breaking news
Telangana
-
ఆషాఢంలో అమ్మతల్లికి బోనాలు.. తప్పక సందర్శించాల్సిన ఆలయాలివే (ఫొటోలు)
-
జీడిమెట్లలో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కూతురు
సాక్షి, మేడ్చల్: జీడిమెట్ల పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.ఎన్ఎల్బీ నగర్లో నివాసముండే 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ.. తన ప్రియుడితో కలిసి తల్లి అంజలి(39) గొంతు పిసికి, తలపై రాడ్తో కొట్టి చంపేసింది జీడిమెట్ల పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఏఈ మనీషా
అంబర్పేట: కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ టి.మనీషా ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒప్పందం ప్రకారం రెండోవిడత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన సోమవారం జీహెచ్ఎంసీ సర్కిల్–16 పరిధిలోని గోల్నాక వార్డు కార్యాలయంలో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మనీషా సర్కిల్ పరిధిలో నల్లకుంట డివిజన్ ఏఈగా కొంత కాలం పని చేసి ప్రస్తుతం గోల్నాక డివిజన్లో విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని ఓ అభివృద్ధి పనిని కాంట్రాక్టర్ దక్కించుకుని పూర్తి చేశాడు. దాని బిల్లు కోసం సదరు కాంట్రాక్టర్ ఏఈని అడుగగా ఆమె రూ.15 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో కాంట్రాక్టర్ మొదటి విడతగా రూ.5 వేలు ఇచ్చాడు. రెండో విడత అందించేందుకు ముందు అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం గోల్నాక వార్డు కార్యాలయంలో ఏఈకి డబ్బులు అందించాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏఈ మనీషా ఏసీబీకి పట్టుబడక మందు అభివృద్ధిపై ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశం పూర్తి కాకముందే అనుమతి తీసుకుని బయటకు వచ్చి ఏసీబీకి పట్టబడడం గమనార్హం. -
విరివిగా.. విదేశీ మద్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) దందా నడుస్తోంది. వాయు, రోడ్డు అనే తేడా లేకుండా వీలున్నన్ని మార్గాల్లో ఈ అక్రమ మద్యం తెలంగాణలోకి విచ్చలవిడిగా ప్రవే శిస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భా రీగా గండిపడుతోంది. విదేశీ, ఇండియన్ మేడ్ ఫారి న్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) ముసుగులో జరుగుతున్న ఈ ఎన్డీపీఎల్ లిక్కర్ దందాతో ఏటా ఖజానాకు రూ.300 నుంచి రూ.500 కోట్ల వరకు నష్టం వస్తోందని ఎక్సైజ్ వర్గాలే అంటున్నాయి. అయితే ఆదాయం పెంపు పేరుతో లిక్కర్, బీర్ల ధరలను పెంచుతున్న ప్రభుత్వం ఈ దందాను అరికట్టే విషయంలో మాత్రం చోద్యం చూస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఎక్కడ అనుమతుల్లేని పార్టీలు జరిగినా, పెద్ద మొత్తంలో నాన్డ్యూటీ పెయిడ్ మద్యం కూడా పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం. వీఐపీలే కాదు..ముఠాలు కూడా ఎన్డీపీఎల్ రాష్ట్రంలోకి అనేక మార్గాల్లో ప్రవేశిస్తోంది. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు లీటర్ల వరకు మద్యం ఉండొచ్చనే నిబంధన ఉంది. దీంతోపాటు విదేశాలకు వెళ్లి వచ్చే వారికి ఎయిర్పోర్టుల నుంచి మద్యం తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో వీఐపీలు ఎక్కువగా విదేశాల నుంచి మద్యాన్ని తెచ్చుకుంటారు. వీరికి తోడు ఈ మద్యం కోసం రాష్ట్రంలో ముఠాలు కూడా ఏర్పడ్డాయి. ఇతర దేశాల్లో ఖరీదైన విదేశీ మద్యం బాటిల్ రూ.12వేలు ఉంటుందని సమాచారం. అయితే, అదే మద్యాన్ని తెలంగాణలో రూ.25వేల వరకు అమ్మే వీలుంది. అదే బ్రాండ్ మద్యం ఇక్కడ అంత ధర పలుకుతుంది. దీంతో విదేశాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల వివరాలను సేకరించి వారితో తప్పనిసరిగా మద్యం తెప్పించేలా ఈ ముఠా సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లేదంటే ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులతో మద్యం కొనుగోలు చేయిస్తున్నారు. ఈ మ ద్యాన్ని బయట అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. ఢిల్లీ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ మద్యం ధరలు తక్కువగా ఉంటాయి. హరియాణా, గోవా ల్లోనూ తెలంగాణతో పోలిస్తే మద్యం ధ రలు చాలా తక్కువ. ఇక్కడ ఐఎంఎఫ్ఎల్ ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల నుంచి రైళ్లు, ఇతర రవాణా మార్గాల్లో మద్యం తెప్పిస్తున్నారు. ఏకంగా కొన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ బుక్ చేసి మరీ ఎన్డీపీఎల్ తెప్పిస్తున్నారని ఎక్సైజ్ వర్గాలే అంటున్నాయి. ఈవెంట్ మేనేజర్లు, పారీ్టల నిర్వాహకుల పేర్లతో ఈ మద్యాన్ని విచ్చలవిడిగా ఆమ్ముకుంటున్నా, ఎక్సైజ్ వర్గాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కేవలం ప్రత్యేక డ్రైవ్లకు మాత్రమే ఎక్సైజ్ శాఖ పరిమితం కావడం గమనార్హం. ఆ డ్రైవ్లు ముగియగానే మౌనం వహించడం, ఎన్ఫోర్స్మెంట్ టీంల దాడులు సరిగా జరగకపోవడం, సరిహద్దు చెక్పోస్టులు నిరీ్వర్యంగా మారడం ఎందుకనే ప్రశ్నలకు ఆ శాఖ అధికారుల వద్ద సమాధానం లేదు. స్పెషల్ డ్రైవ్లు సరిపోతాయా? రాష్ట్రంలో డ్యూటీ చెల్లించని మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్లు మాత్రమే సరిపోవని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. గతంలోనూ ఈ రకమైన డ్రైవ్లు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇటీవల కూడా ప్రత్యేక దాడులు నిర్వహించింది. సీనియర్ అధికారి షానవాజ్ ఖా సిం నేతృత్వంలో ఈ నెల 3వ తేదీ నుంచి వారం రో జుల పాటు ఎక్కడికక్కడ నిఘా పెట్టి విదేశీ మద్యం అమ్ముతున్న వారిని పెద్ద ఎత్తున గుర్తించింది. వారి వద్ద నుంచి రూ.లక్షలు విలువ చేసే మద్యాన్ని స్వా«దీనం చేసుకుంది. అయితే, ఈ డ్రైవ్ ముగిసిన వెంటనే హైదరాబాద్ శివార్లలో జరిగిన ఓ సెలబ్రిటీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం పట్టుబడడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్డీపీఎల్ను నియంత్రించి ఎక్సైజ్ ఆదాయానికి గండి పడకుండా ఉండాలంటే స్పెషల్ డ్రైవ్ నిరంతరంగా కొనసాగాలని, ఎక్కడికక్కడ నిఘా పెంచాలని, ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్ల వద్ద చెక్పోస్టులు పెట్టాలని, రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్పోస్టులను మరింత పటిష్టం చేయాల్సి ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటేనే ఎన్డీపీఎల్ అరికట్టడం సాధ్యమవుతుందనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది. మరి, ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే...! -
హైదరాబాద్.. తగ్గేదేలేద్..!
తగ్గేదే లేదు.. ఆఫీస్ స్పేస్ అయినా.. ఉద్యోగాలైనా.. టాప్ నగరాల్లో మన హైదరాబాద్ ఉండాల్సిందే. ‘వి ఆర్ సిటీ 2024’ పేరుతో ‘అన్ బాక్సింగ్బీఎల్ఆర్ ఫౌండేషన్ ’ రూపొందించిన నివేదిక ఇదే చెబుతోంది. ఖరీదైన ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రావడంతో కొత్తగా జత కూడిన ప్రధాన ఉద్యోగాల సంఖ్య పరంగా దేశంలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో భాగ్యనగరం నిలిచింది. ఆసక్తికర విషయం ఏమంటే.. 7 ప్రధాన నగరాల్లో 2018–23 మధ్య కార్మికుల్లో మహిళల వాటా అత్యధికంగా దాదాపు రెండింతలు పెరిగింది హైదరాబాద్లోనే. అలాగే 2019–23 మధ్య 6.3 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ మాల్ స్పేస్ తోడై టాప్–5 స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశీయంగా అయిదేళ్లలో అత్యధికంగా 27 నగరాలు, పట్టణాలకు విమాన సేవలను బెంగళూరు విస్తరిస్తే, హైదరాబాద్ 18 కేంద్రాలతో టాప్–2లో పోటీపడుతోంది. ఇంటి రుణం సగటు అధికంగా ఉన్న టాప్–3 నగరాల్లో హైదరాబాద్ చోటు సంపాదించింది. దశాబ్ద కాలంలో కొత్తగా ఏర్పాటైన కంపెనీల సంఖ్య పరంగానూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంది. -
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
గద్వాల క్రైం: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహం జరిగినప్పటి నుంచి భర్త తేజేశ్వర్ రాకపోకలపై నిఘా పెట్టి దారుణహత్యకు భార్య సహస్రనే పూర్తి పథకం రచించినట్టు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే తెలియగా, సహస్రను తేజేశ్వర్ మందలించినట్టు తెలిసింది. దీంతో తమ బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బ్యాంకు ఉద్యోగికి జరిగిన విషయం చేరవేసింది. ఆయన సూచన మేరకు భర్త బైక్కు జీపీఎస్ ట్రాకర్ను తన దూరపు బంధువుతో అమర్చేలా చేసింది. సుపారీ తీసుకున్న ముఠా సభ్యులు గద్వాలలో ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా తేజేశ్వర్పై నిఘా పెట్టారు. జీపీఎస్ ద్వారా ఎక్కడ ఉంటున్నాడో గుర్తించి మూడు దఫాలుగా గద్వాల శివారులో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో సహస్ర, ఆ బ్యాంకు ఉద్యోగి ముఠా సభ్యులను ఎగతాళి చేసి, హేళనగా మాట్లాడారు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న సుపారీ గ్యాంగ్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 17వ తేదీన ఉదయం వారి కారులో తేజేశ్వర్ను ఎక్కించుకొని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు చూసేందుకు వెళ్లారు. ఆ కారులోనే కత్తితో పొడిచి హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం శివారులో మృతదేహాన్ని పడేశారు. కేసు విచారణ వేగవంతంతేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిందెవరు..ఎంతమంది వచ్చారు.. వారు వెళ్లేందుకు వినియోగించిన వాహనం.. అసలు తేజేశ్వర్ను వారికి పరిచయం చేసిందెవరు.. ఇలా అనేక అంశాలపై విచారణ అధికారులు పలు బృందాలుగా విడిపోయి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్తేజేశ్వర్ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన ఘటన, ప్రయాణించిన ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం మేరకు సీన్ రీ కన్స్ట్రక్షన్ ప్రక్రియను సోమవారం సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్కుమార్, మల్లేశ్, శ్రీకాంత్ పరిశీలించారు. గద్వాల నుంచి సంగాల ఔటర్ రింగ్ రోడ్డు అక్కడి నుంచి పూడూరు, ఇటిక్యాల, మొగిల్రావుల చెరువు శివారు, పెబ్బేర్, బీచుపల్లి ఫ్లై ఓవర్, తుంగభద్ర ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. గద్వాల మండలం పూడూరు శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని ఓ గోనెసంచిలో చుట్టి కారు డిక్కీలో పెట్టి ఎవరూ లేనిచోట పడేయాలని భావించినట్టు తెలిసింది. అయితే అలా సాధ్యం కాకపోవడంతో నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం శివారులో అర్ధరాత్రి పడేసి కారులోంచి తప్పించుకున్నట్టు అనుమానిస్తున్నారు. హత్యకు ముందే పరిచయం.. తేజేశ్వర్ భార్య సహస్ర తల్లి సుజాత పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్ కాగా, కర్నూలుకు చెందిన రామకృష్ణతో వివాహం అనంతరం కల్లూరుకు వెళ్లారు. సుజాత భర్త రామకృష్ణ చనిపోవడంతో కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. అక్కడే బ్యాంకు ఉద్యోగితో పరిచయం పెరిగి, చనువుగా ఉండేది. కూతురు సహస్ర సైతం సదరు ఉద్యోగితో చనువుగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ సందర్భాల్లో సహస్ర తన తల్లితో కలిసి జమిచేడ్కు వచి్చన క్రమంలో దూరపు బంధువు ద్వారా తేజేశ్వర్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులతో వివాహానికి సిద్ధమయ్యారు. అయితే బ్యాంకు ఉద్యోగికి ఈ విషయం తెలిసి వ్యతిరేకించడంతో తేజేశ్వర్తో నిశ్చితార్థం రద్దు చేసుకుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగికి ముందే మరో మహిళతో వివాహం కావడం, బ్యాంకు ఉద్యోగి భార్య కట్టడి చేయడంతో సమస్య అక్కడితో ఆగిపోయిందని తెలిసింది. ఆ తర్వాత సహస్ర.. తేజేశ్వర్ను మళ్లీ కలిసి పెళ్లికి డబ్బులు లేకపోవడంతో నిరాకరించినట్టు నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత నెల 18న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.పోలీసుల అదుపులో అనుమానితులు?పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో సహస్ర, సుజాత, బ్యాంకు ఉద్యోగి, హత్యకు పాల్పడిన ముగ్గురు, ఒక ఇన్ఫార్మర్ ఉన్నారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీనుతో మాట్లాడగా.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. హత్యకు పాల్పడిన నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామని వివరించారు. తాజాగా రీ కన్స్ట్రక్షన్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలించి గద్వాల మండల శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల కోసం ఓ బృందం కర్నూలు జిల్లాలో గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. -
ఏవీ.. డ్రైవర్ లేకుండానే!
అమెరికాలోని ఆస్టిన్ నగర వీధుల్లో ఒక ఎర్ర కారు.. దానిమీద ‘రోబో ట్యాక్సీ’ అని రాసి ఉంది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ లేదా డ్రైవర్ రహిత కారు. ప్రపంచ ప్రసిద్ధ టెస్లా కంపెనీ ఈ రోబో ట్యాక్సీ సేవలను ఆదివారం ప్రారంభించింది. దీంతో ఇప్పుడు స్వయం చోదక వాహనాల (అటానమస్ వెహికల్ –ఏవీ) మీద చర్చ మరోసారి మొదలైంది. యూఎస్ఏలోని సిలికాన్ వ్యాలీ, చైనాలోని బీజింగ్ నగరంలో ఇప్పటికే ఏవీలు పరుగులు తీస్తున్నాయి. సరుకు రవాణా కోసం అటానమస్ ట్రక్స్ దూసుకెళుతున్నాయి. ప్రపంచంలో వాహనాల తయారీలో నాలుగో స్థానంలో ఉన్న భారత్లో.. ఏవీలు సాకారం అయ్యే అవకాశాలు ఎప్పుడెప్పుడా అని వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. అసలు ఏవీలు ఎక్కడెక్కడ ఏయే స్థాయిల్లో ఉన్నాయి.. ఏవీ ఎలా పనిచేస్తుంది.. డ్రైవర్ లేకుండా ఇది ఎలా నడుస్తుంది?విదేశాల్లో ఇలా..సాధారణ క్యాబ్స్తో పోలిస్తే పలు దేశాల్లో అటానమస్ వెహికల్స్ ఆధారిత క్యాబ్స్ సగం చార్జీలనే వసూలు చేస్తున్నాయి. ఒక్క యూఎస్లోనే ఒక ట్రిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఊబర్ సీఈవో డారా కాస్రోసాహీ ఇటీవల వెల్లడించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు చెందిన వేమో ఇప్పటికే యూఎస్, చైనాలో అటానమస్ వెహికల్స్తో రైడ్ హెయిలింగ్ సేవలు ఆఫర్ చేస్తోంది.యూఎస్కు చెందిన పోనీ.ఏఐ అటానమస్ క్యాబ్స్ సర్వీసులు అందిస్తోంది. అలాగే అటానమస్ ట్రక్స్ ద్వారా సరుకు రవాణా రంగంలోనూ ఉంది. భారత్కు చెందిన గౌతమ్ నారంగ్, అర్జున్ నారంగ్, అపేక్ష కుమావత్ కలిసి అమెరికాలో ఏర్పాటుచేసిన ‘గతిక్.ఏఐ’ అనే కంపెనీ అటానమస్ ట్రక్స్ ద్వారా వాల్మార్ట్ వంటి కంపెనీలకు సేవలందిస్తోంది. న్యూరో అనే కంపెనీ చిన్న అటానమస్ వ్యాన్స్ ద్వారా యూఎస్లో సరుకు రవాణా చేస్తోంది. చైనాలో డీప్రూట్.ఏఐ ఈ రంగంలో ఉంది. వీరైడ్, వాబి, మోషనల్, అరోరా తదితర కంపెనీలు సైతం ఆటానమస్ వెహికల్స్తో పోటీపడుతున్నాయి.అమెరికాలోని ఆస్టిన్ నగరంలో టెస్లా కంపెనీకి చెందిన రోబో ట్యాక్సీలను లాంఛనంగా ప్రారంభించారు. దశాబ్దాల కఠోర శ్రమకు ఇది ఫలితమని, అయితే ఇది పైలట్ ప్రాజెక్టేనని టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ తెలిపారు. ప్రస్తుతం ట్రిప్పునకు 4.20 డాలర్లు (సుమారు రూ.364) వసూలు చేస్తున్నారు. ఈ క్యాబ్స్ పూర్తిస్థాయిలో ప్రజలందరికీ ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో మస్క్ ఇంకా ప్రకటించలేదు. మనదేశం విషయానికొస్తే.. టాటా మోటార్స్ ఇటీవల వైయు అనే పూర్తిస్థాయి అటానమస్ వాణిజ్య వాహనానికి పేటెంట్ పొందింది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వస్తువులు, ప్రయాణికుల రవాణాకు అనుకూలమైనది.మన దేశంలో ప్రారంభ దశలోనే..అటానమస్ వెహికల్స్ రాకతో ఆటోమొబైల్ పరిశ్రమలో సాంకేతికంగా పెద్ద ముందడుగు పడిందని చెప్పవచ్చు. భారత్లో అటానమస్ వెహికల్స్ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పాలి. పూర్తిగా అటానమస్ అంటే డ్రైవర్ అవసరమే లేకుండా నడిచే వాహనాలు (లెవెల్–5) ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులో లేనప్పటికీ.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) అభివృద్ధి, అటానమస్ దిశగా సాంకేతికతల పరీక్షల్లో పురోగతి ఉంది. భారత్లో మైనస్ జీరో, స్వాయత్ రోబోస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా ఈలిక్సీ, ఫ్లక్స్ ఆటో, ఫ్లో మొబిలిటీ తదితర కంపెనీలు ఏవీల అభివృద్ధిపై దృష్టి సారించాయి. ఇదిలా ఉంటే.. డ్రైవర్లెస్ కార్లను భారత్లో అనుమతించేది లేదని పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెబుతూ వచ్చారు.5 లెవెల్స్లో..వాహనాల నియంత్రణ, నిర్వ హణ విషయంలో ఆటో మేషన్ స్థాయిని బట్టి లెవెల్–0 నుంచి పూర్తి అటానమస్ లెవల్–5 వరకు.. ఏవీలను 6 స్థాయిలుగా వర్గీకరించారు. లెవెల్ – 0 అంటే పూర్తిగా డ్రైవర్పైనే ఆధారపడి ఉంటుంది. లెవెల్ – 1లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ముందున్న వాహనం వేగాన్ని బట్టి ఏవీ దానంతట అదే వేగాన్ని నియంత్రించుకుంటుంది. లెవెల్ – 2లో సాంకేతికత స్టీరింగ్ను, వేగాన్ని నియంత్రిస్తుంది. లెవెల్ 1, 2లలో కచ్చితంగా డ్రైవర్ ఉండాల్సిందే. లెవెల్ –3లో ప్రత్యేక పరిస్థితుల్లో వాహనం దానంతట అదే నియంత్రించుకుంటుంది.కానీ, కొన్ని సందర్భాల్లో కారు ఇచ్చే అలర్ట్స్ను బట్టి డ్రైవర్ స్టీరింగ్ను తన చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ –4 అంటే.. చాలా అరుదుగా తప్ప, దాదాపుగా డ్రైవర్ అవసరం లేకుండానే కారు నడుస్తుంది. వీటిని ఎక్కడ పడితే అక్కడ నడపడం సాధ్యం కాదు. ప్రత్యేకమైన ప్రాంతంలోనే (జియో ఫెన్సింగ్ సాయంతో) నడుపుతారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలే ఫీడ్ చేస్తారన్నమాట. ఆ పరిస్థితుల్లోనే కారు నడవగలదు. లెవెల్ – 5.. అసలు డ్రైవర్ అవసరమే ఉండదు. పూర్తిగా కారు తనంతట తానే నడుస్తుంది. ప్రపంచంలో లెవెల్ – 5 స్థాయి వాహనాలను ఎవరూ తయారుచేయలేదు. సెన్సార్స్, కెమెరాలతో..అటానమస్ వెహికల్స్ వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి రూట్ మ్యాప్ను నిర్మించడానికి, నవీకరించడానికి పలు సెన్సార్లపై ఆధారపడతాయి.⇒ రాడార్ సెన్సార్లు సమీపంలోని వాహనాలను ట్రాక్ చేస్తాయి. కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ను గుర్తిస్తాయి. అలాగే రహదారి సంకేతాలను అర్థం చేసుకుంటాయి. పాదచారులు, ఇతర వాహనాల కదలికలను గమనిస్తుంటాయి. ⇒ లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సాంకేతికత దూరాలను కొలవడానికి; లేన్ గుర్తులను, రహదారి సరిహద్దులను గుర్తించడానికి లేజర్ పల్స్లను ఉపయోగిస్తుంది. వాహనం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అధిక రిజొల్యూషన్ 3డీ మ్యాప్గా సృష్టిస్తుంది. అడ్డంకులు, పాదచారులు, ఇతర వాహనాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ⇒ వాహనాలను నిలిపేందుకు నిర్దేశించిన గీతలను, చుట్టూ ఉన్న కార్లను గుర్తించేందుకు చక్రాల దగ్గర పొందుపరిచిన అల్ట్రాసోనిక్ సెన్సార్లు సహాయపడతాయి. ⇒ ట్రాఫిక్ సంకేతాలు, పాదచారుల సమాచారాన్ని ఇతర కెమెరాలు అందిస్తాయి. ⇒ ఏవీల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), ఇనెర్షియల్ మెజర్మెంట్ యూనిట్ (ఐఎంయూ) కూడా ఉన్నాయి. లొకేషన్ కు సంబంధించిన సమాచారాన్ని జీపీఎస్ అందిస్తుంది. వాహన వేగం, దిశలో వచ్చే మార్పును ఐఎంయూ ట్రాక్ చేస్తుంది.⇒ సెన్సార్స్ అందించిన డేటాను అత్యంత సామర్థ్యం గల సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేస్తుంది. ఇది సరైన మార్గాన్ని నిర్ణయించడంతోపాటు వాహన వేగం, దిశ, బ్రేకింగ్, స్టీరింగ్ను నియంత్రిస్తుంది. ముందే పొందుపరిచిన ట్రాఫిక్ నియమాలు, అడ్డంకులను గుర్తించే విధానాలు, పరిసరాల అధ్యయనం, మనుషులు, యంత్రాల గుర్తింపు ద్వారా ఈ సాంకేతిక వ్యవస్థ సురక్షిత, సమర్థవంత ప్రయాణాన్ని అందిస్తుంది. -
సాగు అంతంతే
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సాగు ఇంకా పుంజుకోలేదు. వాస్తవానికి మే నెలలోనే ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో మురిసిపోయిన రైతులు.. అప్పుడు కురిసిన వర్షాలకు పత్తి, మక్కలు, జొన్నలు సాగు చేశారు. ఆపై వరుణుడి జాడ లేకపోవడంతో కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తక, మరికొన్ని చోట్ల ఎండిపోయాయి. రెండురోజులుగా కురుస్తున్న తేలకపాటి వర్షాలతో రైతులు మళ్లీ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బావులు, బోర్ల కింద చాలా చోట్ల నార్లు పోసి, దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేవలం 33 వేల ఎకరాల్లో వరి సాగైంది. కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల నుంచి సాగునీటి లభ్యత, నీటి విడుదలపై స్పష్టత రాకపోవడం, వర్షాలు కూడా సరిగ్గా లేకపోవడంతో మెజారిటీ చోట్ల దుక్కులు దున్నడం లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. పత్తి, జొన్న, మక్కలు, ఇతర తృణధాన్యాల సాగుతోపాటు కంది, పెసర, సోయాబీన్ వంటి పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఈ వానాకాలంలో కోటి 35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం 20 లక్షల ఎకరాల్లో లోపే వివిధ పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఈ సమయంతో పోలిస్తే...ఆరు లక్షల విస్తీర్ణం తక్కువగా ఉంది. – గత సంవత్సరం ఇప్పటి వరకు 21 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, అదిప్పుడు 16 లక్షల ఎకరాలకే పరిమితమైంది. రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారని అంచనా వేశారు. వర్షాలు లేకపోవడం వల్లనే పత్తి సాగు విస్తీర్ణం పెరగలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. – పత్తి తర్వాత అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో సోయాబీన్ 1.25 లక్షల ఎకరాల్లో సాగైంది. – మక్కలు సుమారు 50 వేల ఎకరాల్లో సాగు చేయగా, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఉంది. విత్తనాలు, ఎరువులపై ఆందోళన పత్తి విత్తనాలకు సంబంధించి వివిధ శాఖలు చేసిన ఆపరేషన్ కొంత విజయవంతమైంది. జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ శాఖ, సీడ్ సర్టిఫికేషన్ అధికారులు కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో చాలా చోట్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. నిషేధిత బీటీ–3 విత్తనాలను కూడా సీజ్ చేశారు. అయినా ఇంకా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు పెద్దపల్లి, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, నిజామాబాద్ తదితర చోట్ల నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. – ఎరువులకు సంబంధించి రైతుల్లో ఆందోళన మొదలైంది. పత్తితోపాటు వరికి యూరియా, డీఏపీ అవసరం కాగా, యూరియా కేటాయింపులకు తగినట్టుగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదు. జూన్ నెలాఖరు వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 3 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి ఇటీవలే తిరిగి ప్రారంభం కావడంతో సమస్య ఉండదని మార్క్ఫెడ్ జీఎం విష్ణు ‘సాక్షి’కి తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం యూరియా 9.8 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు డీఏపీ కూడా ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ సీజన్కు కేటాయించింది. సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో యూరియా, డీఏపీ కేటాయింపుల కన్నా ఎక్కువ అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దొడ్డు యూరియా సరఫరా చేయడం లేదని, సన్న యూరియాతో ఇబ్బందులు ఉన్నట్టు రైతులు వాపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచారు కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచింది. పంటల సాగు మొదలు పెట్టాలనుకుంటున్న రైతులకు యూరియా కొరత సమస్యగా మారింది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచితే బాగుంటుంది. – కాలసాని నరసింహారెడ్డి, జమాండ్లపల్లి దొడ్డు యూరియా సరఫరా చేయాలి సహకార సంఘాల్లో మొత్తం దుమ్ముతో కూడిన సన్నపు యూరియానే సరఫరా చేస్తున్నారు. పొలాల్లో చల్లడానికి ఇది ఏమాత్రం అణువుగా ఉండదు. చల్లడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. రైతులకు అనువుగా ఉండే దొడ్డు యూరియాను సరిపడా సకాలంలో సరఫరా చేస్తే బాగుంటుంది. –నోముల తిరుపతిరెడ్డి, నల్లవెల్లి -
ప్రభుత్వం కన్నా పార్టీనే ప్రధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉండటం కంటే పార్టీ బలంగా ఉండటమే ప్రధానమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ ఉద్ఘాటించారు. పార్టీ బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలమని, సంస్థాగత నిర్మాణం చాలా కీలకమన్నారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ మోడల్ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం గాందీభవన్లో క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు కోసం జిల్లాల వారీగా నియమించిన పరిశీలకులతో వారు విడివిడిగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ కూడా పాల్గొన్నారు. కొన్ని కమిటీలు పెండింగ్లో ఉండటంతో వాటిని కూడా ఈనెల 30లోపు పూర్తి చేయాలని మీనాక్షి, మహేశ్గౌడ్ సూచించారు. ఈ కమిటీలు పూర్తయిన తర్వాత డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రారంభమవుతుందని, ఈ నియామకాల కోసం గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి ఏఐసీసీ పరిశీలకులు వస్తారని చెప్పినట్లు తెలిసింది. పలువురు పరిశీలకులు మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను వివరించారు. కొన్నిచోట్ల కార్యకర్తల అసంతృప్తిని వారి దృష్టికి తెచ్చారు. ఇతర పార్టీల నుంచి వచి్చన వారితో కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలున్నాయని, కొన్నిచోట్ల ఆధిపత్య పోరు, సమన్వయ లోపం ఉన్న అంశాన్ని వివరించారు. అన్యాయం చేయం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పీసీసీ నియమించిన పరిశీలకులదేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో 80 శాతం పాత కాంగ్రెస్ వారికే ఇచ్చామని, 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న వారికి కూడా ప్రాధాన్యతనిచ్చామన్నారు. 2017 కంటే ముందు పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలనే ప్రాతిపదికను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, కొన్ని సమీకరణలు, పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీల నుంచి వచి్చన వారికి ఇచ్చామని చెప్పారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే కొంత రాజీపడక తప్పదని వివరించారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం చేసే ప్రసక్తే లేదని, అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పదవుల్లో వారికి తప్పకుండా అవకాశమిస్తామన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటి పరిష్కారం కోసం రోజూ గాం«దీభవన్లో పార్టీ, ప్రభుత్వ ప్రతినిధులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రి, కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల్లో ఎవరో ఒకరు కచి్చతంగా గాంధీభవన్లో అందుబాటులో ఉండాలన్నారు. పదేళ్లు ఎక్కడో కూర్చుని ఇప్పుడు గ్రామాలకు వెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేస్తామంటే కుదరదని, ప్రజాదరణ ఉన్నవారికే స్థానిక ఎన్నికల టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి, మహేశ్ గౌడ్ స్పష్టం చేసినట్టు సమాచారం. అంతకుముందు టీపీసీసీ డీలిమిటేషన్ కమిటీ సమావేశం సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచందర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, పవన్ మల్లాది తదితరులు పాల్గొన్నారు.నేడు గాంధీభవన్కు సీఎం రేవంత్ గాంధీభవన్లో మంగళవారం కూడా కీలక సమావేశాలు జరగనున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. తర్వాత పార్టీ సలహా కమిటీ భేటీ కానుంది. అనంతరం టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించి వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సమావేశాలకు మీనాక్షి నటరాజన్తోపాటు సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు హాజరవుతారని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. -
స్థానిక ఎన్నికలెప్పుడు నిర్వహిస్తారు?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పు డు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తా మని చెప్పి, ఎందుకు చర్య లు చేపట్టలేదని అడిగింది. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు 25 రోజులు సమయం కావాలని సర్కార్ బదులిచ్చింది. అక్కడి నుంచి తమకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని ఎస్ఈసీ పేర్కొంది. అనంతరం పిటిషనపై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగాం జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణు గోపాల్, నిజాయితీగూడెం సర్పంచ్ మురళీధర్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ టి మాధవీదేవి సోమవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను ఖరారు చేసి, వార్డు సభ్యులు, సర్పంచ్ల సీట్లను కులాల వర్గాల వారీగా ప్రకటించడానికి ప్రభుత్వానికి దాదాపు నెల రోజులు అవసరమని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ఖాన్ తెలియజేశారు. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని, అప్పటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ చెప్పారు. ఏడాదిన్నర పూర్తయినా ఎన్నికలు లేవు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్, జి.భాస్కర్రెడ్డి, సీహెచ్.నరేశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని గత అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చి.. నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోందని, ఎన్నికల ఆలస్యంపై రాష్ట్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. కిషన్సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేన్నారు. పరిపాలన ప్రక్రియలు, విధానపరమైన అవసరాలతో కలిగే జాప్యాలను కారణాలుగా చూపుతూ ఎస్ఈసీ ఆ తీర్పును ఉల్లంఘించజాలదని చెప్పారు. సకాలంలో ఎన్నికలు జరిగేలా చూడటంలో ఎస్ఈసీ స్వతంత్రత, విధి అని నొక్కి చెప్పారు. విపత్తులు లాంటి అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఎన్నికలు వాయిదా వేయడానికి వీలు లేదన్నారు. 2024, జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగిందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. దాదాపు ఏడాదిన్నర అవుతున్నా ప్రభుత్వం, ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించడం లేదని నివేదించారు. తాజా మాజీ సర్పంచ్లను పక్కన పెట్టి గ్రామ పంచాయతీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243ఈ, 243కేను, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 నిబంధనలను ఉల్లంఘించడమేనని వాదించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులను అందిస్తామని ప్రభుత్వం చెప్పడంతో తమ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు కొందరు సర్పంచ్లు వ్యక్తిగతంగా నిధులు సమకూర్చారని, ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సర్కార్, ఎస్ఈసీ మరింత సమయం కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పిటిషన్లలో తీర్పును రిజర్వు చేసింది. -
2047కి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ.. ఇదీ మా ‘విజన్’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ’ డాక్యుమెంట్ను రూపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజన్ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్లో ఉండనున్నాయి. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3.40 గంటల నుంచి రాత్రి 9.20 గంటల వరకు సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహిళలు, రైతులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యం విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో అన్ని శాఖలు, అన్ని విభాగాలు భాగస్వామ్యం పంచుకునేలా చూడాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆశిస్తున్న వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యాచరణను విజన్ డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి అయోగ్తో పాటు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్లుగా వ్యవహరిస్తాయి. కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యంతో ఈ విజన్కు రూపకల్పన చేయాలని అధికారులకు కేబినెట్ దిశా నిర్దేశం చేసింది. రైతుల సమక్షంలో సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను విజయవంతంగా, రికార్డు వేగంతో అందించింది. సీఎం రేవంత్రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.400 కోట్లను మంగళవారం జమ చేయనుంది. కోటీ 49 లక్షల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసింది. అతి తక్కువ వ్యవధిలో రాష్ట్రంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించింది. ఈ ఘనత సాధించిన శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సచివాలయం ఎదురుగా రాజీవ్ విగ్రహం వద్ద.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. సీఎం రేవంత్తో పాటు మంత్రివర్గం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ఇక అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించింది. ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ అలైన్మెంట్కు ఓకే హైదరాబాద్ చుట్టూ నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలకు కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. అంతకుముందు ఆర్ అండ్ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను పరిశీలించింది. అనంతరం చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కి.మీ.ల పొడవు ఉండే ఈ అలైన్మెంట్కు ఆమోదం తెలిపింది. జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి –బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చట్టపరంగా, న్యాయపరంగా అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఒక చుక్క గోదావరి జలాలను కూడా నష్టపోకుండా చిత్తశుద్ధితో పోరాడాలని నిర్ణయించింది. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 400 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించగా, దాని ఆధారంగానే బనకచర్ల ప్రాజెక్టును ఏపీ రూపొందించిందని మంత్రివర్గం పేర్కొంది. ఈ విషయాన్ని మరిచిపోయిన బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తింది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను సిద్ధంచేసేందుకు జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టుపై పూర్తి వివరాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. విభజన వివాదాలపై మళ్లీ చర్చలు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయిన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీల ఆధ్వర్యంలో మళ్లీ సమావేశాలను పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాయనుంది. ‘కాళేశ్వరం’ సమాచారాన్ని కమిషన్కు ఇవ్వనున్న సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తెలియజేయాలనుకున్నా, సమాచారం ఇవ్వాలనుకున్నా ఈ నెల 30 లోగా ఇవ్వాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ రాసిన లేఖపై మంత్రివర్గం చర్చించింది. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని గడువులోగా కమిషన్కు అందజేయాలని నిర్ణయించింది. సీఎస్ ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యత అప్పగించింది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మేరకే బరాజ్లను నిర్మించినట్టు కమిషన్ ఎదుట విచారణకు హాజరైన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చారు. నాటి మంత్రి హరీశ్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బరాజ్ల నిర్మాణంపై నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదించిన తర్వాతే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఈటల, హరీశ్రావు కమిషన్కు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘంతో పాటు మంత్రివర్గ సమావేశాల్లో అలాంటి నిర్ణయాలు ఏమీ జరగలేదని రుజువు చేసేందుకు గాను వాటికి సంబంధించిన మినిట్స్ కాపీలను కమిషన్కు ప్రభుత్వం అందించనుంది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడా ప్రమాణాలను పెంపొందించి 2036 ఒలంపిక్స్లో తెలంగాణ సత్తాను చాటాలనే ఉద్దేశంతో రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలపై త్రైమాసిక సమీక్ష పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించనుంది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించడానికి త్రైమాసిక సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలుగా ఇంద్రేశం, జిన్నారం సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారంను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నోరి దత్తాత్రేయుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి అభివృద్ధితో పాటు, క్యాన్సర్ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఆయన సేవలను వాడుకోనుంది. ఎంఎన్జే ఆస్పత్రి అప్గ్రేడేషన్, సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది. బాసర ట్రిపుల్ ఐటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో బాసర ట్రిపుల్ ఐటీ కింద మహబూబ్నగర్లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి ఏటా 180 మంది విద్యార్థులు చొప్పున 6 ఏళ్లలో 1080 మందికి అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతమైన హుస్నాబాద్లో శాతవాహన వర్సిటీ కింద ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి 240 మందికి అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించింది. శాతావహన వర్సిటీలో ఈ ఏడాది నుంచి చెరో 60 సీట్లతో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. -
తెలంగాణలో తప్పక చూడాల్సిన జలపాతాలు.. (ఫొటోలు)
-
స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ (జూన్ 23, 2025న) జరిగిన విచారణలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించింది. దీనిలో భాగంగా ఎన్ని రోజుల్లో ఎన్నికల నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అడిగింది. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. సమయం కావాలని కోరింది. అయితే ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వం తమ ప్రక్రియ పూర్తి చేస్తే తాము ఎన్నికల నిర్వహణకు ముందుకెళతామని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. దాంతో ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధనను గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికలైనా పెట్టండి.. లేదా పాత సర్పంచ్లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లలో కొంతమంది పౌరులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. -
‘నిన్ను సాయంత్రంలోగా చంపేస్తాం’.. ఎంపీ రఘునందన్కు బెదిరింపు కాల్
సాక్షి,హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు సమాచారం. ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ పాల్గొన్నారు.బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మేడ్చల్లో హైడ్రా కూల్చివేతలు.. రియల్ ఎస్టేట్ వెంచర్లో..
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మేడ్చల్ జిల్లా పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొర్రెముల రెవెన్యూ పరిధి ఏకశిలానగర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్లో ప్లాట్లకు అడ్డుగా ప్రహరీ గోడ నిర్మించారు. దీనిపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. -
Jubilee Hills By Election: బరిపై మజ్లిస్ గురి!
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ ‘జూబ్లీహిల్స్’ అసెంబ్లీ ఉప ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే పాతబస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా అవతరించిన ఆ పార్టీ.. జూబ్లీహిల్స్లో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సెగ్మెంట్లలోని డివిజన్లలో ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఉప ఎన్నికల్లోనైనా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్ధానాన్ని దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వాస్తవంగా తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఇక్కడి బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీపడి స్పల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంతో నిలిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగలేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్తో సత్సంబంధాలు కలిగి ఉన్నా.. సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ది కావడంతో పోటీలో ఉండాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ బరిలో దిగే అవకాశం ఉన్నా.. స్నేహపూర్వకంగానే పోటీ ఇచ్చి అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ఇది చక్కని అవకాశంగా భావిస్తోంది. ఇదీ పరిస్థితి.. 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ గట్టి పోటీ ఇచి్చంది. అప్పటో ఆ పార్టీ తరఫున రంగంలో దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ తొమ్మిదివేల పైచిలుకు ఓట్లతో తేడాతో రెండో స్థానంలో నిలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైన అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. నవీన్ యాదవ్ మజ్లిస్కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి సుమారు 18 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన మజ్లిస్.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. వాస్తవంగా అధికార పక్షం దోస్తీ కోసం పార్టీ విస్తరణను సైతం స్వయంగా అడ్డుకట్ట వేసుకునే మజ్లిస్.. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి షేక్పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్ను బరిలో దింపడం వెనుక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పారీ్టకి మళ్లకుండా చేసి అధికార బీఆర్ఎస్కు సహకరించేందుకు మజ్లిస్ పార్టీ బరిలో దిగినట్లు ప్రచారం సాగింది. అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్కు లాభం చేకూరింది. కానీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారగా.. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్తో మజ్లిస్ స్నేహం కుదరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ముస్లిం ఓటర్లు మూడో వంతుజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ పరిధిలోని పలు డివిజన్లలో మజ్లిస్ ప్రాతినిధ్యం కలిగి ఉంది. ప్రతినిత్యం స్థానిక సమస్యలపై పైదల్ దౌరా (పాదయాత్ర) నిర్వహిస్తుండటంతో ప్రజల్లో కూడా గట్టి పట్టు ఉంది. దీంతో రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలు మజ్లిస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఈసారి ఉప ఎన్నికల బరిలో గెలుపు గుర్రాన్ని నిలిపేందుకు కసరత్తు చేస్తోంది.ఇటీవల పోటీ చేసిన షేక్పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్ పెద్దగా ఓట్లు రాబట్టుకోక పోవడంతో ఈసారి మరొకరిని పోటీకి దింపాలని యోచిస్తోంది. మజ్లిస్ పార్టీ పక్షాన మహిళా సాధికారత కోసం గళం విప్పుతున్న విద్యావంతురాలు, జాతీయ కరాటే చాంపియన్ సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. గతంలో ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్తో పాటు దేవబంద్, ఢిల్లీ, షాహీన్బాగ్లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు కార్పొరేటర్ల అభ్యర్థిత్వాలను సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
అత్తింటి వేధింపులకు నవ వధువు బలి
హైదరాబాద్: అత్తింటి వేధింపులు భరించలేక ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు పూజిత (19)కు, జాటోతు శ్రీనుతో ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహమైంది. జాటోతు శ్రీను ఓ జ్యువెలరీ షాపులో సేల్స్ మేనేజర్. కేపీహెచ్బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 3, టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఈఎస్డబ్ల్యూ 1140లో నివసిస్తున్నారు. పూజిత పెళ్లి సమయంలో 8 తులాల బంగారంతో పాటు సుమారు రూ.11 లక్షలు ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేయసాగారు. అదనంగా రూ.10 లక్షల అదనపు కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పూజిత నానమ్మ మాలోతు భద్రమ్మ వచ్చే పంట విక్రయాల అనంతరం అదనపు కట్నం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నెల 21న రాత్రి 12 గంటలకు పూజిత నానమ్మకు శ్రీను ఫోన్ చేసి ఉదయం 9 గంటలకు తాను పనికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చానని, ఇంతలో పూజిత చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నాడు. పూజిత తన సోదరులతో కలిసి కూల్డ్రింక్ తాగుతున్న ఫొటోలను హరి అనే వ్యక్తి శ్రీనుకి పంపించాడని, వాటిని చూపించి శ్రీను ఆమెను వేధిస్తున్నాడని, తన మనవరాలు మృతికి శ్రీను, అతని కుటుంబ సభ్యులే కారణమని పూజిత నానమ్మ కేపీహెచ్బీ పోలీస్లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్–బెంగళూరు.. డిఫెన్స్ కారిడార్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దేశంలో ఇప్పటివరకు రెండు డిఫెన్స్ కారిడార్లు (తమిళనాడు, ఉత్తరప్రదేశ్) ఉన్నాయి. రెండో కారిడార్కు సంబంధించి గతంలోనే రాష్ట్రానికి అవకాశం వచ్చినా చివరలో యూపీకి తరలిపోయింది. తాజాగా మూడో కారిడార్ను తెలంగాణలో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాలమూరులో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ద్వారా హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్కు మార్గం సుగమమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేవరకద్రలో ‘బ్రహ్మోస్’యూనిట్ ఏర్పాటుతో.. బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం హైదరాబాద్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ యూనిట్ను విస్తరించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నా అక్కడ భారీగా భూములు అందుబాటులో లేవు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్కు సుమారు 350 నుంచి 400 ఎకరాల వరకు స్థలం అవసరమవగా అందుకోసం అన్వేషణ కొనసాగుతోంది. సీఎం రేవంత్రెడ్డి చొరవతో డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్ లేబొరేటరీ (డీఆర్డీఎల్), బ్రహ్మోస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూములను పరిశీలించింది. దీంతో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్తోపాటు హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. అంతా సానుకూలత.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చౌదర్పల్లి–బస్వాయిపల్లి మధ్య గతంలో విమానాశ్రయం కోసం ప్రణాళికలు రూపొందించారు. ఆ మ్యాప్ ప్రకారం 150 ఎకరాల మేర ప్రభుత్వ భూమి లభ్యమవగా మరో 150 ఎకరాల మేర ఆసైన్డ్ భూములు ఉన్నాయి. 197 ఎకరాల వరకు రైతుల నుంచి సేకరించాలని అధికారులు అప్పట్లో నిర్ణయించారు. డీఆర్డీఎల్ డైరెక్టర్ జీఏ శ్రీనివాసమూర్తి, జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ జైతీర్థ్ జోషి, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.సాంబశివప్రసాద్ ఇటీవల చౌదర్పల్లి–బస్వాయిపల్లి మధ్య స్థలాన్ని పరిశీలించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, తహసీల్దార్లు అక్కడ 497 ఎకరాల వరకు భూమి లభ్యత ఉందని మ్యాప్ ఆధారంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇస్తామని రాష్ట్ర పెద్దలు శాస్త్రవేత్తల బృందానికి వెల్లడించారు. మిగతా 200 ఎకరాలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో సేకరించి ఇస్తామని.. దీనికి సంబంధించి పరిహారం మాత్రం కేంద్రం భరించేలా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. జాతీయ రహదారులు 167, 44కు మధ్య ఈ భూములు ఉండటం.. అటు హైదరాబాద్, ఇటు బెంగళూరుకు రైలు, విమాన మార్గాల కనెక్టివిటీ ఉండటంతో శాస్త్రవేత్తల బృందం అందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
వాట్సాప్..ఇక యాడ్స్ అడ్డా!
టెక్నాలజీ దిగ్గజం మెటా.. ‘వాట్సాప్ యాడ్స్’పె దృష్టి సారించింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్లలో రారాజైన వాట్సాప్లో ప్రకటనలను ప్రసారం చేయనున్నట్టు ఈ అమెరికన్ దిగ్గజం ప్రకటించింది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రకటనల ఆదాయంతో సక్సెస్ చూసిన మెటా.. తాజాగా వాట్సాప్ యాడ్స్ను ‘తెర’పైకి తెచ్చింది. వాట్సాప్ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగిస్తున్నారు. వీరిలో ఏకంగా 85 కోట్లతో భారత్ అగ్ర స్థానంలో ఉంది.ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జనంతో వాట్సాప్ మమేకమైపోయింది. మెసేజ్, ఫొటో, వీడియో.. ఇలా ఏది పంపాలన్న వాట్సాప్ మాత్రమే వాడేంతగా మనం అలవాటు పడిపోయాం. అందుకేనేమో.. చాలా సంవత్సరాలుగా ప్రకటనలు లేకుండానే కొనసాగించిన మెటా కంపెనీ ఎట్టకేలకు వాట్సాప్ అప్డేట్స్ ట్యాబ్లో ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది.యూజర్లు, వారి కాంటాక్ట్స్ పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు, టెక్స్్ట సందేశాలతోపాటు స్టేటస్ ఫీచర్లో వాట్సాప్ స్పాన్సర్ చేసే ప్రకటనలూ ప్రత్యక్షం అవుతాయి. బ్రాండ్స్ తమ చానెళ్లను ప్రచారంలోకి తేవడానికి కావాల్సిన రుసుము చెల్లించే సౌకర్యాన్ని వాట్సాప్ పరిచయం చేయనుంది. తద్వారా ఫాలోవర్లకు టెక్స్ట్ వీడియోల రూపంలో కంటెంట్ను పంచుకోవచ్చు. కంటెంట్ను ఆస్వాదించేందుకు తమకు నచ్చిన చానెళ్లకు నెలవారీ చందా చెల్లించేందుకు సైతం ఫాలోవర్లకు అవకాశం ఉంటుంది.కళ్లుచెదిరే వ్యాపారం..: వాట్సాప్ నెలవారీ యాక్టివ్ వినియోగదార్ల సంఖ్య 200 కోట్ల పైచిలుకే. 85.4 కోట్ల యూజర్లతో భారత్ ప్రపంచంలో తొలి స్థానంతో దూసుకుపోతోంది. తరవాతి స్థానాల్లో బ్రెజిల్ (14.8 కోట్లు), ఇండోనేషియా (11.2 కోట్లు), యూఎస్ (9.8 కోట్లు), ఫిలిప్పీన్స్ (8.8 కోట్లు) ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్ 60 భాషల్లో 180 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. వాట్సాప్ ’అప్డేట్స్’ ట్యాబ్ను రోజుకు 150 కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఈ అంశమే వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కలిసి రానుంది. ఇప్పటికే ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ వేదికగా కళ్లు చెదిరే వ్యాపారం చేస్తోంది మెటా. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ చేరుతోంది.అంచనాలకు అందనంత....: ఈ టెక్ దిగ్గజాల ప్రకటనల ఆదాయం అంచనాలకు అందనంత ఉంది. గూగుల్ 2024లో రూ.22,75,560 కోట్ల ఆదాయం పొందింది. 2025 జనవరి–మార్చిలో మెటా ప్రకటనల ఆదాయం రూ.3,55,180 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.14 శాతం అధికం. ప్రతిరోజు మెటా యాప్స్ను ప్రపంచవ్యాప్తంగా 343 కోట్ల మంది వాడుతున్నారు. ఏడాదిలో ఈ సంఖ్య 6 శాతం పెరిగింది. ఇక భారత్లో ఈ రెండు దిగ్గజాలు 2023–24లో ప్రకటనల రూపంలో సుమారు రూ.50,000 కోట్లు అందుకున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు.ఈ రంగాల్లో ప్రయోజనం..: డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ), ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్), ఆరోగ్య సంరక్షణ, క్విక్ కామర్స్ వంటి రంగాలలోని బ్రాండ్స్ వాట్సాప్ స్టేటస్ ప్రకటనల నుండి ప్రయోజనం పొందుతాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, ఫేస్బుక్ షార్ట్ వీడియోలతో పోలిస్తే వాట్సాప్ స్టేటస్లోని ప్రకటనలు బ్రాండ్స్ చేసే పెట్టుబడిపై తక్షణ రాబడిని ఇవ్వకపోవచ్చని కూడా చెబుతున్నారు.సమ్మతితో ప్రకటనలుప్రస్తుతానికి ప్రకటనలు కేవలం అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే కనిపిస్తాయి. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలానే యాడ్స్ ఫ్రీగానే కొనసాగుతాయని వాట్సాప్ వెల్లడించింది. అలాగే ప్రకటనకర్తలకు వ్యక్తుల ఫోన్ నంబర్లు షేర్ చేయడం లేదా అమ్మడం చేయబోమని కూడా పేర్కొంది. వాట్సాప్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ డిజిటల్ స్థలం. ఇక్కడ ప్రకటనలు ఇచ్చేటప్పుడు బ్రాండ్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వాట్సాప్ పట్ల యూజర్లలో నమ్మకం ఉంది. యూజర్లు కుటుంబంతో, సన్నిహితులతో మాట్లాడతారు. సున్నిత లావాదేవీలను నిర్వహిస్తారు. ప్రకటనలు ఆ పవిత్రతకు భంగం కలిగిస్తే మెటాకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. వినియోగదారుల సమ్మతితో ప్రకటనలు ఇవ్వాలి. యూజర్ల ప్రైవసీకి భంగం కలగకూడదు.అన్నింటా భారతీయులేగూగుల్లో ఏదైనా వెతుకుతున్నప్పుడో.. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్లో విహరిస్తున్నప్పుడో ప్రకటనలు వెల్లువెత్తుతుంటాయి. నిముషాల వ్యవధిలోనే కొత్త కొత్త యాడ్స్ ప్రత్యక్షమవుతుంటాయి. ఇందుకు కారణం.. మనతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్స్ను కోట్లాది మంది వాడుతుండడమే. ఈ స్థాయిలో యూజర్లు ఉన్నారు కాబట్టే బ్రాండ్ల ప్రచారానికి ఈ యాప్స్ అడ్డాగా మారాయి. వీటికి ఉన్న యూజర్ల సంఖ్య చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వాడకంలో మన భారతీయులే ముందంజలో ఉన్నారు.గూగుల్: రోజుకు సగటున 850 కోట్ల వరకు సెర్చెస్ నమోదవుతున్నాయి. 100 కోట్ల మంది రోజువారీ యాక్టివ్ యూజర్లున్నారు. భారత్ నుంచి నెలకు 1,200 కోట్ల విజిట్స్ నమోదవుతున్నట్టు సమాచారం. యూఎస్ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలిచింది.ఫేస్బుక్: ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైచిలుకు నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న సామాజిక మాధ్యమం ఇదే. ప్రపంచ జనాభాలో దాదాపు 37 శాతం మంది ఫేస్బుక్ వాడుతున్నారు. రోజు ఎఫ్బీ తెరుస్తున్నవారు 211 కోట్ల మంది. యూజర్లలో ఎక్కువ మంది 25–34 ఏళ్ల వయస్కులు. ఇక పురుషుల సంఖ్య 56.7 శాతం, స్త్రీలు 43.3 శాతం. 37 కోట్ల యూజర్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. యూఎస్ 19.3 కోట్లు, ఇండోనేషియా 11.7 కోట్లు, బ్రెజిల్ 11 కోట్లు, మెక్సికో 9 కోట్లు, ఫిలిప్పీన్స్ 8.7 కోట్లు, వియత్నాం 7.4 కోట్లు, బంగ్లాదేశ్ 5.5 కోట్లతో తర్వాతి వరుసలో ఉన్నాయి.యూట్యూబ్: యాక్టివ్ యూజర్లు నెలకు 253 కోట్లకు పైమాటే. 46.7 కోట్ల మంది యూజర్లతో మన దేశం అగ్రస్థానాన్ని ఆక్రమించింది. యూఎస్లో 23.8 కోట్లు, బ్రెజిల్లో 14.4 కోట్ల మంది వాడుతున్నారు. 80 భాషల్లో 100కుపైగా దేశాల్లో అందుబాటులో ఉంది. వినియోగదార్లలో పురుషులు 54 శాతం, స్త్రీలు 46 శాతం ఉన్నారు.ఇన్స్టాగ్రామ్: 200 కోట్లకుపైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 41.4 కోట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది. యూఎస్ 17 కోట్లు, బ్రెజిల్ 14 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. యూజర్లలో అత్యధికులు 25–34 ఏళ్ల వయసు వారే. -
సర్వే నంబర్లు గాయబ్!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు...రెండు కాదు.. రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన లక్షకు పైగా సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. పాత రికార్డుల్లో ఉన్నా కొత్త రికార్డుల్లోకి ఇవి ఎక్కలేదు. ధరణికి ముందున్న మాన్యువల్ రికార్డుల్లో నమోదైన ఈ సర్వే నంబర్లన్నీ ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు కాలేదు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల సర్వే నంబర్లు కనిపించకపోవడంతో ఆయా సర్వే నంబర్లలో భూమి ఉన్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకపోవడం, సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూభారతి సదస్సుల్లో ఈ రైతులందరూ మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 561 మండలాల్లో ఉన్న 10,239 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో మొత్తం 8,00,999 దరఖాస్తులు రాగా, అందులో తమ భూముల సర్వే నంబర్లు మిస్సయ్యాయంటూ ఏకంగా 1,26,028 దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 15 శాతం సర్వే నంబర్ల మిస్సింగ్ దరఖాస్తులే కావడం గమనార్హం. రెవెన్యూ రికార్డులకు సంబంధించి కీలకమైన, భూమి గుర్తింపు సంఖ్య అయిన సర్వే నంబరే లేకుండా పోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొత్తం 8 లక్షలకు పైమాటే రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం పేరిట ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఆ పోర్టల్ను రద్దు చేసి భూభారతి అమల్లోకి తెచ్చి కూడా రెండు నెలలయింది. కానీ రాష్ట్ర రైతాంగం చేతిలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి ఇంకా లెక్కలేనన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామస్థాయిలో జరిగిన ఈ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా వినతులు రావడం గమనార్హం. ఇందులో ఎక్కువగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం దరఖాస్తులు ఇవే కావడం గమనార్హం. కాగా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవసరమైన నిబంధనలను భూభారతి చట్టంలో పెట్టినా..ఈ అంశం కోర్టులో పెండింగ్ ఉండడంతో అవి రెగ్యులరైజ్ చేసేందుకు వీలు కాలేదు. కోర్టులో కేసు ముగిసిన తర్వాత ఆగస్టు నెలలో వీటన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత సర్వే నంబర్ల మిస్సింగ్, అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డుల సమస్యలు, ఆ భూములను తమకు క్రమబద్ధీకరించాలంటూ వచ్చిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. అసైన్డ్ భూముల రెవెన్యూ రికార్డులకు సంబంధించి 90 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఆ భూములను తమకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ మరో 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత వారసత్వం (విరాసత్) ద్వారా వచ్చిన భూమిని భాగస్వామ్య పంపకం చేయాలంటూ ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయితే భూభారతి పోర్టల్ ద్వారా ఈ భాగస్వామ్య పంపకాలకు అవకాశం కల్పించలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక మ్యుటేషన్ పెండింగ్/కోర్టు కేసులు, డిజిటల్ సంతకం పెండింగ్, విస్తీర్ణంలో తేడాలు.. ఇలా రెవెన్యూ రికార్డులకు సంబంధించి 13 రకాలు, ఇతర సమస్యలకు సంబంధించిన 17 రకాల దరఖాస్తులు ఇటీవల జరిగిన భూభారతి సదస్సుల్లో రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 3.2 లక్షలు ఇప్పటికే ఆన్లైన్లో నమోదు కాగా మిగిలిన దరఖాస్తులను కూడా నమోదు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మంలో ఎక్కువ..మేడ్చల్లో తక్కువ జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఖమ్మం జిల్లా రైతాంగం ఎక్కువగా భూమి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు భూభారతి సదస్సుల్లో వచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాలో అత్యధికంగా 67,378 దరఖాస్తులు రాగా, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 61,145 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.28 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం వచ్చిన 8 లక్షల దరఖాస్తుల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 15 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. ఆ తర్వాత వరంగల్ (54,933), భూపాలపల్లి (48,651), సూర్యాపేట (44,501), సిద్దిపేట (42,639), నల్లగొండ (42,161) జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యల్పంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 2,857 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 10 వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో ఆసిఫాబాద్ (3,712), మహబూబ్నగర్ (9,610), నారాయణపేట (4,052), రాజన్న సిరిసిల్ల (6,965), వనపర్తి (7,615) ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి సమస్యల నుంచి విముక్తి భూభారతి సదస్సులను చాలా పకడ్బందీగా నిర్వహించాం. అధికారులే గ్రామాలకు వెళ్లి, ప్రజలకు ఒకరోజు ముందే దరఖాస్తులు ఇచ్చి, అన్ని వివరాలను తీసుకున్నారు. రూపాయి ఖర్చు లేకుండా రైతులు తమ భూ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసుకునే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన పాపాలకు, ధరణి తెచ్చిన కష్టాలకు భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య నిదర్శనం. ధరణిని బంగాళాఖాతంలో కలిపేశాం. ఇప్పుడు రైతుల సమస్యల పరిష్కారమే మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఆగస్టు 15 నాటికి తెలంగాణ రైతాంగాన్ని భూ సమస్యల నుంచి విముక్తులను చేస్తాం. – రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (నోట్: ఇతరముల కేటగిరీలో ఎక్కువగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, 2 లక్షలకు పైగా అవేనని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైన్డ్ భూములను రిజిస్టర్ చేయాలంటూ 50 వేలకు పైగా, శివాయి జమేదార్ భూముల సమస్యలపై 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. వీటితో పాటు పోడు భూములు, సరిహద్దు వివాదాలు, ఇండ్ల స్థలాలకు పాస్బుక్కులు, కోర్టు కేసులు, అప్పీళ్లు, భూదాన్ భూములు.. ఇలా 17 రకాల సమస్యలపై భూభారతి సదస్సుల్లో రైతులు దరఖాస్తులు సమర్పించారు.) -
25 నుంచి 29 వరకు వైద్య కళాశాలల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు ప్రాక్టికల్స్కు అవసరమైన ఏర్పాట్లలో ఉన్న లోపాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించేందుకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. 26 వైద్య కళాశాలల్లో లోపాలపై జాతీయ వైద్య కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, డీఎంఈ నరేంద్ర కుమార్ ఢిల్లీకి వెళ్లి వివరణ ఇచ్చారు. అంతకుముందే సీఎం రేవంత్రెడ్డి ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశా రు.ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి వైద్య కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి నివే దిక అందజేయాలని ఆదేశించారు. దీంతో 10 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు 25 నుంచి 29 వరకు 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సౌకర్యాలను పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై 30న ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో ఎన్ఎంసీ అధికారులకు సైతం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలియజేశారు. -
లైవ్ లొకేషన్ తరహాలో తపాలా డిజిపిన్
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ పిన్ (డిజిపిన్) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించేందుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తపాలాశాఖ ప్రతి 16 చదరపు మీటర్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఓ పిన్ నంబర్ను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఆ పిన్ నంబర్నే ఇప్పుడు రియల్టైమ్ లొకే షన్గా వాడుకునేలా తపాలాశాఖ గూగు ల్ మ్యాప్ ద్వారా అనుసంధానించింది. దీనిని వైద్యారోగ్య, పోలీసు, అగ్నిమాపక, రెవె న్యూ, మత్స్య తదితర శాఖలతో అనుసంధానిస్తారు. ఇది అత్యవసర సందర్భాల్లో ప్రజ లకు వీలైనంత తొందరలో సహాయం అందేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మేరకు ఆయా శాఖలతో అనుసంధానించాలంటూ తాజాగా తెలంగాణ తపాలాశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏంటీ వ్యవస్థ? ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తపాలాశాఖ ఆధ్వర్యంలో పిన్కోడ్ నంబర్లు ఉన్న విష యం తెలిసిందే. ఓ గ్రామానికో, పట్ట ణాలు/నగరాల్లోని కొంతభాగానికో ఒకటి చొప్పున ఈ పిన్కోడ్ నంబర్లు ఉన్నాయి. అది చాలా పెద్ద పరిధితో కూడిన ప్రాంతానికి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా చిన్నచిన్న ప్రాంతానికి ఒక ప్రత్యేక పిన్ నంబర్ ఉండేవిధంగా తపాలాశాఖ డిజిపిన్ వ్యవస్థను రూపొందించిన విషయం తెలి సిందే. ఐఐటీ హైదరాబాద్, నేషనల్ రిమో ట్ సెన్సింగ్ ఏజెన్సీల సంయుక్తాధ్వర్యంలో దీనిని రూపొందించారు.దేశంలో ప్రతి 4 చదరపు మీటర్లు ఇంటూ 4 చదరపు మీటర్ల ప్రాంతానికి ప్రత్యేక డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ను కేటాయించారు. దాన్ని అక్షాంశ రేఖాంశాల ఆధారంగా స్థిరీకరించి శాటిలైట్ ద్వారా అనుసంధానించారు. ఇప్పుడు గూగుల్తో దాన్ని అనుసంధానించారు. మనం ఎక్కడున్నా ఆ ప్రాంత డిజిపిన్ను గుర్తించొచ్చు. స్మార్ట్ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి ‘నో మై డిజిపిన్’అని టైప్ చేయగానే డిజిపిన్ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయగానే గూగుల్ మ్యాప్లో ఆ ప్రాంత డిజిపిన్ కనిపిస్తుంది. దాన్ని కంప్యూటర్/ల్యాప్టాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ మ్యాప్లో మన లొకోషన్ ఎలా కనిపిస్తుందో, అలాగే మనం ఉన్న ప్రాంత డిజిపిన్ కూడా కనిపిస్తుంది. ⇒ దేశం మొత్తాన్ని 16 గ్రిడ్లుగా విభజించారు. మళ్లీ పత్రి గ్రిడ్ను 16 చిన్న గ్రిడ్లుగా విభజించారు. అలా పది లేయర్లుగా విభజిస్తూ చివరు 16 చదరపు మీ టర్ల ప్రాంతం వరకు విభజించారు. ప్రతి గ్రిడ్కు ఓ నంబరు కేటాయిస్తూ.. చివరకు 16 చదరపు మీటర్ల ప్రాంతానికి పది డిజిట్లతో కూడిన ఫైనల్ నంబరు కేటాయించారు. అదే తుది డిజిపిన్ నంబరు. ⇒ ఇది ఇంచుమించు ప్రతి ఇంటికి కాస్త అటూ ఇటుగా ఓ పిన్ నంబరుగా ఉంటుంది. పెద్ద అపార్ట్మెంట్లు, విశాలమైన ప్రాంగణం ఉన్న వాటికి నాలుగైదు నంబర్లు ఉంటాయి. వాటిల్లో ఏ నంబరును వినియోగించినా... మన కచ్చితమైన చిరునామాను గుర్తించొచ్చు. ⇒ ఇక పార్శల్స్, ఉత్తరాలను పోస్ట్/కొరియర్ చేసేప్పుడు నగరం, పట్టణం, కాలనీ, వీధి, ఇంటినంబరు... ఇలాంటివి ఏవీ లేకుండా వ్యక్తి పేరు, డిజిపిన్ రాస్తే ఎలాంటి వెతుకులాట లేకుండా కచ్చితంగా ఆ చిరునామాను గుర్తించొచ్చు. ⇒ చిరునామాలో వ్యక్తిగత గోప్యత ఉండాలనుకునేవారు వారి వ్యక్తిగత చిరునామా ఇవ్వకుండా కేవలం డిజిపిన్ ద్వారా ఆ పార్శిల్ను ఇంటికి తెప్పించుకోవచ్చు. ⇒ మనం వేరే ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నామో.. అవతలి వారికి తెలిపేందుకు ఈ డిజిపిన్ను వాడుకోవచ్చు. ⇒ భారీ వరదలు, అగ్ని, రోడ్డు ప్రమాదా లు, ఇతర ఉపద్రవాల్లో చిక్కుకున్నప్పుడు.. తాను ఉన్న ప్రాంతాన్ని అత్యవసర సేవలు అందించే వారికి ఈ డిజిపిన్ ద్వారా సులభంగా తెలపొచ్చు. ⇒ ఈ–కామర్స్ కంపెనీలు, డిజిటల్ సర్వి సు ప్రొవైడర్లతో కూడా ఈ డిజిపిన్ వ్యవస్థను అనుసంధానించే కసరత్తు జరుగుతోంది. అప్పుడు క్యాబ్/ఆటో ప్రొవైడ ర్లు, ఆహార పదార్థాల సరఫరా సంస్థలు, కిరాణా, మందుల సరఫరా సంస్థలు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. ⇒ ఈ డిజిపిన్ ఏపీఐ, ఓపెన్ సోర్స్ రిపోజిటరీ జిట్హబ్లో అందుబాటులో ఉన్నా యని, తమ పోర్టళ్లతో అనుసంధానించుకోవచ్చని తపాలాశాఖ పేర్కొంటోంది. -
ఆ విమానాలు నిలిపివేయడమే మంచిది
సాక్షి, హైదరాబాద్: ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానాల్లో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వాటి సర్వీసులను నిలిపివేయడమే మంచిదని విమాన ప్రయాణాలు సాగించేవారిలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానం ఈ నెల 12న అహ్మదాబాద్లో కూలిపోవటంతో 270 దుర్మరణం చెందారు. ఈ ఘటన తర్వాత విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించి ఏయే అంశాలపై ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారన్నది తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా తాము ప్రయాణించబోయేది ఏ రకం విమానం అన్నదానికి ప్రయాణికులు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. 41 శాతం మంది తాము ఏ రకమైన విమానంలో ప్రయాణించబోతున్నాము.. అది ఏ కంపెనీది అన్నది కూడా చూస్తున్నారు. సర్వేలోని కొన్ని ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు.. -
విజయవంతంగా ‘సే నో టూ డ్రగ్స్ ..అండ్ ఎస్ టూఫ్ లైఫ్’ సైక్లోథాన్
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ విభాగం నిర్వహించిన సైక్లోథాన్ విజయవంతమైంది. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ సైక్లోథాన్ను నిర్వహించింది. నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో ఆధ్వర్యంలో జూన్ 21న సే నో టూ డ్రగ్స్ అండ్ ఎస్ టూఫ్ లైఫ్ అనే నినాదంతో ఈ సైక్లోథాన్ను చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం నానక్ రామ్ గూడా స్టార్ ఆస్పత్రి నుంచి ఈ రైడ్ జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైక్లోథాన్తో పాటు పలువురు ముఖ్య అతిధులు పాల్గొన్నారు. -
‘పరిపాలన చేతకాక, హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారు’
హైదరాబాద్: ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే.. ఒక కుటుంబం బారినపడి బలి అయ్యిందని మండిపడ్డారు. అవినీతి పాలనతో, దోపిడితో,, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బ తీశారని ద్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా పని చేసిందో మనం చూశామని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇక గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ఆ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అప్పులు ఇచ్చే వారు లేరని, తనను నమ్మే వాడు లేడని సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశాడన్నారు. పరిపాలన చేతకాక, హామాలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. -
మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. దీనిలో భాగంగా ఆదివారం(జూన్ 22) తెలంగాణ భవన్ను ముట్టడించడానికి యత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తెలంగాణ భవన్లోకి దూసుకుపోవడానికి యత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టి పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. సీఎం బినామీలే అక్రమ మైనింగ్ చేస్తున్నారని, తెలంగాణ మంత్రులు ఇసుక దందాకు పాల్పడుతున్నారని నిన్న(శనివారం) వరంగల్లో కౌశిక్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను తెలంగాణ భవన్ వేదికగా బయటపెడతాననని కౌశిక్రెడ్డి విమర్శించారు. -
కాంగ్రెస్లో పొలిటికల్ వార్.. కొండా సురేఖపై చర్యలు తప్పవా?
సాక్షి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్కు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు నేతలందరూ కూటమి కట్టారు. ఇక, తాజాగా హస్తం నేతల పంచాయతీ తాజాగా కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ వద్దకు చేరుకుంది.వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షీ నటరాజన్ భేటీ అయ్యారు. కడియం శ్రీహరి, కార్పొరేషన్ చైర్మన్, ఎర్రబెల్లి స్వర్ణ తదితర నేతలు మీనాక్షి నటరాజన్తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో చర్చలో ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్కు సీనియర్ల నివేదిక అందింది. సీనియర్ల నివేదిక ఆధారంగా మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.కొండా మురళి వ్యాఖ్యల ఎఫెక్ట్.. అయితే, ఇన్ని రోజులు మంత్రి కొండా సురేఖ జిల్లాలో నేతలను కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి ఉంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి మరింత ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి మురళి కామెంట్స్ చేశారు. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ.. మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందర్నీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా.. ఎవరి దారి వారిదే అన్నట్టున్నగా ఉన్న శాసనసభ్యులు.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్క తాటి మీదికి వచ్చినట్టు సమాచారం.కొండా మురళి వ్యాఖ్యలతో.. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్రెడ్డితో కూడా కయ్యం మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వీరంతా.. ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. -
అలా చేస్తే.. కేంద్రం ఇజ్జత్ పోయేది: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని.. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ ప్రభుత్వం రక్షణ కవచంలా మారిపోయిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ఒక్క స్కాంలో కూడా కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణా ప్రజలు డిసైడ్ అయ్యారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.‘‘కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా మారింది. నిజాయితీగా పదకొండేళ్ల నుంచి పాలన చేస్తోన్న మోదీ నుంచి అమిత్ షా అందరూ అదే చెప్పారు. కాళేశ్వరం అవినీతి, అక్రమాలతో కూడిన ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులే వందల కోట్లు సంపాదించుకున్నారు. ఈ అవినీతిపై విచారణను రేవంత్ సర్కార్ అధికారులకే పరిమితం చేయొద్దు. సీడబ్ల్యూసీ 1986 నుంచి 2013 వరకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదంటే.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం నీటి లభ్యత ఎందుకు కనిపించలేదు..?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.‘‘ఈ రిపోర్ట్ ప్రకారం ప్రాజెక్టు కడితే 38 వేల కోట్లలో ప్రాజెక్టు కడితే.. ఇవాళ లక్షా 20 వేల కోట్లు అయ్యేవా?. జాతీయ హోదా ఇస్తే కేంద్రం ఇజ్జత్ పోయేది. ఇంకా సిగ్గు లేకుండా జాతీయ హోదా అడుగుతున్నారు. ఎన్డీఎస్ఏ తాగి కూర్చున్న కమిటీ కాదు.. చట్టబద్ధంగా ఏర్పడిన కమిటీ. క్యాబినెట్లో ఎప్పుడు పెట్టారు?. ఎప్పుడు సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది?. ఎప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభించారో రేవంత్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు..?. కాళేశ్వరం లేకున్నా ఇవాళ పంట దిగుబడి ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ చెప్పాలి. రేవంత్ సర్కార్ వచ్చాక వారు విచారణ చేయరు.. సీబీఐకి అప్పగించరు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
‘మహంకాళి’ డీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
రాంగోపాల్పేట్: వజ్రాల వ్యాపారిని భయపెట్టి రూ.6 లక్షలు వసూళ్లు చేసిన కేసులో మహంకాళి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు క్రైం కానిస్టేబుళ్లను నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. వివరాలలోకి వెళితే...డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ప్రసాద్, క్రైమ్ కానిస్టేబుళ్లు శ్యాం, మహేష్లు గత నెల 31వ తేదీన కడపకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి నుంచి జనరల్బజార్లో కోటి రూపాయల విలువ చేసే వజ్రాలను స్వా«దీనం చేసుకున్నారు. సదరు వ్యాపారి వజ్రాలను తీసుకుని వచ్చి నగరంలోని వివిధ వ్యాపారులకు విక్రయిస్తుంటాడు.ఈ మేరకు వజ్రాలకు సంబంధించిన అన్ని బిల్లులు చూపించినప్పటికీ వినకుండా కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు ఈ కేసుకు సంబంధించి రూ.6 లక్షలు ఇస్తానని సదరు వ్యాపా రి పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే వ్యాపారి అకౌంట్ నుంచి డీఐకి చెందిన స్నేహితుడి ఖాతాకు రూ.6 లక్షలు జమ అయ్యాయి. అయితే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిన వ్యాపారి వెంటనే తన అకౌంట్ నుంచి తన ప్రమే యం లేకుండా రూ.6 లక్షలు డ్రా అయ్యాయని బ్యాంకులో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు దీని గురించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తిగా ఆధారాలు సేకరించిన అనంతరం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వైకే ప్రసాద్, క్రైం కానిస్టేబుళ్లు శ్యాం, మహే‹Ùలను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇదే డీఐ ప్రసాద్ తాను పని చేసే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్ది నెలల క్రితం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సస్పెండ్ అయ్యాడు. ఈ కేసు విచారణ అనంతరం మహంకాళి పోలీస్స్టేషన్కు ఆయనను అటాచ్ చేశారు. -
Hyderabad: విలాసవంతమైన వసతిగా హెలీప్యాడ్
గ్రేటర్లో హైరైజ్ బిల్డింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి. నగరం చుట్లూ పెద్దపెద్ద వెంచర్లు మొదలవుతున్నాయి. కస్టమర్లలోనూ హైరైజ్ నివాసాలపై ఆసక్తి పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు పోటాపోటీగా హైరైజ్ అపార్ట్మెంట్లను నిరి్మస్తున్నాయి. ఇక వీటిల్లో వసతులు ఇప్పుడు హాట్టాపిక్గా మారాయి. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన వసతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు హైరైజ్ భవనాలపైన హెలీకాఫ్టర్లు ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన హెలీప్యాడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇది నగరంలో లగ్జరీ ట్రెండ్గా మారింది. సాక్షి, హైదరాబాద్: హైరైజ్ భవన నిర్మాణాలకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో వాటిల్లో విలాసవంతమైన వసతులు పెరుగుతున్నాయి. గతంలో కస్టమర్లు స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి వసతులనే లగ్జరీగా భావించేవారు. కానీ, ప్రస్తుతం మాత్రం విదేశాల్లో మాదిరిగా అంతర్జాతీయ స్థాయి వసతులను కోరుకుంటున్నారు. దీంతో గోల్ఫ్ కోర్ట్, హెలీప్యాడ్, స్కైవాక్ వంటి విలాసవంతమైన వసతులను సైతం నిర్మాణ సంస్థలు అందిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఆకాశహార్మ్యం పైకప్పులపై హెలీప్యాడ్ల నిర్మాణానికి డెవలపపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ⇒ ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో లగ్జరీ అపార్ట్మెంట్లు, హోటళ్ల పైకప్పులపై హెలీప్యాడ్లు సర్వసాధారణమైపోయాయి. లగ్జరీ, హోదా చిహ్నంగా ఇవి ఉన్నప్పటికీ..అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో నివాసితులను తరలించేందుకు ఇవి ఎంతో ఉపయుక్తం. మన నగరంలో కోకాపేట, నానక్రాంగూడ, తెల్లాపూర్, పుప్పాలగూడ, మాదాపూర్, గచి్చ»ౌలి, కూకట్పల్లి వంటి పశ్చిమ హైదరాబాద్లోనే హెలీప్యాడ్ భవన నిర్మాణాలు ఎక్కువగా వస్తున్నాయి.ఇప్పటివరకు ఐదు ప్రాజెక్ట్లు.. హైరైజ్ బిల్డింగులపై హెలీప్యాడ్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు ఐదు సంస్థలు జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశాయి. వీటికి అనుమతి లభించింది. జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్, టౌన్ప్లానింగ్ డైరెక్టర్, హెచ్ఎండీఏ చీఫ్ సిటీ ప్లానర్, రోడ్లు భవనాల విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్లతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ హెలిప్యాడ్ కోసం నిర్మాణ సంస్థల నుంచి వచి్చన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకు కూకట్పల్లి, నానక్రాంగూడ, నియోపోలిస్ ప్రాంతాలలోని పలు లగ్జరీ అపార్ట్మెంట్లు, మాదాపూర్లోని ఓ హోటల్ పైకప్పుపై హెలీప్యాడ్ నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. లోధా, ఎల్అండ్టీ–ఫోనిక్స్, మంజీరా, మంత్రి, జీహెచ్ఆర్ వంటి సంస్థలు ఈ విలాసవంతమైన సౌకర్యాన్ని అందిస్తున్నాయి. \\60 మీటర్ల కంటే ఎత్తయితే.. జాతీయ భవన నిర్మాణ నియమావళి (ఎన్బీసీ) నిబంధనల ప్రకారం 60 మీటర్ల కంటే ఎత్తయిన భవన నిర్మాణాలకు హెలిప్యాడ్లు తప్పనిసరి. 1999లో ఈ నిబంధన అమలులోకి వచ్చినప్పటికీ హైదరాబాద్లో 60 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలు పెద్దగా లేవు. 2007 నుంచి 60 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయిన ప్రాజెక్ట్లు వస్తుండటంతో హెలీ ప్యాడ్ల ఏర్పాటు తప్పనిసరిగా మారింది. పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) నియమాలు, నిబంధనల ప్రకారమే నిర్మాణ సంస్థలు హెలీప్యాడ్లను నిరి్మంచాల్సి ఉంటుంది. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 22-29)
-
గంజాయి తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్.. గుండెపోటుతో మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాలానగర్లో ఎస్వోటీ కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటుతో మృతిచెందారు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడంతో సదరు కానిస్టేబుల్ తనిఖీలకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు.వివరాల ప్రకారం.. బాలానగర్లో పరిధిలోని ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఎస్వోటీ పోలీసులు.. తనిఖీల కోసం అక్కడికి చేరుకున్నారు. అక్కడ సోదాలు జరుగుతున్న సమయంలో ఎస్వోటీ కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటుతో నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ప్రవీణ్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం, ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
అన్నీ ఆ 13,000 రూపాయల్లోనే!
వచ్చేదే అరకొర. పొదుపుగా వాడుకోవాలి. అందులోనే దాచుకోవాలి. అనుకోని ఖర్చులు ఎదురైతే ఎలా అని వెంటాడే ఆలోచనలు.. ఇదీ పైసా పైసా లెక్కబెట్టే ఓ సగటు దిగువ మధ్య తరగతి ‘జీవి’తం. దేశంలో దిగువ మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సగటు ఆదాయం నెలకు రూ. 33,000. ఖర్చులు రూ. 20,000 వరకు ఉంటున్నాయి. మిగిలిన రూ.13 వేలల్లోనే వారి కలలు, ఆకాంక్షలు, నిర్ణయాలు అన్నీ ముడిపడి ఉంటున్నాయని ‘హోమ్ క్రెడిట్’ సంస్థ నివేదిక చెబుతోంది. గతేడాదితో పోలిస్తే ఆయా విభాగాల్లో నెలవారీ సగటు వ్యయాలూ పెరిగాయని వెల్లడించింది.దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది కస్టమర్లున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ‘హోమ్ క్రెడిట్ ఇండియా’ విడుదల చేసిన ‘ద గ్రేట్ ఇండియన్ వాలెట్–2025’ నివేదిక ప్రకారం నెలవారీ వ్యయాలు పోను తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తున్న వారు 50% మంది మాత్రమే. ఖర్చులతోనూ వెళ్లదీస్తూ, ఆదా చేయలేకపోతున్నవారు 38% మంది ఉన్నారు. 12% మంది నెలవారీ అవసరాల కోసం అప్పు చేస్తున్నారు. ప్రాంతాలు, తరాల వారీగా ఆదాయాల్లో వ్యత్యాసం, కొనుగోళ్ల తీరు వేరుగా ఉందని ఈ నివేదిక తెలిపింది. ఆదాయం రూ.5 లక్షలలోపు..వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న కుటుంబాల ఆదాయాలు, ఖర్చులు, పొదుపుల ఆధారంగా 17 నగరాలలోని 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించారు. వీరిలో పురుషులు 84%, స్త్రీలు 16% ఉన్నారు. జెన్ –జడ్ (13–28 ఏళ్లు) 19%, మిలీనియల్స్ (29–44 ఏళ్లు) 53, జెన్ –ఎక్స్ (44–59 ఏళ్లు) 28% ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో కార్మికులు 42 %, వ్యాపారులు 29, వేతన జీవులు 22, స్వయం ఉపాధి పొందుతున్నవారు 7% ఉన్నారు.పొదుపులో జెన్ –జడ్జెన్ –జడ్ తరంలో అత్యధికంగా 56% మంది పొదుపు చేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. మిలీనియల్స్లో ఇది 53%. వీరితో పోలిస్తే జెన్ –ఎక్స్లో తక్కువగా 41% మంది మాత్రమే సేవింగ్స్కు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నవారిలో జెన్ –జడ్ తరం నుంచి 33% ఉన్నారు. లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక మార్గదర్శకులు కావాలని 58% మంది భావిస్తున్నారు. జెన్ –జడ్ విషయంలో ఈ సంఖ్య 65%, మిలీనియల్స్లో 59% ఉన్నారు. ఇక భారత్లో దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక సగటు ఆదాయం రూ.38,600 నమోదు చేయగా, ఉత్తరాది, తూర్పున ఇది సగటున రూ.30,300గా ఉంది. బెంగళూరు రూ.45,700తో తొలి స్థానంలో నిలిచింది. రూ.39,200తో హైదరాబాద్, రూ.35,800 తో ముంబై ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఆకాంక్షలతోపాటు ఆందోళనలు..వచ్చే అయిదేళ్లలో వ్యాపారం ప్రారంభించడం, విస్తరించాలని 23% మంది లక్ష్యంగా చేసుకున్నారు. ఇల్లు కొనుక్కోవాలని 23% ఆకాంక్షించారు. పిల్లల విద్యకు పొదుపు చేయాలని 15% మంది, రుణాల చెల్లింపు 11%, కారు కొనుగోలు 11%, విదేశీ టూర్ వెళ్లాలని 7% మంది భావిస్తున్నారు. దాదాపు 60% మంది తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉన్నారు. పిల్లల చదువులకు ఖర్చులు సరిపోవడం లేదని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే తగినంత పొదుపు లేదని, రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నామని, ఉద్యోగం లేదా ఆదాయ వనరు కోల్పోయామని, పదవీ విరమణకు సరిపడా డబ్బు లేవని ఆవేదన చెందుతున్నారు.దుకాణాలకు వెళ్లి..దుస్తులు, ఫ్యాషన్ , మొబైల్ ఫోన్ ్స, గృహోపకరణాలు, సరుకులు, మందులు.. ఈ విభాగాల్లో కస్టమర్లు ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మొత్తం కొనుగోళ్లలో ఏకంగా 83–85% ఆఫ్లైన్ లోనే నమోదు కావడం గమనార్హం. బస్సు, రైలు టికెట్ బుకింగ్స్, ఫుడ్ ఆర్డర్స్లో ఆఫ్లైన్ వాటా 58–59%గా ఉంది. రుణాల చెల్లింపుల్లో 50%, బిల్ పేమెంట్స్లో 54% ఆన్లైన్లోనే చేస్తున్నారు.రూ.20వేల వరకు ఖర్చులకే సరిపోతోంది⇒ పొదుపు చేయగలుగుతున్న వారు 50% మంది⇒ భారీగా పెరిగిన పిల్లల చదువు వ్యయం⇒ గతేడాదితో పోలిస్తే 34% పెరుగుదల⇒ దుకాణాలకు వెళ్లి కొంటున్నారు⇒ ‘ద గ్రేట్ ఇండియన్ వాలెట్–2025’ నివేదిక⇒ కొనుగోళ్లలో సుమారు 85% ఆఫ్లైన్ లోనే -
బీఆర్ఎస్కు టచ్లో ఉన్న ఇంజనీర్లపై నిఘా..!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు గత సర్కారులోని పెద్దలతో ఇంకా టచ్లోనే ఉంటున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. సర్కారు తీసుకునే ప్రతీ నిర్ణయంపై వారికి వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అలాంటి ఇంజనీర్లపై నిఘా పెట్టా లని ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఏసీబీ దాడులు కూడా జరిగినట్లు నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించాలని ఆదేశించినట్లు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అధికారవర్గాల సమాచారం. కాళేశ్వరం పరిధిలోని నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా విజిలెన్స్ అధికారులు నీటిపారుదల శాఖలోని ఇంజనీర్లకు ఇటీవల నోటీసులు జారీ చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఏసీబీ దాడుల్లో పట్టుపడుతున్న ఇంజనీర్లు వందల కోట్ల మేర అక్రమ ఆస్తులను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. దీనితో ఆ పార్టీ ముఖ్యనేతలతో కొందరు ఇంజనీర్లకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అనుమానాలను ధ్రువీకరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీని మేరకు కొందరు ఇంజనీర్లపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)తో దాడులు జరిపించడంతోపాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫారసుల ఆధారంగా మరికొందరిపై చర్యలకు శ్రీకారం చుట్టారని చర్చ జరుగుతోంది. విజిలెన్స్ సిఫారసుల ఆధారంగా ఏకంగా 38 మంది ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీకావడం శాఖలో ప్రకంపనలు సృష్టించింది. సర్కారుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనీ... ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీతోపాటు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్గా రెండు హోదాల్లో కీలకంగా కొనసాగిన బి.హరిరామ్ను తొలుత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏప్రిల్ 26న అరెస్టు చేసింది. అలాగే, వేరే చోటికి బదిలీ చేసినా ఏడాదికాలంగా ఎస్సారెస్పీ డివిజన్–8 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొనసాగుతున్న నూనె శ్రీధర్ను సైతం ఏసీబీ ఈ నెల 11న అరెస్టు చేసింది. తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ ప్రభుత్వం ఆయన్ను ఏసీబీ కేసులో అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించడంతోనే వీరిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. సాగునీటి రంగంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుండగా, కొందరు అధికారులు గత ప్రభుత్వ నిర్ణయాలను సమరి్థస్తూ రావడం ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన ఫైళ్ల కాపీలు ప్రతిపక్ష నేతలకు వెళ్లడంతోనే ప్రభుత్వం సీరియస్ అయినట్టు సమాచారం. నివేదిక రెండు నెలలు కోల్డ్ స్టోరేజీలో.. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావును విచారించింది. వీరిని కమిషన్ ప్రశ్నించనున్నట్లు సమాచారం రాగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొందరు ఇంజనీర్లపై ఏసీబీ దాడులు చేయించినట్టు బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో 38 మంది ఇంజనీర్లు అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించిందని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ గత మార్చి 18న విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. రెండు నెలల పాటు కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఈ సిఫారసుల లేఖను సరిగ్గా కేసీఆర్ విచారణ కమిషన్ ఎదుట హాజరు కావడానికి ముందు ప్రభుత్వం బయటపెట్టినట్టు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిషన్ సమన్ల ప్రకారం ఈ నెల 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, 2న విజిలెన్స్ కమిషన్ లేఖను ప్రభుత్వం మీడియాకు లీక్ చేసినట్టు గుర్తు చేస్తున్నారు. -
డబ్బుల్లేవు.. కొత్త పథకాలెట్టా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకే నానా కష్టాలు పడుతూ డబ్బులు సమకూర్చుకుంటున్న నేపథ్యంలో..ఇక కొత్త సంక్షేమ పథకాల అమలు ఇప్పట్లో సాధ్యం కాదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఆర్థిక కటకట నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలు నిలిపివేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి నెలా ఖజానాకు వస్తున్న ఆదాయంతో అనివార్యంగా చేయాల్సిన ఖర్చుల సర్దుబాటు మాత్రమే జరుగుతోందని, ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనప్పుడు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆసరా పింఛన్లను పెంచి ఎన్నికలకు వెళ్లాలనుకున్నా సాధ్యం కాలేదని, రైతు భరోసా నిధులు జమ చేసేందుకు మాత్రమే వెసులుబాటు దొరికిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయం కావాలంటే భూముల అమ్మకమే శరణ్యమని స్పష్టం చేస్తున్నాయి. ఆదాయం అంతంత మాత్రమే.. ఖజానా లెక్కలు పరిశీలిస్తే.. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి నెలా ప్రభుత్వ సొంత రాబడులు రూ.12 వేల కోట్లకు మించడం లేదు. గత రెండేళ్ల గణాంకాలు పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతోంది. తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 ఏప్రిల్ నెలలో రూ.10,916 కోట్లు మాత్రమే పన్ను ఆదాయం వచ్చింది. ఇందులో జీఎస్టీ కింద రూ.4 వేల కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,126 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,700 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.1,300 కోట్లు, కేంద్ర పన్నుల రూపంలో రూ.1,100 కోట్లు వచ్చాయి. వీటితో పాటు అప్పులు, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలిపినా మొత్తం రాబడులు రూ.16,473 కోట్లు మాత్రమే. ప్రతి నెలా ఖర్చు ఇలా.. ఖర్చుల విషయానికి వస్తే ప్రతి నెలా సగటున రూ.6 వేల కోట్ల వరకు రెవెన్యూ పద్దు కింద ఖర్చు చేయాల్సి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పాటు రూ.2 వేల కోట్ల వరకు అప్పులకు వడ్డీల కింద, దాదాపు రూ.4 వేల కోట్లు (తాజాగా ప్రకటించిన డీఏతో కలిపి) ఉద్యోగులకు వేతనాల కింద, రూ.1,500 కోట్లు పింఛన్ల కింద, రూ.2,500 కోట్ల వరకు సబ్సిడీల కింద, రూ.1000–1500 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ అనివార్యంగా చెల్లించాల్సినవే. ఇవన్నీ కలిపి రూ.17 వేల కోట్లు దాటుతున్నాయి. అయితే ప్రభుత్వ రాబడులు (అప్పులతో కలిపి) ఇంతకంటే తక్కువే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొంచెం అటుఇటుగా ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇచ్చేటట్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండటం గమనార్హం. కాగా రూపాయి అదనంగా ఖర్చు పెట్టాలన్నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు కడుపు కట్టుకోవాల్సిందేనని, ఎప్పటికప్పుడు సర్దుబాటుకు మాత్రమే నిధులు సరిపోతున్నాయని, ఏదైనా పథకానికి డబ్బులు కావాలంటే రూపాయి రూపాయి పోగేయాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. హెచ్ఎండీఏపై ఆశలు..‘నియోపొలిస్’పై కన్ను ప్రస్తుత పరిస్థితుల్లో భూముల అమ్మకాల ద్వారా మాత్రమే అదనపు ఆదాయం వస్తుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుడే లోటు రూ.9 వేల కోట్లకు చేరినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల ద్వారా రూ.20 వేల కోట్లు సమకూర్చుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో ఇక, హెచ్ఎండీఏ మీదనే ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కోకాపేట్ నియోపొలిస్ భూముల అమ్మకాలను త్వరలోనే తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఐదు ప్రాంతాల్లో భూముల అమ్మకాలకు అవకాశాలున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు 18 హెచ్ఎండీఏ లేఅవుట్లలోని 2,414 ప్లాట్లు, ఉప్పల్ భగాయత్, తుర్కయంజాల్, ఇన్ముల్ నర్వలతో పాటు లేమూరు, కుర్మాల్గూడ, బాచుపల్లి, మేడిపల్లి, మోకిల, ప్రతాప సింగారం, బహుదూర్పల్లి, పెద్ద కంజర్ల తదితర ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు అమ్మడానికి కూడా సర్కారు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 18 నెలల కాలంలో కనీసం రూ.12 వేల కోట్లను హెచ్ఎండీఏ భూముల అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలని, నియోపోలిస్ భూముల అమ్మకాల ద్వారా మరో రూ.3 వేల కోట్ల వరకు సమకూర్చుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో అలా... అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నట్లు చెప్పి పలు పథకాలను ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చేసరికి ఆదాయం పెరిగితే తప్ప అమలు చేయడం సాధ్యం కాదని, అప్పుల కిందే నెలకు రూ.6 వేల కోట్లు చెల్లించాల్సి రావడం వల్ల సంక్షేమ పథకాలకు నిధులు చాలడం లేదని అంటుండంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెన్షన్ల పెంపు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏడాదిన్నర అయినా అమలు కాకపోగా... రైతుభరోసా కింద ఎకరాకు ఏటా ఇస్తామన్న మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదిండాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. అది కూడా సక్రమంగా చెల్లించలేదని ఆరోపిస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు ఐదు డీఏలు చెల్లించాల్సి ఉండగా, రెండింటికి అమోదం తెలిపి.. ఒక డీఏ ఇప్పుడు చెల్లిస్తామని, మరో డీఏ ఆరునెలల తరవాత చెల్లిస్తామని చెప్పడం కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇక వేతన సవరణ ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదని ఉద్యోగులు వాపోతుండగా.. ఆదాయం పెరిగితే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న బడ్జెట్ అంతరం ప్రస్తుత (2025–26) ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.3.05 లక్షల కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే సగటున నెలకు రూ.25 వేల కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ మొదటి రెండు నెలల ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే అది రూ.16,500 కోట్లు దాటలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, వాస్తవ రాబడులకు మధ్య దాదాపు రూ.8,500 కోట్ల మేర తేడా వస్తోందన్న మాట. గత అర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది ఎక్కువే. 2024–25లో ప్రతిపాదించిన బడ్జెట్ ప్రకారం ప్రతినెలా సగటున రూ 23,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలి. కానీ సగటున రూ.17 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకే రాబడులు వచ్చాయి. అంటే ప్రతినెలా సుమారు రూ.6 వేల కోట్లు తక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ తేడా ఏకంగా రూ.8,500 కోట్లకు చేరడం గమనార్హం. -
హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టులో మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలు దశ 2 (బి) ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మెట్రో రైల్ ఫేజ్ 2 (బి) ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డీపీఆర్లను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. వారం క్రితం రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్.. పరిపాలన అనుమతులు ఇచ్చింది.మెట్రో రెండో దశ (బి) లో 86.1 కిలోమీటర్లు. 19,579 కోట్ల రూపాయలతో మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యం తో మెట్రో రెండో దశ నిర్మాణం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. అందులో ఆర్జీఐఏ నుండి భారత్ ఫ్యూచర్ సిటీ (39.6 కిమీ; రూ.7,168 కోట్లు), జేబీఎస్ నుంచి మేడ్చల్ (24.5 కిమీ; రూ. 6,946 కోట్లు), జేబీఎస్ నుంచి షామిర్పేట (22 కిమీ; రూ. 5,465 కోట్లు). మొత్తం 86.1 కిమీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టులో మొత్తం రూ. 19,579 కోట్ల పెట్టుబడి ఉంటుంది.గతంలో సమర్పించిన ప్లీజ్ 2 (ఎ) ప్రాజెక్ట్ ఐదు కారిడార్ల (76.4 కి.మీ) లాగానే, ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్ట్ను కూడా కేంద్ర, రాష్ట ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ JV ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం, ఫేజ్ 2 (బి) ఖర్చు రూ.19,579 కోట్లు. తెలంగాణ ప్రభుత్వ వాటా రూ. 5,874 కోట్లు (30 శాతం), భారత ప్రభుత్వం వాటా రూ. 3,524 కోట్లు (18 శాతం), అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం రూ. 9,398 కోట్లు (48 శాతం), చిన్న పీపీపీ భాగం రూ. 783 కోట్లు (4 శాతం) కలిగి ఉంటుంది. -
బాలాపూర్ అక్కాచెల్లెళ్ల మృతిపై అనుమానాలు!
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు యువతులు శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తండ్రి మందలించాడని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం దర్యాప్తు తర్వాతే మృతికి గల కారణాలపై ఓ అంచనాకి వస్తామని చెబుతున్నారు.వినీల (17), అఖిల (16) అక్కాచెల్లెళ్లు. వినీల ఈ మధ్య ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో పెద్దలు పంచాయితీ పెట్టి కులాంతర వివాహం వద్దని సర్దిచెప్పి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటని ఆ అక్కాచెల్లెళ్లను తండ్రి మందలించగా.. మనస్థాపానికి గురైన ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీ రెయిలింగ్కి చున్నీతో ఉరి వేసుకున్నారు!. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఉరివేసుకొని మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఈ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబ స్వస్థల నెల్లూరు జిల్లా ఉదయగిరిగా సమాచారం. -
ఊహించని సాక్ష్యాలతో రేపు ప్రెస్మీట్ పెడతా: పాడి కౌశిక్రెడ్డి
సాక్షి, వరంగల్: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి ఊరట లభించింది. కాజీపేట రైల్వే కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆపై శనివారం రాత్రి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ మా లీగల్ టీమ్ కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపడం కోసం నిన్నరాత్రి నుండి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను. నేను Ak 47ను అవుతా. తెలంగాణలో మంత్రులు ఇసుక దందా, పేదల భూములు కబ్జా చేస్తున్నారు. రేపు అందరి అక్రమాలు ఆధారాలతో సహా బయట పెడతా. ఊహించిన సాక్ష్యాలతో రేపు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం పెడతా అని కౌశిక్రెడ్డి అన్నారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం కౌశిక్రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్కు తరలించి.. తొలుత ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపర్చారు. తొలుత కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఖమ్మం జైలుకు తరలించేందకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈలోపు 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో.. రిమాండ్ రద్దు చేస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.కేసు ఏంటంటే.. మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
పాడి కౌశిక్రెడ్డికి రిమాండ్ విధింపు.. ఖమ్మం జైలుకు తరలించే యోచన
సాక్షి, వరంగల్: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(Padi Kaushik Reddy)కి కాజీపేట రైల్వే కోర్టులో చుక్కెదురైంది. గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్రెడ్డిని బెదిరించిన కేసులో ఆయనకు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని పోలీసులు ఖమ్మం జైలుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను వరంగల్కు తరలించారు. ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ను కాజీపేట రైల్వే కోర్టుకు తరలించగా.. వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్ విధించింది.కేసు ఏంటంటే..మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.సుబేదారి పీఎస్ వద్ద ఉద్రిక్తతఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి, కౌశిక్ సోదరుడు ప్రతీక్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయనను పరామర్శించేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అలాగే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో స్టేషన్ చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
మాదాపూర్లో మరో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో మరో భారీ మోసం బయటపడింది. బై బ్యాక్ పేరుతో ఏవీ ఇన్ఫ్రా రూ.500 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామంటూ మోసానికి పాల్పడింది. నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో వెంచర్లు అంటూ మోసానికి తెరలేపింది. అమౌంట్ ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటూ హామీ ఇచ్చింది.సుమారు 500 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలకు డబుల్ అమౌంట్ ఇస్తానని భారీగా వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ప్రశ్నించడంతో మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఒక్క క్లిక్తో తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు (TG EdCET 2025 Results) శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్-పుట్టిన తేదీ వివరాలతో సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 38,758 మంది దరఖాస్తు చేసుకోగా, 32,106 మంది హాజరయ్యారు. వీళ్లలో 30,944 మంది అర్హత సాధించారు. దీంతో ఉత్తీర్ణత శాతం 96.38గా నమోదైంది. ఫస్ట్ ర్యాంక్-గణపతి శాస్త్రి(హైదరాబాద్)శరత్ చందర్(హైదరాబాద్)నాగరాజు(వరంగల్)👉ఫలితాల కోసం క్లిక్ చేయండి -
30 లోపు ఇస్తాం.. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంవో రిఫ్లై
సాక్షి, హైదరాబాద్: సీఎంవోకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ అంశాలు కావాలని కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంవో రిప్లై ఇచ్చింది. 30వ తేదీ లోపు ఆయా శాఖలు కమిషన్ అడిగిన సమాచారం ఇస్తాయని సీఎంవో తెలిపింది. కమిషన్ అడిగిన సమాచారాన్ని ఆయా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు సీఎంవో పంపించగా.. ఎల్లుండి కేబినెట్లో కాళేశ్వరం కమిషన్ లేఖపై సర్కార్ చర్చించనుంది.కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది.దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కమిషన్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా, ఆ లోగానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. -
అక్కడ ట్రాఫిక్ జామ్... ఇలా వెళ్లండి !
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రధాన రహదారిలోని ఓ ప్రాంతంలో ధర్నా, మరో రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ విషయం సీసీ కెమెరాలు, హైరైజ్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పోలీసులకు తెలుస్తుంది. కానీ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకులకు తెలియదు. దీంతో వారు ఆ ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. అలా కాకుండా ముందే ఆ విషయం తెలిస్తే..మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళతారు. హైదరాబాద్ పోలీసులు–గూగుల్ ఇండియా ప్రతినిధులు కసరత్తు చేశారు. కొన్ని మార్గాల్లో ప్రయోగాత్మకంగా కూడా అమలు చేశారు. త్వరలో హైదరాబాద్ అంతా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. జంక్షన్లో మూడు, నాలుగు రోడ్లు సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్లోనూ మూడు, నాలుగు రోడ్లు ఉంటాయి. ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ ‘సిగ్నల్స్ సైకిల్’నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు. అయినా ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మార్పు ఉండదు. అలా ఉండాలంటే వాటిని క్షేత్రస్థాయి సిబ్బంది మాన్యువల్గా ఆపరేట్ చేయాలి. ఇలాంటి అనేక సమస్యలకు గూగుల్ సంస్థ పరిష్కారం చూపనుంది. హైదరాబాద్ పోలీసులు–గూగుల్ ఇండియా ప్రతినిధులు కొన్ని జంక్షన్లు, రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విధానం త్వరలోనే నగరవ్యాప్తంగా అమలు కానున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రకటించారు. ఐటీఎంఎస్ సహకారంతో సిగ్నలింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్కు ఏ జంక్షన్లోని.. ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలుస్తుంది. దీనికోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) అడాఫ్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) విధానం అమలవుతుంది. ఈ విధానంలో ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుందనేది లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్ కెమెరాల్లో ఉంటుంది. ఇవన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించి ఉంటాయి. అక్కడి సర్వర్లో ఉండే సాఫ్ట్వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్లైట్ పడేలా చేస్తుంది. అయితే గరిష్టంగా 100 సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రొటేషన్పై సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది.మ్యాప్స్ ద్వారానే అలర్ట్స్ కూడా...ఇప్పటికే గూగుల్ మ్యాప్స్లో ఆయా మార్గాల్లో ఉన్న రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న సెల్ఫోన్ల ద్వారా ఈ రద్దీని గూగుల్ సంస్థ గుర్తిస్తోంది. ట్రాఫిక్ పోలీసుల డేటాతో గూగుల్ సర్వర్ అనుసంధానం చేస్తున్నారు. ఇలా నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీ వివరాలు గూగుల్కు చేరతాయి. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా, రోడ్డు ప్రమాదం జరిగినా, నిరసన కార్యక్రమం ఉన్నా కూడా తెలుస్తాయి. ఈ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే గూగుల్ సర్వర్ మ్యాప్స్కు అనుసంధానం చేస్తుంది. తద్వారా ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనచోదకులను గుర్తించడంతోపాటు ట్రాఫిక్ జామ్పై అలర్ట్ ఇస్తుంది. దాదాç³# రెండుమూడు కిలోమీటర్ల ముందే ఈ సమాచారం ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాన్నీ సూచిస్తుంది. ఈ విధానం అమలులోకి వస్తే సిగ్నల్స్ అన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని (సీసీసీ) సర్వర్ ఆధారంగా పనిచేస్తాయి. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే జంక్షన్లను మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. -
మా ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావొద్దు
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊశన్నపల్లిలో శుక్రవారం ప్రైవేటు స్కూళ్ల బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ఊరికి ప్రైవేటు స్కూల్ బస్సులు రావద్దని, గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు. ఉదయం స్కూల్ బస్సులు వచ్చే సమయానికి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గుమికూడిన కొందరు గ్రామస్తులు.. బస్సులు ఎక్కుతున్న పిల్లలను దించివేశారు. దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు.పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య ఈ విషయాన్ని ఎంఈఓ మహేశ్కు తెలపటంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న పిల్లల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని కోరారు. అనుమతులు లేకుండా పిల్లలను తరలిస్తున్న వ్యాన్ల డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊశన్నపల్లి పాఠశాల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, కలెక్టర్ చేతుల మీదుగా ‘బెస్ట్ స్కూల్’‘ఛాంపియన్ స్కూల్’అవార్డులు పొందారని ఎంఈఓ గుర్తు చేశారు. తల్లిదండ్రులు నిజం తెలుసుకొని తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరారు. -
ఒక రోజు.. ఒక ఊరు.. కదిలిన యంత్రాంగం
పెద్దపల్లి: ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి సహా అధికార యంత్రాంగమంతా కదిలి అర్హులకు సంక్షేమ పథకాలు అందించినట్లు.. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్తోపాటు అధికార యంత్రాంగం మొత్తం శుక్రవారం మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చేరింది. మీసేవ, ఆధార్ సేవలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు చేస్తూ అర్హులకు రేషన్, ఆధార్కార్డులు, కులం, ఆదాయ సర్టిఫికెట్స్, పోస్టల్ ఇన్సూరెన్స్లు, బ్యాంక్ అకౌంట్స్, హెల్త్ చెకప్స్.. ఇలా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేశారు. పీఎం ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్లో భాగంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు. -
2028లో రప్పా రప్పా.. 3.0 లోడింగ్.. ట్రెండింగ్లో హరీష్ రావు ఫొటో
సాక్షి, సంగారెడ్డి: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా.. డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఫుల్ జోష్లో కనిపించారు.పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హరీష్ రావు రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులను కార్యకర్తలు చూపించారు. 2028లో రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు నిలిచాయి. మరోవైపు.. హరీష్ రావు మాట్లాడుతూ..‘కేటీఆర్పై కేసు పెట్టడం.. కేసీఆర్ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు. రాష్ట్రంలో ఏ సర్వే చేసిన మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నాయి. రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.. మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్డు మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాక్ అవుతుంది. రైతుబంధు ఇవ్వకపోతే రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి రైతులందరూ కదులుతారు జాగ్రత్త. వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం. నల్లమల్లల పుట్టిన అని చెప్పుకొనే రేవంత్.. నల్లమల్ల ఎక్కడ ఉంది? అని అడుగుతున్నాడు. కౌశిక్ను అరెస్ట్ చేయడం దారుణం.. రేవంత్ని ప్రశ్నిస్తే అర్దరాత్రి ఓ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..
సనత్నగర్(హైదరాబాద్): కోరిక తీర్చాలంటూ మహిళను వేధిస్తున్న వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్స్ ప్రాంతానికి చెందిన మహిళ (26) బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి 2023లో మానేసింది. ఆ సమయంలో ఆమెకు ప్రైవేట్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న పనీశ్ (52) పరిచయమయ్యాడు. ఆమెను తన కూతురిలా భావిస్తున్నానని చెప్పేవాడు. అవసరాలకు డబ్బు ఇచ్చేవాడు. 2024లో మహిళ హైటెక్ సిటీలోని మరో బ్యాంకులో పనిలో చేరింది. కాగా ఏప్రిల్ 2024 నుంచి మనీష్ ప్రవర్తనలో మార్పును బాధితురాలు గుర్తించింది. తరచూ ఆమెకు వాట్సప్లో తాను ఇచ్చిన డబ్బు ఇవ్వాలని, లేకుంటే తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకరంగా దూషిస్తూ వాట్సప్ సందేశాలు పంపేవాడు. ఆమె పనిచేస్తున్న బ్యాంక్కు వెళ్లి అక్కడి సిబ్బందికి బాధితురాలి గురించి చెడుగా ప్రచారం చేయగా వారు ఆమెను పనిలోకి రావద్దని చెప్పారు. దీంతో బాధితురాలు శనివారం బేగంపేట పీఎస్లో ఫిర్యాదు చేయగా పనీ‹Ùపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కౌశిక్ రెడ్డి అరెస్ట్.. సుబేదారి స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రికత్త..
కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్డేట్స్.. సుబేదారి స్టేషన్ వద్ద ఉద్రికత్త.. వరంగల్లోని సుబేదారి స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణులుబీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుపోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదంఓటు నోటుకు దొంగ.. రేవంత్ రెడ్డి దొంగ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలుదొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలుఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు, మడికొండ పీఎస్కు తరలింపుసుబేదారి స్టేషన్కు కౌశిక్ రెడ్డి సతీమణి శాలినిరెడ్డి..సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకౌశిక్ రెడ్డిని కలిసి పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన ఆయన సతీమణి శాలినిరెడ్డిపోలీసులతో కేసు వివరాలపై ఆరాతీసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి, కౌశిక్ సతీమణి.పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న హైడ్రామావరంగల్ పోలీస్ కమిషనర్ను కలిసేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్కు వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు, లీగల్ సెల్ బృందంకోర్టుకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు ఎర్రబెల్లి కామెంట్స్.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డిపైన కేసులు ఇదే ప్రథమం కాదుఅసెంబ్లీ ప్రశ్నిస్తూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కౌశిక్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారుఏప్రిల్లో కేసు పెట్టారు..సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఇన్ని రోజులు కాలయాపన చేశారు..కేసు పెట్టిన వ్యక్తిపై అనేక ఆరోపణలు ఉన్నాయిరేవంత్ రెడ్డి స్థాయిలో ఒత్తిడి తెచ్చి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు.కేసీఆర్, కేటీఆర్పై కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారురేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాళా తీసింది..దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి..రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ప్లాప్..పరిపాలన కంట్రోల్లో లేదు.. ఎవరికి వారు దోచుకు తింటున్నారు.. 👉బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకింది. అక్రమ కేసులో అరెస్టయిన కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పీఎస్ వద్దకు చేరుకున్నారు. దాస్యం వినయ్ భాస్కర్, రాకేశ్ రెడ్డి తదతరులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.👉ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా స్టేషన్ బయటే అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. 👉హరీష్ రావు సీరియస్.. కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది.రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నడు.కేసులు, అరెస్టులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.నీ వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోస పూరిత వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం.అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.బిఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నది.ఇందిరమ్మ…— Harish Rao Thanneeru (@BRSHarish) June 21, 2025👉అయితే, మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్కి తరలించారు. ఎమ్మెల్యే తరచూ బెరదింపులకు దిగుతున్నాడని, రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మనోజ్రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఏప్రిల్లో ఫిర్యాదు చేశారు.👉దీనిపై 308(2), 308(4), 352 బీఎన్ఎస్ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరికాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి కౌశిక్ రెడ్డిని తరలించనున్నారు. అక్కడి నుంచి జడ్జి ముందు హాజరుపరుచనున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025 -
Golconda: కోట టు టూంబ్స్.. ఆకాశ యానం
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులను ఆకట్టుకొనే చారిత్రక గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు రోప్వే అందుబాటులోకి రానుంది. ఇందుకోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రణాళికలు రూపొందిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోప్వేలు, స్కైవేలపై విస్తృత అధ్యయనం చేస్తోన్న హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ హుమ్టా గోల్కొండ కోట నుంచి 1.5 కి.మీ దూరంలో ఉన్న కుతుబ్షాహీల సమాధుల వరకు రోప్వే నిర్మాణంపై దృష్టి సారించింది. పర్యాటకులతో కిటకిట.. ప్రతి రోజు దేశ,విదేశాలకు చెందిన పర్యాటకులు గోల్కొండ కోటను సందర్శిస్తుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో టూంబ్స్ వరకు వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు వైపులా రాకపోకలు సాగించేందుకు రోప్వేను ఏర్పాటు చేయడమే ఏకైక పరిష్కారమని అధికారులు భావిస్తున్నారు. రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా రోప్వే ద్వారా కేబుల్ కార్లలో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 10 వేల మందికి పైగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వీరిలో 3 వేల మంది విదేశీ టూరిస్టులు ఉంటారని అంచనా. రోప్వే ఏర్పాటు చేస్తే దేశ విదేశాలకు చెందిన పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. త్వరలో కన్సల్టెన్సీ .. రోప్వే ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదికను అందజేసేందుకు త్వరలో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. పీపీపీ పద్ధతిలో నిర్మాణం.. రోప్వేను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించనున్నారు. 1.5 కిలోమీటర్లకు సుమారు రూ.100 కోట్ల వరకు వ్యయం కానున్నట్లు అంచనా. ప్రస్తుతం గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లాలంటే అరగంటకు పైగా సమయం పడుతుంది. రోప్వే వల్ల కేబుల్ కార్లలో 10 నిమిషాల్లో రాకపోకలు సాగించవచ్చు. పైగా టూరిస్టులకు ఆకాశంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. ప్రస్తుత అంచనాల మేరకు రోజుకు 3000 మందికి పైగా రోప్వేను వినియోగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆ సంఖ్య మరింత పెరగవచ్చు. -
‘సిరిసిల్ల అడ్డగా ఫోన్ ట్యాపింగ్.. ప్రభాకర్ రావు కారణంగానే అరెస్ట్ అయ్యా’
సాక్షి, కరీంనగర్: హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ప్రభాకర్ రావు చాలామంది సంసారాలు నాశనం చేశారు.. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘అందరికంటే ఎక్కువ ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు చేసింది నేనే. హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు అనేక మంది ఉసురు పోసుకున్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పాలి. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్కి ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?. ఫోన్ ట్యాపింగ్కు కారణం కేసీఆర్, కేటీఆరే. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది.ప్రభాకర్ రావు సీఎంవో ఆఫీసుని అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయనకు రాచమర్యాదలు చేయడం బంద్ చేయండి. అందరి జీవితాలు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. నన్ను పేపర్ లీక్ అయ్యిందని ప్రభాకర్ రావు అదేశాల మేరకే అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణను సర్వనాశనం చేసిందే కేసీఆర్ ఫ్యామిలీ. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు పోయారు?. కేటీఆర్ అమెరికా పోయి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తర్వాతనే ఆయన ఇండియాకు వచ్చాడు. నాకు సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. విచారణకు హాజరవుతాను’ అని స్పష్టం చేశారు. -
పంచాయతీ భవనమే ఇల్లు
జగదేవ్పూర్(గజ్వేల్): ఆమె గత స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్.. ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే కుటుంబంతో తలదాచుకుంటోంది. ఇందిరమ్మ ఇల్లు వస్తదని అనుకుంటే నిరాశే మిగిలింది. వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి దండు లావణ్యమల్లేశం 2019 స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తనకున్న అర ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పెంకుటిల్లులోనే నివాసముంటున్నారు. ఏడాదిన్నర క్రితం వర్షాలకు పెంకుటిల్లు కూలిపోగా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే నివాసం ఉంటున్నారు. ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. తాను బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ను కాబట్టే ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్లులు రూ. 4లక్షల వరకు రావాలని వాపోయారు. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కౌశిక్రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. మనోజ్ రెడ్డి కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు. తమను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఫిర్యాదు పేర్కొన్నారు. మనోజ్ భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు.. శనివారం తెల్లవారుజామున కౌశిక్రెడ్డిని అరెస్ట్ చేశారు.పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4) మరియు 352 కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కక్షపూరితంగానే తనను అరెస్ట్ చేస్తున్నట్టు ఘాటు విమర్శలు చేశారు. ఇక, ఈరోజు ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు.. కోర్టులో హాజరు పరుచునున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025 -
ఇంద్రావతికి కట్టడి!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉప నది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్గఢ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజా రిటీ జలాలను వినియోగించుకునేలా బోద్ఘాట్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. ఇంద్రావతి నీటినే నమ్ముకొని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు చేపడుతుండటం గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ వినియోగించని జలాలనే ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి–కావేరి అనుసంధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎగువ నీళ్లకు ఎగువనే అడ్డుకట్ట.. ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600–800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్గఢ్లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన, సమ్మక్క–సారక్క బరాజ్ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన, గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ.. దేవాదుల (38 టీఎంసీలు), సీతారామ (70 టీఎంసీలు), సమ్మక్క–సారక్క (50 టీఎంసీలు మొత్తంగా 158 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇలావుండగా ఇంద్రావతిలో లభ్యత నీటిని ఛత్తీస్గఢ్ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడంతో.. ఈ నీటిని మిగులు జలాలుగా గుర్తించిన కేంద్రం.. నదుల అనుసంధాన ప్రతిపాదనలు చేసింది. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్గఢ్ (అప్పటి మధ్యప్రదేశ్)కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకోని 141.4 టీఎంసీలకు మరో 106 టీఎంసీల వరద జలాలను జతచేసి మొత్తం 247 టీఎంసీలను ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్–సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్ట వరకు తరలించేలా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే గోదావరిలో మిగులు, వరద జలాల నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చేవరకు అనుసంధానం పక్కన పెట్టాలని తెలంగాణ, ఏపీలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీంతో తొలిదశ కింద ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలనే గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలు పోను ఏపీకి 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. చెప్పినట్టే చేస్తున్న ఛత్తీస్గఢ్ తమకు హక్కుగా సంక్రమించిన నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకునేలా తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్గఢ్ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బోద్ఘాట్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. ఈ ప్రాజెక్టు కింద ఇందావ్రతి నీటిని ఒడిసిపట్టేలా రూ.29 వేల కోట్లతో బోద్ఘాట్ ఆనకట్టని, అదనంగా మరో రూ.20 వేల కోట్లతో మహానది–ఇంద్రావతి లింక్ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు దంతెవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల్లోని 359 గ్రామాల పరిధిలోని 3.78 లక్షల హెక్టార్లకు (9.45 లక్షల ఎకరాలకు) సాగునీటిని అందించాలని నిర్ణయించింది. అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమే..! ఇంద్రావతి మెజారిటీ జలాలను ఛత్తీస్గఢ్ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటి పారుదల నిపుణులు అంటున్నారు. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు. కాగా దీనిపై తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. -
నీటిపారుదల శాఖ ఈఎన్సి అనిల్ కుమార్ బదిలీ వేటు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ ఈఎన్సి అనిల్ కుమార్ బదిలీ వేటు పడింది. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.అయితే, మేడిగడ్డ ఆనకట్ట గ్రౌటింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనిల్ కుమార్పై బదిలీ వేటువేసినట్లు సమాచారం. ఏసీబీ దాడిలో అరెస్ట్ అయిన ఈఈ శ్రీధర్ విషయంలో కలగజేసుకున్నారని అనిల్పై ఆరోపణలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో బుంగలు పూడ్చాడని (గ్రౌటింగ్)అనిల్పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎవరి ఆదేశాల మేరకు గ్రౌటింగ్ చేశారని అనిల్ కుమార్పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తాజాగా చర్యలకు ఉపక్రమించింది. నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మెమో జారీ చేసినట్లు సమాచారం. -
‘తెలంగాణతో చర్చించకుండా.. ఢిల్లీ నుంచి అనుమతులు కోరడం సరైంది కాదు’
ఢిల్లీ: పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఏపీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే చంద్రబాబుతో చర్చలకు తామే ముందడుగు వేస్తామన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణతో చర్చించకుండా ఢిల్లీ నుంచి అనుమతులు కోరతామని ఏపీ ప్రభుత్వం చెప్పడం సరైనది కాదన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్. ఈరోజు(శుక్రవారం, జూన్ 20వ తేదీ) ఢిల్లీ నుంచి బయల్దేరి క్రమంలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. ‘టిఆర్ఎస్ వల్లే తెలంగాణకు కృష్ణా నీటి పంపకాల్లో అన్యాయం జరిగింది. 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి నీటిపారుదుల శాఖ మంత్రి హరీష్ రావే. కృష్ణానదిలో మేము 500 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరుతున్నాం. బిజెపికి టిఆర్ఎస్ అవయవ దానం చేసింది. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లను బీజేపీ గెలిపించడంలో బీఆర్ఎస్ సహాయం చేసింది. టీఆర్ఎస్ చరిత్రలో ఒక్క సీటు కూడా గెలవకుండా ఉండటం ఇదే తొలిసారి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
‘నా ముందు కూర్చోవడానికి ఆయనకు నామోషీ’
వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేతలపై కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుంటే, మంత్రి కొండా సురేఖ సైతం అదే తరహాలో మాట్లాడారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషని, సీఎం రేవంత్ వద్దకు, పొంగులేటి వద్దకు వెళ్లా తన మీద ఉన్నది లేనిది చెబుతున్నారంటూ విమర్శలు చేశారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు కడియం శ్రీహరి. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు. సీఎం దగ్గరకు, పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు. తెలుగుదేశంలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు. నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. నన్ను దిగిపోవాలని అనుకుంటే ఎలా?, నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా?, అని కొండా సురేఖ ప్రశ్నించారు. భద్రకాళీ టెంపుల్ ఎవరి సొత్తు కాదు..వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డికి సురేఖ కౌంటర్ ఇచ్చారు. కొందరు భద్రకాళీ టెంపుల్ తమ సొత్తు అనుకుంటున్నారని, అది ఎవరి సొత్తు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రాజేందర్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మాట్లాడటం సరికాదు. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయించుకున్నాం. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమ్మవారు శాఖాహారీ అని అందరికీ తెలుసు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం’ అని కొండా సురేఖ తెలిపారు. కేంద్రానికి వివక్ష తగదుగోదావరి పుష్కరాల విషయంలో రెండు రాష్ట్రాలను కేంద్రం ఒకేలా సమానంగా చూడాలన్నారు కొండా సురేఖ. పుష్కరాలకు రూ. 200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతాయన్నారు. భద్రాచలం రాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని, ఇక్కడే గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయన్నారు. తెలంగాణ వివక్ష వద్దు. కిషన్రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.తెలంగాణకు పుష్కరాల కోసం నిధులు ఇప్పించాలి. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారు’ అని ఆమె స్పష్టం చేశారు. -
‘సీఎం కుర్చీలో రేవంత్ను చూడలేకపోతున్నారు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్రావుకు కంటెంట్ తక్కువ.. ఆవేశం ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. నీళ్ళు అనే పదంతో బీఆర్ఎస్ రాజకీయం చేసిందని, బీఆర్ఎస్ నేతలు బేసిక్ నాలెడ్జ్ తో ప్రాజెక్టులు కడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. వాళ్ల మామ కేసీఆర్ను హరీస్రావు విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు నీళ్లు సంగతి పూర్తిగా అర్థమైంది. కేసీఆర్కి ఉన్న అపరజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. హరీష్ వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలోచన చేశారు..గోదావరి జలాలపై గొంతు చించుకునే బీఆర్ఎస్ నేతలు.. కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడరు?, హరీష్ రావుకి కంటెంట్ కంటెంట్ తక్కువ.. ఆవేశం ఎక్కువ. సీఎం కుర్చీలో రేవంత్ను బీఆర్ఎస్ నేతలుచూడలేకపోతున్నారు. నది జలాలు ఎవరి అయ్యా జాగీరు కాదని హరీష్ తెలుసుకోవాలి. నీళ్ళ అంశంపై తనకి తన మామకి తప్పా ఎవరికీ ఏం తెలియదని హరీష్ అనుకుంటున్నారు. తెలంగాణ నీటిని ఏపీకి దారాదత్తం చేసిందే కేసీఆర్. హరీష్ ఇరిగేషన్ మినిష్టర్ గా ఉన్నప్పుడే ఈ పంచాయితీ మొదలైంది. బనకచర్ల విషయంలో కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. బనకచర్లపై ఏకగ్రీవ తీర్మాణం చేద్దామని అనుకునే సమయానికి ఆల్ పార్టీ మీటింగ్ నుండి బీఆర్ఎస్ ఎంపీ వాకౌట్ చేసారు. బేస్ వదిలి దోచుకునే ప్రయత్నం చేశారు కాబట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. బేసిక్స్ కాదు మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ప్రజలు మాకు పట్టం కట్టారు’ అని ఎంపీ చామల కిరణ్ స్పష్టం చేశారు. -
‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’
వరంగల్: మంత్రి కొండా సురేఖ భర్త మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా ఉండి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు నాయని. కొండా మురళి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని, బీసీ కార్డు అడ్డుపెట్టుకుని మాట్లాడతామనడం సరికాదన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘పార్టీ మంచి చెడులు చర్చించుకున్నాం. సీనియర్లు, అనుభవజ్ఞులు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పండగా మాట్లాడటం సరికాదు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని మాట్లాడతామనడం సరికాదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చేయాలి. మనమే పార్టీకి నష్టం చేసుకుంటే ఎలా?, ఎమ్మెల్యేల అందరి నిర్ణయం మేరకు తదుపరి చర్యలుంటాయి. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం’ అని నాయని స్పష్టం చేశారు. కొండా వ్యాఖ్యలపై కాంగ్రెస్లో ప్రకంపనలుకడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిల పై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా వ్యాఖ్యలపై అధికార ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే రాజేందర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొండా మురళిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకునే క్రమంలో ఆ సమావేశం ఏర్పాటు చేశారు. సొంత పార్టీ నేతలకు కొండా సురేఖ భర్త మాస్ వార్నింగ్ -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై పీసీసీ చీఫ్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనే విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. అలాగే తెరపైకి వస్తున్న పేర్ల వ్యవహారంపైనా ఆయన స్పందించారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అభ్యర్థి పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని వైఎస్సార్ కొనసాగించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దాన్ని బ్రేక్ చేశారు. కాబట్టి జూబ్లీహిల్స్ లో కచ్చితంగా అభ్యర్దిని నిలబెడతాం అని అన్నారాయన. మరోవైపు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సీటు తనదేనంటూ మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రకటించుకోవడంపైనా మహేష్గౌడ్ స్పందించారు. జూబ్లీహిల్స్ సీటు అభ్యర్థి గా ఎవరు ప్రకటించుకున్నా అది వారి వ్యక్తిగతమని, పద్ధతి ప్రకారం దరఖాస్తుల స్వీకరణ తర్వాతే అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టత ఇచ్చారు.మరోవైపు.. వరంగల్ కాంగ్రెస్లో నెలకొన్న ముసలం గురించీ ఆయనకు సాక్షి నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి మహేష్ గౌడ్ స్పందిస్తూ.. వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు వచ్చింది. ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. డీసీసీ నివేదిక తర్వాత క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. మంత్రులు తమ శాఖకు పరిమితమైతే మంచిదన్న ఆయన.. ఇష్టారితిన మాట్లాడితే నష్టం పార్టీకేనని గుర్తించాలని నేతలకు హితవు పలికారు. -
ఫోన్ ట్యాపింగ్.. ప్రభాకర్ రావుకు చెక్ పెట్టే ప్లాన్లో సిట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో ప్రభాకర్ రావు తమకు సహాకరించడంలేదని సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును పోలీసు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నారు.ఎస్ఐబీ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా నేడు ఐదోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్ అధికారులు.. ప్రభాకర్ రావును విచారించనున్నారు. అయితే, ఇప్పటి వరకు తమ విచారణకు ప్రభాకర్ రావు సహాకరించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. సిట్ అడిగిన ప్రశ్నలను ప్రభాకర్ రావు దాటవేస్తున్నట్టు చెబుతున్నారు. సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది.ప్రభాకర్ రావును పోలీసు కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరనున్నారు. అలాగే, ప్రభాకర్ రావుకు ఇచ్చిన రిలీఫ్ను కూడా రద్దు చేయాలని కోరే అవకాశం ఉంది. ఇక, గతంలో ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ప్రస్తుత డీజీపీ జితేందర్, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ పీఎస్లో సిట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ హాజరయ్యారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అత్తింటివారి అదనపు కట్నం వేధింపుల కారణంగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీ వద్ద దుర్గం చెరువులో దూకి తనువు చాలించింది. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతోపాటు అత్త, మామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. ఈస్ట్మారేడ్పల్లిలోని అడ్డగుట్టలో ఉంటున్న అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ(27). ఈ ఏడాది జనవరి 31న సుష్మను నేరేడ్మెట్కు చెందిన అమృత్కు ఇచ్చి వివాహం చేశారు. సుష్మ, ఆమె భర్త అమృత్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 6 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కట్నంగా కింద ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతోపాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈనెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16న డిశ్చార్జి అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ల్యాప్టాప్ తెచ్చుకునేందుకు సుష్మ తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్లింది.ఈ సందర్భంగా భర్తతో సహా కుటుంబ సభ్యులు పరుషంగా మాట్లాడారు. మళ్లీ ఎందుకు వచ్చావంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె తండ్రి అంజయ్యను కూడా దూషించారు. దీంతో, సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం కంపెనీలో విధులకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్కు ఫోన్ చేశాడు. రాత్రి 8.30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్లిందని చెప్పాడు.అలా చెప్పడంతో కంగారు పడిన అంజయ్య.. తెలిసిన చోట గాలించి గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
కోహినూరు వజ్రం కాకతీయులదే!
ఖిలా వరంగల్: కాకతీయుల పాలన స్వర్ణయుగం అంటారు. ఓరుగల్లును రాజధానిగా చేసుకుని గణపతిదేవ చక్రవర్తి 1199 నుంచి 1262 వరకు సుదీర్ఘకాలం పరిపాలించాడు. కళింగ, వేంగి రాజవంశమైన తూర్పు గంగాల నుంచి 13వ శతాబ్దంలో కోహినూరు వజ్రం కాకతీయుల చెంతకు చేరింది. వారికి అత్యంత విలువైన ఆస్తులలో ఒకటిగా నిలిచింది. రాణిరుద్రమదేవి తన తండ్రి నుంచి కోహినూరును వారసత్వంగా పొందింది. ఆమె దానిని తొలుత భద్రకాళి దేవికి అలంకరణ కోసం అంకితం చేయగా.. ఆ తర్వాత కాకతీయులు ఆ వజ్రాన్ని రాజధాని పరిపాలనా భవనంలో ఉంచి తమ శక్తి ప్రతిష్టకు ప్రతీకగా ఉపయోగించారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1310లో ఢిల్లీ సుల్తాన్ పంపిన మాలిక్కాపుర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతోపాటు కోహినూరు వజ్రాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనులలో ఓ వితంతువుకు ఆ వజ్రం దొరికిందని, గ్రామ పెద్ద ద్వారా గణపతిదేవ చక్రవర్తి కోహినూరు వజ్రాన్ని బహుమతిగా అందుకొని మొదటి యజమాని అయ్యారని ఓ కథనం. అతడు కాకతీయుల ఆరాధ్య దైవమైన శ్రీభద్రకాళి, తర్వాత కాకతీదేవి విగ్రహానికి నుదుటన అలంకరించి ఆరా«ధన చేశారని చరిత్ర చెబుతోంది. విలువైన వజ్రం.. ప్రపంచంలోనే విలువైన వజ్రాల్లో కోహినూరు ఒకటి. కోహినూరు వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కోహినూరు వజ్రం చరిత్ర చుట్టూ కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. అయితే, భారత్లోని తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం ఎన్నో రాజవంశాల చేతులు మారింది. చివరకు భారత్ నుంచి బ్రిటన్ చేరుకుంది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. కోహినూరు వజ్రాన్ని తిరిగి భారత్కు అప్పగించాలని భారత ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేసింది. అలాంటి కోహినూరు వజ్రం తెలుగు నేలపై ఎక్కడ దొరికింది, ఇది బ్రిటన్ ఎలా చేరింది వంటి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..! తెలుగు నేలపై .. వివాదాస్పద చరిత్ర కలిగిన కోహినూరు వజ్రం మూలాలు మిస్టరీగానే ఉన్నాయి. కోహినూరు వజ్రం సృష్టి.. దాని ప్రారంభ చరిత్ర చుట్టూ అనేక కథనాలు ఉన్నాయి. కోహినూరు అనేది పర్షియన్ పదం.. భాషా పరంగా కోహ్–ఇ–నూర్ అని రాయబడింది. దాని అర్థం కాంతి పర్వతం. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడికి ఆంధ్రప్రదేశ్లోని నేటి గుంటూరు జిల్లా కొల్లూరు గనిలో లభించిన కోహినూర్ వజ్రం బహుమతిగా లభించింది. కాకతీయుల నుంచి ఖిల్జీ చేతికి.. చాలా మంది చరిత్రకారుల ప్రకారం కోహినూర్ వజ్రం కాకతీయ రాజవంశం పాలనలో కాకతీయుల ఆరాధ్యదైవమైన కాకతీమాత దేవతకు కన్నుగా ప్రతిష్టించబడింది. 14వ శతాబ్దం ప్రారంభంలో టర్కిక్ ఖిల్జీ రాజవంశం సైన్యం దోపిడీ కోసం దక్షిణ భారతదేశ రాజ్యాలపై దాడి చేయడం ప్రారంభించింది. 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ తన జనరల్ మాలిక్ కాపుర్ వరంగల్పై దాడి చేయగా.. ప్రతాపరుద్రుడు అపార సంపదతోపాటు కోహినూరు వజ్రాన్ని అప్పగించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి మరో కథనం .. ప్రతాపరుద్రుడి పాలనలో కోహినూరు వజ్రం గోల్కొండ కోటలో ఉండేది. అయితే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1310లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పంపిన మాలిక్ కాపుర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతోపాటు కోహినూర్ వజ్రాన్ని వారికి సమర్పించారు. అయితే ఆతర్వాత కోహినూరు వజ్రం .. ఒక రాజవంశం నుంచి మరొక రాజవంశానికి చేరి చివరకు మొఘల్లకు చేరింది. అక్కడ నుంచి వజ్రం ఎలా చేతులు మారిందనేది చాలా స్పష్టంగా ఉంది. అలా ఢిల్లీ చేరిన వజ్రం పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోడి చేతికి చేరింది. మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఇబ్రహీంలోడి ఓటమి పాలై మరణించిన తర్వాత మొదటి మొఘల్ పాలకుడు బాబర్ కోహినూరును స్వాదీనం చేసుకున్నాడు. కోహినూరు వజ్రం సింహాసనం పైభాగంలో మెరిసే రత్నపు నెమలి తలపై ఉంచారు. మొఘల్ నుంచి పర్షియన్ చేతికి.. 1739లో పర్షియన్ పాలకుడు నాదిర్షా మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి ..వారిని ఓడించాడు. అప్పుడు ఢిల్లీని దోచుకున్నాడు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు శతాబ్దాలుగా పోగు చేసిన అపారమైన సంపదను తన వశం చేసుకున్నాడు. తనతో కోహినూరు వజ్రాన్ని కూడా తీసుకువెళ్లాడు. నాదిర్షా ఆవజ్రాన్ని చూడగానే .. కోహ్–ఇ–నూర్ అని నామకరణం చేశారు. అప్పటి నుంచి ఆ వజ్రానికి కోహినూరు అనే పేరు వచ్చింది. అఫ్గాన్ నుంచి సిక్కుపాలకులు.. నాదిర్షా నుంచి కోహినూరు వజ్రం అహ్మద్ ఖాన్ అబ్దాలీతో ప్రస్తుత అఫ్గానిస్తాన్ (1747–1856)లోని దుర్రానీ రాజు చేతికి చేరుకుంది. అతను షా యొక్క కమాండర్. అనంతరం పర్షియన్లతో విడిపోయాడు. తన అదీనంలో ఉన్న కోహినూర్తో అతను 1747తో అఫ్గాన్ ప్రజలందరికీ పాలకుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. అహ్మద్ షా అబ్దాలీ పేరును స్వీకరించాడు. అతను 1747లో మొదటి ఆధునిక అఫ్ఘన్ రాజ్యాన్ని స్థాపించాడు. వజ్రం దాదాపు ఏడు దశాబ్దాల పాటు అక్కడే ఉంది. 1813లో అబ్దాలీ బహిష్కరించబడిన వారసుడు షా షుజా.. ఆశ్రయం కోసం కోహినూరును సిక్కు పాలకుడు మహారాజా రంజిత్సింగ్కు అప్పగించారు. దీంతో కోహినూరు వజ్రం భారత దేశానికి తిరిగి వచ్చింది. ఈ సమయంలోనే కోహినూరు వజ్రం అంచనా విలువ బ్రిటిష్ వారిని ఆకర్షించింది. 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కు ఓటమి తర్వాత రంజిత్సింగ్ వారసుడు దులీప్ సింగ్ యుద్ధ ఒప్పందంలో భాగంగా కోహినూరును బ్రిటిష్ వారికి అప్పగించారు. 1851లో లండన్కు.. కోహినూర్ సిక్కుల చేతి నుంచి బ్రిటిష్ చేతిలోకి వెళ్లింది. 1851లో కోహినూరు లండన్లోని గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ ప్రదర్శన తర్వాత దాని రూపాన్ని మెరుగుపరచడానికి రాయిని కత్తిరించి పాలిష్ చేశారు. కోహినూరును కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత అది కిరీట ఆభరణాల్లో భాగమైంది. క్వీన్ విక్టోరియా దీనిని గౌన్కు కుడివైపున బ్రోచ్గా (వజ్రం) ధరించారు. ఆతర్వాత సంవత్సరంలో కోహినూరు వజ్రం.. రాజకుటుంబీకుల కిరీటాల్లో కూడా కనిపించింది. ఈ వజ్రాన్ని రాజకుటుంబం తమ ఇంటి పెద్ద కోడలికి వారసత్వంగా అందజేశారు. ప్రపంచంలో అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రిటన్ను భారత ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదని చరిత్ర చెబుతోంది. -
తక్కువ పంట కాలం.. అధిక దిగుబడి
సాక్షి, హైదరాబాద్: తక్కువ పంట కాలంలో అధిక దిగుబడి ఇచ్చే వరి సాగు వైపు తెలంగాణ రైతులు మొగ్గుచూపుతున్నారు. క్రమక్రమంగా దొడ్డు ధాన్యం పండించే రైతుల సంఖ్య తగ్గుతుండగా, సన్నాలే ఎక్కువగా సాగుచేస్తున్నారు. యాసంగి సీజన్లో కూడా భారీ ఎత్తున సన్నాల సాగు చేయడం, పౌరసరఫరాల సంస్థకు ఏకంగా 23 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం విక్రయించడమే అందుకు తార్కాణం. ఈ పరిస్థితుల్లో రైతులకు ఉపయోగకరంగా ఉండేలా, తక్కువ పంట కాలంలో ఎక్కువ దిగుబడిని ఇచ్చే సన్న రకం వరి వంగడాలను అభివృద్ధి చేస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. రాష్ట్రంలోని ఆరు వరి పరిశోధన కేంద్రాల ద్వారా నిరంతరం వరి విత్తనాలపై పరిశోధనలు సాగిస్తూ... తెలంగాణ వాతావరణానికి అనువుగా ఉండే కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. సాధారణంగా వరి పంట కాలం 130 నుంచి 140 రోజుల వరకు ఉంటుంది. 115 రోజుల నుంచి 125 రోజుల్లో పంట దిగుబడి వచ్చేలా కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. సాంబ మసూరికి ప్రత్యామ్నాయంగా... అత్యధికంగా సాగయ్యే సన్న రకాల్లో సాంబమసూరి (బీపీటీ–5204) ముందు వరుసలో ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు పలు ప్రత్యామ్నాయ రకాలను అభివృద్ధి చేశారు. బీపీటీ 5204 గింజ నాణ్యతతో 120–125 రోజుల పంట కాలంలో అధిక దిగుబడిని ఇచ్చేలా అభివృద్ధి చేసిన వంగడాలను రైతులకు అందుబాటులోకి తెచ్చినట్టు వర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ ‘సాక్షి’కి తెలిపారు. సిద్ధి (డబ్ల్యూజీఎల్–44) 2012 నుంచే అభివృద్ధి చేయగా, కొత్తగా కేఎన్ఎం –7715, కేఎన్ఎం 12472లను అభివృద్ధి చేశారు. ఇదే క్వాలిటీతో జేజీఎల్–28545, జేజీఎల్–33124, ఆర్డీఆర్–1200 రైతులకు ఆయా రైతు పరిశోధన కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. జై శ్రీరాం వంటి ప్రైవేటు రకాలకు దీటుగా .. అతి సన్నరకం బియ్యం వచ్చే జైశ్రీరాం, చింటూ జైశ్రీరాం ప్రైవేట్ వెరైటీలకు బహిరంగ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ రకం బియ్యం కిలో రూ.70 నుంచి రూ. 80 వరకు పలుకుతోంది. కాగా ఇదే నాణ్యతతో వర్సిటీ శాస్త్రవేత్తలు జగిత్యాల వరి పరిశోధన కేంద్రంలో జేజీఎల్ –27356 రకాన్ని ఇప్పటికే అభివృద్ధి చేశారు. నాణ్యతతో, రోగాలను తట్టుకొనేలా 125 రోజుల్లో పంట చేతికొచ్చేలా ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు. రాజేంద్రనగర్లో అభివృద్ధి చేస్తున్న మరో వంగడం ఆర్ఎన్ఆర్–31479ను త్వరలో విడుదల చేయనున్నారు. వీటితోపాటు ఆర్డీఆర్ –1162 కూడా జైశ్రీరాం, హెచ్ఎంటీకి దీటుగా ఉంటుంది. తెలంగాణ సోనాకు ప్రత్యామ్నాయంగా ఆరు రకాలువానాకాలం, యాసంగి సీజన్లలో సాగు చేసేందుకు అనువైన అత్యంత ఆదరణ పొందిన రకం తెలంగాణ సోనా. ఆర్ఎన్ఆర్ –15048గా పిలిచే 125 రోజుల పంటకాలపు ఈ వంగడానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా అవే లక్షణాలతో మరో ఐదారు రకాల వంగడాలను వర్సిటీ అభివృద్ధి చేస్తోంది. కేఎన్ఎం–1638 ఇప్పటికే మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉండగా, మరో ఐదు వంగడాలను పంట క్షేత్రాల్లో అభివృద్ధి చేస్తున్నారు. కేఎన్ఎం–12368, కేఎన్ఎం–12510, కేఎన్ఎం– 7715, కేపీఎస్–10631, కేపీఎస్–10642 రకాలను తెలంగాణ సోనా లక్షణాలతో రోగాలను తట్టుకొని, తెలంగాణ వాతావరణంలో మనుగడ సాధించేలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పంట దిగుబడి కూడా 30 క్వింటాళ్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దొడ్డు రకం ఎంటీయూ 1010 నాణ్యతతో కూడా.. దొడ్డు రకం సాగులో అధికంగా వినియోగించే వంగడం ఎంటీయూ 1010. వెయ్యి పదిగా పిలవబడే ఈ పంట ఉత్తర తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎకరాకు 30 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చేలా మరో నాలుగు రకాలను విశ్వవిద్యాలయ వరి పరిశోధన కేంద్రం విడుదల చేసిందని ప్రిన్సిపల్ సైంటిస్ట్ చంద్రమోహన్ తెలిపారు. కేఎన్ఎం 118, ఆర్ఎన్ఆర్ 28361, ఆర్ఎన్ఆర్ 29325, జేజీఎల్ 28639 రకాలు అధిక దిగుబడిని ఇస్తాయని తెలిపారు. -
రేవంత్కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జి ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నదుల బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ (కనీస అవగాహన) లేకుండా మాట్లాడారు. బేసిన్ (పరివాహక ప్రాంతం)ల కంటే కూడా బ్యాగుల మీదే నాలెడ్జి బాగా ఉన్నట్లు ఉంది. నదీ పరివాహాక ప్రదేశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ రాష్ట్రం పరువు తీశారు..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్లపై ఏపీ ప్రభుత్వం గత ఆరు నెలలుగా కేంద్ర మంత్రులను కలుస్తూ అనుమతులు కోరుతుంటే, కనీసం ఆ ప్రాజెక్టు ఏ నది బేసిన్లో కడుతున్నారో కూడా సీఎం రేవంత్రెడ్డి తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.‘రేవంత్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారు. అంతులేని అజ్ఞానంతో మూర్తీభవించిన మూర్ఖత్వంతో మాట్లాడారు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియదు. బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో తెలియదు. ఇవేవీ తెలుసుకోకుండా సీఎం ఏం చేస్తున్నట్లు..?’ అంటూ మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలా?‘తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్కు అవగాహన, చిత్తశుద్ధి లేదని బుధవారం ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తేలిపోయింది. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కూడా బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉంది. బనకచర్ల విషయంలో మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అప్రమత్తం చేస్తే, సీఎం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో.. ‘ఈ భేటీని రాజకీయ వేదికగా మార్చకు..బనకచర్ల ఆపాలి’ అని మా రవిచంద్ర అంటే సీఎం అబద్ధాలకు వేదికగా మార్చారు. ఏపీ జలదోపిడీ, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం చేతకాని సీఎం చెప్తున్న అబద్ధాలకు అంతు ఉండటం లేదు. రేవంత్రెడ్డి కుసంస్కారి.. వదరుబోతు. ఆయన నల్లమల పులిబిడ్డ కాదు..వెకిలి మాటల వెర్రిబిడ్డ. మేం ఉద్యమాల నుంచి వచ్చినం. నీలాగా అడ్డమైన తొక్కులు తొక్కుతూ రాలేదు..’ అంటూ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి రేవంత్ దాసోహం అవుతున్నారు..‘గోదావరిలో 1,000, కృష్ణా నదిలో 500 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, మిగిలిన జలాలను ఏపీకి తరలించుకునేందుకు ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ ఆయన జాగీరు కాదు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతకడాన్ని రేవంత్ మానుకోలేక పోతున్నారు. ఏపీకి దాసోహం అవుతూ బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రేవంత్ చేసిన ద్రోహానికి ఆయనను ఉరి తీసినా తప్పులేదు. నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఏపీకి, చంద్రబాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు. చంద్రబాబుకు రేవంత్కు మధ్య ఆదిత్యనాథ్ దాస్ అనుసంధాన కర్తగా పనిచేస్తున్నాడు. గోదావరి, కృష్ణా జలాలు ఏపీకి దోచి పెట్టేందుకు అవి రేవంత్ అయ్య సొమ్ము కాదు. ఆయన కేవలం తెలంగాణకు కాపలాదారు మాత్రమే..’ అని మాజీమంత్రి అన్నారు. మేం అంగీకరించామనడం శుద్ధ అబద్ధం‘తెలంగాణకు సాగునీటి కోసం పరితపించిన కేసీఆర్ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. పోలవరం ద్వారా పెన్నా బేసిన్కు నీరు తరలిస్తే కృష్ణా బేసిన్లో 763 టీఎంసీలు తెలంగాణకు రావాలని గతంలో అఫిడవిట్ ఫైల్ చేశాం. గోదావరిలో సగటున ఏటా 3 వేలకు పైగా టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని సీడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా కేసీఆర్ అంచనా వేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ప్రస్తావించారు. కానీ రేవంత్రెడ్డి వాస్తవాలను వక్రీకరించి బనకచర్లకు గత ప్రభుత్వం అంగీకరించినట్లు అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణను సంప్రదించకుండా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపడితే అంగీకరించేది లేదని గతంలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. కానీ రేవంత్ మాత్రం 1,000 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చి, మీరు ఎన్ని జలాలు అయినా తరలించుకోండి అని ఏపీకి చెప్తున్నారు..’ అని హరీశ్రావు ఆరోపించారు.ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం..‘కృష్ణా–గోదావరి నదీ జలాల అనుసంధానం గురించి కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు గతంలో ఏపీ సీఎం జగన్ అంగీకరించక పోవడంతో అది ముందుకు సాగలేదు. తెలంగాణతో సంబంధం లేకుండా కృష్ణా–గోదావరి అనుసంధానికి అంగీకరించే ప్రసక్తే లేదు. గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం. అవసరమైతే రైతుల పక్షాన కోర్టులను ఆశ్రయిస్తాం..’ అని హరీశ్రావు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, అనిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బనకచర్లను అడ్డుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫీజబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్–1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం–2014లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జల్శక్తి మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్తోపాటు ఎంపీలు మల్లురవి, రఘువీర్ రెడ్డి, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొందని వివరించారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని.. జీడబ్ల్యూడీటీ–1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని, అయితే బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, జల్శక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కోరారు.వరద నిజమైతే ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానంపై చర్చిద్దాంసీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి పాటిల్కు రేవంత్, ఉత్తమ్ వివరించారు. గోదావరి అవార్డు ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు కొనసాగిస్తూనే ఉందని చెప్పారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం–బనకచర్లకు బదులు, కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి–నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రం స్పందన సానుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.1,500 టీఎంసీలను వాడుకునేలా..» తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్శక్తి శాఖ, ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్రం ఆమోదం తెలపాలని సీఆర్ పాటిల్కు రేవంత్ విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటి న్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీ లిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.» ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతు ల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని సీఎం రేవంత్ అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నా రు. పాలమూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు అన్ని రకా ల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.» గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్కు రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
మ్యాట్రిక్స్తోనే డేటాలో 'కిక్'
ఐటీ సెక్టార్లో డేటాసైన్స్ తికమక పెడుతోంది. ఫ్రెషర్స్ ఆ స్పీడ్ను అందుకోలేకపోతున్నారు. ఏడాది గడచినా డేటా ఆనుపానులు బుర్రకెక్కడం లేదు. దీంతో కొత్తగా చేరినవారు బెంచ్ మీదే కాలక్షేపం చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఐటీ ఫ్రెషర్స్లో ఆందోళన రేపుతోంది. ప్రాజెక్టు రాకుంటే ఉద్యోగం నిలబడటం కష్టమే. దేశవ్యాప్తంగా డేటాసైన్స్ చదువుతున్నవారు ఏటా 3.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో 80 వేల మందికే డేటా అనలిస్టులుగా ఉద్యోగాలొస్తున్నాయి. వీళ్లలో సగటున 20 వేల మందికే నైపుణ్యం ఉంటోంది. మిగిలిన 60 వేల మంది బెంచ్ మీదే ఉంటున్నారని ఇటీవల నాస్కామ్ వెల్లడించింది. -సాక్షి, హైదరాబాద్కారణాలేంటి?డేటాసైన్స్కు ఆయువు పట్టు గణితం. గణితంపై పట్టు సాధించాలంటే పాఠశాల స్థాయి నుంచే కష్టపడాలి. ఇంటర్లో లోతుగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా మ్యాట్రిక్స్పై పట్టు ఉండాలి. ప్రాబబులిటీస్ను ఏ రూపంలో ఉన్నా చేయగల సమర్థత ఉండాలి. కానీ ఇంటర్లోనే మ్యాట్రిక్స్, కాలిక్యులేషన్స్ను సాదాసీదాగా తీసుకుంటున్నారు. కాలేజీల్లో పరీక్ష కోసం మాత్రమే గణితం ప్రాక్టీస్ చేయిస్తున్నారు. సబ్జెక్టు లోతుల్లోకి వెళ్లడం లేదు. ఒకటి రెండు మెథడ్స్తో సరిపుచ్చుతున్నారు. ఇదే విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇంజనీరింగ్లో ఈ విధానం పనికిరాదని అధ్యాపకులు అంటున్నారు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డేటా స్ట్రక్చర్, డిస్క్రియేట్ మేథమెటిక్స్, ఆల్గరిథమ్ డిజైన్ అండ్ అనాలిసిస్ వంటి చాప్టర్స్లో రాణించాలంటే ఇంటర్ పునాది గట్టిగా ఉండాలి. మ్యాట్రిక్స్పై పూర్తి అవగాహన ఉండాలి. బిగ్ డేటా అనాలిసిస్లో డిజిటల్ డిజైనింగ్లో డేటా విశ్లేషణ క్షణాల్లో శరవేగంగా మారుతుంది. ఐటీ సెక్టార్లో డేటా స్పీడ్ మరింత వేగంగా ఉంటుంది. దీన్ని విశ్లేషించే వేగం ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కు ఉండటం లేదని ఐటీ పరిశ్రమ అంటోంది.గురి పెట్టకుంటే గోవిందా..ప్రపంచవ్యాప్తంగా డేటా అనలిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. అమెరికా ఇప్పటికే 5,381 బిగ్ డేటా కేంద్రాలు ఏర్పాటు చేసింది. మనదేశంలో 870 కేంద్రాలు ఉన్నాయి. మరో మూడేళ్లలో ఇవి 1,800కు చేరబోతున్నాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కార్పొరేట్ కంపెనీలు రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. మన దేశంలో ఈ ఏడాది చివరి నాటికి 15 లక్షల మంది డేటా అనలిస్టుల అవసరం ఉందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి.ప్రస్తుతం ఉన్నది 4.5 లక్షల మందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని డేటాసైన్స్లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. డేటా వేగాన్ని పెంచేలా మైండ్సెట్ను కేంద్రీకరించే తీరును టెన్త్ నుంచే తీసుకురావాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రాబబులిటీస్, మ్యాట్రిక్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెంచాలని సూచిస్తున్నారు. ఇంజనీరింగ్ డేటా సైన్స్ చేసే విద్యార్థులు కూడా డేటా నిపుణుల వద్ద ప్రత్యేక తర్ఫీదు తీసుకోవాలని, ఆన్లైన్ కోర్సుల ద్వారా నైపుణ్యం పెంచుకోవాలని చెబుతున్నారు. గణితమే కీలకండేటాసైన్స్కు కీలకం మేథమెటిక్స్. ముఖ్యంగా మ్యాట్రిక్స్పై పట్టు ఉంటేనే డేటా అనాలిసిస్లో రాణిస్తారు. ఇంటర్లోనే మేథ్స్పై సమర్థత ఎంత అనేది బేరీజు వేసుకోవాలి. ప్రాబబులిటీ, మ్యాట్రిక్స్పై ఆసక్తి ఉంటేనే డేటాసైన్స్ వైపు వెళ్లడం మంచిది. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్స్పీడ్ లేకుంటే కష్టమేడేటాసైన్స్పై శరవేగంగా పనిచేసే సమర్థత ఉండాలి. కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టమే. కాలిక్యులేషన్ వేగంగా ఉంటే తప్ప కంప్యూటర్ పరుగును అందుకోలేం. ఇంజనీరింగ్ స్థాయిలోనే డేటాసైన్స్లో మెళకువలు నేర్చుకోవడమే కాదు, వాటిని ప్రాక్టీస్ కూడా చేయాలి. – కంకిపాటి శేషగిరిరావు, ఐటీ రంగ నిపుణుడు -
రేవంత్ కోసం ‘ఆర్ఆర్ మాడ్యూల్’!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2023 ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ‘ఆర్ఆర్ మాడ్యుల్’పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్కు (ఎస్ఓటీ) నేతృత్వం వహించిన డీఎస్పీ డి.ప్రణీత్రావు దీనిని పర్యవేక్షించారని వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్రావు హయాంలో అనేకమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు. వీరి కోసం మాడ్యూల్స్ రూపొందించారు. ఒక్కో మాడ్యుల్లో సదరు వ్యక్తితోపాటు ఆయనకు సంబంధించి ఇంకా ఎవరెవరివి ఫోన్లు ట్యాప్ చేయాలో ఆ నంబర్లు చేర్చేవారు. ఈ మాడ్యూల్ను అనునిత్యం పర్యవేక్షిస్తూ వారికి వచ్చే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లను పర్యవేక్షించడానికి కొందరు అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఇందులో భాగంగానే రేవంత్రెడ్డికి సంబంధించిన మాడ్యుల్కు ప్రభాకర్రావు ‘ఆర్ఆర్ మాడ్యూల్’అనే పేరు పెట్టారు. ఈ మాడ్యూల్లో ఉన్న వారి ఫోన్లను పర్యవేక్షిస్తూ ఉండటానికి డీఎస్పీ ప్రణీత్రావు నేతృత్వంలో 20 మంది సిబ్బందిని నియమించారు. ప్రభాకర్రావు ఎస్ఐబీ చీఫ్గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. దీనివల్ల ఒనగూరుతున్న లాభాలు తెలిసిన తర్వాత ప్రభాకర్రావు అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. ఎస్ఐబీ అధికారులు చాలా కాలం కేవలం ఫోన్లు మాత్రమే ట్యాప్ చేశారు. 2018 తర్వాత మారిన ట్యాపింగ్ పంథా2018 ఎన్నికల సందర్భం నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్రావు, తిరుపతన్న తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్రావు ట్యాపింగ్ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. ఓ టెక్నాలజీ కన్సల్టెంట్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. దీన్ని ప్రణీత్రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్రావు బృందం రేవంత్రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న వార్రూమ్లో ఏర్పాటు చేసి ‘ఆర్ఆర్ మాడ్యూల్’ను కొన్నాళ్లు పర్యవేక్షించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాలుగోసారి హాజరైన ప్రభాకర్రావుప్రభాకర్రావు గురువారం నాలుగోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ విచారణకు ప్రభాకర్రావు సహకరించట్లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఆయనకు ఇచ్చిన రిలీఫ్ను రద్దు చేయాలని కోరనుంది. మరోవైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడానికి ఉన్న అవకాశాలను న్యాయ నిపుణులతో పరిశీలిస్తోంది. -
వాహనాలన్నీ 'కంట్రోల్'లోనే!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కమాండ్ కంట్రోల్ తరహాలో ఆర్టీఏలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల ప్రజా రవాణా వాహనాల కదలికలను నమోదు చేసేందుకు ఇది దోహదం చేయనుంది. ఖైరతాబాద్లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించగా.. తాజాగా కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటుపై రవాణాశాఖ దృష్టి సారించింది.వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను నమోదు చేస్తారు. ఈ వివరాల ఆధారంగా చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణికుల భద్రతకు ప్రమాదం వాటిల్లినట్లు తెలిసినా వెంటనే అప్రమత్తమయ్యేందుకు అవకాశం లభిస్తుంది. ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రైవేట్ బస్సులు, వ్యాన్లు, క్యాబ్లు, మ్యాక్సీక్యాబ్లు, మినీబస్సులు తదితర అన్ని కేటగిరీలకు చెందిన వాహనాలను నిఘాచట్రంలోకి తెచ్చేలా ఈ సెంటర్ పని చేస్తుందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రవాణాశాఖలో నమోదైన ప్రతి ప్రజారవాణా వాహనాన్ని ఈజీగా ట్రాక్ చేసేందుకు ఈ సెంటర్ పని చేస్తుందన్నారు. తయారు చేసే సమయంలోనే వాటికి తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం కలిగిన డివైజ్లను ఏర్పాటు చేయనున్నారు. కొన్ని కేటగిరీలకు చెందిన వాహనాలకు ఈ డివైజ్లు ఉన్నాయి. పాతవాటికి మాత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదకరంగా ప్రయాణంహైదరాబాద్లోనే 8 వేలకు పైగా ప్రైవేట్ బస్సులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య స్టేజీ క్యారేజీలుగా నడిచే బస్సులతోపాటు నేషనల్ పర్మిట్లపైన టూరిస్టు్ట బస్సులుగా వివిధ రాష్ట్రాలకు మరికొన్ని రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు సైతం కంపెనీల పేరిట నమోదు చేసుకొని ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అలాగే, 1.2 లక్షల క్యాబ్లు, సుమారు 30 వేల మ్యాక్సీక్యాబ్లు, మినీబస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ ప్రైవేట్ వాహనాల్లోనే మహిళా ప్రయాణికుల భద్రత తరచుగా ప్రశ్నార్థకమవుతోంది. రాత్రివేళల్లో విధులు ముగించుకొని ఇల్లు చేరుకొనేందుకు అనివార్యంగా క్యాబ్లను ఆశ్రయించవలసి వస్తుంది. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాకపోకలు సైతం పెరిగాయి. ఈ క్రమంలోనే డ్రైవర్ల తీరుపట్ల మహిళా ప్రయాణికులు తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్లు, సిబ్బంది తరచుగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో వెహికల్ ట్రాకింగ్ అనివార్యంగా మారింది.కెమెరా క్లిక్మంటుంది..నిబంధనలను ఉల్లంఘించి నడిచే వాహనాలపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు మరో సాంకేతిక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసేందుకు రవాణాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కెమెరాలు వాహనాల నంబర్ప్లేట్లను క్లిక్మనిపిస్తాయి. ఈ కెమెరాలను కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేస్తారు. దీంతో సదరు వాహనం ఏ రకమైన నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతోందనేది ఇట్టే తెలిసిపోతుంది. దాని ఆధారంగా వాహన యజమానికి నోటీసులు పంపిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను బదిలీ చేయకుండానే నడపడం, వాహనబీమా లేకపోవడం, పర్మిట్ల కాలపరిమితి ముగిసినా పునరుద్ధరించకపోవడం, ఫిట్నెస్ లేకుండా తిరిగే స్కూల్ బస్సులు, వివిధ రకాల వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టేందుకు ఈ కెమెరాలు దోహదం చేస్తాయి. మొదట ప్రయోగాత్మకంగా 30 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి–సాగర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. గతంలో కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ అనుసంధాన ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను వినియోగించదలిస్తే కేంద్రం సాయమందించే ఇచ్చంపల్లి–సాగర్ లింకు ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ మేరకు ఒక ప్రతిపాదనను తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముందుంచారు. దీంతో నాలుగేళ్ల కిందట గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) తయారు చేసిన ఇచ్చంపల్లి–సాగర్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.మొత్తం 247 టీఎంసీల మళ్లింపు ఎన్డబ్ల్యూడీఏ 2020–21లో రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు అందజేసిన డీపీఆర్లో..ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధాన ప్రాజెక్టు, జలాల లభ్యత, మళ్లించే విధానం, అవసరమయ్యే నిధులు, ఆయా రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలు, వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితర అంశాలను స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం.. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరి నదిపై 15.8 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ నిర్మించి తమిళనాడులో కావేరి నదిపై ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. బరాజ్ నుంచి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున నీటిని సాగర్కు మళ్లిస్తారు. ఈ దారిలో గొట్టిముక్కల బ్రాంచి కాలువ కింద నల్లగొండ జిల్లాలోని మునుగోడు, చండూరు ప్రాంతాల్లో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు, ఎస్సారెస్పీ–2 కింద 1.78 లక్షలు, ఎస్ఎల్బీసీ కింద 1.09 లక్షల హెక్టార్లకు నీరందించాల్సి ఉంటుంది. ఇక ఏపీలో సాగర్ కుడి కాలువ కింద 1.26 లక్షల హెక్టార్లు, నాగార్జునసాగర్–సోమశిల కింద 1.68 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీటిని ప్రతిపాదించారు. సోమశిల–కావేరి మధ్య 2.5 లక్షల హెక్టార్లకు నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. మూడు రాష్ట్రాలకు 230 టీఎంసీలుగోదావరిలో వరద ఉండే జూన్–అక్టోబర్ నెలల్లో 143 రోజుల్లో 247 టీఎంసీలను మళ్లిస్తారు. ఇందులో ఆవిరి నష్టాలు పోనూ మిగిలే 230 టీఎంసీలలో తెలంగాణ 65, ఆంధ్రప్రదేశ్ 79.9, తమిళనాడు 84 టీఎంసీలు వినియోగించుకునేలా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు ఆ సమయంలోనే రూ.85 వేల కోట్ల మేర వ్యయాన్ని అంచనా వేసింది. ఇచ్చంపల్లి నుంచి సాగర్కు నీటిని మళ్లించే క్రమంలో మూడు లిఫ్టులు నిర్మించాల్సి ఉండగా, వీటి నిర్వహణకు 3,840 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమవుతుందని, ఇందుకు ఏటా రూ.770 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఇక ఇచ్చంపల్లి వద్ద నిర్మించే బరాజ్తో 9,300 హెక్టార్లు ముంపునకు గురికానుండగా, 22 వేల మంది నిరాశ్రయులవుతారని ఎన్డబ్ల్యూడీఏ పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనను అప్పట్లో తెలంగాణ వ్యతిరేకించింది. దీనికి దిగువన అకినేపల్లి నుంచి ఒక ప్రతిపాదన, తుపాకులగూడెం నుంచి మరో ప్రతిపాదన, దుమ్ముగూడెం నుంచి ఇంకో ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే ఇంద్రావతి మిగులు జలాలపై ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో దీనిపై చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలవరం–బనకచర్ల చేపట్టడంతో, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ తాజాగా ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. -
‘సీఎం రేవంత్కు విషయం తక్కువ.. విషం ఎక్కువ’
హైదరాబాద్ బనకచర్ల ప్రాజెక్టుకు ఆయనే గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు విమర్శించారు. రేవంత్కు విషయం తక్కువ.. విషం ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఈరోజు(గురువారం, జూన్ 19) తెలంగాణ భవన్లో హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు. తాను బనకచర్లపై మీటింగ్ పెట్టిన తర్వాతే.. మీరు మీటింగ్ పెట్టారన్నారు. అసలు మీరు మీటింగ్ పెట్టింది.. బనకచర్ల ప్రాజెక్టుల ఆపడానికా?, కట్టుకోమనడానికా? అంటూ సీఎం రేవంత్ను హరీష్ ప్రశ్నించారు. బనకచర్ల ఏ జిల్లాలో ఉందో కూడా తెలియకుండా సీఎం రేవంత్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. కృష్ణ బేసిన్ లో 500 TMC లు, గోదావరి బేసిన్ లో 1000 TMC నీళ్లు ఇచ్చి ఏపీ అన్ని ప్రాజెక్ట్ లు అయిన కట్టుకోండి...అని రేవంత్ అంటున్నారు.. అసలు మన సీఎంకు తెలివి ఉందా? అంటై హరీష్ మండిపడ్డారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్ -
సొంత పార్టీ నేతలకు కొండా సురేఖ భర్త మాస్ వార్నింగ్
సాక్షి, వరంగల్: వరంగల్ కాంగ్రెస్లో వార్ ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. కనుబొమ్మలు లేని నాయకుడు నాడు టీడీపీని భ్రష్టు పట్టించాడు. మొన్న కేటీఆర్ను వెన్నుపోటు పొడిచిండు. ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్.. ఇప్పుడు కాంగ్రెస్లో చేరాడు. మీకు ఇజ్జత్ ఉంటే బయటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’’ అంటూ కొండా మురళి వ్యాఖ్యానించారు.వరంగల్ పోలీస్ కమిషనర్కు చెపుతున్నా.. మీ డిపార్ట్మెంట్లో కోవర్డులు ఉన్నారు. నాకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదు.. పోలీస్ డిపార్ట్మెంట్లో కోవర్డులపై చర్యలు తీసుకోండి. కొండా మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరూ ఉండరు. పరకాలలో 75 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు’’ అంటూ కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘పరకాల నియోజకవర్గంలో నా కూతురు కొండా సుస్మిత పటేల్ రంగప్రవేశం చేయనుంది. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమె మంత్రి పదవి ఎక్కడికి పోదు’’ అని కొండా మురళి పేర్కొన్నారు. -
12 మంది మావోయిస్టులు లొంగుబాటు
కొత్తగూడెం: వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. తాజాగా కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. గత ఆరు నెలల్లో 294 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు.కాగా, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి.ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు, ప్రణీత్రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు. -
దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మృతిచెందిన యువతిని సుష్మ(27)గా గుర్తించారు.వివరాల ప్రకారం.. దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జి పైనుంచి సుష్మ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బుధవారం హైటెక్ సిటీలోని కార్యాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో రాత్రి దుర్గం చెరువు తీగల వంతెన వద్ద సుష్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, ఆమె మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. -
జూబ్లీహిల్స్ బరిలో నేనే ఉన్నా: మహ్మద్ అజారుద్దీన్
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోను, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఏ నలుగురిని కదిలించినా కూడా ఇదే అంశంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ ఆయన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు.తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగిందని అన్నారు.మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సగం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేశానని అన్నారు. తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో, వెబ్ సైట్ల లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, తనకు టికెట్ ఇవ్వడంలేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గడిచిన ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయి లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించామని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ తెచ్చుకొని, గెలిచి రాహుల్ గాంధీ కి బహుమతిగా అందిస్తామని అన్నారు. -
బేగంపేటలో ఆగమాగం!
హైదరాబాద్: బేగంపేట ప్రధాన రహదారి అంటే వీఐపీ, వీవీఐపీల రాకపోకలకు ప్రధాన రాస్తా. ఒక్క నిమిషం ట్రాఫిక్ ఆగిందంటే.. క్షణాల్లో వాహనాలు బారులుదీరుతాయి. దీనికి కారణం వాహన విస్ఫోటానికి తగ్గట్లుగా రహదారుల అభివృద్ధి జరగం లేదు. రోడ్ల మీదకు వచ్చే వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందే తప్ప రహదారుల విస్తరణ మాత్రం అలాగే ఉంటోంది. ఫలితంగా నత్తకు నడక నేరి్పస్తున్నట్లుగా తయారైంది వాహనదారుల ప్రయాణం. ఇక చినుకు పడిందంటే చాలు.. ట్రాఫిక్ చిక్కులు చుక్కలు చూపిస్తాయి. ఈ పరిస్థితి బేగంపేట ప్రధాన రహదారిలో సర్వసాధారణంగా మారింది. వీఐపీలు.. వీవీఐపీలతో.. బేగంపేట రహదారి అంటేనే వాహనదారులు వామ్మో అనాల్సిందే. సికింద్రాబాద్, హైదరాబాద్లను కలిపే బేగంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య దినదిన గండం నూరేళ్లాయుష్షుగా మారింది. ప్రధానంగా ఢిల్లీతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే వీవీఐపీలు, వీఐపీలు ఎక్కువగా బేగంపేట విమానాశ్రయాన్నే ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో సాధారణంగానే ఈ రహదారి రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నారంటే ముందుగానే ట్రాఫిక్ను ఆపేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క నిమిషం ట్రాఫిక్ ఆగినా చాంతాడంత వాహనాల క్యూ నిలిచిపోతుంది. ఈ ప్రభావం కొన్ని గంటల పాటు ఉంటుంది. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి పోలీసులు కూడా నానా కష్టాలు పడాల్సిందే. వర్షాకాలంలో అయితే ఈ దారిలో ప్రయాణం అంటే సాహసంతో కూడుకున్నదే. ఎందుకంటే చినుకు పడిందంటే చాలు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి నరకం అంటే ఏమిటో వాహనదారులు చవిచూస్తున్నారు. అటు సికింద్రాబాద్ వైపు నుంచి బేగంపేట మీదుగా అమీర్పేట, పంజగుట్ట, బల్కంపేట, సనత్నగర్ వైపు వెళ్ళే వాహనాలు, ఇటు సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలతో ఎప్పుడు చూసినా రద్దీగానే కనిపిస్తుంది. ఈ రహదారిలో ఫ్లైఓవర్లు ఉన్నా ప్రస్తుత రవాణా అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ముఖ్యంగా బేగంపేట పీ అండ్ టీ ఫ్లైఓవర్ వద్ద, రసూల్ ఫురా మెట్రో స్టేషన్ వద్ద ఒకవైపు మెట్రో పిల్లర్లు రోడ్డు మధ్యలో ఉండడం, మరోవైపు బాటిల్ నెక్ను తలపించేలా ఉండడంతో ఇక్కడకు వచ్చేసరికి వాహనాల వేగం ఒక్కసారిగా కుంటుపడుతుంది. దీంతో ఆ ప్రభావంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే పరిస్థితులకు దారితీస్తోంది. ఇక ఏదైనా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యామ్నాయ మార్గాలే శరణ్యం.. వాహనదారుల అవసరాలను ఇక్కడ ఫ్లైఓవర్లు, రహదారులు తీర్చలేకపోతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రసూల్పురా చౌరస్తా నుంచి పాటిగడ్డ మీదుగా గతంలో రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించినా అది ప్రతిపాదనలకే పరిమితమైందే తప్ప పట్టాలెక్కలేదు. ఈ మార్గంలో ఫ్లైఓవర్ నిర్మించడం ద్వారా పంజగుట్ట వైపు వెళ్లే వాహనదారులకు సులువవడంతో పాటు బేగంపేట రహదారిపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక్కడి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదనపై ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాజెక్టు అమలుపై దృష్టిసారించడం ముదాహవం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే బాగుంటుందని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
HYD: స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 80 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానం తిరుపతి వెళ్తుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో, అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించి.. ఎయిర్పోర్టులోనే ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 80 మంది ప్రయాణీకులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మెడికల్ పీజీ విద్యార్థుల స్టైపెండ్కు ఎగనామం!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పీజీ కోర్సులు చేసే జూనియర్ డాక్టర్లు, ఎంబీబీఎస్ పూర్తి చేసి డ్యూటీ డాక్టర్లుగా పనిచేసే విద్యార్థులకు నెలనెలా ఇవ్వాల్సిన స్టైపెండ్ను యాజమాన్యాలు ఎగ్గొడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. కొన్ని కాలేజీలు మొత్తం స్టైపెండ్కు ఎగనామం పెడుతుండగా, కొన్ని కాలేజీలు నామమాత్రంగా ఇస్తూ, 70 శాతం వరకు వెనకేసుకుంటున్నట్లు సమాచారం. విద్యార్థులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏటీఎం కార్డులు, చెక్కులు ముందే తీసుకుంటున్న యాజ మాన్యాలు..జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నిబంధనల మేరకు స్టైపెండ్ విద్యార్థుల ఖాతాల్లో వేసినట్టే వేసి తిరిగి విత్ డ్రా చేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ విధంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నెలనెలా విద్యార్థులకు ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటున్న మొత్తం రూ.కోట్లలోనే ఉంటుందని అంచనా. ఇలా గత కొన్నేళ్లుగా ప్రైవే టు యాజమాన్యాల కక్కుర్తి దందా కొనసాగుతోందంటూ పీజీ విద్యార్థులు తాజాగా నిరసనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మార్గదర్శ కాల ప్రకారం కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకున్నా.. విద్యార్థుల నుంచి కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు చివరకు..ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించేవారికి నెలవారీ ఖర్చుల కింద చెల్లించే స్టైపెండ్ విషయంలోనూ కక్కుర్తి పడుతున్నాయని జూనియర్ డాక్టర్లు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.నెలకు సగటున రూ.60 వేల చొప్పున రాష్ట్రంలో మొత్తం 35 పీజీ కళాశాలలు ఉండగా, అందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 12, ప్రైవేటు యాజమాన్యాల కింద 23 ఉన్నాయి. 35 కళా శాలల్లో కలిపి 2,750 పీజీ సీట్లు ఉండగా..వీటిలో ప్రభుత్వ కళాశాలల్లో 1,313, ప్రైవేటు కళాశాలల్లో 1,296, మూడు మైనారిటీ కాలేజీల్లో 141 సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులు ఏడాది ఇంటర్న్షిప్ కింద హౌస్ సర్జన్లుగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతినెలా రూ.22,527 మొత్తాన్ని ఏడాది పాటు యాజమాన్యాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక పీజీ డాక్టర్లకైతే ఫస్ట్ ఇయర్ రూ.50,686, సెకండ్ ఇయర్ రూ.53,503, థర్డ్ ఇయర్ 56,319 చెల్లించాలి. పీజీ డిప్లొమా చదివే మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.50,686, రెండో సంవత్సరం వారికి రూ.53,503 చెల్లించాలి. సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసే వారికి మూడేళ్ల పాటు వరుసగా రూ.80,500, రూ.84,525, రూ.88,547 ఇవ్వాలి. ఎండీలకు మూడేళ్ల పాటు 50,686, రూ.53,503, రూ.56,319 లెక్కన చెల్లించాలి. సీనియర్ రెసిడెంట్లకు రూ.80,500 చెల్లించాలి. ఇలా ఒక్కో విద్యార్థికి నెలకు సగటున రూ.60 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అంచనా. 2023లో వచ్చిన జీవో నంబర్ 59 ప్రకారం రెండేళ్లకోసారి స్టైపెండ్ను 15 శాతం పెంచాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఈ ఏడాది నుంచి స్టైపెండ్ పెరగాల్సి ఉంది. అయితే అసలు స్టైపెండ్కే దిక్కులేని పరిస్థితుల్లో పెంచే మాటే ఉత్పన్నం కాదని విద్యార్థులు వాపోతున్నారు.ఖాతాలు తెరిపించి.. ఏటీఎం కార్డులు, చెక్కులు తీసేసుకుని..పీజీ కోర్సులో విద్యార్థి అడ్మిషన్ తీసుకున్న సమయంలోనే కాలేజీల యాజమాన్యాలు వారి పేరిట కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తాయి. విద్యార్థులు చెప్పిన సమాచారం ప్రకారం..పాస్బుక్, ఏటీఎం కార్డు, సంతకం చేసిన చెక్బుక్లు తీసేసుకుంటున్నాయి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం విద్యార్థుల ఖాతాల్లో నిర్దేశిత స్టైపెండ్ను జమ చేసి, రెండు, మూడురోజుల్లోనే తిరిగి ఆ మొత్తాన్ని విత్డ్రా చేసేసుకుంటున్నాయి. కొన్ని కళాశాలలు మరీ కక్కుర్తితో వ్యవహరిస్తూ మొత్తం స్టైపెండ్ను విత్డ్రా చేసుకుంటుండగా, మరికొన్ని కళాశాలలు మాత్రం కొంత మొత్తాన్ని విద్యార్థి ఖాతాలో ఉంచేస్తున్నాయి. తమకు స్టైపెండ్ ఇవ్వకపోవడంతో నెలవారీ ఖర్చులకు ఇబ్బంది అవుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇలా వుండగా జూనియర్ డాక్టర్ల ఆందోళనలను అణచి వేసేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నా యనే ఆరోపణలు విన్పి స్తున్నాయి. గతంలో ఇదే అంశంపై దాదాపు 13 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయినా యాజమాన్యాల్లో ఎలాంటి స్పందన లేదని, ఎన్ఎంసీ మరోసారి జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వం కూడా స్టైపెండ్ ఇప్పించి తమకు న్యాయం చేయాలని పీజీ మెడికల్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
బేగంపేట్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు
సనత్నగర్: బేగంపేట్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. విమానయానానికి సంబంధించి ఇటీవల వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు కాల్ అందరినీ కలవరానికి గురిచేసింది. ఎయిర్పోర్ట్ను పేల్చేసేందుకు బాంబులు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఎయిర్పోర్ట్కు మెయిల్ చేసి ఉరుకులు పరుగులు పెట్టించాడు. వెంటనే ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. పోలీసు జాగిలాలు, బాంబు ఎక్స్ప్లోజివ్ నిపుణులు, బాంబు డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకిదిగి ఎయిర్పోర్ట్ను అణువణువూ గాలించి తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెయిల్ పంపిన వ్యక్తి గురించి తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
రైతుల చేతులకు సంకెళ్లు!
అలంపూర్: ఇథనాల్ కంపెనీ ఏర్పాటనును వ్యతిరేకించే క్రమంలో చోటు చేసుకున్న గొడవతో రిమాండ్లో ఉన్న రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో గాయత్రి రెన్యూవబుల్ ఆన్లైన్ ఇండస్ట్రీస్ కంపెనీ ఇథనాల్ కంపెనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే దీనిని పెద్ద ధన్వాడతో పాటు ఆ చట్టూ ఉన్న 12 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన కంపెనీ నిర్మాణ పనులు ఆరంభించడానికి యాజమాన్యం సామగ్రి సిద్ధం చేసుకుంది. దీన్ని ప్రజలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. దీంతో 41 మంది రైతులపై రాజోలి పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అందులో 12 మంది రైతులను ఈ నెల 5వ తేదీన గద్వాల కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. వీరికి సంబంధించి బుధవారం వాయిదా ఉండటంతో అలంపూర్ కోర్టులో హాజరుపర్చారు. అయితే వీరి చేతులకు సంకెళ్లు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్నం పెట్టే రైతన్నల చేతికి కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లు వేయడం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఆ తర్వాత మీడియాలో కథనాలుగా రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమయ్యింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. 17నే బెయిల్ మంజూరు ఎట్టకేలకు విడుదలమహబూబ్నగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రైతులకు వాస్తవానికి మంగళవారమే బెయిల్ మంజూరైంది. గద్వాల కోర్టు 12 మంది రైతులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రైతులు ఒకవైపు కోర్టు వాయిదాకు హాజరు కాగా.. మరోవైపు వారి బెయిల్కు సంబంధించిన జామీన్ల ప్రక్రియ కొనసాగింది. చివరకు బుధవారం రాత్రి రైతులు బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ పచ్చని పొలాల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో రైతుల జీవితాల్లో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని ఆరోపించారు.ముగ్గురు పోలీస్ అధికారుల సస్పెన్షన్ ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్రావును ‘సాక్షి’ సంప్రదించగా..ఇందుకు కారణమైన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. రైతులను జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా విధుల పట్ల అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటనలో ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఆర్ ఎస్ఐలను సస్పెండ్ చేశామని చెప్పారు. -
మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్కౌంటర్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అరుణ అలియాస్ అరుణక్క..వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రిఅగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్రగాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్కౌంటర్పై అనుమానాలు.. నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ -
డిజిటల్ భద్రతతోనే అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఐటీ సేవల సంస్థ గూగుల్ ప్రారంభంతో ప్రపంచమే మారిపోయి మానవ జీవితం డిజిటల్మయంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అయితే, గోప్యత, భద్రతకు డిజిటలైజేషన్ సవాలు విసురుతోందని, డిజిటల్గా సురక్షితంగా ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. గూగుల్ దివ్యశ్రీ భవన్లో కొత్తగా ఏర్పాటైన ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్’(జీసెక్)ను సీఎం రేవంత్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. జీసెక్ నైపుణ్యాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు దోహదం చేస్తుందని, దేశ సైబర్ భద్రత ప్రమాణాలను పెంచుతుందని చెప్పారు. ‘చెడు చేయొద్దనే గూగుల్ సంస్థ విధానాన్ని నేను ఇష్టపడతాను. గూగుల్ తరహాలోనే మా ప్రభుత్వం కూడా మంచి పనులు మాత్రమే చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు అనువైన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చేదిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మహిళలు, రైతులు, యువత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గూగుల్ మద్దతును కోరుతున్నా. తెలంగాణతో గూగుల్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది. విద్య, భద్రత, మ్యాప్లు, ట్రాఫిక్, స్టార్టప్లు, ఆరోగ్యం.. ఇలా అనేక రంగాలలో గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం. గూగుల్ ఒక వినూత్న సంస్థ, మాది ఒక వినూత్న ప్రభుత్వం’అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐ యుగంలో సైబర్ సెక్యూరిటీ సవాలు: శ్రీధర్బాబు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కేకొద్దీ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఒక్క క్షణం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ హైదరాబాద్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొదటి జీసెక్ను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిన పరిణామమని అన్నారు. ‘సేఫ్ డిజిటల్ తెలంగాణ 2.0’లక్ష్యానికి అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే సురక్షిత ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఎంపీ మల్లు రవి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్లు అరిజీత్ సర్కార్, హీతర్ అడ్కిన్స్, విల్సన్ వైట్, గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లబానా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.భారత్లో తొలి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్లలో హైదరాబాద్లో ఏర్పాటు చేసినది నాలుగోది. ఆసియా పసిఫిక్ రీజియన్లో ఇదే మొట్టమొదటిది కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ హెడ్ ఆఫీసును సందర్శించిన సమయంలో హైదరాబాద్లో జీసెక్ ఏర్పాటు కోసం చొరవ చూపారు. గత ఏడాది అక్టోబర్లో జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా 2024’సదస్సులో భారత్లో జీసెక్ ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీని ఏర్పాటుకు గత ఏడాది డిసెంబర్ 4న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ సెక్యూరిటీ హబ్గా జీసెక్ అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రతా ఉత్పత్తుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, అత్యాధునిక పరిశోధన రంగంలో పనిచేస్తున్న నిపుణులకు ఇది సహకార వేదికగా ఉపయోగపడుతుంది. జీసెక్ ద్వారా ఐటీ రంగంలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. -
కేసీఆర్ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీలకి మించి నీళ్లు అవసరం. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు చర్చించుకుని నీళ్లను వాడుకోవాలని 2016 సెపె్టంబర్ 21న అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది కేసీఆరే. ఆ నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఆయనే. కేసీఆర్ సూచన నుంచే గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్లో కేసీఆర్ చేసిన సూచనలను రికార్డు చేశారని, ఆ మినట్స్ కాపీని ఎంపీలందరికీ అందజేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నికర జలాల వినియోగం పూర్తి కాకముందే మిగులు జలాల లభ్యతను ఎలా తేల్చుతారంటూ బీజేపీ ఎంపీ రఘునందర్రావు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిస్తూ కేసీఆర్పై ఆరోపణలు చేశారు. గోదావరి జలాల తరలింపే ఆ భేటీల లక్ష్యం ‘చంద్రబాబు, కేసీఆర్ మధ్య సమస్యలు రావడంతో 2016 తర్వాత 3 వేల టీఎంసీల మిగులు జలాల అంశం మరుగున పడిపోయింది. ఆ తర్వాత 2019 ఆగస్టులో నాటి ఏపీ సీఎం జగన్తో ప్రగతిభవన్లో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమై మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం అని ఆ సమావేశంలో కేసీఆర్ అన్నారు. కేసీఆర్, జగన్లు ప్రగతిభవన్లో నాలుగుసార్లు సమావేశమై గోదావరి జలాలను రాయలసీమకు తరలించుకోవడంపై చర్చలు జరిపారు. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించడమే నాటి సమావేశాల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తుతం ఏపీ చేపట్టింది. 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని అప్పట్లో కేసీఆర్, జగన్ మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నేరుగా 200 టీఎంసీలు, పరోక్షంగా 100 టీఎంసీలు కలిపి 300 టీఎంసీలను తరలిస్తామంటూ ఏపీ తాజాగా ప్రతిపాదించింది..’ అని రేవంత్ చెప్పారు. ఆ మినట్స్నే గుదిబండగా మార్చాలని ఏపీ చూస్తోంది.. రాయలసీమకు గోదావరి జలాల తరలింపునకు పెద్దన్నగా సహకరిస్తా అని నాడు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. దీనిపై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించి.. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు తరలించే ఉద్దేశంతో కేసీఆర్ ఆ ప్రతిపాదనలు చేశారని వివరణ ఇచ్చారు. బనకచర్లతో తెలంగాణ నష్టపోకుండా ప్రభుత్వానికి సహకరించడానికే తాము ఈ భేటీకి వచ్చామన్నారు. సీఎం జోక్యం చేసుకుని అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్లో ఉన్న అంశాలను మళ్లీ చదివి వినిపిస్తా అని అన్నారు. ‘గోదావరి నీళ్లను శ్రీశైలంలో వేయాలంటే తొలుత సాగర్లో వేయాల్సి ఉంటుంది. కానీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సాగర్లో వేయకుండా నీళ్లను నేరుగా తరలించుకుంటామని ఏపీ ప్రతిపాదించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్లో ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించిన తీసుకున్న నిర్ణయం ప్రకారమే బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ వాదిస్తోంది..’ అని చెప్పారు. దీంతో.. రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్న ఈ సమావేశం నుంచి తాము వాకౌట్ చేస్తున్నట్టు వద్దిరాజు ప్రకటించారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ నచ్చజెప్పబోగా, ‘పోనీయండి’ అంటూ సీఎం వారించారు. కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినందుకు మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టు ఉన్నాడని వ్యాఖ్యానించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినట్స్నే తెలంగాణకు గుదిబండగా మార్చడానికి ఏపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను 2015లో నాటి సీఎం కేసీఆర్ అంగీకరించడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. జూలైలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తాం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి టెక్నికల్, లీగల్, పొలిటికల్..మూడు మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గురువారం మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి అభ్యంతరం తెలుపుతామని అన్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఈ సమావేశానికి రాలేమని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాచారం ఇచ్చారని, వారిని సైతం సీఆర్ పాటిల్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. జూలైలో జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక, పర్యావరణ శాఖల మంత్రులను కలిసి అభ్యంతరాలు తెలియజేస్తామని వెల్లడించారు. రాజకీయ ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ అసదుద్దీన్ సూచించినట్టు జలవివాదాల్లో నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని చెప్పారు. పార్టీలకు అతీతంగా బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఎంపీలందరూ ఈ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని ప్రతిపాదించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిక్షించిన తర్వాతే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరదామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, సలహదారు ఆదిత్యనాథ్ దాస్లు ఎంపీలను సమన్వయం చేస్తారన్నారు. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఎంపీలందరికీ అందించాలని ఆదిత్యనాథ్ను ఆదేశించారు. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తాడంటూ విమర్శలు చేస్తున్నారని, నిరంతరం వెళ్లి సంప్రదింపులు చేస్తేనే ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని సీఎం అన్నారు. భవిష్యత్తులో సైతం కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, రఘురాం రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. -
బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యం పోసిందే కేసీఆర్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా తప్పుడు ప్రచారం ఆపడం లేదని.. తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వంతో ఆ పార్టీ కలిసి రావడం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీల అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి ఎంపీలకు వివరించామని తెలిపారు.‘‘రాజకీయ ప్రయోజనాలు, సంకుచిత స్వభావంతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీల సూచనలు తీసుకున్నాం. అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించి, సుదీర్ఘంగా వివరించామని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బతికించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దురుద్దేశంతో బీఆర్ఎస్ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుకు ఆద్యం పోసిందే కేసీఆర్’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.‘‘2016 అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ 3 వేల టీఎంసీ నీళ్లు అనే పదం నుంచి బనకచర్ల పుట్టింది. 3 వందల టీఎంసీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రెండు వందల టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారు. అనాడు కేసీఆర్ నాలుగు వందల టీఎంసీలు అన్నారు. అందుకే చంద్రబాబు ప్లాన్ మొదలు పెట్టారు. చంద్రబాబు బనకచర్ల అనగానే కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రికి ఫిర్యాదులు చేశాం...బనకచర్ల పై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదు. మేము ఇచ్చిన ఫిర్యాదులకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఉరి తీయ్యాల్సింది కేసీఆర్, హరీష్ రావునే. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రయత్నం చేయలేదు. చేసిందంతా కేసీఆర్, హరీష్ రావు చేసి.. నింద మాపై మోపుతారా?. కమీషన్లకు కకుర్తిపడి తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్రావు. లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టు పై 2లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు.ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం 500 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మనుషులు చనిపోతే హరీష్రావు కళ్లలో పైశాచిక ఆనందం వెళ్లబుచ్చుతారు. పేదలు ఎవరైనా చనిపోతే ఒక్క రూపాయి పేదలకు ఇవ్వలేదు. హరీష్ రావు చిల్లర ప్రయత్నాలు మానాలి. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం హరీష్ రావు. ఢిల్లీ వెళ్తే తప్పేంటి.. మీరు చేసిన తప్పులు మేము సెట్రేట్ చేస్తున్నాం. పది పైసల మిత్తికి 50వేల మిత్తికి హరీష్ రావు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా టార్గెట్.తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం. బనకచర్ల పై అవసరం అయితే ప్రధాన మంత్రిని కలుస్తాం. అందరినీ కలిసిన తర్వాత కోర్టుకు సైతం వెళ్తాం. చంద్రబాబుకు నేను సూచన చేస్తునా!. కేంద్రంలో పలుకుబడి ఉండొచ్చు.. ప్రధాని ఏదైనా వినొచ్చు అనుకుంటే మీ భ్రమ. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడివరకైనా వెళ్తాం. మేము తెలంగాణ ప్రజల కోసం కోర్టుకు అయినా వెళ్తాం. 968 టీఎంసీల నీళ్లను తెలంగాణ వాడుకోవడానికి బ్లాంకెట్గా అనుమతి ఇవ్వాలి’’ అని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. -
KTR: ఏసీబీకి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కేసు విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లతోపాటు ల్యాప్టాప్ ఇవ్వాలని ఏసీబీ కోరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన ఫోన్లు కావాలని కేటీఆర్ను అడిగారు. ఇదే అంశంపై కేటీఆర్ ఇవాళ ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. ఆ లేఖలో 2024లో ఫోన్లు మార్చాను. గతంలో వాడిన ఫోన్లు నా దగ్గర లేవు. 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన ఫోన్లు కావాలని అడిగిన ఏసీబీ. ఫోన్లు అడగడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని అందులో పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు ఫోన్లను అడగడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ‘విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరునిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో కోర్టులు పలు తీర్పులు ఇచ్చాయి. వ్యక్తిగతంగా వాడే ఫోన్లను కోర్టు తీర్పు లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఐటీ చట్టం ప్రకారం ఏసీబీ తీరు వ్యక్తిగత హక్కులకు విఘాతం కలిగిస్తుంది. ఈ చట్ట ప్రకారం కేవలం కోర్టు తీర్పుతోనే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్టాప్ లాంటి వ్యక్తిగత ఉపకరణాలు అడగవచ్చు. ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతోంది’ అని కేటీఆర్కు న్యాయవాదులు వివరించినట్లు సమాచారం. -
‘కబుర్ల దేవత’ కేంద్ర బాల సాహిత్య పురస్కారం
ఢిల్లీ: బాల సాహిత్య, యువ పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 భాషల్లో ఉత్తమ రచనలను ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' (స్టోరీ) పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది. సాహిత్య యువ పురస్కారానికి ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల ఎంపికైంది.భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు జ్యూరీ సభ్యులు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారాన్ని ప్రకటించలేదు. 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలను ప్రకటించింది. -
హనీ ట్రాప్కు చిక్కి.. 38.73 లక్షలు పోగొట్టుకున్న రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి 38.73 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఫేస్ బుక్లో వృద్దుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని.. తల్లి టైలర్ అంటూ సదరు ఆ మహిళ పరిచయం చేసుకుంది. చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ మహిళ.. కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్తో మాట్లాడిన బాధితుడు రూ.10 వేలు పంపించాడు.అనంతరం మహిళ నుంచి ఫేస్ బుక్లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్తో బాధితుడు చాటింగ్ చేశాడు. సదరు మహిళ జబ్బు పడిందని.. ఆస్పత్రిలో ఉందని చెప్పడంతో రూ. 10 లక్షలు ఆ వృద్ధుడు పంపించాడు. అనంతరం క్రెడిట్ కార్డు నుంచి మరో 2.65 లక్షలు చెల్లించాడు.కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని.. ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని చెప్పిన కేబుల్ ఆపరేటర్.. తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలనుకుంటున్నారంటూ కేబుల్ ఆపరేటర్ చెప్పగా.. సరేనన్న వృద్ధుడు.. కొద్ది రోజుల పాటు తల్లి, సోదరితో లైంగికంగా చాటింగ్ చేశాడు. తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కేబుల్ ఆపరేటర్ బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటూ బాధితుడికి సందేశం పంపాడు.బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం 12.5 లక్షలు చెల్లించిన బాధితుడు.. సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్ఐకి లక్ష సమర్పించుకున్నాడు. కొత్త ఎస్ఐ వచ్చానని.. కేసు అవ్వకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలంటూ మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో మరో ఏడు లక్షలను ఆ వృద్ధుడు పంపించాడు. ఇలా మొత్తం 38.73 లక్షలు ఆ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి దగ్గరి నుంచి సైబర్ నేరగాళ్లు దోపిడీ చేసేశారు. -
‘రేవంత్కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో’?
సాక్షి,తెలంగాణ: రేవంత్కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బుధవారం (జూన్18) ఎమ్మెల్సీ కవిత ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరుఫున జులై 16,17,18న రైల్వే రోకోలు నిర్వహిస్తాం. రైల్వే వ్యవస్థను స్తంబింపజేస్తాం. బనక చర్ల ప్రాజెక్ట్ అపాలంటే ఢిల్లోలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఒరిగేదేమీ లేదు. డిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ బుక్ రికార్డు. కేటీఆర్ ఏసీబీ విచారణ అంతా టైంపాస్నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. లీకేజీ పాయింట్ తుపాకుల గూడెం బ్యారేజి వద్ద ఉండాలని కేసీఆర్ తెలిపారు. పోలవరం వద్ద లీకేజీ పాయింట్ పెడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంతో తుపాకుల గూడెం వద్ద లీకేజీ పాయింట్ను చేపట్టాలని ఎందుకు చెప్పడం లేదు? రేవంత్కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటి? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్. చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణపై అక్రమంగా నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్లపై కోర్టుకు వెళ్తాం. బనక చర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం.కేటీఆర్పై ఏసీబీది టైం పాస్ విచారణ.ఇలాంటి విచారణలు చాలా చూశాం. హరీష్ రావుకు అస్వస్థత విషయం నాకు తెలియదు. నేను ఏ కార్యక్రమం చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. బీఆర్ఎస్కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ’ అని కవిత స్పష్టం చేశారు. -
తెలంగాణ పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో పోలీసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అన్యాయం జరిగిందని.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైనే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్..‘ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ కుంటయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల అంకుశాపూర్ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని రకాలుగా ఆదుకుంటామని కేటీఆర్ ధైర్యం చెప్పారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ..‘నేను ఏసీబీ విచారణలో ఉంటే నాకు ధైర్యం చెప్పాడు.. కానీ ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. వారి ఇద్దరు పిల్లల చదువులు, పెళ్లిలు, వారికి ఉన్న అన్ని సమస్యలు నేను చూసుకుంటాను. వారికి మాట ఇస్తున్నా.ఇదే సమయంలో పోలీసు అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయి. అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుల లాగా మేము దిగజారి ప్రవర్తించలేదు’ అని చెప్పుకొచ్చారు.పోలీసు అధికారులకు కేటీఆర్ వార్నింగ్ పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయిఅన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుల లాగా దిగజారి ప్రవర్తించలేదు https://t.co/cWfIkw3qnJ pic.twitter.com/h9xWgRtlG6— Telugu Scribe (@TeluguScribe) June 18, 2025 -
కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం. -
బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం ఎయిర్పోర్టులో బాంబు ఉన్నట్టు దుండగులు మెయిల్ పంపిన పంపించడంతో పోలీసులు, అధికారులు అలర్ట్ అయ్యారు. అనంతరం, ఎయిర్పోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. వివరాల ప్రకారం.. బాంబు బెదిరింపు నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు. ఎయిర్పోర్టు ఉద్యోగులు, సిబ్బందిని బయటకు తరలించి తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. అత్యవసర సహాయక సిబ్బందిని సైతం ఎయిర్పోర్టు అథారిటీ రప్పించింది. దీనిపై సైబర్ క్రైం అధికారులు.. మెయిల్ పంపిన వాళ్ల వివరాలు కనుగొనేందుకు కసరత్తు ప్రారంభించారు. -
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రపంచదేశాలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిలువుదోపిడీ చేసి వేలాది మందిని బలితీసుకున్న ఆ వైరస్ వదలిన ఆనవాళ్లు ఇప్పట్లో చెరిగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన పాపులేషన్ రిపోర్ట్ సమర్పించిన ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ (సీఆర్ఎస్) డేటా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో జననాల కన్నా అత్యధిక మరణాలు చోటు చేసుకున్న 49 జిల్లాల్లో సిరిసిల్ల జిల్లా కూడా ఒకటి. కోవిడ్ అనంతరం ప్రజల ఆరోగ్యాలు, జీవనశైలిలో మార్పులు రావడం, సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభించడంతో ఆ ఏడాది మరణాలు అధికంగా సంభవించాయి.సీఆర్ఎస్ డేటా ప్రకారం..2021లో నమోదైన జనన మరణాలను పరిశీలి స్తే, 5,130 మరణాలకు 5,028 జననాలు చోటు చేసుకున్నాయి. ఆ మరణాలు కేవలం సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,34,425 మరణాలు రికార్డయ్యాయి. అందులో 1,35,725 మంది పురుషులు, 98,700 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. మహిళల కన్నా పురుషులు 40శాతం అధికంగా మరణించారు. ఆ ఏడాది చోటు చేసుకున్న మరణాల్లో పట్టణ ప్రాంతాల్లో 61,553 పురుషులు, 46,674 మంది మహిళలు మరణించగా.. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 1,06,327 మరణాలు సంభవించాయి.పురుషుల్లోనే మరణాలు అధికండేటా ప్రకారం 65 నుంచి 69 ఏళ్ల వయసు వారి లో మరణాల రేటు అధికంగా ఉంది. ఈ వయసులో ఉన్న వారిలో 85,945 మరణాలు రికార్డయ్యాయి. ఇక 70 ఏళ్ల పైబడిన వారిలో 51,516 మరణాలు నమోదయ్యాయి. 55 నుంచి 64 ఏళ్ల 42,349 మంది మరణాలు, 45– 54 వయసు గ్రూపులో 12,184 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడానికి కోవిడ్ ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో జీవన విధానంలో మార్పులు, బీపీ, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వీరి మరణాలకు కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ మరణాల రికార్డులో ముందంజలో ఉంది. 75›శాతం మేరకు మరణాలు అప్పటికప్పుడే రిపోర్టు అవుతున్నాయి. మిగిలినవి తరువాత రిపోర్టు అవుతున్నాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2022లో రాజన్న సిరిసిల్లలో 3,220 మరణాలు నమోదవగా, 7647 జననాలు నమోదయ్యాయి. ఏడాది తరువాత కోవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో మరణాలు కూడా తగ్గుముఖం పట్టి ఉంటాయని భావిస్తున్నారు. -
బోనాల విశిష్టతను ప్రపంచానికి చాటుదాం
హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల విశిష్టతను, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటుదామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతరను పురస్కరించుకొని మంగళవారం గోల్కొండలో నిర్వహించిన అధికారుల సమన్వయ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బోనాలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతులు కలిపంచాలి సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.ముఖ్యంగా పర్యాటక శాఖ బోనాల బోనాల విశిష్టతను తెలియజేస్తూ పర్యాటకులను ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత తరం చిన్న చిన్న వీడియోలు, రీల్స్కు ఆకర్షితులవుతున్నారని.. సమాచార శాఖ ఈ అంశంపై దృష్టి పెట్టాలని.. చిన్న వీడియోల రూపంలో బోనాల గొప్పదనంపై అనేక రకాలుగా ప్రచారాలు నిర్వహించాలన్నారు. గతంలో ఉన్నట్లు ఆషాఢ మాసాంతం గోల్కొండ కోటలో ప్రవేశం ఉచితంగా ఇవ్వాలని, ప్రస్తుతానికి మంగళవారం కూడా ఉచిత ప్రవేశం కోరుతూ పురావస్తు శాఖకు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. గోల్కొండ బోనాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నగర నలుమూలల నుంచీ ఆర్టీసీ బస్సులు నడపనున్నామన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ చైర్మన్ కొండెపుడి చంటిబాబు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కోట లోపల నాగదేవత పుట్ట వద్ద పూజలు చేసి అమ్మవారికి కల్లు సాక పెట్టారు. -
ఈవీలకు వైర్లెస్ చార్జింగ్
ఉస్మానియా యూనివర్సిటీ: కాలుష్య నియంత్రణ, ఇంధన కొరత కారణంగా భవిష్యత్లో విద్యుత్ వాహనాల వినియోగం భారీ సంఖ్యలో పెరగనున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు వైర్లెస్ చార్జింగ్పై పరిశోధన ప్రారంభించారు. ద్విచక్ర వాహనాల నుంచి బస్సులు ఇతర భారీ వాహనాల వరకు ఎలక్ట్రికల్ వాహనాలకు కావాల్సిన పవర్ను (విద్యుత్) బ్యాటరీల చార్జింగ్ ద్వారా పొందుతాయి. విద్యుత్ చార్జింగ్ సెంటర్లు అంతటా అందుబాటులో ఏర్పాటు చేయరు. అనుకోకుండా వాహనం బ్యాటరీలో చార్జింగ్ లేనప్పుడు వెంటనే పొందేందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీని రూపొందించి వైర్లెస్ చార్జింగ్ కోసం లోతైన పరిశోధనలు చేస్తున్నట్లు ప్రొఫెసర్లు తెలి పారు. ఈ పద్ధతి వల్ల విద్యుత్ ఆదాతో పాటు స్మార్ట్ ఫోన్లో యాప్ ద్వారా ఎలక్ట్రికల్ వాహనాలకు వైర్లెస్ చార్జింగ్ చేసుకోవచ్చు అని వివరించారు. స్మార్ట్ ఫోన్తో ఆపరేటింగ్ స్మార్ట్ ఫోన్లో ఉబర్, ఓలా యాప్ నుంచి వాహనాలను బుక్ చేసుకున్నట్లు పవర్ను బుక్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో యాప్ను ఉపయోగించి కావాల్సిన పవర్ను బుక్ చేసుకొని పొందవచ్చు అని ప్రొఫెసర్లు వివరించారు. ఎలక్ట్రికల్ వాహనదారు బయటికి వెళ్లినప్పుడు (షాపింగ్ మహల్, సినిమా, నగరంలోని ఇతర ప్రాంతాలు) అనుకోకుండా వాహనం బ్యాటరీలో పవర్ లేనప్పుడు వైర్లెస్ చార్జింగ్ ద్వారా అవసరమున్నంత పవర్ను చార్జింగ్ బుక్ చేసుకొని కొనుగోలు చేయవచ్చు. వాహనంలో అధికంగా పవర్ ఉన్నప్పుడు ఇతరులకు విక్రయించవచ్చు. మీటర్ మించి దూరం ఉండొద్దు.. మార్కెట్లో అందుబాటులో ఉన్న యాప్లను స్మార్ట్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని థర్డ్ పార్టీ (మూడో వ్యక్తి) ద్వారా పవర్ను (విద్యుత్) క్రయ, విక్రయాలు చేయవచ్చు అని తెలిపారు. అయితే.. వాహనానికి, వాహనానికి మధ్య దూరం మీటరు మించి ఉండకూడదన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వైర్లెస్ పవర్ చార్జింగ్ విధానాన్ని కనిపెట్టినట్లు చెప్పారు. ఎలక్ట్రికల్ వాహనం నుంచి పవర్ గ్రిడ్కు పవర్ గ్రిడ్ నుంచి మరో వాహనానికి విద్యుత్ అందించవచ్చు ప్రొఫెసర్లు తెలిపారు. ఈ విధానం కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలో ఉన్నప్పటికీ.. దుబారా లేకుండా నాణ్యత ప్రమాణాలతో కూడిన పవర్ చార్జింగ్ కోసం పరిశోధనలు చేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు వివరించారు. -
కాంగ్రెస్ గ్యారంటీ కార్డు.. కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ద.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా.. ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే .. సచ్చిందాక సాకుతా అన్నాడట. ఏస్తున్న రైతు భరోసా సరే మరి.. ఎగ్గొట్టిన రైతుభరోసా సంగతి ఏంది?. ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏంది?ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఏంటి?ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి?ఎగ్గొట్టిన రూ.2500 మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటి?ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటి?ఆగిపోయిన రైతుబీమా పరిస్థితి ఏంటి?ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంటి?శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిలోక్ సభ ఎన్నికల కోసం దేవుళ్ల మీద ఒట్లేసిఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది.మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ద - తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే అని కామెంట్స్ చేశారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ స్వరూప
హైదరాబాద్: చర్లపల్లి డివిజన్ పరిధిలో సీసీ రోడ్డు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ సీహెచ్ రామిరెడ్డి నుంచి ఇంజినీరింగ్ విభాగం ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డివిజన్ పరిధిలో రూ. 28.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి అధికారులు టెండర్ వేశారు. టెండర్ను కాంట్రాక్టర్ సీహెచ్ రామిరెడ్డి దక్కించుకుని, సీసీ రోడ్డు పనులను దాదాపు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన నిధుల విడుదలకు ఇంజినీరింగ్ విభాగం అధికారులు రెండు విడతలుగా ఎంబీ బుక్స్ చేసి ఉన్నతాధికారులకు ప్రపోజల్ ఫైల్ను పంపారు. తొలుత రూ. 26 లక్షలు మంజూరయ్యాయి. మిగతా రూ. 2.50 లక్షల కోసం సదరు కాంట్రాక్టర్ కాప్రా సర్కిల్ కార్యాలయం చుట్టూ తిరిగారు. అయినా నిధులు మంజూరు కాలేదు. పెండింగ్ బిల్లు మంజూరు చేయాలంటే రూ.1.50 లక్షలు ఇవ్వాలని ఏఈ బి.స్వరూప డిమాండ్ చేశారు. చివరికి రూ.1.20 లక్షలు ఇస్తే బిల్లు ప్రాసెస్ చేస్తానని చెప్పడంతో గత్యంతరం లేని కాంట్రాక్టర్ రామిరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం కాప్రా సర్కిల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ రామిరెడ్డి నుంచి ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులెవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ సూచించారు. -
ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కేసు విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లతోపాటు ల్యాప్టాప్ ఇవ్వాల ని ఏసీబీ కోరడంపై తన న్యాయవాదులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నారు. మంగళవారం తన న్యాయవాదులతో విచారణ తీరు తెన్నులపై చర్చించారు. ‘ఏసీబీ విచారణ ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్రమానికి సంబంధించినది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రేసు నిర్వహణ పూర్తిగా అధికార యంత్రాంగం ద్వారా సాగింది. ఇందులో కేటీఆర్ వ్యక్తి గతంగా పరిమిత పాత్ర మాత్రమే వహించారు.ఫార్ములా–ఈ కేసు ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప, వ్యక్తిగత సంభాషణకు సంబంధించి కాదు’ అని కేటీఆర్ న్యాయవాదులు స్పష్టం చేశారు. ‘ఈ అంశానికి సంబంధించి ఆయా సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నీ ప్రభుత్వానికి అందుబాటు లో ఉన్నాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ను వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదు. సమాచారం అంతా ప్రభుత్వానికి అందు బాటులో ఉన్నా కేవలం రాజకీయ వేధింపుల కోణంలో కేటీఆర్ మొబైల్ ఫోన్ను అడగడం వెనుక న్యాయ సమ్మతమైన కారణాలు లేవు’ అని న్యాయ వాదులు కేటీఆర్కు చెప్పినట్లు సమాచారం.‘విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరునిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో కోర్టులు పలు తీర్పులు ఇచ్చాయి. వ్యక్తిగతంగా వాడే ఫోన్లను కోర్టు తీర్పు లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఐటీ చట్టం ప్రకారం ఏసీబీ తీరు వ్యక్తిగత హక్కులకు విఘాతం కలిగిస్తుంది. ఈ చట్ట ప్రకారం కేవలం కోర్టు తీర్పుతోనే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్టాప్ లాంటి వ్యక్తిగత ఉపకరణాలు అడగవచ్చు. ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతోంది’ అని కేటీఆర్కు న్యాయవాదులు వివరించారు. -
శాంతి చర్చలతోనే సమస్యలకు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: శాంతి చర్చల ద్వారానే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని శాంతి చర్చల కమిటీ మహాధర్నాలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరిట గత 17 నెలల్లో 540 మందిని భద్రత బలగాలు చంపాయన్నారు. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేసి, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ హింసపై సుప్రీంకోర్టు స్పందించి సుమోటోగా తీసుకోవాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఒక తీర్మానం చేశారు. ఆపరేషన్ కగార్ ఆపివేయాలి..మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే ప్రారంభించాలన్న నినాదంతో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్లోని ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పలు హక్కుల సంఘాల నాయకులు, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు హాజరై మద్దతు ప్రకటించారు.⇒ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయడంతోపాటు, మా వోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని మహాధర్నాకు అధ్యక్షత వహించిన జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు, సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ స్థాయిలోనూ ధర్నా చేస్తామన్నారు. ⇒ ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ కార్పొరేట్ల కోసం ఆదివాసీల మీద యుద్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థల లాభాల కోసం కగార్ను ఆపడం లేదని విమర్శించారు. పదేళ్ల క్రితం బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ లేని భారత్ అని, ప్రస్తుతం కమ్యూనిస్టులు, మావోయి స్టులు ప్రజాస్వామ్యం, ప్రతిక్షాలు లేని భారతదేశమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని చెప్పారు. ⇒ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలు తుంగలో తొక్కుతూ వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం కళ్లు తెరిచి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు. ⇒ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ ఎందుకు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నామో ఆ కారణాలు ప్రజలకు వివరించినప్పుడే రాజకీయ పార్టీల ధోరణి మారుతుందన్నారు. ⇒ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలన్న డిమాండ్కు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు పలుకుతున్నామన్నారు.⇒ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ కేంద్రం, మావోయిస్టుల మధ్య జరుగుతుందని అనుకుంటే పొరపాటే అన్నారు. మోదీ అమిత్షాలు అంతం చేయాలని అనునుకుంటున్నది కేవలం మావోయిస్టులనే కాదని, ప్రశ్నించే గొంతుకలను అని చెప్పారు. ⇒ సినీనటుడు నారాయణమూర్తి మాట్లాడుతూ హిందూత్వం అని చెప్పుకునే బీజేపీ, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాలు..నంబాల కేశవరావు సహా ఇతర మావోయిస్టుల మృతదేహాలకు హిందూధర్మం ప్రకారం ఖర్మకాండలు చేసేందుకు సైతం అవకాశం ఇవ్వలేదని, ఇదెక్కడి హిందూ ధర్మం అని ఆవేదన వ్యక్తం చేశారు. ⇒ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ శాంతి చర్చలకు వరంగల్ సభలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు ప్రకటించారన్నారు. ⇒ నంబాల కేశవరావు మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కోరినా స్పందించలేదని, మావోయిస్టుల శవాలను ఇచ్చేందుకు కూడా భయపడే పరిస్థితి ఉందని సీపీఐ నేత కె.నారాయణ అన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం శాంతిచర్చలకు మద్దతు పలికారు. మహాధర్నాలో కాంగ్రెస్ ఎంపీ అనిల్కుమార్, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్, విమలక్క, వెన్నెల గద్దర్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ను మరమ్మతు చేసి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 21న పోరుబాట చేపట్టనుంది. మేడిగడ్డలోని రెండు పిల్లర్ల కుంగుబాటును చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైందంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. పోరుబాట కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు స్థానిక రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న బరాజ్లు, పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లను సందర్శిస్తారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్రావు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆ పార్టీల వైఖరిని ఎండగట్టేందుకు మరో నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. వచ్చే నెలలో బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ లేదా సడక్ బంద్ చేపట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. దీనిపై ఈ నెలాఖరులోగా కార్యాచరణ ప్రకటించే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.నేడు లండన్కు కేటీఆర్ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే రెండు రోజుల సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఈ సదస్సులో ‘ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా’ అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేస్తారు. దేశ ప్రగతి, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలు, టెక్నాలజీ తదితరాలపై చర్చిస్తారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం రాత్రి కేటీఆర్ లండన్కు బయలుదేరనున్నారు. ఈ నెల 24న హైదరాబాద్కు తిరిగి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.కాగా వైద్య పరీక్షల కోసం నందినగర్ నివాసానికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మరో రెండు రోజులపాటు ఇక్కడే బస చేయనున్నారు. ఇక్కడే పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అమెరికాలోని డాలస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణలో క్రియాశీలంగా పనిచేసిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాలా మంగళవారం కేసీఆర్ను కలిశారు. డాలస్ సభను విజయవంతంగా నిర్వహించిన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నేతలను కేసీఆర్ అభినందించారు. -
రాష్ట్రంలో నాలుగు అత్యాధునిక గోశాలలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గోసంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని, ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నిర్ణయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సవ్యసాచి ఘోష్, శైలజా రామయ్యర్, రఘునందన్రావుతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో గోసంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. రేవంత్రెడ్డి మంగళవారం తన నివాసంలో గోసంరక్షణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యంతోపాటు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గోసంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.భక్తులు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నా స్థలాభావం, ఇతర సమస్యలతో ఇబ్బందులు వస్తున్నాయని, కొన్నిసార్లు గోవులు మృత్యువాత పడుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు గోవుల సంరక్షణే ప్రధాన ఎజెండాగా రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలని చెప్పారు.వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని, గో సంరక్షణ విషయంలో ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్ను అధికారులు సీఎంకు అందజేశారు. ఈ సమీక్షలో పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం ముఖ్యకార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
బరాజ్లపై నిర్ణయం కేసీఆర్దే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను నిర్మించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. గత ప్రభు త్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో బరాజ్ల నిర్మాణంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది. కేసీఆర్ స్వయంగా తీసుకున్న నిర్ణ యాల మేరకే బరాజ్లను నిర్మించారని తేల్చి చెప్పింది. బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 11న కేసీఆర్కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వ హించగా, మంత్రివర్గ నిర్ణయాల మేరకే బరాజ్లను నిర్మించినట్టు బదులిచ్చారు. ఈ నేపథ్యంలో నాటి మంత్రివర్గ సమా వేశాలకు సంబంధించిన మినట్స్ కాపీలను సమర్పించాలని కమిషన్ 13న రాష్ట్ర ప్రభు త్వానికి లేఖ రాసింది. అదే రోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్య దర్శి రాహుల్ బొజ్జా కమిషన్ను కలిసి వివిధ మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన మినట్స్ కాపీలను అందజేశారు.బరాజ్ల నిర్మాణంపై మంత్రివర్గ నిర్ణయాలేమీ జరగలేదని, మాజీ సీఎం కేసీఆర్ మాత్రమే నిర్ణ యం తీసుకున్నారని ఆయన కమిషన్కు రాతపూర్వకంగా లేఖ ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవానికి కమిషన్ విచారణ ప్రారంభించిన వెంటనే కాళేశ్వ రం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఫైళ్లను కమిషన్ కార్యాలయా నికి అందజేసినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. కమిషన్ మంత్రివర్గ నిర్ణయాలను కోరడంతో మళ్లీ అందజేసినట్టు వెల్లడించాయి. -
‘బనకచర్ల’పై చర్చిద్దాం రండి
సాక్షి, హైదరాబాద్: ఏపీ చేపడుతున్న గోదావరి –బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును తీవ్రంగా ప్రతిఘటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ యించింది. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమ తులు జారీ చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అంశంపై ..రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు అధికార, విపక్ష పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యుల అభిప్రాయాలు, సలహాలను స్వీకరించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు సచి వాలయంలో రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్య సభ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వ హించనున్నారు. సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ సమా వేశానికి గౌరవ అతిథు లుగా హాజరు కావాలని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజ య్లకు మంత్రి ఉత్తమ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అందు బాటులో ఉన్న ఇతర ఎంపీలకు సైతం ఆయన ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రం నుంచి ఎంపికైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలందరికీ ఆహ్వాన లేఖలను పంపించారు. అడ్డుకునే వ్యూహంపై చర్చిద్దాంగోదావరి ట్రిబ్యునల్ తీర్పుతో పాటు రాష్ట్ర పున ర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈ నెల 3న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను.. సీఎం రేవంత్రెడ్డి, తాను కలిసిన విషయాన్ని ఎంపీలకు రాసిన లేఖల్లో మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. అంతేకాకుండా సీఆర్ పాటిల్కు తాను లేఖ సైతం రాశానని తెలిపారు. అయితే ఏపీ నుంచి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఇంకా అందలేదని, అందిన తర్వాత తమ శాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)..అమల్లో ఉన్న నిబంధనలు, ట్రిబ్యునళ్ల తీర్పులు, అంతర్రాష్ట్ర జల ఒప్పందాలతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనల ఆధారంగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటుందంటూ పాటిల్ హామీ ఇచ్చారని వివరించారు. కాగా ప్రాజెక్టు ప్రీఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కోరుతూ ఈ నెల 13న సీఆర్ పాటిల్కు మళ్లీ తాను లేఖ రాసినట్టు ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు వస్తారా?తెలంగాణకు నష్టం కలిగించనున్న గోదావరి– బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభు త్వానికి లేఖ రాయాలని సీఎం రేవంత్రెడ్డికి తాజాగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైందని బీఆర్ఎస్ గత కొంత కాలంగా ఆరోప ణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి ఉత్తమ్ నిర్వహించనున్న సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు వస్తారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. -
రంగారెడ్డిలో ఎక్కువ.. నిజామాబాద్లో తక్కువ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు దీరనుంది. అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. 2027 మార్చికి జనాభా లెక్కలు పూర్తి కాగానే, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ (డీలిమిటేషన్) పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుంది. తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్–డిసెంబర్లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్ కూడా వర్తించనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు జరుగుతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సగటు జనాభా ప్రామాణికంగా...ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2,30,064 జనాభా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాల్సి ఉంది. కానీ వివిధ రాజకీయ కారణాలతో దానిని వాయిదా వేస్తూ వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పునర్విభజనను జాప్యం చేస్తున్నారంటూ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమాధానమిస్తూ.. కొత్త జనాభా లెక్కలు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. కోర్టు కేసుతో సంబంధం లేకుండానే 2027 తర్వాత దేశమంతా పునర్విభజన చేస్తుండటంతో రాష్ట్రంలో నియోజకవర్గాల్లో చేర్పులు, మార్పులు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అనివార్యం కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్థానాలు 2011 జనాభా లెక్కలతోపాటు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తాజా అంచనాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 9 శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. అవన్నీ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న శివారు ప్రాంతాల్లోనే కావటం విశేషం. జాతీయ సగటును మించి, విద్య, ఉపాధి, ఐటీ, ఫార్మా, సినిమా, ఇతర అవకాశాల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్కు పెరిగిన వలసల తాకిడి కారణంగా నగరంలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాద్లో కనీసం పది అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ కోర్సిటీ (హైదరాబాద్ జిల్లా)లో రెండు, గ్రేటర్ హైదరాబాద్లో భాగమైన శివార్లలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కొత్తగా 9 కొత్త నియోకజవర్గాలు ఏర్పాటు కానున్నాయి.ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్ధితిడీలిమిటేషన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్థితి ఏర్పడనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 27,97,370. అయితే, ఆ జిల్లా నుంచి 5 మండలాలు ఏపీలో విలీనం కావటం, కొన్ని మండలాలు ములుగు జిల్లాల్లోకి వెళ్లటంతో జిల్లా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. అయినా, ఆదివాసీ ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆ జిల్లాలో శాసనసభ స్థానాలు తగ్గించకుండా అదనంగా రెండుస్థానాలు పెంచే అవకాశం ఉంది.డీలిమిటేషన్ ఇలా..– దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటయ్యే కమిషన్ రాజకీయ పక్షాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తుంది. కొత్త జిల్లాల మేరకు ఒక మండలం ఒకే నియోజకవర్గం, ఒకే జిల్లాలో ఉండే విధంగా భౌగోళిక మార్పులు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో పలు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో కూడా ఉండగా, వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొస్తారు.– రాష్ట్ర మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్న గత కమిషన్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 2,30,064 సగటు జనాభాగా నిర్దారించింది. అయితే ఈ సగటుకు 10 శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువైనా ఉండొచ్చు.– 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాను సగటుగా తీసుకుని డీలిమిటేషన్ చేయటంతో తెలంగాణలో అంతకు ముందు 107 ఉన్న అంసెబ్లీ స్థానాలు 119కి పెరిగాయి. 12 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయాయి.– డీలిమిటేషన్లో కొండప్రాంతాలు, గిరిజనులు, ఇతర ప్రత్యేక కారణాలను కూడా పరిగణనలోకి తీసుకుని నియోకజవర్గాలు ఏర్పాటు చేస్తారు. కొండలతో, విసిరేసినట్లు ఉండే హిమాచల్ప్రదేశ్లోని లాహోల్ – స్పితి అసెంబ్లీ నియోజకవర్గం 25 వేల జనాభాతోనే ఏర్పాటైంది. సిక్కింలోని సాంగ్మో అసెంబ్లీ స్థానం సైతం తక్కువ జనాభాతో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 6,98,000 మందితో అత్యధిక జనాభా కలిగిన శాసనసభ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి రికార్డుకెక్కింది. ఢిల్లీలోని చాందినీచౌక్, యూపీలోని ఘజియాబాద్లు సైతం జనాభా పరంగా అదిపెద్ద నియోజకవర్గాలే. -
మావోయిస్టుల ముసుగేసి.. ఫోన్లు ట్యాప్ చేసి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకొత్త విష యాలు బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు టార్గెట్ చేసిన బడా వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయ డానికి నాటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్రావు టీమ్.. వారందరికీ మావోయిస్టుల ముసుగు వేసినట్లు తేలింది. కొందరి ఫోన్ నంబర్లు మావోయిస్టులవి అని, మరికొందరివి వారి సానుభూతిపరులవి అని, ఇంకొందరు మావో యిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానాలు అంటూ ట్యాపింగ్కు అనుమతి పొందారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆ విషయాన్ని గుర్తించి.. ప్రభాకర్రావు టీమ్ ఎవరి ఫోన్లను ట్యాప్ చేసిందో, వారందరినీ బాధితుల జాబితాలో చేర్చారు. వారికి సాక్షులుగా నోటీసులు జారీ చేసి వాంగ్మూలాల నమోదు ప్రారంభించారు. మంగళవారం పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గద్వాల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సరిత, ఆమె భర్త తదితరులు సిట్ ఎదుట హజరై వాంగ్మూలాలు ఇచ్చారు. నేడు మరికొందరుబుధవారం ఈటల రాజేందర్, ధర్మపురి అర వింద్, రఘునందన్రావు సహా మరికొందరు బీజేపీ కీలక నేతలు సిట్ ముందు వాంగ్మూ లాలు ఇవ్వనున్నారు. మరోపక్క ప్రభాకర్ రావును మంగళవారం విచారించాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) వేల ఫోన్లు ట్యాప్ చేసింది. రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, ప్రముఖులు, కొందరు జర్నలిస్టు లపై ఎస్ఓటీ నిఘా ఉంచిందని తేలింది. 2023 నవంబర్ 15న ఒకేరోజు ఏకంగా 600 ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ట్యాపింగ్ చేసే ఫోన్ నంబర్లు, వివరాలను రివ్యూ కమిటీని సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ప్రభాకర్రావు అవన్నీ మావోయిస్టులు, వారికి మద్దతు ఇస్తున్నవారివి అని చెప్పి ట్యాపింగ్కు అనుమతి పొందారు. ఫలానా నంబర్లు ట్యాప్ చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు రాసిన లేఖల్లో కొన్నింటిని సిట్ అధికారులు సేకరించారు. నాడు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తుల ఫోన్లు సైతం ఎస్ఓటీ ట్యాప్ చేసింది. ప్రణీత్రావు ఆ వివరాలను ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా ఉన్న భుజంగరావుకు అందించారని సిట్ గుర్తించింది. ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన సంభాషణలను నివేదికలుగా మార్చి అవసరమైన వారికి ప్రభాకర్రావు పంపారు. దీనికోసం ప్రత్యేకంగా టైపింగ్ బృందా లను ఏర్పాటు చేశారు. ట్యాపింగ్లో వెలుగులోకి వచ్చిన కీలక వివరాలను అప్పటి అధికారపార్టీ నేతలకు భుజంగరావు, రాధాకిషన్రావు అందించినట్లు అధికారులు చెప్తున్నారు. కేసీఆర్, కేటీఆరే సూత్రధారులురేవంత్రెడ్డి పీసీసీ చీఫ్గా, నేను వర్కింగ్ ప్రెసి డెంట్గా 2021లో బాధ్యతలు స్వీకరించాం. అప్పటి నుంచి చాలా సందర్భాల్లో మా కదలి కల్ని వాళ్లు గుర్తించారు. దీంతో మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని అనుమానం వచ్చింది. అప్పటి చీఫ్ సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేశా ం. ఇవాళ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చట్ట వ్యతిరేకంగా కొన్ని వేల మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇది హేయ మైన చర్య. ఇలాంటి చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తల వంచుకోవాలి. 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా ట్యాపింగ్ అని అర్థం అవుతోంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు అన్నీ ట్యాపింగ్లో ఉన్నాయి. సిట్ అధికారులు చూపించిన లిస్టు ప్రకారం 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ వ్యవహా రానికి వంద శాతం సూత్రధారులు ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లే. నాటి సీఎస్ సోమేశ్ కుమార్, హోం సెక్రటరీ, డీజీపీలను కూడా శిక్షించాలి. – మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్, టీపీసీసీ చీఫ్ కేసీఆర్కు సోమేశ్కుమార్, ప్రభాకర్రావు లొంగిపోయారుగత ప్రభుత్వంలో కేసీఆర్, ఆయన కుటుంబీకులు ప్రభుత్వ సంస్థను దుర్వినియోగం చేశారు. నాటి సీఎస్ సోమేశ్కుమార్, ప్రభాకర్ రావు తదితరులు కేసీఆర్ కుటుంబానికి లొంగిపోయారు. ట్యాపింగ్ ద్వారా లభించిన సమాచారాన్ని దుర్వినియోగం చేశారు. ఇది దేశద్రోహంతో సమానం. ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. – మీడియాతో అనిల్కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు -
‘పామాయిల్ గెల’.. గగ్గోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆయిల్పామ్ రైతులకు దిగుమతి సుంకం తగ్గింపు దెబ్బ తగిలింది. క్రూడ్ పామ్ ఆయిల్ (సీపీఓ) తోపాటు క్రూడ్ సన్ ఫ్లవర్, క్రూడ్ సోయా ఆయిల్లపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెల 31న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మే 31 నాటికి ఒక టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.20,058 ఉండగా, ఇప్పుడు ఆ ధర రూ.18,748కి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతి సుంకాన్ని 10 శాతం మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించగా, పామాయిల్ గెలల ధరపై కూడా సుమారు 10 శాతం వరకు ప్రభావం చూపింది. విదేశాల నుంచి క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి పెరగడంతోనే ఆయిల్ పామ్ గెలల ధర పడిపోయిందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. తగ్గని వంటనూనెల ధరఆయిల్ పామ్ గెలల ధర తగ్గినా, వంట నూనెల రిటైల్ ధరలు తగ్గకపోవడం గమనార్హం. పామాయిల్, సన్ఫ్లవర్, రైస్ బ్రాన్ ఆయిల్ లీటర్ సాచెట్ల ధరల్లో రూపాయి వ్యత్యాసం కూడా లేదు. » మే 31వ తేదీన సన్ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్కు రూ.137.40 గా ఉంటే ఈనెల 16వ తేదీ నాటికి ఆ ధర రూ.136.10గా ఉంది. » పామాయిల్ రిటైల్ ధర గత నెల 31న రూ.115.20 ఉండగా, 13వ తేదీ వరకు సుమారు రూ. 5 తగ్గి రూ.110.70కి చేరగా, 16న ఒక్కసారిగా రూ. 5 పెరిగి రూ. 116.10కి చేరుకుంది. పామాయిల్ గెలల ధరలు తగ్గినా, సాధారణ వినియోగదారుడికి పామాయిల్ ఇతర తిండి నూనెలు అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగించే విషయమే. నూనెల ధరలు, గెలల ధరలతో సంబంధం లేకుండా రైతులకు సుస్థిర ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్పామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి కృషి చేస్తుందని ఆయిల్ఫెడ్ ఎండీ శంకరయ్య ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. -
తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాటాలు కోరకుండా చేయాలి
సాక్షి, హైదరాబాద్: నిత్యం పెరిగిపోతున్న తోబుట్టువుల ఆస్తి తగాదాలు, వివాహ వివాదాలపై ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్నత చదువులు చదువుకుని.. మంచి ఉద్యోగం చేస్తూ.. ఆర్థికంగా బాగానే ఉన్నా.. స్వల్ప ఆస్తి కోసం కొందరు సోదరులు, సోదరీమణులతో కొట్లాడుతుంటారన్నారు. ఒకరిపై ఒకరు కేసులు, పిటిషన్లు వేసుకుంటూ న్యాయస్థానాలను పెద్ద ఎత్తున ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మునిసిపల్ అధికారులు అమలు చేయడం లేదంటూ హైదరాబాద్ నివాసి చార్టర్డ్ అకౌంటెంట్ రాహుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూల్చిన తర్వాత స్థలాన్ని సమానంగా పంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. 2024, ఫిబ్రవరిలో జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్ ప్రకారం చర్యలు చేపట్టి.. స్టేటస్ రిపోర్టును తమకు తెలియజేయాలని సూర్యాపేట మునిసిపాలిటీని ఆదేశించారు. తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేశారు. కేసు విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన వ్యక్తి ఆ భవనంలో ఉంటున్న వారికి సోదరుడు అని.. నలుగురి మధ్య ఆస్తి వివాదం ఉందని తెలుసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఇలాంటి పిటిషన్లు న్యాయస్థానాల్లో పెరిగిపోతున్నాయని, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారంతోనే కేసులు..: ‘హైకోర్టుకు అధికారం ఉండి ఉంటే ఆస్తి తగదాలు, వివాహ వివాదాల్లో ఆస్తులన్నింటినీ న్యాయస్థానం కస్టడీలోకి తీసుకునేవాళ్లం. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి కోసం కొట్లాటలు పెట్టుకుని ఏం సాధిస్తారు? కోర్టు చుట్టూ తిరిగి చివరికి ఆ ఆస్తి పొందిన వాళ్లు కూడా సంతోషంగా ఉండలేరు. ఇక్కడ 264 గజాలు ఆరుగురు (తల్లిదండ్రులతో కలిపి) పంచుకోవాలి. దాదాపు 44 గజాల స్థలం కోసం కొట్లాడుతున్నారు. అందులో ఇళ్లు కట్టుకునేందుకు అధికారులు అనుమతి కూడా ఇవ్వరు. దాంతో ధనవంతులూ కాలేరు. చివరకు ఏం సాధించినట్లు.. అతి పెద్ద సమస్య ఏంటంటే అహంకారం. కంపెనీ లా ట్రిబ్యునల్లో దివాలా పరిష్కార నిపుణుడిని పెట్టినట్లు ఇక్కడ కూడా అలాంటి వ్యక్తిని ఏర్పాటుచేసి ఆస్తులను కస్టడీలోకి తీసుకుని.. పార్టి షన్ సూట్లో ఆస్తుల పరిష్కార ప్రక్రియ చేపడితే సరిపోతుంది. అసలు.. తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు కుమారుడు, కుమార్తె ఆస్తుల్లో వాటాను కోరకుండా చర్యలు తీసుకుంటే తెలిసొస్తుంది. ఉన్నత చదువులు చదువుకుంటారు.. మంచి ఉద్యో గం చేస్తుంటారు.. ఆర్థికంగా బాగానే ఉంటారు.. అయినా స్వల్ప ఆస్తి కోసం కూడా కొట్లాడుతుంటారు. కుటుంబ సభ్యులతో కొట్లాడి వెయ్యి గజాలు సాధించుకున్నా అది భవిష్యత్లో సంతృప్తినివ్వదు. అహంకారం వీడితే సమస్యలకు కుటుంబ స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుంది’అని పేర్కొన్నారు. -
మన మెడికల్ కాలేజీలు మెరుగే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు క్లినికల్ ట్రైనింగ్ వంటి సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలను జాతీయ వైద్యకమిషన్ (ఎన్ఎంసీ)కు తెలియజేయాలని రాష్ట్ర వైద్యాధి కారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకుగాను 26 కళాశాలలు ‘మినిమం స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ (ఎంఎస్ఎంఈఆర్) – 2023’ నిబంధనలకు అనుగుణంగా లేవని ఎన్ఎంసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గత శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, డీఎంఈ నరేంద్రకుమార్కు నోటీసులు జారీచేస్తూ బుధవారం ఢిల్లీలో విచారణకు రావాలని సూచించింది. 26 కళాశాలల ప్రిన్సిపా ల్స్, డీన్లు తమ కళాశాలల నుంచి వర్చువల్గా విచారణలో పాల్గొనాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు అప్ర మత్తమయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ఫ్రొఫె సర్లు ఎందరున్నారు? ఇంకెంత మంది అవసరం? కళాశాలల్లో విద్యార్థుల క్లినికల్ ట్రైనింగ్ ఎలా ఉంది? కొత్తగా కల్పించిన సౌకర్యాలు వంటి అంశాలపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించారు. ఎన్ఎంసీ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్న 26 కళాశాలల్లో కొత్తగా ఏర్పాటైన 8 కళాశాలల్లో ములుగు, జనగాం వంటి కొన్ని చోట్ల మినహా మిగతా అన్ని చోట్ల మౌలిక వసతులు కల్పించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఎన్ఎంసీ అధికారులకు వివరించి, ఏ ఒక్క కళాశాలలో కూడా సీట్ల సంఖ్య తగ్గకుండా, అవసరమైన చోట్ల పెంచుకునేందుకు అవకాశం పొందేలా ఒప్పించాలని నిర్ణయించారు. నోటీసులు రొటీన్ ప్రక్రియే: ఎన్ఎంసీ నోటీసు నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంఎస్ఎంఈఆర్ మార్గదర్శకాల విషయంలో ఏమాత్రం తేడా వచ్చి నా ఎన్ఎంసీ కొర్రీలు పెడుతుందని అధికారులు సీఎంకు వివరించారు. పశి్చమబెంగాల్లో ఉన్న మొత్తం 27 ప్రభుత్వ కళాశాలలు ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారని గుర్తుచేశారు. ఏపీలో మొత్తం 17, కర్ణాటకలో మొత్తం 22 కాలేజీలు, తమిళనాడులో 36కు 34 కాలేజీలు, యూపీలో 45 కాలేజీలకుగాను 24, కేరళలో 11కు 9 కళాశాలల్లో నిబంధనలు అమలు కాలేదని తేల్చి ఢిల్లీకి పిలిచినవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఏటా రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల మినహా అంతటా మెరుగైన సౌకర్యాలు ఉన్నట్లు తెలిపారు. 1,323 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను తీసుకోవడంతో పాటు ఇప్పటికే 1,500కు పైగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లలో అర్హులను బట్టి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించి ఎన్ఎంసీ నిబంధనల మేరకు నియామకాలు చేపట్టవచ్చని సీఎంకు వివరించినట్లు తెలిసింది. జిల్లా, ఏరియా ఆస్పత్రులను బోధనా ఆస్పత్రులుగా మార్చిన నేపథ్యంలో వాటిని 300 పడకల ఆసుపత్రులుగా మార్చే ప్రక్రియ కూడా జరుగుతుందని సీఎంకు తెలిపినట్లు సమాచారం. బుధవారం వైద్య అదికారులు ఢిల్లీకి వెళ్లి ఈ వివరాలన్నీ ఎన్ఎంసీ అధికారులకు వివరిస్తారు. ఎన్ఎంసీ తనిఖీలు జరిపి వెళ్లిన ఆరునెలల్లో ఫ్యాకల్టీ, వసతులు మెరుగయ్యాయని డీఎంఈ నరేంద్ర కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎన్ఎంసీ తనిఖీలు సహజం: డీఎంఈ నరేంద్రకుమార్ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు, మెడికల్ కాలేజీలలో ఎన్ఎంసీ తనిఖీలు చేయడం, నోటీసులు ఇవ్వడం సహ జంగా జరిగే ప్రక్రియ అని వైద్య విద్య సంచాలకులు నరేంద్రకుమార్ తెలిపారు. గత 4 సంవత్సరాలుగా నోటీసులు వస్తూనే ఉన్నాయని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ఈ సంవత్సరం అనేక రాష్ట్రాల్లోని కాలేజీలకూ నోటీసులు వచ్చాయని, మన రాష్ట్రంలోని కాలేజీలకు మాత్రమే నోటీసులు వచ్చినట్టుగా, నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్న ట్టుగా అపోహలు సృష్టించి, తప్పుడు ప్రచారం చేయడం సరి కాదని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకూ అను మతులు వస్తాయని, ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. -
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల క్రితం ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్న ఆర్టీసీ, ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను కూడా తీసుకునేందుకు సిద్ధమైంది. దాదాపు 800 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతానికి ఔట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకోనుంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. పూర్తి స్థాయి నియామకాల్లో ఎడతెగని జాప్యంతో... ప్రస్తుతం ఆర్టీసీలో 2 వేల మంది కండక్టర్ల అవసరముంది. రెగ్యులర్ కండక్టర్లలో దాదాపు 500 మంది ఆర్టీసీ కార్గో సర్వీసు, ఆర్టీసీ పెట్రోల్ బంకులు, సహా ఇతర పలు అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గడచిన కొన్ని నెలల్లో 1,500 మంది కండక్టర్లు ఉద్యోగ విరమణ చేయగా భారీ కొరత ఎదురైంది. ప్రస్తుతం సరిపోను కండక్టర్లు విధుల్లో లేకపోవటంతో ఉన్న వారితోనే అదనపు డ్యూటీలు చేయిస్తున్నారు. ఇది కండక్టర్లకు ఇబ్బందిగా మారింది. అదనపు డ్యూటీకి అదనపు చెల్లింపులు ఉంటున్నా, రోజుల్లో 10 నుంచి 12 గంటల పాటు పనిచేయాల్సి రావటంతో వారు తీవ్రంగా అలసిపోతున్నారు. బలవంతపు అదనపు డ్యూటీలు వద్దని చాలా రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సహా పలు ఇతర పోస్టులు కలిపి దాదాపు 4 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆయా పోస్టులను టీఎస్పీఎస్సీ, వైద్యారోగ్య శాఖ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ, కొంతకాలం ఆయా బోర్డుల నియామక కేలండర్ పేరుతో, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ఖరారు పేరుతో జాప్యం జరుగుతూ వస్తోంది. నెలలు గడుస్తున్నా ఆ భర్తీ ప్రక్రియ లేకపోవటంతో క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రెగ్యులర్ ఉద్యోగుల భర్తీ జరిగే వరకు తాత్కాలిక పద్ధతిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునేందుకు సంస్థ నిర్ణయించింది. రెండు నెలల క్రితం 1,000 మంది డ్రైవర్లను ఇదే పద్ధతిలో నియమించుకుంది. శిక్షణ పూర్తి చేసుకొని వారు విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత కండక్టర్లను కూడా అదే పద్ధతిలో నియమించుకునేందుకు కసరత్తు చేసినా, సచివాలయం నుంచి అనుమతి రాలేదు. మరోసారి విన్నవించగా, రవాణా మంత్రి కార్యాలయం తాజాగా అనుమతించింది. దీంతో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో దాదాపు 600 మంది కండక్టర్లు, వరంగల్ రీజియన్ పరిధిలో 200 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు చర్యలు ప్రారంభించింది. » ఇలా నియమితులయ్యే వారికి నెలవారీ కన్సాలిడేటెడ్ పేమెంట్ రూ.17,969గా నిర్ధారించారు. » ప్రతి అదనపు గంట ఓటీకి రూ.100, గంట మించితే రూ.200 చొప్పున చెల్లిస్తారు. » ప్రతి 6 మస్టర్ల తర్వాత వీక్లీఆఫ్ వసతి ఉంటుంది. -
మధ్యాహ్న భోజనం బాగుందా?
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యాశాఖ తనిఖీలకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో తనిఖీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను సంసిద్ధం చేస్తోంది. ఇవి ఆకస్మిక తనిఖీలు చేపడతాయి. మధ్యాహ్న భోజన నాణ్యత, అందిస్తున్న తీరు, గతంలో ఎదురైన అనుభవాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించిననేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో భోజన నాణ్యతకు పాఠశాల ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేయాలని ప్రభుత్వం సూచించింది. భోజనం వంట దగ్గర్నుంచి, భోజన శాలల్లో పరిశుభ్రత పాటించడం వరకు హెచ్ఎంలే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎక్కడైనా తేడా వస్తే ఈ విద్యాసంవత్సరంలో హెచ్ఎంలకు చర్యలు తప్పవని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆహారం కలుషితమైనా, నాణ్యత తగ్గినట్టు తేలినా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. – సాక్షి, హైదరాబాద్నాణ్యత ఎలా? గత సంవత్సరం అనేక చోట్ల ఆహారం కలుషితమై, విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు రాజకీయ దుమారం రేపాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మధ్యాహ్నం భోజనంలో నాణ్యత, శుభ్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే, అవసరమైన బడ్జెట్ లేకుండా ఆశించిన పురోగతి ఎలా సాధ్యమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజూ మెనూ మార్చాలి. ఏ వారం ఏం పెట్టాలనే మెనూను పాఠశాల విద్య ఖరారు చేసింది. అన్నం, పప్పుచారు, బిర్యానీ, అరటి పండ్లు, గుడ్లు ఇలా రోజుకొకటి అందించాలి. 1–5 తరగతుల విద్యార్థులకు గుడ్డుతో కలిపి ఒక్కొక్కరికి రూ.8.69.. 6–8 తరగతుల వారికి రూ.11.79.. 9–10 తరగతుల విద్యార్థులకు రూ.11.79 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి రూ.99,22,56,492.5 బడ్జెట్ ఇస్తున్నారు. ఇంకా రూ. 38,10,38,935 అదనంగా ఇస్తే తప్ప నాణ్యమైన భోజనం అందించడం సాధ్యం కాదని రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం ఇంత వరకూ స్పష్టత ఇవ్వలేదు. ఒకవైపున నిత్యావసరాలు పెరుగుతుంటే సరిపుచ్చడం ఎలా అని హెచ్ఎంలు అంటున్నారు. ఏం జరిగినా తమనే బలి చేయడం సరికాదని విన్నవిస్తున్నారు. ప్రతి రోజూ నివేదిక రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లున్నాయి. వీటిల్లో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుంది. ఏ రోజు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు? మధ్యాహ్న భోజనంలో ఏయే పదార్థాలు వినియోగించారు? వాటిని ఎక్కడ? ఎప్పుడు కొనుగోలు చేశారు? అనే వివరాలను హెచ్ఎంలు ఆన్లైన్లో పొందు పర్చేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. వీటిని మండల విద్యాశాఖాధికారి పర్యవేక్షిస్తారు. హెచ్ఎంలు పంపే వివరాలను ఎంఈవో పరిశీలించి, జిల్లా విద్యాశాఖాధికారి, అక్కడి నుంచి పాఠశాల విద్య డైరెక్టరేట్కు పంపుతారు. ఇందులోనే బియ్యం, నిత్యావసరాల నిల్వలను పేర్కొనాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంఈవోలు వారానికి కనీసం మూడు స్కూళ్లను పరిశీలిస్తారు. మధ్యాహ్న భోజనం అందించేటప్పుడు నేరుగా నాణ్యతను పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర స్థాయిలోని ప్రత్యేక బృందాలు స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తాయి. ఎక్కడన్నా లోపాలుంటే తక్షణమే చర్యలు తీసుకునే వీలుందని అధికారులు తెలిపారు. -
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాకక్షి,హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ పేరిట మహేష్ కుమార్ గౌడ్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహేష్ కుమార్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన
హైదరాబాద్: గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. తాజాగా సంచలన ప్రకటనతో మరొకసారి వార్తల్లోకి వచ్చారు. ఇక ఐక్యంగా కలిసి పని చేద్దామంటూ రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం(జూన్ 17) రాజాసింగ్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ‘పార్టీలో ఐక్యత, పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కానీ నన్ను టార్గెట్ చేసి అడ్డంకులు సృష్టించాలని చూసినా నిస్వార్థంగా పార్టీ కోసమే పని చేశా. ఒక పార్టీ కార్యకర్తనైన నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం?. కిషన్రెడ్డి వ్యక్తిగత సమయం ఇస్తే వచ్చి కలుస్తాను. సమస్యలు, పార్టీలో మా స్పష్టతను వివరిస్తాను. సమయం నిర్ణయించే చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నా. విభజించడానికి కాదు.. ఐక్యత కోసం ఇక్కడ ఉన్నా. వ్యక్తిగత విభేధాలను విడిచిపెట్టి ఐక్యంగా పని చేద్దాం’ అని రాజాసింగ్ తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ సాక్షిగా సిట్ ముందు హాజరయ్యారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లారు. 2023లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేశ్గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన పలుమార్లు ఇప్పటికే ఆరోపించారు.తాను కూడా ఫోన్ట్యాపింగ్ బాధితుడినేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్ ఏం చెప్తారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మహేష్కుమార్ గౌడ్ సిట్ కార్యాలయానికి చేరుకోగా.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు హడావుడి చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. బయటకు పంపించారు.2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది: మహేష్ గౌడ్సిట్ ముందు హాజరైన అనంతరం మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు బయటకువచ్చాయన్నారు. 2018లో ఫోన్ ట్యాపింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. గత ప్రభుత్వంలో అధికారులు నేతల కనుసన్నల్లోనే పనిచేశారు. ఫోన్ ట్యాప్తో రాజకీయ లబ్ధి పొందారు’’ అని మహష్ గౌడ్ ఆరోపించారు. -
అమ్మ లేదని.. ఇక తిరిగి రాదని తెలియక..
మహబూబాబాద్ రూరల్ : మేకను కొనేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా సమీపంలో చోటుచేసుకుంది.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని బయ్యారం మండలం జగత్ రావు పేట జీపీ పరిధిలోని బోటి తండాకు చెందిన మాలోత్ సురేశ్, అతడి అన్న గణేశ్, వదిన అమలాదేవి (27), వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల గౌతమ్, ఏడాదిన్నర వయసుగల గగన్, అక్కాబావ బానోత్ రంగ్య, మంజుల ఓ ఆటోలో కురవి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా దాటుతుండగా ముందునుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అమలాదేవికి తీవ్ర, మిగతా వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 108 వాహనం క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అమలాదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. కాగా, మంగళవారం తమ ఇంటి వద్ద ఎల్లమ్మ పండుగ చేసుకోనున్న నేపథ్యంలో కురవిలోని అంగడిలో మేకను కొనుగోలు చేయడానికి వారంతా ఆటోలో వెళ్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు. కుమారులు గౌతం, గగన్.. తల్లి అమలాదేవి కనిపించకపోవడంతో వెక్కివెక్కి ఏడుస్తుండగా వారిని ఆపడం ఎవరితరం కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కురవి ఎస్సై గండ్రాతి సతీశ్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
అటో పర్మిట్ ఇక అన్లైన్లో..
సాక్షి, హైదరాబాద్ : కొత్త ఆటో పర్మిట్లకు ఇక ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రవాణాశాఖ వెబ్సైట్లో అవకాశం కల్పిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి అన్ని విధాలుగా అర్హతలు కలిగిన ఆటోడ్రైవర్లకు ప్రొసీడింగ్స్ (అనుమతులు) ఇస్తారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఎక్కడైనా ఆటోరిక్షా కొనుగోలు చేసుకోవచ్చు. పర్మిట్లపైన ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా, బ్లాక్ దందాకు అవకాశం లేకుండా పారదర్శకమైన విధివిధానాలను రూపొందించేందుకు రవాణాశాఖ దృష్టి సారించింది. గతంలో కొంతమంది డీలర్లు, ఫైనాన్షియర్లు కలిసి పెద్దఎత్తున దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బినామీ పేర్లపైన ఆర్టీఏ నుంచి అనుమతులు తీసుకొని పరి్మట్లను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆటోరిక్షాలపైన కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచారు. అప్పట్లో కొందరు రవాణా అధికారులు సైతం ఇందుకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫైనాన్షియర్లు నిరుపేద ఆటోడ్రైవర్లపైన నిలువుదోపిడీకి పాల్పడ్డారు. అప్పటి పరిణామాలు మరోసారి పునరావృతం కాకుండా అరికట్టేందుకు ఈసారి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో కేవలం హైదరాబాద్లోనే కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది. దీంతో కొనుగోలుదార్లు డీలర్ల డిమాండ్ మేరకు ఆటోధర కంటే రెట్టింపు ధర చెల్లించవలసి వచ్చింది. ఈసారి తెలంగాణలో ఎక్కడైనా సరే కొనుక్కొనేందుకు అవకాశం కల్పించడం వల్ల షోరూమ్ ధరలకే ఆటోలు లభించే అవకాశం ఉంటుంది. ఔటర్ రింగ్రోడ్డు వరకు 65 వేల కొత్త ఆటో పరి్మట్లకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త పర్మిట్లపైన ఆంక్షలను సడలించారు. ఈ ఆటోల్లో 25 వేల వరకు పెట్రోల్, డీజిల్ నుంచి ఎల్పీజీ, సీఎన్జీలోకి మార్చుకొనేందుకు రిట్రోఫిట్మెంట్కు అవకాశం కలి్పస్తారు. మరో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల ఎల్పీజీ, మరో 10 వేల సీఎన్జీ ఆటోలకు పరి్మట్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో సుమా రు 1.4 లక్షల ఆటోలు తిరుగుతున్నాయి. కొత్త పరి్మట్ల వల్ల ఆటోల సంఖ్య 2 లక్షలు దాటనుంది. గ్రేటర్ నివాసి అయితే చాలు... కొత్తగా ఆటోలు కొనుగోలు చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తున్నట్లు ఆధార్ వంటి ధృవపత్రాలను కలిగి ఉండాలి. ఇంటి చిరునామా, వివరాలను అధికారులకు అందజేయాలి. అలాగే త్రీవీలర్ ఆటోడ్రైవింగ్ లైసెన్స్, లైట్మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వాళ్లకు మాత్రమే ఆటో కొనుగోలు చేసేందుకు అనుమతినిస్తారు. ఒక డ్రైవర్కు ఒక్క ఆటోకు మాత్రమే పర్మిషన్ ఇచ్చేవిధంగా నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఒకే డ్రైవింగ్ లైసెన్స్, ఒకే చిరునామాపైన పదుల సంఖ్యలో పరి్మట్లను పొందిన కొందరు వాటిని అధికధరలకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. ఈసారి అలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్లు ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు కొత్త ఆటోపరి్మట్లపై విధివిధానాలను రూపొందించేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ జేటీసీ రమేష్ నేతృత్వంలో అధికారుల సమావేశం జరిగింది. పరి్మట్లను పారదర్శకంగా ఇచ్చేందుకు తీసుకోవలసిన చర్యలపైన విస్తృతంగా చర్చించారు. ఆటో పర్మిట్లపై విధివిధానాలపైన త్వరలో రవాణాకమిషనర్ నిర్ణయం తీసుకోనున్నారు.ఫైనాన్షియర్ల పరి్మట్ దందా.... నగరంలో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని భూరేలాల్ కమిటీ సిఫార్సుల మేరకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆటోలపైన ఆంక్షలు విధించింది. అదే సమయంలో కాలం చెల్లిన ఆటోల పరి్మట్లపైన కొత్తవి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో కొందరు ఆటోమొబైల్ డీలర్లు, ఫైనాన్షియర్లు పాత పపర్మిట్లను తమ గుప్పిట్లో పెట్టుకొని అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఆటో రిక్షా ధరతో సంబంధం లేకుండా కేవలం పాతపర్మిట్ను రూ.50 వేల చొప్పున విక్రయిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గతంలో రెండుసార్లు ఆంక్షలను సడలించి సుమారు 25 వేల వరకు కొత్త పర్మిట్లను ఇచ్చారు. ఈ కొత్తవాటిని సైతం ఫైనాన్షియర్లే బినామీ పేర్లపైన కొట్టేసి రూ.కోట్లు ఆర్జించారు. ఈ సారి ప్రభుత్వం 65 వేల ఆటోలకు అనుమతినిచి్చంది.ఆర్టీఏ నిఘా అవసరం..ఈసారి పర్మిట్ల కోసం పటిష్టమైన విధివిధానాలను రూపొందించడమే కాకుండా వాటి అమలుపైన నిఘాను ఏర్పాటు చేయడం అవసం. రవాణాశాఖ కేవలం గైడ్లైన్స్ రూపొందించడం వరకే పరిమితమైతే ఏకంగా 65 వేల ఆటోపరి్మట్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తాయి. దాంతో యథావిధిగా మరోసారి ఫైనాన్షియర్లు, డీలర్లు కలిసి బ్లాక్ దందా కొనసాగించే అవకాశం ఉంది. -
థ్యాంక్యూ.. ఎస్ఐ సార్..
ఖైరతాబాద్: తప్పిపోయి తిరుగుతున్న 8 సంవత్సరాల బాలుడిని ఎస్ఐ నాలుగు గంటల పాటు వెంటపెట్టుకొని వివరాలు సేకరించి ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సయంలో కేర్ హాస్పిటల్ సమీపంలో రోడ్డుపై ఏడుస్తూ ఉన్న బాలుడిని స్థానికులు ఖైరతాబాద్ పెట్రోలింగ్ వాహన సిబ్బందికి అప్పగించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కనకా శ్రీరాములు బాలున్ని తన ద్విచక్రవాహనంపై ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ సుమారు 5 గంటల పాటు బాలున్ని మచ్చిక చేసుకొని వివరాలు సేకరించారు. చివరకు రాత్రి 8.30 గంటలకు బాలున్ని బంజారాహిల్స్ రోడ్నెం 12లోని శ్రీరాంనగర్ కాలనీలో ఉంటున్న తల్లి దండ్రులకు అప్పగించాడు. బిహార్కు చెందిన చందన్ భార్యతో కలిసి నగరానికి వచ్చి ఓ ప్రైవేటు హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు రెండవ సంతానమైన ఆశిష్ కుమార్ సోమవారం స్నేహితులతో కలిసి ఆడుకుంటూ తప్పిపోయాడు. కనిపించకుండా పోయిన బాబుకోసం వారు సాయంత్రం నుంచి వెతుకుతున్నారు. అంతలోనే ఎస్ఐ నేరుగా బాబును తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఎస్ఐ శ్రీరాములకు కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్, 9 రోజుల్లో 9వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ
-
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
స్టేషన్ఘన్పూర్: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్ స్కూల్లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ, కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన ప్రేమజంట కోటె వినయ్కుమార్(25), మచ్చ శృతి(23) ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే వినయ్కుమార్, శృతి ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సోమవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగినమిలిగొండ గ్రామానికి చెందిన కోటె రాజయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్కుమార్, మచ్చ కుమారస్వామి, రేణుక దంపతుల కుమార్తె శృతి బాల్యం నుంచే స్నేహితులు. శృతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లో విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వినయ్కుమార్ జనగామ పిన్కేర్ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతోపాటు శృతికి ఇంటిలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న వినయ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఎప్పటికీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆవేదనతో ఇద్దరు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు భువనగిరిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను వేర్వేరుగా అంబులెన్స్లలో గ్రామానికి తరలించారు. వారివారి ఇళ్ల వద్దకు మృతదేహాలను చేర్చగానే మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించాయి. ఛిద్రమైన మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. అనంతరం శృతి, వినయ్కుమార్ల అంత్యక్రియలు వేర్వేరుగా వారి కుటుంబసభ్యులు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్సై వినయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు చేపట్టారు. -
టచ్లో ఉండకండి
కర్ణుడి కవచ కుండలాల్లా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన శరీరంలోనూ ఒక భాగంగా మారిపోయింది. ఫోన్ ఉంటేనే అన్ని అవయవాలూ ఉన్నట్లు! ఫోన్ చూస్తుంటేనే అన్ని అవయవాలూ బాగా పని చేస్తున్నట్లు! నిద్రలోను, మెలకువలోను మన మైండ్ ఫోన్ మీదే. ఫోన్కి ఇంతగా ‘కట్టు బానిస’అయిపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా ఫోన్ని వదల్లేకపోతున్నాం.అది మన తప్పు కాదు. ఫోనే మనల్ని వదలటం లేదు. మరి దీనికి పరిష్కారం లేదా? లేకనేం, ‘డిజిటల్ డీటాక్స్’ఉంది అంటున్నారు వైద్య నిపుణులు, సైకాలజిస్టులు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం, అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్తో కలిసి బెంగళూరులో ‘బియాండ్ స్క్రీన్స్’అనే కార్యక్రమాన్ని చేపట్టింది.డ్రగ్స్కి బానిసలు అయినట్టే.. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి డిటిజల్ ఉపకరణాలు, ముఖ్యంగా అందులోని సోషల్ మీడియాకు బానిసలైనవారికి కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా విద్య, ఉపాధి వంటి అంశాల్లో తాత్కాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలూ చూపిస్తారు. మనం డిజిటల్ ఉపకరణాలకు ఎంతగా బానిసలు అయిపోతున్నామో చెప్పేందుకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. దీనికి పరిష్కారమే డిజిటల్ డీటాక్స్.స్క్రీన్పై ఈదులాట తగ్గాలి ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, రీల్స్, షార్ట్స్, యూట్యూబ్.. ఈ ప్రపంచంలోకి అడుగుపెడితే ఒక పట్టాన మనల్ని బయటపడనివ్వదు. ఇదో మాయాలోకం. ఫోన్లో చార్జింగ్ అయిపోయేంత వరకు స్క్రీన్పై ఈదులాట సాగుతూనే ఉంటుంది. తలనొప్పిగా ఉన్నది గమనించం. కళ్లు మసక బారుతున్నదీ పట్టించుకోం. నిస్సత్తువ, నిస్తేజం అన్నవి స్క్రీన్ని అన్నేసి గంటలు చూడటం వల్లనే అనీ గుర్తించం. అందుకే ‘డిజిటల్ డీటాక్స్’అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. వీకెండ్లో ‘పీస్ ఆఫ్ మైండ్’ డిజిటల్ డీటాక్స్ అంటే నెమ్మదిగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ని చూసే టైమ్ని తగ్గించుకోవటం. తద్వారా అనారోగ్యాల ముప్పునుంచి తప్పించుకోవటం. మన చేతిలో పట్టే ఫోన్ని మన మెదడును అప్పగించేసి బానిసలు కాకుండా ఉండటం. మనకు వారాంతంలో ఎలా సెలవో అలాగే గ్యాడ్జెట్లకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి. వీకెండ్లో ముఖ్యమైన పనులు తక్కువగా ఉంటాయి డిజిటల్ డీటాక్స్ మొదటి దశకు ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి.డిజిటల్ డీటాక్స్ కూడా సాధనేడిజిటల్ డిటాక్స్లో భాగంగా ముందుగా డిజిటల్ ఉపకరణాలను దూరంగా పెట్టాలి. అత్యవసరమైతే తప్ప వాటి జోలికి పోకూడదు. నిజానికిది అంత సులభమైన సాధన కాదు. ప్రారంభంలో ఏమీ తోచదు. ఎందుకంటే అలవాటైపోయిన ప్రాణం కదా. ఒంటరిగా ఉన్నట్లనిపిస్తుంది. నోటిఫికేషన్లు ఏమైనా వచ్చి ఉంటాయా అన్న ఆసక్తి, ఆందోళన మనసును పీకుతుంటుంది. స్థిమితంగా ఉండలేం. ప్రపంచంలో జరిగే అతి ముఖ్యమైన సంఘటనలు మిస్ అవుతున్నామన్నంత ఆరాటం ఉంటుంది. కానీ, ఏమీ ఫర్వాలేదు. అలవాటు అయ్యాక మాత్రం తేలిగ్గా చేయగలుగుతాం. ఫోన్ని స్విచాఫ్ చెయ్యక్కర్లేదు. ఫోన్ మీద నుంచి మనసును స్విచాఫ్ చేసుకుంటే చాలు. పక్కా ప్లానింగ్తో.. ⇒ అలాగే డీటాక్సింగ్ సమయంలో మనం చేయవలసిన పనులు ముందే అనుకుంటే మనసు ఫోన్ మీదకు మళ్లదు. ⇒ ఉదయం పూట ఖాళీ దొరికితే జిమ్కు వెళ్లొచ్చు. ⇒ పార్కులో రోజూ ఫోన్ లేకుండా రన్నింగ్, వ్యాయామం, యోగా వంటివి ఒక్కరైనా, నలుగురితో కలిసైనా చేయండి. ⇒ స్నానం చేశాక మీకు నచి్చన ఆలయానికి వెళ్లండి. ⇒ ఇంటి పనుల్లో మీ శ్రీమతికి, కుటుంబ సభ్యులకు సాయం చేయండి. ⇒ కొత్తకొత్త రకాల మొక్కలను పెంచండి. ⇒ మీ స్నేహితులకు ఫోన్ చేసి గెట్ టుగెదర్ ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ, అందరూ ఫోన్లు పక్కన పెట్టేయాలన్న కండిషన్ పెట్టుకోండి. ⇒ మంచి పుస్తకం చదవండి. ఆన్లైన్లో కాదు.. కొని, చదవండి. లేదంటే ఎవరి దగ్గర నుంచైనా తీసుకుని చదవండి. ⇒ ధ్యానం అలవాటు చేసుకోండి. ⇒ మీకు బాగా దగ్గరివాళ్లు లేదా మనసుకు నచి్చన వాళ్లతో రెస్టారెంటుకు భోజనానికో, పార్కుకో, షాపింగుకో వెళ్లండి. ⇒ స్నేహితులూ, పిల్లలతో కలిసి క్రికెట్ లాంటి ఆటలు ఆడండి. ⇒ కనీసం ఏడాదికి ఒకసారి.. ఒక అనాథాశ్రమం లేదా వృద్ధాశ్రమంలో ఒక రోజు పూర్తిగా గడపండి. ⇒ మనసుంటే మార్గం ఉంటుంది. ఇలాంటి జాబితాను ఎవరికి వారు వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తయారుచేసుకోవచ్చు.డిజిటల్ డిటాక్స్ ప్రయోజనాలు ⇒ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తేజాన్ని పుంజుకుంటుంది. ⇒ మైండ్లోంచి పెద్ద లోడ్ ఏదో దిగినట్లు అనిపిస్తుంది. ⇒ సోషల్ మీడియా తెచ్చిపెట్టే ఆదుర్దా, ఆందోళన, అసహనం అన్నీ మాయం అవుతాయి. ⇒ మెదడుకు పని చెప్పడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ⇒ కుటుంబ సభ్యులతో గడపటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో గ్రహిస్తాం. ⇒ రోజూ వందల కొద్దీ సోషల్ మీడియా పోస్టులు, వీడియోల వంటివి చూడటం వల్ల మన మెదడు ఒక విషయం మీద ఫోకస్ చేయలేదు. అదే అన్నీ ఆపేస్తే.. మన ఆరోగ్యం, భవిష్యత్తు, మనకు కావాల్సిన వారి గురించి ఆలోచించడం.. ఇలాంటి విషయాలమీద శ్రద్ధ పెట్టవచ్చుమన పెద్దలే గురువులు నిజానికి డిజిటల్ డీటాక్స్ ఎలా చేయాలో ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దనాన్నలు లాంటి పెద్దవాళ్లను ఎవరిని అడిగినా చెప్తారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిపోయినా వాళ్లకు అనవసరం. వాళ్లు చేయాల్సిన పనులు శ్రద్ధగా, కచి్చతంగా చేసేవాళ్లు. కుటుంబ సంబంధాలు చక్కగా నెరిపేవాళ్లు. బంధువుల కుటుంబాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకూ హాజరయ్యేవారు.అక్కడ అందరితోనూ కలిసి మాట్లాడేవారు. ఇప్పటిలా.. నలుగురూ కలిసినా ఒక్కొక్కరూ ఒక్కో ఫోను పట్టుకుని.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేవారు కాదు. అలాంటి వాళ్లు లేరు అంటారా.. అయితే మీకు మళ్లీ ఫోన్లోని డిజిటల్ డీటాక్స్ యాప్లే శరణ్యం. అవి : డిజిటల్ డీటాక్స్ డ్రాగన్స్, ఆఫ్టైమ్, ఆఫ్్రస్కీన్, హెడ్స్పేస్, యాప్డీటాక్స్.పర్వదినాల్లో జైనులు... మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాల్లోని జైనులు.. ‘పర్యూషణ్ పర్వ్’అనే ఆధ్యాతి్మక కార్యక్రమంలో భాగంగా డిజిటల్ డిటాక్స్ చేపడుతున్నారు. కొందరు పూర్తిగా ఫోన్లు స్విచాఫ్ చేస్తే.. మరికొందరు ఆ రోజంతా వాట్సాప్ వాడకుండా ఉంటున్నారు. అహ్మదాబాద్లోని జైనులు మరో అడుగు ముందుకేసి, ఒక పోటీ కూడా పెట్టారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఏవీ వాడకూడదని నిబంధన పెట్టారు. దీనికి ట్యాగ్లైన్..‘మొబైల్ ఫోన్ ఒక మంచి సేవకుడు. అదే సమయంలో ప్రమాదకరమైన గురువు కూడా’. 50 రోజులపాటు ఇలా డిజిటల్ డిటాక్స్ చేసి విజేతలుగా నిలిచిన 10 మందికి ఝార్ఖండ్లోని వారి పవిత్ర క్షేత్రానికి ఉచిత తీర్థయాత్ర ఆఫర్ ఇచ్చారు. -
..మా ఊరొచ్చింది ఏనుగు!
‘ఏనుగమ్మ ఏనుగు.. మా ఊరొచ్చింది ఏనుగు’ అని భలే సంబరపడిపోతున్నారు అమెరికన్లు. చూడటానికి పరిమాణంలోనూ, రాజసంలోనూ అచ్చం గజరాజుల్లా జీవం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఇవన్నీ చెక్కతో చేసినవి. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా 100 బొమ్మలు! ఆసియాలో వన్యప్రాణుల పరిరక్షణకు పనిచేస్తున్న యూకేకు చెందిన ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ అనే స్వచ్ఛంద సంస్థ ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్’ పేరుతో వినూత్నంగా నిధుల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కుంజర సమూహం యూఎస్లోని ప్రముఖ నగర వీధుల్లో జనానికి వింత అనుభూతిని కలిగిస్తోంది. ప్రదర్శన మాత్రమే కదా, గొప్ప ఏముంది అని కొట్టిపారేయకండి.. ఎందుకంటే ఇవి మనదేశంలోనే రూపుదిద్దుకున్నాయి.మనదేశంలోని ఆసియా ఏనుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినవి. అలాంటి ఏనుగులు రైలు ఢీకొట్టడం, విద్యాదాఘాతాల వంటివాటి వల్ల మరణించడం చూసి తట్టుకోలేక వాటికోసం 2002లో అప్పటి జైపూర్ రాజకుటుంబం, బ్రిటన్కు చెందిన ప్రముఖ ఫైన్షాయర్ సర్ ఎవలిన్ డి రాస్చైల్డ్ సంయుక్తంగా ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ని ఏర్పాటుచేశాయి. ఈ సంస్థ ఏనుగుల సంరక్షణలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ఒకటి ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’. ఈ ప్రాజెక్టు కోసం.. భారత్లో తయారైన ఈ భారీ ఏనుగుల బొమ్మలు ఇప్పుడు అమెరికన్లు కట్టిపడేస్తున్నాయి.ఖరీదు కాస్త ఎక్కువే!ప్రదర్శన అంటే కేవలం చూడటమే కాదు.. ఔత్సాహికులు తమకు నచ్చిన బొమ్మను బుక్ చేసుకోవచ్చు కూడా. ఏనుగు పిల్ల నుంచి భారీ కరిరాజు వరకు శిల్పులు నాలుగు రకాల బొమ్మలు తయారుచేశారు. వీటి ధరలు రూ.6,88,000లతో మొదలై రూ.18,92,000 వరకు ఉన్నాయి. బొమ్మ తయారుచేసి, ఇవ్వడానికి 4–6 నెలల సమయం పడుతుందని ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ సంస్థ చెబుతోంది. తమిళనాడు నీలగిరిలోని గూడలూర్కు చెందిన 200 మంది స్థానిక గిరిజన కళాకారుల సంఘం ‘కో ఎగ్జిస్టెన్ ్స కలెక్టివ్’ చేతిలో ఇవి రూపుదిద్దుకున్నాయి. నీలగిరి ప్రాంతంలో తిరిగే ఏనుగులను పోలిన ఈ బొమ్మలను.. శిల్పులు అయిదేళ్లు శ్రమించి తీర్చిదిద్దారు.నగరాల వారీగా..గజరాజుల శిల్పాలను అమెరికా అంతటా తిప్పి, ప్రదర్శనలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2024 జూలైలో న్యూపోర్ట్తో మొదలై న్యూయార్క్ సిటీ, మియామీ బీచ్, హ్యూస్టన్ లలో ఎగ్జిబిషన్ జరిగింది. మోంటానాలోని బ్రౌనింగ్లో జూన్ 4న ప్రారంభమైన ప్రదర్శన జూన్ 16తో ముగిసింది. పశ్చిమ యూఎస్ వయోమింగ్లోని జాక్సన్ హోల్లో మే 17 నుంచి జూన్ 20 వరకు జరుగుతుంది. జులై 1 నుంచి ఈ గజరాజులు కాలిఫోర్నియా వాసులకు కనువిందు చేయనున్నాయి.సంచరించడానికి స్థలం..లాంటానా కామరా పుష్పించే ఈ కలుపు మొక్క వేగంగా వ్యాపిస్తుంది. జలావరణాల్లో ఇవి వేగంగా విస్తరించడం వల్ల జంతువులు జనావాసాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే, ఈ మొక్కలను ఏనుగు బొమ్మల తయారీకి వాడటం ద్వారా.. వన్యప్రాణుల సంచారానికి ఎక్కువ స్థలం ఉంటుందని, అటవీ పునరుద్ధరణకు దోహదపడుతుందనేది ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ ఆలోచన. ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’ ద్వారా సేకరించే నిధులను.. మానవులు, వన్యప్రాణుల సామరస్య సహజీవనాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. -
దేవుడికీ అర్థం కారు!
సాక్షి, హైదరాబాద్: దేవుడు దిగివచ్చినా మున్సిపల్ అధికారుల తీరును అర్థం చేసుకోవడం సాధ్యం కాదని హైకోర్టు మండిపడింది. కళ్ల ముందే అంతస్తులకు అంతస్తులు భవన నిర్మాణం జరుగుతున్నా కబోదుల్లా వ్యవహరిస్తున్నారని.. తీరా నిర్మాణం పూర్తయ్యాక విధులు గుర్తుకొచ్చి కూల్చివేత అంటూ హడావుడి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులే బాధ్యులని చెప్పింది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ న్యాయవాదిపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించగా.. ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. ‘నెలల తరబడి భవన నిర్మాణమంతా పూర్తయ్యే వరకు మున్సిపల్ అధికారులు ఏం చేస్తుంటారు? ఆ ప్రాంతంలోని ఏరియా ఇన్స్పెక్టర్లు కళ్లు మూసుకుని తిరుగుతుంటారా? సెక్షన్ 461 ప్రకారం నిర్మాణం ప్రారంభంలోనే సీజ్ చేసే అధికారమున్నా ఎందుకు చేయరు? ఎవరో పిటిషన్ వేస్తే.. కోర్టు ఆదేశాలు జారీ చేస్తే.. తర్వాత స్పీకింగ్ ఆర్డర్స్ ఇస్తారు. స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చేలోపు భవన నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు కూల్చివేత అంటూ హడావుడి ప్రారంభిస్తారు.. రాష్ట్రంలో ఏటా వెలుస్తున్న అనధికార నిర్మాణాలను ఎందుకు ఆపలేకపోతున్నారు? విచిత్రమేంటంటే.. అక్రమ నిర్మాణం చేసేటప్పుడు వారికి కనిపించదు.. కానీ, పన్ను వసూలుకు మాత్రం ఆ భవనం కనిపిస్తుంది.. దాని వివరాలన్నీ తెలుస్తాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంటారు. మునిసిపల్అధికారులను దేవుడు కూడా బాగుచేయలేడు. ప్రజలకు మునిసిపల్ అధికారులు, న్యాయవాదులు, కోర్టుల గురించి తెలుసు. అధికారుల తీరు మారకపోతే భవిష్యత్లో ఇబ్బందులు తప్పవు’అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. క్రమబద్ధీకరణపై నిర్ణయం వరకు యథాతథస్థితి జీహెచ్ఎంసీ చట్టం–1955లోని సెక్షన్ 462 కింద చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నోటీసు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్కు చెందిన కె.రఘువీర ఆచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భవనం కూల్చివేస్తామంటూ అధికారులు నోటీసులు జారీ చేయడం చట్టవిరుద్ధమన్నారు. భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన నోటీసులను నిలుపుదల చేయాలని కోరారు. బీఆర్ఎస్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. చాలాప్రాంతాల్లో అక్రమ నిర్మాణదారులకు అధికారులు సహకరిస్తున్నారని, అందుకే నిర్మాణాలు పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. పిటిషనర్ సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకునే వరకు యథాతథస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను జూలై 15కు వాయిదా వేశారు. -
వైద్య కళాశాలల్లో ఏ వసతులు కల్పించాలి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస వసతులు లేవని జాతీయ వైద్యమండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 2025–26 సంవత్సరానికి ఈ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు రెన్యూవల్ చేయాలంటే.. ఈనెల 18న వైద్యశాఖ కార్యదర్శి స్వయంగా హాజరుకావాలని ఆదేశించిన నేపథ్యంలోనే కళాశాలల్లోని వసతులు, జాతీయ వైద్యమండలి పేర్కొంటున్న నియమ, నిబంధనలు వెంటనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే వైద్యారోగ్యశాఖపై ఐసీసీసీలో సోమవారం సీఎం సమీక్షించారు.ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాలల్లో తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమరి్పంచాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి. ఎంతమేర నిధులు కావాలనే దానిపై నివేదిక ఇవ్వాలన్నారు. జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి పదోన్నతులు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్గా జపనీస్ సబ్టెక్ట్ ఉండాలి నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ (జపాన్ భాష)ను ఒక ఆప్ష నల్గా నేర్పించాలని, జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మనకు మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆస్పత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమని, ప్రతినెలా మూడోవారంలో ఈ రెండు శాఖలపై సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్టరేట్ డాక్టర్ నరేందర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్లు ఇవ్వండి.. కేటీఆర్కు ఏసీబీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావును ఏసీబీ అధికారులు సోమవారం 8 గంటలకు పైగా విచారించారు. రేసు నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందాలు మొదలు, నిధుల మళ్లింపు, నిబంధనల అతిక్రమణ, విదేశీ కంపెనీతో జరిపిన లావాదేవీలు..తదితర అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సెల్ఫోన్ను సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఫోన్ ఇవ్వమని కోరగా..తీసుకురాలేదని కేటీఆర్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. దీంతో ఫార్ములా ఈ–కారు రేసు నిర్వహణకు సంబంధించి ఒప్పందాలు మొదలైన 2021 నుంచి 2024 మధ్య కాలంలో వినియోగించిన సెల్ఫోన్లు ఈ నెల 18 లోగా అప్పగించాలని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఆదేశించారు. వరుస ప్రశ్నలు..మధ్యమధ్యలో బ్రేక్ ఏసీబీ అధికారుల నోటీసుల మేరకు కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటలకు తన న్యాయవాది రాంచందర్రావుతో కలిసి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కేవలం కేటీఆర్ వాహనాన్ని మాత్రమే పోలీసులు లోనికి అనుమతించారు. కాగా సాయంత్రం 6 గంటల వరకు అధికారులు కేటీఆర్ను ప్రశ్నించారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్జోష్, జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్లతో కూడిన బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. మధ్యలో టీ బ్రేక్లు ఇచ్చారని, మధ్యాహ్నం 45 నిమిషాలకు పైగా భోజన విరామం ఇచ్చినట్టు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జనవరి 9న కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా సోమవారం నాటి విచారణలో పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. డాక్యుమెంట్లు ముందుంచి.. ఈ కేసులో ఏ–2 అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిఅర్వింద్కుమార్, ఏ–3 హెచ్ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డితో పాటు గ్రీన్కో ఏస్ నెక్ట్స్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్కుమార్ స్టేట్మెంట్లలో గుర్తించిన అంశాలు, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను, సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా గతంలో వర్చువల్గా విచారించిన సమయంలో వారిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తయారు చేసుకున్న ప్రశ్నావళి ఆధారంగా కేటీఆర్ను అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటికే సేకరించిన పలు డాక్యుమెంట్లను ముందుంచి ప్రశ్నించారు. వరుస ప్రశ్నలు వేస్తూ, డాక్యుమెంట్లను చూపుతూ వివరాలు రాబట్టారు. కేటీఆర్ చెప్పేదంతా వీడియో రికార్డింగ్ చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండగా ఏ హోదాలో ఆదేశాలు ఇచ్చారనే కోణంలో విచారణ సాగింది. మొదటి దఫా విచారణలో కేటీఆర్ ఇచ్చిన సమాచారం, కేసు దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆధారంగా క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ఖాతాలకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై, అనధికారింగా ఈ నగదు బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయాలపై మరోసారి ప్రశ్నించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ గ్రీన్కో కంపెనీ కొనుగోలుపైనా ఆరా తీసినట్టు తెలిసింది. కాగా అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్కు ఏసీబీ అధికారులు సూచించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ శ్రేణుల హడావుడి..ఉద్రిక్తత కేటీఆర్ విచారణకు బంజారాహిల్స్ వస్తుండడంతో పాటు అక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్లో అదే సమయంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ను అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే పోలీసులు వారిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ముందే అడ్డుకున్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పక్కనే ఉన్న నీలోఫర్ కేఫ్లోకి వెళ్లడంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో నీలోఫర్ కేఫ్తో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను పోలీసులు కాసేపు మూసివేయించారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: జూలైలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని వారు గమనిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లో అందుబాటులో ఉన్న మంత్రులతో, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో సీఎం 45 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు.జరగని నిర్ణయాలను ముందుగానే ప్రకటించడం వల్ల ప్రజల్లో పలుచన అవుతామని స్థానిక సంస్థల ఎన్నికలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్కలు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సుతిమెత్తగా మందలించారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. మంత్రులు టార్గెట్లు పెట్టుకుని మరీ పని చేయాలని, స్థానిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పర్యటనలో ఉన్న కొండా సురేఖ మినహా మంత్రులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్ని ఎకరాలున్నా రైతుభరోసా!: ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులతో రేవంత్ చర్చించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెలాఖరు వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.రైతు భరోసా విషయంలో రాజీ పడేది లేదని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతున్నందున ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా వేద్దామని ఆయన అన్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికల గురించి బయట మాట్లాడేదాని కంటే, ప్రజలకు తామిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించడంపైనే దృష్టి పెట్టాలని అన్నట్టు తెలిసింది. జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని, బీఆర్ఎస్ బలం కొద్దో గొప్పో ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి పనిచేయాలని సూచించారని సమాచారం. బనకచర్లపై కేంద్రంతో తేల్చుకుందాం.. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రంతోనే తేల్చుకుందామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ప్రీ ఫీజబులిటీ నివేదికను సమర్పించడం, దానికి డీపీఆర్ను సమర్పించాలని కేంద్రం కోరడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బనకచర్లకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వద్దామని అన్నట్లు తెలిసింది. -
తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు ఇస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 70.11 లక్షల మంది రైతులకు చెందిన 1.49 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు విడుదల చేస్తూ కంప్యూటర్ బటన్ నొక్కారు. కేవలం 9 రోజుల్లో రైతులందరికీ మొత్తం రూ.9 వేల కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. తొలిరోజు సోమవారం 2 ఎకరాల లోపు 41,25,289 మంది రైతులకు రూ.2,349.83 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. 39.16 లక్షల ఎకరాలకు గాను ఈ డబ్బులు జమయ్యాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్రంలోని 1,034 వేదికల్లో కొత్తగా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో వర్చువల్గా సంభాషించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతు భరోసా గురించిన ప్రకటన చేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. పదేళ్లలో వ్యవసాయాన్ని నీరుగార్చారు.. గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని నీరుగార్చారు. వరి వేస్తే ఉరే అని, వడ్లు కొనలేం అని పెద్దాయన చెప్పాడు. మేం పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పించి దొడ్డు ధాన్యంకు బదులు సన్న ధాన్యం పండించమని రైతులను కోరాం. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించాం. ఈ మేరకు రైతులు సన్న వడ్లు పండిస్తే, సన్న బియ్యం పేదల కడుపు నింపుతున్నాయి. రాష్ట్ర రైతులు ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా 2.80 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించారు. రూ.1,29,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు సర్పంచులు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. మేం అధికారంలోకి వచ్చే నాటికే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. కాంట్రాక్టర్లకు మరో రూ.60 వేల కోట్లు బకాయిలు పెట్టారు. మొత్తంగా రూ.1,29,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంటు డబ్బులు వాడుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ రూ.12 వేల కోట్లు బకాయి పెట్టి పోయారు. పదేళ్లలో రూ.8 లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంలోకి నెట్టి పోయినా, ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ సరి చేసుకుంటూ వస్తున్నాం. ఎన్ని కష్టాలు ఉన్నా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించుకున్నాం. మంత్రులందరితో చర్చించి రైతులందరికీ 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు వారి ఖాతాల్లో వేయాలని నిర్ణయించాం. రైతు ఆశీర్వాదంతోనే ఏదైనా సాధ్యం వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, చివరకు ముఖ్యమంత్రి అయినా రైతు ఆశీర్వాదం ఉంటేనే అది సాధ్యపడుతుంది. కుర్చీ బలంగా ఉంటుంది. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. రైతును రాజును చేయడం, వ్యవసాయాన్ని పండుగ చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నాం. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో రెండు విడతలుగా రుణమాఫీ కింద రైతులకు ఇచ్చింది రూ.17 వేల కోట్ల లోపే. ఊళ్లళ్ల పెళ్లిళ్లలో ఎక్కువ కటా్నల కోసం పిలగాని తండ్రులు కార్లు, మేడలు చూపించినట్లు..పెద్దాయన రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ఆనాటి గాయాలు మానలేదు. అయినా రైతుల కోసం రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, రైతుబీమా, బోనస్ కింద 18 నెలల్లోనే రూ.1,01,720 కోట్లు ఖర్చు చేశాం. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తంలో రైతుల కోసం ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దీనిపై గ్రామ సభలు పెట్టి చర్చిద్దాం. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 24 గంటల్లో డబ్బులు జమ చేశాం. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చాం. రైతులకు మేలు చేసేందుకే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. చావుల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారు రాష్ట్రంలో రైతుల కోసం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే..మొన్ననే వచ్చాడు పిలగాడు కుదురుకోనిద్దాం అని లేకుండా రాజకీయం చేస్తున్నారు. విద్యార్థులు, రైతులు చనిపోతే సంతోíÙస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆనందం పొందుతున్నారు. చావుల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవకుండా ఫాం హౌస్లో లేను. అయినా రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులు జొన్న రొట్టెలు తినాలి చిన్నప్పుడు మా ప్రాంతంలో కందులు, బుడమ కాయలు (దోసకాయలు) పండేవి. దోసకాయ కందిపప్పు కూరను జొన్నరొట్టెతో తింటే ఎంతో కమ్మగా ఉండేది. మటన్, చికెన్ కూడా పనికిరాదు. విద్యార్థులు జొన్నరొట్టెలు తినండి. మీ బట్టలు మీరే ఉతుక్కోండి. ఏ సిక్స్ ప్యాక్ ఎక్సర్సైజ్లు పనికిరావు. వరి ఒక్కటే కాదు. కూరగాయలు, కందులు, పెసర్లు వంటి మిల్లెట్లు పండించాలి. రైతులకు సబ్సిడీతో పనిముట్లు ఇస్తాం. అధునాతన పంటలు కాదు.. తాతలు, తండ్రులు పండించిన పంటలను మళ్లీ పండించాలి. కూరగాయలు పండిస్తే హైదరాబాద్లో అమ్ముకోవచ్చు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు అనుభవజ్ఞులైన రైతులతో రైతు వేదికల వద్ద పాఠాలు చెప్పించండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. -
విద్యార్థులు తగ్గుతున్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కలగడం లేదు. దీంతో ప్రభుత్వ స్కూళ్లకు మూసివేత ప్రమాదం పొంచి ఉంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 310 వరకు స్కూళ్లు జీరో ఎన్రోల్మెంట్తో మూతపడ్డాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సర్దుబాటు చేయగా దాదాపు 1,980 స్కూళ్లు మూతపడ్డాయి. ఇక విద్యా సంవత్సరంలోనూ మరిన్ని స్కూళ్లపైనా మూసివేత కత్తి వేలాడుతోంది. – సాక్షి ప్రతినిధి, నల్లగొండసిద్దిపేటలో తెరుచుకున్నస్కూళ్లుసిద్దిపేట జిల్లాలో 12 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఈసారి తెరుచుకున్నాయి. అక్కన్నపేట మండలం రేగొండ ప్రాథమిక పాఠశాల గత ఏడాది జీరో ఎన్రోల్మెంట్తో మూతపడింది. టీచర్లు గ్రామంలో అవగాహన కల్పించి 35 మంది విద్యార్థులను చేర్పించారు. ఆ పాఠశాలను ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.అత్యధికంగా వరంగల్లో మూసివేత ⇒ 2024–25 విద్యా సంవత్సరంలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. 135 స్కూళ్లు విద్యార్థుల్లేక, తక్కువ మంది (పది మందిలోపే) విద్యార్థులు ఉండటంతో టీచర్లు, విద్యార్థుల సర్దుబాటుతో అవి మూత పడ్డాయి.⇒ ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 94 స్కూళ్లు మూతపడ్డాయి. నల్లగొండ జిల్లాలో 24, మంచిర్యాల జిల్లాలో 32, ఆసిఫాబాద్లో 34, నిర్మల్లో 48, నిజామాబాద్లో 38, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 89, కరీంనగర్ జిల్లాలో 50, రాజన్నసిరిసిల్లలో 18, జగిత్యాలలో 61, పెద్దపల్లిలో 29, హనుమకొండలో 41, మహబూబ్నగర్ జిల్లాలో 48, నాగర్కర్నూల్లో 15, వనపర్తిలో 33, గద్వాలలో 4, నారాయణపేటలో 37 స్కూళ్లు మూత పడ్డాయి. మూడేళ్లలో గణనీయంగా తగ్గిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతూనే ఉండగా, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గడిచిన మూడేళ్ల గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారమే 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,09,212 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 23,71,772కు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 37,26,220కి పెరిగింది.ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన విద్యార్థులు ఖమ్మం జిల్లాలోనూ రామలింగాలపల్లి క్రాస్ రోడ్డు, ఆలియాతండా, గంగారంతండా కొత్తతండా పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఓవరాల్గా చూస్తే ఈ మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లలోనూ రెట్టింపు స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022–23లో ప్రభుత్వ స్కూళ్లలో 1,08,715 మంది విద్యార్థులు ఉంటే వారి సంఖ్య 2024–25లో 1,10,934కు పెరిగింది. ప్రైవేట్ స్కూళ్లలో గతంలో 1,22,781 మంది ఉంటే 1,26,421కి పెరిగింది. ఏటేటా పెరుగుతున్న జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఏటేటా పెరుగుతోంది. అక్కడక్కడ బడిబాటలో టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి ఒకటీ రెండు మూత పడిన స్కూళ్లను తెరిపిస్తున్నా, వందల సంఖ్యలో మూత పడుతూనే ఉన్నాయి. ⇒ 2021–22 విద్యా సంవత్సరంలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 1,086 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపునకు దగ్గరైంది. ⇒ జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 2022–23 విద్యా సంవత్సరంలో 1,307కు పెరగగా, 2023–24 సంవత్సరంలో 1,745కు, 2024–25 సంవత్సరంలో వాటి సంఖ్య 1,980కి పెరిగింది. ⇒ ఈ నెల 19 వరకు నిర్వహించే బడిబాట తర్వాత వాటిల్లో ఎన్ని తెరుచుకుంటాయో, ఈసారి ఎన్ని స్కూళ్లు మూత పడతాయో త్వరలోనే తేలనుంది. -
మాజీ మంత్రి హరీష్రావుకు అస్వస్థత
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం(జూన్ 16) సాయంత్రం సమయంలో తెలంగాణ భవన్లో హరీష్ రావు అస్వస్థతకు లోనయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆచ్.. ఏసీబీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత నిర్విహించిన సమావేశంలో హరీష్రావు స్వల్పపాటి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను అక్కడ నుంచి బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హై ఫీవర్తో హరీష్రావు ఆస్పత్రిలో చేరారు.వైరల్ ఫీవర్, డి ఐడ్రేషన్తో బాధ పడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు.. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ భవన్లోనే ఉన్నారు.సాయంత్రం 7 గంటలకు బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో హరీష్రావును జాయిన్ చేయగా, ఆయన్ను కేటీఆర్, ఇతర బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. -
‘మరో పదేళ్లు కాంగ్రెస్దే అధికారం’
సాక్షి,హైదరాబాద్: మరో పదేళ్లు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి జోస్యం చెప్పారు. ఇవాళ రైతునేస్తం వేదిక నుంచి బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధుల్ని జమచేశారు.9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా జమ చేస్తామని ప్రకటించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం. గతంలో పదవులు అనుభవించిన వాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి వీధినా నాటకాలకు బయలుదేరారు.పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు.. చేతిలో చిప్ప పెట్టారు. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు.వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించాం.మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్న బియ్యం అందించగలుగుతున్నాం. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. పదేళ్లలో 8లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనల్ని విమర్శలు చేస్తున్నారుఒక్కొక్కటిగా సరి దిద్దుకుంటూ..ముందుకు వెళుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించేందుకు ఇక్కడికి వచ్చాం.రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. 18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఏ గ్రామంలోనైనా సవాల్ విసురుదాం.. గ్రామ సభలు పెడదాం, గ్రామాల్లో చర్చ పెడదాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కల్పించాం. చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది.కొంత కాలమైనా సమయం ఇవ్వరా..? సరిదిద్దుకొనివ్వరా?. భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందం. ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం.రైతులకు సోలార్ పంపుసెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఈ వేదికగా ఆదేశిస్తున్నా. రైతులు పంట మార్పిడి చేయండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. -
‘రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను’
సాక్షి,హైదరాబాద్: ఈ-కారు కేసు.. లొట్టపీసు కేసు. సీఎం రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను. దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి మమ్మల్ని జైలుకి పెట్టాలనుకుంటున్నారు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఫార్ములా ఈకార్ రేసు కేసులో ఇవాళ కేసీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం,తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే. ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రే. నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీలో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిపొద్ది అని చెప్పాను. నువ్వు ముందుకు రా? నేను తప్పు చేయలేదు అని లై డిటెక్టర్ సిద్దం కావాలని డిమాండ్ చేశాను.కానీ రాలేదు.ఉదయం 10 గంటల నుంచి అడిగిందే అడుగుడు. అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదు. సీఎం రేవంత్ పంపిన పశ్నలే వీళ్లు అడుగుతున్నారు. వీళ్లకు పరిపాలన చేతకాదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ సాధించిన నేత కేసీఆర్, హరీష్ రావును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి నెల రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. చేయని తప్పుకు కేసిఆర్, హరీష్ రావును కాళేశ్వరం కేసులో జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. నన్ను కూడా ఈ తుపెల్ కేసుతో జైల్లో పెట్టాలని చూస్తున్నారు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా తుపెల్ కేసు అన్నారు. నాపై 14 కేసులు పెట్టారు. 14000 కేసులు పెట్టుకో. ఎవ్వడు భయపడడు.అందరూ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు సంబరాలు చేసుకుందాం. కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది: హరీష్రావు
హైదరాబాద్: చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరంటూ మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయమన్నారు. 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రటరీచ డీఎంఈలు ఎన్ఎమ్సీ ముందు హాజరు కావాలని తాఖీదులు ఇవ్వడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శమన్నారు హరీష్రావు. ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం.. ఈరోజు కమిటీ వేయడం హాస్యస్పదమన్నాఆరు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న సీఎం రేవంత్.. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్కు ఎవరు భరోసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన.. మెడికల్ కాలేజీ విద్యార్థులకు శాపంగా మారుతుందన్నారు. ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థుల జీవితాలు నిలబెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ రైతులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేయనుంది. ఈ మేరకు మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (జూన్16) 1,034 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై తెలంగాణ రైతు భరోసా విధి విధానాల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది -
కేటీఆర్పై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు జైలుకు పోవాలని కుతూహలంగా ఉన్నట్లు ఉందని సెటైర్లు వేశారు. అందుకే వీలైనంత త్వరంగా జైలుకు పంపించాలని సీఎంను రెచ్చగొడుతున్నారన్నారు. కేటీఆర్, కవిత మధ్య పోటీ నెలకొంది. కవిత జైలుకు పోయివచ్చి బీపీ ఎజెండా ఎత్తుకుంది. ఇప్పుడు నేను వెనుకబడ్డా అనుకుంటున్న కేటీఆర్.. జైలుకు పోయి పథకం రచించాలనుకుంటున్నారు. ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలనుకుంటున్నాడు’ అని మంత్రి సీతక్క విమర్శించారు. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సీతక్క మాట్లాడుతూ.. నేటి సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే తాను అన్నానని, కానీ ఎన్నికల డేట్ చెప్పినట్లు మీడియాలో ప్రచారం జరిగిందని, అది అవాస్తవమన్నారు. -
మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసిన రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన వేరొకరు మాట్లాడ్డం ఏంటని పీసీసీ ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా ఎలాంటి ప్రకటనలు చేయోద్దని, మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేతల్ని సున్నితంగా మందలించారు. -
కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుగా నిలిచారు.ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణపై కవిత స్పందించారు. కేటీఆర్ను ఏసీబీ విచారణపై కవిత మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజం. చెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదు. మా పార్టీలో లోపాలు సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోం. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడి. మా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమేరైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసింది.పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది. హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను విచారించింది. ఇప్పుడు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తోంది. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని వాఖ్యానించారు. -
జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. బీజేపీ కార్పొరేటర్ల ధర్నా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేతలు, కార్యకర్తలు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్లు, నేతలు నిరసనకు దిగారు. నగరంలో ఉన్న సమస్యలపై కమిషనర్కు వినతి పత్రం ఇస్తామన్న బీజేపీ కార్పొరేటర్లు. ప్రజా సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ మెమోరండం ఇచ్చేందుకు కార్పొరేట్లరు లోపలికి వెళ్తాన్నారు. దీంతో, 15 మందిని లోపలికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. కానీ, అందరినీ అనుమతించాలని ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆఫీసు ఎదుట బారికేడ్లు పెట్టి వారిని నిలిపివేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు బారికేడ్లు, గేట్లను ఎక్కి ఆఫీసులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. కనీస సౌకర్యాలు ఇవ్వడం చేతకాదు కానీ.. అందాల పోటీలు పెట్టడానికి కోట్లు ఖర్చు చేశారు. అందాల పోటీలకు పెట్టే ఖర్చు పెడితే.. వీధి లైట్లు, నీళ్లు రావా?. కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. ప్రజలకు కనీస అవసరాలైన నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మే 22 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం ఈ కింద లింకులను క్లిక్ చేయండి.. ఫలితాల కోసం.. TS Inter 1st Year General Supply Results 2025: https://results.sakshieducation.com/Results2025/telangana/Inter/Jr-Inter/ts-intermediate-1st-year-supply-results-2025.htmlTS Inter 1st Year Vocational Supply Results 2025: https://results.sakshieducation.com/Results2025/telangana/Inter/Jr-Inter/voc/ts-intermediate-1st-year-vocational-supply-results-2025.htmlTS Inter 2nd Year General Supply Results 2025: https://results.sakshieducation.com/Results2025/telangana/Inter/Sr-Inter/ts-intermediate-2nd-year-supply-results-2025.html TS Inter 2nd Year Vocational Supply Results 2025: https://results.sakshieducation.com/Results2025/telangana/Inter/Sr-Inter/voc/ts-intermediate-2nd-year-vocational-supply-results-2025.html -
ఇది కేసీఆర్ సైన్యం.. ఎవరూ టచ్ చేయలేరన్న కేటీఆర్ (చిత్రాలు)
-
ఏసీబీ విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలు: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏసీబీ విచారణకు వెళ్లిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విచారణకు అంత హంగామా అవసరమా?. ఏసీబీ విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. పేదోళ్ల సొమ్ము అక్రమ దారి పట్టింది.. అందుకే విచారణ జరుగుతోంది. కేటీఆర్ ఏదో జరగబోతున్నట్టుగా హల్చల్ చేస్తున్నారు. ఏసీబీ విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయి. కాళేశ్వరం, ఫార్ములా రేసుపై ఏసీబీ విచారణపై నివేదికల ఆధారంగానే చర్యలుంటాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలకు అంత హంగామా అవసరమా?.త్వరలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్లకు కట్టబడి ఉన్నాం. పెంచిన రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఎవరూ బాధపడొద్దు. ఏడాదిన్నర కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. విడతల వారీగా అర్హలైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇప్పించే బాధ్యత నాది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
భయపడను.. అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసు(Formula E-Car Race Case) లో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్పాలిటిక్స్లో భాగంగా పెట్టిన అక్రమ కేసు ఇదని.. ఇలాంటి కేసులో జైలుకు వెళ్తేందుకు కూడా తాను సిద్ధమని సోమవారం తెలంగాణ భవన్ వద్ద ఆయన ప్రకటించారు. ‘‘ పైచాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నా పైన కేసులు పెడుతున్నారు. ఆరు నెలలుగా విచారించి ఏం తేల్చారు? ఫార్ములా ఈ-రేస్ కేసులో అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. అరెస్ట్ చేసినా కూడా భయపడను. వెనక్కి తగ్గం. జైలుకు వెళ్తేందుకు కూడా సిద్ధం. నాకు జైలు కొత్తేమీ కాదు. తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిని నేను. ఫార్ములా ఈ-రేసు అంశం నాలుగు గోడల మధ్య నన్ను విచారించడం కాదు. అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని నేను చెబుతున్నా. చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయారు. రేవంత్కు ఇదే నా సవాల్.. లై డిటెక్టర్ టెస్ట్కు కూడా నేను సిద్ధమే అని కేటీఆర్(KTR) అన్నారు.అందాల పోటీలు పెట్టీ ప్రపంచం ముందు అభాసుపాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి(Revanth Reddy). కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పుకునేందుకు ఏం లేదు. రైతుబంధును కాస్త ఎలక్షన్ బంధుగా మార్చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అక్రమ కేసు. మాకు చట్టం, కోర్టు అంటే గౌరవం ఉంది. అందుకే మూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచిన విచారణకు వెళ్తాను.బీసీలకుకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటాం. దున్నపోతు ఈనింది అంటే దూడనీ కట్టేయమని బీజేపీ అంటుంది. కాంగ్రెస్-బీజేపీవి దొంగాటలు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తునే ఉంటాం. జై తెలంగాణ అంటూ ఏసీబీ ఆఫీస్కు బయల్దేరారు. అంతకు ముందు.. ఈ ఉదయం కోకాపేట నివాసం నుంచి తొలుత నందినగర్ నివాసానికి కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ హరీష్ రావు, మరికొందరు పార్టీ నేతలతో కలిసి అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆపై భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. -
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
కేటీఆర్ ఏసీబీ విచారణ అప్డేట్స్.. ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణఫార్ములా ఈ కారు రేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణహెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ అధికారుల ప్రశ్నలుఏడుగంటల పాటు సాగిన విచారణఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్కు ఏసీబీ ప్రశ్నలుకేబినెట్ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు మళ్లించారని విచారణ కేటీఆర్ స్టేట్మెంట్ణు రికార్డ్ చేసిన ఏసీబీ అధికారులుఅవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్కు సూచన కేటీఆర్ ఏసీబీ విచారణపై కవిత ఆసక్తిర వ్యాఖ్యలు కేటీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.ఏసీబీ విచారణపై కవిత స్పందించారు‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజంచెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదుమా పార్టీలో లోపాలు సవరించుకుంటాంమా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోంప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడిమా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం కేటీఆర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు. గంటలకు పైగా కేటీఆర్పై ప్రశ్నం వర్షం. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మొదలైన కేటీఆర్ విచారణ.కేటీఆర్ను ప్రశ్నిస్తున్న ఐఓ ఆఫీసర్ మాజీద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి.ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన బీఆర్ఎస్ శ్రేణులు.ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ..IAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..FEOతో ఒప్పందాలు నగదు, బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు.ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..Feo కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ. కేటీఆర్తో నలుగురి బృందం.. కేటీఆర్తో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న నలుగురు బృందం...న్యాయవాది రామచందర్ రావు, మహేందర్ రెడ్డి, తిరుపతి, మరో న్యాయవాది.10.30 గంటలకు మొదలు కానున్న కేటీఆర్ ఏసీబీ విచారణ..ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచందర్రావుఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ను విచారించనున్న ఏసీబీతెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్కు బయల్దేరిన కేటీఆర్కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ఈ-రేస్ కేసులో విచారణకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ఎఫ్ఈవో కంపెనీకి రూ. 54.88 కోట్లు బదిలీ చేయడంపై విచారణఇప్పటికే ఏసీబీ అధికారుల లోతైన దర్యాప్తుఅక్రమ కేసులకు భయపడం: కేటీఆర్అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారుఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నారు.. ఏం తేల్చారు?అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు కావొచ్చుచట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉందిమూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తాఅక్రమ కేసులకు భయపడంఅరెస్ట్ చేసినా వెనక్కి తగ్గంజైలు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాంలై డిటెక్టర్కు కూడా నేను సిద్ధం కాంగ్రెస్, బీజేపీవి దొంగాటలుడైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ కేసులురైతు బంధును.. ఎలక్షన్ బంధుగా మార్చేశారు420 గ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం లక్షలాది మంది కేసీఆర్ సైనికులను అడ్డుకోలేరుతెలంగాణభవన్ చేరుకున్న కేటీఆర్కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు.తెలంగాణభవన్ వద్ద భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలుతెలంగాణ భవన్కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.కేసీఆర్తో కేటీఆర్ భేటీ..నందిని నగర్ నివాసంలో కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు..తాజా పరిస్థితులపై చర్చ..మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్న కేటీఆర్, హరీష్ రావు.. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేటీఆర్.. కోకాపేటలో తన నివాసం నుండి తెలంగాణ భవన్కు బయలుదేరిన కేటీఆర్..మరికాసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకోనున్న కేటీఆర్..10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్..బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలు..భారీగా మోహరించి పోలీసులు..ఏసీబీ ఆఫీస్ ముందు 400 మంది పోలీసు బందోబస్తు..ఏసీబీ కార్యాలయం ఎవరిని అనుమతించని పోలీసులు👉తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.👉మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదేలేదు. మీ ఆరు గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డికి సవాల్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.I will never be deterred by your enquiries, commissions and political vendettaWe @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees Bring it on Revanth 👍 pic.twitter.com/yFUOXmoeoP— KTR (@KTRBRS) June 16, 2025👉ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ జనవరి 9వ తేదీన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాడు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. -
నేడు 1,034 రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 1,034 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో అధికారులతో కలసి సమీక్షించారు. రైతు వేదికలలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లకు మంత్రి తుమ్మల పలు ఆదేశాలు జారీ చేశారు.రైతునేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికలలో ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేశామని, విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో దాదాపు 1,500 మంది రైతులు పాల్గొంటారని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తెలిపారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఇప్పటికే 566 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించామని, ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, వ్యవసాయరంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేస్తున్నామని తెలిపారు.ఇప్పటి వరకు 6.35 లక్షల మంది రైతులు ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు ఇతర రైతుల అనుభవాలను తెలుసుకొన్నారని చెప్పారు. తాజాగా ఈ ‘వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని’, మరొక 1,034 రైతు వేదికలకు కల్పించబోతున్నామని, వీటిని ప్రారంభించాల్సిందిగా సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను వ్యవసాయ శాఖ తరఫున ఆహ్వానించామని తెలిపారు. కాగా, రైతు వేదికలకు హాజరైన రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడనున్నట్లు తుమ్మల తెలిపారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల విజ్ఙప్తి చేశారు. -
తొమ్మిదేళ్లుగా ‘పెండింగే’
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ స్టేషన్లకు శాశ్వత భవనాల నిర్మాణం ఏళ్లకేళ్లుగా పెండింగ్లోనే ఉంది. 2015–16లో రాష్ట్ర వ్యాప్తంగా 56 కొత్త ఎక్సైజ్ స్టేషన్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో కేవలం 18 మాత్రమే పూర్తి కాగా, అందులోనూ 10 మాత్రమే వినియోగంలోనికి వచ్చాయి. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ భవన నిర్మాణానికి అప్పట్లోనే రూ.40 లక్షల చొప్పున మంజూరు చేసింది.ఇందుకుగాను రూ.20 కోట్లకు పైగా నిధులు అవసరం కాగా, అందులో కేవలం రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నిధులతో 18 భవనాల నిర్మాణాలు ప్రారంభం కాగా, మిగిలిన చోట్ల స్థలాల సమస్య, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం లాంటి కారణాలు అడ్డంకిగా మారాయి. అప్పట్లో నిర్మించిన భవనాలకు సంబంధించిన రూ.3 కోట్ల పెండింగ్ బిల్లులున్నాయని, వాటిని మంజూరు చేయాలని ఎక్సైజ్ శాఖ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. స్టేషన్లు ప్రారంభించేదెప్పుడు? ఎక్సైజ్ స్టేషన్లకు భవనాల నిర్మాణం మాట అటుంచితే కొత్త ఎక్సైజ్ స్టేషన్ల ప్రారంభం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. కొన్ని ఎక్సైజ్ స్టేషన్ల పరిధి చాలా ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో కొత్త ఎక్సైజ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా, వాటి పరిధిని తగ్గించాలనే ప్రతిపాదనలు కూడా 2016లోనే వచ్చాయి. ఇందుకు సంబంధించిన జీవో కూడా అప్పుడే వెలువడింది. అప్పటి నుంచి ఎక్సైజ్ అధికారుల అలసత్వం, ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఈ స్టేషన్ల ఏర్పాటు ఆగిపోయింది. అయితే, ఇటీవల ఎక్సైజ్ అధికారులు కొంత చొరవ తీసుకొని వీటి పరిధిని నిర్ణయించడం, ఆయా స్టేషన్లకు హౌస్ ఆఫీసర్లను, సిబ్బందిని నియమించడం లాంటివి జరిగాయి.అద్దె భవనాలు అందుబాటులో ఉంటే కొత్త స్టేషన్లను కొత్త భవనాల్లో ఏర్పాటు చేయాలని, లేదంటే పాత స్టేషన్లోనే కొత్త స్టేషన్ను కూడా నడిపించాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో అధికారికంగానే బంజారాహిల్స్, మారేడుపల్లి, చిక్కడపల్లి, గండిపేట, కొండాపూర్, మీర్పేట, పెద్ద అంబర్పేట, కొంపల్లి, కూకట్పల్లి, కాప్రా, నాగారం, అల్వాల్, అమీన్పూర్, హసన్పర్తిలలో కొత్త ఎక్సైజ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. కానీ వాటిని ప్రభుత్వం ప్రారంభించడం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక కారణంతో ఒకసారి, మే, జూన్ నెలల్లో రెండుసార్లు వాయిదా పడ్డాయి. అయితే, ఇటీవల ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ నెలలోనే వాటిని ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడైనా అవి అధికారికంగా ప్రారంభమవుతాయని ఎక్సైజ్ వర్గాలు ఆశిస్తున్నాయి. -
ప్రభుత్వ బడుల్లో టెక్ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన సేవలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. దీంతో పాఠశాలల్లో ఆధునిక బోధన సదుపాయాలు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ వాణిజ్యవేత్త నందన్ నీలేకని సారథ్యంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ సారథ్యంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థలతో ఈ ఒప్పందాలు జరిగాయి. ఎంవోయూ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థలు అందించే సేవలివీ.. –ఎక్స్టెప్ ఫౌండేషన్ 540 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్పై పని చేస్తుంది. 33 జిల్లాల పరిధిలో 5వేలకుపైగా పైగా ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరిస్తుంది. మూడు నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతోపాటు మ్యాథ్స్పై బేసిక్స్ను అందిస్తుంది. –ఫిజిక్స్వాలా ఇంటర్మీడియట్ విద్యార్థులను నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాలస్థాయి నుంచే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తుంది. –ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్పై శిక్షణ ఇస్తుంది. –ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. –పైజామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్పై శిక్షణ ఇస్తుంది. –ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలను మెరుగుపరుస్తుంది. -
తెలుగువారంతా క్షేమమే
సాక్షి, హైదరాబాద్: ‘రాత్రింబవళ్లు సైరన్లు మోగుతున్నాయి. క్షిపణుల వర్షం కురుస్తోంది. అయినా ఎ లాంటి భయం లేదు. నిశ్చింతగానే ఉన్నాం’అని ఇజ్రాయెల్లో ఉంటున్న పలువురు తెలుగువారు తెలిపారు. రెండు రోజులుగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లి ఇజ్రాయెల్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. ప్రస్తుత యుద్ధం కారణంగా భయాందోళనలు నెలకొన్నాయి. యుద్ధ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్కు తిరిగివచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రవి తెలిపారు. సుమారు 1,000 మంది కార్మికులు ఇజ్రాయెల్లోని ఒక్క రమన్గాన్ ప్రాంతంలోనే ఉంటున్నట్టు చెప్పారు. 20 క్షిపణులు పడ్డాయి‘ఈ నెల 14వ తేదీ ఒక్కరోజే 2,000 క్షిపణులు ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయి. అన్నింటిని ఐరన్డోమ్లు ధ్వంసం చేశాయి. కానీ 20 క్షిపణులు మాత్రం అక్కడక్కడా పలు ప్రాంతాల్లో పడ్డాయి. దీంతో రిషోల్ లిజియో ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. వివిధ చోట్ల మరో 70 మందికి పైగా గాయపడ్డారు’అని హర్జాలియాలో ఉంటున్న చర్చి ఫాదర్ కొల్లాబత్తుల లాజరస్ తెలిపారు. ఇజ్రాయెల్లోని వివిధ నగరాల్లో స్థిరపడ్డ తెలుగువారిలో కొందరు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, యూరప్ మీదుగా ప్రయాణం చేయాల్సి రావడం వల్ల చార్జీలు పెరిగాయని లాజరస్ చెప్పారు.ఇంటింటికీ స్ట్రాంగ్ రూమ్లు..తెలుగు రాష్ట్రాల నుంచి ఇజ్రాయెల్కు వెళ్లిన వారిలో చాలామంది కేర్గివర్స్గా పని చేస్తున్నారు. వయోధికులకు సేవలు చేసేందుకు మేల్ నర్స్ తరహాలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. మహిళలు సైతం కేర్గివర్స్గా అక్కడి వృద్ధ మహిళలకు సేవలందజేస్తున్నారు. హౌస్కీపింగ్ వర్కర్లుగా కూడా చాలామంది ఉన్నారు. డ్రైవర్లుగా, సహాయకులుగా పనిచేసేవారు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. టెల్ అవీవ్కు దూరంగా ఉండే చిన్న పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు పలువురు తెలుగువారు చెప్పారు. ‘ప్రతి ఇంటికి, అపార్ట్మెంట్కు బాంబ్షెల్టర్స్, స్ట్రాంగ్రూమ్లు ఉన్నాయి. యుద్ధం మరింత తీవ్రంగా మారి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతుందని భావిస్తే బాంబ్షెల్టర్లు, స్ట్రాంగ్ రూమ్లలో తలదాచుకోవచ్చు’అని స్థానికులు తెలిపారు. -
భూగర్భ జలాలకు మేలు!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు వర్షాలతో వేసవి ముగియక ముందే రాష్ట్రంలో భూగర్భ జలమట్టాల్లో పెరుగుదల ప్రారంభమైంది. మండుటెండలు, సాగు, తాగు, ఇతర అవసరాలకు నీటి వినియోగం అధికంగా ఉండటంతో గత ఏప్రిల్ నాటికి భూగర్భ జలాల రాష్ట్ర సగటు మట్టం 10.17 మీటర్ల లోతుకు పడిపోయింది. ముందస్తుగా రుతుపవనాల రాకతో ఆ తర్వాతి మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ నెలలో రాష్ట్ర భూగర్భ జలమట్టాల సగటు లోతు 10.07 మీటర్లకు తగ్గింది. 2024 మేతో పోల్చితే 2025 మేలో 0.30 మీటర్ల పెరుగుదల కనిపించింది.వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూగర్భ జల మట్టాలు మరింతగా పెరగనున్నాయి. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ ఏప్రిల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 15 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 15.44 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 5.68 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ⇒ భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. ఒక్క జిల్లాలో కూడా 0–5 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టం లేదని గుర్తించారు. ⇒ 17 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతులో, 13 జిల్లాల్లో 10–15 మీటర్ల లోతులో, 3 జిల్లాల్లో 15 మీటర్లకి మించిన లోతులో భూగర్భ జలాలున్నట్టు తేలింది. ⇒ 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. 15 జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సాధారణానికి మించి 32% అధిక వర్షపాతం గతేడాది రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 919 మి.మీ.లు కాగా, 2024–25 నీటి సంవత్సరంలో 1,216 మి.మీ.ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే, 2024 జూన్ నుంచి 2025 మే చివరి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 32శాతం అధిక వర్షం కురిసింది.19 జిల్లాల్లో భూగర్భ జలాల వృద్ధి2024 మేతో పోల్చితే 2025 మేలో 19 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో వృద్ధి నమోదు కాగా, మరో 14 జిల్లాల్లో క్షీణత కనిపించింది. గత ఏడాది మేలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 10.36 మీటర్లు కాగా.. ఈ ఏడాది మేలో 10.07 మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 2.3 మీటర్లు, అత్యల్పంగా గద్వాల జిల్లాలో 0.05 మీటర్ల వృద్ధి నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 3.02 మీటర్లు, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 0.01 మీటర్ల క్షీణత కనిపించింది.ఈ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో..రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నైరుతి, మధ్య ప్రాంతాలు, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, నాగర్కర్నూల్ జిల్లాలోని దక్షిణాది ప్రాంతాలు, నిర్మల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని పశ్చిమ ప్రాంతాలు, భూపాలపల్లి జిల్లాలోని ఉత్తర, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయికి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మధ్య, కొన్నిచోట్ల 20 మీటర్లకన్నా లోతుకు వెళ్లిపోయినట్టు తేల్చారు. రాష్ట్ర భూభాగం ఈ ప్రాంతాల వాటా 14 శాతం కావడం గమనార్హం. -
Telangana: మూడు రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వాలి ఉండగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. శనివారం ఉత్తరాంధ్ర తీరం, దాని పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తాజాగా వాయవ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంలో విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.దక్షిణ ప్రాంత జిల్లాలతోపాటు ఉత్తర ప్రాంతంలోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రా ష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు సోమవారం కురిసే అవకాశం ఉన్న ట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 4డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
తరాలు మారి.. అంతరాలు పెరిగి..
ఈ తరం యువతకు, నిన్నటి తరం వయోధికులకు నడుమ దూరం పెరుగుతోంది. పెద్దవాళ్లను బాగా చూసుకోవడమంటే వాళ్లకు కావలసిన వైద్య సదుపాయాలను కల్పించడం, సమయానికి మందులు, భోజనం వంటివి అందజేయడమే అనే భావన పెరిగిపోతోంది. తమ భావోద్వేగాలను పిల్లలతో పంచుకోవాలని పెద్దలు ఆశిస్తుండగా, యువత మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఈ నెల 15వ తేదీన అంతర్జాతీయ వయోధికుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా హెల్పేజ్ ఇండియా ‘ప్రస్తుత డిజిటల్ యుగంలో వృద్ధాప్యంపై యువత దృక్కోణం’అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో యువత, వయోధికుల అభిప్రాయాలను సేకరించారు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 5,798 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలోని ముఖ్యాంశాలు..⇒ సర్వేలో వృద్ధాప్యం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు 56 శాతం యువత ‘ఒంటరితనం’అని, మరో 48 శాతం ‘ఇతరులపై ఆధారపడేవారు’అని బదులిచ్చారు. అపార అనుభవం కలిగినవారు అని 51 శాతం యువత పేర్కొనగా, ‘గౌరవించవలసిన వాళ్లు’అని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు. ⇒ సర్వేలో పాల్గొన్న వయోధికుల్లో 54 శాతం మంది తాము ఒంటరితనానికి గురవుతున్నట్లు చెప్పారు. 47 శాతం మంది తమ బాధలను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. ⇒ ఉమ్మడి కుటుంబాల్లో మాత్రం పెద్దవాళ్లకు, పిల్లలకు మధ్య అనుబంధాలు కొంతవరకు బలంగానే ఉన్నాయి. 49 శాతం యువత తమ తాత, ముత్తాతలతో ఎక్కువ సమయం గడుపుతున్నామని చెప్పారు. 50 శాతం మంది వృద్ధులు తమ కొడుకులతో ఎక్కువ అనుబంధాన్ని, 40 శాతం మంది తమ మనవళ్లతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నామని వెల్లడించారు. ⇒ చిన్న కుటుంబాల్లో వయోధికులకు సముచితమైన గౌరవం లభిస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న 75 శాతం వయోధికుల్లో 46 శాతం మంది కుటుంబం తమ మాట వింటుందని, మరో 28 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే వింటుందని తెలిపారు. ⇒71 శాతం వృద్ధులు సాధారణ మొబైల్ ఫోన్లు వాడుతుండగా, 13 శాతం మంది కంప్యూటర్లు, ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నట్లు తేలింది. 66 శాతం వయోధికులు మొబైల్ ఫోన్ను ‘సాంకేతిక గందరగోళం’గా భావిస్తున్నారు. ⇒ 51 శాతం యువత, 45 శాతం వయోధికులు తరాల మధ్య అతిపెద్ద అంతరం ఉన్నట్లు పేర్కొన్నారు. 57 శాతం యువత, 49 శాతం వయోధికులు మాత్రం మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చుననే ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నారు. ⇒ సర్వేలో పాల్గొన్న 86 శాతం వయోధికులు కుటుంబమే తమకు అండగా ఉందని తెలిపారు.సంతోషకరమైన వృద్ధాప్యం కావాలి జీవితంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనివార్యమైన దశ. పెద్దలను అర్ధం చేసుకోవడంలో యువత విఫలం కావడం వల్ల చాలామంది వయోధికులు సంతోషకరమైన వృద్ధాప్యానికి దూరమవుతున్నారు. కుటుంబ సంబంధాలు బలోపేతంగా ఉంటేనే ఆ సంతోషం లభిస్తుంది. – శ్యామ్, స్టేట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్, హెల్పేజ్ ఇండియా -
ఆగస్టు 15 కల్లా భూసమస్యల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్/కూసుమంచి: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న భూసమస్యలను ఆగస్టు 15వ తేదీకల్లా పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ఆదివారం మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ నుంచి రాష్ట్రంలోని 561 మండలాల్లోని 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, 4.61 లక్షల దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ సదస్సులను 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మానవతా దృక్పథంతో పరిష్కార మార్గం చూపాలని అధికారులను కోరారు. పదేళ్లలో రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతోనే సీఎం రేవంత్రెడ్డి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని, ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి రైతులకు మేలు చేసే బాధ్యత అధికారులదేనని చెప్పారు. వేగంగా భూసర్వేరాష్ట్రంలో నక్షాలు లేని 413 గ్రామాలకుగాను ఐదింట జరుగుతున్న రీసర్వే నిర్వహణ గురించి కూడా మంత్రి పొంగులేటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెల మూడోవారం నుంచి ఈ పైలట్ సర్వే నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా సలార్నగర్లో 422 ఎకరాలకు 337 ఎకరాలు, కొమ్మనాపల్లి (కొత్తది) గ్రామంలో 626 ఎకరాలకు 269 ఎకరాలు, ములుగుమడలోని 845 ఎకరాలకు 445 ఎకరాలు, నూగురులో 502 ఎకరాలకు 232 ఎకరాలు, షాహిద్నగర్లో 593 ఎకరాలకు 308 ఎకరాల్లో సర్వే పూర్తయ్యిందని వివరించారు.అనంతరం పొంగులేటి మాట్లాడుతూ మరోవారం, పది రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్న వివాదాలకు కూడా తావు లేకుండా రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. భూముల సర్వే కారణంగా రైతులు, గ్రామీణ భూయజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి పొంగులేటి చెప్పారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో తేదీలపై స్పష్టత వస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆదివారం పాలేరు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కొద్దిరోజుల్లో రైతు భరోసా నిధులు విడుదలవుతాయని, సన్నధాన్యం అమ్మిన రైతులకు బోనస్ చెల్లిస్తామని చెప్పారు. అనంతరం కూసుమంచిలో పొలం దున్నిన పొంగులేటి.. కూలీలతో కలిసి విత్తనాలు వేశారు. -
బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం
సాక్షి, హైదరాబాద్: గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని మాజీమంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్టు డిజైన్, కేంద్రానికి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్) సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్... ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ మేరకు గోదావరి బనకచర్ల అంశంపై మంత్రి ఉత్తమ్కు మాజీమంత్రి హరీశ్రావు ఆదివారం ఒక లేఖ రాశారు. ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించేలోపే, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉండగా, ఏపీ యూనిలేటరల్గా ముందుకెళ్తుండటం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి మంత్రికి ఈ ఏడాది జూన్ 13న మంత్రి ఉత్తమ్ లేఖ రాయడాన్ని హరీశ్రావు అభినందించారు. ‘ఏపీ తీసుకుంటున్న చర్యలు.. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతోపాటు నదీ జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘించడమే. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలి. గోదావరి జలాల్లో 969 టీఎంసీల తెలంగాణ వాటాలో ఇప్పటివరకు వినియోగం 600 టీఎంసీలకు పెరిగింది. గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ వంటి బరాజ్లు, 19 లక్షల ఎకరాల స్థిరీకరణతో గోదావరి బేసిన్ అభివృద్ధి, చెరువులు, చెక్ డ్యామ్లు, మిషన్ కాకతీయ, కాల్వల ద్వారా గోదావరి నీటిని వ్యవస్థీకృతంగా వినియోగంలోకి తెచ్చాం. కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, సమ్మక్కసాగర్, వార్ధా (బీఆర్ అంబేడ్కర్ ప్రాజెక్టు) డీపీఆర్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఏపీ వానాకాలపు వరద జలాలే తరలిస్తామన్నా, గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్లో ‘ఆల్ వాటర్స్’అనే పదమే ఉన్నదని నిపుణుల అభిప్రాయం. అదనపు జలాలు అనే అంశం గోదావరి అవార్డులో లేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు ఈ 157.5 టీఎంసీల అదనపు వాటాను కోరాలి. న్యాయ నిపుణులతో చర్చించి తగిన చర్యలు చేపట్టాలి. కేసీఆర్ పోరాట ఫలితంగా ఇప్పుడు 45 టీఎంసీలతో పాటు 112.5 టీఎంసీల అదనపు వాటా కోసం ట్రిబ్యునల్ ముందు వాదించే అవకాశం వచ్చింది’అని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు. -
విద్యుదాఘాతానికి నలుగురు బలి
కోరుట్ల: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్లో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఇద్దరు మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. కోరుట్ల–మెట్పల్లి జాతీయ రహదారి వెంట ఉన్న బాలాజీ కళా ఆర్ట్స్లో గణపతి విగ్రహాలు తయారు చేస్తారు. షెడ్లో తయారు చేసిన ఓ గణపతి విగ్రహానికి రంగులు వేసేందుకు మరో షెడ్కు తరలించడానికి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో క్రేన్తో ఏర్పాట్లు చేసుకున్నారు. యజమాని అల్వాల వినోద్, ఆయన తమ్ముడు అల్వాల నితిన్ 8 మంది వర్కర్లతో కలిసి విగ్రహాన్ని ట్రాలీపై జాతీయ రహదారిపైకి తెచ్చారు. విగ్రహం దాదాపు 12 ఫీట్ల ఎత్తు ఉండటంతో కిరీటం భాగం పైన ఉన్న 33 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. విగ్రహం తడిగా ఉండటంతో విగ్రహాన్ని పట్టుకుని ఉన్న పది మంది విద్యుత్ షాక్కు గురయ్యారు. కరెంట్ తీగల్లో మంటలు చెలరేగి విగ్రహం కిరీటం కాలిపోయింది. ఏడుగురు షాక్తో విగ్రహానికి అతుక్కుపోయారు. మరో ముగ్గురు కింద పడిపోయారు. గమనించిన చుట్టుపక్కల వారు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు వారు కరెంటు తీగలను పక్కకు తప్పించారు. బాధితులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో యజమాని అల్వాల వినోద్ (32), వర్కర్ వెల్లుట్ల సాయికుమార్ (23) మృతిచెందారు. ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ అశోక్కుమార్ సందర్శించారు. నిద్రలోనే తెల్లారిన బతుకులు నాగోలు: నిద్రిస్తున్న వారిపై విద్యుత్ తీగలు తెగిపడిపోవ డంతో ఇద్దరు సజీవ దహనమైన ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్లోని సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తా సమీపంలోని బాబాయ్ హోటల్ సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఫుట్పాత్పై ఇద్దరు గుర్తు తెలియ ని యాచకులు నిద్రిస్తున్నారు. వారితోపాటు ఓ శునకం కూడా ఉంది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహ నం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో 11 కేవీ హైటెన్షన్ వైరు తెగి నిద్రిస్తున్న వారిపై పడింది.ఇద్దరు యాచకులతోపాటు పక్కనే ఉన్న శునకం సజీవ దహనమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితి పరిశీ లించారు. 11కేవీ విద్యుత్ తీగ వారిపై పడిపోవడంతో మంటల్లో కాలిపోయి వారి బట్టలు, దుప్పట్లు వారి శరీరాలకు అంటుకున్నాయి. గుర్తించలేని విధంగా మృతదేహాలున్నాయి. మృతులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.