breaking news
Crime
-
ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో నవ వధువు జంప్
అన్నానగర్: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్కు వెళుతున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పెళ్లింట ఇలా వధువు వెళ్లిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..పెరంబూర్లోని అంబేడ్కర్ నగర్కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది.అనంతరం, అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్ఫోన్కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది.ఈ క్రమంలో బ్యూటీ సెలూన్కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు ఒక్కసారిగా షాకై దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నం
నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని అగ్రహరపేట అరుంధతీయ కాలనీకి చెందిన ఓ యువతిపై అదే ప్రాంతానికి చెందిన మొండెం ఉదయ్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడికి యత్నించాడు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్రహరపేటకు చెందిన యువతి బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఉదయ్ ఇంట్లోకి ప్రవేశించి లైంగికదాడికి యత్నించాడు. ప్రతిఘటించిన యువతి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు చేరుకునేసరికి ఉదయ్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత యువతి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం
సాక్షి టాస్క్ఫోర్స్/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ.. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు. టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే.. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్బుక్ రాజ్యాంగం.. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్సెట్) నాగమల్లేశ్వరరావు(ఫైల్) -
ఆ ఇద్దరూ కరుడుగట్టిన ఉగ్రవాదులు
సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన అబూబకర్ సిద్దిఖ్ అలియాస్ అమానుల్లా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్లు కరుడుగట్టిన ఉగ్రవాదులని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. తమిళనాడుకు చెందిన వీరు టెక్నికల్గా నిపుణులని, పక్కాగా పథకం వేసి బాంబు పేలుళ్లకు పాల్పడడంలో సిద్ధహస్తులని పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితులైన వీరిని జూన్ 30న తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.రాయచోటి పోలీసు పరేడ్ మైదానం వద్ద గురువారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి మీడియా సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే...‘‘అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 20 ఏళ్లుగా రాయచోటిలో ఉంటున్నారు. తప్పుడు పేర్లతో గుర్తింపు కార్డులు పొందారు. అబూ బకర్ సిద్దిఖ్ తమిళనాడు నాగూరు, మైలాడ్, చెన్నైలోని చింతాద్రిపేట, మధురై తిరుమంగళం, వేలూరులో జరిగిన పలు ఘటనల్లో నిందితుడు. సామూహిక దాడులు, పేలుళ్లు, ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడంపై అతడి మీద కేసులు నమోదయ్యాయి.⇒ మహమ్మద్ అలీపై చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో, పోలీసు కార్యాలయం వద్ద బాంబు పెట్టడంపై కేసులు నమోదయ్యాయి. ఈ చర్యకు పాల్పడిన రోజే.. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చిలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 1999లో కొచ్చి–కుర్లా ఎక్స్ప్రెస్లో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది.⇒ 2013లో కర్ణాటకలోని మల్లేశ్వరంలో జరిగిన బాంబు పేలుళ్లలో అబూ బకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీ ప్రమేయం ఉంది. అప్పుడు రాయచోటి నుంచే కార్యకలాపాలు సాగించారు. స్థానికంగా పేద కుటుంబాల మహిళలను వివాహమాడి చిరు వ్యాపారాలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పోలీసులు తమిళనాడు పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. భారీ కుట్రను భగ్నం చేశాయి.అల్ ఉమ్మా సంస్థతో అనుబంధంఉగ్ర సంస్థ అల్ ఉమ్మాతో అబూబకర్ సిద్దిఖ్, మహమ్మద్ అలీకి అనుబంధం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఉగ్ర సంస్థ. ఐసిస్ తరహా భావజాలం కలిగినది. నిందితులు గతంలో విదేశాలకు వెళ్లి వచ్చారు. వీరి వద్ద దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ల మ్యాప్లు దొరికాయి.రాయచోటి నుంచే పలు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు? ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు జరిపారు? సహాయ సహకారాలు అందించినవారెవరు? ప్రతి విషయం క్షుణ్ణంగా విచారిస్తున్నాం. పేలుడు సామగ్రి ఎలా వచ్చింది? బంధువులు, స్నేహితులు, ఇతర సంబంధాలు అన్ని అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం. స్థానికంగా శిక్షణ ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు. అబూబకర్, మహమ్మద్ అలీలను తమిళనాడు పోలీసులు తీసుకెళ్లారు. ఈ కేసుపై నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి.సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు..ఉగ్రవాదులు ఉంటున్న ఇళ్లను తనిఖీ చేయగా సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు, భారీఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తువులు లభించాయి. వీటితో కర్ణాటకలోని మల్లేశ్వరం లాంటి 30 బాంబు పేలుళ్లకు పాల్పడవచ్చు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేయగల సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం.పోలీసులను అడ్డుకున్న నిందితుల భార్యలు సోదాలకు వెళ్లినప్పుడు అబూబకర్ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీమ్లు మహిళా పోలీసులపై దాడికి యత్నించారు. పేలుడు పదార్థాల గురించి వీరికి తెలుసా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. మహిళలు ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. కోర్టు రిమాండ్ విధించడంతో కడప కేంద్ర కారాగారానికి తరలించాం.⇒ ఉగ్రవాదుల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలతో పాటు నాలుగు సూట్కేస్ బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. భయం.. భయం..రాయచోటిలో ఉగ్రజాడ తెలిసినప్పటి నుంచి అందరిలో భయం నెలకొంది. ఉగ్రవాదులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా చిన్న సమాచారం కూడా వెలుగులోకి రాకపోవడాన్ని పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు, తమిళనాడు పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. ఎస్పీ విద్యాసాగర్నాయుడు, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులను టీమ్లుగా విభజించారు. ఉగ్రవాదుల ఇంటి చుట్టుపక్కల వారిని ఇప్పటికే విచారించిన పోలీసులు.. బంధువులు, స్నేహితులపై దృష్టిసారించారు. రోజూ డీఎస్పీ కార్యాలయానికి పలువురిని తీసుకొచ్చి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలు, సెల్ఫోన్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. -
57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు. ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ అయ్యారు. -
రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్కేసు బాంబులను ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు. -
విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
సాక్షి, విశాఖపట్నం: మరో బెట్టింగ్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో డొంక కదిలింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విశాఖ పోలీసులు.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. బెంగళూరులో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేసి బెట్టింగ్కు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన నిందితుడు కీలక పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠా సభ్యులు వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ టాప్లు, 132 ఏటిఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
అనంతపురం: పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన యువతి సాయినగర్ ఏడో క్రాస్లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది.రెండు సంవ త్సరాల క్రితం అనంతపురం నగరంలోని బస్టాండు వద్ద ఉన్న ప్రియదర్శిని హోటల్లో పార్టం ఉద్యోగం చేస్తున్న ఈమెకు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అగ్రహారంకు చెందిన ప్రవీణ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పగా యువతి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ నగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోంలోన్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరింది.విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. బైకులో బలవంతంగా ప్రసన్నాయ పల్లి రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి దాడి చేశాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుతా అని బెదిరించాడు. తిరిగి బైక్పై హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీనిపై తన సోదరితో కలిసి యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025 -
యజమానురాలు తిట్టిందని.. తల్లీ కుమారులపై సహాయకుని ఘాతుకం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని లజ్పత్ నగర్-Iలో ఘోరం చోటుచేసుకుంది. ఎంతో నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యజమానురాలితో పాటు, ఆమె కుమారుని గొంతు కోశాడు. యజమానురాలు తిట్టిందని, ఆగ్రహంచిన ఆ సహాయకుడు ఇంతటి దారుణానికి తెగించాడు.లజ్పత్ నగర్లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటి లోపల హత్యకు గురయ్యారనే వివరాలు తెలియగానే, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి నుంచి పరారైన సహాయకుడు ముఖేష్(24)ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించడంతోపాటు ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. తన యజమాని రుచికా సేవ, ఆమె కుమారుడు క్రిష్ల గొంతులను కోసినట్లు నిందితుడు ముఖేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. #WATCH | Delhi's Double murder case | The bodies of a woman, Ruchika (42) and her son, Krish (14) were found at their residence in the Lajpat Nagar-1 area. The suspect house help has been apprehended. Further investigation underway: Delhi Police(Visuals from the spot) pic.twitter.com/bI338FWx1N— ANI (@ANI) July 3, 2025రుచిక భర్త కుల్దీప్ రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆయనకు మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్న తలుపును బలవంతంగా తెరిచారు. అక్కడ వారు రుచిక మృతదేహాన్ని బెడ్రూమ్లో, క్రిష్ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించారు. ఇద్దరికీ మెడపై కత్తితో చేసిన గాయాలన్నాయి. ఈ ఘటనకు వారింటిలో పనిచేసే ముఖేష్ కారణమని భావించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ముఖేష్ తనను యజమానురాలు రుచిక తిట్టిందునే ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
భర్త వద్దు.. మామే కావాలి.. పెళ్లైన 45 రోజులకే..
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్సింగ్తో తరచూ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
మాదాపూర్లో దారుణం.. బెట్టింగ్ ఆడ్డొదన్న తండ్రిని చంపేశాడు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో దారుణం జరిగింది. బెట్టింగ్ ఆడొద్దని మందలించిన తండ్రిని కుమారుడు చంపేశాడు. కొడుకు చదువు కోసం ఆరు లక్షలు ఇవ్వగా.. కొడుకు బెట్టింగ్ యాప్స్లో పెట్టి పోగొట్టాడు. దీంతో మందలించిన తండ్రి హనుమంత్ని హత్య చేసిన కుమారుడు రవీందర్.. ఆత్మహత్యగా క్రియేట్ చేశాడు. వనపర్తికి తీసుకెళ్లి తండ్రి మృతదేహానికి కర్మకాండ చేసే ప్రయత్నం చేశాడు.బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. రవీందర్ని అదుపులోకి తీసుకున్న విచారించారు. తండ్రిని తానే చంపానని రవీందర్ ఒప్పుకున్నాడు. రవీందర్ను రిమాండ్కు తరలించారు. -
బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. మహిళలపై తరచూ దారుణాలు చోటుచేసుకుంటున్నాయనే వార్తలు వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో, తాజాగా దీనికి భిన్నంగా జరిగిన ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ముంబైకి చెందిన 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు తన దగ్గర చదువుకునే 16 ఏళ్ల విద్యార్ధికి ఆందోళన నిరోధక మందులు(యాంటీ యాంగ్జైటీ మందులు) ఇచ్చి, ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తోంది. ఈ విషయం బయటపడిన దరిమిలా పోలీసులు ఆ మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. ఆమెపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టం, భారత శిక్షాస్మృతిలోని నిబంధనల కింద నేరాలను మోపారు.పోలీసులు తెలిపిన ప్రకారం నిందితురాలు ఆంగ్ల ఉపాధ్యాయురాలు. బాధిత విద్యార్థి 11వ తరగతిలో ఉన్నప్పుడు అతనికి పాఠ్యాంశాలను బోధించారు. 2023 డిసెంబర్లో జరిగిన పాఠశాల వార్షికోత్సవం సమయంలో ఆ విద్యార్థికి ఆకర్షితురాలినైనట్లు ఆమె పోలీసులకు తెలిపింది. 2024 జనవరి నుంచి ఆ విద్యార్థితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. తొలుత ఆమె ఆ బాలుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగికంగా వేధించేదని, తరువాత అతనికియాంటీ-యాంగ్జైటీ ముందులు ఇచ్చి లోబరుచుకునేదని పోలీసులు తెలిపారు.అయితే ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ప్రవర్తనలో మార్పును గమనించి, ప్రశ్నించగా, అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ విద్యార్థి త్వరలోనే పాఠశాల విద్య పూర్తి చేస్తాడన్న భావనతో అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని విస్మరించారు. ఈ ఏడాది ఆ విద్యార్థి 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఆ ఉపాధ్యాయురాలు తిరిగి అతనిపై వేధింపులు ప్రారంభించింది. దీంతో ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు ఆ ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇది కూడా చదవండి: ఖరీదైన ఐదు టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం ఇంటి రెనోవేషన్ ఖర్చెంతంటే.. -
ఆటోలో ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి,బళ్లారి(కర్ణాటక): వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఆశపడ్డారు. కానీ ఆటో రిక్షాలో శవాలై తేలారు. ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యాపించాయి. వివరాలు.. బెళగావి జిల్లాలో గోకాక్ వద్ద సవదత్తి తాలూకా మనవళ్లికి చెందిన రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ఇద్దరు ఊరి బయట ఆటోలో విగతజీవులై కనిపించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిక్కనంది సమీపంలో ఆటోలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సమగ్ర విచారణ జరిపించాలని జాదవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోకాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.లవ్ బ్రేకప్.. ప్రియుడు ఆత్మహత్య మైసూరు: ప్రేమించిన యువతి ముఖం చాటేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా బన్నితాళపుర గ్రామంలో జరిగింది. సాగడె గ్రామానికి చెందిన సంతు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తాను మరో యువకున్ని ప్రేమిస్తున్నట్లు సంతు వాట్సాప్కు మెసేజ్ పంపింది. దీంతో విరక్తి చెందిన సంతునా మరణానికి ప్రియురాలే కారణం, ఆమె వదిలేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు పలువురికి మెసేజ్లు పంపాడు. తమ ఇద్దరి ఫోటోని స్టేటస్లో పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లుపేటె పోలీసులు కేసు నమోదు చేశారు. -
పాక్ నటిగా పరిచయమై టోకరా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సుదీర్ఘకాలం తర్వాత మాట్రిమోనియల్ ఫ్రాడ్ చోటు చేసుకుంది. సోషల్మీడియాలోని మాట్రిమోనియల్ గ్రూప్ ద్వారా పాకిస్థాన్కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీగా పరిచయమైన సైబర్ నేరగాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆపై తల్లికి అనారోగ్యం, వైద్య ఖర్చుల పేరు చెప్పి రూ.21.73 లక్షలు కాజేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బహదూర్పురా ప్రాంతానికి చెందిన యువకుడు (29) ఓ సోషల్మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న మాట్రిమోనియల్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు. అతడికి 2023 మార్చిలో ఆ గ్రూపు ద్వారానే పాకిస్థాన్కు చెందిన ప్రముఖ నటి ఫాతిమా ఎఫెండీ పేరుతో సైబర్ నేరగాడు పరిచయం అయ్యాడు. తన ఖాతాలకు డీపీగా సదరు నటి ఫొటోను పెట్టుకోవడంతో అతను పూర్తిగా నమ్మేశాడు. కొన్నాళ్లు చాటింగ్ చేసిన తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ అసలు కథ మొదలుపెట్టాడు. ఓ దశలో నగర యువకుడిని పూర్తిగా నమ్మించడానికి ఫాతిమా సోదరి అనీసా ఎం.హుండేకర్ పేరుతోనూ చాటింగ్ చేశాడు. ఈ సందర్భలోనూ తన సోదరిని మీకు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం లేదంటూ పదేపదే ప్రస్తావించి పూర్తిగా ఉచ్చులోకి దింపారు. ఇలా కొంతకాలం చాటింగ్స్ చేసిన తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు తన తల్లి ఆరోగ్యం దెబ్బతిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పాడు. దానికి ఆధారంగా అంటూ కొన్ని నకిలీ పత్రాలనూ వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వైద్యం కోసం భారీగా ఖర్చు అవుతోందని నమ్మబలికాడు. పాకిస్థాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తన వద్ద నగదు అందుబాటులో లేదని సందేశం ఇచ్చాడు. వైద్య ఖర్చుల కోసం సాయం చేస్తే... కొంత తక్షణం, మరికొంత కొన్నాళ్లకు స్థిరాస్తులు విక్రయించి తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అవసరమైతే వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. అతడిని పూర్తిగా నమ్మించడం కోసం తొలుత చిన్న మొత్తాలు బదిలీ చేయించుకుని, వాటిని కొన్ని రోజులకు తిరిగి చెల్లించేశాడు. తాను సంప్రదింపులు జరుపుతోంది, లావాదేవీలు చేస్తోంది పాకిస్థాన్కు చెందిన నటి ఫాతిమా ఎఫెండీతోనే అని నగర యువకుడు పూర్తిగా నమ్మేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు కోరినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వెళ్లాడు. ఇలా దఫదఫాలుగా రూ.21,73,912 చెల్లించాడు. ఆ తర్వాత ఫాతిమాగా చెప్పుకున్న సైబర్ నేరగాడు యువకుడికి సంబంధించిన అన్ని సోషల్మీడియా హ్యాండిల్స్, ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నెంబర్లు, సోషల్మీడియా ఖాతాలతో పాటు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు అకౌంట్ల ఆ«ధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రోదనలు.. ఆక్రందనలు
జిన్నారం (పటాన్చెరు)/పటాన్చెరు టౌన్: పదుల సంఖ్యలో కార్మికులు పొట్ట చేతబట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఉపాధి కోసం సిగాచి పరిశ్రమలో చేరారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. వీరిలో అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు, నవ దంపతులు సైతం ఉన్నారు. సోమవారం ఊహించని విధంగా జరిగిన దుర్ఘటనలో వీరిలో అనేకమంది మృత్యువాత పడ్డారు. కారి్మకులు, కిందిస్థాయి సిబ్బంది మొదలు అధికారులు, ఉన్నతాధికారుల ప్రాణాలు కూడా క్షణాల్లోనే గాల్లో కలిసిపోయాయి. కొంతమంది ఆచూకీ తెలియకుండా పోయింది. కొందరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.మృతుల్లో ఏపీకి చెందిన అధికారి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన మర్రపు ప్రవీణ్కుమార్(46) సిగాచి పరిశ్రమలో డీజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. పేలుడు తర్వాత ఆయన ఆచూకీ తెలియలేదు. అయితే 36 మృతదేహాలను అధికారులు పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రవీణ్కుమార్ మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు బోరున విలపించారు. మంచిర్యాలకు చెందిన క్యూసీ మేనేజర్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన వజ్జకేవుల నాగేశ్వరరావు క్వాలిటీ కంట్రోల్ విభాగంలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మరణించారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకునేందుకు వచి్చన తమ్ముడు రవి విలపిస్తూ.. ఇందుకు సహకరించిన పోలీసులకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు. నాన్నా.. నువ్వు లేకుండా ఎలా బతకాలి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ గ్రామానికి చెందిన జగదీశ్ (53) 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం భార్య కమలాదేవితో కలిసి ఇస్నాపూర్కు వచ్చాడు. సిగాచి పరిశ్రమ ఏర్పాటయ్యాక అందులో చేరాడు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సోమవారం జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. నాన్నా.. నువ్వు లేకుండా మేమంతా ఎలా బతకాలంటూ పిల్లలు రోదిస్తున్నారు. తండ్రి మృతితో రోడ్డున పడిన కుటుంబం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియా జిల్లా రత్ననగర్కు చెందిన రామ్సింగ్ (50) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. ఇస్నాపూర్లో ఉంటున్న ఇతనికి భార్య, పెళ్లీడుకు వచి్చన ఇద్దరు సహా ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రామ్సింగ్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. నా ఇద్దరు చిన్నాన్నలు చనిపోయారు.. తన ఇద్దరు బాబాయిలతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చిన పవన్ నిసార్ ప్రస్తుతం ఒంటరిగా మిగిలాడు. ప్రమాదంలో తన చిన్నాన్నలు అఖిలేశ్ కుమార్ (35), విజయ్కుమార్ (30) మృతి చెందారంటూ పవన్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. రెండురోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడుమహారాష్ట్రకు చెందిన సోని భర్త భీమ్రావు భార్యతో కలిసి బండ్లగూడలో ఉంటూ రెండురోజుల క్రితమే కంపెనీలో చేరాడు. సోమవారం ఉదయం 8 గంటలకు పనికి వెళ్లగా ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. దీంతో సోని కుటుంబసభ్యులతో కలిసి పరిశ్రమ వద్దకు వెళ్లింది. భర్త ఆచూకీ కోసం ప్రయతి్నస్తుంటే పటాన్చెరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు అక్కడివారు చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా భీమ్రావు తీవ్రంగా కాలిన గాయాలతో కని్పంచడంతో సోని బోరున విలపించింది. తన భర్తకు మంచి వైద్యం అందించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని అధికారులను కోరుతోంది. మా అల్లుడి జాడ ఎవరూ చెప్పడం లేదు ‘ప్రమాదంలో మా అల్లుడు ప్రశాంత్ మహాపాత్రో గల్లంతయ్యాడు. మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. తొలుత కాంట్రాక్ట్ లేబర్గా, ఇప్పుడు క్యాజువల్ కారి్మకుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం విధుల్లోనే ఉన్నాడని భావిస్తున్నాం. మరణించాడా? బతికున్నాడా? అనేది ఎవరూ చెప్పడం లేదు. అధికారుల వద్ద ఉన్న జాబితాలో మా అల్లుడి పేరు కనిపించడం లేదు..’అని ఒడిశాకు చెందిన కోక సాహు వాపోయాడు. నా కొడుకు కోసం వెతుకుతున్నా.. ‘నా కొడుకు పేరు వెంకటేశ్. ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. మూడేళ్లుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆదివారం నా కొడుకుతో ఫోన్లో మాట్లాడాను. సోమవారం పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు ఆయన ఫోన్ పనిచేయడం లేదు, ఆచూకీ లభించడం లేదు. అధికారుల వద్ద ఉన్న ఏ జాబితాలోనూ నా కుమారుడి పేరు లేదు. నా కొడుకు సజీవంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా..’అని ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు అన్నాడు. అన్న ఆచూకీ కోసం తమ్ముడి ఆరా ‘మా అన్న దాసరి సునీల్కుమార్ కనిపించడం లేదు. ఏడాదిన్నరగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. క్వాలిటీ చెక్ విభాగంలో పనిచేస్తుండేవాడు. ఇప్పటివరకు ఆయన ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం ఫోన్ రింగ్ అయింది. ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయింది. మా సోదరుడు ఆచూకీ చెప్పాలి..’అని ఏపీలోని ప్రకాశం జిల్లా వాసి దాసరి సంపత్ కోరారు.నవ దంపతుల మృత్యువాత ప్రేమ వివాహం చేసుకున్న రెండు నెలలకే.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ ఇంతలోనే విధి వంచితులుగా మారారు. సోమవారం జరిగిన ప్రమాదం తర్వాత నవ దంపతుల ఆచూకీ తెలియకుండా పోయింది. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు పెనికలపాడుకు చెందిన నిఖిల్రెడ్డి ఎమ్మెస్సీ చదివాడు. ఏపీలోని ఎనీ్టఆర్ జిల్లా మాలపల్లికి చెందిన రామాల శ్రీరమ్య కూడా ఎమ్మెస్సీ చదివింది. తొలుత నిఖిల్రెడ్డి సిగాచిలో చేరగా, అక్కడే శ్రీరమ్య కూడా ఉద్యోగం సంపాదించుకుంది.మంచి స్నేహితులుగా మారిన వాళ్లు పరస్పరం ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారని పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు తెలిపారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న వీరిద్దరూ కన్పించక పోవడంతో మరణించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. విషయం తెలిసి పరిశ్రమ వద్దకు వచి్చన వారి కుటుంబీకులు.. ఆచూకీ లభించని వారి జాబితాలో వీరి పేర్లు చూసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం ఆస్పత్రి మార్చురీలో ఇద్దరి మృతదేహాలను చూసి బోరున విలపించారు. నా భర్త ఏమయ్యాడో చెప్పండి ఏడు నెలల గర్భవతి ఆక్రందన ఒకే కుటుంబంలో ముగ్గురి ఆచూకీ గల్లంతు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆచూకీ గల్లంతైంది. ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినా తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆ కుటుంబానికి చెందిన పూజ కన్నీరు మున్నీరవుతున్నారు. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. బిహార్కు చెందిన పూజ భర్త నాగ పాశ్వాన్ (25), ఇతర కుటుంబసభ్యులు దీపక్ (19), దిలీప్ (45) ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వీరు ఐదునెలల క్రితమే పటాన్చెరుకు ఉపాధి నిమిత్తం వచ్చారు. ఈ పరిశ్రమలో పనికి కుదిరారు.వీరు శిథిలాల్లో నలిగి కాలిపోయి ఉంటారేమోనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బంధువుల సాయంతో పరిశ్రమ వద్దకు వచి్చన పూజ తన భర్త, ఇతర కుటుంబసభ్యుల ఆచూకీ చెప్పాలంటూ విలపించడం స్థానికులను సైతం కన్నీరు పెట్టించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశ్రమను సందర్శించిన సందర్భంగా పూజ గురించి ప్రస్తావించారు. కాగా తన భర్త ఏమయ్యాడో అధికారులు చెప్పడం లేదని పూజ రోదించింది. -
‘భాగస్వామి’పై దారుణం.. మృతదేహంతో రెండు రోజులు సావాసం
భోపాల్: దేశంలో ఇటీవలి కాలంలో ‘రిలేషన్షిప్’ ఉంటున్న కొందరు క్షణికావేశంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి దారుణ ఉదంతం మధ్యప్రదేశ్లోని భోపాల్లో వెలుగు చూసింది. స్థానిక గాయత్రి నగర్లో రితికా సేన్(29) తన లివ్ ఇన్ పార్ట్నర్ సచిన్ రాజ్పుత్(32) చేతిలో దారుణ హత్యకు గురయ్యింది.రితికా సేన్ను గొంతుకోసి, హత్యచేసిన తరువాత సచిన్ ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, రెండు రోజుల పాటు ఆ మృతదేహం పక్కనే పడుకున్నాడు. జూన్ 27 రాత్రి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది రితకా హత్యకు దారితీసింది. ఉద్యోగం లేకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతున్న రాజ్పుత్ తన భాగస్వామి రితికా సేన్పై ఎప్పుడూ అసూయ పడేవాడు. ఆమె పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీ యజమానితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించేవాడు. ఈ నేపధ్యంలోనే ఆమెను హత్య చేశాడు.తరువాత ఆమె మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, మంచం మీద పెట్టి, రెండు రోజుల పాటు అదే గదిలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మద్యం మత్తులో సచిన్ రాజ్పుత్ తన స్నేహితుడు అనుజ్తో తాను రితికా సేన్ను హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో అనుజ్ పోలీసులకు ఫోన్ చేసి, విషయమంతా చెప్పాడు. వెంటనే బజారియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రితికా సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంనకు తరలించారు.పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ శిల్పా కౌరవ్ మీడియాతో మాట్లాడుతూ మృతురాలు రితికా సేన్ తన ప్రియుడు సచిన్ రాజ్పుత్తో పాటు రెండున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్నదన్నారు. సచిన్కు అప్పటికే వివాహం అయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. జూన్ 27న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి, అది రితికా హత్యకు దారితీసిందన్నారు. సింజోర్కు చెందిన సచిన్.. రితికతో పాటు తొమ్మిది నెలల క్రితం గాయత్రి నగర్కు వచ్చి ఉంటున్నాడు. రితిక ఉద్యోగం చేస్తుండగా, సచిన్ ఆమె జీతంపై ఆధారపడేవాడు. నిందితుడు సచిన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై ఘాతుకం -
భర్త దారుణ హత్య.. ఇంటికి తాళం వేసి భార్య పరార్..!
నాగోలు(హైదరాబాద్): ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో పడవేసిన సంఘటన నాగోలు పోలీసుల స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల శివారులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద లభించిన వివరాల ఆధారంగా మృతుడు కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్ గా గుర్తించారు. కాచిగూడలో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న అశోక్ యాదవ్కు భార్య క్రాంతి దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్, ఏసీపీ కృష్ణయ్య, నాగోలు ఇన్స్పెక్టర్ సూర్యనాయక్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. అశోక్ యాదవ్ మృతదేమం లభించిన ఫోన్ ఆధారంగా అతని భార్యకు ఫోన్ చేసిన పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇంటి వస్తున్నట్లు సమాచారం అందుకున్న అతడి భార్య ఇంటికి తాళం, జ్యూస్ సెంటర్ మూసి వేసి సెల్ఫోన్ ఆఫ్ చేసి పరారైనట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. -
తమిళనాడులో భారీ పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సత్తూరులోని బాణసంచా యూనిట్పై దట్టమైన పొగ అములుకుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని బాణాసంచా గోడౌన్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. తరచూ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.#JUSTIN சிவகாசி அருகே சின்ன காமன்பட்டி கோகுலேஸ் பட்டாசு ஆலையில் பயங்கர வெடி விபத்து #Sivakasi #FireAccident #News18Tamilnadu | https://t.co/3v5L32pLWJ pic.twitter.com/5g7GYG6V6d— News18 Tamil Nadu (@News18TamilNadu) July 1, 2025VIDEO Credits: News18 Tamil Nadu -
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
నేరేడుచర్ల(నల్గొండ): ప్రియుడికి వీడియో కాల్ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్రెడ్డి కూడా ఎల్బీనగర్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అశ్విని, సురేష్రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్రెడ్డికి వీడియో కాల్ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతదేహంతో ఆందోళన..అశ్విని మృతికి సురేష్రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై ఘాతుకం
ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. ఆమె అతన్ని దూరం పెట్టింది. అది భరించలేకపోయాడా యువకుడు. ఆమెపై కక్ష కట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో పట్టపగలే అంతా చూస్తుండగా ఆమె పీక కోసి అతికిరాతకంగా చంపాడు.మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో 19 ఏళ్ల సంధ్య చౌద్రీ అనే యువతి దారుణ హత్యకు గురైంది. నిందితుడు అభిషేక్ కోష్టి.. ఆసుపత్రి సిబ్బంది, రోగుల సమక్షంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తరువాత తన గొంతు కోసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది.నర్సింగ్ శిక్షణ పొందుతున్న సంధ్యను వెంబడించిన అభిషేక్ కోష్టి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తరువాత ఆమెను పట్టుకుని, కిందకు నెట్టివేసి, కత్తితో ఆమె గొంతు కోశాడు. తరువాత తన గొంతుకోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఈలోపు జనం గుమిగూడడంతో.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనను చూసిన ఆస్పత్రి అధికారి నళిన్ మాట్లాడుతూ.. నల్ల చొక్కా ధరించిన ఒక యువకుడు సంధ్యపై దాడి చేశాడని, తాను జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడగా, తనను అడ్డుకున్నాడని, చంపేస్తానని కూడా బెదించాడని తెలిపారు.పోలీసులు నిందితుడు అభిషేక్ను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో అతను.. రెండున్నరేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా తాము కలుసుకున్నామని పోలీసులకు తెలిపాడు. తాము ప్రేమించుకుంటున్నామని, అయితే ఇటీవలి కాలంలో సంధ్య తనను పట్టించుకోవడం మానేసిందని, తన నంబర్ను బ్లాక్ చేసిందని చెప్పాడు. ఆమె వేరొకరిని ప్రేమిస్తున్నదని భావించి, ఆమెకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని, ఆమె హత్యకు ప్లాన్ చేసినట్లు అభిషేక్ పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. కాగా సంధ్యకు అభిషేక్తో ఎలాంటి సంబంధం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.సంధ్య హత్య అనంతరం ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. అయితే నిందితునిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంధ్య హత్య జరిగిన రోజు ఆస్పత్రి ట్రామా సెంటర్లో 11 మంది రోగులు చేరారు. అయితే భయంతో ఎనిమిది మంది అదే రోజు డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారు మరుసటి రోజు వెళ్లిపోయారు. ఆసుపత్రి సివిల్ సర్జన్ గురుచరణ్ చౌరాసియా మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తామన్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. సంధ్యను హత్య చేసి, తనను తాను గాయపరచుకున్న నిందితుడు అభిషేక్ ప్రస్తుతం అదుపులో ఉన్నాడు. ఎస్పీ మృగాఖి డేకా సారధ్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ‘హార్వర్డ్’కు ట్రంప్ మరో షాక్.. యూదు హక్కులపై వేటు -
పాశమైలారం ఘటన.. సిగాచి బాధితులకు సీఎం పరామర్శ
పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్యను 45గా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతోంది. తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది. Updates: 42కు చేరిన మృతులుమృతుల సంఖ్య పెరిగే అవకాశంమృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, బిహార్, జార్ఖండ్ వాసులుమృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలుఆసుపత్రుల్లో 35 మంది బాధితులకు చికిత్స12 మంది పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్సపేలుడు ఘటనలో 27 మంది కార్మికులు గల్లంతుశిథిలాల కింద మృతదేహాల కోసం గాలిస్తున్న డీఆర్ఎఫ్ టీమ్సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బందితమవాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళన బాధితులకు సీఎం పరామర్శసిగాచి ఫ్యాక్టరీ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శధృవ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎంఆరోగ్య స్థితిపై ఆరాకార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీమార్చురీ వద్ద రోదనలతో పడిగాపులుపటాన్ చెరులో డిఎన్ఏ శాంపుల్స్ సేకరణ కోసం ప్రత్యేక చర్యలుగుర్తుపట్టేందుకు వీలులేని మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్ లుతమ వారిని గుర్తించలేని కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ సేకరణఇప్పటివరకు 18 మంది డిఎన్ఏ శాంపుల్ సేకరణ మృతదేహాలడీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తరువాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుఇవాళ 11 మంది డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుతమవాళ్ల మృతదేహాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోదనలతో కుటుంబ సభ్యుల పడిగాపులుఘటనపై NHRC కేసు నమోదుపాశమైలారం ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం కేసు నమోదుఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావుకేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీమృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం యాజమాన్యం నుంచి ఇప్పించాలని పిటిషన్తాజా ప్రమాదం నేపథ్యంలో.. తెలంగాణలోని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని కోరిన పిటిషనర్త్వరలో ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు? యాజమాన్యం ఎక్కడ? 24 గంటలు దాటినా యాజమాన్యం రాకపోవడం బాధాకరమన్న మంత్రి శ్రీధర్బాబుఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న శ్రీధర్బాబుప్రమాద ఘటనను కార్మిక, వైద్యశాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: మంత్రి శ్రీధర్బాబుఅంతకుముందు.. యాజమాన్యం ఎక్కడ? అని అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా? అని ప్రశ్న యాజమాన్యం రాకపోవడంపై సీఎం ఆగ్రహం సిగాచి ఘటనపై సీఎం కీలక ఆదేశాలుసిగాచి పరిశ్రమను పరిశీలించిన సీఎం, మంత్రులుఅనంతరం ప్రమాద స్థలిలోనే అధికారులతో సీఎం సమీక్షఫ్యాక్టరీ ప్రమాదంపై అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్సిగాచి పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్పరిశ్రమను తనిఖీ చేశారా?.. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా?పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరు? అంటూ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ను అడిగిన సీఎంఘటనపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా?.. కారణాలు తెలుసుకోండిఇప్పటికే తనిఖీలు చేసినవాళ్లతో కాకుండా.. కొత్త వాళ్లతో విచారణ జరిపించండిఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించి నివేదిక ఇవ్వండిఇలాంటి ప్రమాదాలపై అధికారులు అలర్ట్గా ఉండాలితక్షణ సాయం కింద.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలని సీఎం ఆదేశంపాశమైలారం ఘటనా స్థలిలో సీఎం రేవంత్పాశమైలారం సిగచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డివెంట మంత్రులు పొంగులేటి, వివేక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి..ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రిప్రమాదం జరిగిన తీరును.. సహాయక చర్యలపై అధికారులను ఆరా తీస్తున్న సీఎం రేవంత్పటాన్చెరు మార్చురీలో 37 మృతదేహాలు11 మృతదేహాల గుర్తింపు పూర్తి పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలుడీఎన్ఏ టెస్ట్కు ఒకరోజు నుంచి రోజున్నర టైం పడుతుందంటున్న అధికారులు సిగచి ప్రమాద స్థలికి కేంద్రమంత్రి కిషన్రెడ్డిసంగారెడ్డి పటాన్ చెరువు సిగచి కంపెనీ ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిమధ్యాహ్నం ప్రమాద స్థలిని పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్న కిషన్రెడ్డికిషన్రెడ్డి వెంట బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్రావు కూడాకొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుపాశమైలారం ఘటనలో కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుడీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లుఘటనాస్థలానికి వచ్చిన డీఎన్ఏ పరీక్షలు చేసే బృందాలుఇప్పటిదాకా కేవలం 6 మృతదేహాలకు మాత్రమే గుర్తింపుపటాన్చెరు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డికాసేపట్లో పటాన్చెరు పాశమైలారం పారిశ్రామికవాడకు సీఎం రేవంత్ రెడ్డిఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు ఆస్పత్రిలో పరామర్శపాశమైలారం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎంసీఎం వెంట మంత్రులు కూడాసిగచి ఆవరణలో పోలీసు ఆంక్షలుసిగచి ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డిఅంతకంటే ముందు.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శసీఎం రాక నేపథ్యంలో సిగచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలుసిగచి కంపనీ వైపు ఎవరిని అనుమతించని పోలీసులునిన్న ప్రమాదం తర్వాత బాధిత కుటుంబాలతో పోలీసులకు వాగ్వాదంతమ వారి గురించి సరైన సమాచారం లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులుతోసేసిన పోలీసులు.. ఫ్యాక్టరీ వద్ద కాసేపు ఉద్రిక్తత42కు చేరుకున్న మృతుల సంఖ్యశిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగింపు..మరో రెండు గంటల పాటు శిధిలాల తొలగించే ప్రక్రియ కొనసాగే అవకాశం..కుప్పకూలిన సిగచి ప్రొడక్షన్ బిల్డింగ్చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారే..వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 34 మంది క్షతగాత్రులుమూడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులుశిథిలాల కింద మరో 20 మంది42కి చేరిన మృతుల సంఖ్యశిథిలాల కిందే మరో 20 మంది?మృతుల సంఖ్య 55కి చేరే అవకాశంకొనసాగుతున్న శిథిలాల తొలగింపుధ్వంసమైన ప్లాంట్ను పక్కకు తొలగించిన సహాయక బృందాలుగుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలుమృతుల్లో తమిళనాడు, యూపీ వాసులేక్కువడీఎన్ఏ పరీక్షల అనంతరమే కుటుంబ సభ్యులకు అప్పగించే ఛాన్స్ఇప్పటివరకు గుర్తు పట్టినవి ఆరు మృతదేహాలు మాత్రమేఅంతకు ముందు.. ఈ ఉదయం ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. ఘటన వివరాలతో పాటు సహాయక చర్యలు ఇతరత్రా వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో 47 మంది గల్లంతు అయ్యారుఇప్పటివరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అందులో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించాం.ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరికొందరు మృతిగుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు ఉన్నాయి మరో 27 మంది జాడ తెలియాల్సి ఉందిఆస్పత్రిలో తీవ్ర గాయాలతో 35 మందికి చికిత్స అందుతోంది.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది57 మంది సరక్షితంగా ఇంటికి వెళ్లారుప్రమాద సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయిందిశిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారు.. వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయిసహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు ఇదీ చదవండి: పరిశ్రమల్లో ప్రాణాలు.. గాలిలో దీపాలు సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంతక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చన్న కలెక్టర్ ప్రావీణ్యబ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ ఉత్పత్తి ప్రాథమికం సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యిందన్న ప్రత్యక్ష సాక్షులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న కొందరు కార్మికులు అయితే ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి?మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడుసంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు అగ్నికీలల్లో పలువురి సజీవదహనం.. కార్మికులు, ఉద్యోగులు దుర్మరణం! సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు మృతుల్లో ఎక్కువమంది ఒడిశా, బిహార్, యూపీ వారే.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం 36 మందికి కాలిన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కింద మరికొందరు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్... ఘటనా స్థలాన్ని,ఆస్పత్రులను సందర్శించిన మంత్రులు.. నేడు ఘటనా స్థలానికి సీఎం రేవంత్ ఆస్పత్రిలో బాధితులకు సీఎం పరామర్శ -
నా వల్ల కావడం లేదు తల్లీ..
కూసుమంచి: రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మరణించగా, అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమార్తె ప్రాణం ఉన్నా మంచంలోనే అచేతన స్థితిలో మిగిలింది. దీంతో కూతురిని దక్కించుకోవాలని ఆ తండ్రి శక్తికి మించి రూ.లక్షల్లో అప్పులు చేసినా ఫలితం లేక బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఇది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన జర్పుల పరశురాం (46)– లలితకు సందీప్, సింధు సంతానం. పరశురాం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం సింధు ఖమ్మంలో ఎంసెట్ పరీక్ష రాసింది.పరీక్ష ముగిశాక ఆమెను సోదరుడు సందీప్ బైక్పై తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో సింధు తలకు తీవ్రగాయాలు కావడంతో మాటలేక అచేతన స్థితిలో ఉండిపోయింది. వీరి కుటుంబ దీనస్థితిని గమనించి దాతలు రూ.25 లక్షల మేర సాయం చేశారు. సింధుకు చికిత్స చేయించినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఆపై పరశురాం పలువురి వద్ద రూ.15 లక్షల వరకు అప్పు తీసుకుని చికిత్స కొనసాగించినా ఫలితం లేకపోయింది. తమకున్న పది గుంటల భూమిని అమ్ముకుందామంటే పట్టాదారు పాసుపుస్తకం లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది. మంచంలో బిడ్డను చూడలేకపోతున్నా.. దాతల చేయూతకు తోడు అప్పులు చేసినా బిడ్డకు నయం కాకపోవడం, భూమి అమ్మలేని పరిస్థితి ఎదురుకావడంతో పరశురాం కుమిలిపోయాడు. దీంతో ఆదివారం రాత్రి తాను కౌలుకు తీసుకున్న చేను వద్దకు వెళ్లి అక్కడి నుంచి భార్య లలితకు ఫోన్ చేశాడు. కుమార్తెకు చికిత్స చేయించేందుకు తన శక్తి సరిపోవడం లేదని, బిడ్డను ఆ స్థితిలో చూడలేకపోతున్నానని ఆమెకు చెబుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. దీంతో లలిత స్థానికులతో కలిసి చేను వద్దకు వెళ్లి వ్యవసాయ బావిలో పరిశీలించగా పరశురాం మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది
సాక్షి, హైదరాబాద్: ‘పెద్ద శబ్దం..ఒక్కసారిగా మంట లు వచ్చాయి. మొత్తం పొగ..దుమ్ము.. ఏం జరుగు తోందో తెలియలేదు. ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. మా కళ్ల ముందే పేలుడు జరిగింది..మా ముందే చాలామంది చనిపోయారు. కొందరు మహిళ లు మంటలు అంటుకుని కాపాడాలంటూ వేడుకుంటు న్న అరుపులే ఇంకా గుర్తొస్తున్నాయి. మా చిన్నాన్నలు, అన్నలు, స్నేహితులు కనిపించకుండా పోయారు.వాళ్లు బతికి ఉన్నారో..? లేదో..? తెలియడం లేదు.. పొద్దుటి నుంచి వాళ్ల జాడ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాం..ఎప్పు డు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది..’అని పాశమైలారం సిగాచి ఫ్యా క్టరీలో ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షులు ‘సాక్షి’వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ‘మా వాళ్ల జాడ చెప్పండి సారూ’అంటూ బాధితుల బంధువులు అక్కడికి వచి్చ న అధికారులను బతిమాలుకుంటున్న తీరు కంట తడిపెట్టించింది. తమ వాళ్ల గురించి ఎందుకు చెప్ప డం లేదంటూ కొందరు మహిళలు ఏకంగా రాళ్ల ను తీసుకుని అధికారులపై దాడి చేసినంత పని చేశా రు. వారి కుటుంబీకుల కోసం వారు చేస్తున్న ఆర్తనాదాలు..ఆగ్రహావేశాలు సైతం అందరినీ కలిచి వేశాయి. వాష్రూంలో ఉండగా పెద్ద శబ్దం నేను ఉదయం షిప్ట్లో ఉన్నా. పేలుడు జరగడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా డ్రయింగ్ యూనిట్ దగ్గరే పనిచేస్తున్నా. మూత్ర విసర్జన కోసం బయటికి వెళ్లి పక్కన వాష్రూంలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. బయటికి వచ్చి చూసే సరికి పెద్దగా మంటలు..పొగ..దుమ్ము ఏమీ కనపడ లేదు. వాష్రూంకు వెళ్లకపోతే చనిపోయేవాడిని. – చందన్ గౌర్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్ నేను రియాక్టర్ దగ్గరే పని చేస్తున్నా నేను రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా. ఉదయం పేలుడు జరిగినప్పుడు రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న. మొదట ఎయిర్ బ్లోయర్ పేలింది. దానివల్ల నేను పనిచేస్తున్న రియాక్టర్ కూడా పెద్ద శబ్దంతో పేలింది. అయితే పక్కనే గది నుంచి మెట్లు ఉన్న విషయం నాకు ముందు నుంచి తెలుసుకాబట్టి ఆ దారి వెతుక్కుంటూ బిల్డింగ్ పైకి వెళ్లిన. అక్కడ కూడా ఏమీ అర్థం కాలేదు. వెంటనే కూలిన ఒక గోడ పట్టుకుని పాకుతూ మొదటి అంతస్తులోకి కిందికి వచి్చన. అక్కడ కిటికిలోంచి కిందికి దూకిన. నా పక్కనే రెండు శవాలు పడి ఉన్నాయి. వెంటనే అక్కడ నుంచి బయటికి వచ్చేశా. పేలుడు జరిగినప్పుడు కనీసం 30 నుంచి 45 మంది అక్కడ ఉన్నారు. వాళ్లంతా చనిపోయే ఉంటారు. – పవన్ ఇసాద్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్ మా ఇద్దరు చిన్నాన్నలు చిక్కుకున్నారు ఏడేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. ఇప్పటివరకు ఏ చిన్న ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగినప్పుడు నేను రియాక్టర్ రూం దగ్గరే పనిచేస్తున్న. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. వెంటనే మంటలు అంటుకున్నాయి. దీంతో కిందికి పారిపోయిన. కానీ మా చిన్నాన్నలు శశికుమార్, లఖ్నజీత్ ఇద్దరు లోపలే చిక్కుకున్నారు. ఒకరి శవం దొరికింది. ఇంకొకరు ఏమయ్యారోఏమో.. – విజయ్, బక్సర్ జిల్లా బిహార్ ముగ్గురిని కాపాడినం.. నేను ప్రమాదం జరిగినప్పుడు పక్కన బిల్డింగ్లో టిఫిన్ చేస్తున్న. బయటికి వచ్చేసరికి మొత్తం పొగ ఉంది. ఏం కనిపించలేదు. కాసేపటికి అంతా అటు ఇటు ఉరుకుతున్నరు. పక్కన అడ్మిని్రస్టేషన్ బిల్డింగ్ దగ్గర కొంతమంది కాపాడాలని అరుస్తున్నారు. నేను, ఇంకో ఇద్దరం కలిసి వాళ్ల దగ్గరికి వెళ్లినం. పైన ఫ్లోర్ నుంచి మెల్లగా కిందికి దింపి ముగ్గురిని కాపాడినం. – శివ, కార్మికుడు, ఒడిశా డ్యూటీలోనే దూరంగా ఉన్నా.. నేను ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న. పేలుడు జరిగినప్పుడు డ్యూటీలోనే ఉన్న. కానీ స్పాట్కు దూరంగా ఉన్న. పె ద్ద శబ్దం వచి్చంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అటువైపు పరుగెత్తుకుంటూ వెళ్లిన. ఎవరెరు చనిపోయారో అర్థం కాలేదు. అనేకమంది గాయపడ్డారు. – సంతోష్ కుమార్, ఉద్యోగి, ఏపీ ఆచూకీ లేనివారు ఎంతమంది?సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన తర్వాత ఆచూకీ లేకుండా పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం పరిశ్రమలో విధులకు వెళ్లినవారు ఇంటికి తిరిగి రాక.. ఆసుపత్రుల్లోనూ కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో అసలెంత మంది ఉన్నారు.. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఎంతమంది.. అనేదానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేకుండా పోయింది.ఒకవైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా, శిథిలాల కింద ఎంతమంది ఉండి ఉంటారనే దానిపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్లు తెలిసింది. రెండు మృతదేహాలు శిథిలాల కింద లభ్యమైనట్లు చెబుతున్నారు. మృతదేహాలను పోలీసులు ఆసుపత్రులకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. డీఎన్ఏ పరీక్షలు చేపడుతున్నట్లు తెలిసింది. కుటుంబసభ్యుల డీఎన్ఏలతో పోల్చాకే మృతదేహాలను అప్పగించనున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి వరకు ముగ్గురిని గుర్తించినట్లు తెలుస్తుండగా.. దీన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా 10 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. కంపెనీ డ్రైవర్ సమయస్ఫూర్తి8 మంది క్షతగాత్రులను బస్సులో ఆస్పత్రికి తరలింపుసాక్షి, హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగిన వెంటనే అక్కడ భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే జరిగిన ఘటన నుంచి క్షణాల్లో తేరుకున్న కంపెనీ బస్సు డ్రైవర్ లాల్రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. పేలుడు కారణంగా బస్సు ధ్వంసమైనా వెనుకడుగు వేయకుండా బాధితులను ముత్తంగిలోని ఆసుపత్రికి తరలించారు.ఘటన జరిగిన తీరును ఆయన ‘సాక్షి’ కి వివరించారు. ‘నేను జనరల్ షిప్ట్ వాళ్లను కంపెనీకి తీసుకువచ్చి న తర్వాత బస్సును పార్క్ చేసి కూర్చుని ఉన్నా. కొద్ది నిమిషాల్లోనే పెద్ద శబ్దం విని్పంచింది. కాసేపటికి అంతా గాయాలతో బయటికి వస్తున్నారు. ఇంకా అంబులెన్స్లేవీ రాలేదు. నేను వెంటనే 8 మందిని బస్సులో ఎక్కించుకుని ముత్తంగి ఆసుపత్రికి తీసుకెళ్లిన. అక్కడి నుంచి మదీనగూడ ఆసుపత్రికి తీసుకొచి్చన. ఆషాక్ నుంచి బయటికి రాలేకపోతున్నా..’అని లాల్రెడ్డి వివరించారు. -
బతుకులు బుగ్గి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/పటాన్చెరు/రామచంద్రాపురం/జిన్నారం/చందానగర్: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని సిగాచి అనే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఇద్దరు ఆస్పత్రుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 16 మంది మరణించినట్లు అనధికారిక సమాచారంకాగా, మంత్రులు దామోదర, వివేక్ మాత్రం 12 మంది మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తదితర ప్రముఖులు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ను ఉ త్పత్తి చేస్తారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి? మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్కు పలు సూచనలిచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పరిశ్రమల శాఖ ఫైర్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్గ్రేషియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రులు దామోదర, వివేక్ రాజకీయం చేయొద్దు: మంత్రులు పేలుడు ఘటనలో గాయపడిన వారిలో హేమ సుందర్, ధర్మరాజ్ ప్రసాద్, రాజేష్ కుమార్ చౌదరి, కమలేష్ ముఖియా, చందన్కుమార్ నాయక్, నగ్నజిత్, అభిషేక్ కుమార్, అజిత్ తివారి, సంజయ్కుమార్, యశ్వంత్ కుమార్, ధన్వీర్ కుమార్, సంజయ్ ముఖియా, రాజశేఖర్రెడ్డి, దేవనంద్, గణేష్ కుమార్, సంజయ్కుమార్ యాదవ్, నీలాంబర్ బట్రా, సమీర్, అమర్జిత్, అర్జున్కుమార్, అజిమ్ అన్సారీలను మియాపూర్ మదీనాగూడలోని ప్రణామ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ అభిషేక్ కుమార్, అజిత్ తివారి మృతి చెందారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నవారిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎవరూ ఎలాంటి రాజకీయం చేయవద్దని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సీఎం సందర్శన సిగాచి పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడనున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కేసీఆర్ సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలావుండగా పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పలువురు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధానిసాక్షి, న్యూఢిల్లీ: సంగారెడ్డి జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదం గురించి విని చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపడుతున్నారు..’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం ఎంతో దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం..’ అని ఖర్గే అన్నారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. ప్రమాదంపై ఆరా సాక్షి, హైదరాబాద్: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ జితేందర్, సీఎస్ రామకృష్ణారావుతో సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజాస్టర్మేనేజ్మెంట్స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫైర్సరీ్వసెస్అడిషనల్డీజీని సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య అనుమానాస్పద మృతి
పీలేరు(అన్నమయ్య): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ బందారువాండ్లపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన లోకనాథరెడ్డి, జీవనజ్యోతి కుమార్తె ఇందుజా (30)కు ఐదేళ్ల క్రితం బందారువాండ్లపల్లెకు చెందిన వరంపాటి శంకర్రెడ్డి కుమారుడు విజయశేఖర్రెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంపాటు వారి సంసారం సజావుగా సాగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. విజయశేఖర్రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి వుండడంతో తరచూ భార్య భర్తలు గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇందుజా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పీలేరుకు చేరుకుని తమ కుమార్తెను అత్తింటివారే కడతేర్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్రెడ్డి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి, బంధువుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్ ఇన్ పార్ట్నర్
బెంగళూరు: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పసివయసు వారి నించి వృద్ధ మహిళల వరకూ ఎక్కడో ఒకచోట ప్రతీరోజూ అకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మహిళను నమ్మించి, ఆమెతో సహజీవనం సాగించి, ఆనక ఆమెను కడతేర్చిన ప్రబుద్ధుని ఉదంతం కలకలం రేపుతోంది.బెంగళూరులో ఒక మహిళ మృతదేహాన్ని ఒక చెత్త ట్రక్కులో పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహాన్ని ఒక సంచిలో ఉంచి, దానిని చెత్త ట్రక్కులో పడవేసినట్లు గుర్తించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను ఆమె లివ్ ఇన్ పార్ట్నర్ హత్య చేశాడని కనుగొన్నారు. మృతురాలిని ఆశ(40)గా పోలీసులు గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్(33) అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతనే ఆమెను హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.బెంగళూరు పౌర సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) సిబ్బంది ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం కలిగిన గోనె సంచిని చూసింది. ఆ మహిళ చేతులను కట్టివేసి, గొనె సంచిలో కుక్కివేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు పంపి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.మృతురాలికి సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని అస్సాంకు చెందిన మహ్మద్ షంషుద్దీన్గా గుర్తించారు. నిందితుడు ఆశతో ఏడాదిన్నరగా లివ్ ఇన్లో ఉన్నాడు. వారిద్దరూ దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఒక అద్దె ఇంట్లో కలిసి ఉన్నారు. నిందితుడు, బాధితురాలికి గతంలోనే వేర్వేరుగా వివాహాలు కాగా, వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆశ,మహ్మద్ షంషుద్దీన్లు తాము భార్యాభర్తలమని చుట్టుపక్కల వారికి చెప్పేవారు.ఆశా అర్బన్ కంపెనీలో పనిచేస్తూ, గృహనిర్వాహక సేవలను అందిస్తుంటుంది. మహమ్మద్ షంషుద్దీన్ భార్య, ఇద్దరు పిల్లలు అస్సాంలోనే ఉన్నారు. ఈ కేసు గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగల్సర్ మాట్లాడుతూ ఆశ, షంషుద్దీన్ మధ్య గొడవ జరిగిందని, అది మరింత తీవ్రం కావడంతో షంషుద్దీన్.. ఆశను గొంతు కోసి చంపాడని తెలిపారు. తరువాత అతను ఆశ మృతదేహాన్ని గొనె సంచిలో కుక్కివేసి, దానిని బైక్పై తీసుకువెళ్లి చెత్త ట్రక్కులో పడవేసి అక్కడి నుండి పారిపోయాన్నారు. అయితే ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో నిందితుడు పట్టుబడ్డాడని జగల్సర్ తెలిపారు. -
ఎస్ఐ రాణాప్రతాప్ సతీమణి ఆత్మహత్య.. ఏం జరిగింది?
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఎస్ఐ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం సృష్టించింది. వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం జూలురుపాడులో పురుగుల మందు తాగిన రాజేశ్వరి ఆత్మహత్యాయత్నం చేశారు. అది గమనించి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాజేశ్వరి సోమవారం మృతి చెందారు. అనంతరం, మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే, వేధింపుల కారణంగానే రాజేశ్వరి మృతి చెందినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇక, ఎస్ఐ రాణా ప్రతాప్, రాజేశ్వరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, మొదటి నుంచి రాణా ప్రతాప్ దురుసు ప్రవర్తన కలిగిన వ్యక్తి అని.. వివాదాల్లో ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మంలో ట్రైనీ ఎస్ఐగా ఉన్న సమయంలో సర్వీస్ రివాల్వర్ చూపెట్టి బెదిరించి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. సస్పెండ్ అయినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు.. రాణా ప్రతాప్ సోదరుడు మహేష్ కూడా ఎస్ఐగానే విధులు నిర్వహిస్తునన్నారు. -
ఆర్ఎంపీ వివాహేతర సంబంధం.. జ్యోతిని కారులో తీసుకెళ్లి..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను పక్కాగా ప్లాన్ ప్రకారం ఓ ఆర్ఎంపీ హత్య చేశాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే పూడ్చిపెట్టేందుకు యత్నం చేశాడు. కానీ, పోలీసులు రంగం ప్రవేశం చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడ్ మండలంలో మహేష్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక జునూతలలో జ్యోతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో, ఒత్తిడికి గురైన మహేష్.. జ్యోతిని అడ్డుతొలంగిచుకోవాలని చూశాడు. తాజాగా ఆమెతో మాట్లాడిన మహేష్.. బయటకు తీసుకెళ్లే నెపంతో దేవరకొండ నుంచి బాధితురాలిని తీసుకుని కారులో బయలుదేరాడు.అనంతరం, మార్గ మధ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఆగ్రహానికి లోనైన మహేష్.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును బలవంతంగా ఆమెతో తాగించాడు. జ్యోతిని హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్.. ఆమెకు విషపు ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. జ్యోతి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే.. ఆమెను మట్టిలో పూడ్చిపెట్టాలని అనుకున్నాడు. అయితే, మహేష్ వెళ్తున్న కారుపై అనుమానం వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు.. అతడిని వెంబడించారు. కారును ఆపి పరిశీలించగా.. కొన ఊపిరితో ఉన్న జ్యోతిని చూసి వెంటనే.. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే జ్యోతి మృతి చెందింది. అనంతరం, నిందితుడు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. -
రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు.. ఫ్యాక్టరీ ప్రమాదంపై మంత్రి వివేక్
పటాన్చెరు పారిశ్రామికవాడ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. షిఫ్ట్లో 150 మంది కార్మికులు ఉండగా.. ప్రమాదం జరిగిన బ్లాక్లోనే 90 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. మృతుల సంఖ్య 15కి చేరింది. కంపెనీ మేనేజర్ ఒకరు సైతం మృతి చెందినట్లు సమాచారం. 26 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో పలువురిపరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 9గం. సమయంలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు పడిపోయారు. ప్రమాద సమయంలో లోపల కార్మికులు చాలామందే ఉన్నారు. మంటల్లో.. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకునిపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. అలాగే అధికారులు సకాలంలో స్పందించి చుట్టపక్కల ప్రజలను ఖాళీ చేయించడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో.. సహాయక చర్యలపై మంత్రులు కీలక ప్రకటనలు చేస్తున్నారు.భవన శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులుశిథిలాలను తొగించిన కొద్దీ బయటపడుతున్న మృతదేహాలుగుర్తు పట్టరాని స్థితిలో మృతదేహాలుపాశమైలారంలోని ప్రమాద స్థలం నుంచి మరో రెండు మృత దేహాలు వెలికితీత15కి చేరిన మృతుల సంఖ్యమరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై వెలువడని అధికారిక ప్రకటనపరిశ్రమ వద్ద, ఆస్పత్రుల వద్ద కార్మికుల కుటుంబాల నిరీక్షణ.. రోదనలుఆచూకీ లభించక శోకసంద్రంలో కుటుంబాలుభారీ వర్షంలోనూ కొనసాగుతున్న సహాయక చర్యలురేపు సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డిరేపు ఉదయం పాశమైలారం ప్రమాద ఘటన స్థలానికి వెళ్లనున్న రేవంత్పాశమైలారం ఘటనపై సీఎం విచారంక్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరాప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశంగాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎంబాధాకరం: ప్రధాని మోదీ సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతిచాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరంతమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుక్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాంసీఎం రేవంత్ విచారంపాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై సీఎం రేవంత్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలిచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిపటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన రియాక్టర్ పేలుడుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతికార్మికులు చనిపోవడం అత్యంత విషాదకరంగాయపడిన వారిని రక్షించి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధ్యులను శిక్షించాలి 15 నిమిషాల్లో స్పందించాం: మంత్రి వివేక్ఘటన జరిగిన 15నిమిషాల్లో స్పందించాం. కలెక్టర్, జిల్లా యంత్రాగ సమన్వయంతో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వెంటనే 34మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం.. 12మంది ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. మొత్తం ఘటనలో12మంది చనిపోయారు. ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చర్మం, శరీరం తీవ్రంగా కాలిపోయాయి. హైడ్రా కూడా చేరుకుంది.. షాకిలాలను తీసివేస్తున్నారు. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది.. రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు. నిర్లక్ష్యం ఏంటి అనేది ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది. నిజంగా విచారణ జరిపి బాద్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం అని మంత్రి వివేక్ మీడియాకు తెలిపారు.ఎక్కడా నిర్లక్ష్యం లేదు: మంత్రి రాజనర్సింహసిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని.. సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు. సిగచి కంపెనీ ప్రమాదం బాధాకరం. ఉదయం 9గం.ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మూడు గంటల నుంచి ప్రమాద స్థలంలోనే ఉన్నాం. సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఎమర్జెన్సీ సిస్టం ద్వారా త్వరితగతిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాం. ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టల్ పౌడర్ ని తయారు చేస్తుంటారు. మార్నింగ్ 60మంది వర్కర్స్ పనిలో ఉన్నారు. జనరల్ వాళ్ళు 20మంది ఉన్నారు. ఆస్పత్రిలో 34మందికి చికిత్స అందుతోంది. 12 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశాం. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం వైద్యం అందిస్తుంది.. ఎక్కడ నిర్లక్ష్యం లేదు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తాం. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటాం. ప్రతి కార్మిక కుటుంబాన్ని అదుకుంటాం. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదు అని మంత్రి రాజనర్సింహ అన్నారు. ఇదీ చదవండి: ఫ్యాక్టరీ ప్రమాదం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే!👉ఐజీ సత్యనారాయణ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. రియాక్టర్ పేలడంతో ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన టైంలో.. షిఫ్ట్లో 150 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటిదాకా 8 మంది మరణించారు. మూడు ఆస్పత్రుల్లో 26 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉంది.. అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని తెలిపారు. 👉ప్రమాదం తర్వాత.. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ప్రమాదం గురించి తెలియగానే కలెక్టర్, ఐజీ, సంగారెడ్డి ఎస్పీ, అడిషనల్ కలెక్టర్.. అధికార యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 👉ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండడంతో అక్కడున్నవాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరూ రావొద్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు అక్కిడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా ఆంబులెన్స్లు చేరుకుని క్షతగాత్రుల్ని తరలిస్తున్నాయి. భారీ క్రేన్లు, కట్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా బృందం.. అడ్మిన్స్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. -
సీసీటీవీ సాక్షిగా భార్యాభర్తల గొడవ, ఆ మర్నాడే..
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఒక దంపతుల జంట వారి ఇంట్లో అచేతనంగా కనిపించింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ జంట ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. అలాగే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు.జైపూర్లోని ఒక బ్యాంకులో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న ధర్మేంద్ర సమయం గడుస్తున్నా బ్యాంకుకు రాకపోవడంతో, సిబ్బంది అతనికి కాల్ చేశారు. దానికి కూడా సమాధానం రాకపోవడంతో ధర్మేంద్ర స్నేహితుడు అతని ఇంటికి వెళ్లాడు. అతను ఇంటి తలుపు తెరవగానే ధర్మేంద్రతో పాటు అతని భార్య విగతజీవులుగా కనిపించారు.కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారి ఫ్లాట్ పార్కింగ్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా, దానిలో ధర్మేంద్ర, సుమన్లు ఏదో విషయమై తీవ్ర స్థాయిలో అరుచుకుంటూ, వాదించుకోవడం కనిపించింది. ఈ ఫుటేజ్ దంపతులు మృతిచెందడానికి ముందురోజుదిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ వీడియోలో సుమన్ తన భర్త కారు తీయడాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారు తమ ఇంటిలోనికి వెళ్లిపోయారు.అదే రోజు సాయంత్రం నాటి మరో వీడియోలో వారు అపార్ట్మెంట్లోకి ప్రవేశించడం కనిపించింది. ఆ సమయంలో సుమన్ ఒక బ్యాగ్ తీసుకెళుతున్నది. ఇద్దరూ సజీవంగా కనిపించిన చివరి ఫుటేజ్ ఇదే. కాగా ఈ జంట ఇటీవలే ఫ్లాట్ను కొనుగోలు చేశారని, వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని స్థానికులు తెలిపారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ప్రస్తుతం భరత్పూర్లోని తాత ఇంటిలో ఉన్నారు. కాగా సుమన్ తండ్రి అజయ్ సింగ్ పోలీసులతో మాట్లాడుతూ తన కుమార్తె శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని, ఇది హత్యనని ఆరోపించారు.ఇది కూడా చదవండి: Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు -
మరో మలుపు తిరిగిన యాంకర్ స్వేచ్ఛ కేసు
తెలుగు యాంకర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. మృతురాలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. ఇటు తన భర్త అమాయకుడంటూ చెబుతోంది. హైదరాబాద్, సాక్షి: న్యూస్ రీడర్ స్వేచ్ఛా వొటార్కర్(Swetcha Votarkar Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇటు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ సాక్షికి తెలిపింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో నాకు తెలియదు. అది తెలిశాకే పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించింది. నా పిల్లలను కూడా ‘అమ్మా’ అని పిలవాలని భయపెట్టింది. నా భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడు. .. పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసింది అని స్వప్న మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే.. పలు టీవీ ఛానెల్స్లో న్యూస్రీడర్, యాంకర్గా పని చేసిన స్వేచ్ఛ(40) శుక్రవారం రాత్రి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగానే.. స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో.. ఇప్పుడు పూర్ణ భార్య మీడియా ముందుకు రావడం గమనార్హం.యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన.. కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణ చందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.. పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం అని అన్నారాయన. లొంగిపోయే ముందు పూర్ణ చందర్ మీడియాకు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో ఏం ఉందంటే.. నాకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసు. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశాం. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను నాతో పంచుకుంటూ ఉండేది. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైంది. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేశాయి. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా నా వద్దకు తీసుకువచ్చింది. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నాను. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా లేదు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేది అని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. -
నాన్నా.. ఈ మెంటల్ టార్ఛర్ భరించలేకున్నా!
అన్నానగర్: తిరుప్పూర్ జిల్లా అవినాశిలోని కైకాట్టిపుదూర్ ప్రాంతానికి చెందిన అన్నాదురై బనియన్ కంపెనీ నడుపుతున్నాడు. ఇతని కూతురు రిదన్య ( 27). ఈమెకి కైకట్టిపుదూర్ లోని జయం గార్డె¯న్కు చెందిన కవింకుమార్కు మూడు నెలల క్రితం వివాహమైంది. శనివారం ఇంటి నుంచి కారు తీసుకెళ్లిన రిదన్య ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇంతలో, మొండిపాళయం సమీపంలోని చెట్టిపుత్తూరులో కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు మింగి రిదన్య తన కారులో మృతి చెంది కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న సేవూర్ పోలీసులు రిదన్య మతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కుటుంబ వివాదం కారణంగా రిదన్య విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు రిదన్య తన తండ్రికి వాట్సాప్ ద్వారా కొన్ని ఆడియోలను పంపింది. పోలీసులు వాటిని స్వా«దీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భర్త కవిన్కుమార్, మామగారు ఈశ్వరమూర్తి, అత్తగారు చిత్రాదేవి, ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొంది. ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని వెల్లడించింది. రిదన్యకు పెళ్లయి 3 నెలలే కావడంతో, ఆర్టీఓ దర్యాప్తు కూడా జరుగుతోంది. -
Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో విద్యార్థినిపై జరిగిన అకృత్యం దేశవ్యాపంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. బాధితురాలిని ఇద్దరు నిందితులు కళాశాల లోపలికి బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనిపించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుని నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించిన నేపధ్యంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.అత్యాచార బాధితురాలిని కళాశాల గేటు నుండి కళాశాల ప్రాంగణంలోకి ఇద్దరు నిందితులు బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో బయటపడ్డాయని కోల్కతా పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా మరో ఇద్దరు నిందితులతో తనను బలవంతంగా గార్డు గదిలోనికి తీసుకువెళ్లాలని ఆదేశించాడని బాధితురాలు చెప్పడాన్ని ఈ వీడియో క్లిప్ ధృవీకరిస్తోంది. ప్రస్తుతం తాము ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఈ కేసులో నిందితులు మనోజిత్ మిశ్రా, ప్రోమిత్ ముఖర్జీ, జైద్ అహ్మద్, కాలేజీ సెక్యూరిటీ గార్డులను ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేశారు. మనోజిత్ బాధితురాలిపై అత్యాచారం చేశాడని, మిగిలిన ఇద్దరు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియో చిత్రీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనోజిత్ మిశ్రా తృణమూల్ యువజన విభాగంలో సభ్యునిగా ఉన్నారు. దీంతో పార్టీపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోంది.ఇది కూడా చదవండి: Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు -
మేం ఉండలేం.. బావమరదలు ఒకేసారి...
సాక్షి, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఓ రిసార్టులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నారు. కాగా, ఇద్దరు సన్నిహితంగా ఉండటంతో వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియో, లేఖలో పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీబీనగర్ ఎస్ఐ రమేశ్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాకు చెందిన బంధబాల సుధాకర్ (39), రామంతాపూర్లోని గాంధీ నగర్కు చెందిన పాసాల సుష్మిత (35) సమీప బంధువులు. ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నారు. వీరి స్వగ్రామం నల్గొండ జిల్లా కేతేపల్లి.. ఇద్దరు వరుసకు బావామరదలు అవుతారు. ఇరు కుటుంబాలు ప్రస్తుతం రామంతపూర్లో నివాసం ఉంటున్నారు. అయితే, వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో తగాదాలు జరుగుతున్నాయి.ఇదే కారణంగా నల్గొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్లో సుష్మితపై ఆమె భర్త కేసు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురై రెండు రోజుల కిందట బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్లో సుష్మిత, సుధాకర్ రూమ్ తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకుంటున్నట్లు సుధాకర్ తన బావ రంజిత్కి వీడియో కాల్ చేసి చెప్పాడు. కానీ ఎక్కడ నుంచి ఫోన్ చేసినట్లు చెప్పలేదు. ఉప్పల్ పోలీసుల సాయంతో బీబీనగర్ పోలీస్ స్టేషన్కు రంజిత్ సమాచారం ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం మొబైల్ నెట్వర్క్ ఆధారంగా కొండమడుగు శివారులోని రిసార్ట్స్కు చేరుకొన్నారు. వారు ఉంటున్న రూమ్ తలుపులు పగులకొట్టి చూసేసరికి ఇద్దరు మృతి చెంది ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఇదిలాఉండగా.. చనిపోయే ముందు సుష్మిత, బాల సుధాకర్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోలో బాల సుధాకర్ మాట్లాడుతూ.. ఆయన భార్య తనను వేధిస్తోందన్నారు. ప్రతీ విషయంలో తనను అనుమానిస్తున్నట్టు తెలిపారు. అలాగే, సుష్మిత మాట్లాడుతూ.. తన భర్త వేధింపులు భరించలేకపోతున్నాను. బాల సుధాకర్తో మాట్లాడినందుకే నాతో అక్రమ సంబంధం అంటగట్టాడు. అందరిలో నన్ను తల దించుకునేలా చేశాడు అని తెలిపారు. అంతకుముందు వీరిద్దరూ కలిసి ఓ లేఖ కూడా రాసిపెట్టి పలు విషయాలను అందులో వెల్లడించారు. -
రథయాత్రలో తొక్కిసలాట
పూరీ: ఒడిశాలో విఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో గుండిచా ఆలయం ఎదుట తొక్కిసలాట జరగడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు.మూడు రథాల్లో కొలువుదీరిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను దగ్గరి నుంచి తిలకించడానికి గుండిచా ఆలయం వద్ద భక్తులు ఇసకేస్తే రాలనంతగా గుమిగూడారు. అంతలో యాత్రా సామగ్రితో రెండు ట్రక్కులు జనం మధ్యలోకి దూసుకొచ్చాయి. దాంతో భయాందోళనకు గురై వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాటలో బోలాగఢ్కు చెందిన బసంతి సాహూ (36), బాలిపాట్నాకు చెందిన ప్రేమకాంత్ మొహంతీ (80), ప్రవతి దాస్ (42) మరణించారు. అధికారులపై వేటు తొక్కిసలాటపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వయిన్, ఎస్పీ వినీత్ అగర్వాల్పై బదిలీ వేటు వేశారు. డీసీపీ బిష్ణు పాటీ, కమాండెంట్ అజయ్ పాధీని సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. జగన్నాథుడి భక్తులు క్షమించాలంటూ ‘ఎక్స్’లో సీఎం పోస్టు చేశారు. రథయాత్రలో తొక్కిసలాటకు భద్రతా లోపాలే కారణమని దర్యాప్తులో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. రథయాత్ర ఇన్చార్జిగా సీనియర్ అధికారి అరవింద్ అగర్వాల్ను నియమించింది.పరిస్థితి అదుపులోకి వచి్చందని న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం మనసును కలచివేసిందని పూరీ రాజు, శ్రీజగన్నాథాలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ చెప్పారు. ఇవి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాందీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పటా్నయక్ తదితరులు సంతాపం ప్రకటించారు.ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఘోరం జరిగిందని విమర్శించారు. పూరీలో రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. సంప్రదాయం ప్రకారం మూడు రథాలు ప్రధానాలయం నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి శనివారం చేరుకున్నాయి. గుండిచా మాతను జగన్నాథ, బలభద్ర, సుభద్రల తల్లిగా భావిస్తారు. రథాలు జూలై 5 దాకా అక్కడే ఉంటాయి. అనంతరం బహుదా యాత్ర ద్వారా ఆలయంలోకి తిరుగు ప్రయాణం అవుతాయి. -
అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..!
వారిది కచ్చితంగా అన్యోన్య దాంపత్యమనే చెప్పొచ్చు. కానీ వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక్కడ అన్యోన్య దాంపత్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అది సీసీ టీవీ ఫుటేజ్ చెబుతున్న మాట. మనిషి మాట నమ్మని ఈ రోజుల్లో.. సీసీ టీవీ ఫుటేజ్ ‘మాట’ కచ్చితంగా నమ్ముతాం. వీరు శవాలుగా మారకముందు గత రెండు రోజుల సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించి చూస్తే వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మరి ఈ జంట ఎలా చనిపోయిందనేది ప్రశ్న. ఏమైనా చిన్నపాటి మనస్పర్థలు తలెత్తి అది ఆత్మహత్య వరకూ వెళ్లిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగానే ఈ కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.రాజస్థాన్ రాష్ట్రంలోనే జైపూర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దంపతుల్లో భర్త పేరు ధర్మేంద్ర కాగా, భార్య పేరు సుమన్. వీరికి 11, 8 ఏళ్లు కల్గిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి ఇద్దరు భరత్పూర్ గ్రామంలో తమ నానమ్మ, తాతయ్యలు దగ్గర ఉంటున్నారు. సమ్మర్ హాలీ డేస్కు తాతయ్య ఇంటికి వెళ్లిన ఆ పిల్లలు ఇంకా రాలేదు.ధర్మేంద్ర- సుమన్ జంట ఈ శుక్రవారం(జూన్ 27వ తేదీ) తమ ఫ్లాట్లో విగతజీవులుగా కనిపించారు. అంతకుముందూ వరకూ ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట.. ఎందుకు ఇలా చేశారు అనేది చర్చగా మారింది. ధర్మేంద్ర బ్యాంక్ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ధర్మేంద్ర బ్యాంక్కు వెళ్లకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని సదర ఉద్యోగి.. ధర్మేంద్ర బంధువులకు తెలియజేశాడు. దీంతో వారు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఆ జంట విగతజీవులుగా కనిపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు. ఇటీవలే రీసెంట్గా ఫ్లాట్ కొనుగోలు చేసిన వీరి ఆర్థికపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు అంటున్నారు. మూడు సీసీ ఫుటేజ్లో ఇలా..ఒక సీసీ ఫుటేజ్లో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వారు ఫ్లాట్లో కారు పార్కు చేసే క్రమంలో భార్య సుమన్.. భర్త ధర్మేంద్ర భుజంపై తలపెట్టుకుని అతని చేతుల్ని పట్టుకుని ఉంది. ఆపై కారు దిగి వెళ్లిపోతున్న వీడియోలో ఆమె భుజంపై భర్త ధర్మేంద్ర చేయి వేసి నడుచుకుంటూ వెళ్లినట్లు ఉంది. అయితే వారు చనిపోవడానికి ముంద రోజు గురువారం మాత్రం ఇద్దరికీ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం భార్య సుమన్.. ఒక క్యారీ బ్యాగ్ తీసుకుని వెళుతున్నట్లు కనిపించింది. అదే వారు చివరిసారి సజీవంగా కనిపించడం. ఆ తర్వాత రోజే ఈ దారుణం చోటు చేసుకుంది. సుమన్ ఒంటిపై గాయాలుఅయితే భార్య సుమన్ ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబంలో ఎటువంటి వైవాహిక విభేదాలు ఉన్నట్లు తమకు కనిపించలేదని పోలీస్ అధికారి అజయ్ సింగ్ తెలిపారు. అయితే ఇద్దరూ సూసైడ్ చేసుకుని ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏమైనా క్లూ దొరుకుతుందనే కోణంలో వారి మొబైల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. -
పెళ్లి కోసం ‘రీల్స్’లో ఆస్తి చూపించాడు.. వివాహమైన రెండు గంటలకే..
జబల్పూర్: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలపై హత్యలకు తెగబడుతున్న మహిళల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఇటువంటి ఘటనలను విన్నవారు విస్తుపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. జబల్పూర్కు చెందిన ఇంద్ర కుమార్ తివారీ(45)ని పెళ్లి పేరుతో వంచించి, అతనిని అంతమొందించిన సాహిబా బానో అనే మహిళను ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరెస్టు చేశారు.జూన్ 6న ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లోని హటా ప్రాంతంలోని ఒక కాలువలో ఒక పురుషుని మృతదేహం బయటపడిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. తొలుత ఈ మృతదేహం ఎవరిదైనదీ తెలియలేదు. దర్యాప్తులో కొన్ని వారాల తర్వాత జబల్పూర్లో అదృశ్య వ్యక్తితో ఈ మృతదేహాన్ని పోల్చి చూడగా, అది ఇంద్ర కుమార్ తివారీ మృతదేహమని తేలింది.ఈ హత్య వెనుక సూత్రధారి సాహిబా బానో అని, ఆమె ఖుషీ తివారీగా పేరు మార్చుకుని ఇంద్రకుమార్ను ఆకట్టుకున్నదని పోలీసులు తెలిపారు. పెళ్లికాని ఇంద్రకుమార్ ఇటీవల తనకు గల భూమి వివరాలను చెబుతూ ఒక రీల్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన సాహిబా బానో ఆ భూమిని దక్కించుకోవాలనే ఆశతో, అతనిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.సోషల్ మీడియాలో అతనిని సంప్రదించి, తన పేరు ఖుషీ తివారీ అని పరిచయం చేసుకుని, గోరఖ్పూర్కు రావాలని ఆహ్వానించింది. తర్వాత తన ఇద్దరు సహచరుల సహాయంతో ఇంద్రకుమార్ను వివాహం చేసుకుంది. కొన్ని గంటల తర్వాత తివారీని హత్య చేసి, అతని మృతదేహాన్ని తన సహచారుల సాయంతో కాలువలో పడేసింది. ఈ కేసులో పోలీసులు సాహిబాతో ఆమెకు సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోల్కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్ రిపోర్టులో వెల్లడి
కోల్కతా: కోల్కతాలోని లా కాలేజీలో జూన్ 25న అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లా విద్యార్థిని(24)కి నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమెపై శారీరక దాడి జరిగినట్లు స్పష్టమయ్యింది. బాధితురాలి మెడ, ఛాతీపై కమిలిపోయిన గుర్తులను మెడికల్ రిపోర్టు వెల్లడించింది. బాహ్య జననేంద్రియం లేదా నోటిపై ఎటువంటి గాయాలు కనిపించనప్పటికీ, ఫోరెన్సిక్ నిర్ధారణ మేరకు లైంగిక దాడిని వైద్యులు తోసిపుచ్చలేదు.26న రాత్రి 10 గంటలకు కోల్కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి వైద్యపరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్లను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దీనిలో మూత్ర గర్భ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లా విద్యార్థిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్నదని ఒక అధికారి తెలిపారు.ఈ కేసులో కోల్కతా పోలీసులు తాజాగా నాల్గవ వ్యక్తి, సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణ సమయంలో గార్డు సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ అరెస్టుతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య నాలుగుకు చేరింది. గార్డు గదిలో ఈ లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) సమావేశం తర్వాత తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ సమయంలో తన తలపై హాకీ స్టిక్తో కొట్టారని, రాత్రి 10:50 గంటల ప్రాంతంలో నిందితులు తనను విడిచిపెట్టారని తెలిపింది. ఇది కూడా చదవండి: 20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్.. దేనికి సంకేతం? -
కోర్టు భవనంపై నుంచి దూకిన కుటుంబం
మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ: అత్త, భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి శనివారం మెదక్ జిల్లా కోర్టుకు వచ్చాడు. కేసుకు హాజరైన అనంతరం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. ఘటనలో భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలు, అతడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన డాకొల్ల నవీన్ ఐదేళ్ల క్రితం మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య (24)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్లలోపు ఆడపిల్లలు రుచిక, యశ్విక ఉన్నారు. గతేడాది నవీన్ తన అత్తగారిల్లు లక్ష్మాపూర్కు వచ్చి గొడవపడ్డాడు. ఈ క్రమంలో అత్త రాజమణి, భార్య రమ్యను చంపే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో రామాయంపేటలో నవీన్పై హత్యాయత్నం కేసు నమోదుకాగా, జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో రమ్య సైతం నవీన్పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇటీవలే లోక్అదాలత్లో ఈ కేసుపై వారిద్దరూ రాజీపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అత్త, భార్యపై హత్యాయత్నం కేసు విషయమై శనివారం కోర్టుకు హాజరైన నవీన్.. భార్య పిల్లలతో కలిసి కోర్టు భవనంపైనుంచి దూకాడు. భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా నవీన్, పిల్లలు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. అదనపు ఎస్పీ మహేందర్ ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, నవీనే భార్యాపిల్లలను చంపే కుట్రలో భాగంగా భవనంపైనుంచి తోసిఉంటాడని రమ్య కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. తల్లడిల్లుతున్న చిన్నారులు.. కాగా, బాలిక రుచికకు ఎడమ చేయి మూడు చోట్ల విరిగింది. ఛాతీలోనూ తీవ్ర గాయమైంది. ఏడాది న్నర వయసున్న యశ్విక నోట్లోని పళ్లన్నీ రాలిపో యాయి. తీవ్రగాయాలతో ఉన్న ఆ చిన్నారులను చూసిన వారంతా చలించిపోతున్నారు. -
డబ్బుల కోసం తల్లికి నిప్పంటించి..
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు. -
Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్
కోల్కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ లా ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కోల్కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు.నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రికి సోనీ
హైదరాబాద్: రైలు పట్టాలపై కారు నడిపిన కేసులో నిందితురాలైన వోమికా సోనీని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె మానసిక స్థితి బాగోలేనందున తొలుత చికిత్స తీసుకోవాలని, అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు పర్చాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. 2025 జూన్ 26న(గురువారం) శంకర్పల్లి (రంగారెడ్డి జిల్లా) నాగులపల్లి వద్ద ఓ మహిళ రైలు పట్టాలపై కారు నడిపి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్లపాటు ఆమె అలా పట్టాలపై కారు పోనిచ్చింది. అది గమనించిన స్థానికులు, రైల్వే పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో రాడ్తో ఆమె అందరిపై దాడికి యత్నించింది. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి కారు ఆగిపోగా.. ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఫలితంగా 45 నిమిషాల పాటు రైలు సేవలు నిలిచిపోయాయి. బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిచే 15 రైలు దారి మళ్లించారు. ఘటనకుగానూ ఆమెపై పోలీసులు, రైల్వే పోలీసులు విడివిడిగా కేసు నమోదు చేశారు. తొలుత మద్యం మత్తులో ఆ మహిళ అలా చేసి ఉండొచ్చని పోలీసుల భావించారు. అయితే.. ఆమె పేరు వోమికా సోని(34) అని, లక్నో(యూపీ)కి చెందిన మహిళ అని తర్వాత నిర్ధారించుకున్నారు. ఐటీ జాబ్ పొగొట్టుకున్న ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని.. ఆపై తన కియా కారుతో ఇలా పట్టాలపై బీభత్సం సృష్టించిందని పోలీసులు తేల్చారు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక.. ఆమెపై చర్యల అంశాన్ని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.Video: Woman Drives Car On Railway Track, Disrupts Train Services pic.twitter.com/5MSyXJXzbG— NDTV (@ndtv) June 26, 2025 -
వివాహేతర సంబంధం వద్దన్నా వినలేదు!
అన్నానగర్: వివాహేతర సంబంధం నడుపుతుందన్న కోపంతో భార్యను భర్త కొట్టి, గొంతునులిమి చంపేశాడు. చెన్నై సమీపంలోని పెరుంబాక్కంలో ఉన్న హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అపార్ట్మెంట్లో నివసిస్తున్న జాహీర్ హుస్సేన్ (39)కు సుప్రియ భేగం(26) భార్య ఉంది. వీరు ఉత్తర రాష్ట్రానికి చెందినవారు. వీరిద్దరూ వేర్వేరు ప్రైవేట్ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. దీంతో ఆగ్రహించిన జాహీర్ హుస్సేన్, సుప్రియా బేగంపై దాడి చేసి, గొంతు నులిమాడు. అప్పుడు ఆమె స్పృహ తప్పింది. దీంతో వెంటనే ఆమెను రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, సుప్రియభేగం అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరుంబాక్కం పోలీసులు జాహీర్ హూస్సెన్ను అరెస్టు చేసి, విచారించారు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, మందలించిన వివాహేతర సంబంధాన్ని వదులకపోవడంతో ఆమెను కొట్టి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. -
ఫరీదాబాద్ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్లో రెండు నెలలుగా కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఆ మహిళ మృతదేహాన్ని ఆమె అత్తమామలే స్వయంగా తమ ఇంటి ముందు పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో మామనే ఆమైపై అత్యాచారం చేసి, హత్య చేశారని వెల్లడయ్యింది. ఇందుకు మృతురాలి అత్త, భర్త కూడా సహకరించారని తెలుస్తోంది.మృతురాలు తన్ను ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్కు చెందినది. ఆమెకు రెండేళ్ల క్రితం అరుణ్ సింగ్తో వివాహమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మామ భూప్ సింగ్, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తన్ను భర్త అరుణ్ పరారీలో ఉన్నాడు. తమ కోడలు తన్ను అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ విషయం బయటకు పొక్కకుండా అత్తామామలు జాగ్రత్తపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 21న రాత్రి అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అర్థరాత్రి తన్ను గదిలోకి ప్రవేశించిన మామ అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణం తర్వాత అతను తన కుమారుడు అరుణ్ను పిలిచాడు. వారిద్దరూ కలిసి తన్ను మృతదేహాన్ని.. అప్పటికే వీధిలో తవ్విన గొయ్యిలో పడవేసి, దానిపై ఇటుకలు, మట్టిని పోశారు. ఆ గొయ్యి మురుగునీటి కోసం తవ్వినదని భూప్ సింగ్ చుట్టుపక్కలవారికి తెలిపాడు. దీనిపై అనుమానించిన స్థానికులు తహశీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ గొయ్యిని తవ్వించగా, తన్ను మృతదేహం బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు మామ భూప్ సింగ్, అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్ కుమార్తె కాజల్పై కేసు నమోదు చేశారు. కాగా తమకుమార్తె తన్నును కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని, వివాహం తర్వాత కూడా తమ కుమార్తె ఏడాదిపాటు తమ ఇంటిలోనే ఉన్నదని ఆమె తండ్రి రోదిస్తూ మీడియాకు తెలిపాడు.ఇది కూడా చదవండి:‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్కు భారత్ మరో షాక్ -
యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ‘సాక్షి’కి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడి (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
కోల్కతా: దేశమంతటా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ కాలేజీ మెడికోపై హత్యాచార ఘటనను మరవకముందే కోల్కతాలో అలాంటిదే మరో దారుణం జరిగింది. సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు.అతనో క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అదే లా కాలేజీలో చదివాడు. 45 రోజుల కాంట్రాక్టుపై ప్రస్తుతం కాలేజీలో బోధనేతర విధుల్లో పనిచేస్తున్నాడని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నైనా చటర్జీ చెప్పారు. అంతేగాక అలీపోర్ పోలీస్ అండ్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్గా చేస్తున్నట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. టీఎంసీకి చెందిన పలువురు నేతలతో మోనోజిత్కు దగ్గర సంబంధాలున్నట్లు సమాచారం. ఘటనపై వామపక్ష విద్యార్థి విభాగం, కాంగ్రెస్ శ్రేణులు కస్బా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.తృణమూల్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు అత్యాచారోదంతంపై తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘యువతులు తాము ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నామో చూసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి చోటా మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ ఉదంతంపై నిరసనలు పెరిగి పెద్దవవుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ప్రధాన నిందితుడు మోనోజిత్తో పారీ్టకి సంబంధం లేదని ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొంది. కానీ తృణమూల్ ప్రకటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ తృణమూల్ నేతలతో పాటు మోనోజిత్ ఎన్నోసార్లు వేదికలపై కని్పంచినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతకు సీఎంగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి మండిపడ్డారు. -
ముంచెత్తే మత్తు..బతుకే చిత్తు
కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దందా గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. యువత, కళాశాలల విద్యార్థులు, పాఠశాలల్లో చదువుకునే బాలలే లక్ష్యంగా మాదకద్రవ్యాల ముఠాలు చెలరేగిపోతున్నాయి. పాలకులకు రెడ్బుక్ పేరిట రాజకీయ కక్షలు సాధించడంతో సరిపోతోంది. దీంతో డ్రగ్స్ దెబ్బకు యవత బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది.నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకైన్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థులే లక్ష్యంగా... శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. రాజధాని ప్రాంతంలోనే ఎక్కువమంగళగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వా«దీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య
తెలుగు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar)(40) శుక్రవారం బలవర్మణానికి పాల్పడ్డారు. చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్నగర్లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వివరాల ప్రకారం...ఫ్యానుకు చున్నీతో ఉరేసుకొని తనువు చాలించింది. ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. కూతురు, మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నారని సమాచారం. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా.. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.న్యూస్ రీడర్, ప్రేసెంటెర్, యాంకర్ గా పలు న్యూస్ చానెల్స్ లో పని చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గాను ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్గా ఎన్నికయ్యారు కూడా.చిన్న వయసులో యాంకర్ స్వేచ్ఛ.. అదీ బలవన్మరణానని పాల్పడటం పట్ల పలువురు జర్నలిస్టులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?
మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు. ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే ఆ ట్రైన్ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్లో..ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది. ఇటీవల సియోల్కు చెందిన వాన్ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు. సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ట్రైన్ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్ డబ్బా బ్యాగ్తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్ కోచ్లో జనం కాస్త సంతోషంగా కనిపించారు. తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్లోని ప్రయాణికులు పరుగులు తీశారు. పెట్రోల్ మొత్తం కోచ్ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి. సముద్రగర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిందితుడు వాన్ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 240,000 యూఎస్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వాన్పై హత్యాభియోగాలుఈ దారుణానికి పాల్పడ్డ వాన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కదులుతున్న ట్రైన్లో ఘటన జూన్ 9న జరగ్గా, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు. ట్రైన్లో పెట్రోల్ పోసిన ఘటన వీడియో వైరల్గా మారింది.서울지하철 5호선 방화범 CCTV사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH— 브이몬 (@XXV_mon) June 25, 2025 -
కాంట్రాక్టర్ హంతకులపై తూటా
దొడ్డబళ్లాపురం: హావేరి జిల్లా శిగ్గాంవి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన కాంట్రాక్టర్ శివానంద కున్నూరు (40) హత్య కేసులో నిందితులపై పోలీసులు ఫైరింగ్ చేశారు. నిందితులు అష్రఫ్, నాగరాజు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, వారికి హావేరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హుబ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మూడురోజుల కిందట పట్టపగలు నలుగురు దుండగులు శివానందను కత్తులతో నరికి చంపడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ హత్య వీడియోలు వైరల్ అయ్యాయి.దాగి ఉండగా..పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి వారి కోసం శోధించారు. హానగల్ తాలూకా కొండోజి క్రాస్ వద్ద నిందితులు దాగి ఉన్నట్టు తెలిసి గురువారం తెల్లవారుజామున అరెస్టు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. శిగ్గాంవి సీఐ సత్యప్ప, ఎస్సై సంపత్ నిందితుల కాళ్లకు షూట్ చేయడంతో గాయాలై దొరికిపోయారు. ఈ ఘటనలో సత్యప్ప, సంపత్, కానిస్టేబుల్ రవికి స్వల్ప గాయాలయ్యాయి. హత్యకు ఆర్థిక వ్యవహారాలు, లేదా అక్రమ సంబంధం కారణమని అనుమానాలున్నాయి. ఇప్పటికే సుదీప్, సురేష్ గౌళి, హనుమంత అనే ముగ్గురు అరెస్టయ్యారు. -
కాళ్లు, చేతులు కట్టేసి.. డ్రమ్ములో కుక్కేసి..
మరో ఘోర ఉదంతం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బ్లూ కలర్ డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహాం బయటపడింది. దీంతో యూపీ మీరట్ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. మీరట్లో ఓ మహిళ గంజాయి మత్తులో తూలుతూ.. ప్రియుడి సాయంతో తన భర్తను చంపి మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టిన సంగతి తెలిసిందే.ఛండీగఢ్: మీరట్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. పంజాబ్లోని లూధియానాలో ఓ డ్రమ్ములో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మెడ, కాళ్లను తాడుతో కట్టి.. డ్రమ్ములోకి కుక్కిన వైనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూన్ 25వ తేదీన.. ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి చెత్త ఏరుకుంటుండగా దుర్వాసన వస్తుండడం చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్ల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు డ్రమ్ము నుంచి మృతదేహాన్ని స్వాధీనపర్చుకున్నారు. డ్రమ్ములో ఓ బెడ్షీట్లో మృతదేహం చుట్టి ఉంది. చనిపోయిన వ్యక్తికి 40 ఏళ్ల వయసు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఒంటిపై గాయాలు లేవని.. పోస్ట్మార్టం నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు. లోతైన దర్యాప్తు.. డ్రమ్ము కొత్తగా ఉండడంతో.. లూథియానాలో 42 డ్రమ్ము తయారీ యూనిట్లకు, దుకాణాలకు వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకుని.. ఈ మధ్యకాలంలో కనిపించకుండా పోయిన వ్యక్తల జాబితాతో మృతుడి వివరాలు సరిపోల్చుకుంటున్నారు. మీరట్ సౌరభ్ రాజ్పుత్ హత్య కేసు ఇలా.. ఫిబ్రవరి 24, 2025:మర్చంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్పుత్ లండన్ నుంచి తన కుమార్తె పుట్టినరోజు కోసం భారత్కు వచ్చారు. ఫిబ్రవరి 25, 2025:భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి హత్యకు ప్రయత్నించారు. కానీ ఆ రోజు ప్రయత్నం విఫలమైంది. మార్చి 3, 2025:సౌరభ్ను కత్తితో పొడిచి హత్య చేశారుశరీరాన్ని ముక్కలు చేసి, తల, చేతులను వేరు చేశారుశరీర భాగాలను మిక్సర్ గ్రైండర్లో వేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు మార్చి 4-5, 2025సిమెంట్, డ్రమ్ములు కొనుగోలు చేసి శరీర భాగాలను డ్రమ్ములో వేసి సిమెంట్ పోసారుడ్రమ్మును ఇంట్లో దాచారుమార్చి 10, 2025 (సుమారు):డ్రమ్ము నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అనుమానం వ్యక్తం చేశాడుసౌరభ్ కూతురు ‘‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’’ అని చెప్పినా, మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు మార్చి 20–25, 2025:పోలీసులు డ్రమ్మును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారుఫోరెన్సిక్ బృందం బెడ్షీట్లు, బాత్రూమ్ టైల్స్పై రక్తపు మరకలు గుర్తించిందిసూట్కేస్లో కూడా రక్తపు ఆనవాళ్లు లభించాయి మార్చి 26–27, 2025:ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా అరెస్టయ్యారుఇద్దరూ నేరాన్ని అంగీకరించారుముస్కాన్కు 2019 నుంచి సాహిల్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడించారు ప్రస్తుతం నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా జైలులో ఉన్నారు. ముస్కాన్ ఆరు నెలల గర్భవతి కావడంతో ఆమెను ప్రత్యేక బ్యారక్లో ఉంచారు. ఆమె జైలులో లా చదివే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
భవనం టెర్రస్ పైకి యువతి.. రీల్స్ పిచ్చే బలి తీసుకుందా?
బెంగళూరు: తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిన ఒక యువతి, నిర్మాణంలో ఉన్న భవనంలోని 13వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం రాత్రి ఆ మహిళ తన స్నేహితుల బృందంతో కలిసి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ భవనానికి వెళ్లిందని పోలీసులు వెల్లడించారు.పార్టీ మధ్యలో యువతి రీల్స్ కోసం టెర్రస్పైకి వెళ్లింది.. అక్కడ వీడియో తీసుకుంటూ కాలుజారి నుంచి కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు బీహార్కు చెందిన యువతిగా గుర్తించారు. నగరంలోని ఓ షాపింగ్ మార్ట్లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటననుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే, ఆమె రీల్ షూట్ కోసమే భవనం టెర్రస్పైకి వెళ్లినట్లు చెబుతున్నప్పటికి.. ఆమె ఫోన్ నుంచి అలాంటి రికార్డింగ్ ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ఆ యువతి ప్రమాదవశాత్తు పడిపోయిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
కర్నూలు: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 అక్టోబర్ 22న బాధిత బాలిక (4) ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గుడిసె రుద్రేశ్ (22) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు బనగానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ నరసింహారెడ్డి కేసు విచారించి నిందితుడిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. జరిమానా మొత్తాన్ని బాధిత బాలికకు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో ఆదేశించారు. -
‘హనీమూన్ మర్డర్’లా పోలీసులకు చిక్కొద్దని..
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. మేఘాల య హనీమూన్ మర్డర్ తరహాలో హత్య చేయించి.. అక్కడిలా తాము పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అనంతరం లడాఖ్ లేదా అండమాన్కు వెళదామని ప్రియుడు, ప్రేయసి ప్లాన్ వేశారు. ఇందుకోసం ముందుగానే రూ.20 లక్షల రుణం కూడా తీసుకున్నారు. కానీ పోలీసులు సీసీ ఫుటేజీ, సెల్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన తేజేశ్వర్ హత్య కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. తేజేశ్వర్తో ఐశ్వర్య పరిచయం ఇలా..గద్వాలలోని గంటవీధికి చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్. సుజాత కర్నూలులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. ఈమె పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్. ఈమె కూతురే ఐశ్వర్య అలియాస్ సహస్త్ర. తల్లీకూతురు తరచూ గద్వా లలోని బంధువుల ఇంటి వచ్చేవారు. ఈ క్రమంలోనే తేజేశ్వ ర్తో ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి కులాలు ఒక్కటే కావడంతో పెద్దలు పెళ్లి చేయాలనుకున్నారు. ఇదిలా ఉండగా, సుజాతకు బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తిరుమలరావు ఐశ్వర్యతోనూ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష యాన్ని దాచి ఎలాగైనా తన కూతురికి పెళ్లి చేయాలని సుజాత అనుకుంది. తేజేశ్వర్తో ఐశ్వర్య నిశ్చితార్థం చేయించింది. ఇది ఇష్టంలేని ఐశ్వర్య తిరుమలరావుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపో యింది. దీంతో పెద్దల సమక్షంలో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకు న్నారు. కొన్ని రోజుల తర్వాత తేజేశ్వర్, ఐశ్వర్య ఫోన్ లో మాట్లాడుకొని పెద్దల సమక్షంలో మే 18న బీచుప ల్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం కూడా ఐశ్వర్య తిరుమలరావుతో తరచూ ఫోన్లో మాట్లాడేది. ఈ విషయాన్ని గ్రహించిన తేజేశ్వర్ భార్యను మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో ఐశ్వర్య, తిరుమలరావు కలిసి తేజేశ్వర్ను హత్య చేసేందుకు పథకం వేశారు.నమ్మించి.. హత్య చేశారిలా..: తేజేశ్వర్ను హత్య చేసేందుకు కర్నూలు జిల్లా కృష్ణానగర్కు చెందిన సుపారీగ్యాంగ్ కుమ్మరి నాగేష్, చాకలి పరుశరాముడు, చాకలి రాజుతో రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్నా రు. దీంతో ఆ గ్యాంగ్ ఫోన్ ద్వారా తేజేశ్వర్తో పరిచయం పెంచుకుంది. మీ జిల్లాలో తక్కువ ధరలకు భూములు ఉంటే చూపించండి అందుకు తగిన పారితోషికం ఇస్తామని నమ్మించారు. సర్వేయర్ కావడంతో తేజేశ్వర్ వారితో పలుమార్లు వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన భూములు కొనుగోలు చేస్తామని సుపారీ గ్యాంగ్ ఏపీ 39 యూకే 3157నంబర్ గల కారులో గద్వాలకు వచ్చారు. కారులో తేజేశ్వర్ ఎక్కించుకొని పలు ప్రాంతాలు తిరిగి వస్తుండగా, పథకంలో భాగంగా గద్వాల మండలం వీరాపురం శివారులో పరుశరాముడు మొదట కొడవలితో తేజేశ్వర్పై దాడి చేశాడు. ఆ వెంటనే చాకలి రాజు, కుమ్మరి నగేష్ కొడవలి, కత్తితో విచాక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తేజేశ్వర్ కారులోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని నగేష్ వాట్సప్ కాల్ ద్వారా తిరుమలరావుకు చెప్పగా, మృతదేహాన్ని పంచలింగాల దగ్గరలో ఉన్న ఒక వెంచర్ వద్దకు తీసుకు రావాల్సిందిగా ఆదేశించాడు. బీచుపల్లి బ్రిడ్జి మీదుగా వస్తున్న క్రమంలో తేజేశ్వర్ ఫోన్, ల్యాప్టాప్ బ్యాగ్ ను కృష్ణానదిలో పడేశారు. అక్కడకు వచ్చాక తిరుమ లరావు తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి నిర్ధారించుకు న్నాడు. అనంతరం వారికి రూ.లక్ష అందజేశాడు. అనంతరం సుపారీ గ్యాంగ్ నంద్యాల సమీపంలోని పాణ్యం మండలంలోని గాలేరు నగరి కెనాల్ సమీపంలోని జమ్ములో తేజేశ్వర్ మృతదేహాన్ని పడేడి కర్నూలుకు వచ్చారు. తిరుమలరావు తండ్రి తిరుపతయ్య ద్వారా 19, 20 తేదీల్లో 2.50 లక్షల నగదు తీసుకున్నారు జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. నిఘా పెట్టితేజేశ్వర్ను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ పలుమార్లు యత్నించింది. ఈ క్రమంలోనే తిరుమలరావు జీపీఎస్ ట్రాకర్ను కొనుగోలు చేసి ఓ ఇన్ఫార్మర్ సహాయంతో తేజేశ్వర్ బైక్కు అమర్చారు. అప్పటి నుంచి తేజేశ్వర్ విషయాలను నిత్యం తిరుమలరావు ఐశ్వర్యతో తెలుసుకుంటూ ఓ పథకం వేసుకున్నారు. తేజేశ్వర్ను హత్య చేసిన తర్వాత లడాఖ్ లేదా అండమాన్కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.నిందితులను పట్టుకున్నారిలా..నన్నూర్ టోల్ప్లాజా వద్ద కారు వెళుతున్న సీసీ ఫుటేజీ, గద్వాలలో కారులో తేజేశ్వర్ను తీసుకెళ్లిన ఫుటేజీ, సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించారు. గురువారం పుల్లూర్ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో తిరుమలరావు, నగేష్, పరుశరాముడు, చాకలి రాజు కారులో హైదరాబాద్కు పారిపోతుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గద్వాలలో ఉంటున్న ఐశ్వర్య, మోహన్, కర్నూలు ఉంటున్న తిరుపతయ్య, సుజాతలను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. వారి నుంచి హత్యకు వినియోగించిన కారు, రెండు కొడవళ్లు, 10 సెల్ఫోన్లు, రూ.1.20 లక్షలు, కత్తి, జీపీఎస్ ట్రాకర్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. కేసులో ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఏ3 కుమ్మరి నగేష్, ఏ4 చాకలి పరుశరాముడు, ఏ5 చాకలి రాజు, ఏ6 మోహన్, ఏ7 తిరుపతయ్య , ఏ8 సుజాత ఉన్నారు. హత్య కేసు విచారణలో పాల్గొన్న డీఎస్పీ మొగిలయ్య, గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, మల్లేష్, నందికర్, శ్రీనువాసులు, అబ్దుల్షుకుర్, సిబ్బంది చంద్రయ్య, కిరణ్కుమార్, రాజుయాదవ్, వీరేష్, రామకృష్ణను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్ సింధూర్ సమాచారం పాక్కు అమ్మేశాడు!
ఇటీవల కాలంలో పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది.. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఆ మెరుపు ఆపరేషన్కు పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. ఇక ఎప్పుడైనా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడి భారత్ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్లీ ఆరంభమవుతుందనే గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఫహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్కు భారత్కు చెందిన వ్యక్తి చేరవేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నావీ డైరెక్టర్ ఆఫ్ ద డాక్యార్డ్లో అప్పర్ డివిజన్ క్లర్క్గా పని చేస్తేన్న విశాల్ యాదవ్ అనే వ్యక్తి.. ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విశాల్ యాదవ్,. ప్రియురాలి మోజులో పడి ఆ సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్కు చెందిన ప్రియగా పరిచయమై..భారత్కు చెందిన అమ్మాయిగా, ప్రియా శర్మగా పరిచయం అయిన సదరు అమ్మాయి.. సోషల్ మీడియ ద్వారా విశాల్ను ఆకట్టుకుంది. తాను భారత్కు చెందిన అమ్మాయినంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పరిచయం అలా మొదలై.. వాట్సాప్ వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ చేపట్టిన పలు ఆపరేషన్ల సమాచారాన్ని విశాల్ నుంచి తస్కరించింది. తొలుత చిన్నా చితకా భారత డిఫెన్స్ వ్యవహారాల సమాచారాన్ని తనకు తెలియకుండానే పాక్కు చేరవేసిన విశాల్.. ఆపై పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని సైతం అమ్మేశాడు. ప్రధానంగా ఆపరేషన్ సింధూరు సమాచారాన్ని రూ. 50 వేలకు అమ్మేసిట్లు తేలగా, మొత్తంగా రూ. 2 లక్షల వరకూ ఇలా సమాచారాన్ని అమ్మి డబ్బులు చేసుకున్నాడు విశాల్.పోలీసులు ఏం చెబుతున్నారంటే..తొలుత ఫేస్బుక్లో విశాల్కు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి పరిచయయ్యింది. ఒక ఫేక్ ఐడెంటీతో పరిచయం అయిన అమ్మాయి.. భారత్కు చెందిన ప్రియా శర్మగా పరిచయం అయ్యింది. అనంతరం మెల్లగా అతన్ని మాయమాటల్లో పెట్టి, వరుసగా భారత ఆపరేషన్ల సమాచారాన్ని దొంగిలించింది. ఈ క్రమంలోనే విశాల్కు డబ్బులు ఆశపెట్టి మరీ తనపని తాను కానిచ్చేసింది. సీఐడీ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ విష్ణు కాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారాన్ని పాక్కు చేరవేసినందకు రూ. 2 లక్షల వరకూ విశాల్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆపరేసన్ సింధూర్ సమాచారానికి రూ. 50 వేలు ప్రత్యేకంగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. -
odisha: ఘోరం.. పది రోజుల్లో ఐదు అత్యాచారాలు
భువనేశ్వర్: భారతదేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి వైభవం, ఆధ్యాత్మిక శోభతో అలరారే రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయం, చిలికా సరస్సు వంటి అనేక ప్రాచీనమైన, ప్రకృతి శోభతో ఒడిశా ఫరిడవిల్లుతోంది. కానీ ఇటీవల అక్కడ చోటుచేసుకున్న వరుస అత్యాచార ఘటనలు ఆ రాష్ట్ర ప్రాభవాన్ని దెబ్బతీస్తున్నాయి. గడిచిన గత పది రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు అత్యాచార ఘటనలు రాష్ట్రంలో మహిళా భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.తాజాగా, మయూర్భంజ్ జిల్లా కరంజే ప్రాంతంలో దారుణం జరిగింది. జూన్ 25న ఓ యువతి స్థానికంగా ఉన్న దేవాలయంలో దైవ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో మాటు వేసిన ముగ్గురు అగంతకులు యువతిపై దాడి చేశారు. అనంతరం, స్థానిక అడవుల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన మలర్పాడ గ్రామానికి చెందిన బికాష్ పాత్రాను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. VIDEO | Bhubaneswar: On Gopalpur gang rape case, Congress leader Shobha Oza (@Shobha_Oza) says, “In one month, three heart-wrenching gang rape cases like Nirbhaya case have come up. Odisha ranks 5th in India in terms of rape cases. In past one year, cases of human trafficking,… pic.twitter.com/9D5FnqAvxw— Press Trust of India (@PTI_News) June 21, 2025 1. గంజం జిల్లా,గోపాల్పూర్ బీచ్,జూన్17 : ఓ యువతి తన స్నేహితుడితో కలిసి గోపాల్పూర్ బీచ్ చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో నిందితులు బాధితురాల్ని స్నేహితుడిపై దాడి చేశారు. అనంతరం, నిందితులు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మొత్తం 10మంది నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.2.టెన్తలపాషి గ్రామం, కియోంఝర్ జిల్లా, జూన్ 18: ఉదయం తన ఇంటి సమీపంలో 17 ఏళ్ల బాలికను నిందితులు ఉరితీశారు.దుర్ఘటన జరిగిన ముందు రోజు సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహంపై గాయాలైన గుర్తులు ఉండడంతో బాలికపై దారుణం జరిగినట్లు తేలింది. ఆమె మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 3.బరిపడ, మయూర్భంజ్ జిల్లా, జూన్ 19: 31 ఏళ్ల మహిళ భర్త జూన్ 19న బరిపడ సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో నలుగురు నిందితులు ఇంట్లోకి చొరబడి తన భార్యపై అత్యాచారం చేశారని ఆరోపించారు.4. బెర్హంపూర్, గంజాం జిల్లా, జూన్ 25: జూన్ 25న క్లినిక్ యజమాని తనపై అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. బాధితురాలు బీఎస్సీ (నర్సింగ్) చదవడానికి సహాయం చేస్తానని, ఉచిత వసతి కల్పిస్తానని నిందితుడు కుటుంబానికి హామీ ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు మరియు దర్యాప్తు జరుగుతోంది. -
అతడు-అతడు మధ్యలో ఆమె!
మర్రిపూడి, ఒంగోలు: స్థానిక విద్యాశాఖ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ కోలా రాజశేఖర్ (35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ నెల 18న ఆయన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్నాథం జయసింహగా కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వత్ వెల్లడించారు. బుధవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. రాజశేఖర్ గే. ఆయనకు పొదిలికి చెందిన జగన్నాథం జయసింహతో ఏడాదిన్నర నుంచి స్వలింగ సంపర్క సంబంధం ఉంది. తొలుత ఎవరికీ తెలియకుండా ఇద్దరూ సంబంధం కొనసాగించారు. కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించిన జయసింహ ఒంగోలులో ఫిషరీస్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ చెడు అలవాట్లకు బానిసై ఉద్యోగం మానేశాడు. చెడుతిరుగుళ్లు తిరుగుతూ దర్శికి చెందిన వివాహిత పల్లా అనూషాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది రాజశేఖర్కు నచ్చలేదు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. రాజశేఖర్ను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన జయసింహ తనతో చనువుగా మెలుగుతున్న అనూషాతో కలిసి హత్యకు పథకం రచించాడు. చివరిగా ఒకసారి తనతో శారీరకంగా కలిస్తే వాట్సప్ గ్రూపులో అసభ్యకర పోస్టులు పెట్టనని జయసింహతో రాజశేఖర్ చెప్పాడు. ఈ నెల 18వ తేదీ బుధవారం ఉదయం ఇంటి నుంచి బైక్పై రాజశేఖర్ బయటకు వచ్చాడు. అనంతరం బస్టాండ్ సెంటర్లో అల్పాహారం పార్శిల్ చేయించుకుని శ్రీలక్ష్మీనృంహస్వామి కొండ వైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ జయసింహ, అనూష ఉన్నారు. కాసేపటికే వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు చోటుచేసుకుంది. రాజశేఖర్ను కింద పడేసి అతి కిరాతకంగా కారుతో ఢీకొట్టి చంపారు. ఈ దాడిలో రాజశేఖర్ మర్మాయవాలు తెగిపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత హంతకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మృతుడి ఫోన్కు చివరిగా వచ్చిన కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికతను ఉపయోగించి కేసును ఛేదించారు. హంతకులను పొదిలి కొండ సమీపంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో కొండపి సీఐ సోమశేఖర్, మర్రిపూడి ఎస్సై రమేష్బాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
తేజేశ్వర్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
జోగులాంబ గద్వాల: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును గద్వాల పోలీసులు చేదించారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ప్రియుడు తిరుమల రావుతో పాటు మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన వస్తువులు, నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఏ 1గా తిరుమల రావు, ఏ 2గా ఐశ్వర్య, ఏ8 సుజాతలను చేర్చారు. కాగా, పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్ను నమ్మించింది.దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్రావు కోసం భర్త తేజేశ్వర్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్టాప్ను కృష్ణానదిలో పడేశారు.ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
కటకటాల్లోకి స్వీటీ తెలుగు కపుల్
హాయ్.. ఫ్రెండ్స్. మా న్యూడ్ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు డబ్బులు కొట్టండి. లింక్ను షేర్ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోతున్న ‘స్వీటీ తెలుగు కపుల్’కు.. సడన్ ఎంట్రీతో పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డున నడిచిన ఈ లైవ్ సెక్స్ దందా బాగోతంలోకి వెళ్తే..సాక్షి, హైదరాబాద్: నగరంలో లైవ్ సెక్స్ దందా వెలుగు చూసింది. అంబర్పేటలో ఓ జంట.. తమ శృంగార కార్యకలాపాలను ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వ్యూయర్స్ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఆన్లైన్లో ఈ జంట.. ఆ ప్రైవేట్ లింక్స్ను గత నాలుగు నెలలుగా పంచుతూ ఈ దందా నడిపిస్తోంది. హాయ్.. ఫ్రెండ్స్. మా న్యూడ్ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు డబ్బులు కొట్టండి. లింక్ను షేర్ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోసాగింది. నగ్న వీడియోలతో పాటు తమ శృంగార వీడియోలను షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం టాస్క్ఫోర్స్ పోలీసుల దృష్టికి చేరింది.దీంతో అంబర్పేటలోని ఆ ఇంటిపై టాస్క్ఫోర్స్ టీం రైడ్ చేసింది. ఆ దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ బూతు బాగోతం కోసం తాము ఉంటున్న ఇంటిపైన పరదాలతో ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేశారు. అలాగే ఇంట్లో నుంచి కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనపర్చుకున్నారు. టాస్క్ఫోర్స్ టీం ఈ దంపతులను అంబర్పేట పోలీసులకు అప్పగించగా.. వాళ్లు ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వాళ్ల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య
తిమ్మాపూర్(మానకొండూర్): భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపం చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రేణికుంటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్కు చెందిన రొడ్డ విజయకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. చిన్న కూతురు మమత(27)ను 2018లో రేణికుంటకు చెందిన రాజమల్లుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం ఒప్పుకుని రూ.30 వేలు ముట్టజెప్పారు. రూ.లక్ష కళ్యాణలక్ష్మి వచ్చిన తర్వాత ఇచ్చారు. మరో రూ.70 వేలకు గడువు కోరి.. తర్వాత బంగారం ముట్టజెప్పారు. అయితే రాజమల్లు అదనంగా రూ.2 లక్షల కట్నం డిమాండ్ చేయడంతో గొడవలు జరుగుతున్నాయి. కొన్నిరోజులుగా రాజమల్లు రోజూ మద్యం తాగివచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. కట్నం తేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మమతకు తెలియడంతో మనస్తాపం చెందింది. సోమవారం అర్ధరాత్రి క్రిమిసంహారక మందు తాగింది. ఈ విషయాన్ని మమత కొడుకు అమ్మమ్మ విజయకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె రేణికుంటకు వెళ్లగా మమత అపస్మారక స్థితిలో కనిపించింది. వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్తింటి వేధింపులతో..ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతినగర్కు చెందిన పెసరు అనిత (27) క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎన్టీపీసీ ఎస్సై టి.ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అమీర్పేట లాడ్జ్కి తీసుకెళ్లి..
హైదరాబాద్: యువతిని మోసం చేసి బాబు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై మధురానగర్ పీఎస్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు..రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి షాద్నగర్ కాలేజీలో డిగ్రీ చదివే సమయంలో సీనియర్ ద్వారా అయిన భరత్రెడ్డి పరిచయమయ్యాడు. గత ఏడాది యువతిని అమీర్పేట ఓయో రూంలో బలవంతంగా కలిశాడు.గర్భవతినని ఆమె భరత్రెడ్డికి చెప్పగా పెళ్ళి చేసుకుందామని చెప్పాడు.ఆ తరువాత ఆమెకు బాబు పుట్టాడు. దీంతో బాధితురాలుషాద్నగర్లోని భరత్రెడ్డి ఇంటికి వెళ్ళగా దుర్బాషలాడి పంపారు. తనను మోసం చేసిన భరత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్ఆర్నగర్కు పంపారు. -
మద్యం తాగించి ఈవెంట్ డ్యాన్సర్పై లైంగిక దాడి
గచ్చిబౌలి: వైన్ షాపు ముందు పరిచయమైన ఓ యువకుడు అతిగా మద్యం తాగించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం..సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈవెంట్లలో డ్యాన్సర్గా పని చేసే ఓ యువతి (23) గచ్చిబౌలి జంక్షన్లోని వైన్ షాపు వద్ద మద్యం తాగుతోంది. కుక్గా పనిచేసే ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్రకాష్ (32) అదే వైన్ షాపు వద్దకు వచ్చాడు. మద్యం తాగుతున్న యువతిని పరిచయం చేసుకొని..ఇలా రోడ్డుపై తాగితే మంచిది కాదని చెప్పాడు. దగ్గర్లోనే తన రూమ్ ఉందని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం తాగి నిద్రపోయారు. రాత్రి 2 గంటలకు యువతికి మెళకువ రావడంతో లేవగా..ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంది. దీంతో ఆ యువతి మోసం చేశావంటూ ప్రకాష్ తో గొడవకు దిగింది. తెల్లవారే వరకు అక్కడే ఉండాలని ప్రకాశ్ తన మొబైల్లో తీసిన యువతి న్యూడ్ ఫొటోలు చూపించాడు. ఎవరికి చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ ఫొటోలు అందరికి పంపిస్తానని బెదిరించాడు. అయినా యువతి మాత్రం తాను ఇక్కడ ఉండనని గొడవ పడి ఫ్రెండ్కు ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అతిగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ఫోన్ సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతి చెందారు. మరో పోలీసులకు గాయాలు కావడంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే, ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దుర్గాపురం వద్దకు రాగానే ఒక్కసారిగా లారీ అదుపు తప్పి పోలీసులు ప్రయాణిస్తున్ను కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారులోకి ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కారులో ముందు కూర్చోవడంతో ఎస్ అశోక్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సిన్ చనిపోయారు. ఇదిలా ఉండగా.. అంతకుముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన కారు ఆపినట్టు క్షతగాత్రులు తెలిపారు. అనంతరం, బయలుదేరిన పదిహేను నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
భర్తను కాదని భార్య వేరే యువకుడితో..
కర్ణాటక: ఓ యువకుడు తమ ప్రియురాలిని చంపి తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టిన అమానుష ఘటన జిల్లాలోని కరోటి గ్రామంలో జరిగింది. హాసన జిల్లా హొసకొప్పలు గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి హత్యకు గురైంది. పునీత్ అనే యువకుడే హత్య చేసిన నిందితుడు. ప్రీతికి వివాహమై పిల్లలున్నా పునీత్ వెంటపడింది. గత ఆదివారం మండ్య, మైసూరులకు ట్రిప్ వెళ్లిన ఇద్దరూ జాలీ జాలీగా సమయాన్ని గడిపారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కేఆర్ పేటె కత్తరఘట్ట అడవిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పునీత్ ఆమెను చంపి బంగారు ఆభరణాలను దోచుకుని ఆమె మృతదేహాన్ని తమ పొలంలోనే పాతిపెట్టి పరారయ్యాడు. ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పునీత్ పట్టుబడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పునీత్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రీతి పెళ్లయి పిల్లలు ఉన్నా పునీత్ వెంటపడి తనువు చాలించగా తల్లిని కోల్పోయి పిల్లలు అనాథలయ్యారు. -
ప్రియుడితో భర్తను చంపించిన భార్య
రాప్తాడు రూరల్ : 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కాదని.. రెండునెలల క్రితం పరిచయమైన ప్రియుడిపై ఓ మహిళ మోజు పెంచుకుంది. అది చివరకు భర్తను అంతమొందించేందుకు దారితీసింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన ఆరు గంటల్లోనే అనంతపురం రూరల్ పోలీసులు మిస్టరీని ఛేదించారు. వివరాలివీ..అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ సదాశివకాలనీకి చెందిన కుమ్మర నరసాపురం సురేశ్బాబు (43), అనిత దంపతులు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో సురేష్బాబు ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. భార్య అదే ప్రాంతంలోని ఓ హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో అనితకు రెండునెలల క్రితం ఆటోలో పండ్లు అమ్ముకునే బాబాఫకృద్దీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు అనుమానం రావడంతో..భార్య వ్యవహారశైలిపై ఇటీవల సురేశ్బాబుకు అనుమానం వచ్చింది. దీంతో మద్యం మత్తులో భార్యను వేధించడం ప్రారంభించాడు. తనను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రియుడికి అనిత వివరించింది. భర్తను కడతేరిస్తే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి భర్త హత్యకు పథకం రచించారు. ఈ క్రమంలో సురేశ్బాబు మంగళవారం రాత్రి 11 గంటలకు హోటల్ మూసేసి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అక్కంపల్లి–రాచానపల్లి మధ్య మాటువేసిన బాబాఫకృద్దీన్ ఖాళీ సీసాను సురేశ్బాబుపై విసిరాడు. దీంతో వాహనం అదుపుతప్పి కిందపడిన సురేశ్పై స్క్రూడ్రైవర్తో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ఓ పెద్ద బండరాయితో హతమార్చి ఉడాయించాడు. భార్య తీరుపై అనుమానంతో..ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, సీఐ శేఖర్, ఎస్ఐ రాంబాబు, సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హతుడి భార్య అనితతో మాట్లాడారు. తన భర్త చాలా మంచివాడని ఎవరితోనూ గొడవల్లేవని ఎందుకు హత్యచేశారో తనకు తెలీదంటూ వాపోయింది. అయితే, ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నడవడికపై ఆరా తీశారు. ఆ తర్వాత బాబాఫకృద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
కరెంట్ షాక్తో నలుగురి దుర్మరణం
ఇల్లెందురూరల్/నేరడిగొండ/గంగారం : వేర్వే రు చోట్ల విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మూడు జిల్లాల పరిధిలో బుధవారం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన ఏనుగు నర్సయ్య (60), ఎర్రమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికీ వివాహాలు జరగ్గా, చిన్న కుమారుడు ప్రవీణ్ (35) తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. పొలం పనులకు వెళ్లాలని బుధవారం తెల్లవారుజామునే నిద్రలేచారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆరుబయట నేల బురదమయంగా మారింది. ముందుగా ఎర్రమ్మ నిదానంగా అడుగులు వేస్తూ చేతికందే ఎత్తులో ఉన్న దండెం తీగను ఆసరాగా పట్టుకుంది. అప్పటికే విద్యుత్ సర్వీసు వైరుకు తగిలి ఉన్న దండెం నుంచి కరెంట్ ప్రసారం కావడంతో ఎర్రమ్మ షాక్తో కింద పడింది. ఆ వెనుకాల వస్తున్న నర్సయ్య.. భార్య జారి పడిందని భావించి పైకిలేపే ప్రయత్నం చేయగా ఆయనకు కూడా షాక్ తగలడంతో బిగ్గరగా అరిచాడు. ఏం జరిగిందోనని పరుగున బయటకు వచ్చిన ప్రవీణ్ నేరుగా వారి వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేయడంతో ఆయనా షాక్కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో నర్సయ్య, ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఎర్రమ్మను స్థానికులు తొలుత ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన యువ రైతు సాబ్లే సుభాష్ (35) తన పత్తి చేలో కలుపు తీస్తుండగా.. వేలాడుతున్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని మృతుని బంధువులు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన చిలుక ప్రవీణ్(28) గత ఏడాది మార్చిలో జూనియర్ లైన్మ్యాన్గా మహబూబాబాద్ గంగారం మండలంలో విధుల్లో చేరారు. కోమట్లగూడెం రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి త్రీఫేజ్ విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకొని మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సౌమ్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. -
అర్ధరాత్రి వీడియో కాల్స్.. మహిళా ఉద్యోగులకు చీఫ్ ఇంజినీర్ లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులను చీఫ్ కంట్రోలర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. చీఫ్ కంట్రోలర్ వేధింపులను భరించలేక మంత్రి సీతక్కకు ఆ మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని.. అర్ధరాత్రి వీడియో కాల్స్, జిల్లా టూర్లతో వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.చీఫ్ ఇంజనీర్ వేధింపులు భరించలేక పలువురు మహిళలు ఉద్యోగం మానేసినట్లు సదరు మహిళా ఉద్యోగులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల ఫిర్యాదుతో మంత్రి సీతక్క విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రెటరీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మహిళా మంత్రి శాఖలో మహిళలపై వేధింపుల అంశంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
హైదరాబాద్: ఓయో లాడ్జిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: ఓయో లాడ్జిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన ప్రకారం.. నల్లగండ్లలో నివాసం ఉండె జి.అనూష(26) ఆన్లైన్ ఆర్డర్లపై బ్యూటీషియన్గా పని చేస్తోంది. గత సంవత్సరం వివాహం జరగ్గా మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి అనూష తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. రాత్రి ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ లాడ్జిలో అనూష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు సమాచారం అందించారు.సీలింగ్ ప్యాన్కు కర్టన్తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని, కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సంతోష్ అనే వ్యక్తి మొదట సమాచారం అందించాడని, తన సోదరి ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని సోదరుడు రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నీలిమ 12 పెళ్లిళ్ల వ్యవహారం.. సీఐ ఏమన్నారంటే?
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమకు చెందిన నీలిమ 12 పెళ్లిళ్లు చేసుకుందనే ఆరోపణలపై రామచంద్రపురం సీఐ వెంకట నారాయణ స్పందించారు. నీలిమ పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. తమ విచారణలో 12 పెళ్లిళ్లకు సంబంధించిన ఎటువంటి కచ్చితమైన ఆధారాలు ఇప్పటి వరకు లభ్యం కాలేదన్నారు. గుర్రం రాజేశ్వరి, నీలిమ మధ్య ఉన్న పాత గొడవలు నేపథ్యంలో ఇరువురు ఒకరిపై కేసులు పెట్టుకున్నారు. కోర్టుల్లో ఆ కేసుల్లో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది.వారిరువురి మధ్య ఉన్న ఆర్థిక పరమైన లావాదేవీలు కారణంగానే నీలిమపై అమలాపురం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోందని సీఐ అన్నారు. పన్నెండు పెళ్లిళ్లు వ్యవహారంపై నీలిమ కూడా స్పందించింది. తాను పన్నెండు పెళ్లిళ్లు అంటూ తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఒక పెళ్లి మాత్రమే చేసుకున్నానని పేర్కొంది. మిగిలిన పదకొండు మంది ఎవరో నిగ్గు తేల్చాలని.. లేనిపక్షంలో ఆరోపణలు చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపింది. -
తేజేశ్వర్ కేసు.. ఎట్టకేలకు తిరుమలరావు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు తిరుమలరావును ఎట్టకేలకు గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో ఎప్పటి నుంచో వివాహేతర బంధంలో ఉన్న తిరుమలరావు.. ప్లాన్ ప్రకారమే తేజేశ్వర్ను హత్య చేయించినట్లు అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. సర్వేయర్ హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య(సహస్ర), ఆమె తల్లి సుజాతతో పాటు హత్య చేసిన సుపారీ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు, వీళ్లకు సహకరించిన మరో ముగ్గురు నిందితులు ఉన్నారు. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి అయిన తిరుమలరావు మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో.. అతన్ని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్లోనే అతన్ని గద్వాల్ పోలీసులు అదుపులోకి తీసుట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. సుపారీ గ్యాంగ్తో పోలీసులు ఈ ఉదయం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేనసిట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే..జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.తేజేశ్వర్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్ను నమ్మించింది.దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్రావు కోసం భర్త తేజేశ్వర్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్టాప్ను కృష్ణానదిలో పడేశారు.ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తిరుమలరావును క్షణ్ణంగా విచారిస్తే.. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
అనంతలో యువకుల హల్చల్.. దమ్ముంటే పట్టుకో అంటూ పోలీసులకే..
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మందుబాబులు హల్చల్ చేస్తున్నారు. తాజాగా పుష్ప డైలాగులతో మందు బాబులు పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో, ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. అనంతపురం వన్ టౌన్ పీఎస్ పరిధిలో గంజాయి, మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. ఇద్దరు యువకులు కలిసి.. మరో యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం, పుష్ప సినిమాలోని దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం అంటూ డైలాగ్ చెప్పారు. పోలీసు స్టేషన్ ఎదుటే ఇలా డైలాగ్ చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. -
ఎనిమిది నెలల ఇన్స్టా పరిచయం.. కుమార్తె రాసిన మరణ శాసనం!
సాక్షి, జీడిమెట్ల: ‘నువ్వు వచ్చి మా అమ్మను చంపు.. లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా’ నంటూ ప్రియుడిని బెదిరించిన పదో తరగతి బాలిక.. కన్నతల్లినే హత్య చేయించిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం కలకలం రేపింది.ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39)కి 16 ఏళ్ల క్రితం దమ్మన్నపేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి కూతురు (15) ఉంది. 13 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో అంజలి కుప్పంకు చెందిన రవి అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మనస్విని (12) అనే కూతురు జన్మించింది. రవి సైతం గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంజలి కొన్నేళ్లుగా తెలంగాణ సాంస్కృతిక సారథి విభాగంలో కళాకారిణిగా పని చేస్తూ.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మూడు నెలలుగా షాపూర్నగర్ హెచ్ఎంటీ సొసైటీలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటోంది. షాపూర్నగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పెద్ద కుమార్తె 10వ తరగతి, చిన్న కూతురు 8వ తరగతి చదువుతున్నారు. ఇన్స్టాలో పరిచయంతో.. అంజలి పెద్ద కుమార్తె (15)కు నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శివ (18)కు ఇన్స్ట్రాగాంలో పరిచయం ప్రేమకు దారితీసింది. 8 నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పింది. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే కావడంతో అంజలి తొలుత అంగీకరించి.. ఆ తర్వాత వద్దని వారించింది. తమ ప్రేమకు తల్లి ఒప్పుకోకపోవడంతో బాలిక ఈ నెల 19న శివతో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదేరోజు అంజలి తన కూతురు కనిపించడం లేదంటూ శివపై అనుమానం వ్యక్తం చేస్తూ జీడిమెట్ల పీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు అమ్మాయిని తీసుకుని స్టేషన్కు రావాలని చెప్పడంతో ఈ నెల 21న శివతో పాటు బాలిక పీఎస్కు వచ్చారు. బాలికను తల్లితో ఇంటికి పంపించారు. ప్రేమను నిరాకరించిందని.. ఇంటికి వెళ్లిన తర్వాత శివను వదిలేసి చదువుపై దృష్టి పెట్టాలని కూతురును అంజలి బెదిరించింది. శివపై కేసు పెట్టించి జైలుకు పంపిస్తానంటూ కొట్టింది. తమ ప్రేమకు అడ్డొస్తోందనే కసితో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ఆమెను చంపాలని గట్టిగా నిర్ణయించుకుంది. తాను అనుకున్నట్లుగానే తన తల్లిని హైదరాబాద్ వచ్చి చంపాలని శివను కోరింది. చంపకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని శివను బెదిరించింది. దీంతో యువకుడు ఒప్పుకోవడంతో.. బాలిక తన చెల్లెలిని మరో ఇంటికి పంపించింది.సోమవారం సాయంత్రం 5 గంటలకు శివ, తన తమ్ముడిని (16) తీసుకుని షాపూర్నగర్ వచ్చాడు. వచ్చీ రావడంతోనే కురీ్చలో కూర్చున్న అంజలిని ఒక్కసారిగా తోయడంతో ఆమె ముందుకు పడి తలకు గాయమైంది. వెంటనే అంజలి మెడకు గట్టిగా చున్నీ బిగించడంతో ఆమె కొట్టుకోసాగింది. శివ సోదరుడు అంజలి చేతులు పట్టుకోగా శివ చున్నీతో మెడకు గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అంజలి ముక్కులోంచి తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయిందని నిర్ధారించుకున్నారు. తన తల్లి కిందపడి తలకు దెబ్బతగలంతో చనిపోయిందని అందరినీ నమ్మించాలని బాలిక పథకం పన్ని, శివను, అతని సోదరుడిని పంపించేసింది. బతికే ఉందని.. మళ్లీ రప్పించి.. కొద్దిసేపటి తర్వాత అంజలి మెల్లగా కదలసాగింది. అప్పటికే చిన్న కుమార్తె మనస్విని ఇంటికి రాగా.. అమ్మ ఇంట్లోకి రావొద్దని చెప్పిందంటూ సోదరిని బాలిక బయటే కూర్చోబెట్టింది. 108కు కాల్ చేసినట్లు నటిస్తూ విషయాన్ని ప్రియుడు శివతో మాట్లాడింది. తన తల్లి ఇంకా బతికే ఉందని చెప్పింది. నల్లగొండ వెళ్లేందుకు ఎల్బీనగర్లో ఉన్న శివ మళ్లీ తన సోదరుడిని తీసుకుని రాత్రి 7.30 గంటలకు షాపూర్నగర్ వచ్చాడు. ‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నిన్ను కాపాడతాను ఆంటీ’ బాలిక మనస్విని ముందు నటించాడు. వేరే ఆంటీని పిలుచుకు రావాలంటూ ఆమెను ఇంట్లోంచి పంపించారు. తిరిగి అంజలి మెడకు చున్నీ బిగించారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.రాత్రి 10 గంటలకు తన తల్లి చనిపోయిందని పెద్ద కుమార్తె బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. రాత్రి 11 గంటల తర్వాత జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేశ్కు విషయం తెలిసింది. ఈ నెల 19న బాలిక అదృశ్యమైన కేసు జీడిమెట్లలో నమోదు కావడంతో ఇది కచి్చతంగా హత్యేనని నిర్ధారణకు వచ్చారు. వెంటనే రెండు బృందాలను రంగంలోకి దింపి శివను కట్టంగూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడి సోదరుడి(15)ని హైదరాబాద్ సంతోష్ నగర్లోని ఓ చికెన్ సెంటర్లో అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను విచారణ చేయగా.. అంజలిని తామే చంపివేశామని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లిని పూర్తిగా చంపే వరకు ఇంటి బయటే కాపలా కాసిందని, తల్లి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా ‘క్షమించు మమీ’ అంటూ నిందితురాలు బాలిక రోదించిందని స్థానికులు తెలిపారు. అంజలి మృతదేహాన్ని స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కాదు.. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మకు దూరపు బంధువే తప్పా మునిమనవరాలు కాదని కుటుంబ సబ్యులు తెలిపారు. దీనిపై మీడియాలో వార్తలు నిజం కావన్నారు. -
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
గౌహతి: మేఘాలయ హనీమూన్ కేసులో లెక్కలేనన్ని ట్విస్ట్లు బయటపడుతున్నాయి. భర్త రాజారఘువంశీ హత్యకు కుట్ర పన్నిన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు పోలీసుల ముందు మరో నిజాన్ని వెల్లడించారు. ఎప్పటి నుంచో తమ మధ్య సంబంధం ఉన్నదని వారు పోలీసుల సమక్షంలో అంగీకరించారని మేఘాలయ పోలీసులు తెలిపారు.తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ మీడియాతో మాట్లాడుతూ తమ దర్యాప్తులో రాజ్, సోనమ్లు రిలేషన్షిప్లో ఉన్నట్లు అంగీకరించారని తెలిపారు. వారిద్దిరూ ఇప్పటికే నేరాన్ని అంగీకరించారని, తాము సీన్ రీకన్స్ట్రక్షన్ చేయగా, దానికి వారు సహకరిస్తూ, అన్ని ఆధారాలు చూపించారన్నారు. అందుకే సోనమ్కు ఇప్పుడు నార్కో టెస్టులు అవసరం లేదని భావిస్తున్నామని అన్నారు.సాధారణంగా ఎటువంటి ఆధారాలు లభ్యం కానప్పుడే నార్కో పరీక్ష జరుగుతుందని, వాస్తవానికి సుప్రీంకోర్టు నార్కో విశ్లేషణను నిషేధించిందని వివేక్ సయీమ్ తెలిపారు. కేవలం వారి ఒప్పుకోలును మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, బలమైన సాక్ష్యాధారాలను సేకరించామన్నారు. చార్జిషీట్ను వీలైనంత త్వరగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రఘువంశీ హత్యకు డబ్బు ప్రధాన కారణం కాదని, వారి సంబంధానికి అతను అడ్డుకాకూడదని వారు భావించివుండవచ్చునన్నారు.మేఘాలయ పోలీసులు తాజాగా ఇండోర్లోని ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్ను విచారణ కోసం రప్పిస్తున్నారు. సోనమ్ను అరెస్టు చేయడానికి ముందు ఆమె భర్తతో పాటు అతని ప్లాట్లో కొంతకాలం ఉన్నారు. కాగా సోనమ్ బ్యాగ్లో ఒక దేశీయ పిస్టల్, ఫోన్, రాజా రఘువంశీకి చెందిన నగలు, రూ ఐదు లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి విచారణలో కీలకంగా మారనున్నాయని అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అది నాకు దక్కిన గౌరవం’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
స్టాంప్ డ్యూటీ స్కామ్లో మరిన్ని కంపెనీలు!
అనంతపురం టౌన్, సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నకిలీ స్టాంప్ డ్యూటీ చలానాలు సృష్టించి రూ.900 కోట్లకుపైగా బ్యాంకు రుణాలు పొందిన వ్యవహారంలో డొంకంతా కదులుతోంది! ఈ స్టాంప్ డ్యూటీ కుంభకోణంలో ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పాత్ర ఇప్పటికే బహిర్గతం కాగా ఆయన సన్నిహితుల కంపెనీలు నియో కన్స్ట్రక్షన్స్, సురాజ్ ఇన్ఫ్రా సైతం బ్యాంకులకు నకిలీ స్టాంప్ డ్యూటీ చలానాలు సమర్పించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ కంపెనీలు సైతం రూ.కోట్లలో బ్యాంకు రుణాలు పొందడం గమనార్హం.ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని చెల్లించకుండా తమ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఆర్సీ కంపెనీ 2024 జూన్ నుంచి 2025 మార్చి వరకు తొమ్మిది నెలల వ్యవధిలో టాటా క్యాపిటల్స్, యూనియన్ బ్యాంక్తో పాటు వివిధ బ్యాంకుల్లో రూ.900 కోట్లకు పైగా రుణాలు అక్రమ మార్గంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రుణాలకు సంబంధించి స్టాంప్ డ్యూటీ 0.5 శాతం ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.4 కోట్లకు పైగా కట్టాలి. అయితే నకిలీ స్టాంప్ డ్యూటీ చలానాలను బ్యాంకులకు సమర్పించి రూ.నాలుగు కోట్లకు పైగా స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఎమ్మెల్యే అమిలినేని కంపెనీ ఎగ్గొట్టింది. స్టాంప్ డ్యూటీ నకిలీ చలానాల కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే అమిలినేని కంపెనీ.. దొంగే.. దొంగ.. దొంగ..! అన్నట్లుగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. ఇందులో తమ తప్పు ఏమీ లేదన్నట్లు అంతా మీసేవ నిర్వాహకుడు యర్రప్ప అలియాస్ బాబే చేశాడంటూ ఎస్ఆర్సీ కంపెనీ అనంతపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ప్రశ్నలకు బదులేది?» స్టాంప్ డ్యూటీ చలానాలు తీసే ముందు ఎస్ఆర్సీ కంపెనీ ఖాతా నుంచి సదరు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలా చేయకుండా ‘మీసేవ బాబు’ బ్యాంకు ఖాతా నుంచి చెల్లించారంటే అర్థం ఏమిటి? » రూ.వందల కోట్ల రుణాలు తీసుకునేందుకు రూ.కోట్లలో స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం ‘మీ సేవ బాబు’ దగ్గర ఉంటుందా? » ఒకవేళ ఎస్ఆర్సీ కంపెనీనే స్టాంప్ డ్యూటీకి అవసరమైన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోకి జమ చేసి ఉంటే.. ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్ వివరాలు అందుబాటులో ఉంటాయి కదా? » ఓ ప్రముఖ కంపెనీ తమ సంస్థ పేరిట చలానాలు తీయకుండా థర్డ్ పార్టీ నుంచి చెల్లిస్తుందా? అలా చేయడంలో ఆంతర్యమేమిటి?రహస్యంగా యర్రప్ప దంపతుల విచారణ..ఎమ్మెల్యే సురేంద్రకు అత్యంత సన్నిహితుడైన మీసేవ నిర్వాహకుడు బాబు అలియాస్ బోయ యర్రప్ప, ఆయన భార్య కట్టా భార్గవిని పోలీసులు అదుపులోకి తీసుకుని అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితమే విజిలెన్స్, సీసీఎస్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. యర్రప్ప నివాసంలో జరిపిన సోదాల్లో కిలో బంగారంతో పాటు ఓ డైమండ్ నెక్లెస్, ఆయన భార్య బ్యాంకు ఖాతాలో రూ.1.80 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారని స్థానికంగా చర్చ జరుగుతోంది. కాగా యర్రప్పకు సహకరించిన మోహన్బాబు అనే యువకుడితోపాటు మీసేవలో పనిచేసే మరో వ్యక్తిని, ఆరి్థక లావాదేవీలు నడిపిన ఓ మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యర్రప్పతో సన్నిహితంగా ఉంటూ ఆర్థిక లావాదేవీలు నడిపిన కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి కూడా సీసీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
బంధం.. బలహీనం!
ప్రియుడితో ఫోన్ మాట్లాడొద్దని మందలించిన కన్న తండ్రిని.. తల్లి, అక్కతో కలిసి కొట్టి చంపిన కూతురు.. మహబూబాబాద్ జిల్లాలో ఘటనఆస్తి వివాదం కోసం కన్న తండ్రి ఎదుటే సోదరుడిని తుదముట్టించిన చెల్లెళ్లు.. జగిత్యాల జిల్లాలో ఘోరం ప్రేమకు అడ్డు వస్తోందని కన్నతల్లినే ప్రియుడితో హత్య చేయించిన 15 ఏళ్ల బాలిక.. తాజాగా హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం – సాక్షి సెంట్రల్ డెస్క్మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయనడానికి వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలే నిదర్శనం. చిన్న చిన్న కారణాలకు అయినవాళ్లను, ఆప్తులను అంతమొందించే పరిస్థితులు పెరిగిపోతున్నాయ్. ఓవైపు విజ్ఞానం పెరుగుతున్నా.. మరోవైపు ఇలాంటి అజ్ఞానమూ తాండవిస్తోంది. కుటుంబం అంటే అందమైన పొదరిల్లు అనే భావన క్రమంగా అంతర్థానమవుతోంది. ఒకప్పుడు కుటుంబ సభ్యులతో చిన్నచిన్న పంతాలు, పట్టింపులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడవి పగలు, హత్యల వరకు వెళ్లిపోయాయి. తమ ఆనందం కోసం ఏం చేయడానికైనా, ఎంతకు తెగించడానికైనా వెనకాడటంలేదు. తల్లి లేదు.. తండ్రి లేడు.. తోబుట్టువులైనా.. కట్టుకున్న వాళ్లైనా.. బంధనాల్లాంటి బంధాలు మాకొద్దు.. మా లైఫ్.. మా ఇష్టం.. మా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అడ్డొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు.. అనే తీరు నేడు ఎక్కువైపోయింది. రక్తపాతమే కావాలా?ఫోన్ మాట్లాడొద్దన్నారని.. ప్రేమ పెళ్లికి అంగీకరించడంలేదని.. కన్నవాళ్లనే కడతేరుస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్లో వారికి వేరే ఆప్షన్లు ఉన్నప్పటికీ, రక్తపాతాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? హత్య చేస్తే జైలుకు వెళతామనే ఆలోచన కూడా లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఇలాంటి ఘటనల వెనుక కారణాలు అన్ని కేసుల్లో ఒకేలా ఉండవు. పరిస్థితులు, అవసరాలను బట్టి పలు అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అయితే, ఇవేవీ ఆకస్మిక కోపం వల్లో, క్షణికావేశంలోనో జరిగే నేరాలు మాత్రం కావు. నిందితులకు ఉన్న మానసిక రుగ్మతలు, ఒత్తిడి, విభ్రాంతికరమైన ఆలోచనలు, కోరుకున్న వాతావరణం ఇంట్లో లేకపోవడం, తమకు ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదనుకోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లల్లో పెడాలోచనలు ఎందుకు? మా పిల్లలు మాట వినరు.. సరిగ్గా చదవరు.. ఎప్పుడూ ఫోన్తోనే ఉంటారని చెప్పని తల్లిదండ్రులే లేరంటే అతిశయోక్తి కాదు. మారుతున్న ప్రపంచంతోనే అందరి అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. పిల్లల ఆలోచనలు, అలవాట్లలో కూడా ఇదే కనిపిస్తోంది. పిల్లల్లో విపరీత మనస్తత్వానికి కారణం ఏమిటి అంటే... స్మార్ట్ ఫోన్ అనే సమాధానం ఠక్కున వస్తుంది. కొంతవరకు ఇది నిజమే అయినా.. ఇతర కారణాలూ ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు ఇరువురూ కలిసి సంపాదిస్తే తప్ప.. అవసరాలు తీరని పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి గడిపేందుకు సమయమే ఉండటంలేదు. వారితో ప్రేమగా మాట్లాడి, అవసరాలు తెలుసుకుని తీర్చే పరిస్థితి లేదు. ఇది క్రమంగా వారిలో ఒంటరితనానికి దారితీసి.. తమకు కావాల్సింది స్మార్ట్ ఫోన్లో వెతుక్కోవడం మొదలుపెడుతున్నారు. ఇంట్లో లభించని ప్రేమానురాగాలు బయటి వ్యక్తి చూపిస్తే.. అది నిజమో, అబద్ధమో కూడా తెలుసుకోకుండా వారికి దాసోహమైపోతున్నారు. అదే సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు తమను కంట్రోల్ చేయడం వారికి నచ్చడంలేదు. బయట తమకు ఎంతో స్వేచ్ఛ ఉందని.. ఇంట్లో అన్నింటికీ తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారనే భావన క్రమంగా పెరిగి.. వారిపై కోపం పెంచుకుంటున్నారు. అది ఏకంగా కన్నవారి అడ్డు తొలగించుకోవాలనుకునే స్థాయికి వెళ్లిపోతోంది. అయితే, అందరూ ఇలాగే ఉన్నారని కాదు. మానసిక రుగ్మతలు ఉన్నవారు, చాలాకాలంగా తల్లిదండ్రుల వైఖరితో విభేదిస్తున్నవారు, ప్రేమ వంటి విపరీతమైన భావోద్వేగంలో కూరుకుపోయి ఉన్నవారు.. ఏదీ ఆలోచించే పరిస్థితిలో ఉండరు. ఇలాంటివారు పర్యవసనాలను పట్టించుకోకుండా తాము అనుకున్నది చేయడానికే మొగ్గు చూపిస్తారు.తల్లిదండ్రులు ఏం చేయాలి? తమ పిల్లల ప్రతి చర్యకూ తల్లిదండ్రుల బాధ్యత తప్పకుండా ఉంటుంది. కాలానికి తగ్గట్టే తల్లిదండ్రుల ప్రవర్తనలోనూ మార్పులు రావాలి. పిల్లలను ఎక్కువగా నియంత్రించడం, ఆంక్షలు పెట్టడం వంటివి చేయకూడదు.. అలా అని పూర్తిగా వదిలేయకూడదు. రెండింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయాలి. పిల్లలను అదేపనిగా కట్టుదిట్టం చేస్తే ఒత్తిడిలో కూరుకుపోయి నిరాశలో మునిగిపోతారు.. లేదా తిరగబడతారు. రెండూ ప్రమాదకరమే. రోజులో వీలైనంత సమయం వారితో మాట్లాడాలి. ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. అన్నింటికీ మేం ఉన్నాం అనే భరోసా కల్పించాలి. కుటుంబ బంధాలు, విలువల గురించి అర్థమయ్యేరీతిలో చిన్నప్పటి నుంచే తెలియజెప్పాలి. వ్యక్తిత్వ లోపాలే కారణం అకారణంగా హత్యలకు పాల్పడే వాళ్లకు ఐక్యూ లెవల్స్ తక్కువ ఉంటాయి. ఈ బెడద నుంచి తప్పించుకోవాలన్న తాత్కాలిక ఆలోచన వల్లే చంపుతున్నారు. వారి వ్యక్తిత్వంలోనే లోపాలు ఉంటాయి. మానసిక రుగ్మతలు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి కుట్రలు చేసి, ఇతరులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు.. కుట్రలో పాల్గొనే వారందరికీ వ్యక్తిత్వ లోపాలు ఉంటాయి. ఇలాంటివారిలో చాలామంది.. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ఒకరకమైన అనిశ్చితి, హింస, కోపాలకు గురై ఉంటారు. వారికి తాము చేసిన నేరం సమంజసమే అనిపిస్తుంది.– వీరేందర్, సైకాలజిస్ట్కనుమరుగవుతున్న బంధాలను కాపాడుకోవాలి కన్నవాళ్లను, కట్టుకున్నోళ్లను కడతేర్చడం వంటివి మామూలు హత్యకేసులు కావు. సమాజంలో కనుమరుగవుతున్న బంధాలు, అనుబంధాలకు నిదర్శనంగా వీటిని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో సినిమాల్లో, సోషల్ మీడియాలో కనిపించే ప్రేమను నిజమని నమ్మేస్తున్నారు. దానికి అడ్డుగా నిలిచినవారిని తొలగించాలనే తప్పుడు భావనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ బంధం లేనప్పుడు ప్రేమ ఒక వ్యసనంగా మారుతుంది. పిల్లలకు చిన్న వయసులోనే ఎమోషనల్ ఎడ్యుకేషన్ అందించడం ఇందుకు ఒక పరిష్కారం. తల్లిదండ్రులు పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారితో బంధానికి ఎక్కువ విలువనివ్వాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి, వారి ప్రైవసీని గౌరవించాలి. – సైకాలజిస్ట్ విశేష్ విలువలు నేర్పకపోవడం వల్లే.. చిన్న వయసులోనే ప్రేమ అనే భ్రమలో పడుతున్నారు. అది తల్లిదండ్రుల కంటే ఎక్కువనుకుంటున్నారు. తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడం, వాళ్లని సరిగా అర్థం చేసుకోలేకపోవడం ఇందుకు కారణాలు.అందుకే పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారనేది చాలా ముఖ్యం. చాలా మంది టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పడంలేదు. బాల్యం నుంచే విలువలతోపాటు నేరాలు–చట్టాలపై అవగాహన కల్పించాలి. – డా. మమతా రఘువీర్, తరుణి స్వచ్ఛంద సంస్థ కుటుంబ సభ్యులపైనే దాడులు, హత్యలకు కారణాలివీ..నియంత్రించడం (ఏదైనా వద్దు అని చెప్పడం, ఫోన్ తీసేసుకోవడం వంటివి) 38%ఆస్తి వ్యవహారాలు 10%విభేదాలు 8%కోపం, క్షణికావేశం 8%స్వేచ్ఛాయుత జీవితం కోరుకోవడం 7% -
యాడ్ షూటింగ్ కోసం వస్తే.. నీకు సిటీ చూపిస్తానని చెప్పి..!
ఉదయ్పూర్: రాజస్థాన్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యాడ్ షూట్లో భాగంగా రాజస్థాన్కు వచ్చిన ఫ్రెంచ్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. యాడ్ షూటింగ్ పేరుతో ఆమెను ఒక రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగి. ఆదివారం రాత్రి ఓ గ్రూప్తో కలిసి వచ్చిన వారంతా కలిసి డిన్నర్ చేశారు. అయితే ముందుగా ప్లాన్ చేసుకున్న సదరు ఉద్యోగి.. ఆ ఫ్రెంచ్ యువతికి ఉదయపూర్ అంతా చూపెడతానని నమ్మబలికాడు. దాంతో నమ్మి వెళ్లిన ఆమెను ముందుగా బుక్ చేసి పెట్టుకున్న హోటల్ రూమ్కు తీసుకెళ్లాడు ఈఎమ్ ఉద్యోగి. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దుండగుడి కోసం వెతుకలాట ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న షూటింగ్లో భాగంగా కొంతమంది ఉదయ్పూర్లోని బాద్గావ్ ఏరియాలోని టైగర్ హిల్స్లోని ఓ రెస్టారెంట్కు వచ్చారు. ఫ్రెంచ్ మహిళతో పాటు ఇద్దరు మహిళలు షూటింగ్ కోసం వచ్చారని పోలీస్ అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే వీరంతా డిన్నర్ పూర్తి చేసుకున్న తర్వాత తనను ఉద్యోగి కారులో ఎక్కించుకుని ఓ హెటల్కు తీసుకెళ్లాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉదయ్పూర్ సిటీ చూపిస్తాననని చెప్పి తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువతిని మెడికల్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం నిందితున్ని పట్టుకునే పనిలో ఉన్నామని, సదరు హోటల్ రూమ్ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని ఉదయ్పూర్ ఎస్పీ యోగేష్ గోయల్ తెలిపారు. -
ఐశ్వర్యతోనే పిల్లల్ని కనాలని..
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. ఐశ్వర్య(సహస్ర) కోసం ఆమె భర్తను మాత్రమే కాదు.. తన భార్యనూ అడ్డు తొలగించుకోవాలని బ్యాంకు ఉద్యోగి తిరుమల్ రావు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది.తిరుమల్ రావుకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అయితే ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో భార్యను అడ్డు తొలగించుకుని.. ఐశ్వర్యతోనే పిల్లలను కనాలని భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తేజేశ్వర్తో పాటు తన భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ఆపై ఐశ్వర్యతో కలిసి లడాఖ్కు ట్రిప్ ప్లాన్ వేశాడు. అయితే భార్యను చంపితే బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందన్న భయంతో ఆ ప్లాన్ను విరమించుకున్నాడు. కేవలం తేజేశ్వర్ను మాత్రమే చంపాలని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు.ఇందుకోసం .. తేజేశ్వర్ హత్య జరిగిన ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. అయితే అప్పటికే భర్త తేజేశ్వర్ను చంపేందుకు ఐశ్వర్య ఐదుసార్లు ప్రయత్నించింది. జూన్ 17వ తేదీన ఆరోసారి చేసిన ప్రయత్నంలో తేజేశ్వర్ బలయ్యాడు. సుపారీ గ్యాంగ్కు సమాచారం అందించేందుకు తేజేశ్వర్ బైక్కు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది ఐశ్వర్య. దాని ఆధారంగా అతనికి లొకేషన్ వివరాలను ఆ ముఠాకు అందించింది. ఆపై సర్వే పేరిట తేజేశ్వర్ను వెంట తీసుకెళ్లిన రాజు, పరమేశ్వర్, పరుశరామ్.. కత్తితో పొడిచి చంపారు.కర్నూలు శివారులో పడేసిన మృతదేహాన్ని ఆ మరుసటిరోజు తిరుమల్ వెళ్లి చూసొచ్చాడు. అటుపైనే సుపారీ గ్యాంగ్కు రూ. 2 లక్షలు అందించాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమల్ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అతను లడఖ్లోని ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.కేసు నేపథ్యం ఇదే.. జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. తేజేశ్వర్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్ను నమ్మించింది. దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్రావు కోసం భర్త తేజేశ్వర్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్టాప్ను కృష్ణానదిలో పడేశారు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమల్రావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది. -
జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా....అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. -
టీడీపీ ఎమ్మెల్యే భారీ స్కాం.. బాగోతం బట్టబయలు
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో ఎమ్మెల్యే సురేంద్ర బాబు భాగస్వామిగా ఉన్నారు.. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో రూ.920 కోట్ల రుణాలు పొందింది. స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి భారీగా రుణాలు పొందిన ఎస్ఆర్సీ సంస్థ. నకిలీ పత్రాల ద్వారా యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి 20 కోట్ల రుణాలు పొందింది. బ్యాంకులను మోసగించిన వైనంపై ఆర్బీఐ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టాయి.కళ్యాణదుర్గం టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు ద్వారా వ్యవహారాన్ని నడిపిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.. విషయం బయటపడటంతో తామే మోసపోయామంటూ ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్టు సంస్థ పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు స్టాంప్ డ్యూటీ స్కాంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.తెల్గీ కుంభకోణం తరహాలో భారీ కుంభకోణానికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వెలుగు చూసిన స్టాంప్ డ్యూటీ స్కాంపై ఈడీ, సీబీఐ, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ వందల కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టిందని.. విషయం బయటపడేసరికి ఓ కార్యకర్త పై కేసు నమోదు చేయించి చేతులు దులుపుకునే కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. -
చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ.. సిగ్నల్ కట్ చేసి...
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది.దుండగులు కోమలి సమీపంలో సిగ్నల్ కేబుల్ కట్ చేయడంతో రైలు నిలిచిపోయింది. ఎస్1, ఎస్2 బోగీల్లోకి చొరబడిన దుండగులు.. ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు నగలు దోచుకున్నారు. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారీ అయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
జీడిమెట్ల: తల్లిని కడతేర్చిన కూతురు.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మేడ్చల్: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లినే కడతేర్చింది ఓ బాలిక.. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. తల్లి ప్రేమను మరిచిది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశం గా మారింది. జీడిమెట్ల పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కూతురు హత్య చేసింది. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్(18)తో కలిసి కూతురు తేజశ్రీ(16) కన్నతల్లిపై కిరాతకానికి పాల్పడింది.కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జిడీమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తోంది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే బాలికకు ఇన్స్టాలో శివ పరిచయమయ్యాడు. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితం శివతో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి తిరిగి వచ్చింది.తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్షీట్తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్ కూడా కత్తితో పీక కోశాడు. తల్లి హత్య తర్వాత కుర్చీలో నుంచి పడిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ బాలిక.. తన పెద్దమ్మకు ఫోన్ చేసి అమ్మ కుర్చీ నుంచి పడిపోయిందని.. గాయాలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి మృతిపై బాలిక తేజశ్రీ చెల్లెలు కన్నీరుమున్నీరైంది. బయటకెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగుల్లో ఉందని పేర్కొంది. పోలీసులకు ఫోన్ చేసి.. అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పినా కూడా అక్క వినలేదని పేర్కొంది. -
కుటుంబం ఆత్మాహుతికి యత్నం
హుస్నాబాద్ రూరల్: తండ్రి పెడుతున్న మానసిక క్షోభతో ఓ కుటుంబం ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన హుస్నాబాద్ మండలం కిషన్నగర్లో సోమవారం చోటు చేసుకుంది. జాగిరి సాయి దంపతులు కిషన్నగర్లో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని తల్లి, సోదరుడు కూడా సాయి దగ్గరే ఉంటున్నారు. అయితే తండ్రి రెండో పెళ్లి చేసుకొని హనుమకొండలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి కుటుంబంలో తగాదాలు ఎక్కువయ్యాయి. తమ తండ్రి తమకు తెలియకుండానే ఇంటి స్థలం మరొకరికి విక్రయించారని, దీంతో తమకు దారి లేకుండా పోయిందని సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నాడు. తండ్రి మానసిక క్షోభకు గురి చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందారు. హోటల్పై పెట్రోల్ పోసి నలుగురు కుటుంబ సభ్యులు అందులోనే ఉండి నిప్పు పెట్టుకున్నారు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి వారిని కాపాడారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న అగి్నమాపక సిబ్బంది మంటలు ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. దీనిపై ఎస్సై మహేశ్ను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. -
ఒకే వ్యక్తితో తల్లీ, కూతురు వివాహేతర సంబంధం..!
గద్వాల క్రైం: మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహం జరిగినప్పటి నుంచి భర్త తేజేశ్వర్ రాకపోకలపై నిఘా పెట్టి దారుణహత్యకు భార్య సహస్రనే పూర్తి పథకం రచించినట్టు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే తెలియగా, సహస్రను తేజేశ్వర్ మందలించినట్టు తెలిసింది. దీంతో తమ బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బ్యాంకు ఉద్యోగికి జరిగిన విషయం చేరవేసింది. ఆయన సూచన మేరకు భర్త బైక్కు జీపీఎస్ ట్రాకర్ను తన దూరపు బంధువుతో అమర్చేలా చేసింది. సుపారీ తీసుకున్న ముఠా సభ్యులు గద్వాలలో ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా తేజేశ్వర్పై నిఘా పెట్టారు. జీపీఎస్ ద్వారా ఎక్కడ ఉంటున్నాడో గుర్తించి మూడు దఫాలుగా గద్వాల శివారులో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో సహస్ర, ఆ బ్యాంకు ఉద్యోగి ముఠా సభ్యులను ఎగతాళి చేసి, హేళనగా మాట్లాడారు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న సుపారీ గ్యాంగ్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 17వ తేదీన ఉదయం వారి కారులో తేజేశ్వర్ను ఎక్కించుకొని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు చూసేందుకు వెళ్లారు. ఆ కారులోనే కత్తితో పొడిచి హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం శివారులో మృతదేహాన్ని పడేశారు. కేసు విచారణ వేగవంతంతేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిందెవరు..ఎంతమంది వచ్చారు.. వారు వెళ్లేందుకు వినియోగించిన వాహనం.. అసలు తేజేశ్వర్ను వారికి పరిచయం చేసిందెవరు.. ఇలా అనేక అంశాలపై విచారణ అధికారులు పలు బృందాలుగా విడిపోయి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్తేజేశ్వర్ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన ఘటన, ప్రయాణించిన ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం మేరకు సీన్ రీ కన్స్ట్రక్షన్ ప్రక్రియను సోమవారం సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్కుమార్, మల్లేశ్, శ్రీకాంత్ పరిశీలించారు. గద్వాల నుంచి సంగాల ఔటర్ రింగ్ రోడ్డు అక్కడి నుంచి పూడూరు, ఇటిక్యాల, మొగిల్రావుల చెరువు శివారు, పెబ్బేర్, బీచుపల్లి ఫ్లై ఓవర్, తుంగభద్ర ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. గద్వాల మండలం పూడూరు శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని ఓ గోనెసంచిలో చుట్టి కారు డిక్కీలో పెట్టి ఎవరూ లేనిచోట పడేయాలని భావించినట్టు తెలిసింది. అయితే అలా సాధ్యం కాకపోవడంతో నంద్యాల జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం శివారులో అర్ధరాత్రి పడేసి కారులోంచి తప్పించుకున్నట్టు అనుమానిస్తున్నారు. హత్యకు ముందే పరిచయం.. తేజేశ్వర్ భార్య సహస్ర తల్లి సుజాత పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్ కాగా, కర్నూలుకు చెందిన రామకృష్ణతో వివాహం అనంతరం కల్లూరుకు వెళ్లారు. సుజాత భర్త రామకృష్ణ చనిపోవడంతో కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. అక్కడే బ్యాంకు ఉద్యోగితో పరిచయం పెరిగి, చనువుగా ఉండేది. కూతురు సహస్ర సైతం సదరు ఉద్యోగితో చనువుగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ సందర్భాల్లో సహస్ర తన తల్లితో కలిసి జమిచేడ్కు వచి్చన క్రమంలో దూరపు బంధువు ద్వారా తేజేశ్వర్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులతో వివాహానికి సిద్ధమయ్యారు. అయితే బ్యాంకు ఉద్యోగికి ఈ విషయం తెలిసి వ్యతిరేకించడంతో తేజేశ్వర్తో నిశ్చితార్థం రద్దు చేసుకుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగికి ముందే మరో మహిళతో వివాహం కావడం, బ్యాంకు ఉద్యోగి భార్య కట్టడి చేయడంతో సమస్య అక్కడితో ఆగిపోయిందని తెలిసింది. ఆ తర్వాత సహస్ర.. తేజేశ్వర్ను మళ్లీ కలిసి పెళ్లికి డబ్బులు లేకపోవడంతో నిరాకరించినట్టు నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత నెల 18న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.పోలీసుల అదుపులో అనుమానితులు?పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో సహస్ర, సుజాత, బ్యాంకు ఉద్యోగి, హత్యకు పాల్పడిన ముగ్గురు, ఒక ఇన్ఫార్మర్ ఉన్నారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీనుతో మాట్లాడగా.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. హత్యకు పాల్పడిన నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామని వివరించారు. తాజాగా రీ కన్స్ట్రక్షన్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలించి గద్వాల మండల శివారులోనే తేజేశ్వర్ను హత్య చేసినట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల కోసం ఓ బృందం కర్నూలు జిల్లాలో గాలిస్తున్నట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. -
ఎన్నికల కౌటింగ్ కేంద్రంలో పేలిన బాంబు.. నాలుగో తరగతి విద్యార్థిని మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ ఉద్రిక్తతకు దారి తీశాయి. సోమవారం కాళీగంజ్ నియోజక వర్గంలోని కౌంటింగ్లో నాటు బాంబు పేలి 10ఏళ్ల బాలిక మృతి చెందింది.తూర్పు నదియా జిల్లా బరోచాంద్ నగర్ గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఘటన జరిగే సమయానికి ఈ కేంద్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. ఆ సమయంలో కౌంటింగ్ కేంద్రంలో నాటు బాంబు పేలి నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక తమన్నా ఖాటూన్ తీవ్రంగా గాయపడింది.ఊహించని పరిణామంతో అప్రమత్తమైన స్థానికులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుర్ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. -
కులం పేరుతో దూషిస్తూ.. ఇండిగో సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ ట్రైనీ పైలట్ ఒకరు.. సంచలన ఆరోపణలకు దిగారు. తనను కులం పేరుతో అతిదారుణంగా దూషించారంటూ సహచరులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుగ్రామ్లోని ఎయిర్లైన్స్ హెడ్క్వార్టర్స్ ఈ ఘటన జరగ్గా.. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగళూరుకు చెందిన శరణ్ కుమార్(35) అనే ఇండిగో ట్రైనీ పైలట్.. ఎమ్మార్ క్యాపిటల్ టవర్ 2లో జరిగిన మీటింగ్కు హాజరయ్యారు. ఆ టైంలో మరో ముగ్గురు ఉద్యోగులు అతన్ని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. శరణ్ తండ్రి అశోక్ కుమార్ చేసిన ఫిర్యాదులో.. ‘‘కాక్ పిట్లో కూర్చుని విమానం నడిపేందుకు నీకు(శరణ్ను ఉద్దేశించి..) అర్హత లేదు. ఇండిగోలో గుమాస్తాగా కాదు కదా.. కనీసం మా బూట్లు నాకడానికి కూడా నువ్వు పనికి రావు. పోయి.. మీ తాతముత్తాతల్లాగా చెప్పులు కుట్టుకుని పని చేసుకుంటూ బతుకు’’ అంటూ తనపై వ్యాఖ్యలు చేశారని తపస్ డే, మనిష్ సహానీ, రాహుల్ పాటిల్పై శరణ్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు..తన కుమారుడి విషయంలో ఎయిర్లైన్స్ వాళ్లు దారుణంగా వ్యవహరించారని.. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ ఎథిక్స్ కమిటీ, ఆఖరికి ఆ సంస్థ సీీఈవో దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని అశోక్ మీడియా ముందు వాపోయారు. అంతేకాదు.. తన కొడుకు విధినిర్వహణలో సక్రమంగా ఉన్నప్పటికీ సెలవులు ఇవ్వకుండా, పైగా జీతాల్లో కోతలు పెట్టారని ఆరోపించారాయన. ఘటనపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. అయితే ఈ ఘటన జరిగింది గురుగ్రామ్(హర్యానా)లోని కార్పొరేట్ ఆఫీస్ పరిధిలో. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు.. గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్-1 పీఎస్కు కేసును బదిలీ చేశారు. -
స్నేహితుడి కుమార్తెపై లైంగికదాడి
నెల్లూరు (క్రైమ్): కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి స్నేహితుడి కుమార్తెపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో ఆదివారం విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. సంతపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్య, పదిహేడేళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి వారధి సెంటర్కు చెందిన కుమార్ స్నేహితుడు ఉన్నాడు. ఇరు కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. అందరూ కలిసి బయటకు వెళ్లేవారు. ఈ ఏడాది మార్చిలో ఇరు కుటుంబాలు తిరుమలకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో కుమార్ అతని భార్య, స్నేహితుడి కుమార్తె శ్రీకాళహస్తికి వెళ్లారు. అక్కడే ఉండి మార్చి 16న నెల్లూరుకు వచ్చారు. బాలిక కుమార్ ఇంట్లో ఉండగా, అతని భార్య వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన కుమార్ బాలికను బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన ఆమె ఎవరికి చెప్పలేదు. రెండు నెలలుగా బాలికకు పీరియడ్స్ రాకపోవడంతో బాధిత తల్లి ఆమెను శనివారం జీజీహెచ్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలు ఆదివారం సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ జి. దశరథరామారావు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై వేధింపులు.. ఎనిమిది మందిపై పోక్సో కేసు
గుడిహత్నూర్: సోషల్ మీడియాలో స్నేహం పేరుతో ఓ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో ఎనిమిది మందిని శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు పరిచయం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. ఒకరోజు తనకు న్యూడ్ వీడియో కాల్ చేయాలని, లేదంటే చాటింగ్ అందరికీ తెలిసేలా చేస్తానని బెదిరించాడు. ఆ బాలిక ఒకరోజు న్యూడ్ కాల్చేసి మాట్లాడుతుండగా వీడియోను స్క్రీన్ రికార్డు చేసి తన ఏడుగురు స్నేహితులకు పంపించాడు. వారు వీడియోను అడ్డం పెట్టుకుని బాలికను మానసికంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఓ యువకుడు ఏకంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో షీటీం పోలీసులు ఎనిమిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు. -
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
కర్నూలు: కర్నూలు టీజే మాల్లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32)ను వివాహేతర సంబంధంతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమలరావు అదే బ్యాంకులో పనిచేసే కల్లూరుకు చెందిన చిరుద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగే కూతురుతో కూడా వివాహేతర సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే గద్వాలకు చెందిన తేజేశ్వర్ను ఆ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్ను హత మార్చాలని యువతి తల్లితో కలిసి తిరుమలరావు పథకం పన్నాడు. ల్యాండ్ సర్వే చేయించాలని స్నేహితుల ద్వారా తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించి రహస్య ప్రాంతంలో హత్య చేసి పాణ్యం సమీపంలోని పిన్నాపురం రస్తాలో పడేశారు. అయితే సర్వేయర్ తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్థన్ ఐదు రోజుల క్రితం గద్వాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి విచారించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు సంబంధించిన స్నేహితులను అదుపులోకి తీసుకొని కర్నూలు మూడో పట్టణ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పాణ్యం పోలీసుల సహయంతో మృతదేహాన్ని వెలికి తీసి ఆదివారం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి గద్వాల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హత్య కుట్రకు వెనుక మరి కొందరి హస్తం ఉన్నట్లు గద్వాల పోలీసులు భావించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గొంతు కోసి.. మృతదేహాన్ని పడేసి పాణ్యం: తేజేశ్వర్ను అత్యతం కిరాతకంగా హత్య మార్చారని పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. కారులోనే తేజేశ్వర్ను గొంతు కోసి హత్య చేశారని, నన్నూరు టోల్ప్లాజా మీదుగా పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద పిన్నాపురం రస్తాలో పడేశారన్నారు. కారులో వచ్చిన వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కారు కోసం గద్వాల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు ఉండగా మరో కీలక వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. -
అంతుచూసిన అక్రమ సంబంధం
మైసూరు: చామరాజనగర జిల్లా కొళ్లేగాలలోని హలె హంపాపురలోని సువర్ణవతి నది ఒడ్డున పాతిపెట్టిన మహిళ శవం వర్షాలకు బయటకు వచ్చింది. ఆమె హత్యకు గురైనట్లు గుర్తించారు. కొళ్లేగాల పట్టణంలో నివసించే విజయ్కుమార్ భార్య సోనాక్షి (29) గా గుర్తించారు. పోలీసులు విచారణ జరిపగా, వారి ఇంటి దగ్గరే ఉండే మహేష్ బాబు ఈ హత్య చేశాడని తేలింది. సోనాక్షితో మహేష్బాబు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసి సోనాక్షి భర్త గొడవ పడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. పోలీసులు నిందితున్ని విచారించారు. ఇటీవల సోనాక్షిని బయటకు తీసుకెళ్లిన నిందితుడు ఆమెను హత్య చేసి శవాన్ని చిన్నపాటి గుంత తీసి పాతిపెట్టి వెళ్లిపోయాడు. వర్షాలు రావడంతో పాటు కుక్కలు శవాన్ని లాగడంతో బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని చామరాజనగర సిమ్స్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితున్ని అరెస్టు చేశారు. -
Punjab: కారులో భీతావహ దృశ్యం.. స్థిరాస్థి వ్యాపారి ‘క్షణికావేశం’?
చండీగఢ్: పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. పాటియాలా జిల్లాలోని ఒక గ్రామానికి సమీపంలోని పంటపొలాల్లో విషాదకర దృశ్యం కనిపించింది. టయోటా ఫార్చ్యూనర్ ఎస్యూవీలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి మంజిత్ సింగ్ మీడియాకు తెలిపారు.టెప్లా బానూర్లోని జాతీయ రహదారిలోని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివుంచిన ఈ కారును పోలీసులు గుర్తించారు. మొహాలీకి చెందిన స్థిరాస్థి వ్యాపారి సందీప్ సింగ్ రాజ్పాల్ (45), అతని భార్య మందీప్ కౌర్ (42), వారి కుమారుడు అభయ్ సింగ్ (15)ల మృతదేహాలు ఆ కారులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారి శరీరాలపై తుపాకీ కాల్పుల గాయాలు ఉన్నాయని, క్యాబిన్ లోపల రక్తం చిమ్మివుందని పోలీసులు పేర్కొన్నారు. స్థిరాస్థి వ్యాపారి మృతదేహం డ్రైవర్ సీటులో ఉందని, అతని భార్య మృతదేహం ముందు సీటులో, వెనుక సీటులో వారి కుమారుని మృతదేహం పోలీసులకు కనిపించాయి.కొందరు కూలీలు ఈ కారును గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కారులో నుంచి ఒక హ్యాండ్గన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని పోలీసులు మృతుల బంధువులకు తెలియజేశారు. ప్రాథమిక దర్యాప్తులో సందీప్ సింగ్ తన భార్యను, కుమారులను షూట్ చేశాక, తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తేలింది. వారి కుమారుడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు గుర్తించారు. బతిండాలోని సిఖ్వాలా గ్రామానికి చెందిన సందీప్ సింగ్ గత ఎనిమిది ఏళ్లుగా మొహాలిలో నివసిస్తున్నాడు.ఇది కూడా చదవండి: ఇరాన్లో అధికార మార్పు? ట్రంప్ పరోక్ష హెచ్చరిక -
అశ్లీలం చూస్తే 'కటకటాలే '.. ఆచూకీ కనిపెడుతున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి కారణమైన చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉంది. దీనిపై కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్డ్ మెటీరియల్ను (సీఎస్ఏఎం) కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఐఐటీ ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ సహా 15 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్నెట్తో పాటు సోషల్మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేసినా, చూసినా, డౌన్లోడ్, అప్లోడ్ చేసినా నేరమే. నిఘా వేసి ఉంచే రెండు సంస్థలు..చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్సీఎంఈసీ చర్యలు ముమ్మరం అయ్యాయి. దీంతో పాటు ఇంటర్నేషనల్ చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ (ఐసీఎస్ఈ), గూగుల్కు సంబంధించిన సైబర్ టిప్లైన్ రిపోర్ట్స్ సీఎంఏఎంని గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్లు వాడుతున్నాయి. ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా..తక్షణం గుర్తించే ఈ సాంకేతిక పరిజ్ఞానం వారు వినియోగించిన ఐపీ అడ్రస్లను రీడ్ చేస్తుంది. ఈ వివరాలను ఎన్సీఎంఈ, ఐసీఎస్ఈలకు చెందిన సర్వర్ అందిస్తుంది. వీటిని క్రోడీకరించి జాబితాలు రూపొందించి వీటిని ఆయా దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలకు అందిస్తారు. జాతీయ స్థాయిలో హోమ్ మంత్రిత్వ శాఖ ఆ«దీనంలోని ఐ4సీ నోడల్ ఏజెన్సీగా ఉంది. ఇది తమకు అందిన వివరాలను ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. ఇలా గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం అందింది. నిందితుల్లో అన్ని రకాల వాళ్లూ... వీటిపై కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేయడం సైబర్ బ్యూరో నిర్వర్తిస్తుంది. ఈ నిందితుల్లో విద్యాధికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా ఉంటున్నారు. ఇటీవల అరెస్టు అయిన వారిలో వ్యాపారులు, చిరుద్యోగి కూడా ఉన్నారు. ఇంటర్నెట్లో ఉండే పోర్న్ మెటీరియల్తో పాటే కొన్ని రకాలైన వైరస్లు కూడా ఉండే ప్రమాదం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఈ వెబ్సైట్ల ద్వారా ఆయా వైరస్లు పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్టాప్లు హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్ ఖాతా వివరాలు వారికి చేరి పోర్నోగ్రఫీ బానిసలు అన్ని రకాలుగానూ నష్టపోవాల్సి వస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీనే కాదు..అన్ని రకాలైన అసభ్య, అశ్లీల వెబ్సైట్లపై ఫిర్యాదులు వచి్చనప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంటే నిర్వాహకులు మరోటి తయారు చేస్తున్నారు. వీటిని హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉంటుండటంతో కఠిన చర్యలు సాధ్యం కావట్లేదని పోలీసులు చెబుతున్నారు. -
అత్తింటి వేధింపులకు నవ వధువు బలి
హైదరాబాద్: అత్తింటి వేధింపులు భరించలేక ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన మాలోతు పూజిత (19)కు, జాటోతు శ్రీనుతో ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహమైంది. జాటోతు శ్రీను ఓ జ్యువెలరీ షాపులో సేల్స్ మేనేజర్. కేపీహెచ్బీ కాలనీలోని రోడ్డు నెంబర్ 3, టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఈఎస్డబ్ల్యూ 1140లో నివసిస్తున్నారు. పూజిత పెళ్లి సమయంలో 8 తులాల బంగారంతో పాటు సుమారు రూ.11 లక్షలు ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేయసాగారు. అదనంగా రూ.10 లక్షల అదనపు కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పూజిత నానమ్మ మాలోతు భద్రమ్మ వచ్చే పంట విక్రయాల అనంతరం అదనపు కట్నం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నెల 21న రాత్రి 12 గంటలకు పూజిత నానమ్మకు శ్రీను ఫోన్ చేసి ఉదయం 9 గంటలకు తాను పనికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చానని, ఇంతలో పూజిత చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నాడు. పూజిత తన సోదరులతో కలిసి కూల్డ్రింక్ తాగుతున్న ఫొటోలను హరి అనే వ్యక్తి శ్రీనుకి పంపించాడని, వాటిని చూపించి శ్రీను ఆమెను వేధిస్తున్నాడని, తన మనవరాలు మృతికి శ్రీను, అతని కుటుంబ సభ్యులే కారణమని పూజిత నానమ్మ కేపీహెచ్బీ పోలీస్లకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏలూరు శాయ్లో కీచకుడు.. క్రీడాకారిణులపై కోచ్ లైంగిక వేధింపులు
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)లో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. క్రీడాకారిణిల జీవితాలతో అథ్లెటిక్ కోచ్ వినాయక ప్రసాద్ ఆడుకుంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణను అడ్డం పెట్టుకుని యువ క్రీడాకారిణిలతో అసభ్యంగా ప్రవర్తిసున్నాడు. ఏలూరు శాయ్లో వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారిణిలను కోచ్ నిత్యం లైంగికంగా వేధిస్తున్నాడు.ఏలూరు శాయ్లో వెయిట్ లిఫ్టింగ్లో మొత్తం 45 మంది అండర్ 15, 16, 17, 18 విభాగాల క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. గత కొంత కాలంగా క్రీడాకారిణిలను వినాయక ప్రసాద్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ సెంటర్లో వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ పొందుతోన్న ఓ బాలిక పట్ల కోచ్ అసభ్యంగా ప్రవర్తించాడు. వార్షిక తనిఖీల్లో భాగంగా బెంగుళూరు నుంచి వచ్చిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ఆ బాలిక ఫిర్యాదు చేసింది.కోచ్ అకృత్యాలపై రహస్యంగా విచారణ జరిపిన బెంగుళూరు బృందం.. ఆరోపణలు నిజమని తేలడంతో ఏలూరు టూ టౌన్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. కోచ్ వినాయక ప్రసాద్పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శాయ్లో లైంగిక వేధింపుల వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
మరో హనీమూన్ మర్డర్?: తెలుగు రాష్ట్రాల్లో కలకలం.. పెళ్లైన నెల రోజులకే భర్త హత్య?
సాక్షి,కర్నూల్: మేఘాలయ హనీమూన్ మర్డర్ (meghalaya honeymoon case) తరహాలో.. తెలుగు రాష్ట్రాల్లో మరో హనీమూన్ మర్డర్ కలకలం రేపుతోంది. పెళ్లైన నెలరోజులకే, కొత్త పెళ్లి కొడుకు దారుణంగా హతమయ్యాడు. ఈ హత్యకు పాల్పడింది బాధితుడి భార్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.11 రోజులకే హనీమూన్ పేరుతో ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi)తన భర్త రాజా రఘువంశీని (raja raghuvanshi) మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ హనీమూన్ హత్య ప్రణాళికా హత్యా? లేక పాతకక్షల కారణంగా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాలో అదృశ్యమైన యువకుడు నంద్యాల జిల్లా పాండ్యంలో హత్యకు గురయ్యాడు. మహబూబ్ నగర్ పట్టణం ఘంటవీధికి చెందిన జి.తేజేశ్వర్ లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17నుంచి తేజేశ్వర్ కనపకడపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురంలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తేజేశ్వర్కు కర్నూల్ చెందిన యువతితో వివాహం జరిగింది. నిందితుల్ని గుర్తించిన కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మే 18న బీచ్పల్లిలో తేజేశ్వర్కు కర్నూలు జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజుల వ్యవధిలో భర్త తేజేశ్వర్ హత్యకు గురికావడం కలకలం రేపింది. తేజేశ్వర్ హత్యపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..
గద్వాల క్రైం: మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని గద్వాల డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిలా ్లకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కేటీదొడ్డి మండలం కోతులగిద్దకు చెందిన అనిత (26)కు పాతపాలెం గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులుతో కొంతకాలం కిందట వివాహమైంది. కాగా అనిత అదే గ్రామానికి చెందిన మాల దలాయి రంగస్వామితో వివాహేతర సంబంధం కొనసాగించేది.ఆమె మరొకరితో చనువుగా ఉండటంతో పలుమార్లు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భర్త ఈ నెల 15న హైదరాబాద్లో కూలీ పనులకు వెళ్లగా.. అదేరోజు రాత్రి రంగస్వామి ఇంటికొచ్చా డు. అయితే ఆమె మరొకరితో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రంగస్వామి.. ఆమె గొంతుకు చీర బిగించి హత్య చేశాడు. ఈ ఘటనపై అనిత తమ్ముడు అశోక్ ఫిర్యాదు మేరకు కేటీదొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రంగస్వామి అనితతో తరచూ ఫోన్లో మాట్లాడటాన్ని గుర్తించి శనివారం తెల్లవారుజామున సంగాల పార్కు సమీపంలో అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు నేరం అంగీకరించారని.. ఐదురోజుల్లో కేసు ఛేదించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. రంగస్వామిని గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీను, ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
ఇద్దరు బాలికల బలవన్మరణం
హైదరాబాద్: తల్లిదండ్రులు మందలిస్తున్నారనే కారణంతో అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ కథనం ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్, రమణమ్మ దంపతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో స్థిరపడ్డాడు. వీరికి వెనీల (17), అఖిల(16) సంతానం. వీరు ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. డిఫెన్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసే వెంకటేశ్ను మూడు నెలల కోసం బాలాపూర్ ఆర్సీఐకి బదిలీ చేశారు. దీంతో వారు మూడు వారాల క్రితం కుటుంబంతో సహా వచ్చి మల్లాపూర్లోని శు¿ోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా కుమార్తెలు అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్తుండడంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ డ్యూటీకి, అతని భార్య కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఇద్దరు కుమార్తెలు వెంటిలేటర్ గ్రిల్స్కు చున్నీలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాసేపటికి ఇంటికి వచ్చి చూసిన రమణమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. గతంలో వెనీల బెంగళూరులో అదృశ్యం కావడంతో వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే తల్లిదండ్రులు మందలించినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
బాలాపూర్ అక్కాచెల్లెళ్ల మృతిపై అనుమానాలు!
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు యువతులు శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తండ్రి మందలించాడని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతుండగా.. పోలీసులు మాత్రం దర్యాప్తు తర్వాతే మృతికి గల కారణాలపై ఓ అంచనాకి వస్తామని చెబుతున్నారు.వినీల (17), అఖిల (16) అక్కాచెల్లెళ్లు. వినీల ఈ మధ్య ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో పెద్దలు పంచాయితీ పెట్టి కులాంతర వివాహం వద్దని సర్దిచెప్పి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటని ఆ అక్కాచెల్లెళ్లను తండ్రి మందలించగా.. మనస్థాపానికి గురైన ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీ రెయిలింగ్కి చున్నీతో ఉరి వేసుకున్నారు!. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఉరివేసుకొని మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఈ అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబ స్వస్థల నెల్లూరు జిల్లా ఉదయగిరిగా సమాచారం. -
పాడి కౌశిక్రెడ్డికి రిమాండ్ విధింపు.. ఖమ్మం జైలుకు తరలించే యోచన
సాక్షి, వరంగల్: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి(Padi Kaushik Reddy)కి కాజీపేట రైల్వే కోర్టులో చుక్కెదురైంది. గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్రెడ్డిని బెదిరించిన కేసులో ఆయనకు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని పోలీసులు ఖమ్మం జైలుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాటకీయ పరిణామాల నడుమ శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను వరంగల్కు తరలించారు. ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ను కాజీపేట రైల్వే కోర్టుకు తరలించగా.. వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్ విధించింది.కేసు ఏంటంటే..మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.సుబేదారి పీఎస్ వద్ద ఉద్రిక్తతఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి, కౌశిక్ సోదరుడు ప్రతీక్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయనను పరామర్శించేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అలాగే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో స్టేషన్ చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
మాదాపూర్లో మరో భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో మరో భారీ మోసం బయటపడింది. బై బ్యాక్ పేరుతో ఏవీ ఇన్ఫ్రా రూ.500 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామంటూ మోసానికి పాల్పడింది. నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో వెంచర్లు అంటూ మోసానికి తెరలేపింది. అమౌంట్ ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామంటూ హామీ ఇచ్చింది.సుమారు 500 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నెలలకు డబుల్ అమౌంట్ ఇస్తానని భారీగా వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు ప్రశ్నించడంతో మరో చోట ప్రాజెక్టు అంటూ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో..
ఫరీదాబాద్: హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. భర్త, అత్తామామల వేధింపులకు ఒక మహిళ బలయ్యింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. హర్యానాలోని ఫరీదాబాద్లోని ఒక వీధిలో 10 అడుగుల లోతైన గుంత నుంచి పోలీసులు ఒక మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలిని ఉత్తరప్రదేశ్లోని షికోహాబాద్ నివాసి తనూ(24)గా గుర్తించారు. ఫరీదాబాద్లోని రోషన్ నగర్కు చెందిన అరుణ్తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతంలో తను భర్త, మామ, అత్త, మరొక దగ్గర బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంటిపక్కన మురుగు కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో తనూను ఆమె భర్త, అత్తామామాలు పూడ్చిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.తనూకు 2023లో వివాహం జరిగిందని, అనంతరం ఆమె అత్తవారింటిలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురైందని ఆమె సోదరి ప్రీతి ఆరోపించింది. వివాహం జరిగిన వెంటనే తనూ భర్త అరుణ్, అతని తల్లిదండ్రులు బంగారు నగలు, డబ్బు డిమాండ్ చేశారని పేర్కొంది. తాము వారి డిమాండ్లను తీర్చడానికి ప్రయత్నించినప్పటికీ, ఇంకా ఏదో కావాలని తనూను వేధించారని ఆమె తెలిపింది. వారు పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక తనూ పుట్టింటిలోనే నెల్లాళ్ల పాటు ఉందని, తరువాత ఆమెను తాము అత్తారింటికి పంపామని అప్పటినుంచి తమ సోదరికి మరింతగా వేధింపులు పెరిగాయని ప్రీతి పేర్కొంది.ఏప్రిల్ 23న తనూ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె అత్తమామలు తమకు చెప్పారని, దీంతో ఆమెకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా, కాల్ కలవలేదని ప్రీతి తెలిపారు. దీంతో తమకు మరింతగా అనుమానం పెరిగి, పోలీసులను ఆశ్రయించామన్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతలో తనూ ఇంటికి సమీపంలో ఆమె మామ గొయ్యిని తవ్వారు. దానికి మురుగునీటి పారుదలకు అని ఆయన చుట్టుపక్కల వారికి చెప్పాడు. అయితే ఆ తరువాత నుంచి తనూ కనిపించలేదు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఉషా కుండు మీడియాతో మాట్లాడుతూ వారం రోజల క్రితం ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. గుంతలో నుండి తనూ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఇది విలువల లొంగుబాటు’.. కేంద్రంపై సోనియా మండిపాటు -
కాలేజీ నుంచే ప్రేమ, సహ జీవనం.. గోవాకు తీసుకెళ్లి..
బనశంకరి: కన్నడిగ ప్రేమ జంట గోవా టూర్లో విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ గోవా పోలీసులు ప్రతాప్నగర వద్ద దార్బందోరా అటవీ ప్రదేశంలో యువతి హత్య కేసులో ఆమె ప్రియున్ని అరెస్ట్ చేశారు. అనుమానం పెనుభూతంగా మారి హత్య చేసినట్లు తెలిసింది.గోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ కెవిన్, రోష్ని గోవాలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. సంజయ్ ఏ పనీ చేయకుండా తిరిగేవాడు, రోష్ని అతని ఇంటి దగ్గరే ఓ స్కూల్లో పనిచేసేది. వారికి కాలేజీ రోజుల్లోనే పరిచయమై ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఇక పెళ్లాడాలని గోవా ట్రిప్కు వెళ్లారు. శనివారం రాత్రి బస్సులో బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ గోవా పరిధిలోని దార్బందోరా అనే ప్రాంతంలో దిగిపోయారు. ఇద్దరూ సమీప అడవిలోకి వెళ్లారు, అక్కడ సంజయ్ ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, ఆమె ఫోన్ను తీసుకుని వెళ్లిపోయాడు. ట్యాక్సీలో హుబ్లీకి చేరుకున్నాడు.బస్సు టికెట్లే క్లూ..మంగళవారం ఈ హత్య విషయం బయటపడింది. వెంటనే స్థానిక పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. రోష్ని శవం వద్ద పర్సులో బస్సు టికెట్లు దొరకడంతో ఓ క్లూ లభించింది. పలు బస్టాండ్లలో సీసీ కెమెరాల చిత్రాలను సేకరించి ఆ జంట చిత్రాలను సంపాదించారు. అలా నిందితుని ఆచూకీ కనిపెట్టి బుధవారం సాయంత్రం కల్లా అరెస్టు చేశారు. ఇక, బాధితురాలు స్వస్థలం హుబ్లీ అని సమాచారం.అనుమానంతో హత్య: ఎస్పీదక్షిణ గోవా ఎస్పీ తికమ్సింగ్ వర్మ మాట్లాడుతూ.. రోష్ని మరొకరితో సన్నిహితంగా ఉంటోందని సంజయ్ అనుమానం పెంచుకున్నాడని, హత్య చేయాలని ముందే నిర్ణయించుకుని కత్తి కూడా తీసుకున్నాడని తెలిపారు. మాయమాటలు చెప్పి ఆమెను గోవాకు తీసుకువచ్చాని చెప్పారు. ఎంతో క్లిష్టమైన కేసును ఛేదించామని తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. రోష్నిని తానే చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు, తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకుని బెంగళూరుకు వెళ్లిపోయానని చెప్పినట్లు తెలిసింది. -
సాఫ్ట్వేర్ ఇంజినీరుతో పెళ్లి.. ఆరు నెలలకే టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అత్తింటివారి అదనపు కట్నం వేధింపుల కారణంగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీ వద్ద దుర్గం చెరువులో దూకి తనువు చాలించింది. ఈ క్రమంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్తతోపాటు అత్త, మామలు, మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. ఈస్ట్మారేడ్పల్లిలోని అడ్డగుట్టలో ఉంటున్న అంజయ్య, సుశీల దంపతుల కుమార్తె సుష్మ(27). ఈ ఏడాది జనవరి 31న సుష్మను నేరేడ్మెట్కు చెందిన అమృత్కు ఇచ్చి వివాహం చేశారు. సుష్మ, ఆమె భర్త అమృత్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా చేస్తున్నారు. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 6 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైకు కట్నంగా కింద ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్తతోపాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. అనారోగ్యంతో ఉన్న సుష్మను ఈనెల 13న ఆసుపత్రిలో చేర్పించారు. 16న డిశ్చార్జి అయిన ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ల్యాప్టాప్ తెచ్చుకునేందుకు సుష్మ తండ్రితో కలిసి అత్తగారింటికి వెళ్లింది.ఈ సందర్భంగా భర్తతో సహా కుటుంబ సభ్యులు పరుషంగా మాట్లాడారు. మళ్లీ ఎందుకు వచ్చావంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె తండ్రి అంజయ్యను కూడా దూషించారు. దీంతో, సుష్మ మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం కంపెనీలో విధులకు వెళ్లింది. రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి అంజయ్య కంపెనీ మేనేజర్కు ఫోన్ చేశాడు. రాత్రి 8.30 గంటల సమయంలోనే ఆమె బయటకు వెళ్లిందని చెప్పాడు.అలా చెప్పడంతో కంగారు పడిన అంజయ్య.. తెలిసిన చోట గాలించి గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 7.30 గంటల సమయంలో దుర్గం చెరువులో ఓ మహిళ శవం తేలిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు, ప్రణీత్రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు. -
దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మృతిచెందిన యువతిని సుష్మ(27)గా గుర్తించారు.వివరాల ప్రకారం.. దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జి పైనుంచి సుష్మ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బుధవారం హైటెక్ సిటీలోని కార్యాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో రాత్రి దుర్గం చెరువు తీగల వంతెన వద్ద సుష్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, ఆమె మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. -
సహ ఉద్యోగులే తోడేళ్లై.. చంద్రగిరిలో అరాచకం
చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళెం సచివాలయంలో వెల్ఫేర్ ఆసిస్టెంట్ గుణశేఖర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత ఉద్యోగినిపై సహోద్యోగులే తోడేళ్లై వేధించారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక దళిత ఉద్యోగిని బుధవారం సచివాలయంలోనే బలవన్మరణానికి యత్నించారు.బాధితురాలి కథనం ప్రకారం.. చంద్రగిరి మండలం మిట్టపాళెం సచివాలయంలో కొద్ది రోజులుగా వెల్ఫేర్ అసిస్టెంట్ గుణశేఖర్ లైంగికంగా వేధిస్తుండడంతో తట్టుకోలేని దళిత ఉద్యోగిని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఆమె విధులకు హాజరు కాగానే కార్యాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావంటూ గొడవకు దిగారు. మర్యాదగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసి ఉద్యోగం లేకుండా చేస్తామంటూ భయపెట్టారు. కేసును వెనక్కు తీసుకుంటేనే సచివాలయంలోకి అనుమతిస్తామని హెచ్చరించారు.దీంతో బాధితురాలు ఫోన్ ద్వారా ఎంపీడీఓకు సమాచారం అందించారు. మండల అధికారులు సచివాలయానికి చేరుకునే లోపే సహోద్యోగుల వేధింపులు భరించలేక దళిత ఉద్యోగిని నిద్రమాత్రలు మింగేసి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఆమెను మిగతా సిబ్బంది హుటాహుటిన 108 వాహనంలో చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అనిత ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. ఉద్యోగిని ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ అనిత తెలిపారు. ఇదిలా ఉంటే పత్రికల్లో వచ్చిన వార్తలపై వెల్ఫేర్ ఆసిస్టెంట్ గుణశేఖర్ విలేకరులపై బెదిరింపులకు పాల్పడ్డారు. పరువునష్టం దావా వేస్తానని, కథ తేలుస్తానంటూ చిందులు తొక్కారు. -
పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం. -
మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్కౌంటర్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అరుణ అలియాస్ అరుణక్క..వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రిఅగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్రగాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్కౌంటర్పై అనుమానాలు.. నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ -
హనీ ట్రాప్కు చిక్కి.. 38.73 లక్షలు పోగొట్టుకున్న రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి 38.73 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఫేస్ బుక్లో వృద్దుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని.. తల్లి టైలర్ అంటూ సదరు ఆ మహిళ పరిచయం చేసుకుంది. చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ మహిళ.. కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్తో మాట్లాడిన బాధితుడు రూ.10 వేలు పంపించాడు.అనంతరం మహిళ నుంచి ఫేస్ బుక్లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్తో బాధితుడు చాటింగ్ చేశాడు. సదరు మహిళ జబ్బు పడిందని.. ఆస్పత్రిలో ఉందని చెప్పడంతో రూ. 10 లక్షలు ఆ వృద్ధుడు పంపించాడు. అనంతరం క్రెడిట్ కార్డు నుంచి మరో 2.65 లక్షలు చెల్లించాడు.కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని.. ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని చెప్పిన కేబుల్ ఆపరేటర్.. తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలనుకుంటున్నారంటూ కేబుల్ ఆపరేటర్ చెప్పగా.. సరేనన్న వృద్ధుడు.. కొద్ది రోజుల పాటు తల్లి, సోదరితో లైంగికంగా చాటింగ్ చేశాడు. తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కేబుల్ ఆపరేటర్ బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటూ బాధితుడికి సందేశం పంపాడు.బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం 12.5 లక్షలు చెల్లించిన బాధితుడు.. సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్ఐకి లక్ష సమర్పించుకున్నాడు. కొత్త ఎస్ఐ వచ్చానని.. కేసు అవ్వకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలంటూ మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో మరో ఏడు లక్షలను ఆ వృద్ధుడు పంపించాడు. ఇలా మొత్తం 38.73 లక్షలు ఆ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి దగ్గరి నుంచి సైబర్ నేరగాళ్లు దోపిడీ చేసేశారు. -
అన్నంలో విషం కలిపి.. భర్తపై నవవధువు ‘కాఠిన్యం’
గర్హ్వా: మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ల కథనం మరువకముందే జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఇదే తరహా దారుణం చోటుచేసుకుంది. హనీమూన్ కేసులో సోనమ్ తన భర్తను అంతమొందించేందుకు కాంట్రాక్టు కిల్లర్లను ఆశ్రయిస్తే, జార్ఖండ్కు చెందిన నవ వధువు సునీతా దేవి భర్తను చంపేందుకు అన్నంలో విషం కలిపింది.జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఒక నవ వధువు తన భర్తకు విషం ఇచ్చినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రాంకా ప్రాంతానికి చెందిన సునీతా దేవి జూన్ 15న రాత్రి భర్త బుద్ధనాథ్ సింగ్(24)కు పురుగుల మందు కలిపిన ఆహారాన్ని వడ్డించింది. మరుసటి రోజు ఉదయం అతను మృతిచెందాడు. ఈ ఘటనకు ముందు రోజు వ్యవసాయ అవసరాలకు పురుగుమందు అవసరమంటూ భర్త చేత సునీత పురుగుమందు కొనిపించిందని పోలీసులు తెలిపారు. బుద్ధనాథ్ సింగ్ తల్లి రాజమతి దేవి తన కోడలు తన కుమారునిపై విషప్రయోగం చేసిందని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన రాంకా పోలీసులు సునీతను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బుద్ధనాథ్ సింగ్ మృతికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. కాగా సునీత పోలీసుల ముందు అత్తపై పలు ఆరోపణలు చేస్తూ , కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తరువాత భర్త భోజనంలో తానే విషం కలిపానని,అందుకే భర్త చనిపోయాడని తెలిపింది. బహోకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్, ఛత్తీస్గఢ్కు చెందిన సునీతలకు 2025, మే 11న వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు -
ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
వర్గల్(గజ్వేల్): తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమ జంట బలవన్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మంగళవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో చోటుచేసుకున్నది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్కల ఆంజనేయులు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కల్పన(18) ఉంది. కల్పన ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి మల్లేశం, మంజుల దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శివకుమార్ (21) ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన కల్పన, శివకుమార్ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కుటుంబీకులు వారి ప్రేమను అంగీకరించలేదు. మరోవైపు కూతురు వివాహం కోసం సంబంధం కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో తమ ప్రేమ విఫలమైందని కల్పన, శివకుమార్ మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం ఉదయం శివకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే కల్పన తన ఇంట్లో పైకప్పు పైపునకు చున్నీతో ఉరివేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. -
కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం. -
‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు
అల్వార్: రాజస్థాన్లోని అల్వార్లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ కాంట్రాక్ట్ కిల్లర్ల సాయంతో భర్తను హత్య చేసింది. అయితే ఈ కేసులో ఆ మహిళ తొమ్మిదేళ్ల కుమారుడే సాక్షిగా నిలవడం విశేషం. అల్వార్లోని ఖేర్లి ప్రాంతంలో ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వీరు అలియాస్ మాన్ సింగ్ జాతవ్ ఇంట్లో మృతి చెందాడు. అతని భార్య అనిత తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని తెలిపింది. అయితే వారి కుమారుడు పోలీసులకు ఇంటిలో జరిగిన విషయమంతా చెప్పడంతో 48 గంటల్లో నిజానిజాలు వెలుగు చూశాయి.పోలీసులకు ఆ పిల్లాడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోజు రాత్రి అతని తల్లి ఇంటి ప్రధాన గేటును తెరచివుంచింది. ఇంతలో ఆ బాలుడు ‘అంకుల్’(కాశీరామ్ ప్రజాపతి) అని పిలిచే వ్యక్తితో పాటు నలుగురు ఇంటిలోనికి ప్రవేశించారు. తరువాత వారంతా కలిసి.. మంచంపై పడుకున్న వీరు ముఖంపై తలగడ అదిమిపెట్టి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ పక్కనే నిద్రిస్తున్నట్లు నటించిన ఆ బాలుడు జరిగిన ఘటనను గమనించాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిత, కాశీరామ్ ముందుగానే వీరు హత్యకు ప్లాన్ చేశారు. తమ వివాహేతర సంబంధానికి వీరు అడ్డుగా ఉన్నాడని భావించి, ఈ దారుణానికి పాల్పడ్డారు. అనిత స్థానికంగా ఒక చిన్న జనరల్ స్టోర్ నిర్వహిస్తుండగా, కాశీరామ్ కచోరీలు విక్రయిస్తుంటాడు. అతను తరచూ అనిత దుకాణానికి వస్తుండేవాడు. ఈ నేపధ్యంలో ఇద్దరూ దగ్గరయ్యారు. అనిత, కాశీరామ్లు.. కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ.రెండు లక్షలు ఇచ్చి, వీరును హత్య చేయించారనే ఆరోపణలున్నాయి.వీరు మృతిచెందాక, అతను అనారోగ్యంతో మరణించాడని అనిత బంధువులకు చెప్పింది. అయితే వారు అనుమానంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య పరీక్షల అనంతరం వీరు హత్యకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని 100 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ క్లిప్లను పరిశీలించారు. కాల్ డేటా రికార్డులను విశ్లేషించారు. అనిత, కాశీరామ్లతో పాటు కాంట్రాక్ట్ కిల్లర్లలో ఒకరైన బ్రిజేష్ జాతవ్ను అరెస్టు చేసిన పోలీసులు మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’ -
‘హనీమూన్’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్తో పాటు ప్రియుడు..
షిల్లాంగ్: మధ్యప్రదేశ్కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్ల హనీమూన్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సోనమ్ను, అమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను మేఘాలయ పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు. నాడు నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ (Scene Reconstruction) చేశారు.సోనమ్, రాజా రఘువంశీలు హనీమూన్లో ఉండగా, ఒక పథకం ప్రకారం రాజా రఘువంశీ హత్య జరిగింది. రాజా మృతదేహం దొరికిన ఆరు రోజులకు సోనమ్ యూపీలోని ఘాజీపూర్లో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విచారణలో సోనమ్ తన భర్త హత్యలో తన పాత్రను అంగీకరించింది. అయితే ఆమెపై ఉన్న అభియోగాలను నిరూపించే ఆధారాలను పోలీసులు కోర్టుకు అందించాలి. ఇందుకోసం వారు సోనమ్ను మేఘాలయ తీసుకువచ్చారు.మేఘాలయలోని సోహ్రాలో నేరాల రేటు అతి తక్కువ. గత కొన్ని దశాబ్దాలుగా ఈ పర్యాటక ప్రదేశంలో ఎటువంటి హత్య జరగలేదని పోలీసులు తెలిపారు. అందుకే వారు ఈ కేసు దర్యాప్తుపై మరింత దృష్టి సారించారు. నిందితులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మేఘాలయ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్రాంగ్ అన్నారు. అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విచారణ కోసం సోనమ్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నామన్నారు.ఇది కూడా చదవండి: అంబులెన్స్లో కేదార్నాథ్.. బెడిసికొట్టిన ‘ప్లాన్’ -
అమ్మ లేదని.. ఇక తిరిగి రాదని తెలియక..
మహబూబాబాద్ రూరల్ : మేకను కొనేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా సమీపంలో చోటుచేసుకుంది.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. జిల్లాలోని బయ్యారం మండలం జగత్ రావు పేట జీపీ పరిధిలోని బోటి తండాకు చెందిన మాలోత్ సురేశ్, అతడి అన్న గణేశ్, వదిన అమలాదేవి (27), వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల గౌతమ్, ఏడాదిన్నర వయసుగల గగన్, అక్కాబావ బానోత్ రంగ్య, మంజుల ఓ ఆటోలో కురవి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా దాటుతుండగా ముందునుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అమలాదేవికి తీవ్ర, మిగతా వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 108 వాహనం క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అమలాదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. కాగా, మంగళవారం తమ ఇంటి వద్ద ఎల్లమ్మ పండుగ చేసుకోనున్న నేపథ్యంలో కురవిలోని అంగడిలో మేకను కొనుగోలు చేయడానికి వారంతా ఆటోలో వెళ్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు. కుమారులు గౌతం, గగన్.. తల్లి అమలాదేవి కనిపించకపోవడంతో వెక్కివెక్కి ఏడుస్తుండగా వారిని ఆపడం ఎవరితరం కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కురవి ఎస్సై గండ్రాతి సతీశ్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
నమ్మించి గొంతుకోసి.. కారు ప్రమాదంగా చిత్రీకరించి..
సంగీత ప్రపంచంలో పాపులారిటీ సంపాదించుకుంటోందనుకున్న సమయంలోనే.. ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెది ప్రమాదం కాదని.. హత్య చేశారనే విషయం బయటపడడంతో అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రముఖ హర్యానా మోడల్ శీతల్ చౌద్రీ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను నమ్మించి.. గొంతుకోసి హత్య చేశాడని క్రైమ్బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు. ఆపై ఘటనను ఓ కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. నిందితుడు సునీల్ తన నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. హర్యానా మోడల్ అయిన శీతల్ చౌద్రీ.. అక్కడి మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ ఆల్బమ్స్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె తన బంధువుల అమ్మాయిలతో పానిపట్ సత్కర్తర్ కాలనీలో నివసించసాగింది. అయితే జూన్14వ తేదీన ఓ ఆల్బమ్ షూట్కు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మాత్లౌదా పీఎస్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు.. ఆదివారం(జూన్ 15న) ఓ కాలువలో ఆమె ప్రయాణించిన కారు కొట్టుకువచ్చింది. అయితే అందులో ఆమె మృతదేహాం లేదు. ఆ మరుసటిరోజు.. కారు దొరికిన 80 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతిపై ఉన్న టాటూల ఆధారంగా అది శీతల్ మృతదేహామేనని నిర్ధారించుకున్నారు. ఈలోపు.. ఆమె ప్రియుడు, ప్రమాదం నుంచి బయటపడ్డ సునీల్ చెప్పిన మాటల్ని అంతా నమ్మారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోస్ట్మార్టం నివేదికలో ఆమె గొంతు, శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, ఆ గాయాల కారణంగానే ఆమె మరణించిందని తేలింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన హర్యానా క్రైమ్ బ్రాంచ్ విభాగం.. చివరగా ఆమె కారులో వెళ్లిన ప్రియుడు సునీల్ను గట్టిగా విచారించడంతో విషయం బయటకు వచ్చింది. శీతల్ గతంలో సునీల్ పని చేసిన ఓ హోటల్లో రిసెప్షనిస్ట్గా పని చేసింది. వీళ్ల మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది. శీతల్ ఐదు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తాబిడ్డలను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని సునీల్ శీతల్కు ప్రపోజ్ పెట్టారు. ఈలోపు సునీల్కు ఇదివరకే పెళ్లైందని.. ఇద్దరు బిడ్డలకు తండ్రి అనే విషయం శీతల్కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. తన పరువును బజారున పడేస్తుందన్న భయంతో.. మాట్లాడుకుందామని శీతల్ను పిలిచాడు సునీల్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని కారులో ఉంచి కాలువలోకి నెట్టేశాడు. నిందితుడు సునీల్ నేరం అంగీకరించడంతో.. పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్ 14వ తేదీ.. పానిపట్లో శీతల్ ఆల్బమ్ షూటింగ్.. ఆపై సునీల్తో ఔటింగ్. అర్ధరాత్రి దాకా కలిసి తాగిన శీతల్-సునీల్. ఆపై తన సోదరికి కాల్ చేసి సునీల్ దాడి చేస్తున్నాడని చెప్పిన శీతల్. కాల్ కట్ కావడంతో కంగారుపడిపోయిన శీతల్ సోదరి. జూన్ 15వ తేదీ.. మిస్సింగ్ కేసు నమోదు. పోలీసులు ఎంక్వైరీ. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ను ప్రశ్నించిన పోలీసులు. తాము కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, తాను ఈత కొడుతూ బయటకు వచ్చి ఆస్పత్రిలో చేరానని, శీతల్ కారుతో సహా కొట్టుకుపోయిందని సునీల్ వాంగ్మూలం. శీతల్ ప్రయాణించిన కారు స్వాధీనం.జూన్ 16వ తేదీ.. శీతల్ మృతదేహాం లభ్యం. పోస్ట్మార్టం నివేదికలో హత్య జరిగిందని నిర్ధారణ.జూన్ 17వ తేదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ నేరాంగీకరణ. ఉదయాన్నే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధింపు.CCTV Footage में आखिरी बार अपने Boyfriend के साथ दिखी Haryana Model sheetal । India News Haryana #haryananews #crimenews #cctv #model #sheetalchaudhary #mudercase #boyfriendexpose #boyfriendgirlfriend #viralvideo #ytshorts #breakingnews #latest pic.twitter.com/0yGuANnWns— India News Haryana (@indianews_hr) June 17, 2025Video Credits: India News Haryana -
బుల్లితెర నటిపై ఫిర్యాదు.. డబ్బు కోసం మొదట భర్త ఉండగానే..
మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నానని చెప్పి తనను మోసం చేసిందని కోలీవుడ్ బుల్లితెర నటి నిహానాబేగంపై వ్యాపారవేత్త పూందమల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ్లో బాగా పాపులర్ అయిన 'పొన్ని, పాండియన్ స్టోర్స్' వంటి పలు సీరియల్స్లో నిహానాబేగం నటించింది. అయితే, చెన్నై దగ్గరలో ఉన్న కోళపాక్కంకు చెందిన రాజ్కన్నన్ అనే వ్యాపారవేత్త ఆమె తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులో ఇద్దరు పిల్లల తల్లి అయిన నిహానాబేగం తాను భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు చెప్పిందన్నారు. ఆమెతో తన పరిచయం స్నేహంగా మారి, ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే నిహానాబేగం తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదని తరువాత తెలిసిందని, తనను మోసం చేసి, రూ.20 లక్షలు తీసుకుందని ఆరోపించాడు. తనను మోసం చేసిన ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని, తన నుంచి తీసుకున్న రూ.20 లక్షలను తిరిగి ఇచ్చేలా చేయాలని బాధితుడు పిటిషన్లో కోరాడు. పోలీసులు నిహానాబేగంను, రాజ్కన్నన్ను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారించడానికి సిద్ధమయ్యారు. -
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
స్టేషన్ఘన్పూర్: గ్రామంలో వారివి సమీప ఇళ్లు. హైస్కూల్, ఇంటర్ చదువులు నమిలిగొండ శివారులోని మోడల్ స్కూల్లో చదివారు.. ఇద్దరూ ఒకే తరగతి వారు కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ, కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన ప్రేమజంట కోటె వినయ్కుమార్(25), మచ్చ శృతి(23) ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే వినయ్కుమార్, శృతి ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో సోమవారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగినమిలిగొండ గ్రామానికి చెందిన కోటె రాజయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు వినయ్కుమార్, మచ్చ కుమారస్వామి, రేణుక దంపతుల కుమార్తె శృతి బాల్యం నుంచే స్నేహితులు. శృతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లో విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వినయ్కుమార్ జనగామ పిన్కేర్ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి ప్రేమను ఒప్పుకోకపోవడంతోపాటు శృతికి ఇంటిలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న వినయ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇక ఎప్పటికీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆవేదనతో ఇద్దరు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు భువనగిరిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను వేర్వేరుగా అంబులెన్స్లలో గ్రామానికి తరలించారు. వారివారి ఇళ్ల వద్దకు మృతదేహాలను చేర్చగానే మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించాయి. ఛిద్రమైన మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. అనంతరం శృతి, వినయ్కుమార్ల అంత్యక్రియలు వేర్వేరుగా వారి కుటుంబసభ్యులు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్సై వినయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు చేపట్టారు. -
ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్తో పాటు 25 క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025 -
నెల క్రితమే పెళ్లి.. కొత్త జంటను ఇలా వెంటాడిన మృత్యువు
సాక్షి, గాజువాక: వివాహమైన నెల రోజులకే ఒక జంట మృత్యు ఒడికి చేరింది. కాళ్ల పారాణి ఆరకముందే విధి ప్రమాద రూపంలో కబళించింది. నగరంలో సరదాగా షికారు చేసి వద్దామనుకొని బయల్దేరిన కొత్త జంట రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. దీంతో, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.గాజువాక ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలివి.. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జొన్నాడ సాయి(27), పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన శాలిని (25) గాజువాకలోని యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకొని నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీహరిపురంలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ల్యాబ్కు సెలవు కావడంతో షికారు కోసం నగరంలోకి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు.ములగాడ మీదుగా పోర్టు రోడ్లోని మారుతీ సర్కిల్ వద్ద వెనుకనే వస్తున్న ఒక ట్రాలర్ వారిని ఢీకొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్ర గాయాలపాలైన శాలినిని షీలానగర్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స ప్రారంభించే సమయానికి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సీఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ కింద పడి ఇద్దరు నేవీ వైద్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.. 24 గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. -
వాడితో తిరగడం మానుకో బిడ్డా.. ఇంతలోనే..
సాక్షి, రాయచూరు: ప్రేమించిన పాపానికి అమ్మాయిని ఆరు నెలల క్రితం హత్య చేసి పాతిపెట్టాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన కారణంగానే హత్య చేసినట్టు ప్రియుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గదగ్ తాలూకా నారాయణపుర గ్రామంలో మధుశ్రీ (21) అనే యువతిని సతీష్ హిరేమఠ (22) అనే యువకుడు ప్రేమించాడు. ప్రేమ పేరుతో షికార్లకు తీసుకెళ్లాడు. ఐదేళ్ల నుంచి ఈ ప్రేమాయణం సాగుతోంది. ఇది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు హిరేమఠతో తిరగడం మానుకోవాలని ఆమెను హెచ్చరించి గదగ్లోని బంధువుల ఇంట్లో ఉంచారు. గత ఏడాది డిసెంబర్ 16న గదగ్ నుంచి మధుశ్రీ వెళ్లిపోయింది. ఈ ఏడాది జనవరి 12న బెటగేరి పోలీస్ స్టేషన్లో కనబడుట లేదనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సతీష్ హిరేమఠ్పై అనుమానంతో పోలీసుల విచారణ జరిపారు.పెళ్లి చేసుకోమనడంతో..ఇద్దరూ బైక్లో వెళ్తున్నట్లు గదగ్లో కొన్ని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టిగా విచారించగా నిందితుడు నిజం కక్కాడు. పెళ్లి చేసుకోవాలని మధుశ్రీ ఒత్తిడి చేసింది.. తనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఊరి బయటకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి, వాగులో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపాడు. అనంతరం, గదగ్ యస్ఐ మారుతి, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా యువతి అస్తిపంజరం కనిపించింది. ప్రేమోన్మాది చేతిలో బలయ్యావా తల్లీ అని తల్లిదండ్రులు విలపించారు. -
మోసం చేశాడు సరే.. డబ్బులిప్పిస్తాం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో బాలికలు, మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ చూసుకుని వారి అనుచరులు, వందిమాగధులు చెలరేగిపోతున్నారు. మహిళలపై జరుగుతున్న దారుణాలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా, ప్రజా సంఘాల నుంచి నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ తరుణంలో రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు అల్లుడు వరుసయ్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు పులపర్తి సత్యదేవ్ పెళ్లి చేసుకుంటానంటూ ఒక దళిత మైనర్ బాలిక (17)ను గర్భవతిని చేసి.. అధికారం అండతో ధైర్యంగా తిరిగాడు.ఆమె బిడ్డను కన్న తర్వాత కూడా బుకాయిస్తూ వచ్చాడు. ఏడాది కాలంగా ఈ విషయం బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కిపెట్టారు. డబ్బులిప్పిస్తామని.. పెళ్లొద్దంటూ దుప్పటి పంచాయితీ చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని వైఎస్సార్సీపీ మహిళా నేతలు బయట పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ఎట్టకేలకు పోక్సో కేసు పెట్టారు. అయితే అధికార పార్టీ అండదండలతో నిందితుడు పరారీలో ఉన్నాడు. టీడీపీ పెద్దలు డబ్బులిప్పిస్తామంటూ దుప్పటి పంచాయితీ చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ సత్యదేవ్ రెండేళ్లుగా వెంటపడుతూ వచ్చాడు. తనకు టీడీపీలో ముఖ్య నేతలంతా సన్నిహితంగా ఉంటారని, తాను ఎంత చెబితే అంత అంటూ నమ్మించి.. ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేశాడు. సత్యదేవ్ మాటలు నమ్మి ఆ బాలిక మోసపోయింది. బాలికతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుని గర్భవతిని చేశాడు. ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు తేలడంతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో కులం తక్కువ దానివి ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దూషిస్తూ అబార్షన్ చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు సత్యదేవ్ మోసంపై రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథానికి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ సమయంలో కేసు లేకుండా ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకునేలా అధికార పార్టీ నేతలు ఆ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పెళ్లి చేసుకోవడమే పరిష్కారమని బాధిత బాలిక, ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో అయ్యప్ప దీక్ష తీసుకున్నానని నిందితుడు పెళ్లి వాయిదా వేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికకు ఎనిమిదవ నెల వచ్చేసింది. అబార్షన్ చేయడం ప్రమాదమని వైద్యులు చెప్పి, సిజేరియన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత బిడ్డ్డ ఉన్నట్లుండి చనిపోయాడు. బిడ్డకు వైద్యం అందకుండా చేసి చనిపోయేందుకు సత్యదేవే కారకుడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ అప్పటి నుంచి బొమ్మూరు పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధిత కుటుంబం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఈ నెల 4న జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు సత్యదేవ్ను పిలిపించి పెళ్లి చేసుకోవాలని వారం గడువు ఇచ్చారు. అయినప్పటికీ బాలికకు న్యాయం జరగలేదు. దీంతో ఈ బాగోతాన్ని వైఎస్సార్సీపీ మహిళా నేతలు పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి మీడియా ఎదుట బయటపెట్టారు. బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని వారు డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత బాలికకు తన అనుచరుడి కారణంగా ఏడాదిగా అన్యాయం జరుగుతున్నా టీడీపీ ఎమ్మెల్యే వాసు ఏమీ ఎరగనట్టు ఉండటం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆక్షేపించారు. ఇప్పటికీ బాధిత బాలికకు న్యాయం చేసే బదులు ప్రైవేట్ సెటిల్మెంట్కు ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు.మానవతా దృక్పథంతోనే కేసు నమోదులో ఆలస్యంమానవతా దృక్పథంతో ఆలోచించడం వల్లే కేసు నమోదుకు ఆలస్యమైంది. ఈనెల 4న బాధితురాలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. జిల్లా వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య బాధితురాలిని బొమ్మూరు పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆమెకు నేను, సౌజన్య కౌన్సెలింగ్ చేశాం. సత్యదేవ్తో తనకు పెళ్లి జరిపించాలని కోరింది. సత్యదేవ్ను, అతని బాబాయిని పిలిపించి మాట్లాడాం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని పది రోజులు గడువు కోరాడు. ఏడు రోజుల్లో స్పష్టం చేయాలని ఇద్దరికీ చెప్పాం. నిందితుడు పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాటతో కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు ఆ గడువు తీరిపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యదేవ్పై క్రైంనెంబర్ 197/2025 యు/ఎస్64(2)(ఎం), 89బిఎన్ఎస్,సెక్షన్ 5(1)ఆర్/డబ్ల్యూ 6ఆఫ్ పోక్సో యాక్ట్ అండ్ సెక్షన్ 3(2)(వి) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్ 1989 కింద కేసు నమోదు చేశాం. సత్యదేవ్ కోసం గాలిస్తున్నాం. బిడ్డ ఎలా చనిపోయిందో కూడా విచారిస్తాం. – బి.విద్య, డీఎస్పీ, తూర్పు జోన్, రాజమహేంద్రవరంఆరేళ్ల బాలికపై అత్యాచారం కర్నూలులో దారుణం నిందితుడిపై పోక్సో కేసుకర్నూలు: కర్నూలులో ఆరేళ్ల బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీలో విజయ్కుమార్ అలియాస్ రాజు (40) ఉంటున్నాడు. అదే కాలనీలో ఉంటున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్డాడు. ఇతనికి పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న బాలికను ఇంట్లోకి పిలిచి ఈ నెల 13న దారుణానికి ఒడిగట్టాడు. శనివారం బాలిక మూత్రానికి వెళ్లడానికి ఇబ్బంది పడుతుండటంతో తల్లి కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరిశీలించి అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదే రోజు విజయ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. -
విద్యుదాఘాతానికి నలుగురు బలి
కోరుట్ల: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్లో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఇద్దరు మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. కోరుట్ల–మెట్పల్లి జాతీయ రహదారి వెంట ఉన్న బాలాజీ కళా ఆర్ట్స్లో గణపతి విగ్రహాలు తయారు చేస్తారు. షెడ్లో తయారు చేసిన ఓ గణపతి విగ్రహానికి రంగులు వేసేందుకు మరో షెడ్కు తరలించడానికి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో క్రేన్తో ఏర్పాట్లు చేసుకున్నారు. యజమాని అల్వాల వినోద్, ఆయన తమ్ముడు అల్వాల నితిన్ 8 మంది వర్కర్లతో కలిసి విగ్రహాన్ని ట్రాలీపై జాతీయ రహదారిపైకి తెచ్చారు. విగ్రహం దాదాపు 12 ఫీట్ల ఎత్తు ఉండటంతో కిరీటం భాగం పైన ఉన్న 33 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. విగ్రహం తడిగా ఉండటంతో విగ్రహాన్ని పట్టుకుని ఉన్న పది మంది విద్యుత్ షాక్కు గురయ్యారు. కరెంట్ తీగల్లో మంటలు చెలరేగి విగ్రహం కిరీటం కాలిపోయింది. ఏడుగురు షాక్తో విగ్రహానికి అతుక్కుపోయారు. మరో ముగ్గురు కింద పడిపోయారు. గమనించిన చుట్టుపక్కల వారు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు వారు కరెంటు తీగలను పక్కకు తప్పించారు. బాధితులను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో యజమాని అల్వాల వినోద్ (32), వర్కర్ వెల్లుట్ల సాయికుమార్ (23) మృతిచెందారు. ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ అశోక్కుమార్ సందర్శించారు. నిద్రలోనే తెల్లారిన బతుకులు నాగోలు: నిద్రిస్తున్న వారిపై విద్యుత్ తీగలు తెగిపడిపోవ డంతో ఇద్దరు సజీవ దహనమైన ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్లోని సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తా సమీపంలోని బాబాయ్ హోటల్ సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఫుట్పాత్పై ఇద్దరు గుర్తు తెలియ ని యాచకులు నిద్రిస్తున్నారు. వారితోపాటు ఓ శునకం కూడా ఉంది. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహ నం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో 11 కేవీ హైటెన్షన్ వైరు తెగి నిద్రిస్తున్న వారిపై పడింది.ఇద్దరు యాచకులతోపాటు పక్కనే ఉన్న శునకం సజీవ దహనమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితి పరిశీ లించారు. 11కేవీ విద్యుత్ తీగ వారిపై పడిపోవడంతో మంటల్లో కాలిపోయి వారి బట్టలు, దుప్పట్లు వారి శరీరాలకు అంటుకున్నాయి. గుర్తించలేని విధంగా మృతదేహాలున్నాయి. మృతులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...
నెహ్రూసెంటర్: భర్త మరణం భార్యకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివాహ వార్షికోత్సవం తర్వాత రోజే విద్యుత్ ప్రమాదరూపంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబ విషాదంలో మునిగిపోయింది. మరోచోట కరెంట్ షాక్తో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. డోర్నకల్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న క్రాంతికుమార్ (32) ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తూ శనివారం విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు తీసుకురాగా అప్పటికే మృతిచెందాడు. క్రాంతికుమార్ మృతితో భార్య, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.సంతోషం.. మరునాడే విషాదంమృతుడు క్రాంతికుమార్ దంపతులు శుక్రవారం పెళ్లిరోజు వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన కాంత్రి మరుసటి రోజే మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తమను సంతోషంగా చూసుకుంటాడనుకున్న భర్త మృతితో భార్య రోదనలు మిన్నంటాయి.ఫాదర్స్డే రోజున నాన్న లేడాయే...క్రాంతికుమార్కు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నేడు అందరూ ఫాదర్స్ డే జరుపుకుంటుండగా చిన్నారులకు మాత్రం కన్నతండ్రి దూరమైన పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆ చిన్నారులు తమ తండ్రి చనిపోయిన విషయాన్ని సైతం తెలుసుకునే వయస్సులో లేకపోవడం కలిచివేస్తుంది.ఇనుగుర్తిలో ఘటన...జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. డోర్నకల్లో జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇనుగుర్తి శివారు వీరారెడ్డిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అదే గ్రామానికి చెందిన బూర్గుల అంబేడ్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లో ఆస్పత్రికి తరలించారు. -
రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త
నెల్లూరు(క్రైమ్): భార్య చీటికి మాటికి గొడవపడుతుండడంతో విసిగిపోయిన భర్త రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు బాలాజీనగర్ గౌడహాస్టల్ సమీపంలో ఎల్.విజయ్చంద్ర, శైలజ(46) దంపతులు నివసిస్తున్నారు. వారికి బీటెక్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు.విజయ్చంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శైలజ తండ్రి చెన్నైలో ఉంటూ మృతిచెందారు. ఆయనకు చెందిన ఆస్తులు తమకు రావాలంటే కొంత నగదు ఖర్చు చేయాలని ఆమె భర్తకు చెప్పి అతనిచేత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేయించింది. దీంతో విజయ్చంద్ర అప్పులపాలయ్యాడు.ఈ క్రమంలోనే భర్తపై ఆమె అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టింది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిత్యం భర్తతో గొడవపడుతుండేది. కుమారులు ప్రశి్నస్తే వారితోనూ గొడవపడేది. శనివారం మధ్యాహ్నం విజయ్చంద్ర ఇంట్లోనే ఉన్నారు. కుమారులను భోజనం తీసుకురమ్మని బయటకు పంపించారు. ఈక్రమంలో దంపతుల నడుమ మరోమారు గొడవ జరిగింది.ఆగ్రహానికి గురైన భర్త పక్కనే ఉన్న రోకలిబండతో శైలజ తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పెద్దకుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
విద్యుత్ కార్మికులకు కరెంట్ షాక్..
డోర్నకల్ /కేసముద్రం/నల్లబెల్లి/ముస్తాబాద్ (సిరిసిల్ల) /మల్లాపూర్: ఉమ్మడి వరంగల్, జగిత్యాల జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న వేర్వేరు విద్యుత్ ప్రమాదాల్లో నలుగురు విద్యుత్ కార్మికులు కరెంట్ షాక్కు గురయ్యారు. అందులో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, సిరిసిల్ల జిల్లాలో కిందపడిన విద్యుత్ తీగను సరిచేస్తూ షాక్కు గురై ఓ కూలీ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన బి.క్రాంతికుమార్ (32) ఐదేళ్లుగా డోర్నకల్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మున్నేరువాగు వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేయడానికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలంటూ ప్రత్యేక యాప్ ద్వారా అనుమతి కోరగా.. సరఫరా నిలిపివేసినట్లు సమాచారం వచ్చింది. దీంతో ట్రాన్స్ఫార్మర్పైకి వెళ్లి మరమ్మతు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడ్డాడు. అతడిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోల్పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణంవిద్యుత్ స్తంభంపైకెక్కి తీగలు సరిచేస్తుండగా కరెంట్ షాక్తో జూనియర్ లైన్మెన్ మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన దుంపేట రాజేశం (40) కొత్తదాంరాజుపల్లి సబ్స్టేషన్ పరిధిలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. వాల్గొండలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలను సరిచేసేందుకు స్తంభంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో కరెంట్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్కు గురై స్తంభంపై నుంచి కిందపడి మృతిచెందాడు. కరెంట్షాక్తో కూలీ దుర్మరణంరాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన బైతి రాజయ్య(48) ఇంట్లో శనివారం విద్యుత్ సర్వీస్ తీగ తెగిపడింది. దానిని పక్కకు తీస్తూ షాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు ముస్తాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. రాజయ్య భార్య గతంలోనే చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.మరో రెండు ఘటనల్లో ఇద్దరికి గాయాలు..వరంగల్ జిల్లా పంతులుపల్లికి చెందిన నీలం శ్రీనివాస్ అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్గా పనిచేస్తున్నాడు. గోవిందాపూర్ ఫీడర్లో ఎల్సీ తీసుకుని శివారు లైన్తండాలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనులు చేపడుతున్నాడు. అయితే ఏఎల్ఎం బాసు.. మద్యం మత్తులో ఉండి ఎల్సీ తీసుకున్న విషయం మరిచిపోయి ఫీడర్ను ఆన్ చేశాడు. దీంతో శ్రీనివాస్ విద్యుత్ షాక్కు గురై గాయపడ్డాడు. ఏఎల్ఎం బాసు మద్యం తాగినట్లు గుర్తించి పోలీస్స్టేషన్కు తరలించారు. మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన అసిస్టెంట్ లైన్మెన్ బూర్గుల అంబేడ్కర్ రాముతండా జీపీ శివారు వీరారెడ్డిపల్లి సమీప వ్యవసాయక్షేత్రంలో ట్రాన్స్ఫార్మర్ను బిగించే క్రమంలో షాక్కు గురయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఆస్పత్రికి పంపించారు. -
చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
మైలవరం(ఎన్టీఆర్): ‘మా మధ్య ఎటువంటి గొడవలు లేవని’ మైలవరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిన్నారుల తల్లి చంద్రిక చెప్పారు. మైలవరంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం చంద్రిక మాట్లాడుతూ భర్త రవిశంకర్ తాను ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్లమన్నారు. మూడు నెలల క్రితం బహ్రయిన్ వెళ్లానని, ఈ నెల 5,6,7 తేదీల్లో తన భర్త రవిశంకర్తో మాట్లాడానని పేర్కొన్నారు. 8వ తేదీ పుట్టిన రోజు అని చెప్పాడని, ఆ రోజున పిల్లలతో మాట్లాడతానని తాను చెప్పారన్నారు. 8న అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని, వదినకు ఫోన్ చేసినట్లు తెలిపింది. పిల్లలను ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. – మైలవరం పీఎస్లో ఎస్ఐ సుధాకర్ చిన్నారుల తల్లి చంద్రికతో పాటు మరి కొంతమంది బంధువుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పోలీస్లకు దొరికిన సూసైడ్ నోట్ రవిశంకర్ ఇంట్లో అతను రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించినట్లు సమాచారం. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. చంద్రిక నన్ను క్షమించు. నీకు ఇచ్చిన మాట తప్పాను, నా పిల్లలుగా పుట్టిన పాపానికి వీళ్లని బలి ఇచ్చాను. 8.6.92 తన పుట్టిన రోజు అని అదే రోజు నాకు పిల్లలకు చావు రోజు అని రవిశంకర్ రాసిన లేఖలో పేర్కొన్నాడు. ముమ్మరంగా గాలింపు గత ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రవిశంకర్ చివరి కాల్ ఐదు నిమిషాలు మాట్లాడినట్లు రికార్డు అయింది. అనంతరం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలోకి దూకి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మైలవరం సీఐ దాడి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్లు, బోట్ల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. -
బ్యాంకింగ్ మోసాలు @ రూ.36,014 కోట్లు
సాక్షి, అమరావతి: రుణ ఖాతాలు, డిజిటల్ పేమెంట్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ నేరాల విలువ 2023–24తో పోల్చిచూస్తే మూడు రెట్లు పెరిగింది. ఈ మోసాల విలువ రూ.12,230 కోట్ల నుంచి రూ.36,014 కోట్లకు ఎగసింది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఇదే కాలంలో నేరాల సంఖ్య మాత్రం 36,060 నుంచి 23,953కు తగ్గింది. ఫ్రాడ్ క్లాసిఫికేషన్కు సంబంధించి 2023 మార్చి 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, గత సంవత్సరాల్లో నివేదించిన రూ.18,674 కోట్ల విలువైన 122 కేసులను తిరిగి తాజా నేరాలుగా నమోదు చేయడం వల్ల మొత్తం నేరాల విలువ పెరిగిందని ఆర్బీఐ నివేదిక వివరించడం గమనార్హం. మొత్తం నేరాల సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులకు సంబంధించినవి 60 శాతం ఉన్నాయి. కానీ విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకులవి 71 శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..» నేరాల సంఖ్యలో ఎక్కువగా డిజిటల్ చెల్లింపుల (కార్డ్, ఇంటర్నెట్) కేటగిరీలో చోటుచేసుకున్నాయి. అయితే విలువ పరంగా చూస్తే లోన్ లేదా అడ్వాన్స్ ఖాతాల్లోనే ఎక్కువ నేరాలు జరిగాయి. » ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువగా కార్డ్, ఇంటర్నెట్ నేరాలు జరగ్గా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లోన్ పోర్టుఫోలియోకి సంబంధించిన నేరాలు ఎక్కువ ఉన్నాయి. » మొత్తం కేసుల్లో లోన్ సంబంధిత నేరాలు 33 శాతానికి పైగా ఉండగా, మొత్తం నేరాల విలువలో 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి.» 2024–25 చివరిలో కార్డ్, ఇంటర్నెట్ నేరాల కేటగిరీలో 13,516 కేసులు నమోదయ్యాయి. ఇవి మొత్తం 23,953 నేరాల్లో 56.5 శాతం.» రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఉన్న కేసుల వివరాలనే నివేదికలో పొందుపరచడం జరిగింది. » సంస్థలు తమ నివేదికలను సవరిస్తే ఈ డేటా మారే అవకాశం కూడా ఉంది. » నివేదికలో పేర్కొన్న మొత్తాన్ని ‘కోల్పోయిన నష్టం’గా పరిగణించడం సరికాదు. రికవరీల ఆధారంగా నష్టం తగ్గవచ్చు.భద్రత కోసం కొత్త డొమెయిన్లు..డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న నేరాలపై పోరాటానికి ఒక వినూత్న ప్రయత్నంగా భారతీయ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా ‘..bank.in’, నాన్–బ్యాంకుల కోసం ‘fin.in’ అనే ఇంటర్నెట్ డొమెయిన్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ చేసింది. ఈ ప్రయత్నం డిజిటల్ బ్యాంకింగ్పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది, సైబర్ మోసాలను గుర్తించడంలో అలాగే ఫిషింగ్ వంటి ప్రమాదకరమైన కార్యకలాపాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్బీటీ) ఈ డొమెయిన్లకు ప్రత్యేక రిజిస్ట్రార్గా వ్యవహరిస్తుందని, బ్యాంకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని నివేదిక తెలిపింది. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఐదుగురు బలి
సాక్షి బెంగళూరు/కార్వేటినగరం: కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు మృతిచెందారు. ఏపీఎస్ ఆర్టీసీ చిత్తూరు–2 డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు గురువారం రాత్రి తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. బస్సు శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు శివారులోని హోసకోటె–కోలారు జాతీయ రహదారిపై గొట్టిపుర గేట్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. బస్సు అదుపు తప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో 18 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతి మారేడుపల్లె గ్రామానికి విశ్వనాథరెడ్డి భార్య శారద(40), వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కె.కేశవులురెడ్డి(45), అతని తమ్ముడు జనార్దన్రెడ్డి కుమారుడు 45 రోజుల చిన్నారి, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ గ్రామానికి చెందిన తులసి (22), తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన హరిబాబు, రోహిణి దంపతుల కుమార్తె ప్రణతి(4)గా గుర్తించారు. ప్రణతి తండ్రి బెంగళూరులో ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. క్షతగాత్రులను సిలికాన్ సిటీ, ఎంవీజే ఆస్పత్రుల్లో చేర్పిం చి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోపాటు అతి వేగంతో లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయతి్నంచడమే ఈ ప్రమాదానికి కారణమని హోసకోటె పోలీసులు తెలిపారు. బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ సీకే బాబా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
విశాఖలో దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను హతమార్చి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యను డంబుల్తో కొట్టి చంపేశాడు.. భార్యను హతమార్చిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే కారణమమని పోలీసులు అంటున్నారు.తమ్ముడి చేతిలో అన్న హతంమరో ఘటనలో తమ్ముడి చేతిలో అన్న హతమయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాలా జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలో జరిగింది. కుటుంబ కలహాలతో తాగిన మైకంలో అన్న కూన నర్సయ్యను కట్టెతో తలపై తమ్ముడు కూన రాములు విచక్షణారహితంగా కొట్టి చంపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వరంగల్లో దారుణం.. భర్త గొంతు కోసిన భార్య
సాక్షి, వరగల్: వరంగల్ నగరంలో దారుణ ఘటన జరిగింది. భర్త గొంతును భార్య కోసేసింది. దుబాయ్ వెళ్లి సంపాదించాలని భర్తపై ఒత్తిడి చేసింది. దుబాయ్ వెళ్లనందుకు భర్తపై హత్యాయత్నం చేసింది. భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఎంజీఎంలో మృత్యువుతో రెహమాన్ పోరాడుతున్నాడు. గత కొద్దిరోజులుగా రహమాన్ను భార్య కుటుంసభ్యులు వేధిస్తుండగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
బాలికపై అఘాయిత్యం
రాజమహేంద్రవరం సిటీ: ప్రేమ పేరుతో వంచించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బాలికను గర్భిణిని చేసిన యువకుడు చివరకు మోసం చేసిన ఘటన రాజమహేంద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికతో కలసి రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి గురువారం మీడియాతో మాట్లాడారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామానికి చెందిన బాలికను మోరంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు పులపర్తి సత్యదేవ్ ప్రేమించానంటూ రెండేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ బాలికను లోబరచుకున్నాడు. గత ఏడాది నవంబర్లో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ బాలిక 6వ నెల గర్భిణిగా నిర్ధారణ అయ్యింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్ వద్దకు వెళ్లి తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామి మాలలో ఉన్నానని, మాల తీసేలోగా బాలికకు అబార్షన్ చేయించాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరంలోని సీఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్ 17న ఆ బాలికకు అబార్షన్ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్ నిరాకరిస్తున్నాడు. కులం తక్కువ దానివంటూ దూషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలిక, తల్లిదండ్రులు బొమ్మూరు సీఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితురాలికి చట్ట ప్రకారం న్యాయం జరగాలని కోరారు. బాలికకు అబార్షన్ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ గాండ్ల, తెలుకుల సంఘం అధ్యక్షురాలు సంకిస భవానీప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి పాల్గొన్నారు.బాలికపై లైంగిక దాడిగర్భం దాల్చడంతో తల్లి ఫిర్యాదునాగలాపురం: తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో 15 ఏళ్ల బాలికపై రెండునెలల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తిపై గురువారం పోక్సో కేసు నమోదు చేసినట్లు నిండ్ర సీఐ రవీంద్ర తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ప్రకారం.. పిచ్చాటూరు మండలం, కారూరు దళితవాడకు చెందిన శేఖర్ (55) అనే వ్యక్తి రెండు నెలల క్రితం 15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అనంతరం.. బాలిక గర్భం దాల్చడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. పిచ్చాటూరు పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండుకు తరలించినట్లు పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేశ్వర్ తెలిపారు. -
పిడుగుపాటుకు ఆరుగురు మృతి
సాక్షి, ఆదిలాబాద్: మూడుచోట్ల పిడుగులు పడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా ఆదివాసీలే. గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన రైతు పెందూర్ మాధవరావు తన కుటుంబసభ్యులు, 14 మంది కూలీలతో కలిసి చేనులో గురువారం మొక్కజొన్న విత్తనాలు విత్తుతున్నారు. మధ్యాహ్న భోజన సమయం తర్వాత మళ్లీ అదేపనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో వారంతా సమీపంలోని ఓ పందిరి కిందకు చేరారు. అక్కడే ఓ టేకు చెట్టు ఉంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడింది. దీంతో దానికి దగ్గరలోనే ఉన్న పెందూర్ మాధవరావు(45), ఆయన కూతురు పెందూర్ సుజాత(16), సిడం రంభబాయి(40), మంగం భీమ్బాయి (45) అక్కడికక్కడే మృతిచెందారు. మాధవరావు భార్య, ఇద్దరు కుమారులు, బంధువులు 10 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని పీహెచ్సీలకు, మరికొందరిని మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. బేల మండల పరిధిలోని సాంగిడి గ్రామంలో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగు పడి గెడం నందిని(30), సోన్కాస్ గ్రామంలో పొలం పనులు చేస్తుండగా కోవ సునీత(40) అక్కడికక్కడే మృతిచెందారు. ఉట్నూర్ మండలం కుమ్మరితండాకు చెందిన ధర్మరాజు, కృష్ణబాయి, నిర్మల చేను పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.చేను సమీపంలోని చెట్టుపై పిడుగు పడడంతో ముగ్గురూ గాయపడ్డారు. వీరిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. -
కారులో ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ మృతదేహం.. రంగంలోకి పోలీసులు
భఠిండా: పంజాబ్లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన కారులో ఆమె మృతదేహం పోలీసులకు లభ్యమయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడ కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పార్క్ చేసిన కారు నుండి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు లోపల కౌర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ కారు లూధియానా జిల్లాలో రిజిస్ట్రర్ అయిన కారు అని సమాచారం. కౌర్కు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో 3.83 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే రీల్స్ ఎంతో ఆదరణ పొందాయి. అయితే ఆమె అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తారనే ఆరోపణలున్నాయి.ప్రాథమికంగా దీనిని హత్యకేసుగా పరిగణిస్తున్నామని బఠిండా పోలీస్ సూపరింటెండెంట్ అమ్నీత్ కొండల్ తెలిపారు. సంఘటనా స్థలం నుండి ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. నిందితులు కౌర్ను వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ స్థలంలోని కారులో ఉంచారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: హనీమూన్ కేసు: సోనమ్ను సిట్ అడగబోయే 20 ప్రశ్నలివే.. -
కాళేశ్వరం ఈఈకి 200 కోట్ల ఆస్తులు.. భారీగా బంగారం, డైమండ్స్..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నూనె శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం.. రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.కాగా, ఈఈ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 13 ప్రాంతాల్లో సోదాలు చేయగా.. స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు, కార్లు సీజ్, విల్లాలు, బయటపడ్డాయి.శ్రీధర్ నివాసం, కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలో ప్లాట్, కరీంనగర్లో 3 ఓపెన్ ప్లాట్లు, అమీర్పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 3 ఇండిపెండెంట్ హౌస్లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు తేలింది.రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వలు తనిఖీల్లో బయటపడ్డాయి. శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ నిర్ధారించింది. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
హనీమూన్ కేసు: సోనమ్ తన మంగళ సూత్రాన్ని తీసేసి..
న్యూఢిల్లీ: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రఘువంశీ, సోనమ్లు బస చేసిన హోమ్స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పురోగతికి దోహదపడ్డాయి. సోనమ్ స్టేహోమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన మంగళ సూత్రాన్ని అక్కడే వదిలివెళ్లింది. అలాగే ఒక ఉంగరం కూడా అక్కడ దొరికిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డీఎన్ఆర్ మారక్ మీడియాకు తెలిపారు.అనుమానాలు రేకెత్తించిన మంగళసూత్రంరఘువంశీ, సోనమ్లు బసచేసిన హోమ్స్టే గదిలో లభ్యమైన ఒక సూట్కేసులో సోనమ్ మంగళసూత్రాన్ని, ఒక ఉంగరాన్ని కనుగొన్నామని, ఇది తమకు సందేహాన్ని కలిగించిందని, ఒక మహిళ తన హనీమూన్ సమయంలో మంగళసూత్రాన్ని ఎందుకు వదిలి వెళుతుందనే ప్రశ్న తమలో మెదిలిందని మారక్ అన్నారు. సోనమ్ భర్త రాజా రఘువంశీని ఆమెతో పాటు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లు హత్య చేశారని మారక్ తెలిపారు. మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని తెలిపారు. అతను సోనమ్ ప్రేమికుడని అన్నారు. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు అధికారి తెలిపారు.ఫోటోలు తీసుకునే నెపంతో..మే 23న కాంట్రాక్ట్ కిల్లర్లు నోంగ్రియాట్ గ్రామంలోని మరో హోమ్స్టేలో కాపుగాచారు. అదే సమయంలో సోనమ్ ఫోటోలు తీసుకునే నెపంతో రాజాను హోమ్ స్టే నుండి బయటకు తీసుకెళ్లింది. అక్కడ వారు స్కూటీని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివేశారు. ఆమె ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ, కొంచెం ముందుకు నడిచింది. ఇంతలో కాంట్రాక్ట్ హంతకులు వెనుక నుండి వచ్చి రాజాను అంతమొందించారని పోలీసు అధికారి మారక్ మీడియాకు తెలిపారు. హంతకులు రెండు స్కూటీలను వినియోగించారని కూడా చెప్పారు. ఘటన తరువాత సోనమ్ ఒక నిందితుని స్కూటీపై కూర్చుని వెళ్లిందని, మిగిలిన ఇద్దరు నిందితులు మరో స్కూటీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసు అధికారి పేర్కొన్నారు. మృతదేహాన్ని విసిరేయడంతో సోనియా సహాయంతరువాత వారంతా రాజా మృతదేహాన్ని మౌలాఖియాత్ అనే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ పడేశారని చెప్పారు. రాజా మృతదేహాన్ని లోయలోకి విసిరివేయడంలో సోనమ్ కూడా తమకు సహాయం చేసిందని నిందితులు చెప్పారని పోలీసు అధికారి మారక్ తెలిపారు. హత్య వెనుక గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని అన్నారు. మే 11న ఇండోర్లో రాజా, సోనమ్లకు వివాహం జరిగింది. తరువాత వారు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు.ఇది కూడా చదవండి: మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం.. -
బంజారాహిల్స్లో వ్యభిచార గృహంపై దాడి
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీసులతో కలిసి వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ బృందం వ్యభిచారం గృహంపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఇద్దరు హౌస్ కీపింగ్ సిబ్బంది, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. మరో నలుగురు మహిళలను రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహం నిర్వాహకుడు అనంతపురం జిల్లా కేశవరాయనిపేటకు చెందిన కుమ్మెత నరేందర్రెడ్డి, హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తించే బీహార్లోని ముజఫర్పూర్ ప్రాంతానికి చెందిన ఆనంద్కుమార్, రాహుల్కుమార్లతో పాటు ముగ్గురు కస్టమర్లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నలుగురు మహిళలను రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. వీరి నుంచి రూ.26,500 నగదు, ఏడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం..
గౌహతి: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్ హత్య కేసు మరువకముందే ఇదే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి అదృశ్యం వెనుకనున్న రహస్యాన్ని పోలీసులు ఛేదించారు.త్రిపుర రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచెర్రా మార్కెట్లో ఐస్క్రీమ్ ఫ్రీజర్లో దాచిన ట్రాలీ బ్యాగ్లో ఒక యువకుని మృతదేహం లభ్యమయ్యింది. మేఘాలయలో చోటుచేసుకున్న ‘హనీమూన్ హత్య’ దరిమిలా ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న సరిఫుల్ ఇస్లాం(20) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ యువకుడు, దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్స్టోరీ ఈ హత్యకు దారితీసిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.ప్రాథమిక దర్యాప్తులో తొలుత ఆ మహిళకు, ఆమె బంధువు అయిన దిబాకర్ సాహా మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తేలింది. సరిఫుల్ ఇస్లాం హత్య కేసులో ఆ డాక్టర్, అతని తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. జూన్ 8న సాయంత్రం డాక్టర్ దిబాకర్ సాహా.. సరిఫుల్ను సౌత్ ఇంద్రానగర్ కబర్ఖలా ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అక్కడి జోయ్దీప్ దాస్(20) ఇంటిలో బహుమతి ఇస్తానని చెప్పాడు. అతని మాట మేరకు సరిఫుల్ అక్కడకు రాగానే దిబాకర్, అతని స్నేహితులు అనిమేష్ యాదవ్(21) నబనితా దాస్(25) అతనిపై దాడి చేశారు. అతన్ని గొంతు నరికి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేశారని పోలీసులు తెలిపారు.మర్నాటి ఉదయం దిబాకర్తో పాటు అతని తల్లిదండ్రులు దీపక్, దేబికా సాహాలు గండచెర్రా నుండి అగర్తలాకు మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగ్ను తీసుకెళ్లారు. తరువాత శవాన్ని గండచెర్రా మార్కెట్లోని వారి దుకాణంలోగల ఐస్ క్రీం ఫ్రీజర్లో దాచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించారు. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం సరిఫుల్ ఇస్లాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారందరినీ గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, వారి మొబైల్ మెసేజ్ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’ -
మీ బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగింది
సాక్షి, హైదరాబాద్: బెంగళూరుకు చెందిన వృద్ధ దంపతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ‘డిజిటల్ అరెస్టు’చేసిన సైబర్ నేరగాళ్లు రూ.4.79 కోట్లు స్వాహా చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి సైబర్ ఎకనమిక్ అండ్ నార్కోటిక్స్ (సీఈఎన్) పోలీసులు, ఈ నేరంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం వారిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన మంజునాథ్కు గత మార్చిలో బ్యాంకు ప్రతినిధుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మంజునాథ్ పేరు, ఆధార్ నంబర్తో తెరిచిన బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగినట్లు అవతలి వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు చెప్పాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఈడీ అధికారి అవతారం ఎత్తిన మరో సైబర్ నేరగాడు మంజునాథ్ను ఫోన్ చేశాడు. సదరు మనీలాండరింగ్ వ్యవçహారాన్ని తమతో పాటు సీబీఐ అధికారులూ దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పాడు. ఆ బ్యాంకు ఖాతా, నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంజునాథ్ లబోదిబోమన్నాడు. ఆ కేసులో నిందితు లను ఇప్పటికే అరెస్టు చేశామని.. మీరు అనుమాని తులు కావడంతో మీతో పాటు మీ భార్యను డిజి టల్ అరెస్టు చేస్తున్నామని నేరగాడు చెప్పా డు. నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసం తమ అధికా రిక ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయా ల్సి ఉంటుందని చెప్పాడు. వెరిఫికేషన్ పక్రియ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తా మని నమ్మించారు. ఇలా మంజునాథ్, ఆయన భార్య నుంచి రెండున్నర నెలల్లో రూ.4.97 కోట్లు స్వాహా చేశారు. కొన్ని రోజులు ఎదురు చూసినా తన నగదు తిరిగి రాకపోవడంతో పాటు నేర గాళ్లు వాడిన ఫోన్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి, బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు ఆ నగదులో కొంత హైదరాబాద్కు చెందిన నారాయణ్ సింగ్ చౌదరి, ఈశ్వర్ సింగ్ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వీరు తరచూ శ్రీలంక వెళ్లి కొలంబోలోని క్యాసినోల్లో జల్సాలు చేస్తున్నట్లు తేల్చారు. కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్న వీరు.. తమ పేర్లతో తెరిచిన కరెంట్ ఖాతాలను సూత్రధారులకు ఇచ్చి సహకరిస్తున్నట్లు దర్యాప్తు అ«ధికారులు చెప్తున్నారు. -
రాయచోటిలో దారుణం.. ప్రేమోన్మాది అకృత్యాలకు బాలిక ఆత్మహత్య
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది అకృత్యాలు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను వేధించిన యువకుడు తారకరత్న.. ఇంట్లో చెప్తే మీ నాన్నను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ బాలిక తండ్రికి చెప్పడంతో సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ వేధించాడు. భయాందోళనకు గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.తండ్రి.. ఆ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటుకున్నారు. పదో తరగతిలో 554 మార్కులు సాధించిన బాలిక.. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఇంటర్లో అడ్మిషన్ తీసుకుంది. ఎల్లుండి నుంచి క్లాస్లకు వెళ్లాల్సిన బాలిక ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడింది. తారకరత్న అనే యవకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడని విద్యార్థి తండ్రి చంద్రగిరి ఉత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పక్కా కుట్రతోనే టీడీపీ నేతల దాడులు.. డీజీపీకి సాక్షి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీవ్యాప్తంగా తమ కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులకు తెగపడుతుండడంపై సాక్షి మీడియా సంస్థ పోలీసులను ఆశ్రయించింది. బుధవారం ఉదయం సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి ఫిర్యాదు అందజేసింది. ఏపీలో సాక్షి యూనిట్తోపాటు ప్రాంతీయ కార్యాలయాలపై టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు జరిపిన దాడులు.. ఆస్తులు విధ్వంసం తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సాక్షి ప్రతినిధుల బృందం కోరింది. తద్వారా రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలని తెలిపింది. మహిళలు, బాలికలతో పాటు అన్ని వర్గాల పట్ల సాక్షి మీడియా పూర్తి గౌరవంతో వ్యవహరిస్తోందని, ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను సాక్షి మీడియా సమర్థించదని, పక్కా కుట్రతోనే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీకి స్పష్టం చేసింది. కార్యాలయాలపై దాడికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించాలని ఆయన్ని సాక్షి బృందం కోరింది.ఏపీ పోలీస్ హెడ్క్వార్టర్స వద్ద సాక్షి ప్రతినిధుల బృందం -
‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’
న్యూఢిల్లీ: మేఘాలయలో అదృశ్యమైన కొత్త జంట ఉదంతం లెక్కలేన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ చెబుతున్న విషయాలు పోలీసులను సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి. సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఈ హత్యను ముందుగానే ప్లాన్ చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోనమ్ తన భర్తను ఈశాన్య రాష్ట్రానికి తీసుకువెళ్లి అంతమొందించాలని ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు.కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలంటూ..సోనమ్ ముందుగా కామాఖ్య ఆలయాన్ని సందర్శించేందుకు వెళదామని రాజా రఘువంశీని ఒప్పించిదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. రాజాను తొలుత గౌహతికి, తరువాత మేఘాలయకు తీకువెళ్లాలని సోనమ్ ప్లాన్ చేసింది. వివాహం తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహం జరిగిన నాలుగు రోజుల తర్వాత మే 15న సోనమ్ తన పుట్టింటికి వచ్చింది. అక్కడ తన ప్రియుడు రాజ్కు పోన్ చేసి, ‘ప్రణాళిక’ను సిద్ధం చేసిందని పోలీసులు తెలిపారు. ఇండోర్లో మేఘాలయ పోలీసులు నిందితుడిని ప్రాథమికంగా విచారించినప్పుడు ఈ ఉదంతంలో సోనమ్ ప్రమేయం ఏ మేరకు ఉందనేది వెల్లడయ్యింది.‘అందరినీ ఉరి తీయాలి’నిందితులు విశాల్, ఆనంద్, ఆకాష్లు రాజా రఘువంశీని చంపడంలో విఫలమైతే, తానే ఫోటో తీయాలనే నెపంతో, భర్తను కొండ అంచునకు తీసుకెళ్లి, అక్కడి నుంచి అతనిని తోసేస్తానని సోనమ్ తన ప్రియునితో చెప్పినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమయ్యింది. ఒకవేళ నేరం బయటపడితే సోనమ్, రాజాలు నేపాల్కు పారిపోయేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా రాజా రఘువంశీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుని హత్యలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ ఉరితీయాలన్నారు. వారిలో సోనమ్ కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలోని వారు కూడా ఉన్నారన్నారు. సోనమ్ కుటుంబాన్ని సమాజం నుంచి బహిష్కరించాలని కూడా ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా.. -
భార్యను రివాల్వర్తో కాల్చి చంపిన భర్త..!
కోరుట్ల(కరీంనగర్): రెండ్రోజుల క్రితం ముంబయిలోని వర్లిలో కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో కోరుట్ల మండలం అయిలాపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం దంపతుల అంత్యక్రియలు అయిలాపూర్లో ఒకే చితిపై నిర్వహించారు. కోరుట్ల మండలం అయిలాపూర్కు చెందిన నాంపల్లి రాజమనోహార్(62), లత(51) దంపతులు కొన్నేళ్లుగా కొడుకు– కోడలుతో కలిసి ముంబయిలోని వర్లిలో నివాసముంటున్నారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు నెలకొనడంతో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో రాజమోహన్(62) తన వద్ద ఉన్న కంట్రీమేడ్ రివాల్వర్తో భార్య లతను కాల్చిచంపాడు. అనంతరం రాజమోహన్ తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వర్లి పోలీసులు ఈ సంఘటనదపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా, పోస్టుమార్టం అనంతరం దంపతులు రాజమోహన్–లత మృతదేహాలు మంగళవారం స్వగ్రామం అయిలాపూర్కు తీసుకువచ్చారు. దంపతుల మృతదేహాలను ఒకే చోట చితిపై ఉంచి అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం స్థానికులను కంటతడి పెట్టించింది. -
‘హనీమూన్’ కేసు: సోనమ్ను ‘అక్కా’ అనేవాడు.. షాకిచ్చిన ప్రియుని సోదరి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని మీరట్కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్ల ‘హనీమూన్ కథ’ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంది. జూన్ 2న మేఘాలయలోని ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమయ్యాక ఈ కథలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ తమ కుటుంబ వ్యాపార కార్యాలయంలో పనిచేసే రాజ్ కుశ్వాహాతో ఎప్పటి నుంచో ప్రేమలో ఉందని పోలీసుల విచారణలో తేలింది. రాజారఘువంశీ హత్యకు రాజ్ కుశ్వాహాతో పాటు అతని స్నేహితులు ఆకాష్, ఆనంద్, వికాస్లు సోనమ్కు సహకరించారని, ఇందుకు ప్రతిగా సోనమ్ వారికి రూ. 20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. తాజాగా రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు నిర్దోషి అని, సోనమ్ను ‘దీదీ’ (అక్క) అని సంబోధించేవాడని, ఇంటిలో ఆఫీసుకు సంబంధించిన విషయాలు అంతగా మాట్లాడేవాడు కాదని తెలిపింది. సోనమ్ ప్రతీరోజూ ఉదయం అన్నయ్యకు ఫోన్ చేసేదని, ఆఫీసులో చేయాల్సిన పనుల గురించి చెప్పేదని సుహానీ తెలిపింది. తన అన్నయ్య సోనమ్ ఆఫీసులో రెండేళ్లు పనిచేశాడని చెప్పింది. మే 23న మేఘాలయలో రాజా రఘువంశీ హత్యకు గురైనప్పుడు తన సోదరుడు ఇండోర్లోనే ఉన్నాడని ఆమె పేర్కొంది. మే 11న జరిగిన సోనమ్ వివాహానికి తమ కుటుంబం నుండి ఎవరూ హాజరు కాలేదని సుహాని తెలిపింది. సోనమ్ వివాహ నిశ్చితార్థం తరువాత కూడా తన సోదరునిలో ఎటువంటి మార్పు చూడలేదని, అన్నయ్య ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ హత్యలో సోనమ్ దీదీ ప్రమేయం గురించి తనకు తెలియదని సుహానీ తెలిపింది.ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు -
నాన్నా.. వదిలిపెట్టు, భయమేస్తోంది!
అనుమానం పెనుభూతమైంది. క్షణికావేశంలో ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం.. మొత్తం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య వివాహేతర సంబంధంలో ఉందన్న అనుమానంతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ భర్త.. కొన్ని గంటల్లోనే నలుగురు కొడుకులతో కలిసి పట్టాలపై శవమై కనిపించాడు. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘోర ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫరిదాబాద్కు చెందిన మనోజ్ మాహట్టో(45) భార్య ప్రియతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఆ భర్త తన నలుగురు పిల్లలు పవన్(10), కరు(9), మురళి(5), చోటు (3)లను తీసుకుని బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నాం దాకా సమీపంలోని ఓ పార్క్లో సేదతీరాడు. పిల్లలకు చిప్స్, కూల్డ్రింక్స్ కొనిచ్చి సరదాగా గడిపాడు. ఆపై వాళ్లను తీసుకుని సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. భుజాలపై చెరోవైపు.. చెరోకరిని, మిగతా ఇద్దరిని రెండు వైపులా చేతులు పట్టుకుని పట్టాలపై నడిపిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడో ఆ పిల్లలకు అప్పటిదాకా అర్థం కావడంలేదు. మరికాసేపట్లో భల్లాబ్గఢ్ స్టేషన్కు గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ చేరుకోవాల్సి ఉంది. స్టేషన్ మరో కిలోమీటర్ దూరం ఉందనగా.. పట్టాలపై నలుగురు పిల్లలతో మనోజ్ నిల్చున్నాడు. అయితే పట్టాలపై పిల్లలతో వ్యక్తి నిల్చున్న విషయం గమనించిన లోకో పైలట్ హారన్ కొడుతూ రైలును ఆపే ప్రయత్నం చేశాడు. అయినా మనోజ్లో చలనం లేదు. రైలు దగ్గరగా వస్తుండడంతో భయంతో ఆ పిల్లలు రోదించ సాగారు. తమను వదిలిపెట్టమని పవన్, కరులు గింజుకుంటున్నారు. అయినా ఆ తండ్రి చలించలేదు. వాళ్లను బలంగా అదిమి పట్టుకున్నాడు. చివరకు రైలు వచ్చి ఢీ కొట్టడంతో ఆ ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఆపై కాస్త దూరంలో రైలు ఆగడంతో.. లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆపై పోలీసులు వచ్చి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మనోజ్ జేబులో సూసైడ్ నోట్ లభించగా.. అందులో తన భార్యే కారణమని రాసి ఉంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
భార్యతో విసుగు చెంది భర్త ఆత్మహత్య
బనశంకరి(కర్ణాటక): పదే పదే ఇల్లు వదిలిపెట్టి వెళుతున్న భార్య ప్రవర్తనతో విరక్తి చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో కేపీ అగ్రహార పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గోవర్ధన్, ప్రియా దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రియా అప్పుడప్పుడు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లేది. నెల క్రితం కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. గోవర్ధన్ కుటుంబం మూడో అంతస్తులో ఉంటుంది. గోవర్ధన్ తల్లి కింది అంతస్తులో ఉంటుంది. 8వ తేదీ రాత్రి తల్లి గోవర్దన్ కు భోజనం అందించి వచ్చింది. భోజనం కూడా చేయకుండా గోవర్ధన్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు సాయంత్రం వరకు కొడుకు బయటకు రాలేదని తల్లి వెళ్లిచూడగా ఉరికి వేలాడుతూ ఉన్నాడు. కేపీ.అగ్రహార పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని మీరట్కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్లు హనీమూన్కు వెళ్లి, అదృశ్యమయ్యాక ఈ ఉదంతం పలు మలుపులు తిరుగుతూ, సినిమా కథను తలపిస్తోంది. ఈ ఘటనలో రాజా రఘువంశీ మే 23న హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం జూన్ 2న లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్ ఎక్కడుందో తెలియలేదు. భర్త హత్య దరిమిలా సోనమ్పై కూడా దాడి జరిగివుంటుందని, లేదా కిడ్నాప్ చేసివుంటారనే ఊహాగానాలు తొలుత వినిపించాయి. అయితే ఉత్తరప్రదేశ్లో సోనమ్ జాడ కనుగొన్నాక మేఘాలయ పోలీసులు.. భర్తను హత్య చేసిన సోనమ్ ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నించిందనే వివరాలు సేకరించారు.ప్రియునితో జతకట్టి..సోనమ్, రఘువంశీలకు మే 11న వివాహం జరిగింది. ఆ తర్వాత వారు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లేందుకు మే 21న షిల్లాంగ్ చేరుకున్నారు. ఆ తర్వాత వారు తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని చిరపుంజిలోని సోహ్రాకు వెళ్లారు. అయితే సోనమ్ తమ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారంలో ఉద్యోగి అయిన రాజ్ కుష్వాహాను ప్రేమిస్తోంది. తల్లిదండ్రుల ఒత్తిడితో రాజా రఘువంశీని వివాహం చేసుకుంది. పెళ్లాయ్యాక ప్రియుని సాయంతో భర్తను అడ్డు తప్పించుకోవాలనుకుంది. ఈ నేపధ్యంలో ప్రియుడు రాజ్ కుష్వాహా తన ముగ్గురు స్నేహితులతో రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేశాడు. సోనమ్ వారికి రూ. 20 లక్షలు చెల్లిస్తానని హామీ ఇచ్చిందని పోలీసులు చెబుతున్నారు.కొత్త జంటను అనుసరించిన నిందితులుమే 23న, సోనమ్, రాజా రఘువంశీలు మావ్లాఖియాత్లోని ఒక కొండ పైకి చేరుకుని, జలపాతాన్ని చూడాలనే ఆలోచనతో ట్రెక్కింగ్కు వెళ్లారు. ఇదే సమయంలో నిందితులు వారిని వెంబడించారు. ఈ దంపతులు నిర్జన ప్రదేశానికి చేరుకోగానే, రాజా రఘువంశీని అంతమొందించాలని సోనమ్ ఆ ముగ్గురు నిందితులను కోరిందని, ఆ తరువాత భర్త మృతదేహాన్ని లోయలో విసిరేయాలని వారికి చెప్పిందని పోలీసులు చెబుతున్నారు. భర్త హత్య తర్వాత సోనమ్.. మావ్కాడోక్ నుండి షిల్లాంగ్కు టాక్సీలో వెళ్లింది. అనంతరం ఆమె టూరిస్ట్ టాక్సీలో గౌహతికి చేరుకుందని, అక్కడి నుంచి రైలులో ప్రయాణించిందని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు.హత్య జరిగిన రోజు..ఆమె పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గౌహతి నుంచి రైలులో ఇండోర్కు చేరుకుంది. రాజ్ కుష్వాహా కుష్వాహా స్నేహితులైన ముగ్గురు నిందితులు సోహ్రా నుండి గౌహతికి టాక్సీలో వచ్చారు. ఆ తరువాత వారు రైలులో ఇండోర్కు వచ్చారు. రాజా రఘువంశీ హత్య తరువాత సోనమ్తో పాటు నిందితులు కేసు నుంచి తప్పించుకునేందుకు పలు ప్రణాళికలు వేసుకున్నారని కేసు దర్యాప్తు చేస్తున్నమేఘాలయ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. హత్య జరిగిన రోజు ఆమె రాజ్ కుష్వాహాతో టచ్లో ఉందని, అతను ఆ ముగ్గురు నిందితులతో సంభాషించాడని పోలీసులు నిర్ధారించారని ఎస్పీ వివేక్ సయీమ్ పేర్కొన్నారు. అయితే సోనమ్, రఘువంశీలు ఇంతకు ముందు మేఘాలయకు వెళ్లి, హత్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నారా లేదా అనేది పోలీసులు ఇంకా నిర్థారించలేదు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, ఆ తర్వాత దర్యాప్తు కోసం పోలీసు రిమాండ్కు తీసుకువెళతామని ఎస్పీ తెలిపారు.ఇది కూడా చదవండి: శుభాన్షు అంతరిక్ష ప్రయాణం మళ్లీ వాయిదా -
అనుమానంతో భార్యను అంతం చేశాడు
చైతన్యపురి(హైదరాబాద్): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో తన భార్యను మెడకు చున్నీ బిగించి హతమార్చాడు ఓ వ్యక్తి. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి వివరాలు వెల్లడించారు. భాగ్యనగర్ కాలనీలో అమ్ములు (30), మరియదాస్లు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మరియదాస్ కారు డ్రైవర్గా పనిచేస్తుండగా అమ్ములు ఇండ్లలో సనిచేస్తోంది. బార్యభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి వివాహేతర సంబంధ అనుమానాలు ఉన్నాయి. కొంత కాలంగా ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరుగుతోంది.. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో గొడవ పెట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం మరియదాస్.. అమ్ములు మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. ఇదే విషయాన్ని మరియదాస్ ఎదురు ఇంట్లో ఉండే మామ అర్జునుడుకి సమాచారం ఇచ్చాడు. దీంతో అర్జునుడు వారి ఇంటికి వెళ్లి చూడగా కూతురు విగతజీవిగా ఉండటం గమనించాడు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
పచ్చని జీవితాల్లో మద్యం చిచ్చు
కోరుకొండ: తాగిన మత్తులో కొంతమంది వ్యక్తులు స్నేహితుడినే అంతమొందించారు. ఈనెల 4న జరిగిన ఈ హత్య కేసు మిస్టరీని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ కథనం మేరకు... కోరుకొండ మండలం గాడాల–నిడిగట్ల రోడ్డులోని ఓ వెంచర్ డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. హతుడిని రాజమహేంద్రవరం రూరల్ వెంకట నగరం గ్రామానికి చెందిన కొవ్వాడ చిన్నబ్బులు (31)గా పోలీసులు గుర్తించారు. చిన్నబ్బులుకు రాజమహేంద్రవరానికి చెందిన డీజే సాయి, శెట్టి వీరబాబు, కర్రి శ్రీనివాసరెడ్డి, రేలంగి తరుణ్సాయి, ఆకుల గణేశ్ స్నేహితులు. తరచుగా కలుసుకుని మద్యం తాగుతుంటారు. ఈనెల 4న ఉదయం మద్యం తాగుతున్న సమయంలో వీరబాబు సెల్ఫోన్ చిన్నబ్బులు తీసుకోగా, కింద పడి పగిలిపోయింది. దీంతో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు బెదిరించుకున్నారు. సమస్య పరిష్కరించుకుందామని అదే రోజు రాత్రి చిన్నబ్బులును పిలిచారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఐదుగురూ చిన్నబ్బులు గొంతును పదునైన బ్లేడ్తో కోసి, బండరాయితో మోది హత్య చేశారు. నిందితులను పోలీసులు రాజమహేంద్రవరం సీతంపేటలోని ఓ ఇంట్లో అరెస్టు చేశారు. వారికి ఆశ్రయమిచి్చన గండిమేను సుదర్శన్, నిఖితలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రెండు మోటార్ సైకిళ్లు, సెల్ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు, ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నారు.తండ్రి హతం మద్యం తాగి ఇంట్లో గొడవ.. కొడుకులపై దాడిఎదురు దాడి చేసిన పెద్ద కుమారుడు తోట్లవల్లూరు: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో కొడుకు చేతిలో తండ్రి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని చాగంటిపాడు గ్రామానికి చెందిన నిమ్మకూరి ఆనంద్ (43) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అతనికి భార్య సుపధ, కుమారులు వాసు, భార్గవ్ ఉన్నారు. వాసు కార్ల షోరూమ్లో పనిచేస్తున్నాడు. భార్గవ్ డిగ్రీ చదువుకుంటూ విజయవాడలో ఉంటున్నాడు. తనకు తెలియకుండా భార్య ఇంటిపై రూ.5లక్షలు అప్పు తెచ్చినట్టు ఆనంద్కు తెలిసింది. ఈక్రమంలో సోమవారం మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆనంద్ తల్లి వెంకటేశ్వరమ్మ ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. తండ్రి మద్యం తాగి వచ్చి గొడవచేస్తున్న విషయాన్ని సుపధ కొడుకులు చెప్పింది. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న కొడుకులతో కూడా ఆనంద్ గొడవకు దిగాడు. రాడ్తో పెద్ద కొడుకు వాసుపై దాడి చేయటంతో కింద పడిపోయాడు. వెంటనే వాసు చేతికి దొరికిన చెక్కతో దాడి చేశాడు.కోపంలో రాడ్తో కూడా కొట్టడంతో తలకు బలమైన గాయాలై ఆనంద్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, తోట్లవల్లూరు ఎస్ఐ అవినాశ్ మంగళవారం వివరాలను సేకరించారు. మృతుని తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారకుడైన వాసుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.యువకుడి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): మద్యానికి బానిస కావడంతో, భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని జాకీర్హుస్సేన్ నగర్లో మంగళవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. రబ్బాని (30), మముల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రబ్బాని తన ఇంటి పక్క వీధిలో టిఫిన్ అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన రబ్బాని భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో దంపతుల నడుమ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 8న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో భర్తపై అలిగి మముల తన ఇద్దరు పిల్లలను తీనుకుని శ్రీనివాసగనర్లోని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రబ్బాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితుడు అక్బర్ అలియాస్ ఇక్బాల్ ఫోన్ చేసి మములాకు తెలిపారు. దీంతో ఆమె తన బంధువులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. బాధితురాలు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు.