breaking news
song
-
ఆంధ్ర కింగ్ తాలూకా.. రామ్ పాడిన ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగా తాలూకా(Andhra King Taluka Movie). ఈ మూవీకి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కింగ్డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. పప్పీ షేమ్ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను హీరో రామ్ ఆలపించడం ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. వివేక్- మెర్విన్ సంగీతం అందించారు. కాగా.. ఈ చిత్రంలో కన్నడ హీరో కీలక పాత్రలో నటించారు. -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ సాంగ్
తెలంగాణ జానపదలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని, నృత్యకారిణి నాగదుర్గ నుంచి తాజాగా విడుదలైన పాట ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ ప్రస్తుతం యూట్యూబ్లో మరియు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఈ కొత్త పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. పేరుగల్ల పెద్దిరెడ్డి అంటూ వచ్చిన ఈ పాట తండ్రి మీద ప్రేమతో కూతురు చెబుతున్న నేపథ్యంలో ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని, జానపద లయను ప్రతిబింబిస్తూ ఈ పాట ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే, నాగదుర్గ ఈ పాటలో తనదైన శైలిలో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈ పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ను సాధిస్తూ ట్రెండింగ్లో నిలిచింది. పల్లె జానపద పాటల అభిమానుల మధ్య ఈ పాట క్రేజీ హిట్గా మారడంతో నాగదుర్గ ఖాతాలో మరో విజయవంతమైన జానపద పాట చేరింది. ఈ పాటకు బుల్లెట్ బండి లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. మమత రమేష్ గానం చేశారు. సంగీతాన్ని మదన్ కే అందించారు. -
ద్రౌపది-2 సాంగ్.. చిన్మయికి డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..!
రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి నెలరాజె అంటూ సాగే పాటను విడుదల చేశారు.అయితే ఈ పాటను తమిళంలో ఏం కోనే అంటూ సాగే ఈ పాటను చిన్మయి ఆలపించారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఈ పాటను పాడినందుకు క్షమాపణలు చెబుతూ సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేపథ్యం గురించి తనకు తెలియకపోవటం వల్ల పాడానని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుంచే నేను ఇందులో భాగం అయ్యేదాన్ని కాదని వెల్లడించారు. దీనికి కారణం డైరెక్టర్ మోహన్ అంటూ పోస్ట్ చేసింది.డైరెక్టర్ రియాక్షన్..చిన్మయి క్షమాపణ చెబుతూ ట్వీట్ చేయడంపై చిత్ర దర్శకుడు మోహన్ జి స్పందించారు. ఈ పాటను పాడటానికి తాను పర్సనల్గా చిన్మయి అయితేనే బాగుంటుందని పాడించానని పేర్నొన్నారు. రికార్డింగ్ సమయంలో చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేకపోవటంతో తాను ట్రాక్కు సంబంధించిన విషయాలను మాత్రమే వివరించానని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. తనతో కానీ, సంగీత దర్శకుడితో కానీ మాట్లాడకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగించిదన్నారు. దీనిపై చిన్నయి వివరణ ఇవ్వాలని లేదంటే ట్వీట్ను తొలగించాలని కోరారు.ఈ సందర్భంగా ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను కాకుండా తనను విమర్శించాలని డైరెక్టర్ అన్నారు. ఈ సినిమా మేకింగ్లో భాగమైన ఇతరులను విమర్శించటం పిరికితనమని దర్శకుడు మోహన్ పేర్కొన్నారు. చిన్మయి తన మెసేజ్లో పేర్కొన్న వ్యతిరేక భావజాలం గురించి దర్శకుడు మాట్లాడుతూ చిన్మయి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేస్తోందన్నారు. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో తనకు స్పష్టంగా అర్థం కాలేదని ఆయన వెల్లడించారు. At the outset, my heartfelt apologies for Emkoney.Ghibran is a composer I have known for 18 years since my jingle singing days. When his office called for this song, I just went & sang as I usually do. If I remember right, Ghibran wasn't present during this session - I was…— Chinmayi Sripaada (@Chinmayi) December 1, 2025 Don't target any Technicians, Actors, actresses and who ever work with me in #Draupathi2.. Whatever my movie speaks it's my own creation and idealogy. Your target is me.. Don't target those associated Directly or indirectly with me and my projects.. It's a kind of cowardness..— Mohan G Kshatriyan (@mohandreamer) December 1, 2025 -
బాలయ్య అఖండ-2.. హైందవం సాంగ్ వచ్చేసింది
బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన అఖండకు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి హైందవం సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. నాగ గురునాథ శర్మ లిరిక్స్ రాసిన ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్గా గుర్తింపు పొందిన సింగర్స్ శ్రేయ, రాజ్యలక్ష్మి పాడారు. ఈ పాట బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సాంగ్కు తమన్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
భారీ బడ్జెట్ మూవీగా ద్రౌపది-2.. సాంగ్ రిలీజ్!
రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇటీవలే ద్రౌపది పాత్రలోని రక్షణ చంద్రచూడన్ ఫస్ట్ లుక్ను మేకర్స్ రీసెంట్గానే విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నెలరాజె..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. అమ్మాయి కాబోయే వరుడిని మనసులో ఊహించుకుంటూ పాడే పాట ఇది. ఈ పాటక జిబ్రాన్ సంగీత అందించారు. ఈ సాంగ్ను సామ్రాట్ రాయగా.. పద్మలత పాడారు. ఈ సాంగ్ హృదయానికి హత్తుకునేలా ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ చిత్రంలో నట్టి నటరాజ్, వేల రామమూర్తి, చిరాగ్ జాని, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, వై గీ మహేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
తెలంగాణ గ్రామీణ ప్రేమకథా చిత్రం.. లవ్ సాంగ్ వచ్చేసింది..!
రవికృష్ణ, మనికా చిక్కాల జంటగా నటిస్తోన్న చిత్రం దండోరా. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ ప్రేమికులను తెగ అలరిస్తోంది. ఈ పాటకు పూర్ణచారి లిరిక్స్ అందించగా.. ఆదితి భవరాజు, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ మూవీకి మార్క్ కె రాబిన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో కెమెరా అసిస్టెంట్గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. కేఏప్రోడక్షన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన వి. మునిరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. చిన్ని చిన్ని అంటూ సాగే ఫస్ట్ సింగిల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా.. హరిణి ఇవటూరి, పవన్ కల్యాణ్ పాడారు. ఈ సాంగ్కు వంశీకాంత్ రేఖన సంగీతమందించారు.కాగా.. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అతడిపై పోలీస్ కేసు.. ఏడుస్తూ సింగర్ మంగ్లీకి క్షమాపణ
ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో పాడుతూ, అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే 'బాయిలోన బల్లిపలికే' అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలానే ట్రెండింగ్ కూడా అవుతోంది. సోషల్ మీడియాలో రీల్స్ బాగానే కనిపిస్తున్నాయి. అయితే మేడిపల్లి స్టార్ అలియాస్ మల్లిఖార్జున్ అనే వ్యక్తి మాత్రం ఈ పాటని, మంగ్లీని ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ చేశాడు. దీంతో మంగ్లీ.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఈ క్రమంలో గురువారం ఉదయం నిందితుడు మల్లిఖార్జున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ ఇతడు ఇలానే అసభ్య కంటెంట్తో వీడియోలు చేశాడని గుర్తించారు. మరి స్టేషన్లో ఏం జరిగిందో ఏమో గానీ సదరు మేడిపల్లి స్టార్.. ఏడుస్తూ ఇప్పుడు మంగ్లీకి క్షమాపణ చెబుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'పాట ట్రెండింగ్ ఉంది కదక్క.. కామెంట్ పెట్టిన వాడిని తిట్టాను, మిమ్మల్ని కాదు అక్క. నేను ఎవరినీ తిట్టను అక్క. క్షమించక్క. ఏ మహిళని తిట్టను అక్క, ఎవరిపై కామెంట్ చేయను అక్క. ప్లీజ్ అక్క, క్షమించు అక్క' అని మల్లిఖార్జున్ చెబుతున్న వీడియో ఇప్పుడు కనిపిస్తుంది. మంగ్లీ పెట్టిన ఈ కేసుని.. సోషల్ మీడియాలో వీడియోలు ప్రతిఒక్కరూ గమనించాలి. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు కచ్చితంగా ఆలోచించి మాట్లాడితే బెటర్. లేదంటే పోలీస్ స్టేషన్లో చిక్కులు గ్యారంటీ.(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?) -
సింగర్గా నవీన్ పొలిశెట్టి.. హుషారెత్తించే పాట రిలీజ్
'జాతిరత్నాలు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మరో హిట్ అందుకున్నాడు. దీని తర్వాత మరో మూవీ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే చిత్రం చేస్తున్నాడు. రాబోయే సంక్రాంతికి దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)ఇప్పటికే దసరా, దీపావళికి ప్రమోషనల్ వీడియోలు వదిలిన నవీన్.. ఇప్పుడు తొలి పాటని రిలీజ్ చేశారు. 'భీమవరం బల్మా' అంటూ సాగే ఈ గీతాన్ని.. భీమవరంలోనే ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లోనే గురువారం సాయంత్రం లాంచ్ చేశారు. పాట కలర్ఫుల్గా ఉంది. నవీన్-మీనాక్షి కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి మారి దర్శకుడు.(ఇదీ చదవండి: 'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?) -
యూట్యూబ్లో దూసుకెళ్తున్న ‘బిగ్బాస్’ ఫేం నిఖిల్ పాట
యూట్యూబ్లో ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ హవా నడుస్తోంది. ఈ క్రమంలో ఓ మెలోడీ గీతాన్ని వదిలి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘తేనెల వానలా’ అంటూ సాగే తెలుగు రొమాంటిక్ మెలోడీ గీతాన్ని నవంబర్ 20న వదిలారు. ప్రాచి, నిఖిల్ కలిసి ఈ మెలోడీ గీతాన్ని వీక్షకులకు నచ్చేలా, మెచ్చేలా మలిచారు. ఈ పాట విజువల్గా అద్భుతంగా ఉండటమే కాకుండా వినసొంపుగానూ ఉండి శ్రోతల్ని మెప్పిస్తోంది.కార్వార్, గోవాలోని అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ, జలపాతాలు, పచ్చని తీరప్రాంతాల్లోని విజువల్స్ను చూపిస్తూ కట్టి పడేశారు. ఈ పాటలో ప్రాచి తెహ్లాన్ ఎంతో అందంగా కనిపించారు. నిఖిల్ లుక్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్తో పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్ తీసుకు వచ్చినట్టు అయింది.‘తేనెల వానలా’ పాటను జీ మ్యూజిక్ నిర్మించింది. ఆ సంస్థ యూట్యూబ్ ఛానెల్లోనే ఈ పాట ప్రసారం అవుతోంది. వీహ అద్భుతమైన గానం, హృదయాన్ని హత్తుకునేలా చరణ్ అర్జున్ ఇచ్చి బాణీ, సాహిత్యం ఈ పాటను అందరికీ మరింత చేరువ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. -
బ్లూ, ఎల్లో కలిస్తే గ్రీన్ ఒస్తాది.. సాంగ్ విన్నారా?
టాలీవుడ్ నటుడు, నందు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ (Psych Siddhartha Movie). పేరుకు తగ్గట్లే సినిమాలో బూతులకు కొదవే లేదు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యామిని భాస్కర్ హీరోయిన్. ఇటీవల రిలీజైన టీజర్ మొత్తం బూతులతోనే నిండిపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. బ్లూ ఎల్లో కలిపితే రెడ్ అవుతాది అంటూ సాగే ఈ పాట వెరైటీగా ఆకట్టుకుంటోంది.వదిలేసి వెళ్లిపోయిందిసిగరెట్స్ లంగ్స్కు అస్సలు మంచిది కాదు.. అయినా అందరూ ఇంటర్వెల్లో కాలుస్తారు. ఆల్కహాల్.. లివర్కు అస్సలు మంచిది కాదు. అయినా అందరూ బేబీ సినిమా చూసొచ్చి తాగుతారు. అట్లనే లవ్.. హార్ట్కు అస్సలు మంచిది కాదు. అయితే మీరందరు లవ్ చేసిర్రని తెలుసు.. నేను కూడా అట్లనే చేశిన.. కానీ, ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయిందిరా అంటూ ఏడుపందుకున్నాడు నందు. ఆ తర్వాత అసలు పాట మొదలైంది.కలర్స్ సాంగ్'బ్లూ, ఎల్లో కలిసినాయంటే గ్రీన్ ఒస్తాది.. రెడ్, ఎల్లో కలిసినాయంటే ఆరెంజ్ ఒస్తాది.. బ్లాక్.. నలుపాయే జిందగీ నువ్వెళ్లిపోతే చెలి' అంటూ పాట సాగింది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ పాటను జెస్సీ గిఫ్ట్ ఆలపించాడు. పాట వెరైటీగా భలే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: దండం పెడ్తా.. పంపించు బిగ్బాస్: అడుక్కున్న సోహైల్ -
శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా.. మెలోడీ సాంగ్ రిలీజ్
నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్.. బాలనటుడిగా కాస్త పరిచయమే. 'రుద్రమదేవి' మూవీలో అలా నటించాడు. కాస్త పెద్దోడు అయిన తర్వాత 'నిర్మల కాన్వెంట్' చిత్రంతో హీరో అయ్యాడు. 2021లో 'పెళ్లి సందD' అనే సినిమా చేశాడు. దీనితోనే శ్రీలీల.. హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయమైంది. ఈ మూవీ తర్వాత శ్రీలీల వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ అయిపోయింది. రోషన్ మాత్రం మరో మూవీ చేయలేకపోయాడు. ఇన్నాళ్లకు ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అదే 'ఛాంపియన్'.(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాత ఎమోషనల్)డిసెంబరు 25న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకుడు కాగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్. ఈమెకు ఇదే తొలి తెలుగు మూవీ. విడుదలకు మరో నెల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలి పాటని రిలీజ్ చేశారు. 'గిర గిర గింగిరిగిరే' అంటూ సాగే రామ్ మిర్యాల పాడిన ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా) -
శ్రీలీల- శివకార్తికేయన్ పరాశక్తి.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ భారీఎత్తున నిర్మించారు. పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దివంగత నటుడు శివాజీగణేశన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం పేరు పరాశక్తి. అదే పేరుతో మళ్లీ ఇన్నాళ్లకు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రత్నమాల అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
పెళ్లిలో జగనన్న పాట.. వద్దన్న పోలీసులపై ప్రజల ఆగ్రహం
అనంతపురం జిల్లా: పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట రావడంతో కూడేరు పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని ఊరేగింపును అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పాటను పెట్టరాదంటూ హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులపై స్థానికులు తిరగబడ్డారు. ఈ ఘటన కూడేరు మండలం కలగళ్లలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు... కలగళ్లలో వడ్డే శ్రీకాంత్, రూప వివాహం ఆదివారం జరిగింది. అదే రోజు రాత్రి ఊరేగింపులో కుటుంబసభ్యులు డీజే ఏర్పాటు చేసి బంధు మిత్రులతో కలసి సరదాగా డ్యాన్స్ చూస్తూ సందడి చేయసాగారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రూపొందించిన పాట ప్లే కావడంతో పిల్లలు, యువత రెట్టింపు ఉత్సాహంతో ఈలలు వేస్తూ స్టెప్పులు వేశారు.ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు. అయితే వైఎస్ జగన్ పాటలు పెట్టరాదని పోలీసులు చెప్పడంతో పోలీసుల తీరుపై పెళ్లి వారితో పాటు పలువురు గ్రామస్తులు మండిపడ్డారు. ఇదే గ్రామంలో టీడీపీ వారు పెళ్లి ఊరేగింపులో డీజే పెట్టి టీడీపీ పాటలు పెట్టి సంబరాలు జరుపుకున్నారని, ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రజలు తిరగబడడంతో పోలీసులు మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రభాస్ 'ది రాజా సాబ్'.. రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas)- మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెబల్సాబ్ పేరుతో ఈ ఫుల్ సాంగ్ను(The Raja Saab First Single) విడుదల చేశారు. ఈ పాట రెబల్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఊపేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. -
బాలయ్య అఖండ-2.. జాజికాయ వచ్చేసింది!
బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మారో చిత్రం అఖండ-2(Akhanda 2). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ది తాండవం పేరుతో ఓ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు.తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. జాజికాయ.. జాజికాయ అంటూ సాగే పాటను విడుదల చేశారు. వైజాగ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ పాటను లాంఛ్ చేశారు. ఈ సాంగ్కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. బ్రిజేశ్ శాండిల్య, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు తమన్ సంగీతమందించారు.ఇటీవలే ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!
రామ్చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. #ChikiriChikiri hits 80M+ VIEWS on YouTube ❤🔥Everyone is grooving to the Chikiri Vibe 💥🕺💃🔗 https://t.co/Fd9ALDmIcs#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/TZwUAdY8is— Vriddhi Cinemas (@vriddhicinemas) November 16, 2025 -
చంద్రబోస్ రిలీజ్ చేసిన 'వసుదేవసుతం' మెలోడీ సాంగ్
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమా 'వసుదేవసుతం'. వైకుంఠ్ బోను దర్శకుడు కాగా ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యాయి. రీసెంట్గా ఈ మూవీ నుంచి ఓ మెలోడీ పాటని ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.మణిశర్మ సంగీతమందించిన 'ఏమైపోతుందో' అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. పవన్, శృతిక పాడారు. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ అందంగా చూపించారు. పాట రిలీజ్ చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ.. 'వసుదేవసుతం'లోని 'ఏమైపోతుందో' పాట చాలా బాగుంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. రిలీజ్ డేట్కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది. -
'అఖండ 2' నుంచి తాండవం పాట రిలీజ్
బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తీస్తున్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2'. డిసెంబరు 5న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'ద తాండవం' అంటూ సాగే టైటిల్ గీతాన్ని రిలీజ్ చేశారు. తొలి పార్ట్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 2021లో విడుదల చేశారు. ఈసారి పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో విడుదల చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ: నటుడు చిన్నా)ఇందులో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ ఎప్పటిలానే చెవులు దద్దరిల్లే సంగీతమందించాడు. విజువల్స్ చూస్తుంటే బోయపాటి మార్క్ స్పష్టం కనిపిస్తుంది. డిసెంబరు 5న ఇది తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరి ఈసారి అఖండ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: పాస్పోర్ట్ లేకుండా కంగారుపడి వచ్చేయకండి: మహేశ్) -
కనకం కన్నే కొడితే...
మెట్రో శిరీష్, శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ సినిమా ‘నాన్ వయొలెన్స్’. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో ఏకే పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి తమిళ ‘కనగ’ పాట లిరికల్ వీడియోతో పాటు తెలుగు వెర్షన్ ‘కనకం’ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘కనకం కన్నే కొడితే కసా పిసా అయిపోతారు... అందమే ఆరబోస్తే కొంప గూడు వదిలేస్తారు...’ అనే లిరిక్స్తో ‘కనకం’ పాట సాగుతుంది. ఈ పాటకు భాష్యశ్రీ సాహిత్యం అందించగా, తేజస్వినితో కలిసి ఈ చిత్రసంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పాడారు. ఈ పాటలో ‘మెట్రో’ శిరీష్, శ్రియ శరణ్ల ఎనర్జిటిక్ మూవ్స్ కనిపిస్తాయి. బాబీ సింహా, యోగిబాబు, అదితి బాలన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
శర్వానంద్ బైకర్.. రిలీజ్కు ముందే ఫుల్ వీడియో సాంగ్
చాలా రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బైకర్ మూవీ ఫస్ట్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రెట్టి బేబీ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు.కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను జిబ్రాన్, యాజిన్ నైజర్, సుభ్లాషిణి ఆలపించారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ శర్వా ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
విజయ్ కచేరి సాంగ్.. ఫేక్ వ్యూస్పై స్పందించిన యూట్యూబ్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ'జన నాయగణ్'. పొలిటిక్స్లో అడుగుపెట్టిన తర్వాత విజయ్ కెరీర్లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'దళపతి కచేరీ' అంటూ సాగే ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేశారు.అయితే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. యూట్యూబ్లో ఏకంగా 44 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో ఇవన్నీ ఫేక్ వ్యూస్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బాట్స్ ద్వారా ఈ వ్యూస్ వచ్చాయని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రిలీజైన గంటలోనే ఏకంగా 3 మిలియన్స్ వ్యూస్ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు వ్యూస్ పెంచుకునేందుకు బాట్స్ ఉపయోగపడ్డాయా అంటూ ట్రోల్ చేశారు.కచేరీ సాంగ్పై వస్తున్న ఆరోపణలపై యూట్యూబ్ కూడా స్పందించింది. ఇలాంటి వాటిని గుర్తించడానికి(లైక్లు, వ్యూస్) తమ వద్ద ప్రత్యేక వ్యవస్థ ఉందని యూట్యూబ్ తెలిపింది. అవీ ఒరిజినల్ లేదా ఫేక్ అని ధృవీకరించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ కూడా ఉందని పేర్కొంది. కాగా.. దళపతి కచేరి' పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించగా.. అనిరుధ్, అరివు, విజయ్ ఆలపించారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. To maintain a fair & positive experience across YouTube, we have systems that verify if views are valid & should be counted! more on that here: https://t.co/7ia2e2f2VE— TeamYouTube (@TeamYouTube) November 12, 2025 -
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
రామ్చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్లింది. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.తాజాగా ఈ పాట గురించి లిరిసిస్ట్ బాలాజీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. చికిరి.. చికిరి అనే పాట ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలోని వెనకబడిన జాతి నుంచి వచ్చిన యువకుడికి.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఏమనిపించింది అనేదే కాన్సెప్ట్తో పుట్టుకొచ్చిందే ఈ పాట.చికిరి అంటే ప్రత్యేకంగా అర్థమేమి లేదన్నారు. ఆ అబ్బాయిని.. అమ్మాయిని పొగుడుతూ తన కోరికను ఇలా చికిరి పాట రూపంలో చెప్తాడని బాలాజీ తెలిపారు. ఈ సాంగ్ కోసం దాదాపు ఎనిమిది నెలలు ప్రయాణం చేశానన్నారు.ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'అన్నకు మేమే ఫ్యాన్స్.. ఇప్పుడేస్తాం డ్యాన్స్'.. మాస్ సాంగ్ రిలీజ్
మాస్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ మాస్ సాంగ్ రామ్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు దినేశ్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. వివేక్ అండ్ మెర్విన్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్
ఇన్నిరోజులు అసలు సినిమా తీస్తున్న విషయమే బయటకు రానీయకుండా జాగ్రత్తపడిన రాజమౌళి.. ఇప్పుడు మాత్రం అన్ని సడన్ సర్ప్రైజులు ఇస్తున్నాడు. ఈనెల 15న హైదరాబాద్లో మహేశ్ బాబు 'SSMB29' మూవీకి సంబంధించి భారీ ఈవెంట్ జరగనుంది. దీన్ని హాట్స్టార్లో ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మహేశ్, ప్రియాంక చోప్రా వీడియో బైస్ట్ ఇప్పటికే రిలీజ్ చేశారు.అలానే కొన్నిరోజుల క్రితం ఇదే సినిమాలో విలన్గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కుంభ పాత్రలో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వీల్ ఛైర్లో ఉన్న పృథ్వీరాజ్ లుక్పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా 'గ్లోబ్ ట్రాటర్' అనే పాటని రిలీజ్ చేశారు. హీరోయిన్ శ్రుతి హాసన్ దీన్ని పాడటం విశేషం.'సంచారి.. సంచారి' అని సాగే లిరిక్స్.. హీరో గురించి చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. ఈ పాటని సినిమా కోసమే స్వరపరిచారా లేదంటే ఈ వారం జరగబోయే ఈవెంట్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. శ్రుతి హాసన్ పాడింది అంటే కచ్చితంగా మూవీలో ఉంటుందనే అనుకోవచ్చేమో? View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. దీంతో తన చివరిదైన 'జన నాయగణ్' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన తొలి పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'తళపతి కచేరీ' అంటూ సాగే మూవీలోని తొలి పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)అనిరుధ్ ఎప్పటిలానే మరో మాస్ బీట్తో అలరించాడు. దానికి విజయ్, జనాలతో కలిసి వేసిన సింపుల్ స్టెప్పులు.. ఆయన అభిమానులకు కనువిందు చేసేలా ఉన్నాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. (ఇదీ చదవండి: Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
శ్రీలీల క్రేజీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) , శ్రీలీల(Sreeleela) హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సింగారాల సీతాకోకవే అంటూ రొమాంటిక్ లవ్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా.. ఎల్వీ రేవంత్, ఢీ, సీ రోల్డాన్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ మ్యూజికల్ లవర్స్ను తెగ అలరిస్తోంది. ఇందులో రవిమోహన్, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. -
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. ఎమోషనల్ సాంగ్ ఫుల్ వీడియో!
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే 'డ్యూడ్' మూవీతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. బాగుండు పో.. అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ ఎమోషనల్ లవ్ సాంగ్కు రాజజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజీత్ హెగ్డే, సాయి అభ్యంకర్ ఆలపించారు. ఈ పాటను సాయి అభ్యంకర్ కంపోజ్ చేశారు. కాగా.. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. -
సింగారాల సీతాకోక.. సాంగ్ ప్రోమో రిలీజ్
శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ భారీఎత్తున నిర్మించారు. ఇది పీరియాడికల్ సినిమా కావడంతో పరాశక్తిపై ప్రారంభం నుంచే ఆసక్తి నెలకొంది. సినిమా టైటిల్ కూడా ఇందుకు ఒక కారణం. దివంగత నటుడు శివాజీగణేశన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం పేరు పరాశక్తి. అదే పేరుతో మళ్లీ ఇన్నాళ్లకు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2026 జనవరిలో సంక్రాంతి సందర్బంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. మంగళవారం నాడు ఈ సినిమా నుంచి సింగారాల సీతాకోక.. పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్, శ్రీలీల స్టెప్పులేశారు. ఫుల్ సాంగ్ నేడు (నవంబర్ 6న) విడుదల కానుంది. -
రష్మిక ది గర్ల్ఫ్రెండ్ మూవీ.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అభిమానులు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు. నీదే కథ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సాంగ్ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఈ పాట రష్మిక ఫ్యాన్స్ను తెగ అలరిస్తోంది. కాగా.. ది గర్ల్ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. -
హీరో మంచు మనోజ్ సతీమణి ఎమోషనల్.. ఆ ఒక్క పాటతో కన్నీళ్లు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. ఇటీవలే విడుదలైన మిరాయ్తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తేజ సజ్జా కీలక పాత్రలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది.అయితే హీరో మంచు మనోజ్ తాజాగా ఓ మూవీ ఈవెంట్కు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా సాంగ్ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మంచు మనోజ్ అన్నారు. అంతేకాకుడా మౌనికతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు. రాజ్యాలేమీ లేకపోయినా.. రాణిలా చూసుకుంటానని మాటిచ్చానని తెలిపారు.అయితే ఈవెంట్కు హాజరైన మిట్టపల్లి సురేందర్ ఓ సాంగ్ను ఆలపించారు. 'రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా' అంటూ మంచు మనోజ్, మౌనికలను ఉద్దేశించి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలోని పాట పాడారు. భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు. ఈ పాట విన్న భూమా మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వేదికపైనే కన్నీళ్లు ఆపులేకపోయింది. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Celebrities Tollywood (@celebrities_tollywood_) -
హైదరాబాద్కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం.. నెటిజన్స్ ఫిదా!
టాలీవుడ్ సినిమాకు ఉన్న క్రేజే వేరు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ వరల్డ్ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే రాజమౌళి బాహుహలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడు. ఆస్కార్ వేదికపై తెలుగోడి సత్తా చాటాడు. అందుకే మన తెలుగు సినిమాలంటే ఫారినర్స్ కూడా పడి చచ్చిపోతారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే పుష్ప మేనరిజంతో అలరిస్తాడు. తెలుగు సినిమాపై ఉన్న ఇష్టంతో నితిన్ రాబిన్హుడ్ మూవీలో కెమియో పాత్రలో సందడి చేశాడు.అంతలా తెలుగు సినిమాలకు ఫారినర్స్ ఫిదా అవుతున్నారు. డేవిడ్ వార్నర్ లాగే ఎప్పటి నుంచో స్వీడన్కు చెందిన కర్ల్ స్వాన్బెర్గ్ దంపతులు మన చిత్రాలకు డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. కొత్త సినిమాలో ఏ హిట్ సాంగ్ వచ్చినా వీరిద్దరు కలిసి రీల్ చేయాల్సిందే. అలా ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టు సాంగ్ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అంతేకాకుండా పలు సూపర్ హిట్ సాంగ్స్కు తమదైన స్టెప్పులతో అదరగొట్టేశారు.తాజాగా మరో టాలీవుడ్ సాంగ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా అంటూ సాగే పాటతో అలరించారు. రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం మూవీలో ఈ సాంగ్కు డ్యాన్స్ చేశారు. ఇటీవల రిలీజైన కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్ స్టైల్లో అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. కర్ల్ స్వాన్బెర్గ్ తన భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ తెలుగు ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్స్.. మీరిద్దరు హైదరాబాద్కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మా ఇండియన్స్ కంటే మీ వీడియోలే బాగుంటాయని మరికొందరు కొనియాడుతున్నారు. మీ ఇద్దరికి ఆధార్, పాన్ కార్డ్స్ ఇప్పించే బాధ్యత నాది అంటూ మరో నెటిజన్స్ భరోసానిస్తూ కామెంట్ చేశాడు. ఏది ఏమైనా మన తెలుగు సినిమాకు విదేశీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
రామ్-భాగ్యశ్రీ నుంచి మరో మెలోడీ సాంగ్
రామ్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'ఆంధ్రా కింగ్ తాలుకా'. నవంబర్ 28న మూవీ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రెండు పాటలు రాగా అవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హీరోహీరోయిన్ల మధ్యలో తీసిన మరో మెలోడీ గీతాన్ని తాజాగా రిలీజ్ చేశారు. 'చిన్ని గుండెలోనా..' అంటూ సాగే ఈ గీతం వినసొంపుగా ఉంటూ శ్రోతల్ని అలరిస్తోంది.(ఇదీ చదవండి: కాంట్రాక్టర్ పేరు రాజమౌళి.. 'బాహుబలి'పై ప్రశాంత్ నీల్ రివ్యూ)గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ రామ్కి హిట్స్ దక్కట్లేదు. ఈ క్రమంలోనే 'ఆంధ్రా కింగ్ తాలుకా'పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఓ ఫ్యాన్ బయోపిక్ అనే ట్యాగ్ లైన్తో మూవీ తీస్తున్నారు. సినిమా హీరోలు, వాళ్ల ఫ్యాన్స్ మధ్య ఉండే ఎమోషన్స్ తదితర అంశాల్ని చూపిస్తూనే మరోవైపు ప్రేమకథని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లితో ఒక్కటైన తెలుగు సీరియల్ యాక్టర్స్) -
దుల్కర్ సల్మాన్ కాంత.. మరో సాంగ్ వచ్చేసింది
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సో జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత. ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో సాంగ్ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన సాంగ్ దుల్కర్ సల్మాన్ అభిమానులను అలరిస్తోంది. ఇంగ్లిష్ లిరిక్స్తోపాటు తమిళం, తెలుగు ర్యాప్తో కూడిన ఈ సాంగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటను సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. ఈ సాంగ్కు జాను చంతర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. -
రష్మిక ది గర్ల్ఫ్రెండ్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతుంది.ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. కురిసే వాన తడిపేయాలన్ని భూమే ఏదో.. అంటూ సాగే మూడో లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్కు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా.. ఈ రొమాంటిక్ లిరికల్ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. కాగా.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. -
టాలీవుడ్ స్పై డ్రామాగా 'చైనా పీస్'.. జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న స్పై డ్రామా చైనా పీస్. ఈ మూవీని అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హర్షిత, శ్రీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా జేమ్స్ బాండ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు దినేష్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. స్పూర్తి జితేందర్, హారిక నారాయణ్ ఆలపించారు. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతమందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. -
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. సింగారి ఫుల్ వీడియో వచ్చేసింది
డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటేస్ట్ మూవీ డ్యూడ్. ఈ దీపావళికి థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో డ్రాగన్ హీరో హ్యాట్రిక్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. సింగారి అనే సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 17న రిలీజైన ఈ చిత్రంలో శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. #Singari video song from #Dude out now 🤩🤩Tamil ▶️ https://t.co/W6GmIS2HeDTelugu▶️https://t.co/pU5RQH4swgVibe to this beautiful composition ❤️A @SaiAbhyankkar musical 🎼⭐ing 'The Sensational' @pradeeponelife🎬 Written and directed by @Keerthiswaran_Produced by… pic.twitter.com/hf6XMeMwE3— Mythri Movie Makers (@MythriOfficial) October 29, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. క్రేజీ సాంగ్ ఫుల్ వీడియో
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన తాజా చిత్రం కె-ర్యాంప్. దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. జైన్స్ నాని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీని రాజేశ్ దండ, శివ బొమ్మ సంయుక్తంగా నిర్మించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఓనమ్ అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కిరణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను అలరించింది. ఇంకెందుకు ఆలస్యం ఓనమ్ ఫుల్ సాంగ్ను చూసి ఎంజాయ్ చేయండి. -
'సంతాన ప్రాప్తిరస్తు' నుంచి 'తెలుసా నీ కోసమే' సాంగ్ లాంచ్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. నవంబర్ 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం సినిమాలోని ఓ పాట లాంచ్ చేశారు. తెలుసా నీ కోసమే అంటూ సాగే లిరికల్ గీతాన్ని అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు రిలీజ్ చేశారు. 'ఆయ్', 'సేవ్ ది టైగర్స్' లాంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ.. ఈ గీతాన్ని కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునే పాడారు. -
మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది పొంగల్కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్గారు మూవీతో బ్లాక్బస్టర్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ (Mana Shankaravaraprasad Garu Movie)లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.36 మిలియన్ల వ్యూస్(Meesaala Pilla Song) యూట్యూబ్లో టాప్లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది. ఈ సాంగ్లో చిరు వేసే స్టెప్పులు సింపుల్గా కనిపిస్తూనే చాలా స్టైలిష్గా ఉంటాయి. లిరికల్ సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఇక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!సినిమాభీమ్స్ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశాడు. పోలకి మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. The unanimous chartbuster continues to be the audience’s favourite song of the season ❤️🔥#MeesaalaPilla Trending #1 on YouTube for 13 days with 36MILLION + views 🔥🔥🔥-- https://t.co/4dgILT40kG #ManaShankaraVaraPrasadGaru Sankranthi 2026 RELEASE Megastar @KChiruTweets… pic.twitter.com/8sbxhs7BrY— Shine Screens (@Shine_Screens) October 27, 2025 చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
యాంకర్ సుమ తనయుడు రోషన్ (Roshan Kanakala) హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'మోగ్లీ' (Mowgli). ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ప్రస్తుతం సందీప్ రాజ్తో జతకట్టారు. ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ నుంచి లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. సయ్యారే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాల భైరవ, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫారెస్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాగా.. మోగ్లీ డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
ట్రెండింగ్లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె ర్యాంప్ మూవీ (K Ramp Movie) హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రారంభంలో హీరో.. ఇదేమిటమ్మా మాయా మాయా.. అంటూ రాజశేఖర్ సాంగ్ను రీక్రియేట్ చేశాడు. మాస్ స్టెప్పులతో ప్రారంభంలోనే కావాల్సినంత ఊపు తెప్పించాడు. సినిమాకు మంచి ఎనర్జీనిచ్చిన ఈ సాంగ్ వీడియోను గురువారం నాడు యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఒరిజినల్ సాంగ్ రిలీజ్దీంతో అది టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇదేమిటమ్మా మాయా... ఒరిజినల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఆయుధం సినిమాలోనిది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా చిన్ని చరణ్ లిరిక్స్ రాశారు. కుమార్ సాను, నిష్మా ఆలపించారు. ఈ సాంగ్లో రాజశేఖర్, గుర్లీన్ చోప్రా (Gurleen Chopra) జంటగా స్టెప్పులేశారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించారు. రాజశేఖర్తో స్టెప్పేసిన బ్యూటీ ఎవరు?చండీగఢ్కు చెందిన గుర్లీన్ చోప్రా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఒక పెళ్లాం ముద్దు- రెండో పెళ్లాం వద్దు, నేను సైతం, ఖాకీ, పాండవులు పాండవులు తుమ్మెద, శివ కేశవ్ చిత్రాలు చేసింది. హిందీ, కన్నడ, తమిళ, పంజాబి, మరాఠి భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2020 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంది. నటుడు డేవిందర్ రాంధ్వాను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కౌన్సెలింగ్ విత్ జీసీ పేరిట ఓ వెబ్సైట్ నడిపిస్తోంది. ఇందులో ఆమె పోషకాహార నిపుణురాలిగా సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by ACTRESS GURLEEN CHOPRA (@igurleenchopra)చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా? -
రవితేజ- శ్రీలీల 'సూపర్ డూపర్ హిట్టు సాంగ్'.. చూశారా?
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja), హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ధమాకా' మూవీ సూపర్ హిట్గా నిలిచింది. మూడేళ్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర (Mass Jathara Song). ధమాకాకు బ్లాక్బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు సాంగ్ వచ్చాయి. తూ మేరా లవ్వరు, ఓలే ఓలే.., హుడియో హుడియో.. సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా నాలుగో పాట రిలీజ్ చేశారు.సూపర్ డూపర్ హిట్టు సాంగ్అదే సూపర్ డూపర్ హిట్టు సాంగ్! ఈ పాటకు రిథమ్ లేదు.. కదం లేదు, పదం లేదు.. అర్థం లేదు.. పర్థం లేదు అంటూ సాగే ఈ పాట సూపర్ హిట్టని లిరిక్స్లోనే చెప్తున్నారు. రోహిణి, భీమ్స్ సిసిరోలియో ఆలపించిన ఈ పాట సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ జాతర విషయానికి వస్తే.. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చదవండి: నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది? -
కరుప్పు నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్
స్టార్ హీరో సూర్య (Suriya) నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాష్బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. గాడ్ మోడ్..త్వరలోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపావళి పండగ సందర్భంగా సాంగ్ గాడ్ మోడ్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేశారు. నల్లని దుస్తులు, చేతిలో కత్తితో సూర్య నటించిన ఊరమాస్ ట్యూన్స్తో రూపొందిన ఈ పాట ఇప్పుడు అబిమానులను విపరీతంగా అలరిస్తోంది. సినిమాపై అంచనాలను సైతం పెంచేస్తోంది. ఇకపోతే సూర్య ఈ చిత్రంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంనూలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
మీసాల పిల్ల సాంగ్ క్రేజ్.. యూట్యూబ్లో సరికొత్త రికార్డ్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టిన అనిల్ మరో బ్లాక్ బస్టర్ కోసం రెడీ అయిపోయాడు.ఇటీవలే ఈ మూవీ నుంచి మీసాల పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్లో నంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ పాట 30 మిలియన్ల వ్యూస్, 30 వేల రీల్స్, 300 మిలియన్ల రీల్స్ వ్యూస్తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా అన్ని మ్యూజిక్ ఫ్లాట్ఫామ్స్లో 50 మిలియన్లకు పైగా ఈ పాటను ప్లే చేశారు.కాగా.. ఈ రొమాంటిక్ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. There’s no stopping the MEGA GRACE of #ManaShankaraVaraPrasadGaru 🔥🔥🔥#MeesaalaPilla is trending #1 on YouTube with 30M+ Views, 30K+ Reels on insta, 300M+ Reel Views and 50M+ Plays across all music platforms 💥💥💥AN UNANIMOUS MUSICAL SENSATION IN INDIA ❤️🔥❤️🔥❤️🔥--… pic.twitter.com/6rqiuAUop5— Shine Screens (@Shine_Screens) October 21, 2025 -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ రోజెస్ అనే ఫుల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
రివాల్వర్ రీటా.. హ్యాపీ బర్త్డే సాంగ్ రిలీజ్
మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్ (Keerthy Suresh)కు 2024 పెద్దగా కలిసి రాలేదు. వృత్తిపరంగా వరుస అపజయాలను చవి చూసిన ఆమె వ్యక్తిగతంగా మాత్రం మధురమైన ఘట్టానికి చేరుకున్నారు. తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లి చేరుకున్నారు. అయితే సినిమాలకు మాత్రం కాస్త దూరం అయ్యారనే చెప్పాలి. ఈమె నటించిన రఘు తాత, హిందీ చిత్రం మేరీజాన్ చిత్రాలు నిరాశపరిచాయి. ఉప్పు కప్పరంబు అనే వెబ్సీరీస్లో నటించినా, అది ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా రీచ్ కాలేదు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే డబ్బు సంపాదించారు.సినిమాఇప్పుడు కీర్తి సురేశ్ మళ్లీ బిజీ అయ్యారు. ఇప్పటికే తెలుగులో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకుముందు నటించిన రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వాటిలో ఒకటి రివాల్వర్ రీటా (Revolver Rita Movie). ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి చంద్రు దర్శకుడు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు నిర్వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం (అక్టోబర్ 17) కీర్తిసురేష్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రివాల్వర్ రీటా చిత్ర యూనిట్ ఒక సాంగ్ విడుదల చేసింది. -
విక్రమ్ తనయుడి బైసన్.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తోన్న తాజా చిత్రం బైసన్(Bison Kaalamaadan). ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఈ రోజు రిలీజ్ అయింది. వచ్చేవారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే బైసన్ మూవీ నుంచి ఓ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మంచి మనసు అంటూ సాగే పాటను విడుదల చేశారు. మారి సెల్వరాజ్ రాసిన ఈ సాంగ్ను తెలుగులోకి యనమండ్ర రామకృష్ణ ట్రాన్స్లేట్ చేశారు. ఈ పాటను మనువర్ధన్, గాయత్రీ సురేశ్ ఆలపించారు. -
పల్సర్ బైక్ సాంగ్కు ఎన్ని లక్షలు వచ్చాయంటే?
సినిమా పాటల్ని సైతం వెనక్కు నెడుతూ జానపద పాటలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. రాను బొంబాయికి రాను, సొమ్మసిల్లిపోతున్నవే.., ఆడనెమలి.., సీమదసర సిన్నోడు.. ఇలా ఎన్నో పాటలు యూట్యూబ్లో మోత మోగిస్తున్నాయి. పల్సర్ బైక్ (Pulsar Bike Song) కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ పాట రిలీజైన కొత్తలో.. ఏ ఫంక్షన్లో చూసినా ఈ సాంగే మోగేది. 2018లో ఇండస్ట్రీకి..ఇక ఈ ఒక్క పాటతోనే ఫుల్ సెన్సేషన్ అయ్యాడు సింగర్ రమణ (Singer Ramana). ఈ సాంగ్ను రవితేజ ధమాకా సినిమాలో పెట్టడంతో మరింత పాపులారిటీ వచ్చింది. తాజాగా ఈ పాట గురించి రమణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 'నేను 2018లో ఈ ఇండస్ట్రీకి వచ్చాను. 2022లో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. జీవితంలో ఊహించనంత పాపులారిటీ వచ్చింది. ఆ రోజుల్లో ఒక ఆడియో సాంగ్ చేయాలంటే రూ.15-20 వేలల్లో అయిపోయేది.పల్సర్ బైక్కు ఎంతొచ్చిందంటే?కానీ, ఆ రూ.20 వేలు కూడబెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఈవెంట్కు వెళ్తే రూ.2-3 వేలు మిగిలేవంతే! ఎక్కువ డబ్బు వచ్చేది కాదు. పల్సర్ బైక్ ఆడియో సాంగ్ రూ.5-10 వేలల్లో అయిపోయింది. వీడియో సాంగ్ కూడా కలుపుకుంటే రూ.5 లక్షల దాకా ఖర్చు వచ్చింది. కానీ ఈ పాట మేము ఊహించని స్థాయిలో రూ.40-50 లక్షల డబ్బు తెచ్చిపెట్టింది' అని రమణ చెప్పుకొచ్చాడు.చదవండి: అప్పుడు గాజులమ్ముకున్నా.. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా -
మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. రొమాంటిక్ ఫుల్ సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళ్తున్నారు.ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. -
కాంతార చాప్టర్ 1.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!
రిషబ్ శెట్టి (Rishab Shetty) డైరెక్షన్లో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాకు ప్రీక్వెల్గా భారీ బడ్జెట్తో కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచే అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే కాంతార మూవీ రికార్డ్ను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ చిత్రం నుంచి బ్రహ్మ కలశ అనే ఫుల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాట థియేటర్లలో కాంతార ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అబ్బి ఆలపించారు. వరాహరూపం థీమ్తో వచ్చిన ఈ సాంగ్ థియేటర్లలో అభిమానులను అలరించింది. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్నాథ్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. A symphony of faith, a celebration of devotion 🔱🔥#Brahmakalasha Video Song from #KantaraChapter1 out now 🎵▶️ https://t.co/wzi1h7ek5l#BlockbusterKantara in cinemas now!#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere #Kantara @hombalefilms @KantaraFilm… pic.twitter.com/VKVnnqXmrq— Hombale Films (@hombalefilms) October 8, 2025 -
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
అప్పటికప్పుడే తీసుకున్న నిర్ణయమది: రష్మిక పోస్ట్ వైరల్
టాలీవుడ్లో ప్రస్తుతం ఆ ఇద్దరి పేర్లే తెగ వైరలవుతున్నాయి. ఆ జంట మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. వీరిద్దరిపై ఎప్పటి నుంచో డేటింగ్ రూమర్స్ వస్తున్నప్పటికీ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నిశ్చితార్థం విషయంలోనూ అదే జరిగింది. ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.ఇక ఈ సంగతి పక్కన పెడితే రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి థామా.. మరొకటి ది గర్ల్ఫ్రెండ్. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. లేటేస్ట్గా రిలీజైన థామా సాంగ్ గురించి రష్మిక పోస్ట్ పెట్టారు. ఆ సాంగ్ రూపొందించడం వెనక ఉన్న స్టోరీని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఇదంతా దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తోన్న థామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో రష్మిక తన అందంతో డ్యాన్స్తో అభిమానులను అలరించింది. తాజాగా ఈ పాట వెనక ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.రష్మిక తన పోస్ట్లో రాస్తూ.. 'మేము ఓ అందమైన ప్రదేశంలో దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ చేశాం. అయితే షూట్ చివరి రోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ప్లేస్ ఇంత బాగుంది కదా మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదని అన్నారు. ఆ ఆలోచన మా అందరికీ నచ్చింది. ఆ లొకేషన్ అందంగా ఉండడంతో మూడు, నాలుగు రోజుల్లోనే పాటను పూర్తి చేశాం. మేము ప్లాన్ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. మీరంతా కూడా థియేటర్లో ఈ సాంగ్ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా' అంటూ సాంగ్ స్టిల్స్ను షేర్ చేశారు. కాగా.. ఈ హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముంజ్య ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్లో ఉన్న పిక్ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్కు పయనమయ్యారు. కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
ఏఆర్ రెహ్మాన్ను సైతం ఆకట్టుకున్న ఫాతిమా ఫ్యామిలీ
తిరువనంతపురంలోని ఆ ఇంట్లోకి అడుగు పెడితే సంగీత కళాశాలలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ కుటుంబ సంగీత కచేరి వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి ముచ్చటపడిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు.ఫాతిమా వయోలిన్ వాయిస్తుంది. ఆమె చెల్లి గిటార్ వాయిస్తుంది. ఆమె తండ్రి తబలా వాయిస్తూ గానం చేస్తాడు. వీరందరూ కలిసి రెహమాన్ ట్యూన్ చేసిన ‘గురు’ సినిమాలోని ‘తెరే బినా’పాటను అద్భుతంగా ఆలాపించారు. ‘హార్ట్’ ‘క్లాప్’ ఇమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. View this post on Instagram A post shared by Fathima Shadha (@fathimashadhav) కనుల, వీనుల విందు చేసే ఈ వీడియో చూస్తూ.... ‘ఆ ఇల్లు ఎంత అదృష్టం చేసుకుందో!’ అని స్పందించారు నెటిజనులు.కన్నుల.. వీనుల విందు -
డబుల్ సెలబ్రేషన్స్
ఇక్కడున్న ఫొటోలో మంచి జోష్తో ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు చిరంజీవి, వెంకటేశ్. ఇంతకీ ఈ జోష్కి కారణం ఏంటంటే... స్నేహితులను కలవడానికి వెళ్లారు. ప్రతి ఏడాది ‘క్లాస్ ఆఫ్ 80స్’ అంటూ 1980స్కి చెందిన నటీనటులందరూ కలిసి, సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కోసారి ఒక్కో థీమ్, ప్లేస్ ఉంటుంది. ఈసారి రీ యూనియన్కి చెన్నై వేదికైంది.ఇందు కోసమే చిరంజీవి, వెంకటేశ్ శనివారం హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం అయ్యారు. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్గారు’లో ఓ కీలకపాత్రలో వెంకటేశ్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, వెంకటేశ్లపై కీలక సన్నివేశాలను, ఓ సెలబ్రేషన్ సాంగ్ను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట.‘‘చిరంజీవి, వెంకటేశ్గార్లను కలిసి సెట్స్లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇటు రీ యూనియన్ సెలబ్రేషన్స్ అటు సెట్స్లో సెలబ్రేషన్ సాంగ్... ఇలా ఈ నెల చిరంజీవి, వెంకటేశ్కు డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. -
సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ.. భయపెట్టేలా సాంగ్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జటాధర. ఈ మూవీలో పాన్ ఇండియా మూవీలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో పాటను విడుదల చేశారు.జటాధర మూవీలోని ధన పిశాచి అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా..సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటకు సమీర్ కొప్పికర్ సంగీతమందించారు. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. సోనాక్షి సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. -
Pre Wedding Show: ఆకట్టుకుంటున్న‘వయ్యారి వయ్యారి’ సాంగ్
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఓ క్యాచీ లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు. సనారే సాహిత్యం అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా ఉంది. ఇక యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ గాత్రం ఈ పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. సురేష్ బొబ్బిలి బాణీ శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ‘వయ్యారి వయ్యారి’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.ఈ చిత్రానికి కెమెరామెన్గా కె. సోమ శేఖర్, ఎడిటర్గా నరేష్ అడుప, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ప్రజ్ఞయ్ కొణిగారి పని చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మేకర్లు.. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. -
ఓం నమః శివాయ.. జటాధర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
సుధీర్బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులు. సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్గురువారం ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధర’ను విడుదల చేశారు. ఈ ట్రాక్లో ‘ఓం నమః శివాయ’ అంటూ వినిపిస్తుంది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి పాడారు. ‘‘మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి–విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ‘జటాధర’ చిత్రం చూపించబోతోంది. పౌరాణిక ఇతివృత్తాలు, సూపర్ విజువల్స్తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీ మ్యూజిక్ కో. చదవండి: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్ -
వాషి యో వాషి.. పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓజీ (They Call Him OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేశాడు. రన్ రాజా రన్, సాహో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వం వహించాడు. డీవీవీ దానయ్య నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.సాంగ్ రిలీజ్సెప్టెంబర్ 21న ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దానికంటే ముందు ఓ సర్ప్రైజ్ వదిలారు. పవన్ పాడిన 'వాషియో వాషి' పాటను రిలీజ్ చేశారు. ఇది జపనీస్ భాషలో సాగుతుంది. అయితే ఇదంతా పవన్ ఏదో డైలాగులు చెప్తున్నట్లు ఉందే తప్ప అసలు పాటలానే లేదు.డబ్బులు దండుకునే పనిఇక ఓజీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను భారీగా పెంచారు. ప్రజల కోసం, ప్రజల కొరకు అంటూ డైలాగులు చెప్పే పవన్.. తన సినిమావంతు వచ్చేసరికి మాత్రం ప్రజల జేబులో డబ్బులు దండుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం గమనార్హం. కాగా ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్డే.. కీరవాణి స్పెషల్ సాంగ్
ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ సాంగ్ను రిలీజ్ చేశారు. పలు భాషల్లో రూపొందించిన ఈ పాటకు తెలుగులో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతమందించారు. మోదీ పుట్టిన రోజున విడుదలైన ప్రత్యేక గీతం అందరినీ ఆకట్టుకుంటోంది.నమో నమో ఆర్త బాంధవుడా.. అంటూ సాగే ఈ పాటను ఎం ఎం కీరవాణి, షగున్ సోధి, ఐరా ఉడిపి ఆలపించారు. మోదీ జీ @75 పేరుతో ఈ పాటను టీ సిరీస్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో మోదీ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను ప్రస్తావించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ స్పెషల్ సాంగ్ను చూసేయండి.On the 75th birthday of Shri Narendra Modi Ji, we celebrate his spirit of service and vision for New India with “Modi Ji@75”. 🙏🇮🇳https://t.co/CGQ4AJtH9l#HappyBirthdayModiji @narendramodi@mmkeeravaani #ShagunSodhi #AiraaUdupi #Nadaan #Tseries pic.twitter.com/XimgRvVpR1— T-Series (@TSeries) September 17, 2025 -
పవన్ కల్యాణ్ ఓజీ.. సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఓమీ అనే సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఓమీ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు.తాజాగా ఈ చిత్రం నుంచి గన్స్ అండ్ రోజెస్ అనే పాటను విడుదల చేశారు. అద్వితీయ, హర్ష రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. -
కాంతార ప్రీక్వెల్... రంగంలోకి నేషనల్ అవార్డ్ సింగర్!
కన్నడ ఇండస్ట్రీలో నుంచి బ్లాక్బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఆ చిత్రానికి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్ చేశారు.ఈ సాంగ్ను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంతార వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి, గాయకుడు దిల్జిత్ దోసాంజ్, హోంబలే ఫిల్మ్స్ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. Excited to join hands with @diljitdosanjh for the Kantara album 🙏✨By Shiva’s grace, everything fell into place. Much love, Paji ❤️🔥Another Shiva bhakt meets Kantara.#KantaraChapter1 #KantaraChapter1onOct2 pic.twitter.com/44ya4cyL8S— Rishab Shetty (@shetty_rishab) September 12, 2025 -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు. ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
రజినీకాంత్ కూలీ.. పూజా హెగ్డే మోనికా వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. పూజాహెగ్డే తన డ్యాన్స్తో మెప్పించిన మోనికా ఫుల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో సౌబిన్ షాహిర్ ఆడియన్స్ను మెప్పించారు.కాగా.. పాటను తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్స్ కూడా విడుదల చేశారు. గతంలో కుర్రకారును ఓ రేంజ్లో ఊపేసిన మోనికా ఫుల్ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. మరోవైపు ఈ సూపర్ హిట్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. Finally, Our Monica Bellucci erangi vandhachi 💃🏻 #Monica video song is out now! 💘Tamil ▶️ https://t.co/HqBfqY7AdbTelugu ▶️ https://t.co/tnMJvrUCZBHindi ▶️ https://t.co/SDtC7RjCdyKannada ▶️ https://t.co/BrwN1rAbV7Malayalam ▶️ https://t.co/viT48NIpOR@rajinikanth… pic.twitter.com/Qoy1Y3rhdc— Sun Pictures (@sunpictures) September 11, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించారు. -
సింగర్గా రామ్ పోతినేని.. ఆంధ్ర కింగ్ తాలూకా సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే.. రామ్కు జంటగా నటిస్తోంది. ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 28న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని పప్పీ షేమ్ అనే పాటను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ను రామ్నే ఆలపించడం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించహా.. వివేక్, మెర్విన్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. -
'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'లిటిల్ హార్ట్స్' హిట్ టాక్ తెచ్చుకుంది. పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే ఈ మూవీలో మిగతా పాటలేమో గానీ సెకండాఫ్లో వచ్చే 'కాత్యాయని' పాట అయితే వేరే లెవల్ ఉంటుంది. సంగీతంలో ఉండే రూల్స్ లాంటివి ఏం అందులో పాటించరు కానీ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అయిదే ఇది రీమేక్. దీనికి ఒరిజినల్ ఇప్పటికే ఉంది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)'కాత్యాయని' అంటూ సినిమాలో ఉన్న పాటకు ఎనిమిదేళ్ల క్రితం యూట్యూబ్లో రిలీజైన ఓ సాంగ్ మూలం. శరత్ గౌడ్ అనే కుర్రాడు 'కమాన్ బేబీ' పేరుతో ఓ గీతాన్ని పాడుతూ డ్యాన్స్ చేశాడు. అప్పట్లో పెద్ద వ్యూస్ రాలేదు కానీ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' రిలీజైన తర్వాత దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. పాటని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ సాంగ్ ఓసారి వినేయండి.'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని నాగరం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకుడు. టీనేజ్ లవ్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో పెద్ద కథేం ఉండదు. ఫన్నీ మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. అవే ఇప్పుడు ప్రేక్షకుల్ని ఫుల్గా నవ్విస్తున్నాయి. నాలుగు రోజుల్లో కలెక్షన్ కూడా చాలానే వచ్చాయి.(ఇదీ చదవండి: హిందీ వెబ్ సిరీస్లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్) -
మాస్ డ్యాన్స్?
మాస్ డ్యాన్స్ చేస్తారా? రొమాంటిక్ సాంగ్ పాడుకుంటారా? ఇంతకీ చిరంజీవి–నయనతార ఏ తరహా పాట చేయనున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఈ ఇద్దరూ పాల్గొనగా ఒక పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తోంది ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్. చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’.ఇటీవల ఆరంభమైన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, ఇతర ముఖ్య తారలు పాల్గొనగా టాకీ పార్ట్ షూట్ చేశారు. నేటి నుంచి చిరంజీవి, నయనతార పాల్గొనగా హైదరాబాద్లో ఒక పాట చిత్రీకరించనున్నట్లు యూనిట్ పేర్కొంది. ‘‘భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్ రూపొందించారు.చిరంజీవి–నయనతారపై చిత్రీకరించే పాటకు డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు’’ అని యూనిట్ తెలియజేసింది. అయితే... ఇది మాస్ నంబరా? రొమాంటిక్ సాంగా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
'నువ్వే చెప్పు చిరుగాలి' పాట లాంచ్ చేసిన మంచు మనోజ్
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ చెలియా'. రూపాశ్రీ కొపురు నిర్మించగా ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద 'ఓ చెలియా' నుంచి తొలి పాటని రిలీజ్ చేశారు.'నువ్వే చెప్పు చిరుగాలి' అని సాగే ఈ పాటని మంచు మనోజ్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేశారు. ఈ గీతాన్ని సాయి చరణ్ ఆలపించగా, ఎంఎం కుమార్ బాణీని అందించారు. సుధీర్ బగడి రాసిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటించబోతోన్నారు. -
మంగ్లీ నుంచి డిఫరెంట్ సాంగ్.. వినాయకుడి పాట
మంగ్లీ పేరు చెప్పగానే తెలంగాణ ఫోక్ సాంగ్ ఎక్కువగా గుర్తొస్తుంటాయి. పల్లె గీతాలతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాల్లోనూ అడపాదడపా కమర్షియల్ పాటలు పాడుతూనే ఉంది. అయితే మంగ్లీ అంటే ఒకేలాంటి పాటలు పాడుతుంది అనే అభిప్రాయం చాలామందికి ఉంది. అలాంటిది ఇప్పుడు ఓ డిఫరెంట్ సాంగ్తో వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని స్తూతిస్తూ ఈ పాట పాడింది.(ఇదీ చదవండి: 'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్) కర్ణాటిక్ మ్యూజిక్ కూడా గతంలోనే నేర్చుకున్న మంగ్లీ.. ఇప్పుడు వినాయకుడి గీతాన్ని ఆ జానర్లోనే పాడింది. 'శ్రీ గణపతిని' అంటూ సాగే ఈ గీతం రెండు రోజుల క్రితం తన యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేసింది. రెస్పాన్స్ కూడా బాగానే వస్తోంది. మీరు కూడా ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
టాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటిస్తోన్న తాజా యూత్ ఫుల్ లవ్ స్టోరీ బ్యూటీ. ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లేని ఆర్వీ సుబ్రహ్మణ్యం అందించగా.. జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్లపై విజయపాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ప్రెట్టీ ప్రెట్టీ అంటూ రొమాంటిక్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. ఈ తాజా లవ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు విజయ బుల్గానిన్ సంగీతమందించగా.. సనారే లిరిక్స్ రాశారు. ఈ రొమాంటిక్ సాంగ్ను పీవీఎన్ఎస్ రోహిత్ పాడారు. ఈ సినిమాను సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో నటించారు. -
దేవర సాంగ్.. ఆ క్రెడిట్ అంతా మీకేనా.. మాకు ఇవ్వరా?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న రిలీజై సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ విజయంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో.. అంతే రేంజ్లో ఆ సాంగ్ కూడా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఎక్కడా చూసిన ఆ పాటే వినిపించేది. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకుంది.'చుట్టమల్లే చుట్టేస్తావే' అంటూ వచ్చిన దేవర సాంగ్కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ రొమాంటిక్ సాంగ్ జూనియర్ ఫ్యాన్స్ను ఓ ఊపు ఊపేసింది. ఇందులో తారక్, జాన్వీ కపూర్ల కెమిస్ట్రీ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్ మెలోడీని మరో లెవెల్కు తీసుకెళ్లింది.తాజాగా ఇలాంటి పాటలకు వచ్చే క్రెడిట్ తమకు ఇవ్వడం లేదని దేవర సాంగ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్ల పేర్లను పూర్తిగా విస్మరించడం సరికాదంటున్నారు. సాంగ్ పూర్తయ్యాక కొరియోగ్రాఫర్లను మరిచిపోవడం సాధారణంగా మారిపోయిందన్నారు. ఇక్కడ నాకు క్రెడిట్ ఇవ్వలేదని కాదు.. నేను కాకుండా మరో బ్రాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ అయితే కచ్చితంగా వారి పేర్లు వేసేవాళ్లన్నారు. పాటలకు పనిచేసిన కొరియోగ్రాఫర్ల బ్రాండ్ను దెబ్బ తీయవద్దని మేకర్స్ను కోరారు.బోస్కో మాట్లాడుతూ.. 'పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్ను మరచిపోతారు. మా కష్టాన్ని ఇతరులకు క్రెడిట్ ఇస్తారు. కానీ ఇప్పుడు కూడా పాట విడుదలైనప్పుడు కొన్నిసార్లు కొరియోగ్రాఫర్ పేర్లను కూడా చూస్తున్నాం. కానీ కొందరు మాత్రం కొరియోగ్రాఫర్ పేరును ఎప్పుడూ ఉంచరు. వారు ఎల్లప్పుడూ ఆ మూవీ స్టార్ పేరునే ఉంచుతారు. ఒక స్టార్కు ఎంత గొప్పగా పేరు వస్తే.. కొరియోగ్రాఫర్కు కూడా అంతే గొప్పగా రావాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడికి ఎంత పేరు వస్తుందో.. సింగర్కు కూడా అంతే క్రెడిట్ దక్కాలి. నాకు రాకపోయినా.. నా తర్వాత వచ్చే కొత్తతరానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. దేవర సినిమా ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. -
రష్మిక 'గర్ల్ ఫ్రెండ్'.. మెలోడీ సాంగ్ రిలీజ్
ఓవైపు స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రష్మిక.. మరోవైపు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. అదే 'గర్ల్ ఫ్రెండ్'. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లవ్ స్టోరీతో తీస్తున్నారు. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మిక సరసన నటిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం తొలి పాట రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో గీతాన్ని వదిలారు.చిన్మయి పాడిన ఈ పాట.. మంచి మెలోడీయస్గా ఉంటూనే హీరోహీరోయిన్ మధ్య లవ్ ఎలా ఉండబోతుందనేది చూపించింది. ఒకే కాలేజీలో చదువుకునే ప్రధాన పాత్రధారుల మధ్య ప్రేమని చూపించే సీన్స్ అన్నీ ఈ పాటలో కనిపించాయి. చూస్తుంటే రష్మిక.. మరి హిట్ కొట్టేలా కనిపిస్తుంది. లెక్క ప్రకారం ఈ మూవీ ఈపాటికే రిలీజైపోవాలి. కానీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ‘ఉతుకు పిండు ఆరేయ్’ సాంగ్
విశాఖపట్నం: ఇటీవల విడుదలైన ‘ఉతుకు పిండు, ఆరేయ్’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్గా మారి, విశేష ఆదరణ పొందుతోంది. మాస్ స్టైల్లో సందేశాత్మక లిరిక్స్ ఉండటంతో ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువతను లక్ష్యంగా చేసుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఈ పాట సందేశం ఇస్తోంది. నగరానికి చెందిన 300 మంది కళాకారులతో ఈ పాటను విశాఖ పర్యాటక ప్రాంతాల్లో చిత్రీకరించారు.ఒకేసారి ఇంతమంది కళాకారులతో చిత్రీకరణ జరపడం ద్వారా ఈ పాట తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. పూర్ణామార్కెట్కు చెందిన యాదకుమార్ ఈ పాటకు దర్శకత్వం వహించగా, ధనుంజయ్, నిహారిక ఇందులో నటించారు. పల్సర్ బైక్ రమణ ఈ పాటను ఆలపించగా, నిస్సీ జెస్టిన్ సంగీతం, సందీప్ మిరియాల సాహిత్యం అందించారు. పాటకు లభించిన అనూహ్య స్పందన నేపథ్యంలో, వినాయక చవితి సందర్భంగా బుధవారం దీనికి సంబంధించిన డీజే మిక్సింగ్ పాటను విడుదల చేయనున్నట్లు దర్శకుడు యాదకుమార్ తెలిపారు. -
రజినీకాంత్ కూలీ.. మాస్ సాంగ్ వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్ను కూలీ అధిగమించింది. కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందితాజాగా ఈ మూవీ నుంచి కొక్కి అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను అమోగ్ బాలాజీ పాడగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ మాస్ రజినీకాంత్ను ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు.Electrifying & Addictive #Kokki lyric video is out now!🖤🔥 #Coolie▶️ https://t.co/XC6UiW0qcZ #Coolie ruling in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja… pic.twitter.com/Sxn6Xu4Xe7— Sun Pictures (@sunpictures) August 22, 2025 -
అనుష్క శెట్టి పాన్ ఇండియా మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
అనుష్కశెట్టి లీడ్ రోల్లో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా నుంచి దస్సోరా అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ సాంగ్కు సాగర్ నాగవెల్లి కంపోజ్ చేయగా.. ఈఎస్ మూర్తి లిరిక్స్ అందించారు. ఈ పాటను గీతా మాధురి, సాకేత్, శ్రుతి రంజని ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
వార్ 2లో కిక్కిచ్చిన 'సలాం అనాలి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వార్ 2 (War 2 Movie). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ లభించింది. ఈ మూవీ నుంచి తాజాగా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్స్వీరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. సినిమా సంగతేమో కానీ వీళ్ల డ్యాన్స్ మాత్రం అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించగా నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణ కాంత్ తెలుగులో లిరిక్స్ సమకూర్చారు. వార్ 2 మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహనిర్మాతగా వ్యవహరించారు. -
పవన్ కల్యాణ్ మూవీలో సాంగ్.. ఆ కారణంతో చేయనని చెప్పా: ఉదయభాను
టాలీవుడ్లో యాంకర్ గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. నటిగానూ రాణించింది. పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్లోనూ మెప్పించిన ఉదయభాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బార్బరిక్ త్రిబాణధారి మూవీతో మరోసారి అభిమానులను పలకరించేందుకు వస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఉదయభాను కొన్ని సినిమాల్లో పాటలు చేయడానికి నో చెప్పానని తెలిపింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో పార్టీ సాంగ్కు నో చెప్పేశానని వెల్లడించింది. నాకు స్క్రిప్ట్ నచ్చకపోతే డైరెక్టర్తోనే నేరుగా వేరేవాళ్లను తీసుకోమని చెప్పానన్నారు. అందుకే త్రివిక్రమ్ మూవీలోనూ సాంగ్ చేయనని చెప్పానని ఉదయభాను తెలిపారు. అయితే ఆ సాంగ్ చేసేందుకు భయపడ్డానని.. అంత పెద్ద స్టార్స్ మధ్య పార్టీ సాంగ్ కావడంతో చేసేందుకు వెనకడుగు వేశానని ఉదయభాను పేర్కొంది.కాగా.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2013లో రిలీజైన సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. మాస్ సాంగ్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. రగిలే రగిలే అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట విజయ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
‘గుంజి గుంజి’ సాంగ్ రిలీజ్.. అదిరిపోయే స్టెప్పులేసిన ఆటిట్యూడ్ స్టార్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తున్నారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.ఆడియో ప్రమోషన్స్లో భాగంగా గతంలో ‘రెడ్డి మామ’ అంటూ ఓ మాస్ బీట్ సాంగ్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్లో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ‘గుంజి గుంజి’ అంటూ సాగే ఓ యూత్ ఫుల్, మాస్, ఎనర్జిటిక్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు రోల్ రైడా సాహిత్యాన్ని అందించగా.. ఆర్ఆర్ ధృవన్ బాణీని సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియో చూస్తుంటే గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చంద్రహాస్ అదిరిపోయేలా స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. -
ఫరియా అబ్దుల్లా డార్క్ కామెడీ థ్రిల్లర్.. లిరికల్ సాంగ్ రిలీజ్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'గుర్రం పాపిరెడ్డి'. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఈ మూవీని డార్క్ కామెడీ కథగా దర్శకుడు మురళీ మనోహర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా.. లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ పాడారు. కృష్ణ సౌరభ్ ఈ సాంగ్ను కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమకాు కృష్ణ సౌరభ్ సంగీతమందిస్తున్నారు. -
‘అడుగు అడుగునా..’ ఆకట్టుకుంది: సీపీ సీవీ ఆనంద్
రోహిత్ సాహిని, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టీరియస్’. తాజాగా ఈ సినిమాలోని ‘అడుగు అడుగునా’ పాటని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ఈ పాటను ఆలపించిన సింగర్ కార్తికేయన్ను అభినందించాడు. అంకితభావంతో పని చేసే పోలీసు అధికారిపై చిత్రీకరించిన ఈ పాటను అద్భుతంగా ఆలపించాడంటూ ప్రశంసులు కురిపించాడు. ఈ పాటను లిరిక్స్తో పాటు సంగీతం అందించిన ఎమ్ఎల్ రాజాకి అభినందనలు తెలియజేశాడు. జయ్ వల్లందాస్ నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. ‘ఎంతో బిజీ గా ఉండి కూడా మా సినిమా లిరికల్ సాంగ్ ని విడుదల చేసినందుకు కమీషనర్ CV ఆనంద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొత్త వరవడి లో చూపించే ప్రయత్నం చేశాం. దయచేసి అందరూ మా చిత్రాన్ని చూసి మమల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ కార్యక్రమం లో హీరో రోహిత్ సాహిని, గౌతమ్, దర్శకులు మహి కోమటిరెడ్డి, నిర్మాత జయ్ వల్లందాస్, సహా నిర్మాత రామ్ ఉప్పు (బన్నీ రామ్)తదితరులు పాల్గొన్నారు. -
'సతీ లీలావతి'గా మెగా కోడలు.. పెళ్లి పాట చూశారా?
వరుణ్ తేజ్తో పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటిస్తోన్న చిత్రం సతీ లీలావతి. ఈ మూవీలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లో నాగ మోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి చిత్తూరు పిల్లా అంటూ సాగే సాంగ్ను రిలీజ్ చేశారు.(ఇది చదవండి: మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!)పెళ్లి వేడుకలో వచ్చే ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పెళ్లిపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. నూతన్ మోహన్, కృష్ణ తేజస్వీ, రితేష్ జి రావు పాడారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ ఈ సంగీతమందిచారు. ఈ చిత్రంలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. The sound of love, joy, and celebration 💃🕺#ChittoorPilla lyrical video from #SathiLeelavathi is OUT NOW! 🎶- https://t.co/abxPxwEmbxA @MickeyJMeyer Musical 🎶Sung by 🎤 : @Nutana_Mohan, @krishnatejasvi_ & #RiteshGRaoLyrics by ✍: #Vanamali@ActorDevMohan @SatyaTatineni… pic.twitter.com/VM1IrkU1eh— Lavanya konidela tripathi (@Itslavanya) August 12, 2025 -
దుల్కర్ 'కాంత' తొలి సాంగ్ రిలీజ్
విభిన్న చిత్రాలు చేస్తూ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం 'కాంత' అనే మూవీ చేస్తున్నాడు. రానా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్.. కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వచ్చే నెల 12న మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అలా తొలి పాటని విడుదల చేశారు.(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్కి నమ్రత స్పెషల్ విషెస్)'పసి మనసే' అంటూ సాగే పాటని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో దుల్కర్-భాగ్యశ్రీ డ్యాన్స్.. పాత సినిమాల్లో పాటల్ని గుర్తుచేస్తోంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ కథతో తీసిన ఈ సినిమాలో దుల్కర్ హీరో పాత్ర పోషిస్తుండగా, సముద్రఖని దర్శకుడిగా కనిపించబోతున్నారు. ఓ మూవీ తేసే విషయమై వీళ్లిద్దరి మధ్య ఎలాంటి ఈగోలు చోటుచేసుకున్నాయి. చివరకు ఏమైందనే కాన్సెప్ట్తో మూవీని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: నిర్మాతలు ఎటూ తేల్చకపోతే చిరంజీవి ఆ పని చేస్తానన్నారు) -
K Ramp: కలర్ఫుల్గా ఓనం సాంగ్
'క' సినిమాతో అసలు సిసలైన హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) దిల్రూబా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాడు. ప్రస్తుతం ఇతడు కె- ర్యాంప్ సినిమా చేస్తున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు.ఓనం సాంగ్..నేడు (ఆగస్టు 9) రాఖీ పండగను పురస్కరించుకుని కె- ర్యాంప్ (K - Ramp Movie) నుంచి ఓనమ్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. 'ఇన్స్టా ఆపేశానే.. ట్విటర్ మానేశానే.. నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్ల..' అన్న లిరిక్స్తో పాట మొదలైంది. చేతన్ భరద్వాజ్, సాహితి చాగంటి ఈ పాట ఆలపించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. సురేంద్ర కృష్ణ లిరిక్స్ సమకూర్చాడు. పాట కలర్ఫుల్గా ఉంది. కిరణ్ ఎనర్జిటిక్గా డ్యాన్స్ చేశాడు. కె ర్యాంప్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. చదవండి: 'చిట్టి' గుండెల కోసం మహేశ్ బాబు.. -
'పరమ్ సుందరి'గా జాన్వీ కపూర్.. వర్షంలో రొమాంటిక్ సాంగ్ చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'పరమ్ సుందరి'. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫుల్ రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.బీగీ శారీ అంటూ సాగే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో సిద్ధార్థ్- జాన్వీల కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వర్షంలో చేసిన ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఈ అద్భుతమైన సాంగ్ను శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ, సచిన్ జిగర్ ఆలపించారు. ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. సచిన్ జిగర్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
టాలీవుడ్ లవ్ స్టోరీ.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ప్రేమిస్తున్నా. ఈ సినిమాకు భాను దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు కనకదుర్గారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీలోని రెండో పాటను రిలీజ్ చేశారు. ఎవరే నువ్వు అంటూ సాగే సాంగ్ను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ సూపర్ హిట్ కావాలని విజయ్ సేతుపతి అన్నారు. ఈ పాటను పూర్ణ చంద్ర రచించగా.. సిద్ధార్థ్ సాలూర్ సంగీతం అందించారు.దర్శకుడు భాను మాట్లాడుతూ...' మా ప్రేమిస్తున్నా సినిమా సెకండ్ సాంగ్ను హీరో విజయ్ సేతుపతి విడుదల చెయ్యడం మా చిత్ర యూనిట్కు దక్కిన అదృష్టం. మా సినిమా కథను తెలుసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యడం విశేషం. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ సినిమా' అని తెలిపారు. ఈ సినిమాకు భాస్కర్ శ్యామల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
'ఉండిపోవే నా తోనే బంగారం'.. అలరిస్తోన్న కిష్కింధపురి సాంగ్!
బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కిష్కింధపురి. ఈ మూవీలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ ఏడాది భైరవం తర్వాత బెల్లంకొండ నటిస్తోన్న చిత్రం కావడంతో భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఉండిపోవే నాతోనే బంగారం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ బెల్లంకొండ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. జావెద్ అలీ ఆలపించారు. ఈ సాంగ్ను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. -
మేఘం వర్షించదా.. లవ్ సాంగ్ రిలీజ్
విజయ రామరాజు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి' (Arjun Chakravarthy Movie). విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఇన్స్టాగ్రామ్లో 16 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. యూట్యూబ్ లో 1.5 మిలియన్ల వ్యూస్ దాటింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మేఘం వర్షించదా' రిలీజ్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ కంపోజ్ చేసిన ఈ పాటకు విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వుంది. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ పాడారు. ఇక ఈ సినిమాలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ చక్రవర్తి ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..! -
సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆన్లైన్ ప్రమోషన్స్ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు అంటూ హంగామా చేయకుండా సోషల్ మీడియాలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వార్ 2 మూవీలోని తన పోస్టర్తో ఉన్న బిల్బోర్డ్ను హృతిక్ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్.. తన పోస్టర్ ఉన్న బిల్బోర్డ్ను తారక్ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్ మీడియాలో సరదా వార్ జరుగుతోంది.ఫుల్ సాంగ్ కావాలంటే..తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్లో కాదు.. ఏకంగా థియేటర్లోనే ఫుల్ సాంగ్ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease... #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…— Jr NTR (@tarak9999) August 7, 2025 చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు -
అనుపమ పరదా మూవీ.. బ్యూటీఫుల్ సాంగ్ వచ్చేసింది!
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న తాజా చిత్రం పరదా. ఈ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పరదా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే యత్ర నార్యస్తు పూజ్యంతే అనే పాటను విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఎగరేయి నీ రెక్కలే అంటూ సాగే బ్యూటీఫుల్ సాంగ్ను విడుదల చేశారు.ఈపాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. రితేశ్ జీ రావు ఆలపించారు. ఈ సాంగ్ను గోపి సుందర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో సంగీత, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఆగష్టు 22న ఈ చిత్రం విడుదల థియేటర్లో సందడి చేయనుంది.Let the music take you deep within🎶3rd single from #Paradha is here!#YegareyiNeeRekkale #AkaleEeNeermutthukal Lyrical Video OUT NOWTelugu: https://t.co/7EUihYEyKQMalayalam: https://t.co/wQ31mwufieIn cinemas AUG 22@anupamahere @darshanarajend @sangithakrish @GopiSundarOffl pic.twitter.com/OA2EveLA4D— Paradha Movie (@Paradhamovie) August 5, 2025 -
కిరీటి స్టెప్పులు, శ్రీలీల గ్రేస్.. వైరల్ వయ్యారి ఫుల్ సాంగ్ చూసేయండి
ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్ (Junior Movie). ఇది మొదటి సినిమా అయినప్పటికీ కిరీటి నటనకు, ముఖ్యంగా అతడి డ్యాన్స్కు ఫుల్ మార్కులు పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమానిని అని చెప్పుకునే ఇతడు ఆ హీరోకు తగ్గట్లుగానే డ్యాన్స్ చేశాడు. వైరల్ వయ్యారి సాంగ్లో ఎన్టీఆర్ను గుర్తుచేసేలా స్టెప్పులతో అదరగొట్టాడు.వైరల్ వయ్యారి ఫుల్ వీడియో సాంగ్శ్రీలీల (Sreeleela) గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పటిలాగే చించిపడేసింది. ఒకరకంగా చెప్పాలంటే జూనియర్ సినిమాకు వైరల్ వయ్యారి పాట భారీ హైప్ తీసుకొచ్చింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. 4కె వర్షన్లో వైరల్ వయ్యారి సాంగ్ (Viral Vayyari Full Video Song)ను యూట్యూబ్లో అందుబాటులోకి తెచ్చారు. పోటాపోటీగా డ్యాన్స్ చేసిన కిరీటి, శ్రీలీలఇది చూసిన అభిమానులు.. శ్రీలీలకే పోటీ ఇచ్చేలా డ్యాన్స్ చేశాడని కిరీటిని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పాటకు రేవంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. జూనియర్ సినిమా విషయానికి వస్తే.. కిరీటి, శ్రీలీల జంటగా నటించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: తిరుమలలో 'కిరణ్ అబ్బవరం' కుమారుడి నామకరణం -
'ఓజీ' సినిమా తొలి పాట రిలీజ్
రీసెంట్గా పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలపడింది. దీంతో అభిమానులు ఈ మూవీ గురించి మర్చిపోవడం మొదలుపెట్టారు. ఈ సెప్టెంబరు చివర్లో రిలీజయ్యే 'ఓజీ' కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సినిమా నుంచి 'ఫైర్ స్ట్రోమ్' అంటూ సాగే తొలి లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?)పాట గురించి రిలీజ్ ముందు వరకు హైప్ ఎక్కువగానే ఇచ్చారు గానీ తమన్ ఇదివరకే కంపోజ్ చేసిన పాటల్లానే బాగుంది. కాకపోతే మరీ సూపర్గా అయితే అనిపించలేదు. అదే టైంలో లిరిక్స్ని మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. ప్రస్తుతానికైతే అభిమానులకు నచ్చినట్లే కనిపిస్తోంది. రానురాను పాట అలవాటు అవుతుందేమో చూడాలి.'ఓజీ' సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా చేసింది. సుజీత్ దర్శకుడు కాగా.. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారు. సెప్టెంబరు 25న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. అదే రోజున బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ కూడా ఉంది. మరి ఇద్దరు పోటీకి దిగుతారా? లేదంటే ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?(చదవండి: 'మహావతార్ నరసింహ' ఆల్టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?) -
వార్ 2 కోసం బ్రహ్మాస్త్ర టీమ్.. హృతిక్, కియారాలతో రొమాంటిక్ సాంగ్!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యూక్షన్ మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా కోసం హృతిక్–కియారాలపై చిత్రీకరించిన ‘ఆవన్ జావన్ ...’ అనే పాటను అతి త్వరలోవిడుదల చేయనున్నట్లు వెల్లడించి, ఈ పాట ఫస్ట్లుక్ రోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.‘‘హృతిక్ రోషన్ – కియారా అద్వానీ కెమిస్ట్రీ ‘అవన్ జావన్ ..’ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు ప్రీతమ్, లిరిక్ రైటర్ అమితాబ్ భట్టాచార్య, గాయకుడు అరిజీత్ సింగ్ కలిసి పని చే శారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా...’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ తరహాలోనే ‘ఆవన్ జావన్ ..’ కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.కాగా... ఈ నెల 31న కియారా అద్వానీ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఆవన్ జావన్ ...’ పాటని రిలీజ్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్గా ‘వార్ 2’ రూపొందిన సంగతి తెలిసిందే. -
కూలీ పవర్ఫుల్ సాంగ్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ జోరు పెంచేశారు.ఈ నేపథ్యంలోనే పవర్ఫుల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ వర్షన్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్లో లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. పవర్హౌస్ పేరుతో వచ్చిన ఈ పాట ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఇది చదవండి: రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?)కాగా.. కూలీ ట్రైలర్ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
తమన్-సిద్ శ్రీరామ్ 'మల్లిక గంధ' సాంగ్ రిలీజ్
'టిల్లు' సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న సిద్ధు చేస్తున్న లేటెస్ట్ సినిమా 'తెలుగు కదా'. స్టైలిష్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబరు 17న మూవీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా ఇప్పుడు మూవీ నుంచి తొలి సాంగ్ రిలీజ్ చేశారు. 'మల్లిక గంధ' అంటూ సాగే పాటని సిద్ శ్రీరామ్ పాడాడు.(ఇదీ చదవండి: సూపర్ హీరోగా కల్యాణి.. అలరించేలా 'లోకా' టీజర్)తమన్ స్వరపరిచిన ఈ మెలోడీ ఓవైపు వినసొంపుగా ఉంటూనే బీట్ కూడా వినబడుతోంది. సిద్ధు-రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందించాడు. చూస్తుంటే తమన్ స్వరపరిచిన తొలిపాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
బాలీవుడ్ సాంగ్కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..!
సోషల్మీడియాలో ఒక ఇంట్రస్టింగ్ వీడియో హల్చల్ చేస్తోంది. రష్యాకు చెందిన చిన్నారులు బాలీవుడ్ సూపర్స్టార్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అడింకా మాండరింకా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 2.4 కోట్ల వీక్షణలను సంపాదించింది.అమీర్ ఖాన్ , కాజోల్ నటించిన ఫనా (2006) చిత్రం నుండి 'చందా చమ్కే' పాటకు రష్యాకు చెందిన చిన్నారులు అద్భుతంగా స్టెప్పులేశారు. చక్కటి హావభావాలు, అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అందమైన ఎరుపు లెహంగాలు ధరించిన చిన్నారుల బృందం పాటలోని ప్రతి బీట్ను క్యాచ్ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశారు. సో క్యూట్ ఎంత బాగా చేశారో, మంచి డ్యాన్సర్లు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే! View this post on Instagram A post shared by Adinka Mandarinka (@adina_madikyzy)అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. చిన్నారుల డ్యాన్స్ వీడియోను రికార్డ్ చేసిన 'కెమెరామెన్' పై ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తాయి. అతని కెమెరా యాంగిల్స్పై నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. చక్కటి వీడియోను పాడు చేసేశాడు అంటూ కమెంట్ చేశారు.ఇవీ చదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్ లుక్ వైరల్ పొంగల్లో పురుగు : మరో వివాదంలో రామేశ్వరం కెఫే -
శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. స్టూడెంట్ డ్యాన్స్కు హీరో ఫిదా!
ఇటీవల సినీ ప్రియులను ఓ రేంజ్లో ఊపేస్తోన్న హీరోయిన్ శ్రీలీల. గతేడాది పుష్ప-2 చిత్రంలో కిస్సిక్ సాంగ్తో అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి ఊపున్న సాంగ్తో మెప్పించింది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వచ్చిన జూనియర్ మూవీలో వైరల్ వయ్యారి అంటూ అభిమానుల ముందుకొచ్చింది. ఈ మాస్ సాంగ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి అంటూ రీల్స్తో అదరగొట్టేసింది.అంతలా క్రేజ్ దక్కించుకున్న ఈ పాటకు కర్నాటకకు చెందిన ఓ విద్యార్థిని చేసిన డ్యాన్స్ నెట్టింట వైరలవుతోంది. హీరో కిరిటీ సమక్షంలోనే ఆ బాలిక అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను హీరో కిరిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన డ్యాన్స్తో అదరగొట్టిన విద్యార్థినికి హీరో కిరిటీ చిరుకానుక అందించారు. ఇది చూసిన నెటిజన్స్ విద్యార్థిని టాలెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా చేశావంటూ కితాబిస్తున్నారు.కాగా.. కిరిటీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జూలై 18 తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తోంది. The super talented V. Pooja from Kurugodu, a beautiful village in my hometown Ballari, dancing her heart out to #ViralVayyari. Blessings to you, little star! #Junior pic.twitter.com/FITaWGU6ra— Kireeti (@KireetiOfficial) July 23, 2025 -
రజినీకాంత్ కూలీ.. పవర్ఫుల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నుంచి ఇప్పటికే చికిటు, మోనికా అంటూ సాగే రెండు పాటలను విడుదల చేశారు. మోనికా సాంగ్తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.తాజాగా కూలీ మూవీ ప్రమోషన్లలో భాగంగా థర్డ్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. పవర్ హౌస్ అంటూ సాగే పవర్ఫుల్ లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పవర్ఫుల్ సాంగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. వచ్చేనెల ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సీజనల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్గా 'నువ్వుంటే చాలే'
రామ్ నటించిన కొత్త సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. త్వరలో థియేటర్లలోకి రానుంది. రీసెంట్గానే ఈ మూవీ నుంచి 'నువ్వుంటే చాలే' అని సాగే పాటని రిలీజ్ చేశారు. హీరో రామ్ ఈ పాటని రాయగా రాక్ స్టార్ అనిరుధ్ పాడటం విశేషం. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. సీజనల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్గా మారిపోయింది.(ఇదీ చదవండి: 'భళ్లాలదేవ'గా నేనే చేయాలి.. కానీ: జయసుధ కొడుకు)మహేష్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో ఓ పాటకు రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. ప్రేమకు నిజమైన అర్థాన్ని తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయాణంలా ఈ సాంగ్ అనిపిస్తుంది. రిలీజ్ చేసిన గంటల వ్యవధిలోని ఇది మ్యూజిక్ లవర్స్కి బాగా నచ్చేసింది. ఇదే పాటలో రామ్, భాగ్య శ్రీ జంట చూడముచ్చటగా ఉంది. కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ కానుందనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?) -
తెలుగు సినిమాలపై విదేశీ జంట క్రేజ్.. ఈ సాంగ్ చూశారా?
తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వస్తోంది. మన టాలీవుడ్ చిత్రాలకు విదేశీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. జపానీయులైతే మన చిత్రాలను తెగ చూసేస్తారు. జపాన్కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తెలుగు కూడా నేర్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతలా మన సినిమాలకు ఫారినర్స్ ఫిదా అయిపోయారు. ఇక డేవిడ్ వార్నర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మేనరిజంతో రీల్స్ చేస్తూ అలరించిన డేవిడ్ వార్నర్.. నితిన్ మూవీ రాబిన్హుడ్తో ఏకంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అంతలా మన సినిమాలు, పాటలకు విదేశీ ఆడియన్స్ సైతం ఫిదా అయిపోవాల్సిందే.గతంలో సంక్రాంతి వస్తున్నాం సాంగ్తో అలరించిన విదేశీ జంట.. మరోసారి తెలుగు పాటతో సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ జంట మరోసారి తెలుగు సాంగ్తో ప్రేక్షకులను అలరించింది. స్వీడన్కు చెందిన కర్ల్ స్వాన్బెర్గ్ అనే నటుడు తన సతీమణితో కలిసి మరో తెలుగు పాటకు డ్యాన్స్ చేశారు.అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా, ఐశ్వర్య అర్జున్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతా పయనం. ఈ సినిమాలో 'ఏ ఊరికెళ్తావే పిల్లా..నువ్వు ఏ ఊరికెళ్తావే పిల్లా.. మా ఊరు రావే పిల్లా' అనే పాటను రీ క్రియేట్ చేశారు. తెలుగు వంటకాలను పరిచయం చేస్తూ విదేశీ జంట చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. తెలుగు ఆడియన్స్ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. అర్జున్ సర్జా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతా పయనం. అర్జున్ కుమార్తె, హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ మెయిన్ లీడ్ రోల్లో నటించింది. సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
వైరల్ వయ్యారి సాంగ్.. హీరోయిన్ శ్రీలీలను మించిపోయిన బామ్మ..!
శ్రీలీల సాంగ్ చిన్నా పెద్దా లేకుండా అందరిని ఊపేస్తోంది. గతేడాది పుష్ప-2 మూవీలో కిస్సిక్ సాంగ్తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి గూస్బంప్స్ తెప్పించే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటించిన లేటేస్ట్ మూవీ 'జూనియర్' నుంచి వైరల్ వయ్యారి అంటూ ఇటీవలే లిరికిల్ సాంగ్ రిలీజ్ చేయగా యూట్యూబ్ను షేక్ చేసింది. ఈ పాటతో మరోసారి మాస్ ఆడియన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా పరిచయమవుతోన్న ఈ సినిమా జూలై 18న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్లో వైరల్ వయ్యారి సాంగ్ను ప్రదర్శించారు. ఈ పాటకు సీనియర్ నటి, బామ్మ పాత్రలకు ఫేమస్ అయిన మణి తనదైన డ్యాన్స్తో అదరగొట్టేసింది. వైరల్ వయ్యారి వేదికపై స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది. పక్కనే యాంకర్ సుమ బామ్మతో కలిసి కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బామ్మ ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Good music and good vibe has no age barrier ❤️The most viral dance for #ViralVayyari at the #Junior Grand Pre Release Event ❤🔥Watch live now!▶️ https://t.co/XiLs4gDSed#Junior Grand release on July 18th ✨#JuniorOnJuly18th #JuniorPreReleaseEvent pic.twitter.com/JSCTs2onDa— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 16, 2025 -
డిఫరెంట్ సాంగ్లో రష్మిక.. డ్యాన్స్ మాత్రం
సాధారణంగా డ్యాన్స్ అనగానే గంతులు వేయడం లాంటి స్టెప్స్ చాలా వరకు ఉంటాయి. కానీ రష్మిక మాత్రం కాస్త డిఫరెంట్ సాంగ్లో కనిపించింది. డ్యాన్స్ కూడా అందుకు తగ్గట్లే ఉంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తొలి పాటని రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'నదివే' అంటూ సాగిన ఈ పాట.. ప్రేమ సాహిత్యం తరహాలో వెరైటీగా ఉంది.(ఇదీ చదవండి: థియేటర్లలోకి రిలీజైన ఒక్కరోజుకే ఓటీటీలోకి హిట్ సినిమా)రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక లీడ్ రోల్ కాగా, 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి ఈమె సరసన నటిస్తున్నాడు. యానిమల్, పుష్ప 2, ఛావా తదితర సినిమాలతో పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న రష్మిక చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. అల్లు అరవింద్ నిర్మించారు. తాజాగా రిలీజ్ చేసిన పాట చూడటానికి వినటానికి బాగానే ఉంది. మూవీని సెప్టెంబరు 5న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆయన నా ఫ్యామిలీ మెంబర్ లాంటోడు.. అందుకే: ప్రభాస్) -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఆ సాంగ్ ప్రోమో వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈనెల 25న విడుదల కావాల్సినా ఈ చిత్రం వారం రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో ఈ నెలాఖర్లో అంటే జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీలోని అన్నా అంటూనే సాగే ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ పాటను కృష్ణకాంత్ రాయగా.. అనిరుధ్ ఆలపించారు. కాగా.. ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
ట్రాన్స్ ఆఫ్ కుబేర.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!
ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాలో ధనుశ్ బిచ్చగాడి పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా ఈ మూవీ ఓ క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. కుబేరలోని నాది నాది నాదే ఈ లోకమంతా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ధనుష్, హేమచంద్ర ఈ సాంగ్ను ఆలపించగా.. కిశోర్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.ఓటీటీకి కుబేరవిడుదలకు ముందే 'కుబేర' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో ఈ నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. -
కుబేర క్రేజీ సాంగ్.. ఫుల్ వీడియో వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న కుబేర కలెక్షన్ల పరంగా వందకోట్లకు పైగానే రాబట్టింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్ర పోషించారు.తాజాగా ఈ చిత్రంలో క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. అనఅనగా కథ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను కరీముల్లా, హైడ్ కార్తి ఆలపించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్వీసీఎల్ఎల్పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.కుబేర కథేంటంటే..'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ. -
బేబీ బంప్పై ‘అమృతస్వరం’ పాట పాడితే.. వీడియో వైరల్
బాలీవుడ్ సూపర్ గాయని శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) తన మధురమైన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. అనేక భాషల్లో తన స్వరంతో సంగీతాభిమానులు ఉర్రూతలూగించింది. తాజాగా తన గానంతో కడుపులో ఉన్న బిడ్డను కూడా కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ వైరల్గా మారింది.ఆమ్స్టర్డామ్ లోని ‘‘ఆల్ హార్ట్స్ టూర్’’ సందర్భంగా తన వీరాభిమానిని కలిసింది శ్రేయా ఘోషల్. గర్భిణి అయిన అభిమాని ముందు మోకాళ్లపై కూర్చుని, ఆమె గర్భంపై తన చేతిని సున్నితంగా ఉంచి, పుట్టబోయే బిడ్డ కోసం జోలపాట పాడటం విశేషం. పరిణీత చిత్రంలోని "పియు బోలే సాంగ్ను మంద్రంగా ఆలపించింది. అంతే గర్భస్థ శిశువు పరవశంతో కదిలిందిట. ఆ సమయంలో అభిమానితో పాటు శ్రేయ కూడా ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియో నెట్టింట అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla)లక్కీ బేబీ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. ‘డివైన్ వాయిస్ ఆ బిడ్డను ఆశీర్వదించింది’ అని ఒకరు, ‘ఓహ్..ఆ పుట్టబోయే బిడ్డకు ఎంత అదృష్టం’ అని మరో అభిమాని వ్యాఖ్యానించడం విశేషం."శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అని ఇదేనేమో!ఇదీ చదవండి: ట్విన్స్కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్ -
పుష్ప-2 రేంజ్లో మాస్ సాంగ్.. మరోసారి వైరల్ అవుతోన్న శ్రీలీల!
గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటిస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల కనిపించనుంది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో వరుస అప్డేట్స్తో మేకర్స్ అలరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జూనియర్ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. వైరల్ వయ్యారి అంటూ సాగే మాస్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో శ్రీలీల మరోసారి తనదైన డ్యాన్స్తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. పుష్ప-2లో ఐటమ్ సాంగ్ రేంజ్లో శ్రీలీల అలరించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. తాజాగా విడుదలైన పాట మాస్ ఆడియన్స్ను ఊపేస్తోంది. కాగా.. ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రాయగా.. హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ ఆలపించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. -
వైరల్ ఎలా అవ్వాలంటోన్న శ్రీలీల.. అసలు విషయం ఏంటంటే?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఏడాది నితిన్ సరసన రాబిన్హుడ్లో మెప్పించిన భామ.. ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనెల 4న వైరల్ వయ్యారి అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ చేసిన ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి కాల్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీ రీల్సే కనిపిస్తున్నాయి.. మీలా వైరల్ ఎలా అవ్వాలో నేర్పిస్తారా అని అడిగింది. ఏంటీ వైరల్ ఎలా అవ్వాలో మీకు నేర్పాలా?కామెడీ వద్దమ్మా? మీరే నాకు నేర్పాలని దేవీశ్రీ అన్నారు. నిజమే కదా.. మీరు వయ్యారంగా ఓ మాస్ స్టెప్ వేస్తే అదే వైరలైపోద్ది అని చెప్పాడు. అదేదో మీరే ఇవ్వండి సార్ అని శ్రీలీల ముద్దుగా అడగడంతో.. వైరల్ వయ్యారి అంటే ఎలా ఉంది సాంగ్ అంటూ దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇదంతా వైరల్ వయ్యారి పాట కోసమే వీరిలా వైరైటీ ప్రమోషన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.#Junior second single #ViralVayyari out on July 4thIn cinemas July 18th. @sreeleela14 @ThisIsDSP pic.twitter.com/TDAbv8w5Rz— ScreenTimeGuru (@ScreenTimeGuru) July 1, 2025 -
హీరోగా స్టార్ హీరో తనయుడి ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే?
విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఫీనిక్స్’. స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే బ్రేవ్మ్యాన్ పిక్చర్స్ నిర్మించారు. ఫీనిక్స్ మూవీలో అభినక్షత్ర, వర్ష హీరోయిన్లుగా నటిస్తుండగా... వరలక్ష్మి శరత్కుమార్, సంపత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలోని ఇందా వాంగికో...(ఇదిగో తీసుకో అని అర్థం) అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. గతంలో నానుమ్ రౌడీదాన్, సిందుబాద్’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సూర్య సేతుపతి హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్, చక్కని ఎమోషన్తో రూపొందించిన ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. -
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
ఈ ఏడాది సంక్రాంతి వచ్చి బ్లాక్బస్టర్గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ఓ రేంజ్లో అదరగొట్టేసింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్లో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.అయితే ఈ సినిమాలోని ఓ పాట ఆడియన్స్ను ఓ రేంజ్లో ఊపేసింది. గోదారిగట్టు మీద రామ చిలకవే అంటూ అభిమానులతో స్టెప్పలేయించింది. ఈ పాటలో వెంకీమామ, ఐశ్వర్య రాజేశ్ తమ డ్యాన్స్తో ఫ్యాన్స్ను మెప్పించారు. అంతేకాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.అయితే ఈ పాటకు కేవలం మన ఆడియన్స్ మాత్రమే ఊగిపోయారనుకుంటే పొరపాటే అవుతుంది. తాజాగా ఫారినర్స్ కూడా ఈ సాంగ్కు ఫిదా అయిపోయారు. స్వీడన్కు చెందిన కర్ల్ స్వాన్బెర్గ్ అనే నటుడు తన సతీమణితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. వెంకటేశ్ ఐశ్వర్య రాజేశ్ పాత్రల్లో వీరిద్దరు అదరగొట్టేశారు. కేవలం ఈ సాంగ్ మాత్రమే కాదు.. పలు ఇండియన్ చిత్రాలకు సంబంధించిన పాటలతో పాటు డైలాగ్స్, సీన్స్ కూడా రీ క్రియేట్ చేస్తుంటారు. ఏదేమైనా ఇండియన్ సినిమాలపై వీరికున్న అభిమానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం గోదారి గట్టు మీద రామ చిలకవే సాంగ్ చూసేయండి. View this post on Instagram A post shared by Karl Svanberg (@raja.svanberg) -
రష్మిక సాంగ్ ఎందుకు తీసేశారు?.. శేఖర్ కమ్ముల క్లారిటీ!
ధనుశ్, నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ కుబేర. క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో నాగ్ ఫ్యాన్స్తో పాటు ధనుశ్ అభిమానులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. కుబేర సక్సెస్ కావడంతో ఇది శేఖర్ కమ్ముల మార్క్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ రష్మిక సైతం తన పాత్రకు వస్తున్న ఆదరణను చూసి సంతోషంగా ఉందని తెలిపింది.అయితే తాజాగా కుబేర సక్సెస్ కావడంతో టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో నాగార్జునతో పాటు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా పాల్గొన్నారు. ఈ సినిమాలో పీపీ..డుమ్ డుమ్ అనే రష్మిక సాంగ్ను ఎందుకు తొలగించారంటూ దర్శకుడికి ప్రశ్న ఎదురైంది. దీనిపై శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చారు.పాన్ ఇండియా సినిమా కావడం వల్ల కొన్ని అలాంటి సాంగ్స్ ఉండాలకున్నామని శేఖర్ కమ్ముల తెలిపారు. అయితే ఈ సాంగ్ను కావాలని మేము తీయలేదన్నారు. కానీ కథలో ఎక్కడైనా ఈ పాట అడ్డుగా వస్తుందేమోనని వద్దనుకున్నట్లు వెల్లడించారు. వేరే మంచి సీన్ తొలగించి ఈ పాటను పెట్టడానికి నేను కథను అలా రాసుకోలేదన్నారు. ఈ చిత్రంలో ఒక్క సీన్, ఒక్క డైలాగ్ తీసేసినా ఈ సినిమా ఉండదు.. అలా కథ రాసుకున్నానని శేఖర్ కమ్ముల వివరించారు. -
కుబేర మూవీ.. ఫుల్ ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రిలీజ్ ఒక్క రోజే సమయం ఉండడంతో మేకర్స్ కుబేర చిత్రంలో నాలుగో పాటను విడుదల చేశారు. నా కొడుకా అంటూ సాంగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. నందకిశోర్ లిరిక్స్ అందించగా.. సిందూరి విశాల్ ఆలపించారు. ఈ ఎమోషనల్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది.కాగా.. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ నటించగా.. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.The soul touching #Kuberaa4thSingle is out now ♥️A Rockstar @ThisIsDSP musical 🎶#NaaKoduka - https://t.co/EF9sJ4w7xW#Kuberaa in cinemas June 20, 2025.#SekharKammulasKuberaa #Kuberaa #KuberaaBookings #KuberaaOn20thJune pic.twitter.com/B3Zqmyr86y— Kuberaa Movie (@KuberaaTheMovie) June 18, 2025 -
జగన్ పాటకు దుమ్మురేపిన లేడీ ఫ్యాన్..
-
జగనన్న పాటకు డాన్స్ అదరగొట్టిన యువతి
-
యముడు: ధర్మో రక్షతి రక్షిత: పాట రిలీజ్
మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా ‘యముడు’ అనే చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది.తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు. భవానీ రాకేష్ అందించిన బాణీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ‘యముడు’ రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
ప్రేమ లోతును చూపించింది.. వైరలవుతోంది.. సిద్ శ్రీరామ్ పాట
సాక్షి, సిటీబ్యూరో: తన స్వరంలో ఏదో మాయ ఉంటుంది, ఆ గళంలో ప్రతి నాదం మనసును మెలిపెట్టేస్తుంది. ఆ స్వర మాధూర్యం మరెవరో కాదు.. సిద్ శ్రీరామ్. ఆయన స్వర సందడిలో భాగంగా సరికొత్త గీతం ‘కన్నె’లో మాటలకందని భావాలను పలికించారు. ఈ పాటను అయనే స్వయంగా కంపోజ్ చేసి, పాడానని తెలిపారు. ఒక ప్రేమ గీతంగా విడుదలైన ఈ పాట ప్రస్తుతం వైరల్గా మారింది. తమిళంలో వివేక్, తెలుగులో కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటను వార్నర్ మ్యూజిక్ విడుదల చేసింది. ఏప్రిల్లో భక్తిగీతం ‘శివనార్’ విడుదల తనంతరం ఈ పాట కూడా భారతీయ భాషల్లో ఉన్న సంగీతాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా అలరిస్తోంది. చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్ View this post on Instagram A post shared by Sid Sriram (@sidsriram)ప్రేమ లోతును చూపిస్తుంది.. ఈ పాట ప్రజల హృదయాలను తాకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వార్నర్ మ్యూజిక్ ఇండియాతో ఇది నా రెండో రెండో పాట. నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న పాట. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన సమయంలో కలిగే మార్పులను, భావోద్వేగాలను ఈ పాట గుర్తుకుతెస్తుంది. గతంలో ‘శ్రీవల్లి’ (పుష్ప : ది రైజ్), ‘కుంకుమాలా’ (బ్రహ్మాస్త్ర), ‘అదియే’ (కదల్), ‘కన్నానా కన్నే’ (విశ్వాసం) హిట్ సాంగ్స్ వరుసలో ఈ ఏడాది మరి కొన్ని రానున్నాయి. గతేడాది ప్రపంచ ప్రఖ్యాత కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి దక్షిణ భారతీయ కళాకారుడిగా నిలవడం సంతోషాన్నిచ్చింది. – సిద్ శ్రీరామ్. ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ -
వెన్నుపోటు వీరుడా.. చంద్రబాబు మీద సాంగ్ వైరల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పాటను రిలీజ్ చేసింది. వెన్నుపోటు వీరుడా.. అబద్ధాల శూరుడా.. నీకు నీవే సాటి రా.. అంటూ సాగే ఆ వీడియో సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో రిలీజ్ చేయగానే అత్యధికులు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, ధరల పెరుగుదల.. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారో ఆ సాంగ్ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.Here is the teaser of "వెన్నుపోటు వీరుడా.. అబద్దాల శూరుడా!" song!Vennupotu Veerudaa.. Abaddhaala Shurudaa!🎧 Stay tuned for the full song, releasing today at 8 PM — launching on the @we_ysrcp YouTube channel!📲 👇🏻https://t.co/VOuzq3sSkA#VennupotuVeerudaa… pic.twitter.com/PFu655VgvZ— YSR Congress Party (@YSRCParty) June 4, 2025 -
'చౌకీదార్' నుంచి 'నాన్న' పాట రిలీజ్
నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'చౌకీదార్'. తెలుగు, కన్నడ భాషల్లో తీస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా నటిస్తున్నారు. డా. కల్లహల్లి చంద్ర శేఖర్ ఈ మూవీ నిర్మిస్తుండగా, చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)నాన్న గొప్పదనం చాటి చెప్పేలా గుండెను పిండేసేలా ఓ చక్కటి బాణీని అందించారు. నాన్నా అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. సచిన్ బస్రూర్ అందించిన బాణీ అయితే ప్రతీ ఒక్కరినీ కదిలించేలా ఉంది. తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటేలా పాటను రచించారు. లిరికల్ వీడియో చూస్తుంటే సాయి కుమార్ తండ్రిగా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది) -
అర్జున్ అంబటి హీరోగా 'పరమపద సోపానం'.. క్రేజీ సాంగ్ వచ్చేసింది!
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పరమపద సోపానం'. ఈ చిత్రంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో ఎస్.ఎస్.మీడియా బ్యానర్లో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి నాగ శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ నుంచి 'భూమ్ భూమ్' అంటూ సాగే రెండో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను గీతా మాధురి ఆలపించారు. రాంబాబు గోశాల సాహిత్యం అందించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాలోని 'చిన్ని చిన్ని తప్పులేవో' అనే లిరికల్ సాంగ్ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రమోషన్లలో భాగంగా రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా జూలై 11న థియేటర్లలో సందడి చేయనుంది.గీతా మాధురి మాట్లాడుతూ.. " పరమపద సోపానంలో 'భూమ్ భూమ్' అనే పాటని పాడాను. నాగ శివ పూరి వద్ద చాలా సినిమాలకు అసోసియేట్గా వర్క్ చేశారు. ఇప్పుడు దర్శకుడిగా మారి మనముందుకు 'పరమపద సోపానం'ని తీసుకొస్తున్నారు. ఈ పాటని చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇది మంచి స్వింగ్ ఉన్న పాట. కచ్చితంగా ఈ పాట అందరినీ అలరిస్తుంది. టీం అందరికీ థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్" అని అన్నారు. -
మంచు విష్ణు కన్నప్ప.. శ్రీకాళహస్తి ఫుల్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన భక్తి సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీ నుంచి శ్రీకాళహస్తి అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. A song filled with devotion and power! 🔥 Sri-Kala-Hasti lyrical from #Kannappa🏹 is OUT NOW! 🎶✨ Feel the rhythm, embrace the energy! Watch & enjoy!Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥#SriKalaHastiLyricalSong #Kannappa #Stalapurana #OmNamahShivaya🔗Telugu:… pic.twitter.com/e4ebn1Ypoh— Kannappa The Movie (@kannappamovie) May 28, 2025 -
మరో వివాదంలో గుడ్ బ్యాడ్ అగ్లీ.. లీగల్ యాక్షన్ తీసుకుంటానన్న స్టార్ హీరో తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా ఈ మూవీపై మరో వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో మూడు పాటలను ఉపయోగించడంపై నటుడు ధనుశ్ తండ్రి, చిత్రనిర్మాత కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో ఉపయోగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన చిత్రాల్లోని మూడు పాటలు - పంజు మిట్థై, ఓథా రూబా థారెన్, తూటువలై ఇలై అరాచి లాంటి పాటలు వినియోగించారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం చిత్రనిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారని ఆయన విమర్శించారు.కస్తూరి రాజా మాట్లాడుతూ.. 'ఇళయరాజా, దేవా వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి. కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్లను ఉపయోగించడం సమస్య కాదు. కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్య తీసుకుంటా' అని తెలిపారు.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్)ఇళయరాజా రూ.5 కోట్ల డిమాండ్..కాగా.. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఓథా రూబా థారెన్ పాటను ఉపయోగించారు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇళయరాజా తన మూడు పాటలను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపారు. రూ. కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సినిమా నుంచి తన పాటలను తొలగించాలని కోరారు. మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించినప్పుడు తాము ఎటువంటి తప్పు చేయలేదని చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ అన్నారు. మేము సినిమాలో ఉపయోగించిన పాటలకు అవసరమైన అన్ని రకాల అనుమతి తీసుకున్నామని తెలిపారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలా వరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు. -
మంచు విష్ణు కన్నప్ప.. ఆయన కుమార్తెల సాంగ్ ప్రోమో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్)ఈ మూవీ శ్రీకాళ హస్తి అనే లిరికల్ సాంగ్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 28న ఈ పాటను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తాజాగా ఈ సాంగ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. My little munchkins! They are blessed by Lord Shiva to be singing the Stalapurana of SriKalaHasti temple. Cannot wait for all of you to hear the song. #HarHarMahadev https://t.co/dDPjlxixO1#kannappa— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025 -
కమల్ హాసన్ థగ్ లైఫ్.. 'షుగర్ బేబీ' వచ్చేసింది..!
కమల్హాసన్ , త్రిష జంటగా నటిస్తోన్న తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ హాసన్ జతకట్టారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. షుగర్ బేబీ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను అలెగ్జాండ్ర జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. (ఇది చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్)కాగా..ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో శింబు కీలక పాత్రలో కనిపించనున్నారు. శింబు సరసన సన్య మల్హోత్రా నటించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
మంచు మనోజ్ బర్త్ డే స్పెషల్.. భైరవం సాంగ్ రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మే 30న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇవాళ మంజు మనోజ్ పుట్టినరోజు కావడంతో భైరవం టీమ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. థీమ్ ఆఫ్ గజపతి పేరుతో పవర్ఫుల్ సాంగ్ను విడుదల చేసింది. ఈ పాటకు పూర్ణాచారి చల్లూరి లిరిక్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల, క్రాంతి కిరణ్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో అజయ్ రాజా, రవీంద్ర శరత్, సంపత్, సందీప్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
రామ.. రామ... రామ...
‘రామ... రామ..’ అంటూ యూట్యూబ్ వీక్షకులను చిరంజీవి అలరిస్తున్నారు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘విశ్వంభర’లోని ‘జై శ్రీరామ్... జై శ్రీరామ్... రామ... రామ... రామ..’ అంటూ సాగేపాట లిరికల్ వీడియోను ఏప్రిల్లో విడుదల చేశారు మేకర్స్.ఈపాట యూట్యూబ్ మ్యూజిక్లో 25+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, శ్రోతలను బాగా ఆకట్టుకుందని చిత్రబృందం పేర్కొంది. ‘‘జై శ్రీ రామ్’ అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్గా మారి, చార్ట్ బస్టర్గా నిలిచింది. చిరంజీవిగారి డ్యాన్స్ గ్రేస్, ఆస్కార్ విన్నర్ కీరవాణిగారి మ్యూజిక్, రామజోగయ్యశాస్త్రిగారి లిరిక్స్, భారీ సెట్... ఇలా ఈపాట అన్ని విధాలుగా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తోంది. మున్ముందు ఈపాట మరింత పెద్ద హిట్ అవుతుందని ఊహిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
'చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం.. శ్రీదేవి వల్ల ఆ సాంగ్ చేయాల్సి వచ్చింది'
తెలుగు చిత్రసీమ చరిత్రలోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం విడుదలై 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. మే 9న ఈ చిత్రాన్ని గ్రాండ్గా రీ రిలీజ్ చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ నిర్మించారు.కాగా.. మే 9వ తేదీ 1990న జగదేక వీరుడు అతిలోక సుందరి థియేటర్లలో విడుదలైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా ఈ సినిమా తుడిచిపెట్టేసింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ అనేలా ఈ మూవీ నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు దాని క్రేజ్ గురించి ఒక్క మాటలో ఓ ఉదాహరణగా చెప్పాలంటే.. రూ. 6 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్లో రూ. 210 వరకు అమ్మేశారట. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు అన్నమాట. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలోని ఎవర్ గ్రీన్ సాంగ్ అబ్బనీ తీయని దెబ్బ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. 'ఈ పాటను ఒక రోజులోపు కంపోజ్ చేశామని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇళయరాజా ఉదయం 9 గంటలకు ఆ పాటపై పని చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 లేదా 12:30 గంటల ప్రాంతంలో బాగుందా? లేదా వినండి అంటూ ఇళయరాజా మాకు ఒక ట్యూన్ ఇచ్చారు. అది రాఘవేంద్రరావు, అశ్వనీదత్తో పాటు నాకు వెంటనే నచ్చింది. ఆ ట్యూన్ ఎంతో సింపుల్గా, తియ్యగా అనిపించింది. భోజన సమయంలో వేటూరి సాహిత్యం రాశారు. బాలు, చిత్ర గారు అలా సరదాగా పాడేశారు'అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ‘అందాలలో’ అనే పాట గురించి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. 'కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు, హీరోయిన్ ఒక దేవత అని చెప్పాల్సి వచ్చింది. దానిని పాట ద్వారా మాత్రమే సమర్థవంతంగా తెలియజేయగలమని మేము భావించాము. ఆ ఐకానిక్ పాటను కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన అదే' అని అన్నారు.‘దినక్కుతా’ అనే పాట గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ .. ‘ఈ పాటను షూట్ చేసే టైమ్కి చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ప్రతి షాట్ బ్రేక్ సమయంలో.. మేము అతని శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం. శ్రీదేవి కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఆయన ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత, ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళ్లనుంది. మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు’ అని అన్నారు.శ్రీదేవి గతంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ గురించి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో తనకు ఇష్టమైన పాట ‘ప్రియతమ’ సాంగ్ అని అన్నారు. అది చాలా అందమైన మెలోడీ. రాఘవేంద్రరావు దానిని ఎక్కువ మూమెంట్స్ లేకుండా కేవలం కంటి చూపులు, సైగలతోనే కంపోజ్ చేయించారు. అది మరపురాని పాట అని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్లు అజయన్ విన్సెంట్, కె.ఎస్. ప్రకాష్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ‘మాస్ట్రో’ ఇళయరాజా ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీకి కథను యండమూరి వీరేంద్రనాథ్.. స్క్రీన్ప్లేను జంధ్యాల అందించారు. ఈ వేసవిలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాజాలాన్ని మే 9న 2డీ, 3డీ ఫార్మాట్లలో చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) -
పవన్ కల్యాణ్ హీరోగా కొత్త చిత్రం.. సాంగ్ రిలీజ్ చేసిన తండేల్ డైరెక్టర్
పవన్ కల్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా 'ఏ స్టార్ ఈజ్ బార్న్'. ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి హీరోయిన్లుగా టాలీవుడ్కు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు వీజే సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సీఆర్ ప్రొడక్షన్స్, వీజే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై రవి సాగర్, వీజే సాగర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని "నా గతమే' అనే పాటను తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ... "నా గతమే సాంగ్ బాగుంది. పోస్టర్స్, ప్రోమోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో దాదాపు 93 మంది కొత్త నటీనటులు ఉండడం విశేషం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. ఈ టీజర్కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్కు మరింత హైప్ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. నిమిషం పాటు ఉన్న ప్రోమోను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. హృదయం లోపల అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ సాంగ్ను మే 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. -
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
సింగర్ ప్రవస్తి చేసిన సంచలన ఆరోపణలపై ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత స్పందించారు. పాడుతా తీయగా సింగింగ్ షో సమయంలో తనను మెంటల్గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించింది. సునీతతో పాటు కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్పై కూడా విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలోనే సింగర్ సునీత ఈ అంశంపై మాట్లాడారు. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వ్యక్తిత్వం అనేది ఇలాంటి రూమర్స్పై నిర్మించబడలేదు..అంతేకాదు వాటి వల్ల మన ఖ్యాతి కూడా దెబ్బతినదు.. ఊహాగానాల కంటే నిజం గెలుస్తుందని మేము నమ్మకంగా ఉన్నామని పోస్ట్ చేసింది.సునీత మాట్లాడుతూ..'నమస్కారం. నిన్నంతా ఒకటే చర్చ.. అదే సింగర్ ప్రవస్తి.. రకరకాల ఛానెల్స్లో రకరకాలుగా వార్తలు ప్రచురించారు. ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానెల్స్కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. తాను మొత్తానికి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఛానెల్స్ వాడిన భాష.. తాను ఎక్స్పోజ్ చేయాలని చేసింది కాబట్టే ఆ పదం వాడాల్సి వస్తోంది. డైరెక్ట్గా సునీత అని నా పేరు చెప్పినందువల్లే ఈ వీడియో చేస్తున్నా. సింగర్ ప్రవస్తి.. నిన్ను అందరిలాగే నేను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. నీకు 19 ఏళ్లు కదా.. ఇప్పుడు నిన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా? చిన్నప్పుడు చాలా బాగా పాడావ్ అనేకంటే.. చాలా ముద్దుగా పాడావ్? అనేవాళ్లం నీకు గుర్తుందో లేదో? చిన్నప్పుడు పాడినట్టే 19 ఏళ్ల వయసులో కూడా పాడి ఉంటే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా ప్రణీత, మా గాయత్రి అని మీ పేర్లు ఎక్కువగా చెప్పుకుని మురిసిపోయే పిచ్చివాళ్లం మేము' అని అన్నారు.మీలో ఎవరైనా బాగా పాడితే ఉప్పొంగిపోయి, కన్నీళ్ల పర్యంతమైపోయి ఏడ్చేసినా సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు ఇవన్నీ చూడలేదేమో.. మిస్సయ్యావ్ అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు పెద్దదైపోయి.. రోడ్డుమీద నిలబడి తన బాధను వెళ్లగక్కుకుని..మా గురించి చర్చించే స్థాయికి ఎదిగిందంటే కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావ్.. ప్రవస్తి నీకు ఒక విషయం చెప్పాలమ్మా.. పాడుతా తీయగా కాంపీటీషన్ మాత్రమే కాదు.. విభిన్నమైన ఛానెల్స్లో కూడా పాల్గొన్నావ్ కదా? నీకు పద్ధతి గురించి తెలియదా అమ్మా? సింగర్ సెలెక్షన్స్, సింగర్స్ పంపించే పాటల విషయంలో కొన్నింటికీ మాత్రమే రైట్స్ ఉంటాయి. ఈ విషయం నీకు తెలుసో.. తెలియదో నాకు తెలియదు కానీ.. చెప్తే అన్ని విషయాలు చెప్పు. ప్రాసెస్ గురించి కూడా మాట్లాడు.. ఆ సాంగ్ సెలెక్షన్స్లో ఛానెల్కున్న నిబంధనల గురించి మాట్లాడమ్మా? నేను కూడా సంతోషిస్తాను. ఏ ఛానెల్కైనా మ్యూజిక్ వాడుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అన్ని పాటలకు ఉండదు. సింగర్స్ ఇచ్చే సాంగ్స్ లిస్ట్లో ఎన్నిసార్లు ఆ పాట రిపీట్ అయింది అనేది కూడా యాజమాన్యం చూస్తుంది. ఇదంతా నీకు మళ్లీ వివరిస్తారు. నేను ఏ పాట ఇచ్చినా వాళ్లు వద్దంటున్నారు అనే మాటనే ఎక్కువసార్లు వినిపించావ్. దానికి రీజన్ ఇది అని మీకు తెలియదు కదా? అందుకే నేను చెబుతున్నా. నిన్ను కొరకొరగా చూశానని చెప్పావ్. నిన్ను అలా చూడాల్సిన అవసరమేంటో నాకర్థం లేదు. నేను, కీరవాణీ, చంద్రబోస్ గారు నిన్నే టార్గెట్ చేశారన్నావ్? కనీసం ఆ ఆలోచన కూడా నాకు రావడం లేదు.సునీత మాట్లాడుతూ..' నువ్వు మర్చిపోయిన కొన్ని విషయాలు నేను ఇప్పుడు గుర్తు చేస్తాను. క్లాసికల్ రౌండ్లో నీ దగ్గరికి వచ్చి మరి అందరి మధ్యలో నీకు మాత్రమే చెప్పాను. నువ్వు పాడేటప్పుడు మృదంగం అటు ఇటు అయినా కూడా అప్సెట్ కావాల్సిన అవసరం లేదమ్మా..నువ్వు ఎలా పాడావో మా అందరికీ తెలుసు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో కానీ..మిగిలిన వాళ్లు గుర్తు పెట్టుకున్నారు. మిగిలిన వాళ్ల పేరు నువ్వు బయటికీ తీస్తున్నావ్ కానీ.. వీళ్లంతా మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా నువ్వు తప్ప. నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి.. నిహాల్ గారు మీకు గురువు.. అష్టలక్ష్మీ స్తోత్రం పాడేటప్పుడు నేను ఒక్కదాన్నే ఆ వీడియో షూట్ చేయొచ్చు తల్లీ.. నువ్వు బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావ్ కదా? నువ్వు, మీ మదర్ ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా పంపించాం కదా? అవన్నీ ఎలా మర్చిపోయావ్ తల్లీ? అని ప్రవస్తిని ప్రశ్నించింది.ప్రవస్తి నేను మీ అమ్మగారిని నువ్వు అని సంభోధించినందుకు నీకు బాధేసింది? ఎలిమినేషన్ తర్వాత మీ అమ్మ స్టేజిపైకి వచ్చి.. నీ చేతులో ఉండాల్సిన ట్రోఫీ కాదని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేశారు. నువ్వే మోసం చేశావ్? అని నన్ను మాట్లాడినప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? అక్కడ అన్ని రికార్డ్ అయ్యాయి. అవన్నీ బయటపెట్టొచ్చు. కానీ మీ అమ్మగారు, నువ్వు ఆవేశంలో ఉన్నారు. అప్పుడు కీరవాణి, చంద్రబోస్ గారు బయటికి వెళ్లిపోయారు. కానీ సునీత గారు నీ ఎలిమినేషన్ చూసేందుకే ఉన్నారని చాలా తప్పు మాట్లాడవమ్మా.. ఎవరైనా ఎలిమినేట్ అయితేనో.. ఎవరన్నా ఓడిపోతేనో సంతోషించే నీచమైన క్యారెక్టర్ నాది కాదు. నువ్వు ఎలిమినేట్ అయితే నేను పార్టీ ఇచ్చానని మాట్లాడుతున్నావ్.. అది నాకర్థం కావడం లేదు. నా జీవితంలో నేను చాలా కష్టాలు పడ్డాను. నువ్వు ఒకదాన్ని ఇంకొదానికి ఆపాదించి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఓ పోటీలోనైనా ఒక్కరే గెలుస్తారు. మా గురువులకు మాకు అదే నేర్పించారు. కానీ ఈ జనరేషన్లో మారాల్సి ఉంది. పిల్లలకు తల్లిదండ్రులే మంచి, చెడు నేర్పాలి. ఆ తర్వాతే గురువు. ప్రవస్తి నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా.. కాస్తా ఆలోచించి నిర్ణయం తీసుకుని మాట్లాడు. నేను ఎప్పటికీ నీ మంచినే కోరుకుంటా అంటూ ' సునీత మాట్లాడారు.' View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
బెట్టింగ్ భూతం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ ట్వీట్ వైరల్
బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు కృషిచేస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం ఎంత సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే.బెట్టింగ్ యాప్స్ మోజులో అనేకమంది యువత ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు సజ్జనార్. ఈ పోరు భాగంగానే తాజాగా ‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు అంటూ ఒక చక్కటి గీతాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.మన్మథుడు సినిమాలోని ‘వద్దురా.. పెళ్లొద్దురా ’ అనే సాంగ్ తరహాలో వద్దురా.. సోదరా.. బెట్టింగ్ జోలికి పోవద్దురా అంటూ ఇద్దరు గాయనీ మణులు ఒక పేరడీ సాంగ్ను పాడారు. దీన్ని సజ్జనార్ ట్వీట్ చేశారు.‘‘వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి. #SayNoToBettingApps @Cyberdost… pic.twitter.com/9DU8NNpCkv— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 22, 2025 ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు. బెట్టింగ్ యాప్స్ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి’’ అంటూ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ అవినీతిని, మెసాన్నీ కళ్లకు కట్టినట్టు ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా బెట్టింగ్ యాప్లలో డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడిన అనేక ఘటనలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలకలం రేపాయి. -
పుష్ప పాటకు సతీమణితో కేజ్రీవాల్ స్టెప్పులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట శుభకార్యం జరిగింది. కేజ్రీవాల్ కూతురు హర్షిత తన ఐఐటీయన్ స్నేహితుడిని వివాహమాడారు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది రాజకీయ సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో కేజ్రీవాల్ చేసిన సందడి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఢిల్లీలోని షాంగ్రీ లా ఎరోస్ హోటల్లో గురువారం కేజ్రీవాల్ కూతురి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ నేత మనీశ్ సిసోడియాలు హాజరయ్యారు. ఈ వేడుకలో పుష్ప 2 చిత్రంలోని ‘అంగారో కా అంబర్ సె’ పాటకు సతీమణి సునీతతో కలిసి కేజ్రీవాల్ హుషారుగా స్టెప్పులేశారు. #arvindkejriwal #dancevideo #delhiaap pic.twitter.com/1hObFExoGU— Khushbu Goyal (@kgoyal466) April 18, 2025జనాల గోల మధ్య కేజ్రీవాల్ వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప రాజ్గా అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ దక్కించుకున్నారో తెలియంది కాదు. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, ఆఖరికి పుష్ప మేనరిజం కూడా జనాలకు బాగా ఎక్కేసింది. మరోవైపు.. వివాహ కార్యక్రమానికి హాజరైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పంజాబీ స్టైల్లో చిందులేసి ఆకట్టుకున్నారు. Punjab CM Bhagwant Mann performing at the engagement ceremony of Kejriwal's daughter in Delhi.#Bhagwantmann #ArvindKejriwal pic.twitter.com/Vy9PqA4Teu— Raajeev Chopra (@Raajeev_Chopra) April 18, 2025పీటీఐ కథనం ప్రకారం.. అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత ఢిల్లీ ఐఐటీలో చదివారు. కాలేజీ రోజుల్లో స్నేహితుడైన సంభవ్ జైన్ ఇష్టపడి వివాహమాడారు. ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి బసిల్ హెల్త్ అనే స్టార్టప్ను కూడా నడిపిస్తున్నారు. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో కపుర్తలా హౌజ్లో వీళ్ల వివాహం జరిగింది. ఈ వేడుకకు కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఏప్రిల్ 20వ తేదీన రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
రొమాంటిక్ ప్రేమకథగా వస్తోన్న 'దూరదర్శని'.. సుకుమార్ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్
సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం దూరదర్శని. కలిపింది ఇద్దరినీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990 నేపథ్యంలో జరిగిన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా ఓరోరి మొండివాడా’ అంటూ సాగే బ్యూటిఫుల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటను సింధుజ, శ్రీనివాసన్ ఆలపించగా.. సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు.ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ 'ఈ సినిమా హీరో సువిక్షిత్ నా రూపం వచ్చేటట్లు వరిపొలంలో ఫామింగ్ చేశాడు. నాకు అప్పట్నుంచి పరిచయం ఉంది. తనకి సినిమా అంటే ప్యాషన్. సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి' అన్నారు.హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. 'నా అభిమాన దర్శకుడు, ఎంతో ఇష్టమైన వ్యక్తి సుకుమార్ చేతుల మీదుగా మా సాంగ్ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకొస్తాయి. ఈ లిరికల్ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది.1990వ నేపథ్యంలో అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో భద్రం, కృష్ణా రెడ్డి, కిట్టయ్య, చలపతి రాజు, జెమిని సురేష్, జి.భాస్కర్, భద్రమ్, లావణ్య రెడ్డి, తేజ చిట్టూరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి'.. మ్యాడ్ స్క్వేర్ ఫుల్ సాంగ్ చూశారా?
ఇటీవల యూత్ను ఫుల్గా అలరించిన కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో మెప్పించారు. గతంలో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ను అలరించింది.తాజాగా ఈ సినిమాలో క్రేజీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. స్వాతిరెడ్డి అంటూ సాగే పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్లో హీరోయిన్ రెబా మోనికా జాన్ తన డ్యాన్స్తో అదరగొట్టింది. ఈ పాటలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ స్టెప్పులతో అలరించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. రిలీజ్కు ముందే క్రేజ్ దక్కించుకున్న ఈ సూపర్ హిట్ సాంగ్ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. -
'ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్'.. లవ్ సాంగ్ వచ్చేసింది!
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్". ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి 'ఏదో ఏదో' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి పాడారు. ఈ ఫీల్ గుడ్ సాంగ్ టాలీవుడ్ అభిమానలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. -
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం గతేడాది దసరా కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. దేవర సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు.అయితే ఈ సినిమాలోని సాంగ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించాయి. ముఖ్యంగా చుట్టమల్లే, ఆయుధపూజ సాంగ్స్ అయితే సూపర్ క్రేజ్ను సొంతం చేసుకున్నాయి. దేవర పాటలకు రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ అలరించారు. అయితే ఈ సినిమాలోని రెడ్ సీ సాంగ్ బీజీఎం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఎర్ర సముద్రం బీజీఎం స్కోర్ ఓ రేంజ్లో ఆకట్టుకుంది.అయితే తాజాగా దేవర మూవీ రెడ్ సీ సాంగ్ను ఏకంగా శ్రీలంక ప్రెసిడెంట్ అనురా కుమార దిసానాయకే తన సోషల్ మీడియాలో వినియోగించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి స్వాగతం పలుకుతూ చేసిన ఓ వీడియోను ఆయన తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోకు దేవర రెడ్ సీ సాంగ్ బీజీఎంను జత చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఈ సీన్కు సరిగ్గా సరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మీకు అద్భుతమైన ఎడిటర్ ఉన్నారు సార్ అంటూ శ్రీలంక అధ్యక్షుడిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా మీ ఎడిటర్కు శ్రీలంక కరెన్సీ కాకుండా యూఎస్ డాలర్లలో చెల్లించండి అంటూ ఫ్యాన్స్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.కాగా.. దేవర పార్ట్-1 బ్లాక్బస్టర్ హిట్ కావడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. దేవర సీక్వెల్ అప్డేట్స్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. View this post on Instagram A post shared by Anura Kumara Dissanayake (@anurakumaraofficial) -
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్లైన్. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ధమాకా బ్లాక్బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. తాజాగా ఈ సినిమా నుంచి తు మేరా లవర్ అనే పాట రిలీజ్ చేశారు. 2002లో వచ్చిన ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటకు రీమిక్స్ చేసి దీన్ని రూపొందించారు. పాటే కాదు రవితేజ స్టెప్పులు కూడా రిపీట్ చేశాడు.ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫుల్ సాంగ్ ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. సామజవరగమన మూవీకి రైటర్గా పనిచేసిన భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. విధు అయ్యన్న సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. చదవండి: అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే -
విశ్వంభర.. రామరామ సాంగ్ ప్రోమో చూశారా?
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రామ రామ పాట ప్రోమో విడుదలైంది. చిరంజీవి నోటి నుంచి వచ్చిన జై శ్రీరామ్ నినాదంతో పాట మొదలవుతుంది. ఇందులో బాల హనుమాన్లు ముందు నడుచుకుంటూ వస్తుంటే అందులో ఒకరిని చిరు తన భుజాలపై ఎత్తుకుని నడుస్తున్నాడు. ప్రోమో అయితే అదిరిపోయింది. పూర్తి పాటను హనుమాన్ జయంతి (ఏప్రిల్ 12) రోజు ఉదయం 11.12 గంటలకు విడుదల చేయనున్నారు.అప్పుడే ఫుల్ సాంగ్ రిలీజ్..కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు. ఫుల్ సాంగ్ వినాలంటే రేపటివరకు ఆగాల్సిందే! విశ్వంభర విషయానికి వస్తే.. ఆంజనేయ స్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా, కునాల్ కపూర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. వాసుదేవ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చదవండి: -
అబ్కీ బార్.. అర్జున్ సర్కార్ అంటోన్న నాని.. హిట్-3 సాంగ్ వచ్చేసింది!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్-3. శైలేశ్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్ మూడో చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన హిట్, హిట్-2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచాయి. ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపుర్నేని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి అబ్కీ బార్.. అర్జున్ సర్కార్..అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ఈ పాటకు మిక్కీ జె మేయర్ సంగీతమందించారు. కాగా.. ఇప్పటికే రిలీజైన మెలోడి సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.Lil something to start the heat. Fireworks on 14th. All hell breaks loose on May 1st. #AbKiBaarArjunSarkaar full song is here. https://t.co/6URUQmtchs #HIT3 pic.twitter.com/z104cXigpE— Nani (@NameisNani) April 9, 2025 -
అజిత్ కుమార్ 'ఓజీ సంభవం'.. తెలుగు వర్షన్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ గురువారమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ తెలుగు, తమిళంలో ట్రైలర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇప్పటికే ఓజీ సంభవం పేరుతో తమిళంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రంపై అజిత్ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. -
మారుతీనగర్ సుబ్రమణ్యం హీరో లేటేస్ట్ మూవీ.. సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటిస్తోన్న తాజా చిత్రం బ్యూటీ. ఈ సినిమాకు భలే ఉన్నాడే ఫేమ్ జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్, వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి కన్నమ్మ అనే బ్యూటీఫుల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను సనారే రాయగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. ఇక విజయ్ బుల్గానిన్ సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. -
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్రాజ్ పోస్ట్ వైరల్!
శ్రీరామనవమి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా అదొక్కటే. అదే సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో కనిపించిన లవకుశ. ప్రతిష్టాత్మకమైన ఈ ఫెస్టివల్ వచ్చిందంటే టీవీల్లో లవకుశ సినిమా చూసేయాల్సిందే. ఈ చిత్రంలో ముఖ్యంగా రామకథను వినరయ్యా అంటూ లవకుశలు పాడే పాట హైలెట్. ఈ పాటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. శ్రీరామనవమి రోజున ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తుంది. ఇంతలా ప్రాముఖ్యత ఉన్న ఈ పాటను పాడిందెవరో తెలుసా? అలనాటి సింగర్స్ సుశీల, లీల.అయితే ఇవాళ శ్రీరామనవమి కావడంతో మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయితే టాలీవుడ్ నటుడు ధన్రాజ్ పండుగ వేళ ఈ పాటకు వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చిన లవకుశ చిత్రంలోని పాటను పాడింది వీరిద్దరు అక్కా చెల్లెళ్లు అంటూ సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు నెటిజన్స్ పాట పాడింది వీరు కాదంటూ కామెంట్స్ చేశారు.ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న ధన్రాజ్.. తాను పెట్టిన పోస్ట్కు క్షమాపణలు చెప్పాడు. ఈ పాట పాడింది వీరిద్దరు కాదు.. పి సుశీల, పి. లీల గార్లు.. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సారీ అంటూ మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే ధనరాజ్ ఇటీవలే రామం రాఘవం చిత్రంతో అభిమానుల ముందుకొచ్చారు. హీరోగా నటిస్తూ.. తానే దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు.లవకుశ సినిమలో పాడింది p. సుశీలమ్మ,, లీల గార్లు sorry for wrong information 🙏🏿— Dhanraj koranani (@DhanrajOffl) April 6, 2025 -
జాట్: ఓరామ శ్రీరామ సాంగ్ రిలీజ్
బాలీవుడ్ హీరో సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాట్. ఈ చిత్రంతో టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. నేడు (ఏప్రిల్ 6) శ్రీరామనవమి కావడంతో జాట్ మూవీ నుంచి ఓ రామ శ్రీరామ పాట రిలీజ్ చేశారు. పవర్ఫుల్ మ్యూజిక్తో ఆకట్టుకుంటున్న ఈ పాటకు థమన్ సంగీతం అందించాడు. అద్వితీయ వొజ్జల, శృతి రంజని సాహిత్యం అందించగా ధనుంజయ్ సీపన, సాకేత్ కొమ్మజోస్యుల, సుమానస్ కసుల, సాత్విక్, వాగ్దేవి కుమార ఆలపించారు. చదవండి: 'జాట్' తెలుగు వర్షన్కు ఇబ్బంది ఏంటి..? -
మారిపోయిన మనిషిని గుర్తు చేసేలా ‘అరి’ థీమ్ సాంగ్
‘పేపర్ బాయ్’ఫేం జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక.వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్.ఇప్పటికే ఈ చిత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలకు చూపించగా..వారంతా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఈ తరం తప్పకుండా చూడాల్సిన సినిమా అని సూచించారు. ఇక తాజాగా ఈ చిత్రం థీమ్ సాంగ్ని విడుదల చేశారు మేకర్స్.‘మషినేనా నువ్వు..ఏమై పోతున్నావ్.. మృగమల్లే జారీ..దిగజారిపోయావ్’ అంటూ సాగే ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. షణ్ముఖ ప్రియ అద్భుతంగా ఆలపించింది. ఇక అనూప్ రూబెన్స్ తనదైన సంగీతంతో పాటను మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమాలోని కీలక పాత్రలన్నింటిని పరిచయం చేస్తూ.. అసలు ఈ సినిమా కథేంటి? ఎం సందేశం ఇవ్వబోతుందనే విషయాలను తెలియజేలా థీమ్ సాంగ్ ఉంది. ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని చిత్రబృందం పేర్కొంది. -
కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. 'నాయాల్దీ' వచ్చేసింది!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. నాయాల్ది అంటూ సాగే మాస్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘు రామ్ లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, సోనీ కొమండూరి ఆలపించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
గోదారిగట్టు, బుజ్జితల్లి.. ఇప్పుడు ప్రేమలో.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది
కొన్ని సాంగ్స్ వింటే పదే పదే వినాలనిపిస్తుంది. అంతేకాదు డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అలాంటి పాటలు ఇటీవల తెలుగు సినిమాల్లో అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి గోదారి గట్టు సాంగ్, అలాగే తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి సాంగ్ సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎక్కడ చూసిన ఈ పాటలకు ఆడియన్స్ కాలు కదిరాపు. దీంతో ఈ రెండు పాటలకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది కొంతమంది ఏకంగా ఈ పాటలకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలా ఇదే జాబితాలో మరో హిట్ సాంగ్ వచ్చి చేరింది. అదేనండి ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తోన్న కోర్ట్ మూవీ సాంగ్. ఇంకేంటీ మీకోసమే తాజాగా ఫుల్ సాంగ్ కూడా వచ్చేసింది. మరెందుకు ఆలస్యం చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!)ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం కోర్ట్(Court: State Vs Nobody). కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్టాక్తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 28.9 కోట్లు రాబట్టింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ వల్ల బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
'వచ్చార్రోయి.. మళ్లొచ్చార్రోయ్..వీళ్లకు హారతి పట్టండ్రోయ్'
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తున్నారు. గతంలో మ్యాడ్ మూవీతో ప్రేక్షకులకు మ్యాడ్నెస్ తెప్పించిన వీళ్లు.. మరోసారి అంతకుమించి ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ సినిమాకు కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ను తెరకెక్కించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం యూత్పుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెలలోనే థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.(ఇది చదవండి: రెట్టింపు వినోదంతో 'మ్యాడ్2' టీజర్)ఇప్పటికే 'మ్యాడ్ స్క్వేర్' నుంచి విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు కూడా ఆడియన్స్ను ఊపేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ 'వచ్చార్రోయ్' ఆడియన్స్కు మరింత గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో తనదైన ప్రత్యేక శైలి సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. "ఏసుకోండ్రా మీమ్స్.. చేసుకోండ్రా రీల్స్.. రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్" లాంటి లిరిక్స్తో అందరినీ అలరించేలా ఉంది.కాగా.. ఈ పాటకు కేవీ అనుదీప్ లిరిక్స్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో ఆలపించారు. తాజాగా విడుదలైన సాంగ్ ప్రేక్షకులకు జోష్ తెప్పిస్తోంది. కాగా.. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది. They are back to come and rock 😎🔥#Vaccharroi is out now to celebrate the arrival of the MAD TRIO ❤️🔥— https://t.co/563V9p6Z0GA double dose of Seetimaar madness and a euphoric experience awaits on the Big Screens 💥💥#MADSquare in cinemas worldwide from MARCH 28th! 🕺🥳… pic.twitter.com/75udzExUF9— Sithara Entertainments (@SitharaEnts) March 18, 2025 -
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓజీ సంభవం పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా.. ఈ యాక్షన్ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. Maameyyyyy!!!The Blast is here 💥💥#OGSambavam from #GoodBadUgly 🔥🔥https://t.co/FWr6nWOpB5In cinemas April 10th.— Mythri Movie Makers (@MythriOfficial) March 18, 2025 -
వరుణ్ సందేశ్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
వరుణ్ సందేశ్, మధులిక జంటగా చిత్రం కానిస్టేబుల్. ఈ మూవీకి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్పై బలగం జగదీష్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ మూవీ నుంచి 'మేఘం కురిసింది' అనే క్రేజీ సాంగ్ను విడుదల చేశారు. హైదరాబాద్లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..' శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైxof. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ప్రేక్షకుల ఆదరణ పొందాలి. సినీ పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని.. వారిని ప్రోత్సహించాలని' సూచించారు.సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీశ్, నాయకులు జగ్గయ్య, రమణ పాల్గొన్నారు.


