సాక్షి, హైదరాబాద్: గాజుల రామారంలో భారీ శబ్ధంతో భూ ప్రకంపనలు రావడంతో కలకలం రేగింది. మెట్కాన్ గూడెంలో ఉదయం 10 గంటల సమయంలో భారీ శబ్ధంతో భూమి కంపించిందంటూ స్థానికుల చెబుతున్నారు. క్వారీ బ్లాస్టింగా? భూంకపమా? అనే దానిపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
శబ్ధాలు రావడంతో ఉలిక్కిపడిన గేటెడ్, అపార్ట్మెంట్ వాసులు రోడ్లపైకి వచ్చారు. స్థానికంగా ఉన్న పాఠశాలలకు స్కూల్స్ యాజమాన్యం సెలవు ప్రకటించాయి.


