breaking news
Crime News
-
అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
హైదరాబాద్: నిత్యం తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.. వారి కూతుళ్లు విసిగి వేసారిపోయారు.. సొంతూరికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బతుకుదామని భావించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలెక్కారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఆదివారం గాందీనగర్ ఏసీపీ కార్యాలయంలో సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ యాదగిరి, దోమలగూడ సీఐ అంజద్ అలీతో కలిసి వివరాలు వెల్లడించారు.ఛత్తీస్గఢ్కు చెందిన తోటరాం, రాంధులారి దంపతులు 2 నెలల క్రితం నగరానికి వలస వచ్చి దోమలగూడ ఫరీద్ బస్తీలో నివసిస్తున్నారు. హిమాయత్నగర్లోని ఓ హోటల్లో పనిచేస్తున్నారు. ఆ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో భరించలేక వారి కుమార్తెలు సహిత కుమారి(17), స్నేహ కుమారి(16)తోపాటు సమీప బంధువైన లత(15) గత ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఇంట్లోంచి పారిపోయారు. పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాదాపు 262 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు.రైలెక్కి.. ఛత్తీస్గఢ్ చేరి..హిమాయత్నగర్ మెయిన్ రోడ్లో ఆటో ఎక్కిన బాలికలు కాచిగూడ రైల్వేస్టేషన్కు, అక్కడ నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఘన్పూర్ ఎక్స్ప్రెస్లో నాగ్పూర్ చేరుకోగా ఓ వ్యక్తి చేరదీసి ఫాంహౌస్లో పనులు చేసేందుకు గడ్చిరోలి మీదుగా ఛత్తీస్గఢ్లోని పతంజూరుకు చెందిన బిశ్వజిత్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు గుర్తించిన బిశ్వజిత్ దోమలగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఛత్తీస్గఢ్లోని కాంకర్ పోలీసుల సహకారంతో బాలికలను తీసుకొచ్చి సఖీ సెంటర్కు అప్పగించారు. తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో పిల్లల్ని పెంచాలని డీసీపీ సూచించారు. -
ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్ కుమార్కు డీఎన్ఏ పరిక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్కుమార్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది.అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్కుమార్కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. -
అబిడ్స్లో యువకుడి వీరంగం! కారుతో నేరుగా పోలీసుల పైకే..
హైదరాబాద్: గత కొన్నిరోజులనుంచి డ్రగ్స్ డీల్ సమాచారంతో అబిడ్స్లో పోలీసులు నిఘా పెడ్తున్నారు. అయితే, ఈరోజు సోమవారం ఉదయం తెల్లవారుజామున, ఓ యువకుడు బలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకుడు కారుతో నేరుగా పోలీసులపైకి దూసుకెళ్లాడు. ప్రమాదంనుంచి తప్పుకునేలోపు నిందితుడు కారును రివర్స్లో తీసి పోలీసులపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్కు గాయాలు కాగా, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అయినాసరే వారి గాయాలను లెక్కచేయకుండా పారిపోతున్న నిందితుడు సైఫ్ను పోలీసులు ఛేజ్చేసి పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం దగ్గరలో ఉన్నటువంటి యశోధ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స పొందుతున్నారు. అయితే, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ ఫిర్యాదుతో నిందితుడిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగం నిందితుడిని విచారిస్తున్నట్లుగా తెలిసింది. -
మరిది వేసిన మాస్టర్ప్లాన్! కథ అడ్డం తిరిగింది..
కరీంనగర్, జగిత్యాల: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక రచించిన మరిది, అతని భార్య, సమీప బంధువులను ఇప్పటికే రిమాండ్కు తరలించగా.. తాజాగా మరో నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్వర్మను అరెస్ట్ చేశారు. మెట్పల్లి సర్కిల్ ఆఫీస్లో డీఎస్పీ రాములు శుక్రవారం వివరాలు వెల్లడించారు.జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, రాజం అన్నదమ్ములు. పొత్తుల ఉన్న 58 గుంటల భూమిని శంకర్ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా పొత్తులో ఉన్న ఇంటిని సైతం తన పేరిట రిజి స్ట్రేషన్ చేయించుకోవడం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈక్రమంలోనే రెండు సార్లు శంకర్ తన అన్నవదినలు రాజం, లక్ష్మిలపై దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఆస్తిని దక్కించుకునేందుకు తన వదిన గోనెల లక్ష్మిని హత్య చేయాలని భార్య అనూష, బంధువు ముత్తన్నలతో కలిసి పథకం రచించాడు.తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన సచిన్వర్మను సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్ గత మార్చిలో ప్రయాగ్రాజ్కు వెళ్లి అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీని కోసం శంకర్ రూ.35వేలు ఫోన్పే ద్వారా సచిన్కు పంపించాడు. సచిన్వర్మ మెట్పల్లికి తిరిగి వచ్చిన తర్వాత గత నెల 13న లక్ష్మిని చంపడానికి వారి ఇంటికి వెళ్లిన సచిన్ భయాందోళనకు గురై కాల్పులు జరపకుండా వెళ్లిపోయాడు.తిరిగి 15న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురి ప్రోద్బలంతో సచిన్ బైక్పై వెళ్లి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్ ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పులతో భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్ పరారయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సచిన్ను ఉత్తరప్రదేశ్కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మరుసటి రోజు శంకర్, ముత్తన్న.. 28న అనూషలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసిన తర్వాత బుల్లెట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఈనెల 20న ప్రయాగ్రాజ్కు వెళ్లి సచిన్ను అదుపులోకి తీసుకొని.. పిస్టల్, రెండు బుల్లెట్స్, బైక్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సురేశ్బాబు, ఎస్సై కిరణ్కుమార్, సిబ్బందిని అభినందించారు. -
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఆదిలాబాద్, మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు జరిపారు. ఈ దాడుల్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అయితే, గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. నిలువ ఉంచబడిన సుమారు 1,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 9 మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా నిర్మూలనపై.. ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే, ఇలాంటి కార్యకాలపాలు చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొన్నవద్దని వారికి చెప్పడంతోపాటు, గుడుంబా తయారీలో పాల్లొన్నవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను ఏసీబీ హెచ్చరించారు. -
5వ అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వైద్య విద్యార్థిని 5వ అంతస్తు నుంచి దూకి మృతిచెందిన సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఆనందచారి, తన భార్య అరుణ, పిల్లలతో కలిసి నాగారం వెస్ట్ గాం«దీనగర్ భవానీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వారి కుమార్తె దీక్షిత (28) ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పైచదువుల నిమిత్తం ఆరు నెలల కిందట కర్ణాటకలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో చేరి పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 17న నాగారంలోని ఇంటికి వచి్చంది. శుక్రవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను స్థానికంగా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని, ఎలాంటి అనుమానాలు లేవని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'చదవడం' నావల్ల కాదన్నా వినిపించుకోరేం?
ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా... పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా.. చేతగాని వారంతా చావును వెతుక్కుంటున్నారు. తాజాగా మార్కుల ఒత్తిడి తట్టుకోలేక.. హాస్టల్లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకున్నాడు. హాస్టల్లో చేరిన గంటల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు. హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రొళ్ల మండలం చిగమతిగట్ట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నళినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్రేగౌడ్(18) అగళి మండలం ఇనగలూరు జెడ్పీ హైస్కూల్లో 385 మార్కులతో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో (ఎంపీసీ) చేరినా అక్కడ ఉండటం ఇష్టంలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చంద్రేగౌడ్ను మడకశిరలోని వెంకటేశ్వర కళాశాలలో చేర్పించారు.రోజూ ఇంటివద్దనుంచే కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 399 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కళాశాలలోని హాస్టల్లోనే ఉంచితే చదువుకునేందుకు సమయం ఉంటుందని, మార్కులు కూడా పెరుగుతాయని భావించిన కుటుంబీకులు ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఇష్టంలేకపోయినా చంద్రేగౌడ్ ఒప్పుకున్నాడు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం లగేజీతో హాస్టల్కు వచ్చిన చంద్రేగౌడ్.. రాత్రి వేళ హాస్టల్లోని వాష్రూంకు వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు.గురువారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి దూరంగా ఉంటూ ఒత్తిడితో కూడిన చదువులు తనకు ఇష్టంలేదని చంద్రేగౌడ్ తరచూ చెప్పేవాడని, ఈక్రమంలోనే చదవలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం చెందాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. చంద్రేగౌడ్ మృతితో స్వగ్రామం చిగమతిగట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మడకశిర ఎస్ఐ కృష్ణారెడ్డి కళాశాల హాస్టల్కు వెళ్లి వివరాలు సేకరించారు. కళాశాల యాజమాన్యం, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దొరికినంత దోచుకో.. తోటి పోలీసుల సొమ్ముతో కారు, బంగ్లా..!
దొరికినంత దోచుకో.. దోచుకుంది దాచుకో..కారు, బంగ్లా తీసుకో.. లైఫు నీదే కుమ్ముకో.. ఓ సినిమా పాటలోని అర్థాన్ని కానిస్టేబుల్ రవి తన జీవితాన్ని అన్వయించుకున్నాడు. ఎంచక్కా తోటి సిబ్బంది సొసైటీ ఖాతాల్లోని డబ్బులతో జల్సా చేస్తున్నాడు. కడప అర్బన్: శాంతిభద్రతలను కాపాడుతూ, సమాజంలో నేరాలను అరికట్టాల్సిన పోలీస్ శాఖలోనే ఒక పెద్ద అవినీతి తిమింగలం తిష్టవేసింది. తోటి సిబ్బంది దాచుకున్న రక్తాన్ని, కష్టార్జితాన్ని నమిలి మింగేసింది. జిల్లా పోలీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఏకంగా రూ.1,07,00,000 (కోటి ఏడు లక్షలు) నిధులు నిలువునా స్వాహా అయిన వైనం జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ దందా బయటపడి రోజులు గడుస్తున్నా.. ఉన్నతాధికారులు విచారణ పేరిట కాలయాపన చేయడం, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. పిల్లల చదువుల కోసం పెడితే.. బినామీ ఆస్తులకు వాడుకున్నారు! గతంలో కడప ఎస్పీగా పనిచేసిన మనీష్ కుమార్ సిన్హా హయాంలో పోలీసులు తమ అత్యవసర అవసరాల కోసం ఈ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసుకుని సభ్యత్వం తీసుకున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్యం వంటి అత్యవసర సమయాలలో ఈ సొసైటీ నుంచి లోన్లు తీసుకుని, మరలా వాయిదాల పద్ధతిలో కట్టుకునేలా నిబంధనలు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం పద్ధతి ప్రకారం జరిగి ఉంటే ఎవరికీ నష్టం కలిగేది కాదు. కానీ, ఈ సొసైటీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన వి.రవి (పీసీ 3275) ఈ భారీ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇతనికి కొంతమంది ఉన్నతాధికారులు, సిబ్బంది తమ వంతు సహకారాన్ని అందించినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ రవి 2020 సంవత్సరానికి ముందు సాధారణ జీవితాన్ని గడిపేవాడని, సొసైటీ ఏర్పాటైన తర్వాత వచ్చిన డబ్బుతో ప్రస్తుతం కడప నగరంలో ఒక భారీ భవనాన్ని నిర్మించుకున్నాడని, ఒకే ఫ్యాన్సీ నంబర్ కలిగిన ద్విచక్ర వాహనం, లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆ కానిస్టేబుల్ అవినీతి పలుకుబడికి పరాకాష్టగా మారిందని తోటి సిబ్బంది మండిపడుతున్నారు. ఆర్టీఐ కానిస్టేబుల్పై ఎస్పీ సీరియస్? సొసైటీలో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై అనుమానం వచ్చిన ఒక బాధిత కానిస్టేబుల్.. ధైర్యంగా ముందుకొచ్చి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ గోల్మాల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆర్టీఐ ప్రకారం తనకు వివరాలు తెలియజేయాలని దరఖాస్తు చేసుకున్న సదరు కానిస్టేబుల్ పై ప్రస్తుత జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సీరియస్ అయినట్లు సమాచారం. దాదాపు రెండు నెలల క్రితం బాధితుడైన ఆ కానిస్టేబుల్ నేరుగా ఎస్పీని కలిసి తనకు పూర్తి వివరాలు కావాలని, తమ సొమ్ము తమకు ఇప్పించాలని కోరారు. సదరు కానిస్టేబుల్ విజ్ఞప్తిని స్వీకరించి, విచారిస్తామని చెప్పి రెండు నెలల పైగా గడుస్తున్నా.. ఇప్పటివరకు ఏమాత్రం విచారణ చేయకపోవడం గమనార్హం. మా డబ్బు మాకు వచ్చేదెప్పుడు? ఆధారాలతో సహా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోంది? మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అని బాధిత కానిస్టేబుళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటి సిబ్బంది కష్టార్జితాన్ని కాజేసిన పీసీ రవి, అతనికి సహకరించిన వారిపై ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్రంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, అతను స్వాహా చేసిన డబ్బును వెనక్కి ఇప్పించేలా కృషి చేయాలని పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో డిపార్ట్మెంట్లో ఇలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
6 మందిని లేపేసింది.. కానీ ఉరిశిక్ష తప్పించుకుంది..
-
10వ అంతస్తునుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..
హైదరాబాద్, మణికొండ: అపార్ట్మెంట్ 10వ అంతస్తునుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఫైనాన్షియల్ జిల్లా పుప్పాలగూడలో జరిగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జేపీ మోర్గాన్ చేజ్ అనే ఐటీ సంస్థలో మబ్బు విష్ణువర్దన్రెడ్డి(27) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఏఎస్బీఎల్ స్పెక్ట్రా అపార్ట్మెంట్ 10వ అంతస్తులోని తన ఫ్లాట్కు వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం, దర్యాప్తు అనంతరం వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. -
కలకలం రేపిన సగం కాలిన మృతదేహం..
విశాఖపట్నం: గోపాలపట్నం, కొత్తపాలెంలోని పులగానిపాలెం పాత ఊరు సమీపంలో రైల్వే ట్రాక్ దాటాక నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహం ఘటన బుధవారం కలకలం రేపింది. గుర్తుతెలియని, సుమారు 35–40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం సగం కాలి, చెట్టు కింద పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి వీఆర్వో సుబ్బారావుకు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐలు మారయ్య, రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్ద కాలిపోయిన మొబైల్, కళ్లజోడు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వేలిముద్రలను కూడా సేకరించారు. అనంతరం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ మృతుడు ట్రాక్ ప్యాంటు, రౌండ్ నెక్ టీషర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహం పరిస్థితిని బట్టి ఘటన మంగళవారం రాత్రి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, వేరే చోట హత్య చేసి, ఆధారాలు చెరిపివేసేందుకు ఇక్కడ కాల్చి ఉండొచ్చన్న అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుడి గుర్తింపుతో పాటు ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు మొబైల్ ఫోన్ ఆధారాలు, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీఆర్వో సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.మద్యం, గంజాయి కార్యకలాపాలకు అడ్డాఘటన జరిగిన పులగానిపాలెం పాత ఊరు–రైల్వే కల్వర్టు పరిసర ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడ తరచూ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతానికి రావాలంటే స్థానికులు కూడా భయపడే పరిస్థితి ఉందన్నారు. పోలీసుల నిఘాను మరింత పెంచాలని కోరుతున్నారు. -
గర్భిణి అని కూడా చూడకుండా..
ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య: పైళ్లెన పది నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తంబళ్లపల్లె మండలంలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లి దండ్రులు తంబళ్లపల్లె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు... కోటకొండ పంచాయతీ, బీఎస్ఆర్ వడ్డిపల్లికి చెందిన మహేష్, రవళి (18)ని 10 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పైళ్లెన మూడు నెలల నుంచే అత్త అరుణ వేధింపులు ప్రారంభించింది. దీంతో రవళి తీవ్ర మనోవేదనకు గురైంది.గర్భిణి అని కూడా చూడకుండా..రవళి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. అయినప్పటికీ అత్త అరుణ వేధింపులకు గురిచేసేది. వేధింపులు భరించలేక రవళి ఈనెల 15 ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు చికిత్సలు అందించి పరిస్థితి విషమించడంతో రుయాకు రెఫర్ చేశారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకు వచ్చారు. బుధవారం ఉదయం నాలుగు నెలల గర్భిణి రవళి మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె ఎస్ఐ అనీల్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్పోర్ట్ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్తో కలిసి కేతన్ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
నెలక్రితం ఆమె తలలో దిగింది బుల్లెట్టే..!
కరీంనగర్: మెట్పల్లి పట్టణానికి చెందిన గోనెల లక్ష్మీపై నెల క్రితం జరిగిన దాడి సంఘటనకు సంబంధించి ఆమె తలలో నుంచి బయటపడింది బుల్లెట్టేనని ఫోరెన్సిక్ విభాగం పరిశీలనలో తేలినట్లు తెలిసింది. ఆ రోజు సదరు మహిళను ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు కాల్చినట్లు గుర్తించిన పోలీసులు.. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని మూడురోజుల క్రితం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీలక నిందితుడైన యూపీ యువకుడు పట్టుబడడంతో కేసుపై ఉన్న అనుమానాలు తొలగిపోనున్నాయి.ఉపాధి కోసం వచ్చి..వెంట రివాల్వర్ తెచ్చుకుని..పట్టణంలోని మఠంవాడకు చెందిన గోనెల శంకర్కు జేసీబీ ఉంది. దానికి డ్రైవర్గా కొంతకాలం నుంచి ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు పనిచేస్తున్నాడు. అతడు ఇక్కడకు వచ్చేటప్పుడే తన వెంట రివాల్వర్ తెచ్చుకున్నట్లు తెలిసింది. శంకర్కు తన సోదరుడైన రాజం కుటుంబంతో ఆస్తి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 15న అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న రాజం భార్య లక్ష్మీపై శంకర్, అతని భార్య అనూష, బావమరిది ముత్తన్న యూపీ యువకుడితో కలిసి దాడి చేశారు.ఈ సంఘటనలో లక్ష్మీ తలకు తీవ్ర గాయం కాగా.. మొదట స్థానిక ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ తీయగా ఆమె తలలో ఇనుప ముక్క లాంటిది ఉందని తేలడంతో వైద్యులు శస్త్ర చిక్సిత చేసి తొలగించారు. ముందుగా తనపై కర్రతో దాడి చేశారని లక్ష్మీ చెప్పడంతో తొలుత మామూలు దాడి అని భావించిన పోలీసులు.. బయటపడింది ఇనుపముక్క బుల్లెట్లాగా ఉండడంతో కంగుతిన్నారు. తర్వాత దానిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. అది బుల్లెట్టేనని తేలడంతో దర్యాప్తు జరిపి ఆమెపై కాల్పులకు పాల్పడింది యూపీ యువకుడు అని నిర్ధారణకు వచ్చారు.దాడి తర్వాత యూపీకి పరార్..లక్ష్మీపై దాడి అనంతరం అదే రోజు సదరు యువకుడు యూపీకి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్ నివేదిక రావడంలో జాప్యం నెలకొనడంతో ఇనుప ముక్క విషయంలో స్పష్టత లేక ఇంతకాలం వేచి చూసిన పోలీసులు.. అది బుల్లెట్ అని ఫోరెన్సిక్ విభాగం తేల్చడంతో మూడు రోజుల క్రితం యూపీకి వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని మెట్పల్లికి తీసుకొచ్చినట్లు తెలిసింది. నెలకుపైగా మిస్టరీగా ఉన్న ఈ కేసు యువకుడు పట్టుబడడంతో మరో రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశముంది. -
టీచర్ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి..
తమిళనాడు: కన్యాకుమారి జిల్లా తక్కలై సమీపంలో స్నానం చేస్తున్న ఉపాధ్యాయురాలిని రహస్యంగా వీడియో తీసి, బెదిరించి బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు దానిని రికార్డ్ చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు కూడా సదరు టీచర్ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. తమిళనాడు కన్యాకుమారి జిల్లా తక్కలై సమీప ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల ఉపాధ్యాయురాలు మదురై హైకోర్టు బెంచ్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ‘‘నేను ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను. నా భర్త టెంపో డ్రైవర్. నేను నా ఇంటి బాత్రూమ్లో స్నానం చేస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన జయకాంతన్ అనే వ్యక్తి రహస్యంగా తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆ వీడియోను అడ్డం పెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేస్తూ, నిరంతరం వేధింపులకు గురిచేశాడు’’ అని ఆ పేర్కొన్నారు. నిందితుడు తనను భయపెట్టి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, అతని స్నేహితుడు కూడా ఈ విషయం తెలుసుకుని తనను వేధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆదేశాల మేరకు తక్కలై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై సమాచార సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం, బలవంతపు వేధింపులు ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
ఒంటరిగా వెళ్తున్నయువతిని ఎత్తుకెళ్ళి అత్యాచారం..!
కర్ణాటక: రాత్రి ఒంటరిగా వెళ్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతిని కారులో అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మైసూరు జిల్లాలోని టి. నరసిపుర తాలూకాలోని ముగురు గ్రామం వద్ద జరిగింది. ఈ కేసులో టి.నరసిపురలో బట్టల దుకాణదారు రిహాన్ ఖాన్, హౌసింగ్ బోర్డ్వాసి కిషోర్ కుమార్, హెలవర హుండి గ్రామానికి చెందిన కిరణ్ అలియాస్ హుచ్చాను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బెంగాల్కు చెందిన 30 ఏళ్ల యువతి, టి.నరసిపుర పట్టణంలో అద్దె ఇంట్లో నివసిస్తూ, ఒక చాట్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమె 19న రాత్రి పార్టీ ఉందంటే మైసూరులో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి బస్టాండులో దిగి నడిచి వస్తుండగా, కారులో వచ్చిన నిందితులు ఆమెను ఏదో చిరునామా అడిగారు, తనకు తెలియదని చెప్పగా, బలవంతంగా ఎక్కించుకున్నారు. పలు లాడ్జిలు తిప్పుతూ చివరకు ముగురు గ్రామం సమీపంలో ఉన్న ఒక లాడ్జికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్తో పాటు రూ. 5 వేలు దోచుకున్నారు. రూ.లక్ష ఇవ్వాలని బెదిరించి రూ.లక్ష ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారని బాధితురాలు తెలిపింది. డబ్బు ఇంట్లో ఉందని, తీసుకెళ్తే ఇస్తానని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారని ఆమె పేర్కొంది. బాధితురాలు కారు దిగి వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని సహాయం కోసం కేకలు వేసింది. దీంతో నిందితులు పారిపోయారు. ఇంటి యజమాని సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల ఆధారంగా కారును సీజ్ చేసి, నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి మంగళవారం తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ఆయనకు ఇద్దరు... చిన్నారిపై సవితి తల్లి దారుణం!
నిజామాబాద్, బాన్సువాడ: చిన్నారిపై హత్యాయత్నం చేసిన ఘటనలో తండ్రి, సవతి తల్లిని పోలీసులు రిమాండ్కు తరలించారు. సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ విఠల్రెడ్డి వివరాలు వెల్లడించారు. బీర్కూర్కు చెందిన టేకు సతీశ్కు ఇద్దరు భార్యలు. సతీశ్ మొదట శైలజను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆ తర్వాత శైలజ చెల్లి సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వైష్ణవి జన్మించింది. వైష్ణవి పుట్టినప్పటి నుంచి సతీశ్, శైలజతో గొడవలు జరగడంతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. వైష్ణవిని మాత్రం సతీశ్ తన వద్దనే పెంచుకుంటున్నాడు.ఈ నెల 15న ఉదయం చిన్నారి వైష్ణవి పొదల్లో రక్తమడుగుల్లో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం విషమంగానే ఉంది. అయితే, అక్క శైలజ తన కుమార్తెను హత్య చేయాలనే ఉద్దేశంతో బ్లేడ్తో దాడికి పాల్పడినట్లు సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాస్త్రీయ దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. వైష్ణవిని పోశించడం భారంగా మారడంతోపాటు కుటుంబంలో విభేదాల నేపథ్యంలో చిన్నారిని అడ్డు తొలగించాలని సతీశ్, శైలజ కుట్ర పన్నారు. 14న రాత్రి నిద్రిస్తున్న చిన్నారి వైష్ణవిని ఇద్దరూ కలిసి సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లి గడ్డి ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న బ్లేడ్తో గాయపర్చారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదని, గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చి వారితో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. చిన్నారి ఉన్న ప్రదేశం ముందుగానే తెలిసి కూడా అక్కడికి వెళ్లి కనిపించినట్లు చెప్పి ఎలాంటి అనుమానం రాకుండా బంధువులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచినట్లు గ్రామస్తులు, బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ పరిశీలన, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులు సతీశ్, శైలజ వద్ద రెండ్లు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ఛేదించిన బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులులను ఎస్పీ అభినందించారని ఆయన పేర్కొన్నారు. -
ఉదయ్ కృష్ణారెడ్డికి సీబీఐ మాజీ అధికారి అండ
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో హాట్ టాపిక్గా మారింది. మహిళా ఐపీఎస్ ప్రొబేషనర్ లైంగిక వేధింపుల ఆరోపణలు, కేసు నమోదు.. మనస్తాపం చెందిన ఉదయ్ అత్మహత్యాయత్నం చేయడం.. ఆపై సంచలన ఆరోపణలతో ఈ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై మాజీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు స్పందించారు.ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం జరగాలని కోరుతూ మన్నెం నాగేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరగకముందే ఒక అధికారి కెరీర్పై తీవ్ర ప్రభావం పడకూడదని, నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. తాత్కాలిక సస్పెన్షన్ను కూడా ఆయన తప్పుబట్టారు.కష్టాల నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణాన్ని ప్రస్తావించిన మన్నెం నాగేశ్వరరావు.. అతని ఎదుగుదల ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఉదయ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య అమ్మమ్మ సంరక్షణలో పెరిగారని తెలిపారు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఆయన.. జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా చేరారు. అయితే ఉన్నత లక్ష్యాన్ని వదులుకోకుండా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలతో చదివి ఐపీఎస్కు ఎంపిక కావడం అసాధారణ విజయమని, గ్రామీణ యువతకు ఆయన ప్రయాణం స్ఫూర్తిగా నిలుస్తుందని మన్నెం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.రెండు వాదనలు.. ఆధారాలే కీలకంప్రస్తుత వ్యవహారంలో రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయని మాజీ ఐపీఎస్ అధికారి పేర్కొన్నారు. మహిళా ప్రొబేషనర్ తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం తమ మధ్య సంబంధం పరస్పర అంగీకారంతో కొనసాగిందని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెబుతున్నారని వివరించారు. వ్యక్తిగత సంబంధం విఫలమైన తర్వాత ఏర్పడిన వివాదాలను పూర్తిగా నేరపరమైన కోణంలోకి తీసుకెళ్లే ముందు.. వాస్తవాలు, ఆధారాలను పరిశీలించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.సస్పెన్షన్పై ప్రశ్నలుఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిపై తీసుకున్న పరిపాలనా చర్యలపై కూడా మన్నెం నాగేశ్వరరావు ప్రశ్నలు లేవనెత్తారు. విచారణ పూర్తికాకముందే ఒక యువ అధికారి భవిష్యత్తు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకే ఘటనలో ఇద్దరు వ్యక్తులు భాగస్వాములైతే.. పరిపాలనా చర్యలు కూడా సమానంగా ఉండాలనే సూత్రాన్ని పాటించాలని పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.శిక్షణ సంస్థల బాధ్యతఐపీఎస్ అధికారులను తీర్చిదిద్దే ఎస్వీపీఎన్పీఏ కేవలం క్రమశిక్షణ అమలు చేసే సంస్థ మాత్రమే కాకుండా.. యువ అధికారులకు మార్గదర్శకత్వం, మానసిక సహకారం అందించే వేదికగా ఉండాలని మన్నెం నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఒక ఆరోపణ లేదంటే వివాదం కారణంగా ఒక అధికారి కష్టపడి సాధించిన కెరీర్ నాశనం కాకూడదని, విచారణ పూర్తయ్యే వరకు న్యాయ ప్రక్రియకు అవకాశం ఇవ్వాలని కోరారు.‘నిష్పక్షపాత విచారణ జరగాలి’ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో చట్టం తన పని తాను చేసుకోవాలని, అదే సమయంలో న్యాయం, సమానత్వ సూత్రాలు పాటించాలని మన్నెం నాగేశ్వరరావు కోరారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన యువ అధికారి విషయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా.. ఆధారాల ఆధారంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మన్నెం నాగేశ్వరరావు నేపథ్యం..మన్నెం నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. 1986 బ్యాచ్కు చెందిన ఆయన ఒడిశా క్యాడర్లో సేవలందించారు. సీబీఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన.. 2018లో సంస్థలో పరిణామాల సమయంలో తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు.. పోలీస్, దర్యాప్తు విభాగాల్లో కీలక అనుభవం ఉన్న అధికారిగా గుర్తింపు పొందారు. తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.Justice for Uday Krishna Reddy: A Case for FairnessThe allegations levelled by lady IPS probationer Suma H.K. against her co-trainee Uday Krishna Reddy at the Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA), Hyderabad, have ignited intense public debate.Currently,… pic.twitter.com/YSm2pb0pRS— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) July 21, 2026 -
కుక్కను వెతికిపెడితే రూ.10వేల బహుమతి
నల్గొండ, మిర్యాలగూడ: తన పెంపుడు కుక్కను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని ఓ వ్యక్తి సోమవారం మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిర్యాలగూడ పట్టణంలోని వినోభానగర్కు చెందిన గడ్డం నాగరాజు పెంచుకుంటున్న కుక్క ఈ నెల 18వ తేదీ నుంచి కనిపిండంలేదు. దీంతో అతడు కాలనీలో సీసీ కెమెరాలను పరిశీలించగా.. వినోభానగర్ చర్జి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కుక్కను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించాడు. కుక్క ఆచూకీ లభించకపోవడంతో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కుక్కను తీసుకొచ్చి ఇస్తే రూ.10వేల వరకు బహుమతిని ఇస్తానంటూ నాగరాజు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం విశేషం. -
కీచకుడిపై చట్టపరమైన చర్యలు
కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లు, ఆమె తల్లిపై ఘాతుకానికి పాల్పడిన కీచకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ‘సాక్షి’ పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కీచకుడి చేతిలో విలవిల’ కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, జిల్లా పోలీస్ శాఖ నుంచి నివేదిక కోరామన్నారు. జరిగిన నేరంపై ఆధారాలు లభ్యమయ్యాయని, ఫిర్యాదుతో నిమిత్తం లేకుండా నేరం చేసిన వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మిని వివరణ కోరగా, బాధిత కుటుంబంతో సహా బాధ్యుడిని తమ కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. బాధితులు జరిగిన ఘోరాన్ని వివరించి లిఖిత పూర్వకంగా నిర్ధారించారన్నారు. మైనర్లు, ఆమె తల్లిపై జరిగిన ఘాతుకం నిజమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాలికకు ఆరోగ్య పరీక్షలు, ఆమెకు చదువుకు ఏర్పాట్లు, నేరానికి పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు అనే మూడు అంశాలను సిఫారసు చేస్తూ కలెక్టర్కు నోట్ఫైల్ పంపామన్నారు. అలాగే ఎస్పీ బిందుమాధవ్కు వీరబాబు అనే బాధితుల బంధువు నుంచి మెయిల్ వచ్చిందని, ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని కాకినాడ త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు! -
రూ.25 లక్షల కార్ లోన్ తీసుకుని.. కారే అమ్మేసిన మోసగాడు
కర్ణాటక: నగరంలో రూ. 25 లక్షల బ్యాంకు రుణంతో కారు కొని, దానిని అక్రమంగా వేరొకరికి అమ్మేసిన రుణగ్రహీత ఉదంతమిది. వివరాలు.. మధు మోహన్ అనే వ్యక్తి సరస్వతీపురంలోని ఎస్బిఐ బ్యాంక్ శాఖ నుంచి రూ. 25 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో, రుణాన్ని వసూలు చేయడానికి బ్యాంకు సిబ్బంది మధు మోహన్ ఇంటికి వెళ్లినప్పుడు, అతను అందుబాటులో లేడు. పైగా కారును బ్యాంకు నుంచి అనుమతి తీసుకోకుండా, రవాణా అధికారుల నకిలీ సంతకాలతో రికార్డులను తారుమారు చేశాడు, ఆ కారును షకీబ్ మన్సూర్ అనే వ్యక్తికి అమ్మినట్లు తేలింది. దోషులపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది సరస్వతీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని బచేపల్లి గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ప్రయానిస్తున్న స్కార్పియో కారు ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయింది. ప్రమాదావశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో కారులో ఉన్నటువంటి భార్యభర్తలతో పాటు 4ఏళ్ల కూతురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు నాందేడ్ వాసులుగా తెలుస్తోంది. -
స్కూల్కు వెళ్తుండగా నడిరోడ్డులో విద్యార్థినిపై బుల్లెట్ల వర్షం.. మృతి
పట్నా: బిహార్లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన దారుణ ఘటన ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలకు వెళ్తున్న 15 ఏళ్ల విద్యార్థినిని రోడ్డుపైనే కాల్చి చంపాడు ఓ యువకుడు. సైకిల్పై ఆ అమ్మాయి కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను చంపాక నిందితుడు బైక్పై పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.బైక్పై వెంబడించి.. వరుసగా కాల్పులుమృతురాలిని పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సోనం కుమారిగా గుర్తించారు. సమాచారం ప్రకారం, సోనం ఎప్పటిలాగే ఉదయం సైకిల్పై పాఠశాలకు బయల్దేరింది. ఆమె మంగళ్ స్థాన్ సమీపానికి చేరుకున్న సమయంలో పల్సర్ బైక్పై వచ్చిన ఓ యువకుడు వెంబడించడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కేజియా వార్డు-13 సమీపంలో నిందితుడు ఆమె సైకిల్ను ఓవర్టేక్ చేసి ఎదురుగా వచ్చాడు. వెంటనే తుపాకీ తీసి వరుసగా కాల్పులు జరిపాడు. సోనంకు 4 బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఘటన తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న వైని పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) బృందం ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. సదర్ డీఎస్పీ-1 సంజయ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం లభించిందని చెప్పారు. ఆ సమాచారం ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేస్తున్నామని, నిందితుడిని త్వరగా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. -
బ్రేకింగ్ న్యూస్..సాయి కృష్ణ ఇంటికి సిట్ అధికారులు
-
టీచర్ను హోటల్కు తీసుకెళ్లిన జిమ్ ట్రైనర్.. ఆపై నిజస్వరూపం..
విజయవాడ: ఓ యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫొటోలు తీసినట్లు బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్పై కేసు నమోదు చేసిన సత్య నారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బాధిత యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్గా పని చేస్తోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యాడు. లావుగా ఉన్న టీచర్ స్లిమ్గా అయ్యేందుకు జిమ్ సలహాలు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రైవేట్ హోటల్కు తీసుకువెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడని ఆ టీచర్ తెలిపింది. మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించిన యువతి. కేసు నమోదు చేసి యువతిని పోలీసులు వైద్య పరీక్షల కోసం తరలించారు. జిమ్ ట్రైనర్ ఖాదర్ పరారీలో ఉన్నాడు. -
త్రిపుర డీజీపీ ఆత్మహత్య
అగర్తలా: త్రిపుర డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) అనురాగ్ ఠాకూర్(60) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన సొంత ఆఫీసు ఛాంబర్ బాత్రూంలో ఉరేసుకుని బలవన్మరణం చెందారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు. ఠాకూర్ మరణ వార్త విని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జేకే సిన్హా,, ఆరోగ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టె తదితరులు ఆస్పత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అనురాగ్ ఠాకూర్ మృతిపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ‘మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ అనురాగ్ ఠాకూర్ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు 12.48 గంటలకు ప్రకటించారు’అని గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రి మెడిసిన్ డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ ప్రదీప్ భౌమిక్ వివరించారు. పోస్టుమార్టం అనంతరమే ఠాకూర్ మృతికి దారి తీసిన కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన అనురాగ్ ఠాకూర్కు భార్య, కుమార్తె ఉన్నారు. మేలో డీజీపీగా నియమితులైన ఠాకూర్ మరో 11 నెలల్లో రిటైరవ్వాల్సి ఉంది. #BreakingNews | #Tripura Director General of Police (DGP) Anurag Dhankar was found dead at his office at the Police Headquarters in Agartala on Monday.Preliminary reports suggest that the senior IPS officer allegedly died by suicide. However, the exact circumstances surrounding… pic.twitter.com/ks4KYnOB6Z— NORTHEAST TODAY (@NortheastToday) July 20, 2026 కాగా, రాష్ట్ర పోలీస్ చీఫ్ ఆఫీసులోనే చనిపోవడంపై ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా సీనియర్ ఐపీఎస్ ఆత్మహత్య పాల్పడటాన్ని చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ఆయన తీవ్ర ఒత్తిడులకు గురయ్యారు. అవేంటో వెల్లడికావాలి. ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలి. మృతికి కారణాలను వెల్లడించాలి’అని జితేంద్ర చౌదరి డిమాండ్ చేశారు. డీజీపీ అనురాగ్ ఠాకూర్ మరణంపై మెజిస్టీరియల్ దర్యాప్తు జరుగుతోందని, నిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ అభిõÙక్ దేబ్రాయ్ తెలిపారు. -
‘రేర్ ఆఫ్ ది రేరెస్ట్’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు
కేరళలో సంచలనం సృష్టించిన నెన్మారా డబుల్ మర్డర్ కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడింది. తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసిన కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతమరాకు కోర్టు మరణశిక్ష విధించింది. అంతకు ముందు అదే కుటుంబంలోని వ్యక్తిని హత్య చేసిన చెంతమరా.. బెయిల్పై బయటకు వచ్చి జంట హత్యలకు పాల్పడడం గమనార్హం. దీంతో ఈ కేసు అత్యంత అరుదైన కేసుల (రేర్ ఆఫ్ ది రేరెస్ట్) పరిధిలోకి వస్తుందని భావించిన న్యాయస్థానం కఠిన శిక్షను ఖరారు చేసింది.పాలక్కాడ్ జిల్లా నెన్మారా పరిధిలోని పొతుండి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2025 జనవరి 27న సుధాకరన్ (55), ఆయన తల్లి లక్ష్మి (75)పై నిందితుడు చెంతమరా (Chenthamara) దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.భార్య దూరం కావడంపై అనుమానంతో.. చెంతమరా నేర చరిత్ర మొదలైంది 2019 ఆగస్టు 31న. ఆ రోజు అతను తన పొరుగింటి మహిళ సజిత (35)ను హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. తన భార్య, కుమార్తె తనను విడిచిపెట్టి వెళ్లడానికి సజిత కుటుంబం చేసిన చేతబడే కారణమని చెంతమరా అనుమానించాడు. ఈ అనుమానంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. బెయిల్పై బయటకు వచ్చాక ఘాతుకంసుధాకరన్ భార్య సజిత హత్య కేసులో అరెస్టైన చెంతమరా.. బెయిల్పై బయటకు వచ్చాడు. సరాసరి సజిత ఇంటికి వెళ్లి.. ఆమె భర్త సుధాకరన్, తల్లి లక్ష్మిలను హత్య చేశాడు. నేర తీవ్రత, హత్య చేసిన తీరు, బాధిత కుటుంబంపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ కేసును అత్యంత అరుదైన నేరంగా పరిగణించింది. సాధారణంగా జీవిత ఖైదు విధించే పరిస్థితుల్లో కాకుండా.. అరుదైన సందర్భాల్లో మాత్రమే విధించే మరణశిక్షను పాలక్కాడ్ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు–IV అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ (Kenneth George) ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.తీర్పుతో ముగిసిపోలేదా?నెన్మారా జంట హత్యల కేసు కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా కోర్టు తీర్పుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడికి అప్పీల్ అవకాశాలు ఉండనున్నాయి. -
వైద్యం వికటించి మహిళ మృతి
హైదరాబాద్, హయత్నగర్: వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనె తండా గ్రామానికి చెందిన మంజుల(25) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం శుక్రవారం రాత్రి హయత్నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత శనివారం వార్డుకు షిఫ్ట్ చేశారు.సాయంత్రం కడుపునొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. మంజుల మృతికి నీలాద్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. మృతురాలి తల్లి కొర్రా లక్ష్మీభాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్లో భారీ చోరీ.. కిలో బంగారం మాయం
బంజారాహిల్స్: ఓ ప్రైవేటు సంస్థ కార్యాలయంలో భద్రపరిచిన కిలో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఈడెన్ గార్డెన్లో ఉన్న గురుకృప ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో డైమండ్ ఫిక్సింగ్ కోసం సంస్థ లాకర్లో భద్రపరిచిన 1028.59 గ్రాముల బరువు ఉన్న 14 బంగారు ఆభరణాలు (7 నెక్లెస్లు, 7 జతల చెవిపోగులు) కనిపించలేదు. కార్యాలయంలో వాష్రూమ్ కిటికీ ధ్వంసమైనట్లు గుర్తించడంతో దుండగులు అక్కడి నుంచి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గుజరాత్ సూరత్కు చెందిన వ్యాపారి ప్రీతేష్రమణి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు ఆధారంగా తోటి ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు కాగా.. ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. అకాడమీలోనే (SVPNPA) మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధించారని, అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆదివారం ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల తర్వాతే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.సంచలన ఆరోపణలుకర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదులో పలు తీవ్ర ఆరోపణలు చేశారు. గత నెల 23వ తేదీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపేవారని, తోటి ట్రైనీ అధికారుల ముందు తనను కించపరిచేలా మాట్లాడేవారని ఆరోపించారు. తనకు మరో అధికారితో సంబంధం ఉందంటూ ఆరోపిస్తూ.. దాన్ని ఒప్పుకోవాలని ఒత్తిడి చేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఫోన్ను బలవంతంగా తీసుకుని మెసేజ్లు పరిశీలించేవారని, పాస్వర్డ్ చెప్పాలని ఒత్తిడి చేసేవారని ఆరోపించారు.గదిలోకి లాక్కెళ్లి దాడి చేశారని ఆరోపణఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన తనను గదికి తీసుకెళ్లి ఫోన్ పాస్వర్డ్ అడిగి బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. అలాగే జూలై 9న తనను జుట్టు పట్టుకుని గదిలోకి లాక్కెళ్లారని, మెడపై కత్తి పెట్టి బెదిరించారని, బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో కండోమ్ ప్యాకెట్లు విసిరారని, అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరుసటి రోజు కూడా తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్!తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి, వాటిని తన భర్తకు పంపించి బ్లాక్మెయిల్ చేశారని మహిళా అధికారి ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66E, 67A కింద కేసు నమోదు చేశారు. ఇందులో వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన, అసభ్యకర కంటెంట్ ప్రసారం వంటి అంశాలు ఉన్నాయి.కేసు నమోదు.. దర్యాప్తు కొనసాగింపుమహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ రికార్డులు, వాంగ్మూలాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిర్యాదులో చేసిన ఆరోపణలు దర్యాప్తులో ఉన్నాయని, వాటి వాస్తవాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.ఆత్మహత్యాయత్నంతో కేసులో కొత్త మలుపుఇదిలా ఉండగా.. కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు తన తప్పు లేదంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు సమాచారం. లైంగిక వేధింపులు అవాస్తవమని, చట్టంపై నమ్మకముంది.. న్యాయం గెలిచి తీరుతుంది అని ఇన్స్టాగ్రామ్లోనూ మరో పోస్టులో ఉదయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన తీవ్ర ఆరోపణలు.. మరోవైపు కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం ఘటనతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సిటీ పోలీసుల ప్రకటనఉదయ్ ఆత్మహత్యాయత్నం ఘటనపై సిటీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అమీర్పేట లీలా నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉదయ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అది అతని స్నేహితురాలి నివాసంగా నిర్ధారణ అయ్యింది. కేసు నమోదు అయ్యాక కుటుంబ సభ్యులు అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతను కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 ప్రాంతంలో ఎస్సార్నగర్లోని ఓ ఆస్పత్రికి అతన్ని తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు వెల్లడించారు. ఉదయ్ సస్పెన్షన్మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాత్కాలిక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అకాడమీ అధికారులు చర్యలు తీసుకోగా.. తదుపరి నిర్ణయం కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) పరిధిలో ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. -
బాలికపై అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్పై పోక్సో కేసు!
నల్లగొండ: విధుల్లో ఉండి చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు కానిస్టేబుల్పైనే పోక్సో కేసు నమోదవడం జిల్లాలో సంచలనంగా మారింది. నల్లగొండ వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో గుర్రంపోడు పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం, సైకిల్పై వెళ్తున్న బాలికను నిందితుడు అడ్డగించి అసభ్యంగా తాకి వేధించించాడు . ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. నిందితుడు మాస్క్ ధరించి పలుచోట్ల సంచరించాడు, పోలీస్లు సీసీటీవీ దృశ్యాల సహాయంతో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు గుర్రంపోడు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు.ఇదిలా ఉండగా, గతంలో నకిరేకల్లో విధులు నిర్వహించిన సమయంలో కూడా అతడిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల కూడా నీచంగా ప్రవర్తించే వాడని ఆరోపణలు ఆరోపణలు ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా వివిధ ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
'మా ఇంటికి ఎందుకొచ్చారు.. వెళ్లిపోండి' అనడమే శాపమైంది..
హైదరాబాద్, బహదుర్పురా: ‘మా ఇంటికి ఎందుకు వచ్చారు.. వెళ్లిపోండి’ అన్నందుకు బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన కాలాపత్తర్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మహ్మద్ కలీల్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీకి చెందిన మహ్మద్ ఫైజ్ ఎలియస్ అజాన్ (17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.ఐదేళ్ల క్రితం కాలాపత్తర్లో ఉన్న అబ్రార్ ప్రస్తుతం బాలాపూర్లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి అబ్రార్ తన స్నేహితులు ఆశ్వక్ (21), పర్హాన్ (20) సహా మరో ఇద్దరితో కలిసి మద్యం తాగారు. అబ్రార్ ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఆశ్వక్, పర్హాన్లను వెంటబెట్టుకుని కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీలోని అజాన్ ఇంటి వద్దకు వచ్చాడు. ఇక్కడికి ఎందుకొచ్చారంటూ అజాన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వారిని అడ్డుకున్నారు.ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగి ఆశ్వక్, పర్హాన్, అబ్రార్ కలిసి తలపై కత్తితో పొడవడంతో అజాన్ కుప్పకూలాడు. అతను మృతి చెందినట్లు తెలుసుకున్న అబ్రార్ తన స్నేహితులతో కలిసి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అజాన్ మామ సాధిక్ అలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగా అజాన్ను హత్య చేశారా? లేక పథకం ప్రకారం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు మూడు టీంలు రంగంలోకి దిగాయి. -
శంకర్దాదా.. డాక్టర్ దందా
నగరంలో నకిలీ వైద్యులు దర్జాగా చెలామణి అవుతున్నారు. ఎలాంటి విద్యార్హత లేకున్నా, ప్రభుత్వ పరమైన అనుమతులు లేకుండా దశాబ్దాల కాలంగా దొరికితే దొంగ లేకుంటే డాక్టర్ అన్నట్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తమ పరిధిలో నడుస్తున్న ఆస్పత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోంలో జరిగే కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండగా, మెడికల్ కౌన్సిల్ సభ్యులు అప్పుడప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. కాగా.. గల్లీల్లోని నకిలీ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకు కేసులను రిఫర్ చేస్తూ యాజమాన్యాల నుంచి ఖరీదైన బహుమతులు, నగదు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. – సాక్షి, హైదరాబాద్సికింద్రాబాద్ రాంనగర్కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ ఎలాంటి అర్హతలు లేకపోయినా వైద్యుడి అవతారమెత్తాడు. రోగులను పరీక్షించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, ఇతర వైద్య సేవలందిస్తుండటాన్ని మూడు రోజుల క్రితం గుర్తించిన టాస్్కఫోర్స్ బృందం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గత నెల 26న సైదాబాద్ సింగరేణి కాలనీలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేసి ముగ్గురు నకిలీ వైద్యులను గుర్తించారు. ఎలాంటి అర్హతలు లేకుండానే స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, హెచ్–1 డ్రగ్స్ వినియోగిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.నెల రోజు క్రితం పాతనేరేడ్మెట్ మూడుగుళ్ల ప్రాంతంలో నకిలీ దంత వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో సదరు వ్యక్తి ఇంటర్ కూడా పాస్ కాలేదని గుర్తించారు. గాడితప్పిన పర్యవేక్షణ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో గ్రేటర్ పరిధి విస్తరించింది. దీంతో ఆయా ప్రాంతాలపై సంబంధిత జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉన్నా.. పట్టణ పరిధిలోని ఆసుపత్రులపై మానిటరింగ్ గాడి తప్పుతోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేయడం, ఆ తర్వాత షరామామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వర్షాకాలం వచి్చందంటే రోగాలు ప్రబలుతాయి.1.35 కోట్ల జనాభా ఉన్న గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 5 వేలకుపైగా ఉండగా.. ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్లినిక్లు వందల సంఖ్యలోనే ఉంటాయని అంచనా. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అందులోనూ కొన్ని ప్రాంతాల్లోనే తనిఖీలు చేపడుతున్నారంటూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. నకిలీలను గుర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో జిల్లా వైద్యారోగ్య శాఖ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మధ్య సమన్వయం లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మాజీ ప్రియురాలి కాబోయే భర్తకు ఫోన్ చేసి..
"వైషు కథ ముగిసిపోయింది’’ అంటూ తన మాజీ ప్రియురాలు వైష్ణవిని దారుణంగా పొడిచి చంపిన తర్వాత.. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సాహిల్ లవ్హారే అనే యువకుడు ఫోన్ చేసి చెప్పిన మాటలివి. ఈ ఘోరం జరిగిన కొద్ది గంటలకే.. ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టుకు నిందితుడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఉన్మాద ప్రేమికుడి దారుణ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో వెలుగుచూసింది. తన మాజీ ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే కోపంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.నాసిక్లోని ఇందిరానగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో సాహిల్, వైష్ణవి కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య సుమారు 30 నిమిషాల పాటు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సాహిల్.. వైష్ణవిపై పదే పదే కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వైష్ణవిని హత్య చేసిన తర్వాత సాహిల్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు.ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. హత్య జరగడానికి కొన్ని నిమిషాల ముందు వైష్ణవికి కాబోయే భర్తతో సాహిల్ ఫోన్ మాట్లాడటం.. సాహిల్ ఇక్కడే ఉన్నాడు.. త్వరగా రా’ అంటూ వైష్ణవి ఫోన్లో తన కాబోయే భర్తకు చెప్పింది. ఆ మాట వినగానే ఆమె కాబోయే భర్త తన పనిని వదిలేసి వెంటనే ఆమె ఉన్న లొకేషన్కు బయలుదేరాడు. అయితే, అతను ఫోన్ కట్ చేయకుండా అలాగే లైన్లో ఉంచాడు. దాదాపు 22 నిమిషాల పాటు సాహిల్, వైష్ణవిల మధ్య జరిగిన గొడవను అతను ఫోన్లో వింటూనే ఉన్నాడు. కానీ అతను అక్కడికి చేరుకునే లోపే.. ‘ఆమెను చంపేశాను’ అని సాహిల్ చెప్పాడు. మృతురాలు వైష్ణవి అమరావతి జిల్లా, నిందితుడు సాహిల్ యావత్మాల్ ఉమర్ఖేడ్కు చెందినవారు. -
అక్క ప్రేమ వివాహం చేసుకుందని..
కర్నూలు: అక్క ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆగపల్లి–పెద్దతుండ్ల గ్రామాల మధ్య శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. మంచాల సీఐ మధు కథనం ప్రకారం.. లోయపల్లి గ్రామానికి చెందిన బూడిద అరుణ్ (18) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. ఇటీవల అతని సోదరి ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది ఇష్టం లేని అరుణ్ ఆగపల్లిలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆగపల్లి–పెద్దతుండ్ల మార్గంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను చనిపోతున్నా.. అక్క ప్రేమ వివాహం చేసుకోవడం నాకిష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’.. అని తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లోయపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. -
మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!
నల్లగొండ జిల్లా: కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో 24 గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఇద్దరు యువతీయువకుల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముందుగా అనుమానాస్పద పరిస్థితుల్లో యువతి మృతి చెందగా, మరుసటి రోజే ఆమెతో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రెండు ఘటనల మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.వివరాల ప్రకారం.. మునుకుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (23) శుక్రవారం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా లక్ష్మీ ప్రసన్న, చరణ్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే, ప్రసన్న మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలోనే శనివారం ఉదయం చరణ్ గ్రామ శివారులో తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వరుసగా 24 గంటల్లో ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోవడంతో మునుకుంట్ల గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.అయితే, లక్ష్మీ ప్రసన్న మృతి, చరణ్ ఆత్మహత్య ఘటనలకు పరస్పర సంబంధం ఉందా? ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. -
నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
హైదరాబాద్: రహదారులు రుధిర ధారలుగా మారాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గ్రేటర్ పరిధిలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు పాఠశాల విద్యార్థి, మరొకరు ఇంటర్మీడియట్ విద్యార్థి, ఓ మహిళ ఉన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..మేడ్చల్లో బైక్ను ఢీకొట్టడంతో.. నగర శివారు ఐడీపీఎల్ దిల్కుష్నగర్కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సొహైల్ (18), కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సుమిత్ గైక్వాడ్ (17) గురువారం అర్ధరాత్రి మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వీరి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సొహైల్, సుమిత్ గైక్వాడ్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.కీసర ఓఆర్ఆర్పై..మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన రషీద్ (40) మటన్ షాప్ యజమాని. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాములు (60), గౌస్ కలిసి బొలేరో వాహనంలో గొర్రెల లోడ్తో నగర శివారు చెంగిచర్లలోని మండీకి వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర రావడంతో కీసర ఓఆర్ఆర్పై రాంపల్లి దాయర వద్ద బొలేరో వాహనాన్ని ఎడమ వైపు ఆపి నిద్రించారు. గుర్తు తెలియని వాహనం వెనక నుంచి వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. వాహనంలో నిద్రిస్తున్న రషీద్, రాములు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గౌస్కు కాలు విరిగింది. వాహనంలోని కొన్ని గొర్రెలు సైతం మృతిచెందాయి. మృతుడు రషీద్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రాములుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ ఆంజనేయులు చెప్పారు. మెట్రో పిల్లర్ను బైక్ ఢీ..జగిత్యాల జిల్లా బీజ్పూర్ మండలం నర్సింహుల పల్లె గ్రామానికి చెందిన చెర్పూరి అఖిలేష్ యాదవ్ (24) నగరంలోని కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఆస్పత్రిలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన మహమ్మద్ యూనిస్ (26) ప్రైవేట్ ఉద్యోగ చేస్తూ ఇక్కడి హాస్టల్లో ఉంటున్నాడు.వీరిద్దరూ కలిసి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్పై జేఎన్టీయూ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి భాగ్యనగర్ బస్టాప్ వద్ద వీరి బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో అఖిలేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న మహమమ్మద్ యూనిస్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అఖిలేష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కూతురిని ఆఫ్రికా వ్యభిచార గృహానికి అమ్మేశారు
బెంగళూరు: డబ్బు కోసం 20 ఏళ్ల యువతిని తల్లిదండ్రులు ఆఫ్రికాలో వ్యభిచార గృహానికి అమ్మిన ఘటన చిక్కమగళూరులో వెలుగులోకి వచ్చింది. సంచారజాతికి చెందిన దంపతులు మూలికల కోసం ఆఫ్రికాలోని సెనగల్ దేశానికి వెళ్లారు. అక్కడ తమ కూతురిని రూ.7 లక్షలకు విక్రయించారు. బాధితురాలు ఎలాగో చిక్కమగళూరులో ఉంటున్న బ«ంధువులకు వీడియో కాల్ చేసి తన దుస్థితిని వివరించింది. సహాయం చేయాలని వేడుకొంది. అక్కడి భారత రాయబార సిబ్బంది, పోలీసులు ఆమెను కాపాడారు. ఈలోపు తల్లిదండ్రులు ఊరికి వచ్చేశారు. కామాంధుడు అరెస్ట్ = మహిళల లోదుస్తుల చోరీ కేసు దొడ్డబళ్లాపురం: మహిళల లోదుస్తులు చోరీ చేస్తున్న కామాంధుడిని బెంగళూరు ఇందిరా నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హొయ్సళ నగర్లో నివసిస్తున్న పలువురు మహిళలు ఉతికి ఆరేసిన తమ లోదుస్తులు కనబడకుండా పోతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిందితుడిని కనిపెట్టారు. అస్సాంకు చెందిన అబ్దుల్ హుసేన్ అరెస్ట్ మహిళలు ఉతికి ఆరేసిన లోదుస్తులను తస్కరించి వాటిని ధరించి కొన్ని రోజులకు మళ్లీ తెచ్చి అక్కడే పెట్టి వెళ్లిపోయేవాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడు అబ్దుల్ హుసేన్ను అరెస్ట్ చేశారు. -
దారుణం.. ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిపై..
సాక్షి, చిత్తూరు జిల్లా: వీ.కోటలో వెలుగు దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని తల్లి హింసించింది.. ప్రియుడితో కలిసి కసాయి తల్లి.. కుమారుడిపై బ్లేడుతో దాడి చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి తన ప్రియుడుతో కలిసి కొడుకును అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసింది.వీ.కోట ఈశ్వర్ నగర్లో నివాసముంటున్న ఇంద్రజకు భర్త చనిపోగా.. ఎర్ర చేనుకు చెందిన రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి ఏడేళ్ల కొడుకు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి.. ప్రియుడుతో కలిసి శరీరం, ప్రైవేట్ పార్ట్లలో బ్లేడుతో విచక్షణారహితంగా కోసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని కాపాడి ఆసుపత్రికి తరలించింది. -
చనువుగా మాట్లాడతూ.. ఓచర్ రాస్తానని నమ్మించి..
తూర్పు గోదావరి, కైకలూరు: బ్యాంకులో అన్నీ తెలిసిన వ్యక్తిగా చలామణి అవుతాడు. అక్కడ వస్తువులు సర్దుతున్నట్టు నటిస్తూ బ్యాంకు సిబ్బందితో చనువుగా మాట్లాడతాడు. చదువురాని డ్వాక్రా మహిళలను టార్గెట్ చేస్తూ.. అదును చూసి ఫేక్ ఓచర్లు రాసి సొమ్ములు కాజేస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ మీరావలి.ఇదే తరహాలో కృష్ణా, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మీరావలిపై 50కు పైగా కేసులు నమోదయ్యాయి. బ్యాంకుల వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలు, వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని తాను బ్యాంకు ఉద్యోగి, డ్వాక్రా సీసీనంటూ నమ్మించి నగదు తీసుకుని కౌంటర్లో చెల్లిస్తానని నమ్మిస్తున్నాడు. వారికి ఫేక్ ఓచర్ అందించి సొమ్ముతో ఉడాయిస్తున్నాడు.మోసం బట్టబయలు ఇలా.. కలిదిండి మండలం గుర్వాయిపాలేనికి చెందిన బొల్లా ముత్యాలమ్మ గత నెల 6న కలిదిండి ఎస్బీఐ బ్యాంకుకు డ్వాక్రా రుణ వాయిదా చెల్లించేందుకు వెళ్లింది. అప్పటికే కొన్ని రోజులుగా డ్వాక్రా మహిళలకు తాను బ్యాంకు సిబ్బంది, వెలుగు కార్యాలయానికి చెందిన వ్యక్తిగా మీరావలి నమ్మిస్తూ వచ్చాడు. దీంతో ఓచర్ రాసి నగదు కౌంటర్లో చెల్లిస్తానని చెప్పగా ముత్యాలమ్మ నమ్మింది. అతడికి రూ.61 వేలు ఇవ్వగా.. కౌంటర్ వద్దకు వెళ్లి నగదు చెల్లించకుండా అప్పటికే తన జేబులో సిద్ధం చేసుకున్న చెల్లింపు రశీదును ఆమెకు ఇచ్చి మోసం చేశాడు.ఆ రశీదు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తాజాగా తిరగి వాయిదా చెల్లించేందుకు వెళ్లగా, అసలు బండారం బయట పడింది. ఆమె కలిదిండి పోలీసులను ఆశ్రయించగా.. బ్యాంకులో సీసీ పుటేజీని పరిశీలించి నాగూల్ మీరావలిని గుర్తించారు. అతడికి ఆచూకీ తెలిసిన వారు పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. బ్యాంకుల వద్ద ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కలిదిండి ఎస్సై పవన్కుమార్ సూచించారు. -
వివాహేతర సంబంధం.. ప్రియుడిని రాడ్డుతో కొట్టి దారుణ హత్య!
ప్రకాశం, సంతమాగులూరు(అద్దంకి): వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడిని మహిళ కుమారుడు రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన సంతమాగులూరు మండలం పాతమాగులూరులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పాతమాగులూరుకు చెందిన సజ్జల పిచ్చిరెడ్డి (47) వ్యవసాయం చేస్తుంటాడు.ఆయనకు భార్య అనూష, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, పిచ్చిరెడ్డికి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ కుమారుడు విష్ణువర్ధన్ చైన్నెలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి చైన్నె నుంచి వచ్చిన విష్ణు నేరుగా ఇంటికి వెళ్లాడు. అప్పటికే తన ఇంట్లో ఉన్న పిచ్చిరెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. విష్ణును గమనించిన పిచ్చిరెడ్డి భయంతో బయటకు పరుగులు తీశాడు. అయితే, అతన్ని వెంబడించిన విష్ణువర్ధన్ ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టడంతో పిచ్చిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.బుధవారం రాత్రి బయటకు వెళ్తున్నానని చెప్పిన భర్త తిరిగి రాకపోవడంతో.. ఆ మహిళ ఇంటికే వెళ్లి ఉంటాడని భార్య అనూష భావించింది. గురువారం ఉదయం భర్త హత్యకు గురయ్యాడన్న వార్త తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. తన భర్తను సదరు మహిళ కుమారుడే హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతమాగులూరు సీఐ శేషగిరిరావు సమాచారంతో దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు.లొంగిపోయిన నిందితుడుహత్యకు పాల్పడిన విష్ణువర్ధన్ తన తల్లితో కలిసి వెళ్లి అద్దంకి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గతంలోనే వీరి సంబంధం గురించి తెలుసుకున్న విష్ణువర్ధన్.. తమ ఇంటికి రావొద్దని పిచ్చిరెడ్డిని తీవ్రంగా హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు.ఉలిక్కిపడ్డ మండల వాసులుఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు ఉన్న పాతమాగులూరులో ఉదయాన్నే హత్య వార్త దావానలంలా వ్యాపించింది. ఏ రాజకీయ హత్య జరిగిందోనని మండల ప్రజలు తొలుత తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, హత్యకు దారితీసిన అసలు కారణం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
షాబాద్ హత్యల కేసులో కీలక పరిణామం
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు బిడ్డలతో పాటు మైనర్ బాలిక, ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు పార్వతి రాజ్కుమార్ మృతిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్కుమార్ సెల్ఫీ వీడియో, అతడి మొబైల్ ఫోన్లో లభించిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అతడి మరణం ఆత్మహత్యేనా? లేదంటే ఇతర కోణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జులై 10 తేదీ అర్ధరాత్రి సమయంలో రాజ్కుమార్ దైవాలగూడలో నరమేధం సృష్టించాడు. రెండు రోజుల తర్వాత.. కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో రాజ్కుమార్ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. మృతదేహం పక్కనే పురుగుమందు డబ్బా ఉండటంతో అతడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.సెల్ఫీ వీడియోలో ఏముంది?రాజ్కుమార్ మొబైల్ ఫోన్లో పోలీసులు గుర్తించిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. అందులో తనపై నమోదైన పోక్సో కేసు, తన జీవితంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. బాధితులను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు కొన్ని గంటల ముందే ఈ వీడియోను రికార్డు చేసినట్లు గుర్తించారు.అలాగే రాజ్కుమార్ రాసినట్లుగా భావిస్తున్న నాలుగు పేజీల లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన చర్యలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ లేఖ, సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.మృతిపై కూడా కేసు నమోదురాజ్కుమార్ మృతికి సంబంధించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. సెల్ఫీ వీడియో, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీడియోలో పేర్కొన్న వ్యక్తులను పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తోంది. చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే మృతిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఏం జరిగింది?పోక్సో కేసు నమోదుపై కక్ష పెంచుకున్న రాజ్కుమార్.. గత శుక్రవారం రాత్రి బాలిక, ఆమె తల్లి, నానమ్మలను హత్య చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా కిరాతకంగా చంపేశాడు. కేవలం అరగంట వ్యవధిలోనే.. మొత్తం ఆరు హత్యలు చేశాడు. అనంతరం తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి.. తాను చనిపోతున్నానంటూ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు.రెండు రోజుల వేట తర్వాత..ఆరు హత్యల అనంతరం పరారైన రాజ్కుమార్ కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు, లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పెంజర్ల సమీపంలో అతడి మృతదేహం లభించడంతో గాలింపు ముగిసింది.కుటుంబం నిరాకరించడంతో..రాజ్కుమార్ మృతదేహాన్ని స్వీకరించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసుల ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
పటాన్చెరు ఓఆర్ఆర్ పరిధిలో మహిళ దారుణ హత్య
మెదక్, పటాన్చెరు: ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు చెట్ల పొదల్లో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. సదాశివపేటకు చెందిన మంజుల(45) 15 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో బతుకుదెరువు కోసం ఇద్దరు కొడుకులను తీసుకుని జీ.పీ డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ కాలనీకి వచ్చి ఉంటూ, స్థానికంగా మేస్త్రీ కింద కూలిపని చేస్తుంది. ఇద్దరు కుమారులు కూడా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ క్రమంలో బుధవారం సాయంత్రం అంబేడ్కర్ కాలనీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కాగా గురువారం ఉదయం పటాన్చెరు శివారులో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో పక్కన మహిళ హత్యకు గురైందని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మంజుల తలకు, కంటికి తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అక్కడికి తీసుకువచ్చి తలపై బలంగా దాడి చేసి హత్య చేసి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతురాలు ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందం, డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వినాయక్ రెడ్డి, సిబ్బందితో కలసి పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. -
నిందితుడి అరెస్టుకి 'మమ్మీ–డాడీ’ టాటూనే కీలక ఆధారం..
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్తో సంబంధాలున్నట్లు నమ్మించి, ఫారెక్స్ వ్యాపారికి చెందిన ముగ్గురు ఉద్యోగులను మోసం చేసి, ముంబైలో నిర్భంధించిన ఓ ముఠా వారి యజమాని నుంచి రూ.55 లక్షలు వసూలు చేసింది. ఆ మొత్తాన్ని హైదరాబాద్లోని తన అనుచరుడికి ఇచ్చేలా చేసి బందీలను వదిలి పారిపోయి వచ్చింది. దీనిపై ముంబైలోని వకోల పోలీసుస్టేషన్లో కేసు నమోదు కాగా... దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ యూనిట్–8 అధికారులు సోమవారం హైదరాబాద్లో దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం ముంబైకి తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముంబైతో పాటు సిటీలోనూ గాలిస్తున్నారు. ఈ కేసు కొలిక్కి రావడానికి ఓ నిందితుడి చేతిపై ఉన్న ‘మమ్మీ–డాడీ’ టాటూనే కీలక ఆధారమైంది.బాలీవుడ్ ఫైనాన్సియర్లుగా నమ్మించి...ఢిల్లీకి చెందిన మయాంక్ శర్మ అలియాస్ లడ్డూ కొన్నేళ్లుగా ముంబైలో ఉంటున్నాడు. తాను బాలీవుడ్కు చెందిన ఫైనాన్సియర్ కృష్ణగా వకోల ప్రాంతానికి చెందిన ఫారెక్స్ వ్యాపారిని పరిచయం చేసుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగే షూటింగ్స్ను అవసరమైన నగదు అందిస్తూ ఉంటానని, తనతో కలిసి పని చేస్తే భారీ లాభాలు ఉంటాయని చెప్పాడు. ఫారెక్స్ వ్యాపారి ఇది నమ్మడంతో ఈ నెల 8న అతడిని సంప్రదించిన మయాంక్ హైదరాబాద్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతోందని, దాని నిర్మాతకు అక్కడ రూ.55 లక్షలు ఇవ్వాల్సి ఉందని చెప్పాడు. ఆ మొత్తాన్ని తాను ముంబైలో అప్పగిస్తానని నమ్మబలికాడు. దీనికి అంగీకరించిన వ్యాపారి ముంబైలో నగదు తీసుకునే బాధ్యతల్ని తన ఉద్యోగి ఖుష్పాల్ మోహన్ సింగ్కు అప్పగించాడు.ఓ ఫ్లాట్లో నిర్భంధించి, బెదిరించి...ఈ నెల 9న ఖుష్పాల్ను సంప్రదించిన మయాంక్ ఆ రోజు మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు కలీనా ప్రాంతంలోని సీఎస్టీ రోడ్డులో ఉన్న నవరత్న భవనానికి రావాలని సూచించాడు. అందులోని రూమ్ నం.901లో తాను బస చేశానని, వస్తే రూ.55 లక్షలు ఇస్తానని, వెంటనే హైదరాబాద్లో డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు దీనికి అంగీకరించిన ఖుష్పాల్ తన సహోద్యోగులు విక్రమ్, మహావీర్లతో కలిసి అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ తన అనుచరులు ఉత్తరప్రదేశ్కు చెందిన మజీద్ ఖాన్ అలియాస్ మన్ను, థానే నివాసి ఆకాశ్ అగర్వాల్ అలియాస్ కబీర్లతో కలిసి వేచి ఉన్న మయాంక్ ఆ ముగ్గురినీ నిర్భంధించాడు. ఇక్కడ రూ.55 లక్షలు ముట్టినట్లు తమ యజమానికి ఫోన్ చేసి చెప్పాలని, అలా కాకుంటే చంపేస్తామంటూ తుపాకీతో బెదిరించారు. దీంతో ఖుష్పాల్ అలానే చేశాడు.నగరానికి పారిపోయి వచ్చిన గ్యాంగ్...ఇది నమ్మిన ఫారెక్స్ సంస్థ యజమాని హైదరాబాద్లో వేచి ఉన్న ఇద్దరు మయాంక్ అనుచరులకు రూ.55 లక్షలు అందేలా చేశాడు. నగదు ముట్టినట్లు ఖరారు చేసుకున్న ఆ ముగ్గురూ బందీలను వదిలిపెట్టి హైదరాబాద్ పారిపోయి వచ్చేశారు. తన అనుచరుల నుంచి నగదు తీసుకుని, వారి కొంత ఇచ్చి ముంబై పంపేశారు. మయాంక్, మజీద్, ఆకాశ్ మాత్రం కొన్నాళ్లు షెల్టర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి ఓ గెస్ట్హౌస్లో బస చేశారు. ఖుష్పాల్ ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న ఫారెక్స్ వ్యాపారి దీనిపై వకోల పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఆ ఠాణాలో కేసు నమోదు కాగా... ఈ గ్యాంగ్ కోసం క్రైమ్ బ్రాంచ్ యూనిట్–8కు చెందిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ సాలుంఖే నేతృత్వంలోని టీమ్ దర్యాప్త చేపట్టింది.‘మమ్మీ–డాడీ’ టాటూని చూసి...ఈ బృందం నవరత్న భవనానికి వెళ్లి అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించింది. అందులో దుండగుల కదలికలు రికార్డు కాగా... ఆకాశ్ చేతిపై ఉన్న ‘మమ్మీ–డాడీ’ అనే టాటూని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గమనించారు. అతడిపై గతంలోనూ కొన్ని కేసులు ఉండటంతో అధికారులు వెంటనే అతడిని గుర్తించారు. ఎక్కడ ఉన్నాడనే అంశాన్ని సాంకేతికంగా ఆరా తీయగా హైదరాబాద్లో ఉన్నట్లు తేలింది. దీంతో సోమవారం సిటీకి చేరుకున్న ప్రత్యేక బృందం గెస్ట్హౌస్పై దాడి చేసి ఆకాశ్తో పాటు మయాంక్, మజీద్లను పట్టుకుంది. వీరిని మంగళవారం ముంబై తరలించి కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం పోలీసు కస్టడీకి ఇవ్వడంతో విచారిస్తోంది. పరారీలో ఉన్న అజీజుద్దీన్ ఖాన్, గంగా రాజీవ్ కోసం గాలిస్తున్నారు. -
మేక మాంసంలో కల్తీ.. విస్తుపోయే నిజాలు!
హైదరాబాద్, నాంపల్లి: కల్తీ మేక మాంసాన్ని విక్రయించిన వ్యక్తిపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీన హబీబ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి బడే మసీదు వద్ద మహ్మద్ ఉస్మాన్ ఖురేషి దుకాణంపై హెచ్– ఫాస్ట్ ఎస్సై నవీన్, జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, హబీబ్నగర్ ఎస్సై అశోక్, సీసీఎస్ పోలీసులు దాడులు జరిపారు. దుకాణంలోని 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాదీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మాంసాన్ని చెంగిచర్లలోని నేషనల్ మీట్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఎన్ఎంఆర్ఐ) ల్యాబ్కు తరలించి డీఎన్ఏ పరీక్షలు చేయగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మేక మాంసంలో బర్రె దూడ మాంసం కలిపినట్లుగా నిర్ధారించి సంబంధిత అధికారులకు నివేదిక అందజేశారు.ఈ నేపథ్యంలో కల్తీ మాంసం విక్రయించిన మహ్మద్ ఉస్మాన్ ఖురేషిపై త్వరలో చార్జ్షీట్ను నమోదు చేసి రిమాండ్కు తరలించే అవకాశం ఉందని సమాచారం. కల్తీ కేటుగాళ్లు ఎక్కువగా బర్రె దూడలనే ఎంచుకుని మేక, గొర్రె మాంసంలో కలుపుతూ విక్రయిస్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. మేక, గొర్రె మాంసంలో కల్తీ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్– ఫాస్ట్ అధికారులు హెచ్చరించారు. -
ప్రియుడి సోదరుడి కక్ష.. అమాయక ప్రియురాలు బలి
ప్రేమ పేరుతో మొదలైన పరిచయం చివరకు విషాదాంతమైంది. ప్రేమపై యువతికి నమ్మకం దెబ్బతింది. చివరకు చోటుచేసుకున్న పరిణామాలు యువతి ప్రాణాలనే బలితీసుకున్నాయి. ఈ ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.లా చదువుతున్న అమృత అనే విద్యార్థిని ధనుష్ అనే ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఆ యువకుడికి అప్పటికే పెళ్లి జరిగి, ఓ పిల్లాడు కూడా కూడా ఉన్నాడు. తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ విషయాన్ని తన ప్రియురాలు అమృతకు చెప్పలేదు.అమృత ఓ పిజ్జా దుకాణంలో పార్ట్టైమ్ ఉద్యోగం కూడా చేసేది. అమృతకు ధనుష్తో కుటుంబ పరిచయం ద్వారా మాటలు కలిశాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ధనుష్కు ఇప్పటికే విడాకులు అయ్యాయన్న విషయం, ఓ బిడ్డ ఉన్న విషయాన్ని దాచిపెట్టాడని తెలుసుకున్న తర్వాత అమృత బ్రేకప్ చెప్పేసింది.ఆ యువతి బ్రేకప్ నిర్ణయం తీసుకున్నందుకు ధనుష్ సోదరుడు సూర్య అమృతను బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. జులై 13న అమృతను ఇంటి సమీపంలో సూర్య అడ్డగించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సూర్య అమృత ఛాతీ, వీపుపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న అమృతను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మరణించింది.దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యతో పాటు ధనుష్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అమృత మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం సీవీ రామన్ ఆసుపత్రికి తరలించారు. -
సియా గోయల్ కుటుంబానికి బిగ్ షాక్
యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్న కుటుంబానికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సియా కుటుంబం నిర్వహించే మసాలా, డ్రై ఫ్రూట్స్ వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం (FDA) చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలు, కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న బీజీ గోయల్ అండ్ కంపెనీ (M/s BG Goyal and Company) అనే సంస్థను సియా కుటుంబం నిర్వహిస్తోంది. ఈ షాపులో తాజాగా ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా మొత్తం 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSS Act) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని ఎఫ్డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. లైసెన్స్ వివరాల్లో అవసరమైన మార్పులు చేయాలని గతంలో సూచించినప్పటికీ.. సంస్థ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్పత్తుల లేబులింగ్లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు, కల్తీ జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా.. సియా గోయల్ పేరు దేశం అంతటికి తెలిసిందే. తన కాబోయే భర్త కేతన్ (25)ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగఢ్ కోట వద్ద నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. జూన్ 18న ఈ ఘటన జరగ్గా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు సియా, చేతన్ అరెస్ట్తో ఓ కొలిక్కి వచ్చింది. అయితే కేతన్ను తోసిందెవరు? అనే మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఈ విషయంలో నిందితులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇటు హత్య కేసు విచారణ కొనసాగుతున్న వేళ.. తాజాగా ఆమె కుటుంబ వ్యాపారంపై FDA చర్యలు తీసుకోవడం పుణెలో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఎఫ్డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తుకారాం ముండే కల్తీపై కొరడా ఝుళిపిస్తున్నారు. కల్తీ ఆహారం, నిషేధిత ఉత్పత్తులు, నాసిరకం మందులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కఠిన నిర్ణయాలతో గుర్తింపు పొందిన ముండే.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో అక్రమ తయారీ కేంద్రాలు, గుట్కా విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కేసులు, సీజ్ చర్యలు కొనసాగుతున్నాయి. -
రక్తపు మడుగులో భర్త, కొడుకు.. ఫోన్లో బిజీగా భార్య!
కర్ణాటకలోని ధార్వాడ్లో చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైద్యుడు ఇంట్లోనే హత్యకు గురి కాగా.. ఆయన ఎనిమిదేళ్ల కొడుకు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే.. ఈ కేసులో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. భర్త శవం, కొడుకు రక్తపు మడుగులో ఉండగా.. ఆ భార్య మాత్రం ఏం జరగలేదన్నట్లు ఫోన్ చూస్తూ తాపీగా కనిపించింది. ధార్వాడ్లోని బారాకోట్రి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ (45) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కూడా తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో డాక్టర్ కిరణ్, ఆయన భార్య డాక్టర్ ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు. భద్రత ఎక్కువగా ఉండే అపార్ట్మెంట్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు.ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో వెలుగులోకి..డాక్టర్ కిరణ్కు బంధువులు, స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆయన భార్య ప్రియాంకను సంప్రదించగా.. ఆమె మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత డ్యూటీకి వెళ్లారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె చెప్పిన సమాధానాలపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్కు చేరుకున్నారు. అక్కడ ఓ గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో పడి ఉండగా.. మరో గదిలో తీవ్ర గాయాలతో బాలుడు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.Shocking, horrifying & ruthless. A woman allegedly killed her doctor husband & stabbed her 8yr old son inside their #Dharwad apartment. As the child lay in a pool of blood fighting for life, mother was scrolling through her phone. @compolhdc rescued the boy & shifted to hospital. pic.twitter.com/RL5GO9fzEV— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) July 16, 2026భార్యపై అనుమానాలు.. విచారణఘటన తర్వాత పోలీసులు డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో ఆమె ఫోన్ చూస్తూ కనిపించిన దృశ్యాలు కూడా చర్చకు దారితీశాయి. అయితే హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యల తర్వాత ఆమె ప్రవర్తించిన తీరుతో మానసిక స్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు దారితీసిన పరిస్థితులు, దాడి జరిగిన సమయం, ఆయుధం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రముఖ వైద్య కుటుంబంలో విషాదండాక్టర్ కిరణ్ స్థానికంగా పేరున్న వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన భార్య ప్రియాంక కంటి వైద్యురాలు. ఇద్దరూ వైద్య వృత్తిలో ఉండగా.. ఇంట్లోనే ఈ దారుణం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, ఫోరెన్సిక్ నివేదికలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
స్నేహితుడి పోస్టే పోలీసులకు క్లూ.. చిక్కిన రౌడీబాబా!
సాక్షి, హైదరాబాద్: లేక్ పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్గా ఉన్న జావేద్ 2018లో సైఫాబాద్ ఠాణా పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గత ఏడాది జూన్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఇతడిపై నాన్–బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయింది. ఈ విషయం తెలిసి అరెస్టును తప్పించుకోవడానికి బాబా అవతారం ఎత్తాడు. ఇతడి స్నేహితుడు సోషల్మీడియాలో షేర్ చేసిన ఫొటో జావేద్ ఆచూకీపై ఆధారాన్ని ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ టీమ్ నెల రోజులు గాలించి చెరియాలలో మంగళవారం పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది.కోర్టుకు, పోలీసుల వద్ద హాజరుకాకుండా... ఎంఎస్ మక్తా ప్రాంతానికి చెందిన మహ్మద్ షేక్ జావేద్పై లేక్ ఠాణాలో రౌడీషీట్ ఉంది. 2018లో సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఐదో నిందితుడిగా అరెస్టు అయ్యాడు. బెయిల్పై బయటకు వచ్చిన ఇతడు గత ఏడాది జూన్ 5 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అటు కోర్టు వాయిదాలకు, ఇటు టాస్క్ఫోర్స్, లేక్ పోలీసుస్టేషన్లో హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఇతడిపై న్యాయస్థానం ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. జావేద్ను ఔట్ ఆఫ్ వ్యూలో (ఓవీ) నేరగాళ్ల జాబితాలో చేర్చిన ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆరు నెలలుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. తన ఫోన్, సోషల్మీడియా ఖాతాలతో సహా ఏదీ వినియోగించకుండా ఉన్న జావేద్ తన ఉనికి బయటపడనీయలేదు.అమ్మమ్మ ఇంట్లో మకాం... బాబా అవతారం...ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.రాఘవేందర్ నేతృత్వంలోని బృందం జావేద్ స్నేహితులు, బంధువుల సోషల్మీడియా ఖాతాలను విశ్లేషించడం ప్రారంభించింది. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి జావేద్ ఈ ఏడాది జనవరి నుంచి సంగారెడ్డి జిల్లా చెరియాల్ రోడ్డు సమీపంలోని తన అమ్మమ్మ ఇంట్లో తలదాచుకుంటున్నాడు. నకిలీ బాబా అవతారం ఎత్తి కంది మండలంలో చెరియాల్ రోడ్డు వద్ద ఉన్న జిందేషా మదార్ దర్గాలో పూజారిగా చేరాడు. తన వద్దకు వచ్చిన వారికి దువా ఇస్తున్నట్లు నటిస్తూ వారందరినీ మోసం చేస్తున్నాడు. ప్రధానంగా చిన్నారులు, మహిళలకు దువా ఇస్తున్నట్లు హడావుడి చేసే వాడు. నగరానికి చెందిన జావేద్ స్నేహితుడు అతడు నిజమైన బాబా అని నమ్ముతూ ఇటీవల వెళ్లి అతడికి కలిసి వచ్చాడు. ఆ సందర్భంలో ఓ మహిళకు దువా ఇస్తుండగా ఫొటో తీశాడు.నెల రోజులు నిఘా ఉంచి...ఈ ఫొటోను సదరు స్నేహితుడు తన సోషల్మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. అప్పటికే అనేక ఖాతాలను విశ్లేషిస్తున్న ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ టీమ్ కంట్లో ఇది పడింది. వెంటనే అతడిని పిలిచిన అధికారులు ‘జావేద్ బాబా’ అడ్రస్ తెలుసుకున్నారు. కానిస్టేబుల్ పురుషోత్తం వారం రోజుల పాటు చెరియాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి జిందేషా మదార్ దర్గాలో జావేద్ ఆచూకీ కనిపెట్టాడు. అయితే అక్కడ అరెస్టు చేస్తే ఇబ్బందులు వస్తాయని అతడి కదలికలపై నెల రోజులుగా నిఘా ఉంచారు. సైఫాబాద్ నానా మియా మసీదు సమీపంలోని పూల్ బాగ్ ప్రాంతానికి వచ్చిన జావేద్ను గుర్తించి పట్టుకున్నారు. చేరుకుని, నిందితుడు మహ్మద్ షేక్ జావేద్ను విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న క్యారీబ్యాగ్లో ఉన్న 115 గ్రాముల గంజాయి, మారువేషం కోసం ఉపయోగించిన ఆకుపచ్చ రంగు పీర్ బాబా దుస్తులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. -
స్నానం చేస్తుండగా ఫొటోలు.. బ్లాక్మెయిల్తో గ్యాంగ్రేప్..!
జగిత్యాలజోన్: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ కేసులో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి బుధవారం సంచలనాత్మక తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు కథనం ప్రకారం.. మెట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇంట్లో స్నానం చేస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన లోకిని రాజేశ్ ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను అందరికీ చూపిస్తానంటూ బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. అత్యాచారం విషయం ఎవరికైనా చెపితే ‘నిన్ను నీ కుటుంబసభ్యులను చంపేస్తా’ అంటూ బెదిరించాడు. ఇలా, బాలికను ఫొటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో 6 అక్టోబర్ 2020 రోజున ‘నీతో, నీ స్నేహితుడు మాట్లాడతా అంటున్నాడు, బయటకు రా’ అంటూ సదరు బాలికకు రాజేశ్ ఫోన్ చేశాడు. బాలిక బయటకు రాగానే పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేశాడు. రాజేశ్ అత్యాచారం చేస్తున్న సమయంలో, అక్కడికి వచ్చిన అతడి నలుగురు స్నేహితులు దరంగుల సాయికుమార్, మొగిలిపాక అనిల్కుమార్, కుంచెపు శివ, కుంచెపు వెంకటేశ్ను బాలిక చూసి, ‘నన్ను ఏమి చేయవద్దు’ అని బతిమిలాడినా ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుంటూ అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, ఫొటోలు, వీడియోలు బయటపెట్టి, నీ జీవితాన్ని నాశనం చేస్తామంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లి, నడవలేని స్థితిలో ఉన్న ఆ బాలిక అక్కడి నుంచి మెళ్లగా ఇంటికి చేరుకుంది. ఇంటి పరువు పోతుందని ఎవరికీ చెప్పకుండా ఆ భాదను తనలోనే దాచుకుంది. చివరకు జరిగిన ఘటనను తమ కుటుంబసభ్యులకు తెలియజేయగా, మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై ఎన్.సదాకర్ కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ ఎండీ గౌస్బాబా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తర్వాత వచ్చిన డీఎస్పీ వి.రవీందర్రెడ్డి కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, కోర్టులో నిందితులపై చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, డి.శ్రీధర్, బి.రాజు బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితులకు యావజ్జీవ శిక్ష, జరిమానా విధించారు. భాదితురాలికి రూ.12 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. -
కక్షతో.. బాత్రూం క్లీన్ చేసే రసాయనం తాగించి..
హైదరాబాద్, సుభాష్నగర్: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన మహిళపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సూరారం పోలీస్ స్టేషన్లో పేట్బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి వివరాలు వెల్లడించారు. గాజులరామారం కైసర్ నగర్లోని సర్వేనెంబర్ 342 ప్రభుత్వ స్థలంలో కబ్జాలు జరుగుతున్నాయని స్థానికురాలు సల్మా బేగం జూన్ 19న రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కబ్జాదారుడు రత్నాకరం సాయిరాజ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.సల్మా బేగంపై దాడి చేయాలని స్థానికంగా ఉన్న హేమశ్రీ, సయ్యద్ రేష్మ బేగం, సయ్యద్ రహీం, షహనాజ్ అనే మహిళలను ప్రేరేపించాడు. ఈ నెల 8న సల్మా బేగం ఇంట్లోకి నలుగురు చొరబడి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా బాత్రూం క్లీన్ చేసే రసాయనాన్ని బలవంతంగా తాగించి ప్రాణాపాయ స్థితికి గురి చేశారు. దాడి దృశ్యాలను సల్మా బేగం కూతురు ఫోన్లో చిత్రీకరిస్తుండగా మొబైల్ను లాక్కొని నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు.దీంతో ఈ నెల 8న సల్మా బేగం సూరారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన రత్నాకరం సాయిరాజ్ కోసం గాలిస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. సాయిరాజ్పై గతంలో ఆరు కేసులు ఉండగా అతనిపై భూకబ్జా షీటు నమోదు చేస్తున్నామని, అదే విధంగా ఓ మహిళపై గతంలో ఐదు కేసులు ఉండగా, దీనితో కలిపి ఆరో కేసు నమోదు చేసి ఆమెపై కూడా రౌడీ షీట్ నమోదు చేస్తామన్నారు. -
భవనం పైనుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: గచ్చిబౌలి ఐటీకారిడార్పరిధిలోని నాలెడ్జి సిటీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం...ఏపీలోని నెల్లూరుకు చెందిన టి. అవినాష్ (40)కు జ్యోతితో వివాహం జరగ్గా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు నెలల క్రితమే బెంగళూరు కూకట్పల్లికి మకాం మార్చారు. నాలెడ్జి సిటీలోని క్వాల్కామ్ భవనంలోని హెచ్సీఎల్ కంపెనీలో పనిచేస్తున్నాడు.మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరుతున్నట్లు భార్యకు మెసేజ్ చేసిన అవినాష్, ఆ తర్వాత ఫోన్లు ఎత్తలేదు. ఆందోళన చెందిన భార్య సమాచారంతో ఆమె సోదరుడు అరుణ్కుమార్ రాత్రి 8.30 గంటలకు క్వాల్కామ్ భవనం వద్దకు వెళ్ళాడు. అక్కడ అవినాష్ 5వ అంతస్థు నుంచి కిందకు దూకి మృతిచెంది ఉండటం గమనించాడు. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై లైంగికదాడి.. ఆరుగురిపై పోక్సో కేసు నమోదు
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం టూటౌన్ పరిధిలో బాలికపై లైంగికదాడి చేసిన ఘటనలో ఆరుగురిపై పోక్సో కేసు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గరీబ్పేటకు చెందిన మార్తి రామకృష్ణ ఓ బాలికను ప్రేమపేరుతో వేధించాడు. ఆ తర్వాత ఆమెను జాలె నవీన్, గణేశ్ సహకారంతో ఈ నెల 3వ తేదీన తన బావ, కానిస్టేబుల్ వెంకటేశ్ గదికి తీసుకువెళ్లి లైంగికదాడి చేశాడని తెలిపారు. తరువాత స్నేహితులైన కలకుంట్ల విజేందర్, బడేటి మహేశ్కు చెప్పగా వారు కూడా ఈనెల 4, 5వ తేదీల్లో వేర్వేరుగా బాధితురాలిని భయపెట్టి ఆటోల్లో తీసుకువెళ్లి లైంగికదాడి చేశారని వివరించారు. ఈ విషయమైబాలిక ఈ నెల 11న తల్లికి తెలపగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి బుధవారం మార్తి రామకృష్ణ, కలకుంట్ల విజేందర్, బడేటి మహేశ్, బాలె నవీన్ను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు ఆటోలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన నిందితుల్లో కానిస్టేబుల్ వెంకటేశ్తో పాటు గణేశ్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. వన్టౌన్ సీఐ కరుణాకర్, టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రియుడితో కలిసి.. భర్తను పరుగెత్తించి చంపిన భార్య..!
నిండా రెండేళ్లు పూర్తి కాని వివాహ బంధం. దానికి ప్రతిఫలంగా పుట్టిన ఏడు నెలల బిడ్డ. అన్యోన్యంగా సాగుతోందని బంధువులు అనుకున్న కాపురం. భార్య వివాహేతర సంబంధం కాలనాగులా మారి భర్తను కాటేసింది. భార్య తోడ్పాటుతో ఆమె ప్రియుడి చేతిలో భర్త హతమయ్యాడు. జీవిత భాగస్వామి పన్నిన వ్యూహంలో చిక్కుకుని అతను ప్రాణాలు కోల్పోయాడు. సాక్షి, చిత్తూరు : శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ బోయనపల్లికి చెందిన యువతికి రెండేళ్ల క్రితం తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్తో పెద్దలు పెళ్లి చేశారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారని ఇరు కుటుంబాల వారు భావించారు. ఏడు నెలల క్రితం ఆ యువతి ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు నెలల క్రితం అత్తారింటికి వెళ్లింది. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటే ఆమెకు పుట్టిన ఊరిలో మరో యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలని భార్య ప్రియుడితో కలిసి పథకం పన్నింది. రెండు రోజుల క్రితం ఆమె భర్త రమేష్ తో కలిసి పుట్టింటికి వచ్చింది. మంగళవారం భర్త, బిడ్డను గుడుపల్లి మండలంలోని మల్లప్ప కొండౖపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రియుడికి చేరవేసింది. అతను తన స్నేహితుడితో కలిసి మల్లప్పకొండపై ఆలయానికి వెళ్లే మార్గంలో కాపు కాసి బైకును అడ్డుకున్నట్టు తెలిసింది. దాడి జరుగుతోందని గమనించిన రమేష్ తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో రోడ్డు నుంచి దాదాపు 100 మీటర్లు తనను వెంబడించిన ప్రియుడు, తన స్నేహితుడు విచక్షణారహితంగా నరికినట్టు సంఘటనా స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం యువతి, తన ప్రియుడు, ప్రియుడి స్నేహితుడు కలిసి మృతుడికి చెందిన బైకుపైనే వెళ్లిపోయినట్టు సమాచారం. చంటి బిడ్డతో గుడికి వెళ్లిన దంపతులు తిరిగిరాకపోవడంతో బంధువులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. వారు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో మల్లప్ప కొండపై శవం ఉందనే సమాచారం రావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యువతి తన భర్తతో కలిసి మల్లప్ప కొండ వైపు వెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ పుటేజీల్లో గుర్తించారు. భర్త శవం దొరకడంతో భార్య, బిడ్డ ఏమయ్యారని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి యువతి బైకుపై వెళుతున్నట్టు సీసీ టీవీల్లో తేలింది. భార్య, తన ప్రియుడు మరో వ్యక్తితో కలిసి రమేష్ ను హతమార్చినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న యువతి ఇంకా మైనర్ అని బోయనపల్లి గ్రామస్తులు చెప్పారు. రెండేళ్ల క్రితం తను 9వ తరగతి చదువుతుండగానే ఈ బాలికకు పెద్దలు పెళ్లి చేశారని పేర్కొన్నారు. -
ధార్వాడ్లో ఘోరం.. ఇంట్లోనే డాక్టర్ దారుణ హత్య
కర్ణాటకలోని ధార్వాడ్లో బుధవారం ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. బారాకోట్రి ప్రాంతంలో అనస్థీషియాలజిస్ట్ కిరణ్ హోనన్నవర్(45)ను గుర్తుతెలియని దుండగులు తన అపార్ట్మెంట్లోనే అత్యంత కిరాకతంగా హత్య చేశారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు సైతం తీవ్రమైన కత్తిపోట్లకు గురయ్యాడు.ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, ఆప్తమాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ ఘటన జరిగిన అపార్ట్మెంట్ అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఉంది. మా ప్రాథమిక విచారణలో ఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లభించలేదు. ఆ సమయంలో ఇంట్లో కేవలం డాక్టర్ కిరణ్, ఆయన భార్య ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు" అని పేర్కొన్నారు.ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెలుగులోకి..కాగా డాక్టర్ కిరణ్ బంధువులు ఆయనకు వరుసగా ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఆయన భార్య ప్రియాంకకు ఫోన్ చేశారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి బంధువులు నేరుగా అపార్ట్మెంట్కు చేరుకున్నారు.అక్కడికి వచ్చి చూడగా ఒక గదిలో డాక్టర్ కిరణ్ మృతదేహం, మరో గదిలో గాయపడిన బాలుడు పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతుడి భార్యను విచారిస్తున్నారు. ఆమె పోలీసులకు కూడా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కిరణ్ కుటంబ సభ్యులు మాత్రం డాక్టర్ ప్రియాంకనే ఈ హత్యకు ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. -
పోలీసులా.. రాక్షసులా? మరో లాకప్ డెత్..
-
కారు అదుపు తప్పి బోల్తా.. వైద్య విద్యార్థిని మృతి
హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డుపై కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైద్య విద్యార్థిని మృతి చెందినట్లు శంషాబాద్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్లోని అమ్స్రీ సెంట్రల్ కోర్టు నివాసి అద్దంకి అమూల్య(21) ఎంఎన్ఆర్ కళాశాలలో డెంటల్ విద్య అభ్యసిస్తోంది. ఈ నెల 13న అర్ధరాత్రి దాటిన తర్వాత స్నేహితుడు సిద్ధార్థ్తో కలిసి శంషాబాద్ చూడటానికి కారులో వచి్చంది. మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ బయలుదేరారు. వీరు దారి తప్పి ఔటర్పైకి వచ్చి పెద్ద అంబర్పేట్ వైపు వెళ్తూ పెద్దగోల్కొండ టోల్గేట్ దాటగానే ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపునకు వెళ్లి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న అమూల్య కారులోంచి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన సిద్ధార్థ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెట్రోలింగ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్నానపు వీడియోతో వివాహితకు బ్లాక్మెయిల్!?
స్నానం చేస్తుండగా ఓ యువకుడు మహిళను రహస్యంగా వీడియో తీశాడు. ఆ వీడియోతో ఆమెను లోబర్చుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలిసినా కుటుంబ పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యువకుడి ఆగడాలు మితిమీరిపోవడంతో.. అతడిని లేకుండా చేయాలని దంపతులు పథకం రచించారు. గుజరాత్లోని గాంధీనగర్లో తీవ్ర కలకలం రేపిన ఘటన వివరాల్లోకి వెళ్తే..గాంధీనగర్ జిల్లా పరిధిలోని కలొల్ ప్రాంతానికి చెందిన హార్దిక్ (20) కాలేజీ స్టూడెంట్. దాదాపు ఒకటిన్నర నెలల క్రితం ఓ మహిళ స్నానం చేస్తుండగా చాటుగా తన ఫోన్తో వీడియో తీశాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను మహిళను బెదిరించాడు. తనతో శారీరక సంబంధం కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. భయంతో ఆమె అతడి డిమాండ్లకు అంగీకరించింది.మహిళ భర్త ఫ్యాన్ రిపేర్లు, వైరింగ్ పనులు చేస్తుంటాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య పదే పదే ఫోన్లో మాట్లాడడంపై గట్టిగా నిలదీశాడు. ఆమె జరిగింది చెప్పింది. అయితే పరువు పోతుందనే భయంతో అతను మౌనంగా ఉండిపోయాడు. అయితే ఈలోపు హార్ధిక్ మితిమీరి ప్రవర్తించాడు.ఇంటి ముందు నుంచి వెళ్లే సమయంలో మహిళను చూసి కన్ను కొట్టడం, అసభ్య సైగలు చేయడం ఆ భర్త భరించలేకపోయాడు. మొదట హార్దిక్ కుటుంబ సభ్యులతో పంచాయితీ పెట్టి విషయం చెప్పాలని దంపతులు భావించారు. అయితే.. విషయం బయటకు తెలిసిపోతుందని భావించారు. ఈలోపు హార్దిక్ చేష్టలు ఆ భర్తకు మరింత కోపం తెప్పించాయి. దీంతో అతన్ని హతమార్చాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.పథకం ప్రకారం జూలై 11 ఉదయం మహిళ హార్దిక్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. అంతకుముందే భర్త పని కోసం బయటకు వెళ్తున్నట్లు నటించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పిల్లలు స్కూల్కు వెళ్లిపోయారు. హార్దిక్ తన తండ్రికి ఫోన్ చేసి.. పర్బత్పురలో ఓ భూమి చూసేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే అతడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు.ఈలోపు.. హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన భర్తను చూసి హార్దిక్ పరుగులు తీయబోయాడు. భర్త అతని ఛాతీ మీద కూర్చోగా.. భార్య కాళ్లు, చేతులు బలంగా పట్టుకుంది. తొలుత ఆమె స్కార్ప్తో, ఆ తర్వాత కరెంట్ వైర్లను మెడకు బిగించి హార్దిక్ను హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇంటికి తాళం వేశారు. సరాసరి స్కూల్కు వెళ్లి పిల్లలను తీసుకుని.. వివాహిత స్వస్థలానికి పారిపోయారు.మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో..హార్దిక్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కంగారుపడ్డ తండ్రి.. కలోల్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ హత్య బయటపడింది. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి మరణించినట్లు వెల్డి కావడంతో.. దంపతుల్ని ట్రేస్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.హార్దిక్ వద్ద ఉన్న మొబైల్లోనే మహిళకు సంబంధించిన వీడియో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత భర్త ఆ ఫోన్ను పగలగొట్టి రోడ్డుపక్కన పడేసినట్లు సమాచారం. ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు నిందితులను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
జనసేన కార్యకర్తపై భార్య ఫిర్యాదు
ఏలూరు: కైకలూరులో రాజ్యాంగేతర శక్తిగా మారిన జనసేన కార్యకర్త కొల్లి వీర వెంకట సత్య వరప్రసాద్ (బాబీ) నిజస్వరూపాన్ని అతని భార్య దుర్గాదేవీ మీడియా ముందు మంగళవారం బట్టబయలు చేసింది. ఇటీవల కైకలూరు దానిగూడెం దళితుల దాడి కేసులో జైలు జీవితం అనుభవించి వచ్చిన కొల్లి బాబీ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న ఇతనిపై మట్టిదందా, పేకాట నిర్వాహణ వంటి పలు ఆరోపణలు ఉన్నాయి. కైకలూరు టౌన్ స్టేషన్లో బాబీపై అతని భార్య వరకట్న వేధింపులు, అక్రమ సంబంధం, పిల్లలను కలవనివ్వడం లేదంటూ వంటి వాటిపై తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. కొల్లి బాబీకి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన దుర్గాదేవీతో వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు. మరింత కట్నం కోసం వేధిస్తుంటే అదనంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. కొల్లి బాబీ వ్యసనాలకు బానిసై తనను మానసికంగా వేధించాడని ఆమె పేర్కొంది. తన పుస్తెలు, పదో తరగతి సర్టిఫికెట్లపై లోను తీసుకుని కార్లలో తిరుగుతూ తనను మనిషిగా చూసేవాడు కాదని వాపోయింది. తనను 5 సంవత్సరాలుగా దూరం పెట్టి ఇంటికి పంపారన్నారు. తన బిడ్డలను సెలవులకు తీసుకొచ్చి ఏలూరు సిద్దార్థ హాస్టల్లో పెట్టారని వారిని చూడనివ్వకుండా చేస్తున్నారని వాపోయింది. తన భర్తతో ప్రాణభయం ఉందని, అతనికి వివాహేతర సంబంధం ఉందని ఆమె తెలిపింది. ఇంటికి వస్తే నరికేస్తా అంటూ బెదిరిస్తున్నాడని, తన భర్తతో పాటు, నా బిడ్డలతో కలసి జీవించే విధంగా న్యాయం చేయాలని కోరింది. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదన్నారు. దుర్గాదేవి ఫిర్యాదుపై టౌన్ సీఐ ఏవీఎస్ రామకృష్ణను వివరణగా కోరగా ఫిర్యాదు అందిందని, ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. -
నిజం చెరగకూడదని.. చేతులు, కాళ్ల నిండా సూసైడ్ లేఖ రాసుకుని..
భోపాల్: ఒక మహిళ ఎన్నో ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధను ఇక భరించలేకపోయింది. అత్తింట్లో ఎదుర్కొంటున్న వేధింపులు ఆమె మనసుని చంపేశాయి. ఎవరూ తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే, తాను చనిపోతే తన గొంతు మూగబోతుందని, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఆవేదనతో కాగితంపై కాకుండా... తన చేతులు, కాళ్లపైనే మెహందీతో చివరి సందేశం రాసింది. మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.ఛింద్వారాకు చెందిన ఓ మహిళ అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. చనిపోవడానికి ముందు ఆమె తన చేతులు, కాళ్లపై మెహందీతో సూసైడ్ నోట్ రాసింది. అందులో అత్తింట్లో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొన్న వేధింపుల గురించి రాసిన విషయాలు గుండెను కలిచివేస్తున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతురాలి చేతులు, కాళ్లపై రాసిన సూసైడ్ నోట్కు వీడియోగ్రఫీ కూడా చేశారు.చేతులు, కాళ్లపై సూసైడ్ నోట్ ఎందుకు?చౌరై పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళ పేరు ప్రీతి వర్మ (32). ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. ప్రీతికి సుమారు 13 ఏళ్ల క్రితం లఖన్ వర్మతో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి భర్త లఖన్, అతని కుటుంబ సభ్యులు ప్రీతిని వేధించేవారు.మృతురాలు ప్రీతి సోదరుడు హరియోమ్ జాంగేలా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు. ప్రీతి చనిపోయిన తర్వాత కాగితంపై రాసిన సూసైడ్ నోట్ను అత్తింటి వారు నాశనం చేసే అవకాశం ఉందని ఆమె భయపడి ఉండొచ్చని చెప్పారు. అందుకే తన శరీరంపైనే మెహందీతో సూసైడ్ నోట్ రాసిందని, అలా చేస్తే దాన్ని చెరపలేరని తెలిపారు. భర్త లఖన్ వర్మ, అత్తింటి వారు చాలాకాలంగా ప్రీతిని వేధించారని చెప్పారు. ఆమెపై మానసికంగా, శారీరకంగా వేధింపులు జరిగేవని తెలిపారు. ప్రీతి 2-3 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ప్రతిసారీ భర్త లఖన్ వర్మ ఆమెను నమ్మించి, బాగా చూసుకుంటానని తిరిగి తీసుకెళ్లేవాడని చెప్పారు.వాంగ్మూలం ఇచ్చేలోపే ప్రీతి మృతిపోలీసుల సమాచారం ప్రకారం.. ప్రీతి వర్మ విషం తాగిన తర్వాత కుటుంబ సభ్యులు ముందుగా జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేసేలోపే శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ ప్రీతి చనిపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు. -
క్షణికావేశం.. యువ సర్పంచ్ జ్యోతి మృతి
ఆదిలాబాద్: ఆమె ఒక గ్రామానికి సర్పంచ్. గ్రామంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతూ, ఎందరికో న్యాయం చేసింది. కానీ తన ఇంట్లో జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకొని తన ఇద్దరు చిన్నారులకు తీవ్ర అన్యాయం చేసింది. ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు క్షణికావేశంలో బోరిగాం గ్రామానికి చెందిన సర్పంచ్ పల్లె జ్యోతి (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి జ్యోతి ఆమె భర్త విఠల్ల మధ్య పిల్లలను పాఠశాలకు పంపించే విషయమై చిన్నపాటి గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన జ్యోతి అందరూ నిద్రిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున వంట గదిలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచా రం అందించడంతో సీఐ రవీందర్ నాయక్, ఎస్సై షేక్ జుబేర్లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జ్యోతి తండ్రి మాదు ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై వెల్లడించారు. ఆమెకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మరిచి తల్లి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
4 నెలలకే.. నవ దంపతుల విషాదం! అసలేం జరిగింది?
కర్ణాటక, తుమకూరు: పెళ్లయిన 4 నెలలకే నూతన జంట ఆత్మహత్య చేసుకుంది. వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలన్న పెద్దల దీవెనలు ఫలించలేదు. తుమకూరు జిల్లా శిర తాలూకాలోని హనుమానహళ్లిలో శరణ్య (20), గిరీష్ (28) ప్రాణాలు తీసుకున్నారు. పొరుగూరు సిద్ధనహళ్లి గ్రామానికి చెందిన శరణ్య డిగ్రీ చదువుతోంది. ఇటీవల ఆమెకు తల్లి సోదరుని కుమారుడైన గిరీష్తో వివాహం చేశారు. కొత్త సంసారం సజావుగా సాగుతోంది. సోమవారం అత్తమామలు, భర్త పత్తి విత్తనాలు వేసేందుకు పొలానికి వెళ్లారు.సాయంత్రం భర్త ఇంటికి వచ్చి పిలిచాడు. స్పందన రాకపోవడంతో, కిటికీలో నుంచి చూడగా, శరణ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో గిరీష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తీవ్ర భయాందోళన చెంది పొలంలోని చెట్టుకు అతడూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు. పట్టణాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది. -
ఢిల్లీలో దారుణం.. భార్య పుట్టిన రోజునాడే నడిరోడ్డుపై..
ఢిల్లీ: నగరంలోని వినోద్ నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. భార్య పుట్టినరోజు నాడే నడిరోడ్డుపై భర్త తుపాకీతో కాల్చి చంపాడు. 2023లో మనీష్ భాటి అనే వ్యక్తితో ప్రియాంకకు వివాహం జరిగింది.నిందితుడు మనీష్.. ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రియాంక పుట్టినరోజు కావడంతో, దంపతులిద్దరూ కలిసి రాత్రి రెండు గంటలకు బైక్పై బయటకు వెళ్లగా.. మార్గమధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి సమీపంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రియాంక బైక్ దిగి వెళ్లిపోతుండగా.. తుపాకీ బయటకు తీసి కాల్పులు జరిపి మనీష్ పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ప్రియాంకను గమనించిన ఓ డెలివరీ బాయ్ వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 2024లో కట్నం కోసం మనీష్ భార్య ప్రియాంకను వేధింపులకు గురిచేశాడని.. ఆ సమయంలో సుమారు 8 నెలలు సోదరుడి ఇంట్లోనే ప్రియాంక ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
నా చావుకు అతడే కారణం
మంచిర్యాల జిల్లా: ప్రేమించాను.. నిన్నే పెళ్లి చేసుకుంటానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ యువతిని ఓ యువకుడు రెండేళ్లుగా వేధిస్తున్నాడు. దీంతో వేధింపులు తాళలేక యువతి ఉరేసుకు ని ఊపిరి తీసుకుంది. తన చావుకు యువకుడే కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆ గ్రామానికి చెందిన దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు తన చదువు పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు గోనే వెంకటేశ్ రెండేళ్లుగా సదరు యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడు. అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజ కూడా వెంకటేశ్ను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో ఆ యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. తన వెంట పడొద్దని ప్రాధేయపడ్డా వినకుండా పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని బెదిరించాడు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యువతి వెంట పడొద్దని సూచించారు. అయినా వెంకటేశ్ మానలేదు. అతడితోపాటు కుటుంబ సభ్యులు వేధించడంతో సోమవారం మధ్యాహ్నం ఆ యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్యకు వెంకటేశ్, అతడి కుటుంబ సభ్యులే కారణమని, న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, ఐబీ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సీఐలు ప్రమోద్రావు, నవీన్కుమార్, ఎస్సై భూమేశ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, నిందితుడు వెంకటేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
రాజ్ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం తెలుస్తుంది ?
-
ఉపాధికై నగరానికి వచ్చి.. నిండు ప్రాణాలు కోల్పోయి
ఉపాధి కోసం.. పని వెదుక్కుంటూ.. కూతురుని చూసేందుకు.. నగరానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరుచోట్ల జరిగిన ఈ దుర్ఘటనల్లో ఏపీలోని ప్రకాశం జిల్లా వారు ఇద్దరు యువకులు, రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాకు మహిళ మృతి చెందారు. నిజాంపేట్: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాచుపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని ప్రకాశం జిల్లా పల్లమల్లి గ్రామానికి చెందిన ఎల్రక్టీíÙయన్ శివసాయి పవన్ (25) బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఉంటున్నాడు. స్నేహితుడు ఉమాప్రసాద్ (23)తో కలిసి ఆదివారం అర్ధరాత్రి బైక్పై బాచుపల్లి నుంచి ప్రగతి నగర్ వైపు బయలుదేరారు. బైక్ అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివసాయి పవన్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఉమాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..హయత్నగర్: ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. హయత్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ (35) హయత్నగర్లోని సూర్యనగర్లో నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోనగర్ నుంచి ఇంటికి వెళ్తుండగా, హయత్నగర్లో వెనుక నుంచి వేగంగా వచి్చన ఆర్టీసీ బస్సు ఆదినారాయణ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన తల బస్సు చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
పల్నాడులో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఘటనాస్థలిలో పోలీసులు ఓ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు‘ అని భారతి రాసినట్లు తెలుస్తోంది. భారతి ఈ ఘోర నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను పోలీసులు విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఆరుగురిని ఎందుకు చంపానంటే! రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో
-
ఐబీ ఆఫీసర్ హత్య కేసు: ఆప్ మాజీ నేతను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)) ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్తో పాటు మరో నలుగురిని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు దోషులుగా తేల్చింది.ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా, మొత్తం ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది కోర్టు, ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్తుది తీర్పును వెలువరించారు. 11 మంది నిందితులకు గాను తాహిర్ హుస్సేన్, హసీన్ (అలియాస్ ముల్లాజీ), నజీమ్, కాసిమ్, సమీర్ ఖాన్లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. మరో ఆరుగురిని సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా వదిలేసింది. దోషులుగా తేలిన వారిపై హత్య (302), అల్లర్లు (147, 148), మత విద్వేషాలు రెచ్చగొట్టడం (153A) తదితర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయి. దోషులకు విధించే శిక్షల వివరాలను త్వరలోనే కోర్టు ఖరారు చేయనుంది.2020, ఫిబ్రవరి 25వ తేదీన సీఏఏ అల్లర్ల సమయంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని చాంద్బాగ్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంకిత్ శర్మ ఇక తిరిగి రాలేదు. ఆ రోజు అప్పుడే ఇంటికి వచ్చిన అంకిత్ శర్మ.. అల్లరి మూకలు స్థానికంగా రెచ్చిపోవడం గమనించారు. దాంతో బయటకు వెళ్లి వారిని సద్దుమణిచే యత్నం చేశారు. అలా ఆప్ కౌన్సిలర్గా ఉన్న హుస్సేన్ ఇంటికి వెళ్లిన అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేసి డ్రెయిన్లో పడేశారు. తన కొడుకు ఎంతకీ ఇంటికీ రాకపోయే సరికి ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి రవీందర్ కుమార్. దాంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ యువకుని మృతదేహం డ్రెయిన్లో ఉన్న విషయం గమనించడంతో అతను అంకిత్ శర్మగా నిర్దారణ అయ్యింది. దీనిపై హుస్సేన్తో పాటు 11 మందిపై కేసు నమోదైంది. అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేశారు. విచారణలో అంకిత్ శర్మ 51 కత్తిపోట్లకు గురైనట్లు తేలింది.2023. మార్చిలో , అల్లర్లు, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, హత్య, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు సంబంధించి హుస్సేన్తో సహా 11 మంది నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఆ సమయంలో తన గ్రూపును హుస్సేన్ రెచ్చగొట్టారనే ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు సమర్ధించడంతో వారికి జైలు శిక్ష పడింది.తన బెయిల్కు చేసుకున్న అభ్యర్థనను కూడా అంతకుముందు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్పై అభియోగాలు తీవ్రంగా ఉండటంతో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. తాజాగా వారిని దోషులుగా తేల్చుతూ కర్కర్దూమా కోర్టు తీర్పును వెలువరించింది. -
శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్
ఆగ్రా: ఓ వ్యక్తి తన కన్నతల్లికి విషం పెట్టాడు. పిల్లనిచ్చిన అత్త మాటలు విని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అతడు. ఈ ఘటన ఆగ్రాలోని పిధౌరా పరిధిలో ఉన్న బర్పురా గ్రామంలో జరిగింది. నిందితుడు రవీంద్ర, అతని తమ్ముడు ముకేశ్ మధ్య భూ వివాదం తలెత్తింది. ఆ వివాదం తర్వాత రవీంద్ర భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి తీసుకురావడానికి రవీంద్ర అత్తింటికి వెళ్లగా, అతని అత్త ఓ షరతు పెట్టింది. తన కూతురిని తిరిగి పంపాలంటే ‘‘ముందుగా నీ తల్లిని చంపాలి’’ అని ఆమె చెప్పింది. తల్లికి పెట్టే శనగ కూరలో విషం కలిపి చంపాలని కూడా అత్త సూచించింది. రవీంద్ర ఆ షరతుకు అంగీకరించి ఇంటికి వచ్చాడు. అనంతరం శనగ కూరలో విషం కలిపి తన తల్లికి తినిపించాడు. దీంతో ఆమె ఆరోగ్యం విషమించింది.కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. అతని అత్త ఫూల్వతి పరారీలో ఉండగా, ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.ఈ కేసు వివరాలను సహాయ పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ వెల్లడించారు. రవీంద్రను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఫూల్వతిని పట్టుకునేందుకు దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. -
ప్రశాంతగా చచ్చిండు.. రాజ్ కుమార్ చావు పై అన్న రియాక్షన్
-
క్లూజ్ టీమ్ చేతికి ఆధారాలు
-
ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!
హైదరాబాద్: షాబాద్ హత్య కేసుల నిందితుడు రాజ్కుమార్ ఈరోజు(సోమవారం, జూలై 13వ తేదీ) సాయంత్రం ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలో అతని మృతదేహం లభించింది. అయితే హత్యలకు ముందే సెల్పీ వీడియో తీసుకున్న విషయం పోలీసులు కనుగొన్నారు. ఇదిలా ఉంచితే, ఘటనా స్థలంలో రాజ్కుమార్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రాజ్కుమార్కు ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఇచ్చారని, అతడ్ని కాల్చి కాల్చి చంపేసి ఉండాల్సిందంటూ పోలీసుల వద్ద ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కన్నబిడ్డలను సైతం రాజ్కుమార్ పొట్టనబెట్టుకున్నాడని సోదరుడు ప్రధానంగా ప్రస్తావించాడు. ఆ పిల్లల్ని బతకనిస్తే కనీసం తానైనా చూసుకునేవాడనన్నాడు. ఈ నరరూప రాక్షసుడ్ని అప్పుడే కాల్చి పారేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని కోపావేశం ప్రదర్శించాడు.ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్కుమార్ మృతి -
పుట్టినరోజునే భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపిన కానిస్టేబుల్
న్యూఢిల్లీ: భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవంపై నిలబడాలి. కానీ అదే బంధంలో కోపం, అనుమానం, అహంకారం ఉంటే ఏదో ఒక క్షణంలో జీవితం చీకటిగా మారుతుంది. ఒకప్పుడు జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చిన వ్యక్తే ప్రాణాలు తీసే స్థితికి చేరితే అంతకంటే హృదయవిదారకమైన విషాదం ఇంకొకటి ఉండదు. అలాంటి కన్నీరు తెప్పించే ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది.నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపాడు ఓ కానిస్టేబుల్. సోమవారం తెల్లవారుజామున తూర్పు ఢిల్లీలోని కల్యాణ్పురి ప్రాంతంలో దంపతులు స్కూటర్పై వెళ్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భర్త మనీశ్ భాటి స్కూటర్ను ఆపగా ఇద్దరూ దిగిన తర్వాత కూడా వాగ్వాదం కొనసాగింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం.. భాటి తన భార్యపై కాల్పులు జరిపి ఆమెను రోడ్డుపైనే వదిలి అక్కడి నుంచి పారిపోయాడు.రోడ్డుపక్కన మహిళ మృతదేహాన్ని దారిన వెళ్లే ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ గుర్తించి వెంటనే ఆమెను తూర్పు ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి (ఎల్బీఎస్) ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.మనీశ్ భాటి ఇటీవల తూర్పు ఢిల్లీలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (ఏఏటీఎస్)లో విధుల్లో చేరాడు. మృతురాలు భాటి భార్య ప్రియాంక (26)గా గుర్తించారు. ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసేది. ఈరోజు ప్రియాంక పుట్టినరోజు. నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేసేందుకు గాలింపు కొనసాగుతోంది. -
షాబాద్ సైకో కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దుల్లోనూ అతడి కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో పుకార్లను నమ్మవద్దని.. అధికారికంగా ఏది ఉన్నా తామే ప్రకటిస్తామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. రాజ్కుమార్పై నమోదైన పోక్సో కేసులో మంజూరైన బెయిల్ ఆర్డర్ కాపీలోని కీలక అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మైనర్ బాలికను ఏడాది కాలంగా రాజ్కుమార్ వేధిస్తున్నాడని, ఆమె ఇంటి వైపు సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిఘా పెట్టాడని బాలిక తల్లి చిట్యాల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నీ తండ్రిని చంపినట్లే.. మిమ్మల్ని చంపుతానని బాలికను అతను బెదిరించినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న రాజ్కుమార్ను అరెస్టు చేశారు. అనంతరం రాజ్కుమార్ కోర్టును ఆశ్రయించగా.. జూన్ 12న బెయిల్ లభించింది. అయితే.. బెయిల్ విచారణ సందర్భంగా రాజ్కుమార్ తరఫు న్యాయవాది పలు వాదనలు వినిపించారు. మైనర్ బాలిక తండ్రి గతంలో తన వద్ద అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగినందుకే తనపై తప్పుడు కేసు పెట్టారని రాజ్కుమార్ కోర్టుకు తెలిపాడు. అలాగే, తనపై వేధింపుల ఆరోపణలు చేసిన రోజు తాను అక్కడ లేనని, తన భార్యతో కలిసి ఆస్పత్రికి వెళ్లినట్లు కూడా వాదించాడు. ఇరువైపులా వాదనలను విన్న కోర్టు.. రాజ్కుమార్కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ విచారణ సందర్భంగా రాజ్కుమార్ తరఫున కోర్టులో వినిపించిన వాదనలు, అందులో నమోదైన వివరాలు ప్రస్తుతం ఈ కేసులో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అయితే బాలిక కుటుంబం మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. ఎనిమిదేళ్ల కిందట సరితను ప్రేమవివాహం చేసుకున్న రాజ్కుమార్.. ఇద్దరు పిల్లల్ని కన్నాడు. తన పక్కింట్లో ఉండే మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను వేధించగా.. భార్య సైతం అతన్ని అసహ్యించుకుని దూరం పెట్టింది. ఆపై బాలికకు వేధింపులు ఎక్కువ కావడంతో ఆ కుటుంబం పోక్సో కేసు పెట్టింది. దీంతో జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రతీకారంతో రగిలిపోతూ.. శుక్రవారం(జులై 10వ తేదీ) రాత్రి మైనర్ బాలికను, ఆమె తల్లి, నాన్నమ్మలతో పాటు తన భార్య సరిత, ఇద్దరు బిడ్డల్ని గొంతు కోసి చంపాడు. అనంతరం.. తన తండ్రికి ఫోన్ చేసి ఆరుగుర్ని చంపానని, తాను చనిపోతానని చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. అప్పటి నుంచి ఆ నరరూప రాక్షసుడి కోసం జల్లెడ పడుతున్నారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కారణంగానే ఆరుగురి ప్రాణాలు పోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో రాజ్కుమార్పై ఏడేళ్లలోపు నేరం కింద సెక్షన్లు నమోదు చేయడం వల్లనే సలువుగా బెయిల్ వచ్చిందని.. పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు విఫలమయ్యారని.. నిందితుడిపై నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు జరగ్గా.. షాబాద్ అధికారులను పోలీస్ శాఖ సస్పెండ్ చేయడం గమనార్హం. -
రాజ్ కుమార్ కేసులో Big Twist
-
సాయి కృష్ణ కేసుకు బ్రేకులు
-
ఇండియాకి రాగానే నందు దంపతులకు ఎదురయ్యేది ఇదే!
-
మేనమామతో పెళ్లి.. నా కూతురికి చుక్కలు చూపించాడు!
ఇచ్ఛాపురం రూరల్: ‘సొంతవాడే కదా.. మా బిడ్డను బంగారంగా చూసుకుంటాడు’ అనే ఆశతో కుమార్తెను మేనమామకు ఇచ్చి వివాహం చేసిన తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన మరడ రుక్మిణమ్మ, దేవేందర్ల కుమార్తె ధనలక్ష్మి(27)ని 2018 ఆగస్టులో ఒడిశా రాష్ట్రం రొంపా బొరడా గ్రామానికి చెందిన నందిక లోకనాథంకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఏడేళ్ల కుమారుడు రక్షిత్ ఉన్నాడు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతుండటంతో ధనలక్ష్మి కన్నవారి గ్రామం ధర్మపురంలో ఉంటోంది. పెద్దలు పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ భర్త వేధింపులు తీవ్రంగా ఉండటంతో మనస్థాపం చెందిన ధనలక్ష్మి శనివారం రాత్రి కన్నవారింట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతదేహం వద్ద రక్షిత్ ‘అమ్మా.. లేవమ్మా.. నాతో మాట్లాడమ్మా..!’ అంటూ అమాయకంగా పిలుస్తూ కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. మృతురాలి తల్లి రుక్మిణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కోనసీమ రావులపాలెంలో యువకుడు దారుణ హత్య..
ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దుండగులచేతిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా, రావులపాలెంలో విషాదకర ఘటన జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు తలను బండరాళ్లతో మోది కిరాతకంగా హత్యచేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి అను సాయి అలియాస్ నల్లసాయిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
అనంతగిరి ట్రెక్కింగ్లో విషాదం
అనంతగిరి: వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన ట్రెక్కింగ్లో విషాదం చోటు చేసుకుంది. వివరాలివి. హైదరాబాద్లోని కంచన్బాగ్ డీఆర్డీఏ ప్రాంతానికి చెందిన ప్రియామోల్ (47) ప్రైవేట్ టీచర్. ఆమె కుటుంబీకులు, బంధువులతో కలిసి అనంతగిరి అర్బన్ పార్క్లో ట్రెక్కింగ్కు వెళ్లారు.ట్రెక్కింగ్ మార్గంలోని వాచ్ టవర్ సమీపానికి చేరుకోగానే ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. గమనించిన కుటుంబీకులు అటవీ సిబ్బందితో ఆమెను వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ప్రాథమికంగా గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
మూడ్రోజుల సహజీవనం.. ఏఐ ఇంజినీర్ ఘాతుకం
ప్రేమగా మొదలైన బంధం.. కలిసి జీవించాలని తీసుకున్న నిర్ణయం.. కేవలం మూడు రోజుల్లోనే విషాదాంతమైంది. ఒకే ఇంట్లో జీవితం ప్రారంభించిన యువజంట మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. యువతి కత్తిపోట్లతో రక్తపు మడుగులో కనిపించగా, ఆమె ప్రియుడు కొన్ని గంటల వ్యవధిలోనే రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ప్రేమ, సహజీవనం, అనుమానాల మధ్య మరో విషాదకథగా మారింది.హర్యానాలోని గురుగ్రామ్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన ఇషారా అయూబీ గురుగ్రామ్లోని సెక్టార్-55లో అద్దె ఫ్లాట్లో నివసిస్తోంది. ఛత్తీస్గఢ్లోని భిలాయ్కు చెందిన శ్రేష్ఠ్ మాలిక్ (25) గురుగ్రామ్లో ప్రముఖ కంపెనీలో ఏఐ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలె సహజీవనం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.ఫోన్ ఎత్తకపోవడంతో..ఆదివారం ఇషారాకు కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫ్లాట్కు చేరుకుని తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. ఇషారా రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించింది. ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది.రైల్వే ట్రాక్పై శవంగా..దర్యాప్తులో భాగంగా ఘటనకు ముందు శ్రేష్ఠ్ మాలిక్ ఇషారా ఫ్లాట్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలిస్తుండగా.. గర్హీ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై రెండు ముక్కలైన ఓ యువకుడి మృతదేహం కనిపించినట్లు సమాచారం అందింది. మృతదేహం వద్ద లభించిన మొబైల్ ఫోన్ ఆధారంగా అతడిని శ్రేష్ఠ్గా గుర్తించారు. ప్రియురాలిని హత్య చేసిన అనంతరం అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మూడ్రోజుల క్రితమే కలిసి నివాసంపోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరూ మూడ్రోజుల క్రితమే ఒకే ఫ్లాట్లో కలిసి నివసించడం ప్రారంభించినట్లు తేలింది. అయితే వీరి మధ్య ఏం జరిగింది? ఏ కారణంతో ఈ ఘర్షణ హత్యకు దారితీసింది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.మొబైల్ చాట్లు, కాల్ రికార్డుల పరిశీలనఇద్దరి మొబైల్ ఫోన్లు, కాల్ రికార్డులు, చాట్ హిస్టరీతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువతిని హత్య చేసిన కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన వెనుక అసలు కారణం పోస్టుమార్టం నివేదికలు, సాంకేతిక ఆధారాలు, విచారణ పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
మేఘాలయ షిల్లాంగ్లో ఘోర ప్రమాదం! బావిలో విషవాయువుతో..
మేఘాలయ: మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారంరోజున ఒక ప్రైవేట్ నిర్మాణ స్థలంలోని ఓ బావిలో విషవాయువుతో ఐదుగురు మృతి చెందారు.తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా పోలీసు అధిపతి వివేక్ సియెమ్ తెలిపిన వివరాల ప్రకారం.. లాపాలాంగ్ ప్రాంతంలోని ప్రైవేట్ స్థలంలో ఉన్నటువంటి బావిలో నలుగురు కూలీలు నీరు తోడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. బావిలో ఉన్నటువంటి జనరేటర్ నుంచి విషపూరిత వాయువు వెలువడింది. ఈ పొగ కారణంగా వారికి ఊపిరాడక అక్కడే కుప్పకూలారు. అయితే, వీరిని రక్షించేందుకు అదే ప్రాంతంలో నివసించే ఇద్దరు సొంత సోదరులు బావిలోకి దిగారు. దీంతో దట్టమైన పొగ ఎక్కువవడంతో వారుకూడా అందులోనే చిక్కుకుపోయారు. ఎలాగోలా ఒక వ్యక్తి మాత్రం సురక్షితంగా బయటపడగలిగాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తక్షణమే రెస్క్యూ టీంతో రక్షణ చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఈ విషాదకర దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే, పోస్టుమార్టం నుంచి ఖచ్చితమైన నివేదికలు వచ్చిన తరువాతే మరణాలకు గల అసలు కారణాలేంటో స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. -
ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా: ప్రేమ విఫలమై యు వతి ఆత్మహత్యకు పాల్పడిన ఘ టన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చందారం గ్రామానికి చెందిన తు మ్మ అర్చన(21), సమీప గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు వారి ప్రేమను ఒప్పుకోలేదు. మనస్తాపం చెందిన యువకుడు గత 20 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి అర్చన మానసికంగా బాధపడుతుంది. ఈక్రమంలో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తల్లి భారతి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈరోజు తెల్లవారుజామున ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదు. ఫిలింనగర్ సైట్ 2 రోడ్ నంబర్ 5 లో ఉదయం 4 గంటల సమయంలో ఫెరారీ స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్నటువంటి హిల్ వ్యూ అపార్ట్మెంట్ గేటు బద్దలు కొట్టి లోనికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. ప్రమాదం జరిగిన వెంటనే యువకులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మద్యం మత్తులో ఉన్న యువకులు ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫెరారీ స్పోర్ట్స్ కారును క్రేన్ సహాయంతో టోయింగ్ వెహికల్ లో ఫిలింనగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే, ఈ ప్రమాదం మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా? లేదంటే నెగ్లిజెన్సీ రాష్ డ్రైవింగ్ కారణమా? ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దైవాలగూడ ఘటన: భగ్గుమన్న షాబాద్.. ఎస్ఐపై వేటు
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో నిందితుడు రాజ్కుమార్ ఆరుగురిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీసుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు షాబాద్ చౌరస్తాలో ఈ ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆందోళన చేస్తున్న గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. "పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈరోజు ఆరుగురు ప్రాణాలు పోయేవి కావు" అంటూ గ్రామస్తులు పోలీసులపై మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ కీలక ప్రకటనలు చేశారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ రమేశ్ను సస్పెండ్ చేశామని, దర్యాప్తులో ఎవరిపై బాధ్యత తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే హత్యాకాండలో ప్రాణాలతో బయటపడిన దివ్యాంగ బాధితురాలికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దీంతో గ్రామస్తులు శాంతించి ఆందోళన విరమించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. అంతకు ముందు.. ఈ ఉదయం బాధిత బాలిక బంధవులు, గ్రామస్తులు హైవేపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిందితుడు రాజ్కుమార్ను తమకు అప్పగించాలని.. ఆ నరరూప రాక్షసుడి సంగతి తేలుస్తామంటూ నినాదాలు చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లను పెట్టి.. పోక్సో కేసు నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని.. అరెస్టై రెండు నెలలు తిరగకముందే నిందితుడిని వదిలేశారని ఎస్సైపై గ్రామస్తులు ఆరోపణలు గుప్పించారు. ఒకానొక టైంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేకు చేదు అనుభవంగ్రామస్తుల ఆందోళన సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య.. షాబాద్ చౌరస్తాకు చేరుకున్నారు. ఆ సమయంలో గ్రామస్తులకు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన్ని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఏం జరిగిందంటే..దైవాలగూడ గ్రామానికి చెందిన పార్వతి రాజ్కుమార్ ఓ మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించ సాగాడు. ఈ క్రమంలో అతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మే చివరి వారంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం స్టేషన్ బెయిల్ మీద రాజ్కుమార్ బయటకు వచ్చాడు. ఓ కారు అద్దెకు తీసుకుని సరాసరి బాధితురాలి ఇంటికి వెళ్లి.. ఆమె తల్లి, నాన్నమ్మల గొంతు కోశాడు. ఆపై బాలికను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి శివారులోని చెరువు వద్ద అత్యాచారం జరిపాడు. ఆపై తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు బిడ్డలను కిరాతకంగా చంపేశాడు.ముందే బెదిరింపులు.. పట్టించుకోని పోలీసులు?దైవాలగూడ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. శంషాబాద్లో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్లిన బాధితురాలిని రాజ్కుమార్ బెదిరించినట్లు తెలుస్తోంది. "మీ నాన్నను ఎలా చంపేశానో.. మిమ్మల్నీ అలాగే చంపేస్తా"** అంటూ రాజ్కుమార్ గతంలోనే బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కూడా వారు ఆరోపించారు. ఆ సమయంలోనే కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈ మారణహోమం జరిగేది కాదని, ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పరారైన కారు గుర్తింపు..మరోవైపు పరారీలో ఉన్న నిందితుడు రాజ్కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు అతను ఉపయోగించిన కారును నందిగామ సమీపంలో గుర్తించారు. అక్కడ కారు వదిలేసి సమీప రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అతడి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు కారు రెంట్కు ఇచ్చిన ఓనర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేతల అరెస్టులుఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు దైవాలగూడకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలకు పోలీసులు చేవెళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. వాళ్లలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలు ఉఉన్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, పట్నం నరేందర్రెడ్డిలను శంకర్పల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా, పట్లోళ్ల కార్తీక్రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో షాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఒకవైపు గ్రామస్తుల ఆందోళనలు, మరోవైపు పోలీసులపై తీవ్ర ఆరోపణలు, ఇంకోవైపు ప్రతిపక్ష నేతల అరెస్టులతో **షాబాద్ హత్యాకాండ** రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్కుమార్ను పట్టుకోవడంపై, అలాగే పోలీసుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై అందరి దృష్టి నెలకొంది. -
ప్రియుడి మోజులో కట్టుకున్నవాడిని కాటికి పంపుతున్న భార్యలు
-
విశాఖ: టెకీ రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అరెస్టు
ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీ హిల్ స్టేషన్ హోటల్లో గత కొన్నిరోజులక్రితం తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి అనుమానస్పద స్థితిలో మరిణించిన విషయం తెలిసిందే.అయితే, ఈ హత్యకు ప్రధాన నిందితుడు తన అల్లుడు శ్రీ చరణే అని మృతిరాలి తండ్రి పలు ఆరోపణలు చేశారు. తండ్రి చేసిన ఆరోపణలతో రంగంలోకి దిగిన పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై భర్త శ్రీచరణ్ని డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. -
రాజ్ కుమార్ అత్త విస్తుపోయే నిజాలు.. నా ప్రాణం పోయే వరకు వాడిని నేను వదల..
-
అమ్మాయిల లోదుస్తులు దొంగలించి.. వికృత చేష్టలు..!
మహిళల దుస్తులు కాజేసి సీసీ టీవీ కెమెరా ముందు అశ్లీలంగా ప్రవర్తించే అసోంకు చెందిన వికృత కాముకుడిని బెంగళూరు ఇందిరానగర పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ హుసేన్ పట్టుబడిన వ్యక్తి. కంపెనీలో డెలివరీ బాయ్గా పని చేస్తూ ఇందిరానగరలో నివాసం ఉంటున్నారు. దుస్తులు కాజేయడంపై యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందిరానగర పోలీసులు అబ్దుల్ హుసేన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించగా, బెయిల్పై విడుదలైనట్లు పోలీసులు తెలిపారు.స్నేహితురాలితో కలిసి హొయ్సళనగరలో ఓ యువతి నివాసం ఉండేది. గత మే నెల నుంచి ఇంటి కాంపౌండు లోపల దుస్తులు ఆరబెట్టిన స్దలంలో పలుమార్లు దుస్తులు చోరీకి గురయ్యాయి. కొద్దిరోజుల అనంతరం పాత దుస్తులు మళ్లీ కౌంపౌండ్లో పెట్టి కొత్త దుస్తులు మాత్రమే చోరీ చేసేవారని యువతి ఇందిరానగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుస్తులు పలుమార్లు చోరీకి గురికావడంపై యువతి రహస్య కెమెరా అమర్చింది. ఈనెల 2వ తేదీ తెల్లవారు జామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి కాంపౌండ్లోకి అక్రమంగా ప్రవేశించి గతంలో చోరీ చేసిన దుస్తులు ధరించి మళ్లీ దుస్తుల చోరీకి పాల్పడ్డాడు. అంతేగాక కెమెరా ముందు అశ్లీలంగా ప్రవర్తించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇందిరానగర పోలీసులు తీవ్రంగా గాలించి అరెస్ట్ చేసి జైలుకు పంపించగా బెయిల్పై విడుదలయ్యాడు. -బెంగళూరు -
ముగ్గురు బాలికలపై కామాంధుడి లైంగిక దాడి..!
కర్ణాటక: రాచనగరి మైసూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ముగ్గురు బాలికలపై ఓ కామాంధుడు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. నిందితుడు మొదట 9వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అసభ్యకరమైన వీడియో క్లిప్తో ఆమెను బెదిరించి, తన స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి చేశాడు. అనంతరం ఆమె తీసుకువచ్చిన మరో ఇద్దరు బాలికలపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ఘోరం వెలుగు చూడగా పోలీసులు సదరు కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టి విచారణ చేస్తున్నారు. ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. ఓ బాలిక మైసూరులోని విజయనగరలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు తన పొరుగు గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని ఇన్స్టా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను ఆమెతో నిరంతరం సంప్రదిసూ మాయమాటలతో తన ఇంటికి రప్పించుకున్నాడు. అతడిని నమ్మిన బాలిక విజయనగరలోని అతని ఇంటికి వచ్చింది. ఆ సమయాన్ని ఉపయోగించుకుని, అతను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన మొబైల్ ఫోన్లో ఆమె అశ్లీల వీడియోను చిత్రీకరించాడు. అలా అతను ఆమెను పదేపదే లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఆ వీడియో క్లిప్లను చూపుతూ ఆమెను బెదిరించాడు. స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి తన స్నేహితురాళ్లను తనతో పాటు ఇంటికి తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక, తన ఇద్దరు స్నేహితురాళ్లను అతని ఇంటికి తీసుకువెళ్లింది. అతను వారిపై కూడా లైంగిక దాడికి పాల్పడటమేగాక మిగతా స్నేహితురాళ్లను కూడా తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆందోళనకు గురైన ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. దీంతో వారు ఒడనాడి సేవా సంస్థకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన స్పయాని, పరశు ఈ విషయాన్ని బాలల సంరక్షణ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు విజయనగర డివిజన్ ఏసీపీకి కూడా ఈ సంఘటనల గురించి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. బాలల సంరక్షణ కమిటీ కూడా బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
అమ్మ సన్నిధిలో ఆడబిడ్డకు రక్షణ కరువు
విజయవాడపశ్చిమ, ఇంద్రకీలాద్రి: శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మహిళా సెక్యూరిటీ గార్డుపై వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా సెక్యూరిటీ గార్డును అదే విభాగంలో విధులు నిర్వహిస్తున్న మరో గార్డు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు సెక్యూరిటీ సీఎస్వోకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు గత కొంత కాలంగా మహామండపం రెండో అంతస్తులోని అన్నదానం విభాగంలో భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటుంది. అయితే అదే ఫ్లోర్ ఇన్చార్జిగా ఉన్న సూపర్వైజర్ కిరణ్ అనే గార్డు కొంతకాలంగా ఆ మహిళా గార్డును వేధింపులకు గురి చేయసాగాడు. విధులు ముగిసిన అనంతరం మూడో అంతస్తులోని కార్యాలయానికి వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తానని బెదిరింపులకు దిగాడు. గతంలో దుర్గాఘాట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ కిరణ్ ఆ మహిళా గార్డును వేధింపులకు గురి చేయడమే కాకుండా వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడేవాడు.అప్పట్లో సెక్యూరిటీ సూపర్వైజర్లు కిరణ్ను పిలిచి మందలించినా ప్రయోజనం లేకపోయింది. తాజా వేధింపులపై బాధితురాలు సెక్యూరిటీ అధికారికి ఫిర్యాదు చేసింది. ఆలయ అధికారుల సూచన మేరకు సీఎస్వో రూపేంద్రబాబు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సదరు ఫిర్యాదుపై సీఐ శుక్రవారం ఆలయానికి చేరుకుని మహా మండపం రెండో అంతస్తులో తోటి గార్డులతో పాటు సూపర్వైజర్లు, ఇతర సిబ్బందిని విచారించారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు సీరియస్గా తీసుకుని సదరు సూపర్వైజర్ కిరణ్ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. -
తల్లినే కాదు.. తండ్రిని కూడా కడతేర్చిందా?
ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబ ఆస్తి కోసం కన్న తల్లినే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైపూర్ యువతి ఆయుషి శర్మ (23) కేసులో మరో సంచలన మలుపు తిరిగింది. ఇప్పటికే తల్లి నీరజ్ శర్మ హత్య కేసులో అరెస్టైన ఆయుషిపై.. ఇప్పుడు తన తండ్రి విజయ్ శర్మ మరణంలోనూ పాత్ర ఉండొచ్చనే అనుమానాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో ఈ కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.విజయ్ శర్మ రాజస్థాన్ హైకోర్టులో కోర్ట్ మాస్టర్గా పనిచేసేవారు. అనారోగ్యానికి గురైన ఆయన 2025లో మరణించారు. ఆయన మృతి అనంతరం కారుణ్య నియామకం కింద భార్య నీరజ్ శర్మకు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగం లభించింది. అయితే ఆ ఉద్యోగం తనకే రావాలని కుమార్తె ఆయుషి భావించినట్లు, అదే సమయంలో కుటుంబ ఆస్తి విషయంలోనూ విభేదాలు తీవ్రరూపం దాల్చాయి..ఈ నేపథ్యంలో జూలై 3న కోచింగ్ సెంటర్లో తన కుమారుడిని దింపి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న నీరజ్ను అతివేగంగా వచ్చిన ఎస్యూవీ ఢీకొట్టింది. తొలుత ఇది రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ.. దర్యాప్తులో ఇది ముందే పథకం వేసి చేసిన హత్య అని తేలింది. తల్లి హత్య కోసం ఆయుషి బంధువులతో కలిసి రూ.7 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు(ఆయుషి కజిన్) పరారీలో ఉన్నాడు.ఇదే కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నీరజ్ సోదరుడు రాకేశ్ శర్మ మరో సంచలన ఫిర్యాదు చేశారు. తన బావ విజయ్ శర్మ మరణం కూడా సహజ మరణం కాదని, దాని వెనుక కూడా ఆయుషి, ఆమె బంధువు బలరామ్ పాత్ర ఉండొచ్చని ఆరోపించారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న విజయ్ను ఇంటి నుంచి తీసుకెళ్లి నెలల తరబడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, చివరకు ఆస్పత్రిలో చేర్చినప్పటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.తండ్రి మరణం అనంతరం ప్రభుత్వ ఉద్యోగం తనకే ఇవ్వాలని, కుటుంబ ఆస్తి మొత్తం తన పేరుపై బదిలీ చేయాలని ఆయుషి ఒత్తిడి తెచ్చింది. అంతేకాదు.. ఒకసారి తల్లితో జరిగిన వాగ్వాదంలో "నాన్న ఫీడింగ్ ట్యూబ్ తీసేసి చంపగలిగాం.. నిన్ను చంపడం ఇంకా సులువు" అని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందు నీరజ్ శర్మ వాట్సాప్లో "నాకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి" అనే భావం వచ్చే స్టేటస్ పెట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీటి ఆధారంగా పోలీసులు విజయ్ శర్మ మరణంపైనా దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు.. ఈ కేసులో మరో సంచలన కోణం కూడా బయటపడింది. ఆయుషి తన తల్లి నీరజ్పై విపరీతమైన ద్వేషం పెంచుకుందని తెలిసింది. తన గురించి కాకుండా ఎప్పుడూ తన దివ్యాంగ సోదరుడి గురించే తల్లి ఎక్కువగా ఆలోచించేదని.. అతన్నే ప్రేమగా చూసేదని బంధవువుల వద్ద ఆయుషి వాపోయేదట. ఈ క్రమంలోనే.. కుటుంబ ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం, వ్యక్తిగత కక్షలే ఈ హత్య వెనుక ప్రధాన కారణాలై ఉంటాయని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం విజయ్ శర్మ మరణానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. వైద్య చికిత్స వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా విజయ్ శర్మ మరణంపై ప్రత్యేక కేసు నమోదు చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న కేసులో అదనపు అభియోగాలు చేర్చాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ కేసు రాజస్థాన్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేసి..
వరంగల్: ఉమ్మడి జిల్లా జనగామలో అర్ధరాత్రి వేళ నిలిపి ఉంచిన బస్సును ఓ వ్యక్తి దొంగతనం చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. విధులు ముగించుకున్న ఆర్టీసీ డ్రైవర్లు జనగామ బస్టాండ్లో రాత్రి అక్కడే బస్సును నిలిపిఉంచారు.అయితే, పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తి బస్టాండ్ సిబ్బంది నిద్రిస్తున్నవేళ ఆర్టీసీ అద్దె బస్సును స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. సూర్యాపేట వైపు సుమారు 21 కిలోమీటర్ల దూరం నడిపాడు. అలా.. సింగరాజుపల్లి టోల్ గేట్ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టడంతో అక్కడే ఆగిపోయింది. బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడు మద్యం సేవించి ఉండటంతో, ఆ మత్తులోనే ఇదంతా జరిగినట్లుగా తెలుస్తోంది. నిందితుడు వెంకన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తిజనగామ బస్టాండులో నిలిపి ఉన్న అద్దె ఆర్టీసీ బస్సును మద్యం మత్తులో ఎత్తుకెళ్లిన పాలకుర్తికి చెందిన వెంకన్న అనే వ్యక్తిజనగామ నుండి సూర్యాపేట వైపు దాదాపు 21 కిలోమీటర్లు బస్సు తీసుకెళ్లిన క్రమంలో, సింగరాజుపల్లి టోల్ ప్లాజా వద్ద… pic.twitter.com/lo0Ho21wyf— Telugu Scribe (@TeluguScribe) July 10, 2026 -
దైవాలగూడలో రాక్షసక్రీడ.. ముందే హత్యాచారం!
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన సామూహిక హత్యలు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. పోక్సో కేసులో బెయిల్పై విడుదలైన రాజ్కుమార్.. ప్రతీకారాన్ని అత్యంత దారుణంగా తీర్చుకున్నాడు. గంటల వ్యవధిలోనే ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్యలు జరిగిన తీరు, దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న వివరాలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పార్వతి రాజ్కుమార్ కారులో బాధిత బాలిక(17) ఇంటికి ఓ కారులో చేరుకున్నాడు. ఆ సమయంలో బాలికను తనతో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే వారి మాటలను పట్టించుకోకుండా బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామ శివారులోని చెరువు సమీపానికి తీసుకెళ్లాడు.అక్కడ బాలికపై అత్యాచారం చేసిన అనంతరం ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం అక్కడి నుంచి నేరుగా మళ్లీ బాలిక ఇంటికే చేరుకున్న రాజ్కుమార్.. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్లను కత్తితో దాడి చేసి ఇద్దరినీ హతమార్చాడు. అక్కడి నుంచి రాజ్కుమార్ నేరుగా తన ఇంటికి వెళ్లాడు. పిల్లల కోసమంటూ..ఇంటికి వెళ్లే ముందు భార్య సరితకు ఫోన్ చేసి.. "పిల్లలను చూడాలని ఉంది" అని చెప్పాడు. దీంతో ఆమె ఎలాంటి అనుమానం లేకుండా తలుపులు తీసినట్లు సమాచారం. ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణాలు దక్కించుకునేందుకు సరిత బయటకు పరుగెత్తినా.. వెంబడించి పట్టుకుని మరీ హత్య చేసినట్లు తెలుస్తోంది.ఆ తర్వాత ఇంట్లో ఉన్న తన మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడినీ వదల్లేదు. ఇద్దరు చిన్నారుల గొంతులు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రలో ఉన్న చిన్నారులు.. అలాగే బెడ్ మీద రక్తపు మడుగులో కన్నుమూశారు. పోక్సో కేసు నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను ద్వేషించడం, పిల్లల్ని దగ్గరకు రానివ్వద్దన్న ఉద్దేశంతోనే హతమార్చినట్లు తెలుస్తోంది.పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. నిందితుడు హత్యల సమయంలో శబ్దం బయటకు వెళ్లకుండా అత్యంత వేగంగా, వరుసగా దాడులు చేసినట్లు భావిస్తున్నారు. దీంతో బాధితులకు సహాయం కోరే అవకాశం లేకపోయిందని అధికారులు చెబుతున్నారు.ఆరుగురిని హతమార్చిన అనంతరం రాజ్కుమార్ కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్లే ముందు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరుగురిని చంపానని.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి స్విచ్చాఫ్ చేసుకున్నాడు. రాజ్కుమార్ తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికీ నిందితుడు పోలీసులకు చిక్కలేదు.ప్రేమ, పెళ్లి పేరిట వేధింపులురాజ్కుమార్ ఏడేళ్ల కిందట.. సరితను ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే దైవాలగూడకే చెందిన బాలికను ఇటీవల ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు శంషాబాద్లోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజీకి వెళ్లే సమయంలోనూ రాజ్కుమార్ ఆ మెను వెంబడించి.. కలవాలని, మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడట. ఈ బెదిరింపులకు భయపడి బాధితురాల్ని కాలేజీకి పంపడం మానేశారు. అయితే పరీక్షలకు మాత్రం దగ్గరుండి ఆమె తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేయగా.. తల్లి రక్షించుకుంది. వేధింపులు ఎక్కువయ్యే సరికి బాధిత బాలిక తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మే 16న పోక్సో కేసు నమోదు కాగా.. మే 26న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే.. కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేసిన పోలీసులు.. కేవలం రూ.20,000 పూచీకత్తుతో బెయిల్ మీద బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. రాజ్కుమార్పై గతంలోనూ ఓ భూవివాదంలో కేసు నమోదైందని తెలుస్తోంది. ఆ కేసులో ఇద్దరిపై దాడి చేశాడని అభియోగం నమోదు అయ్యింది.ఆ విషయంపై స్పష్టత లేదు: సీపీ జోషిదైవాలగూడ సామూహిక హత్యలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి కీలక వివరాలు వెల్లడించారు. హత్యల అనంతరం నిందితుడు రాజ్కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి, తాను కూడా చనిపోతున్నట్లు చెప్పినట్లు తెలిపారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదనే అంశంపై కూడా విచారణ జరుగుతోందన్నారు. రాజ్కుమార్పై పోక్సో కేసుతో పాటు గతంలో మరో కేసు కూడా నమోదైందని ధృవీకరించారు. బాధిత బాలిక తండ్రి మరణంలోనూ రాజ్కుమార్ పాత్ర ఉందా? అనే కోణంలో విచారణ జరిపామని, అయితే ఇప్పటివరకు అందుకు ఆధారాలు లభించలేదన్నారు. భార్య, ఇద్దరు చిన్నారులను ఎందుకు హత్య చేశాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, ప్రాథమిక విచారణ ప్రకారం ఈ ఆరు హత్యలను రాజ్కుమార్ ఒక్కడే చేసినట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు.పోక్సో కేసులో నమోదైన కక్షే ఈ మారణహోమానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడి కదలికలపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ఈ ఘటనలో పరారీలో ఉన్న రాజ్కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. "ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన ఆ రాక్షసుడు ఎక్కడ?" అన్న ప్రశ్న దైవాలగూడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సీసీటీవీ ఫుటేజ్షాబాద్ పోక్సో హత్యల ఘటనలో నిందితుడు బాలికను లాక్కెళ్లిన దృశ్యాలుదైవాలగూడలో రాత్రి 11 గంటలకు బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లిన రాజ్కుమార్బాలిక తల్లి, అమ్మమ్మను చంపి బాధితురాలిని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసి గొంతు కోసి… https://t.co/LWvY7DhtNE pic.twitter.com/uugkSFqnsa— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026 -
షాబాద్ ఘటన.. పోలీసులపై గ్రామస్తుల ఆగ్రహం
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకున్న సామూహిక హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోక్సో కేసులో నిందితుడిగా అరెస్టై బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్ ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ శనివారం ఉదయం షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను ముట్టడించి నినాదాలు చేశారు. పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టలేదని, బాధిత కుటుంబానికి ఎలాంటి భద్రత కల్పించలేదని ఆరోపించారు. బెయిల్పై విడుదలైన తర్వాత కూడా అతడి నుంచి ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలిసినా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించలేదని మండిపడ్డారు.ఆరుగురి హత్యలకు షాబాద్ సీఐ, ఎస్సైల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆందోళనకారులు ఆరోపించారు. రాజ్కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయినప్పటికీ.. కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం, పైగా రెండు నెలల్లోనే అతను బయటకు రావడం చర్చనీయాంశంగా మారాయి. దీంతో పోలీసులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ఒకే కుటుంబానికి చెందిన అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో షాబాద్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో, గ్రామ పెద్దలతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి బెయిల్, అనంతర పరిణామాలు, స్థానిక పోలీసుల వ్యవహారశైలిపై కూడా విచారణ జరిపే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థలో బాధ్యతను పెంచాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పోక్సో చట్టం.. కవచమా? కాగితపు పులినా?
పోక్సో కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన నిందితుడు ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడం.. అందునా బాధిత బాలికను అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోక్సో.. పిల్లలకు కవచమా? నిందితులకు అవకాశమా? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన సామూహిక హత్యలు ఈ ప్రశ్నను మరోసారి దేశం ముందుకు తెచ్చాయి. దీంతో పిల్లల రక్షణ కోసం రూపొందించిన కఠిన ‘పోక్సో’ చట్టం అమలులో ఏ మేర లోపాలున్నాయి? మైనర్లకు రక్షణ కల్పించాల్సింది బదులు నిందితులకు అవకాశంగా మారుతున్నాయా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.మన దేశంలో 2012లో లైంగిక దాడుల్లో మైనర్ల రక్షణ కోసం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇదే ఏడాది డిసెంబర్లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఈ రెండు సంఘటనలను చాలామంది ఒకటిగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి పోక్సో చట్టం నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందే (2012 నవంబర్ 14 నుంచి) అమల్లోకి వచ్చింది. అయితే నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత, లైంగిక నేరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పోక్సో చట్టం అమలు మరింత కఠినంగా మారింది. 2019లో కేంద్ర ప్రభుత్వం పోక్సోకు కొన్ని సవరణలు చేసి, కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష వరకు విధించే అవకాశాన్ని కూడా చట్టంలో చేర్చింది.పోక్సో ప్రత్యేకత ఏంటి?ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు ప్రతి బాలుడు, బాలికకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. శారీరక దాడితో పాటు లైంగిక వేధింపులు, అశ్లీల ప్రదర్శనలు, ఆన్లైన్ లైంగిక వేధింపులు, పిల్లల అశ్లీల చిత్రాల తయారీ, వినియోగం వంటి అనేక నేరాలను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అలాగే ప్రత్యేక పోక్సో కోర్టులు, ఇన్కెమెరా విచారణ, బాధితుడి గుర్తింపు గోప్యంగా ఉంచడం, పిల్లలకు అనుకూలమైన విచారణ విధానం వంటి అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి.పోక్సోకు ముందు పరిస్థితి ఏంటి?చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే.. పోక్సోకు ముందే పిల్లలపై లైంగిక నేరాలకు చట్టమే లేదనేది. కానీ అది నిజం కాదు. పోక్సోకు ముందు కూడా భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద అత్యాచారం, అసభ్య ప్రవర్తన, వేధింపులు, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్షలు విధించేవారు. అయితే ఆ చట్టాల్లో పిల్లల కోసం ప్రత్యేక నిర్వచనాలు, ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక విచారణ విధానం లేవు. ముఖ్యంగా అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులు, శారీరక సంబంధం లేకుండా జరిగే లైంగిక వేధింపులు, పిల్లలను అశ్లీల చిత్రాల్లో ఉపయోగించడం వంటి అనేక నేరాలకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనం లేకపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండేవి.పోక్సో వచ్చాక కూడా.. బెయిల్ ఎలా?పోక్సో కేసు అంటే బెయిల్ రాదనుకోవడం సరికాదు. నేర తీవ్రత, సాక్ష్యాలు, దర్యాప్తు దశ, నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, బాధితుల భద్రత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టులు బెయిల్పై నిర్ణయం తీసుకుంటాయి. అంటే చట్టం బెయిల్ను పూర్తిగా నిషేధించలేదు. అయితే బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించే షరతులు, వాటి అమలు చాలా కీలకం. షాబాద్ కేసులో..రాజశేఖర్ విషయంలో ఇదే జరిగి ఉంటుంది.చట్టంలో లోపమా.. అమలులో లోపమా?న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య ఎక్కువగా చట్టంలో కంటే అమలులోనే ఉంది. బెయిల్పై విడుదలైన నిందితులపై నిరంతర నిఘా, బాధిత కుటుంబాలకు రక్షణ, నిందితుడు బాధితులను సంప్రదించకుండా కఠిన ఆంక్షలు అమలు చేయడం, అవసరమైతే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వంటి వ్యవస్థలు మన దేశంలో ఇంకా పరిమితంగానే ఉన్నాయి.ఇలాంటి చర్చ ఇదే తొలిసారి కాదు. పోక్సో చట్టం అమలు, దాని వ్యాఖ్యానంపై గతంలోనూ దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీవ్ర చర్చ జరిగింది. 2021లో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఇచ్చిన 'స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్' తీర్పు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. బట్టలపై నుంచి తాకితే అది పోక్సో కింద లైంగిక దాడి కాదన్న వ్యాఖ్యలపై బాలల హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ.. లైంగిక ఉద్దేశంతో పిల్లలను తాకే ఏ చర్య అయినా పోక్సో పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. అలాగే పోక్సో కేసుల్లో బెయిల్పై విడుదలైన నిందితులు బాధితులను బెదిరించడం, సాక్షులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు కూడా గతంలో పలు రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో బెయిల్ షరతులను మరింత కఠినతరం చేయడం, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించడం, విడుదలైన నిందితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న డిమాండ్ అప్పట్లోనే వినిపించింది.విదేశాల్లో ఎలా ఉంటుంది?అమెరికాలో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని రికార్డుల్లో(Sex Offender Registry)లో నమోదు చేసి.. విడుదల తర్వాత కూడా ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తారు. పిల్లల పాఠశాలలు, పార్కులు, నివాస ప్రాంతాలకు వెళ్లకుండా కోర్టులు ఆంక్షలు విధిస్తాయి.బ్రిటన్లో ఎస్హెచ్పీవో( Sexual Harm Prevention Orders) ద్వారా నిందితుల కదలికలు, పిల్లలతో సంబంధాలు, ఇంటర్నెట్ వినియోగంపైనా పరిమితులు విధించవచ్చు.ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్లో విడుదలైన లైంగిక నేరస్థులపై ఎలక్ట్రానిక్ ట్రాకింగ్, పోలీసు పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉన్నాయి.భారత్లో చట్టం బలహీనమా?శిక్షల పరంగా చూస్తే భారత పోక్సో చట్టం ప్రపంచంలోనే కఠినమైన చట్టాల్లో ఒకటి. తీవ్రమైన కేసుల్లో జీవిత ఖైదు, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కానీ నిపుణులు చెబుతున్నది ఒక్కటే. చట్టం కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితులపై కఠిన నిఘా, బాధిత కుటుంబాల భద్రత, వేగవంతమైన విచారణ, సాక్షుల రక్షణ వంటి అంశాలు కూడా అంతే బలంగా అమలు కావాలి.షాబాద్ ఘటన చెబుతున్న పాఠంషాబాద్ సామూహిక హత్యలు కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు. పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టం అమలు విషయంలో ఉన్న లోటుపాట్లను మరోసారి గుర్తు చేశాయి. పోక్సోను మరింత కఠినతరం చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చట్టం కంటే దాని అమలు, బెయిల్ తర్వాత నిందితుల పర్యవేక్షణ, బాధిత కుటుంబాల భద్రతను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.:::వెబ్ ప్రత్యేకం -
భాగమతి మూవీ దర్శకుడిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: సినిమాలో హీరో అవకాశం ఇస్తానని నమ్మించి ఓ యువకుడిని నిలువెల్లా మోసం చేశారు. ఈమేరకు దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మీలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఠాణాలో కేసు నమోదైంది. కూకట్పల్లికి చెందిన నాయుడు హనుమంతరావు కుమారుడికి సినిమాలంటే మక్కువ. దీన్ని అవకాశంగా మలుచుకున్న అశోక్, విజయలక్ష్మీలు సినిమా అవకాశం ఇస్తామని నమ్మించారు.యువకుడి తల్లిదండ్రుల నుంచి పలు దఫాలుగా రూ.3.50 కోట్లు తీసుకున్నారు. అయితే అనుకోని కారణాలతో సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఇచ్చిన సొమ్ము వాపసు ఇవ్వాలంటూ బాధితులు దర్శకుడు అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మీలను సంప్రదించారు. దీంతో వాళ్లు డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో విసుగు చెందిన బాధితుడు హనుమంతరావు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్శకుడు అశోక్ బాబు తెలుగులో భాగమతి, పిల్ల జమిందార్, ఆకాశరామన్న వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
స్విట్జర్లాండ్ టూర్ అన్న దంపతులు.. ఎక్కడ?
హైదరాబాద్, కుషాయిగూడ: విదేశాలకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన దంపతులు అదృశ్యమయ్యారు. చర్లపల్లి ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన మేరకు.. చక్రిపురం, భగవాన్కాలనీలో నివసించే ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ ప్రదాన కార్యదర్శి, సిమెంట్ వ్యాపారి పబ్బ చంద్రశేఖర్, స్వప్న దంపతులు జూన్ 22న స్విట్జార్లాండ్ టూర్ వెళ్లి వస్తామని చెప్పి తమ కూతుళ్లను సోదరుడి ఇంట్లో ఉంచి వెళ్లారు. మరుసటి రోజు నుంచి ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కూతుళ్లు పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో కూతురు శ్రేయ చర్లపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా ఇప్పటికే పబ్బ చంద్రశేఖర్ 50 కోట్లు అప్పులు చేసి ఉడాయించాడంటూ ఆలిండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్తో కలిసి బాధితులు జూన్ 31 సీపీ సుమతిని కలిసి వినతిపత్రం అందజేశారు. -
భర్త ఆత్మహత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్
బోధన్(నిజామాబాద్): భర్త ఆత్మహత్యకు కారణమైన భార్య.. ప్రియుడితో కలిసి అతడి మరణాన్ని సహజమరణంగా చిత్రించేందుకు యత్నించి పోలీసులకు చిక్కింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య అలియాస్ మహిపాల్ (27), భార్య స్వరూప ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. మల్లయ్య తల్లి గ్రామంలోనే విడిగా ఉంటోంది. గ్రామానికి చెందిన సుమన్తో స్వరూప వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో మల్లయ్య మనస్తాపానికి గురై గత నెల 30వ తేదీన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని స్వరూప ఆమె ప్రియుడు సుమన్కు తెలపగా.. అతను ఇంటికి చేరుకుని ఉరిని తొలగించాడు. భర్త మల్లయ్యది సహజ మరణమని స్వరూప గ్రామస్తులను నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాటు చేయించింది. ఈ క్రమంలో మల్లయ్య గొంతుపై గాట్లు కనిపించడంతో మృతుని తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, మల్లయ్యది సహజ మరణం కాదని, ఆత్మహత్య అని తేల్చా రు. అతని ఆత్మహత్యకు కారణమైన స్వరూపతోపాటు ఆమె ప్రియుడు సుమన్ను శుక్రవారం రిమాండ్కు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ట్యాంకర్ టైరు కింద నలిగి..
హైదరాబాద్, గచ్చిబౌలి: వేగంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఓ యువతి మృతి చెందగా మరో యువతి గాయపడింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన మల్లం భవాని(23) ఇందిరానగర్ పీజీ హాస్టల్లో ఉంటూ టెలికాంనగర్లోని గోకలర్స్లో సేల్స్ గర్ల్గా పని చేస్తోంది.మరో సేల్స్ గర్ల్ ఎస్.సుహాసిని(30) అంజయ్యనగర్లోని లక్ష్మీ హాస్టల్లో నివాసం ఉంటోంది. గురువారం రాత్రి 11.20 గంటల సమయంలో సుహాసిని, భవాని కలిసి భోజనానికి వెళ్లారు. ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి ఫ్లై ఓవర్ సమీపంలో వెనక నుంచి వాటర్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. వెనక కూర్చున్న భవాని టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సుహాసిని తీవ్రంగా గాయపడింది. -
రంగారెడ్డి షాబాద్లో కిరాతకం.. పోక్సో కేసు కక్షతో ఆరుగురి హత్య
సాక్షి, షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయి. తనపై పోక్సో కేసు నమోదు చేశారనే కక్షతో ఓ వ్యక్తి మొత్తం ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉండటం గమనార్హం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజ్కుమార్పై ఓ బాలికను(17) వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మే 26న అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం అతడు బెయిల్పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చాడు. శనివారం తెల్లవారుజామున.. సరాసరి తన ఇంటికి వెళ్లి భార్య సరిత (30), మూడేళ్ల కుమార్తె పరీక్షిత్, రెండేళ్ల కుమారుడు రుద్రవాన్స్లను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నేరుగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి.. బాధితురాలి తల్లి చిట్యాల లక్ష్మి, నానమ్మ చిట్యాల రుక్కమ్మ (65)లను అదే కత్తితో కిరాతకంగా హతమార్చాడు. ఆపై బాధిత బాలికను ఎత్తుకెళ్లి ఊరి శివారులో అత్యాచారం జరిపి మరీ హత్య చేశాడు. హత్యల అనంతరం రాజ్కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో షాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం గ్రామాన్ని భయాందోళనలకు గురిచేసింది.ప్రాథమిక విచారణలో పోక్సో కేసుపై కక్షే ఈ సామూహిక హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలికను రాజ్కుమార్ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యల్లో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న దుర్మార్గుడి కోసం గాలింపు చేపట్టారు. నగర పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన సామూహిక హత్యల ఘటనల్లో ఇదొకటిగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో దైవాలగూడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకేరోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు షాక్కు గురయ్యారు. అదే సమయంలో.. నిందితుడి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాక్షసుడు రాజ్కుమార్ తన కుటుంబాన్నిఎందుకు కడతేర్చాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహాల్ని పోస్ట్మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ప్రశ్న రావణ్ పై దేశద్రోహం కేసు PV సునీల్ కుమార్ స్ట్రాంగ్ రియాక్షన్
-
డబ్బులివ్వద్దన్నా అక్కకు ఇస్తుంది.. అందుకే అమ్మను చంపేస్తున్నా!
నల్గొండ, తుంగతుర్తి: సంపాదించిన డబ్బంతా కుమార్తెకే ఇస్తుందనే కోపంతో భార్యను చంపి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. తుంగతుర్తి సీఐ ఉపేందర్రావు, ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ (74), కనకలక్ష్మి (66) దంపతులు అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరు జీవనోపాధి కొరకు ఒకరు సూర్యాపేటలో, మరొకరు తిరుమలగిరిలో ఉంటున్నారు.అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును కనకలక్ష్మి ఎక్కువగా కుమార్తెకు ఇస్తుందని, అంతేకాకుండా కుమార్తెకు రూ.3 లక్షలతో తిరుమలగిరిలో ప్లాటు కొనుగోలు చేసి ఇచ్చిందని ఆమెతో భర్త కోటేశ్వరరావు తరచూ గొడవ పడుతుండేవాడు. భర్త వేధింపులు భరించలేక కనకలక్ష్మి నెల క్రితం పెద్ద కుమారుడు సోమేశ్వర్ దగ్గరకు వెళ్లింది. ఇటీవల పెద్ద మనుషులందరూ కలిసి పంచాయితీ పెట్టి కనకలక్ష్మిని తిరిగి గొట్టిమర్తికి తీసుకొచ్చారు. ఇదే విషయమై బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య పంచాయితీ జరగడంతో కనకలక్ష్మి తన కుమారులకు ఫోన్ చేసింది.కుమారులిద్దరు కాన్ఫరెన్స్లో తల్లిదండ్రులతో మాట్లాడి ‘మీరు పంచాయితీ పెట్టుకోవద్దు.. మేము వస్తామని’ చెప్పారు. అదే సమయంలో కోటేశ్వరరావు ఫోన్లో మాట్లాడుతూ.. ‘మీ అమ్మ నేను చెప్పినట్లు వినడం లేదు, నాకు తెలియకుండా డబ్బులన్నీ అక్కకు ఇస్తుంది, ఎలాగైనా మీ అమ్మను చంపుతాను’ అని చెప్పడంతో కుమారులిద్దరు కలిసి తండ్రిని వారించి సర్ది చెప్పారు.సూసైడ్ నోట్ గోడకు అంటించి..!ఎలాగైనా భార్యను చంపాలని నిర్ణయించుకున్న కోటేశ్వరరావు బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో కనకలక్ష్మి తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం కోటేశ్వరరావు సూసైట్ నోట్ రాసి ఇంట్లో ఉన్న గోడకు అంటించాడు. తన వద్ద రూ.4.90 లక్షలు అప్పు పత్రాలు ఉన్నాయని, రూ.9వేల నగదు ఉందని, ఆ సొమ్మును ఇద్దరు కొడుకులు చెరి సమానంగా తీసుకోవాలని, గొడవ పెట్టుకోవద్దని సూసైడ్ నోట్లో రాశాడు. 4.20 గంటలకు ఉరేసుకుంటున్నానని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని, తాను చేసుకున్న కర్మ అని రాసి ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.గురువారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి కుమారులకు సమాచారం ఇచ్చారు. కుమారులిద్దరు వచ్చి చూడగా.. అప్పటికే కోటేశ్వరరావు, కనకలక్ష్మి మృతిచెంది ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పరిశీలించారు. మృతుల చిన్న కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
‘నా బిడ్డను కాపాడండి..’
కరీంనగర్, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని బీబీరాజ్పల్లెకి చెందిన దాసరి అరవింద్ సౌదీ అరేబియాలో చిక్కుకున్న విషయం తెల్సిందే. తన కొడుకును కాపాడాలంటూ ఆయన తల్లి దాసరి రాజవ్వ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు జడ్జి విజయసేన్రెడ్డి ప్రతివాదులైన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రొటెక్షన్ ఎమిగ్రేట్స్ (పీజీఈ), సౌదీ రాజధాని రియాద్లోని ఇండియన్ ఎంబసీ ప్రతినిధి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఐడీ, ఎన్ఆర్ఐ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేశారు.కేసు విచారణను ఈనెల 16కు వాయిదా వేశారు. అరవింద్ను ఓ ఏజెంట్ సౌదీలో ప్యాకింగ్ వర్కర్గా ఉద్యోగం కల్పిస్తామని పంపించాడు. అక్కడికి చేరుకున్నాక రియాద్కు సుమారు 950 కిలోమీటర్ల దూరంలో ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా పనిచేయిస్తున్నారు. తన దుర్భర పరిస్థితులను అరవింద్ వీడియో ద్వారా కుటుంబసభ్యులకు పంపించాడు. ఈ విషయం కంపెనీ యాజమాన్యానికి తెలియడంతో అతని వద్దనున్న మొబైల్, సిమ్కార్డు స్వాధీనం చేసుకోవడంతో అతని భద్రతపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
'నా ముందే అలా చేస్తావా?' రోకలిబండతో భర్త హత్య!
కరీంనగర్, కోరుట్ల: భర్త ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి తనతోపాటు, పిల్లలను వేధిస్తున్నాడని భావించిన భార్య రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కోరుట్ల పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అల్లమయ్య గుట్ట ప్రాంతంలో నివసించే ఇప్ప కాశీరాం, రజినీ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం.కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలు కలిసి మద్యం తాగారు. భార్య తనముందే మద్యం తాగిందని మనసులో పెట్టుకున్న కాశీరాం అప్పటినుంచి అతిగా మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేని రజినీ 20రోజుల క్రితం భర్తపై ఎదురుతిరిగింది. చుట్టుపక్కల వారు వచ్చి గొడవ సద్దుమణిగించారు. అప్పటినుంచి ప్రతిరోజూ గొడవ పడుతూనే ఉన్నారు. బుధవారం కుటుంబసభ్యులందరూ కలిసి వనభోజనానికి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత రజినీ తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని తన తల్లిగారింటికి పంపించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాశీరాం(35)ను రోకలిబండతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.అనంతరం అయ్యప్ప గుట్ట సమీపంలో ఉండే తల్లిగారింటికి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలైన రజినీని గురువారం అరెస్టు చేశారు. తండ్రి హత్యకు గురికావడం.. తల్లి కటకటాల్లోకి వెళ్లటంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. కాశీరాం బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెట్పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు ఆధ్వర్యంలో రజినీని రిమాండ్కు తరలించారు. సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు. -
నితిన్ గులాబానీపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: సోమాజీగూడ కేంద్రంగా కేవీ జ్యువెలర్స్, నితిన్ జ్యువెలర్స్, కేవీవీ జ్యువెలర్స్, నితిన్ ఎంటర్ప్రైజెస్ సంస్థల్ని నిర్వహించిన నితిన్ గులాబానిపై నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) మరో కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన వ్యాపారి రూ.7.8 కోట్ల మేర మోసపోయానంటూ ఇచ్చిన ఫిర్యాదుతో దీన్ని రిజిస్టర్ చేశారు. ఇప్పటికే నగరానికి చెందిన నలుగురు జ్యువెలరీ దుకాణం యజమానుల్ని రూ.20.59 కోట్లకు మోసం చేసిన ఆరోపణలతో నితిన్పై ఓ కేసు నమోదైన విషయం విదితమే.బెంగళూరులోని బెంగళూరు జ్యువెలరీ హౌస్ ముఖేష్ కుమార్ జైన్ నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చి 22న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన ఆభరణాల ప్రదర్శనలో ముఖేష్ను నితిన్ రమేష్ గులాబానీ కలిశాడు. తాను హైదరాబాద్లోని మూడు సంస్థలకు యజమానని పరిచయం చేసుకున్నాడు. ముఖేష్ను తన స్టాల్కు తీసుకెళ్లిను నితిన్ వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. తొలినాళ్లల్లో బంగారు ఆభరణాలు సరఫరా చేసిన 30 రోజుల్లోపు నితిన్ చెల్లింపులు చేస్తుండేవాడు. రెండు లావాదేవీలను ఇలానే పూర్తి చేసి తనపై పూర్తి నమ్మకం తెచ్చుకున్నాడు.ఈ ఏడాది మార్చి 30న రూ.3.68 కోట్ల విలువైన 2503.190 గ్రాముల బంగారు ఆభరణాలు, ఏప్రిల్ 1న రూ.3.16 కోట్ల విలువైన 2207.600 గ్రాముల బంగారు ఆభరణాలు సరఫరా చేశారు. ఈ సరుకుని ముఖేష్ వద్ద పని చేసే శ్రవణ్, సంజయ్ హైదరాబాద్ తీసుకువచ్చి నితిన్ జ్యువెలర్స్ కార్యాలయంలో అందించారు. ఆపై మే 19న రూ.4.41 కోట్ల విలువైన 2927.250 గ్రాముల బంగారు ఆభరణాలను ముఖేష్ స్వయంగా తీసువచ్చి ఇవ్వగా... జూన్ 2న రూ.2.90 కోట్ల విలువైన 1808.180 గ్రాముల బంగారు ఆభరణాలను నితిన్ గులాబానీ కార్యాలయంలో ముఖేష్ ఉద్యోగులు హరీష్, ధన్రాజ్లు అందించారు.గరిష్టంగా 30 రోజుల్లో చెల్లింపులు చేయాల్సి ఉండగా నితిన్ అలా చేయలేదు. ముఖేష్కు చెల్లించాల్సిన రూ.13.81 కోట్ల బకాయిలో కేవలం రూ.5.95 కోట్లు మాత్రమే చెల్లించాడు. మిగిలిన రూ.7.86 కోట్ల కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ముఖేష్ బెంగళూరులో ఉండటంతో ఆయన ఉద్యోగులను పదేపదే హైదరాబాద్ వచ్చి నితిన్ను అడిగినా ఫలితం దక్కలేదు. ప్రతిసారీ నితిన్తో పాటు ఆయన సిబ్బంది త్వరలోనే మొత్తం చెల్లిస్తామని చెప్పేవారు. కొన్ని సందర్భాల్లో నితిన్ తాను ఆస్పత్రిలో ఉన్నారని చెప్పి, బకాయితో పాటు ఆలస్యమైనందుకు నెలకు 2 శాతం వడ్డీ కూడా చెల్లిస్తానని నమ్మబలికాడు.కొన్నాళ్లకు నితిన్ గులాబానీతో పాటు ఆయన సోదరుడు విపిన్, సిబ్బంది హరీష్, ధన్రాజ్ సింగ్ ప్రవర్తన పూర్తిగా మారిపోవడాన్ని ముఖేష్ గమనించారు. ఫోన్కాల్స్, వాట్సాప్ సందేశాలకు స్పందించడం మానేశారు. దీంతో జూన్ 17న ముఖేష్ స్వయంగా హైదరాబాద్కు వచ్చి నితిన్ గులాబానీని కలిశారు. మరుసటి రోజు కనీసం రూ.2 కోట్లు చెల్లిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో మరుసటి రోజు ముఖేష్ కార్యాలయానికి వెళ్లారు. అప్పుడు ఆ కార్యాలయం మూసి ఉండటం, నితిన్ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండటాన్ని గమనించారు. ఆయన ఉద్యోగుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లోనే ఉండటంతో ముఖేష్కు అనుమానం వచ్చింది. దీంతో ఆయన నితిన్ నివాసానికి వెళ్లి చూడగా అది తాళం వేసి ఉంది. మోసపోయానని గుర్తించిన బాధితుడు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
భార్య కళ్లెదుటే.. భర్త, అతడి ప్రియురాలు ఆత్మహత్య!
హైదరాబాద్, అడ్డగుట్ట: ఈ నెల 7న శబరి ఎక్స్ప్రెస్లో భార్య కళ్ల ముందే భర్త, అతని ప్రియురాలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం నీలవేణి(36) మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని చప్రా గ్రామానికి చెందిన నీలవేణికి భర్త, 16, 18 సంవత్సరాల ఇద్దరు కుమారులు ఉన్నారు.రెండు నెలల క్రితం కుటుంబసభ్యులతో కలిసి నగరానికి వచ్చి మూసాపేటలో నివాసముంటున్నారు. అదే గ్రామానికి చెందిన శిరీష్ అనే వ్యక్తితో నీలవేణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. నెల రోజుల క్రితం ఇద్దరూ కొయంబత్తూరుకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఆచూకీ తెలుసుకున్న శిరీష్ భార్య సులోచన వారిని పట్టుకొని ఈ నెల 7న భర్త, నీలవేణితో కలిసి సికింద్రాబాద్కు శబరి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరింది.ఈ క్రమంలో రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో సులోచన కళ్లెదుటే శిరీష్, నీలవేణిలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలించగా, రెండ్రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నీలవేణి గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శిరీష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఫిల్మ్నగర్లో కలకలం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు!
ఫిల్మ్నగర్లో ఓ కారు ప్రమాదం కలకలం రేపింది. అదుపుతప్పి వాహనం నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి దూసుకెళ్లడం ఘటన చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో.. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫిల్మ్నగర్ పరిధిలో నటుడు ధర్మ మహేష్ నివాసం ఉంది. అయితే గత అర్ధరాత్రి దాటాక ఓ కారు అదుపుతప్పి ఆ ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గేటు, ప్రహారీ గోడ ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం తప్పింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది.మద్యం మత్తులోనా?..ప్రమాద సమయంలో కారులో కొందరు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. కారు నడిపిన తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొంటూ ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్కు నటుడి కుటుంబం సమాచారం అందించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వాళ్లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.ప్రమాదంపై పోలీసుల దర్యాప్తుప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు వేగం, డ్రైవర్ పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపారా? అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, చట్టపరమైన చర్యలపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఫిల్మ్నగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ధర్మ మహేష్ (కాకాని ధర్మ) తెలుగు సినీ నటుడు. అసలు పేరు కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్. విజయవాడకు చెందిన మహేష్.. ఇంజినీరింగ్ (బీటెక్) పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో విశాఖపట్నంలోని సత్యానంద్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘సింధూరం’ (2023), ‘డ్రింకర్ సాయి’ (2024)చిత్రాల్లో నటించాడు. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఆ మధ్య వ్యక్తిగత వివాదాలతోనూ ధర్మ మహేష్ వార్తల్లోకి ఎక్కాడు. -
టీసీఎస్ కేసు.. జైల్లో ప్రసవ వేదన భరించలేనిది!
నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్కు నాసిక్ లోకల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలులోనే బిడ్డకు జన్మనివ్వాల్సి రావడం ఏ మహిళకైనా తీవ్రమైన వేదనతో కూడుకున్నదన్న కోర్టు.. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనన ప్రస్తావన తేస్తూ కీలక వ్యాఖ్యలు గమనార్హం. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన కేసులో నిదా ఖాన్ నిందితురాలిగా ఉంది. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యాక ఆమె పరారయ్యింది. అయితే.. దాదాపు 25 రోజుల తర్వాత మే 7న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్లోని ఓ అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేశారు. అయితే పరారీలో ఉన్న టైంలో తాను గర్భంతో ఉన్నానని.. ముందస్తు బెయిల్ కావాలని ఆమె వేసిన పిటిషన్ను నాసిక్ రోడ్ కోర్టు కొట్టేసింది. తాజాగా.. మరోసారి ఆమె గర్భధారణను ప్రధాన కారణంగా చూపిస్తూ బెయిల్ పిటిషన్ వేయగా.. జులై 6న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు రూ.75 వేల వ్యక్తిగత బాండ్తో పాటు అదే మొత్తానికి ఒక పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.నిదా ఖాన్ బెయిల్ వాదనను పోలీసులు, బాధితుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో తగిన ఆధారాలు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిదా ఖాన్ తరఫు న్యాయవాది రాహుల్ కస్లీవాల్ మాత్రం ఆమె నిర్దోషి అని, తప్పుడు కేసులో ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆమె ఉన్నత విద్యావంతురాలని, టీసీఎస్లో అసోసియేట్గా పనిచేసిందని పేర్కొన్నారు.జైలులో ప్రసవం వేదన భరించలేనిది..బెయిల్ తీర్పు సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి కేజీ జోషి తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. “శ్రీకృష్ణుడి జననం జైల్లో జరిగింది. అలాంటి పరిస్థితుల మాదిరిగా ఓ బిడ్డకు జైలులో జన్మనివ్వాల్సి రావడం వల్ల కలిగే మానసిక వేదన, సామాజిక కళంకం ఏ మహిళకైనా తట్టుకోలేనిది. కాబట్టి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి బాధాకర పరిస్థితులను నివారించేందుకు న్యాయ విచక్షణను ఉపయోగించడం సముచితమని కోర్టు భావిస్తోంది అంటూ తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా.. దర్యాప్తు పూర్తయి చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో ఆమెను జైలులో కొనసాగించడం వల్ల ప్రత్యేక ప్రయోజనం లేదని న్యాయస్థానం పేర్కొంది.టీసీఎస్ కేసులో ఆరోపణలు ఏమిటి?నాసిక్లోని టీసీఎస్ యూనిట్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, మత మార్పిడికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై పోలీసులు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిదా ఖాన్కు సంబంధించిన కేసులో.. మతపరమైన విషయాలతో ప్రభావితం చేయడం, బురఖా, మత గ్రంథాలు ఇవ్వడం, బాధితురాలి మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం, నమాజ్ నేర్పించడం, హిజాబ్ ధరించే విధానం వివరించడం వంటి ఆరోపణలు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు.. బాధితురాలు దళితురాలు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.టీసీఎస్ వివరణఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత టీసీఎస్.. వేధింపులు, బలవంతపు చర్యల విషయంలో తమ సంస్థకు జీరో టాలరెన్స్ విధానం(ఉపేక్షించేది లేదని) ఉందని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.శ్రీకృష్ణుడు దేవకి–వసుదేవులకు మధుర కారాగారంలో జన్మించాడు. కంసుడి నుంచి రక్షించేందుకు వసుదేవుడు ఆయనను గోకులానికి తీసుకెళ్లగా.. నందుడు, యశోద దంపతులు పెంచి పెద్ద చేశారు. అందుకే శ్రీకృష్ణుడిని జన్మనిచ్చిన తల్లి పేరుతో దేవకీనందనుడు, పెంచిన తల్లి–తండ్రుల పేర్లతో యశోదానందనుడు, నందలాలా అని కూడా పిలుస్తారు. -
అయ్యో అమైరా..! వినిపించని చిట్టితల్లి ఆర్తనాదం
తోటి విద్యార్థుల వేధింపుల మధ్య ఓ చిన్నారి చేసిన పోరాటం.. చివరకు విషాదంగా ముగిసిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహాయం కోసం ఆమె చేసిన ప్రయత్నం.. తన బాధను ఎవరికైనా చెప్పుకోవాలన్న ఆరాటం.. టీచర్లు సైతం పట్టించుకోలేదనే చిట్టితల్లి అసహనం.. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలతో మరోసారి తెరపైకి వచ్చాయి. చిన్నారి అమైరా చివరి క్షణాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.రాజస్థాన్లోని జైపూర్లో గత ఏడాది సంచలనం సృష్టించిన తొమ్మిదేళ్ల అమైరా మీనా మృతి కేసు తాజాగా విడుదలైన తరగతి గది సీసీటీవీ వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులు విడుదల చేసిన ఈ దృశ్యాల్లో.. అమైరా ఆందోళనకు గురైనట్లు, పలుమార్లు క్లాస్ టీచర్ను ఆశ్రయించే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపించింది.వీడియోలో కనిపించిన ఆ రోజు దృశ్యాలు2025 నవంబర్ 1న జైపూర్లోని నీర్జా మోడీ స్కూల్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న అమైరా పాఠశాల నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచే అమైరా తల్లిదండ్రులు.. తమ కుమార్తె వేధింపులకు గురైందని, పాఠశాల నుంచి తగిన స్పందన లభించలేదని ఆరోపిస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు.సీసీటీవీలో కనిపించిన ఆ క్షణాలుతాజాగా బయటకు వచ్చిన వీడియోలో అమైరా మొదట సాధారణంగానే తరగతి గదిలో ఉన్నట్లు కనిపిస్తోంది. సహ విద్యార్థులతో మాట్లాడుతున్న చిన్నారి.. కొంతసేపటి తర్వాత అసౌకర్యంగా, ఆందోళనగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆమెకు ఓ డిజిటల్ స్లేట్ చూపించిన తర్వాత అమైరా ప్రవర్తనలో మార్పు కనిపించిందని వారు పేర్కొన్నారు. అనంతరం ఆమె క్లాస్ టీచర్ వద్దకు వెళ్లి తన సమస్యను వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.చేతులు జోడించడం, ఆందోళనగా కనిపించడం, ఏడుపును ఆపుకునే ప్రయత్నం చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయని, అవి ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని తెలియజేస్తున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.On Nov 1, 2025, Amaira, a Class 4 student, died by suicide after jumping from the fourth floor of the Neerja Modi School in Jaipur.She had been bullied for 18 months, with classmates targeting her using "bad words," many of which carried sexual undertones. However, her class… pic.twitter.com/iiS4J6UFwm— THE SKIN DOCTOR (@theskindoctor13) July 9, 2026సహాయం కోరింది.. స్పందన రాలేదా?అమైరా తల్లి శివానీ మీనా మాట్లాడుతూ.. తమ కుమార్తె పలుమార్లు సహాయం కోసం ప్రయత్నించినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. “ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తన బాధను చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు అండగా ఎవరూ నిలబడలేదు. తరగతి గది నుంచి నాలుగో అంతస్తు వరకు వెళ్లేంతవరకు ఎవరూ గమనించకపోవడం ఎలా?” అని ఆమె ప్రశ్నించారు. పాఠశాలలో భద్రతా లోపాలు ఉన్నాయని, వేధింపులపై ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబం ఆరోపిస్తోంది.మరీ ఇంత నిర్లక్ష్యమా?ఈ ఘటనపై నిర్వహించిన తనిఖీల్లో పాఠశాలలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్లు సమాచారం. సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా కమిటీ ఏర్పాటు, పై అంతస్తుల్లో రక్షణ ఏర్పాట్లపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అమైరా చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ.. వాటిపై తగిన స్పందన లేదన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి.కన్నీటి ప్రశ్నతాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో అమైరా కేసులో న్యాయం కోసం కుటుంబం చేస్తున్న పోరాటం మరింత బలపడింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమైరా ఘటన మరోసారి పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, బుల్లీయింగ్ నియంత్రణ వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమైరా ఎదుర్కొన్న బాధను సకాలంలో ఎవరైనా గుర్తించి ఉంటే.. ఈ విషాదం జరిగేదా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
సినీ ఫక్కీలో ఛేజ్.. గురుగ్రామ్లో హైటెన్షన్ ఎన్కౌంటర్!
హర్యానాలోని గురుగ్రామ్లో గతరాత్రి హైటెన్షన్ ఎన్కౌంటర్ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులకు పాల్పడి తప్పించుకునేందుకు ప్రయత్నించిన గ్యాంగ్స్టర్లను పోలీసులు మట్టుబెట్టారు. సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా గాయాలపాలయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ లోక్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు కొంతకాలంగా దీపక్నందల్ గ్యాంగ్ నుంచి బెదిరింపు సందేశాలు వస్తున్నాయి. అయితే ఆయన వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. బుధవారం రాత్రి కొందరు దుండగులు ఆయన నివాసంపై కాల్పులకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్పుల సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. దీంతో ఆ గ్యాంగ్ పారిపోయే ప్రయత్నం చేసింది. ఈలోపు.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ స్కార్పియో వాహనంలో నిందితులు ఆయుధాలతో ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అలా చాలా దూరం చేజ్ చేసుకుంటూ వెళ్లారు.లొంగిపోకుండా కాల్పులు..పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ.. నిందితులు ఆధునిక ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారని అధికారులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు నిందితులకు బుల్లెట్ గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నలుగురు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరో నిందితుడు చికిత్స పొందుతున్నాడు.విదేశాల్లో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్న గ్యాంగ్స్టర్ దీపక్ నందల్కు చెందిన షూటర్లుగా వీరిని పోలీసులు గుర్తించారు. నందల్ గ్యాంగ్ హరియాణా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్న నేర ముఠాగా పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. వ్యాపారవేత్తలు, ప్రముఖులను టార్గెట్ చేసి బెదిరింపు సందేశాలు పంపడం, డబ్బులు డిమాండ్ చేయడం వంటి కార్యకలాపాల్లో ఈ గ్యాంగ్ సభ్యుల ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోంది. విదేశాల నుంచి ఆపరేషన్లు నడుపుతూ స్థానిక షూటర్ల ద్వారా దాడులు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ అనంతరం నిందితుల నేర చరిత్ర, గ్యాంగ్ నెట్వర్క్, ఆయుధాల సరఫరా మార్గాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.#WATCH | Gurugram, Haryana: Visuals from Sushant Lok in Gurugram where four shooters of the foreign-based Deepak Nandal gang were killed and one was injured during a police encounter. The miscreants had arrived to open fire at the residence of SGT University founder's son over… pic.twitter.com/nOsa9J1Jhh— ANI (@ANI) July 10, 2026పోలీసులకు కూడా గాయాలుఎన్కౌంటర్లో ముగ్గురు క్రైమ్ బ్రాంచ్ సిబ్బందికి తూటా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, నిందితుల నేర చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.భయపెట్టే గ్యాంగ్లకు చెక్ప్రజల్లో భయాందోళనలు సృష్టించే నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని గురుగ్రామ్ పోలీసులు స్పష్టం చేశారు. వ్యాపారవేత్తల నుంచి బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసే గ్యాంగ్లపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్
-
ఒక ప్రశ్న.. రెండు నిండు ప్రాణాలు బలి!
సాక్షి, తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఓ వివాహ వేడుకకు వచ్చిన వ్యక్తిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఇద్దరు వ్యక్తులు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగు చూసింది.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ జంట హత్యల వెనుక కుటుంబ వివాదమే కారణమని తెలుస్తోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్.. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీళ్ల వివాహానికి మునిరత్నం, మణికంఠలు దగ్గరుండి సహకరించారు. అయితే.. కొన్ని నెలలుగా సునీల్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కారణం ఏంటో చెప్పడం లేదని.. ఎంత బతిమాలినా సునీల్ వినలేదని తెలుస్తోంది. ఈ విషయంలో పెద్దలు సర్దిచెప్పాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో.. బుధవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఓ వివాహానికి అతను హాజరైన విషయం సంపూర్ణమ్మకు తెలిసింది. దీంతో తన కుమార్తెకు అండగా ఉన్న మునిరత్నం, మణికంఠలకు ఆమె సమాచారం ఇచ్చింది. వాల్లిద్దరూ వివాహ మండపానికి చేరుకుని సునీల్ను నిలదీశారు. నీ భార్యను ఎందుకు వదిలేశావు? అని ప్రశ్నించారు. దానికి సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో సునీల్తో పాటు అతడి తమ్ముడు, అక్క, మరో బంధువు అక్కడికి చేరుకున్నారు. ఆ నలుగురూ కలిసి మునిరత్నం, మణికంఠలపై కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న మణికంఠను తిరుపతి.. రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీళ్లిద్దరూ జీవకోనకు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సీఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. నిందితులు అదుపులోకి.. విచారణ కొనసాగింపుభార్యాభర్తల గొడవ.. పెళ్లి వేదికలో మొదలైన వివాదం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన తిరుపతిలో సంచలనంగా మారింది. జంట హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సునీల్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు పూర్తి కారణాలు, దాడిలో పాల్గొన్న వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. -
సమాజానికి సమాధానం చెప్పలేకే ఆత్మహత్యాయత్నం !
హైదరాబాద్: భార్య కళ్లెదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త, అతని ప్రియురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శ్రీకాకుళం జిల్లా చప్రా గ్రామానికి చెందిన శ్రీరామ్ శిరీష్ అదే గ్రామానికి చెందిన నీలవేణి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని నెల రోజులుగా కోయంబత్తూర్లో నివాసముంటున్నాడు. భర్త ఆచూకీ తెలుసుకున్న భార్య కోయంబత్తూర్కు వెళ్లి తన భర్తతో పాటు అతని ప్రియురాలిని తీసుకొని మంగళవారం శబరి ఎక్స్ప్రెస్ రైలులో సికింద్రాబాద్కు వస్తున్నారు. ఇంటికి వెళ్లిన తరువాత సమాజం తమను ఏ విధంగా చూస్తుందో... పిల్లలకు ముఖం ఎలా చూపించుకోవాలి... అనే ఆలోచనతో సతమతమై ఉంటారని, ఈ క్రమంలో భార్య కళ్లముందే భర్త శిరీష్, అతని ప్రియురాలు నీలవేణిలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిరీష్, నీలవేణిల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. -
భర్తను తోసేసి.. యువతిని బలవంతంగా తీసుకెళ్లిన బంధువులు..!
పాపన్నపేట(మెదక్): ప్రేమ పెళ్లి చేసుకున్న యువతిని ఆమె తల్లిదండ్రులు, బంధువులు కలిసి అత్తింటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సంఘటన మండలంలోని ఎల్లాపూర్లో చోటు చేసుకుంది. అబ్బాయి కుటుంబీకుల కథనం పక్రారం... గ్రామానికి చెందిన ఓ యువకుడు, కౌడిపల్లి మండలం సలాబత్పూర్కు చెందిన యువతిని ఈ నెల 6న పెళ్లి చేసుకొని, పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇద్దరు మేజర్ కావడంతో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే అమ్మాయి, యువకుడితోనే ఉంటానని చెప్పడంతో ఆమెను అత్తింటికి పంపించారు. కాగా బుధవారం అమ్మాయి తరపు వారు మూడు కార్లలో ఎల్లాపూర్కు వచ్చి అడ్డొచ్చిన యువకుడిని, అతడి తల్లి శ్యామలను, అన్నావదినెలను ప్రక్కకు తోసేసి, యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ మేరకు వారు పాపన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయమై ఎస్సై శ్రీనివాస్గౌడ్ను వివరణ కోరగా ఇరు వర్గాలను మెదక్ సీఐ కార్యాలయానికి పిలిపించి, కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని తీసుకెళ్లిన ఆమె బంధువులుమెదక్ జిల్లా సలాబత్పూర్ గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 6వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్న ఎల్లపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడుకులాంతర వివాహం చేసుకుందని కోపంతో ప్రణయ్ కుటుంబ… https://t.co/TrWxGlOzHW pic.twitter.com/PZPlxvNc0P— Telugu Scribe (@TeluguScribe) July 9, 2026 -
శంషాబాద్ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, శంషాబాద్: హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ బొలెరో వాహనం బస్టాండ్లో వేచి ఉన్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.సతమరాయి సమీపంలో ఈ వేకువజామున ఈ ఘోరం జరిగింది. ఉదయం సమయంలో రోడ్డుపై వెళ్తున్న బొలెరో.. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చిన వాహనం నేరుగా రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్లోకి దూసుకెళ్లింది. అక్కడ బస్సు కోసం వేచి ఉన్న మహిళలను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో శంషాబాద్–సతమరాయి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనం, సహాయక చర్యల కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అట్లూరి ప్రసన్న.. రూ.100 కోట్ల స్కాంలో నిందితురాలు
సాక్షి, హైదరాబాద్: షేర్స్ బజార్ ప్రై.లి.(ఎస్బీపీఎల్), కిసాన్ పరివార్ (కేపీఎల్) కంపెనీల పేరిట రూ.100 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ కంపెనీ డైరెక్టర్, ప్రిన్సిపల్ ఆఫీసర్ అట్లూరి ప్రసన్న (25) అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న న్యూయార్క్లోని షుయ్లర్ కౌంటీలో ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రసన్న.. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో గత నెల 15న నమోదైన చీటింగ్ కేసులో నిందితురాలు.అల్గారిథమ్ ఆధారిత స్టాక్ ట్రేడింగ్, సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభాలు అందిస్తామని పెట్టుబడిదారులను ఆకర్షించి.. రూ.వందల కోట్లు మోసగించారు. పెట్టుబడిదారులకు ఏడాదికి 18 నుంచి 48 శాతం వరకు అధిక లాభాలు అందిస్తామని నమ్మించిన ఈ సంస్థలు దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మందిని మోసగించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మంది బాధితులు ఉన్నారు. గత జూన్ 15న సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదైంది. -
ప్రియుడితో కలిసి భర్త హత్య.. 250 కిలోమీటర్లు తీసుకెళ్లి.. దారుణం!
హైదరాబాద్, మియాపూర్: ఆస్తి కోసం ఓ మహిళ భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించింది. ఆ తరువాత మృతదేహాన్ని 250 కిలోమీటర్లు తీసుకెళ్లి దహనం చేసింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ వివరాలు వెల్లడించారు. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మల్లాని పెంటేష్ కుటుంబ కలహల కారణంగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఏపీలోని అనకాపల్లికి చెందిన సత్యవతి.. పెంటేష్ నిర్మిస్తున్న ఇంటి పనుల కోసం ఇంటికి వచ్చేది. ఇద్దరి మధ్యా పరిచయం పెరగడంతో 2009లో సత్యవతిని పెంటేష్ వివాహం చేసుకున్నాడు. పెంటేష్కు 4 ఎకరాల భూమితో పాటు మియాపూర్లో రెండు భవనాలు ఉన్నాయి.భార్యకు జిమ్ ట్రైనర్తో పరిచయం..వనపర్తికి చెందిన జిమ్ ట్రైనర్ మధుసూదన్రెడ్డి.. పెంటేష్ ఇంట్లో అద్దెకుండేవాడు. ఈ క్రమంలో సత్యవతి, మధుసూదన్ రెడ్డిల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పుడప్పుడూ మధుకు సత్యవతి డబ్బులిచ్చేది. దీంతో పెంటేష్ ఇద్దరినీ హెచ్చరించి మధును ఇల్లు ఖాళీ చేయించాడు. ఆ తరువాత కూడా ఇద్దరి మధ్యా సంబంధం కొనసాగింది. ఈ క్రమంలో గతేడాది పెంటేష్ మి యాపూర్లోని షట్లర్లను విక్రయించగా రూ.80 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లోనే ఉంచాడు. అందులోంచి రూ.10 లక్షలు మధుకు ఇచ్చింది. ఈ విషయం బయట పడడంతో పెంటేష్, సత్యవతి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్తను హత్య చేయాలని సత్యవతి మధుసూదన్కు తెలపడంతో ఇద్దరు కలిసి పథకం రూపొందించారు.నిద్రమాత్రలు ఇచ్చి.. 2025 నవంబర్ 18న సత్యవతి భర్త పెంటేష్ భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. స్పృహా కోల్పోయిన అనంతరం మధుసూదన్, చిన్న నాటి స్నేహితుడు రాజేష్ కుమార్ వచ్చారు. పెంటేష్ ముఖం పై దిండు పెట్టి గొంతు నుమిలి హత్య చేశారు. అనంతరం ఆన్లైన్లో కారు బుక్చేసుకొని రాత్రికి రాత్రే 250 కిలోమీటర్లూ దూరంలోని నల్దుర్గు ( మహారాష్ట్ర) పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం చేసి అక్కడే వదిలేసి వచ్చేశాడు. భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు.. ఆ తరువాత.. తన భర్త కనిపించడం లేదంటూ సత్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా సత్యవతి, మధుసూదన్రెడ్డి కాల్ డేటా, సిగ్నల్స్ వివరాలను విశ్లేషించిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో మియాపూర్ పోలీసులు సత్యవతి, మధుసూదన్రెడ్డి, మృతదేహాన్ని తరలించడంలో సహకరించిన రాజేష్ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తమ తండ్రి కనిపించడం లేదని మొదటి భార్య పిల్లలు భరత్ రాజ్, సంధ్యలు సత్యవతి పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించినా తమ ఫిర్యాదు స్వీకరించలేదని ఆరోపించారు. సత్యవతి ప్రవర్తనలో మార్పులు కనిపించాయని చెప్పినా స్పందించలేదన్నారు. భరత్రాజ్ పైనే అనుమానం వచ్చేలా సత్యవతి పోలీసులకు కట్టుకథలు చెప్పిందని వాపోయారు. -
హత్యకు మోటివ్ ఏంటో తేలితే..అందరి పాత్రలు బయటకొస్తాయి
-
హైదరాబాద్.. అతడి రూమ్కి చాలాసార్లు పిలిపించుకున్నాడు..!
నల్లగొండ: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరామ ప్రసాద్ మంగళవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలానికి చెందిన యువతి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటుంది. ఆమె వివాహం నిమిత్తం ఒక మ్యారేజ్ బ్యూరోకు తన బయోడేటా పంపింది. విషయం తెలుసుకున్న హైదరాబాద్లోని బోడుప్పల్లో నివాసముండే గొర్రె ప్రభుదాస్ ఆమెను సంప్రదించి, వివాహం చేసుకుంటానని నమ్మించాడు.తాను నిరుద్యోగినని తన అవసరాలకు కొంత డబ్బు కావాలని పెద్ద మొత్తంలో వివిధ దఫాల్లో డబ్బులు తీసుకున్నాడు. తన స్వగ్రామమైన కర్నూల్లో నివాసముంటున్న తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని ఆమెను నమ్మించి కర్నూలు కు తీసుకువెళ్లాడు. ఈక్రమంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా హైదరాబాద్లోని అతడి రూమ్కి కూడా చాలాసార్లు పిలిపించుకున్నాడు. అనంతరం అధిక కట్నం ఆశించి ప్రభుదాస్ వేరే సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసి ఆమె అతనిని కలిసి పెళ్లి చేసుకోమని కోరగా అతను అందుకు నిరాకరించి వేరే సంబంధం చేసుకుంటానని తేల్చిచెప్పాడు.ఆమెను దుర్భాషలాడి, చంపుతానని బెదిరించడంతో సదరు యువతి గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసు నమోదు చేశారు. హుజూర్నగర్ సీఐ భాస్కర్ దర్యాప్తును పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల పూర్తి విచారణ అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడు గొర్రె ప్రభుదాస్పై నేరం నిరూపణ కావడంతో మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ 1,500ల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరొక నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్కు లైజన్ ఆఫీసర్ వెంకన్న సహకరించారు. -
చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని మృతి
నల్లగొండ : సర్జరీ తర్వాత దాదాపు మూడు రోజుల పాటు ఆస్పత్రిలోని వెంటిలేటర్పై చికిత్స పొందుతూ యువ వైద్య విద్యార్థిని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కోదాడకు చెందిన ధరావత్ అమృత(23) జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హౌజ్సర్జన్(ఇంటన్షిప్)గా పనిచేస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఆమె థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమెను ఈనెల 4న ఎస్వీఎస్ ఆస్పత్రిలో థైరాయిడ్కు సంబంధించిన సర్జరీ పూర్తి చేశారు. సర్జరీ అయిన తర్వాత మూడు రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న విద్యార్థిని మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
అసలు రూ.8 లక్షలు.. వడ్డీ రూ.75 లక్షలు!
వికారాబాద్: ‘నా భర్త కొందరి వద్ద రూ.8 లక్షలు అప్పు గా తీసుకున్నాడు. దానికి వడ్డీతో కలిపి సదరు వ్యక్తులు రూ.83 లక్షలు చేశారు. అప్పు కట్టాలని మానసికంగా వేధించారు. బెదిరించారు. చివరకు ఆయన చావుకు కారణమయ్యారు. వారిని కఠినంగా శిక్షించాలి’ అని దొంగ ఎనికేపల్లి గ్రామానికి చెందిన శేరి అశ్విని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. గత నెల 20న ఆమె భర్త శేరి రాంరెడ్డి సూసైడ్ లెటర్ రాసి, ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా ఆమె సూసైడ్ నోట్లో భర్త పేర్కొన్న అంశాలను వెల్లడించారు. ‘పూడూరు మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన బిజ్జి పద్మమ్మ, మోసిన్ ఖాన్, వసీం ఖాన్, అర్జున్, రాజు, సల్మాన్ ఖాన్, అజీమ్, కురువ మహేందర్ అనే వ్యక్తులు నన్ను ఇబ్బందులకు గురిచేశారు. రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నప్పటికీ.. ఆ డబ్బులకు నెలకు రూ.40 వేల చొప్పున వడ్డీ కలిపి మొత్తం కలిపి రూ.83 లక్షలు చేశారు. అప్పు కింద మా రెండు ఎకరాల 14 గంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయినప్పటికీ అదనంగా డబ్బులు ఇవ్వాలని వేధించారు. అందుకే చనిపోతున్నాను’ అని నా భర్త లేఖ రాశారని ఆమె తెలిపింది. ఇదే విషయమై పోలీసులకు భర్త చనిపోయిన రోజే ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ వారు స్పందించ లేదని ఆరోపించారు. కుటుంబ పెద్దను కోల్పోయి కొడుకుతో అనాథగా మిగిలానని తెలిపింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి, నా భర్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
'బాగా చదువుకో'.. కన్నీరు పెట్టిస్తున్న విషాదం
‘తమ్ముడిని తీసుకుని మార్టుకెళ్తున్నా. అక్కడ వాడికి బొమ్మలు కొనిస్తా. నీకు కూడా తెస్తాలే..!!. నువ్వు స్కూలు నుంచి జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. బాగా చదువుకోవాలి. డబ్బులు, నగలు భద్రం..’ అంటూ తల్లి లీలా బాలశ్రావణి కుమార్తెతో మాట్లాడిన చివరి మాటలు గుర్తుచేసుకుని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం కుమారుడిపై పెట్రోల్ పోసి తనూ నిప్పంటించుకుని మృత్యుఒడికి చేరిన ఘటనపై వెంకటగిరి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకు చనిపోయింది.. ఆ ఆలోచన ఎలా వచ్చింది.. దీనికి కారణమేమిటి..? అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా.. మంగళవారం తల్లీకుమారుడికి బంధుమిత్రుల సమక్షంలో బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికారు. వెంకటగిరి రూరల్: వెంకటగిరి పట్టణానికి చెందిన లీలా బాలశ్రావణి, ఆమె కుమారుడు చంద్రమౌళి ఆత్మహత్యపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల వివరాల మేరకు.. ఇంట్లో భర్త నిద్రపోతున్న వేళ పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు చంద్రమౌళిని తన మోటారు సైకిల్పై ఎక్కించుకోని పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కుమార్తె నిషిత వద్దకు లాలా బాలశ్రావణి వెళ్లింది. కుమార్తెను పంపించాలని పాఠశాల ఉపా«ధ్యాయులను అభ్యరి్థంచింది. ఆ సమయంలో నిషితకు పరీక్ష ఉండడంతో పంపడం వీలుకాదని ఉపాధ్యాయులు తేల్చారు. దీంతో లీలా బాలశ్రావణి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదు పాఠశాల వద్ద కుమార్తెకు ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్లి, బాగా చదువుకోమని చెప్పినట్టు సమాచారం. తమ్ముడిని మార్టుకి తీసుకెళ్లి బొమ్మలు తీసుకొని వస్తామమని చెప్పి పట్టణంలోని కాశితోట వద్దకు చేరుకుంది. తనతోపాటు కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకుని తనువు చాలించింది. ఆ సమయంలో నిషతను తల్లితో పంపి ఉంటే నిషిత కుడా ప్రమాదానికి గురయ్యేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. కన్నీటి వీడ్కోలు పోస్టుమార్టం అనంతరం తల్లీకుమారుడి మృతదేహాలను స్వగృహం అయిన డక్కిలి మండలం, వెంబులూరు గ్రామానికి తీసుకెళ్లారు. ఒకే చోట తల్లి, కుమారుడు మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులతోపాటు, స్థానికులు చలించిపోయారు. వెంకటగిరి పట్టణం నుంచి పలువురు స్వగ్రామానికి చేరుకుని నివాళి అర్పించారు. కన్నీటి వీడ్కోలు మధ్య తల్లి, కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేశారు.చిన్న మనస్పర్థలే కారణమా? పెళ్లి జరిగి 12 ఏళ్లు దాటింది. ఉమ్మడి కుటుంబంతో అందరూ కలసిమెలసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. లీలా బాలశ్రావణికి చాలా మృధుస్వభావి. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచింతే తత్వం ఉన్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా తలనొప్పితో బాధ పడుతుండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఎక్కువగా ఆలోచించి క్షణికావేశం, తొందరపాటు నిర్ణయం తీసుకుందని పోలీసులకు తెలిపారు. అయితే భార్త నాగేశ్వరశర్మకు, భార్య లీలా బాలశ్రావణికి ముడు రోజుల నుంచి చిన్నపాటి మనస్పర్థలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ముమ్మర దర్యాప్తు తల్లి, కుమారుడు అగ్నికి ఆహుతైన ఘటనపై వెంకటగిరి సీఐ రోశయ్య, ఎస్ఐ స్వరూప ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. మంగళవారం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను భర్త నాగేశ్వరశర్మ, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న నాయుడుపేట ఫోరెన్సిక్ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రోశయ్య తెలియజేశారు. తల్లి బాలశ్రావణి, కుమారుడు చంద్రమౌళి మృతదేహాలకు పోస్టుమర్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
షికారుకు తీసుకెళ్లి ప్రియురాలి హత్య
కర్ణాటక: అనైతిక బంధాలు ఎలా విషాదాంతమవుతున్నాయో మరోసారి ఈ ఘటన చాటిచెప్పింది. జిల్లాలో జాతీయ రహదారి–948లో జవగనహళ్లి కొండ వద్ద నిర్జన ప్రాంతంలో గత నెల 22న లభించిన కాలిన స్థితిలో మహిళ మృతదేహం మిస్టరీని మళవళ్లి తాలూకా బెళకవాడి పోలీసులు ఛేదించారు. బెంగళూరులోని హారోహళ్లి కగ్గలీపురకు చెందిన నళిని (33)గా గుర్తించారు. స్థలంలో మహిళ చేతి గడియారం, ఉంగరం, హెయిర్ క్లిప్, ఇంటి తాళాలు లభించాయి. ఆమె ప్రియుడు తమిళనాడు క్రిష్ణగిరి జిల్లాకు చెందిన ఉప్పారహళ్లి రాజశేఖర్ (30) అని తేలింది. నళినికి ఇదివరకే పెళ్లయి విడిపోయింది. బెంగళూరులోని జేపీనగరలో బ్యూటీపార్లర్లో పనిచేసేది. నళినికి ఓ గుడి వద్ద రాజశేఖర్తో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని నళిని ఒత్తిడి చేయగా, నీకు ఇదివరకే పెళ్లయిందని అతడు నిరాకరించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. నళిని తీరుతో కక్ష పెంచుకున్న రాజశేఖర్ మాయమాటలతో నళినిని గత నెల 22న కారులో షికారుకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి నిప్పంటించి కాల్చి వేశాడు. తర్వాత రెండు రోజులకు మళ్లీ అక్కడకు వెళ్లి కాలిన స్థితిలో శవాన్ని చూసి వెళ్లాడు. తల్లితో కలిసి నిందితుని ఆత్మహత్య పోలీసుల దర్యాప్తు తీవ్రం కావడంతో భయపడిన రాజశేఖర్ గతనెల 28న సాయంత్రం తన తల్లితో కలిసి తమిళనాడులోని ఉప్పారహళ్లి వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదివరకే అతన్ని విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. తరువాత నళిని స్నేహితురాలు శ్రేయా వారి ప్రేమ గురించి పోలీసులకు వివరించింది. దీంతో మిస్టరీ వీడింది. అయితే హంతకుడు కూడా చనిపోవడంతో కేసు క్లోజ్ చేశారు. ఎస్పీ శోభారాణి, డీఎస్పీ యశ్వంత్, సీఐ శ్రీధర్, ఎస్ఐ ప్రకాష్ కేసును పర్యవేక్షించారు. -
సికింద్రాబాద్లో దారుణం.. మహిళపై ఇద్దరి అత్యాచారం
హైదరాబాద్: భర్తతో తలెత్తిన విభేదాలను ఓ టీవీ చానల్ వేదికగా జరిగే చర్చా కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవడానికి హైదరాబాద్ వచి్చన ఓ మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్లోని ఓ తండాకు చెందిన ఓ మహిళకు 9 ఏళ్ల క్రితం సిరిసిల్లకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వారికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో మూడు రోజుల క్రితం ఆ మహిళ పుట్టింటికి వచ్చింది. ఓ టీవీ చానల్లో కుటుంబ వివాదాల పరిష్కారంపై ప్రసారమయ్యే చర్చా కార్యక్రమానికి వెళ్తే తన సమస్య పరిష్కారమవుతుందని భావించిన ఆమె ఈ నెల 6న మహబూబాబాద్లో రైలెక్కి నగరానికి చేరుకుంది. ఆ చానల్ కార్యాలయం కోసం వెతుకుతూ మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చింది. అదే సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఎక్కడికెళ్లాలని అడగ్గా టీవీ చానల్ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పింది. తనకు తెలిసిన వ్యక్తికి టీవీ చానల్తో సంబంధాలు ఉన్నాయని.. తనతో వస్తే తీసుకెళ్తానని నమ్మించి ఆ మహిళను ఎంజీ రోడ్డు లోని ఓ నిర్మానుష్య భవనం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తన స్నేహితుడిని పిలిపించడంతో అతను కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. దీనిపై బాధితురాలు స్థానికుల సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో నిందితుడు మిస్సింగ్
విజయవాడ: ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో నిందితుడు అదృశ్యమయ్యాడు. దీంతో హైకోర్టులో అతడి కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఓ కేసులో పోలీసులు ఏసుబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అతడు కనిపించడం లేదని పిటిషన్లో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గత నెల 17వ తేదీన ఓ కేసు విచారణ కోసం మొగిలిచర్ల ఏసుబాబును జగ్గయ్యపేట పోలీసులు తీసుకెళ్లారు. నాటి నుంచి నేటి వరకూ ఏసుబాబు ఆచూకీ లభ్యం కాలేదు. విచారణ పేరుతో ఏసుబాబు భార్య, అత్తను తీసుకెళ్లి పోలీసులు టార్చర్ చేస్తున్నారు. ఏసుబాబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో హైకోర్టులో మేనమామ పల్లెపోగు శివయ్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. రేపు హైకోర్టులో హెబియస్ పిటిషన్ విచారణకు రానుంది. -
ప్రియుడి మోజులో పిశాచిగా మారిన భార్య.. భర్తను చంపి అక్కడితోనూ ఆగకుండా
జీవితంలో అత్యంత నమ్మకంగా ఉండాల్సిన బంధం... జీవితాంతం తోడుగా నిలవాల్సిన అనుబంధం... అదే ఒక రోజు ప్రాణాలు తీసే కుట్రగా మారితే? ప్రేమ, నమ్మకం, కుటుంబం అనే విలువలన్నీ ఒక్క క్షణంలో ఛిద్రమైతే? బయట ప్రపంచం నుంచి ప్రమాదం వస్తుందని భయపడే మనిషి... తన ఇంట్లోనే, తనకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి చేతిలో ప్రాణాలు కోల్పోతాడని ఊహించగలడా?అలాంటి హృదయవిదారక ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. భార్య చేతిలో మరో భర్త ప్రాణాలు కోల్పోయాడు. వరుసగా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తూ ఇప్పటికే ఎంతో మంది మహిళలు అరెస్ట్ అయ్యారు. అయినప్పటికీ ఇలాంటి ఘోరాలు ఆగడం లేదు.తాజా కేసులో, యువకుడు కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే... అతడు ఎక్కడో కొత్త జీవితం మొదలుపెట్టాడేమో అనుకున్నవాళ్లు కూడా ఉన్నారు. కానీ వాస్తవం మాత్రం అందరినీ కలచివేసింది. కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం నెలల తరబడి సాగిన అన్వేషణ చివరకు ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఆ నిజం తెలిసిన క్షణం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఈ ఘటన గురించి విన్న ప్రతి ఒక్కరూ షాక్కు గురయ్యారు.హైదరాబాద్లోని మియాపూర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. డెడ్బాడీని మహారాష్ట్ర సరిహద్దులో పూడ్చిపెట్టింది. ఏమీ తెలియనట్లు.. భర్త కనిపించడం లేదని గత ఏడాది నవంబరులో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఆమె నాటకాలు బయటపడ్డాయి. నిందితురాలు ఎవరో తేలడంతో పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం ఎంతకాలం సాగినా... నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందనే మాట మరోసారి నిజమైంది. అనుమానం రాకుండా వేసిన ప్రతి అడుగు, దాచిపెట్టిన ప్రతి ఆనవాలు, చెప్పిన ప్రతి కథ చివరకు విచారణ ముందు తేలిపోయాయి. బంధాన్ని కాపాడాల్సిన భార్యే ద్రోహానికి పాల్పడటం, ఆ తర్వాత నాటకం ఆడడం సినిమాను తలపించేలా ఉంది. ఈ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టిన ఈ ఘటనలో బయటపడిన విషయాలు వింటే గుండె చెమ్మగిల్లక మానదు. నెలలుగా మిస్టరీగా ఉన్న ఈ కేసు చివరకు పోలీసులు ఛేదించడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. -
వివాహేతర సంబంధం.. భర్త హత్య కేసులో సంచలన తీర్పు!
నెల్లూరు జిల్లా: వివాహేతర సంబంధం కొనసాగించేందుకు అడ్డుగా ఉన్నాడని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడితో కలిసి 2021లో హత్య చేసిన ఘటనలో నేరం రుజువు కావడంతో హతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ సోమవారం గూడూరు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఒకటో పట్టణ సీఐ శేఖర్బాబు తెలిపిన వివరాల మేరకు.. గూడూరులోని నరసయ్యగుంట ప్రాంతానికి చెందిన రూపేష్ మానస 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. మానసకు గూడూరు మండలం కొండగుంట గ్రామానికి చెందిన ఎంట్రపాటి రవివర్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రూపేష్ ఓ రోజు కోపంతో రవివర్మపై దాడి చేశాడు. దీంతో రవివర్మ, మానస కలిసి రూపేష్ ను హత మార్చాలనుకున్నారు. పధకంలో భాగంగా మానస అత్తగారి ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రవివర్మ నరసయ్యగుంటలోని రూపేష్ ఇంటికి చేరుకుని నిద్రలో ఉన్న రూపేష్ తలపై ఇనుప రాడ్తో మోది హత్య చేశాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కేసు నమోదు చేయగా అప్పటి సీఐ జి.దశరథరామారావు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో గూడూరు ఏడో అదనపు జిల్లా జడ్జి కె.వెంకటనాగ పవన్ సంచలన తీర్పును ఇస్తూ నిందితులైన రవివర్మ, మానసలకు జీవిత ఖైదుతోపాటు రూ.50 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించారు. -
అమ్మా.. ఎంత పనిచేశావు?
తిరుపతి జిల్లా: బడి నుంచి ఇంటికొచ్చిన బిడ్డకు అన్నం పెట్టి మళ్లీ పంపించాల్సిన తల్లి.. దారుణానికి పాల్పడింది. కొడుకుపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఆ తల్లి తానూ పెట్రోల్ పోసుకుని సజీవదహనమైంది. అమ్మ తనకు ఎందుకు నిప్పంటించిందో తెలియక శరీరం కాలిపోతుంటే భరించలేక కేకలు వేస్తూ పరుగెత్తిన ఆ చిన్నారి తరువాత కన్నుమూశాడు. అమ్మ స్కూటీ ఎక్కమంటే.. ఎక్కడికో తీసుకెళుతుంది, ఏదో కొనిపెడుతుందన్న ఆశతో స్కూటీ ఎక్కిన ఆ చిన్నారి శరీరం కాలి విలవిల్లాడుతూ ప్రాణాలొదిలాడు. హృదయవిదారకమైన ఈ ఘటన సోమవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో అందరికంట తడిపెట్టించింది.పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరికి చెందిన నాగేశ్వరశర్మకు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన గూడలి శ్రావణి (35)కి 2014లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు చంద్రమౌళి (09) ఉన్నాడు. పట్టణంలోని కర్ణకమ్మ వీధిలో నివాసముంటున్నారు. నాగేశ్వరశర్మ కాశీపేటలోని శివాలయంలో అర్చకుడుగా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రమౌళి స్థానిక కేంద్రీయ విద్యాలయంలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం బడికెళ్లి మధ్యాహ్నం ఇంటికొచి్చన చంద్రమౌళిని తల్లి శ్రావణి స్కూటీపై ఎక్కించుకుంది. పట్టణానికి కిలోమీటరు దూరం తీసుకెళ్లి రోడ్డుపక్కన ఆపింది. తన వెంటతెచ్చిన సీసాలో పెట్రోల్ కుమారుడిపై పోసి నిప్పంటించింది. ఆ తర్వాత తనపైనా పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు, కాలిన గాయాలు తట్టుకోలేక ఆ బాలుడు కేకలు వేస్తూ పట్టణం వైపు పరుగులు తీస్తూ ఓ ఆటోడ్రైవర్ వద్దకు చేరుకున్నాడు. ఆటోడ్రైవర్ తన సెల్ఫోన్తో నాగేశ్వరశర్మకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరశర్మ హుటాహుటిన అక్కడికి చేరుకునేసరికే శ్రావణి పూర్తిగా కాలి ముద్దగా మారింది. తీవ్రంగా శరీరం కాలిన చంద్రమౌళిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లారు. తరువాత మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న సీఐ రోశయ్య, ఎస్ఐ స్వరూప ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రావణి ఈ దారుణానికి పాల్పడటానికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
భర్తను లేపేయడానికి చావు తెలివి.. పట్టించిన సెల్ ఫోన్
-
ఏ కష్టం లేదు.. అయినా ఎందుకీ విషాద నిర్ణయం?
ముచ్చటైన కుటుంబం. ఏ కలతలూ లేవు. ఆర్థిక సమస్యలు అసలేలేవు. కుమారుల్లో ఒకరు జర్మనీలో ఉన్నత చదువులు. మరో కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం. ప్రొవిజన్స్ స్టోర్తో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారి కుదుపు. దుకాణం నుంచి ఇంటికెళ్లొస్తానంటూ బయల్దేరిన మహిళ అనూహ్యంగా చావును ఆశ్రయించడం గంగనపల్లెను విషాదంలో ముంచెత్తింది. చిత్తూరు కార్పొరేషన్: ఆదివారం నగరానికి చెందిన హేమలత (44) చిత్తూరు రైల్వేస్టేషన్ వద్ద రైలుకు ఎదురొడ్డి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మహత్య వెనుక బలమైన కారణాలేవీ లేవని, మానసిక స్థితి సరిగా లేక, కుంగుబాటుకు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తేలిందని రైల్వే జీఆర్పీ ఎస్సై నరసింహులు చెప్పారు. బంగారుపాళెంకు చెందిన హేమలతకు బావ వరుస అయిన చిత్తూరు గంగనపల్లెకు చెందిన చంద్రశేఖర్శెట్టితో 2001లో వివాహమైంది. మొదట్లో చంద్రశేఖర్ సోప్, నూనె డీలర్గా ఉంటూ చిల్లర దుకాణం నిర్వహించేవారు. రెండూ చూసుకోవడం కష్టంగా మారడంతో గంగనపల్లెలో చిల్లర దుకాణం నిర్వహణకే పరిమితమయ్యారు. తొలి నుంచి హేమలత బాగానే ఉన్నప్పటికీ మూడేళ్ల క్రితం అత్త మరణం ఆమెను కుంగదీసింది. చిత్తూరు, వేలూరులోని ఆస్పత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారు. తనకు నలతగా ఉందని, నిద్రపట్టడం లేదని, తినాలని లేదని, దడదడ ఉందని భర్త, పిల్లలతో తరచూ చెప్పేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరింత మెరుగైన చికిత్స కోసం తమిళనాడులోని వేరొక ఆస్పత్రికి తీసుకెళ్తానని భర్త చెప్పినా అవసరం లేదని, తాను బాగానే ఉన్నానని చెప్పేదని తెలిసింది. అంతేకాకుండా కొన్నిరోజులుగా ఆమె మందులు కూడా వేసుకోవడం మానేసినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చిల్లర దుకాణాన్ని దంపతులు తెరిచారు. చంద్రశేఖర్రెడ్డి మార్కెట్కు వెళ్లి కూరగాయలు, సరుకులు తీసుకొని దుకాణానికి వచ్చారు. అప్పటికే చాలాసేపు ఆమె దుకాణంలో ఉండడంతో చంద్రశేఖర్రెడ్డి ఇద్దరికీ హోటల్ నుంచి టిఫిన్ తెచ్చాడు. దుకాణంలోనే తిన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకొమ్మని భార్యకు చెప్పాడు. ఆమె రెస్ట్ తీసుకుని వస్తానంటూ బయల్దేరింది. అయితే ఇంటికి వెళ్లలేదు. తిన్నగా మూడు కిలోమీటర్ల దూరంలోని రైల్వేస్టేషన్కు కొత్తబస్టాండ్ సమీప మార్గంలో వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అప్పటికే భార్య కోసం గాలింపు..! ఇంటికి వెళ్లిన చంద్రశేఖర్కు భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఆమె ఆచూకీ కోసం గాలించినా లభించలేదు. సాయంత్రం చిత్తూరు టౌటౌన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన “గుర్తు తెలియని మహిళ మృతి’ సమాచారాన్ని చూపారు. అంతేకాకుండా మృతురాలి కుడిచేతిపై మురళి అని పచ్చ»ొట్టు (మృతురాలి అన్న పేరు) ఉండటం కూడా చూశారు. ఆ మృతురాలు హేమలతే అని గ్రహించి భోరున విలపించారు. ఆ తర్వాత రైల్వే పోలీసులను సంప్రదించారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. గంగనపల్లె వాసులను ఈ ఉదంతం కలచివేసింది. -
నిజామాబాద్ భార్య AI వీడియో
-
కొత్త జంటపై పోలీస్ స్టేషన్లోనే దాడి
బెంగుళూరు: ప్రేమించి వివాహం చేసుకున్న జంటపై పోలీస్స్టేషన్ ఆవరణలోనే హత్యాయత్నం చేసిన సంఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా బసవాపట్టణంలో జరిగింది. కుంచుగారనహళ్లికి చెందిన సిద్ధేశ్ (22)ని యువతి కుటుంబభ్యులు కత్తితో పొడిచారు. వివరాలు.. దాగినకట్టె గ్రామానికి చెందిన లీలావతి (18), సిద్ధేశ్ ప్రేమించుకున్నారు. పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా ఇటీవలే వివాహం చేసుకున్నారు. లీలావతి కుటుంబం నుంచి బెదిరింపులు వస్తుండడంతో ఇద్దరూ జిల్లా ఎస్పీని కలిసి భద్రత కల్పించాలని కోరారు. ఎస్పీ సూచనల మేరకు ఇద్దరూ బసవాపట్టణ పోలీస్స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలనుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఉండగానే యువతి కుటుంబీకులు సిద్ధేశ్ను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశారు. యువతిని తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు సిద్ధేశ్ను దావణగెరెలోని ఎస్ఎస్ ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచారు. పోలీసు స్టేషన్లోనే హత్యాయత్నం జరగడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
భార్య, మరదలిని హత్య చేసిన భర్త?
బెంగుళూరు: కట్టుకున్న భార్యను, ఆమె చెల్లెలిని చాకుతో గొంతుకోసి చంపాడో కిరాతకుడు. అక్కడి నుంచి సొంతూరికి పారిపోయాడు. చింతామణి పట్టణం జెజె కాలనీలో సోమవారం ఈ హత్యాకాండ జరిగింది. వివరాలు.. భార్య షమా తాజ్ (27) మరదలు రేష్మా(18)ను హత్య చేశాడు. 8 ఏళ్ల కిందట స్థానికులు అనిత, సర్దార్ దంపతుల కుమార్తెను కోలారు మిలత్ నగరకు ఎజాజ్ (35)కు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని ఏళ్లు సజావుగా సాగింది, వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. 3 నెలల నుంచి కలహాలు జరుగుతున్నాయి. ఆమె కోలారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పంచాయతీలు చేశారు. పుట్టింటికి వచ్చేసినా.. భర్త వేధింపులను తట్టుకోలేక షమా తాజ్ ముగ్గురు పిల్లలను పిలుచుకొని చింతామణిలో పుట్టింటికి వచ్చింది. ఎజాజ్ ఆదివారం రాత్రి ఆమె వద్దకు వచ్చాడు, ఈ సమయంలోనూ రగడ మొదలైంది. ఉదయమే వాగ్వాదం జరిగి, ఎజాజ్ కత్తి పట్టుకుని ఉన్మాదిగా మారి భార్య, ఆమె చెల్లెలిని గొంతు కోసి, ముగ్గురు పిల్లలను పిలుచుకొని కోలారుకు వెళ్లాడు. ఇంటిలో పిల్లలను వదిలి, గల్పేట ఠాణాలో లొంగిపోయాడు. గంజాయి, ఇస్పేటు అలవాట్లు చుట్టుపక్కల జనం అనుమానంతో ఇంట్లోకి వెళ్లిచూడగా ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, అదనపు ఎస్పీ జగన్నాథ్, సీఐ శివరాజ్ పరిశీలించారు. ఎజాజ్ నిత్యం గంజాయి సేవిస్తూ, ఇస్పేటు ఆడుతూ సంసారాన్ని పట్టించుకొనేవాడు కాదని బంధువులు ఆరోపించారు. షమా తల్లిదండ్రులే డబ్బులు పంపేవారని చెప్పారు. -
సోదరి నిశ్చితార్థానికి వెళ్లొస్తూ..
హైదరాబాద్, శంషాబాద్: ఔటర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందగా వదినకు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపిన మేరకు.. కాకినాడ రామచంద్రాపురం మండలం యెరుపల్లికి చెందిన చల్లా రాఘవేంద్ర ప్రసాద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కిస్మత్పూర్లో నివాసముంటున్నాడు.వరుసకు సోదరుడైన చల్లా మనోహర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. రాఘవేంద్రప్రసాద్ సోదరి నిశ్చితార్థం కోసం వారి స్వగ్రామం యెరుపల్లికి ఈ నెల 4న ప్రసాద్, అతని భార్య భవాని (31), కొడుకు కార్తికేయ (2)తో పాటు మనోహర్ వెళ్లాడు. శుభకార్యం తర్వాత వీరంతా ఈ నెల 5న సాయంత్రం హైదరాబాద్ బయలుదేరారు.వెనక నుంచి లారీని ఢీకొట్టి.. కారును రాఘవేంద్రప్రసాద్ నడుపుతుండగా.. పక్క సీట్లో మనోహర్, వెనక సీట్లో భవాని, కార్తికేయ కూర్చున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు ఔటర్పై పెద్దగోల్కొండ శివారులోకి రాగానే.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. రాఘవేంద్ర గమనించకపోవడంతో కారు అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టింది.లారీని కారు ఎడమవైపు భాగం బలంగా ఢీకొనడంతో మనోహర్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు వెనక సీట్లో కూర్చున్న భవానికి తీవ్ర గాయాలవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మాట్లాడుకుందామంటూ రప్పించి.. కత్తులతో పొడిచి
హైదరాబాద్, పహాడీషరీఫ్: స్నేహితుల మధ్య నెలకొన్న గొడవలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. బార్కాస్ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బాల్కషర్ (29) జిమ్ కోచ్తో పాటు మెకానిక్గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సయీద్ బిన్ ఫైసల్ బామ్, సాలం బామ్ అనే స్నేహితులు ఉన్నారు.వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. మాట్లాడుకుందామంటూ సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మరియం కాలనీకి ఫహద్ను స్నేహితులు పిలిపించారు. అక్కడికి వెళ్లాక మాటామాటా పెరిగింది. పథకంలో భాగంగా అప్పటికే తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో ఫహద్పై విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొన ఊపిరితో ఉన్న ఫహద్ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. -
నిజామాబాద్ లో దారుణం.. భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి
-
లై డిటెక్టర్ టెస్ట్ లో సియా ఏం చెప్పిందంటే..? అందరూ షాక్!
-
వామ్మో.. కళ్లజోడులో స్పై కెమెరా పెట్టుకుని బద్రీనాథ్ ఆలయంలోకి..
డెహ్రాడూన్: కొన్ని హిందూ దేవాలయాల్లో ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నిషేధం. భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటి నిబంధనలను ఉల్లంఘించిన ఓ భక్తుడు ఇప్పుడు పోలీసు చర్యలను ఎదుర్కొంటున్నాడు.బద్రీనాథ్ ధామ్ గర్భగుడిలో స్పై కెమెరాతో అక్రమంగా వీడియో చిత్రీకరించిన ఓ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. తన పేరు జైప్రకాశ్ పాండే అని చెప్పుకున్న అతడు.. క్షమాపణ చెప్పి, ఆ వీడియోను ఏ రూపంలోనూ షేర్ చేయబోనని హామీ ఇచ్చాడు. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న విష్ణుమూర్తికి అంకితమైన బద్రీనాథ్ ఆలయ గర్భగుడిలో ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం పూర్తిగా నిషేధం.ముంబైకు చెందిన పాండే తన కళ్లజోడులో స్పై కెమెరా పెట్టుకుని గర్భగుడి లోపలి దృశ్యాలను రికార్డు చేశాడు. దీనిపై పాండే మాట్లాడుతూ.. "ఈ కెమెరాతో వీడియో తీస్తూ పట్టుబడ్డాను. ఇది నా తప్పు. ఇలా చేయకూడదని నాకు తెలియదు. ఇకపై ఇలాంటి పని చేయను. వీడియోను తొలగిస్తున్నాను. దానిని ఎక్కడా పోస్ట్ చేయను" అని చెప్పాడు.ఈ చర్య ఆలయ యాజమాన్యం అమలు చేస్తున్న నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, ఆధ్యాత్మిక మర్యాదలకు విరుద్ధమని చమోలీ పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఉత్తరాఖండ్ సెక్షన్ 81 కింద న్యాయపరమైన చర్యలు ప్రారంభించారు. ఆలయ గోప్యత, భద్రత దృష్ట్యా అతడి వద్ద ఉన్న అక్రమంగా చిత్రీకరించిన వీడియోలు, ఫొటోలు అన్నింటినీ తొలగించారు.ఆలయ యాజమాన్యం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ప్రతి భక్తుడు తప్పనిసరిగా పాటించాలని చమోలీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత ప్రాంతాల్లో ఎలాంటి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయవద్దని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. -
పార్టీకి పిలిచి, మూకుమ్మడి అత్యాచారయత్నం
బెంగుళూరు: రాజధానిలో ఘోరం జరిగింది. ఒక యువతిపై సామూహిక అత్యాచారయత్నం జరిగిన సంఘటన తలఘట్టపుర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది, ఈ ఘటనలో ప్రధాన నిందితులు సోమశేఖర్, అంబరీష్లతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేసే సోమశేఖర్ వద్దకు కలబుర్గి నుంచి నలుగురు స్నేహితులు వచ్చారు. దేవనహళ్లిలో ఉంటున్న తన స్నేహితురాలికి కాల్ చేసిన సోమశేఖర్, స్నేహితులు వచ్చారని, పార్టీకి రావాలని కోరాడు. సదరు యువతి వచ్చింది. అందరూ మద్యం తాగి విందు చేసుకున్నారు. ఈ సమయంలో అంబరీష్ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. మిగతావారు అందుకు సహకరించారు. అదృష్టవశాత్తు ఆమె వారి నుంచి తప్పించుకుని 112 హెల్ప్లైన్కి కాల్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య
కరీంనగర్రూరల్: భార్య వేధింపులు భరించలేక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బంగారు ఆభరణాలు తీసుకరావాలని, తల్లిదండ్రులను కలువకూడదంటూ మానసికంగా హింసించడంతోనే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి ఆరోపిస్తున్నాడు. కరీంనగర్రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి(హవేలి)కి చెందిన కళ్యాణం రవి కుమారుడు రాకేశ్(27) హైదరాబాద్కు చెందిన సంజన అలియాస్ వర్షను 2024లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తీగలగుట్టపల్లిలోని సరస్వతినగర్లో భార్యాభర్తలు నివాసముంటున్నారు. కొంతకాలంగా తల్లిదండ్రులను కలవకుండా రాకేశ్ను సంజనా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. సెల్ఫోన్లో సైతం మాట్లాడకుండా వేధింపులకు గురిచేయడంతో భరించలేక రాకేశ్ శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు.ఉరేసుకొని వ్యక్తి..యైటింక్లయిన్కాలనీ: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన కాసర్ల వెంకటేశ్(38)అనే కాంట్రాక్ డ్రైవర్ ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓసీపీ–5లో కాంట్రాక్ట్ వోల్వో డ్రైవర్గా వెంకటేశ్ పనిచేస్తున్నాడు.ఎడాది క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మద్యానికి బానిసై విధులకు పోవడంలేదు. భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత భార్య మరోగదిలో తన అత్తవద్ద పిల్లలలో కలిసి నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున వెంకటేశ్ తన గదిలో ఉరేసుకుని కనిపించాడు. పని చేయకుండా, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకొన్నట్లు మృతుడి భార్య స్వరూప ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీవితంపై విరక్తితో వివాహిత..మానకొండూర్: మండలంలోని కొండపలకల గ్రామానికి చెందిన దావల్ల భాగ్యలక్ష్మి (45) జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ శ్రీలత తెలిపిన వివరాలు.. భాగ్యలక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతోంది. చాలా ఆస్పత్రులు తిరిగినా ఆరోగ్యం కుదుట పడలేదు. గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు కాపాడారు. ఆదివారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లగా భాగ్యలక్ష్మి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కుమారుడి ‘జ్ఞాపకం’ కోసం ఓ తండ్రి ఆవేదన
హైదరాబాద్, అంబర్పేట: రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడికి సమాధి కట్టించాలనుకుంటున్న ఓ తండ్రి చేస్తున్న ప్రయత్నాన్ని ఓ వ్యక్తి ముందుకు కదలనివ్వడం లేదు. సమాధి నిర్మిస్తా అంటూ డబ్బుతీసుకుని నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ఆదివారం అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... డీడీ కాలనీకి చెందిన సూర్యనారాయణ మూర్తి కుమారుడు సురేష్(34) 2022లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో భువనగిరి జిల్లా సీమలకొండూరులోని సొంతపొలంలో దహనసంస్కారాలు చేసి అక్కడ భారీ ఖర్చుతో సమాధి కట్టించాడు. అక్కడ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమాధి అడ్డు వస్తుందని, ఇక్కడి నుంచి తరలించాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను కుమారుడి అస్థికలను తీసుకుని ఘట్కేసర్లోని స్మృతివనంలో నిర్వాహకులతో సంప్రదించి అస్థికలను పూడ్చిపెట్టాడు.పూడ్చిపెట్టిన ప్రాంతంలో సమాధి కట్టించడానికి రామ్చందర్ అనే వ్యక్తిని సంప్రదించడంతో రూ. లక్ష ఖర్చవుతుందని అందుకు అడ్వాన్స్ ఇవ్వాలని ప్రతిపాదించాడు. దీంతో సూర్యనారాయణ మూర్తి రూ. 50 వేలు అడ్వాన్స్ను ఈ ఏడాది మార్చి 25న ఆన్లైన్లో చెల్లించాడు. అడ్వాన్స్ తీసుకున్న రామ్చందర్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దీంతో అతను గత నెల అంబర్పేట పోలీసులను ఆశ్రయించగా నెల రోజుల్లో పూర్తి అయ్యేలా హామీ ఇప్పించారు. అయినా అతని తీరులో మార్పు రాకపోవడంతో ఆదివారం తిరిగి పోలీసు స్టేషన్కు వచ్చి న్యాయం చేయాలని కోరాడు. అవసరమైతే కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చి పంపించారు. -
బోగీ ఎక్కి.. హైటెన్షన్ వైర్లను పట్టుకొని..
హైదారాబాద్, కాచిగూడ: తల్లిదండ్రులతో గొడవపడి నగరానికి వచ్చిన ఓ ఏసీ మెకానిక్ మద్యం మత్తులో గూడ్స్ రైలు ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన మేరకు.. ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన శ్రీనివాస్ కుమారుడు కేసరి పవన్ (23) తల్లిదండ్రులతో గొడవపడి శనివారం రాత్రి నగరానికి వచ్చాడు. మద్యం మత్తులో మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు ఎక్కాడు. గూడ్స్ రైలు రెండు భోగీల మధ్య కూర్చుని ఫలక్నుమా రైల్వే స్టేషన్ వరకు చేరుకున్నాడు.రైలు ఫలక్నుమా రైల్వే స్టేషన్లో ఆగడంతో రైలు బోగీ ఎక్కి విద్యుత్ హైటెన్షన్ వైర్లను పట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కూతురికి మాటలు రావట్లేదని.. తల్లి తీవ్ర నిర్ణయం!
హైదరాబాద్, గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్పరిధిలో ఓ గృహిణి 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. బిహర్కు చెందిన ఆర్కిటెక్ట్ అన్మోల్ కుమార్, అపర్ణ అన్మోల్ అరుణ్(36) దంపతులు కొండాపూర్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో నివాసం ఉంటున్నారు.శుక్రవారం రాత్రి అపర్ణ 12వ అంతస్తునుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వీరి ఆరేళ్ల కుమార్తె ఆటిజంతో బాధపడుతోంది. కుమార్తెకు మాటలు రాకపోవడంతో అపర్ణ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుమార్తె విషయంలో భార్యా భర్తలకు గొడవ జరగడంతో బలవన్మరణం చెందినట్లుపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కిరాతకంగా హత్యచేసి.. భార్య చెల్లికే ఫోన్ చేసి..
హైదరాబాద్, ఉప్పల్: కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అనుమానంతో కత్తులతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిలుకానగర్ శనివారం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి చెందిన పోతపాటి సురేష్ (43), జెస్సికా (35) దంపతులు చిలుకానగర్లో అద్దెకు ఉంటున్నారు. సురేష్ సఫిల్గూడలోని ట్రావెల్స్ కంపెనీలో సూపర్ వైజర్గా పనిచేస్తుండగా జెస్సికా తార్నాకలో ఒక ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది.వీరికి ఒక కూతురు (9) ఉంది. తరచూ భార్యాభర్తలు గొడవపడుతూ ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన సురేష్ భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరూ పెద్దగా అరుచుకున్నారు. ఈ క్రమంలో జెస్సికాను కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. అది వంగిపోవడంతో మరో కత్తి తీసుకుని హత్య చేశాడు.శరీరంపై దాదాపు 8 చోట్ల కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం వరకు అక్కడక్కడే తిరుగుతూ.. చివరికి జెస్సికా సోదరికి హత్య చేసిన విషయం చెప్పాడు. ద్విచక్ర వాహనాన్ని ఇంటి వద్దే పార్క్ చేసి పక్కనే ఉన్న ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొని పారిపోయాడు. ఉప్పల్ ఏసీపీ వెంకటరెడ్డి హత్య జరిగిన తీరును కుటుంబ సభ్యులతో ఆరా తీశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
లై డిటెక్టర్ టెస్ట్పై సియా, చేతన్ కీలక నిర్ణయం!
-
మరో ఎన్కౌంటర్: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్పై కాల్పులు
గువాహటి: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్ విశ్వకర్మ ఎన్కౌంటర్లో గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం జీఎంసీహెచ్ ఆస్పత్రిలో చేర్చారు. గువాహటి నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగింది. కొన్ని రోజుల క్రితం గువాహటిలోని 3 చోట్ల పోలీసులు దాడులు చేపట్టి భారీ మొత్తంలో నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. సిక్స్మైల్లో దిస్పూర్ పోలీసులు ఏఎస్-01-పీసీ-8433 నంబరు స్విఫ్ట్ డిజైర్ కారు నుంచి రూ. 2.56 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దేవజిత్ దేయూరి, అజయ్ విశ్వకర్మను అరెస్టు చేశారు.పోలీసుల విచారణలో అజయ్ విశ్వకర్మ సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తన వాదన ప్రకారం, గువాహటి నగరంలో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నకిలీ నోట్లు చెలామణీ అయ్యాయి. అలాగే, లఖింపూర్ జిల్లాలోని బొంగాల్మారా కేంద్రంగా భారీ నకిలీ నోట్ల అక్రమ రవాణా ముఠా చురుకుగా పని చేస్తోందని వెల్లడించాడు.బుధవారం రాత్రి మాలిగావ్, సిక్స్మైల్ ప్రాంతాల్లో వేర్వేరుగా చేపట్టిన దాడుల్లో పోలీసులు మొత్తం దాదాపు రూ. 10 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మాలిగావ్లో కామాఖ్య రైల్వే జంక్షన్ ప్రాంతం నుంచి రూ. 7.37 లక్షల విలువైన నకిలీ నోట్లతో దయాల్ దాస్, గోలాబ్ షేక్ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లను ఝార్ఖండ్కు తరలిస్తారు. -
దొంగ సొమ్ము.. దొంగకే దక్కలేదు!
హైదరాబాద్: దొంగిలించిన సొత్తుతో ఓ వ్యక్తి హోటల్లో బస చేయగా అక్కడికి వచ్చిన ఓ యువతి అందులో నుంచి రూ. లక్ష ఎత్తుకెళ్లింది. జల్సాల కోసం చోరీ చేసిన సొత్తులో కొంత మరో దొంగ కొట్టేయడంతో ఓ నిందితుడు లబోదిబోమంటూ పోలీసుల ముందు తనగొడు వెల్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని జైన్ కన్స్ట్రక్షన్స్లో గుంటూరు జిల్లా గుడిపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ ఫణీంద్ర(29) గత మూడేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పని చేస్తున్నాడు.నమ్మకంగా పని చేస్తున్నట్లు యజమాన్యాన్ని నమ్మించి గత నెల 26వ తేదీన యజమాని కళ్లుగప్పి కార్యాలయంలో రూ.12.33 లక్షల నగదు ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లాడు. బస్సులో ఒంగోలుకు వెళ్లి చోరీ చేసిన సొత్తుతో ఒక కేటీఎం బైక్ కొనుగోలు చేశాడు. అక్కడే ఒక ఐఫోన్ కూడా కొన్నాడు. బైక్పై నెల్లూరు వెళ్లి ఓ హోటల్లో బస చేసి ఆ రాత్రికి ఓ యువతిని రప్పించుకున్నాడు. తెల్లవారి ఫణీంద్ర కళ్లుగప్పిన ఆ యువతి బ్యాగులో ఉన్న రూ.లక్ష సొత్తుతో ఉడాయించింది. నిందితుడు అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగిలించిన సొత్తును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాడు. అప్పటికే పోలీసులు ఫణీంద్ర కదలికలపై నిఘా పెట్టారు. ఫోన్ నెంబర్ ఆధారంగా బెంగళూరుకు 130 కిలోమీటర్ల దూరంలో ఓ బస్సులో వెళ్తున్న నిందితుడిని బంజారాహిల్స్ క్రైమ్ ఎస్ఐ యాసిన్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న ఫణీంద్ర మధ్య తరగతి జీవితంతో విసుగు చెంది సంపన్నులు మాదిరిగా ఉండాలని ఇప్పుడున్న జీతం సరిపోకపోవడంతో దొంగగా మారాడు. చోరీ చేసిన సొత్తుతో కేటీఎం బైక్తో పాటు ఐఫోన్ కొనుగోలు చేసి అంతకుముందు చేసిన అప్పులు తీర్చి స్టార్ హోటళ్లలో బస చేస్తూ జల్సాలు చేస్తూ అయిదు రోజుల పాటు బెంగళూరులోనే తిరిగాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కొంత సొత్తును రికవరీ చేశారు.


