breaking news
USA President
-
పుతిన్, ట్రంప్తో జిన్పింగ్ మాటామంతి
బీజింగ్: చైనా అధినేత జిన్పింగ్ బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్తో సంభాషించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా, రష్యా సంబంధాలపై పుతిన్తో జిన్పింగ్ విస్తృతంగా చర్చించారు. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక ‘గ్రాండ్ ప్లాన్’ను పుతిన్ ప్రతిపాదించారు. గత ఏడాది నవంబర్ తర్వాత జిన్పింగ్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఇటీవలి కాలంలో చైనా, జపాన్ సంబంధాలు దెబ్బతింటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్తో సంభాషణ చర్చనీయాంశంగా మారింది. పుతిన్తో, ట్రంప్తో జిన్పింగ్ ఒకేరోజు మాట్లాడడం అత్యంత అరుదైన ఘటన. అయితే, ట్రంప్తో ఏం చర్చించారన్నది తెలియరాలేదు. దీనిపై చైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. రష్యా, అమెరికాల మధ్య 2010లో కుదిరిన అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం గడువు గురువారం ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్త ఒప్పందాన్ని ప్రతిపాదించారు. ఇందులో చైనా భాగస్వామిగా మారాలని కోరుతున్నారు. అందుకు చైనా అంగీకరించడం లేదు. -
ఒప్పందం చేసుకోకుంటే మారణహోమమే
వాషింగ్టన్/బాగ్దాద్: బద్ధ శత్రువు ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి దాడుల హెచ్చరికలు చేశారు. అణ్వాయుధాల్లో వినియోగం కోసం కొనసాగిస్తున్న అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తక్షణం నిలిపేయాలని ఇరాన్కు సూచించారు. మాట వినకపోతే మారణహోమం తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ భారీ స్థాయిలో యుద్ధనౌకలు, సైన్యం ఇరాన్ దిశగా కదులుతోంది. అత్యంత శక్తివంత ఆయుధాలతో, ఉత్సకతతో, సదుద్దేశంతో సాయుధులు ఇరాన్ వైపుగా వెళ్తున్నారు. ప్రతిష్టాత్మక యుద్ధ విమాన వాహకనౌక ‘అబ్రహాం లింకన్’ ఈ బలగాలకు సారథ్యం వహిస్తోంది. వెనెజువెలాలో మాదిరే ఆపరేషన్కు సిద్ధమవుతోంది. వెనెజువెలాలో తరహాలో మిషన్ను పూర్తిచేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. అవసరమైతే వేగంగా, హింసాత్మకంగా పని పూర్తిచేస్తారు. ఇరాన్ త్వరగానే చర్చలకు ముందుకొస్తుందని ఆశిస్తున్నా. అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన పనిలేకుండానే సామరస్యంగా చర్చలు జరుపుదాం. సమయం మించిపోతోంది. ఇప్పటికైనా ఇరాన్ మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. లేదంటే ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ సిద్ధంగా ఉంది. ఇరాన్ వినాశనం తప్పదు. మేం చేసే తదుపరి దాడి దారుణంగా ఉంటుంది. అలా జరక్కుండా చూసుకోండి’’ అని ట్రంప్ హెచ్చరించారు. దాడులు చేస్తామని భయాందోళనలు ఓవైపు పెంచుతూ మళ్లీ చర్చలకు కూర్చోవాలంటే కుదరదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే ట్రంప్ పైవిధంగా మరోసారి హెచ్చరికలు చేయడం గమనార్హం. -
చైనాతో ఒప్పందం చేసుకుంటే... 100 శాతం టారిఫ్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాగ్ని తాజాగా కెనడా వైపు మళ్లింది. చైనాతో వాణిజ్య ఒప్పందం విషయంలో మొండిగా ముందుకెళ్తే కెనడాపై ఏకంగా 100 శాతం టారిఫ్లు విధిస్తామని శనివారం ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాటి మధ్య ఒప్పందం కుదిరితే ఆ మరుక్షణమే సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్సోషల్లో ఈ మేరకు పోస్టు పెట్టారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా వస్తువులు, ఉత్పత్తులను అమెరికాలో గుమ్మరించేందుకు ఆయన కెనడాను వేదికగా మార్చజూస్తున్నారని ఆరోపించారు. ‘‘కార్నీ ఉద్దేశం అదే అయితే గనక ఆయన చాలా పొరబడుతున్నారు. అలా జరిగేందుకు నేనెప్పటికీ అనుమతించబోను’’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని కార్యాలయం అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ తన పోస్టులో కార్నీని ‘గవర్నర్’గా సంబోధించడం విశేషం. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా విలీనం కావాలని ఆయన పలుమార్లు సూచించడం తెలిసిందే. ఈ సంబోధన తాలూకు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ట్రంప్, కార్నీ నడుమ కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్వి ఏకపక్ష పోకడలంటూ ఇటీవల కార్నీ దుయ్యబట్టారు. దాంతో చిర్రెత్తుకొచి్చన ట్రంప్, అసలు కెనడా బతుకుతున్నదే అమెరికా దయాదాక్షిణ్యాల మీద అంటూ దావోస్ వేదికగా ఎద్దేవా చేశారు. దీనిపై కార్నీ స్పందిస్తూ, నియంతృత్వ పోకడలకు తల వంచకుండా ప్రపంచానికి కెనడా ఒక ఉదాహరణగా నిలుస్తుందంటూ బదులిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో గాజా పునర్నిర్మాణానికి తలపెట్టిన శాంతిమండలిలో చేరేందుకు కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. చైనా తన విద్యుత్ వాహనాలపై టారిఫ్లను తగ్గించేలా కెనడాతో కొంతకాలంగా బేరసారాలాడుతోంది. ప్రతిగా కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఈ మేరకు ఒప్పందం దిశగా వాటి మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాను ఆర్థికంగా, సామాజికంగా చైనా పూర్తిగా కబళించేస్తుందని ఇటీవలే ఆయన హెచ్చరించారు. అమెరికా ప్రతిపాదిత గోల్డెన్డోమ్ రక్షణ ఛత్రంలోకి వచ్చేందుకు కెనడా నిరాకరించడంపై కూడా ట్రంప్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. -
నాటో పాత్రను చులకన చేస్తారా!
లండన్: అఫ్గానిస్తాన్లో యుద్ధం సమయంలో అమెరికా బలగాలు మాత్రమే ముందుండగా నాటో దేశాల బలగాలు దూరంగా ఉండిపో యాయని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై యూకే ప్రధానమంత్రి స్టార్మర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందాను. ఆ వ్యాఖ్యలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే దేశ ప్రజలకు తీవ్ర వేదన కలిగించాయి’అని స్టార్మర్ పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్లో నాటో బలగాలు సాహసోపేతంగా పోరాడాయని, దేశం కోసం త్యాగాలు చేశాయని స్టార్మర్ కొనియాడారు. నాటో బలగాల గురించి అవమానకరంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని ట్రంప్ను ఆయన కోరారు. అవసరమైనప్పుడు అమెరికాకు మద్దతు ఇవ్వడానికి నాటో సిద్ధంగా ఉంటుందన్న తనకు నమ్మకం లేదని ట్రంప్ దావోస్లో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మాకు నాటో అవసరం ఎప్పుడూ రాలేదు, మేం వారిని నిజానికి ఏమీ అడగలేదు. నాటో దేశాల వారు అఫ్గానిస్తాన్కు, ఇతర ప్రాంతాలకు కొన్ని దళాలను పంపించారు. కానీ, వారు ముందు వరుసలో ఉండటానికి బదులు వెనుకనే ఉండిపోయారు’అని ట్రంప్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. -
మాకు సంబంధం లేదు
మాస్కో: గ్రీన్లాండ్ను తమ స్వాధీనం చేయా లంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న డిమాండ్తో నాటో ఐక్యతకు బీటలు వారుతున్న వేళ ఈ వ్యవహారంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనదైన శైలిలో స్పందించారు. గ్రీన్లాండ్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పారు. బుధవారం రాత్రి మాస్కోలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘గ్రీన్లాండ్ను డెన్మార్క్ ఒక కాలనీ మాదిరిగా పరిగణిస్తోంది. అక్కడి ప్రజల విషయంలో క్రూరంగా కాకున్నా, కఠినంగా వ్యవహరించిందన్నది నిజం. అది వేరే విషయం. గ్రీన్లాండ్పై ఇప్పుడు ఎవరికైనా ఆసక్తి ఉంటుందా అంటే అనుమానమే’అని పేర్కొన్నారు. ‘గ్రీన్లాండ్కు సంబంధించిన పరిణామాలపై మాకెలాంటి ఆందోళన లేదు. ఈ అంశాన్ని వాళ్లే పరిష్కరించుకుంటారని భావిస్తున్నా’అని పుతిన్ తెలిపారు. ‘1917లో డెన్మార్క్ వర్జిన్ దీవులను అమెరికాకు అమ్మేసింది. ఆ మాట కొస్తే రష్యా 1867లో అలా స్కాను అమెరికాకు 72 లక్షల డాలర్లకు విక్రయించింది’అని ఆయన చరిత్రను గుర్తు చేశారు. -
కొలువైన ట్రంప్ శాంతి మండలి
దావోస్/న్యూఢిల్లీ: మాటలతోనే పెనుకుంపట్లు రాజేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతికాముకుడి అవతారమెత్తి ప్రపంచ యవనికపై కొత్త కూటమిని కొలువుతీర్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగరంలో 19 దేశాల అగ్రనేతల సమక్షంలో బోర్డ్ ఆఫ్ పీస్(శాంతి మండలి)ని ట్రంప్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అగ్రనేతల సమక్షంలో సంబంధిత పత్రంపై ట్రంప్ సంతకం చేసి కొత్త కూటమిని ఉనికిలోకి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా తన కనుసన్నల్లో పనిచేసేలా గాజా పునర్నిర్మాణ, అభివృద్ధి మాటున శాంతి మండలిని ఏర్పాటుచేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలను ట్రంప్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ‘‘ శాంతి మండలిలో భాగస్వాములుగా ఉండేందుకు ప్రతి దేశం అమితాసక్తి కనబరుస్తోంది. ఇవేగాక మరెన్నో దేశాలతో కలిసి పనిచేస్తాం. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తా. ఇప్పుడిప్పుడే ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. ఐరోపా, అమెరికా, పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఏడాది క్రితం యుద్ధాలతో ప్రపంచం అగ్నిగోళంగా ఉండేది. ఇది చాలా మందికి తెలీదు. సమకాలీన పరిస్థితుల పర్యవసానంగా ఏర్పడిన ఈ ‘శాంతి మండలి’ అంతర్జాతీయ కూటముల్లో ఒకటిగా గొప్పదిగా ఉండబోతోంది. శాంతి మండలి అనేది ప్రపంచానికి చాలాచాలా ప్రత్యేకమైంది. ఐక్యరాజ్యసమితిలో ఎంతో సత్తా ఉంది. ఒక పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధమేకాదు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ముగింపు కోసం ఐరాసతో కలిసి పనిచేస్తా. ఐరాస, కొత్త శాంతి మండలి కలిసి పనిచేస్తే అది ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ముఖ్యంగా పశ్చిమాసియాకు కొత్త రోజులొస్తాయి. గాజా యుద్ధం దాదాపు చివరి దశకు చేరుకుంది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నా వాటిని మనం ఆపేయబోతున్నాం. వాగ్దానం చేసినట్లు హమాస్ వాళ్లు ఆయుధాలు విడనాడాలి. ఆయుధాలను త్యజించని రోజున అదే వాళ్లకు ఆఖరి రోజు అవుతుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు. కొత్త కూటమితో ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగిసిపోనుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.35 దేశాలతో మొదలు..35 దేశాలతో శాంతి మండలిని ఆరంభిస్తున్నామని ట్రంప్ తెలిపారు. వేదికపై ఆసీనులైన పలువురు అగ్రనేతలను ట్రంప్ పేరుపేరున పొగిడారు. తనతో కలిసి ముందడుగువేస్తున్నందుకు అభినందించారు. ‘‘మేమంతా ఎంతో కీలకమైన పనులు చేయబోతున్నాం. ఇంతటి ఘనకార్యాలు చేయడానికి ఇంతకు మించిన వేదిక మరోటి లేదు. వ్యవస్థాపక చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. గర్వంగానూ ఉంది’’ అని ట్రంప్ అన్నారు. శాంతి మండలి డాక్యుమెంట్పై ట్రంప్ సంతకంచేశాక అక్కడి 19 దేశాల అగ్రనేతలను సంతకాలుచేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం కార్యక్రమంలో పాల్గొని కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముష్కరులను ముద్దుచేస్తూ ఉగ్రవాదాన్ని పెంచి అశాంతిని రాజేసే పాకిస్తాన్.. శాంతికాముక∙బోర్డ్లో చేరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాలు శాంతి మండలిలో చేరేందుకు ఆసక్తి చూపించగా ఐరోపా సమాఖ్యలోని కొన్ని సభ్యదేశాలు నిరాకరించాయి. ఆహ్వానం అందుకున్నా ఇంకొన్ని దేశాలు తమ వైఖరిని బయటపెట్టలేదు. భారత్ సైతం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉండిపోయింది.నేనింకా రియల్ ఎస్టేట్ మనిషినే..గాజా పునర్నిర్మాణలో భాగంగా గాజాను సము ద్రతీర ప్రాంతాలకు, రవాణా, ఇంధన మౌలిక వసతులను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ అన్నారు. ఇదే వేదికపై ఆయన నూతన గాజా ఇలా ఉండబోతోందంటూ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ‘‘ సముద్రతీర ప్రాంతం ఎంత బాగుందో చూడండి. బీచ్లతో అలరారుతున్న గాజా స్ట్రిప్లో ఆకాశహ ర్మ్యామ్యలను నిర్మించబోతున్నాం. తీరప్రాంత పర్యాటకం ఊపందుకోబోతోంది. ఇన్నాళ్లూ ఇదే ప్రాంతంలో కడు పేదరికంలో మగ్గిపోయిన పాలస్తీనియన్లు మేం చేసే అభివృద్ధి తర్వాత అద్భుతజీవనం కొనసాగిస్తారు. భవిష్యత్లో సాక్షాత్కారం కాబోయే ఈ భవంతులను చూస్తుంటే నాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి మేల్కొంటున్నాడు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నేను రియల్ ఎస్టేట్ వ్యక్తినే’’ అని ట్రంప్ అన్నారు.మండలిలో చేరతామన్న దేశాలుఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేసియా, జోర్డాన్, అల్బేనియా, అర్మేని యా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసోవో, మొరాకోసమ్మతి తెలపని దేశాలు..ఫ్రాన్స్, నార్వే, స్లోవేనియా, స్వీడన్, బ్రిటన్తటస్థ వైఖరితో ఉన్న దేశాలురష్యా, భారత్, సింగపూర్, థాయ్లాండ్, ఉక్రెయిన్, ఇటలీ, జర్మనీ, కాంబోడియా, చైనా, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం -
తొంబై ఒకటోసారి..
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అన్నారు. రెండు దేశాలు అణు యుద్ధానికి సిద్ధమయ్యాయని, ఆ యు ద్ధాన్ని ఆపి తాను లక్షలాది మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు. పది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపిన ఘనత తనదని చెప్పుకొ చ్చారు. తన రెండవ పదవీకాలం వార్షికోత్స వం సందర్భంగా ఆయన వైట్హౌస్లో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. తనను కలిసిన పాక్ ప్రధాని ‘మిస్టర్ ట్రంప్.. మీరు కోటి మంది, అంతకంటే ఎక్కువ మంది ప్రాణాలే కాపాడారు’ అని చెప్పారనన్నారు. మిగిలిన దేశాల యుద్ధాల వల్ల నష్టపోయేది లక్షలాది మందేనని, కానీ భారత్, పాకిస్తాన్ లో మాత్రం కోటి, కోటిన్నర, రెండు కోట్లు, అంతకంటే ఎక్కువ జనాభా కూడా అయి ఉండొచ్చన్నారు. ఇది చాలా పెద్ద విషయమ ని చెప్పారు. భారత్, పాక్ల మధ్య యుద్ధం వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతోనే ఆగిందని గతేడాది మే 10న ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అదే విషయాన్ని సుమారు 90 సార్లు పేర్కొన్నారు. అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లినా ఈ వాదనను పదేపదే ముందుకు తెస్తున్నారు. ‘365 రోజుల్లో 365 విజయాలు’ట్రంప్ 2.0 మొదటి ఏడాదిలో సాధించిన విజయాల సమగ్ర సంకలనాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది. ‘365 రోజుల్లో 365 విజయాలు’ పేరుతో విడుదల చేసిన ఆ ప్రకటన ఆధునిక అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడి పదవీకాలంలో సాధించని అద్భుతమైన విజయాలు అధ్యక్షుడు ట్రంప్ సాధించారని పేర్కొంది. వలసలు తగ్గించడం, హత్యల రేటు రికార్డు స్థాయిలో తగ్గటం, దేశంలోకి ట్రిలియన్ల కొద్దీ పెట్టుబడులు, యుద్ధాలు ముగించి శాంతి ఒప్పందాలు, రికార్డు స్థాయిలో ఇంధన ఉత్పత్తి, బ్యూరోక్రసీలో భారీకోతలు అన్నీ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాఏ సాధ్యమ య్యాయని తెలిపింది. అత్యవసరమైన ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ట్రంప్ అమలు చేశారని, ఇది ప్రారంభం మ్రాతమేనని ప్రకటించింది. ట్రంప్ జనవరి 20, 2025న రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సంవత్సరంలో సాధించిన విజయాల్లో ‘భారత్, పాకిస్తాన్ల మధ్య శాంతిని నెలకొల్పడం’ కూడా ఉందని పేర్కొంది. ఇక, ఇజ్రాయెల్ – ఇరాన్, ఈజిప్టు – ఇథియోపియా, అర్మేనియా – అజర్బైజాన్ మధ్య యుద్ధాలను ముగించినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించి ఉండాల్సిందని కూడా ట్రంప్ అన్నారు. తాను సంఘర్షణను ముగించిన ప్రతి దేశంలోని నాయకులు నోబెల్ శాంతి బహుమతికి తననే నామినేట్ చేశారని చెప్పారు. ఆ దేశాల నాయకులు తనకు బహుమతి ఇవ్వాలని కోరుతూ బలమైన సిఫార్సులను కూడా పంపారని ఆయన తెలిపారు. శాంతి బహుమతి గ్రహీతను ఎంపిక చేసే నార్వేజియన్ నోబెల్ కమిటీపైనా ఆయన మండిపడ్డారు. అధికారులు తమకు సంబంధం లేదని చెబుతున్నా, నోబెల్ బహుమతి ఎవరికి ఇవ్వాలనే అంశాన్ని నార్వేనే నిర్ణయిస్తుందని తాను భావిస్తున్నా న్నారు. ఆమెకు దక్కిన నోబెల్ శాంతి–2025 బహుమతిని తనకు అందజేసిన వెనిజువెలా ప్రతిపక్ష నాయ కురాలు మచాడోపై తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. ఎనిమిది యుద్ధాలను ముగించినందుకు నోబెల్ బహుమతికి అర్హత మీకే ఉందని, ఆ బహుమతికి తాను అర్హురాలిని కాదని ఆమె చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. -
ట్రంప్ ఏడాది పాలన... ప్రపంచానికి పీడకల
డొనాల్డ్ ట్రంప్ 2.0 క్రమంగా ప్రపంచానికి మర్చిపోలేని పీడకలగా మారుతోంది. అమెరికా అధ్యక్షునిగా రెండో టర్మ్లో ఆయన తొలి 12 నెలల పాలన అన్ని దేశాలనూ చెప్పలేనంత అనిశ్చితికి, అయోమయానికి, అంతకు మించిన అభద్రతా భావానికి గురి చేసింది. 2025 జనవరి 20న ప్రమాణస్వీకారం చేసింది మొదలు మితిమీరిన దూకుడు, మతిలేని నిర్ణయాలతో ప్రతి దేశాన్నీ ట్రంప్ హడలెత్తిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో అమెరికా గౌరవాన్ని, అగ్ర రాజ్యంగా దానికున్న పరువు ప్రతిష్టలను కూడా మంటగలుపుతున్నారు. నోటికొచ్చిన వ్యాఖ్యలు, చౌకబారు కామెంట్లకు ట్రంప్ మారుపేరుగా మారిపోయారు. ఆచితూచి మాట్లాడటం తన డిక్షనరీలోనే లేదని నిరూపిస్తున్నారు. కనీస దౌత్య మర్యాదలకు కూడా తిలోదకాలిస్తూ దేశాధినేతలనే మీడియా సాక్షిగా అవమానించి అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇక ప్రతి దేశంపైనా ఎడాపెడా భారీ టారిఫ్లు విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్య వాతావరణాన్నే అతలాకుతలం చేసేశారు ట్రంప్. మాట వినని దేశాలను బెదిరించేందుకు టారిఫ్లను అస్త్రంగా ప్రయోగిస్తూ విపరీతమైన చెడ్డపేరు తెచ్చుకున్నారు. తన ఏడాది పాలన ఘనతలపై మంగళవారం మీడియాతో ట్రంప్ ఏకంగా గంటా నలభై నిమిషాల పాటు ప్రసంగించారు. 365 రోజుల్లో రోజుకొకటి చొప్పున ఏకంగా 365 విజయాలు సాధించానంటూ గొప్పలకు పోయారు. అమెరికాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేయడంతో పాటు పలు అద్భుతాలు చేశానని చెప్పుకున్నారు. ఆ క్రమంలో మూడొంతులకు పైగా అర్ధసత్యాలు, అసత్యాలే చెప్పి విస్మయపరిచారు. పొరుగు దేశాలను అమెరికాలో కలిపేసుకోవాలన్న విస్తరణ కాంక్షను, గ్రీన్లాండ్ విషయంలో యూరప్ మిత్ర దేశాలతో కూడా కయ్యానికి కాలు దువ్వడాన్నీ అడ్డంగా సమర్థించుకున్నారు. ఈ పెడ పోకడలపై మీడియా అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ధోరణిలోనే బదులిచ్చి సరిపెట్టారు. గడచిన ఏడాదికాలంలో అటు సొంత ప్రజలను, ఇటు ప్రపంచాన్ని ట్రంప్ హడలెత్తించిన తీరుపై ఫోకస్...టారిఫ్లే టారిఫ్లుటారిఫ్లు. ఈ ఏడాది పొడవునా ట్రంప్కు ఫేవరెట్గా మారిన పదం ఇదేనంటే అతిశయోక్తి కాదు. మిత్రులు, ప్రత్యర్థులు, శత్రువులు అని తేడా లేకుండా ప్రతి దేశంపైనా ఎడాపెడా సుంకాల బాదుడుకు దిగారు ట్రంప్. పిడుగుకూ, బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్టుగా ప్రతిదానికీ టారిఫ్లనే అస్త్రంగా ప్రయోగిస్తూ వచ్చారు. తద్వారా మొత్తంగా ప్రపంచ వాణిజ్య స్థితిగతులనే అతలాకుతలం చేసి వదిలారు. సగటున అమెరికాతో వాణిజ్యం నెరుపుతున్న ప్రతి దేశంపైనా కనీసం 10 శాతం అదనపు టారిఫ్లు విధించారు. భారత్పై అత్యధికంగా 50 శాతం మేరకు బాదారు. ఈ టారిఫ్లు, పన్నులు, ఫీజుల ద్వారా 2025లో అమెరికా ఏకంగా 287 బిలియన్ డాలర్లు ఆర్జించినట్టు ఆ దేశ ట్రెజరీ విభాగం గణాంకాలే చెబుతున్నాయి. తద్వారా సగటు అమెరికన్లకు ఒరిగిన ప్రయోజనం కూడా ఏమీ లేదని యేల్ వర్సిటీ బడ్జెట్ ల్యాబ్ తేల్చింది. ట్రంప్ మతిలేని టారిఫ్ల వల్ల పెరిగిన నిత్యావసరాల ధరల దెబ్బకు గత ఏడాది కాలంలో ఒక్కో అమెరికన్ కుటుంబంపై కనీసం 1,500 డాలర్ల మేరకు అదనపు భారం పడ్డట్టు అంచనా వేసింది! ఏడు దేశాలపై దాడులు!యుద్ధాలకు తెర దించి ప్రపంచ శాంతిని సుస్థిరం చేస్తానని రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెట్టుకున్న ఒట్టును ట్రంప్ సింపుల్గా గట్టుమీద పెట్టేశారు. ఈ ఏడాది కాలంలో కనీసం ఏడు దేశాలపై దాడులకు తెగబడ్డారు! బాధిత దేశాల్లో ఇరాక్తో మొదలుపెట్టి సోమాలియా, ఇరాన్, యెమన్, సిరియా, నైజీరియా, తాజాగా వెనెజువెలా దాకా ఉన్నాయి. ఈ జాబితాలో తర్వాతి పేరు గ్రీన్లాండే అయ్యేలా కన్పిస్తోంది. ఆ దీవిని ఆక్రమించేందుకు యూరప్ దేశాలతో తగాదాలకు కూడా ట్రంప్ వెనకాడటం లేదు! 2024 జనవరి 20 నుంచి ఈ జనవరి దాకా అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి కనీసం 658 వాయు, డ్రోన్ దాడులకు పాల్పడ్డట్టు ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా మానిటర్ పేర్కొంది!6 లక్షల మంది గెంటివేతట్రంప్ ఏడాది పాలనలోనే అమెరికా నుంచి ఏకంగా 6.05 లక్షల మందిని గెంటేశారు! నిర్బంధం, అధికారుల బెదిరింపులు తదితరాలను తట్టుకోలేక ఏకంగా 19 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగానే అమెరికాను వీడి వెళ్లిపోయారు. మొత్తమ్మీద ట్రంప్ యంత్రాంగం అడ్డగోలు నిబంధనల దెబ్బకు గత ఏడాది కాలంలో అమెరికాలో నివసిస్తున్న 16 లక్షల మంది వలసదారుల హోదాను కోల్పోయారు. అంతేగాక ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏకంగా 66,866 మందిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్బంధించింది. అంటే సగటున రోజుకు 821 మంది ఊచలు లెక్కబెట్టారు! వీటికితోడు, ఏకంగా 75 దేశాలవారు అమెరికా ఇమిగ్రేషన్ వీసాలు పొందేందుకు వీల్లేకుండా ట్రంప్ నిషేధం విధించారు.బెదిరింపుల దౌత్యందౌత్య మర్యాదలకు, సాటి దేశాధినేతలకు ఇవ్వాల్సిన కనీస గౌరవాదరాలకు కనీవినీ ఎరగని రీతిలో పాతర వేశారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్హౌస్ ముఖాముఖిలో మీడియా సాక్షిగా దారుణంగా అవమానించి ప్రపంచమంతా ముక్కున వేలేసుకునేలా చేశారు. అంతటితో ఆగలేదు. పలువురు దేశాధినేతలను ఉద్దేశించి మీడియాముఖంగా బెదిరింపులకు దిగడం, వారితో తన ప్రైవేట్ సంభాషణలను బయటపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. తద్వారా తనతో భేటీ అంటేనే వాళ్లు తీవ్ర విముఖత చూపేదాకా తెచ్చుకున్నారు.228 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు2025 జనవరి 20న ప్ర మాణస్వీకారం చేసిన తొలి రోజే ట్రంప్ రికార్డు స్థాయి లో 26 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు (ఈఓ) జారీ చేశా రు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆప ద్ధర్మంగా మాత్రమే ఈవో అస్త్రం వాడాలన్న మర్యాదను అటకెక్కించారు. తొలి టర్ములో నాలుగేళ్లలోనూ కలిపి 220 ఈఓలు ఇస్తే, రెండో టర్ములో తొలి ఏడాది కాలంలోనే ఏకంగా 228 ఈవోలు జారీ చేసి మరో రికార్డు సృష్టించారు! పైగా ఆ ఉత్తర్వులు ఫెడరల్ చట్టాలకు భిన్నంగా ఉండొద్దన్న రాజ్యాంగ నిర్దేశాన్ని కూడా తుంగలో తొక్కారు. దాంతో ట్రంప్ ఈవోలు చాలావరకు కోర్టు కేసులకు దారితీశాయి.పర్యావరణం గాలికిఅగ్రరాజ్యంగా అమెరికాను పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో ముందు నిలపాల్సింది పోయి, ఆ బాధ్యతలను క్రమంగా పూర్తిగా వదిలించుకుంటూ ట్రంప్ చేతులు దులుపుకుంటున్నారు. పారిస్ ఒప్పందంతో పాటు పలు కీలకమైన పర్యావరణ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణ దిశగా తాజా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 30కి పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసి పారేశారు. పైగా సముద్రాల్లో ఏకంగా 25 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆఫ్ షోర్ డ్రిల్లింగ్కు పచ్చజెండా ఊపారు!!ఉద్యోగాలు హుష్కాకి!ప్రపంచ దేశాల మీదే కాదు, తన ను నమ్మి గద్దెనె క్కించిన అమె రికన్లపై కూడా ట్రంప్ ఏమాత్రం కనికరం చూపలేదు. కేవలం 10 నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 3.17 లక్షల ఉద్యోగాలను పీకిపారేశారు! అమెరికాను తిరిగి శక్తిమంతమైన దేశంగా మార్చేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తెచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) వ్యయ నియంత్రణ పేరుతో ఇలా ఎడాపెడా ఉద్యోగాలను తీసేస్తూ పోయింది. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ (డీఈఐ) కార్యాలయాలన్నింటకీ మూత వేసింది. అంతర్జాతీయ అభివృద్ధి విభాగాన్నే నామరూపాల్లేకుండా చేసేసింది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
అదో ఐసు ముక్క!.. గ్రీన్లాండ్పై ట్రంప్ వ్యాఖ్యలు
దావోస్: గ్రీన్లాండ్ను కేవలం ‘ప్రపంచానికి మారుమూలగా ఉన్న ఒక మంచు ముక్క’గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివరి్ణంచారు! అయితే, ‘‘వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమున్న ప్రాంతం గనుకనే ప్రపంచ శాంతిభద్రతల నిమిత్తం దానిపై అమెరికా నియంత్రణ ఉండాలని కోరుతున్నా. అంతే తప్ప అక్కడున్న అరుదైన ఖనిజ నిల్వల కోసం కాదు’’ అని చెప్పారు. గ్రీన్లాండ్ను అమెరికా మాదిరిగా కాపాడే సత్తా మరే దేశానికీ లేదని చెప్పుకొచ్చారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బుధవారం ట్రంప్ గంటకు పైగా మాట్లాడారు. ‘ఇక్కడ సమావేశమైన ఎందరో మిత్రులారా, కొందరు శత్రువులారా!’ అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం విశేషం. ‘గ్రీన్లాండ్పై హక్కులు, యాజమాన్యం, సార్వ¿ౌమాధికారం... అన్నీ అమెరికాకే కావాలి’ అంటూ ఈ సందర్భంగా ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. గ్రీన్లాండ్కు, యూరప్కు, ముఖ్యంగా డెన్మార్క్కు దశాబ్దాలుగా అమెరికా చేసిన మేలుకు బదులుగా తాను అడుగుతున్నది చాలా చిన్నదని చెప్పుకొచ్చారు. ‘‘అందుకు ఆ దేశాలు అవుననవచ్చు, కాదనీ అనవచ్చు. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలచుకున్నా. కాదన్న దేశాలను నేను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటా’’ అంటూ హెచ్చరించారు! అంతేకాదు, గ్రీన్లాండ్ స్వా«దీనం కోసం బలప్రయోగం చేయబోనని కూడా ట్రంప్ ప్రకటించారు. ‘‘నేను సైనిక చర్యకు దిగుతానని చాలామంది అనుకుంటున్నారు. కానీ నాకు ఆ ఆలోచనే లేదు. గ్రీన్లాండ్పై బలప్రయోగానికి దిగను’’ అని స్పష్టం చేశారు. అయితే, ‘‘గ్రీన్లాండ్ ఉన్నది ఉత్తర అమెరికా ఖండంలో. కనుక అది మా భూభాగమే’’ అంటూ వాదించారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్లాండ్ను అమెరికాయే డెన్మార్క్కు అప్పగించింది. అది నిజంగా తెలివితక్కువ పని. ఆ దీవిని కాపాడే సత్తా డెన్మార్క్కు లేదు’’ అన్నారు. ట్రంప్ ప్రసంగం వినేందుకు వచ్చిన పారిశ్రామిక ప్రముఖులు తదితరులతో దావోస్ వేదిక కిటకిటలాడిపోయింది. యూరప్ను ప్రేమిస్తా, కానీ... యూరప్ అంటే తనకెంతో ప్రేమ అని ట్రంప్ చెప్పుకున్నారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆ ఖండాన్ని కాపాడింది అమెరికాయేనని చెప్పారు. కానీ కొంతకాలంగా యూరప్ మాటలు, చేతలు సరైన దిశలో సాగడం లేదని ఆక్షేపించారు. యూరప్ దేశాలపైనా, నాటో కూటమిపైనా ఈ సందర్భంగా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టారిఫ్లు మొదలుకుని పర్యావరణం, వలసల దాకా ప్రతి విషయంలోనూ యూరప్ దేశాలు పొరపాట్లపై పొరపాట్లు చేస్తున్నాయన్నారు. తమ గ్రీన్లాండ్ స్వాధీన యత్నాలకు అవి కలిసిరాకపోవడం ఘోర తప్పిదమని పదేపదే చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈ విషయమై తక్షణం సంప్రదింపుల ప్రక్రియకు యూరప్ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రీన్లాండ్ను అమెరికా స్వా«దీనం చేసుకోవడానికి నాటో కూడా మద్దతివ్వాలని అభిప్రాయపడ్డారు. అమెరికా గత అధ్యక్షులపై, ముఖ్యంగా జో బైడెన్పై ట్రంప్ విమర్శల వర్షం కురిపించారు. ‘‘అమెరికాను బైడెన్ దివాలా స్థాయికి దిగజార్చారు. నేనొచ్చాక ఏడాదిలోనే దేశ ఆర్థిక పరిస్థితిని అద్భుతంగా తీర్చిదిద్దా’’ అని చెప్పుకున్నారు. యూరప్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో ఆర్థికంగా అతలాకుతలం అవుతోందని ఎద్దేవా చేశారు. ‘‘చైనా నుంచి యూరప్ గాలిమరల్ని కొంటోంది. చైనా ఆర్థికంగా బలపడటం, యూరప్లో పక్షులు చనిపోవడం తప్ప వాటివల్ల ఒరిగేదేమిటి? చైనాలో ఎక్కడైనా గాలిమరల్ని వాడుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రపంచమంతటికీ ఆర్థిక ఇంజన్ అమెరికాయే. అమెరికా అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచమంతా అభివృద్ధి సాధిస్తుంది’’ అన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో గ్రీన్లాండ్కు బదులుగా పదేపదే ఐస్లాండ్ అని పేర్కొనడం విశేషం! భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని దావోస్ వేదికపై కూడా ట్రంప్ పాత పాటే పాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటికైనా తెర దించకపోతే ఆ దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీ మూర్ఖులే అవుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు! అయితే, వాళ్లు మూర్ఖులు కాదని తనకు తెలుసంటూ ముక్తాయించారు. ట్రంప్ కాన్వాయ్ దావోస్ వేదిక వద్దకు వస్తుండగా నిరసనకారులు దారి పొడవునా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మాక్రాన్ కళ్లద్దాలపై చెణుకులు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ధరించిన కళ్లద్దాలపై దావోస్ వేదికగా ట్రంప్ చెణుకులు విసిరారు. ‘‘నిన్న దావోస్ వేదికపై మాక్రాన్ అందమైన కళ్లద్దాలు ధరించడం చూశా. పాపం, ఆయనకు ఏమైందసలు?’’ అంటూ ప్రశ్నించడంతో సభికులంతా ఘెల్లున నవ్వారు. తాత్కాలిక కళ్ల సమస్య కారణంగా వాటిని ధరించక తప్పడం లేదని మాక్రాన్ చెప్పడం తెలిసిందే.మావల్లే మీ ఉనికి! కెనడాపై ట్రంప్ ఫైర్ మార్క్, నోరు జాగ్రత్త! ప్రధానికి హెచ్చరికలు దావోస్ వేదికగా అమెరికాపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ గుప్పించిన విమర్శలపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను కూడా అదే వేదిక నుంచి ఆయనకు గట్టిగా చురకలు వేశారు. అమెరికా వల్లే కెనడా బతికి బట్టకడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్క్ (కెనడా ప్రధానిని ఉద్దేశించి)! దశాబ్దాలుగా అమెరికా నుంచి కెనడా ఎన్నో తాయిలాలు అందుకుంటూ వచ్చింది. ఇకపై ఏ వ్యాఖ్యలైనా చేసేముందు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకో’’ అంటూ హెచ్చరించారు. తమ సాయం పట్ల కెనడాకు కృతజ్ఞతే లేదంటూ ఆక్షేపించారు. అమెరికా ఏకపక్ష పోకడలను కార్నీ మంగళవారం దావోస్ సదస్సులో ఏకిపారేయడం తెలిసిందే. -
వాణిజ్య యుద్ధం ఎవ్వరికీ మంచిది కాదు
లండన్: గ్రీన్లాండ్ను సొంతం చేసుకునే క్ర మంలో యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షు డు ట్రంప్ చేస్తున్న తీవ్ర ఒత్తిడులపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా, యూకే ఎప్పటిలా గానే సన్నిహిత మిత్ర దేశాలుగా కొనసాగు తాయన్న ఆయన..వాణిజ్య యుద్ధం వల్ల ఎవ్వరికీ లాభం కలగదన్నారు. సోమవారం ఆయన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రీన్లాండ్ను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్ని స్తున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. మిత్ర దేశాలపై టారిఫ్లను అస్త్రంగా ప్రయో గించడం పూర్తిగా తప్పన్నారు. అదే సమయంలో, యూకే జాతీయ ప్రయోజనాల పరిరక్షణే తన బాధ్యతన్నారు. ‘అందుకే, భాగస్వామ్యం, వాస్తవాలు, పరస్పర గౌరవం ప్రాతిపదికగా ఈ సమస్యపై పరిష్కారం కనుగొనే క్రమంలో ఆదివారం ట్రంప్తోపాటు యూరప్ దేశాల నేతలు, నాటో సెక్రటరీ జనరల్తో ఫోన్లో మాట్లాడా. ఎందుకంటే, బలమైన కూట ములు తమ ఉమ్మడి ప్రయోజనాలను ఆ విధంగానే కాపాడుకుంటాయి’అని వ్యాఖ్యా నించారు. ట్రంప్తో క్రమం తప్పక మాట్లాడు తూనే ఉంటానన్న స్టార్మర్..విభేదాలున్నా లేనట్టుగా నటించడం కాదు, వాటిని ముఖా ముఖి చర్చించి పరిష్కరించుకోవడమే పరిణతి చెందిన కూటముల లక్షణమని చెప్పారు. -
నాకు నోబెల్ ఇవ్వలేదు కాబట్టి.. శాంతి గురించి ఆలోచించను..!
ఓస్లో: గ్రీన్లాండ్ అంశంపై ఉద్రిక్త తలు కొనసాగుతున్న వేళ నార్వే ప్రధానమంత్రి జొనాస్ గహ్ర్ స్టోర్ ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. నోబెల్ శాంతి బహుమ తిని, గ్రీన్లాండ్తో ముడిపెడుతూ అమెరికా అధ్యక్షుడు తనకో సందేశం పంపారని చెప్పారు. ‘నోబెల్ శాంతి బహుమతి నాకు లభించలేదు. కాబట్టి, శాంతి గురించి మాత్రమే మాట్లాడాల్సిన బాధ్యత ఎంతమాత్రం నాకు లేదు’అని అందులో ట్రంప్ పేర్కొన్నట్లు తెలిపారు. ‘ఎనిమి దికి పైగా యుద్ధాలను ఆపినందుకుగాను నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని మీ దేశం నిర్ణయించింది. అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్య త నాకు ఉందని అనుకో వడం లేదు. శాంతికి ఎప్పు డూ ప్రాధాన్యత ఉంటుంది, కానీ, ఇప్పుడు అమెరికాకు ఏది మంచిది, ఏది సరైనది అనే దానిపైనే నేనిప్పుడు ఆలోచిస్తా. గ్రీన్లాండ్పై మాకు పూర్తి, సమగ్ర నియంత్రణ ఉంటే తప్ప ఈ ప్రపంచం సురక్షి తంగా ఉండదు’అని ఆయన అందులో పేర్కొ న్నట్లు జొనాస్ వివరించారు. ట్రంప్ నోబెల్ వాదనపై జొనాస్.. ‘నోబెల్ శాంతి బహుమతి ఎంపిక బాధ్యత నార్వేజి యన్ నోబెల్ కమిటీయే తప్ప నార్వే ప్రభు త్వం కాదు. కమిటీ ఒక స్వతంత్ర విభాగం. అందులోని ఐదుగురు సభ్యులను నార్వే పార్లమెంట్ నియమిస్తుంది’అని వివరించారు. -
మిన్నెపొలిస్లో ‘వలస’ల రగడ
మిన్నెపొలిస్: ట్రంప్ సర్కారు వలసల అణచివేత చర్యలపై అమెరికాలో మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపొలిస్ అట్టుడుకుతోంది. వలసల వ్యతిరేక, అనుకూల వర్గాల నడుమ ఘర్షణలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్ కార్యాలయం తెలిపింది. వలసల అణచివేతపై నిరసనల్లో భాగంగా శనివారం మిన్నియాపోలీస్ డౌన్టౌన్లో నిరసన కారులు పెద్ద సంఖ్యలో చేరారు. వారికి వలసలపై అణచివేతకు అనుకూల ఆందోళనకారులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు స్నో బాల్స్, ఇతర నీటి బెలూన్లను విసురుకున్నారు. ముసుగులు ధరించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇళ్ల నుంచి, కార్ల నుంచి ప్రజలను బయటకు లాగడమే కాక.. దూకుడుగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు విమర్శించారు. తక్కువగా ఉన్న అనుకూల సమూహాన్ని తరిమికొట్టిన నిరసనకారులు, అనుకూల ఆందోళనకారుల్లో ఒకరైన జేక్లాంగ్ను పట్టుకుని దాడిచేశారు. గతేడాది జనవరి 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో జేక్ ఉన్నారు. ఆయన బేస్బాల్ బ్యాట్తో అధికారిపై దాడి చేయడం సహా పలు నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. క్షమాభిక్షతో బయటికి వచి్చన జేక్.. ఫ్లోరిడాలోని యూఎస్ సెనేట్కు పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మిన్నెపొలిస్, సెయింట్ పాల్ జంట నగరాల్లో వలసలపై అణచివేత చర్యల్లో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇటీవల 2వేల మందికి పైగా ఫెడరల్ అధికారులను తరలించింది. ఇమ్మిగ్రేషన్ అమలును వేగవంతం చేసింది. నాటి నుంచి ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయి. ట్విన్ సిటీస్లో జరుగుతున్న ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్లో ఇటీవల ఒక మహిళ మరణించింది. అమెరికా పౌరురాలైన ఆమెను జనవరి 7న జరిగిన ఘర్షణలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్పి చంపారు. దీంతో శనివారం అధికారులు శాంతియుతంగా నిరసనకారులపై ఎలాంటి నిర్బంధం, టియర్గ్యాస్ను కూడా ప్రయోగించలేదు. మిన్నెసోటా స్టేట్ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికే కాదు, శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజల హక్కులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డెమోక్రటిక్ గవర్నర్ టిమ్ వాల్జ్ తెలిపారు. అయితే, దేశంలో ఉండటానికి హక్కు లేని అక్రమ వలసదారుల అరెస్టు, నిర్బంధం బహిష్కరణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్ లాఫ్లిన్ అన్నారు. -
చాబహర్ పోర్టుపై రాజకీయ రగడ
ఇరాన్లోని చాబహర్ ఓడ రేవు భారత్లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఈ ఓడరేవుతో భారత్కు ఎంతో అనుబంధం ఉంది. పోర్ట్ నిర్మాణంలో దాదాపు దశాబ్ద కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ ఒత్తిడిని తట్టుకోలేక చాబహర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా వైట్హౌస్ నిర్దేశించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడింది. భారత్పై పెత్తనం చేయడానికి ట్రంప్ను ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీసింది అయితే, కాంగ్రెస్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార బీజేపీ కొట్టిపారేసింది. చాబహర్ పోర్ట్ విషయంలో వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాబహర్ పోర్ట్ నుంచి భారత్ నిజంగా వెనక్కి తగ్గుతుందా, అదే జరిగితే మనకు నష్టమెంత అనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. గ్వాదర్ పోర్టుకు పోటీగా.. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో గ్వాదర్ ఓడరేవును చైనా నిర్మిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో స్వీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి భారత్ కూడా రంగంలోకి దిగింది. గ్వాదర్ పోర్ట్కు పోటీగా ఇరాన్ తీరంలో చాబహర్ పోర్ట్ నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గత ఏడాది ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాబహర్ పోర్ట్పై సెప్టెంబర్లో అమెరికా సర్కార్ ఆంక్షలు విధించింది. అక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని భారత్కు సూచించింది. అందుకు ఆరు నెలల గడువు విధించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్ దాకా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచి్చంది. పోర్ట్ నిర్మాణం కోసం భారత్ ఇప్పటికే ఇరాన్కు 12 కోట్ల డాలర్లు బదిలీ చేసింది. ఎందుకంత కీలకం? చాబహర్ ఓడ రేవు ఇరాన్లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో.. పాక్లోని గ్వాదర్ పోర్ట్కు 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచ ఇంధన వ్యాపారానికి చెక్పాయింట్ లాంటి హొర్మూజ్ జలసంధికి సమీపంలోనే ఉండడంతో భారత్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో అఫ్గనిస్తాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రేవులతో పనిలేదు. అంతేకాకుండా అంతర్జాతీయ ఉత్తర–దక్షిణ రవాణా కారిడార్(ఐఎన్ఎస్టీసీ)లో చాబహర్ పోర్ట్ ముఖ్యమైనది. ముంబై నుంచి ఈ పోర్ట్ గుండా రష్యా, యూరప్లకు చేరుకోవచ్చు. సరుకు రవాణా సులభతరమవుతుంది. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గిపోతుంది. అరేబియా, పశి్చమ హిందూ మహా సముద్రంలో పాక్–చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకోవచ్చు. పోర్ట్ నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం భారత్, ఇరాన్ మధ్య 2003లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో ఇరుదేశాల నడుమ ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్లో చాబహర్లో భారత కార్యకలాపాలు ప్రారంభించింది. చాబహర్ నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దులోని జహెదాన్ వరకు రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ అంగీకరించింది. దీంతో వ్యాపార విస్తరణ మెరుగుపడే అవకాశం ఉంది. సుంకాలతో భారత్కు నష్టమే చాబహర్ కోసం భారత్ చేస్తున్న మొత్తం వ్యయం 370 మిలియన్ డాలర్లు. ఇందులో 120 మిలియన్ డాలర్లు ప్రత్యక్ష పెట్టుబడి కాగా, 250 మిలియన్ డాలర్లను ఇరాన్కు రుణంగా ఇస్తోంది. 120 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఇరాన్కు అందించింది. చాబహర్పై విధించిన ఆంక్షలు గడువు త్వరలోనే ముగిసిపోనుంది. గడువు పెంపుకోసం భారత ప్రభుత్వం ప్రయతి్న స్తోంది. అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్పై ట్రంప్ ప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆంక్షలను ఎత్తివేసే సూచనలు కనిపించడంలేదు. పోర్ట్ విషయంలో ఇలాగే ముందుకు వెళ్తే ట్రంప్ హెచ్చరించినట్లు భారత్పై మరో 25 శాతం సుంకాలు అమల్లోకి వచి్చనా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే భారత్కు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. 120 మిలియన్ డాలర్ల పెట్టుబడిని వదులుకోవాలా? లేక అమెరికాతో జరిగే 132 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని వదులుకోవాలా? అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలని అంటున్నారు. మొత్తానికి చాబహర్ ఓడరేవు అంశంలో భారత్ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పొ చ్చు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖమేనీని సాగనంపాల్సిందే
వాషింగ్టన్: ఇరాన్లో సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ శకం పరిసమాప్తి కావాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. పొలిటికో వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్ అంశంపై మాట్లాడారు. ‘‘ఇరాన్లో నూతన నాయకత్వం తెరమీదకు రావల్సిన తరుణం ఆసన్నమైంది. ఖమేనీని సాగనంపాల్సిందే’’అని అన్నారు. తమ దేశంలో హింసకు ట్రంపే కారణమని ఖమేనీ పలుమార్లు ఆరోపణలు గుప్పించిన వేళ ఇరాన్లో నాయకత్వ మార్పుపై ట్రంప్ వ్యాఖ్యలుచేయడం ఇదే తొలిసారికావడం విశేషం. ‘‘దేశంలో అత్యున్నత పరిపాలనా హోదాలో కొనసాగుతూ కూడా దేశం సర్వనాశనమవుతుంటే ఆయన(ఖమేనీ) పట్టించుకోలేదు. పైగా పోలీసు చర్యతో ఉద్యమాలను అణచివేస్తూ హింసను ప్రోత్సహించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హింసాత్మక ఘటనలకు కారకుడయ్యారు. నాయకులు నాలా దేశాన్ని సవ్యంగా పరిపాలించడంపై దృష్టి సారించాలి. అధికారంలో కొనసాగేందుకు ఆయనలాగా నేను వేలాది మందిని చంపలేదు. అసమర్థ ఖమేనీకి పరిపాలించే అర్హత లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ట్రంప్ ఓ నేరగాడు
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో సంభవించిన ప్రజల మరణాలు, విధ్వంసాలకు ఆయనే కారణమన్నారు. నిరసనలకు ఆజ్యం పోసింది ట్రంపేనంటూ నిందించారు. ఇటీవల తలెత్తిన అశాంతి వెనుక అమెరికా హస్తం ఉందన్నారు. ఇరాన్ను అస్థిరపర్చడం ద్వారా పైచేయి సాధించాలన్నదే ఆ దేశం లక్ష్యమన్నారు. అయితే, తమ దేశాన్ని బలవంతంగా యుద్ధంలోకి నెట్టలేరని కుండబద్దలు కొట్టారు. విధ్వంసానికి కారణమైన దేశీయ, విదేశీ నేరగాళ్లను శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. ఇరాన్ ఎంతో సంయమనం పాటిస్తోందని, అదే సమయంలో హింసకు కారణమైన వారిపై సహనంచూపే ప్రసక్తే లేదన్నారు. ‘దేశంలో జరుగుతున్న ఆందోళనల విషయంలో ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. విధ్వంసాలకు పాల్పడే వారిని ఇరానియన్లుగా పేర్కొన్నారు. నిరసనలపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేశారు. సైన్యాన్ని మద్దతుగా పంపుతామంటూ ఉసిగొల్పారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ద్వారా అశాంతికి ఆజ్యం పోశారు’అని ఖమేనీ విమర్శించారు. అంతర్గత, బాహ్య శత్రువులపై తీవ్ర స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. అల్లర్లను కఠినంగా అణచివేయడంతోపాటు రెచ్చగొట్టే వారి వెన్ను విరుస్తామన్నారు. అశాంతికి కారణమైన లోపలి, బయటి నేరగాళ్లను వదలబోమని తెలిపారు.రెండు రోజుల్లోనే 12 వేల మందిదేశంలో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆందోళనలను కఠినంగా అణగదొక్కేందుకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్లోని కుద్స్ బలగాలు, అనుబంధ సాయుధ గ్రూపులు రంగంలోకి దిగినట్లు చెబుతు న్నారు. ఈ నెల 8, 9వ తేదీ రాత్రుల్లోనే కనీసం 12 వేల మందిని ఇవి పొట్టన బెట్టుకున్నాయని సమాచారం. అధికారిక సమాచారం, ఆస్పత్రుల్లో డేటా ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు ఇరాన్ ఇంటర్నేనల్ అనే మీడియా సంస్థ పేర్కొంది. అయితే, నిరసనల్లో ఇప్పటి వరకు 3,090మంది చనిపోయినట్లు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మృతుల్లో 2,885మంది నిరసన కారులున్నారంది. ఇలా ఉండగా, శనివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 8 గంటల సమయంలో జాతిని ఉత్తేజపరిచేలా నినాదాలు చేయాలని ప్రజలకు అమెరికాలో ఉన్న రాజ కుటుంబ వారసుడు రెజా పహ్లావీ పిలుపునిచ్చారు. -
బోర్డ్ ఆఫ్ పీస్లో అజయ్ బంగా, రూబియో
న్యూయార్క్/వాషింగ్టన్: గాజా సంక్షోభ నివారణలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో రెండో దశ మొదలైంది. గాజా పునరభివృద్ధి కోసం ట్రంప్ సారథ్యంలో బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటైంది. ఇందులో భారత సంతతికి చెందిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితర ప్రముఖులుగా సభ్యులుగా ఉన్నారు. అధ్యక్ష భవనం వైట్హౌస్ శుక్రవారం ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల పేర్లను విడుదల చేసింది. ‘దౌత్యం, అభివృద్ధి, మౌలిక రంగం, ఆర్థిక వ్యూహం..’ఇలా అన్ని రంగాల్లో అనుభవం గడించిన వారికి ఇందులో చోటు కల్పించినట్లు ప్రకటించింది. వీరిలో మహిళలు, పాలస్తీనియన్లకు చోటుదక్కకపోవడం గమనార్హం. బోర్డ్ ఆఫ్ పీస్లో బంగా, రూబియోలతోపాటు అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపొలో గ్లోబల్ మేనేజ్మెంట్ సీఈవో మార్క్ రొవాన్, యూఎస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ గాబ్రియెల్ ఉన్నారు. సుస్థిర గాజా, దీర్ఘకాల పురోగతికి సంబంధించి వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక బాధ్యతలున్నాయని వైట్ హౌస్ తెలిపింది. అంతేకాదు, అదనపు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులుగా తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్, ఖతార్ దౌత్యవేత్త అలీ అల్–థవాడి, ఈజిప్టుకు చెందిన హస్సన్ రషద్, యూఏఈ మంత్రి రీమ్ అల్ హషిమీ, ఇజ్రాయెల్ వ్యాపారవేత్త యకిర్ గబాయ్, నెదర్లాండ్స్ మాజీ ఉప ప్రధాని సిగ్రిడ్ కాగ్ ఉంటారని వైట్ హౌస్ వివరించింది. గాజా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడిగా బల్గేరియాకు చెందిన ఐరాస పశ్చిమాసియా దూత నికొలాయ్ మ్లాదెనొవ్ను నియమించినట్లు వెల్లడించింది. పునరభివృద్ధి ప్రణాళికను వేగంగా అమలు చేసేందుకు 15 మందితో ఏర్పాటైన నేషనల్ కమిటీ ఫర్ ది అడ్మిని్రస్టేషన్ ఆఫ్ గాజా(ఎన్కాగ్)ను పర్యవేక్షిస్తారు. ఐఎస్ఎఫ్ కూడా.. ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్(ఐఎస్ఎఫ్) కమాండర్గా మేజర్ జనరల్ జాస్పెర్ జెఫ్పర్స్ను నియమించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈయన గాజాలో భద్రత, ఉగ్రవాద రహిత వాతావరణాన్ని నెలకొల్పడంలో కృషి చేస్తారని తెలిపింది. భద్రతా చర్యలకు సారథ్యం వహిస్తూ సమగ్ర డీమిలిటరైజేషన్కు, మానవతా సాయం పంపిణీ, పునర్నిర్మాణ సామగ్రి అందజేత చర్యలను పర్యవేక్షిస్తారంది. గాజా సమగ్ర ప్రణాళిక లక్ష్యాల సాధన కోసం అంతర్జాతీయ సమాజంతోపాటు కీలకమైన అరబ్ దేశాలతో సన్నిహిత భాగస్వామ్యం కొనసాగించేందుకు అమెరికా కట్టుబడి ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. ఎన్కాగ్, బోర్డ్ ఆఫ్ పీస్, ఐఎస్ఎఫ్లకు పూర్తి స్థాయిలో సహకరించాలని సంబంధిత వర్గాలకు అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. కైరోలో ఎన్కాగ్ మొదటి భేటీ గాజా రోజువారీ పాలనా బాధ్యతలను చేపట్టే పాలస్తీనా కమిటీ ఎన్కాగ్, ఈజిప్టు రాజధాని కైరోలో శుక్రవారం మొదటిసారిగా సమావేశమైంది. అనంతరం, గాజాలో పాలస్తీనా అథారిటీ మాజీ అధికారి, ఇంజనీరింగ్ నిపుణుడు అయిన కమిటీ సారథి అలీ షాథ్ మీడియాతో మాట్లాడారు. గాజాలో పరిస్థితులను మెరుగుపర్చేందుకు తక్షణమే రంగంలోకి దిగుతామన్నారు. గాజా తిరిగి కోలుకునేందుకు, పునర్నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు కనీసం మూడేళ్లయినా పడుతుందని చెప్పారు. అత్యవసరాలను సమకూర్చడంతో గూడు కోల్పోయిన పాలస్తీనా వాసులకు ఆశ్రయం కల్పించడానికి మొదటగా తాము ప్రాధాన్యమిస్తామన్నారు. గతేడాది అక్టోబర్ 10వ తేదీన ట్రంప్ ప్రణాళిక అమల్లోకి వచి్చన తర్వాత గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఇజ్రాయెల్ ఉపసంహరించుకోగా, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వేలాది మంది తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం సరిగ్గా అమలయ్యేలా చూడటం, హమాస్ వంటి సాయుధ గ్రూపులను నిరాయుధుల్ని చేయడం అతిపెద్ద సవాలుగా మారాయి. గాజాలో రోజువారీ కార్యకలాపాలను బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షణలో అలీ షాథ్ సారథ్యంలోని కమిటీ చూసుకుంటుంది. -
ట్రంప్కు కీలెరిగి వాత!
టారిఫ్లను బూచిగా చూపి ప్రపంచ దేశాలన్నింటినీ బెదరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత్ కీలెరిగి వాత పెట్టింది! ‘నీవు నేరి్పన విద్యయే...’అన్నట్టుగా అమెరికాపై ప్రతీకార టారిఫ్లు విధించి దెబ్బకు దెబ్బ తీసింది. అది కూడా ట్రంప్లా నానా హడావుడీ చేయకుండా, నిశ్శబ్దంగానే పని కానిచ్చేసింది. మూడున్నర నెలలుగా వాటిని వసూలు చేస్తోంది కూడా! భారత్పై ట్రంప్ గతేడాది టారిఫ్ల మోత మోగించడం తెలిసిందే. రోజుకో రకంగా అన్నట్టుగా మారుస్తూ వచ్చి, చివరికి వాటిని 25 శాతానికి ఖరారు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదంటూ మరో 25 శాతం వడ్డించి 50 శాతానికి చేర్చారు! ఇక్కడే భారత్ సైలెంటుగా పావులు కదిపింది. అమెరికా నుంచి దిగుమతయ్యే తృణధాన్యాలపై 30 శాతం టారిఫ్లు విధించేసింది! గత అక్టోబర్ 30న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచే ఆ టారిఫ్లు అమల్లోకి కూడా వచ్చాయి!! అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పప్పులు, ముఖ్యంగా బఠాణీలకు ఇది వర్తిస్తోంది. ఈ విషయంలో మోదీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టారిఫ్ల విధింపుపై అధికారిక ప్రకటన వంటిదేమీ చేయలేదు. అంతేగాక దానికి పెద్దగా ప్రచారం కూడా కల్పించకుండా జాగ్రత్త పడింది. తీవ్ర నష్టం: సెనేటర్లు నార్త్ డకోటా, మొంటానా రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు కెవిన్ క్రేమర్, స్టీవ్ డెయిన్స్ శుక్రవారం ట్రంప్కు రాసిన లేఖతో అమెరికా తృణధాన్యాలపై భారత్ టారిఫ్ల అంశం వెలుగులోకి వచ్చింది. తమ రాష్ట్రాల్లో విస్తారంగా సాగయ్యే పప్పులు, ముఖ్యంగా తృణధాన్యాలకు ఈ టారిఫ్లు పెద్ద భారంగా మారాయంటూ లేఖలో వారు వాపోయారు. భారతీయులే వాటిని ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తారని గుర్తు చేశారు. అలాంటి తృణధాన్యాలపై 30 శాతం దిగుమతి సుంకం సరికాదంటూ ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తొలగించేలా ప్రధాని మోదీతో సంప్రదింపులు జరపాల్సిందిగా ట్రంప్ను వారు కోరారు. ఈ పరిణామంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘టారిఫ్ల రంకెలు వస్తున్న అమెరికాకు దాని భాషలోనే భారత్ సైలెంటుగా దీటైన సమాధానమిచ్చింది’, ‘మౌనంగానే దెబ్బకు దెబ్బ కొట్టాం’అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పప్పులు, తృణధాన్యాల వినియోగంలో భారత్ వాటాయే 27 శాతంగా ఉంది. ట్రంప్ తొలి టర్ములో కూడా భారత్ ఇలాగే అమెరికాలో సాగయ్యే పప్పులపై సుంకాలు విధించిందని, అప్పుడు కూడా ఈ అంశాన్ని తామే ఆయన దృష్టికి తెచ్చామని సెనేటర్లు గుర్తు చేసుకున్నారు. దాంతో వాటిని తొలగించాలని కోరుతూ 2020 భారత పర్యటన సందర్భంగా మోదీకి ట్రంప్ స్వయంగా లేఖ అందజేసి మరీ సమస్యను పరిష్కరించినట్టు వారు చెప్పారు. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జాబితా నుంచి 2019లో భారత్ను తొలగించడంతో మరుసటేడే అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై భారత్ సుంకాలు వేసింది. చర్చలకు విఘాతమే! అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొద్ది నెలలుగా అటూ ఇటూ ఊగిసలాడుతున్న విషయం తెలిసిందే. నిజానికి అది పూర్తిగా కొలిక్కి వచ్చిందని, కేవలం ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయని కారణంగానే పెండింగ్లో పడిందని అమెరికా ఇటీవలే పేర్కొనడం తెలిసిందే. దాంతో ఇరు దేశాల సంబంధాలు కొద్ది రోజులుగా దిగజారుతూ వస్తున్నాయి. దానికి తోడు పప్పులు, తృణధాన్యాలపై భారత్ టారిఫ్తో పీటముడి మరింత బిగుసుకోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో మరింతగా చొచ్చుకొచ్చేందుకు అమెరికా చిరకాలంగా ప్రయతి్నస్తూ వస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల్లో కూడా ప్రధానంగా ఈ దిశగా నిబంధనల సడలింపుకు పట్టుబడుతోంది. మోదీ సర్కారు మాత్రం అందుకు ససేమిరా అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రీన్లాండ్ సొంతం కావాల్సిందే!
నూక్ (గ్రీన్లాండ్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ నామజపం నానాటికీ శ్రుతి మించుతోంది. ఆ ద్వీపం పూర్తిగా అమెరికా వశం అయి తీరాల్సిందేనని, అది తప్ప ఇంక దేనికీ అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన బుధవారం పునరుద్ఘాటించారు. అంతేకాదు, అందుకు నాటో కూటమి ఇతోధికంగా సాయపడాలని చెప్పుకొచ్చారు. వెనెజువెలాపై సైనిక చర్యతో అధ్యక్షుడు మదురో దంపతులను నిర్బంధించిన అనంతరం ట్రంప్ తన దృష్టినంతా గ్రీన్లాండ్పై కేంద్రీకరించడం తెలిసిందే. ఇది గ్రీన్లాండ్తో పాటు ఆ ద్వీపాన్ని నియంత్రిస్తున్న డెన్మార్క్తో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అవసరమైతే సైనిక చర్య తప్పదని ట్రంప్, అలాగైతే తొలి తూటా పేల్చేది తామేనని డెన్మార్క్ పోటాపోటీ ప్రకట నలతో వాతావరణం బాగా వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఒకవైపు డెన్మార్క్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాషింగ్టన్లో భేటీ అవుతుండగా, అంతకు కేవలం కొద్ది గంటల ముందు ట్రంప్ మళ్లీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. ‘అమెరికా జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే. ఆ ప్రయత్నాలకు నాటో కూటమే సారథ్యం వహించాలి. లేదంటే గ్రీన్లాండ్పై రష్యా, చైనా పట్టు సాధిస్తాయి. అలా జరగనివ్వబోం’ అని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’లో ఆయన వరుస పోస్టులు పెట్టారు. ‘మేం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థలో గ్రీన్లాండ్ అతి కీలకం’ అని పేర్కొన్నారు. అంతేకాదు, గ్రీన్లాండ్ అమెరికా గుప్పెట్లోకి వస్తే నాటో మరింత బలోపేతమైన శక్తిగా మారుతుందని చెప్పుకొచ్చారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రతినిధుల బృందం ఇప్పటికే వైట్హౌస్లో ఒక దఫా అమెరికా బృందంతో చర్చలు జరిపింది. వాన్స్తో భేటీ అనంతరం సెనేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో వారు మరోసారి సమావేశం కానున్నారు. మరోవైపు, గ్రీన్లాండ్ స్వాధీన ప్రయత్నాలకు రక్షణ, లేదా ఇతర శాఖల నుంచి నిధులు వెచ్చించేందుకు వీల్లేదంటూ ఇద్దరు సెనేటర్లు తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు. వీరిలో ఒకరు అధికార రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడం విశేషం. శుక్ర, శనివారాల్లో వారి బృందం డెన్మార్క్లో పర్యటించనుంది. డెన్మార్క్ ప్రధాని తదితరులతో భేటీ కావాలని వారు నిశ్చయించారు. తమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై గ్రీన్లాండ్వాసులు మండిపడుతున్నారు. తాము అమ్మకానికి సిద్ధంగా లేమంటూ నినదిస్తున్నారు. ‘‘మేం డెన్మార్క్ను ఎంచుకున్నాం. ఆ దేశంలో భాగంగా, యూరోపియన్ యూనియన్ భాగస్వామిగా మాత్రమే కొనసాగుతాం. అంతే తప్ప అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరడం కల్ల’’ అని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో వారు కుండబద్దలు కొడుతున్నారు. చైనా, రష్యాలతో తమ ద్వీపానికి ముప్పుందన్న ట్రంప్ వాదనను గ్రీన్లాండ్వాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన నోట వస్తున్నవన్నీ కాల్పనిక గాథలని వారు చెప్పు కొచ్చారు. ‘‘ట్రంప్కు కావాల్సింది కేవలం మా ద్వీపంలోని అపార సహజ వనరులే. వాటికోసమే ఇలా ఇతర దేశాలను బూచిగా చూపుతూ ప్రయాస పడుతు న్నారు’’ అని మండిపడ్డారు. మరోవైపు, ఫిబ్రవరి 6న గ్రీన్లాండ్లో దౌత్య కార్యాలయం తెరుస్తున్నట్టు నాటో సభ్య దేశమైన ఫ్రాన్స్ కీలక ప్రకటన చేసింది. గ్రీన్లాండ్పై దాడి తప్పదన్న బ్లాక్మెయిలింగ్కు అమెరికా స్వస్తి పలకాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారొట్ హితవు పలికారు.డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతల యునైటెడ్ ఫ్రంట్!ట్రంప్కు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్ సంఘటితమవుతున్నాయి. ఈ దిశగా సమైక్య పోరు కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయానికి వచ్చారు. ‘‘గ్రీన్లాండ్ పూర్తిగా డెన్మార్క్కు చెందిన భాగమే. కనుక దానికి నాటో సైనిక రక్షణ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని ఇరు దేశాల ప్రధానులు మెట్టె ఫ్రెడరిక్సన్, జీన్స్ నీల్సన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘ప్రియ మైన గ్రీన్లాండ్వాసు లారా.. ఈ రోజు మనమంతా సంయుక్తంగా ఒక్కతాటిపై నిలబడి ఉన్నాం. మున్ముందూ అలాగే ఉండబోతున్నాం’’అని ఫ్రెడరిక్సన్ కోపెన్ హాగెన్లో మీడియా భేటీలో ప్రకటించారు. ‘‘అమెరికా, డెన్మార్క్లలో ఏదో ఒకదా న్నే ఎంచుకోవాల్సి వస్తే మా చాయిస్ ఎప్పటికీ డెన్మార్కే. నాటోనే. యూరోపియన్ యూని యనే’’ అని నీల్సన్ కుండబద్దలు కొట్టారు. -
భారతే ముఖ్యం
న్యూఢిల్లీ: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగంలోని పలువురు సలహాదారుల నోటి దురుసు కారణంగా భారత్తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై అమెరికా గట్టిగా దృష్టి సారించింది. భారత్లో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ ఈ దిశగా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కోణంలో చూసినా అమెరికాకు భారత్ అంతటి ముఖ్యమైన దేశం మరొకటి లేదని స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బంది, మీడియాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయన్నది నిజం కాదని గోర్ స్పష్టం చేశారు. ఈ దిశగా ఇరు దేశాల ప్రతినిధుల నడుమ మంగళవారమే తర్వాతి దశ చర్చలు జరగనున్నట్టు వెల్లడించారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధకు సంబంధించి అమెరికా సారథ్యంలో రూపొందుతున్న వ్యూహాత్మక కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అభిలషించారు. ఈ మేరకు ట్రంప్ తరఫున భారత్ను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ‘‘భారత్ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దేశం. భారత్, అమెరికా నడుమ ఉన్నది కేవలం సారూప్య ప్రయోజనాలు మాత్రమే కాదు. విడదీయలేని దృఢమైన బంధం కూడా’’ అని అన్నారు. ‘‘భారత్ ఓ అద్భుత దేశం. దౌత్యాన్ని ప్రపంచానికే ఆదర్శప్రాయ రీతిలో పునర్ నిర్వచించే సువర్ణావకాశం ప్రస్తుతం ఇరుదేశాల ముందుంది. భారత్, అమెరికా మైత్రి ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత ప్రభావశీల భాగస్వామ్యంగా రూపుదిద్దుకోగలదు’’ అని 38 ఏళ్ల గోర్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ కంటే ఆవశ్యకమైన భాగస్వామి అమెరికాకు ఇంకెవరూ లేరు. రాయబారిగా భారత్తో బంధం విషయంలో వచ్చే కొన్నేళ్లకు సంబంధించి ఓ భారీ ఎజెండాయే నా ముందుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం, శక్తి సామర్థ్యాలతో పాటు పరస్పర గౌరవాదరాలు, నాయకత్వ పటిమే పునాదులుగా అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య నిజమైన, దృఢమైన స్నేహముందని గోర్ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత రెండు దశాబ్దాల్లోకెల్లా అత్యల్ప స్థాయికి చేరేందుకు కారణమైన విభేదాల పరిష్కారానికి వారి స్నేహబంధం కచ్చితంగా తోడ్పడుతుందని అభిప్రాయç ³డ్డారు. ‘‘నిజమైన మిత్రులు పరస్పరం విభేదించవచ్చేమో. కానీ అంతిమంగా తమ భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటారు’’ అని అమెరికా–భారత్ నడుమ బంధానికి బీటలు పడ్డట్టు గోర్ పరోక్షంగా అంగీకరించారు. ‘‘ఇరు దేశాల బంధం విషయంలో వాణిజ్యం చాలా ముఖ్యమైన అంశమే. దానితో పాటు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఇంధనం, టెక్నాలజీ, విద్య, వైద్యం వంటి పలు కీలక రంగాల అంశాల్లో ఇరు దేశాలూ అత్యంత సన్నిహితంగా కలిసి పని చేయనున్నాయి’’ అని గోర్ వివరించారు.బంధానికి బీటలు..ఇటీవలి కాలంలో భారత్, అమెరికా బంధం ఒడిదుడుకుల్లో పడటం తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనడంపై తాను సంతోషంగా లేనని ట్రంప్ అనడం, టారిఫ్లను భారీగా పెంచుతానని హెచ్చరించడం, అందుకు తగ్గట్టే భారత్, చైనాలపై ఏకంగా 500 శాతం టారిఫ్ల విధింపుకు అమెరికా బిల్లు సిద్ధం చేస్తుండటం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. దాంతో ఇరు దేశాల సంబంధాలు కొంతకాలంగా నేలచూపులు చూస్తూ వస్తున్నాయి. పైగా మోదీ స్వయంగా ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడని కారణంగానే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిందని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ బాహాటంగా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. వీటికి తోడు భారతీ యులను ప్రధా నంగా లక్ష్యంగా చేసుకుని హెచ్– 1బీ వీసాలపై అమెరికా నానాటికీ ఆంక్షల చట్రాన్ని బిగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సన్నిహిత బృందంలో కీలక సభ్యుడైన గోర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ తో సంబంధాలను తిరిగి మెరుగు పరు చుకునే ప్రయత్నాల్లో అవి భాగమేనని భావిస్తున్నారు. గోర్ ప్రస్తావించిన పిక్స్ సిలికా కూటమిలో జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, ఇజ్రాయెల్ ఇప్పటికే చేరాయి.మోదీకి ట్రంప్ శుభాకాంక్షలు‘‘భారత్ బయల్దేరే ముందే ట్రంప్తో మాట్లాడా. ఈ అద్భుత దేశం పౌరులకు, ముఖ్యంగా ప్రియ మిత్రుడు మోదీకి శుభాకాంక్షలు అందించాల్సిందిగా ఆయన నాకు చెప్పారు’’ అని గోర్ తెలిపారు. ‘‘రెండు వారాల క్రితం ట్రంప్తో మాట్లాడా. ఆయన భారత్ సందర్శన తాలూకు అద్భుత అనుభవాలను నాతో పంచుకున్నారు. ఒకట్రెండేళ్లలో మరోసారి భారత్లో పర్యటించాలని కూడా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు’’ అని వివరించారు. ‘‘రాయబారిగా మొట్టమొదటే భారత్ వంటి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద, అతిపురాతన దేశంలో పని చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన రెండు అతి గొప్ప దేశాల బాగస్వామ్యాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం’’ అని గోర్ ప్రకటించారు. -
చర్చలకు దిగొచ్చిన ఇరాన్
దుబాయ్: దాడులు తప్పవన్న తన హెచ్చరికలకు ఇరాన్ దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సామరస్యంగా చర్చించుకుందామని ప్రతిపాదించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం రాత్రి ఎయిర్ఫోర్స్వన్ విమానంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఇరాన్ అభ్యర్థన మేరకు ఆ దేశ నాయకత్వంతో చర్చల కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించారు. అయితే నిరసనకారుల మరణాల సంఖ్య ఇలాగే పెరిగితే మాత్రం తాను చర్చలకు బదులు ‘చర్యలు’ తీసుకోవాల్సి రావచ్చని ట్రంప్ హెచ్చరించారు. ‘‘మా సైన్యం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. గట్టి ఆప్షన్లనే పరిశీలిస్తున్నాం’’ అని వెల్లడించారు. అమెరికా దాడికి దిగితే దీటుగా తిప్పికొడతామన్న ఇరాన్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా, ‘వారు అదే చేస్తే కనీవినీ ఎరగని రీతిలో వారిపై విరుచుకుపడతాం’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ చర్చల ప్రకటనపై ఇరాన్ ధ్రువీకరించలేదు. అయితే అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధకార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాచీ చెప్పారు. అయితే అవి ఏకపక్షంగా ఉంటే అంగీకరించబోమన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ మాత్రం నిరసనల్లో చోటుచేసుకుంటున్న హింసాకాండ, రక్తపాతాల ఏకైక ఉద్దేశం తమపై దాడికి అమెరికాకు అవసరమైన సాకు కల్పించడమేనని దుయ్యబట్టడం విశేషం. మరోవైపు మూడో వారానికి చేరిన ఇరాన్ ఆందోళనల్లో మృతుల సంఖ్య599కు చేరుకున్నట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తాజాగా వెల్లడించింది. వీరిలో 525 మంది దాకా నిరసనకారులు కాగా మిగతా మృతులు పోలీసు, భద్రతా సిబ్బంది అని పేర్కొంది. క్షతగాత్రుల సంఖ్య 11 వేలు దాటినట్టు తెలిపింది.ప్రదర్శనల్లో అధ్యక్షుడు..నిరసనలు నింగినంటుతున్న వేళ ఇరాన్లో మరో పరిణామం చోటుచేసుకుంది. వాటికి ప్రతిగా ప్రభుత్వ అనుకూలంగా ఉన్న వేలాది మందితో ఇరాన్ సర్కారు రాజధాని టెహ్రాన్లో భారీ ప్రదర్శనలకు దిగింది. అధ్యక్షుడు పెజెష్కియాన్తో పాటు విదేశాంగ మంత్రి తదితరులు వీటిలో పాల్గొనడం విశేషం. అమెరికా, ఇజ్రాయెల్ ప్రాయోజిత ఉగ్రవాదంపై ప్రజాగ్రహంగా ఇరాన్ వీటిని అభివర్ణించింది. కెర్మన్, రష్త్ తదితర పట్టణాల్లోనూ ఈ ప్రదర్శనలు కొనసాగాయి. మరోవైపు, ఇరాన్లో సుస్థిరత నెలకొనాలని చైనా ఆకాంక్షించింది. ఈ విషయంలో బయటి శక్తుల ప్రమేయానికి తావుండరాదని స్పష్టం చేసింది. సొంత ప్రజల మీదే ఇరాన్ యంత్రాంగం ఇంత దారుణంగా దమనకాండకు దిగడం దారుణమని జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ విమర్శించారు. నిరసనకారుల ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు.స్టార్ లింక్ సేవలు కట్మిన్నంటుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కట్టడి చేసే యత్నాల్లో భాగంగా ఇరాన్లో స్టార్ లింక్ ఉపగ్రహ సేవలను ఖమేనీ యంత్రాంగం నిలిపేసింది. ఇందుకోసం మిలిటరీ గ్రేడ్ ‘కిల్ స్విచ్’ను యాక్టివేట్ చేసినట్టు సమాచారం. ఈ అత్యాధునిక జామింగ్ పరిజ్ఞానాన్ని ఇరాన్కు రష్యా లేదా చైనా అందించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇరాన్వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను కొద్దిరోజుల క్రితమే నిలిపేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ నెట్వర్క్ ద్వారానే అక్కడి సమాచారం అంతో ఇంతో బయటి ప్రపంచానికి తెలుస్తూ వస్తోంది. తాజాగా ఆ లింకును ఇరాన్ తెంచేసింది. ఏమిటీ కిల్ స్విచ్?స్టార్లింక్ ఉపగ్రహాలను జామ్ చేసేందుకు ఇరాన్ యంత్రాంగం వాడిన కిల్ స్విచ్ ఇప్పుడు ట్రెండింగ్లో నిలిచింది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిలిటరీ గ్రేడ్జామింగ్ ఎక్విప్మెంట్. దీని ఖరీదు 15.6 లక్షల డాలర్లని సమాచారం. స్టార్లింక్ రిసీవర్లు తమ యూజర్లను లొకేట్ చేసి వారితో కనెక్టయ్యేందుకు జీపీఎస్ను వాడతాయి. మిలిటరీ గ్రేడ్ జామర్లు ఆ లింకును తెంపేస్తాయి. అందుకోసం సదరు ఉపగ్రహం తాలూకు ఫ్రీక్వెన్సీలోనే అత్యంత శక్తిమంతమైన రేడియో సిగ్నళ్లను విడుదల చేస్తాయి. మొత్తం వ్యవస్థను కలిపి కిల్ స్విచ్గా పేర్కొంటారు. 2014 నుంచీ రష్యా ఈ టెక్నాలజీని వాడుతోంది. -
ఆలస్యం కాకముందే మేల్కోండి
వాషింగ్టన్: వెనెజువెలా నుంచి చమురు కానీ, నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు తేల్చిచెప్పారు. వెనెజువెలా చమురుకు అతిపెద్ద వినియోగదారు క్యూబా. వెనెజువెలాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని ట్రంప్ సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. డెల్సీ రోడ్రిగ్స్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువుదీరింది. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది. ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆలస్యం కాకముందే మేల్కోవాలని, ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం గనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికపై క్యూబా స్పందన ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు క్యూబా ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వెనెజువెలా నుంచి చమురు, నిధులు రాకపోతే పూర్తిగా కుప్పకూలడం తథ్యం. ఈ నేపథ్యంలో అమెరికాతో డీల్కు సిద్ధపడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే.. ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రూబియో తల్లిదండ్రులు 1950వ దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచి్చన వారు కావడం గమనార్హం. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందరు అంటుంటే, క్యూబా పట్ల ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేíÙస్తున్నారు. -
దాడి చేస్తే అంతు చూస్తాం
టెహ్రాన్/దుబాయ్: నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. ప్రజల ఆక్రోశం తీవ్ర ఆవేశంగా రూపుదాలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏ నగరం చూసినా ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. మొత్తం 36 ప్రావిన్సుల్లోనూ జనాందోళన పెద్దపెట్టున కొనసాగుతోంది. 100కు పైగా నగరాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్లో ఆదివారం నిరసనకారులు వీధుల్లోకి పోటెత్తారు. ఖమేనీ నియంతృత్వ పాలన తమకొద్దంటూ నిరసనలతో హోరెత్తించారు. వాటిని ఇరాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండటం, దీన్ని చూస్తూ ఊరుకోబోమని, నేరుగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించడం తెలిసిందే. దాంతో ఆ రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. పరిస్థితి ఏ క్షణమైనా అదుపు తప్పేలా కనిపిస్తోంది. అయితే ఇంటర్నెట్ పడకేయడం, ఫోన్ లైన్లు కూడా మూగబోవడంతో అక్కడ తాజా పరిస్థితి అంచనాలకు అందడం లేదు. వాస్తవ మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాక వేలాది మందిని సైన్యం, పోలీసు బలగాలు నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టు వార్తలందుతున్నాయి. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఆందళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ తాజాగా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ ఆదివారం పేర్కొన్నారు. నిండు పార్లమెంటులోనే ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. నిరసనల వెల్లువ! ఇరాన్లో జనాగ్రహం, నిరసనల వెల్లువ కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్తో పాటు రెండో అతి పెద్ద నగరం మషాద్లోనూ ప్రజలు వీధుల్లోకి పోటెత్తుతున్నారు. రాత్రుళ్లు సెల్ఫోన్ లైట్లు వెలిగించి మరీ నిరసన తెలుపుతున్నారు. నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫుటేజీ ఆన్లైన్లో వైరల్గా మారింది. వీధుల నిండా పోలీసు, సైనిక సిబ్బంది పహారా, డ్రోన్ల నిఘా పెరిగినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. మషాద్లో పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలతో జనం ఘర్షణలకు దిగుతున్నారు. వీధుల నిండా తగలబడ్డ సామాన్లు తదితరాలు కనిపిస్తున్నాయి. కెర్మన్ తదితర నగరాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ప్రవాసంలో ఉన్న ఇరాన్ రాకుమారుడు రెజా పహ్లావీ ఒక వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ టీవీలో మాత్రం ఖోమ్, ఖాజ్విన్ తదితర నగరాల్లో జరుగుతున్న ప్రభుత్వ అనుకూల నిరసనల దృశ్యాలను చూపిస్తున్నారు. నిరసనలపై ఉక్కుపాదమే ఇరాన్ పార్లమెంటు కార్యకలాపాలను ప్రభుత్వ టీవీ చానల్ ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిరసనలను అదుపు చేయడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారంటూ పోలీసులు, రివల్యూషనరీ గార్డ్ సిబ్బందిని స్పీకర్ ఖలిబాఫ్ ప్రస్తుతించారు. నిరసనల్లో అరెస్టయిన వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా గనక ఇరాన్పై దాడికి దిగితే ఈ ప్రాంతంలోని ఆ దేశ సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు తదితరాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 538 మందికి పైగా బలి !రెండు వారాలకు పైగా ఇరాన్లో సాగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 538కు పెరిగినట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ ‘యాక్టివిటీ’పేర్కొంది. దేశవ్యాప్తంగా 10,670 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శవాలతో నిండిన పికప్ ట్రక్కు విజువల్స్ టీవీల్లో ప్రసారమయ్యాయి. ఇరాన్లో పలు నగరాల్లో ఆస్పత్రుల్లో శవాలు గుట్టలుగా పేరుకుంటున్నట్టు మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఉత్తర ఇరాన్లో రస్త్ పట్టణంలోని పౌర్సిన ఆస్పత్రికి ఒక్క శుక్రవారం రాత్రే ఏకంగా 70కి పైగా శవాలు వచి్చనట్టు సమాచారం. టెహ్రాన్లో ఒక ఆస్పత్రికి తాజాగా 38 శవాలు వచి్చనట్టు అక్కడి మెడిక్ చెప్పారు. ‘చాలావరకు నేరుగా తలలో ఛాతీలో కాల్చి చంపారు. అంతేకాదు, చాలామంది యువకులు తూటా గాయాలతో వచి ఆస్పత్రిలో చేరుతున్నారు‘ అని ఆయన వివరించారు. అయితే ఇస్ఫహాన్ ప్రావిన్స్లో 30 మందిని, కెర్మన్షాలో ఆరుగురు పోలీసులను నిరసనకారులు చంపారని ప్రభుత్వం పేర్కొంది. మషాద్లో మసీదుకు నిప్పు పెట్టారని ప్రభుత్వం పేర్కొంది. నిరసనకారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అన్నారు. ‘‘ఐసిస్ తరహాలో పోలీసు, భద్రతా సిబ్బందిని హతమారుస్తున్నారు. సజీవంగా తగలబెడుతున్నారు’’ అని మండిపడుతున్నారు. బలహీనంగా ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇరాన్ ఇప్పటికిప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగే స్థితిలో ఉందా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత జూన్లో ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఆ దేశ వైమానిక సంపత్తి చాలావరకు ధ్వంసం కావడం తెలిసిందే. అంతేగాక ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్ అణు స్థావరాలను భారీ బాంబులతో ధ్వంసం చేసేసింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్పై దాడులకు దిగే దుస్సాహసం ఇరాన్ సుప్రీం లీడర్ 87 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ చేస్తారా అన్నది చూడాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలను ఇజ్రాయెల్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పలు అంశాలపై ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు.యూఎస్, ఇజ్రాయెలే ఎగదోస్తున్నాయి: పెజెష్కియాన్ ఇరాన్ను అస్థిర పరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర చేస్తున్నాయని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంలో అవి పనిగట్టుకొని నిరసనలను ఎగదోస్తున్నాయని దుయ్యబట్టారు. అయితే నిరసనకారుల ఆవేదనను సహానుభూతితో ఆలకిస్తామని ప్రకటించారు. ‘‘ప్రజలకు చాలా విషయంలో అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు వారితో చర్చించడం అవసరం’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే అల్లర్ల పట్ల అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. విధ్వంసకారులు మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేసేందుకు ప్రయతి్నస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రభుత్వ టీవీ ఆదివారం ప్రసారం చేసింది. అయితే ఇరాన్పై సైనిక దాడి విషయంలో ఉన్నతాధికారులు తాజాగా ట్రంప్కు పలు ఆప్షన్లు సూచించారని తెలుస్తోంది. వాటిపై ఆయన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైట్హౌస్ వర్గాలు చెబుతుండటం విశేషం. -
గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాల్సిందే
వాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, చమురు, సహజ వాయువు నిల్వలతో కూడిన గ్రీన్లాండ్ను సాధ్యమైనంత త్వరగా అమెరికాలో విలీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. గ్రీన్లాండ్ను రష్యా, చైనాలు ఆక్రమించుకోక ముందే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికన్లకు ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రీన్లాండ్ విషయంలో తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. వీలైతే సులభమైన మార్గంలో.. లేకపోతే కఠినమైన మార్గంలో ఆ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేయక తప్పదని ఉద్ఘాటించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాము అనుకున్నది చేసి తీరుతామన్నారు. త్వరలో ఏదో ఒకటి చేయక తప్పదని వెల్లడించారు. గ్రీన్లాండ్ రక్షణ బాధ్యత తమపై ఉందన్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతంపై యాజమాన్య హక్కుందని ఎలా అంటారని డెన్మార్క్పై అసహనం వ్యక్తంచేశారు. లీజు ఒప్పందాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని, చట్టబద్ధంగా యాజమాన్య హక్కులు ఉండాలని వ్యాఖ్యానించారు. విలీనాన్ని ఎవరూ ఆపలేరు చైనా ప్రజలను, రష్యా ప్రజలను తాను చాలా అభిమానిస్తానని.. కానీ, వారు గ్రీన్లాండ్లో అమెరికాకు పొరుగువారిగా ఉండిపోవడం తమకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. అలా జరగనివ్వబోనని పేర్కొన్నారు. ఈ విషయం అర్థం చేసుకోవాలని నాటోకు సూచించారు. మొత్తానికి గ్రీన్లాండ్ అనేది అమెరికాలో అంతర్భాగం కావడం తథ్యమని, అలా జరగడం ఎవరూ ఆపలేరని ట్రంప్ పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అత్యంత కీలకమని ట్రంప్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రష్యా, చైనా నౌకలు పాగా వేస్తున్నాయని, అది తమ భద్రతకు విఘాతం కలిగిస్తోందని అంటున్నారు. గ్రీన్లాండ్ వాయవ్య భాగంలో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఏర్పాటయ్యింది. ప్రస్తుతం అక్కడ 100 మందికిపైగా అమెరికా జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మకానికి లేదు గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్లో భాగంగా కొనసాగుతోంది. పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదాను అనుభవిస్తోంది. ఇక్కడి ప్రజలకు డెన్మార్క్ పౌరసత్వం ఉంది. డెన్మార్క్ నుంచి ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. గ్రీన్లాండ్ను డబ్బుతో కొనాలన్న ఆలోచన ఉన్నట్లు అమెరికా శ్వేతసౌధం అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఆ ప్రయత్నం విఫలమైతే బలప్రయోగం తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. సైన్యాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని వెల్లడించారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాల పట్ల డెన్మార్క్, గ్రీన్లాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, డబ్బుతో కొనేయాలన్న ఆలోచన ఉంటే మానుకోవాలని డెన్మార్క్ నేతలు తేల్చిచెప్పారు. ఒకవేళ అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘నాటో’అంతమవుతుందని అన్నారు. పార్లమెంట్లో తీర్మానం అమెరికాలో తాము అంతర్భాగంగా మారే ప్రసక్తే లేదంటూ గ్రీన్లాండ్ పార్లమెంట్లో శుక్రవారం తీర్మానం చేశారు. పార్లమెంట్లోని అన్ని పారీ్టలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి. గ్రీన్లాండ్ ఎప్పటికీ గ్రీన్లాండర్స్దే గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్తోపాటు అధికార, ప్రతిపక్ష నాయకులు శుక్రవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అమెరికా పౌరులుగా లేదా డెన్మార్క్ పౌరులుగా మారాలన్న కోరిక తమకు లేదని తేల్చిచెప్పారు. తమ దేశాన్ని స్వాహా చేయాలన్న ప్రయత్నాన్ని పక్కనపెట్టాలని అమెరికాను కోరారు. ఎప్పటికీ గ్రీన్లాండ్ పౌరులుగానే ఉంటామని, అందులో మరో మాటకు తావులేదని వెల్లడించారు. విలీనం వెనుక ఎన్నో సవాళ్లు బల ప్రయోగంతో గ్రీన్లాండ్ను విలీనం చేసుకోవాలన్న ఆరాటం ట్రంప్లో ఉన్నప్పటికీ అది అనుకున్నంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెబుతున్నారు. సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించే అవకాశం ఉంది. అమెరికాతో సంబంధాల విషయంలో విదేశాలు పునరాలోచించుకోవచ్చు. మొదట ‘నాటో’కూటమిలో సంక్షోభం తలెత్తుతుంది. కూటమి విచి్ఛన్నమైనా ఆశ్చర్యం లేదు. కొన్ని దేశాలు గ్రీన్లాండ్ రక్షణ కోసం ముందుకు రావొచ్చు. గ్రీన్లాండ్ సమీపంలో ఇప్పటికే రష్యా, చైనాల జలాంతర్గాములు, నౌకలు ఉన్నాయి. ఉమ్మడిగా సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తున్నాయి. గ్రీన్లాండ్కు మద్దతుగా ఆ రెండు దేశాలు అమెరికాతో తలపడే అవకాశాలు లేకపోలేదు. అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం వినాశనానికి దారితీయవచ్చు. మొదట కాల్పులు, తర్వాతే మాటలు గ్రీన్లాండ్పై ఎవరైనా దండయాత్ర చేస్తే కచి్చతంగా తిప్పికొడతామని డెన్మార్క్ హెచ్చరించారు. దురాక్రమణదారులపై తొలుత కాల్పులు జరుపుతామని, ఆ తర్వాతే చర్చిస్తామని పేర్కొంది. ఈ మేరకు డెన్మార్క్ ప్రభుత్వం తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా దూకుడుగా ముందుకెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అమెరికాను ఢీకొట్టగల శక్తి డెన్మార్క్కు లేదు. వెనెజువెలా తరహా సైనిక ఆపరేషన్ను తట్టుకొనే బలం కూడా లేదు. అమెరికా భూభాగంలో డెన్మార్క్ పరిమాణం 0.44 శాతమే. సైనిక శక్తి అంతంతమాత్రమే. సైనిక సిబ్బంది వేల సంఖ్యలోనే ఉన్నారు. కానీ, నాటో సభ్యదేశాలపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
ట్రంప్ ఉపసంహరణ తంత్రం
వాషింగ్టన్: తమ అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్న దేశాలపైకి సైన్యాన్ని నడిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సంబంధిత మెమోరాండంపై సంతకం చేశారు. ఆయా సంస్థల అవసరం ఇకపై లేదని, అవి అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నాయని ట్రంప్ తేలి్చచెప్పారు. ఇందులో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, పలు ఇతర సంస్థలతోపాటు భారత్, ఫ్రాన్స్ సారథ్యంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ఉంది. వాటితో అమెరికాకు ఎలాంటి సంబంధం ఉండబోదని ట్రంప్ స్పష్టంచేశారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రత, ఆర్థిక ప్రగతి, సార్వ¿ౌమత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థల్లో సభ్యత్వం కొనసాగించడం, భాగస్వామిగా పనిచేయడం, ఆర్థిక సాయం అందించడం అర్థంలేని పని అని అన్నారు. అమెరికా పట్ల దురుద్దేశాలతో వ్యవహరిస్తున్న సంస్థలకు తమ నిధులు ఎందుకివ్వాలని నిలదీశారు. అమెరికా సభ్యత్వం ఉపసంహరించుకున్న వాటిలో ఐరాస సంస్థలు 31, ఇతర సంస్థలు 35 ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి ఉపసంహరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ డిపార్టుమెంట్లు, ఏజెన్సీలను ట్రంప్ ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ట్రంప్ను తప్పుపట్టొద్దు: రూబియో మరికొన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ట్రంప్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచి్చన హామీని ట్రంప్ అమలు చేస్తున్నారని, ఆయనను తప్పు పట్టాల్సిన పనిలేదని అన్నారు. అమెరికాను వ్యతిరేకించే శక్తులకు నిధులు ఇవ్వడం ఆపేస్తానంటూ ట్రంప్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘అమెరికా, అమెరికన్స్ ఫస్ట్’ అనేదే తమ నినాదం, విధానమని ఉద్ఘాటించారు. అమెరికా ప్రజల రక్తం, స్వేదం, కష్టార్జితాన్ని మరెవరికో ధారపోయడం కొనసాగదని రూబియో పేర్కొన్నారు. ఇప్పటికే బిలియన్ డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపోయిందని, అమెరికా ప్రజలే నష్టపోయారని తెలిపారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, దెబ్బకొట్టాలని చూస్తున్న సంస్థలకు నిధులిచ్చే ప్రసక్తే లేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ స్పష్టంచేశారు. సౌర కూటమికి ఎదురుదెబ్బ? అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సౌర విద్యుత్, సౌర ఇంధన వనరులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతికూల వాతావరణ మార్పులను, దు్రష్పభావాలను అరికట్టాలన్న లక్ష్యంతో ఈ కూటమి ఏర్పాటైంది. భారత్, ఫ్రాన్స్ ఇందుకు సంయుక్తంగా చొరవ తీసుకున్నాయి. 2015లో పారిస్లో జరిగిన కాప్–21 సదస్సు సందర్భంగా కూటమిని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం భారత్లోనే ఉంది. ప్రస్తుతం 90కి పైగా దేశాలకు ఐఎస్ఏలో సభ్యత్వం కల్పించారు. 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్నది కూటమి లక్ష్యం. ముఖ్యమైన దేశం అమెరికా ఉపసంహరించుకోవడంతో ఐఎస్ఏ ఉద్దేశం నీరుగారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక రకంగా ట్రంప్ నిర్ణయం సౌర కూటమికి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఏయే సంస్థల నుంచి.. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఉక్రెయిన్), యూఎన్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యూఎన్ పాపులేషన్ ఫండ్ తదితర సంస్థల నుంచి తాము ఉపసంహరించుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. -
..ఇక ఇరాన్ వంతు !!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ట్రంప్ అదుపు తప్పారు. ఆయనది మతిలేని దూకుడు’’ అంటూ విమర్శించారు. అమెరికా నిత్యం పాటిస్తానని గొప్పగా చెప్పుకునే నిబంధనలు నిజానికి కాకమ్మ కథలు మాత్రమేనంటూ దుయ్యబట్టారు. వెనెజువెలా అనంతరం ట్రంప్ తదుపరి లక్ష్యం కచ్చితంగా ఇరాన్ అని తాజాగా ఇండియాటుడే వార్తాసంస్థతో మాట్లాడుతూ శాక్స్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ఫ్లోరిడాలోని మారా లాగో ఎస్టేట్లో ట్రంప్తో భేటీ అయ్యారు. తదుపరి లక్ష్యం ఇరాన్ అని ఆ సందర్భంగా వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు’’ అని వెల్లడించారు. అమెరికాను ధూర్త దేశం (రోగ్ స్టేట్)గా శాచ్స్ అభివర్ణించారు. ఇజ్రాయెల్ అంతకుమించిన ధూర్త దేశమంటూ ఆక్షేపించారు. ‘‘అవి రెండూ నిజంగా ఇరాన్పై భారీ ఎత్తున దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచ యుద్ధ స్థాయికి విస్తరిస్తుంది’’ అని హెచ్చరించారు. ఇరాన్ వద్ద పలు అత్యాధునిక క్షిపణులున్నాయని గుర్తు చేశారు. ‘‘ఇరాన్ మాత్రమే కాదు. మెక్సికో, కొలంబియా, క్యూబా, డెన్మార్క్, నైజీరియా ఇలా కనీసం మరో అర డజను దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాద పోకడలను భారత్ తదితర బ్రిక్స్ దేశాలే అడ్డుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్దేనని యూరప్ దేశాలన్నీ ముక్తకంఠంతో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.పిల్ల చేష్టల ట్రంప్సైన్యం, ముఖ్యంగా సీఐఏ, పెంటగాన్ వంటి భద్రతా సంస్థలు, ఇంకా సామ్రాజ్యవాద కుబేరులతో కూడిన రాజ్యాంగేతర శక్తి అయిన డీప్స్టేట్ ప్రస్తుతం అమెరికాను పాలిస్తోందంటూ శాక్స్ ఆరోపించారు. ‘‘ఇక ట్రంప్ నిజానికి ఓ ఉన్మాది. ఎక్కడ చమురు కనిపించినా అది తమదేననే రకం. ఆయనవి పిల్ల చేష్టలు. వెనెజువెలాపై ఆయనకు ఎప్పట్నుంచో కన్నుంది. తొలి దఫా అధ్యక్షునిగా ఉండగా 2017లో లాటిన్ అమెరికాకు చెందిన పలువురు నేతలను విందుకు పిలిచారు. వెనెజువెలాపై తానెందుకు దాడి చేయకూడదని వారిని అడిగారు. అది ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందంటూ వారు వారించడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు మాత్రం మతిలేని దూకుడుతో మదురోను బంధించి తీసుకెళ్లారు. అయితే దీని వెనక డీప్స్టేట్ అజెండా సైతం దాగుంది. ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానాన్ని నియంత్రించేంది అధ్యక్షుడు కాదు, డీప్స్టేట్’’ అని శాక్స్ చెప్పుకొచ్చారు. ‘‘నిజానికి ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా 20 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే వస్తోంది. కానీ పలు దేశాల్లో నాయకత్వాన్ని మార్చేందుకు ఇప్పటిదాకా అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. వెనెజువెలాలో అదే పునరావృతం అయ్యేలా కన్పిస్తోంది’’ అని అంచనా వేశారు. -
వెనెజువెలా చమురు మాదే
కారకాస్: వెనెజువెలాలోని అపారమైన చము రు నిల్వలను దోచుకోవడానికే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అక్రమంగా నిర్బంధించారంటూ ప్రపంచమంతటా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనెజువెలా చమురు తమదేనని తేల్చిచెప్పారు. అయితే, మార్కెట్ ధరకే కొనుగోలు చేయబోతున్నామని వెల్లడించారు. 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల అత్యధిక నాణ్యత కలిగిన చమురును వెనెజువెలా మధ్యంతర ప్రభుత్వం నుంచి స్వీకరిస్తామని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఎలాంటి ఖర్చు లేకుండా బలప్రయోగంతో చమురును సొంతం చేసుకోవడానికి ట్రంప్ కుట్రలు సాగిస్తున్నారంటూ వస్తున్న విమర్శలను పరోక్షంగా ఖండించారు. ‘‘స్టోరేజీ నౌకల్లో చమురును వెనెజువెలా నుంచి నేరుగా అమెరికాలోని అన్లోడింగ్ కేంద్రాలకు తరలిస్తాం. అమెరికా అధ్యక్షుడిగా నా నియంత్రణలో ఉన్న డబ్బును వెనెజువెలా, అమెరికా ప్రజలకు కచి్చతంగా మేలు జరిగేలా ఖర్చు చేస్తాం’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు. గొప్ప పని చేశావంటూ క్రెడిట్ ఇస్తారు వెనెజువెలాపై దాడి చట్టవిరుద్ధం, అన్యాయం అంటూ ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ట్రంప్ తిప్పికొట్టారు. డ్రగ్స్ టెర్రరిజం కేసులో నికోలస్ మదురోను అరెస్టు చేయాలని మాజీ అధ్యక్షుడు బైడెన్ ఆదేశించినట్లు గుర్తుచేశారు. తాను చేసింది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వాషింగ్టన్లో ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. వెనెజువెలాపై విజయవంతంగా సైనిక ఆపరేషన్ నిర్వహించినందుకు తనను ప్రశంసించాల్సిందిపోయి తప్పుపట్టడం సరైంది కాదని అన్నారు. మదురోను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా అమెరికా ప్రభుత్వం ఏనాడూ గుర్తించలేదని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులు ఏదో ఒకరు తనను పొగిడేస్తారని, గొప్ప పని చేశావంటూ క్రెడిట్ ఇస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ హెచ్చరికలను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్స్ కొట్టిపారేశారు. తన విధిని నిర్ణయించేది భగవంతుడే తప్ప మరొకరు కాదని స్పష్టంచేశారు. తనను బెదిరించేవారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఆమె అన్నారు. బ్యారెల్కు 56 డాలర్లు? వెనెజువెలా చమురును అమెరికా సర్కార్ బ్యారెల్ 56 డాలర్ల ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ చెప్పినట్లుగా రోజుకు సగటున 20 మిలియన్ల బ్యారెల్స్ కొనుగోలు చేయొచ్చు. 2.8 బిలియన్ డాలర్ల విలువైన చమురు, చమురు సంబంధిత ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకోనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే రోజువారీ అవసరాల కంటే ఎక్కువ చమురే వెనెజువెలా నుంచి దిగుమతి కానున్నట్లు యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మిని్రస్టేషన్ తెలియజేసింది. రేపు వైట్హౌస్లో కీలక భేటీ! వెనెజువెలా చమురును అమెరికాకు తరలించే ప్రక్రియ ఊపందుకుంటోంది. వెనెజువెలా చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో కీలక సమావేశం జరగనున్నట్లు సమాచారం. స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా చమురు దిగ్గజ సంస్థలు ఎక్సాన్, చెవ్రాన్, కొనాకోఫిలిప్స్ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. వెనెజువెలా, అమెరికా మధ్య చమురు వాణిజ్యంపై ఈ సమావేశంలో చర్చిస్తారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అయితే తమ రాజధాని కారకాస్పై ఈ నెల 3న అమెరికా నిర్వహించిన దాడిలో కనీసం 24 మంది భద్రతా సిబ్బంది మరణించారని వెనెజువెలా అధికారులు వెల్లడించారు. అలాగే 32 మంది క్యూబా సైనికులు, పోలీసు అధికారులు మృతిచెందినట్లు తెలియజేశారు. -
ట్రంప్ కు అభిశంసన తప్పదా ?
-
పుతిన్ నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదు
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి దిగిందంటూ వచ్చిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. రష్యా అధ్యక్షుడి నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు. పుతిన్ నివాసానికి సమీపంలో ఏదో జరిగిందని, అయితే అది పుతిన్ను లక్ష్యంగా చేసుకుని జరిగింది కాదని తమ అధికారులు చెప్పారన్నారు. ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో నివాసంలో రెండు వారాల విశ్రాంతి ముగించుకున్న ట్రంప్ సోమవారం వాషింగ్టన్కు వస్తూ తన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. ‘మొదట్లో ఉక్రెయిన్ దాడి విషయం మేం కూడా నమ్మాం. కానీ, ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. అలాంటి దాడి ఏదీ జరగలేదని నిర్ధారణ అయింది’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్రతిపాదిత రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అమెరికాలో చర్చలు జరుగుతున్న వేళ..పుతిన్ తనతో ఫోన్లో మాట్లాడారని, డ్రోన్ దాడి జరిగినట్లు చెప్పడంతో తనకు చాలా కోపం వచ్చిందని సోమవారం ట్రంప్ తెలపడం తెల్సిందే. అనంతరం, శాంతి చర్చలను తప్పుదోవ పట్టించేందుకే రష్యా ఈ అబద్ధం చెప్పిందటూ న్యూయార్క్ పోస్ట్లో వచ్చిన కథనాన్ని బుధవారం ఆయన షేర్ చేశారు. శాంతి చర్చలు పురోగతిలో ఉన్నట్లు ట్రంప్, జెలెన్స్కీ ప్రకటించినా రష్యా మాత్రం తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్లోని పారిశ్రామిక డోన్బాస్ ప్రాంతం మొత్తం తనకే చెందాలని, యుద్ధానంతరం ఆ దేశం పరిమితంగా సైన్యాన్ని ఉంచుకోవాలని షరతులు విధిస్తోంది. -
ఆ డ్యాన్సులే కొంప ముంచాయా?
వాషింగ్టన్: డ్యాన్సు స్టెప్పులు వేసి మరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అనవసరంగా రెచ్చగొట్టడమే వెనెజువెలా నియంత నికోలస్ మదురో కొంప ముంచిందా? అవుననే అంటోంది న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక. నృత్యాలతో తమను ఎద్దేవా చేయడమే గాక ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఆయన బాహాటంగా సవాలు విసిరినట్టు కూడా ట్రంప్ యంత్రాంగం భావించిందట. గత నవంబర్లో మదురో పలుమార్లు టీవీల్లో కనిపించారు. ‘యుద్ధం వద్దు, శాంతే కావాలి’ అంటూ తాను చేసిన ప్రసంగం తాలూకు మ్యూజికల్ రీమిక్స్కు సరదాగా స్టెప్పులు వేశారు. ‘మతిలేని యుద్ధం వద్దే వద్దు (నో క్రేజీ వార్)’ అనే లైన్లకు కూడా అలాగే పాదాలు కదిపారు. అమెరికాను, ట్రంప్ను, ప్రత్యక్ష దాడి తప్పదన్న ఆయన హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటున్నాననే అర్థం వచ్చేలా ఆ సందర్భంగా పదే పదే నవ్వుతూ కన్పించారు. ఇదంతా ట్రంప్కు తీవ్ర ఆగ్రహం కలిగించిందని వైట్హౌస్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ‘‘నిజానికి మదురో అధికారిక నివాసంపై నేరుగా దాడి చేసి ఆయనను ఎత్తుకొచ్చేందుకు అప్పటికి కొద్ది నెలలుగా అమెరికా సైన్యం తాలూకు స్పెషల్ ఫోర్సెస్ రిహార్సల్స్లో మునిగి తేలుతూనే ఉన్నాయి. కాకపోతే నిజంగా అలాంటి ప్రత్యక్ష చర్యకు దిగే విషయంలో మాత్రం అప్పటిదాకా ట్రంప్ కాస్త సంశయంలోనే ఉన్నారు. కానీ మదురో డ్యాన్సింగ్ సవాళ్లు చూసి ఆయనకు చిర్రెత్తుకొచ్చింది’’అని తెలిపింది. దాంతో, ‘‘మదురో స్టెప్పులు మరీ శ్రుతి మించాయి. ఇక గుణపాఠం నేర్పి తీరాల్సిందే’అని ట్రంప్తో పాటు ఆయన యంత్రాంగంలోని ఉన్నతాధికారులు కూడా నిర్ణయానికి వచ్చారట. అలా ట్రంప్ను అనవసరంగా పరిధి దాటి రెచ్చగొట్టి, ఆ ఫలితాన్ని మదురో ఇలా అనుభవిస్తున్నారన్నది న్యూయార్క్ టైమ్స్ కథనం! గత శనివారం అర్ధరాత్రి అమెరికా ప్రత్యేక సైనిక దళాలు మెరుపు ఆపరేషన్ చేపట్టి మదురోను ఆయన భార్య సిలియా ఫ్లోరెస్తో పాటు బెడ్రూంలో నుంచి లాక్కొచ్చి మరీ న్యూయార్క్కు తరలించడం తెలిసిందే. ఇప్పుడాయన విచారణ కోసం ఎదురుచూస్తూ న్యూయార్క్ జైల్లో కాలం గడుపుతున్నారు. మదురో దంపతులతో పాటు వారి కుమారునిపై కూడా అమెరికా డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పలు అభియోగాలు మోపింది. సైనిక చర్యకు ముందు పలుమార్లు మదురోకు దేశం వీడి ఏ తుర్కియేలోనో ఆశ్రయం పొందాల్సిందిగా ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. వాటిని మదురో నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వచ్చారు. -
'వెనిజులా నేనే పాలిస్తా' ఇది సాధ్యమేనా? ట్రంప్ తప్పుకు భారీ శిక్ష?
-
ఇక కొలంబియా వంతు!
వాషింగ్టన్: లాటిన్ అమెరికాలో దుమారం రేపేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నట్టు కన్పిస్తోంది. ‘తర్వాత నీ వంతే కావచ్చు, జాగ్రత్త!’ అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ట్రంప్ ఓ బూతు మాట ప్రయోగించి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘గుస్తావో పెట్రో విచ్చలవిడిగా కొకైన్ తయారు చేయిస్తున్నారు. దాన్ని నేరుగా అమెరికాలోకి తరలిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంతటితో ఆగలేదు. మెక్సికో, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు తయారు చేస్తూ అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ‘‘ పలు నేరగాళ్ల ముఠాలకూ ఆ దేశాలు ఆశ్రయమిస్తున్నాయి. తీరు మార్చుకోకుంటే వాటికీ వెనిజువెలా గతే పడుతుంది’’ అంటూ అల్టిమేటమిచ్చారు. అవసరమైతే ఆ దేశాల్లోని డ్రగ్ ల్యాబ్స్పై దాడులకు వెనుకడుగు వేయబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఖండాల్లో తమ దేశ ఆధిపత్యాన్ని ఎవరూ వేలెత్తి చూపేందుకు కూడా వీల్లేకుండా చేస్తామన్నారు. ‘‘మా చుట్టూ మంచి మిత్రులుండాలి. స్థిరత్వం, శక్తియుక్తులుండాలి. వెనిజువెలాలో అమితమైన శక్తిసామర్థ్యాలున్నాయి. వాటిని కాపాడాల్సిన అవసరముంది. మా ప్రయోజనాలు తీరాలంటే అవి కావాలి’’ అంటూ కుండబద్దలు కొట్టారు. వెనెజువెలాలో మా సైన్యం..వెనిజువెలా చమురు కంపెనీలపై తమ నిషేధం ఇకపై కూడా కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. ‘‘వెనిజువెలాలో మా సైనిక మోహరింపులు కొనసాగుతాయి. అక్కడ మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేదాకా, మేం పూర్తిగా సంతృప్తి చెందేదాకా అక్కణ్నుంచి వైదొలగేదే లేదు’’ అని స్పష్టం చేశారు.సైన్యంతో మేం సిద్ధం: పెట్రోట్రంప్ బెదిరింపులపై కొలంబియా అధ్యక్షుడు పెట్రో తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపైనే దాడిగా ఆయన అభివర్ణించారు. ‘‘ఇది కచ్చితంగా మానవతా సంక్షోభానికి దారి తీయగల పరిణామం. ట్రంప్ తీరు చూసి మేమిప్పటికే అప్రమత్తమయ్యాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వెనిజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు. మదురోకు పెట్రో అత్యంత సన్నిహితుడు.క్యూబా పని పడతాంరూబియో సంకేతంవెనిజువెలా తర్వాత ఇక క్యూబాయే తమ లక్ష్యం కావచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంకేతాలిచ్చారు. ‘నేనే గనక క్యూబా ప్రభుత్వంలో ఉంటే, ఆ దేశ రాజధాని హవానాలో నివసిస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత ఆందోళన చెంది తీరతా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా మరో సార్వభౌమ దేశంపై సైనిక చర్యకు దిగనుందన్న అనుమా నాలు బలపడుతున్నాయి. మెక్సికోకు ట్రంప్ శనివారం హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. ‘‘మెక్సికో విషయంలో కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. అధ్యక్షురాలు క్లాడియా షేన్బాం మంచి వ్యక్తే. కానీ దేశాన్ని ఆమె పాలించడం లేదు. డ్రగ్ ముఠాలే నడుపుతున్నాయి’’ అని ఆరోపించారు. -
ఆదివారం ట్రంప్తో భేటీ: జెలెన్స్కీ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆదివారం ఫ్లోరిడాలో సమావేశమయ్యే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. ‘మేం ఒక్క రోజు కూడా వృథాగా పోనివ్వడం లేదు. అధ్యక్షుడు ట్రంప్తో అతి త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సరం ప్రవేశించే లోగానే కీలక పరిణామాలు సంభవించొచ్చు’అని ఆయన మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదిత 20–సూత్రాల ప్రణాళికలో 90 శాతం మేర ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఆదివారం జరిగే సమావేశం సందర్భంగా ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. జెలెన్స్కీ వ్యాఖ్యలతో చర్చలు పురోగతిలో ఉన్నట్లు భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషె్నర్తో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు జెలెన్స్కీ అంతకుముందు గురువారం ప్రకటించారు. పారిశ్రామికంగా కీలకమైన తూ ర్పు ప్రాంతం తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జెలెన్స్కీ తెలిపారు. అయితే, రష్యా కూడా ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకుని, నిస్సైనిక ప్రాంతంగా ప్రకటించేందుకు సిద్ధం కావాలన్నారు. -
వెనెజులా చమురు ట్యాంకర్ను అడ్డుకున్న అమెరికా
వాషింగ్టన్: వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మడురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని మరింతగా పెంచుతున్నారు. వెనెజులాకు చెందిన చమురు ట్యాంకర్ను శనివారం ఆ దేశ తీరానికి సమీపంలోనే అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇలా అడ్డగించడం ఇది రెండోసారి. ఆంక్షలు విధించిన ఆయిల్ ట్యాంకర్లను దిగ్బంధిస్తామంటూ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ నెల 10న అమెరికా బలగాలు మొదటిసారిగా ఓ ట్యాంకర్ను నిలువరించాయి. తాజా చర్యను హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ధ్రువీకరించారు. సెంచరీస్ అనే పేరున్న ట్యాంకర్పైకి అమెరికా బలగాలు హెలికాప్టర్ ద్వారా దిగుతున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నార్కో టెర్రరిజానికి ఊతమిచ్చే ఆయిల్ రవాణాను అమెరికా అడ్డుకుంటుందని ఆమె తెలిపారు. పనామాకు చెందిన ముడిచమురు ట్యాంకర్ సెంచరీస్ ఇటీవల వెనెజులా తీరంలో కనిపించినట్లు మెరైన్ ట్రాఫిక్ అనే సంస్థ తెలిపింది. అయితే, సెంచరీస్ ట్యాంకర్ అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్నదీ లేనిదీ వెల్లడించలేదు. ఈ పరిణామంపై రక్షణ శాఖ గానీ, వైట్హౌస్ అధికారులు గానీ స్పందించలేదు. అయితే, అమెరికా చర్యలను నేరపూరితంగా వెనెజులా అభివర్ణించింది. ‘ఈ అంశాన్ని భద్రతా మండలి దృష్టికి తీసుకెళతాం. అమెరికాను వదిలేది లేదు, చట్టపరంగా ఎదుర్కొంటాం’అని స్పష్టం చేసింది. -
సమస్యల్ని పరిష్కరించా విజయాలెన్నో సాధించా
న్యూయార్క్/వాషింగ్టన్: జో బైడెన్ ప్రభుత్వం వారసత్వంగా తనకు ఇచ్చిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి దేశాన్ని అభివృద్ధిపథంలో ఉరకలెత్తిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2025 ఏడాది మరో రెండు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో తన 11 నెలల పాలనపై ట్రంప్ 19 నిమిషాలపాటు గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన విజయాల పరంపర ఇదేనంటూ పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘ బైడెన్ తన పాలనలో ప్రపంచంలోనే అమెరికా సరిహద్దును అత్యంత దుర్భలంగా మార్చారు. నేను దుర్భేద్యంగా పటిష్టపరిచా. ఇలాంటి ఎన్నో సమస్యలతో అధ్వానస్థితిలో అమెరికా పరిపాలనా పగ్గాలను ఆయన నాకు వారసత్వంగా ఇచ్చారు. ఆ సమస్య లను నేను సమర్థవంతంగా సరిదిద్దు తున్నా. అమెరికాకు పూర్వవైభవం తీసుకొచ్చా. 10 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 8 ప్రధానమైన యుద్ధాలను నిలువరించా. ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణుఉపద్రవాన్ని అడ్డుకున్నా. 3,000 సంవత్సరాల్లో సాధ్యంకాని పశ్చిమా సియాలో శాంతిని స్థాపించా. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసి గాజాలో శాంతి కపోతాలను ఎగరేశా. భారత్–పాకిస్తాన్, థాయిలాండ్–కాంబోడియా, అర్మేనియా–అజర్బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియో పియా, రువాండా, కాంగోల మధ్య సమరాలు సమసిపో యేలా చేశా. బైడెన్ హయాంలోనే అమెరికాలోకి లక్షలాదిగా అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయి. వీళ్ల కోసం బైడెన్ సర్కార్ అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అనవసరంగా ఖర్చుచేసింది’’ అని ట్రంప్ ఆరోపించారు.వీళ్ల కారణంగానే ఇళ్ల అద్దెలు పెరిగాయి‘‘విదేశీ వలసదారులు పోటెత్తడంతోనే ఇళ్ల అద్దెలు పెరిగాయి. రెంటల్ మార్కెట్ 60 శాతం పెరగడానికి బైడెన్ ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణం. టారిఫ్ అనే పదం నాకెంతో ఇష్టం. టారిఫ్ల బెత్తం చూపించి అమెరికాలోకి మళ్లీ కర్మాగారాలు క్యూ కట్టేలా చేశా. అమెరికాకు 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించా. దీంతో ఉద్యోగాలు, జీతభత్యాల పెంపు, ఆర్థికాభివృద్ధి, కొత్త ఫ్యాక్టరీల ఆరంభాలు, పటిష్టమైన జాతీయ భద్రతను సాకారంచేశా. ఉత్పత్తకేంద్రాలను అమెరికాలో నెలకొల్పితే టారిఫ్లు ఉండబోవని కంపెనీలకు ఇప్పుడు అర్థమైంది. డ్రగ్స్ భూతాన్ని దూరంగా తరమికొట్టా. అందుకే భూ, సముద్రమార్గాల ద్వారా అమెరికాలోకి విదేశీ మత్తుపదార్థాల రాక 94 శాతం తగ్గింది. గత అర్థశతాబ్దకాలంలో తొలిసారిగా దేశం నుంచి అక్రమవలసదారులు తిరిగి వెళ్లిపోతున్నారు. వాళ్లు వదిలేసిన ఇళ్లు, ఉద్యోగాలు అమెరికన్లకు దక్కుతున్నాయి ’’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసింది
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ట్రంప్ గోల్డ్ కార్డు’ వీసా పథకం అమల్లోకి వచ్చింది. బుధవారం శ్వేతసౌధంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయనే స్వయంగా గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించారు. ఇందుకోసం trumpcard. gov అనే ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి, శాశ్వత నివాసానికి, తర్వాత పౌరసత్వం పొందడానికి కూడా వీలు కలి్పంచే ఈ కార్డు ధర మిలియన్ డాలర్లు(రూ.9.02 కోట్లు). అమెరికాలో స్థిరపడాలని భావించే విదేశీయులు వ్యక్తిగతంగా లేదా విదేశీ ఉద్యోగుల తరఫున అమెరికాలోని కంపెనీలు కొనుగోలు చేయొచ్చు. కంపెనీల మాత్రం రెండు మిలియన్ల డాలర్లు(రూ.18.03 కోట్లు) చెల్లించాలి. గోల్డ్ కార్డు కోసం వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రాసెసింగ్ ఫీజు కింద 15,000 డాలర్లు(రూ.13.54 లక్షలు) చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఆన్లైన్లోనే మిలియన్ డాలర్ల రుసుము చెల్లించవచ్చు. అమెరికాలో అతి తక్కువ సమయంలో నివాసిత హోదా, తద్వారా పౌరసత్వం పొందాలంటే ‘ట్రంప్ గోల్డ్ కార్డు’ కొనుగోలు చేయడం చక్కటి మార్గమని ప్రభుత్వం వెల్లడించింది. కార్డు విక్రయాల ద్వారా వచ్చే సొమ్ముతో అమెరికా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. ట్రంప్ గోల్డ్ కార్డు అనేది నిజానికి ఒక వీసా లాంటిదే. నైపుణ్యం కలిగిన విదేశీయులను అమెరికాలో ఉద్యోగాల్లో నియమించుకోవడం, వారు ఇక్కడే ఉండిపోయే అవకాశం కల్పించడం, పౌరసత్వం ఇవ్వడం, అమెరికా అభివృద్ధి కోసం వారి సేవలు ఉపయోగించుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. విదేశీ నిపుణులు రావడం ఒక బహుమతి గోల్డ్ కార్డు వీసా విక్రయాలు అధికారికంగా ప్రారంభం కావడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న నైపుణ్యం కలిగిన విదేశీ విద్యార్థులు ఇకపై స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉద్యోగాలు పొందవచ్చని, ఇక్కడే ఉండిపోవచ్చని సూచించారు. గ్రీన్ కార్డు కంటే గోల్డ్ కార్డు అత్యత్తమమైనదని స్పష్టంచేశారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. ట్రంప్ బుధవారం మధ్యాహ్నం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, డెల్ టెక్నాలజీస్ సీఈఓ మైఖేల్ డెల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. వెబ్సైట్ ద్వారా గోల్డ్ కార్డులు కొనుగోలు చేయొచ్చని ట్రంప్ సూచించారు. అమెరికాలో చదువుకుంటున్న భారత్, చైనా విద్యార్థులు విద్యాభ్యాసం ముగిసిన తర్వాత స్వదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉండడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. విదేశీ నిపుణులు అమెరికాకు రావడం, అమెరికా ప్రగతి కోసం పనిచేయడాన్ని ఒక బహుమతిగా భావిస్తామని చెప్పారు. సమస్య ఏమిటో తెలిసింది..యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్తోపాటు ఇతర కంపెనీల ప్రతినిధులతో తనకు ఎదురైన అనుభవాన్ని ట్రంప్ పంచుకున్నారు. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు చదువు అయిపోయిన తర్వాత సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని, వారిని ఉద్యోగాల్లో నియమించుకోలేకపోతున్నామని, వారంతా అమెరికాలోనే ఉండేలా చూడాలని టిమ్ కుక్ తనను కోరారని తెలిపారు. అసలైన సమస్య ఏమిటో తనకు తెలిసిందని చెప్పారు. ఇకపై ఆ సమస్య ఉండదన్నారు.సొమ్ము చేసుకోవడానికేనా? ఇండియాలో హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలను ఐదారు నెలలపాటు వాయిదా వేశారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైళ్లను, వారు చేసిన పోస్టులను క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ ప్రకటించింది. వేలాది మంది దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. తదుపరి షెడ్యూల్ కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలకు తెరతీయడం గమనార్హం. అధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కఠినతరం చేసింది. విదేశాల నుంచి వలసలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. మరోవైపు విదేశీయులను ఆకర్శించడానికి గోల్డ్ కార్డు వీసాను తీసుకొచి్చంది. గోల్డ్ కార్డు పేరిట భారీగా సొమ్ము చేసుకోవడం, ఆర్థిక లోటును పూడ్చుకోవడమే ట్రంప్ సర్కార్ అసలు లక్ష్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్లాటినం వెర్షన్ కార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని ధర 5 మిలియన్ల డాలర్లు. కంపెనీలు ఈ కార్డు కొంటే కొన్ని రకాల పన్ను రాయితీలు, మినహాయింపులు లభిస్తాయి. త్వరలో ఈ కార్డు అందుబాటులోకి రానుంది.ఐదేళ్ల తర్వాత పౌరసత్వం: హోవార్డ్ లుట్నిక్ గోల్డ్ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే మిలియన్ డాలర్లు, కంపెనీలు దరఖాస్తు చేస్తే రెండు మిలియన్ల డాలర్లు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ కార్డు కొనుగోలు చేసినవారు ఐదేళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఒక కార్డుతో ఒక్కరు మాత్రమే అమెరికాలో ఉండడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కంపెనీలు ఎన్ని కార్డులైనా కొనుగోలు చేయొచ్చని అన్నారు. కార్డు ఎన్ని రోజుల్లో రావొచ్చు..గోల్డ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యి కార్డు చేతికి అందడానికి కొన్ని వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. అవసరాన్ని బట్టి అదనపు డాక్యుమెంట్లు కూడా సమర్పించాలి. దరఖాస్తు రుసుము 15,000 డాలర్లు నాన్ రీఫండబుల్. అంటే గోల్డ్ కార్డు వచి్చనా రాకున్నా ఈ సొమ్ము వెనక్కి తిరిగిరాదు. కార్డు వచి్చన వారికి అమెరికాలో చట్టబద్ధమైన పరి్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ కల్పిస్తారు. ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాదారుల హోదా లభిస్తుంది. అసాధారణమైన, అద్భుతమైన తెలివితేటలు, నైపుణ్యాలు ఉన్నవారికి ఈబీ–1 లేదా ఈబీ–2 వీసాలు ఇస్తుంటారు. ట్రంప్ గోల్డ్ కార్డు కొంటే పరోక్షంగా ఈబీ–1 లేదా ఈబీ–2 వీసా పొందినట్లే. -
యుద్ధం ఆపా!
న్యూయార్క్, పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘భారత్, పాక్ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయి. కల్పించుకుని దాన్ని నివారించా‘ అన్నారు. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు 70వ సారి కావడం విశేషం! మంగళవారం పెన్సిల్వేనియాలోని మౌంట్ పొకోనో వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ పాలు గొప్పలకు పోయారు. ‘గత 10నెలల్లోనే నేను ఏకంగా 8 యుద్ధాలను ఆపాను. కొసావో, సెర్బియా, ఇండో–పాక్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపి యా, ఆర్మేనియా, అజర్ బైజాన్‘ అంటూ ఏకంగా జాబితానే ఏకరువు పెట్టారు. ‘ఇప్పుడు కంబోడి యా, థాయ్ లాండ్ తలపడుతున్నాయి. రేపు ఆ దేశాధినేతలకు కాల్ చేయబోతున్నా. ఇలాంటి ప్రకటనలు నేనుగాక ఇంకెవరు చేయగలరు?‘ అంటూ గొప్పలకు పోయారు. సోమాలియా, అఫ్ఘానిస్థాన్ వంటి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వతం ఫుల్ స్టాప్ పెట్టానని చెప్పుకొచ్చారు. నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటి దేశాల నుంచి అమెరికాకు రారెందుకంటూ వాపోయారు. గత ఏప్రిల్ లో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణారహిత కాల్పులతో పొట్టన పెట్టు కోవడం, అందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి దాయాది పీచమణచడం తెలిసిందే. చివరికి పాక్ కాళ్ల బేరానికి రావడంతో శాంతి కుదిరింది. అదంతా తన ఘనతేనని అప్పట్లోనే ట్రంప్ చెప్పు కున్నారు. అదేమీ లేదని భారత్ అప్పుడే కొట్టిపారేసింది. కేవలం ఇరు దేశాల చర్చలతోనే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేసింది. -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫిఫా శాంతి బహుమతి
-
ట్రంప్ ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడం సాధారణంగా మారిపోయింది. ఆయన మునుపటిలా లేరని.. ఎనర్జీ లెవల్ దారుణంగా పడిపోయిందని.. బహుశా వయోభారమే అందుకు కారణమై ఉండొచ్చని తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇది సాధారణంగానే ఆయనకు కోపం తెప్పించింది.ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలను వైట్హౌజ్ కొట్టిపారేసింది. తాజాగా ఆయన తీయించుకున్న ఎమ్మారై స్కాన్తో ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా ఆయన వయసు ఉన్నవాళ్లకు ఇమేజింగ్ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అలా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలు కనిపించలేవు. ఆయన గుండె సాధారణంగానే ఉంది. రక్తనాళాల్లో ఎలాంటి బ్లాకులు లేవు. రక్తప్రవాహానికి ఆటంకం.. గుండె, ప్రధాన రక్తనాళాల్లో ఎలాంటి అసాధారణతలు కనిపించలేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు’’ అని మీడియా కథనాలను ఖండించారామె. మరోవైపు న్యూయార్క్ టైమ్స్ కథనం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.🇺🇸 WHITE HOUSE: TRUMP’S MRI SHOWS “EXCELLENT OVERALL HEALTH”The White House released Trump’s MRI today, confirming everything came back normal. His physician, Capt. Sean Barbarella of the U.S. Navy, said the MRI showed no heart or abdominal issues, with “all major organs… pic.twitter.com/FWHpfHMSoQ— Mario Nawfal (@MarioNawfal) December 2, 2025‘‘ఇప్పటిదాకా నా జీవితంలో ఏనాడూ ఇంతలా కష్టపడలేదు. అంతగా పని చేస్తూ.. పర్ఫెక్ట్గా ఫలితాలు రాబట్టగలుగుతున్నా. శారీరకంగా, మానసికంగా నేను ఫిట్గా ఉన్నా. నా స్టామినా విషయంలో సందేహమే అక్కర్లేదు’’ అని మొన్నీమధ్యే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ను తిట్టిపోసిన ఆయన.. ఆ కథనం వెనుక రాజకీయాల ప్రభావం ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే.. ఎప్పటిలాగే దానిని అమెరికన్ల శత్రువుగా అభివర్ణించారు. అలాగే ఆ కథనం రాసిన కేటీ రోగర్స్కు నానాశాపనార్థాలు పెట్టారు.28 ఏళ్ల కరోలైన్ లెవిట్ అమెరికా చరిత్రలో అత్యంత యువ ప్రెస్ సెక్రటరీ ఘనత దక్కించుకుంది. 2022లో న్యూ హాంప్షైర్ 1వ కాంగ్రెస్ జిల్లా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆమెకు వైట్హౌజ్లో బాధ్యతలు అప్పగించారు. అందగత్తె మాత్రమే కాదు.. తెలివైంది కూడా అంటూ ఆయన తరచూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తుంటారు. ఈ ఏడాదిలోనే ఆమె వివాహం జరిగింది కూడా. -
ట్రంప్, జిన్పింగ్ మాటామంతి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్ సోమవారం ఉదయం ఫోన్లో మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంతోపాటు తైవాన్, ఉక్రెయిన్ వ్యవహారాలపై వారిద్ద రూ చర్చించుకున్నట్లు అమెరికా, చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల క్రితం దక్షిణ కొరియాలోని బుసాన్లో ట్రంప్, జిన్పింగ్ కలుసుకున్నారు. ఇంతలోనే మరో సారి వారు చర్చించుకోవడం గమనార్హం. తైవాన్ విషయంలో చైనా వైఖరిని జిన్పింగ్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని సమాచారం. తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని ఆయన ట్రంప్కు స్పష్టంచేశారు. -
నైపుణ్యం కలిగిన వలసదారులను స్వాగతిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: వలసదారులపై ఇన్నాళ్లూ కఠిన వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. అమెరికాకు వారి అవసరమేంటో ఆయనకు ఎట్టకేలకు తెలిసొచ్చింది. నైపుణ్యం కలిగిన వలసదారులను కచ్చితంగా స్వాగతిస్తామని చెప్పారు. కంప్యూటర్ చిప్స్, క్షిపణులు లాంటి సంక్లిష్టమైన ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో అమెరికన్ కార్మీకులకు వలసదారులు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు గతంలో మద్దతు ఇచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు వలసదారులకు పెద్దపీట వేస్తే స్వదేశంలో కొందరి నుంచి వ్యతిరేకత రావొచ్చని అన్నారు. వ్యతిరేకతను భరిస్తానని చెప్పారు. బుధవారం యూఎస్–సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ట్రంప్ మాట్లాడారు. దేశ ఆర్థిక ప్రగతి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, మిస్సైల్స్ వంటి కంపెనీల్లో పని చేయడానికి నిపుణులైన వలసదారులు కావాలని తెలిపారు. వారి పరిజ్ఞానం తమ కార్మీకులకు ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. వస్తువుల ఉత్పత్తికి అవసరమైన మానవ వనరులను విదేశాల నుంచి రప్పించుకోవచ్చని అమెరికా సంస్థలకు ట్రంప్ సూచించారు. వేలాది మంది వచ్చినా తప్పకుండా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.ఈ విషయంలో నన్ను క్షమించాలి వలసదారుల రాకను వ్యతిరేకించేవారు నిజంగా చాలా తెలివైనవారు, నమ్మశక్యంకాని దేశభక్తులు అని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. అయితే, అమెరికా కార్మీకులకు నైపుణ్యాలు నేరి్పంచాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. మన కంపెనీల్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేవారిని అనుమతించకపోతే మనం విజయవంతమైన వ్యక్తులుగా ఎప్పటికీ ఎదగలేమని తేలి్చచెప్పారు. ఒక పెద్ద కంపెనీ ఏర్పాటై, ఉత్పత్తి ప్రారంభం కావాలంటే విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు, ఉద్యోగులు రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ విషయంలో తనను క్షమించాలని కోరారు. మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్)ను ఇప్పటికీ ఆరాధిస్తున్నానని, విదేశాల నుంచి మనకు కావాల్సిన నిపుణులను రప్పించుకోవడం కూడా ‘మాగా’అవుతుందని అమెరికా అధ్యక్షుడు వివరించారు. తనకు ఓటు వేసేవారి సంఖ్య తగ్గినా పట్టించుకోబోనని, చివరకు వారే అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. -
యుద్ధం ఆపేస్తానన్నారు!
వాషింగ్టన్: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. కానీ, ఈసారి ఒక కొత్త విషయం చెప్పారు. దాడులు ప్రతిదాడులు వెంటనే నిలిపివేయకపోతే ఏకంగా 350 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించడంతో ఆ రెండు దేశాలు మరో గత్యంతరం లేక దారికొచ్చాయని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడారని, పాకిస్తాన్పై యుద్ధం చేయబోమని చెప్పారని స్పష్టంచేశారు. అణ్వస్త్ర దేశాలైన భారత్–పాక్ మధ్య భీకర యుద్ధాన్ని తానే చొరవ తీసుకొని ఆపేశానంటూ ట్రంప్ నోటివెంట వచ్చిన ప్రకటనల సంఖ్య 60 దాటడం గమనార్హం. రెండు దేశాల నడుమ ఘర్షణ ఆగడం వెనుక మూడో వ్యక్తి ప్రమేయం, పాకిస్తాన్ ప్రాధేయపడడం వల్లనే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ పదేపదే చెబుతున్నా ట్రంప్ తన వైఖరి మార్చుకోవడం లేదు. ఆయన తాజాగా యూఎస్–సౌదీ అరేబియా పెట్టుబడుల సదస్సులో ప్రసంగించారు. ‘‘భారత్–పాక్ మధ్య దాడులు ఆరంభం కాగానే ఆ రెండు దేశాల అధినేతలతో మాట్లాడా. దాడులు తక్షణమే ఆపాలని, లేకపోతే 350 శాతం సుంకాలు భరించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించా. అంత పని చేయొద్దని భారత్, పాక్ వేడుకున్నాయి. అణ్వాయుధాలతో పరస్పరం యుద్ధం సాగిస్తే లక్షలాది మంది మరణిస్తారని చెప్పా. లాస్ ఏంజెలెస్ సిటీపై అణుధూళి పేరుకుపోతుందని వెల్లడించా. 350 శాతం సుంకాలు అనగానే రెండు దేశాలు బెదిరిపోయి నా మాట విన్నాయి. ఒక్క మాటతో అంతా సెట్ అయిపోయింది. మొదట నాకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నుంచి ఫోన్ వచ్చింది. యుద్ధాన్ని నిలిపివేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడినందుకు ఆయన నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత నరేంద్ర మోదీ ఫోన్చేసి మాట్లాడారు. మేము చేయాల్సింది చేశాం మీరేం చేస్తారో చెప్పాలని ప్రశ్నించా. పాక్పై యుద్ధం చేయబోమని మోదీ బదులిచ్చారు. దాంతో మోదీకి కృతజ్ఞతలు తెలియజేశా’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సదస్సులో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాల్గొన్నారు. పదేపదే అదే మాట 350 శాతం టారిఫ్లు విధిస్తానని భారత్, పాక్లను హెచ్చరించానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి ఆయన గతంలో మాట్లాడుతూ 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరించానని చెప్పారు. ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అది 350 శాతానికి చేరింది. ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. ఇదిలా ఉండగా, గురువారం వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ భేటీలోనూ ట్రంప్ తన నోటికి పనిచెప్పారు. భారత్–పాక్ యుద్ధానికి తానే ఫుల్స్టాప్ పెట్టేశానని పునరుద్ఘాటించారు. -
‘ఆహారం’పై టారిఫ్లు రద్దు
వాషింగ్టన్: విదేశీ ఉత్పత్తులపై టారిఫ్లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత కరుణ చూపారు. విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే పశుమాంసం(బీఫ్), కాఫీ, ఉష్ణమండల పండ్లతోపాటు ఇతర ఉత్పత్తులపై టారిఫ్లు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ట్రంప్ కఠిన విధానాలపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాగ్రహం నానాటికీ తీవ్రమవుతోంది. ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక ట్రంప్ దిగివచ్చినట్లు తెలుస్తోంది. అందుకే టారిఫ్ల రద్దు ప్రకటన చేసినట్లు సమాచారం. దీనివల్ల స్వదేశంలో ధరలు తగ్గుతాయి. అమెరికన్లకు ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే టారిఫ్ల కొరడా అందుకున్న సంగతి తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం బీఫ్, కాఫీ, అరటి పండ్లు, అవకాడో, టమాటాలు, కొబ్బరికాయలు, మామిడికాయలు, కోకోవా, బ్లాక్ టీ, గ్రీన్ టీ, వెనిల్లా బీన్స్, జామకాయలు, నిమ్మకాయలు, నారింజ, పైనాపిల్, జీడిపప్పు, గసగసాలు సహా 100కిపైగా ఉత్పత్తులపై సుంకాలు రద్దు చేస్తూ సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ టారిఫ్ల రద్దు ఆదేశాలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. -
గిలియానీ తదితరులకు ట్రంప్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ వ్యక్తిగత లాయర్ రూడీ గిలియానీ, మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ తదితరులకు క్షమాభిక్ష ప్రకటించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ శ్రేణులు ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నించగా సహకరించినట్లు వీరిపై ఆరోపణలు న్నాయి. వీరికి అధ్యక్షుడు ట్రంప్ ‘సంపూర్ణ, బేష రతు’ క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంతకం చేశారని ప్రభుత్వ అటార్నీ ఎడ్ మార్టిన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఈ అవకాశం దక్కిన వారిలో సిడ్నీ పావెల్, జాన్ ఈస్ట్మన్ అనే లాయర్లున్నారు. వీరితోపాటు 2020 ఎన్నికల్లో ట్రంప్ తరఫున నకిలీ ఓటర్లుగా మారిన రిపబ్లికన్ పార్టీకి చెందిన కనీసం డజను మంది ఉన్నారు. కాగా, ఈ క్షమాభిక్ష ట్రంప్నకు వర్తించదని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. -
ట్రంప్.. సౌండ్ పెంచుకోండి
న్యూయార్క్: న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై నిప్పులు చెరిగారు. వలసదారులపై సాగిస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటానని తేల్చిచెప్పారు. రాజకీయ వారసత్వానికి కాలం చెల్లిందని స్పష్టంచేశారు. తన ఎన్నికను అణచివేత, నిరంశకుత్వంపై విజయంగా, ఒక ఆశారేఖగా అభివర్ణించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చరిత్రాత్మక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని మమ్దాని ప్రస్తావించారు. చీకటి నుంచి వెలుగులోకి, పాత యుగం నుంచి కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం అర్ధరాత్రి బ్రూక్లిన్ పారామౌంట్లో మమ్దాని వేలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. భవిష్యత్తు మన చేతుల్లోని ఉందని అన్నారు. రాజకీయ వారసత్వాన్ని, రాజవంశాన్ని కూల్చేశామని చెప్పారు. మార్పు కోసం, కొత్త తరం రాజకీయాల కోసం న్యూయార్క్ సిటీ గొప్ప తీర్పు ఇచ్చిందని ప్రశంసించారు. నూయార్క్ను మన జీవనానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఈ తీర్పు వచ్చిందన్నారు. ప్రజలకు నిజాయతీగా సేవ చేసే ప్రభుత్వం కోసం తీర్పు లభించిందన్నారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య మమ్దాని ఇంకా ఏం మాట్లాడారంటే... అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం ‘‘ఈరోజు మీ ముందుకు రావడం గర్వంగా ఉంది. జవహర్లాల్ నెహ్రూ మాటలు గుర్తుచేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒక శకం ముగిసినప్పుడు.. పాత శకం నుంచి కొత్త శకం వైపు అడుగులు వేసినప్పుడు.. సుదీర్ఘకాలం అణచివేతకు గురైన ఒక జాతి ఆత్మ తన గళం వినిపించినప్పుడు.. చరిత్రలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. ఈరోజు పాత శకం నుంచి నూతన శకంలోకి ప్రవేశించాం. అందుకే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎవరూ అపార్థం చేసుకోకుండా స్పష్టంగా, సంకల్పంతో మాట్లాడుకుందాం. వలసదారులతోనే న్యూయార్క్ మరింత శక్తివంతంగా మారుతుంది. ఇకపై వలసదారుడే నగరానికి సారథ్యం వహించబోతున్నాడు. ఒక గొప్ప మార్పునకు మనం కలిసికట్టుగా నాంది పలుకుదాం. అణచివేతను ఎదుర్కొందాం. అంతులేని అధికారం అండతో వలసదారులపై పగబట్టిన డొనాల్డ్ ట్రంప్కు బుద్ధి చెబుదాం. డొనాల్డ్ ట్రంప్.. మీరు నా మాటలు వింటున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నాలుగు మాటలున్నాయి. అందుకే సౌండ్ పెంచుకోండి. ధనవంతులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఎందరో ట్రంప్లు ప్రజలను అడ్డం పెట్టుకొని అక్రమంగా పైకి ఎదిగారు. ట్రంప్ లాంటి బిలియనీర్లు పన్నులు ఎగవేశారు. పన్ను చట్టాలను ఉల్లంఘించారు. ఇకపై అవినీతి సంస్కృతిని అంతం చేస్తాం. కార్మిక, ప్రజా సంఘాలకు అండగా ఉంటాం. కార్మికుల రక్షణలు మరింత విస్తరింపజేస్తాం. కష్టపడి పనిచేసేవారికి తగిన హక్కులు ఉండాల్సిందే. ఏ జాతి వారైనా ప్రియమైనవారే.. రాజకీయ అంధకారం నుంచి న్యూయార్క్ను వెలుగులోకి నడిపిస్తాం. మేము ప్రేమించేవారందరికీ మేము తోడుగా ఉంటాం. వారు వలసదారులైనా, ట్రాన్స్జెండర్లయినా, ఏ జాతి వారైనా మాకు ప్రియమైనవారే. ఓ నల్లజాతి మహిళను ప్రభుత్వం ఉద్యోగం నుంచి డొనాల్డ్డ్ట్రంప్ అన్యాయంగా తొలగించారు. ఆ ఒంటరి మహిళ చాలా కష్టాలు పడుతూ బతుకు పోరాటం చేస్తోంది. అందుకే ప్రజల కష్టాలు మా కష్టాలుగానే భావిస్తాం. న్యూయార్క్లో అన్ని జాతులకూ సమానమైన ఆదరణ లభిస్తుంది. ఎవరిపైనా ఎలాంటి వివక్ష ఉండదు. నగరంలో ఇస్లామోఫోబియాకు స్థానం లేదు. ముస్లింలు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, విజయం సొంతం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యువకుడిని. వృద్ధుడిగా మారినా కూడా ముస్లింగానే ఉంటాను. నేనొక డెమొక్రటిక్ సోషలిస్ట్ను. ముస్లింను అయినందుకు క్షమాపణ చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకు నిరాకరిస్తున్నా. నన్ను గెలిపించినందుకు న్యూయార్క్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధూమ్ మచాలే ధూమ్ ఇలాంటి రోజు ఒకటి ఎప్పటికీ రాదని చాలామంది భావించారు. రాజకీయాలు చాలా క్రూరంగా మారాయని అనుకున్నారు. ఆశను కోల్పోయారు. అలాంటి భయాలకు న్యూయార్క్ నేడు సమాధానం చెప్పింది. ఆశారేఖ సజీవంగానే ఉంది. అసాధ్యం సుసాధ్యం అవుతుందని ప్రజలు విశ్వసించడం వల్లే మనం గెలిచాం. వచ్చే ఏడాది జనవరి 1న మేయర్గా బాధ్యతలు స్వీకరిస్తా. నా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నన్ను తీర్చిదిద్దింది వారే. నా భార్య రమా దువాజీకి కూడా కృతజ్ఞతలు’’ అని మమ్దాని పేర్కొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తల్లిదండ్రులు, భార్య అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ చిత్రం ‘ధూమ్’లోని ‘ధూమ్ మచాలే ధూమ్’ పాట మార్మోగిపోయింది. -
పాక్ చైనా అణుపరీక్షలు చేస్తున్నాయి
వాషింగ్టన్: దశాబ్దాల క్రితంనాటి తొలితరం అణుబాంబు ధాటికే హిరోషిమా, నాగసాకి నగరాలు తుడిచిపెట్టుకుపోయిన దారుణోదంతాలను చవిచూసిన ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో చెడువార్తను మోసుకొచ్చారు. గత ఒడంబడికలను బుట్టదాఖలుచేస్తూ ఇకపై తాము అణుపరీక్షలు చేపడతామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. తాము మాత్రమే అణుపరీక్షలు చేయట్లేమని, ఇప్పటికే పాకిస్తాన్, చైనా ఈ పని మొదలెట్టాయని ఆయన కొత్త విషయం చెప్పారు. సీబీసీ న్యూస్ ఛానల్ వారి నోరా ఓ డేనియల్ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు విషయాలను వెల్లడించారు. ‘‘ రష్యా అణు పరీక్షలు చేస్తోంది. చైనా తక్కువేం తినలేదు. అదికూడా అణుపరీక్షలు చేస్తోంది. ఈ విషయాన్ని అవి బహిరంగంగా చెప్పట్లేవు. మేం అలా కాదు. మేం అన్నీ చెప్పేస్తాం. అమెరికా సైతం అణుపరీక్షలు చేయబోతోంది. ఎందుకంటే వాళ్లంతా చేస్తున్నారుగా. ఉత్తర కొరియా ఇప్పటికే అణుపరీక్షలు చేసేసింది. పాకిస్తాన్ ఇప్పుడు చేస్తోంది’’ అని ట్రంప్ చెప్పారు. ‘‘ కొన్ని దేశాలు తమ అణు పరీక్షల వివరాలను బహిర్గతంచేయట్లేవు. ఆ అణుపరీక్షలు భూగర్భంలో జరుగుతున్నాయో. దాంతో అవి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో ఎవరికీ తెలీవు. కేవలం సూక్ష్మస్థాయిలో ప్రకంపనలు మాత్రమే వస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా పరీక్షలు జరపడం సబబే’’ అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమరి్థంచుకున్నారు. ‘‘అణ్వాయుధాలను తయారుచేశాక వాటిని పరీక్షించకుండా ఉంటే ఎలా? అవి పనిచేస్తున్నాయో లేదో తెలియాలంటే పరీక్షించాలి కదా. అయినా ఇతర దేశాలు అణుపరీక్షలు జరుపుతూ అణ్వ్రస్తాలను పెంచుకుంటున్నాయి. అమెరికా సైతం తగు నిల్వలను సముపార్జించాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్కు పొంచి ఉన్న ముప్పు చైనా, పాక్లు కొత్తగా అణుపరీక్షలు జరుపుతోందన్న ట్రంప్ వ్యాఖ్యలతో సరిహద్దున పొరుగుదేశంతో భారత్కు అణుముప్పు పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే భారత్ కంటే అత్యధికంగా చైనా వద్ద ఏకంగా 600 అణ్వాయుధాలు ఉన్నాయి. మరో ఐదేళ్లలో వీటి సంఖ్య 1,000కి చేరుకోనుంది. పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలున్నాయి. భారత్ వద్ద 180 అణువార్హెడ్లు ఉన్నాయి. అంతర్జాతీయ అధికారిక రికార్డ్ల ప్రకారం రష్యా 1990తర్వాత అణుపరీక్షలు జరపలేదు. చైనా 1996 తర్వాత, భారత్ 1998 మే తర్వాత అణుపరీక్షలు చేయలేదు. -
భారత్పై ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదం
న్యూఢిల్లీ: భారత్ సహా వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల పేరుతో చేస్తున్న ఆర్థిక దాడిని యోగా గురువు బాబా రాందేవ్ తప్పుబట్టారు. ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆర్థిక యుద్ధం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని పేర్కొన్నారు. ఎలాంటి ఆర్థిక యుద్ధానికైనా ‘స్వదేశీ’యే సరైన పరిష్కారమని రాందేవ్ తెలిపారు. మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద వంట మహనీయులు ఇదే విషయం చెప్పారన్నారు. ఆత్మ నిర్భరత, స్వయం సమృద్ధి, స్వావలంబన స్వదేశీకి కీలకమన్నారు. అమెరికా అవలంభిస్తున్న విస్తరణ, సామాజ్రావాద ధోరణుల నేపథ్యంలో దేశీయంగా తయారైన ఉత్పత్తులు, వస్తువులను కొనడం ద్వారా అందరం అభివృద్ధి చెందుతామన్నారు. -
ట్రంప్, జిన్పింగ్ స్నేహగీతం
సియోల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ ఆరేళ్ల తర్వాత ముఖాముఖి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై దాదాపు రెండు గంటలపాటు చర్చించుకున్నారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనడానికి దక్షిణ కొరియాకు చేరుకున్న ఇరువురు నేతలు గురువారం బుసాన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైనా ఉత్పత్తులపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అలాగే అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేయడానికి చైనా అంగీకరించింది. మొత్తానికి అమెరికా, చైనాల మధ్య స్నేహ సంబంధాలకు ట్రంప్–జిన్పింగ్ భేటీ అద్దం పట్టింది. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని అమెరికాకు తిరిగివెళ్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. జిన్పింగ్తో ముఖాముఖి సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అన్నారు. మాదక ద్రవ్యాల(ఫెంటానిల్) తయారీకి అవసరమైన రసాయనాలు విక్రయిస్తున్నందుకు శిక్షగా చైనాపై ఈ ఏడాది మొదట్లో విధించిన 20 శాతం టారిఫ్లను 10 శాతానికి తగ్గించబోతున్నట్లు తెలిపారు. దీంతో చైనాపై మొత్తం టారిఫ్లు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గిపోనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్లో తాను చైనాలో పర్యటించబోతున్నట్లు ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత జిన్పింగ్ సైతం అమెరికాకు రాబోతున్నారని వెల్లడించారు. మరిన్ని అడ్వాన్స్డ్ కంప్యూటర్ చిప్లను చైనాకు ఎగుమతి చేయడంపై జిన్పింగ్తో చర్చించానని అన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకం చేయబోతున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ విషయంలో పెద్దగా అవరోధాలేవీ లేవన్నారు. టిక్టాక్ సమస్యను పరిష్కరించుకుంటాం: చైనా ట్రంప్, జిన్పింగ్ భేటీలో టిక్టాక్ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు. టిక్టాక్ యజమాన్యాన్ని చైనా నుంచి అమెరికాకు బదిలీ చేయాలని ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. టిక్టాక్ను అమెరికా సంస్థకు అప్పగించాలని చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నారు. చైనా యాజమాన్యంలో ఉంటే అమెరికాలోని యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని అంటున్నారు. దీనికి చైనా అంగీకరించడం లేదు. అమెరికాతో నెలకొన్న టిక్టాక్ సమస్యను కచి్చతంగా పరిష్కరించుకుంటామని చైనా వాణిజ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై అమెరికాతో చర్చిస్తామని పేర్కొంది. మరోవైపు అమెరికాలో టిక్టాక్ను కొనసాగించేలా చైనాతో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం సంకేతాలిచి్చంది.అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతులు అమెరికా నుంచి ప్రతిఏటా 25 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ దిగుమతి చేసుకోవడానికి చైనా అంగీకరించింది. ఈ మేరకు ట్రంప్, జిన్పింగ్ చర్చల్లో ఒప్పందం కుదిరినట్లు అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఈ ఒప్పందం వచ్చే మూడేళ్లపాటు అమల్లో ఉంటుందన్నారు. ఈరోజు నుంచి వచ్చే ఏడాది జనవరి దాకా చైనా 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలు చేయనుందని తెలిపారు. దీనివల్ల అమెరికా రైతులకు లబ్ధి చేకూరుతుందని బెసెంట్ వివరించారు. -
చమురు కొనుగోళ్లకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాం
న్యూఢిల్లీ: రష్యన్ చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ తన ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు మరిన్ని కొత్త మార్గాలను అన్వేíషింంచనుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైస్వాల్ గురువారం ప్రకటించారు. రష్యాలో ప్రభుత్వరంగ అతిపెద్ద చమురు సంస్థ రోస్నెఫ్ట్తోపాటు అక్కడి అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ లక్ఆయిల్లపై ఆంక్షల కొరడా ఝలిపించామని దక్షిణకొరియాలో ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే భారత్ స్పందించడం గమనార్హం. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఈ సంస్థల నుంచి తక్కువ ధరకు చమురుకొనే బదులు ఇదే రేట్లకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయగల అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకుంటూ అమెరికా పెట్రోలియం ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోబోందన్న వార్తల నడుమ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ స్పందించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ ఇంకా చర్చలు జరుపుతోందని గుర్తుచేశారు. అయితే గత నెలలతో పోలిస్తే తాజాగా రష్యన్ సంస్థల నుంచి భారత చమురు కొనుగోళ్లు తగ్గినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఛాబహార్ పోర్ట్ విషయంలో ఊరట ఇరాన్లోని కీలక ఛాబహార్ ఓడరేవు నుంచి అంతర్జాతీయ నౌకల రాకపోకలపై అమెరికా విధించిన ఆంక్షలను భారత్ కోసం కొద్దికాలం పక్కనబెట్టింది. ఆరు నెలలపాటు ఆంక్షల నుంచి భారత్ను మినహాయింపునిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మినహాయింపు అక్టోబర్ 29వ తేదీ నుంచి మొదలవుతుందని జైస్వాల్ చెప్పారు. అంతర్జాతీయంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో తనకు ప్రతికూలంగా మారొద్దనే అక్కసుతో అమెరికా ఈ ఓడరేవుపై సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ఆంక్షలు విధించడం తెల్సిందే. అయితే భారత అభ్యర్థనతో ఆ ఆంక్షల అమలును నెలరోజులు వాయిదా వేశారు. తాజా చర్చలతో దానిని మరో ఆరునెలలు పొడిగించారు. ఛాబహర్ పోర్ట్ను అనుసంధానత, సత్సంబంధాలే లక్ష్యంగా భారత్, ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధిచేశాయి. -
యుద్ధం ఆపానన్న ట్రంప్తో మోదీ వాదనలో గెలవలేరు
షేక్పురా(బిహార్): ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వాదనలకు అడ్డుకట్ట వేసే ధైర్యం ప్రధాని మోదీకి అస్సలు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. బిహార్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా గురువారం నలంద, షేక్పురాలో సభలో రాహుల్ ప్రసంగిస్తూ మోదీపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ‘‘తన కారణంగానే భారత్, పాక్ యుద్ధం ఆగిందని ఇప్పటికే ఎన్నో సార్లు ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై డప్పు కొట్టారు. ఆయన ప్రకటనలను ప్రధాని మోదీ కనీసం అడ్డుకునే సాహసం చేయట్లేరు. మీరు మాట్లాడేది అబద్ధం అని మాట వరసకు కూడా ట్రంప్కు చెప్పే ధైర్యం మోదీకి లేదు. ఇటీవల కాలంలో మోదీ అమెరికాకు వెళ్లాల్సింది. కానీ ట్రంప్ భయానికే ఆయన అమెరికా వైపు కన్నెత్తి చూడట్లేరు. నిజంగానే మోదీకి అంతటి ధైర్యం ఉంటే బిహార్ ఎన్నికల ర్యాలీల్లో యుద్ధం ఆపింది ట్రంప్ కానేకాదు అని మోదీ కరాఖండీగా ప్రకటించాలి’’అని రాహుల్సవాల్ విసిరారు. ధైర్యశాలి ప్రధాని అంటే మా నాన్నమ్మే ‘‘నిజానికి ప్రధాని అంటే ఎంతటి ధైర్యశాలిగా ఉండాలో మా నాన్నమ్మ, నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడితో ఇందిర సూటిగా ‘మాకు మీరంటే ఏమాత్రం భయంలేదు’అని ముఖం మీదే చెప్పేశారు. ఆమె తెగింపు గల నాయకురాలు’’అని ఇందిరను రాహుల్ గుర్తుచేసుకున్నారు. బిహార్లో భూములు అందుబాటులో లేవన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘బడా పారిశ్రామిక సంస్థకు చవగ్గా భూములు అమ్మేస్తూ పోతే ఇక భూముల లభ్యత ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు. -
నేడు డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ సమావేశం
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ గురువారం దక్షిణ కొరియాలో సమావేశం కాబోతున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ బుధవారం వెల్లడించారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ ఇప్పటికే దక్షిణ కొరియాకు చేరుకున్నారు. దక్షిణ కొరియాలోని బుసాన్ సిటీలో ట్రంప్, జిన్పింగ్ భేటీ కాబోతున్నారు. అమెరికా–చైనా సంబంధాల్లో స్థిరమైన పురోగతికి నూతన వేగాన్ని కల్పిచేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని తాము అంచనా వేస్తున్నట్లు జియాకున్ తెలియజేశారు. సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షీ జిన్పింగ్తో ముఖాముఖి భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
మోదీ గొప్ప వ్యక్తి.. కిల్లర్
టోక్యో/సియోల్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన వాచాలత్వం ప్రదర్శించారు. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మోదీ చాలా మంచి మనిషి, చక్కగా, అందంగా కనిపించే నాయకుడు అంటూనే ఆయనొక కిల్లర్, నరకం లాంటి కఠినమైన వ్యక్తి అంటూ ఆక్షేపించారు. మనం ఎలాంటి మంచి తండ్రి కావాలని కోరుకుంటామో సరిగ్గా అలా కనిపించే వ్యక్తి మోదీ అంటూ వ్యాఖ్యానించారు. మూడు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం జపాన్ నుంచి దక్షిణ కొరియాకు చేరుకున్నారు. గెయింగ్జూలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార(అపెక్) సీఈఓ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఆయన గొప్ప మిత్రుడు అంటూ ప్రశంసించారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, అందుకోసం వాణిజ్యం అనే అస్త్రం ప్రయోగించానని మరోసారి వెల్లడించారు. భారత్–పాక్ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత మోదీతో ఫోన్లో మాట్లాడానని, మీతో వాణిజ్య ఒప్పందం చేసుకొనే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పానని వివరించారు. పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభించారంటూ మోదీని మందలించానని అన్నారు. వాణిజ్య ఒప్పందం ఉండదని కచ్చితంగా చెప్పడంతో భారత్ దారికొచ్చిందని, పాక్పై దాడులు నిలిపివేసిందని స్పష్టంచేశారు. కొత్త, అందమైన యుద్ధ విమానాలు ధ్వంసం దక్షిణ కొరియాకు బయలుదేరడానికి ముందు ట్రంప్ జపాన్ రాజధాని టోక్యోలో వ్యాపారవేత్తలతో విందు కార్యక్రమంలో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేశానని చెప్పారు. ఆపరేషన్ సిందూర్లో భారత్కు నష్టం వాటిల్లిందని పరోక్షంగా స్పష్టంచేశారు. ‘‘ఏడు నూతన, అందమైన యుద్ధ విమానాలు నేలకూలాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన యుద్ధంలో అవి ధ్వంసమయ్యాయి’’ అని తెలిపారు. -
రష్యా చమురుకు భారత్ రాం రాం!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా ఆపేయాలని భారత్పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే మాట మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా తగ్గిస్తోందని తెలిపారు. చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గిస్తోందని చెప్పారు. శనివారం తన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మలేషియా వెళ్లూ మార్గమధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణకొరియాలో జరుగనున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (అపెక్) సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశమై నప్పుడు రష్యా చమురు గురించి కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపాపనని మరోసారి చెప్పుకున్నారు. ‘భారత్–పాక్ యుద్ధంతోపాటు మరికొన్ని యుద్ధాలను ఆపటం చాలా కష్టమని, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపటం చాలా తేలిక అని నేను భావించాను. కానీ, నా అంచనా తప్పింది. భారత్–పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు నేను చేయాల్సిందంతా చేశాను. రష్యా– ఉక్రెయిన్ విషయంలో కూడా అదే వ్యూహం అమలుచేశాం. కానీ, ఆ రెండు దేశాధినేతల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పరస్పరం తీవ్రంగా అసహ్యించుకుంటారు’అని ట్రంప్ తెలిపారు. -
స్వేచ్ఛా వాణిజ్యం బలోపేతం
ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనిశి్చత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్లో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. కౌలాలంపూర్/న్యూఢిల్లీ: ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియాన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టిసారించింది. ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు, ప్రగతికి భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతోందని మోదీ వ్యాఖ్యానించారు. మలేసియాలోని కౌలాలంపూర్ నగరంలో ఆదివారం ప్రారంభమైన ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెను ముప్పుగా పరిణమించిందని, దీనిని ఎదుర్కొనేందుకు అందరం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ అన్నారు. ఆసియాన్–ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్(ఏఐటీఐజీఏ)ను వీలైనంత త్వరగా సమీక్షించాలని మోదీ అభిలషించారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఏఐటీఐజీఏ ఒప్పందం 15 ఏళ్ల క్రితం అమల్లోకి వచి్చంది. ఇప్పుడు భారత్–ఆసియాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమైతే ఇరు దేశాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. ప్రాంతీయ సహకారం సైతం ఇనుమడిస్తుంది’’అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ఆసియాన్, భారత్ల ఆర్థిక ప్రగతికి బాటలువేసే కీలకమైన సుస్థిర పర్యాటకంపై ఇరువర్గాలు ఒక ప్రకటన విడుదలచేశాయి. ‘‘ఇండో–పసిఫిక్లో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) కూటమికి భారత్ గట్టి మద్దతుదారుగా నిలుస్తోంది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం(2026–2030) అమలు కోసం ఆసియాన్–భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్కు మద్దతు పలుకుతున్నాం. త్వరలో రెండో ఆసియాన్–భారత్ రక్షణ మంత్రుల సమావేశం, రెండో ఆసియాన్–భారత్ నౌకావిన్యాసాలు జరుపుదాం’’అని మోదీ అన్నారు. నాలుగో వంతు మనమే ‘‘విశ్వమానవాళిలో నాలుగో వంతు జనాభాకు భారత్, ఆసియాన్ దేశాలే ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. జనాభాను మాత్రమే కాదు మనం అత్యంత చరిత్రాత్మకమైన ఒప్పందాలు, విలువల బంధాలతో పెనవేసుకుపోయా. గ్లోబల్ సౌత్లో మనం కలిసి ముందడుగువేస్తున్నాం. కేవలం వాణిజ్య భాగస్వాములం కాదు సాంస్కృతిక సహచరులం. భారత్ అవలంభిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ అనేది పునాదిరాయి. ఆసియాన్ లక్ష్యాలకు, ఇండో–పసిఫిక్ విషయంలో ఆసియాన్ వైఖరికి భారత్ ఎల్లవేళలా పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతోంది. ఒడిదుడుకుల కాలంలోనూ భారత్–ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది సుస్థిరాభివృద్ధిని కొనసాగించింది. ఈ బలమైన బంధమే యావత్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి, ప్రగతికి కొత్త అంకురార్పణ చేస్తోంది. భారత్, ఆసియాన్ రెండూ విద్య, పర్యాటకం, శాస్త్రసాంకేతిక, ఆరోగ్య, శుద్ధ ఇంధనం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో మరింత బలమైన పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటున్నాయి. ఇకమీదట సైతం సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకునేందుకు కలిసి పనిచేస్తాం. భారత, ఆసియాన్ ప్రజల మధ్య సత్సంబంధాలను పెంచుతాం. ఇందుకోసం భుజం భుజం కలిపి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉంది. ఆసియాన్ పవర్ గ్రిడ్ కార్యక్రమం కోసం 400 నిపుణులకు పునరుత్పాదక ఇంధన రంగంలో శిక్షణనిప్పిస్తాం ’’అని మోదీ అన్నారు. సవాళ్లు ఎదురవుతున్నా.. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా డిజిటల్ సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత, సరకు రవాణా గొలుసు వంటి అంశాల్లో ఆసియాన్ దేశాలు సమష్టిగా పోరాడుతూ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తమైన ‘సమ్మిళిత సుస్థిరత’భావనను శిఖరాగ్రాలపై నిలిపాయి. ఆసియాన్ దేశాల ప్రాధాన్యతలను మద్దతు పలుకుతూనే ఆసియాన్ దేశాలను ఇలాగే సమష్టిగా కలిపి ఉంచేందుకు భారత్ కృషిచేస్తుంది. ఆపత్కాలంలో ఆసియాన్ దేశాలను ఆదుకునేందుకు భారత్ సదా ఆపన్నహస్తం అందించింది. మనవతా సాయం, విపత్తు సాయం, సముద్రయాన భద్రత, సాగరసంబంధ వాణిజ్యాభివృద్ధికి భారత్ అండగా నిలబడుతుంది. 2026 ఏడాదిని ‘ఆసియాన్–భారత్ సముద్ర సహకార సంవత్సరం’గా ప్రకటిస్తున్నాం’’అని మోదీ చెప్పారు. -
ట్రంప్ విషయంలో అదే నిజమైంది.. అధ్యక్ష పోటీపై స్పందించిన కమలా హారిస్
వాష్టింగన్: అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా ఏదో ఒకరోజు అమెరికాకు అధ్యక్షురాలిని కావచ్చు అని అన్నారు. భవిష్యత్తులో శ్వేతసౌధంలో ఓ మహిళా అధ్యక్షురాలు ఉంటుందన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై అమెరికన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజాగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష పదవి కోసం నేను మరోసారి పోటీచేసే అవకాశం లేకపోలేదు. నా మనవరాళ్లు వారి జీవితకాలంలో కచ్చితంగా ఓ మహిళా అధ్యక్షురాలిని చూస్తారు. బహుశా అది నేనే కావచ్చు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ విషయమై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను. వాస్తవానికి నేను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. నా కెరీర్ మొత్తాన్ని దేశ సేవలో గడిపాను. అది నా రక్తంలో ఉంది అని చెప్పుకొచ్చారు.Kamala Harris tells the BBC that she may “possibly” run for president again:“I am not done. I have lived my entire career a life of service and it’s in my bones. There are many ways to serve. I have not decided yet what I will do in the future beyond what I am doing right now.” pic.twitter.com/96QUWYYQkj— Pop Crave (@PopCrave) October 25, 2025ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనపై స్పందిస్తూ..‘ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ గురించి తాము చేసిన హెచ్చరికలు నిజమే అని ఇప్పుడు నిరూపితం అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఫాసిస్ట్లా ప్రవర్తిస్తారని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతారని మేము ముందే చెప్పాం. మా అంచనా నిజమైంది. ట్రంప్ న్యాయశాఖను ఆయుధంగా మలచుకుంటానని చెప్పారని, ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు’ అని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి నిర్వహించిన పోల్స్లో డెమోక్రట్ల తరఫున ఆశావహుల రేసులో కమలా హారిస్ వెనుకంజలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా, తాను వాటిని పట్టించుకోనని తెలిపారు. ఒకవేళ ఇలాంటి పోల్స్ను పట్టించుకొని ఉంటే, తాను గత ఎన్నికల్లో పోటీపడేదాన్నే కాదని తెలిపారు. ఇక, గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి తరఫున కమల పోటీచేసిన విషయం తెలిసిందే. -
ట్రంప్ నోట మళ్లీ చమురు మాట
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ఇస్తున్న డబ్బులతోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తోందని ఆయన మండిపడుతున్నారు. ఈ కొనుగోళ్లను ఆపేయాల్సిందేనని అంటున్నారు. అదే విషయం మరోసారి స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆ దిగుమతులు దాదాపు సున్నాకు పడిపోతాయని పేర్కొన్నారు. అంటే కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనకుండా చైనాను ఒప్పించడానికి ప్రయతి్నస్తానని ట్రంప్ తెలిపారు. భారత్ బాటలో చైనా కూడా నడిస్తే బాగుంటుందని సూచించారు. ఆయన బుధవారం వైట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్ననే ఫోన్లో మాట్లాడాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయడానికి భారత్ అంగీకరించింది. అయితే, హఠాత్తుగా ఆపేయలేరు కాబట్టి కొంత సమయం పడుతుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయి. భారత్ గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది’’అని ఉద్ఘాటించారు. రష్యా చమురు విషయంలో ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. భారత్, చైనాలు రష్యాకు ఇచ్చే డబ్బులు ఆగిపోతే ఉక్రెయిన్లో యుద్ధం ఆగుతుందని ఆయన తరచుగా చెబుతున్నారు. ఈ యుద్ధానికి ఆ రెండు దేశాలే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయని మండిపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు బంద్ చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని భారత్ ఖండించింది. మోదీ అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని తేల్చిచెప్పింది. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో మరో ఉద్దేశం లేదని వెల్లడించింది. తన మాట లెక్కచేయనందుకు భారతదేశ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. త్వరలో చైనా అధినేత షీ జిన్పింగ్తో సమావేశం కాబోతున్నానని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో చర్చిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అది చమురు గానీ, ఇంధనం గానీ, ఇంకేదైనా గానీ రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తన ప్రతిపాదనల పట్ల జిన్పింగ్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని వివరించారు. -
రష్యా ముడి చమురుకు కత్తెర
వాషింగ్టన్: భారతీయులతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్, అమెరికాల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని మోదీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో మంగళవారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు. సంప్రదాయ చమురు దీపాన్ని స్వయంగా వెలిగించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం అధికంగా ముడిచమురు కొనుగోలు చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా చమురు విషయంలో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలును పూర్తిగా ఆపేస్తామంటూ భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పరిమితంగానే కొనుగోలు చేస్తుందంటూ తాజాగా వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీపావళి వేడుకల్లో ఆహా్వనితులను ఉద్దేశించి ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ ‘‘మీ ప్రధానమంత్రి మోదీతో ఇప్పుడే మాట్లాడాను. మా మధ్య చక్కటి సంభాషణ జరిగింది. వాణిజ్యం సహా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆ అంశంపై మోదీకి ఎక్కువ ఆసక్తి ఉంది. మోదీ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన నాకు చాలాఏళ్లుగా మంచి మిత్రుడు. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం. భారత్–పాకిస్తాన్ సంబంధాలపైనా మోదీతో చర్చించాను. పాకిస్తాన్తో యుద్ధాలు వద్దన్న అభిప్రాయం మా సంభాషణలో వ్యక్తమైంది. భారత్, పాకిస్తాన్లతో అమెరికాకు ఎలాంటి యుద్ధాలు, విభేదాలు లేకపోవడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. కీలక ఒప్పందాలపై కలిసి పని చేస్తున్నాంవైట్హౌస్ వేడుకల అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారతీయులను ఎంతగానో అభిమానిస్తున్నానని చెప్పారు. మోదీతో ఫోన్లో మాట్లాడానని, ఆయనతో తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారత్ అధికంగా(టూ మచ్) ముడి చమురు కొనుగోలు చేయబోదని ఉద్ఘాటించారు. కొన్ని కీలక ఒప్పందాలపై భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని వివరించారు. తనలాగే మోదీ కూడా ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవడాన్ని కళ్లారా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ భారీగా కత్తెర వేస్తుందని తాను భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చాలావరకు తగ్గిపోవడం తథ్యమని అన్నారు. ముడిచమురు దిగుమతుల తగ్గింపు ప్రక్రియ చాలాకాలం కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు ఎంతగానో తోడ్పాడు అందిస్తున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలకు భారత్–అమెరికన్లు సారథ్యం వహిస్తున్నారని, వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అదే మనకు దారిదీపం వైట్హౌస్లో దీపావళి పండుగకు అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్, మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మోహ్రోత్రా, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, అమెరికాలో భారత రాయబారి వినయ్మోహన్ క్వాత్రా, ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ దీపావళి సందేశాన్ని విడుదల చేశారు. ‘‘చీకటిపై వెలుగు విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపం వెలిగిస్తున్నాం. దీపావళి సమయంలో ప్రాచీన గాథలను గుర్తుచేసుకోవాలి. శత్రువులు పరాజయం పాలైన, అవరోధాలు తొలగిపోయిన, సామాన్యులకు విముక్తి లభించిన గాథలను మనం తెలుసుకోవాలి. నిండుగా వెలుగులు విరజిమ్ముతున్న దీపం మనకు దారి చూపిస్తుంది. జ్ఞానమార్గంలో నడవాలని, శ్రద్ధతో పనిచేయాలని, మనకు లభించే ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేయాలని బోధిస్తుంది’’ అని ట్రంప్ వివరించారు. మోదీకి ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు ఫోన్ చేసి మాట్లాడి, దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు కలిసికట్టుగా పనిచేయాలని, ప్రపంచాన్ని వెలిగిస్తూనే ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదంపై భారత్, అమెరికాలు ఉమ్మడిగా పోరాటం చేయాలన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్, మోదీ సంభాషణలో పాకిస్తాన్ ప్రస్తావన రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ట్రంప్ రాజు కాదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జనం తిరుగుబాటు ప్రారంభించారు. ‘నో కింగ్స్’ పేరిట శనివారం దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రంప్కు వ్యతిరేకంగా గళమెత్తారు. ట్రంప్ రాజు కాదని, ఇక్కడ రాజులెవరూ లేరని, నిరంకుశ పరిపాలన ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దేశాన్ని నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. నియంతృత్వ పరిపాలనను ప్రతిఘటించడం, నిరసన తెలపడమే అసలైన దేశభక్తి అని ప్రజలు తేల్చిచెప్పారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్తోపాటు బోస్టన్, అట్లాంటా, షికాగో తదితర నగరాల్లో నిరసనకారులు కదం తొక్కారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్ సహా వివిధ నగరాల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. గాలితో నింపిన దుస్తుల్లాంటివి ధరించారు. అమెరికా రాజ్యాంగ ప్రవేశికను ముద్రించిన బ్యానర్లపై సంతకాలు చేశారు. తాము ముమ్మాటికీ అసలైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. నియంతగా మారుతున్న ట్రంప్ నిరసన ప్రదర్శనలపై అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అవన్నీ ‘అమెరికాను ద్వేషించే’ ర్యాలీలు అంటూ ఆరోపించింది. ట్రంప్ మద్దతుదారులు సైతం ఈ ర్యాలీలను తప్పుపట్టారు. ట్రంప్కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా జనం సామూహికంగా నిరసన తెలపడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కొన్నిరోజుల క్రితం అమెరికాలో షట్టౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సేవలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రంప్ నిర్వాకం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని వారు మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుపట్టారు. నిరంకుశ అధికారం చెల్లబోదని తేల్చిచెప్పారు. ట్రంప్ విధానాలు తమకు ఎంతమాత్రం నచ్చడం లేదని ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికురాలు షాన్ హోవార్డ్ చెప్పారు. తాను గతంలో ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ముందుకెళ్తోందని, వలసదారులను అక్రమంగా నిర్బంధించడం ఏమిటని మండిపడ్డారు. ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహరించడం సరైంది కాదన్నారు. ఇదంతా ‘అన్–అమెరికన్’ అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ నియంతగా మారిపోతున్నారని మరో నిరసనకారుడు ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, నిరసన కార్యక్రమాల విషయంలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలియజేశారు. జెట్ విమానంలో ‘కింగ్ ట్రంప్’ తనకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ‘నో కింగ్స్’ నినాదాన్ని హేళన చేస్తూ కింగ్ ట్రంప్ పేరిట ఒక కృత్రిమ మేధ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో కిరీటం ధరించిన ట్రంప్ జెట్ విమానంలో కూర్చొని దూసుకెళ్తున్నారు. బాంబుల తరహాలో ఈ విమానం బురదను చిమ్ముతోంది. ఆ బురదంతా అమెరికాలో నగరాల్లోని నిరసనకారులను కమ్మేస్తోంది. ట్రంప్ తనను తాను బలమైన రాజుగా పరోక్షంగా ప్రకటించుకున్నారు. నిరసన ర్యాలీలను లెక్కచేయబోనని, బురదతో సన్మానిస్తానని సంకేతాలు పంపించారు. -
పాక్–ఆఫ్గాన్ యుద్ధాన్ని చిటికెలో ఆపగలను: ట్రంప్
వాషింగ్టన్: పాకిస్తాన్–ఆఫ్గనిస్తాన్ మధ్య పెరుగు తున్న ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందించారు. ఆ రెండు దేశాల మధ్య ఘ ర్షణను ఆపటం తనకు చిటికెలో పని అని తెలి పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పాకిస్తాన్పై జరుగుతున్న దాడి, ఆఫ్గని స్తాన్పై పాక్ జరుపుతున్న దాడి గురించి నాకు అర్థమవుతోంది. నేను గనుక పరిష్కరించాలని అనుకుంటే ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపటం చాలా తేలిక. ప్రజలను చంపే ఘర్షణలను ఆపటం అంటే నాకు చాలా ఇష్టం. నేను లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడాను. ఈ యుద్ధాన్ని ఆపటంలో కూడా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’అని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా పాక్–ఆఫ్గాన్ మధ్య సైనిక ఘర్ష ణ జరుగుతున్న విషయం తెలిసిందే. -
ఎక్కడిదక్కడే ఆపేయండి
వాషింగ్టన్: సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని రెండు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఇంతవరకు జరిగిన రక్తపాతం చాలని, ఇకనైనా ఎక్కడిదక్కడే ఆపేసి రెండు దేశాలు వెనక్కు తగ్గాలని సూచించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ శుక్రవారం (స్థానిక కాలమానం) మధ్యాహ్నం ట్రంప్ సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య దాదాపు రెండుగంటలపాటు చర్చలు జరిగాయి. అనంతరం తన సొంత సోషల్మీడియా కంపెనీ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. ‘వారు ఎక్కడిదక్కడే ఆపేయాలి. ఇద్దరూ ఎవరికి వారే యుద్ధంలో గెలిచినట్లు ప్రకటించుకోవచ్చు. అసలు విషయాన్ని చరిత్రకు వదిలేద్దాం’అని పేర్కొన్నారు. ఇక ఇళ్లకు వెళ్లండి యుద్ధాన్ని ఆపేసి ఇరుపక్షాలు చర్చలకు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. వారాంతపు సెలవులు గడిపేందుకు ఫ్లోరిడాకు వచి్చన ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఎక్కడికైనా యుద్ధక్షేత్రంలోకి వెళ్లి చూడండి. అంతటా తీవ్రమైన పరిస్థితులే. యుద్ధాన్ని ఎక్కడిదక్కడే ఆపేసి ఇరుపక్షాలు ఇళ్లకు వెళ్లిపోండి. కుటుంబాలతో గడపండి. హత్యలు ఆపండి. ఇరుపక్షాలు ఈ పనిచేయటం మంచిది’అని పేర్కొన్నారు. యుద్ధ విరమణపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ గురువారం ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయతి్నస్తున్న ట్రంప్.. గతంలో జెలెన్స్కీని తీవ్రంగా విమర్శించగా, తాజాగా పుతిన్పై బెదిరింపులకు దిగుతున్నారు. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూభాగాలను వదిలేసి వెనక్కు వెళ్లాలని హెచ్చరించారు. వెనక్కు తగ్గకుంటే ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి అత్యాధునిక తొమహాక్ క్షిపణులు అందిస్తానని రష్యాను హెచ్చరించిన ఆయన.. తాజాగా మాట మార్చి రష్యాను బెదిరించేందుకే అలా చెప్పానని, ఆ క్షిపణులు ఉక్రెయిన్కు అవసం లేదని ఎన్బీసీకి ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యుద్ధం ఆపాలన్న ట్రంప్ ప్రకటనను జెలెన్స్కీ స్వాగతించారు. కాల్పుల విరమణ ప్రకటించి, చర్చలు జరిపేందుకు ఇదే తగిన సమయమని పేర్కొన్నారు. -
ఇక ఉక్రెయిన్–రష్యాపైనే దృష్టి: ట్రంప్
వాషింగ్టన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి తెరదించానని, బందీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక తన మొత్తం దృష్టిని ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే కేంద్రీకరించినట్లు తెలిపారు. రష్యాను చర్చల వేదికపైకి రప్పించడానికి ఉక్రెయిన్కు లాంగ్–రేంజ్ ఆయుధాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు. రష్యా దాడులను తిప్పికొట్టడానికి దీర్ఘశ్రేణి క్షిపణులు ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యం ఎప్పటినుంచో అమెరికాను కోరుతోంది. ట్రంప్ బుధవారం శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానన్న విశ్వాసం ఉందన్నారు. శాంతి చర్చల కోసం ముందుకు రావాలని రష్యా అధినేత పుతిన్కు సూచించారు. లేకపోతే మరింత ఒత్తిడి పెంచక తప్పదని తేల్చిచెప్పారు. మాట వినకపోతే మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారు. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపేస్తానని గత ఏడాది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలవుతున్నా ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. -
మోదీ మాటిచ్చారు..!
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడిచమురు కొనుగోలు చేస్తుండడం పట్ల చాలా రోజులుగా అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ తన మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని నిలిపివేసే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా ఉక్రెయిన్పై దండయాత్ర ఆగిపోతుందని ఉద్ఘాటించారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండడం తమకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆర్థికంగా మేలు జరుగుతోందని, అంతిమంగా ఆ సొమ్మంతా ఉక్రెయిన్పై యుద్ధానికే ఖర్చవుతోందని తెలిపారు. ఎవరైనా సరే రష్యాకు ఆర్థికంగా సాయం అందించడం మానుకోవడం మంచిదని హితవు పలికారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న మతిలేని యుద్ధంలో లక్షల మంది బలైపోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తామంటూ ఈరోజు తన మిత్రుడు మోదీ మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఇక చైనా సైతం అదే దారిలో నడుస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలియజేశారు. చైనా ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమ తి చేసుకోవడం ఆపేస్తే మంచిదని సూచించారు. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ ప్రశంసించారు. తానంటే మోదీకి ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రేమ అనే పదాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. మోదీ రాజకీయ జీవితానికి ఇబ్బందులు సృష్టించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘భారత్ను చాలా ఏళ్లుగా గమనిస్తున్నా. అదొక నమ్మశక్యంకాని దేశం. ప్రతి సంవత్సరం ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వస్తుంటారు. కొందరైతే కొన్ని నెలలపాటే ఉండొచ్చు కూడా. కానీ, నా స్నేహితుడు మోదీ చాలాఏళ్లుగా వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ ఆయన నాకు మాట ఇచ్చారు. నిజంగా నాకు తెలియదు గానీ అదొక బ్రేకింగ్ స్టోరీ కావొచ్చు! మోదీ వెంటనే ఆ పని చేయకపోవచ్చు. నా అంచనా ప్రకారం కొంత సమయం పట్టొచ్చు. కానీ, త్వరలోనే ఆ ప్ర క్రియ పూర్తవుతుంది. ఉక్రెయిన్పై యుద్ధం ముగిసిన తర్వాత రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాక్ను అనబోయి..భారత్లో ఏడాదికొక పాలకుడు అధికారంలోకి వస్తాడంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ పరిస్థితిని ట్రంప్ పొరపాటున భారత్కు అన్వయించి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగతోంది. ట్రంప్ మానసిక ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయని జనం పోస్టులు చేస్తున్నారు. నిజానికి భారత్లో ఏడాదికొక ప్రధానమంత్రి మారిపోయిన సందర్భాలు లేవు. పాకిస్తాన్లోనే అలాంటి పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.అంతా అబద్ధం‘మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరగలేదు’ రష్యా చమురు విషయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ గురువారం ఖండించింది. బుధవారం మోదీ, ట్రంప్ మధ్య ఫోన్లో ఎలాంటి సంభాషణ జరగలేదని తేల్చిచెప్పింది. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేసింది. దేశ అవసరాలు, ప్రయోజనాల కోణంలోనే రష్యా నుంచి ముడిచమురు కొంటున్నామని, ఇందులో మరో మాటకు తావులేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఇంధన విధాన నిర్ణయాలకు స్థిరమైన ధరలు, నిరంతరాయమైన సరఫరానే పతిప్రాదిక అని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన దిగుమతుల్లో మార్పులుచేర్పులు చేసుకుంటున్నామని ఉద్ఘాటించింది. ఇంధన వనరుల్లో వైవిధ్యం కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది. ట్రంప్ను చూస్తే మోదీకి భయం: రాహుల్ న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను మోదీ అమెరికాకు ఔట్సోర్సింగ్కు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పాలనలో విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ మిత్రుడు మోదీ మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించడంపై రాహుల్ గురువారం తీవ్రంగా స్పందించారు. రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని, ప్రకటనలు చేసే అధికారాన్ని ట్రంప్కు మోదీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ వల్ల తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ అభినందన సందేశాలు పంపిస్తున్నారని ప్రధానమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. భారత ఆర్థిక శాఖ మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే విషయంలో ఈజిప్టులోని షెర్మ్ ఎల్–õÙక్లో జరిగిన భేటీకి ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందంటూ డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ నిలదీశారు. -
యుద్ధం ఆపకుంటే ఉక్రెయిన్కు తొమహాక్లు ఇస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్తో సుదీర్ఘకాలంగా చేస్తున్న యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపకుంటే తాము ఉక్రెయిన్కు అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణులైన తొమహాక్లు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్కు వెళ్తూ తన విమానం ఎయిర్ఫోర్స్ వన్లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘ఈ యుద్ధానికి ముగింపు పలకకుంటే నేను వారికి (ఉక్రెయిన్) తొమహాక్లు అందజేస్తాను. తొమహాక్లు చాలా ప్రత్యేకమైనవి, శక్తిమంతమైనవి, ప్రభావవంతమైనవి. నిజంగా చెప్తున్నా ఉక్రెయిన్ చేతికి ఇలాంటి ఆయుధాలు అందటం రష్యాకు అస్సలు మంచిది కాదు. ఉక్రెయిన్కు తొమహాక్లు ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కానీ, యుద్ధాన్ని ముగించేందుకు అదే సరైన పని. ఇలాంటి పరిస్థితి రావాలని రష్యా కోరుకోదనే అనుకుంటున్నా. ఈ అంశంపై నేను రష్యాతోనూ మాట్లాడే అవకాశాలు లేకపోలేదు’అని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉక్రెయిన్కు తొమహాక్ క్షిపణులు అందజేసేందుకు సిద్ధమని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్పై కీలకమైన ఆయుధాలు వాడకుండా రష్యాపై కూడా తాను ఒత్తిడి తీసుకురాగలనని పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్కు తొమహాక్ క్షిపణులు అందిస్తే రష్యా– అమెరికా మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని పుతిన్ ఇటీవలే హెచ్చరించారు. ఏమిటి తొమహాక్ల ప్రత్యేకత? తొమహాక్ క్షిపణుల పూర్తిపేరు బీజీఎం–109 తొమహాక్ లాండ్ అటాక్ మిసైల్స్ (టీఎల్ఏఎం). ఇవి ఎలాంటి వాతావరణంలో అయినా లక్ష్యాన్ని అత్యంత కచి్చతత్వంతో ధ్వంసం చేయగలవు. జెట్ ఇంజన్ శక్తిగత ఈ సబ్సోనిక్ క్యూయిజ్ క్షిపణులను ప్రస్తుతం అమెరికా నేవీ, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీలు వాడుతున్నాయి. వీటిని యుద్ధనౌకలు, సబ్మెరైన్ల ద్వారా ప్రయోగిస్తారు. జాన్హాప్కిన్స్ యూనివర్సిటీలోని అప్లయిడ్ ఫిజిక్స్ లే»ొరేటరీ వీటిని అభివృద్ధి చేసింది. 1970 దశకంలో వీటిని జనరల్ డైనమిక్స్ మొదట ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత కాలానుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. వీటితో బహుళ లక్ష్యాలను ఛేదించవచ్చు. యుద్ధనౌకలతోపాటు భూమిపై ఉండే లక్ష్యాలను కూడా ధ్వంసం చేయవచ్చు. ఒక్కో క్షిపణి ఖరీదు దాదాపు రూ.18 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో వివిధ రకాలున్నాయి. టీఎల్ఏఎం బ్లాక్ 2 క్షిపణి రేంజ్ 2,500 కిలోమీటర్లు. బ్లాక్ 3 రేంజ్ 1,300 కిలోమీటర్లు. సబ్మెరైన్స్ నుంచి ప్రయోగించే క్షిపణుల రేంజ్ వేరుగా ఉంటుంది. ఇవి శత్రు రాడార్లను ఏమార్చి దాడులు చేయగలవు. -
సంక్లిష్ట వ్యవహారమిది
షర్మ్ ఎల్ షేక్(ఈజిప్ట్): గాజాలో శాంతి వీచికలు మొదలయ్యాక ఆ శాంతిని శాశ్వతంగా సుస్థిరం చేసేందుకు మొదలైన ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పంలోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో పలువురు యూరప్ దేశాలు, పశి్చమాసియా దేశాల అగ్రనేతల సమక్షంలో శాంతి శిఖరాగ్ర సదస్సులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ సంతకంచేశారు. ఆయనతోపాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసీ, ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అగ్రనేతల సమక్షంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇది చరిత్రాత్మకమైన ఒప్పందం. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు నెరవేరాయి. మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మధ్యవర్తిత్వం విషయంలో ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసి అద్భుతంగా వ్యవహరించారు. మీరు నమ్ముతారో లేదో తెలీదుగానీ అసలు ఈ వివాదం 500 నుంచి మూడువేల సంవత్సరాల నాటిది అని అనుకుంటున్నా. ఇప్పటికి ఓ కొలిక్కి వచి్చంది. ఇంకా ఇందులో ఎంతో సంక్లిష్టత ఉంది. ఈ ఒప్పందం అత్యంత చిక్కుముళ్లతో కూడుకుంది. ఎన్నో నిబంధనలు, షరతులను పొందుపరిచాం. వాస్తవానికి పశ్చిమాసియాలో ఈ యుద్ధం చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చాలా మంది భావించారు. ఇకపై అలాంటిదేమీ ఉండబోదు. నేను గతంలో ఎన్నో సంక్లిష్టమైన సమరాలు, సమస్యలను పరిష్కరించా. ఇది మాత్రం అతిపెద్ద రాకెట్ షిప్లాగా సమస్యాత్మకంగా మారింది. చివరకు పరిష్కరించాం’’ అని ట్రంప్ అన్నారు. తర్వాత నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. తర్వాత నేతలంతా వేరే వేదికపై చేరారు. అక్కడ మళ్లీ ట్రంప్ బ్రిటన్, ఇటలీ, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే తదితర కీలక దేశాల అగ్రనేతలను పొగుడుతూ మాట్లాడారు. భారత్ గొప్పదేశం వెనకాల పలువురు నేతలు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా వాళ్ల సమక్షంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘ భారత్ గొప్పదేశం. నాకు అత్యంత మిత్రదేశం. భారత్ గొప్ప పనులెన్నో చేసింది. ఇకమీదట పాకిస్తాన్, భారత్లు ఇరుగుపొరుగున హాయిలా కలిసిమెలసి ఉంటాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఆ సందర్భంలో షరీఫ్ నవ్వుతూ కనిపించారు. తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ మాట్లాడారు. ‘‘పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికారం ఉండాల్సిందే. వాటిని భవిష్యత్తులో ఏ దేశమూ లాగేసుకోకూడదు. స్వతంత్ర దేశంగా ఎదగాలి’’ అని సిసీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
అవధుల్లేని ఆనందం
డెయిర్ అల్ బాలాహ్(గాజా స్ట్రిప్)/జెరూసలేం: నెలల తరబడి చీకట్లో మగ్గిపోయిన ఇజ్రాయెలీ బందీలు ఎట్టకేలకు హమాస్ బందీ సంకెళ్లను తెంపుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన హమాస్, ఇజ్రాయెల్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక శుక్రవారం అమల్లోకిరాగా బందీల విడుదల సోమవారం మొదలైంది. రెండేళ్లకుపైగా తమ వద్ద బందీలుగా ఉంచుకున్న 20 మంది ఇజ్రాయెలీలను హమాస్ పాలస్తీనాలోని వేర్వేరు చోట్ల ఏకకాలంలో విడిచిపెట్టింది. దీంతో ఇజ్రాయెలీ బందీల కుటుంబాల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బందీలు విడుదలయ్యారన్న వార్త తెలీగానే ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ ప్రధాన కూడళ్ల వద్ద వేలాది మంది జనం పోగయ్యి సంబరాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులు బందీల కోసం ఎదురుచూశారు. చిక్కిశల్యమైన తమ వారిని చూసిన ఆనందంలో బందీల కుటుంబ సభ్యులు కేరింతలు కొట్టారు. వాళ్లను హత్తుకుని ఆనందభాష్పాలను రాల్చారు. ‘‘ మా నాన్న ఓమ్రీ మిరాన్ ఏకంగా 738 రోజుల తర్వాత ఇంటికొచ్చారు. ఆయన రాక కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. వేదన అంతా ఇప్పుడు మటుమాయమైంది’’ అని ఓమ్రీ సంతానం ఆనందం వ్యక్తంచేసింది. ఓమ్రీని వీడియోకాల్లో తొలిసారిగా చూసిన ఆయన భార్య లేషే మిరాన్ లావీకు ఆనందంతో మాటలు రాలేదు. నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన పలువురు బందీల పార్థివదేహాలను సైతం హమాస్ రెడ్క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది. మరికొన్ని మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో తమకు సైతం స్పష్టంగా తెలీదని హమాస్ ప్రతినిధులు చేసిన ప్రకటనపై బందీలు, ఆచూకీగల్లంతైన బాధితుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 20 సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ కచ్చితంగా కట్టుబడి ఉండాలని డిమాండ్చేసింది. ఇజ్రాయెల్ సైతం ఒప్పందంలో భాగంగా ఆక్రమిత వెస్ట్బ్యాంక్లోని ఓపెర్ జైలు నుంచి దాదాపు 2,000 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టింది. వీళ్లలో గతంలో జీవితఖైదు పడిన 250 మంది ఖైదీలు న్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో అదుపు లోకి తీసుకున్న వందలాది మందిని ఇజ్రాయెల్ విడుదలచేసింది. దీంతో వీళ్లంతా గాజా, వెస్ట్ బ్యాంక్లకు బయల్దేరారు. బస్సులో చేరుకున్న తమ వారిని చూసిన ఆనందంలో రమల్లా సిటీలోని పాలస్తీనియన్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.పీడకల పోగొట్టాం.. శాంతిస్థాపన బాధ్యత మీదే: ట్రంప్బందీల విడుదలతో కీలకపాత్రపోషించిన ట్రంప్ సోమవారం పశ్చిమాసియా పర్యటనలో భాగంగా తొలుత ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్లో ప్రసంగించారు. 2008 తర్వాత అమెరికా అధ్యక్షుడు నెస్సెట్లో ప్రసంగించడం ఇదే తొలిసారి. 1949 ఏడాది నుంచి చూస్తే గతంలో కేవలం ముగ్గురు అమెరికా అధ్యక్షులు మాత్రమే కేనేసెట్కు వచ్చారు. స్పీకర్ ఆమిర్ ఒహామా ఘన స్వాగతం తర్వాత పార్లమెంటేరియన్లనుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘ నెలలతరబడి పట్టి పీడించిన బాధాతప్త యుద్ధ పీడ కలను మేం పోగొట్టాం. తుపాకులు ఇప్పుడు మౌనం దాల్చాయి. ఇక మీరు రణక్షేత్రంలో సాధించడానికి ఏమీ లేదు. ఇక ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సువర్ణావకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. శాంతిని శాశ్వత చేయండి. పశ్చిమాసియాలో కొత్త శాంతి ఉషోదయం మొదలైంది. మధ్యవర్తిత్వం వహించిన నా అల్లుడు జేడ్ కుష్నర్, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, అరబ్ దేశాలకు కృతజ్ఞతలు. ఇజ్రాయెల్కు మాత్రమేకాదు పశ్చిమాసియాలో సువర్ణా« ద్యాయం మొదలుకానుంది. గాజాలో నిస్సైనికీ కరణ జరగాలి. హమాస్ ఆయుధాలను త్యజించాలి. దానికి ఇంకా అంగీకారం కుదరలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రసంగాన్ని ఒకరు అడ్డుకోబోగా భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాక్కెళ్లారు.ట్రంప్కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంగాజా ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు ట్రంప్కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవంతో సత్కరించనుంది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ను ట్రంప్కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ సోమవారం ప్రకటించారు. త్వరలో ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్ను ఈ పురస్కారంతో సత్కరిస్తామని ఇస్సాక్ చెప్పారు. -
ట్రం‘పూనకాలు’!
అన్యాయం! ఘోరం! ట్రంప్ గారికి నోబెల్ రాలేదు! నోబెల్ శాంతి బహుమతి 2025 ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ గారికి మాత్రం దక్కలేదు! ఇందులో ఆశ్చర్యమేమీ లేదు, కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో వచి్చన మీమ్స్, జోకులు చూస్తే మాత్రం పగలబడి నవ్వకుండా ఉండలేం. ఈ వార్త వినగానే, ఏం జరిగిందో ఊహించగలం కదా? అవును, ట్రంప్ స్పందనను ఊహిస్తూ ‘క్లాస్ పీకుతున్న’మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. మనసు గెలిచిన మచాడో.. ఈసారి బహుమతిని వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో గెలుచుకున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న ఈమెకు ‘వెనెజులాఉక్కు మహిళ’అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నప్పటికీ, టైమ్ మ్యాగజైన్ ‘2025లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది’జాబితాలో ‘మచాడో’పేరు ఉందంటే ఆమె ప్రభావాన్ని ఊహించుకోవచ్చు. ట్రంప్ గారే టాక్ ఆఫ్ ది టౌన్! కానీ, ఆన్లైన్లో జనాలు ‘మచాడో’గురించి మాట్లాడకుండా, కేవలం ట్రంప్ కలల బహుమతి గురించి మాత్రమే జోకులు వేసుకున్నారు. ట్రంప్ నోబెల్ గెలవనందుకు ఎంత నిరాశ చెందారో చూపిస్తూ.. ఎక్స్ ప్లాట్ఫాం నిండిపోయింది. ట్రంప్ చిన్న పిల్లాడిలా అలిగి, చిందులు తొక్కుతున్నట్లు మారి్ఫంగ్ చేసిన ఫొటోలు, ఆయనకు బహుమతి దక్కనందుకు ప్రపంచం అంతా పండుగ చేసుకుంటున్న వీడియోలు.. అబ్బో! నెటిజన్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఈ అవకాశాన్ని ’ఇంటర్నెట్ గోల్డ్’గా మార్చడానికి అస్సలు ఆలస్యం చేయలేదు. ట్రంప్ ‘శాంతి’ ప్రకటనలు: కామెడీకి కొత్త నిర్వచనం నిజానికి, 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు, ట్రంప్ చాలా పకడ్బందీగా ప్రచారం కూడా చేశారు. ప్రపంచంలో అనేక శాంతి కార్యక్రమాలలో తన పాత్ర ఉందని, అందుకే ఈ గౌరవం తనకే దక్కాలని ఆయన పట్టుబట్టారు. నిజమా?.. మీరే చేసారా? ఆయన నోటి నుంచి ఈ మాటలు వస్తున్నప్పుడు, అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు ముఖాలు ఎలా పెట్టుకున్నారో ఊహించుకుంటే చాలు. అన్నీ విన్నాక, ‘నిజంగా మీరు ఇవన్నీ చేసేసారా?’అని అందరూ నవ్వుకుంటూనే ప్రశ్నించారట!. ఏదేమైనా, నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కకపోయినా, ఆయన వల్ల మాత్రం నెటిజన్లకు భారీ వినోదం మాత్రం దక్కింది.ఆయన సొంత డబ్బా లిస్ట్ ఇదే.. → ఇజ్రాయెల్–హమాస్, ఆర్మేనియా–అజర్బైజాన్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించారట! → కంబోడియా–థాయిలాండ్ గొడవలు కూడా ఆయనే పరిష్కరించారట! → అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య కూడా శాంతి ఒప్పందానికి కృషి చేశానని చెప్పుకొన్నారు (అసలు అదెప్పుడు చేశారో ఎవరికీ తెలియదు). → ఇక, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో–రువాండా, ఈజిప్ట్–ఇథియోపియా, సెర్బియా–కొసావో మధ్య ఉద్రిక్తతలు కూడా ఆయన వల్లే శాంతించాయట! -
ట్రంప్కు నోబెల్ నిరాశ
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిని బలవంతంగానైనా సాధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చివరకు భంగపాటే ఎదురయ్యింది. తానే ప్రపంచంలో అతిపెద్ద శాంతి దూతనని, ఏడు యుద్ధాలను ఆపి ప్రపంచంలో శాంతిని నెలకొల్పానని, అందువల్ల తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న ఆయన వాదనను నోబెల్ కమిటీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనెజువెలా ప్రతిపక్ష నేత, ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు ప్రకటించటంతో ట్రంప్ కార్యవర్గంపై నోబెల్ కమిటీపై అక్కసు వెళ్లగక్కింది. నోబెల్ కమిటీ అసలైన శాంతి పరిరక్షకులకంటే రాజకీ యాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శలు గుప్పించింది. మరోవైపు ‘మీడియా ప్రచారాన్ని నమ్మి నోబెల్ ఇవ్వం’ అని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్ కోసం ట్రంప్ డిమాండ్నోబెల్ శాంతి పురస్కారంపై ట్రంప్ ఆసక్తి ఇప్పటిది కాదు. ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచే దానిపై మనసు పారేసుకున్నారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఏకంగా తనకు నోబెల్ పురస్కారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. తనకు ఆ పురస్కారం రాకపోవటంకంటే తన రాజకీయ ప్రత్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇవ్వటమే ట్రంప్ను అధికంగా మనోవేదనకు గురిచేస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. ఈ ఏడాది మొదట్లో అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచే ఆయన నోబెల్ శాంతిబహుమతిపై కన్నేశారు. పలు దేశాలను బెదిరించి మరీ తనకు నామినేషన్ వేయించుకున్నారు. పది నెలల తన పాలనా కాలంలో ఏడు యుద్ధాలను ఆపానని, ఇంతకంటే శాంతి ప్రదాత ఎవరు ఉంటారని ప్రశ్నిస్తూ వచ్చారు. తనకు నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్లేనని ఇటీవలే వ్యాఖ్యానించారు. పురస్కార ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడా ఆయన దీనిపై స్పందించారు. ‘ఒబామా ఏమీ చేయకుండానే నోబెల్ పురస్కారం ఇచ్చారు. అమెరికాను ధ్వంసం చేసినందుకు ఆయనకు ఇచ్చారు. సరే.. వాళ్లు ఇప్పుడు ఏం చేయగలరో చేయనివ్వండి. ఏ నిర్ణయం ప్రకటించినా మంచిదే. దానికోసం (అవార్డు కోసం) నేను పనిచేయలేదు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకే నేను ఇదంతా (యుద్ధాలను ఆపటం) చేశాను’అని గురువారం తెలిపారు. నోబెల్ కోసం సొంత టీమ్తో ప్రచారం చేయించుకున్న ట్రంప్.. ఈ ఏడాది జూలైలో ఏకంగా నార్వే ఆర్థికమంత్రి జెన్స్ స్టాల్టె్టన్బెర్గ్కు స్వయంగా ఫోన్ చేసి తనకు నోబెల్ ఇవ్వకుంటే టారిఫ్లు తప్పవన్నట్లు మాట్లాడారని నార్వే మీడియా పేర్కొంది.గడువు ముగిసిన తర్వాత నామినేషన్లుఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఫిబ్రవరి 1వ తేదీతో నామినేషన్ల గడువు ముగిసిపోయింది. ట్రంప్ తరఫున అనేక నామినేషన్లు వచ్చినప్పటికీ, చాలావరకు ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చినవే ఉన్నాయి. ఈ ఏడాది మేలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్న పాక్ను ట్రంప్ చేరదీసి భరోసా ఇవ్వ టంతో.. ఆ తర్వాత పాకిస్తాన్.. ట్రంప్కు నోబెల్ శాంతిపురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇజ్రాయెల్తో కూడా బ లవంతంగా గత నెలలో ట్రంప్ నామి నేషన్ ఇప్పించుకున్నారు. అయితే, ఈ పురస్కా రం కోసం ట్రంప్ యంత్రాంగం గత ఏడాది డిసెంబర్ నుంచే ప్రచారం మొద లుపెట్టింది. అందుకోసం అధ్యక్ష కార్యాల యం ఓవల్ ఆఫీస్నే కేంద్రంగా చేసు కోవటం గమనార్హం.నోబెల్ కమిటీపై వైట్హౌస్ ఫైర్ ట్రంప్కు నోబెల్ పురస్కారం ఇవ్వకపోవటంపై అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రతినిధి స్టీవెన్ చెంగ్ అక్కసు వెళ్లగ క్కారు. ‘శాంతి ఒప్పందాలు కుదురుస్తూ, యుద్ధాలు ఆపుతూ, ప్రజల ప్రాణాలు కాపాడే పనిని అధ్యక్షుడు ట్రంప్ కొనసాగిస్తూనే ఉంటారు. ఆయనది గొప్ప మానవతా హృదయం. తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగల ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండదు. నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది’అని విమర్శించారు. అయితే, శాంతి పురస్కా రానికి అభ్యర్థి ఎంపికపై నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్డాన్ స్పష్టత ఇచ్చారు. ‘నాకు తెలిసి ఈ కమిటీ ఇలాంటి ప్రచారాలు, మీడియా రిపోర్టులను చాలా చూసే ఉంటుంది. శాంతి స్థాపన కోసం అది చేశాం, ఇది చేశామని పేర్కొంటూ మాకు ఏటా వేల లేఖలు వస్తాయి. నోబెల్ పురస్కా రాలు పొందిన గొప్ప వ్యక్తుల చిత్రపటాలతో నిండిన ఓ గదిలో ఈ కమిటీ కూర్చుని చర్చిస్తుంది. ఆ గది సమగ్రత, ధైర్యసాహసాలతో నిండి ఉంటుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ సేవలు, ఆయన రాసిన విల్లులోని అంశాల ఆధారంగానే మేం నిర్ణయాలు తీసుకుంటాం’అని స్పష్టంచేశారు. -
గాజాలో శాంతి పవనాలు!
జెరూసలేం/న్యూఢిల్లీ: వైమానిక దాడులు, బాంబు పేలుళ్లు, విధ్వంసాలు, ఆకలి చావులతో రెండేళ్లుగా అల్లాడిపోతున్న కల్లోలిత గాజా స్ట్రిప్లో శాంతి సాధనకు ఎట్టకేలకు అడుగులుపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను వైరిపక్షాలైన ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేయబోతున్నాయి. రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం పూర్తిగా ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి దశ ఒప్పందం ప్రకారం.. గాజాలో దాడులు వెంటనే ఆపేయాలి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను అతిత్వరలో హమాస్ మిలిటెంట్లు విడుదల చేయనున్నారు. అందుకు బదులుగా తమ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం విముక్తి కలి్పంచనుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోనుంది. హమాస్ అ«దీనంలో 20 మంది బందీలు సజీవంగా ఉన్నట్లు అంచనా. భగవంతుడి దయతో వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హమాస్ సైతం స్పందించింది. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సేనలు వెనక్కి వెళ్లిపోవాలని, గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించాలని పేర్కొంది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను తమకు అప్పగించాలని తేల్చిచెప్పింది. మరోవైపు రెండు కీలకమైన అంశాలపై స్పష్టత రాలేదు. ట్రంప్ ప్లాన్ ప్రకారం హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి. గాజా పరిపాలన బాధ్యతలను నిపుణులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా అథారిటీకి అప్పగించాలి. ఈ రెండింటిపై హమాస్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. గాజాలో ఆనందోత్సాహాలు ట్రంప్ శాంతి ప్రణాళికలో మొదటి దశను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడంతో గాజాలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. యుద్ధం ఇక ఆగిపోతుందని, రక్తపాతానికి తెరపడుతుందని, తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నామని అన్నారు. జనం పరస్పరం అభినందనలు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. గాజాలో పనిచేస్తున్న జర్నలిస్టులు సైతం సంబరాల్లో మునిగిపోయారు. కొందరు పాలస్తీనా సంప్రదాయ నృత్యాలు చేశారు. మారణహోమం, అన్యాయం, అణచివేత కారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోయామని, ఇకనైనా ఊపిరి పీల్చుకుంటానని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు చెప్పారు. మరోవైపు శాంతి ప్రణాళిక అమల్లోకి వచ్చినట్లు భావించిన నిరాశ్రయులు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నించగా ఇజ్రాయెల్ సైనికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జెరూసలేంలో సంబరాలు ఇజ్రాయెల్లోని జెరూసలేం నగరంలోనూ జనం హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. బందీల రాకకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా బందీల కుటుంబ సభ్యులు, బంధువులు సంబరాల్లో మునిగిపోయారు. పరస్పరం ఆలింగనాలు చేసుకున్నారు. తాము ఇన్నాళ్లూ చేసిన ప్రార్థనలు ఫలించాయని భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడని విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని యూదు మత గురువు అవీ కోజ్మన్ వ్యాఖ్యానించారు. అన్ని పక్షాలనూ గౌరవిస్తాం: ట్రంప్ ‘‘గాజాలో బలమైన, మన్నికైన, శాశ్వతమైన శాంతి సాధనలో భాగంగా బందీలందరినీ హమాస్ అతిత్వరలో విడుదల చేస్తుంది. ఇజ్రాయెల్ తమ సైనికులను ఉపసంహరించుకుంటుంది. ఈ విషయంలో అన్ని పక్షాలనూ సమానంగానే గౌరవిస్తాం’’ అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. గురువారం అర్ధరాత్రి గానీ, శుక్రవారం ఉదయం నుంచి గానీ ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ ప్రారంభవుతుందని ఆశిస్తున్నట్లు హమాస్ సీనియర్ నేత ఒసామా హమ్దాన్ చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులంతా వెళ్లిపోవాలని కోరారు. ఇజ్రాయెల్ జైళ్లలో 250 మంది పాలస్తీనా ఖైదీలు చాలాఏళ్లుగా మగ్గుతున్నారని, గాజాపై యుద్ధం మొదలైన తర్వాత ఈ రెండేళ్లలో మరో 1,700 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ సైన్యం నిర్బంధించిందని గుర్తుచేశారు. వీరందరినీ విడుదల చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.ఇప్పుడేం జరగొచ్చు? గాజాలో హమాస్ను పూర్తిగా నిరీ్వర్యం చేయాలని ఇజ్రాయెల్ పట్టుదలతో ఉంది. వారంతా ఆయుధాలు అప్పగించి, లొంగిపోవాల్సిందేనని చెబుతోంది. ఇదే అంశాన్ని ట్రంప్ ప్లాన్లోనూ చేర్చారు. లొంగిపోతే క్షమాభిక్ష ప్రసాదిస్తామని సూచించారు. కానీ, ఆయుధాలు వదిలేయడానికి హమాస్ మిలిటెంట్లు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గాజా తమ పట్టునుంచి జారిపోకుండా చూసుకోవాలన్నదే వారి ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా ఖాళీ చేయాలని, మరోసారి దాడులు చేయొద్దని వారు షరతు విధిస్తున్నారు. సైన్యమంతా వెనక్కి వెళ్లిపోయిన తర్వాతే చివరి బందీని విడుదల చేస్తామని తేల్చిచెబుతున్నారు. గాజాలోని బఫర్ జోన్లలో తమ సైన్యాన్ని కొనసాగించక తప్పదని ఇజ్రాయెల్ వాదిస్తుండడం గమనార్హం. మరోవైపు గాజాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కొరవడింది. వెస్ట్బ్యాంక్ మద్దతున్న పాలస్తీనా అథారిటీకి గాజా అధికార బాధ్యతలు అప్పగించడం గానీ, స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని గుర్తించడాన్ని గానీ తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఇజ్రాయెల్ చెబుతోంది. మిలిటెంట్లు లొంగిపోయి, స్వతంత్ర పాలస్తీనా అథారిటీ చేతిలోకి పాలనా పగ్గాలు వస్తే తప్ప గాజా పునరి్నర్మాణం సాధ్యం కాదు. 20 లక్షల మంది పాలస్తీనా ప్రజల భవిష్యత్తు ఇంకా తేలడం లేదు. గాజాలో శాశ్వతంగా శాంతి ఎప్పుడు నెలకొంటుందన్న సంగతి ఎవరూ చెప్పలేకపోతున్నారు. అప్పుడేం జరిగింది...2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 1,200 మంది మరణించారు. మిలిటెంట్లు 251 మందిని బందీలుగా మార్చేసి గాజాకు బలవంతంగా తరలించి, సొరంగాల్లో బంధించారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. హమాస్ దుశ్చర్యపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే ప్రతిస్పందించింది. మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా భీకర యుద్ధం ఆరంభించింది. గాజాలో రెండేళ్లపాటు సాగిన యుద్ధంలో 67,000 మందికిపైగా మృతిచెందారు. 1.70 లక్షల మంది క్షతగాత్రులుగా మారారు. గాజా చాలావరకు ధ్వంసమైపోయింది. శిథిలాల దిబ్బగా మారింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గాజాలో మారణహోమం ఆపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవలే 20 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఇజ్రాయెల్ను, హమాస్ను నయానో భయానో ఒప్పించారు. తన మాట వినకుంటే నరకం చూపిస్తామని హమాస్ను హెచ్చరించారు. దాంతో ఉభయ పక్షాలు దారికొచ్చాయి. ట్రంప్ పీస్ ప్లాన్ను ఇజ్రాయెల్–హమాస్ మధ్య మూడో కాల్పుల విరమణ ఒప్పందంగా చెప్పుకోవచ్చు. 2023 నవంబర్లో ఇరుపక్షాల మధ్య తొలి ఒప్పందం కుదిరింది. అప్పట్లో 100 మందికిపైగా బందీలను హమాస్ విడుదల చేసింది. ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. అందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రెండో ఒప్పందం కుదిరింది. హమాస్ మిలిటెంట్లు 25 మంది బందీలను వదిలేశారు. అంతేకాకుండా మరణించిన బందీల్లో 8 మంది మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వం 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ట్రంప్కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం తెలియజేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. మోదీ గురువారం ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. గాజాలో శాంతి సాధనకు కృషి చేసినందుకు తన మిత్రు డిని అభినందించానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ ప్లాన్ చరిత్రాత్మకమని పేర్కొన్నారు. అలాగే భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతిని తాము సమీక్షించామని తెలిపారు. రాబోయే రోజుల్లో పరస్పరం సంప్రదించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు మోదీ స్పష్టంచేశారు. నెతన్యాహుకు మోదీ ఫోన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా మోదీ ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ శాంతి ప్రణాళికలో పురోగతి పట్ల నెతన్యాహుకు అభినందనలు తెలిపారు. గాజా నుంచి బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయం పంపిణీ కోసం అడుగులు ముందుకు పడడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని మోదీ తేల్చిచెప్పారు. -
నేడు ఇజ్రాయెల్, హమాస్ చర్చలు
కైరో: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రధాన లక్ష్యాలుగా సోమవారం ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు మొదలుకానున్నాయి. పరోక్షంగా జరిగే ఈ చర్చల కోసం ఇజ్రాయెల్, హమాస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ వారంలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల మొదలుకానుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్తోపాటు హమాస్ సానుకూలంగా స్పందించడం తెల్సిందే. హమాస్ చెర నుంచి ఇజ్రాయెలీలకు విముక్తి కల్పించడం, బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీని యన్లను విడుదల చేయడంపైనే సోమవారం ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సైతం పాలుపంచుకుంటారని ఈజిప్టు విదేశాంగ శాఖ తెలిపింది. బందీల విడుదల, గాజాలో 2025 ఆగస్ట్లో ఉన్న ప్రాంతాల్లోకి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకోవడంపై అంగీకారం కుదిరిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అతి సమీపంలో ఉన్నట్లేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. కాల్పుల విరమణ దిశగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముస్లిం మెజారిటీ కలిగిన 8 దేశాలు ఓ ఉమ్మడి ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. పాలస్తీనా అథారిటీకి గాజాను అప్పగించాలని, గాజాను వెస్ట్బ్యాంక్లో విలీనం చేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆ దేశాలు డిమాండ్ చేశాయి. ఈ చర్యలన్నిటి కంటే ముందుగా బందీల విడుదల, అందుకు బదులుగా ఖైదీలకు విముక్తి జరగాల్సి ఉందన్నారు. ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాపై బాంబింగ్ను నిలిపివేయాలని ఇజ్రాయెల్ను కోరిన తర్వాతా దాడులు కొనసాగినట్లు సమాచారం. గాజా నగరం, రఫాలపై ఆదివారం జరిగిన దాడుల్లో కనీసం 12 మంది చనిపోయారని వివిధ ఆస్పత్రుల సిబ్బంది చెప్పారు. కాల్పుల విరమణ ఇంకా మొదలుకానందున, గాజాలో ప్రస్తుతానికి బాంబింగ్ను పూర్తిగా ఆపేయలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి మీడియాకు చెప్పారు. అదేవిధంగా, చర్చలను జాప్యం చేసేందుకు హమాస్ చేసే ప్రయత్నాలపై ఓ కన్నేసి ఉంచామని కూడా ఆమె తెలిపారు. -
బందీల విడుదలకు సిద్ధం
గాజా స్ట్రిప్: హమాస్ అంతమే లక్ష్యంగా రెండేళ్లుగా గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడుల పరంపర ముగింపునకు వచ్చిన జాడలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా శనివారం కీలక పరిణామాలు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 అంశాల ప్రణాళిక మేరకు తమ వద్ద ఉన్న బందీలందరి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించగా గాజాలో యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. గాజాలోని తమ బలగాలు ఇప్పుడు కేవలం ఆత్మరక్షణ చర్యలకే పరిమితమయ్యాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. దాడులు జరపడం లేదంది. అయితే, గాజా నుంచి బలగాలను మాత్రం ఉపసంహరించుకోవడం లేదని స్పష్టం చేసింది.కీలక పరిణామంబందీలందరినీ విడుదల చేయడంతోపాటు గాజాలో అధికారాన్ని స్వతంత్ర రాజకీయ పాలస్తీనా గ్రూపులకు అప్పగించడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడాన్ని కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. అయితే, ట్రంప్ ప్రణాళికలోని ఇతర అంశాలపై పాలస్తీనా గ్రూపులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని హమాస్ పేర్కొంది. కొన్నిటిపై మరిన్ని విస్తృత చర్చలు అవసరమవుతాయని కూడా పేర్కొంది. గాజా భవిష్యత్తును పాలస్తీనియన్లే చర్చించి నిర్ణయించుకోవాల్సి ఉందని తెలిపింది. ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామంది. అయితే, హమాస్ ఆయుధాలను అప్పగించాలన్న ఇజ్రాయెల్ కీలక డిమాండ్ ప్రస్తావన ఇందులో లేకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్న ట్రంప్ ప్రతిపాదనలను చర్చలు జరపకుండా ఆమోదించలేమని హమాస్ సీనియర్ అధికారి మౌసా అబూ మెర్జౌక్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా, బందీలందరినీ 72 గంటల్లోగా విడుదల చేయడం సాధ్యం కాదన్నారు. వారందరినీ ఒకే చోటకు చేర్చేందుకు రోజులు లేక వారాలు పట్టొచ్చని చెప్పారు. ఆయుధాలను అప్పగించే హమాస్ సిద్ధంగానే ఉందన్నారు. అయితే, హమాస్ విడుదల చేసిన అధికార ప్రకటనలో మాత్రం ఆయుధాల అప్పగింత విషయం లేకపోవడం గమనార్హం.బాంబింగ్ ఆపేయాలి: ట్రంప్హమాస్ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. ‘శాశ్వత శాంతిని హమాస్ కోరుకుంటోందని అనుకుంటున్నా. గాజాపై బాంబింగ్ను ఇజ్రాయెల్ వెంటనే నిలిపివేయాలి. బందీలందరినీ తక్షణమే సురక్షితంగా తీసుకురావడానికి ఇదెంతో అవసరం. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. మిగతా అంశాలపై చర్చలకు సిద్ధం’అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.శాంతి నెలకొంటుందా?తన శాంతి ప్రణాళిక పూర్తిస్థాయి అమలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పూర్తి నమ్మకంతో ఉన్నట్లు కనిపించడం లేదు. ‘చూద్దాం.. ఏం జరుగుతుందో..మనమైతే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. స్పష్టంగా చెప్పాం’అని ఆయన వ్యాఖ్యానించడం దీనికి అద్దం పడుతోంది. ‘ఈ ఒప్పంద ఫలితంగా గాజాలో కొన్ని రోజులపాటు ఇజ్రాయెల్ కాల్పు లను ఆపేస్తుంది. బందీలను హమాస్ విడుదల చేస్తుంది. హమాస్ ఆయుధాలను అప్పగించకుంటే మాత్రం ఇజ్రాయెల్ తిరిగి దాడులు మొదలుపెడుతుంది’అని ఇజ్రాయెల్ మాజీ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. హమాస్ చర్చలకు సిద్ధమని ప్రకటించిందే గానీ, ఆ సంస్థ డిమాండ్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదని మరో పరిశీలకుడు తెలిపారు. రెండు వర్గాల మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదని విశ్లేషించారు. -
నో అంటే నరకమే!
గాజా స్ట్రిప్: గాజాలో శాంతి సాధన కోసం తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల హమాస్ మిలిటెంట్లు ఇంకా స్పందించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పుకోవాలని అల్టిమేటం విధించారు. లేకపోతే నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తామని హమాస్ను హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై ఈ నెల 7వ తేదీకి రెండేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే 20 శాతం శాంతి ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ట్రంప్ ప్లాన్ను ఇజ్రాయెల్ అంగీకరించింది. ప్రపంచ దేశాలు సైతం స్వాగతించాయి. హమాస్ మాత్రం ఇంకా స్పందించలేదు. ట్రంప్ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యం కాదని, ఇందులో కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. అభ్యంతకర అంశాలపై చర్చించాల్సి ఉందని మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్ కూడా చెబుతున్నాయి. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతాం గడువులోగా హమాస్ తమతో ఒప్పందానికి రావాల్సిందేనని ట్రంప్ స్పష్టంచేశారు. ఇదే ఆఖరి అవకాశంగా భావించాలన్నారు. ఒప్పందానికి రాకపోతే ఇప్పటిదాకా ఎవరూ చూడని నరకాన్ని హమాస్కు చూపిస్తామని ఉద్ఘాటించారు. మిలిటెంట్లపై పూర్తిస్థాయి సైనిక చర్య ప్రారంభమవుతుందన్నారు. ఒక మార్గంలో కాకపోతే.. మరో మార్గంలోనైనా మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతామని ట్రంప్ పేర్కొన్నారు. హమాస్ను పూర్తిగా అంతం చేస్తామన్న సంకేతాలిచ్చారు. -
‘నాకు శాంతి నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్టే’
న్యూయార్క్: నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏకంగా బెదిరింపులకే దిగారు. తనకు శాంతి నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను తీవ్రంగా అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు సాయుధ ఘర్షణలను ఆపిన తనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను సోమవారం ప్రతిపాదించిన ప్రణాళికపై మంగళవారం క్వాంటికోలో మిలిటరీ అధికారులతో ట్రంప్ మాట్లాడారు. ‘మనం సాధించాం. సమస్య పరిష్కారమైనట్టే అని భావిస్తున్నాను.. చూడాలి మరి. దీనిని హమాస్ అంగీకరించాల్సిందే (శాంతి ప్రణాళికను). లేదంటే వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని అరబ్దేశాలు, ముస్లిం దేశాలు ప్రణాళికను అంగీకరించాయి. ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. ఇది అద్భుతమైన విషయం. పరిస్థితి కొలిక్కి వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి పని ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అయినా, నోబెల్ బహుమతి ఇస్తారా?.. ఇవ్వనే ఇవ్వరు. ఇలాంటి పని ఏదీ చేయని ఎవరో ఒకరికి ఇస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలపై పుస్తకం రాసి, యుద్ధాన్ని ఎలా ఆపాలి అని అందులో వివరించే ఎవరో ఒకరికి నోబెల్ ఇస్తారు. ఏం జరుగుతుందో చూడాలి. ఎవరో ఒక పుస్తక రచయితకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే మాత్రం అది అమెరికాకు తీవ్రమైన అవమానమే. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. నాకు అది (నోబెల్) అవసరం లేదు. మన దేశం దానిని (నోబెల్) సాధించాలని కోరుకుంటున్నా. గాజా ఘర్షణకు ముగింపు పలికే ప్రణాళిక అమలవుతుందనే భావిస్తున్నా. ఇది నేను ఆశామాషీగా చెప్పటం లేదు. నాకు అన్నింటికంటే ఇలాంటి డీల్స్ గురించి బాగా తెలుసు. నా జీవితం మొత్తం ఇలాంటివాటితోనే గడిచింది. అందులో ఈ 8 (గాజా ఘర్షణతో కలిసి ట్రంప్ ఆపానని చెబుతున్న యుద్ధాలు) గొప్ప విషయాలు’అని ట్రంప్ పేర్కొన్నారు. -
త్వరలో ట్రంప్, మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెలాఖరులో మలేసియాలో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కౌలాలంపూర్లో ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే 47వ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) శిఖరాగ్రానికి ఇద్దరు నేతలు హాజరుకా నున్నారు. ఈ సందర్భంగా వీరు సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమా చారం. సమావేశానికి రావాలంటూ మలేసియా ఇప్పటికే ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపించింది. ట్రంప్ పర్యటన ఖరారైన పక్షంలో, అమెరికా భారత్పై 50 శాతం టారిఫ్లను విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలుసుకునే మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం అవుతుంది. -
మళ్లీ ట్రంప్ టారిఫ్ బాంబు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై టారిఫ్ల మోత మోగిస్తూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే కలప(టింబర్)పై 10 శాతం, ఫర్నిచర్తోపాటు కిచెన్ కేబినెట్లపై 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సుంకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ ఆదేశాల పట్ల అమెరికాలో భవన నిర్మాణ రంగంపై మరింత భారం పడడం ఖాయమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఇళ్ల నిర్మాణం ఖరీదైన వ్యవహారంగా మారుతుందని అంటున్నారు. అమెరికాలో నిర్మాణ వ్యయం ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయింది. స్థానిక పరిశ్రమల కోసమే అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకో వడంతోపాటు స్థానిక కలప పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే విదేశీ కలప, ఫర్నిచర్పై సుంకాలు విధించినట్లు ట్రంప్ స్పష్టంచేశారు. స్థానిక పరిశ్రమలకు ఊతం ఇస్తే కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుందని, తద్వారా తమ యువతకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దిగుమతులు తగ్గించుకోవడంతోపాటు అమెరికా నుంచి కలప, ఫర్నిచర్ ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ అవసరాలకు సరిపోయే చెట్లు, కలప అమెరికాలో ఉన్నాయని స్పష్టంచేశారు. అమెరికాకు ప్రధానంగా పొరుగుదేశం కెనడా నుంచి కలప దిగుమతి అవుతుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో కెనడాకు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. -
ట్రంప్ శాంతి మంత్రం
వాషింగ్టన్: కల్లోలిత గాజాలో సంక్షోభానికి, విధ్వంసానికి తెరదించి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రతిపాదన చేశారు. ‘20 సూత్రాల శాంతి ప్రణాళిక’ను తెరపైకి తెచ్చారు. సోమవారం వైట్హౌస్లో ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సమావేశమయ్యారు. గాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధాన్ని ముగించడమే ధ్యేయంగా ట్రంప్ ప్లాన్ను వైట్హౌస్ విడుదల చేసింది. ఈ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యమేనని నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఇక హమాస్ సైతం అంగీకరిస్తే గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోతుందని ట్రంప్ స్పష్టంచేశారు. హమాస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించే అవకాశం లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు సంకేతాలిచ్చారు. శాంతి ప్రతిపాదనపై 3 నుంచి 4 రోజుల్లోగా స్పందించాలని హమాస్కు డెడ్లైన్ విధించారు. లేకపోతే ‘విషాదకరమైన ముగింపు’ ఉంటుందని తేల్చిచెప్పారు. స్వాగతించిన ఇస్లామిక్ దేశాలు గాజా విషయంలో ట్రంప్ ప్లాన్ను ఈజిప్టు, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ) తదితర ఇస్లామిక్ దేశాలు స్వాగతించారు. ఈమేరకు మంగళవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. గాజాలో శాంతి కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. చైనా, రష్యా, భారత్తోపాటు పలు యూరప్ దేశాలు సైతం స్వాగతించాయి. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. పాలస్తీనాతోపాటు ఇజ్రాయెల్ ప్రజల భద్రత, అభివృద్ధికి, శాశ్వత శాంతికి ఒక మార్గం ఏర్పడినట్లేనని, మొత్తం పశి్చమాసియాకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. హమాస్కు మరణ శాసనమే! గాజాలో శాంతి సాధన దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికపై చర్చ మొదలైంది. దీనికి ఇజ్రాయెల్ వెంటనే అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు హమాస్ మాత్రం వేచిచూసే ధోరణితో ముందుకెళ్తోంది. ట్రంప్ ప్లాన్ను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటోంది. నిజానికి ట్రంప్ ప్లాన్ హమాస్కు మరణ శాసనమేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.ప్రణాళికలో కీలక అంశాలు → ట్రంప్ ప్లాన్ను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరిస్తే గాజాలో దాడులు వెంటనే ఆగిపోతాయి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ 72 గంటల్లోగా హమాస్ మిలిటెంట్లు విడుదల చేయాలి. ఒకవేళ బందీల్లో ఎవరైనా మృతిచెంది ఉంటే వారి మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగించాలి. → బందీలకు విముక్తి లభించిన తర్వాత ఇజ్రాయెల్ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 250 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేయాలి. 2023 అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ సైన్యం బంధించిన 1,700 మంది పాలస్తీనా పౌరులను సైతం విడుదల చేయాలి. గాజా నుంచి ఒక బందీ విడుదలైతే, అందుకు ప్రతిగా 15 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంటుంది. → ట్రంప్ ప్రతిపాదనకు ఆమోదం లభించగానే ఇజ్రాయెల్ సేనలు దాడులు ఆపేసి గాజా నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. గాజాలో ఇజ్రాయెల్ దళాలు ఖాళీ చేసిన స్థానంలోకి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్(ఐఎస్ఎఫ్) చేరుతుంది. పాలస్తీనా ప్రజలకు భద్రత కల్పిస్తుంది, పాలస్తీనా పోలీసులకు శిక్షణ ఇస్తుంది. → బందీలు క్షేమంగా ఇజ్రాయెల్కు చేరుకున్న తర్వాత హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలి. వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఒకవేళ మిలిటెంట్లు గాజాను వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని భావిస్తే అందుకు వారికి సహకారం లభిస్తుంది. అభ్యంతరం లేకపోతే గాజాలోనే ఉండిపోవచ్చు. → అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని ‘బోర్డ్ ఆఫ్ పీస్’ గాజాలో పరిపాలన, పునరి్నర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. గాజాను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా అభివృద్ధి చేస్తారు. → పునరి్నర్మాణం తర్వాత గాజా పరిపాలన బాధ్యతలను పాలస్తీనియన్ అథారిటీకి అప్పగిస్తారు. ఈలోగా పాలస్తీనియన్ అథారిటీలో సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుంది. -
భారత్ను దారికి తీసుకురావాలి
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇండియా, బ్రెజిల్ను ఉద్దేశించి కీలక వ్యా ఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలను దారికి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని ఇండియా, బ్రెజిల్ దేశాలకు హితవు పలికా రు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్లు తెరవాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. బ్రెజిల్, ఇండియా, స్విట్లర్లాండ్, తైవాన్ వంటి దేశాల వ్యవహార శైలి తమకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు. అమెరికా పట్ల నిజంగా స్నేహ పూర్వకంగా ఉండాలనుకుంటే సరిగ్గా ప్రతిస్పందించాలని స్పష్టంచేశారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా పని చేస్తుండడం వల్లనే ఇండియా వంటి దేశాలతో తాము కఠినంగా ఉండాల్సి వస్తోందని లుట్నిక్ తేల్చిచెప్పారు. ‘‘మీ ఉత్పత్తులు అమెరికన్లకు విక్రయించుకోవాలని కోరుకుంటే మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లా డుకోండి. సంధి చేసుకోండి’’ అని సూ చించారు. ఇండియా సహా పలుదేశాల తో వాణిజ్య చర్చలు చురుగ్గా ముందు కు సాగడం లేదని తెలిపారు. ఆయా దేశాల మొండి పట్టుదల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. వివాదాలను త్వరలో పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి కొనుగోళ్లు ఆపాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. భారత్ అందుకు అంగీకరించడం లేదు. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో దురుద్దేశం ఏమీ లేదని చెబుతోంది. భారత్ వాదనను అమెరికా నమ్మడం లేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మీరే నిధులు ఇస్తున్నారంటూ మండిపడుతోంది. మరోవైపు భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా కావడం గమనార్హం. 2024–25లో రెండు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది. -
7 యుద్దాలు ఆపాను.. నోబెల్ ఇవ్వాల్సిందే.. ట్రంప్ చిల్లర కామెంట్స్
-
ఉత్త మాటలతో యుద్ధాలు ఆగవు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాకు సమీపంలోకి వచ్చే మరో దేశం లేనేలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. భూగోళంపై వ్యాపారం, వాణిజ్యంలో అత్యుత్తమ దేశం తమదేనని స్పష్టంచేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, నానాటికీ మరింత బలం పుంజుకుంటోందని అన్నారు. అమెరికాకు గతంలో ఎన్నడూ దక్కనంత గౌరవం ఇప్పుడు దక్కుతోందని వివరించారు. తాను మొదటి పర్యాయం అధ్యక్షుడిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే తమ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో ఇదొక పరిణామం అని అభివరి్ణంచారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ(జనరల్ అసెంబ్లీ) 80వ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ సుదీర్ఘంగా ప్రసంగించారు. పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి పనితీరుపై నేరుగా విమర్శలు గుప్పించారు. అదొక డొల్ల సంస్థగా మారిందని ఆక్షేపించారు. గొప్ప శక్తిసామర్థ్యాలు కలిగిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి ఇప్పుడు దాదాపు నిరీ్వర్యమైపోయిందని విమర్శించారు. ఆశించిన స్థాయిలో పని చేయడంలేదని, బలాన్ని ప్రదర్శించడం లేదని తప్పుపట్టారు. ఉత్త మాటలతో సమస్యలు పరిష్కారం అవుతాయా? యుద్ధాలు ఆగిపోతాయా? అని ట్రంప్ ప్రశ్నించడం గమనార్హం. ఘాటైన పదజాలంలో లేఖలు రాయడం తప్ప చేసిందేమైనా ఉందా? అని నిలదీశారు. ఐరాస ప్రధాన కార్యాలయానికి వస్తుండగా ఎస్కలేటర్ ఆగిపోవడం, టెలిప్రాంప్టర్ విఫలం కావడం గురించి మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐరాస వేదికపై ప్రసంగించడం ఇదే తొలిసారి. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఐరాస నుంచి ఫోన్ కూడా రాలేదు ‘‘అందరూ అసాధ్యం అన్నవి నేను సుసాధ్యం చేసి చూపించా. ఏడు నెలల్లో ‘ముగింపు లేని’ ఏడు యుద్ధాలు ఆపేశా. 36 ఏళ్లుగా, 31 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాలు కూడా ఇందులో ఉన్నాయి. కాంబోడియా–థాయ్లాండ్, కాంగో–రువాండా, భారత్–పాకిస్తాన్, ఇజ్రాయెల్–ఇరాన్, ఈజిప్టు–ఇథియోపియా, అర్మేనియా–అజర్బైజాన్, కొసావో–సెర్బియా యుద్ధాలకు ముగింపు పలికేశా. దీనివల్ల వేలాది మంది ప్రాణాలు నిలిచినట్లే. ఈ ఏడాది మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి చొరవ తీసుకున్నా. కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించా. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పని నేను చేయాల్సి రావడం నిజంగా బాధగా ఉంది. అసలు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏమిటి? యుద్ధాలు ఆపడానికి ఐక్యరాజ్యసమితి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. యుద్ధాల్లో మునిగి తేలుతున్న దేశాల అధినేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపా. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి నుంచి నాకు కనీసం ఫోన్కాల్ కూడా రాలేదు. ఐక్యరాజ్యసమితి నుంచి వచి్చంది ఏమిటయ్యా అంటే ఎస్కలేటర్ మాత్రమే. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. నా భార్య మెలానియా ట్రంప్ చక్కటి ఆకారం(õÙప్)లో ఉంది కాబట్టి కిందపడిపోలేదు. మేమిద్దరం చక్కటి ఆకారంలో ఉన్నాం. టెలిప్రాంప్టర్ కూడా సరిగ్గా పని చేయలేదు. టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ఉంటే హృదయం లోతుల నుంచి మరింత ఎక్కువగా మాట్లాడొచ్చు. రక్తపాతాన్ని ఆపేలా మా చర్యలుంటాయి ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయి. కొనుగోళ్లు ఆపాలని చెబుతున్నా మొండిగా కొనసాగిస్తున్నాయి. నాటో దేశాలు సైతం రష్యా నుంచి చమురు ఉత్పత్తులు, పలు రకాల ఇంధనాలు కొనుగోలు చేస్తుండడం క్షమించరాని విషయం. ఇది నాకు చాలా అసంతృప్తి కలిగిస్తోంది. ఏమైనా ఆలోచిస్తున్నారా? మీపై యుద్ధానికి మీరే నిధులు అందిస్తారా? ఉక్రెయిన్పై దాడులు ఆపాలని చెబుతున్నా రష్యా వినడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు, టారిఫ్లు విధించక తప్పదు. రక్తపాతాన్ని ఆపేలా మా చర్యలుంటాయి. అవి కూడా అతిత్వరలోనే. రష్యాపై చర్యలు తీసుకొనే విషయంలో యూరప్ దేశాలు కూడా మాతో కలిసి రావాలి. ఎందుకంటే రష్యాకు యూరప్ దేశాలే దగ్గర. మాకు, రష్యాకు మధ్య సముద్రం ఉంది. ఒకవైపు రష్యాతో పోరాడుతూనే మరోవైపు అదే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనడం సరైంది కాదు. ఇది నిజంగా కంపరం కలిగిస్తోంది. ఈ కొనుగోళ్లు తక్షణమే ఆపండి. ఇప్పటికే మనం చాలా సమయం వృథాచేశాం. యూరప్ దేశాల అధినేతలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడో ఎందుకు.. ఈ రోజే చర్చిద్దాం. ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయాలి ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం మాకు ఆమోదయోగ్యం కాదు. అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోం. గాజాపై యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ బందీలందరినీ హమాస్ మిలిటెంట్లు ఇకనైనా విడుదల చేయాలి. యుద్ధం ఆగాలంటే ఇజ్రాయెల్తోపాటు హమాస్ ముందుకు రావాలి. నియంత్రణ లేని వలసలతో అమెరికా సహా యూరప్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి అక్రమ వలసలకు ఐక్యరాజ్యసమితి వత్తాసు పలుకుతుండటం, కొన్నిసార్లు నిధులు కూడా ఇస్తుండటం దురదృష్టకరం. మరోవైపు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల పేరిట కొనసాగుతున్న వలసలు యూరప్ దేశాలకు మరణశాసనం రాస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదా? టారిఫ్ల విషయంలో విదేశాలు మమ్మల్ని తప్పుపడుతున్నాయి. మా సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకోవడానికే విదేశీ ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తున్నాం. ఇందులో మరోమాటకు తావులేదు. ఇక పునరుత్పాదక ఇంధన వనరులు ఒక జోక్. శిలాజ ఇంధనాలకు సరైన ప్రత్యామ్నాలు ఉన్నాయా? మా రాజధాని వాషింగ్టన్ డీసీ భద్రత పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు అక్కర్లేదు. మా రాజధాని భద్రంగా ఉంది’’ అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. -
హెచ్1బీ, జీఎస్టీ ఎఫెక్ట్
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. వారాంతాన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును ఎకాఎకిన లక్ష డాలర్ల(రూ. 88 లక్షలు)కు పెంచేయడం, గత వారం 0.25 శాతం వడ్డీ రేట్లను తగ్గించిన యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ భవిష్యత్ విధానాలపై ప్రసంగించనుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..దేశీయంగా స్టాక్ మార్కెట్లకు ఈ వారం కీలకంగా నిలవనుంది. గత వారం జూలై తదుపరి ప్రధాన ఇండెక్సులు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ గరిష్టాలకు చేరాయి. అయితే ఇకపై వీటి పరుగును దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా ఈ(సెపె్టంబర్) నెలకు హెచ్ఎస్బీసీ కాంపోజిట్, తయారీ, సర్వీసుల పీఎంఐ ఫ్లాష్ అంచనాలు వెలువడనున్నాయి. ఇక గత వారాంతాన ఉన్నట్టుండి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును 3,000–5,000 డాలర్ల నుంచి ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచేయడం ఐటీ పరిశ్రమలో సంచలనానికి తెరతీసింది. దీంతో యూఎస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన దేశీ ఐటీ దిగ్గజాల షేర్లు(ఏడీఆర్లు) అమ్మకాలతో డీలాపడ్డాయి. ఈ ప్రభావం నేడు(సోమవారం) కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ఐటీ పరిశ్రమలో కొన్నేళ్లుగా పెరిగిపోయిన ఆన్సైట్ సర్వీసులపై ఈ ప్రభావం పడవచ్చని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిరిగి ఆఫ్షోర్ విధానానికి ప్రాధాన్యత పెరగవచ్చని అంచనా వేశారు. 285 బిలియన్ డాలర్ల విలువైన దేశీ ఐటీ పరిశ్రమలో ఆన్షోర్ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. ఇప్పటికే ఎగుమతి ఆధారిత రంగాలు ట్రంప్ విధించిన అదనపు టారిఫ్లతో డీలాపడినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. హెచ్1బీ వీసాల జారీలో భారత నిపుణుల వాటా 70 శాతంకాగా.. దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోకు సెగ తగిలే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ వివరించారు. జీఎస్టీ దన్ను నేటి నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలు అమల్లోకిరానుండటంతో ఆటోమొబైల్, వైట్గూడ్స్, ఎఫ్ఎంసీజీసహా పలు రంగాలలోని కంపెనీలకు జోష్ లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కొనుగోళ్లు పెరిగి వ్యవస్థలో డిమాండ్ బలపడే వీలున్నట్లు అంచనా వేశాయి. ఇది పెట్టుబడులకు, ఉద్యోగాలకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రధానంగా జీఎస్టీని రెండు శ్లాబులు 5 శాతం, 18 శాతంగా క్రమబదీ్ధకరించడంతో పట్టణ ప్రాంతాలలోనూ డిమాండ్ ఊపందుకోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 40 శాతం శ్లాబులోకి మరికొన్ని ప్రొడక్టులను చేర్చినప్పటికీ జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీని రద్దు చేయడం, 375 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వినియోగానికి దారి చూపనున్నట్లు తెలియజేశారు. కాగా.. వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన ఈ నెల 22 నుంచి యూఎస్తో వాణిజ్య టారిఫ్లపై చర్చలు ప్రారంభంకానున్నట్లు దేశీ ప్రభుత్వం వారాంతాన వెల్లడించింది. ఇతర అంశాలు కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్లోనూ మరిన్ని కంపెనీలు ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు క్యూ కట్టనున్నట్లు పీఎల్ క్యాపిటల్ అడ్వయిజరీ హెడ్ విక్రమ్ కసట్ పేర్కొన్నారు. ఇక దేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు తదితర అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు వివరించారు. గత వారమిలా గత వారం మార్కెట్లు వరుసగా మూడోసారి లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 722 పాయింట్లు(0.9 శాతం) బలపడి 82,626 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 213 పాయింట్లు(0.85 శాతం) పుంజుకుని 25,327 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.5–2 శాతం చొప్పున ఎగశాయి.సాంకేతికంగా గత వారం అంచనాలనకు అనుగుణంగా మార్కెట్లు బ్రేకవుట్ బాటలో సాగాయి. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,350 సమీపంలో ముగిసింది. అయితే ఈ వారం నిఫ్టీకి 25,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చు. ఆపై ఇటీవలి గరిష్టం 25,669 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చు. ఒకవేళ బలహీనపడితే తొలుత 25,000 పాయింట్ల వద్ద మద్దతుకు వీలుంది. తదుపరి 24,650 వద్ద మరోసారి సపోర్ట్ లభించవచ్చు.వెనకడుగులోనే ఎఫ్పీఐలుఈ నెలలో రూ. 7,945 కోట్ల అమ్మకాలు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 7,945 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఆగస్ట్లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్లు విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. దీంతో ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.38 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. టారిఫ్లు, యుద్ధాలు తదితర ప్రపంచ అనిశి్చతులు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే గత వారం యూఎస్ ఫెడ్ 0.25 శాతం వడ్డీ రేటు కోత పెట్టడంతో ఎఫ్పీఐలు నికరంగా రూ. 900 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
41వ సారి!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: పదేపదే అదే విషయాన్ని చెప్పి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్లా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మారిపోయారు. ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం అణ్వస్త్రపోరుకు దారితీయకుండా తానొక్కడినే అడ్డంగా నిలబడి యుద్ధానికి ముగింపు పలికానని ట్రంప్ శనివారం మరోమారు ప్రకటించుకున్నారు. ఇలా ప్రకటించుకోవడం ఇది 41వ సారి కావడం గమనార్హం. ఈ ప్రకటనకు వర్జీనియా రాష్ట్రంలోని మౌంట్ వెర్నాన్ పట్టణంలో జరిగిన ‘అమెరికన్ కార్నర్స్టోన్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్స్’ డిన్నర్ కార్యక్రమం వేదికైంది. భారత్, పాక్ ఘర్షణలను తానే ఆపానని ట్రంప్ ఇప్పటికే పలు సందర్భాల్లో మొత్తంగా 40 సార్లు ప్రకటించారని వార్తలొచ్చాయి. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల మొద లైన యుద్ధాన్ని మీరొకసారి గుర్తుచేసుకోండి. నేనాయుద్ధాన్ని ఎలా ఆపానో తెలుసా? వాణిజ్యం ఆయుధంతో భయపెట్టి ఆ రెండు దేశాలను తీవ్ర యుద్ధంలో జారిపోకుండా కాపాడా. నేను ఇలా ఎన్నో యుద్ధాలను ఆపేశా. భారత్, పాకిస్తాన్, థాయ్లాండ్, కాంబోడియా, అర్మేనియా, అజర్బైజాన్, కొసొవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, రువాండా, డీఆర్ కాంగో ఇలా ఇన్ని దేశాల మధ్య ఆరంభమైన ఏడు యుద్ధాలను నిలువరించా. వీటిలో 60 శాతం యుద్ధాలను కేవలం వాణిజ్యబూచిని చూపి అడ్డుకున్నా. నెలల తరబడి కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నాకు కచ్చితంగా నోబెల్ శాంతి పురస్కారం దక్కుతుందేమో. అసలు నేను ఇప్పటికే 7 యుద్దాలను ఆపానుకదా ఈ లెక్కన ఒక్కో భారీ యుద్ధానికి ఒక నోబెల్ లెక్కేసుకున్నా ఏడు నోబెల్ బహుమతులు రావాలి. కానీ కొందరు నాతో మరోలా చెప్పారు. ఏడు సంగతి పక్కనబెడితే ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే మాత్రం నోబెల్ తథ్యం అని అన్నారు. వాస్తవానికి ఏడు సమరాలకు ముగింపు పలికడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క యుద్ధం ఆపడమంటే అత్యంత సంక్లిష్ట, సాహసోపేతమైన పని విజయవంతంగా పూర్తిచేసినట్లే. వాస్తవానికి పుతిన్తో నాకున్న పాత పరిచయాల కారణంగా ఈ యుద్ధం ఆపడం అత్యంత తేలిక అని గతంలో భావించా. నా నమ్మకా న్ని పుతిన్ వమ్ముచేసి వంచించారు. ఎలాగైనా సరే ఉక్రె యిన్ యుద్ధాన్ని ఆపి తీరుతా’’ అని ట్రంప్ అన్నారు. -
సాదిక్ ఖాన్ చెత్త మేయర్
లండన్: లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ప్రపంచంలోనే పరమ చెత్త మేయర్ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభివరి్ణంచారు. బ్రిటన్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన రాజ విందుకు.. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ను ఆహ్వానించవద్దని తానే వ్యక్తిగతంగా కోరానని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కింగ్ చార్లెస్–3 ఆతిథ్యమిచ్చిన రాజ విందులో ట్రంప్ పాల్గొన్నారు. రాజ విందులో బ్రిటన్, అమెరికాకు చెందిన ప్రముఖ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర ఉన్నత స్థాయి అతిథులు పాల్గొన్నారు. విందు అనంతరం ట్రంప్.. గురువారం బ్రిటన్ నుంచి బయలుదేరుతూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. ఖాన్ గైర్హాజరీ గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. సాదిక్ ఖాన్ అక్కడ ఉండటం తనకు ఇష్టం లేదని, అతన్ని ఆహా్వనించవద్దని తానే కోరానని స్పష్టం చేశారు. -
వార్ ఆపుతానని వంచించాడు
లండన్: ఉక్రెయిన్పై దురాక్రమణ జెండా ఎత్తి భీకరయుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల వేళ సమరానికి స్వస్తి పలుకుతానని చెప్పి తనను నమ్మించి మోసంచేశాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిటన్లో రెండ్రోజుల పర్యటనలో రాజు ఛార్లెస్ కుటుంబం, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్లతో వరుస భేటీలతో బిజీగా గడిపిన ట్రంప్ మరోవైపు ‘ఎక్స్’లో పుతిన్పై విమర్శలుచేశారు. ‘‘పుతిన్ ఎంతో మందిని చంపేస్తున్నారు. అంత కంటే ఎక్కువ మందిని దూరంచేసుకుంటున్నారు. మోసం చేసి నన్ను కూడా ఆయన దూరం చేసుకుంటున్నారు. చర్చల వేళ యుద్ధం ఆపేస్తానని చెప్పి పుతిన్ నన్ను దారుణంగా మోసంచేశారు. ఎంతో మనస్తాపానికి గురయ్యా’’అని ట్రంప్ అన్నారు. ఈ ఏడాది ఆగస్ట్లో అలాస్కా భేటీలో ట్రంప్, పుతిన్ అత్యంత ఆర్భాటంగా కలిసినా ఎలాంటి సంయుక్త ప్రకటన విడుదలచేయకపోవడంతో ప్రపంచదేశాలు ఉసూరుమన్న విషయం తెల్సిందే. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత్పై టారిఫ్ల భారం మోపడాన్ని ట్రంప్ సమరి్థంచుకున్నారు. ‘‘సులభమైన పద్ధతిలో చెప్పాలంటే ఒకవేళ ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోతే చమురును అమ్ముకుంటున్న రష్యాకు లాభాలు అడుగంటిపోతాయి. ఆయుధాలకు డబ్బుల్లేక చివరకు యుద్ధాన్ని ఆపుతుంది. చమురు ధర అంతర్జాతీయంగా దిగివస్తోంది. మరింతగా దిగవచ్చేలా నేను చేస్తా’’ అని అన్నారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్తో భేటీ తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపుతారన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ సమాధానం దాటవేసి పాత కయ్యాలకు రాజీ కుదిర్చానని చెప్పారు. ‘‘ పరిష్కారం కనుగొనడం అసాధ్యం అనుకునే 7 సంక్షోభాలకు ముగింపు పలికా. ఇకమీదటా మరో శుభవార్త వినగలమనే అనుకుంటున్నా. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా అమెరికాపై పడట్లేదు. ఉక్రెయిన్ యుద్ధం అంతానికి ఒక అవరోధం అడ్డుపడుతోంది’’ అని అన్నారు. స్టార్మర్తో చర్చలు బకింగ్షైర్లో చెకర్స్లోని 16వ శతాబ్దినాటి పురాతన భవంతిలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్తో చర్చలు జరిపాక మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఇంగ్లిష్ ఛానల్, సరిహద్దు గుండా అక్రమ చొరబాట్లపై స్టార్మర్కు మీరేం సలహా ఇస్తారని ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. ‘‘అమెరికాలోకి అయితే చట్టవ్యతిరేకంగా లక్షలాది మంది చొరబడుతున్నారు. ఇలాంటి అక్రమవలసదారులు ఎన్నో దేశాలను నాశనంచేశారు. అలా చూస్తూ ఊరుకోలేను. వాళ్లను బహిష్కరించి పంపేయడం తప్ప మరో మార్గంలేదు. స్టార్మర్కూ అదే చెప్పా. సైన్యాన్ని సరిహద్దులకు రప్పించి అక్రమ వలసలను కట్టడిచేయండి. సైన్యాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నామనేదే ముఖ్యం’’అని అన్నారు. మోదీ, భారత్తో నాకెంతో సాన్నిహిత్యం బుధవారం మోదీ బర్త్డే వేళ ఫోన్చేసి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ మరుసటి రోజు సైతం పొగిడారు. ‘‘భారత ప్రధాని మోదీ, ఇండియాతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. హ్యాపీబర్త్డే చెప్పేందుకు నిన్ననే ఫోన్చేసి మాట్లాడా. మా మధ్య సత్సంబంధాలున్నాయి. అయినాసరే భారత్పై అధిక టారిఫ్ మోపాల్సి వచి్చంది’’అని అన్నారు. బ్రిటన్తో టెక్ డీల్ ట్రంప్ పర్యటన వేళ బ్రిటన్తో అమెరికా సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సాంకేతికత శ్రేయస్సు ఒప్పదం అని పేరు పెట్టారు. కృత్రిమమేథ, క్వాంటమ్ కంప్యూటింగ్, అణువిద్యుత్ రంగాల్లో సహకారంతోపాటు బ్రిటన్లో సాంకేతికరంగాల్లో బడా అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఒప్పందం బాటలు వేయనుంది. మైక్రోసాఫ్ట్ ఏకంగా 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతానని ప్రకటించింది. మరో రెండేళ్లలో ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాల రంగాల్లో 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తానని గూగుల్ తెలిపింది. అఫ్గానిస్తాన్ స్థావరాన్ని తిరిగి సాధిస్తాం ‘‘అఫ్గానిస్తాన్లోని బాగ్రామ్ వైమానికస్థావరాన్ని తిరిగి చేజిక్కించుకుంటాం. అది జరిగితే నిజంగా ఇది సంచలన వార్తే అవుతుంది. దానిని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశం వెనుక పెద్ద కారణం ఉంది. అక్కడి నుంచి కేవలం గంట సేపు విమానంలో ప్రయాణిస్తే చైనా అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని చేరుకోవచ్చు’’అని ట్రంప్ అన్నారు. 1950దశకంలో సోవి యట్ రష్యా ఈ స్థావరాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసింది. 1980లలో అది ప్రధానస్థావరంగా వెలుగొందింది. 2001లో తాలిబన్ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోసి ఆ స్థావరాన్ని తమ వశంచేసుకుంది. చిన్నబేస్ను దశలవారీగా ఏకంగా 77 చదరపు కిలోమీటర్ల స్థాయికి పెంచింది. ఇటీవల అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా ని్రష్కమించడం తెల్సిందే. -
టారిఫ్ల వల్లే విభేదాలు: ట్రంప్
న్యూయార్క్: భారత్పై విధించిన టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు విధించాల్సి వచ్చిందని, ఇది సాధారణ విషయం కాదని అన్నారు. ఈ సుంకాల కారణంగా భారత్తో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శుక్రవారం ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. రష్యా చమురుకు భారత్ అతిపెద్ద కస్టమర్గా మారిందని ఆక్షేపించారు. దానికారణంగానే 50 శాతం టారిఫ్లు విధించక తప్పలేదని పునరుద్ఘాటించారు. నిజానికి అది చాలా పెద్ద నిర్ణయమని, దాన్ని మామూలు విషయంగా భావించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్పై మొండిగా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యా అధినేత పుతిన్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. రష్యా మిత్రదేశమైన భారత్పై భారీగా సుంకాలు విధించడం ద్వారా ఒకరకంగా చర్యలు తీసుకున్నట్లేనని వివరించారు. -
మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా..
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు చాలా మంచి మిత్రుడని, ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రాబోయే కొన్ని వారాల్లోనే మోదీతో సంభాషిస్తానని తెలిపారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు చురుగ్గా కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. ఈ చర్చలు విజయవంతం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చర్చలను సానుకూలమైన ముగింపునకు తీసుకురావడంలో ఇబ్బందులేవీ లేవని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. భారత్తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నానని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత్, అమెరికా నడుమ వాణిజ్యపరమైన అవరోధాలు కచ్చితంగా తొలగించుకుంటామని పేర్కొన్నారు. భారత్తో సంబంధాలను బలహీనపర్చుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదని ట్రంప్ తన చర్యల ద్వారా సంకేతాలిస్తున్నారు. ‘‘మోదీ గొప్ప ప్రధానమంత్రి. ఆయన నాకు ఎప్పటికీ మంచి మిత్రుడే. మేము ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటాం’’ అని ట్రంప్ శుక్రవారం వైట్హౌస్లో వ్యాఖ్యానించారు. -
శ్రుతి మించుతున్న ట్రంప్... వెనెజువెలాపై యుద్ధం!
వాషింగ్టన్: ఆసియా, యూరప్ అనంతరం అమెరికా ఖండాన్ని సైతం యుద్ధ మేఘాలు వేగంగా కమ్ముకుంటున్నాయి. తమకు చిరకాలంగా కొరకరాని కొయ్యగా మారిన పొరుగు దేశం వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. వెనెజులాలో డ్రగ్స్ కార్టెళ్ల విధ్వంసం ముసుగులో అక్కడి అపార చమురు నిక్షేపాలను చేజిక్కించుకునే దిశగా డొనాల్డ్ ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అమెరికా సైన్యం ఇప్పటికే వందల సంఖ్యలో భీకర, భారీ క్షిపణులను వెనెజువెలాపైకి ఎక్కుపెట్టింది. ట్రంప్ ఊ అన్న మరుక్షణమే విరుచుకుపడేందుకు అమెరికా యుద్ధనౌకలు, అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఈ బాహుబలి దాడిని కాచుకునేందుకు నిరుపేద వెనెజువెలా కాలూ చేయీ కూడదీసుకుంటోంది. యుద్ధాలను ఆపేస్తానంటూ ఆదర్శాలు వల్లించి రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్ ఈ ఎనిమిది నెలల్లో ఏ యుద్ధాన్నీ ఆపలేకపోగా ఇలా పొరుగు ఖండంలోనే స్వయంగా రణన్నినాదాలకు దిగుతుండడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.8 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలు మాదకద్రవ్యాలను తమ దేశంలోకి అక్రమంగా సరఫరా చేస్తున్న వెనెజువెలా డ్రగ్స్ ముఠాల ధ్వంసానికి సైనిక చర్యకూ వెనుకాడబోమని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అన్నట్టుగానే వెనెజువెలాను సముద్ర మార్గాన చుట్టుముట్టాల్సిందిగా నేవీని ఆదేశించారు. దాంతో అత్యాధునిక యుద్ధ నౌకలు యూఎస్ఎస్ గ్రేవ్లీ, యూఎస్ఎస్ జాసన్ డన్హమ్ ఆగమేఘాలపై దక్షిణ కరేబియన్ సముద్రంలోకి ప్రవేశించి వెనెజువెలాపైకి గైడెడ్ మిసైల్స్ ఎక్కుపెట్టాయి. అప్పటికే అక్కడున్న డి్రస్టాయర్ నౌక యూఎస్ఎస్ సామ్సన్ వాటికి తోడైంది. ఇవి చాలవన్నట్టు పసిఫిక్ మహా సముద్రం నుంచి యూఎస్ఎస్ లేక్ ఏరీ నౌకను రప్పిస్తున్నారు. యూఎస్ఎస్ ఇవో జిమా, యూఎస్ఎస్ సాన్ ఆంటోనియో, యూఎస్ఎస్ ఫోర్ట్ లాడెర్డేల్ వంటి యుద్ధ నౌకలూ యుద్ధ ప్రాతిపదికన వచ్చి చేరుతున్నాయి. ఇలా 8 అత్యాధునిక యుద్ధ నౌకలు వెనెజువెలా తీరం వెంబడి అంతర్జాతీయ జలాలను అష్టదిగ్బంధనం చేశాయి. 4,000 మంది సెయిలర్లు, మెరైన్ కమెండోలు సిద్ధంగా ఉన్నారు. వెనెజువెలా డ్రగ్స్ ముఠాలపై ఆకాశ మార్గంలో కూడా విరుచుకుపడేందుకు 10 అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను కూడా అమెరికా శనివారమే ప్యూర్టోరికోకు తరలించి ఉంచింది!వెనెజువెలా ‘తగ్గేదే లే’! సైనికపరంగా అమెరికాతో వెనెజువెలా ఏమాత్రం తూగలేదు. అమెరికా, యూరప్ కఠిన ఆంక్షల దెబ్బకు నికొలాస్ మదురో సారథ్యంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అత్యాధునిక ఆయుధ, సైనిక సంపత్తిని సమకూర్చుకోలేకపోయింది. ఉన్నవల్లా కాలం చెల్లిన పాతకాలపు ఎఫ్–16 యుద్ధ విమానాలే! సైన్యం కూడా 1.5 లక్షల కన్నా లేదు. అన్ని విభాగాలూ కలిపినా 3.5 లక్షల లోపే! అయినా సరే, అమెరికా వంటి తిరుగులేని సైనిక శక్తిని యథాశక్తి ప్రతిఘటించి తీరతామని మదురో ఇటీవలే ప్రకటించారు. అతి త్వరగా ఏకంగా 50 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తానని చెప్పారు! చమురు నిక్షేపాలపై కన్ను పేద దేశమైనా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలకు వెనెజువెలా కేంద్రం. దేశంలో దాదాపు 48 వేల మిలియన్ టన్నుల చమురు నిల్వలున్నట్లు గుర్తించారు. అమెరికా కఠిన ఆంక్షల వల్ల వాటిని వెలికితీయటం సాధ్యపడటం లేదు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడే ఆ చమురు నిల్వలపై కన్నేశారు. వెనెజువెలా చమురంతా అమెరికాకే దక్కాలని అప్పట్లోనే బహిరంగ ప్రకటనలు చేశారు. అందుకోసం అవసరమైతే అక్కడి చమురు క్షేత్రాలను ఆక్రమించుకుంటామన్నారు! మరోవైపు కమ్యూనిస్టు నాయకుడైన అధ్యక్షుడు మదురో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. ట్రంప్ మద్దతుదారులైన ప్రతిపక్ష నేతలను తీవ్రంగా అణచివేశారు. దాంతో మదురోను పట్టించినవారికి రూ.450 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. వెనెజువెలాలో చైనా భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు 90 శాతం చమురు కొనుగోలు చేస్తోంది. ఇది అమెరికాకు కంటగింపుగా ఉంది. -
దోస్త్ మేరా దోస్త్!
న్యూయార్క్/వాషింగ్టన్: నాలుకకు నరం లేదని, తన చిత్తం క్షణక్షణానికీ మారుతూ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించారు. రష్యా, చైనాతో పాటు భారత్పైనా ఒంటికాలిపై లేచి ఒక్కరోజైనా గడవకుండానే షరామామూలుగా ప్లేటు ఫిరాయించారు. భారత్పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘భారత్తో అమెరికాకు ‘ప్రత్యేక బంధ’ముంది. ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది కూడా’’ అని శుక్రవారం (అమెరికా కాలమానం ప్ర కారం) వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో మీడియా భేటీ సందర్భంగా మీడియా ప్రశ్నలకు బదులుగా చెప్పుకొచ్చారు. మోదీ కూడా అందుకు అత్యంత హుందాగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షుని తాలూకు ఈ మారిన వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత–అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు. ట్రంప్ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్లో ప్రధాని పోస్టు పెట్టారు. భారత్, అమెరికాలది అత్యంత సానుకూల, ప్రగతి శీల, సమగ్ర వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వా మ్యం అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జూన్ 17 నాటి ఫోన్ సంభాషణల అనంతరం ట్రంప్, మోదీ పరస్పరం స్పందించడం ఇదే తొలిసారి. ప్రతీకార సుంకాల కారణంగా దిగజారిన ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణకు అమెరికా, భారత్ సంసిద్ధతకు ఇది నిదర్శనమని పరిశీలకులు భావిస్తున్నారు. నిమిషానికో మాట... భారత్, రష్యాలను దుష్ట చైనాకు కోల్పోయామంటూ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ట్రూత్సోషల్’లో ట్రంప్ ఘాటుగా పోస్టు పెట్టడం తెలిసిందే. ఆ మూడింటి దోస్తీ సుదీర్ఘంగా వర్ధిల్లాలంటూ వ్యంగ్యోక్తులు కూడా విసిరారు. ‘యుద్ధమా, శాంతా అమెరికాయే తేల్చుకోవా’లన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హెచ్చరికలకు స్పందనగా ట్రంప్ పెట్టిన ఆ పోస్టు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయన ఒంటెత్తు పోకడల కారణంగా అమెరికాతో భారత సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిపోవడం తెలిసిందే. వాటిని పూర్తిస్థాయిలో చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ట్రంప్ను విలేకరులు ప్రశ్నించారు. అందుకాయన రకరకాలుగా స్పందించారు. ‘‘ఇరుదేశాల సంబంధాల విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదు. ఏదో, అప్పుడప్పుడూ అలా జరుగుతూ ఉంటుంది’ అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. ‘‘మోదీతో నేను చాలా చనువుగా ఉంటా తెలుసా! ఆయన చాలా గొప్ప వ్యక్తి. రెండు నెలల క్రితమే అమెరికాలో పర్యటించారు కదా!’’ అంటూ ప్రధానిపై మరోసారి పొగడ్తలు కురిపించారు. ‘‘ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి రోజ్ గార్డెన్లో వ్యాహ్యాళికి వెళ్లాం. అక్కడి గడ్డి చెప్పలేనంత తడిగా ఉంది. మీడియా కాన్ఫరెన్స్కు అస్సలు సరైన ప్రదేశం కాదది. అలాంటి చోట ప్రెస్మీట్ పెట్టడం నాకదే చివరిసారి’’ అని చెప్పుకున్నారు. అంతలోకే, ‘మోదీ ప్రస్తుతం చేస్తున్న పనే నాకస్సలు నచ్చడం లేదు’ అంటూ రష్యా, చైనాలతో భారత మైత్రిపై తన ఆగ్రహాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ‘అయినా సరే, భారత్తో అమెరికాకు అత్యంత ప్రత్యేక బంధముంది’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘అంతలోకే, రష్యా నుంచి భారత్ అంతంత భారీగా చమురు కొనేస్తుండటం నాకస్సలు నచ్చడం లేదు. ఇది నన్నెంతో నిరాశకు గురి చేస్తోంది’’ అంటూ మళ్లీ అక్కసు వెళ్లగక్కారు. ‘‘ఈ విషయం వాళ్లు తెలుసుకోవాలి. అందుకేగా భారత్పై అతి భారీగా 50 శాతం సుంకాలు విధించా!’’ అని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే మోదీపై మళ్లీ ప్రశంసలు కురిపించారు. భారత్ను చైనాకు కోల్పోయామంటూ మీరు చేసిన పోస్టు నిజమేనా అని మీడియా ప్రశ్నించగా, అలా జరిగిందని తాను అనుకోవడం లేదని ట్రంప్ చెప్పడం విశేషం!వాణిజ్య చర్చలు సూపర్ భారత్తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని మీడియా ప్రశ్నకు బదులుగా ట్రంప్ చెప్పారు. ‘‘అన్ని దేశాలతోనూ చర్చలు బాగా జరుగుతున్నాయి. కాకపోతే గూగుల్ తదితర అతి పెద్ద అమెరికా టెక్ దిగ్గజాల పట్ల యూరోపియన్ యూనియన్ వైఖరి విషయంలోనే బాగా నిరాశకు లోనయ్యాం’’ అని బదులిచ్చారు.మళ్లీ నవరో నోటిదురుసు! భారత్ పట్ల విద్వేషానికి పెట్టింది పేరుగా మారిన ట్రంప్ సలహా బృందం సీనియర్ సభ్యుడు పీటర్ నవరో మరోసారి నోరు పారేసుకున్నారు. రష్యా నుంచి భారత్ కొంటున్న చమురు ద్వారా సమకూరుతున్న ఆర్థిక వనరులే ఉక్రెయిన్పై యుద్ధానికి ఆదరువుగా మారాయంటూ మరోసారి ప్రేలాపనలకు దిగారు. -
టారిఫ్లతో చంపుతోంది
వాషింగ్టన్: భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. భారత్ అత్యధిక టారిఫ్లతో అమెరికాను చంపుతోందని మండిపడ్డారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియాతోపాటు చైనా, బ్రెజిల్లు భారీగా టారిఫ్లు విధిస్తున్నాయని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన తాజాగా స్కాట్ జెన్సింగ్స్ రేడియో కార్యక్రమంలో మాట్లాడారు. అమెరికా ఉత్పత్తులపై ఇకపై ఎలాంటి టారిఫ్లు విధించబోమంటూ ఇండియా తమకు ఆఫర్ ఇచి్చందని అన్నారు. భారతదేశ ఉత్పత్తులపై తాము టారిఫ్లు భారీగా పెంచాం కాబట్టి అలాంటి ఆఫర్ వచ్చిందని, లేకపోతే వచ్చేదేకాదని తేలి్చచెప్పారు. కాబట్టి ఇండియాపై టారిఫ్లు వేయడంలో అన్యాయం ఏమీ లేదని పరోక్షంగా స్పష్టంచేశారు. తమ చర్యల వల్లే ఇతర దేశాలతో బేరమాడే శక్తి పెరిగిందని పేర్కొన్నారు. భారత్–అమెరికా బంధం ఏకపక్షమే భారత వాణిజ్య విధానాలను ట్రంప్ మరోసారి తప్పుపట్టారు. భారత్–అమెరికాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సంబంధాలన్నీ ఏకపక్ష బంధంగా అభివరి్ణంచారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం వైట్హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఇండియాతో చాలా బాగా కలిసి పోయాం. కానీ, మా బంధం చాలా ఏళ్లుగా ఏకపక్ష బంధంగానే ఉంది. భారత్ అపారమైన సుంకాలను వసూలు చేస్తోంది. మా ఉత్పత్తులపై వందశాతం సుంకాలు విధించింది. అందుకే ఇండియా నుంచి దిగుమతులు ఆపేశాం. వాణిజ్యం చేయడం లేదు. కానీ, ఇండియాకు అమెరికాలో భారీగా మార్కెట్ ఉంది. ఎందుకంటే ఇండియా నుంచి మేము మూర్ఖంగా సుంకాలు వసూలు చేయడం లేదు. వారు తయారు చేసిన ప్రతి వస్తువును అమెరికాకు పంపగలుగుతున్నారు. వారి ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. భారత్ వాణిజ్య విధానాలు అమెరికాలోని తయారీదారులకు భారీ నష్టాన్ని కలిగించాయి’’ అని ట్రంప్ ఆరోపించారు. హార్లీ–డేవిడ్సన్ బైక్లు అమ్మలేకపోయాంఅమెరికాలో అత్యంత గుర్తింపు పొందిన మోటార్సైకిల్ బ్రాండ్లలో ఒకటైన హార్లీ–డేవిడ్సన్ భారత్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ట్రంప్ ప్రస్తావించారు. ‘హార్లీ–డేవిడ్సన్ బైక్లను భారత్లో అమ్మలేకపోయాం. మోటార్ సైకిల్పై 200 శాతం సుంకం విధించారు. దాంతో సుంకాలను తప్పించుకోవడానికి హార్లీ–డేవిడ్సన్ సంస్థ భారత్లోనే ప్లాంట్ నిర్మించాల్సి వచి్చంది. ఈ అన్యాయమైన సుంకాల వల్ల కంపెనీలు తమ ఉత్పత్తులను అమెరికా వెలుపల చేస్తున్నాయి. నేను అధికారంలోకి వచ్చాక ఈ వాణిజ్య విధానాలను తిప్పికొట్టడం ప్రారంభించా. అందులో భాగమే ఈ పరస్పర సుంకాలు’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమెరికా వైపే మొగ్గు తమ నూతన విధానాలతో అనేక సంస్థలు అమెరికాలో కంపెనీలను, ప్లాంట్లను స్థాపించడానికి ముందుకు వస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. ‘‘మా వాణిజ్య విధానాల వల్ల కార్ల కంపెనీలు, ఏఐ సంస్థలు ఇప్పుడు అమెరికా వైపు మొగ్గుచూపుతున్నాయి. చైనా, మెక్సికో, కెనడా నుంచి మేము దిగుమతి చేసుకుంటున్న అనేక కార్ల కంపెనీలు ఇప్పుడు మా దేశంలోనే ఏర్పాటవుతున్నాయి. దానివల్ల ఆయా కంపెనీలపై సుంకాల మోత తప్పుతోంది. వాటికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతోంది’’ అని ట్రంప్ తెలిపారు. ఏడు యుద్ధాలను ఆపేశా.. ప్రపంచ యుద్ధాలను ఆపానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ట్రంప్ మరోమారు అదే విషయం చెప్పారు. తన వాణిజ్య విధానాలతో ఏడు యుద్ధాలను పరిష్కరించానని స్పష్టంచేశారు. ‘‘సుంకాల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థకే కాకుండా ఏడు యుద్ధాలను పరిష్కరించడానికి సహాయపడింది. అమెరికా చాలా శక్తివంతమైన దేశం. అమెరికా లేకపోతే ప్రపంచంలో ఏదీ లేదు. టారిఫ్లు మా దేశాన్ని ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా మార్చాయి. ఈ టారిఫ్లతోనే ఏడు యుద్ధాలను ఆపాను’’ అని వ్యాఖ్యానించారు.అవన్నీవదంతులు..తన అనారోగ్యంపై వస్తున్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. ‘‘మీరు చనిపోయారంటూ వార్తలు మీ దృష్టికి వచ్చాయా?’’ అని ఓ విలేకరి ప్రశ్నించగా ట్రంప్ స్పందించారు. తన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయని మాత్రమే విన్నానని తెలిపారు. అవి కూడా పుకార్లేనని ఖండించారు. తాను చాలా చురుగ్గా ఉన్నానని, ముందే చెప్పినట్టుగా ఇప్పుడున్నంత ఆరోగ్యంగా మరెప్పుడూ లేనని స్పష్టం చేశారు. -
ట్రంప్, మోదీ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు
-
టారిఫ్లు అక్రమం
వాషింగ్టన్: శత్రుదేశాలు, మిత్ర దేశాలు అనే తేడా లేకుండా ఎడాపెడా టారిఫ్ల వాతలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అక్కడి అప్పీళ్ల కోర్టు షాక్ ఇచ్చింది. అధికారాలను మితిమీరి వాడేశారని, ఇలా టారిఫ్లు పెంచడం పూర్తిగా అక్రమమని వాషింగ్టన్లోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్’శుక్రవారం తీర్పు చెప్పింది. ‘‘ప్రపంచంలోని ప్రతి దేశంపై ఇష్టారీతిన అంతర్జాతీయ టారిఫ్లు పెంచేసే అధికారం, అర్హత అధ్యక్షుడికి లేవు’’అని జడ్జీలు 7–4 మెజారీ్టతో తీర్పు చెప్పారు. అధిక టారిఫ్లను తప్పుబడుతూ మేలో న్యూయార్క్లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును మేం సమర్థిస్తున్నామని మెజారిటీ జడ్జీలు తమ తీర్పులో అభిప్రాయపడ్డారు. అమెరికా అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) ప్రకారమే ఈ టారిఫ్లు పెంచామన్న ట్రంప్ ప్రభుత్వం చేసిన వాదనలను జడ్జీలు తోసిపుచ్చారు. ఐఈఈపీఏ చట్టానికి విరుద్దంగా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకున్నారు. అధికారాలను మితిమీరి ఉపయోగించారు. ఇలా భూగోళం మీది ప్రతి ఒక్క దేశంపై టారిఫ్ మోపకూడదు. పెంచిన టారిఫ్లను తొలగిస్తే ఇప్పటికిప్పుడే అమెరికా ఆర్థికవ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. అందుకే అక్టోబర్ 14వ తేదీదాకా యథాతథ స్థితిని కొనసాగిస్తాం. ఆలోపు ఈ కేసును యూఎస్ సుప్రీంకోర్టు పరిశీలించాలని కోరుతున్నాం’’అని 127 పేజీల తీర్పులో అప్పీళ్ల కోర్టు తెలిపింది. తీర్పుపై దుమ్మెత్తిపోసిన ట్రంప్ తన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెలువడిన కోర్టు తీర్పుపై వెంటనే ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆరోపణలు గుప్పించారు. ‘‘తీర్పు తర్వాత సైతం నేను విధించిన టారిఫ్లు ఇంకొన్ని రోజులు అమల్లోనే ఉండబోతున్నాయి. పక్షపాతధోరణితోనే అప్పీళ్ల కోర్టు టారిఫ్లను తప్పుబట్టింది. అప్పీళ్ల కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిన సుప్రీంకోర్టులో గెలిచి తీరతాం. చివరకు గెలిచేది మేమే. ఒకవేళ టారిఫ్లను తొలగిస్తే దేశంలో వినాశనం తప్పదు. అది మన ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుంది. వాస్తవానికి మన వ్యవస్థ బలీయంగా ఉండాలి. శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా మనపై విదేశాలు మోపిన టారి ఫ్ల భారాన్ని, వాణిజ్య లోటును అమెరికా సహించబోదు. విదేశాల విధానాలతో మన తయారీసంస్థలు, రైతులుసహా ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారు. మన కార్మికులతోపాటు కర్మాగారాలను పరిరక్షించాలంటే విదేశాలపై టారిఫ్లను పెంచడమే అత్యుత్తమ మార్గం’’అని ట్రంప్ అన్నారు.ఇప్పుడేం జరగొచ్చు? అప్పీళ్ల కోర్టులో కేసును ఓడిపోవడంతో ట్రంప్ వెంటనే యూఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అక్కడే ట్రంప్ సర్కార్కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్ సుప్రీంకోర్టులోని 9 మంది జడ్జీల్లో ఆరుగురిని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వాలే నియమించాయి. ఈ ఆరుగురిలో ముగ్గురిని స్వయంగా ట్రంప్ నియమించారు. వీరంతా ట్రంప్కు అనుకూలంగా తీర్పు చెప్పే అవకాశముంది. అయితే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పోలిస్తే స్వయంగా అధ్యక్షుడు కలుగజేసుకున్న కేసులను యూఎస్ సుప్రీంకోర్టు మరింత నిశితంగా పరిశీలించే వీలుంది. అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)ను కాదని సొంతంగా తీసుకున్న నిర్ణయాలతో వెలువర్చిన కార్యనిర్వాహక ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు పారదర్శకంగా వ్యవహరిస్తే ఈ కేసు ఫలితం ఎటువైపు రానుందో ఇప్పుడే చెప్పడం కష్టమే. ఒకవేళ సుప్రీంకోర్టు సైతం ట్రంప్ టారిఫ్లు చట్టవ్యతిరేకమని తేలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. అదనపు టారిఫ్ల కింద వసూలుచేసిన వందల బిలియన్ డాలర్లను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. -
ట్రంప్కేమైంది?
న్యూఢిల్లీ: ట్రంప్కేమైంది? ఆయన బాగున్నారా?అసలు బతికే ఉన్నారా? అమెరికా అధ్యక్షుడు మరణించారంటూ శనివారం ఉన్నట్టుండి పుకార్లు పుట్టా యి. చూస్తుండగానే ప్రపంచమంతటా కార్చిచ్చు వేగంతో వ్యాపించాయి. ఈ వైనమంతా ‘ట్రంప్ మరణించారు’ పేరిట ఇంటర్నెట్లో రోజంతా యమా ట్రెండింగ్గా మారింది. సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 60 వేలకు పైగా పోస్టులు పుట్టుకొచ్చాయి. గ్రోక్ తదితరాల్లోనైతే ఏకంగా 13 లక్షల మందికి పైగా ఈ విషయమై ఆరాలు తీశారు. నిజానికి 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం కొన్ని నెలలుగా అమెరికాలోనే గాక ప్రపంచమంతటా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత జూలైలో ఆయన చేతికి గాయం, కాళ్ల మడిమల వాపుతో కన్పించడంతో లెక్కలేనన్ని పుకార్లకు తెర లేచింది. ఆయన ఆరోగ్యం నిక్షేపంగా ఉందంటూ వైట్హౌస్ వర్గాలు వెంటనే వివరణ ఇచ్చినా అనుమానాలు మాత్రం నేటికీ ఆగలేదు. అందుకు తగ్గట్టే, ట్రంప్ తన గాయాలు, వాపులు తదితరాలను మేకప్తో మేనేజ్ చేస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం కూడా విపరీతంగా వార్తలు వెలువడ్డాయి. పైగా తాజా పుకార్లపై వైట్హౌస్ కూడా మౌనం పాటిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు ఇటీవల స్వయానా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (41) చేసిన వ్యాఖ్యలు వీటికి మరింత ఆజ్యం పోశాయి. ‘‘200 రోజులుగా (ఉపా ధ్యక్షునిగా) మంచి శిక్షణ పొందుతూ వస్తున్నా. పెను విషాదమేదైనా జరిగి తప్పనిసరైతే, ‘పెద్ద బాధ్యతలు’ స్వీకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నా ’’ అని బుధవారం ఒక ఇంటర్వ్యూలో అన్నారాయ న! ఆ వెంటనే సర్దుకుని, ‘‘ట్రంప్ ఆరోగ్యం భేషుగ్గా ఉంది. ఈ వయసులో కూడా అర్ధరాత్రి దాటేదాకా పని చస్తున్నారు. మళ్లీ తెల్లవారుజామునే మేల్కొంటున్నారు’’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే నాలుగు రోజులుగా బయటి ప్రపంచానికి కన్పించని ట్రంప్, శనివారం ఉదయమే తన మనవ రాలు కై తదితరులతో కలిసి వర్జీనియాలో గోల్ఫ్ క్లబ్కు వెళుతున్న ఫొటోలు బయటికొచ్చాయి.జనానికి దూరంగా... కొంతకాలంగా ట్రంప్ బయట కన్పించడం బాగా తగ్గింది. అలాగని బయటి ప్రపంచానికి ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారని చెప్పడానికి కూడా లేదు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో శనివారం తెల్లవారుజామున కూడా ఆయన ఖాతాలో ఒక మెసేజ్ దర్శనమిచ్చింది. ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్లు ఇంకా అమల్లోనే ఉన్నాయని ట్రంప్ అందులో రాసుకొచ్చారు.ఆ గాయం వెనక... అప్పట్లో ఓవల్ ఆఫీసులో భేటీ సందర్భంగా గాయాలైన కుడి అరచేయిని ట్రంప్ వీలైనంతగా కప్పుకుంటూ మీడియా కంటబడ్డారు. దక్షిణ కొరియా అధ్యక్షునితో భేటీ సందర్భంగా కుడిచేయి వెనకవైపు గాయంతో కనిపిస్తున్న ట్రంప్ ఫొటోలు తాజాగా విపరీతంగా ట్రెండయ్యాయి. ఆయన దీర్ఘకాలంగా నరాల బలహీనతతో బాధపడుతున్నట్టు తాజాగా జరిపిన వార్షిక ఆరోగ్య పరీక్షల్లో తేలింది. 70 ఏళ్ల పైబడ్డ వారిలో ఇది సాధారణమేనని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ అప్పట్లో అన్నారు. ట్రంప్ నరాల సమస్య పెద్ద విషయమేమీ కాదంటూ ఆయన వ్యక్తిగత వైద్యుని పేరిట ఒక లేఖ నోట్ను కూడా ప్రభుత్వం హడావుడిగా విడుదల చేసింది. అంతకుముందు గత ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్తో భేటీ సందర్భంగా కూడా ట్రంప్ కుడి చేయి ఇలాగే వార్తల్లో నిలిచింది. దానికి కొట్టొచి్చనట్టుగా కన్పించే స్థాయిలో మేకప్ వేసుకున్న వైనాన్ని అంతా గమనించారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ
-
ఏనుగును ఎలుక ఢీకొడుతున్నట్టుగా ఉంది
వాషింగ్టన్: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసినందుకు భారత్ను శిక్షించాలనే ప్రయత్నంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఆ దేశానికే ఎసరు తెస్తున్నాయి. భారత్ పట్ల అమెరికా వైఖరిపై ట్రంప్ ప్రభుత్వం సొంత ఆర్థిక వేత్తలనుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. భారత్పై అమెరికా సుంకాల చర్యలు ఏనుగును ఎలుక పిడికిలితో ఢీకొట్టినట్టుగా ఉందని అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వ్యక్తిలా అమెరికా వ్యవహరిస్తోందని, కానీ తనను తానే దహించుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలు బ్రిక్స్ కూటమిని పోషిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్ను విజయవంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా అమెరికా అభివృద్ధి చేస్తోందని గుర్తు చేశారు. కాగా, భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రష్యా టుడేకు ఇచి్చన ఇంటర్వ్యూలో వోల్ఫ్ మాట్లాడారు. బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తోంది.. ‘భూమిపై అతిపెద్ద దేశం భారత్. సోవియట్ యూనియన్ కాలం నుంచే అమెరికాతో భారత్కు బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ మర్చిపోతున్నారు. భారత్కు అమెరికా మార్కెట్ గేట్లు మూసేస్తే.. ఆ దేశం తన ఎగుమతులను విక్రయించడానికి ఇతర దేశాలను వెదుక్కుంటుంది. చమురును అమ్ముకునేందుకు రష్యా ఇతరత్రా మార్కెట్లను సిద్ధం చేసుకున్నట్లే.. భారత్ కూడా ఇతరత్రా మార్కెట్లను తయారు చేసుకోగలదు. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ కూటమిలోని చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాల వాటా 35 శాతం దాకా ఉంది. జీ7 దేశాల జీడీపీ వాటా 28 శాతమే. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు బ్రిక్స్ దేశాలను బలోపేతం చేస్తాయి. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారుస్తాయి’అని వోల్ఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా దిగుమతిదారులకూ ప్రమాదం.. ‘ప్రస్తుతం భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో వస్తువులు, సేవలను చౌకగా పొందుతున్న కంపెనీలు అమెరికాకు తరలే అవకాశమే లేదు. అందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించవు. ఇప్పటికే అమెరికాలో కొత్త ఉద్యోగాలు లేవు. సుంకాల వల్ల అమెరికన్ ఎగుమతిదారులూ రిస్్కను ఎదుర్కొంటున్నారు. వాళ్లు విదేశీ మార్కెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు ట్రిలియన్ డాలర్ల అప్పులున్నాయి. విదేశీ అప్పులపై అమెరికా ఇంకా ఎంతకాలం నిలువగలదనేది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా అప్పులపై వడ్డీల భారం పెరిగిపోతుంది. తద్వారా అమెరికా బలహీనపడుతుంది’అని వోల్ఫ్ విశ్లేషించారు. బ్రిక్స్ దేశాలకు బెదిరింపులు.. బ్రిక్స్ పది దేశాలతో కూడిన సమూహం. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యుదేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి పాశ్చాత్య ఆర్థిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. అయితే.. ట్రంప్ అనేక సందర్భాల్లో బ్రిక్స్ను వేగంగా అంతరించిపోతున్న ఒక చిన్న సమూహంగా తోసిపుచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరిలో ఏకంగా బ్రిక్స్ చచి్చపోయిందన్నారు. డాలర్ను కాదని ఉమ్మడి కరెన్సీని సృష్టించడానికి ప్రయతి్నస్తే.. సభ్య దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు. -
అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం: వాన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా భయంకరమైన విషాదం జరిగితే అమెరికా కమాండర్–ఇన్–చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే.. ట్రంప్ తన నాలుగు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసేంత ఆరోగ్యంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ.. జనవరిలో మొదటిసారి ఓవల్ ఆఫీసులో అడుగు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఆ గొప్పతనం, అద్భుతమైన చరిత్ర చూసి ముగ్ధుడినయ్యాను. అది నిజంగా అద్భుతమైన అనుభవం. అది శీతాకాలం. కర్టెన్లు మూసి ఉండటంతో చాలా చీకటిగా కనిపించింది. ప్రపంచ నాయకుడు పనిచేసే ప్రదేశం ఇలాగే ఉండకూడదు. అది కొంచెం వెలుగుతో, ఉత్సాహంగా ఉండాలనుకున్నా. ఆ తరువాత అధ్యక్షుడు చేసిన మార్పులు నాకు చాలా నచ్చాయి. JUST IN—VP JD Vance said he is prepared to step in if “a terrible tragedy” were to befall Trump, while emphasizing that Trump is “in incredibly good health” and brimming with “incredible energy.” Trump is sicker than we thought. pic.twitter.com/fX9uiauvtp— ADAM (@AdameMedia) August 28, 2025 వైట్హౌస్ను పునరుద్ధరించడంలో ట్రంప్ విలక్షణమైన శైలి నాకు బాగా నచ్చింది’ అని ప్రశంసించారు. అనంతరం 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం గురించి ఆందోళనలను ప్రస్తావించగా.. ‘ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనకు అద్భుతమైన శక్తి ఉంది. ఆయనతో పనిచేస్తున్నవారు చాలామంది ఆయనకంటే చిన్న వయసువాళ్లే. అయినా వారందరికంటే చివరిగా నిద్రపోయేది, మొదటగా నిద్ర లేచేది ట్రంపే. ఆయన మిగిలిన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం నాకుంది. అమెరికన్ ప్రజలకోసం ఆయన ఇంకా ఎన్నో గొప్ప పనులు చేస్తారు’ అని వాన్స్ వ్యాఖ్యానించారు. పెద్ద విషాదం ఏదైనా జరిగి, అనుకోని పరిస్థితులు ఎదురైతే, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని వాన్స్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్తో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతికి పెద్ద గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తాయి. 78 సంవత్సరాల ఏడు నెలల వయసులో ఈ ఏడాది జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో ట్రంప్ అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడాయన. అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ 2021లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయసు 78 సంవత్సరాల రెండు నెలలు. ఇక, ఈ నెల ప్రారంభంలో ట్రంప్ మాట్లాడుతూ వాన్స్ను తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వారసుడిగా చెప్పుకొచ్చారు. కానీ వాన్స్ మాత్రం 2028 అధ్యక్ష ఎన్నికల ప్రణాళికల గురించి ఊహాగానాలను తోసిపుచ్చుతూనే ఉన్నారు. -
ఫెడరల్ రిజర్వు గవర్నర్కు ట్రంప్ ఉద్వాసన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్ను తొలగించారు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి సొంత ట్రూత్ మీడియాలో ట్రంప్ ప్రకటించారు. ఆమె మోసానికి పాల్పడినట్లు వచి్చన ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని తెలిపారు. మిషిగన్, జార్జియాలోని భవనా లను ప్రాథమిక నివాసాలుగా ప్రకటిస్తూ ఆమె సంతకాలు చేసిన పత్రాలను ట్రంప్ అటాచ్ చేశారు. రెండు వారాల వ్యవధిల్లోనే రెండిళ్లను ఆమె కోరారని, బహుశా మొదటి నివాసం విషయం మ ర్చిపోయి ఉంటారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మార్టిగేజ్(తనఖా) విభాగానికి ట్రంప్ నియమించిన బిల్ పాల్ట్ గత వారం స్వయంగా లిసాపై ఆరోపణలు చేయడం గమనార్హం. స్వల్పకాలిక వడ్డీ రేట్లలో కోత విధించాలంటూ ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్పై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. చెప్పింది చేయకుంటే పదవి నుంచి తొలగిస్తానని హెచ్చరిక సైతం చేయడం గమనార్హం. అదేవిధంగా, సెంట్రల్ బ్యాంకు బోర్డులోని ఏడుగురు సభ్యుల్లో లిసా ఒకరు. మొత్తం 12 మంది సభ్యుల్లో లిసా సహా ఏడుగురికి మాత్రం వడ్డీ రేట్లు తగ్గించే అధికారముంది. వడ్డీ రేటు తగ్గించేందుకు లిసా అంగీకరించడం లేదు. జూలైలో జరిగిన బోర్డు సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు పావెల్తోపాటు ఓటేసిన వారిలో లిసా కుక్ ఉన్నారు. దీంతో, ఇటీవల రాజీనామా చేయాలంటూ ట్రంప్ కోరినా ఆమె కొనసాగుతూనే ఉన్నారు. ఇది నచ్చని ట్రంప్ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంతోనే లిసా కుక్ను తొలగించినట్లు తాజాగా సమర్థించుకున్నారు. ఆ అధికారం అధ్యక్షుడికి లేదు ఫెడరల్ రిజర్వు గవర్నర్ లిసా కుక్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. వేధింపులకు భయపడి రాజీనామా చేయబోనని తెగేసి చెప్పారు. తనను తొలగించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలకు సేవలందించేందుకు 2022 నుంచి కొనసాగుతున్నానన్నారు. ట్రంప్ చర్యకు తగు కారణం లేదన్నారు. ట్రంప్ చూపుతున్న పత్రాలు నాలుగేళ్ల క్రితం తాను సెంట్రల్ బ్యాంకులో చేరకముందునాటివని తెలిపారు. -
ట్రంప్ ఫోన్ కాల్స్కు మోదీ నో
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించారా? అందుకు మోదీ తిరస్కరించారా? ట్రంప్తో సంభాషణకు మోదీ ఇష్టపడలేదా? అంటే.. అవుననే చెబుతోంది జర్మనీ వార్తాపత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్జెమేని(ఎఫ్ఏజెడ్). భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. దీనిపట్ల భారత నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీతో ఫోన్లో మాట్లాడడానికి ట్రంప్ కనీసం నాలుగుసార్లు ప్రయత్నించారని జర్మనీ పత్రిక పేర్కొంది. అమెరికా నుంచి నాలుగుసార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని వెల్లడించింది. అమెరికా విజ్ఞప్తులను ఆయన గట్టిగా తిరస్కరించారని, ట్రంప్ విధించిన టారిఫ్ల పట్ల తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తీకరించారని స్పష్టంచేసింది. ఈ మేరకు జర్మనీ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బెర్లిన్కు చెందిన గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ థార్స్టెన్ బెన్నర్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ శాపనార్థాలు భారత్–అమెరికా మధ్య గత 25 ఏళ్లుగా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. కానీ, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. భారత్ ఇస్తున్న సొమ్మును ఉక్రెయిన్లో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలను భారత ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో ప్రతీకార చర్యల కింద 50 శాతం టారిఫ్లు విధించారు. భారత్–రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మృతప్రాయంగా మారుతాయంటూ ట్రంప్ శాపనార్థాలు సైతం పెట్టారు. అయితే, ట్రంప్కు ప్రధాని మోదీ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని తేలి్చచెప్పారు. టారిఫ్లకు బెదిరిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రెచ్చగొట్టేలా ట్రంప్ చర్యలు! మరోవైపు భారత్–పాకిస్తాన్ ఘర్షణను తానే ఆపేశానని ట్రంప్ తరచుగా చెప్పుకుంటున్నారు. తాను చొరవ తీసుకోకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. భారత్పై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్పై దాడులకు తెరదించేలా చేశానని ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ హఠాత్తుగా ఆగిపోవడం తన ఘనతేనని స్పష్టంచేశారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని అంటున్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ను ట్రంప్ ముద్దు చేస్తున్నారు. వైట్హౌస్కు అధికారికంగా ఆహా్వనించి, ఘనంగా విందు ఇచ్చారు. పాకిస్తాన్కు ఆర్థికంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భారత ప్రభుత్వానికి రుచించడం లేదు. ట్రంప్ చర్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావిస్తోంది. అందుకు ట్రంప్తో మాటాడ్డానికి ప్రధాని మోదీ ఇష్టపడలేదని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో చైనాతో సంబంధాలకు మోదీ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఆయన ఈ నెలాఖరులో చైనాలో పర్యటించబోతున్నారు -
పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులతో ట్రంప్ పంపేస్తారా?
వాషింగ్టన్: అమెరికాలోని ప్రతి ఒక్క ఉద్యోగం అమెరికన్లకే దక్కాలనే దురాశతో దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని, లొసుగును వాడుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి గ్రీన్కార్డ్, వీసాదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారు. మద్యం తాగి వాహనం నడపడంతో నమోదైన పాత కేసులను సైతం తిరిగి తోడి ఆయా వ్యక్తులపై మళ్లీ నేరాభియోగాలు మోపి దేశం నుంచి బహిష్కరించాలని ట్రంప్ సర్కార్ కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగా ఇప్పటికే ‘ప్రొటెక్షన్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డ్రంక్ అండర్ ఇన్ప్లూయన్స్’చట్టాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రతినిధుల(దిగువ)సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు జూలై చివరివారంలో ఆమోద ముద్రపడింది. వెంటనే దీనిని ఎగువ సభ అయిన సెనేట్లో ప్రవేశపెట్టారు. జూన్లో ఈ బిల్లును సెనేట్ జుడీíÙయరీ, రూల్స్ కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడ బిల్లుకు ఆమోదముద్రపడితే సెనేట్లో తర్వాత ఆమోదం పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఈ లెక్కన బిల్లు చివరకు చట్టంగా మారితే ఇప్పటికే పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కేసులున్న గ్రీన్కార్డ్ పొందిన భారతీయులకూ కష్టాలు మొదలుకానున్నాయి. ఇక విద్యార్థి, హెచ్–1బీ వంటి వీసాలు పొందిన భారతీయులకూ బహిష్కరణ వేటు పడే అవకాశముంది. ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ చట్టానికి సవరణలు తెస్తూ ఈ హెచ్.ఆర్.875 బిల్లును తీసుకొచ్చారు. అమెరికా పౌరసత్వంలేని విదేశీయులు అమెరికాలో మద్యం తాగి, లేదంటే మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు ప్రమాదం చేసినా, అమెరికన్ల ప్రాణాలు హరించినా అలాంటి వ్యక్తలను దేశబహిష్కరణ చేయాలనే ప్రధానోద్దేశ్యంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై గ్రీన్కార్డ్, వీసాదారుల నుంచి సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత నిర్దయగా నిబంధనలు కొత్త బిల్లులో పేర్కొన్న నిబంధనలు, షరతులు చూస్తుంటే ఎలాగైనా సరే పాత, చిన్నపాటి నేరాలకు పాల్పడిన విదేశీయులను ఖచ్చితంగా దేశబహిష్కరణచేయాలనే ఉద్దేశం్య స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ఒక పదేళ్ల క్రితంనాటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయినాసరే, అది ఇప్పటికే మూసేసిన కేసు అయినాసరే దానిని మళ్లీ తెరచి నేరం మోపుతారు. ఆ కేసులో నిందితుడు క్షమాపణ చెప్పడం, సంబంధిత ట్రయల్ కోర్టు అందుకు సమ్మతి తెలపడం వంటి సందర్భాల్లోనూ పాత కేసులను తిరగతోడి దేశ బహిష్కరణచేస్తారు’’అని వలసదారుల కేసులను వాదించే లాయర్ జోసెఫ్ ట్సాంగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇది అత్యంత దారుణమైన బిల్లు. ఉదాహరణకు గ్రీన్కార్డ్దారుడు లేదంటే స్టూడెంట్ వీసా, హెచ్–1బీ వంటి అంతర్జాతీయ వీసా పొందిన వ్యక్తి పదేళ్ల క్రితం మద్యం మత్తులో చిన్నపాటి యాక్సిడెంట్ చేసి తర్వాత కేసు నుంచి బయటపడ్డాను అనుకుందాం. ఈరోజు ఆ వ్యక్తి స్వదేశానికి లేదంటే వేరే పని నిమిత్తం న్యూజిలాండ్ వంటి దేశానికి వెళ్లాడనుకుందాం. ఈలోపు హెచ్.ఆర్.875 బిల్లు చట్టంగామారితే ఇకపై ఆ వ్యక్తిని అమెరికాలోకి అనుమతించబోరు. కనీసం ఆ పాత కేసుపై వాదించుకునే అవకాశం అతనికి ఇవ్వబోరు. నిన్ను అమెరికాలోకి అనుమతించబోమనే ముంద్తు హెచ్చరిక కూడా ప్రభుత్వం పంపబోదు. అసలు అమెరికాలోకి వచ్చే అధికారిక మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఇంతటి నిర్దయ నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి’’అని జోసెఫ్ చెప్పారు. ‘‘ఎలాంటి అధికారిక పత్రాలు లేని వలసదారులు, వీసా, శాశ్వత స్థిరనివాస హోదా సవరణ కోసం దరఖాస్తు చేసుకుని వేచిచూస్తున్న వ్యక్తులకు సైతం ఈ బిల్లు వర్తిస్తుంది’’అని వలసదారుల న్యాయసేవల సంస్థ ‘ల్యాండర్హోమ్ ఇమిగ్రేషన్’పేర్కొంది. ఈ బిల్లు చట్టంగా మారేలోపే పాత కేసులున్న వ్యక్తులు తక్షణం కోర్టులను ఆశ్రయించి తమ వాదనలను వినిపించడం ఉత్తమమని ఈ సంస్థ అభిప్రాయపడింది. -
ఉక్రెయిన్కు 3,350 క్షిపణులు పంపనున్న అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. 850 మిలియన్ డాలర్ల విలువైన 3,350కి పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ఈఆర్ఏఎమ్) క్షిపణులను ఉక్రెయిన్కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఆయుధ ప్యాకేజీకి యురోపియన్దేశాలు నిధులు సమకూరుస్తున్నాయి. ఆరు వారాల్లో ఈ క్షిపణులు కీవ్కు చేరుకుంటాయి. ఇవి ఎప్పుడో ఉక్రెయిన్కు చేరాల్సి ఉండగా.. రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యాయి. వీటిలో 240 నుంచి 450 కి.మీ. పరిధి కలిగిన ఈ ఈ ఆర్ఏఎమ్ క్షిపణులు ఉన్నాయి. -
రష్యాకు రెండు వారాల గడువిస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు రెండు వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాదాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఉక్రెయిన్లోని అమెరికాకు చెందిన ఎల్రక్టానిక్ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి దాడి నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఇటీవల అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రష్యా దాడితో తాను సంతోషంగా లేనని, పరిస్థితిని మరోసారి సమీక్షిస్తానని ట్రంప్ అన్నారు. తదుపరి చర్యలను రెండు వారాల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య సంక్షోభం తెలివితక్కువైంది. వారానికి 7 వేల మంది, అంతకంటే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పోరాటాన్ని ఆపాలనుకుంటున్నా, అయితే, ఇప్పుడది కష్టతరంగా మారింది’అని ట్రంప్ అన్నారు. -
రేపే ట్రంప్, జెలెన్స్కీ భేటీ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సోమవారం వాషింగ్టన్లో భేటీ కాబోతున్నానని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వెల్లడించారు. శనివారం ఉదయమే ట్రంప్తో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. చాలాసేపు సంభాషణ జరిగిందని పేర్కొన్నారు. వ్యక్తిగత భేటీ కోసం సోమవారం వాషింగ్టన్కు రావాలంటూ ఆహా్వనించినందుకు ట్రంప్కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని, సాధారణ ప్రజల మరణాలకు ముగింపు పలికే దిశగా ట్రంప్తో సమగ్రంగా చర్చించబోతున్నానని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఉక్రెయిన్–రష్యా సంఘర్షణకు తెరతించడానికి యూరప్ దేశాలు చురుకైన పాత్ర పోషించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికాతోపాటు యూరప్ దేశాల అధినేతల నుంచి ఉక్రెయిన్ భద్రతకు హామీ కోరుతున్నామని ఉద్ఘాటించారు. తమకు విశ్వసనీయమైన సెక్యూరిటీ గ్యారంటీ కావాలన్నారు. -
పుతిన్ పైచేయి!
ఉక్రెయిన్పై దురాక్రమణ దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికాసహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ వారెంట్లు, సైబర్ దాడులతో శత్రుదేశాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెదరక పుతిన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని నిరూపించారు. సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారు. దాదాపు 13 నిమిషాలపాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో అగ్రభాగం 8 నిమిషాలు పుతినే మాట్లాడాడు. దాంతో ట్రంప్ చివర్లో మమ అనిపించి ప్రసంగాన్ని ముగించారు. ట్రంప్తో భేటీ పర్వంలో అడుగడుగునా పుతిన్ తన పైచేయిని ప్రదర్శించడం విశేషం.ఎర్రతివాచీ స్వాగతంలో తొలి గెలుపు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చు కోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలను స్వీకరించిన ట్రంప్ నుంచే స్వయంగా రెడ్కార్పెట్ సాదర స్వాగతాన్ని పొంది పుతిన్ తన రష్యాకు అంతర్జాతీయంగా ప్రభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది అమాయక ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారన్న అపవాదు ఉన్న దేశాధ్యక్షునికి అలస్కా ఎయిర్పోర్ట్లో సాధారణ స్వాగతంతో ట్రంప్ ముగిస్తే సరిపోయేది. కానీ అత్యంత ఆప్తుడైన మిత్రుడు తరలివస్తే ఎంతగా ప్రేమతో ఆహా్వనం పలుకుతామో అదేతరహాలో పుతిన్కు ట్రంప్ ఎర్రతివాచీ పరిచి మరీ సాదరంగా ఆహా్వనించారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా సమహోదా ఉన్న ట్రంప్ స్వయంగా వెళ్లి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకలేదు. కానీ యుద్ధనేరారోపణలు ఎదుర్కొ ంటున్నాసరే స్వయంగా ట్రంప్ వెళ్లి పుతిన్కు స్వాగతం పలకడం ద్వారా అగ్రరాజ్యాధినేతకు తాను ఏమాత్రం తీసిపోనని పుతిన్ బహిరంగంగా నిరూపించారు. ఉక్రెయిన్ మొదలయ్యాక దౌత్యపరంగా, ఆర్థికంగా, ఆంక్షల పరంగా రష్యా ఏకాకిగా తయారైందని పశి్చమదేశాల మీడియా చెబుతున్నదంతా ఒట్టిమాటలేనని, అమెరికా దృష్టిలో పుతిన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రపంచనేత అని రుజువైంది. ట్రంప్తో సోదరభావంతో మెలగడం, కరచాలనం, ఒకే కారులో ప్రయాణించడం ద్వారా తానూ ట్రంప్ ఒకేస్థాయి అని పుతిన్ అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.కాల్పుల విరమణ.. గప్చుప్ ఉక్రెయిన్తో దాడులు ఆపి కాల్పుల విరమణను అమల్లోకి తేవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. అలాంటి కీలక ‘కాల్పుల విరమణ’పదాన్ని మాటవరసకైనా ట్రంప్ ప్రస్తావించకుండా పుతిన్ విజయవంతంగా కట్టడిచేశారు. మేమే ‘ఆ మార్గం’లో ఇంకా పయనించలేదు. అక్కడి దాకా వెళ్లేందుకు ఇంకొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది అని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారుగానీ ‘కాల్పుల విరమణ’అనే పదం పలకడానికి కూడా ఆయన సాహసించలేదు. తద్వారా పుతిన్ తన కనుసన్నల్లో, తాను అనుకున్నదే భేటీలో జరిగేలా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాక్షిక విజయం కూడా సాధించని ట్రంప్ ఈ భేటీలో మా ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాపై మరోదఫా ఆంక్షలు విధిస్తానని రెండ్రోజుల ముందు ట్రంప్ చేసిన భీష్మప్రతిజ్ఞ ఉత్తిదేనని తేలిపోయింది. ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ ముగిసినా సరే ట్రంప్లో ఎలాంటి నిరసన, ఆందోళన కనిపించలేదు. పైగా పుతిన్ చేసిన మాస్కో పర్యటన ప్రతిపాదనకు ట్రంప్ సంతోషం వ్యక్తంచేయడం విచిత్రం. పైగా తాము అనుకున్న ఫలితాలు రాకపోయినా ట్రంప్.. పుతిన్తో చర్చలు సానుకూలంగా సాగాయని విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం. దీంతో భేటీపై ట్రంప్కు ఎలాంటి పట్టు సాధించలేకపోయారని అర్థమవుతోంది. భేటీ జరుగుతున్నాసరే రష్యా దాడులుచేసేలా పుతిన్ ఆదేశాలిచ్చి తన మొండి వైఖరిని మరోసారి చూపించారు. శాంతి చర్చలను వాణిజ్య చర్చలుగా మార్చిన పుతిన్ యుద్ధం ఆపాలన్న డిమాండ్తో ముందుకొచి్చన అమెరికాను వాణిజ్యచర్చలకు బలవంతంగా పుతిన్ కూర్చోబెట్టినట్లు ఈ భేటీ తర్వాత ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘‘వాణిజ్యం, డిజిటల్, హై–టెక్, స్పేస్ వంటి రంగాల్లో అమెరికా–రష్యా పెట్టుబడులు, వాణిజ్య సహకారం మరింతగా బలపడనుంది. ఆర్కిటిక్లోనూ సహకారం బాగుంది’’అని సంబంధంలేని విషయాలనూ పుతిన్ చెప్పుకొస్తున్నా ఆయనను అడ్డుకోవాల్సిందిపోయి ట్రంప్ ఆయనకు వంతపాడటం విచిత్రం. పుతిన్తోపాటు ట్రంప్ ఆ తర్వాత గొంతు కలుపుతూ.. ‘‘రష్యా వ్యాపార భాగస్వాములు మాతో వాణిజ్యానికి ఉవి్వళ్లూరుతున్నారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా శాంతి చర్చలను పుతిన్ విజయవంతంగా వాణిజ్యచర్చలుగా మార్చేశారు. పదికి పది.. కానీ సున్నా సమావేశం ముగిశాక ఈ భేటీలో పూర్తి సత్ఫలితాలను సాధించామని, 10/10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యానాల్లో పిసరంతైనా నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ఆ పది మార్కులు పుతిన్ దోచేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలో పుతిన్ను ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఎయిర్పోర్ట్లో ట్రంప్తో కరచాలనం, రెడ్కార్పెట్ స్వాగతం, ట్రంప్ కలిసి మీడియాకు ఫొటోలకు పోజులు, కలిసి కారులో ప్రయాణం, దారి పొడవునా కారులో నవ్వులు, భేటీ సందర్భంగా తమ వాదనను గట్టిగా వినిపించడం, సంయుక్త ప్రకటన వేళ తొలుత మాట్లాడం సహా ప్రతి సందర్భంలోనూ పుతిన్ పైచేయి సాధించారు. సాధారణంగా ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కల్గజేసుకుని, వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్.. ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం గమనార్హం. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ట్రంప్ ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్యవిజయంగా చెప్పొచ్చు. సొంత గడ్డపై జరిగిన భేటీలోనే నోరుమెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే రెండో రౌండ్ భేటీలో ఏపాటి మాట్లాడతారనే అనుమానాలు బలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్కంఠతో మొదలై ఉసూరుమనిపించి..
జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్న్(అలాస్కా): ఎడాపెడా టారిఫ్ల పిడిగుద్దులు కురిపించి ప్రపంచదేశాలకు సుంకాల ముచ్చెమటలు పట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శక్తిసామర్థ్యాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదుట నిర్విర్యమయ్యాయి. అలాస్కాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రపంచ దేశా లు అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూసిన ట్రంప్, పుతిన్ శిఖరాగ్ర చర్చలు దాదాపు మూడు గంటలపాటు జరిగినా చివరకు ఎలాంటి సత్ఫలితాలనివ్వకుండానే ముగిశాయి. దీంతో దురాక్రమణ జెండా ఎగరేసి ఉక్రెయిన్పై బాంబుల మోత మోగిస్తున్న రష్యాను నిలువరించి ఉక్రెయిన్లో శాంతికపోతాలు ఎగిరేలా చేస్తానన్న ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలాస్కాకు చేరుకున్నది మొదలు చర్చలు, సంయుక్త ప్రకటనదాకా ఆద్యంతం పుతిన్దే పైచేయి కనిపించింది. అయితే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేశామని ట్రంప్ ప్రకటించగా ఒప్పందం కంటే ‘పరస్పర అవగాహన’దిశగా సఖ్యత కుదిరిందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్లో శాంతిస్థావనకు ఇరునేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే నిర్దిష్ట ప్రణాళికలను ఇరువురూ బయటపెట్టలేదు. కానీ ఈ చర్చలకు కొనసాగింపుగా రష్యా రాజధాని మాస్కోలో మరోదఫా చర్చలు జరిగే అవకాశముంది. పుతిన్పై ప్రశ్నల శరాలు తన ఏలుబడిలో రష్యా మీడియా పుతిన్ను ముక్కుసూటి ప్రశ్నలడిగే దుస్సాహసం చేయదు. కానీ అమెరికాలో అడుగుపెట్టిన పుతిన్కు అమెరికా అంతర్జాతీయ మీడియా ప్రశ్నలతో మూకుమ్మడి దాడి చేసింది. పుతిన్ దాదాపు ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వనప్పటికీ ప్రశ్నల బాణాలు సంధిస్తూ మీడియా పుతిన్కు నోటమాట రానివ్వకుండా చేసింది. ‘‘ఉక్రెయిన్లో అమాయక పౌరుల ప్రాణాలను తీయడం ఎప్పుడు ఆపేస్తారు? శాంతిస్థాపనకు కంకణం కట్టుకున్నానని మీరు చెప్పే మాటలను ట్రంప్ ఎందుకు నమ్మాలి? ఇలా పలు ప్రశ్నలను మీడియా గట్టిగా అడిగినా పుతిన్ మౌనంగా ఉండిపోయారు. తాను ఆ ప్రశ్నలను వినదల్చుకోలేదు అన్నట్లు చెవులు మూసుకున్నారు. సాదర స్వాగతం పలికిన ట్రంప్ పుతిన్ కంటే ముందే యాంకరేజ్ సిటీలోని ఎయిర్పోర్ట్కు ట్రంప్ చేరుకున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన పుతిన్కు ట్రంప్ ఎర్ర తివాచీ పరచి మరీ సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజిచ్చారు. రెడ్కార్పెట్పై నడిచి వెళ్లేటప్పుడు అమెరికా అత్యంత భారీ బాంబులను జారవిడిచే బీ–2 బాంబర్ యుద్ధవిమానాలతోపాటు ఎఫ్–22 ఫైటర్జెట్లు గగనతలంలో దూసుకుపోయాయి. ట్రంప్ తన బీస్ట్ కారులో పుతిన్ను ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో ఇద్దరూ వెనకసీట్లో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. తర్వాత జాయింట్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్న్ వైమానిక స్థావరంలో ఏర్పాటుచేసిన సమావేశమందిరానికి చేరుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలçహాదారు మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, జాతీయ భద్రతా సలహాదారు యూరీ ఉషకోవ్ల సమక్షంలో ట్రంప్, పుతిన్లు సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్పై దాడులు మొదలెట్టాక పుతిన్ అమెరికా గడ్డపై కాలుమోపడం ఇదే తొలిసారి.అమెరికా మా పొరుగు దేశం భేటీ తర్వాత సంయుక్త సమావేశంలో పుతిన్ తొలుత మాట్లాడారు. ‘‘అమెరికా, రష్యాలు పొరుగుదేశాలే. మమ్మల్ని కేవలం మహాసముద్రాలే వేరుచేస్తున్నాయి. అది కూడా కేవలం నాలుగు కిలోమీటర్లే. మిగతా అంశాల్లో మేం మిత్రదేశాలమే. అందుకే రెడ్కార్పెట్పై నాకు స్వాగతం పలకేటప్పుడు ట్రంప్ నన్ను హలో పొరుగుమిత్రుడా(నెయిబర్) అని సంబోధించారు. అమెరికాలో ఇప్పటికీ ఆర్థోడాక్స్ చర్చిలు ఉన్నాయి. మా మధ్య సాంస్కృతిక బంధం బలోపేతానికి కృషి చేస్తాం. పరస్పర ప్రయోజనకర, సమస్థాయి ఒప్పందాలకు ఈ సాంస్కృతికబంధాలు వారధిగా నిలుస్తాయి. ప్రచ్ఛన్నయుద్ధంకాలంనుంచి ఇరు దేశాల సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఇకమీదట విభేదాలు విడనాడి చర్చల మార్గంలో పయనిద్దాం. వాస్తవానికి ఇలాంటి భేటీ ఎప్పుడో జరగాల్సింది’’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం అంశాన్ని పుతిన్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘సంక్షోభమే ఈ సమావేశాలకు ప్రధాన పునాది. ఉక్రెయిన్ను చుట్టుముట్టిన సమస్యలకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఉక్రేనియన్ల ఆందోళనను అప్పుడూ పట్టించుకున్నా. ఇప్పుడూ పట్టించుకుంటున్నా. మా మూలాలు ఒక్కటే. పరస్పర సంఘర్షణ కారణంగా ఇరువైపులా శాంతి ప్రక్రియలో ఉక్రేనియన్లు, యురోపియన్లు అవరోధాలు కల్పించొద్దు. అంతా శుభమే జరగాలని కోరుకుంటున్న ట్రంప్కు నా ధన్యవాదాలు. మా ఇరు పక్షాలు చక్కటి ఫలితాల కోసమే పాటుపడుతున్నాయి. అమెరికా శ్రేయస్సు కోసం ట్రంప్ పరితపిస్తున్నారు. అలాగే రష్యా స్వప్రయోజనాలు మాకు ముఖ్యం. ట్రంప్తో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. కానీ ఉక్రెయిన్ అంశంలో అమెరికాతో ఒక అవగాహనకు వచ్చాం’’అని పుతిన్ స్పష్టంచేశారు.నేరుగా శాంతి ఒప్పందమే అత్యుత్తమం తర్వాత ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడు వ్లాదిమిర్తో సమావేశం అత్యంత సత్ఫలితాలనిచి్చంది. అయితే తదుపరి దశ(శాంతిచర్చల)కు చేరే క్రమంలో ఎంతో పురోగతి సాధించాం. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సువర్ణావకాశం దక్కింది. కానీ ఇంకా కొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది. (శాంతి)ఒప్పందం కుదరాలంటే అంతకుముందు మరో ఒప్పందం కుదరాలి. సంక్షోభం సమసిపోవాలంటే నాటో కూటమి దేశాలు, ఉక్రెయిన్ వల్లే సాధ్యం. ఒప్పందం పూర్తిగా వాళ్ల చేతుల్లోనే ఉంది. వారానికి వేల మంది చనిపోకుండా నిలువరించాల్సి ఉంది. చర్చల కొనసాగింపుగా మరోదఫా వ్లాదిమిర్తో భేటీ కావాల్సి ఉంది’’అని ట్రంప్ అన్నారు. దీంతో వెంటనే పుతిన్ కల్పించుకుని ‘‘ఈసారి మాస్కోలో కలుద్దాం’’అని అన్నారు. తర్వాత ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఉక్రెయిన్, రష్యాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ యుద్ధాన్ని ముగించేందుకు అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా అది సమగ్ర స్థాయిలో అమలుకావడం కష్టమే. కాల్పుల విరమణ తరచూ ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉక్రెయిన్, రష్యా నేరుగా శాంతి ఒప్పందం చేసుకోవాలి. సోమవారం వైట్హౌస్లో జెలెన్స్కీతో సమావేశమవుతా. మా చర్చలు ఫలవంతమయ్యాక పుతిన్తో మాట్లాడతా. ఆ తర్వాత పుతిన్, జెలెన్స్కీలు ఒక్కచోటకు చేర్చి యుద్ధవిరమణకు కృషిచేస్తా’’అని ట్రంప్ అన్నారు. -
ఎవరి పంతం నెగ్గుతుందో!
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు. ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం.. అందుకే అలస్కా వేదిక ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు. ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు. అలాగైతేనే కాల్పుల విరమణ ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే, పుతిన్ డిమాండ్ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు. ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ మరణంపై జోస్యం నిజమవుతుందా?
-
యుద్ధం ఆపనంటే తీవ్ర పరిణామాలు
వాషింగ్టన్/బెర్లిన్: ఉక్రెయిన్పై పుతిన్ దండయాత్రను ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శుక్రవారం అమెరికా పరిధిలోని అలస్కాలో పుతిన్తో భేటీకి మరికొద్ది గంటలే ముగిలి ఉండగా ఆలోపే పుతిన్ను హెచ్చరిస్తూ ట్రంప్ వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం. జర్మనీ రాజధాని బెర్లిన్లో జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంయుక్తంగా యురోపియన్ యూనియన్ సభ్యదేశాల అగ్రనేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో ట్రంప్ సైతం వర్చువల్గా భేటీ అయి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. ‘‘ శుక్రవారం అలస్కాలో పుతిన్తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్నా. యుద్ధాన్ని ఆపబోనని పుతిన్ గనక చెబితే రష్యా తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోక తప్పదు. రెండో దఫా ఆంక్షలను విధంచాల్సి ఉంటుంది. ఒకవేళ భేటీ సత్ఫలితాలనిస్తే వెంటనే పుతిన్, జెలెన్స్కీల మధ్య భేటీని నిర్వహించేందుకు సిద్ధపడతా. ఇరువురి భేటీలో నన్ను అనుమతిస్తే నేనూ భాగస్వామినవుతా’’ అని ట్రంప్ అన్నారు. వర్చువల్ భేటీలో జెలెన్స్కీసహా యురోపియన్ యూనియన్ సభ్యుదేశాల అగ్రనేతలతోనూ ట్రంప్ మాట్లాడారు. జెలెన్స్కీతో వర్చువల్ భేటీ అద్భుతంగా సాగిందని ట్రంప్ అన్నారు. -
ట్రంప్, పుతిన్ ఏకాంత చర్చలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతోందని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో ట్రంప్, పుతిన్తోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని తెలిపాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండదని పేర్కొన్నాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపబోతున్నారు. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2018 జూలై 16న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్ మధ్య రెండు గంటలపాటు గోప్యమైన భేటీ జరిగింది. అప్పటి చర్చల్లో పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. ఫల వంతం కాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో గోప్యంగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటిలాగే విఫలమయ్యే అవకాశం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ట్రంప్, పుతిన్ తోపాటు ఇరుపక్షాల నుంచి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పుతిన్తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉన్న ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్తో గట్టిగా వాదించి, ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడు తుందని ఆయన భావిస్తున్నట్లు సమా చారం. ఎందుకంటే చర్చల గదిలో ఇతరు లు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి, వెనక్కి లాగే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్తో మొదట కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పుతిన్ విజయమే: బోల్టన్ అలస్కాలో జరిగే భేటీని పుతిన్ విజయంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభివర్ణించారు. సమావేశానికి ట్రంప్ను స్వయంగా రప్పిస్తుండడం ద్వారా పుతిన్ ఇప్పటికే పైచేయి సాధించారని అన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపేస్తుందన్న నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు. అయితే, జాన్ బోల్టన్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాకు అపజయం ఉండదని పేర్కొన్నారు. -
ఫెడరల్ నియంత్రణలోకి వాషింగ్టన్ డీసీ
వాషింగ్టన్: దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ హింసాత్మక గ్యాంగ్లు, రక్తపిపాసులైన నేరగాళ్లతో నిండిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాజధానిలోని పోలీసు విభాగాన్ని ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులకుతోడుగా 800 మంది నేషనల్ గార్డ్స్ను కూడా మోహరిస్తామని ప్రకటించారు. నేషనల్ గార్డులు శాంతిభద్రతలను, పౌరులకు రక్షణను కల్పిస్తారన్నారు. అవసరమైతే మరింతమంది నేషనల్ గార్డులను తీసుకొస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన వైట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. నగరంలో నేరాల రేటు 2024లో 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ గణాంకాలు చెబుతుండగా నేరాలమయంగా మారిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్ ఈ వారంలోనే ఫెడరల్ బలగాలు రాజధానికి చేరుకుంటాయని రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. నిరాశ్రయులు నగరం విడిచి వెళ్లిపోవాలి ‘నివాసం లేని వారు వెంటనే నగరం వదిలి వెళ్లిపోవాలి. వారి కోసం నగరానికి దూరంగా స్థలాలిచ్చాం. నేరగాళ్లూ, మీరు మాత్రం ఎక్కడికీ వెళ్లొద్దు, మీరుండాల్సింది జైలులోనే. మేమే మిమ్మల్ని అందులో ఉంచుతాం’అని ట్రంప్ అంతకుముందు సొంత ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. వీధుల్లో, పార్కుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఫెడరల్ పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు. -
అలస్కా చర్చల్లో జెలెన్స్కీకీ చోటు?
వాషింగ్టన్: ఈ నెల 15వ తేదీన అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన దౌత్యపరమైన విభేదాలకు తెరతీసింది. ఈ సమావేశంలో కుదరబోయే ఒప్పందంపై ఉప్పందుకున్న యూరప్ దేశాల నేతలు ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించే భేటీలో అధ్యక్షుడు జెలెన్స్కీకి చోటు కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు..ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు మద్దతు పలికారు. అదే సమయంలో, ట్రంప్–పుతిన్ చర్చల తర్వాత ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలని, ఉక్రెయిన్కు సైతం ఒప్పందంలో భాగస్వామి అయ్యే అవకాశమివ్వాలని జేడీ వాన్స్ను కోరారు. అలస్కాలో శుక్రవారం పుతిన్–ట్రంప్ మధ్య జరిగే శిఖరాగ్రంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు లేదు. అయితే, జెలెన్స్కీ పాల్గొనే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. ట్రంప్–పుతిన్ల సమావేశం తర్వాత మాత్రమే జెలెన్స్కీకి చాన్సుంటుందని చెబుతున్నారు. వేగంగా చోటుచేసుకున్న పరిణామాల నడుమ అలస్కా శిఖరాగ్రంపై నిర్ణయం వెలువడింది. శిఖరాగ్రం వేదికను ఇంకా ఖరారు చేయలేదు. అంతేకాదు, ఇద్దరు నేతల మధ్య చర్చకు రావాల్సిన అంశాలపైనా స్పష్టత రాలేదని చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు నేతలతో కలిసి త్రైపాక్షిక చర్చలకు సైతం సిద్దంగా ఉన్నా, పుతిన్ వినతి మేరకు ద్వైపాక్షిక చర్చలకు అవసరమైన ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. యూరప్ నేతల డిమాండ్లివీ..అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అవనున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఇందులో జెలెన్స్కీ పాల్గొనేదీ లేనిదీ మాత్రం స్పష్టం చేయలేదు. యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఉక్రెయిన్ను కూడా భాగస్వామిగా చేర్చుకోవాలని జెలెన్స్కీతోపాటు యూరప్ దేశాల నేతలు కోరుతున్నారు. ట్రంప్ ప్రకటనను స్వాగతించిన జెలెన్స్కీ, తమ భూభాగాన్ని రష్యాకు ధారాదత్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తోసిపుచ్చారు. పుతిన్–ట్రంప్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అంశాలేమిటి, కుదరనున్న ఒప్పందం వివరాలేమిటి? అంటూ జేడీ వాన్స్తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు కూపీ లాగారు. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు పుతిన్ బుధవారం అందించిన పత్రాల్లో ఏముందంటూ ఆరా తీశారు. ‘ఈ చర్చల్లో ఉక్రెయిన్కు భాగస్వామ్యం ఉండాలి. చర్చల అనంతరం ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. ఆ తర్వాతే మిగతా అంశాల అమలు విషయం తేల్చాలి. ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తే..ప్రస్తుతం రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలి...’వంటి షరతులను వారు జేడీ వాన్స్కు వినిపించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనపై ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలండ్, యూకే, ఈయూ, ఫిన్లాండ్ దేశాల నేతలు సంతకాలు చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకూ గ్యారెంటీ ఇవ్వాలని కోరారు. తమ ప్రతినిధి విట్కాఫ్ మాస్కోలో పుతిన్తో జరిపిన సమావేశంలో కుదిరిన ఒప్పందంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్.. కొన్ని భూభాగాలను వదులుకోవడం వంటి అంశాలున్నాయని చెప్పడం యూరప్ దేశాలతోపాటు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పుతిన్ అందజేసిన పత్రంలో తాము పాక్షికంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతోపాటు డోన్బాస్ ప్రాంతం పూర్తిగా స్వాధీనం చేయాలనే అంశం ఉన్నట్లు యూరప్ దేశాలంటున్నాయి. ఖెర్సన్, జపొరిజియాల్లోనూ రష్యా ఆర్మీ తిష్టవేసింది. వీటి విషయం తేల్చలేదు. అమెరికా ఇచ్చే భద్రతాపరమైన గ్యారంటీల విషయం సైతం అస్పష్టంగా ఉంది. దీనిపై వైట్ హౌస్ అధికారులను ఈయూ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నా స్పందనలేదు. -
మా అభ్యంతరాలు వినాల్సిందే
కీవ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య ఈ నెల 15న జరుగబోతున్న భేటీ పట్ల ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అసహనం వ్యక్తంచేశారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వారిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఒప్పందం కుదుర్చుకున్నా అది తమకు సమ్మతం కాబోదని తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ‘టెలిగ్రామ్’లో పోస్టు చేశారు. రష్యా ఆక్రమణలో ఉన్న తమ భూభాగాలను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. అవి ఏనాటికైనా ఉక్రెయిన్లో కలవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒకవేళ వాటిని రష్యాలో అంతర్భాగంగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తే సంఘర్షణ మరింత ముదురుతుంది తప్ప తగ్గబోదని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ట్రంప్–పుతిన్ చర్చల్లో ఈ అంశంపై చర్చ జరగదనే భావిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి కోసమే ఆ ఇరువురు నేతల చర్చలు పరిమితమైతే బాగుంటుందని వెల్లడించారు. రెండు దేశాల నడుమ శాశ్వత శాంతి సాధ్యం కావాలంటే తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆక్రమణదారులకు తమ భూమి అప్పగించేందుకు సిద్ధంగా లేమన్నారు. ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఇతర పక్షాలు తీసుకొనే ఏ నిర్ణయమైనా అది శాంతికి వ్యతిరేకమే అవుతుందన్నారు. పరిష్కారమార్గాలను చంపేసేలా ఎవరూ వ్యవహరించవద్దని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్లోని ఖేర్సన్ సిటీపై రష్యా సైన్యం శనివారం డ్రోన్లతో దాడికి దిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. జపొరిజియాలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. రష్యా సైన్యం 47 డ్రోన్లు ప్రయోగించగా, వాటిలో 16 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేశామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. రెండు క్షిపణులు సైతం ప్రయోగించగా, ఒక క్షిపణిని ధ్వంసం చేశామని తెలియజేసింది. -
టారిఫ్ల వ్యవహారం తేలేదాకా.. భారత్తో వాణిజ్య చర్చల ప్రశ్నే లేదు: ట్రంప్
వాషింగ్టన్: టారిఫ్ల వ్యవహారం తేలేదాకా, భారత్తో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ వస్తువులపై టారిఫ్లను 50 శాతానికి పెంచిన నేపథ్యంలో వాణిజ్య చర్చలను ముమ్మరం చేస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్..భారత్తో ముందు టారిఫ్ల వ్యవహారం కొలిక్కిరావాలని, అప్పటి వరకు వాణిజ్య చర్చలు జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. ట్రంప్ రెండో విడత పెంచిన 25 శాతం టారిఫ్లు 21 రోజుల తర్వాత ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ భారతీయ అమెరికన్ అటార్నీ రవి బాత్రా స్పందించారు. ట్రంప్ కోరిన విధంగా ఉక్రెయిన్తో రష్యా కాల్పుల విరమణకు రాకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. భారత్ను బాధపెడితే రష్యాను బాధపెట్టినట్లే. అదే సమయంలో అది మమ్మల్నీ మరింతగా బాధపెడుతుంది’అని ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికాతో రక్షణ ఒప్పందాలు యథాతథం
న్యూఢిల్లీ: భారత్ వస్తువులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన వేళ రక్షణ ఒప్పందాలను నిలిపి వేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం కొట్టివేసింది. రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. అమెరికా నుంచి అందాల్సినవి ఒప్పందం ప్రకారం అందుతూనే ఉంటాయని, తదుపరి ఆర్డర్లపై చర్చలు కూడా కొనసాగుతాయని వివరించింది. అమెరికా నుంచి రక్షణ కొనుగోళ్లను భారత ప్రభుత్వం ఆపేసిందంటూ వస్తున్న వార్తలు అసత్యాలు, అభూత కల్పనలు అని రక్షణ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. టారిఫ్ల పెంపు నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ అమెరికా వెళ్లి, కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. అయితే, ఆ పర్యటనను ప్రభుత్వం రద్దు చేసిందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. టారిఫ్ల పెంపు వేళ..రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల మధ్య విశ్వాసం సడలిన మాట వాస్తవమేనని, అయితే దీని ప్రభావం రక్షణ సంబంధాలపై ప్రత్యక్షంగా పడబోదని ఐజీ డ్రోన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ మేజర్ జనరల్ పధి విశ్లేషించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 20 వరకు రక్షణ ఒప్పందాలున్నాయన్నారు. అమెరికాకు చెందిన అపాచీ, చినూక్, పీ–81 విమానాలు, ఎంక్యూ–9 డ్రోన్లను భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, వీటిపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. -
వచ్చే వారంలో ట్రంప్తో భేటీ
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్తో క్రెమ్లిన్లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్..ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు. తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
రష్యా–అమెరికా నిర్మాణాత్మక చర్చలు
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధం ముగించే దిశగా రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా రష్యా అధినేత పుతిన్తో చర్చల కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా స్టీవ్ విట్కాఫ్ను పంపించారు. విట్కాఫ్ బుధవారం ఉదయం మాస్కోలో పుతిన్తో దాదాపు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. ట్రంప్ సందేశాన్ని విట్కాఫ్ ఈ సందర్భంగా పుతిన్కు చేరవేశారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సన్నద్ధం కావాలని, కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. పుతిన్, విట్కాఫ్ మధ్య సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని రష్యా విదేశాంగ ప్రతినిధి యూరి ఉషకోవ్ తెలిపారు. ఇరుపక్షాలు సానుకూల సంకేతాలు పంపించుకున్నాయని వివరించారు. వ్యూహాత్మక సహకారంపై చర్చించుకున్నాయని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, పుతిన్తో చర్చల అనంతరం విట్కాఫ్ బుధవారం మధ్యాహ్నం స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారని రష్యన్ మీడియా తెలియజేసింది. అయితే, పుతిన్, విట్కాఫ్ తాజా చర్చలపై అమెరికా, ఉక్రెయిన్ ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఉక్రెయిన్పై యుద్ధానికి ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టకపోతే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాను ట్రంప్ తీవ్రంగ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాల సుత్తితో మోదుతానని మొత్తుకుంటున్నా మోదీ మౌనం వహించడం వెనుక అక్రమ వ్యాపార సంబంధాలు దాగున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మరో 24 గంటల్లో మరోమారు భారత్పై దిగుమతి టారిఫ్లను పెంచుతానని మంగళవారం ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రాహుల్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ భారత్పై అదనపు టారిఫ్లు మోపుతానని ట్రంప్ పదేపదే ప్రకటిస్తూ ఇప్పటికే ఒకసారి 25 శాతం పెంచినా ప్రధాని మోదీ ఏమాత్రం ట్రంప్ను నిలువరించలేకపోయారు. దీని వెనుక అసలు కారణం ఇప్పటికైనా భారతీయు లకు తెలియాల్సి ఉంది. అదేంటంటే అమెరికాలో గౌతమ్ అదానీపై అక్కడి విచారణ సంస్థలు దర్యాప్తు కొన సాగిస్తున్నాయి. మోదీ, ఏఏ(అంబానీ, అదానీ), రష్యా ముడి చమురు కొను గోళ్ల వ్యవహారంలో అక్రమ ఆర్థిక సంబంధాలు బట్టబయలు చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు. అందుకే భారత్పై ఎంతటి టారిఫ్ల భారం పడుతున్నా ప్రధాని మోదీ చీమకుట్టినట్లయినా లేకుండా మౌనంగా ఉండిపోయారు. అదానీ దర్యాప్తు పేరు చెప్పి మోదీ చేతుల్ని ట్రంప్ కట్టిపడేశారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలపై అదానీ గ్రూప్ సంస్థనుంచిగానీ కేంద్రప్రభుత్వం నుంచిగానీ ఇంతవరకు ఎలాంటి స్పందన, వివరణ రాలేదు. రష్యాతో ముడి చమురు వాణిజ్యాన్ని భారత్ మరింతగా పెంచుకోవడంపై ట్రంప్ మొదట్నుంచీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం తెల్సిందే. ఈ అక్కసుతోనే ఆయన భారత్పై అదనపు దిగుమతి టారిఫ్లను విధిస్తు న్నారు. ఇప్పటికే ఒక దఫా పెంచగా మరోదఫా మరికొన్ని గంటల్లో పెంచుతానని ప్రకటించడం, భారత్ ఘాటుగా బదులివ్వడం తెల్సిందే. -
ట్రంప్ చెప్పింది అబద్ధం
వాషింగ్టన్: రష్యా నుంచి ఆయుధాలు, చమురును కొనుగోలు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్లురిమి చూసినా భారత్ ఏమాత్రం బెదరలేదని తాజాగా వెల్లడైంది. భారత్ చమురు, ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా ఆర్జించిన లాభాలను రష్యా.. ఉక్రెయిన్పై యుద్ధం కోసం వెచ్చిస్తోందని ట్రంప్ ఇప్పటికే ఆరోపించారు. ఈ కొనుగోల్లు ఆపకపోతే భారీ దిగుమతి సుంకాలు విధిస్తానని భారత్ను ట్రంప్ బెదిరించినా రష్యా ముడిచమురును భారత రిఫైనరీ కంపెనీలు నిరాటంకంగా కొనుగోలుచేస్తూనే ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భవిష్యత్తులో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలుచేయబోదనే వార్తలను విన్నానని ట్రంప్ శనివారం వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే జాతీయమీడియాలో భిన్నమైన వార్తలు రావడం విశేషం. ‘‘రష్యా నుంచి చమురు కొనే సంస్కృతికి భారత్ మంగళం పాడుతుందని విన్నా. ఇది నిజంగా మంచి విషయం. అయితే ఇందులో నిజమెంతో నాక్కూడా తెలీదు. తర్వాత ఏం జరుగుతుందో వేచిచూద్దాం’’ అని ట్రంప్ న్యూజెర్సీలోని బెడ్మిన్స్టర్ గల్ఫ్ క్లబ్లో మీడియాతో ట్రంప్ అన్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికా ఎంతగా బెదిరించినా సరే భారత్ తన స్వప్రయోజనాలకు, సార్వ¿ౌమతానికే అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మరోసారి రుజువైందని జాతీయమీడియాలో శనివారం పలు కథనాలు వచ్చాయి. ‘‘ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయాలా? వద్దా? కొంటే ఎంత పరిమాణంలో కొనాలి? అనేవి కేవలం మార్కెట్ ధర ప్రకారంమే నిర్ణయం తీసుకుంటాంగానీ ట్రంప్ వంటి బయటివ్యక్తి బెదిరింపులకు భయపడికాదు’’ అని రిఫైనరీల సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘‘ ముడి చమురు నాణ్యత, సరఫరా వ్యయాలు, ఇతరత్రా ఖర్చుల గురించే మేం ఆలోచిస్తాంగానీ అమెరికా ఆదేశించిందనో మరెవరో వద్దన్నారో మేం చమురు కొనుగోళ్లను ఆపబోం’’ అని భారతీయ రిఫైనరీలు స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. -
25 శాతం సుంకాలు ఇక అధికారికం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: తంపులమారి ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్పై తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకాలపై అమెరికా అధ్యక్షుడు అధికారిక ముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులపై గురువారం సంతకం చేశారు. అంతేగాక పదుల కొద్దీ దేశాలపై కూడా సుంకాల కొరడా ఝళిపించారు. తద్వారా అంతర్జాతీయంగా మరోసారి వాణిజ్య కల్లోలానికి తెర తీశారు. తాజా జాబితాలో లేని దేశాలకు 10 శాతం టారిఫ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అత్యధికంగా సిరియాపై 41 శాతం, పలు దేశాలపై అత్యల్పంగా 10 శాతం టారిఫ్లు వడ్డించారు. ఇవి ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పాకిస్తాన్పై మాత్రం టారిఫ్లను 29 నుంచి 19 శాతానికి తగ్గించడం విశేషం. తాజాగా టారిఫ్లు విధించిన జాబితాలో 69 దేశాలున్నాయి. మరిన్ని దేశాలు తమతో చర్చలు జరుపుతున్నా, వాటి ప్రతిపాదనలు పరస్పర వర్తక లోటును పూడ్చేలా లేవంటూ ట్రంప్ పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని టారిఫ్ పెంపుదలలు ఉంటాయని వైట్హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై అధ్యక్షుడే ప్రకటన చేస్తారన్నారు. ఉత్తర అమెరికా వర్తక ఒప్పందం కింద అమెరికాలోకి ప్రవేశించే కెనడా, మెక్సికో ఉత్పత్తులకు సుంకాల బాదుడు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలోకి ఫెంటానిల్ భారీ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కెనడా విఫలమవుతోందని వైట్హౌస్ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఉత్పత్తులపై టారిఫ్లను 25 నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. మెక్సికోకు మాత్రం పలు ఉత్పత్తులపై విధించిన 30 శాతం టారిఫ్లను సంప్రదింపులకు వీలుగా 90 రోజుల గడువిచ్చారు. అయితే ఆటోయేతర, లోహేతర వస్తువులకు మాత్రం గడువు ఇవ్వలేదు. మెక్సికో నుంచి ఉక్కు, అల్యుమినియం, రాగిపై 50 శాతం టారిఫ్లు, ఆటో ఉత్పత్తులపై 25 శాతం తప్పవని వైట్హౌస్ స్పష్టం చేసింది. ట్రంప్ కొద్ది నెలల క్రితం ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్లు ఆగస్టు 1 నుంచే అమల్లోకి రావడం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ మృతప్రాయమైనది అంటూ బుధవారం ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మన ఎగుమతులపై 25 శాతం టారిఫ్లు విధిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో ఆయన పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు ప్రకటించిన పెనాల్టీ శాతాన్ని మాత్రం తాజా ఉత్తర్వుల్లో వెల్లడించలేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని అంగీకరించేందుకు భారత్ ఇప్పటికే ససేమిరా అనడం తెలిసిందే. అమెరికాపై భారత్ సుంకాలు దారుణంగా ఉన్నాయంటూ ట్రంప్ ఇటీవలే విమర్శించడం, దేశ ప్రయోజనాలను అన్ని రకాలుగా కాపాడతామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల నడుమ చర్చలు కొనసాగుతుండగానే బుధవారం ట్రంప్ 25 శాతం సుంకాలు బాదారు. ఇక అమెరికాకు ఎగుమతులపై 15 శాతం టారిఫ్లకు దక్షిణ కొరియా ఇప్పటికే అంగీకరించింది. వాటిపై 25 శాతం బాదుడు తప్పదంటూ ట్రంప్ తొలుత హెచ్చరించారు. దాంతో ఆయన నిర్ణయించే అమెరికా ప్రాజెక్టుల్లో 350 బిలియన్ల మేరకు పెట్టుబడికి ఒప్పుకుంది. ఇక అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాపై టారిఫ్లను ట్రంప్ ఏ మేరకు నిర్ణయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 12 నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా ఆ దేశానికి ఆయన ఇప్పటికే అలి్టమేటమివ్వడం తెలిసిందే. ఇరు దేశాల నడుమ పలు అంశాలపై వర్తక విభేదాలు కొనసాగుతున్నాయి. దేశ ప్రయోజనాలు కాపాడతాం: కేంద్రం ట్రంప్ వ్యాఖ్యలు, తాజా ఉత్తర్వులపై కేంద్రం ఆచితూచి స్పందించింది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచింది. ఇరు దేశాలు విశ్వసించే ఎజెండాకు కట్టుబడి ఉన్నాం. ఈ బంధం సజావుగా సాగుతుందని విశ్వసిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు ప్రతీకారంగా జరిమానా విధిస్తామన్న ట్రంప్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా ఈ విషయంలో జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలు తప్పుగా దొర్లినవే...
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు. భారత్ ఉత్పత్తులపై ఆగస్ట్ 1 నుంచి 25 శాతం టారిఫ్లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామంటూ ప్రకటించిన మర్నాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘రష్యాతో భారత్ ఏం చేసినా నాకు అవసరం లేదు. నిర్వీర్యమైన తమ ఆర్థిక వ్యవస్థలను (డెడ్ ఎకానమీస్) అవి పరస్పరం మరింత దిగజార్చుకుంటుండడంపైనే నా దృష్టి అంతా’’అని పోస్ట్లో పేర్కొన్నారు. దీనిపై కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా స్పందిస్తూ.. భారత్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా దొర్లినట్టుగా పేర్కొంది.ఇండియానే ఆధారం.. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 2024 గణాంకాల ప్రకారం భారత్లో సగటు వయసు 28.8 సంవత్సరాలు కాగా, అమెరికాలో ఇది 38.5, యూరప్లో 42.8 సంవత్సరాలుగా ఉంది. సగటు వయసు, వృద్ధి అవకాశాల పరంగా అభివృద్ది చెందిన దేశాలు మరింత వృద్ధాప్యంలోకి చేరుతున్నట్టు శ్రీవాస్తవ అన్నారు. ఐఎంఎఫ్ ఒక రోజు ముందే భారత ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచుతూ ప్రకటించడం గమనార్హం. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాదికి గాను భారత్ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) 6.5 శాతంగా అంచనా వేసింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్కు సంబంధించి మెరుగైన అంచనాలను ప్రకటించడం తెలిసిందే. -
బఫూన్లకు బాస్ ట్రంప్
న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్యం చేస్తున్నదనేసాకు చూపుతూ భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. భారత ప్రభుత్వాన్ని వేధిస్తున్న ట్రంప్ను ఆయన ‘బఫూన్ ఇన్ చీఫ్’గా అభివర్ణించారు. ‘వైట్ హౌస్లోని బఫూర్ ఇన్ చీఫ్ నా దేశ ప్రభుత్వాన్ని వేధిస్తుండటం విచారం కలిగిస్తోంది. ఇలాంటి బెదిరింపులకు లొంగటానికి సామంత రాజ్యం కాదు.. భారత్ సార్వభౌమత్వం కలిగిన దేశం అని స్పష్టం చేశారు. అత్యధిక టారిఫ్లతో మన ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ టారిఫ్ల పెంపుపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మోదీ వైఖరి దారుణమన్నారు. -
అవి డెడ్ ఎకానమీలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: ఆంక్షలు విధిస్తామ ని భయపెట్టినా గత కొంతకాలంగా రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోళ్లను తగ్గించుకోని భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్కు చమురును సరఫరాచేస్తున్న శత్రు దేశం రష్యాను సైతం ట్రంప్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భారత్, రష్యా రెండూ కలిసి సాధించేది ఏమీ ఉండదని ఎద్దేవాచేశారు. జట్టుకట్టి అనవసరంగా రెండు దేశాల ఆర్థికవ్యవస్థలను మరింత నిర్వీర్యంచేస్తున్నా యని ఇరు దేశాల ప్రభుత్వాలపై విమర్శల బురద చల్లారు. భారత్పై పాతికశాతం టారిఫ్ ఆర్థిక భారం మోపిన ట్రంప్ గురువారం భారత్, రష్యాల వాణిజ్యబంధంపై తన అక్కసును వెళ్లగక్కుతూ సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ఐ డోంట్ కేర్..‘‘ రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందీ, రష్యాతో భారత్కు ఉన్న సత్సంబంధాలు ఏంటి అనేవి నాకు అస్సలు అవసరం లేదు. అత్యంత కీలకమైన అమెరికాతో వాణిజ్యం అత్యల్ప స్థాయిలో చేసుకుంటూ భారత్ సొంత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యంచేసుకుంటోంది. ఇక రష్యా సంగతి చెప్పనక్కర్లేదు. రష్యాతో అమెరికాకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవు. ఇలాంటి రష్యా, భారత్లో కూడబలుక్కుని సాధించింది ఏమీ లేదు. అవి రెండూ డెడ్ ఎకానమీలు (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థలు). ఉమ్మడిగా పతనమవుతున్నాయి. ఈ దేశాలను నేనసలు పట్టించుకోను. భారత్తో మేం చాలా తక్కువ స్థాయిలో వాణిజ్యం చేస్తున్నాం. భారత్ మాపై విధించే అధిక టారిఫ్లే ఇందుకు ప్రధాన కారణం. భారత్ విధించే దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక దిగుమతి సుంకాలు వసూలుచేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్తో వ్యవహారాలు ఒక్కోసారి సవ్యంగా ఉండవు. దాని పర్యవసానమే ఈ 25 శాతం దిగుమతి సుంకాలు. వీటికి పెనాల్టీ(జరిమానా) అదనం. ఇవన్నీ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అమలుచేసి వసూలు మొదలెడతా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘భారత వాణిజ్య విధానాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉంటాయి. దానికితోడు భారత్తో పరస్పర సరుకుల విలువను మాత్రమే జమకట్టే నగదుయేతర వాణిజ్య అవరోధాలు చాలా ఉన్నాయి. మేం వద్దు అని వారిస్తున్నా, హెచ్చరిస్తున్నాసరే రష్యా నుంచి ఆయుధ, ఇంధన ఉత్పత్తులను భారీ ఎత్తున భారత్ కొనుగోలుచేస్తోంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధం కోసం రష్యా వినియోగిస్తోంది’’ అని ట్రంప్ ఆరోపించారు.మెద్వెదేవ్, ట్రంప్ మాటల యుద్ధంభారత్ను విమర్శించిన ట్రంప్ పనిలోపనిగా రష్యాపైనా, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్పైనా విమర్శలు గుప్పించారు. దీంతో మెద్వదేవ్ సైతం ప్రతివిమర్శలు చేశారు. తొలు త మెద్వదేవ్నుద్దేశిస్తూ ట్రంప్ వ్యంగ్య పోస్ట్ చేశారు. ‘‘రష్యా అధ్యక్షుడిగా పేలవంగా పాలించిన మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ ఇంకా రష్యాకు అధ్యక్షుడినే అని అనుకుంటున్నారేమో. ఏదైనా మాట్లాడేముందు చూసి మాట్లాడండి. అమె రికాపై మాట్లాడే దుస్సాహసం చేయొద్దు’’ అని హెచ్చరించారు. దీనిపై రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడి హోదాలో మెద్వదేవ్ ఘాటుగా జవాబిచ్చారు. ‘‘ట్రంప్ ఎలా స్పందించినాసరే రష్యా తన పంథాను వీడబోదు. డెడ్ ఎకానమీ అని నోటికొచ్చినట్లు మాట్లాడటంకాదు. సోవి యట్ కాలంలోనే రష్యా అణుబాంబును తయా రుచేసిందన్న విషయం మర్చి పోవద్దు. అయినా ‘డెడ్’ అనే పదానికి ‘ది వాకింగ్ డెడ్’ అనే సినిమాకు, ‘డెడ్ హ్యాండ్ అనే ‘వ్యవ స్థ’కు ఉన్న శక్తి ట్రంప్కు తెలీదనుకుంటా’’ అని మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. శత్రుదేశం దాడిచేసి రష్యా నా యక త్వాన్ని అంతమొందించినాసరే తిరిగి అణు బాంబులు ప్రయోగించేలా రష్యా రూపొందించిన ఆటో మేటిక్ దాడి వ్యవస్థ పేరే డెడ్ హ్యాండ్. -
టారిఫ్లతో జీడీపీపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఊహించిన దానికన్నా అధిక స్థాయిలో టారిఫ్లు విధించడంతో పాటు పెనాల్టిలు కూడా వేయాలన్న అమెరికా నిర్ణయంతో భారత స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు తెలిపారు. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే డీల్ను కుదుర్చుకోవడం ద్వారా భారత్ దీన్ని అధిగమించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ టారిఫ్ల వల్ల ఇరు దేశాల మధ్య అత్యధిక వాణిజ్యం జరిగే ఫార్మా, టెక్స్టైల్స్, లెదర్, ఆటోమొబైల్స్, మెరైన్ ఉత్పత్తుల్లాంటి కీలక రంగాలపై నేరుగా ప్రభావం పడుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ప్రాథమికంగా టారిఫ్లను ప్రకటించినప్పుడే 2025–26 జీడీపీ వృద్ధి అంచనాలను 6.2 శాతానికి కుదించగా, తాజాగా పెనాల్టిల పరిమాణాన్ని బట్టి మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 25% టారిఫ్ల విధింపు దురదృష్టకరమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీని వల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. టెక్స్టైల్స్ రంగానికి టారిఫ్లు పెను సవాలుగా మారతాయని టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య సీఐటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. -
రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనం
ముంబై: భారత్పై ఆగస్టు 1 నుంచి జరిమానాతో సహా 25% సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో దేశీయ కరెన్సీ రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో ఏకంగా 89 పైసలు బలహీనపడి 87.80 వద్ద ముగిసింది.2022, డిసెంబర్ 24 (99 పైసలు క్షీణత) తర్వాత రూపాయి ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. నెలాఖరున దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సైతం దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయి. -
గాజాలో కరువు వాస్తవమే: ట్రంప్
స్కాట్లాండ్: గాజాలో కరువు పరిస్థితులున్న విష యం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కరువు లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. ‘టీవీల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో... అక్కడ నిజంగానే కరువుంది. దీనిని దాచిపెట్టలేం’అని స్కాట్లాండ్లో పర్యటిస్తున్న ట్రంప్ సోమ వారం పేర్కొన్నారు. గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజా లో హమాస్ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. ‘బందీలందరినీ హమాస్ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్ హమాస్తో ఒప్పందం కష్టమంటోంది. అదే సమ యంలో, చిట్టచివరి 20 మంది బందీలను హమాస్ రక్షణ కవచాలుగా భావిస్తోంది. అందుకే, వారిని వి డుదల చేయడం లేదు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.గాజాలో 17 టన్నుల ఆహారం జారవేతయూఏఈ వైమానిక దళం విమానాలు రెండో రోజు సోమవారం గాజాలోని పాలస్తీనియన్లకు 17 టన్నుల ఆహార పదార్థాలను జారవిడిచాయని జోర్డాన్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 19 టన్నుల ఆహార పదార్థాలను ఒక ట్రక్కు కింద లెక్క. అంటే ట్రక్కు కంటే తక్కువ ఆహారాన్ని విడిచినట్లేనని ఐరాస పాలస్తీనా శరణార్థి విభాగం చీఫ్ ఫిలిప్ తెలిపారు. ఆదివారం 25 టన్నుల ఆహార ప్యాకెట్లను జారవిడవడం తెల్సిందే. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలుగా అమలు చేస్తున్న దిగ్బంధంతో గాజాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, జనం, ముఖ్యంగా చిన్నారులు ఆకలి చావులకు గురవుతుండటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.పుతిన్కు గడువు 10, 12 రోజులేఉక్రెయిన్తో ఒప్పందానికి రాకుంటే ఆంక్షలేట్రంప్ తాజా హెచ్చరికఉక్రెయన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు విధించిన 50 రోజుల గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదించారు. అధ్యక్షుడు పుతిన్ 10, 12 రోజుల్లో ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకోకుంటే ఆంక్షలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం ఆయన స్కాట్లాండ్లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని కావాలనే పొడిగిస్తూ పోతున్న పుతిన్ వైఖరితో అసహనంతో ఉన్నానన్నారు. ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండటంలో అర్థం లేదంటూ, మున్ముందు ఏం జరగనుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే పుతిన్కు తక్కువ సమయం ఇస్తున్నట్లు తెలిపారు. భారీ టారిఫ్ల ను రష్యాపై విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన.. ఇందుకు సంబంధించిన చర్యలపై ఇవ్వాళోరేపో ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలపై పుతిన్తో మాట్లా డాలనే ఆసక్తి తనకు అంతగా లేదని చెప్పారు. -
ట్రంప్ రూల్.. ఇండియన్స్ కు షాక్
-
ట్రంప్ వ్యాఖ్యలపై మౌనమెందుకు?
న్యూఢిల్లీ: భారత్–పాక్ల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్నా, ప్రధాని నరేంద్ర మోదీ దానిపై ఎందుకు నోరు విప్పడం లేదని లోక్సభ ప్రతిపక్షనాయకుడు రాహుల్గాంధీ ప్రశ్నించారు.‘‘కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానని ట్రంప్ ఇప్పటికో 25 సార్లు చెప్పారు. అసలు మనదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చడానికి ట్రంప్ ఎవరు? అది ఆయన పని కాదు. అయినా.. ప్రధాని ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదు’’అని ఆయన మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ పట్ల పరస్పర వైరుధ్య వ్యాఖ్యలు చేయడాన్ని రాహుల్ ఎత్తి చూపారు. ‘ఒకవైపు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది అంటున్నారు, మరోవైపు, విజయం సాధించామంటున్నారు. అది కొనసాగుతోందా? లేదా ముగిసిందా? మరోవైపు ఆపరేషన్ సిందూర్ను తానే ఆపానని ట్రంప్ చెబుతున్నారు. కాబట్టి ‘కుచ్ తో దాల్ మే కాలా హై నా’(ఏదో తేడాగా ఉంది)’అని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం న్యూయార్క్లో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్–పాక్ల మధ్య పెద్ద యుద్ధాన్ని తానే నిరోధించానని పునరుద్ఘాటించడాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత విదేశాంగ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రపంచ వేదికపై భారత్ను ఒంటరి చేస్తోందని ఆరోపించారు. ట్రంప్ వాదన కారణంగానే ప్రధాని మోదీ పార్లమెంటుకు దూరంగా ఉంటున్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల మోసం.. బీహార్లో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా సవరణను కూడా రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ప్రక్రియను బీజేపీ ఎన్నికల మోసంగా ఆయన అభివరి్ణంచారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని గుర్తు చేశారు. ‘బిహార్లో 52 లక్షల మంది మాత్రమే కాదు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసం చేశారు. ఓటర్ల జాబితాను చూపించమని ఈసీని అడిగితే నిరాకరించింది. వీడియోగ్రఫీ గురించి అడిగితే నియమాలను మార్చేసింది. మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారు. కర్ణాటకలో భారీ మోసాన్ని బయటపెట్టి.. ఎన్నికల కమిషన్ ముందుంచాం. తమ ఆటలు ఇక చెల్లవని తెలిసి ఓటర్లను తొలగించారు’అని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ సమరి్థంచారు. కీలకమైన విషయాలపై చర్చించేందుకు మోదీ నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రకటనతో రజతోత్సవం జరుపుకుంటున్న సమయంలో, ప్రధానమంత్రి పూర్తిగా మౌనంగా ఉన్నారు. విదేశాలకు వెళ్లడానికి, స్వదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్థిరపరచడానికి మాత్రమే సమయం వెతుక్కుంటున్నారు’అని ఆయన ఎక్స్లో ఎద్దేవా చేశారు. -
జెఫ్రీ ఎప్స్టీన్ స్కామ్కు ఫుల్స్టాప్ పెట్టాలి
వాషింగ్టన్: రాజకీయ నాయకులకు వ్యభిచారిణులను ఎరగా వేసి, సొంత పనులు చక్కబెట్టుకోవడంలో సిద్ధహస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంలో పూర్తి నిజాలు బయటకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాల్స్ట్రీట్ జర్నల్ పత్రిక తాజాగా ఓ రిపోర్ట్ ప్రచురించింది. 2003లో జెఫ్రీ ఎప్స్టీన్కు పంపించిన బర్త్డే లేఖలో ట్రంప్ పేరు, సంతకం ఉన్నట్లు ఆ పత్రిక బయటపెట్టింది. అభ్యంతకర రీతిలో ఉన్న ఓ మహిళ శరీర భాగాలు, దానిపై ట్రంప్ సంతకం ఇందులో కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ట్రంప్పై ప్రతిపక్ష డెమొక్రటిక్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. అది నకిలీ లేఖ అని తేల్చిచెప్పారు. వాల్స్ట్రీట్ జర్నల్ను, పాత్రికేయుడు రూపర్డ్ మర్దోక్ను కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. డెమొక్రటిక్ పార్టీ సృష్టిస్తున్న ఈ కుంభకోణానికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎప్స్టీన్ అంశంలో పూర్తి వివరాలు సేకరించాలని, నిజాలు నిగ్గుతేల్చాలని తమ అటార్నీ జనరల్ పామ్ బాండీని ఆదేశించారు. కోర్టు ఆమోదం మేరకు సమాచారం బహిర్గతం చేయాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ట్రంప్ ఆదేశాలపై దీనిపై పామ్ బాండీ ప్రతిస్పందించారు. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎప్స్టీన్పై ఇప్పటిదాకా రహస్యంగా సాగిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ప్రయతి్నస్తానని స్పష్టంచేశారు. -
కాళ్ల వద్ద వాపు.. చేతి వద్ద గాయం..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(80) ఆరోగ్యంపై మరోసారి వదంతులు చెలరే గాయి. ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఫిపా క్లబ్ వరల్డ్ కప్ తిలకించేందుకు వచ్చిన ట్రంప్నకు కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా కనిపించడం, కుడి చేతిపై పలు చోట్ల వాపు కనిపించడంపై పలు దృశ్యాలు ఆన్లైన్లో హల్చల్ చేశాయి. ట్రంప్ వాస్తవ ఆరోగ్య స్థితిని కప్పిపుచ్చేందుకు అధ్యక్ష యంత్రాంగం ప్రయత్నిస్తోందా? అంటూ ఎక్స్లో ఓ యూజర్ అనుమానం వ్యక్తం చేశాడు. అధ్యక్షుడు ట్రంప్ శ్వాస సంబంధ సమస్యతో బాధపడు తున్నట్లుగా మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఇలా వస్తున్న రకరకాల వదంతులపై అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. వీన్స్ ఇన్సఫియెన్సీ అనే సిరల వ్యాధితో ట్రంప్ బాధపడుతున్నారన్నారు. 70 ఏళ్లు దాటిన వారిలో సాధారణంగా కనిపించేదేనని చెప్పారు. ‘ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, చీలమండ వద్ద వాపును వైద్యులు పరీక్షించారు. దీన్ని సాధారణ లోపంగా నిర్ధారించారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు’అని ఆమె తెలిపారు. ఇతర వైద్య పరీక్షల్లో గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యం వంటివి లేనట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. -
ఈయూ, మెక్సికోపై 30% టారిఫ్లు
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో శనివారం పోస్టుచేశారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్ ప్రశంసించారు. మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్లు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు 27 దేశాలతో కూడిన ఈయూపై టారిఫ్లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదని అంటున్నారు. -
భలే ఇంగ్లిష్ మీది!
వాషింగ్టన్: ఏదో ఒక వివాదం లేనిదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పొద్దుపోవడం లేదు. తాజాగా లైబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొవాకై ఇంగ్లిష్ చాలా బాగుందంటూ ఆయన ఇచి్చన కితాబు కూడా వివాదానికే దారితీసింది. బుధవారం వైట్హౌస్లో ఐదుగురు ఆఫ్రికా దేశాధినేతలతో భేటీ సందర్భంగా జోసెఫ్ ఇంగ్లిష్ కు ట్రంప్ ముగ్ధుడయ్యారు. ‘‘చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంత చక్కని ఇంగ్లిష్ ఎక్కడ నేర్చుకున్నారు?’’అంటూ ఆరా తీశారు. ఆయన ధోరణి తమను అవమానించేలా ఉందంటూ లైబీరియాలోనే గాక ఆఫ్రికావ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ఆఫ్రికా ప్రాంతాలవాళ్లు నిరక్షర కుక్షులనే ఉద్దేశంలోనే ట్రంప్ వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు. దీనిపై లైబీరియా దౌత్యవేత్తలు కూడా అభ్యంతరం వెలిబుచ్చారు. ట్రంప్ తీరుకు నిరసనగా తమ అధ్యక్షుడు వాకౌట్ చేయాల్సిందని లైబీరియన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వైట్హౌస్ ప్రెస్ కరోలినా లెవిట్ ట్రంప్ వ్యాఖ్యలను సమరి్థంచారు. వాటిలో తప్పేమీ లేదని, తమ అధ్యక్షుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని లైబీరియా విదేశాంగ మంత్రి కూడా అన్నారు. ఆంగ్లమే అధికార భాష లైబీరియా అధికారిక భాష ఇంగ్లిష్. ఆఫ్రికాలో బానిసత్వం నుంచి విముక్తి పొందిన వారి పునరావాసం నిమిత్తం అమెరికా వలస సమాజం 1822లో ఆ దేశాన్ని ఏర్పాటు చేసింది. 1847లోనే అమెరికా నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది. ఆంగ్లంతో పాటు అక్కడ పలు భాషలు మాట్లాడతారు. గతంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడెరిక్ మెర్జ్ ఇంగ్లిష్ నుకూడా ట్రంప్ ఇలాగే మెచ్చుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ‘అమెరికా ఫస్ట్’నినాదంతో భాగంగా ఆంగ్లానికి ఆయన అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దాన్ని అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ గత మార్చిలో ఉత్తర్వులు కూడా ఇచ్చారు! -
నా ప్రాణాలకు ముప్పు నిజమే: ట్రంప్
వాషింగ్టన్: తన ప్రాణాలకు ముప్పు ఉన్న మాట నిజమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డ్రోన్ దాడి చేసి ట్రంప్ను అంతం చేస్తామంటూ ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహితుడొకరు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మర్–ఎ–లాగో రిసార్ట్లో ట్రంప్ సన్ బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్ ప్రయోగిస్తామని, అదే అనువైన ప్రదేశమని చెప్పారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఇది తనకు వచి్చన బెదిరింపుగానే భావిస్తున్నానని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదన్నారు. వాస్తవానికి ఏడేళ్ల వయసు నుంచి తాను సన్ బాత్ చేయడం లేదని వివరించారు. ఖమేనీ అనుచరుడి హెచ్చరికలను పరోక్షంగా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. -
జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ రగడకు తెర తీశారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్కు ఈ మేరకు స్వయంగా లేఖలు కూడా రాశారు. ప్రతీకార సుంకాలకు దిగితే ఆ దేశాలపై టారిఫ్లు ఆ మేరకు పెరుగుతాయని అందులో ట్రంప్ హెచ్చరించారు! ఆ లేఖల స్క్రీన్షాట్లను ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం టారిఫ్ నిజానికి చాలా తక్కువేనంటూ వాపోయారు. ‘‘ఇవి తుది టారిఫ్లు కావు. మీ దేశంతో మా సంబంధాలను బట్టి అంతిమంగా పెరగవచ్చు, తగ్గనూ వచ్చు’’ అన్నారు. టారిఫ్ పెంపుపై భారత్తో పాటు పలు ఇతర దేశాలకు కూడా ట్రంప్ లేఖాస్త్రాలు సంధిస్తున్నట్టు సమాచారం. మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఎద్దేవా న్యూయార్క్: ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడతానన్న ఎలాన్ మస్క్ ప్రకటనను హాస్యాస్పదంగా ట్రంప్ సోమవారం అభివర్ణించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్లుగా రెండు పారీ్టలతోనే రాజకీయ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు మూడో పార్టీని తీసుకురావడమంటే గందరగోళాన్ని సృష్టించడమే’’ అని అన్నారు. తర్వాత తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లోనూ మస్్కను విమర్శిస్తూ ట్రంప్ పోస్ట్లు పెట్టారు. ‘‘కొన్ని వారాల క్రితం మా స్నేహ రైలుబండ్లు ఢీకొన్నాయి. ఇప్పుడు మస్క్ పూర్తిగా పట్టాలు తప్పారు. అమెరికాలో మూడో పార్టీ ఏదీ అద్భుతాలు చేయలేదన్న చేదు నిజం తెల్సికూడా మస్క్ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. సక్రమంగా ఉన్న రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి తప్ప మూడోపార్టీ ఎందుకూ పనికిరాదు’’ అని వ్యాఖ్యానించారు. -
ఒంటి చేత్తో యుద్ధం ఆపేశా
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడగా, తానే చొరవ తీసుకొని ఒంటిచేత్తో ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టంచేశారు. అన్ని రకాల వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని హెచ్చరించడంతో ఈ రెండు దేశాలు తన మాట విని దారికొచ్చాయని, యుద్ధం ఆపేశాయని చెప్పారు. ట్రంప్ తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత తన సీనియర్ అధికారులను రంగంలోకి దించానని, ఇరుదేశాలను ఒత్తిడి పెంచానని తెలిపారు. తన చాతుర్యం ఫలించి యుద్ధం ఆగిపోయిందని వెల్లడించారు. తానే కనుక చొరవ తీసుకోకపోత రెండు దేశాల మధ్య కచ్చితంగా అణు యుద్ధం జరిగేదని స్పష్టంచేశారు. తనలాగా గొప్ప పని చేసిన అమెరికా అధ్యక్షుడు గతంలో మరొకరు ఉన్నారో లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మధ్య కాల్పుల విరమణకు భారత్, పాక్లను ఒప్పించడం ద్వారా గొప్ప పని చేశానని అన్నారు. సెర్బియా, కొసావో దేశాలను సైతం ఇలాంటి దారికి తీసుకొచ్చానని, అక్కడ పెద్ద యుద్ధం ఆపేశానని ట్రంప్ ఉద్ఘాటించారు. వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటానని బెదిరించడంతో అవి ఘర్షణకు స్వస్తి చెప్పి, శాంతిని ఆశ్రయించాయని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల్లో మంచి నాయకులు ఉన్నారని, వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అమెరికాతో వాణిజ్యం కావాలా? లేక ఒకరిపై ఒకరు అణు బాంబులతో దాడులు చేసుకుంటారా? అని ప్రశ్నించగా, వాణిజ్యమే కావాలని బదులిచ్చారని వివరించారు. -
NATO Summit 2025: డాడీ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొత్తగా ఒక నిక్నేమ్ వచ్చి చేరింది. అదేమిటో తెలుసా?.. డాడీ. అంటే నాన్న అని తెలిసిందేగా. నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ను డాడీ అని పిలుస్తున్న వీడియోను వైట్హౌస్ తాజాగా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ను పక్కనే ఉన్న నాటో చీఫ్ మార్క్ రుట్టే సరదాగా డాడీ అని సంబోధించారు. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను ‘డాడీస్ హోమ్. హే, హే, హే, డాడీ’ అని శీర్షికతో శ్వేతసౌధం షేర్ చేసింది. ఇది జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు తమకు తోచిన రీతిలో ప్రతిస్పందిస్తున్నారు. నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో నాటో సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ముగిసిపోయేలా తానే చొరవ తీసుకున్నానని ఆయన చెప్పారు. ఇంతలో నాటో చీఫ్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. డాడీ (ట్రంప్) ఇరు దేశాలకు బలమైన భాషలో చెప్పారని వ్యాఖ్యానించారు. తర్వాత డాడీ అన్ని సంబోధనపై ట్రంప్ స్పందించారు. అది చాలా ఆప్యాయత, అనురాగంతో కూడిన సంబోధన అని ఆనందం వ్యక్తం చేశారు. -
శాంతి నోబెల్కు ట్రంప్
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ఆశలు మళ్లీ చిగురించాయి. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం నార్వేకు సిఫార్సుచేసింది. ఈ మేరకు నామినేట్ చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తమ నాయకుడు నోబెల్ అవార్డ్కు తగిన వ్యక్తి అని అమెరికా కాంగ్రెస్లో ప్రతినిధుల సభ సభ్యుడు, జార్జియా నుంచి రిపబ్లికన్ పార్టీ నేత బడ్డీ కార్టర్ వ్యాఖ్యానించారు. ఈయన సైతం ట్రంప్ పేరును నామినేట్ చేస్తూ నార్వేలోని శాంతి బహుమతి కమిటీకి లేఖ రాశారు. ‘‘ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఒంటిచేత్తో ఆపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇరాన్ అణుబాంబును సాధించకుండా ట్రంప్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అసాధ్యమని అంతా భావించిన వేళ ట్రంప్ దానిని సాధించి చూపించారు. సమర సంక్షోభం సమసిపోయేలా ఎంతో సమర్థవంతంగా వ్యవహరించిన ట్రంప్ ఈసారి నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు. శాంతిస్థాపన, యుద్ధ విరమణ, అంతర్జాతీయ సామరస్యాల సాధనకు కృషిచేసినందుకు ట్రంప్ నోబెల్ ఇవ్వాల్సిందే’’అని బడ్డీ కార్టర్ తన లేఖలో రాశారు. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య పరస్పర సైనిక చర్యలు ఆపడంలో ట్రంప్ సఫలీకృతులయ్యారు. దౌత్య జోక్యం ద్వారా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించారు. ఈ విషయంలో ట్రంప్ నిజంగా శాంతికాముకుడు’’అని పాకిస్తాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. అయితే గతంలో ట్రంప్ను నామినేట్ చేస్తూ లేఖ రాసిన ఉక్రెయిన్ విదేశీవ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఒలెగ్జాండర్ మరెజ్కో తన ట్రంప్ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. -
ట్రంప్కు ‘నోబెల్ శాంతి’ ఇవ్వాలి
ఇస్లామాబాద్/న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఇటీవల నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యంతో భారత్–పాకిస్తాన్ ఘర్షణ ఆగేలా ట్రంప్ కృషి చేశారని, అందుకు నోబెల్ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. మూడు రోజుల క్రితం ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు వైట్హౌస్లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ సమయంలో అసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా పాక్ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. భారత్–పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇరు దేశాలతో మాట్లాడి శాంతికోసం కృషి చేశారని పేర్కొంది. అణ్వ్రస్తాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నివారించారని కొనియాడింది. భారత్–పాక్ మధ్య అమల్లోకి వచి్చన కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమని స్పష్టంచేసింది. రక్త పిపాసులకా! నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రతిపాదించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇంటా బయ టా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్ సర్కారు తీరును పలువురు తప్పుపట్టారు. పాక్ పౌరులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రచయితలతోపాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ నిపుణులు కూడా వీరిలో ఉన్నారు. ఒకవైపు గాజాలో మారణహోమం సృష్టిస్తూ, మరోవైపు ఇరాన్లో రక్తం పారిస్తున్న ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నందుకు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలా? అని మండిపడ్డారు. హింసాకాండను సమరి్థస్తున్న వ్యక్తి ఈ బహుమతికి ఎలా అర్హుడో చెప్పాలని నిలదీశారు. పాక్ ప్రభుత్వం ఆత్మగౌరవం అనేది లేకుండా ట్రంప్ చేతిలో కీలు»ొమ్మగా మారిందని సామాజిక కార్యకర్తలు ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. శాంతి, న్యాయం కోసం నిజాయతీగా కృషి చేసినవారికే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, అమాయక ప్రజల రక్తంతాగే వారికి కాదని తేల్చిచెప్పారు. పాక్ సర్కారు నిర్ణయానికి ప్రజల ఆమోదం లేదని స్పష్టంచేశారు. నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాకు నోబెల్ శాంతి బహుమతి దక్కదేమో డొనాల్డ్ ట్రంప్ నిర్వేదం భారత్–పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేసినందుకు లేదా రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలు నివారించేందుకు కృషి చేస్తున్నందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కదేమోనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక బహుమతి తనకు రాసిపెట్టి లేదేమోనని నిర్వేదం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను ఎన్ని మంచి పనులు చేసినా నోబెల్ శాంతి బహుమతి రాదన్నారు. దశాబ్దాలుగా యుద్ధ రంగంలో తలపడుతున్న కాంగో, రువాండా మధ్య శాంతికి చొరవ తీసుకుంటున్నానని, అందుకు చాలా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం ఇరు దేశాల మధ్య ఒప్పందం జరగబోతోందని, ఆఫ్రికాతోపాటు ప్రపంచానికి అదొక గొప్ప రోజు కాబోతోందని వివరించారు. సెర్బియా, కొసావో మధ్య ఘర్షణలకు చరమగీతం పాడేశానని, ఈజిప్టు, ఇథియోపియా మధ్య శాంతిని కొనసాగిస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం లేదని ట్రంప్ నిరాశకు లోనయ్యారు. -
టెలికాం రంగంలోకి డొనాల్డ్ ట్రంప్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు రెడ్ టోపీలను మాత్రమే కాదు.. ఇక నుంచి పసిడి వర్ణపు ఫోన్లను కూడా క్యారీ చేయనున్నారు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు టెలికాం రంగంపై దృష్టి సారించారు. కొత్త ఫోన్ బ్రాండ్తోపాటు ఒక నెట్వర్క్నే ఏర్పాటు చేయాలనే ప్రణాళికలో ఉన్నారు. ఆయన ట్రేడ్మార్క్లను నిర్వహించే కంపెనీ డీటీటీఎమ్ ఆపరేషన్స్ ఎల్ఎల్సీ రెండు ట్రేడ్ మార్క్లకోసం యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుంది. అందులో ట్రంప్ బ్రాండ్ మొబైల్ఫోన్, టెలికాం నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 12న ట్రంప్, టీ1 పేర్లపై పేటెంట్ కోరినట్లు తెలుస్తోంది. దరఖాస్తు పత్రాల ప్రకారం.. మొబైల్ ఫోన్లు, ఫోన్కేసులు, బ్యాటరీ ఛార్జర్లు, వైర్లెస్ టెలికాం సేవలు, ట్రంప్ బ్రాండ్తో రీటైల్ దుకాణాలు ప్రారంభించే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఊతమిస్తూ ట్రంప్ వ్యాపారాలను నిర్వహించే ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. ట్రంప్ మొబైల్ అనే కొత్త వెంచర్ అమెరికాలో తయారయ్యే ఫోన్లను విక్రయిస్తుందని, కాల్ సెంటర్కూడా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఆగస్టులో అందుబాటులోకి వచ్చే టీ1 ఫోన్ బంగారు రంగులో ఉంటుందని, అయితే దీనిని మరో కంపెనీ తయారు చేస్తుందని ట్రంప్ కుటుంబ సంస్థ తెలిపింది. మరిన్ని వివరాలను వెల్లడించలేదు. -
యుద్ధం తక్షణమే ఆపండి
కాల్గరీ: ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని జీ7 దేశాల అధినేతలు తేల్చిచెప్పారు. రెండు దేశాలు వెంటనే వెనక్కి తగ్గాలని, యుద్ధానికి స్వస్తి చెప్పాలని కోరారు. ఇజ్రాయెల్–ఇరాన్ వెంటనే చర్చలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. పరస్పరం కలిసి చర్చించుకొని, ఘర్షణకు తెరతించాలని అన్నారు. జీ7 కూటమి వార్షిక సదస్సు సోమవారం కెనడాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లా డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించడమే లక్ష్యగా ఒక పరిష్కార మార్గం కనిపెట్టాలని తామంతా అంగీకారానికి వచ్చినట్లు బ్రిటిష్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ చెప్పారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలోనూ పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలు సొంతం చేసుకొనేందుకు ఇరాన్ను అనుమతించకూడదని జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పారు. మరోవైపు జీ7 కూటమిపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించడం పొరపాటేనని చెప్పారు. రష్యాను పక్కనపెట్టడం ప్రపంచాన్ని ఇప్పుడు అస్థిరపరుస్తోందని అభిప్రాయపడ్డారు. జీ7 ఇక జీ8 కావాలని.. జీ9 అయితే ఇంకా బాగుంటుందని పేర్కొన్నారు. కూటమిలో రష్యా, చైనా సైతం సభ్యదేశాలుగా చేరాలన్న తన ఆకాంక్షను ట్రంప్ వ్యక్తంశారు. జీ7 ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా,చే యూరోపియన్ యూనియన్(ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో భారత్కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జీ7 సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంగళవారం జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు. -
సోదాలు, అరెస్టులకు తాత్కాలిక విరామం
వాషింగ్టన్: అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి మార్చుకున్నారు. వలసదారులందరినీ ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా బయటకు తరిమేస్తే తలెత్తే ఇబ్బందుమిటో అనుభవంలోకి వస్తున్నాయి. కార్మిక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతే పరిశ్రమలు నష్టాల్లోకి జారుకొనే ప్రమాదం పొంచి ఉంది. అందుకే సోదాలు, అరెస్టులు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మాంసం ప్యాకింగ్ ప్లాంట్లతోపాటు చేపల పెంపకం కేంద్రాల్లోనూ సోదాలు నిలిపివేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి ఐసీఈ అధికారులకు అధికారికంగా ఈ–మెయిల్ పంపించినట్లు సమాచారం. ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఈ విషయం ధ్రువీకరించారు. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం వస్తే సోదాలు కొనసాగించవచ్చని, అరెస్టులు చేయొచ్చని ప్రభుత్వం తేల్చిచెప్పింది. -
ట్రంప్ గద్దె దిగడమా, నాన్సెన్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వివాదంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. అధ్యక్షునితో తలపడటం ద్వారా ఆయన పెద్ద తప్పిదం చేస్తున్నారన్నారు. ఎప్స్టీన్ లైంగిక కుంభకోణంతో ట్రంప్కు సంబంధముందని, ఆయన గద్దె దిగి వాన్స్ అధ్యక్షుడు కావడం ఖాయమని మస్క్ పేర్కొనడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ‘నాన్సెన్స్’అంటూ వాన్స్ శుక్రవారం కొట్టిపారేశారు. అధ్యక్షునిగా ట్రంప్ అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. ఆయనపై మస్క్ ఆరోపణలను ఖండించారు. ‘‘ఇలాంటి గొడవలు అందరి విషయంలోనూ జరుగుతుంటాయి. అందులోనూ మస్క్ చాలా ఎమోషనల్. కాస్త నెమ్మదించారంటే అంతా సర్దుకుంటుంది. కొంతకాలానికి ఆయనే మా వద్దకు తిరిగొస్తారు’’అని అభిప్రాయపడ్డారు. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందంటూ చేసిన ఎక్స్ పోస్టులను మస్క్ తాజాగా తొలగించారు. అయితే, ‘ఆ పోస్టులను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దాచిపెట్టుకోండి’అంటూ భావగర్భితంగా పోస్ట్ చేశారు. మరోవైపు, మస్్కతో తాను మాట్లాడబోతున్నానంటూ వచి్చన వార్తలను ట్రంప్ ఖండించారు. ‘‘ఆ మతి చెడిన మనిíÙతోనా? అలాంటి ఉద్దేశమేదీ నాకు లేదు. నిజానికి మస్కే నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. నేనే పట్టించుకోలేదు’’అని స్పష్టం చేశారు. అంతేగాక ఆయన కంపెనీలకు ప్రభుత్వం కట్టబెట్టిన కాంట్రాక్టులన్నింటినీ పూర్తిగా సమీక్షిస్తానని ప్రకటించారు. ‘‘అంతా నిబంధనల మేరకే ఉంటే ఓకే. లేదంటే ఏం చేయాలో ఆలోచిస్తాం’’అని స్పష్టం చేశారు. మస్క్ కంపెనీలపై గతంలో జరిగిన విచారణలను తిరగదోడతారా అని ప్రశ్నించగా, ‘‘అలాంటివి జరిగాయా? నాకు తెలియదు. అదే నిజమైతే ఏం జరగాలో అదే జరుగుతుంది’’అంటూ స్పందించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్ వంటి అంతర్జాతీయ అంశాలతో నేనిప్పుడు యమా బిజీగా ఉన్నా. మస్క్ గురించి ఆలోచేంచే తీరిక కూడా లేదు. మస్కే కాదు, ఒక్క నేను తప్ప ఎవరున్నా లేకున్నా అమెరికాకు వచి్చన లోటేమీ లేదు’’అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రాట్లకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మస్క్ కొత్త పార్టీ! ట్రంప్తో రగడ నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు కని్పస్తోంది. 80 శాతం మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ ఎక్స్లో ఆయన ఒపీనియన్ పోల్ పెట్టడం తెలిసిందే. దాన్ని 80 శాతం మంది సమరి్థంచినట్టు శుక్రవారం మస్క్ ప్రకటించారు. ‘‘80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే పారీ్టకి 80 శాతం మద్దతు. విధి అంటే ఇదేనేమో!’’అని ఒక పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు. ఆ వెంటనే ‘ద అమెరికా పారీ్ట’అంటూ మరో పోస్ట్ పెట్టారు. అది ఆయన పెట్టబోయే కొత్త పార్టీ పేరు కావచ్చని భావిస్తున్నారు. మస్క్ రష్యాలో స్థిరపడాలనుకుంటే రెడ్కార్పెట్ పరుస్తామని ఆ దేశ చట్టసభ డ్యూమా సభ్యుడు ద్మిత్రీ నొవికోవ్ ప్రకటించారు. ఆయన కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామన్నారు. అయితే ట్రంప్–మస్క్ రగడపై స్పందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నిరాకరించారు. -
పెద్దన్నల పోట్లాట
వాషింగ్టన్: ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. మరొకరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధినేత. బెదిరించి పనులు చక్కబెట్టుకోవడంలో, అవసరం తీరిందనుకుంటే ఎంతటి వారినైనా సరే దూరం పెట్టడంలో, భావోద్వేగాలకు తావన్నదే లేకుండా స్వీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించడంలో ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోరు. అలాంటి వాళ్లు పరస్పరం తలపడితే ఎలా ఉంటుంది? అచ్చం ఎలాన్ మస్క్ , డొనాల్డ్ ట్రంప్ తాజా రగడ మాదిరిగానే ఉంటుంది. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మొదలైన వారి బ్రొమాన్స్ ట్రంప్ గద్దెనెక్కాక కూడా బ్రహా్మండంగా కొనసాగింది. అవకాశం దొరికినప్పుడల్లా మస్క్ ను ఇంద్రుడు చంద్రుడంటూ ట్రంప్ ఆకాశానికెత్తేశారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేసేందుకు సృష్టించిన డోజ్ విభాగపు సారథ్యం అప్పగించారు. దాని ముసుగులో కీలకమైన ప్రభుత్వ డేటాను మస్క్ చేజిక్కించుకున్నారంటూ ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. అధ్యక్ష కార్యాలయమైన ఓవల్ ఆఫీసులో, అధికారిక విమానం ఎయిర్ఫోర్స్వన్లో, కేబినెట్ సమావేశాల్లో... ఇలా ఎక్కడ చూసినా మస్కే. వైట్హౌస్ను చివరికి మస్క్కు అత్తారిల్లుగా మార్చేశారంటూ ట్రంప్పై విపక్షాలు దుమ్మెత్తిపోసేదాకా వెళ్లింది. అంతలా కొనసాగిన ట్రంప్, మస్క్ సాన్నిహిత్యానికి మూడు రోజుల క్రితం అనూహ్యంగా, అర్ధాంతరంగా తెరపడింది. అంతే! ఒక్కసారిగా అంతా తల్లకిందులైంది. అసలే మొండితనంలోనూ, నోటి దురుసులోనూ ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోని బాపతు కావడంతో పరస్పర నిందలు, విమర్శలు, ఆరోపణలతో ‘తగ్గేదే లే’అంటూ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుంటున్నారు. మస్క్ కు మతి చలించిందంటూ ట్రంప్ దుయ్యబట్టడమే గాక ఆయన స్పేస్ ఎక్స్, స్టార్లింక్ తదితర సంస్థలకు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేసి పారేస్తానని హెచ్చరించారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్ , దమ్ముంటే ఆ పని చేసి చూపించాలంటూ సవాలు విసిరారు. నాసాకు అతి కీలకమైన స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక సేవలను తక్షణం నిలిపేస్తానంటూ బెదిరించారు. అంతేగాక, ‘‘అసలు నావల్లే ట్రంప్ అధ్యక్షునిగా గెలిచారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు’’అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా మైనర్లతో సెక్స్ కార్యకలాపాల ‘ఎప్స్టీన్ కుంభకోణం’లో ట్రంప్ పేరూ ఉందంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ ఉదంతంలో ఆయన గద్దె దిగడం, ఉపాధ్యక్షుడు వాన్స్ అధ్యక్ష పీఠమెక్కడం తప్పదని జోస్యం చెప్పారు. వారి వాగ్యుద్ధం ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్గా మారిపోయింది. ఇది చివరికి ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అలా మొదలైంది... నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.ఏమిటీ ఎప్స్టీన్ కుంభకోణం? మైనర్ బాలికలతో పాటు మహిళలను లైంగికంగా వేధించినట్టు ఎప్స్టీన్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఎదుగుదల కోసం వారిని సన్నిహితులైన రాజకీయ తదితర రంగాల ప్రముఖులకు ఎరగా వేశాడని అభియోగాలు నమోదయ్యాయి. జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, పలు దేశాల ప్రధానులు, రాజకీయ దిగ్గజాలు, హాలీవుడ్ తారలు తదితరులున్నారు. 2019లో అతను జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. సంబంధిత ఫైళ్లను బయట పెడతానని గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు.మస్క్ కు ఎదురుదెబ్బలు విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్కు ‘బ్యూటిఫుల్’ బిల్లులో భారీ కోతలు ప్రతిపాదించారు. అందులోని పలు అంశాలు తన వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేవి కావడం మస్క్ కు మంటెక్కించింది. అంతకుముందు అమెరికా వైమానిక వ్యవస్థ తన స్టార్లింక్ శాటిలైట్ సిస్టం సేవలను వాడుకునేలా ఒప్పించేందుకు ప్రయతి్నంచినా కుదరలేదు. మస్క్ సన్నిహితున్ని నాసా చీఫ్ పదవికి పరిగణించొద్దని ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్తో రగడ నేపథ్యంలో మస్క్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం పడిపోయాయి.ట్రంప్ గద్దె దిగుతారు: మస్క్అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్కు సంబంధాలున్నట్టు మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘అతి పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్స్టీన్ దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉంది. అందుకే వాటిని ఆయన బయట పెట్టడం లేదు’’అంటూ ఆరోపించారు. ట్రంప్ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ను సమరి్థంచారు. వాన్స్ను అధ్యక్షున్ని చేయాలన్న పోస్ట్ను రీ పోస్ట్ చేస్తూ ‘అవు’నని కామెంట్ చేశారు. ‘‘ట్రంప్ అధ్యక్షునిగా ఉండేది మహా అయితే మూడున్నరేళ్లు. నేను మాత్రం కనీసం ఇంకో 40 ఏళ్ల దాకా ఉంటాను’’ అన్నారు. అమెరికన్లలో కనీసం 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపనపై ఒపీనియన్ పోల్ పెట్టారు. నాసాకు డ్రాగన్ సేవలు ఆపేయబోనంటూ కాస్త వెనక్కు తగ్గారు.మస్క్ తో మాట్లాడను: ట్రంప్ మస్క్ వంటి వ్యక్తి డోజ్ పదవిని నెలల క్రితమే వదిలేసి ఉంటే బాగుండేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘బ్యూటిఫుల్ బిల్లు’లో టెస్లాకు మస్క్ ఆశించిన లబ్ధి కని్పంచకపోవడంతో తనపై నిందారోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ గురించి కనీసం ఆలోచించడం కూడా లేదు. కొంతకాలం ఆయనతో మాట్లాడబోను’’అని సీఎన్ఎన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ‘‘పాపం మస్క్ . అతనికేదో సమస్య ఉన్నట్టుంది! బహుశా మతి చలించినట్టుంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేసేందుకు సులువైన మార్గం ఒకటుంది. మస్క్ సంస్థలకు అందుతున్న ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలను తెగ్గోస్తే చాలు!’’అంటూ గురువారం ట్రూత్ సోషల్లో వరుస పోస్టులు పెట్టారు. -
కొన్నాళ్లు కొట్టుకోనీ!
వాషింగ్టన్/కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. రెండు దేశాలనూ ఇంకొన్నాళ్లు కొట్టుకోనివ్వడమే మేలని వ్యాఖ్యానించారు. గురువారం వైట్హౌస్లో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవి మరీ చిన్నపిల్లల మాదిరిగా కీచులాడుకుంటున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘కొన్నిసార్లు ఓపికున్నంత సేపు కొట్టొకోనివ్వడమే మేలు. తర్వాత ఇద్దరినీ చెరోవైపు లాగేయాలి. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పా’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ‘‘నా మాట వినకపోతే చాలా కఠినంగా వ్యవహరిస్తా. యుద్ధానికి తెర దించకపోతే రెండు దేశాలపైనా ఆంక్షలు విధిస్తా’’ అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు.రష్యా డ్రోన్ దాడుల్లో ఐదుగురు మృతిబుధవారం రాత్రి ఉత్తర ఉక్రెయిన్లోని ప్రిలుకీ నగరంపై రష్యా డ్రోన్ దాడిలో ఐదుగురు మరణించారు. ‘‘స్థానిక ఫైర్ చీఫ్ ఒలెక్జాండర్ లెబిడ్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. ఆయన భార్య, కుమార్తె, ఏడాది వయసున్న మనవడు చనిపోయారు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. చిన్నారి తల్లి కీవ్లో పోలీసు అధికారి. అక్కడ రష్యా దాడులు పెరగడంతో బాబును తల్లిదండ్రుల దగ్గర వదిలేందుకు వచ్చి తనతో పాటుగా బలైంది. పుతిన్తో ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోపే ప్రిలుకీపై దాడి జరగడం గమనార్హం. ఆదివారం తమ వైమానిక స్థావరాలపై జరిపిన దాడులకు గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ తనతో అన్నట్లు అనంతరం ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు సాగిస్తుండటం తెల్సిందే. -
ట్రంప్ మాటలు ఉత్త డొల్ల
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపేశానని, తాను చొరవ తీసుకోకపోయి ఉంటే రెండు దేశాల మధ్య కచి్చతంగా అణుయుద్ధం జరిగేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ తిప్పికొట్టారు. మాట వినకపోతే టారిఫ్లు విధిస్తామని, వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని బెదిరించడంతో భారత్, పాక్లు దారికొచ్చాయని, బుద్ధిగా కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చెప్పడాన్ని ఖండించారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికాలో జరిగిన చర్చల్లో టారిఫ్ల అంశమే ప్రస్తావనకు రాలేదని గురువారం తేలి్చచెప్పారు. గత నెల 7 నుంచి 10వ తేదీ దాకా అమెరికాలో పలుమార్లు సంప్రదింపులు జరిగాయని అన్నారు. పాకిస్తాన్తో నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి మాత్రమేని మాట్లాడామని తెలిపారు. టారిఫ్లు, వాణిజ్య సంబంధాల అంశాన్ని అమెరికా లేవనెత్తలేదని స్పష్టంచేశారు. ట్రంప్ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కేవలం రెండు దేశాలకు సంబంధించిన అంశమని, ఇందులో మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని వెల్లడించింది. అయినప్పటికీ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికీ నోరుపారేసుకుంటూనే ఉంది. ట్రంప్ హెచ్చరికల కారణంగానే భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచి్చనట్లు ఈ నెల 23న కోర్టు ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్కు అమెరికా ప్రభుత్వం తెలియజేసింది. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ ప్రతిపాదించిన అధిక టారిఫ్లకు చట్టపరమైన ఇబ్బందులు రాకుండా కోర్టు ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్కు తప్పుడు వివరణలు ఇస్తున్నట్లు అమెరికాపై సర్కారుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ట్రంప్పై మస్క్ అసమ్మతి గళం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన సన్నిహిత మిత్రుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన పన్నులు, వ్యయాల బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ట్రిలియన్ డాలర్ల మేర పన్నులు చేయకుండా నిలిపివేయడం, రక్షణ రంగంపై వ్యయాన్ని భారీగా పెంచాలని ట్రంప్ నిర్ణయించడం సరైంది కాదని కుండబద్ధలు కొట్టారు. మంగళవారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్మాట్లాడారు. ‘బిగ్, బ్యూటిఫుల్’అంటూ ట్రంప్ చెబుతున్న బిల్లు గొప్ప బిల్లుగా తాను భావించడం లేదన్నారు. అది చాలా పెద్దది లేదా అందమైనది అని తాను ఎంతమాత్రం అనుకోవడం లేదని తేల్చిచెప్పారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ఎలాన్ మస్క్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారీగా ఆర్థిక సాయం సైతం అందజేశారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్ మస్్కకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశించిన డో జ్ చీఫ్ పదవిని కట్టబెట్టారు. అలాంటి తన మిత్రు డు ట్రంప్పై ఎలాన్ మస్క్ అసమ్మతి గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. పన్నుల్లో కోతలకు, రక్షణ వ్యయం పెంపునకు తాను వ్యతిరేకం అని పరోక్షంగా ఎలాన్ మస్క్ స్పష్టంచేశారు. -
ట్రంప్ పేరుతో నకిలీ యాప్
బెంగళూరు: సైబర్ నేగరాళ్లు చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కూడా వదల్లేదు. ఆయన పేరుతో యాప్ను రూపొందించి.. 150 మందిని మోసం రూ.కోటి వసూలు చేశారు. ‘ట్రంప్ హోటల్ రెంటల్’పేరుతో యాప్ క్రియెట్ చేసిన స్కామర్లు.. ఇందులో పెట్టుబడులు పెడితే డబ్బు రెట్టింపవుతుందని నమ్మబలికారు. యాప్ చట్టబద్ధమైనదిగా చూపించడానికి ఏఐ జనరేటెడ్ ట్రంప్ వీడియోను ప్రసారం చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి బహుమతులు కూడా ఆశ చూపారు. అంతేకాదు.. ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో నమ్మిన బెంగళూరు, తమకూరు, మంగళూరు, హవేరి వరకు ప్రజలు యాప్లో ఉన్న నంబర్కు కాల్ చేసి డబ్బు ఇచ్చారు. 150 మంది కోటికి పైగా పెట్టుబడి పెట్టారు. వీరికి నమ్మకం కలిగించేందుకు స్కామర్లు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేవారు. కొన్ని రోజులపాటు చిన్నచిన్న బహుమతులు కూడా అందజేశారు. ఆ తరువాత షేర్లు రోజురోజుకూ పెరుగుతున్నట్టుగా డిజిట్స్ మారుస్తూ వారిని మాయ చేశారు. ఆ తరువాత కొంతకాలానికి యాప్లో ఉన్న నంబర్కు కాల్ చేస్తే స్పందన లేదు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. ఒక్క హవేరీలోనే 15 మందికి పైగా మోసపోయారని పోలీసు అధికారులు వెల్లడించారు. -
హార్వర్డ్లో విదేశీ విద్యార్థులే ఎక్కువ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై దాడిని కొనసాగించారు. వర్సిటీ ఎస్ఈవీపీ హోదా రద్దును నిలిపేస్తూ తన ప్రభుత్వం తీసుకున్న చర్యను ఆయన సమరి్థంచారు. అక్కడ చదువుతున్నవారిలో 31శాతం విదేశీ విద్యార్థులే ఉన్నారని, వారి పూర్తి వివరాలను వెల్లడించాలని ట్రూత్సోషల్ వేదికగా ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు నిలిపేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందించారు. ‘హార్వర్డ్లో చదువుతున్నవారిలో 31 శాతం మంది విదేశీ విద్యార్థులే. పదేపదే ప్రభుత్వం అభ్యరి్థంచినప్పటికీ విశ్వవిద్యాలయ ఆయా విద్యార్థుల గురించి వివరాలను అందించడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? వారిలో ఎక్కువ మంది అమెరికా వ్యతిరేక దేశాలకు చెందిన విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థుల విద్యకోసం వారేమీ చెల్లించడం లేదు. ఆ విదేశీ విద్యార్థులు ఎవరో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం’అని ట్రంప్ పేర్కొన్నారు. 443 కోట్లు ఖర్చు చేయండి.. ‘హార్వర్డ్ యూనివర్సిటీకి బిలియన్ డాలర్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వంగా వివరాలు అభ్యర్థించడం సహేతుకమైనది. మాకు ఆ విద్యార్థుల పేర్లు, వారి దేశా ల వివరాలు కావాలి. లేదంటే హార్వర్డ్ దగ్గర దాదా పు రూ.443 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటినే ఉపయోగించుకోవాలి. ఫెడరల్ ప్రభుత్వాన్ని నిధు లు అడగకూడదు’అని ట్రంప్ హెచ్చరించారు. -
సామ్సంగ్కు ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలను టారిఫ్ల పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆయా కంపెనీలు అమెరికాలోనే వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేయాలని, లేకపోతే సుంకాల బాదుడుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆయన యాపిల్ కంపెనీకి ఇప్పటికే హెచ్చరికలుజారీ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ సంస్థకు సైతం ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది. అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25 శాతం టారిఫ్ విధిస్తామని సామ్సంగ్కు ట్రంప్ తేల్చిచెప్పారు. ఆయన తాజాగా వైట్హúస్లో మీడియాతో మాట్లాడారు. అణు విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో ఎల్రక్టానిక్ ఉత్పత్తులు విక్రయించుకొనే ఏ సంస్థ అయినా సరే వాటిని ఇక్కడే తయారు చేయాలని, లేనిపక్షంలో సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. తయారీ ప్లాంట్లను అమెరికాలో నెలకొల్పితే ఎలాంటి టారిఫ్లు ఉండవని చెప్పారు. మరెక్కడో తయారు చేసి, ఇక్కడ విక్రయించుకొని, సొమ్ము చేసుకుంటామంటే అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఐఫోన్లను అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం టారిఫ్లు విధించడం తథ్యమని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్ కంపెనీకి సంబంధించి 90 శాతం ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడి ప్లాంట్లను భారత్కు తరలించేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఇంతలోనే ట్రంప్ కన్నెర్ర చేశారు. మరోవైపు సామ్సంగ్కు చైనాలో తయారీ ప్లాంట్లు లేవు. చివరి ప్లాంట్ 2019లో మూతపడింది. సామ్సంగ్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు ఎక్కువగా భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్లోనే తయారవుతున్నాయి. భారత్లోనే తయారు చేస్తారా? మీ ఇష్టం.. యాపిల్ కంపెనీకి ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి భారత్కు తరలించుకోవాలంటే తరలించుకోండి. మేము వద్దనడం లేదు. కానీ, ఐఫోన్లను అమెరికాలో విక్రయించుకోవాలంటే మాత్రం సుంకాలు చెల్లించాల్సిందే. సుంకాలు లేకుండా మీరు ఐఫోన్లు ఇక్కడ అమ్ముకోలేరు’’అని పేర్కొన్నారు. -
ట్రంప్ గారి మనవరాలు... మస్తు హుషార్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. తన గోల్ఫ్ ఆటకు సంబంధించిన ఫోటోలు, వైట్హౌజ్లో తాతతో గడిపిన ఫోటోలు ఇందులో ఉన్నాయి. ‘17... నువ్వు నాకు జీవితం గురించి ఎంతో చె΄్పావు. 18... నువ్వు కూడా అలాగే చేస్తావని ఆశిస్తున్నాను’ అని తన పోస్ట్లో రాసింది కై ట్రంప్.‘లాస్ట్ డే బీయింగ్ 17’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియోలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది కై. తాత కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ఉపన్యాసాలు ఇచ్చింది. రాజకీయ ఉపన్యాసాల సంగతి ఎలా ఉన్నా గోల్ఫ్ ఆటలో చక్కని ప్రతిభ చూపుతోంది. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే ‘సోషల్ మీడియా సెన్సేషన్’ అయింది. -
ట్రంప్.. మళ్లీ అదే తీరు!
వాషింగ్టన్: కొన్ని వారాల క్రితం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. సాదరంగా ఆహా్వనించి నిందారోపణల బురద కుమ్మరించడం అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచమీడియా తీవ్రంగా మందలించినా ట్రంప్ తన తెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని బుధవారం మరోసారి రుజువైంది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్హౌస్కు విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసాకు ట్రంప్ ఆరోపణలతో స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికాలో వేలాది మంది శ్వేతజాతి రైతులను వధించారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో హతాశుడైన రమఫొసా వెంటనే తేరుకుని ట్రంప్కు దీటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే? శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో సంయుక్తంగా మాట్లాడేందుకు రమఫొసా సిద్ధంకాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద టెలివిజన్లో ఒక వీడియో చూపిస్తాం చూడండని అక్కడి వారందరినీ ఆదేశించారు. ‘‘శ్వేతజాతీయులను చంపేయండి. శ్వేతజాతి రైతులను కాల్చిచంపండి’’ అంటూ దక్షిణాఫ్రికాలో చిన్నపాటి కమ్యూనిస్ట్పార్టీ అయిన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రమఫొసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ‘‘ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారనేది ఒట్టిమాట. వాస్తవానికి వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేతజాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేతజాతీయులు బతుకుజీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలసవచ్చారు. వాళ్లకు మేం ఆశ్రయం కల్పించాం’’ అంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు. శ్వేతజాతీయుల అవస్థలు ఇవి అంటూ విదేశీ వార్తాసంస్థల్లో ప్రచురితమైన కథనాల జిరాక్స్ కాపీలను మీడియా ప్రతినిధులకు చూపించి రమఫొసాకు అందజేశారు. వీటికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్చేశారు. ‘‘ అన్ని హత్యలే. దక్షిణాఫ్రికాలో ఎక్కడ చూసినా మరణాలే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రమఫొసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నాసరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. ‘‘ అసలేంటీ వీడియో?. నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిదీ వీడియో?. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం?’’ అంటూ ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాదిమంది నల్లజాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. మా దేశంలో శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికనర్స్గా పిలిచే మైనారిటీ శ్వేతజాతీయులే చాన్నాళ్లు మా దేశాన్ని చెండుకు తిన్నారు. ఆఫ్రికన్ల దీనగా«థను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుంది.’’ అని రమఫొస సూటిగా సమాధానం ఇచ్చారు. ట్రంప్ చూపిన వీడియోలో ఒక రోడ్డు పక్కన చోట పెద్ద సంఖ్యలో సమాధులు ఉన్నాయి. అయితే ఇవి నిజమైన సమాధులు కావని, 2020లో ఖ్వజూలు–నటాల్ ప్రావిన్సులో ఒక రైతు జంట పొలంలో హత్యకు నిరసనగా ఏర్పాటుచేసిన నకిలీ సమాధులు అని కొందరు వాదించారు. ఉంటే ఇచ్చేవాడినే శ్వేతజాతి, నల్లజాతీయుల్లో ఎవరు పీడనకు గురయ్యారని ఓవైపు ట్రంప్, రమఫొసా వాదించుకుంటుంటే ఒక విలేకరి మధ్యలో కల్గజేసుకుని వందల కోట్ల రూపాయల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంత వరకు నైతికతగా అనిపించుకుంటుంది? అని ట్రంప్ను సూటి ప్రశ్న వేశారు. దీంతో చిర్రెత్తికొచ్చిన ట్రంప్.. ‘‘ నువ్వో చెత్త రిపోర్టర్వు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోల ఏంటి?. నువ్వు అసలు ప్రశ్నలు అడగొద్దు’’ అని అతనిపై ట్రంప్ అరిచాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ను కూల్ చేసేందుకు రమఫొసా మధ్యలో కలుగజేసుకున్నారు. ‘‘ ఖతార్ మాత్రమే కాదు. కావాలంటే మేం కూడా మీకు విమానాన్ని బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు. దీనికి ట్రంప్ వెటకారంగా బదులిచ్చారు. ‘‘ అగ్రరాజ్యమైన అమెరికాకే ఎయిర్ఫోర్స్వన్గా కొత్త విమానాన్ని ఇచ్చే దమ్ముంటే మీరూ ఇవ్వొచ్చు. నేను తీసుకునేందుకు రెడీ’’ అని అన్నారు. వెంటనే రమఫొసా ‘‘ అగ్రరాజ్యంగా ఉండి కూడా మీరు ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉన్నా.. ఇచ్చే స్థితిలో మేం లేము. మా వద్ద అసలు విమానమే లేదు’’ అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ఘొల్లున నవ్వేశారు. -
ట్రంప్ సలహా సంఘంలో మాజీ ఉగ్రవాదులు
వాషింగ్టన్: కరడుగట్టిన అల్కాయిదా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన మాజీ ఉగ్రవాదులకు ఏకంగా అమెరికా అధ్యక్షుని సలహా సంఘంలో చోటు దక్కింది! వారిలో ఒకరు ఉగ్రవాదం, సంబంధిత కేసుల్లో దోషిగా జైలుశిక్ష అనుభవించి విడుదలైన ఇస్మాయిల్ రాయర్ కాగా మరొకరు హమాస్, ముస్లిం బ్రదర్హుడ్లతో సంబంధాలున్న మాజీ ఉగ్రవాది షేక్ హమ్జా యూసుఫ్. వారిని రిలీజియస్ లిబర్టీ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్లో సభ్యులుగా ట్రంప్ సర్కారు ఎంపిక చేసింది. వారిద్దరూ అమెరికాలో ఇస్లామిక్ బోధనల్లో ప్రముఖులుగా మంచిపేరు తెచ్చుకున్నారని చెప్పుకొచి్చంది. కరడుగట్టిన ఉగ్ర చరిత్ర ఉన్న మాజీలను సలహా సంఘంలోకి కూర్చోబెడతారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ రెండో హయాంలో అమెరికాలో నెలకొన్న అవ్యవస్థకు ఇది మరో నిదర్శనమంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ సలహా సంఘం మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అధ్యక్షుడికి సలహాలిస్తుంది.ఎవరీ ఇస్మాయిల్? ఇతను అమెరికా జాతీయుడు. అసలు పేరు ర్యాండల్ టోడ్ రాయర్. 1992లో ఇస్లాం స్వీకరించి ఇస్మాయిల్గా పేరు మార్చుకున్నాడు. లష్కరే తోయిబా, ఈజిప్్టలోని ముస్లిం బ్రదర్హుడ్, ‘వర్జీనియా జిహాద్ నెట్వర్క్’, పాలస్తీనాలోని హమాస్ ఉగ్ర సంస్థతో సత్సంబంధాలున్నాయి. ప్రత్యేక ఉగ్రశిక్షణ కోసం 2000లో పాక్ వెళ్లాడు. అమెరికాపై యుద్ధం కోసం పలువురికి ఉగ్ర తర్ఫీదు ఇచ్చేలా ప్రణాళికలు వేశాడు. జమ్మూ కశీ్మర్లో సైనిక స్థావరాలపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్ దాడికి సహచర ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చాడు. అల్ఆయిదా, లష్కరేలకు సాయపడ్డ నేరానికి 2003లో ఇస్మాయిల్పై కేసు నమోదైంది. దోషిగా తేలడంతో 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డా స్రత్పవర్తన కారణంగా 2017లో విడుదలయ్యాడు. అమెరికాలోని రిలీజియస్ ఫ్రీడం ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా ఉన్నాడు.ఎవరీ షేక్హమ్జా యూసుఫ్? అమెరికాలో తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అయిన జేతునా కాలేజ్ సహవ్యవస్థాపకుడు. ఈ కాలేజీలో షరియా చట్టాలను బోధిస్తారు. యూసుఫ్కు ముస్లిం బ్రదర్హుడ్, హమాస్లతో లింకులున్నట్టు తేలింది. వాటితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిన్తున్నట్టు చెబుతారు. ఇతని బోధనలకు పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులైనట్టు స్పష్టమైంది. అమెరికా జాత్యహంకార దేశమంటూ వ్యాఖ్యలు చేశాడు. 1990ల నాటి శకంలో న్యూయార్క్ బాంబు దాడుల కేసు నిందితుడు షేక్ ఒమర్ అబ్దుల్ రహా్మన్పై దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించాడు. అమెరికా పోలీస్ ఉన్నతాధికారిని హత్య చేసిన జమీల్ అల్ అమీన్ అనే వ్యక్తికి మద్దతుగా యూసుఫ్ ప్రసంగించాడు. తర్వాత రెండు రోజులకే అమెరికాపై 9/11 దాడి జరిగింది. దాంతో అతన్ని ఎఫ్బీఐ విచారించింది. ముస్లిం దేశాల్లో అత్యంత ప్రముఖ ఇస్లామిక్ విద్యావేత్తగా పేరొందాడు. -
భారత్–పాక్ మధ్య అణు యుద్ధం ఆపేశా..
వాషింగ్టన్: భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కోసం తానే చొరవ తీసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ఆ క్రెడిట్ తనకే దక్కాలని పేర్కొన్నారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి, ఉద్రిక్తతలు ఆగిపోవడం ఇప్పటిదాకా తాను సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఫాక్స్ న్యూస్ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జోక్యం వల్లే పాకిస్తాన్పై ఇండియా సైనిక చర్య నిలిచిపోయిందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని తెలిపారు. రెండు బలమైన దేశాలైన భారత్–పాక్ మధ్య మొదలైన ఘర్షణలు అతి తక్కువ సమయంలోనే అణుయుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందని, తాను కల్పించుకోవడంతో అది ఆగిపోయిందని వివరించారు. అయితే, పాకిస్తాన్తో కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం ఎంతమాత్రం లేదని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ వెల్లడించింది. అయినప్పటికీ ట్రంప్ తన నోటి దురుసు తగ్గించుకోకపోవడం గమనార్హం. భారత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినప్పటికీ ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా ఆయన ఏం సాధించదల్చుకున్నారో అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు. టారిఫ్ల రద్దుకు ఇండియా సంసిద్ధత భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు నివారించి, శాంతిని నెలకొల్పడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లను 100 శాతం రద్దు చేయడానికి ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసిందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరడం ఖాయమని తెలిపారు. అయితే, ఈ ఒప్పందం కోసం తాను తొందరపడడంలేదన్నారు. తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటిదాకా 150 దేశాలు ఇలాంటి ఒప్పందం కోసం ముందుకొచ్చాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అంటూ ట్రంప్ మరోసారి విమర్శించారు. వ్యాపారాలు చేయడం అసాధ్యం అనే పరిస్థితులు ఇండియాలో సృష్టించారని తప్పుపట్టారు. కానీ, అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు పూర్తిగా రద్దు చేయడానికి ఇండియా సుముఖంగా ఉందని వివరించారు. కేవలం అమెరికా కోసం ఇండియా ఈ మేలు చేయడానికి సిద్ధపడిందని అన్నారు. -
అమెరికాలో రెమిటెన్సులపై పన్ను.. ఎన్నారైలకు సెగ..!
న్యూఢిల్లీ: అమెరికాలో ఉంటున్న విదేశీయులు స్వదేశాలకు పంపే రెమిటెన్సులపై 5 శాతం ట్యాక్స్ విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదన అక్కడి ప్రవాస భారతీయులకు సమస్యగా పరిణమించనుంది. దీని వల్ల వారు భారత్కి నిధులు పంపించడానికి సంబంధించిన వ్యయాలు పెరగనున్నాయి. ఇటీవలి రిజర్వ్ బ్యాంక్ ఆర్టికల్లో ప్రస్తావించిన 2023–24 డేటా ప్రకారం ఏకంగా 1.6 బిలియన్ డాలర్ల మేర భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సదరు కథనం ప్రకారం వివిధ దేశాల నుంచి 2010–11లో రెమిటెన్సులు 55.6 బిలియన్ డాలర్ల నుంచి 2023–24లో రెట్టింపై 118.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇందులో అమెరికా వాటా 27.7 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే అమెరికా నుంచి 32.9 బిలియన్ డాలర్లు రెమిటెన్సుల రూపంలో వచ్చాయి. దీనిపై 5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తే 1.64 బిలియన్ డాలర్ల పన్ను భారం పడుతుందని అంచనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా దృష్టి పెడుతున్న ప్రతిపాదన ప్రకారం గ్రీన్ కార్డులు, హెచ్1బీ వీసాలపై ఉన్న వారు సహా మొత్తం 4 కోట్ల మందిపై 5 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ భారం పడనుంది. ఇది అమెరికన్ పౌరులకు వర్తించదు. టాప్లో భారత్.. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం అత్యధిక స్థాయిలో రెమిటెన్సులను అందుకోవడంలో 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ దేశాల మధ్య 2001లో 11 శాతంగా ఉన్న భారత్ వాటా 2024లో 14 శాతానికి పెరిగింది. 2024లో 129 బిలియన్ డాలర్లతో భారత్ అగ్రస్థానంలో ఉండగా, మెక్సికో (68 బిలియన్ డాలర్లు), చైనా (48 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (40 బిలియన్ డాలర్లు), పాకిస్తాన్ (33 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
అమెరికా ఉత్పత్తులకు భారత్లో జీరో టారిఫ్!
దోహా: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న వేళ కాల్పుల విరమణకు ఇరుదేశాలు సమ్మతించాయని అందరికంటే ముందే ప్రకటించి అభాసుపాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తొందరపాటు ప్రకటన చేశారు. టారిఫ్లు విధించకుండానే అమెరికా నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్ అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ గురువారం అనూహ్య ప్రకటన చేశారు. దీంతో వెంటనే భారత్ స్పందించింది. అలాంటిదేమీ లేదని, టారిఫ్ల ఖరారుపై విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతు న్నాయని, చర్చలు ఇప్పట్లో ముగిసిపోవని భారత్ స్పష్టంచేసింది. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది.మోదీ మౌనమేల?: కాంగ్రెస్ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించట్లేరని విపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. ‘‘ అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు చర్చల కోసం మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ జీరో టారిఫ్ అంటూ ప్రకటన చేశారు. ఈ సున్నా టారిఫ్కు, ఆపరేషన్ సిందూర్ ఆగిపోవడానికి మధ్య సంబంధమేంటి?. ఈ అంశంలో మోదీ ఎందుకు మౌనం వహించారు?. అమెరికాతో డీల్ కుదుర్చుకునేందుకు మోదీ ఏమేం అంశాల్లో తలూపారు?’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు.ట్రంప్ ఏం మాట్లాడారు?గురువారం ఖతార్ రాజధాని దోహాలో వ్యాపారదిగ్గజాలు, సంస్థలతో ట్రంప్ సమావేశమయ్యారు. చైనా, అమెరికా టారిఫ్ల యుద్ధం నేపథ్యంలో భారత్లో అత్యధికంగా ఐఫోన్లను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేయబోతున్నట్లు యాపిల్ సంస్థ ఇటీవల ప్రకటించడం తెల్సిందే. ఈ విషయం నచ్చని ట్రంప్ ఇదే అంశాన్ని దోహా భేటీలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వద్ద ప్రస్తావించారు. ‘‘అమెరికాలో యాపిల్ సంస్థను ఇంతబాగా చూసుకుంటున్నా మీరేమో భారత్లో ఐఫోన్లను మరింత ఎక్కువగా తయారుచేస్తామంటున్నారు. అక్కడే కర్మాగారాలను విస్తరిస్తున్నారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అమెరికా ఉత్పత్తులపై భారత్ చాలా ఎక్కువ టారిఫ్లు విధిస్తోంది. ప్రపంచంలో అధిక టారిఫ్లు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. టారిఫ్లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్లో వస్తువులను విక్రయించడం చాలా కష్టమవుతుంది. మీకో విషయం చెప్పనా. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చింది. అసలు టారిఫ్లే లేకుండా వస్తువులను భారత్లోకి దిగుమతి చేసుకోవడానికి వాళ్లు దాదాపు అంగీకారం తెలిపారు. మీరు భారత్లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా అక్కడి సర్కార్ మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్లకు స్వప్రయోజనాలే ముఖ్యం’’ అని టిమ్కుక్తో ట్రంప్ మాట్లాడారు. ఈ విషయాలను మీడియాకు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తనతో మాట్లాడిన తర్వాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్కుక్ అంగీకారం తెలిపారని ట్రంప్ ప్రకటించారు. భారతీయ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ ఏప్రిల్ 9వ తేదీన ప్రకటించారు. అయితే 90 రోజులపాటు ఈ పెంపును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తర్వాత ట్రంప్ వెల్లడించడం తెల్సిందే.ఖండించిన భారత్ట్రంప్ మాటల్లో వాస్తవం లేదని భారత్ గురువారం ప్రకటించింది. ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘ టారిఫ్లుసహా సమగ్ర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య విస్తృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇవి సంక్లిష్టమైనవి. చర్చలు ముగిసిపోలేదు. ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా ఏ అంశంపైనా తుది నిర్ణయాలు వెలువడలేదు. ఒప్పందం కుదుర్చుకుంటే అది ఇరుపక్షాలకు ప్రయోజనకారిగా ఉండాలి. రెండు దేశాలకూ లబ్ధిచేకూరాలి. మేం ఇదే కోరుకుంటున్నాం. చర్చలు పూర్తికాకుండానే దీనిపై మాట్లాడటం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. 2024లో ఇరుదేశాల మధ్య 129 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. -
విరమణ.. ఉల్లంఘన
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్ కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా భారత్ దాన్ని తోసిపుచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. ఒప్పందం కుదిరిందన్న ట్రంప్పాక్ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్ సైన్యం క్షిపణి, డ్రోన్ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్ వైమానిక, రెండు రాడార్ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్ షరీఫ్లకు అభినందనలు తెలిపారు. ట్రంప్ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ‘‘పాక్ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్ ప్రకటించింది. బయటపడ్డ పాక్ నైజం కొద్ది గంటలైనా గడవకుండానే పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం. – విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ


