
అమెరికాతో చర్చల్లో టారిఫ్ల అంశమే ప్రస్తావనకు రాలేదు
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపేశానని, తాను చొరవ తీసుకోకపోయి ఉంటే రెండు దేశాల మధ్య కచి్చతంగా అణుయుద్ధం జరిగేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ తిప్పికొట్టారు. మాట వినకపోతే టారిఫ్లు విధిస్తామని, వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని బెదిరించడంతో భారత్, పాక్లు దారికొచ్చాయని, బుద్ధిగా కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చెప్పడాన్ని ఖండించారు.
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికాలో జరిగిన చర్చల్లో టారిఫ్ల అంశమే ప్రస్తావనకు రాలేదని గురువారం తేలి్చచెప్పారు. గత నెల 7 నుంచి 10వ తేదీ దాకా అమెరికాలో పలుమార్లు సంప్రదింపులు జరిగాయని అన్నారు. పాకిస్తాన్తో నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి మాత్రమేని మాట్లాడామని తెలిపారు. టారిఫ్లు, వాణిజ్య సంబంధాల అంశాన్ని అమెరికా లేవనెత్తలేదని స్పష్టంచేశారు.
ట్రంప్ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కేవలం రెండు దేశాలకు సంబంధించిన అంశమని, ఇందులో మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని వెల్లడించింది. అయినప్పటికీ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికీ నోరుపారేసుకుంటూనే ఉంది.
ట్రంప్ హెచ్చరికల కారణంగానే భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచి్చనట్లు ఈ నెల 23న కోర్టు ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్కు అమెరికా ప్రభుత్వం తెలియజేసింది. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ ప్రతిపాదించిన అధిక టారిఫ్లకు చట్టపరమైన ఇబ్బందులు రాకుండా కోర్టు ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్కు తప్పుడు వివరణలు ఇస్తున్నట్లు అమెరికాపై సర్కారుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.