ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం | Man suffers heart attack while riding two-wheeler; none help despite his wife’s pleas | Sakshi
Sakshi News home page

ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం

Dec 17 2025 9:08 AM | Updated on Dec 17 2025 9:08 AM

Man suffers heart attack while riding two-wheeler; none help despite his wife’s pleas

కర్ణాటక: కళ్ల ముందే ప్రాణం పో­తు­న్నా.. గుండెపో­టుతో రోడ్డుపై విల­విల్లా­డు­తున్నా.. సాయం కో­సం అతని భార్య చేతు­లు జోడించి వేడుకుంటున్నా.. జనం పట్టించుకో­లేదు. సాయం చేయ­డానికి ఎవరూ ముందుకు రాక­పోవ­డంతో చివరకు ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. 

బనశంకరి మూడో స్టేజ్‌ బాలాజీనగర్‌కు చెందిన వెంకటరామన్‌(34) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళనకు గురైన భార్య రూప అతనిని వెంటనే స్కూటీపై సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెపోటు అని నిర్ధారించారు. ప్రథమ చికిత్స చేసి.. జయదేవ హృద్రోగ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ అంబులెన్సు లేకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రూప.. భర్తను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు మళ్లీ స్కూటీపైనే బయలుదేరింది.

 కదిరేనహళ్లి బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి.. వెంకటరామన్‌ స్కూటీపై నుంచి కిందపడిపోయాడు. దీంతో రూప రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అడ్డుపడి సాయం కోసం వేడుకుంది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆ తర్వాత కొద్ది సేపటికి  వెంకటరామన్‌ సోదరి అక్కడకు చేరుకుంది. చివరకు ఇద్దరూ కలిసి క్యాబ్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే వెంకటరామన్‌ మరణించాడు. సమయానికి ఎవరూ మానవత్వం చూపకపోయినా.. రూప పెద్ద మనసుతో తన భర్త కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement