సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సృష్టి తరహా గ్యాంగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ఘటన కలకలం రేపింది. ఈ కేసులో 12 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్లో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ముఠానుంచి ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించారు.
హైదరాబాద్లోని కీలక ప్రాంతాలైన మియాపూర్,కూకట్పల్లి ఆల్విన్ కాలనీ, బిహెచ్ఎల్ జగదిరిగుట్ట ప్రాంతాలలో ఈ ముఠా కాపుకాసు పిల్లలను అపహరిస్తుంది. ఆ తరువాత ఒక్కో శిశువును రూ. 15 లక్షల చొప్పున విక్రయిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ మొత్తం ఎనిమిది ఆసుపత్రులకు ఏజెంట్లుగా పని చేస్తున్నట్టు పోలీసులు గురించారు. అపహరించిన చిన్న పిల్లల్ని రెస్క్యూ హోంకు తరలించారు.


