అరుణాచల్ ప్రదేశ్లో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది దుర్మరణం పాలయ్యారు.
అరుణాచల్ ప్రదేశ్ అన్జా జిల్లా చాగ్లాగాం వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. హయులియాంగ్-చాక్లా మధ్య 40 నెంబర్ మైలురాయి వద్ద ట్రక్కు లోయలో పడిపోయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. ప్రత్యేక వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అతికష్టం మీద గాయపడిన నలుగురిని రక్షించి ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా అస్సాంకు చెందిన కూలీలుగా తెలుస్తోంది. టిన్సుకియా నుంచి వాళ్లంతా పనుల కోసం వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు.. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
A truck carrying 22 labourers reportedly fell into a deep gorge between Hayuliang and Chakla, in the remote Chaglagam circle under Anjaw district. A rescue operation is currently underway, and efforts are on to contact authorities to know more about the incident. pic.twitter.com/rPGLnVvVXP
— DD News Arunachal (@DDNewsArunachal) December 11, 2025


