లోయలో పడ్డ బస్సు.. 17 మంది కూలీల దుర్మరణం | Arunachal Pradesh Truck Plunges into gorge Accident Details | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ బస్సు.. 17 మంది కూలీల దుర్మరణం

Dec 11 2025 4:12 PM | Updated on Dec 11 2025 4:16 PM

Arunachal Pradesh Truck Plunges into gorge Accident Details

అరుణాచల్‌ ప్రదేశ్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది దుర్మరణం పాలయ్యారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌ అన్జా జిల్లా చాగ్లాగాం వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. హయులియాంగ్‌-చాక్లా మధ్య 40 నెంబర్‌ మైలురాయి వద్ద ట్రక్కు లోయలో పడిపోయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న ఇండియన్‌ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది.  ప్రత్యేక వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

అతికష్టం మీద గాయపడిన నలుగురిని రక్షించి ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా అస్సాంకు చెందిన కూలీలుగా తెలుస్తోంది. టిన్సుకియా నుంచి వాళ్లంతా పనుల కోసం వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు.. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement