Crime News
-
భార్య వివాహేతర సంబంధం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా : ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రాజు(35)కొమురంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిను ప్రేమించి 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మనించారు. అదేగ్రామానికి చెందిన మండల రవీందర్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది సరైన పద్ధతి కాదని రాజు తన భార్యతోపాటు రవీందర్నూ పలుమార్లు మందలించినా తీరు మారలేదు. ఈక్రమంలో ఆర్నెల్లక్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకుని తన స్వస్థలం వెళ్లిపోయింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించినా, మందలించినా రవీందర్ తీరు మారకపోగా.. తన భార్యను తరచూ కలుసుకోవడంతో అవమానంగా భావించి మనస్తాపంతో రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు ఇందుకు కారణమని భావించి రవీందర్ ఇందిఎదుట మృతదేహతో ధర్నా చేశారు. ఆత్మహత్యకు కారణమైన మృతుడి భార్యతోపాటు రవీంరద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ రాజు, ముత్తారం, రామగిరి ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోలీస్స్టేషన్ వద్దకు తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
భర్తను వదిలి బంగారం, డబ్బుతో వెళ్లిపోయిన భార్య..
వరంగల్ జిల్లా: భార్య.. భర్తను వదిలి డబ్బులు, బంగారం, ఇతర సామగ్రితో వెళ్లిపోయింది. ఈ∙ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... పుట్ట నరేశ్ అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గీసుగొండ మండలం మునుగొండకు చెందిన గుల్లపల్లి గాయత్రితో మార్చి 15, 2026న వివాహం జరిగింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి సోమవారం గూడ్స్ వాహనాన్ని రప్పించి ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇంటిలోని ఐదు తులాల బంగారం, రూ.2.5లక్షల నగదు, ఇతర సామగ్రి తీసుకుని వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికిన నరేశ్ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆదివారం అవమాన భారం భరించలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. ప్రస్తుతం నరేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. -
అతనితో శారీరక సంబంధం పెట్టుకో.. బాలికకు వీఆర్వో ఒత్తిడి..!
అనకాపల్లి జిల్లా: మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికను ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసిన మహిళా వీఆర్వోపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం. ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హాస్టల్ ఉండి చదువుకుంటోంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన ఆ బాలికకు సమీపంలో ఉన్న మహిళా వీఆర్వో బొల్లం పార్వతి ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని చెప్పింది. అందుకు బాలిక నిరాకరించడంతో మహిళా వీఆర్వో, ఆమె అక్క సింగారపు అప్పలనర్సలు చెడు ప్రచారం చేయసాగారు. బాలికకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉన్నట్టు వదంతులు సృష్టించి ప్రచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది తెలిసిన బాలిక మనస్థాపం చెందడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఈ నెల 6వ తేదీన యలమంచిలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో వీఆర్వోపై కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
60 ఏళ్ల వయసులో జల్సాలు..! స్నేహితుడిని నమ్మించి..
బంజారాహిల్స్: 60 ఏళ్ళ వయసులో జల్సాలకు అలవాటుపడ్డాడు..పేకాటకు బానిసై అప్పులు చేశాడు.. వాటిని చెల్లించేందుకు నమ్మిన స్నేహితుడినే నట్టేట ముంచి బంగారు నగలతో ఉడాయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నయ్య అలియాస్ రాములు(60) పేకాటకు బానిసై జల్సాలకు అలవాటు పడి అందరి వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చడానికి మోసాలకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే అమీర్పేట్లోని ఓ హాస్టల్లో ఉంటూ బస్టాప్లలో అపరిచితులను పరిచయం చేసుకొని స్నేహం నటించి వారితో రాకపోకలు సాగిస్తూ వారి కదలికలు గమనిస్తుండేవాడు. గచ్చిబౌలికి చెందిన ఆర్అండ్ బీ రిటైర్డ్ ఉద్యోగి రాజామ్ రాజయ్య ప్రకాశ్ను ఇలాగే పరిచయం చేసుకొని 62 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 57.66 గ్రాముల బంగారంతోపాటు ఒక మొబైల్ ఫోన్ను రికవరీ చేసి రిమాండ్కు తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మిర్లోనిగూడెం గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి(45) విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమారులు ప్రశాంత్రెడ్డి, ప్రణీత్రెడ్డి(14) ఉన్నారు. లింగారెడ్డి కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసముంటున్నారు. లింగారెడ్డి పెద్ద కుమారుడు ప్రశాంత్రెడ్డి ఇటీవల పదో తరగతి పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటరీ్మడియట్లో చేరాడు. సోమవారం ఉదయం ప్రశాంత్రెడ్డిని హాస్టల్లో వదిలిరావడానికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాద్కు వెళ్లింది. అదే సమయంలో లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన మిర్లోనిగూడెం వెళ్లగా.. ఇంట్లో లింగారెడ్డి, అతడి చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డి మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డికి ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడగగా.. తిన్నానని సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకునేసరికి గేటుకు లోపలి నుంచి బేడం వేసి ఉంది. ఎంత పిలిచినా భర్త, కుమారుడు స్పందించకపోవడంతో పక్కింటి బాలుడి సహాయంతో గేటు తెరిపించి లోపలికి వెళ్లి చూడగా భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత్రెడ్డి తలపై తీవ్ర గాయాలు ఉండగా, ఇంట్లో టీవీ స్టాండ్పై సుత్తి కనిపించింది. మరోవైపు లింగారెడ్డి నోటి నుంచి నురగలు రావడంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అయితే కొడుకును సుత్తితో కొట్టి హత్య చేసిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సుత్తిపై ఉన్న వేలిముద్రలతో పాటు మృతుల వేలిముద్రలను కూడా సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నేరాలు చేసి నేపాలీలు పరార్!
సాక్షి, సిటీబ్యూరో: రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో నిందితులైన ఏడుగురు నేపాలీల్లో ఒక్కరే చిక్కారు. సూత్రధారి, కీలక నిందితురాలు కల్పన సహా మిగతవారు పరారీలోనే ఉన్నారు.ఈ ఒక్క కేసులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నేపాలీ సంబంధిత నేరాల్లో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న వారి సంఖ్య 170గా తేలింది. నేపాలీ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిని పట్టుకోవడానికి సమన్వయంతో, సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.ఈ నేపాలీ నేరగాళ్లు సంపన్నుల ఇళ్లల్లో పని వాళ్లు, వంట వాళ్లు, వాచ్మెన్లుగా చేరుతున్నారు. తొలినాళ్లలో నమ్మకంగా పనిచేసినా.. ఆపై అదును చూసుకుని పంజా విసురుతున్నారు. సరైన సమయంలో తమ ముఠాకు చెందిన మిగిలిన వారిని రంగంలోకి దింపుతున్నారు. అంతా కలిసి తమ ‘పని’ పూర్తి చేసుకున్న తర్వాత ముందు నగరం..ఆపై దేశం దాటేస్తున్నారు. కల్పన కూడా నేపాల్ చేరినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేటుగాళ్లు నేరం చేసిన వెంటనే తమ సెల్ఫోన్లు, సిమ్కార్డులు ధ్వంసం చేసేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఫలితంగా పోలీసులకు వీరి ఆచూకీ కనిపెట్టడం పెద్ద సవాల్గా మారుతోంది.రెండు రకాల వ్యూహంతో ముందుకు..వాంటెడ్గా ఉన్న నేపాలీలను పట్టుకోవడానికి పోలీసులు రెండు రకాలైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సాంకేతిక నిఘా ఉంచడంతో పాటు సరిహద్దుల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టులు, ఇతర విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క ఈ నేరగాళ్ల వివరాలు, ఆచూకీ చెప్పాల్సిందిగా కోరుతూ ఆయా అసోసియేషన్లు, యూనియన్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినప్పటికీ నేపాల్లోకి ప్రవేశించి, వీరికి అరెస్టు చేసుకురావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.బెయిల్ వస్తే మళ్లీ దొరకరు... ప్రస్తుతం రాష్ట్ర పోలీసులకు వాంటెడ్గా ఉన్న 170 మందీ నేరం చేసిన వెంటనే పరారు కాలేదు. వీరిలో కొందరు అరెస్టయి.. బెయిల్పై వచి్చ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ష్యూరిటీలు ఇచి్చన వారికీ వీరి వివరాలు తెలియట్లేదు. శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ పంథా అనుసరిస్తుండటంతో వీరిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాయి.కీలకంగా వ్యవహరిస్తున్న జీవన్... రాష్ట్రంలో నేపాలీలకు ఉద్యోగాలు ఇప్పించడం, నేరాలు చేయించడంలో జీవన్ అనే నేపాలీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు ఓ దళారిగా వ్యవహరిస్తూ సంపన్నుల ఇళ్లల్లో నేపాలీలను పనిలో పెడుతున్నాడు. ఆపై పథక రచన చేసి, మిగతవారిని రంగంలోకి దింపి టార్గెట్ చేసిన ఇంట్లో నేరం చేయిస్తున్నాడు. పథకం సిద్ధమైన తర్వాత నేరం జరగడానికి ముందు తొలుత అతగాడే నేపాల్ వెళ్లిపోతాడు. అతని సహచరులు ఇక్కడే ఉండి ప్రణాళికను అమలు చేస్తారు. కొన్నాళ్లకు మరో పేరుతో వస్తున్న జీవన్ నేర పంథా కొనసాగిస్తున్నాడని పోలీసులకు ఆధారాలు లభించాయి. అతడి కోసం ఆరా తీస్తున్నారు. -
బీమా చేయించి.. చంపేశారు!
నారాయణపేట: ఇన్సూరెన్స్ చేయించినవారే..రూ.50 లక్షల జీవిత బీమా సొమ్మును కాజేయాలనే దురాశతో పథకం ప్రకారం హత్య చేసి.. దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు బోడి రాజు (44)కు మక్తల్ పట్టణానికి చెందిన ఆనంపల్లి భాస్కర్ దూరపు బంధువు. మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన అల్లెం నాగరాజు ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కమీషన్ ఒప్పందం చేసుకొని అందరితో బీమా చేయిస్తుంటాడు. అదే తరహాలో తనకు పరిచయం ఉన్న ఆనంపల్లి భాస్కర్ సహాయంతో బోడి రాజుతో రూ.50 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు.రాజు వద్ద డబ్బు లేకున్నా.. తర్వాత ఇవ్వమని చెప్పి నిందితుడు నాగరాజే తొలిఏడాది పాలసీ డబ్బులు కట్టాడు. ఫోన్నంబర్ పాలసీదారుడు రాజుది కాకుండా నాగరాజు తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అయితే బీమా డబ్బు సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనంపల్లి భాస్కర్తోపాటు గుడిగండ్ల గ్రామానికి చెందిన సిరిగిరి భాను ప్రకాశ్తో కలిసి పథకం వేశారు. అందులో భాగంగా జూన్ 3న సాయంత్రం రాజును తమ వెంట తీసుకెళ్లారు. ఆయనకు బాగా మద్యం తాగించిన అనంతరం సామన్పల్లి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు కట్టెలు, రాళ్లతో దాడి చేశారు.ప్రమాదంగా నమ్మించే యత్నం.. దాడి అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న బోడి రాజును భాను ప్రకాశ్కు చెందిన కారులో హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, దండు చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమా దం జరిగిందని, చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం ఇచ్చారు.జూన్ 4న కుటుంబ సభ్యులు మక్తల్ పోలీస్స్టేషన్లో రోడ్డు ప్రమాద మరణంగా ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన మక్తల్ పోలీసులు అనుమానాస్పద అంశాలపై దృష్టి సారించారు. కారు డ్రైవర్ సిరిగిరి భానుప్రకాశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. దండు చౌరస్తా వద్ద ఎ లాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని తేలింది.అనంతరం నిందితులను లోతుగా విచారించగా, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పన్నిన హత్య కుట్ర వెలుగులోకి వచి్చంది. పోలీసుల విచార ణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లెం నాగరాజు, సిరి గిరి భాను ప్రకాశ్, ఆనంపల్లి భాస్కర్లను అరెస్ట్ చేశారు. -
హైదరాబాద్లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో నేపాల్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న వ్యాపారి ఇంట్లో సుమారు కేజీ బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులే చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారి ఆ దంపతులను పనిలో పెట్టుకోగా, ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది.ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు.. నిందితుల కోసం గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, గత నెల 8వ తేదీన ప్రశాసన్నగర్లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య తనూజరంజన్ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్ను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్లోకి అడుగుపెట్టారు.చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సునీల్ పెరియార్తో పాటు రిసీవర్ దిలీప్లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంతలోనే నగరంలోని . గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది. -
అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!
గోవిందరావుపేట: చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని టేకులకుంట గొత్తికోయ గుంపులో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.స్థానికులు, బంధువుల సమాచారం మేరకు మృతులను కాశపు కోమల (18), కోరం ఇరవయ్య (18)గా గుర్తించారు. వీరిద్దరూ గొత్తికోయ తెగకు చెందినవారని తెలిసింది. ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట ఇప్పపువ్వు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన యువతి, యువకుడు తిరిగి ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు.కాగా, కర్లపల్లి శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పస్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కచి్చతమైన కారణాలు, ఇతర వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. -
ప్రేమపేరుతో యువకుడి వేధింపులు.. తాళలేక యువతి ఆత్మహత్య
జగిత్యాల క్రైం: ప్రేమపేరుతో ఓ యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై ఉమాసాగర్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సైదు శ్రీలత (20) జగిత్యాల పట్టణంలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది.ఈ క్రమంలో మూడేళ్లుగా జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన అంకతి రాజు ప్రేమ పేరుతో శ్రీలతను వేధిస్తు న్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా వెంటపడుతుండటంతో శ్రీలత మూడేళ్ల కిందటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. కుటుంబసభ్యులు కాపాడారు.అయినప్పటికీ యువకుడి వేధింపులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. అయినా మార్పు రాకపోగా.. సోమవారం శ్రీలతకు ఫోన్ చేసి తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్కేస్లో కుక్కింది.!
పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పై సూట్కేసులో దొరికిన కుళ్లిపోయిన తల చేతులు కాళ్లు లేని మృతదేహం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల కాళ్లు, చేతులు లేక పోవడం, మొండెం మాత్రం ఉండటంతోకేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపును గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలింది. కాల్ డేటా రికార్డ్, వాట్సాప్ లోకేషన్ ఆధారంగా నిందితులు తేనాంపేట, టి.నగర్ పరిసరాలలో ఉన్నట్టు గుర్తించారు. హత్యకు గల కారణాలు.. పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టి.నగర్లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు అష్రఫ్ (31)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం మట్టుబెట్టినట్టు తేలింది. హత్య తర్వాత తన భర్త అమీర్ అలీ స్వయంగా పెట్టినట్లుగా.. తనకు ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫెస్బుక్లో రోకిమా పోస్టు చేసింది. మానసిక క్షోభతో∙అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది.శవాన్ని ముక్కలుగా నరికి.. పథకం ప్రకారం, జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా, నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా, తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర బాగాలను నరికేటప్పుడు ఆనందంగా భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం.-సాక్షి, చెన్నై -
బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
విశాఖపట్నం: రామాటాకీస్ వెనుక వైపున గల శ్రీనగర్లో నివాసముంటున్న దంపతులు బలరాం (33), ప్రియాంక (27) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కళింగపటా్ననికి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, బతుకుతెరువు కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వెల్డింగ్ పనులు చేసే బలరాం మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండటంతో ప్రియాంక గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బలరాం బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి బయటకు వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి దంపతులిద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అయితే బలరామే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రియాంక బలవన్మరణానికి పాల్పడటంతో భయపడి బలరాం ఆత్మహత్యకు ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ ప్రియాంక తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది. -
మోహన్ నా కూతురు అందంగా లేదు.. వేరే సంతానం కావాలి..!
బెంగళూరు: కన్నకూతురినే పొట్టనబెట్టుకున్న తల్లి ఉదంతం అంతటా చర్చనీయాంశమైంది. బెంగళూరు కాడుగోడిలో ఆరేళ్ల బాలిక వెన్నెల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లి, ప్రియునిపై అనుమానాలు బలపడ్డాయి. మార్చి 24 తేదీన బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తల్లి ప్రియాంక పుట్టిన రోజు వేడుకలను కోలారు వద్ద ఓ కెఫెలో జరుపుకొంది, అక్కడ వెన్నెలా కేక్ తిని కారులో నిద్రపోగా ఉదయానికి చనిపోయిందని తెలిపింది. మోహన్ అనే రియల్టర్తో ప్రియాంక జీవిస్తోంది. భర్త ప్రవీణ్ను వదిలేసిన ప్రియాంక లగ్జరీ లైఫ్ కోసం తపించేది. సంతోషానికి అడ్డు అని.. కొన్ని నెలల కిందట మోహన్ను కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. సంతానం కావాలని అనుకున్నారు. తమ సంతోషాలకు వెన్నెలా అడ్డుగా ఉందని, పైగా బాలిక అంద విహీనంగా ఉందనే కారణంతో బాలిక గొంతు పిసికి చంపారనే అనుమానాలున్నాయి. ప్రియాంక కు హొసకోటే వద్ద ఐదు ఎకరాలు భూమి ఉండగా, అందులో వాటా ఇవ్వాల్సి వస్తుందనేది కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు. మోహన్ను కాడుగోడి పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు. బాలిక చనిపోయిన రోజున ఆమె దుస్తులు మార్చారని సీసీ కెమెరాలలో వెల్లడైంది. కాగా ప్రియాంకను అరెస్టు చేశారా, పరారీలో ఉందా అనేది తెలియడం లేదు. -
మామిడిపండ్లు తిన్న అనంతరం అమ్మాయి మృతి
హైదరాబాద్: మామిడిపండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృతి చెందింది. నారాయణగూడ ఎస్ఐ సాయి సందీప్ తెలిపిన మేరకు.. బీదర్ చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులు విఠల్ వాడిలో ఉంటున్నారు. నివారం వారి బంధువు రేణుక నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొనుగోలు చేసుకుని వీరి ఇంటికి వచ్చింది. ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు ఆదివారం తిన్నారు. అయితే అందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మూడో కుమార్తె భువనే శ్వరి(17) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
లోన్ యాప్ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా: లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నేరేట్మెట్ పోలీసులు తెలిపిన మేరకు..రేవంత్కుమార్, దేవనందిని (25) దంపతులు నేరేడ్మెట్లో నివాసముంటున్నారు. ఈ నెల 7న రేవంత్కుమార్ బయటకు వెళ్లిన అనంతరం భార్యకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా బెడ్ రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఫోన్ను పరిశీలించగా ఓ గుర్తు తెలియని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు గుర్తించారు. తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలింది. ఇదిలా తండ్రి వెంకట్రెడ్డి మాత్రం.. భర్త, అత్తమాల వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు. -
హత్య కేసులో కొడుకు, కూతురుకు ఉరి
మల్కాజిగిరి: ఏడేళ్ల క్రితం తండ్రిని చంపిన కేసులో కొడుకు, కూతురుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హతుడి భార్య గంగాబాయి(65)కి వయసురీత్యా జీవిత ఖైదు విధించింది. ఈమేరకు కొడుకు కిషన్ (47) కూతురు ప్రపుల్ల (36)కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ జడ్జి వి.బాలభాస్కర్ రావు తీర్పు వెలువరించారు. సోమవారం మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్టకు చెందిన కిషన్ మారుతీ సుతార దక్షిణ మధ్య రైల్వేలో గూడ్స్ ట్రైన్ డ్రైవర్గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకుని మల్కాజిగిరిలో ఎన్ఏ కృష్ణానగర్లో ఇల్లు కొనుగోలు చేశాడు. అక్కడ భార్య గంగాబాయి, కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లతో నివాసముంటున్నాడు. మరో కూతురు అనుపమ వివాహం కావడంతో వేరుగా ఉంటున్నది. కిషన్ ఖాళీగా ఇంటి వద్దనే ఉంటూ తన జల్సాలకు డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. అతనికి సోదరి ప్రపుల్ల, తల్లి గంగాబాయి వత్తాసు పలికేవారు. ప్రపుల్ల కూడా పీజీ చేసినా ఉద్యోగం లేక ఖాళీగా ఉండటంతో తండ్రి మందలించేవాడు. ఇది వారికి నచ్చలేదు. పింఛను మొత్తాన్ని కూడా ప్రపుల్ల పేరు మీద మార్చాలని ఒత్తిడి చేయడంతో మారుతీ ఒప్పుకోక పోవడంతో అతన్ని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని చంపడానికి ప్రపుల్ల యూట్యూబ్లో చూసి ఒక పథకం రచించి విషయాన్ని తల్లి, సోదరుడుతో పంచుకొంది. ఉమ్మెత్త చెట్టు గింజలను నూరి ఆ పొడిని ఆహారంలో కలిపి విషప్రభావంతో చనిపోయేలా చేసి తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి బయట నాలాలో పడేద్దామని చెప్పింది. ఆవిధంగా పలుమార్లు ఆహారంలో ఉమ్మెత్త చెట్టు గింజల పొడిని ఆహారంలో కలిపి మారుతీకి ఇవ్వగా 2019 ఆగష్టు 16న మృతి చెందాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో ఉంచి పూజగదిలో దాచివుంచారు. జన సంచారం ఉండటంతో రెండు రోజులు అలాగే ఉంచారు. దుర్వాసన రాకుండా అగరబత్తీలు వెలిగించి, సెంట్ చల్లి జాగ్రత్తపడ్డారు. జనసంచారం తగ్గడంతో 18వ తేదీన బయటకు తీసుకొని రావడంతో ఒక్కసారిగా దుర్వాసన వచి్చంది. దీంతో స్థానికులు గుమిగూడటంతో విషయం బయటపడ్డది. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదుచేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సోమవారం తీర్పు వచి్చంది. -
Big Update: ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు, మోసాల చిట్టా లీక్..
-
రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
కర్ణాటక: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఉణకల్లో జరిగింది. వివరాలు.. సుధ మృతురాలు. సిద్దారూఢ, అరుణ, మీనాక్షి, మల్లికార్జున, వీరప్ప, ప్రకాష్ బసవలింగప్ప, శివానంద, గిరిజాలపై కేసు నమోదైంది. సుధ ప్రస్తుతం ఉణకల్లో నివసిస్తూ సవదత్తి మునవళ్లిలో అంగన్వాడీ టీచర్గా పని చేస్తోంది.రెండేళ్ల క్రితం ఇంట్లో స్నానం చేస్తుండగా ఫొటో, వీడియో తీసుకొని ఆమెపై నిందితులు వేధింపులకు పాల్పడి ఆమె నుంచి క్రమంగా రూ.17 లక్షల మేర వసూలు చేశారు. అంతేగాక చెక్ బౌన్స్ కేసులో సవదత్తి కోర్టు ద్వారా కూడా ఆమెను మనోవేదనకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఉణకల్లోని అద్దె ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
రాజకీయ నేత ఇంట్లో రూ.కోటిన్నర చోరీ?
సనత్నగర్: ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారం సనత్నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఏకంగా కోటిన్నర రూపాయలు చోరీకి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. అయితే ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జెక్కాలనీలో ప్రాంతంలో ఉండే ఓ రాజకీయ పార్టీ నేత ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడం లేదంటూ సదరు నాయకుడు సనత్నగర్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా చివరికి ఆ రాజకీయ నేత కుమార్తె డబ్బులు తీసినట్లు తెలిసింది. ఇంట్లో త్వరలో జరిగే వివాహం నిమిత్తం నగదు జమ చేసి కోటిన్నర రూపాయల వరకు అల్మారాలో దాచి ఉంచారు. శుక్రవారం కొంత నగదు వేరే వారికి ఇవ్వాల్సి ఉండగా అల్మరాలో నుంచి డబ్బును తీసుకునేందుకు చూడగా అందులో నగదు కనిపించలే దు. దీంతో కంగారు పడి ఆ రాజకీయ నేత పోలీసులకు విషయం తెలపగా వారు వచ్చి విచారణ జరిపారు. చివరకు తమ కుమార్తెనే నగదు తీసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇది తమ కుటుంబ వ్యవహారమని, తామే చూసుకుంటామని సదరు రాజకీయ నేత చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. దీనిపై ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. -
భార్య గొంతు కోసి చంపేశాడు
హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. ఈ ఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్బాగ్కు చెందిన సులేమాన్ బిన్, నిషాత్ ఫాతిమా (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులేమాన్ భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో గొడవ పడుతుండడంతో గతంలో మహిళా పోలీస్స్టేషన్లో కేసు నమోదయ్యింది. పెద్దలు సర్దిచెప్పడంతో బాగా చూసుకుంటానని చెప్పిన సులేమాన్ మళ్లీ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం కిషన్ బాగ్లోని ఇంటికి కత్తితో వచి్చన సులేమాన్, పిల్లలను వేరే గదిలో ఉంచి, భార్య నిషాత్ ఫాతిమా గొంతుకోసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయాడు. నిషాత్ పాతిమా తల్లి సాయంత్రం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న బహదూర్పురా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలాన్ని ఫలక్నుమా ఏసీపీ జావెద్ పరిశీలించారు. నిషాత్ ఫాతిమా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..
మెదక్: మరో మహిళతో వివాహేత ర సంబంధం పెట్టుకు న్నాడనే నెపంతో కట్టు కున్న భార్య, ఆమె తల్లి దండ్రులు, తమ్ముడితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా మెదక్ మండలంలో వెలుగులోకి వచ్చింది.ర్యాలమడుగు గ్రామానికి చెందిన పుంటికూర కుమార్గౌడ్ (50) ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తు న్నారు. అతనికి కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన పద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరి మధ్య గొడవ కారణంగా కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు. కుమార్గౌడ్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఉంటున్నారు.మరో మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో శనివారం రాత్రి అతడి భార్య పద్మ, ఆమె తల్లిదండ్రులు రామకృష్ణగౌడ్–ఎల్లమ్మ, సోదరుడు సంతోష్తో పాటు మరికొందరు కుమార్గౌడ్పై విచక్షణారహితంగా ఇనుప రాడ్స్, కర్రలతో కొట్టి చంపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పద్మతో పాటు ఆమె తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
నీతో ఏకాంతంగా ఉన్న ఆ ఇద్దరు మహిళలు ఎవరు? అంటూ హత్య
మెదక్: వివాహేతర సంబంధం మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. భార్య కళ్లుగప్పి మరో ఇద్దరు మహిళలతో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. ఆ విషయాన్ని గుర్తించిన భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. తన తల్లిదండ్రులు, సోదరుడి సాయంతో భర్తను అక్కడికక్కడే చంపేసింది. మెదక్, మిలిటరీ కాలనీలో ఓ ఆర్మీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగా పొన్నం కుమార్ను అతడి భార్య, అత్త, మామ, బావమరిది హత్య హత్యచేశారు. ఇంట్లో ఇద్దరు మహిళలతో పొన్నం కుమార్ ఏకాంతంగా ఉండగా అతడి భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ ఇద్దరు మహిళలు ఎవరంటూ ఆగ్రహంతో పొన్నం కుమార్ను హత్య చేసి, అనంతరం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితులు నలుగురు లొంగిపోయారు. ఉత్తరాఖండ్లో ఆర్మీ ఉద్యోగిగా పని చేస్తున్న కుమార్.. ప్రస్తుతం సెలవులు ఉండడంతో ఇంటికి వచ్చాడు. ఈ నెల 10న విధులకు తిరిగి వెళ్లాల్సి ఉండగా హత్యకు గురయ్యాడు. -
మహిళను చంపడానికి 1,400 కి.మీ ప్రయాణించి..
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ దంపతులు ఢిల్లీలోని ఓ ప్రొఫెసర్ను హత్య చేసేందుకు 1,400 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్ హత్య కేసును పోలీసులు కేవలం 3 రోజుల్లో ఛేదించారు.తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్లో ఉన్న సత్యం అపార్ట్మెంట్స్లో బుధవారం దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు పశ్చిమ బెంగాల్లోని బర్దమాన్ చేరుకుని రామ్ప్రసాద్ దాస్, బంశ్రీ దాస్ను అరెస్టు చేశారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. వారి మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దంపతులను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరే అవకాశం ఉందని వారు తెలిపారు.అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిందితులు బర్దమాన్ లో ఉంటారు. బాధితురాలిని కలవాలనే నెపంతో వారు ఢిల్లీకి వచ్చారు. 2022లో వివాహ జీవితం ప్రారంభమైన ఐదేళ్ల తరువాత దేబోస్మితా పాల్ తన భర్త నుంచి విడిపోయింది. ఆమె ఆ ఫ్లాట్లో ఒంటరిగా ఉండగా, ఆమె భర్త బెంగళూరులో ఉన్నాడు.బుధవారం నిందితులు మాస్కులు ధరించి ఆమె ఫ్లాట్కు వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వారు కొన్ని సంచులతో ప్రైవేట్ క్యాబ్లో వచ్చి, మెట్లు ఎక్కి 6వ అంతస్తుకు చేరుకున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు తమ మైనర్ కుమారుడిని కూడా వెంట తీసుకువచ్చారు. స్నేహపూర్వకంగా ఇంట్లోకి ప్రవేశించి, తమ వెంట తెచ్చుకున్న ఆయుధంతో ప్రొఫెసర్ను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు.దుస్తులు మార్చుకున్న తరువాత సుమారు 30 నిమిషాలకే వారు తిరిగి వచ్చి, కింద వేచి ఉన్న క్యాబ్లో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సోర్సెస్ వెల్లడించాయి. క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, ప్రయాణ వివరాల ఆధారంగా ప్రయాణికుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు.బుధవారం ఆ హౌసింగ్ సముదాయాన్ని సందర్శించిన 200 మందిలో 13 మందిని అనుమానితులుగా గుర్తించి ప్రశ్నించారు. 7 పోలీసు బృందాలు 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి, వందల మందిని విచారించాయి. దీంతో కేసు ఛేదించగలిగారు. చివరకు నిందితులను బర్దమాన్లో అరెస్టు చేసి విచారిస్తున్నారు.ఎందుకు చంపారు? బాధితురాలికి పశ్చిమ బెంగాల్లో తన మాతామహుడి మరణం అనంతరం వారసత్వంగా వచ్చిన ఓ ఆస్తి ఉంది. దాన్ని విలువ కోట్లాది రూపాయలు. నిందితులు ఆ ఇంటిలో అద్దెదారులుగా ఉండేవారు. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇల్లు ఖాళీ చేయాలని దేబోస్మితా పాల్ వారిపై ఒత్తిడి తెస్తోంది. ఆస్తిని సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెను హత్య చేయాలని దంపతులు పథకం రచించినట్లు అధికారులు తెలిపారు.దేబోస్మితా సోదరి దేవరతి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన సోదరి మృతిచెందినట్లు తెలిపింది. ఫ్లాట్కు బయట నుంచి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. సోదరికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దేవరతి తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించింది.లోపల దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ఆమె తలపై లోతైన గాయం, మణికట్టులో కోసిన రక్తనాళాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో నగలు, నగదు యథాతథంగా ఉండటంతో దోపిడీ ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. -
భర్తను కాదని.. కాలేజీ ఫ్రెండ్తో వివాహేతర సంబంధం..!
అక్రమ సంబంధం మోజుతో ఓ తల్లి ఎవరూ చేయరాని అకృత్యానికి పాల్పడింది. ప్రియునితో వెళ్లిపోయిన తల్లి.. ఆ తరువాత కూతురిని కడతేర్చింది. ఈ దారుణం బెంగళూరు కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బాలిక హత్యపై భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ పై తండ్రి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ప్రవీణ్, బెంగళూరువాసి ప్రియాంకకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియాంక కాలేజీ ప్రియుడు మోహన్తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీని గురించి భర్త ప్రశ్నించగా, ప్రియాంక విడాకులు కావాలని పట్టుబట్టింది. చివరకు కుమార్తెలతో వెళ్లిపోయింది. హఠాత్తుగా బాలిక మృతి.. మార్చి 24న చిన్న కూతురు ఆకస్మాత్తుగా మరణించింది. ఏమైందని భర్త వెళ్లి ప్రియాంకను అడగ్గా, బిర్యానీ తింటూ చనిపోయిందని ఒకసారి, ఐస్ క్రీమ్ ఇచ్చి, ఏసీ వేసి కారులోనే పడుకోబెడితో మరణించిందని మరోసారి చెప్పింది. బాలిక నల్లగా ఉందని తరచూ తల్లి సతాయించేదని తెలిసింది. కుమార్తెను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియుడు మోహన్ను అరెస్టు చేయగా, ఇంతలో తల్లి పరారైంది. - బెంగళూరు -
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రియుడు నిత్యం వేధిస్తుండటంతో ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొల్లి దుర్గ(23) నానక్రాంగూడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో టెలీకాలర్గా పని చేస్తోంది. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన సాయి కుమార్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులనుంచి ఇద్దరూ కేశవ్నగర్లో ఉంటున్నారు. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సాయి కుమార్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగుతూ సాయికుమార్ గొడవకు దిగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ ఐదో అంతస్తుపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సిటిజన్ హస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దుర్గ తల్లి దుబాయ్కి వెళ్లింది. మేనమామ దేవరంపల్లి రవి కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాయి కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. -
‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’
పరకాల: ల్యాబ్ టెక్నీషియన్ షరిఫోద్దీన్ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. రోడ్డు ప్రమాదం కాదు.. హత్య అని తేల్చిన పోలీసులు నిందితుడు టీస్టాల్ నిర్వాహకుడు జట్టబోయిన సందీప్(31)ను అరెస్ట్ చేశారు. షరిఫోద్దీన్ భార్యతో నిందితుడికి ఉన్న వివాహేతర సంబంధం వ్యవహారమే ఈ హత్యకు దారి తీసినట్లు పరకాల ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఈ హత్య కేసు వివరాలు వెల్లడించారు. పరకాలలోని ఓ ఇంట్లో ల్యాబ్టెక్నీషియన్ ఎండీ షరిఫోద్దీన్ అద్దెకు ఉంటున్నాడు. హనుమకొండలోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. రోజూ డ్యూటీకి వెళ్లే సమయంలో తన భార్యకు టిఫిన్ ఇచ్చిరావాలని సమీపంలోని టీ స్టాల్ నిర్వాహకుడు సందీప్కు చెప్పేవాడు. సందీప్ రోజూ వెళ్లి టిఫిన్లు ఇచ్చే క్రమంలో అతడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరికి తను చెప్పకపోయినా సందీప్ ఇంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్న షరీఫొద్దీన్ ఈ నెల2న ఉదయం అతడి దగ్గరికి వెళ్లి ఈ రోజు నీతో మాట్లాడే పని ఉందని, డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పాడు. తమ వివాహేతర సంబంధం తెలిసిపోయిందని గ్రహించిన సందీప్ అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం షరిఫోద్దీన్ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే సందీప్ వేరేవ్యక్తి ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ చేసి వెల్లంపల్లి రోడ్డులోని ఓ బ్రిక్స్ షెడ్డు వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి బయల్దేరిన షరీఫోద్దీన్ మార్గమధ్యలో ఓ వైన్స్ వద్ద రెండు బీర్లు కొనుక్కొని వెళ్లగా ఇద్దరు కలిసి తాగారు. మళ్లీ అతనే వెళ్లి ఇంకో రెండు బీర్లను తీసుకురాగా వాటిని తాగుతూ ‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’ అంటూ సందీప్పై షరీఫోద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్ పక్కనే ఉన్న కర్రతో షరీఫోద్దీన్ తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని అతడి వాహనంపైనే అడ్డుగా పెట్టుకొని రోడ్డు మీదికి తీసుకొచ్చి ఎవరూ లేని సమయంలో పడేసి వెళ్లిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న షర్ట్ను తన ఇంటి పక్కనున్న బాత్రూం వెనుకాల కాల్చిపడేశాడు. మిగతా దుస్తులను పిండిన దుస్తుల్లో కలిపి హత్య వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేశాడు. మృతుడి సోదరుడు రజాక్ ఇది హత్యగా అనుమానిస్తూ విచారణ చేయాలని ఫిర్యాదు చేయడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. సందీప్ ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసును వేగవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ క్రాంతికుమార్, ఎస్ఐలు రమేశ్, పవన్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
భర్త చనిపోయిన బాధలో ఉంటే.. ఆమెపై కన్నేశాడు
విశాఖపట్నం: మరణించిన స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.దామోదరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానాపురంలో కె.ప్రసాద్ అనే వ్యక్తి భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి జీవించేవాడు. ప్రసాద్ స్నేహితుడైన ధనాల అరుణ్కుమార్ (30) కూడా అదే ప్రాంతంలో నివసించేవాడు. 2019లో ప్రసాద్ అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మిపై నిందితుడు కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు 2021 ఏప్రిల్లో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు అరుణ్కుమార్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం కబళించింది. అంత్యక్రియలు, అస్థికల నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం బారినపడింది. దీంతో ఆ కుటుంబంలోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.పంజాబ్లోని ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిపై ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జలాలాబాద్కు చెందిన ఓ కుటుంబంలో ఇంటి పెద్ద(మహిళ) మరణించింది. దీంతో అంత్యక్రియలు, అనంతర కర్మలు పూర్తి చేసుకుని ఆ కుటుంబం పికప్ వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 28 మంది వాహనంలో ఉన్నట్లు సమాచారం.గత అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనం ఫిరోజ్పూర్-ఫజిల్కా మార్గంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకర కొండ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్తో కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పికప్ వాహనం అధిక వేగంతో వెళ్తుండటంతో డ్రైవర్ మలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైలర్ను తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఢీకొట్టిన తీవ్రతకు పికప్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని ఫరీద్కోట్లోని ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగం, ఇరుకు రహదారి, ప్రమాదకర మలుపు కలిసి ప్రమాదానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిలోని ఈ భాగం చాలా కాలంగా ప్రమాదాల కేంద్రంగా మారిందని, రహదారి విస్తరణ చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#BREAKING SEVEN TO NINE killed and 15 injured in Ferozepur, Punjab, when a truck collided with a jeep carrying a family to immerse ashes. SSP Bhupinder Singh confirmed. #Punjab #Ferozepur #RoadAccident @PunjabPoliceInd https://t.co/3CbYUL1g3A pic.twitter.com/k8W1AxtjUP— jarvis ☠️ (@Vishii14) June 6, 2026 -
బుర్ఖాలో వచ్చాడు.. నడకతో దొరికిపోయాడు
స్నేహితుడి మెడలో ఐదు తులాల బంగారంపై కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని నెలల తరబడి ఎదురు చూశాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి ఏం చేయాలి.. ఎలా తప్పించుకోవాలి అని స్కెచ్ గీశాడు. ప్లాన్ అమలు చేసే టైంలో.. కంగారుపడడంతో ఊహించనిది జరిగింది. అయినా బెదరలేదు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. చివరకు.. సీసీటీవీలో దొరికిన ఒక చిన్న క్లూ చివరకు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ప్రకాశ్ చంద్ర గుప్తా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి మోహిత్ ద్వివేది అనే వ్యక్తితో 18 ఏళ్ల స్నేహం ఉంది. అయితే ఆ స్నేహానికే చివరికి డబ్బు, బంగారం చిచ్చుపెట్టాయి. ప్రకాశ్ ధరించే సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసుపై మోహిత్ కన్నేశాడు. దానిని ఎలాగైనా దోచుకోవాలని నిర్ణయించుకున్న అతడు ముందుగానే పథకం రచించాడు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న మే 31 రాత్రి ప్రకాశ్ తన కోచింగ్ సెంటర్లోనే ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించడంతో పాటు మహిళలు ఉపయోగించే ఆభరణాలు, చెప్పులు కూడా వేసుకున్నాడు. అనంతరం కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి ప్రకాశ్పై దాడికి దిగాడు. బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది.ఈ క్రమంలో ప్రకాశ్ను బలంగా తోసేయడంతో అతడు నేలపై పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మోహిత్ బంగారు గొలుసుతో పాటు మరో బంగారు బ్రాస్లెట్ను కూడా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం ప్రకాశ్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని రక్తపు మడుగులో గుర్తించారు. తొలుత పోలీసులు ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్ల మరణించి ఉండొచ్చని భావించారు. అయితే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఒక చోట ఒకరు బుర్ఖాలో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ మనిషి నడక మాత్రం తేడాగా కనిపించింది. దీంతో బుర్ఖాలో ఉంది మహిళ కాదేమోనని అనుమానపడ్డారు. అలాగే.. అక్కడి నుంచి సుమారు 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఆ ముసుగు వ్యక్తి కదలికలను ట్రాక్ చేశారు. చివరకు ఒక కారులో.. బుర్ఖా మార్చుకుంటూ ఆ వ్యక్తి బయటపడ్డాడు. అది మోహిత్ అని గుర్తించి షాక్ తిన్నారు.పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన మోహిత్.. హత్య తర్వాత కూడా ఎలాంటి అనుమానం రాకుండా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు వెల్లడైంది. అంతేకాకుండా నేరం జరిగిన మరుసటి రోజే ఓ పోటీ పరీక్షకు హాజరై, తర్వాత లక్నోకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనతో ప్రకాశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. "18 ఏళ్ల స్నేహాన్ని డబ్బు కోసం బలి చేశాడు. ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఊహించలేదు" అని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
రహస్య గదులు.. స్పా ముసుగులో వ్యభిచారం..!
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమ స్పా సెంటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) సమన్వయంతో కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లలో విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయా సెంటర్లు ప్రధానంగా అనుమతులు లేకపోవడం, రహస్య గదుల ఏర్పాటు, గుర్తింపు కార్డులు సేకరించకపోవడం, నేమ్బోర్డులు ప్రదర్శించకపోవడం, రికార్డుల నిర్వహణ లోపం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు కమిషనర్ బి. సుమతి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), వ్యభిచార నిరోధక చట్టం (ఐటీపీఏ) ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భవన యజమానులు తమ ప్రాంగణాలను స్పా నిర్వహణకు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలను పూర్తిగా సరిచూసుకోవాలని, అక్రమ కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కూడా చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. #Hyderabad:Major crackdown on #spacentres in #Malkajgiri#Police inspected 113 spa centres and booked 46 cases for violations including #hiddenrooms without #transparentdoors, failure to collect #customerIDproofs, lack of permissions and poor record maintenance.Cases have… pic.twitter.com/yz44plNGKq— NewsMeter (@NewsMeter_In) June 5, 2026 -
లైంగిక ఆరోపణలు.. లొంగిపోయిన చిన్నమల్లయ్య
సాక్షి, పల్నాడు: ఏపీలో సంచలనం రేపిన వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. లైంగిక ఆరోపణల కేసు నేపథ్యంలో నెలకు పైగా అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఎట్టకేలకు ఈ వేకువ జామున పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ తనపై అత్యాచారం చేశాడని చిన్నమల్లయ్యపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన కుటుంబం నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారం వ్యవహారంలో పరిచయం ఏర్పడిన సీఐ చిన్నమల్లయ్య.. తనను బెదిరించి లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీస్ శాఖ స్పందించింది. చిన్నమల్లయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభమైంది. ఈలోపు.. చిన్నమల్లయ్య కనిపించకుండా పోవడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం, పోలీస్ శాఖ తీరు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా.. ఆయన్ని విధుల నుంచి తొలిగిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటు మొదట హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోర్టుల నుంచి ఊరట లభించకపోవడంతో చిన్నమల్లయ్యపై ఒత్తిడి మరింత పెరిగింది. ఒకవైపు పోలీసుల గాలింపు, మరోవైపు కోర్టుల్లో ఎదురుదెబ్బలు, ఉద్యోగం కోల్పోయిన పరిణామాల మధ్య చిన్నమల్లయ్య చివరకు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన వినుకొండ పోలీస్ స్టేషన్కు చేరుకుని లొంగిపోయినట్లు స్పష్టమవుతోంది. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు. -
సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫోన్ సంభాషణలు
-
అమీర్పేట ప్రమాదం.. స్పాట్కు ‘హైడ్రా’ రంగనాథ్
హైదరాబాద్: అమీర్పేట మైత్రివనం సిగ్నల్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంత భారీ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఎలా జరిగింది? అనేదానిపై పోలీసులు కచ్చితమైన ఓ అంచనాకు రాలేకపోయారు. ఈ క్రమంలో.. ఫోరెన్సిక్ టీం శుక్రవారం మరోసారి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది. మరోవైపు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ‘‘మంటల్లో బిల్డింగ్ దాదాపుగా కాలిపోయింది. కాంప్లెక్స్కు ఎంట్రీ, ఎగ్జిట్లు సరిగ్గా లేవు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. పక్కన మెస్ నుంచి మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని మరికొందరు అంటున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు పూర్తైతేనే తెలుస్తుంది.. .. మెట్రో నిర్మాణం తర్వాతే ఈ కాంప్లెక్స్ కట్టారని అంటున్నారు. ఫుట్పాత్, నాలా ఆక్రమణలు జరిగాయా? అనే దానిపై దృష్టిసారించాం. అలాగే.. బిల్డింగ్ అనుమతలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. నాలా ఆక్రమణ ఉంటే కచ్చితంగా కూల్చేస్తామని అన్నారాయన. ఈ ప్రమాదం నేపథ్యంలో.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలపై హైడ్రా తరఫున ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే.. మైత్రివనం చౌరస్తాలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ మాల్ కాంప్లెక్స్లో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి 20కి పైగా దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. సుమారు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే రెండో అంతస్తులో షార్ట్సర్క్యూట్ జరిగి ఈ ఘోరం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
లవర్స్ కోసం.. కుళాయిలు కొట్టేశారు
ప్రేమలో పడితే కొన్నిసార్లు ఆలోచనలకన్నా కోరికలే ముందుకు నడిపిస్తాయి. ప్రియురాళ్లకు గిఫ్ట్గా ఐఫోన్ ఇవ్వాలన్న చిన్న ఆశ ఆ యువకులను పెద్ద నేరం వైపు నెట్టేసింది. కానీ వారు వేసిన ప్లాన్ మాత్రం చివరికి ఊహించని మలుపు తిరిగి కటకటాల పాలు జేసింది.ఇద్దరు యువకులు తమ గర్ల్ఫ్రెండ్స్కు ఐఫోన్లు కొనివ్వాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ ట్యాప్స్ను ఓ గోడౌన్ నుంచి దొంగిలించారు. కానీ ఆ ఖరీదైన వస్తువులు చివరికి కేవలం రూ.20 వేలకే స్క్రాప్ డీలర్కు అమ్మేయడం ఈ కేసులో మరో ట్విస్ట్గా మారింది.ఓ గోడౌన్ యజమాని ఫిర్యాదుతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. మే 27–28 మధ్య రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గోడౌన్ పైకప్పులోని టిన్ షీట్లు తొలగించి లోపలికి ప్రవేశించి ఖరీదైన సానిటరీ వేర్ను ఎత్తుకెళ్లారు. గోల్డ్ టోన్, రోజ్ గోల్డ్, సిల్వర్ ఫినిష్ ఉన్న ప్రీమియం ట్యాప్స్ సహా మొత్తం రూ.6.5 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి.కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు 20కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సమాచారం, టెక్నికల్ ఇన్పుట్స్ ఆధారంగా కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించారు. విచారణలో ఇద్దరు మైనర్లు సహా ఒక ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. ప్రశ్నించగా షాకింగ్ నిజం బయటపడింది గర్ల్ఫ్రెండ్స్కు ఐఫోన్లు కొనాలన్న కోరికతోనే ఈ దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నారు. దొంగిలించిన ఖరీదైన ట్యాప్స్ను కేవలం రూ.20 వేలకే అమ్మినట్లు కూడా తేలింది. ఆ వస్తువులు కొనుగోలు చేసిన 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం వేసిన “కాస్ట్లీ స్కెచ్” చివరికి చీప్ బేరంలో ముగిసి, పోలీసులు కేసును ఛేదించడంతో కథ ముగిసింది. నాగ్పూర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం
ప్రేమ సంబంధం.. బెడిసి కొట్టి రక్తసిక్తమైంది. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. ఆఫీస్లో.. అదీ తోటి ఉద్యోగులు చూస్తుండగానే ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఆపై తన గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని మొహాలీ నగరంలో గురువారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో సహోద్యోగి చేతితో యువతి దారుణ హత్యకు గురైంది. అక్కడే ఉన్న కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ ఉన్మాది ఆగలేదు. అనంతరం నిందితుడు తన గొంతును తానే పలుమార్లు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డింపుల్ ఓ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అక్కడే పని చేసే హర్విందర్ మాన్ అలియాస్ హ్యారీతో మూడేళ్లుగా రిలేషస్షిప్లో ఉంది. అయితే.. కొన్నిరోజులుగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. హ్యారీ డింపుల్ను బతిమాలుతూ వచ్చాడు. ఈ క్రమంలో బ్రేకప్ను వెనక్కి తీసుకునేందుకు డింపుల్ అంగీకరించలేదు. పైగా హెచ్ఆర్కు ఫిర్యాదు చేయడంతో అతనికి నోటీసులు ఇచ్చారు. దీంతో.. గురువారం సాయంత్రం సుమారు 7:40 గంటల సమయంలో నిందితుడు ఆఫీస్లోకి వచ్చాడు. అప్పటికే తన డెస్క్ వద్ద పని చేస్తున్న డింపుల్పై వెనుక నుంచి దాడి చేసి కత్తితో పొడిచాడు. ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసినా.. నిందితుడు వెంటాడుతూ జుట్టు పట్టుకుని లాగుతూ మరింతగా దాడి చేశాడు.కార్యాలయంలో ఉన్న సిబ్బంది అతడిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఈ దాడిలో డింపుల్కు 20 కత్తిపోట్లు పడ్డట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నిందితుడు అదే కార్యాలయంలోకి వెళ్లి తన గొంతును తానే పలుమార్లు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరినీ సమీపంలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డింపుల్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడి ఒంటిపై 30 కత్తి పోట్లు ఉన్నాయని.. ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డింపుల్ కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు."Rejected Lover Stabs Ex-Girlfriend to Death Inside Mohali Office, Then Attempts Suicide"#Mohali, #Punjab - In a shocking case of suspected rejection-driven violence, a 30-year-old woman named Dimple was stabbed to death by her former boyfriend inside a private Packers & Movers… pic.twitter.com/GRXcNOjG8f— Siraj Noorani (@sirajnoorani) June 5, 2026 -
ఒంటరి మహిళపై అన్నదమ్ముల అఘాయిత్యం
పల్నాడు: వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్ తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్, అతడి సోదరుడు శ్రీను గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇంకా మరువక ముందే.. తాజాగా నోయిడాలోని ఓ ఎత్తైన అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.నోయిడాలోని ఐవీ కౌంటీ (Ivy County) అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.A fire broke out at the IVY County residential complex in Sector 75, Noida, raising serious concerns about the city’s firefighting preparedness. According to residents, fire brigade hoses were unable to project water beyond the sixth floor. pic.twitter.com/YnFPXZvW3N— Sanjay Kishore (@saintkishore) June 5, 2026ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళే, తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం భవనాల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య గొంతు కోసి హత్య
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ భర్త.. భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. బోరబండకు చెందిన షేక్ రహీం (32)తో సుమేరా బేగం (23)కు 2024లో వివాహం జరిగింది. వీరికి 20 నెలల కుమారుడు ఉన్నాడు. కైత్లాపూర్లోని ఇందిరమ్మ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. ఇటీవల దంపతుల మధ్యగొడవలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం ఏప్రిల్లో సుమేరా బేగం భర్తపై గృహహింస కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. గురువారం ఉదయం భార్యా భర్తలు గొడవపడసాగారు. ఈ క్రమంలో భర్త షేక్ రహీం కూరగాయల కత్తితో సుమేరా బేగం గొంతు కోశాడు. దీంతో ఆమె మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి భర్త షేక్ రహీంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ చేసి తమ్ముడికి సమాచారమిచ్చి..
ఒంగోలు టౌన్: ఆ యువకుడు ఆ ఇంటికి పెద్ద కుమారుడు. తల్లిదండ్రుల సంపాదన అంతంతమాత్రమే కావడంతో కుమారుడిగా బాధ్యత నెత్తిమీద వేసుకున్నాడు. ఇంకా చదువుకోవాలని ఉన్నా.. పదో తరగతి వరకే చదివాడు. తమ్ముడిని, చెల్లిని చదివించాలని కలలుగన్నాడు. కానీ, ఆ కలలు తీరకుండానే లోకం విడిచాడు. రోడ్డు ప్రమాదం ఆ ఇంటిని అంతులేని విషాదంలో నింపింది.బాధిత కుటుంబం కథనం ప్రకారం... ఒంగోలు నగరానికి చెందిన కడియం గోపి, శ్రావణి దంపతులకు ముగ్గురు సంతానం. గోపి ఆటో డ్రైవర్, శ్రావణి ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. పెద్ద కుమారుడు లోకేష్ (21) పదో తరగతి వరకే చదువుకున్నాడు. తనకు బాగా చదువుకోవాలని ఉన్నప్పటికీ కుటుంబం గడిచే పరిస్థితి లేకపోవడంతో కష్టంగానే చదువు మానుకుని పనులకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు.త్రోవగుంటలోని ఒక మోటారు సైకిల్ కంపెనీలో పనికి చేరాడు. తమ్ముడు, చెల్లెలు చదువుతుంటే సంతోషించేవాడు. ఎప్పుడూ సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటికి వచ్చే లోకేష్.. మంగళవారం పని ఎక్కువగా ఉందని ఇంటికి రాలేదు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తమ్ముడికి ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చే దారిలో దశరాజుపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద తనకు ప్రమాదం జరిగిందని, వెంటనే రావాలని చెప్పాడు. ఆ మాటలు పూర్తి కాకుండానే ఫోన్ స్విచాఫ్ అయింది.ఆందోళన చెందిన లోకేష్ కుటుంబ సభ్యులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు మీద లోకేష్ నిర్జీవంగా పడి ఉన్నాడు. దాంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి ఆవేదనతో చూపరుల గుండెలు సైతం తరక్కుపోయాయి. లోకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమీర్పేట అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్జామ్
సాక్షి, హైదరాబాద్: అమీర్పేటలో గురువారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతైంది. అమీర్పేట మెట్రో జంక్షన్కు 100 అడుగుల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో అమీర్పేట చుట్టుపక్కల ఏరియాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయ్యింది.అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు మొదలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించడం మొదలుపెట్టాయి. ప్రమాదం ధాటికి షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. రెండు, మూడు అంతస్థుల్లోని సుమారు 20 దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఓ మెస్కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో అమీర్పేట-మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది. సహాయక చర్యల నేపథ్యంలో.. అమీర్పేట నుంచి ఎస్సార్ నగర్ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిటీ బస్సులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వాటర్ ట్యాంకర్లు, ఆరు ఫైరింజన్లు మంటల్ని అదుపు చేసే రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ప్రాణ నష్టం తప్పినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.మెట్రో సేవలకు అంతరాయం!మైత్రివనం దగ్గర అగ్నిప్రమాదంతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన ప్లేస్ మెట్రో ట్రాక్కు సమీపంలో ఉండడం, పిల్లర్కు సైతం మంటలు అంటుకోవడం.. ఫైరింజన్లతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడం మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సజ్జనార్ ట్వీట్మైత్రివనం సిగ్నల్ దగ్గరి అగ్నిప్రమాదంపై నగర కమిషనర్ సీవీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అమీర్పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్లో అగ్నిప్రమాదం సంభవించిందని.. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని.. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరారాయన. ట్రాఫిక్ అలర్ట్!అమీర్పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్…— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 4, 2026 -
ఢిల్లీ హోటల్ ఘటన: సిలిండర్ పేలుడు కాదంట!
ఢిల్లీ: మాలవీయా నగర్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై.. ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. అగ్ని ప్రమాదానికి సిలిండర్ బ్లాస్ట్ కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.మొదట్లో ఈ అగ్ని ప్రమాదం ఎల్పీజీ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా? అనుమానం వ్యక్తమైంది. కానీ దర్యాప్తు బృందాలు ఆ కోణాన్ని ప్రస్తుతం పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత సిలిండర్ పేలుడు జరిగినట్లు సూచించే ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్యాస్ ఎక్స్ప్లోషన్ కారణమన్న వాదన బలహీనపడింది.దర్యాప్తులో బయటపడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. హోటల్లో రెండు వేర్వేరు కిచెన్లు ఉండటం. వాటిలో ఒకటి భవనం బేస్మెంట్లో ఉండగా, మరొకటి పై అంతస్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కిచెన్లలోనూ అనేక ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉన్నప్పటికీ, అవి ఏదీ పేలిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో మంటలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏ ఎలక్ట్రికల్ పాయింట్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న అంశాలపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రేక్ఫాస్ట్ కోసం వంటమనిషి(చెఫ్) ఎలక్ట్రిక్ స్టవ్ వినియోగ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కోణమే ప్రధాన అనుమానంగా కొనసాగుతోంది. అయితే, ఇది తుది నిర్ధారణ కాదని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత రానుందని అధికారులు పేర్కొంటున్నారు.దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ హౌజ్రాణి ప్రాంతంలో ఉన్న ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు ఆఫ్రికా, తుర్క్మెనిస్థాన్కు చెందిన విదేశీయులు కూడా ఉన్నారు. గురుగ్రావ్కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మరణించారు. మరో 35 మంది గాయపడగా, వారిలో 19 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. భవనంలో ఒకే ఎగ్జిట్ ఉండటం, అనుమతులకు మించి గదులు నిర్వహించడం, బేస్మెంట్తో సహా అనధికార నిర్మాణాలు ఉండటం వల్ల ఎక్కువ మంది బయటపడలేకపోయారని అధికారులు చెబుతున్నారు. కొందరు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, ఒక మహిళ తన చిన్నారితో సహా మూడో అంతస్తు నుంచి దూకిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ హోటల్ ప్రభుత్వ B&B పథకం కింద నడుస్తుండగా, కేవలం ఆరు గదుల అనుమతి ఉన్నా 25 గదుల వరకు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న హోటల్ యాజమానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ప్రమాద సమయంలో తాను అక్కడే ఉన్నానని.. భయంతో పారిపోయానని చెబుతున్నాడతను. -
శివ.. ది ‘గాంజా’ ట్రాన్స్పోర్టర్! నా దారిలో నో టోల్గేట్!
సాక్షి, రంగారెడ్డి: అంతరాష్ట్ర గంజాయి ట్రాన్స్పోర్టర్గా మారిన ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ సరుకు సరఫరాలో తనదైన పంథాను అనుసరిస్తున్నాడు. ఎక్కడా టోల్గేట్ దాటకుండా నాలుగు రాష్ట్రాల్లోని గమ్యాలకు చేరుతున్నాడు. అక్కడ ఉన్న డ్రగ్ పెడ్లర్స్కు సరుకు అప్పగిస్తున్నాడు. ఈ పంథాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడిని జూబ్లీహిల్స్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.79 లక్షల విలువైన 158 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు.ఇల్లు కట్టి ఇరుక్కుపోయిన వైనం...ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడానికి చెందిన పనగూడు శివకృష్ణ 2009లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో (ఎన్డీఆర్ఎఫ్) డిప్యుటేషన్పై ఉన్న శివ కేరళంలో పని చేసేవాడు. అక్కడి ఉట్టూరులో విలాసవంతమైన ఇల్లు కట్టిన శివ అప్పుల్లో మునిగిపోయాడు. ఇదిలా ఉండగా... మోతుగూడానికి చెందిన కొందరి ద్వారా ఇతడికి సీలేరు కేంద్రంగా గంజాయి పండించే వారితో పరిచయం ఏర్పడింది. అప్పులు తీర్చుకోవడంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం గంజాయి ట్రాన్స్పోర్టర్గా మారాడు. సరుకు తీసుకువెళ్లడానికి డిక్కీ పెద్దగా ఉంటుందనే ఉద్దేశంతో కేరళంలో చేవ్రొలెట్ కంపెనీ కారు ఖరీదు చేశాడు. దాని డిక్కీలో సరుకు సర్దుకుని సీలేరు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న పెడ్లర్స్కు సరఫరా చేస్తున్నాడు.దూరమైనా టోల్గేట్లు దాటడు...ఏదైనా ఓ ప్రాంతానికి గంజాయి తీసుకువెళ్లాలంటే ఆ గమ్యస్థానానికి దారితీసే మార్గాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా అధ్యయనం చేస్తాడు. కాస్త దూరం ఎక్కువైనప్పటికీ ఎక్కడా టోల్గేట్ దాటకుండా జాగ్రత్తపడతాడు. తన కదలికలు బయటపడకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. ఒక్కో ట్రిప్కు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఆర్జిస్తున్నాడు. 2023లో ఇతడిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట ఠాణాలో కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని శివ నెట్వర్క్ మరింత విస్తరించుకుని దందా కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం టాస్క్ఫోర్స్ పోలీసులు అంబర్పేటలో ఓ డ్రగ్ పెడ్లర్ని పట్టుకున్నారు. ఇతడి విచారణలో శివ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ యదేందర్, ఎస్సై డి.రవి రాజ్ నేతృత్వంలోని బృందం బుధవారం ఎస్సార్నగర్ పరిధిలో అతడి పట్టుకుంది. ఈసారి ఇతడు షోలాపూర్ వెళ్తున్నాడని అధికారులు చెప్తున్నారు.ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు..తనకు వచ్చే ఆర్డర్స్ ఆధారంగా శివ ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు వేసి సరుకు సరఫరా చేస్తుంటాడు. సీలేరుతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సరుకు తీసుకునే ఇతగాడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రయాణం ప్రారంభిస్తాడు. మరుసటి రోజు అదే సమయానికి గమ్యానికి చేరుకుంటాడు. ఆయా రహదారుల్లోని టోల్గేట్స్ను తప్పించుకు తిరిగే ఇతగాడు మిగిలిన చోట్ల పోలీసులు ఆపితే తన సీఐఎస్ఎఫ్ గుర్తింపు కార్డు చూపించి బయటపడతాడు. 2023లో కేసు నమోదైన నాటి నుంచి ఇతడు సస్పెన్షన్లో ఉన్నట్లు డీసీపీ రఘునాథ్ చెప్పారు. -
అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్!
ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర హోటల్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రి చికిత్స కోసం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని గుర్గ్రామ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం.. అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. సౌత్ ఢిల్లీలోని ఫ్లారిష్ స్టే బీ అండ్ బీ హోటల్లో మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల ఇరుకైన భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందగా, వారిలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మరణించిన భారతీయుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. గుర్గ్రామ్ సెక్టార్ 46కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్ (48), ఆయన భార్య తరణి అగర్వాల్, తల్లి ప్రేమలత అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా (ఏంజెల్), వర్య (పర్ల్)తో పాటు మరో ఇద్దరు బంధువులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు తరాలు ఈ ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయాయి.ఈ కుటుంబం ఢిల్లీకి రావడానికి కారణం అత్యంత హృదయ విదారకం. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ (80లు) శ్వాస సంబంధిత వ్యాధితో సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, ఆయనకు దగ్గరగా ఉండేందుకు కుటుంబం సమీపంలోని హోటల్లో బస చేసింది. తండ్రిని చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ప్రయాణం ఒక్కసారిగా శాశ్వత విషాదంగా మారింది.తరుణి అగర్వాల్ వైపు నుంచి వచ్చిన మరో ముగ్గురు బంధువులు కూడా అదే హోటల్లో ఉండగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం ఎనిమిది మంది ఒకే కుటుంబం నుంచి మరణించారు. మరింత హృదయ విదారకంగా, చికిత్స పొందుతున్న రాధేశ్యామ్ అగర్వాల్ వద్దకే తన భార్య, కుమారుడు, కోడలు, మనవళ్లు, బంధువుల మృతదేహాలు చేరిన పరిస్థితి కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది.ఈ ఘటనలో మరణానికి ముందు జరిగిన చివరి క్షణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యుడు పునీత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, మంటల సమయంలో వివేక్ అగర్వాల్ చివరిసారిగా ఫోన్ చేసి “బహుశా మేము బతకలేము” అని చెప్పినట్లు తెలిపారు. తడి రుమాలు ముఖానికి పెట్టుకోవాలని సూచించినా.. పరిస్థితి వేగంగా దారుణంగా మారిందని ఆయన పేర్కొన్నారు.ప్రాథమిక దర్యాప్తులో హోటల్లో తీవ్ర భద్రతా లోపాలు ఉన్నట్లు బయటపడింది. ఒకే ప్రవేశ–నిష్క్రమణ మార్గం ఉండడం, చిన్న కిటికీలు, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల అనేక మంది బయటకు రాలేకపోయారు. కొన్ని కిటికీలు మూసివేయబడినట్లు కూడా గుర్తించారు.అంతేకాకుండా హోటల్ అనుమతి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. బీ అండ్ బీ విధానంలో ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉండగా, అక్కడ 25 గదులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్లో అనుమతి లేకుండా రెస్టారెంట్ నడపడం, బేస్మెంట్లో సరైన ఎగ్జిట్ లేకపోవడం, భవనం చుట్టూ గుంపుగా ఉండటం, విద్యుత్ తీగల అడ్డంకులు కూడా రక్షణ చర్యలకు ఆటంకంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.మొత్తం ఘటనలో గుర్తింపు సమస్యలు కూడా కుటుంబాలను తీవ్రంగా బాధిస్తున్నాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను ఫోటోల ఆధారంగా గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదని బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రుల వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కన్నీరు.. హృదయాలను కలిచివేస్తున్నాయి. -
సిట్ ఎదుట హాజరైన పారిజాత దంపతులు
బడంగ్పేట్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బడంగ్పేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాత, నర్సింహారెడ్డి దంపతులు బుధ వారం సిట్ ఎదుట హాజర య్యారు. బీఆర్ఎస్ నేతలైన వీరు 2022లో ఆపార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. పారిజాత ప్రస్తుతం పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.బీఆర్ఎస్లో ఉన్న సమయంలో పారిజాతతో పాటు ఆమె భర్త ఫోన్లు ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇరువురి మాటలను రికార్డు చేశారు. ఫోన్ల ట్యాపింగ్తో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బాధితులు వివరించగా, వాటిని రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు.తాము ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకున్నప్పటి నుంచి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేయడానికి ఫోన్ ట్యాపింగే కారణం కావచ్చన్నారు. 2 రోజుల క్రితం సిట్ అధికారులు చెప్పే వర కూ ఈ విషయం తమకు తెలియదన్నారు. సిట్ అధి కారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పామన్నారు. -
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు. -
ఐసీయూలో మంటలు.. పలువురి సజీవదహనం!
పాట్నా: దేశ రాజధాని ఢిల్లీలోని హోటల్ అగ్నిప్రమాదం విషాదం మరువకముందే బిహార్లో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ముజఫర్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు సమాచారం. మరికొందరికి గాయాలు కాగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రసాద్ ఆస్పత్రి ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ విభాగంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా పలువురు శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం.అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసరంగా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు మరణించినట్లు సమాచారం అందుతోంది.मुजफ्फरपुर के प्रसाद हॉस्पिटल के ICU में लगी भीषण आग ने दिल दहला दिया। हादसे में 3 लोगों की मौत की खबर है, जबकि कई मरीज आग की चपेट में आए। अस्पतालों में सुरक्षा व्यवस्था और फायर सेफ्टी मानकों पर गंभीर सवाल खड़े हो गए हैं।दिवंगतों के परिजनों के प्रति संवेदना। प्रशासन से निष्पक्ष… pic.twitter.com/0gZPFHnnb2— Indian Observer (@ag_Journalist) June 4, 2026ప్రాథమిక విచారణలో.. షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మాలవీయ నగర్లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యంలో, తాజాగా బిహార్లో ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ విషాదం మరింత కలకలం రేపుతోంది.కీలకాంశాలుబిహార్లోని ముజఫర్పూర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదంఐసీయూ విభాగంలో ప్రారంభమైన మంటలుముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం!20 మందికి పైగా రోగులను సురక్షితంగా బయటకు తెచ్చారుపలువురి పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్షార్ట్సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానంకొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం -
మోనాలిసా దంపతులకు ఊరట
కొచ్చి: కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన మోనాలిసా భోస్లేకు, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్కు ఊరట లభించింది. వాళ్లను అరెస్ట్ చేయొద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.మోనాలిసా మైనర్ అని, ఆమెను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు.. అలాగే ఈ వివాహం చట్టబద్ధం కాదనే మధ్యప్రదేశ్ పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అభియోగాలను తోసిపుచ్చుతూ అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ మోనాలిసా, ఫర్మాన్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నెలరోజుల పాటు ఫర్మాన్ ఖాన్ను అరెస్ట్ చేయొద్దని మద్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఈలోగా.. అక్కడి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఈ జంటకు కోర్టు సూచించింది. 2025 కుంభమేళా సందర్భంగా పూసలు విక్రయిస్తూ వైరల్ అయిన మోనాలిసా భోస్తే Monalisa Bhosle ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకుంది. మతాంతర వివాహం కావడంతో ఈ వ్యహారం పెను దుమారం రేపింది. అయితే మోనాలిసా వివాహం సమయంలో కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నారని ఆరోపణలు రావడంతో వివాహ చట్టబద్ధతపై వివాదం చెలరేగింది. దీంతో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఇక మోనాలిసా తండ్రి పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఫర్మాన్ ఖాన్పై కేసు నమోదైంది. తాము ఎలాంటి అక్రమానికి పాల్పడలేదని, మోనాలిసా మైనర్ కాదని దంపతులు కోర్టులో వాదించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు, మోనాలిసా వయస్సుకు సంబంధించిన పత్రాల్లో ఫోర్జరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె జననం 2009 డిసెంబర్లో జరిగిందని, దంపతులు చెబుతున్నట్లుగా 2008 జనవరిలో కాదని వాదించారు. అయితే ఈ ఆరోపణలను మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు ఖండించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్.. ఒక నెలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.ఇదీ చదవండి: కేరళలో ఉండడం మీ అదృష్టం! -
ఢిల్లీ మృత్యుకేళి: ప్రాణాల కోసం పై నుంచి దూకారు..!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో బుధవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. హౌజ్రాణి ఏరియాలోని ఓ హోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా.. 40 మందికిపైగా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రమాద సమయంలో హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న అతిథులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైఅంతస్తుల నుంచి కిందకు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలో ఓ విదేశీయుడు, ఓ మహిళ ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది తెలియరావడం లేదు. మరికొందరు కూడా ప్రాణాలు అరచేత పట్టుకుని భవనం నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. కింద నిల్చున్న స్థానికులు తమ ఫోన్లలో ఆ దృశ్యాలు బంధించారు.VIDEO | Death toll in fire in restaurant in south Delhi's Malviya Nagar goes up to 21, many of those killed are foreigners: officials. Latest visuals from incident spot.#DelhiNews #MalviyaNagarHotelFire(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8QS1kYrx4v— Press Trust of India (@PTI_News) June 3, 2026ఉదయం సుమారు 9 గంటల సమయంలో అగ్నిప్రమాద సమాచారం అందడంతో ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పది కంటే ఎక్కువ ఫైర్ ఇంజిన్లు, ప్రత్యేక రక్షణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పొగతో నిండిపోయిన భవనంలోకి ప్రవేశించి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.Delhi hotel fire: woman seen jumping off building#MalviyaNagar #DelhiFire pic.twitter.com/4LoMU1ypqF— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026నిబంధనలకు విరుద్ధంగా..!ఈ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ 'బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్' పథకం కింద కేవలం ఆరు గదులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతి పొందిన లెమన్ గ్రీన్ హోటల్.. నిబంధనలకు విరుద్ధంగా 25 గదులు నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బేస్మెంట్లో కూడా గదులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భవన భద్రతా ప్రమాణాలు, అనుమతుల ఉల్లంఘనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Delhi Hotel Fire: Death Toll Rises to 21 in Malviya Nagar Tragedy#MalviyaNagar #DelhiFire pic.twitter.com/3lEpgIKWBM— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026#दिल्ली: मालवीय नगर के होटल में लगी आग पूरी इमारत में फैली, दर्दनाक हादसे में 10 लोगों की जलकर मौत #Malviyanagar #Delhifire #Breaking pic.twitter.com/zymTBTdWQt— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) June 3, 2026అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించిందా? అనుమతులకు మించి కార్యకలాపాలు నిర్వహించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రమాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ -
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగి 21 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్టారెంట్లో పలువురు చిక్కుకుని ఉండడం.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.హౌజ్రాణి ఏరియాలోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఉదయం 8గం.50ని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లు, హోటల్లో బస చేసినవాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. #DELHI-साकेत प्रेस एन्क्लेव के सामने, मालवीय नगर के हौज रानी स्थित एक होटल में लगी भीषण आग ।लाल डोरा क्षेत्र में तेजी से बन रहे बहुमंजिला होटलों की अग्नि सुरक्षा, आपातकालीन पहुंच और नियामक निगरानी पर गंभीर सवाल खड़े कर दिए हैं।#DelhiFire #MalviyaNagar #Saket #FireSafety pic.twitter.com/2gtCHzJfg9— Payall Singhh (@PayallSingh13) June 3, 2026మంటలు భారీగా ఎగసి పడడంతో.. దట్టమైన పొగతో రెస్టారెంట్ అలుముకోవడంతో.. ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించిన పలువురి సాహసాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 30 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. రెస్టారెంట్లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో.. సౌతాఫ్రికా, సోమాలియా, గల్ఫ్ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.दिल्ली के मालवीय नगर में एक रेस्ट्रां में लगी आग हादसे में 10 लोगों की मौत की खबरबेसमेंट में फंसे तीन नाइजीरियन नागरिकों को रेस्क्यू कर बाहर निकाला गया।#DELHIFIRE#MALVIYENAGAR#RESTRAURENTFIRE pic.twitter.com/GVD3yKxmXR— Vivek Shukla (@anchorviveks) June 3, 2026ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 3, 2026 -
కేరళలో ఉండడం మీ అదృష్టం!
కొచ్చి: కుంభమేళా సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోనాలిసా, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ ముగిసింది. బుధవారం(ఇవాళ) ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తీర్పు రిజర్వ్ చేసే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.విచారణలో భాగంగా న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ “మీరు కేరళలో ఉన్నందుకు అదృష్టవంతులు” అని వ్యాఖ్యానించారు. దానికి మొనాలిసా తరఫు న్యాయవాది.. అందువల్లే వీళ్లు ఇంకా బతికి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెట్టింట దుమారం రేగింది. జడ్జి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..న్యాయ వర్గాల ప్రకారం కోర్టు ఉద్దేశం కేసుపై ప్రత్యక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసు చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భద్రతా పరిస్థితులను పరోక్షంగా సూచించడమేనని భావిస్తున్నారు. కేరళలో న్యాయ ప్రక్రియ తక్కువ ఒత్తిడితో, మరింత నిష్పక్షపాత వాతావరణంలో సాగుతోందన్న సందేశాన్ని ఆ వ్యాఖ్య ద్వారా ఇచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఈ కేసు ఒక సాధారణ వివాహ వివాదం నుంచి ఇప్పుడు ఇంటర్ఫెయిత్ వివాహం, వయస్సు నిర్ధారణ(ఆమె మైనర్ అనే ఆరోపణలు), ఫోర్జరీ ఆరోపణలు, కిడ్నాప్ కేసులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలతో కేరళ-మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద న్యాయ వివాదంగా మారింది. మోనాలిసా వివాహం, ఆమె వయస్సు నిర్ధారణ, మతాంతర వివాహ చట్టబద్ధతతో పాటు పలు రాష్ట్రాల్లో నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు క్లిష్ట అంశాలు ఒకేసారి విచారణ జరిగాయి.ఇక మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమపై వివిధ వర్గాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వయస్సు తప్పుడు నమోదు, ఫోర్జరీ ఆరోపణలు సహా కేసు తీవ్రమని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా రెండు రాష్ట్రాల అంశంగా మారింది. తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. -
‘నా ఆత్మహత్యకు డీఎస్పీ, ఎస్ఐలే కారకులు’
కర్ణాటక: ఓ వ్యక్తి డీఎస్పీ, ఎస్ఐల పేర్లు డెత్నోట్లో రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా బెండిగేరి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రవీంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వలేదని మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చిన అప్పులను తిరిగి ఇవ్వమన్నందుకు ప్రాణాలు తీస్తామని బెదిరించారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు రవీంద్ర డెత్ నోట్లో పేర్కొన్నాడు. అంతేగాక పోలీసులు కూడా తన పట్ల అన్యాయంగా నడుచుకున్నారని ఆయన పేర్కొనడంతో కేసు కలకలం సృష్టిస్తోంది. లక్ష్మణ చందరిగి, భరమప్ప పూజారిలకు రూ.8 లక్షలు అప్పు ఇచ్చాను. అయితే ఆ డబ్బును లక్ష్మణ్, భరమప్ప తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని అడిగితే చంపుతామని బెదిరించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఎస్ఐ ఆనంద్, డీఎస్పీకి విజ్ఞప్తి చేసినా కూడా వారు స్పందించలేదని, వారు కూడా వారిలానే తనను చంపుతామని బెదిరించారని రవీంద్ర ఆత్మహత్యకు ముందు రాసిన డెత్నోట్లో వివరించారు. ఘటనా స్థలాన్ని మూడలిగి పోలీసులు పరిశీలించారు. రవీంద్ర భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
కాగితాలు ఏరుకునే వ్యక్తి పేరిట.. బీమా మోసం!
సుల్తాన్బజార్: చనిపోయిన వ్యక్తి పేరు మీద రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని బీమా డబ్బులు కాజేయాలని చూసిన ఓ ముఠా గుట్టును సుల్తాన్బజార్ పోలీసులు రట్టు చేశారు. చాదర్ఘాట్ వద్ద కాగితాలు ఏరుకుంటూ బతికే తలారి వెంకటయ్య అనే వ్యక్తి 2023 జనవరి 9న విద్యుదాఘాతంతో చనిపోయాడు.ఈ మరణాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న బోడ శ్రీకృష్ణ అనే వ్యక్తి స్టార్ హెల్త్ ఏజెంట్ మల్దే మహేష్, సేల్స్ మేనేజర్ మడసిరావార వంశీకృష్ణలతో కుమ్మకై పక్కా స్కెచ్ వేశాడు. 2024 డిసెంబర్లో వెంకటయ్య పేరు మీద స్టార్ హెల్త్ యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకున్నారు. మృతుడి బావమరిదినంటూ శ్రీకృష్ణ నామినీగా నమోదు చేసుకున్నాడు. 2025 ఏప్రిల్ 28న ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల పాత ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, ఇన్వెస్ట్ రిపోర్టులను ఫోర్జరీ చేశారు.క్లైమ్ కోసం దరఖాస్తు చేయగా స్టార్ హెల్త్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మహ్మద్ అబ్దుల్ బారీ చేసిన అంతర్గత విచారణలో బండారం బయటపడింది. పాలసీ తీసుకోవడాని కంటే ముందే వెంకటయ్య చనిపోయాడని తేలడంతో 2026 మే 14న సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మత్తయ్య పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐ వేణు ఈ కేసును ఛేదించారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందగా, కారులో ఉన్న కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొలిపాక రవిచంద్రకాంత్ (49) కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం సిద్దిపేటకు బతుకుదెరువుకు వచ్చాడు. గోల్డెన్ ఫ్రేమ్స్ పేరిట ఫ్లెక్సీ ప్రింటింగ్, ఫొటో ఫ్రేమ్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సునీత (45), కుమారుడు అజయ్, కూతురు ఉన్నారు. అజయ్కు ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. వేసవి కావడంతో స్వగ్రామం మణుగూరుకు నాలుగు రోజుల క్రితం వెళ్లారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు కారులో సిద్దిపేటకు బయల్దేరారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మిట్టపల్లి శివారులోకి రాగానే వేబ్రిడ్జి పక్కన నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో కారు సగ భాగం చొచ్చుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న రవిచంద్రకాంత్, అతని భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందారు. వెనక సీట్లో కూర్చున్న కొడుకు అజయ్, కోడలు అర్చన తలకు తీవ్ర గాయాలు కాగా కుడి కాలు కూడా విరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. అర్చన తండ్రి అంకం ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్
తిరువనంతపురం: నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు హంతకుడి ఆత్మప్రబోధంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని తెలియజేసి లొంగిపోయాడు. కోజికోడ్ జిల్లా కూడరంజికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ అలీ గత ఏడాది పోలీసులను ఆశ్రయించాడు. 1980ల కాలంలో తాను రెండు హత్యలు చేశానని, తనను అరెస్ట్ చేయాలని కోరాడు.అవి తాను తెలియక చేసిన తప్పులని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నానని మీడియాకు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం అతడిని నీటిలో ముంచి చంపేశానన్నాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా, డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్త సారాంశం.తిరువంబడి పోలీసులు 1980ల కాలంలో మలబార్ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. సుదీర్ఘ శాస్త్రీయ విచారణ అనంతరం ఆ మృతుడు కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన మోహనన్గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలాలకు సరిగ్గా సరిపోలడంతో ఈ కేసును ధృవీకరించారు. కాగా, 1989లో కోజికోడ్ బీచ్లో చేసినట్లు చెబుతున్న మరో హత్యకు సంబంధించిన వివరాలను, బాధితుడి గుర్తింపును కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ టెన్షన్: ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే.. -
చినికి చినికి చివరికి హత్యగా!
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ సభ్యుడు ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, విలువైన స్థిరాస్తులు తమ చేయి దాటిపోతున్నాయనే ఉద్దేశంతోనే ఆలంఖాన్లు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. మలక్పేట, లక్డీకాపూల్ల్లోని ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్తోపాటు మల్లేపల్లిలో ఉన్న మదర్సా ఏ ఎజాజ్ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఖాజా మొహిజుద్దీన్కు తండ్రీకుమారులైన మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్ వర్గాల మధ్య ఏళ్లుగా విభేదాలు నెలకొన్నాయి.13 ఏళ్లుగా వివాదాలు.. ఈ రెండు సంస్థలకు చెందిన స్థిరచరాస్తులు, విద్యాసంస్థల పరిపాలన, నిర్వహణను చేతుల్లోకి తీసుకునే అంశంపై 13 ఏళ్లుగా వివాదాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే మజ్లిస్ ఏ ఉమ్నాగా పిలిచే ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీ 2013లో మహబూబ్ ఆలంఖాన్ను సెక్రటరీ పోస్టు నుంచి తొలగించింది. దీంతో మహబూబ్ ఆలంఖాన్ 17 మంది సభ్యులతో ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ ప్రెసిడెంట్తో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలు ఒకదానిపై మరోటి హైకోర్టులో అనేక రిట్ పిటిషన్లు ఫైల్ చేసుకున్నాయి.రాజీ చేసినా.. 2023లో కొందరు ఈ రెండు గ్రూపుల మధ్య రాజీ చేసి క్రిమినల్, సివిల్ పిటిషన్లు ఉపసంహరించునేలా చేశారు. దీంతో మహబూబ్ ఆలంఖాన్ ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్కు సెక్రటరీగా పునర్ నియమితులై 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. ఆర్థిక అవకతవకలపై మరోసారి మహబూబ్ ఆలంఖాన్కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీని రద్దు చేసింది. ఆ సమయంలో 2025 నుంచి 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఏర్పడిన కొత్త కమిటీకి ఖాజా మొహిజుద్దీన్ ట్రెజరర్గా నియమితులయ్యారు. దీంతో మరోసారి హైకోర్టులో మహబూబ్ ఆలంఖాన్కు వ్యతిరేకంగా పిటిషన్లు ఫైల్ అయ్యాయి. వాటికి ఖాజా మొహిజుద్దీన్ వకాల్తా తీసుకున్నారు.వకాల్తా.. ఆర్థికంగా దివాలా.. 2013లో ఉస్మాన్ ఖాన్, కిషన్సింగ్ అలియాస్ పప్పుతో కలిసి మహబూబ్ ఆలంఖాన్ లంగర్హౌస్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ద్వారా ఖాజా మొహిజుద్దీన్పై అత్యాచారం కేసు నమోదు చేయించారు. దర్యాప్తు అనంతరం ఈ కేసును పోలీసులు మూసివేశారు. మొహిజుద్దీన్ వకాల్తా కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, అనేక వక్ఫ్ ఆస్తులు చేయి దాటిపోతున్నాయని భావించిన ఆలంఖాన్లు అతడిని అంతం చేయాలని కుట్ర పన్నారు.అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా కనిపించేలా హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతల్ని తమ వద్ద పని చేసే హసన్ అలీతోపాటు ముజాహిద్ ఆలంఖాన్కు పరిచయస్తుడైన మునీర్లకు అప్పగించారు. కిషన్సింగ్ని కూడా భాగస్వామిని చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసమూ గాలిస్తున్నారు. -
స్పాట్ పెట్టేస్తున్నాయ్.. సైబరాబాద్ పరిధిలో 43 బ్లాక్స్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 43 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) ప్రాణాంతకంగా మారాయి. గత మూడేళ్లలో 320 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 251 మంది మరణించారు. మూల మలుపులు, అసంపూర్ణ రహదారి పనులు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల మార్గానికి అడ్డంగా చెట్లు ఉండటం వంటి కారణాలుగా గుర్తించారు. అనేక ప్రమాదకర ప్రాంతాల చుట్టూ నివాస కాలనీలు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్లు, మెట్రో కారిడార్లు ఏర్పడ్డాయి. దీంతో ఆయా మార్గాలలో పాదచారులు, స్థానిక ప్రయాణికులు నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.ట్రాఫిక్ పోలీసు అధికారులు, శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, రోడ్ ఇంజినీరింగ్ ఏజెన్సీల బాధ్యులు బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి నివేదిక రూపొందించారు. గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో 90 శాతానికి పైగా మేడ్చల్ జోన్ పరిధిలోకి వస్తాయి. 50 శాతానికి పైగా ప్రమాదకర ప్రాంతాలలో ఎన్హెచ్–65 మార్గం అత్యంత ప్రమాదకరమైందిగా గుర్తించారు. 43 బ్లాక్ స్పాట్లలో 22 ముంబై హైవే (ఎన్హెచ్–65)కి చెందినవే ఉండటం గమనార్హం.అత్యంత ప్రభావిత ప్రాంతాలివీ..పటాన్చెరు శాంతి నగర్ కమాన్ నుంచి బజాజ్ ఎల్రక్టానిక్స్ మార్గం అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ 24 ప్రమాదాలు జరగగా.. 11 మంది మరణించారు.పటాన్చెరులోని ఇస్నాపూర్ క్రాస్ రోడ్లో అలాగే ఆర్సీపురంలోని శ్రీమణికాంత షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఏషియన్ జ్యోతి థియేటర్ వరకు ఒక్కో మార్గంలో 10 మరణాలు సంభవించాయి.పటాన్చెరులోని నోవాపన్ టీ–జంక్షన్ మరో ప్రమాదకర ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ 10 రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు.ఎన్హెచ్–765డీ పై కుత్బుల్లాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మాంగల్య షాపింగ్ మాల్ వరకు ఉన్న మార్గంలో 16 ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో 14 ప్రమాదాల్లో 14 మంది చనిపోయారు.ఎన్హెచ్–65తో పాటు అధికారులు ఎన్హెచ్–44 నాగ్పూర్ రోడ్డుపై 7, ఎన్హెచ్–765డీ మెదక్–నర్సాపూర్ రోడ్డుపై 6, స్టేట్ హైవే (ఎస్హెచ్–1) రాజీవ్ రహదారిపై ఒకటి, నల్లగండ్ల ఫైఓవర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఓల్డ్ ముంబై హైవే వరకు ఉన్న మార్గంలో 5 ప్రమాదాలతో సహా 7 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు.ఎన్హెచ్–44పై రేకులబాయి క్రాస్ రోడ్, భారత్ పెట్రోల్ మధ్య మార్గంలో 11 ప్రమాదాల్లో 11 మంది చనిపోయారు. మేడ్చల్లోని ఎస్సీ హోటల్, సంప్రదా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మధ్య మార్గంలో 10 యాక్సిడెంట్లలో 8 మంది మృత్యువాత పడ్డారు.కారణాలివీ..అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనుల వల్ల అనేక మార్గాలు ప్రభావితమయ్యాయి. రోడ్లను తవ్వి చాలాకాలం పాటు అసంపూర్తిగా వదిలేశారు. రోడ్లపైనే నిర్మాణ సామగ్రి పెట్టడం, దెబ్బతిన్న క్యారేజ్వేలు, పాక్షికంగా పూర్తి చేసిన రోడ్డు పనులు అనేక ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.రోడ్డు పక్కన ఉన్న చెట్లు క్యారేజ్వేల పైకి చొచ్చుకురావడం, చెట్లు ఎండిపోయి అనేక ప్రాంతాలలో క్యారేజ్వేలకు అడ్డుగా ఉన్నట్లు తనిఖీలలో పోలీసులు గుర్తించారు. మూలమలుపులు, ఎత్తుపల్లాలు ఉండటం, రాత్రి వేళల్లో ఆయా మార్గాలలో వీధి దీపాలు లేకపోవడం, ఉన్నా వెలుతురు సరిగా లేకపోవడం. రాత్రి వేళల్లో అధిక వేగంతో వాహనాలు తిరిగే హైవే మార్గాలలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం. -
ఆఖరి స్టెప్తోనే ముగిసిన జీవితం..పెళ్లి వేడుకలో విషాదం
చిలకలూరిపేటటౌన్: పెళ్లి వేడుకలో ఆనందంగా చిందేస్తూ, ఆ నవ్వుల మధ్యే ఓ నిండు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిన హృదయవిదారక సంఘటన చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల మండలం రేకులగడ్డకు చెందిన ఏసోబు (62)కు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి గ్రామానికి చెందిన భాగ్యమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు సంతానం లేదు. ఈ క్రమంలోనే దండమూడి గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకకు ఈ దంపతులు హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు అక్కడి వారంతా ఉత్సాహంగా నృత్యాలు చేస్తుండటంతో ఏసోబు కూడా వారితో కలిసి ఆనందంగా చిందేశాడు. అయితే దురదృష్టవశాత్తూ వెల్లకిలా పడిపోయాడు. కింద పడే క్రమంలో తలకు తీవ్ర గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను బంధువులు హుటాహుటిన చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఏసోబు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ గ్రామంలో విషాదం నెలకొంది. బిడ్డలు కూడా లేని తనకు ఆఖరి శ్వాస వరకు తోడుగా ఉంటాడనుకున్న భర్త ఇలా మధ్యలోనే దూరమయ్యాడయ్యా.. అంటూ భాగ్యమ్మ కన్నీటి రోదన చూపరులను సైతం కంట తడిపెట్టించింది. -
బాలిక గర్భం కేసులో సంచలనం.. అసలు నిందితుడు తండ్రి
తమిళనాడు: వేలూరు సమీపంలోని పాఠశాల విద్యార్థి ని కన్న తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన సంచలనం రేపింది. వేలూరు తాలూకాకు చెందిన 13 సంవత్సరాల బాలిక వేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి చదివింది. ఈ నేపథ్యంలో గత నెల 25వ తేదీన బాలికకు ఉన్నపళంగా అనారోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను వేలూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక రెండు నెలలు గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. వీటిపై ఆసపత్రి నిర్వాహకులు బాలిక మైనర్ కావడంతో వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేలూరు మహిళా పోలీసులు బాలిక వద్దకు చేరు కొని విచారణ జరపగా ఆ సమయంలో ఆ బాలిక కాట్పాడికి చెందిన ఒక యువకుడిని ప్రేమించినట్లు అతను వివాహం చేసుకుంటానని మాయ మాటలు చెప్పి గర్భం చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసేందుకు అతని వివరాలు, ఫొటో, చిరునామా వివరాలు అడిగారు. ఆ సమయంలో బాలిక మాటలు తడబడుతూ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానించిన పోలీసులు బాలిక వద్ద సమగ్రమైన విచారణ చేపట్టారు. ఆ సమయంలో తన తండ్రి పెయింటర్గా పనిచేసేవాడని రాత్రి వేళల్లో మద్యం మత్తులో తన తల్లి నిద్రించిన సమయంలో తనను బెదిరించి అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని బయటకు చెపితే కుటుంబంలోని అందరినీ హత్య చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. అదే విధంగా తన కన్న తండ్రి కారణంగా తాను గర్భం దాల్చిన విషయాన్ని బయట పెట్టకూడదనే కారణంతోనే కాటా్పడిలోని ఒక యువకుడిపై చెప్పినట్లు తెలిపింది. దీంతో పోలీసులు బాలిక తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కన్న కుమార్తెను తండ్రే బెదిరించి గర్భం చేసిన సంఘటన వేలూరు పట్టణంలో సంచలనం రేపింది. -
మహిళా ఉద్యోగి ఫొటోలు పోస్టు చేసిన ఏఓ అరెస్ట్
జనగామ: జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో పనిచేస్తు న్న ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను అనుమతి లేకుండా తీసి, నకిలీ ఖాతా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో అదే కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న విజయ్రెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్ పంపించినట్టు సీఐ సత్యనారాయణరెడ్డి సోమవారం తెలిపారు. సీఐ మాట్లాడుతూ విజయ్రెడ్డి తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆమె ఫొటోలను పోస్టు చేసి, అవమానకరమైన కామెంట్లతో గౌరవానికి భంగం కలిగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. మహిళల పై కార్యాలయాల్లో జరిగే లైంగిక వేధింపులను నిరోధించే పోష్ చట్టం–2013 ప్రకా రం ఇది శిక్షార్హమైన నేరమని తెలిపారు. దర్యాప్తులో సేకరించిన డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించినట్టు పేర్కొన్నారు. -
మత్తులో 2 హత్యలు..
కంటోన్మెంట్, బంజారాహిల్స్: గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో పొడిచి మరో యువకుడిని, మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశారు. మారేడ్పల్లి సంజీవయ్యనగర్ బస్తీ వాసి, ఫ్లవర్ డెకరేటర్ శ్రావణ్ (22)ను అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ (23) అంతమొందించాడు.బీటెక్ ఆపేసి గంజాయికి బానిసైన నిఖిల్... శ్రావణ్ బంధువుల యువతిని అసభ్య సైగలతో వేధిస్తున్నాడు. శ్రావణ్, నిఖిల్ మధ్య 2 నెలల క్రితం గొడవ జరిగింది. ఆదివారం రాత్రి యువతిని నిఖిల్ మళ్లీ వేధించాడు. ఆమె తండ్రి మందలించగా గొడవ మొదలైంది. అప్పుడే ఇంటికి వస్తున్న శ్రావణ్ నిలదీయగా... కోపోద్రిక్తుడైన నిఖిల్ కత్తితో 8 సార్లు పొడిచాడు. గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రావణ్ చనిపోయాడు. నిఖిల్ గంజాయి తాగడంతో పాటు అమ్ముతుంటాడని, ఆ మత్తులోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు బేంగపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు.బంజారాహిల్స్ రోడ్ నం11 లోని బోళానగర్ బస్తీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (32), రౌడీషీటర్ అహ్మద్ హుస్సేన్ స్నేహితులు. ఆటో నడుపుతుంటారు. ఖాలిద్ సయీద్ జావీద్, హైదర్ షరీఫ్, అన్వర్, మతీన్తో కలిసి హయత్ ప్లేస్ హోటల్ గల్లీలో ఆటోలోనే ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగారు. ఖాళీ బీరు సీసాలను హుస్సేన్ రోడ్డు పక్కన పడేశాడు. అలా నిర్లక్ష్యంగా పడేస్తే ఎవరికైనా గుచ్చుకుంటాయని ఇమ్రాన్ మందలించాడు. హుస్సేన్ కోపంతో నాకే నీతులు చెబుతావా? అంటూ దాడికి దిగాడు. అరగంట పాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుప్పకూలిన ఇమ్రాన్ మృతి చెందాడు. -
‘ధురంధర్’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి..
ముంబై: డీ-కంపెనీని బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. పాకిస్థాన్లో ఉంటూ అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడిపిస్తున్న ఈ ముఠా ధురంధర్ సినిమా విజయానంతరం ముంబైలో తన గ్రౌండ్ నెట్వర్క్ను యాక్టివేట్ చేసినట్లు సోర్సెస్ తెలిపాయి.రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్ర కనిపిస్తుంది. మరణశయ్యపై ఉన్న ఆ పాత్రను దావూద్ను పోలి ఉన్నట్లు చూపించారు. దీనివల్ల దావూద్ ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రజలను నమ్మించాల్సిన అత్యవసర పరిస్థితి డీ-కంపెనీకి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.షకీల్ ముఠాకు నియామకాల బాధ్యత కొత్త ఉగ్ర కుట్రలో భాగంగా కొత్త సభ్యులను సమీకరించడం ముఠా ముందున్న తొలి సవాలు. నియామక ప్రక్రియ బాధ్యతను షకీల్ ముఠాకు అప్పగించినట్లు సోర్సులు తెలిపాయి. పాకిస్థాన్ ఐఎస్ఐకి ఈ కొత్త సభ్యులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు అందించడం వంటివి చేయనుందని చెప్పాయి. ఉగ్ర ప్రణాళిక అమలు బాధ్యతను షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు తెలిపాయి.ఈ ఆపరేషన్ వెనుక అసలు కారణాన్ని కొత్త సభ్యులకు చెప్పలేదని సోర్సెస్ తెలిపాయి. ముంబై నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన వీరిని, బాంద్రా గరీబ్ నగర్లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి రెచ్చగొట్టినట్లు వెల్లడించాయి.ఇటీవల ఢిల్లీ పోలీసులు ఒక ఉగ్ర ప్రణాళికను భగ్నం చేసి, ఐఎస్ఐకి ముంబై అండర్వరల్డ్తో ఉన్న సంబంధాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండర్వరల్డ్ కార్యకలాపాలు, వసూళ్ల వ్యవహారాల్లో ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ, డీ-కంపెనీ ఆకస్మిక కదలికలు మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.తమ ప్రభావాన్ని మళ్లీ పెంచుకునేందుకు, ఐఎస్ఐ సాయంతో భారతదేశంలో భారీ దాడి చేయాలని లేదా ఓ వీఐపీని లక్ష్యంగా చేసుకోవాలని దావూద్ ముఠా ప్రణాళికలు రచిస్తున్నట్లు సోర్సెస్ తెలిపాయి.ఇలాంటి ఉగ్ర ప్రణాళికలకు ఆశ్రయం ఇవ్వడంలో పాకిస్థాన్ పాత్ర నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నాయి. అయితే కీలక అరెస్టులు సకాలంలో జరుపుతూ భారత దర్యాప్తు సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయని సోర్సెస్ తెలిపాయి. -
వివాహమైన 18 రోజులకే విషాదం!
పటాన్చెరు టౌన్: పెళ్లయిన 18 రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, కోట్పల్లి మండలం బీరోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (28)కు పటాన్చెరుకు చెందిన రేణుకతో మే 13న వివాహం జరిగింది. కాగా ఐదు రోజుల క్రితం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.ఈ క్రమంలో శనివారం రాత్రి శ్రీకాంత్ సెల్ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డ్ విషయంలో భార్య రేణుక ఇష్టం వచి్చనట్టు అతడ్ని తిట్టింది. దీంతో శ్రీకాంత్ అతని సోదరుడు శ్రీశైలానికి జరిగిన విషయం చెప్పడంతో ఉదయం మాట్లాడుదామని చెప్పాడు. భార్యతో గొడవపడిన శ్రీకాంత్ వేరే రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు స్నేహితులను కాపాడి! చివరికి..
అబ్దుల్లాపూర్మెట్: అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులను కాపాడిన అనురూప్రెడ్డి.. నీట మునిగి మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోడూరి రాజేందర్రెడ్డి–దుర్గాభవాని దంపతులు కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆశ్రిత్రెడ్డితోపాటు అనురూప్రెడ్డి (22) సైతం ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అనురూప్రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఇటీవల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.శనివారం లూసియానాలోని టోరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో అతనితోపాటు మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురూ లోతు ప్రదేశంలోకి వెళుతూ రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూప్రెడ్డి ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. తను పైకి వచ్చే క్రమంలో చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకోవడంతోపాటు నీటి ప్రవాహం పెరగడంతో పైకి రాలేకపోయాడు. అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా, అప్పటికే నీటిని ఎక్కువగా మింగడంతో మృత్యువాత పడ్డాడు.ఉన్నత చదువుల కోసం వెళ్లిన కుమారుడు ఇలా విగతజీవిగా మారుతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. అనురూప్రెడ్డికి ఫొటోగ్రఫీ ఎంతో ఇష్టమని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. టీం ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ సంయుక్త సహకారం అందించి వారం రోజుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సమాచారం. -
‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. Tragic incident from God’s own countryHere is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle.Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్ను హుటాహుటిన పనవూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి. అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.నెలల వయసు నుంచే..అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. ఆగ్రహంతో దంచి కొట్టారు!పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆదివారం అష్కర్ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026 -
హత్యకు దారి తీసి పబ్లో గొడవ!
సాక్షి,చెన్నై: కోయంబేడులో శనివారం అర్ధరాత్రి దాటి న తర్వాత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ స్టార్ హోటల్ పబ్లో మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తూ మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. గంజాయి, మద్యం మత్తు లో ఉన్న ఒక ముఠా.. కక్షపూరితంగా బైక్ను కారుతో ఢీకొట్టడంతో ప్లస్–2 చదువు పూర్తి చేసిన శ్రీలంక త మిళ శరణార్థి శిబిరం యువతి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘోర ఘటనలో మరో 17 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. విల్లుపురం జిల్లా అనిచన్ కుప్పంలోని శ్రీలంక తమిళ పునరావాస శిబి రానికి చెందిన యాన్సీ(18) ఇటీవల ప్లస్–2 పరీక్షల్లో 450 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె ఉన్నత చదువుల కోసం అలగప్ప విశ్వవిద్యాలయానికి దరఖా స్తు చేసుకుంది. ఈ క్రమంలో చెన్నై రామపురంలో నివసిస్తున్న తన స్నేహితురాలిని (17 ఏళ్ల బాలిక) కలవడానికి యాన్సీ కొద్దిరోజుల క్రితం చెన్నైకి వచ్చింది. శనివారం రాత్రి యాన్సీ, ఆమె స్నేహితురాలు తబిత (18) అనే మరో యువతితో పాటూ యువకులు కలిసి మొత్తం ఆరుగురు మూడు మోటారు సైకిళ్లపై కోయంబేడు ఫ్లైఓవర్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్ పబ్కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత యాన్సీ బృందం నృత్యం చేస్తున్న సమయంలో అక్క డ మద్యం మత్తులో ఉన్న మరో వర్గానికి చెందిన యు వకులతో వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పబ్ లో గందరగోళం నెలకొంది. హో టల్ బౌన్సర్లు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి బయటకు గెంటేశారు. బయటకు వచ్చినా మరోసారి గొడవ పడ్డారు. తర్వాత ఇళ్లకు బయలుదేరారు. కారుతో తొక్కించి హత్య గొడవతో తీవ్ర ఆగ్రహానికి గురైన కారు డ్రైవర్ సుమన్ శక్తివేల్ (20) బైక్పై ప్రయాణిస్తున్న యువతులను చంపాలనే ఉద్దేశంతో కారును మెరుపు వేగంతో వారి బైక్ వైపు పోనిచ్చి బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న యాన్సీ, వెనుక కూర్చున్న 17 ఏళ్ల బాలిక గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయమై, ముఖం పూర్తిగా చిద్రమైన స్థితిలో యాన్సీ (18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలైన బాలికను కోయంబేడు కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నిరుపేద కూలీ అయిన యాన్సీ తండ్రి నకులేశ్వరన్ , కుటుంబ సభ్యులు ఈ వార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రియునితో కలిసి వదిననే చంపిన మరదలు..!
బెంగళూరు: బంగారు నగల కోసం మానవులు రాక్షసులుగా మారుతున్న ఉదంతాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. అదే రీతిలో బంగారం కోసం ప్రియునితో కలిసి సొంత వదిననే గొంతు కోసి చంపిందో మరదలు. ఈ కిరాతక ఘటన చిక్కబళ్లాపురం నగరంలో వెలుగుచూసింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. మే 28వ తేదీ అర్ధరాత్రి కందవార పేట సమీపంలోని బాపూజినగరలో మేస్త్రి నరసింహమూర్తి ఇంట్లో కోడలు పుష్పలతను దొంగలు పడి గొంతు కోసి బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఆమె పక్కనే పడుకొన్న మరదలు భవ్య నోట్లో బట్టలు కుక్కి పెప్పర్ స్ప్రే కొట్టి పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు భవ్య కుటుంబీకులకు, పోలీసులకు తెలిపింది. పుష్పలత తల్లిదండ్రులు మహేశ్, లక్ష్మి మాత్రం ఏదో జరిగిందని, భర్త తరఫు వారే తమ బిడ్డను బలిగొన్నారని విలపించారు. పోలీసులు మొదట్లో ఇది దోపిడీ అనుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న భవ్యను విచారించగా ఆమె మాటల్లో పొంతన కుదరలేదు. నివ్వెరపోయే నిజాలు.. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సె దర్యాప్తులో అసలు నిజాన్ని గుర్తించారు. భవ్యకు హొసకోటకు చెందిన వ్యక్తితో పెళ్లి చేసి పంపారు. కానీ ఆమె భర్త మిత్రుడు, కార్ డ్రైవర్ లోహిత్కుమార్ లల్లుతో అక్రమ సంబంధం ఏర్పడి అతనితో పరారైంది. భర్త గొడవచేయడంతో పుట్టింటికి వచ్చేసింది. మరోవైపు లల్లు నీ ప్రైవేటు వీడియోలు బయట పెడతానని బెదిరించడంతో భవ్య రూ. 5 లక్షల వరకూ ఇచ్చుకుంది. మరింత డబ్బులు కావాలని బెదిరించగా, నా వదిన దగ్గర బంగారు నగలు ఉన్నాయి, ఆమెను హత్య చేసి తీసుకుపో అని చెప్పింది. 28వ తేదీ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్లాన్ ప్రకారం భవ్య వదిన పక్కన పడుకుంది. లల్లు రాగానే తలుపులు తీసింది. ఇద్దరూ కలిసి పుష్పలతను దిండుతో అదిమి, కత్తితో గొంతుకోసి చంపి ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. దొంగలు తనపై దాడి చేశారని భవ్య నాటకమాడింది. అదే రోజు ఇంటి సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఎక్కడా దొంగల ఆచూకీ లేదు. పోస్టుమార్టం రిపోర్టు ఇది సహజ మరణం కాదు అని తేలి్చంది. దీంతో భవ్యను తమదైన రీతిలో ప్రశ్నించగా, మొత్తం ఏకరువు పెట్టింది. లల్లును కూడా అరెస్టు చేశారు. అత్త మామల పాత్ర ఉంటే వదిలిపెట్టబోమని ఎస్పీ కుశాల్ తెలిపారు. -
భర్త, అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా..!
రాజేంద్రనగర్ : భర్తతో పాటు అత్త వేధింపులు రోజురోజుకూ అధికమయ్యాయని.. ఇక తాను భరించలేనని ఓ వివాహిత తన తండ్రికి ఫోన్ చేసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన మేరకు.. సికింద్రాబాద్కు చెందిన భవాని (26) రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన శ్రీకాంత్లు ప్రేమించి 2025లో పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్ స్థానికంగా వెల్డింగ్ షాప్ లో పనిచేసేవాడు.పెళ్లయిన తరువాత భవాని అత్త కనకమ్మ రోజూ తాగి వచ్చి కోడలితో గొడవకు దిగేది. భర్త శ్రీకాంత్కు చెప్పినా పట్టించుకోకుండా తల్లికి వత్తాసు పలికేవాడు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ సొంత ఊరు అయిన సిద్దిపేటలో శుభకార్యం ఉండడంతో భార్యాభర్తలతో పాటు అత్త గ్రామానికి వెళ్లారు. అక్కడ అత్త భవానీని బంధువుల ముందే తిట్టి అవమానించింది. ఈనెల 30న తిరిగి వచ్చారు.ఆరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో భవాని తండ్రి ఎల్లయ్యకు ఫోన్ చేసి.. వేధింపులు రోజురోజుకూ ఎక్కువయ్యాయని ఇక తాను భరించలేనని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపి ఫోన్ కట్ చేసింది. అనంతరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎల్లయ్య ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత
నల్గొండ జిల్లా: తల్లిదండ్రులు రేణుకా ఎల్లమ్మ పండుగ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారి కుమార్తె మధ్యాహ్నం సమయంలో సరదాగా తోటి పిల్లలతో ఈత కొట్టేందుకు వెళ్తుండగా తల్లిదండ్రులు వద్దని వారించిన వినలేదు. బాలిక గుంత లోతు గమనించక ఈత కొడుతూ కొంత దూరం వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందింది. ఈ ఘటన కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బిల్లంకానిగూడెంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మగూడెంలో ఆది, సోమవారాల్లో గంగదేవమ్మ పండగ నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. ముందు రోజు శనివారం గ్రామానికి చెందిన ఎలుక శంకర్, కల్పన దంపతులు ఇంట్లో రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. వారు ఈ పనుల్లో నిమగ్నం కాగా.. వారి కుమార్తె హారిక(13) గ్రామ శివారులోని నీటి గుంతలో ఈత కొట్టేందుకు తన అన్న గణేష్, తన మేనత్త కుమార్తె, కుమారుడితో కలిసి గ్రామ శివారులో రైతులు పొలాల దిగువ భాగంలో నీటి నిల్వ కోసం తీసిన పెద్దగుంత వద్దకు వెళ్లారు. గుంత లోతు ఎక్కువగా ఉండటంతో గమనించని హారిక ఈత కొడుతూ దూరంగా వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. హారిక అన్న గణేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఈ విషయాన్ని గణేష్ తన తల్లిదండ్రులకు తెలపడంతో అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో నకరేకల్ ఫైరింజన్ సిబ్బందిని పిలిపించారు. సిబ్బంది బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. హారిక చిన్నపురిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బొల్లారంలో దారుణం.. బైక్పై వెళ్తున్న దంపతులపై దాడి
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలో దారుణం జరిగింది. బైక్పై వెళ్తున్న భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో దుండగులను భర్త అడ్డుకున్నారు. దీంతో ఆయన భార్య మీనాను దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేయగా.. భర్త అనిల్ కుమార్పై కత్తులతో దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. పరారైన నిందితులు కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. బిహార్కు చెందిన దంపతులు బొల్లారంలో నివాసం ఉంటున్నారు. షాపింగ్కు వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. -
విద్యార్థి హత్య: ఎన్కౌంటర్లో నిందితుడు హతం
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ను కుదిపేసిన 11వ తరగతి విద్యార్థి సూర్య చౌహాన్ దారుణ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా ఉన్న అసద్, పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. శనివారం ఇందిరాపురం ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ ఉద్రిక్తతకు దారితీసింది.ఎన్కౌంటర్ వెనుక ఉన్న అసలు కథమే 28న జరిగిన ఘర్షణలో సూర్య చౌహాన్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ప్రధాన నిందితుడు అసద్పై రూ. 50,000 రివార్డు ప్రకటించిన పోలీసులు, అతడి కోసం వేట మొదలుపెట్టారు. ఖోడా ప్రాంతంలో తన సహచరులను కలిసేందుకు అసద్ వస్తున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు, అప్రమత్తమై చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మోటార్ సైకిల్పై వస్తున్న అసద్ను ఆపే ప్రయత్నం చేయగా, అతను పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అసద్కు తీవ్రగాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు.కుట్రపూరిత హత్య: కుటుంబం ఆరోపణసూర్య కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మే 28న ఫోన్ కాల్ చేసి ఈద్ వేడుకల కోసం రమ్మని పిలిచి, అతడిని ఒకచోట బంధించి దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులు కత్తులతో వెంటాడి మరీ సూర్యను పొడిచారని, తనను తాను కాపాడుకునేందుకు 200 మీటర్ల దూరం పరుగెత్తినా వదలకుండా దాడి చేశారని సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చివేయాలని బాధితుడి తల్లి సరోజ్ డిమాండ్ చేస్తున్నారు.చిన్న గొడవే ప్రాణం తీసిందిపోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సూర్య స్నేహితులే నిందితులు. మోటార్ సైకిల్ నడపడం విషయమై జరిగిన చిన్నపాటి వాగ్వాదం పెరిగి, కోపంతో అసద్ సూర్యను నిందితులు కత్తితో పొడిచినట్లు డీసీపీ ధవల్ జైస్వాల్ తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, తుపాకీని స్వాధీనం చేసుకుని సోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: అందం, హోదా.. అంతా అబద్ధమేనా? -
భర్తను చంపించి.. గుండెలు బాదుకుంది!
రోడ్డుపక్కన మంటల్లో కాలిపోతున్న స్కార్పియో వాహనం, అందులో కనిపించిన మృతదేహాలు, ఇంటివద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య.. ఆ ఘోరం చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. గ్రామస్తులే కాదు, మొదట్లో పోలీసులు కూడా ప్రమాదమే అనుకుని జాలి చూపించారు. కానీ ఫోరెన్సిక్ దర్యాప్తులో బయటపడిన నిజాలు.. ఒక్కసారిగా అందరినీ షాక్కు గురిచేశాయి.రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా శ్రీరాంపుర గ్రామం మే 28వ తేదీన ఉదయం సమీపంలో ఓ స్కార్పియో వాహనం మంటల్లో కాలిపోతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనంలో మూడు కాలిన మృతదేహాలను గుర్తించారు. మరొక మృతదేహం సమీపంలోని పొలంలో లభించింది. మృతులను మాజీ సర్పంచ్ రామ్సింగ్ చౌదరి, ఆయన తల్లి పూసీదేవి, రెండో భార్య సూర్యగ్యాన్ దేవి, కుటుంబ సభ్యురాలు మహిమా చౌదరిగా గుర్తించారు. తొలుత ఇది ఘోర ప్రమాదమని భావించిన పోలీసులు.. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతదేహాలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గాయాలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో కేసు మలుపు తిరిగింది.ఈ తరుణంలో.. దర్యాప్తు క్రమంగా కుటుంబ సభ్యుల వైపు మళ్లింది. ఇదే సమయంలో రామ్సింగ్ మొదటి భార్య సునీత చౌదరి ఇంటివద్ద తీవ్రంగా విలపిస్తూ కనిపించింది. బంధువుల మధ్య కూర్చుని కన్నీళ్లు కారుస్తూ.. గుండెలు బాదుకుంది. షాక్తో పదే పదే మూర్ఛపోసాగింది. అయితే ఆమె పర్ఫార్మెన్స్పై పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. భర్త రెండో వివాహం.. కుటుంబ వివాదాల నడుమ.. ఆమె అలా ప్రవర్తించడం ఆ దిశగా విచారణకు అడుగులేయించింది.అయితే పోలీసులకు సునీత ఓ స్టేట్మెంట్ ఇస్తే.. దర్యాప్తులో అదంతా తారుమారైంది. రామ్సింగ్ తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని ఆమె చెప్పినా.. సాంకేతిక ఆధారాలు, ఇరుపొరుగువాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు విషయం బయటపడింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామ్సింగ్కు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల తరచూ ఘర్షణలు జరిగేవి. అలా బుధవారం రాత్రి గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో సునీత చౌదరి, ఆమె కుమార్తె సరిత, మైనర్ కొడుకు కలిసి.. తొలుత రామ్సింగ్ను హతమార్చారు. ఆపై ఆ హత్యను చూసిన రామ్సింగ్ తల్లిని చంపారు. ఆ వెంటనే రెండో భార్య కూడా చూసి ఉంటుందన్న అనుమానంతో చంపేశారు. ఈలోపు అటుగా వచ్చిన రెండో భార్య మేనకోడలిని సైతం ఎవరికైనా చెబుతుందేమోనని చంపేశారు.అనంతరం నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను స్కార్పియోలో వేసి హైవేపైకి తీసుకెళ్లి వాహనానికి నిప్పంటించినట్లు ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, మొబైల్ డేటా, గ్రామస్తుల వాంగ్మూలాలు కలిపి చూసినప్పుడు కుట్ర మొత్తం బయటపడిందని అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ తెలిపారు. చిన్నచిన్న ఆధారాలే ఈ కేసును ఛేదించాయని ఆయన చెప్పారు.ప్రస్తుతం సునీత చౌదరి, ఆమె కుమార్తె, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రజలను అత్యంత షాక్కు గురిచేసిన విషయం ఒక్కటే. నాలుగు హత్యలకు పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళే.. ఆ తర్వాత మృతుల కోసం కన్నీళ్లు కారుస్తూ, శోకసంద్రంలో మునిగిపోయినట్టు నటించిందని పోలీసులు చెబుతున్నారు. నెలల తరబడి ఎదురు చూసి..పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ హత్యల వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి కుటుంబంలోని మైనర్ కుమారుడేనని ఓ అంచనాకి వచ్చారు. కుటుంబ విభేదాలు, ముఖ్యంగా తండ్రి రెండో వివాహంపై ఇంట్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ముందుగానే ఈ దాడికి సిద్ధమైనట్లు విచారణలో తేలిందని కథనాలు పేర్కొంటున్నాయి. తరచూ తల్లిని, అక్కను తండ్రి కొట్టడం భరించలేకపోయాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్లైన్లో పదునైన కత్తిని కొనుగోలు చేసి, దానిని కొంతకాలం ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రాత్రి తల్లి సునీత, అక్క సరితతో కలిసి పథకం ప్రకారమే నలుగురిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యల అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాలను స్కార్పియో వాహనంలో తీసుకెళ్లి నిప్పంటించడంలోనూ అతడు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ప్రియురాలిని చంపి.. భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు..!
ఏలూరు టౌన్: అనుమానం పెనుభూతంగా మారింది... ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కాస్తా... పగ, ప్రతీకారానికి దారితీశాయి... డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఊరు తీసుకువెళ్ళి అత్యంత కిరాతకంగా చంపేశాడు... ఐదు రోజుల అనంతరం మృతదేహాన్ని గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఈ ఘోరహత్యకు సంబంధించి ఏలూరు త్రీటౌన్లో నమోదైన మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులకు విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. ఏలూరు త్రీటౌన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా, అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీస్సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఏలూరు శివారు శౌరీపురం గ్రామానికి చెందిన మల్లపల్లి విశాలి (36) ఏప్రిల్ 18న గుడివాడలోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది. విశాలి ఇంటికి రాకపోవటంతో భర్త, బంధువులు కంగారుపడ్డారు. ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో భర్త ఆందోళనతో ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రైమ్నెంబర్ 81/2026, విమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఏలూరు త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు బృందాలుగా మహిళ కదలికలపై నిఘా ఉంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దర్యాప్తు చేపట్టగా... శౌరీపురం గ్రామానికే చెందిన ఫ్రాన్సిస్ శౌరి (36) పాలవ్యాపారితో ఆమె నిత్యం ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు. మిస్సింగ్ కేసు విచారణ సమయంలో ఫ్రాన్సిస్ గ్రామంలో లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. పాలవ్యాపారి ఫ్రాన్సిస్ విశాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రూ.2 లక్షలు వడ్డీకి అప్పు ఇచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతూ ఉండగానే, మరోవైపు విశాలి ఇతర వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతుందనే అనుమానాన్ని పెంచుకున్నాడు. ప్రియురాలిపై మోహం కాస్తా, కక్షగా మారింది. ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. చున్నీతో గొంగు బిగించి... పెద్దరాయితో మోది హత్య ప్రియురాలిని హత్య చేయాలనే పధకంతో ఏప్రిల్ 18న డబ్బులు ఇస్తానని నమ్మించి విశాలిని హనుమాన్ జంక్షన్కు రావాలని చెప్పాడు. ఆమెను మోటారు సైకిల్పై నూజివీడు మండలం పల్లెర్లమూడి, పోలవరం కాలువ గట్టు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. విశాలి చున్నీతో ఆమె గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. కిందపడిపోయిన ఆమెపై పెద్దరాయితో ఛాతీపై బలంగా మోదాడు. కిరాతకమైన దాడిలో విశాలి ప్రాణాలు కోల్పొయింది. హత్య చేసిన అనంతరం పొదల్లో పడేసి మెల్లగా జారుకున్నాడు. ఐదు రోజుల అనంతరం ఏప్రిల్ 23న సంఘటనా స్థలానికి వెళ్లిన ఫ్రాన్సిస్ ఆమె మృతదేహాన్ని లోతుగా గుంతతవ్వి పూడ్చిపెట్టాడు. ఆమె బట్టలు, వస్తువులను దగ్ధం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె బతికే ఉందనే భ్రమ కలి్పస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ విశాలి ఫోన్ నుంచి భర్తకు వాట్సాప్ చాటింగ్ చేయటం, ఫోన్ చేసి లిఫ్ట్ చేశాక మాట్లాడకుండా ఉంటూ వారితో ఆటలాడాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ పగులగొట్టి, చెరువులో పడేశాడు. ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు ఏలూరు త్రీటౌన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈనెల 28న ఏలూరు హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో నిందితుడు ఫ్రాన్సిస్ను మోటారు సైకిల్తో అదుపులోకి తీసుకుని విచారించారు. నేరాన్ని అంగీకరిస్తూ నూజివీడు పల్లెర్లమూడి శివారులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి పోలీసులు వెళ్ళిన అనంతరం నూజివీడు తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికితీశారు. మహిళ మిస్సింగ్ కేసును హత్య కేసు, ఆధారాల నిర్మూలన సెక్షన్లు 103(1), 238(ఏ)బీఎన్ఎస్ గా మార్పు చేశారు. బంధువుల అదనపు స్టేట్మెంట్లు రికార్డు చేసి, నేరస్థలంలో పక్కా ఆధారాలు సేకరించి, నిందితుడ్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్సై పి.రాంబాబు, సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. -
మొయిజుద్దీన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్: లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించి ఏడుగుర్ని అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల వివాదాలే లాయర్ హత్యకు కారణమన్నారు. లం ఖాన్ కుటుంబానికి మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.‘మొయిజుద్దీన్ స్విమ్మింగ్కు వెళ్తుండగా హత్య చేశారు. మొయిజుద్దీన్ను హతమార్చాలని ఆలంఖాన్ నిర్ణయించుకున్నాడు. మే 23 న శాంతి నగర్ లో అడ్వకేట్ ఖాజా మొయిజుద్దిన్ను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీ కోట్టారు. వక్ఫ్ భూముల వివాదాలే లాయర్ హత్యకు కారణం. జనవరి నుంచి లాయర్ హత్యకు రెక్కీ నిర్వహించారు. 23వ తేదీన మొయిజుద్దీన్ స్విమ్మింగ్ వెళ్తుండగా హత్య చేశారు. లాయర్ను చంపేందుకు రూ. 15 లక్షలు సుపారీ ఇచ్చారు. నిందితుల నుంచి రూ. 10. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. ఆలం ఖాన్ కుటుంబానికి మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లక్డి కాపుల్, మలక్ పేట్ ప్రాంతాలకు చెందిన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి కేసులలో ఖాజా మొయిజుద్దిన్, ఆలం ఖాన్ కుటుంబానికి వివాదాలు ఉన్నాయి. హత్య చేసేందుకు గత ఆరు నెలల నుండి పలు మార్లు ప్రయత్నం చేసి చివరకు మొయిజుద్దిన్ ను హత్య చేశారు’ అని తెలిపారు. -
కడుపులో బిడ్డ తనది కాదని.. ట్విషాని మెంటల్ టార్చర్ చేసి చంపేసి..
-
మీ ఫోన్ వస్తే భయమేస్తోంది సార్..
నల్గొండ జిల్లా: ‘మీ ఫోన్ వస్తే భయమేస్తోంది సార్.. మీ వల్ల నరకం చూశాను.. అధిక వడ్డీకి అప్పులు తీసుకొని తీర్చలేకపోతున్నా.. నా కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి’అని సూసైడ్ నోట్ రాసి వ్యవసాయాధికారి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) కొన్నేళ్లుగా కేతేపల్లి క్లస్టర్ వ్యవసాయ శాఖలో ఏఈఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ అవసరాలతోపాటు వ్యవసాయం చేసేందుకుగాను కొందరి వద్ద అప్పుగా డబ్బు తీసుకొని వాటిపై అధిక వడ్డీ భారం మోస్తూ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించగా గురువారం ఉరుమడ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అప్పుల మీద అప్పులు.. ఆత్మహత్యకు ముందు ఏఈఓ బాలరాజు తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో.. అప్పు ఇచ్చిన వారు ఫోన్ చేస్తూ ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలో మరో వ్యక్తితో కలిసి పదెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయగా రూ.3 లక్షల నష్టం వచ్చిందన్నాడు. అది పూడ్చుకునేందుకుగాను ఓ చిట్ఫండ్లో పనిచేసే ఏజెంట్ ద్వారా తన తోటి కౌలుదారుతో చిట్టీ వేయించానని, అందుకు తాను ష్యూరిటీ ఉన్నానని, అతడు చిట్టీ డబ్బులు పూర్తిగా కట్టకపోవడంతో రూ.5 లక్షలు చిట్ఫండ్ కంపెనీకి తానే కట్టాల్సి వచ్చిందని నోట్లో పేర్కొన్నాడు. ఈ భారం నుంచి బయటపడేందుకు.. తెలిసిన వ్యక్తుల ద్వారా మారి్టగేజ్ లోన్లు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొని, వడ్డీలు కట్టలేక మరలా అప్పులు చేయాల్సి వచ్చిందని బాలరాజు వివరించాడు. అధిక వడ్డీలతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న వారిని వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో కలెక్టర్, ఎస్పీలను కోరాడు. -
నేపాలీ ఇదేం పని.. వీధిలో చేయిపట్టుకొని అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి
హైదరాబాద్: రాత్రివేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులను గురువారం అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బుధవారం రాత్రి బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఓ యువతి ఒంటరిగా వెళుతోంది. దీంతో నేపాల్ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. యువతి గట్టిగా అరవడంతో స్థానికులు బంధించి బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని అబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. స్థానికంగా ఓ ఫాస్ట్ఫుడ్ కేంద్రంలో పనిచేస్తున్న సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ నేవులుగా గుర్తించారు. -
61 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక లైంగికదాడి
తిరువొత్తియూరు: చెన్నై వేళచ్చేరిలో వృద్ధురాలిపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చెన్నై వేళచ్చేరికి చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు బుధవారం తెల్లవారుజామున మడిపాక్కం ప్రాంతం నుంచి వేళచ్చేరి వైపు నడిచి వెళుతోంది. బైకుల్లో వచ్చిన ఐదుగురు యువకులు వాకింగ్ ముగించుకుని వస్తున్న ఆమెతో పరిచయం చేసుకుని బైకులో ఎక్కించుకుని జన సంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఐదుగురు యువకులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పారిపోయారు. రక్తగాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న ఆమెను గురువారం ఉదయం అటుగా వెళుతున్న వారు చూసి పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. వేళచ్చేరి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఎగ్మూర్లోని ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. వేళచ్చేరి పోలీసులు, బిహార్ రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల బాలుడు సహా ముగ్గురు ఇతర రాష్ట్ర కారి్మకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా, వారు ఆ ప్రాంతంలోని హోటళ్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను చూసి వెంబడించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వారు నేరం అంగీకరించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారణను వేగవంతం చేశారు. -
కూతురి ప్రేమ వివాహం.. మనవడిని కుక్కర్తో కొట్టి చంపిన తాత!
తమిళనాడు: నామక్కల్ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన వెంకటాచలం. ఇతని భార్య అముధ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వెంకటాచలం మద్యపానానికి బానిసయ్యాడు. ఇతను ఇంట్లోని పాత్రలను అమ్ముతాడు. ఆ డబ్బుతో మద్యం తాగుతూ తిరుగుతాడు. ఈ క్రమంలో, అతని పెద్ద కుమార్తె మోనిషా, భవానికి చెందిన మయిలానందన్తో ప్రేమలో పడింది. తల్లిదండ్రుల వ్యతిరేకత ఉన్నప్పటికీ వీరికి వివాహం జరిగింది. ఈ పరిస్థితుల్లో, మోనిషా 10 రోజుల క్రితం తన 10 నెలల బాబు జోష్విక్తో కలిసి తల్లి ఇంటికి వచ్చింది. దీనికి వెంకటాచలం అభ్యంతరం తెలిపి, ‘ఎందుకు ఇంటికి వచ్చావు? అని అడిగి కూతురిని కొట్టి, హింసించాడు. కుక్కర్ మూత తీసుకుని మోనిషాపై విసిరాడు. అది ఆ పిల్లాడి తలపై పడడంతో, ఆ పిల్లాడు గాయపడి మరణించాడు. మోనిషా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంకటాచలాన్ని అరెస్టు చేశారు. -
మైనర్ బాలుడిపై పోలీస్ అధికారి లైంగిక దాడి..!
సాక్షి, చెన్నై : సమాజానికి రక్షణగా ఉండాల్సిన పోలీస్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ దారుణానికి ఒడిగట్టాడు. సెలవుల కోసం బంధువుల ఇంటికి వచ్చిన ఒక మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, నోటిలో బలవంతంగా మద్యం పోసి చిత్రహింసలు పెట్టిన ఘటన చెన్నై నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడైన పోలీస్పై అశోక్ నగర్ పోలీసులు శరవేగంగా స్పందించి పోక్సో చట్టంలో కేసు నమోదు చేసిన అరెస్ట్ చేశారు. వివరాలు..కన్యాకుమారి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ప్లస్–1 చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి చెన్నై కోడంబాక్కం ప్రాంతంలోని తన మామ ఇంటికి వచ్చాడు. కుటుంబంతో కలిసి పెరియపాలయం, సిరువాపురి ఆలయాలను సందర్శించిన అనంతరం తల్లిదండ్రులు స్వగ్రామానికి తిరిగి వెళ్లగా, ఆ బాలుడు మాత్రం మామ ఇంట్లోనే ఉండిపోయాడు. ఈనేపథ్యంలో వడపళని పోలీస్ స్టేషన్ రైటర్ పనిచేస్తున్న వేలప్పన్ తన మామకు స్నేహితుడు కావడంతో బుధవారం రాత్రి వారి ఇంటికి ఆ బాలుడు వెళ్లాడు. అక్కడ ఆ రైటర్, బాలుడి మామ కలిసి మద్యం సేవించారు. కొంత సమయం తర్వాత బాలుడి మామ మద్యం మత్తులో నిద్రపోయాడు. బెడ్ రూమ్లోకి చొరబడి దారుణం అర్ధరాత్రి సమయంలో నిందితుడు వేలప్పన్, బాలుడు టీవీ చూస్తూ పడుకున్న పడకగదిలోకి అకస్మాత్తుగా చొరబడ్డాడు. బాలుడిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, గట్టిగా అరవకుండా ఉండేందుకు నోట్లో మద్యం పోసి క్రూరంగా ప్రవర్తించాడు. నిందితుడి క్రూరత్వం నుండి ఎలాగైనా బయటపడాలని భావించిన ఆ బాలుడు ధైర్యం చేసి, పక్కనే ఉన్న టీవీ రిమోట్తో వేలప్పన్ను బలంగా కొట్టి కిందకు తోసేశాడు. అనంతరం గదిలోంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. మత్తులో కామాంధుడిగా మారిన ఆ నిందితుడు లోపల ఉంచి ఇంటికి తాళం వేశాడు. అర్ధరాత్రి వేళ భయంతో కేకలు వేస్తూ కాలినడకన సమీపంలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆశ్రయం పొందాడు. పోలీస్ స్టేషన్లో బాలుడు ఏడుస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో అధికారులు తక్షణమే స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఇంట్లోనే బందీగా ఉన్న వేలప్పన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిరా>్ధరణ కావడంతో, నిందితుడు వేలప్పన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
ఈదురుగాలులకు కూలిన బ్రిడ్జి.. ఆరుగురి మృతి
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరికొందరిని ఆస్పత్రికి తరలించగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.హమీర్పూర్ జిల్లాలో బేత్వా నది వద్ద శుక్రవారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెన కింద నిద్రిస్తున్న కార్మికుల మీద అవి పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడినవాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. At least 6 people were killed after an under construction bridge collapsed in Hamirpur district of Uttar Pradesh. pic.twitter.com/2UfarN3Nm9— Piyush Rai (@PiyushRaiUP65) May 29, 2026సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జిని నాసికరంగా నిర్మించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా ఆంధీ తుపాను హెచ్చరిక ఉన్నప్పటికీ కార్మికుల భద్రత విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహిరించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. తీవ్ర ఆరోఫణల నేపథ్యంలో విస్తృతస్థాయి దర్యాప్తునకు ఆయన జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలె బిహార్లోనూ ఈ తరహా ప్రమాదం ఒకటి జరిగింది. -
డీఎస్పీగా ప్రమోషన్.. ఇంతలోనే పోలీస్ అధికారి ఆత్మహత్య..!
బెంగళూరు: పోలీసు శాఖలోని ఎస్డీఆర్ఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేసే శ్రీశైల్ చౌగలే (37) ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి సిటీలో జరిగింది. బుధవారం రాత్రి విధులు ముగించుకుని చెన్నమ్మ నగరలోని ఇంటికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. భార్య చూసి వెంటనే ఆయన పనిచేసే ఆఫీసుకు కాల్ చేసి చెప్పింది. సిబ్బంది, పోలీసులు చేరుకుని తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు. మృతదేహాన్ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాలు బహిర్గతం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో డీఎస్పీ ప్రమోషన్ ఆయన బంధువులు మాట్లాడుతూ చౌగలే ప్రతిభావంతుడైన అధికారి అని, గతంలో రిజర్వు పోలీసు సీఐగా ఉండేవాడని తెలిపారు. త్వరలోనే డీఎస్పీగా ప్రమోషన్ వస్తుందని చెప్పేవాడని, ఇంతలోనే ఘోరం జరిగిందని విలపించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
తీయని మాటలతో రూ.1.66 కోట్ల లూటీ
బనశంకరి: సిలికాన్ సిటీలో మరో భారీ సైబర్ క్రైం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా అపరిచిత సుందరి తీయని మాటల మాయలో పడిన టెక్కీ రూ.1.66 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. ఈ ఫ్రాడ్ బెంగళూరులో జరగ్గా, బాధితుడు ఆగ్నేయ విభాగం సైబర్క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రేమ, పెళ్లి.. పెట్టుబడులు వివరాలు... సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌరవ్ దూబే నగరంలో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 15న టంటన్ అనే ప్రముఖ డేటింగ్ యాప్లో అతనికి రియా అగర్వాల్ అనే పేరు గల యువతి పరిచయమైంది. చాటింగ్ చేసుకుంటూ స్నేహితులుగా మారారు. తరువాత రియా అతని మొబైల్ నంబరు తీసుకుని తరచూ ఆడియో, వీడియోకాల్స్ చేస్తూ దగ్గరైంది. దూబెని వివాహం చేసుకుంటానని నమ్మించింది. బాధితుడు పూర్తిగా వలలో పడిపోయాడని గ్రహించిన మోసగత్తె... ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు లాభం పొందవచ్చునని, మన భవిష్యత్తుకు ఎంతో సహాయంగా ఉంటుందని ఆశపెట్టింది. యువతి మోజులో పడిన టెక్కీ ఏమాత్రం ఆలోచించకుండా మూడు నెలల అవధిలో తన బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.1.66 కోట్లను ఆమె చెప్పిన ఖాతాలకు పంపించాడు. మొబైల్ స్విచ్చాఫ్ కోట్లాది రూపాయలు సమర్పించుకున్న సౌరబ్ దూబె ఖాతాలోకి లాభాల పేరిట రూ.4,250 వచ్చాయి. దీంతో అనుమానపడిన అతడు తన పెట్టుబడి డబ్బు, లాభం వెనక్కి ఇవ్వాలని రియా అగర్వాల్ను అడిగాడు. కొన్నిరోజుల పాటు మాటలు చెప్పి తప్పించుకుంది. అతడు ఒత్తిడి తీవ్రం చేయడంతో వంచకురాలు మొబైల్ను స్విచ్చాఫ్ చేసుకుని అదృశ్యమైంది. దీంతో టెక్కీ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. చివరకు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంచకురాలు, ఆమె బ్యాంకు అకౌంట్లను కనిపెట్టే పనిలో ఉన్నారు. డేటింగ్ యాప్స్లో అపరిచితుల ప్రలోభాలకు గురికావద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరించారు. -
నుజ్జునుజ్జైన కారు.. అక్కడికక్కడే ఐదుగురి దుర్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. చిత్రదుర్గం జిల్లా తుమకుర్లహళ్లి సమీపంలో కారు–లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యిందని తెలుస్తోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులు ఉన్నట్లయితే వారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు లేదా నియంత్రణ కోల్పోవడం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండ్రోజుల కిందట ఇదే జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. -
యువతికి నరకం అంటే ఏంటో చూపించిన పూజారి
ఢిల్లీకి చెందిన ఓ పూజారి (27) తన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ను తిరస్కరించిన ఓ యువతికి నరకం చూపించాడు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అసభ్యకర, నగ్న మార్ఫింగ్ ఇమేజ్లు, ఫొటోలు రూపొందించాడు. ఆ పూజారి ఆన్లైన్లో మత వీడియోలు చేసేవాడు. సులభంగా దొరికే ఏఐ టూల్స్ వాడి మహిళ ఫొటోలను మార్చి, అనేక నకిలీ సోషల్ మీడియా ఖాతాల్లో అతడు అప్లోడ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అతడిని ఢిల్లీలో గుర్తించి, బుధవారం అరెస్టు చేశారు. మహిళలను ఆన్లైన్ వేధింపుల నుంచి కాపాడే “మిషన్ సైబర్ రక్షిక: #సెక్యూర్ హర్ స్పేస్” కార్యక్రమం కింద ఈ అరెస్టు జరిగింది.ఎలా మొదలైంది? ఆన్లైన్లో మత ప్రవచనాలు చేసే సుమిత్ నేమ్చంద్ శర్మతో గుజరాత్కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. శర్మ మొదట ఇన్స్టాగ్రామ్లో ఆమెతో చాట్చేసి, మత విషయాలపై సంభాషణలు ప్రారంభించినట్టు సమాచారం. తర్వాత అతడు ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించగా, మహిళ తిరస్కరించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ 6 వరకు అతడు ఇంటర్నెట్ ద్వారా మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏఐతో అసభ్యకర కంటెంట్ బాధిత మహిళ శర్మతో ఫ్రెండ్షిప్ను తిరస్కరించడంతో ఆ యువతి, ఆమె తల్లి ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్లోడ్ చేశాడు. ఫొటోల్లో దుస్తులు లేకుండా చేసే ఏఐ టూల్స్ కోసం ఆన్లైన్లో వెతికాడు శర్మ. ఆ టూల్స్ సాయంతో 100కు పైగా అసభ్యకర మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు. వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు.ఆ మహిళ పేరు, ఫొటోలు వాడి శర్మ 3 నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, ఓ యూట్యూబ్ ఛానల్ సృష్టించాడు. ఏఐతో తయారైన కంటెంట్ను వాటిలో అప్లోడ్ చేసి, మహిళ, ఆమె కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతినేలా కామెంట్స్ పెట్టాడు. దర్యాప్తులో పోలీసులు, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికల్లో అతడు 8 నుంచి 10 వరకు నకిలీ ఖాతాలు సృష్టించినట్టు గుర్తించారు.“నిందితుడు ఆ యువతితో పాటు ఆమె తల్లి ఏఐ మార్ఫింగ్ నగ్న ఫొటోలు, వీడియోలను నకిలీ ఖాతాల్లో అప్లోడ్ చేశాడు. మహిళను మానసికంగా వేధించి, సమాజంలో ఆమె ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశాడు” అని అధికారులు తెలిపారు.“యువతి, ఆమె తల్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్లోడ్ చేసి, గూగుల్లో ‘ఏఐ రిమూవ్ క్లోత్స్’ అని వెతికిన తర్వాత అనేక వెబ్సైట్లు వాడి, కృత్రిమ మేధ సాధనాలతో మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు” అని అధికారులు తెలిపారు.ఢిల్లీలో దొరికిపోయాడు..బాధిత యువతి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బృందాన్ని ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ ఎంహెచ్ భేటారియా నేతృత్వంలోని పోలీసు బృందం, డిజిటల్ ట్రాకింగ్, మానవ సమాచార సాయంతో ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్పూర్లో నిందితుడి ఆచూకీని గుర్తించింది. ఆ ప్రాంతంలో పోలీసులు దాడి చేసి శర్మను అరెస్టు చేశారు. -
లేడీస్ హాస్టల్లో రహస్య ఫొటోలు.. ప్రియుడికి పంపిన మహిళ!
స్నేహితురాళ్ల అశ్లీల ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి టౌన్ ప్రాంతానికి చెందిన మకరజ్యోతి (39) అనే మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమె, పాలయంకోట్టైలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ సమయంలో కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఇతర మహిళల రోజూవారి కార్యకలాపాలను వారికి తెలియకుండానే మకరజ్యోతి సెల్ఫోన్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా తీసిన అశ్లీల చిత్రాలను ఆమె కోయంబత్తూరులో ఉన్న తన ప్రియుడికి పంపుతున్నట్టు తెలిసింది. హాస్టల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహిళా పోలీసులు విచారణ చేశారు. విచారణలో తోటి మహిళలను అశ్లీలంగా ఫొటోలు తీసినట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. -చెన్నై -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక..
రంగారెడ్డి జిల్లా: బంధాలు, అనుబంధాలే కరువైపోతున్న ఈ రోజుల్లో తండ్రి మీద ఆ కుమా రు డు పెంచుకున్న మమకారం ఏకంగా ప్రాణాలనే తీసుకునేలా చేసింది. కుమారుడిని అలా చూసిన తల్లి కూడా తనువు చాలించింది. ఈ విషాద ఘట న రంగారెడ్డి జిల్లా లష్కర్గూడ పంచాయతీ కనకదుర్గానగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన పసుల కళాధర్, కళావతి దంపతులు తమ కుమారుడు శివకుమార్తో కలిసి మేడ్చల్లో ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ టైలరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన కళాధర్ ఆరు నెలల క్రితం మృతిచెందారు. దీంతో శివకుమార్ను తీసుకుని కళావతి లష్కర్గూడలో ఉంటున్న తన సోదరుడి వద్దకు వచ్చారు. ఇక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. అ యితే, తండ్రి మరణం శివకుమార్(20)కు మాన సికంగా కుంగదీసింది.తండ్రితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నిత్యం తల్లడిల్లేవాడు. ఈ క్ర మంలో తీవ్ర మనోవేదనతో బుధవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కొద్దిసేపటి తర్వాత తల్లి కళావతి(45) కొడుకు చనిపోయి ఉండటాన్ని గమనించారు. ఆరునెలల క్రితం భర్త చనిపోవడం, ఇప్పుడు కొడుకు ఆత్మహ త్య చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయారు. వా రిద్దరూ లేని జీవితం ఎందుకు అనుకున్నారేమో.. ఆమె కూడా చీరతో ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. -
అప్పులుంటే.. చంపేస్తావా!
తెలిసీ తెలియని వయస్సులో ఈ చేతులే కదా మాకు గోరు ముద్దలు తినిపించాయి.. ఈ చేతులే కదా మమ్మల్ని ఆడించాయి.. ఈ చేతులే కదా మాకు నడక నేర్పించాయి.. అలాంటి ఈ చేతులతోనే మమ్మల్ని కాటికి సాగనంపుతున్నావా నాన్న అంటూ ఆ చిన్నారుల మూగరోదన ఆ తండ్రికి వినిపించలేదు.. అల్లారు ముద్దుగా పెంచి.. అడిగినవన్నీ అరచేతిలో పెట్టి.. మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన నువ్వే.. ఏమాత్రం కనికరం లేకుండా.. కాళ్లు, చేతులు కట్టేసి.. కాటికి సాగే నంపే తరుణంలో నీ గుండె ఎంత బండలా మారింది నాన్నా.. అన్న ఆ పసిహృదయాల మౌనవేదన ఆ తండ్రికి కనిపించలేదు. ..కేవలం తాను చేసిన అప్పులకు తన భార్యాపిల్లలు ఎక్కడ బలవుతారో అన్న చిన్న కారణంతో.. ఎన్నో విజయాలు అందుకొని.. నిండు నూరేళ్లు జీవించాల్సిన మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు ఓ తండ్రి. ఇంటి నిర్మాణం, వ్యవసాయంలో నష్టాలు.. వెరసీ అప్పులపాలైన ఓ కౌలు రైతు.. తన కుటుంబాన్ని తానే చిదిమేసుకు న్న విషాదకర సంఘటన తీవ్రంగా కలచివేసింది. వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిశీలించిన డీఎస్పీ గిరిబాబు విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్నగర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.గొల్లుమన్న కుటుంబం.. తల్లిదండ్రుల చాటున నిండునూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు.. ఊహించని విధంగా కన్న తండ్రే.. కాలయముడై కాళ్లు చేతులు కట్టేసి నీటి సంపులోకి తోసి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. తోటలో ఆడుతూ... పాడుతూ.. సరదాగా తిరిగే చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి మామిడి తోట చుట్టుపక్కల రైతులు, కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నర్సింహులు స్వగ్రామం డోకూరుకు తీసుకెళ్లారు. -
వివాహేతర సంబంధం, రూ. 2 కోట్ల బీమా కోసం..
మంచిర్యాల క్రైం: వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడి చేత హత్య చేయించింది. ఇందుకోసం భర్త పేరిట ముందే రూ. 2 కోట్ల విలువైన బీమా పాలసీలు చేయించి వాటిని కూడా సొంతం చేసుకోవాలని పథకం రచించింది. ఆపై ఎవరికీ అనుమానం రా కుండా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం వెలుగు చూడటంతో చివరకు కటకటాలపాలైంది. మంచిర్యాలలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన సాయిని కుమార్ (40) వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. అతనికి భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 22న రాత్రి పని నిమిత్తం బయటకు వెళ్లిన కుమార్.. ముల్కల్ల శివారులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు హాజీపూర్ పోలీ సులకు సమాచారం అందించారు. అయితే కుమారుడి మర ణం అనుమానాస్పదంగా ఉండటంతో తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడాది క్రితం నుంచే.. గుడిపేటకు చెందిన రామ్మల్లేశ్ వద్ద కుమార్ గతంలో రూ. 60 వేలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో రామ్ మల్లేశ్ తన అప్పు తీర్చాలంటూ తరచూ కుమార్ ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు. చంపుతానని కూడా బెదిరించేవాడు. ఈ క్రమంలో రామ్మల్లేశ్ భారతికి దగ్గరయ్యాడు. అప్పటికే ఆమె గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో భారతి, కుమార్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భారతి ఏడాది క్రితమే నిర్ణయించుకుంది. లోన్ యాప్లో అప్పు చేసి బీమా పాలసీలు.. భర్తను హత్య చేస్తే వివాహేతర సంబంధానికి అడ్డులేకుండా పోతుందని.. అదే సమయంలో భర్త పేరిట బీమా చేయిస్తే రూ. కోట్లు పొందొచ్చని భారతి భావించింది. ఇందుకోసం ఆన్లైన్ లోన్ యాప్ల ద్వారా ఏకంగా రూ. 15 లక్షలు అప్పు చేసి గతేడాది జనవరిలో భర్త కుమార్ పేరిట వివిధ బీమా కంపెనీల నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన పాలసీలు తీసుకుంది. అనంతరం భర్త హత్యకు రూ.10 లక్షలతో రామ్ మల్లేశ్తో ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని వారిద్దరూ పథకం వేసుకున్నారు. రామ్మల్లేశ్... తనకు పరిచయం ఉన్న మంచిర్యాల ఎల్ఐసీ కాలనీకి చెందిన శ్రీరామ్కుమార్ సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 22న రాత్రి రామ్మల్లేశ్, శ్రీరాంకుమార్లు కుమార్తో కలిసి ముల్కల్ల శివారులో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న కుమార్ను ఇనుప సుత్తితో తలపై కొట్టి చంపారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డు పక్కనే మోటార్ సైకిల్ పడేసి వెళ్లిపోయారు. కుమార్ మృతిచెందడం, అతని తల్లి ఈ మరణంపై అ నుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు భార్యపైనే అనుమా నం వ్యక్తం చేస్తూ ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. హత్య చేసింది రామ్మల్లేశ్, శ్రీరాంకుమారేనని.. చేయించింది భారతి అని నిర్ధారించారు. అలాగే భారతితో వివాహేతర సంబంధం కొనసాగించిన లగిశెట్టి సురేందర్పైనా కేసు నమోదు చేశారు. స్థానిక ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్సై కిరణ్కుమార్ రెండ్రోజుల వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించారు. మంగళవారం భారతి, రామ్మల్లేశ్, సురేందర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీరాంకుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏవండీ.. ఇన్సూరెన్స్లు చేయించుకోండి
కుటుంబంలో కలతలు… సంబంధాల్లో మలుపులు… డబ్బుపై ఆశతో వేసిన ఒక పక్కా స్కెచ్ చివరికి ఓ దారుణ హత్యకు దారి తీసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భర్త చావును సహజ మరణంగా చూపించి కోట్ల రూపాయల బీమా సొమ్ము దక్కించుకోవాలన్న ఆ భార్య ప్లాన్ పోలీసుల దర్యాప్తుతో బెడిసి కొట్టింది. పైగా వివాహేతర సంబంధం మోజులోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ జంటకు పెళ్లై చాలా కాలం అయ్యి పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే కొంతకాలంగా భార్య భర్తపై ఎప్పుడూ లేనంత ప్రేమ కురిపిస్తూ వచ్చింది. బయటకు అది ఆప్యాయతలాగే కనిపించినా… ఆ ప్రేమ ముసుగు వెనుక కుట్ర దాగి ఉందని ఆ భర్త పసిగట్టలేకపోయాడు.అయితే అప్పటికే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్న సదరు మహిళ.. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఓ సుపారీ గ్యాంగ్కు రూ.10 లక్షలిచ్చి డీల్ మాట్లాడుకుంది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి సహజ మరణంగా చూపించాలనుకుంది. తద్వారా భర్త పేరు మీద ఉన్న రూ.3 కోట్ల విలువైన ఇన్సూరెన్స్లు రాబట్టాలనుకుంది. అయితే ఎంత కవర్ చేసే ప్రయత్నం జరిగినప్పటికీ.. భర్త బంధువులకు అనుమానాలు పెరగడం, పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. సాంకేతిక ఆధారాలు, కాల్డేటా, ఆర్థిక లావాదేవీలు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించాయి. ప్లాన్ప్రకారం భర్తను చంపే ఉద్దేశంతోనే ఆమె.. అతని పేరి మీదట ఇన్సూరెన్స్లు తీయించినట్లు తేలింది. భార్యను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మొత్తం కుట్రలో మరెవరి పాత్ర ఉందన్న కోణంలో లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇవాళ ప్రెస్మీట్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
అమెరికాలో భారతీయ మహిళ హత్య
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ స్టోర్లో గుజరాత్కు చెందిన భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. మృతురాలిని బిజాపుర్ ప్రాంతంలో మెహసానా జిల్లా జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనా పటేల్గా గుర్తించారు. మేఘ్నా పటేల్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. దుకాణం (స్టోర్) లోపల దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలో ఓ వ్యక్తి కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించడం కనిపించింది. ట్రాక్సూట్, జాకెట్, గ్లోవ్స్ , ఫేస్ మాస్క్ టోపీ ధరించి ఉన్న ఆ వ్యక్తి.. మేఘ్నా పటేల్తో కొద్దిసేపు మాట్లాడిన సెకన్ల వ్యవధిలోనే ఆమెపై కాల్పులు జరిపాడు.ఆ తర్వాత అతను టేబుల్ పైనుంచి ఏదో తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం కనిపించింది. ఈ కాల్పులు దోపిడీ ఉద్దేశంతోనే జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బీఆర్ఎస్ నేత హత్య కేసును చేధించిన పోలీసులు
సూర్యాపేట: బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. పాతకక్షల నేపథ్యంలోనే మధును మట్టుబెట్టారని చెప్పారు. తన తండ్రి హత్యకు ప్రతీకారంగా ప్రధాన నిందితుడు మిద్దె జీవన్ ఈ హత్యకు పాల్పడినట్టు ఎస్పీ వెల్లడించారు. అతడికి మరో ఐదుగురు సహకరించారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిద్దె రవీందర్ 2007లో యర్కారంలో హత్యకు గురయ్యాడు. తన తండ్రిని హత్య చేసిన మధుపై ప్రతీకారం తీర్చుకునేందుకు రవీందర్ కొడుకు జీవన్ గతంలో రెండు సార్లు హత్యాయత్నం చేసి విఫలం అయ్యాడు. తాజాగా పక్కా ప్లాన్తో మధును హత్య చేశాడు. కొంతకాలంగా సూర్యాపేట బాలాజీనగర్లో కుటుంబంతో పాటు నివసిస్తున్న మధును పథకం ప్రకారం బయటకు తీసుకొచ్చి కత్తులతో నరికి చంపారు.చేపల కూరతో పార్టీ చేసుకుందామంటూ మధును చింత సైదులు శుక్రవారం తన ఇంటికి పిలిచాడు. వీరితో పాటు మేదరి ప్రసాద్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. సాయంత్రం సైదులు, ప్రసాద్తో కలిసి మధు మద్యం సేవించాడు. అతడు మత్తులోకి జారుకోగానే జీవన్కు సైదులు ఫోన్ చేశాడు. సోదరుడి వరుస అయ్యే ఆనంద్తో కలిసి మటన్ కొట్టే కత్తి తీసుకుని సైదులు ఇంటికి వచ్చాడు జీవన్. ఆ తర్వాత జీవన్, సైదులు కత్తితో మధును విచక్షణారహితంగా నరికి చంపారు. మృతదేహాన్ని గొనెసంచితో మూటగట్టి, కారులో తీసుకెళ్లి యర్కారం వద్ద కల్వర్ట్లో పడేశారు.మధు హత్యకు సహకరించిన సైదులు భార్య ముల్కలపల్లి భవానీ పరారీలో ఉందని ఎస్పీ నరసింహ తెలిపారు. మిద్దె జీవన్, చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్ చంద్లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితులతో పాటు కారు, బైక్, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ అన్నారు. చదవండి: వ్యవస్థ చచ్చింది.. శవమై నడిచింది! -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని మహాదేవపుర నియోజకవర్గం హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజేష్ ఆరాధ్య భార్య లక్ష్మీప్రియ (26) శుక్రవారం కృష్ణరాజపురలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రాజేష్ ఆరాధ్య–లక్ష్మీప్రియల వివాహం 2023లో జరిగింది. రాజేష్ ఆరాధ్య, అతని తండ్రి పాలక్ష రాధ్య, తల్లి భాగ్యమ్మ తమ కుమార్తెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని లక్ష్మీప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మీ ప్రియ వాట్సాప్ ద్వారా తన సోదరి జయశ్రీకి ఫోన్ చేయగా ఆమె కాల్ స్వీకరించలేదు. ఆ తర్వాత రాజేష్ ఆరాధ్య ఆమెకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రియ మరణించినట్లు తెలియజేశాడు. లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నాతో ఉంటావా.. చస్తావా?
వికారాబాద్: ‘నాతో ఉంటావా.. లేదా చస్తావా’ అని ఓ వ్యక్తి మహిళ గొంతు కోశాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం తిమ్మాయిపల్లికి చెందిన వివాహిత రేణుకకు.. తాండూరు పట్టణానికి చెందిన వడ్డె రాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగగా.. ఆమె సదరు వ్యక్తికి దూరంగా ఉంటోంది. తాజాగా ఆదివారం ఎదురు పడిన వివాహితను ఆపి, తనతోనే ఉండాలంటూ బెదిరింపులకు దిగగా.. ఆమె ఎదురుతిరిగింది. దీంతో రాజు బ్లేడుతో రేణుక గొంతు కోశాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందుతున్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు రాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
వివాహేతర సంబంధం.. ప్రియురాలి నాలుక కోసిన ప్రియుడు!
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న మహిళ నాలుకను కోసేశాడు ఓ వ్యక్తి. కుషాయిగూడ ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ, శుభోదయ కాలనీలో నివాసం ఉంటున్న సుజాత దినసరి కూలీ. ఆమె భర్త చనిపోవడంతో అదే కాలనీకి చెందిన నవీన్ అనే వ్యక్తితో కలిసి ఆరు నెలలుగా సహజీవనం చేస్తోంది. కూలీ పనిచేసే ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 22న మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. మాటామాట పెరగడంతో ఆమె నాలుకను నవీన్ కోశాడు. ఇరుగుపొరుగు గమనించి అదే కాలనీలో ఉండే ఆమె కొడుకు డేవిడ్కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డేవిడ్ ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
‘ఇదే నా చివరి రాత్రి.. నువ్వు సుఖంగా ఉండు’
హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ యువకుడు ‘ఇదే నా చివరి రాత్రి’ అంటూ సెల్ ఫోన్లో తన స్నేహితులకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో దేవరకొండ బస్తీలో నివసించే సమీర్ (20) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా సమీర్ మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం స్నేహితులకు ‘ఇదే నా చివరి రాత్రి. నువ్వు సుఖంగా ఉండు’ అంటూ చాటింగ్ చేసి ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎలాంటి కారణాలు కూడా లేవని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మొబైల్ ఫోన్ చాటింగ్లను పోలీసులు పరిశీలించారు. -
హత్యా.. ఆత్మహత్యా?
కరీంనగర్, మానకొండూర్: డబ్బు తీసుకొని వెళ్లిన యువకుడు విగతజీవిగా కనిపించిన ఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ శివారులోని మానేరు డ్యాం సమీపంలో జరిగింది. పోలీసులు, మృతుడి తల్లి కథనం ప్రకారం.. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి సదాశివపల్లికి చెందిన జార్తి కనకలక్ష్మి భర్త సంపత్ గతంలో చనిపోయాడు.కనకలక్ష్మి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కొడుకు శ్రీనిధ్, కూతురును చదివిస్తోంది. శ్రీనిధ్ ఇటీవలే ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. శనివారం ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో దాచిన రూ.48,000 కనిపించలేదు.అలాగే తన తల్లి మొబైల్ నుంచి శ్రీనిధ్ తన అకౌంట్కు రూ.33 వేలు బదిలీ చేసుకున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసినా ఎత్తలేదు. సాయంత్రం స్విచ్చాఫ్ అయింది. రాత్రి 10.30 గంటలకు శ్రీనిధ్ స్నేహితుడు వికాస్ ఫోన్ చేసి అతని గురించి అడిగాడు. స్నేహితులను విచారించగా వారు కూడా చూడలేదని చెప్పారు.ఆదివారం శవమై..ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో శ్రీనిధ్ స్నేహితులు వీక్, ప్రణయ్ ఇంటికి వచ్చి అతని గురించి అడిగి వెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో బంధువు కౌటం సంపత్, కనకలక్ష్మికి ఫోన్ చేసి రామకృష్ణకాలనీ శివారులో శ్రీనిధ్ ఉరేసుకున్నట్లు ఉందని తెలిపా డు.బంధువులు ఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీనిధ్ చేతులు అదే తాడుతో కట్టి ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉరివేసి ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. -
అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు..!
నంద్యాల జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అహోబిలం గ్రామానికి చెందిన బేరింగుల హరిస్వామి, వెంకటలక్ష్మీల కూతురు మోహిత (30) ఇంటర్ చదువుతున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత పుల్లయ్య ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. నీవు లేకుంటే చచ్చిపోతా.. నీవే సర్వస్వం అంటూ మాయమాటలు చెప్పాడు. చివరకు ఆమె ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో అతను మంచోడు కాదు, అందులోనూ కులాలు వేరని తల్లిదండ్రులు వారించారు. దీంతో ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు సాఫీగా సాగిన సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఓ సంవత్సరం నుంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన పుల్లయ్య అనుచరుడుగా ఉంటున్న ఓ గిరిజన యువకుడి భార్యపై మోజు పడ్డాడు. ఆమెను అతనికి దూరం చేసి అనధికారికంగా విడాకులు ఇప్పించాడు. ఆమెను హరినగరం గ్రామంలో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. అయినా మనసు సంపుకుని సంసారం చేస్తున్న మోహితకు ఈ మధ్య భర్తతోపాటు ఇంట్లో ఉన్న వారి వేధింపులు అధికమవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ మధ్యనే పుట్టింటికి వెళ్లి తన తల్లితో అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు.. నాకు బతకాలని లేదని చెప్పింది. అయితే అతను అధికార పార్టీకి చెందిన వాడు, మనం ఏమీ చేయలేము.. కేసు పెడదామన్నా మన మీదనే దాడి చేస్తారు. ఏదో విధంగా కొన్ని రోజులు సర్దుకుపోమని చెప్పి పంపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ చూస్తుండగానే విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. నా కూతురు మృతిపై అనుమానాలుపుల్లయ్య నా కుమార్తెకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నా కూతురుపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ మధ్య మరో మహిళతో కాపురం చేస్తూ నా కూతురును కట్నం తేలదని వేధిస్తున్నాడు. ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానని గొడవ చేశాడు. అనుకోకుండా మందు తాగిందని, ఆసుపత్రికి తీసుకు పోతున్నామని చెప్పారు. అంతలోనే మృతి చెందిందని చెబుతున్నారు. ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించి నా కుమార్తె మృతికి కారణమైన ప్రతి ఒక్కరినీ శిక్షించాలి.– బేరింగుల హరిస్వామి, మృతురాలి తండ్రి -
నీ ప్రైవేటు వీడియోలు నా వద్ద ఉన్నాయి..!
కోలారు: నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇట్టే నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. వారి వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇదే మాదిరిగా.. నీ ప్రైవేటు వీడియోలు నా వద్ద ఉన్నాయి, వాటిని ఇంటర్నెట్లో పెడతానని ఓ సైబర్ నేరగాడు బెదిరిస్తుండగా, భయాందోళనకు గురైన మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన కోలారు తాలూకాలోని ఛత్రకోడిహళ్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వివాహిత (28) మృతురాలు. తాలూకాలోని బెగ్లిబెణచేనహళ్లికి యువకుడు శ్రీకాంత్ ఆమెకు పరిచయస్తుడు. సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమె ఫోటోలను సేకరించి అశ్లీలంగా మార్చాడు. వాటిని ఆమెకు చూపించి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, వేధించి ఇప్పటికే లక్షల రూపాయలు వసూలు చేశాడు. భయాందోళనకు గురై.. కొన్నిరోజులుగా మరింతగా బెదిరించి మాంగల్యం చైను, బంగారు ఆభరణాలు కలిపి మొత్తం రూ. 30 నుంచి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. శ్రీకాంత్పై మరో ఇద్దరు మహిళలను ఇదే విధంగా బెదిరించి దోచుకున్నట్లు ఆపణలు ఉన్నాయి. శ్రీకాంత్ వల్ల తన కాపురం బజారుపాలై పరువు పోతుందని ఆమె విరక్తి చెంది ఇంట్లో గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శనివారం ఉదయం కోలారు రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి పరిశీలన చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు. -
అర్ధరాత్రి ఆగిన ఊపిరి
సాక్షి, బళ్లారి, రాయచూరు రూరల్: బంధువుకు అనారోగ్యంగా ఉండడంతో ఉదయమే ఊరి నుంచి మరో ఊరికి వచ్చారు. అర్ధరాత్రి తిరిగి బయల్దేరారు. కొంతసేపు ఉంటే క్షేమంగా చేరేవారే. కానీ మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చి పొట్టనబెట్టుకుంది. ట్రాక్స్ క్రూయిజర్ను లారీ ఢీకొగా, 5 మంది క్షణాల్లోనే చనిపోయారు. కలబుర్గి జిల్లా చిత్తాపూర్ తాలూకా లాడ్లాపూర్ సమీపంలో జాతీయ రహదారి– 50 పై జరిగింది. తుక్కయిన క్రూయిజర్ చిత్తాపూర్ తాలూకా వాడి పట్టణం దగ్గర ఇంగళిగి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 5 మంది క్రూయిజర్లో యాదగిరికి వచ్చి శుక్రవారం అర్ధరాత్రి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన తమిళనాడు లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఆ ధాటికి క్రూయిజర్ గుర్తుపట్టలేనంతగా తుక్కయింది. అందులోని మహ్మద్ హుస్సేన్ (60), ఫాతిమా (40), రసూల్బీ (40), మహబూబ్ (34), టోలూసాబ్ కాశ్వర్ (27) అనే అందరూ మరణించారు. మృతదేహాలు వాహనంలో చిక్కుకుపోయాయి. ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, స్థానికులతో కలిసి బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవరు కోసం గాలిస్తున్నారు. ఐదుమంది మరణంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
మహిళతో అసభ్యంగా ప్రవర్తించి..సీసీ కెమెరాల్లో చిక్కి
హైదరాబాద్: రోడ్డుపై వెళుతున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని నార్సింగి పోలీసులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 14న అలకాపూర్ టౌన్షిప్లో ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నార్సింగి పోలీసులు.. తీవ్రంగా పరిగణించి బాధితురాలి నుంచి 19న ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. శనివారం పుప్పాలగూడలో ఉంటున్న నిందితుడు నాగరాజు(26)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిందితుడు పుప్పాలగూడలో స్థిరపడ్డాడని ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. -
ఆన్లైన్లో రూమ్ను బుక్ చేసుకుని..!
శ్రీకాకుళం క్రైమ్: ఆ యువతి మూర్ఛ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతోంది. దాదాపు రూ.10 లక్షలు సమకూరితే గానీ ఆరోగ్యం మెరుగవ్వదని తెలుసుకుంది. తండ్రికి స్థోమత లేకపోవడం, కుటుంబానికి భారమనుకుందో ఏమో.. స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ ద్వారా తన బాధ పంచుకుంది. శ్రీకాకుళం నగరానికి వచ్చి ఓ హోటల్లో ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రెండో పట్టణ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుణుపూర్కు చెందిన అభిమన్యు బెహరాకు ఇద్దరు కుమారులు, కుమార్తె కసూర్తి కుమారి బెహరా (23) ఉన్నారు. నిరుపేద కుటుంబం. కస్తూరికి చిన్నప్పటి నుంచీ మూర్ఛవ్యాధి ఉండటంతో ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. పూర్తిగా నయం కావాలంటే రూ. లక్షలతో కూడుకున్న పని మదనపడేది. స్నేహితురాలి ఊరికని చెప్పి.. ఈ క్రమంలో గురువారం తన స్నేహితురాలి ఊరికి వెళ్తానని తండ్రితో చెప్పింది. ఉదయం 10 గంటలకు గుణుపూర్లో తండ్రి రైలు ఎక్కించారు. కస్తూరి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లకుండా అప్పటికే ఆన్లైన్లో శ్రీకాకుళం విజేత హోటల్లోని రూమ్ను బుక్ చేసుకుని ఆమదాలవలసలో దిగి నగరంలోని హోటల్కు చేరింది. గురువారం మధ్యా హ్నం ఒంటి గంటకు తన స్నేహితురాలికి వాట్సాప్ మెసేజ్ చేసింది. తాను చనిపోతున్నానని, తన అనారోగ్యానికి తండ్రి రూ.10 లక్షలు ఖర్చు పెట్టడం సాధ్యం కాదన్నది ఆ మెసేజ్ సారాంశం. అదే విషయాన్ని కస్తూరి స్నేహితురాలు వెంటనే కస్తూరి తండ్రికి ఫోన్ చేసి చెప్పి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. అప్పటి నుంచి తండ్రి కస్తూరికి పలుమార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో స్థానికంగా ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళంలో లొకేషన్ చూపిండంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈలోగా అక్కడి వారు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో పట్టణ పోలీసులకు ఫోన్ చేయడంతో హోటల్లో ఫ్యాన్కు ఉరేసుకున్న సమాచారాన్ని చెప్పారు. హుటాహుటిన తల్లిదండ్రులు చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. -
మాసబ్ట్యాంక్లో దారుణం.. ప్రముఖ న్యాయవాది మృతి
హైదరాబాద్: మాసబ్ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కామర్స్ లెక్చరర్ కామ క్రీడ.. భార్యకు రెడ్హ్యాండెడ్గా దొరికి..
సాక్షి, కృష్ణా: కామర్స్ పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్.. కామ వాంఛతో మితిమీరి ప్రవర్తించాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని ప్లాన్ చేశాడు. అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో రెడ్హ్యాండెడ్గా భార్యకు దొరికిపోయాడు. దీంతో, అందరి ముందే భర్తను భార్య చితకబాదింది. యువతిని బ్లాక్మొయిల్ చేసిందుకు పోలీసులు కామర్స్ లెక్చరర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామర్స్ లెక్చరర్ జాషువా గతంలో మచిలీపట్నంలోని ఓ మహిళా కాలేజీలో లెక్చరర్గా పనిచేసి ప్రస్తుతం అవనిగడ్డలోని ప్రభుత్వ కళాశాలలో విధుల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఓ యువతి.. కామర్స్ లెక్చరర్ జాషువాను ఆశ్రయించింది. దీంతో, ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి యువతిని లోబరచుకోవాలని జాషువా ప్లాన్ చేశాడు. యువతిని మచిలీపట్నంలోని తమ రూమ్కు రావాలని కోరాడు.జాషువా వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఖంగుతిన్న యువతి.. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ను ఆశ్రయించింది. అనంతరం, జాషువా నిజస్వరూపాన్ని లెక్చరర్ భార్యకు సమాచారమిచ్చింది. దీంతో, రంగంలోకి దిగిన జాషువా భార్య.. లెక్చరర్ బాగోతాన్ని బట్ట బయలు చేసింది. ప్లాన్ ప్రకారం.. బాధితురాలితో రూమ్లో జాషువా ఉండగా.. అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదింది. అందరి ముందే తిక్క కుదిర్చింది. ఇక, బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు జాషువాను అదుపులోకి తీసుకున్నారు. -
బతికి ఉంటే ఇబ్బంది పెడతాడని.. భర్తను చంపేసింది
హైదరాబాద్: కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న భార్య ఇంటికి పిల్లలను చూడటానికి వచ్చిన భర్తను తమ్ముడు, అతని స్నేహితుడితో కలిసి భార్య విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వికారాబాద్ జిల్లా హజీపూర్ గ్రామానికి చెందిన గురు వెంకటేశ్ (31) బీఎన్రెడ్డినగర్లో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్.. పిల్లలను చూసేందుకు రైతు బజార్ సమీపంలోని డబుల్బెడ్రూం నివాసాల్లో భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు.భర్తను చూసిన స్వప్న ఇక్కడికెందుకు వస్తున్నావు అంటూ తమ్ముడు పాండుతో కలిసి మూడో అంతస్తు నుండి కిందకు తీసుకువస్తూ దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాండు తన స్నేహితుడు జగదీష్ను పిలిపించుకుని ముగ్గురూ కలిసి మూకుమ్మడిగా దాడిచేశారు. స్పృహ తప్పి పడిపోవడంతో..బతికి ఉంటే మళ్లీ ఇబ్బంది పెడతాడని దాడి చేసి తీవ్రంగా కొట్టి గ్రౌండ్ఫ్లోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు గమనించారు. మృతుడి సోదరుడు గురు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతుని భార్య స్వప్న, ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్లపై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు గల కారణాలను రాబట్టేందుకు విచారిస్తున్నట్లు తెలిసింది. -
పోలీసుల అలసత్వమే ప్రాణం తీసిందా?
యువ సింగర్ ఇందర్ కౌర్ హఠాన్మరణం పంజాబ్ను ఉలిక్కి పడేలా చేసింది. వారం కిందట కిడ్నాప్కు గురైన ఆమె.. నిన్న కాలువలో శవమై కనిపించారు. దీంతో అక్కడి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాల్ని వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు.యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్(29).. పంజాబీ సింగింగ్ సెన్సేషన్. ఈ నెల 13న సాయంత్రం లూథియానాలోని ఇంటి నుంచి కారులో బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల అంతటా జల్లెడ పట్టారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం నీలో కాలువలో ఆమె శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కబురు పంపి.. మృతదేహాన్ని సమ్రాలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. పోస్ట్మార్టం పూర్తయ్యాకే వివరాలు చెబుతామని అధికారులు అంటున్నారు. ఈలోపు ఇందర్ కుటుంబం సంచలన ఆరోపణలకు దిగింది.మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన గాయకుడు సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ మృతికి కారణమంటూ ఆమె సోదరుడు జోతింధర్ సింగ్ చెబుతున్నాడు. మూడేళ్ల కిందట వీళ్లకు పరిచయమైంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు సుఖా. అయితే అప్పటికే కెనడాలో అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని జోతింధర్ అంటున్నాడు. తమ సోదరి కనిపించకుండా పోయిన నాడే పోలీసులకు ఈ విషయం చెప్పామని అంటున్నాడతను. సుఖాతో పాటు అతని స్నేహితుడు కరమ్జిత్ సింగ్ కూడా ఈ నేరంలో భాగమయ్యాడు. వాళ్లు తుపాకీ చూపించి ఇందర్ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతే ఆమె శవమై కనిపించిందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం.పోలీసుల అలసత్వమేనా?ఇందర్ కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు, తండ్రి మే 13వ తేదీ రాత్రే లూథియానాలోని జమల్పూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు వెంటనే స్పందించలేదన్నది ఇందర్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఉన్నతాధికారి లేడంటూ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. పైగా అనుమానితుడిగా సింగర్ సుఖా పేరు చెప్పినా.. ఆ కోణంలో దర్యాప్తు జరపలేదు.ఇందర్ తిరస్కరించాక సుఖా అవమానంగా ఫీలై కెనడాకు వెళ్లిపోయాడు. అయితే పగ పెంచుకుని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఇందర్, ఆమె కుటుంబం ఊహించలేదు. కెనడా నుంచి నేపాల్ మీదుగా భారత్కు వచ్చిన సుఖా.. నేరం చేశాక తిరిగి అదే దారిలో వెళ్లిపోయాడు. పోలీసులు తక్షణ ఫిర్యాదు స్వీకరించినా.. సకాలంలో స్పందించినా.. ఇందర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తుడు చిక్కేవాడేమోనని అని బాధిత కుటుంబం వాపోతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విచారణకు ఆదేశిస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత విబేధాలతో పాటు గ్యాంగ్స్టర్ మాఫియా లింకుల కోణంలోనూ ఈ కేసు విచారణ జరుపుతామని ప్రకటించింది.ఫేమస్ అవుతున్న టైంలో.. పంజాబీ సంగీత ప్రపంచంలో ఇందర్ కౌర్ రైజింగ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోక్ మ్యూజిక్కి దగ్గరగా ఉండే స్టైల్తో పాటు పాప్ కల్చర్కి కూడా అనుసంధానం చేసేది. లైవ్ పెర్ఫార్మెన్స్లు, సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల ఆమెకు మంచి ఫ్యాన్బేస్ ఏర్పడింది. అలా అభిమానులు ఆమెను ఫోక్ క్వీన్గా పిలుచుకునేవారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె హఠాత్తుగా ఇలా చనిపోవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.పంజాబ్లోనే ఎందుకిలా?ఇందర్ కౌర్ మరణం పంజాబ్ గ్లామర్ఫీల్డ్ను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. వ్యక్తిగత విబేధాలు మాత్రమే కాదు.. అక్కడి గాయకులు, సెలబ్రిటీలు తరచుగా హింసకు గురవుతున్నారు. సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఈ తరహా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణాలను పరిశీలిస్తే..పంజాబ్లో సింగర్లు కేవలం వినోదకారులు మాత్రమే కాదు.. సామాజిక, రాజకీయ, కుల చిహ్నాలుగా ఉంటున్నారు. వీటికి తోడు పంజాబ్లో సంఘటిత నేరజాలం వినోద రంగంతో మిళితమై ఉంది. అంటే.. కొంతమంది గాయకుల పాటల్లో గన్స్, రివెంజ్, పవర్ పాలిటిక్స్ వంటి అంశాలు ఉండటం వల్ల వారు గ్యాంగ్స్టర్ కల్చర్తో అనుసంధానమైపోతున్నారు. అలా దాడులకు గురవుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. -
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్పురా కిషన్బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బిడ్డకు పాలు పట్టాల్సిన తల్లి యాసిడ్ తాగించి..
జైపూర్: బిడ్డలకు ఏ కష్టం వచ్చినా కన్న పేగు తల్లడిల్లిపోతుంది. తన బిడ్డకు చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుటుంంది. కానీ, ఓ కన్నతల్లి మాత్రం కర్కశత్వం ప్రదర్శించింది. బిడ్డను ఎత్తుకోవాల్సిన చేతులతోనే క్రూరంగా వ్యవహరించింది. ఆడుకుంటూ ఉండాల్సిన 8 నెలల పాప.. ఆ తల్లి కారణంగా ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతోంది. బిడ్డకు పాలు పట్టాల్సిన తల్లి యాసిడ్ తాగించింది. దీంతో నోరు, ముక్కు నుంచి రక్తం కారుతూ వెంటిలేటర్పై చిన్నారి విలవిల్లాడుతోంది. ఏ పాపమూ తెలియని ఆ బిడ్డ బాధను చూసి బంధువులు తీవ్ర మనోవేదకు గురయ్యారు. రాజస్థాన్లోని ఖైర్తల్-తిజారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాల కోసం పోరాడుతోంది. ఆమె తల్లి యాసిడ్ తాగించిందని పోలీసులు మంగళవారం తెలిపారు. నోరు, ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్న ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఆ పసికందు వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.ఈ ఘటన భివాడి ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. సోమవారం ఘటన జరిగిన సమయంలో చిన్నారి తండ్రి మోహిత్ పనికి వెళ్లాడు. ఇంట్లో చిన్నారి తల్లితో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో చిన్నారికి మహిళ బలవంతంగా యాసిడ్ తాగించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సోమవారం సాయంత్రం చిన్నారి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను భివాడిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేద్ ప్రకాశ్ మంగళవారం మాట్లాడుతూ.. ఆస్పత్రి నుంచి చిన్నారి గురించి సమాచారం అందిందని తెలిపారు. తర్వాత తాను ఆస్పత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు.“తన భార్య కుమార్తెకు బలవంతంగా యాసిడ్ తాగించిందని తండ్రి ఆరోపించాడు. చిన్నారి వెంటిలేటర్పై ఉంది” అని ఆయన తెలిపారు. లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
భర్త.. రెండో భర్త.. ఇద్దరు ప్రియులు!
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఏదో ఒక మూల రోజుకో దారుణం జరుగుతోంది. ప్రేమ, మోసం, హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం.. ఇలా ఒక్కో తీరు నేరాలు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్లో బయటపడ్డ ‘శాంతిగిరి కేసు’ ట్విస్టుల మీద ట్విస్టులను ఇచ్చింది. ఈ తరహా కేసుల్లోనే ఓ కొత్తదనం చూపించింది. సురేంద్రనగర్ జిల్లాలో శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలోనే అతను దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసును చేధించిన పోలీసులు.. నిందితుల నుంచి విస్తుపోయే వివరాలను సేకరించారు. అసలేం జరిగిందంటే.. జాగృతి గోస్వామి అనే మహిళ సుఖ్దేవ్గిరి గోస్వామిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొంతకాలానికి ఆమె తన భర్త పెద్ద అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలి.. అతనితో పారిపోయి మరో గ్రామంలో కొత్త జీవితం మొదలుపెట్టింది. అయితే అక్కడా ఆమె బుద్ధి వక్రదారి పట్టింది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్ పని కోసం తరచూ బయట ఉండేవాడు. ఈ సమయంలో కాంతిలాల్ అలియాస్ భారత్ సబారియా అనే వ్యక్తితో జాగృతి సంబంధం పెట్టుకుంది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి లేని సమయంలో ఇద్దరూ కలుసుకునేవారు. అయితే ఏదో ఒకరోజు తమ విషయం తెలుస్తుందని.. శాంతిగిరిని అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూనిస్ అనే వ్యక్తికి 25,000 సుపారీ ఇచ్చారు. అయితే యూనిస్ ‘భలే’ మోసం చేశాడు. నిద్రపోతున్న శాంతిగిరిని ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపాడు. అయితే మరుసటి రోజు ఉదయం భర్త బతికే ఉండడంతో జాగృతి షాక్కు గురైంది. తీరా చూస్తే యూనిస్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో జాగృతి, కాంతిలాల్ స్వయంగా హత్యకు ప్లాన్ చేశారు. నిద్రిస్తున్న శాంతిగిరి గొంతును కాంతిలాల్ నులిమి చంపగా.. జాగృతి దుప్పటి తోసి శబ్దం రాకుండా చేసింది. ఆపై శవాన్ని గదిలో దాచారు. ఆ తర్వాత దీపక్ అలియాస్ మున్నా అనే వ్యక్తి సహాయంతో కారులో తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు కథ అల్లే ప్రయత్నం చేశారు. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటి ఊరికి వెళ్లాడని.. ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించారు. అలా ఎనిమిది నెలలు గడిచాయి. ఈ గ్యాప్లో కాంతిలాల్కు తెలియకుండా దీపక్తో ఆమె వ్యవహారం నడిపించింది. అయితే.. శాంతిగిరి బంధవుల ఎంట్రీతో సీన్ మారింది. జాగృతి ప్రవర్తనపై అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు వాళ్లు. అలా ఈ మిస్సింగ్ మిస్టరీ కేసు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్కు చేరింది. రెండు నెలల దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందం.. జాగృతి, కాంతిలాల్ను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు చేపట్టింది. -
మొయినాబాద్ ఫౌంహౌస్లో దారుణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం తాండూరులో అదృశ్యమైన ఇద్దరు మహిళలుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను తాండూరులో కిడ్నాప్ చేసిన దుండగులు.. దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మహిళల నుంచి అప్పులు తీసుకున్నవాళ్లే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
బండి భగీరథ్కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: మైనర్పై లైంగిక వేధింపుల కేసులో బండీ భగీరథ్కు మరో షాక్ తగిలింది. భగీరథ్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టులో మధ్యంతర ఉపశమనం దక్కని నేపథ్యంలో.. శనివారం అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. మైనర్ బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు (పోక్సో చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. ఈ క్రమంలో.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్పై తుది తీర్పు వెలువడనుంది. ఈలోపు..ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదు బృందాలు భగీరథ్ కోసం ఢిల్లీ, కరీంనగర్తో పాటు హైదరాబాద్ను జల్లెడపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నాం సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటు పేట్ బషీర్బాద్ పీఎస్ వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. దీంతో ఇవాళో రేపో భగీరథ్ను అరెస్ట్ చేస్తారని.. తనంతట తానే లొంగిపోతాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.సెన్సిటివ్ కేసు.. ఎలాపడితే అలా కుదరదు: సీఎం రేవంత్ఈ కేసు దర్యాప్తు విషయంలో వస్తున్న విమర్శలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. చర్యలు తీసుకునే ఉద్దేశమే లేకపోతే పోక్సో కేసు ఎందుకు పెడతామని విమర్శకులను ఆయన ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన వే2న్యూస్ కాంక్లేవ్–2026లో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ మరుసటిరోజే విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11న సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి భగీరథ్ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని నోటీసులిచ్చారు. ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి భగీరథ్ తండ్రికి, బీఆర్ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్కి, బండి భగీరథ్ తండ్రికి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు. ఆ అమ్మాయికి రెండు బర్త్ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో ఆ కేంద్ర మంత్రి(సహాయ) తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి అని సీఎం రేవంత్ సూచించారు. -
ప్రేమ పేరుతో నర్సును గర్భవతిని చేసిన డాక్టర్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మాయమాటలు చెప్పి, శారీరకంగా లొంగదీసుకుని తనను మోసగించాడని ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు నగరానికి చెందిన వైద్యుడిపై మహిళా పోలీసు స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. వివరాల ప్రకారం నూజివీడు ప్రాంతానికి చెందిన యువతి తొమ్మిదేళ్లుగా నగరంలోని వేర్వేరు హాస్పిటల్స్లో నర్సుగా పనిచేస్తోంది. 2018లో ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే సమయంలో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పామర్తి భాస్కర్ ప్రకాష్ పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఆ యువతిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలవగా రెండుసార్లు గర్భం దాల్చింది. ప్రకాష్ తనకు బలవంతంగా గర్భస్రావం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని నిలదీయగా 2024 ఏప్రిల్లో ఓ ఇంట్లో తన మెడలో తాళి కట్టి దండలు మార్చుకున్నట్లు పేర్కొంది. అప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను మూడవ నెల గర్భిణీ అని, కొన్ని రోజులుగా ప్రకాష్ తన వద్దకు రాకపోవడంతో విచారణ చేయగా, అతనికి ముందే పెళ్లి అయిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసినట్లు పేర్కొంది. ఈ విషయమై డాక్టర్ భాస్కర్ ప్రకాష్ను నిలదీయగా, అతని భార్య, తల్లి తనను బెదిరించారని తెలిపింది. బాధితురాలు ఎస్సీ కావడంతో డాక్టర్ భాస్కర్ ప్రకాష్ అతని భార్య, తల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్లపై మహిళా పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదు చేశారు. -
బోరుబావిలో పడ్డ చిన్నారి.. రక్షించబోయి తాత మృతి
సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడగా.. రక్షించేందుకు వెళ్లి అతని తాత మృత్యువాత పడ్డాడు. శనివారం ఉదయం యాదగిరిపల్లిలో జరిగిందీ ఘటన.. శనివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద ఉన్న మామిడి చెట్టుకు నీరు పెట్టేందుకు మనువడు, మనవరాలుతో వెంకన్న(50) వెళ్లాడు. మనవడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. అది గమనించిన తాత వెంకన్న రక్షించేందుకు ప్రయత్నించగా.. బోరు అంచులో ఉన్న మట్టి కుంగిపోయి అదే గుంతలో తలకిందులుగా పడిపోయాడు. వెంటనే మనవరాలు స్థానికులను అప్రమత్తం చేసింది. దీంతో తాళ్ల సాయంతో సైదులు అనే యువకుడు లోపలికి దిగి వాళ్లను బయటకు తీశాడు. ఈలోపు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే బోరుబావి గుంతలో ఊపిరి ఆడక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే వెంకన్న కన్నుమూశాడు. చిన్నారి పరిస్థితి బాగానే ఉందని.. ప్రస్తుతం చికిత్స అందుతుందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అద్దె అడిగితే గొంతు కోశాడు
సూర్యాపేట జిల్లా: అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధురి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
పోక్సో కేసులో కానిస్టేబుల్కు 31 ఏళ్ల జైలు
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కానిస్టేబుల్కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నేరం రుజువు కావడంతో నిందితుడు వరదరాజ్ సుదేశ్కు 31 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అదనంగా బాధిత బాలికకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. 2020లో డీసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వరదరాజ్ సుదేశ్ బోయిన్ నపల్లి తాడుబండ్ ప్రాంతంలో నివసించే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగింది. ఆరు సంవత్సరాల అనంతరం నేరం నిరూపణ కావడంతో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
బతికి ఉన్న భర్తకు రిప్ (RIP)..!
కర్ణాటక: నేటి డిజిటల్ యుగంలో కుటుంబ సంబంధాలు, దంపతుల మధ్య అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. చిన్న కారణాలకే విడిపోతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే మాదిరిగా ఓ భార్య.. భర్తను వదిలేసి అతని ఫోటో మీద రెస్ట్ ఇన్ పీస్ (ఆర్ఐపీ) అని రాసింది. వివరాలు.. 9 ఏళ్ల కిందట ఇక్కడి సాగానహళ్ళిలోని అనూజకు శిడ్లఘట్ట తాలూకా దొడ్డతేకనహళ్ళి కుమార్తో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన అనూజా పల్లెలో అత్తమామలను వదిలి బెంగళూరు దేవనహళ్ళిలో భర్తతో బాడుగ ఇంట్లో కాపురం ఉంటున్నారు. పుట్టింటికి వచ్చేసి పోస్టింగులు భర్త కారు డ్రైవర్ కాగా, భార్య విలాసవంత జీవనం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. కొన్నిరోజుల కిందట అనూజ భర్తను వదిలేసి పుట్టిల్లయిన సాగానహళ్ళికు వచ్చింది. భర్త ఫోను చేసి కాపురానికి రావాలన్నా అనూజ తిరస్కరించింది. పైగా సోషల్ మీడియాలో.. భర్త ఫోటో పెట్టి రిప్ అని రాసింది. దీంతో కోద్రిక్తుడైన కుమార్ బంధుమిత్రులతో వచ్చి భార్యను నిలదీశాడు. అనూజ, ఆమె అన్న కలిసి కారంపొడి చల్లి చితకబాదడంతో కుమార్, అతని బంధువుల గాయపడ్డారు. బాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు పరారయ్యారు. -
భార్య ముందు అవమానించారని..
ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. భార్య ముందు తనను అవమానించారనే కోపంతో ఓ వ్యక్తి కన్న తల్లిదండ్రులనే రోకలితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన.. శుక్రవారం మధ్యాహ్నం ధూలే జిల్లాలోని శిర్పూర్లోని మహావీర్ సొసైటీలో జరిగింది. తమ కుమార్తె పెళ్లి ముగించుకుని తల్లిదండ్రులు అదే రోజు ఇంటికి తిరిగి రాగా.. ఇంటికి వచ్చిన తర్వాత వారు ఏదో కారణంతో తన కుమారుడిని మందలించడమే కాకుండా.. కోడలి ముందే అతడిని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు.. ఇంట్లో ఉన్న రోకలిని తీసుకుని తన తల్లిదండ్రుల తలపై బలంగా బాదాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి రంజుదేవి మహతో, తండ్రి ఇందారామ్ మహతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు చందన్ ఇందారామ్ మహతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. హత్య చేసి..
విశాఖ: అక్కయ్యపాలెంలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దారుణానికి తెగబడ్డారు. పార్వతి (50) అనే మహిళ కాళ్లు, చేతులు కట్టేసి, హత్య చేశారు. ఆమె ఇంట్లోని లాకర్ను బద్దలుకొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు.ఈ ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెం శ్రీనివాస్నగర్, పుట్ట బంగారమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. బంగారం కోసమే ఈ హత్య జరిగి ఉంటుందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. -
భార్యపై అనుమానం.. గొడ్డలితో కాలు నరికిన భర్త
సంగారెడ్డి: భార్య కాలును నరికిన భర్తను పోలీసులు జైలుకు పంపించారు. బుధవారం కేసుకు సంబంధించిన వివరాలు పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ వెల్లడించారు. చౌటకూర్ మండలం గంగోజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి వీరమణి, దుర్గయ్య భార్యాభర్తలు. వీరిద్దరూ బతుకు దెరువు కోసం సంగారెడ్డిలోని కొత్ల చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానంతో తరచూ దుర్గయ్య గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆవేశంతో దుర్గయ్య ఇంట్లో ఉన్న భార్య కుడికాలును గొడ్డలితో నరికాడు. అలాగే కుడి చేతిపై కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన వీరమణిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారి కుమారుడు హరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని బుధవారం తద్ధాన్పల్లి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు. -
సౌదీలో పునబాక మహిళ ఆత్మహత్య
తిరుపతి: మండలంలోని పునబాక గ్రామానికి చెందిన ఉయ్యాల భాస్కరయ్య, తయారమ్మ దంపతుల కుమార్తె కోనేటి మమత(36) బుధవారం సౌదీలోని జుబేల్ ప్రాంతంలో ఉంటూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో తిరుపతికి చెందిన కోనేటి చెంగయ్య (విశ్రాంత ఎస్ఐ) చిన్న కుమారుడు కోనేటి కృష్ణకి మమతను ఇచ్చి వివాహం చేశారు. వీరు శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్లో నివాసం ఉండేవారు.వీరికి కోనేటి రూపేష్ కోనేటి లోహిత్ కుమారులు ఉన్నారు. 2012లో కృష్ణకి సౌదీలోని సాట్రాప్ పెట్రో కెమికల్ కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం రావడంతో భార్యభర్తలిద్దరు సౌదీలో నివాసం ఉంటున్నారు. తిరుపతిలో ఉన్న కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి వివాదం నెలకొనడంతో మమత మనస్తాపానికి గురై భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చి తమకు అప్పగించేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
నా భర్త సరైనోడు కాదు..!
బనశంకరి: బెంగళూరులో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సాధనాశెట్టి.. బ్లాక్మెయిల్ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో సాధనాశెట్టిని కార్తీక్పుతా లైంగికంగా వేధించాడని అతని భార్య హర్షిత జయనగర పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడం విశేషం. అసలు దోషి తన భర్తే అని.. అక్రమ సంబంధాలు దాచి పెట్టేందుకు సాధనాశెట్టిపై ఫిర్యాదు చేశాడని ఆరోపించింది. వివరాలు.. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సాధనాశెట్టిని వ్యాపార ప్రచారం కోసం మేకప్ క్లినిక్ యజమాని కార్తీక్పుతా కలిశాడు.తొలుత వీరి మధ్య ప్రారంభమైన స్నేహం.. ప్రేమకు దారి తీసింది. అనేకచోట్ల ఇద్దరూ తిరిగారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లైంగికంగా వాడుకున్నాడంటూ సాధనాశెట్టి ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసింది. గత ఏడాది హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో కార్తీక్పుతా.. సాధనాశెట్టి మొబైల్ చోరీకి పాల్పడ్డాడు. అంతేకాక లైంగిక సంబంధం దాచిపెట్టడానికి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు పెట్టుకుని హనీట్రాప్కు పాల్పడుతోందని ఆరోపిస్తూ జయనగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాజాగా తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి సాధనాశెట్టిపై కార్తీక్పుతా ఫిర్యాదు చేశాడని భార్య హర్షిత చెబుతోంది. కార్తీక్పుతా బిజినెస్మెన్ కాదు. కాస్మోటిక్ మార్కెటింగ్ చేసేవాడు. యువతి ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవని హనీట్రాప్ అంటూ ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడని భార్య చెబుతోంది. -
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో..
ఢిల్లీ: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. స్లీపర్ బస్సులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. బస్సులో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలు పీతంపురలోని మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. మే 11వ తేదీ రాత్రి సదరు మహిళ పని ముగించుకుని ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో సరస్వతి విహార్లోని బస్టాప్ వద్ద ఓ స్లీపర్ బస్సు ఆగింది. బస్సు తలుపు వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం ఎంత అని అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.అనంతరం నిందితులు బస్సును నాంగ్లోయ్ వైపు నడిపారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. బస్సును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుగుతోందని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. -
వివాహేతర సంబంధం.. భర్త, మామను హత్య చేసిన కోడలు..!
కర్ణాటక: దేశ రక్షణ కోసం పోరాడే జవాన్, మాజీ జవాన్కు సొంత ఇంట్లోనే భద్రత లేకుండా పోయింది. మూడు రోజుల క్రితం క్రిష్ణగిరి సమీపంలో కాలిన స్థితిలో బయటపడిన మృతదేహాల కేసును పోలీసులు ఛేదించారు. తండ్రీకుమారుడు హత్యకు గురికాగా, కోడలి అక్రమ సంబంధమే ఇంత ఘోరానికి కారణమని తేల్చారు. ఉలిక్కిపడిన బెల్లారంపల్లి వెప్పాలంపట్టి సమీపంలో కాలిన స్థితిలో ఇద్దరి మృతదేహాలున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సేలం డీఐజీ సంతోష్, క్రిష్ణగిరి ఎస్పీ తంగదురైలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తులు క్రిష్ణగిరి సమీపంలోని బెల్లారంపల్లి గ్రామానికి చెందిన సైనికుడు మాదేశ్ (43), అతని తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప (63)గా గుర్తించారు. భర్త జమ్మూకశ్మీర్లో ఉంటే..మాదేష్ జమ్మూకశ్మీర్లో విధుల్లో ఉండేవాడు. ఈ క్రమంలో అతని భార్య భానుప్రియ (30)పై పోలీసులకు అనుమానం ఏర్పడింది. ఆమెను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలివ్వడంతో.. పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో అసలు గుట్టును భానుప్రియ విప్పింది. బెల్లారంపల్లివాసి, జవాన్ మాదేశ్ (43) జమ్మూకశ్మీర్లో పని చేసేవాడు. ఈ క్రమంలో భానుప్రియకు స్థానికంగా ఉండే వ్యాన్ డ్రైవర్ పూవరసన్ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి తతంగమంతా గ్రామస్థులకు తెలిసింది. భర్త మాదేశ్కు కూడా విషయం తెలియడంతో.. ఆయన ఆగ్రహంతో ఈ నెల 10వ తేదీన హఠాత్తుగా ఊరికి వచ్చి భార్యను నిలదీసి దండించాడు. భానుప్రియ ఈ సంగతిని ప్రియునికి చెప్పింది. పథకం ప్రకారం ప్రియుడు పూవరసన్ ఆ రోజు రాత్రి కత్తితో భానుప్రియ ఇంటికెళ్లి మాదేశ్పై దాడి చేశాడు. మాదేశ్ కేకలు వేయడంతో తండ్రి, మాజీ జవాన్ సెల్లప్ప బయటకొచ్చాడు. వారిద్దరిపై భానుప్రియ, ప్రియుడు కత్తులతో విరుచుకుపడి హత్య చేశారు. శవాలను వ్యాన్లో తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నిందితులు వివరించారు. ఈ కేసు చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. -
టిక్.. టిక్.. టిక్.. సినీ ఫక్కీలో టైమ్ బాంబు నిర్వీర్యం
బాంబు ఉందని సమాచారం అందుకోవడం.. ముసుగులేసుకుని స్క్వాడ్లు అక్కడికి చేరుకోవడం.. ఏ వైర్ తెంపాలో అనే ఉత్కంఠ చివరిదాకా.. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. మహారాష్ట్ర పుణేలో ఈ తరహాలోనే ఓ ఘటన జరిగింది. ఓ ఆస్పత్రి ఆవరణలో లైవ్ బాంబు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.పుణే సిటీలోని హడప్సర్ కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం బాంబు బయటపడింది. తొలుత అనుమానాస్పద వస్తువుగా భావించినప్పటికీ.. ఆ తర్వాత అది టైమర్ బాంబ్ అని తేలడంతో అందరి గుండెలు గుభేల్మన్నాయ్. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్ను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసుపత్రి పరిసరాలను ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ పరిణామాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే.. పరిశీలనలో అది 7 గంటల తర్వాత పేలేలా టైమర్తో అమర్చిన లైవ్ బాంబు అని తేలింది. బీడీడీఎస్ సిబ్బంది బాంబును సురక్షిత ప్రదేశానికి తరలించి.. ఓపెన్ ఫీల్డ్లో నిర్వీర్యం చేశారు. బాంబులో తక్కువ శక్తి గల పేలుడు పదార్థం ఉందని నిర్ధారించారు."నగరంలో తక్కువ శక్తి గల IED (ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్) కనుగొనబడింది. దానిని నిర్వీర్యం చేశాం. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది." అని పుణే పోలీస్ కమిషనర్ నితేష్ కుమార్ తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
భర్త ఫ్రెండ్తో వివాహేతర సంబంధం..!
నెల్లూరు జిల్లా: దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామంలో మైపాటి మాధవి అనే మహిళను హత్య చేసిన కేసులో ఆమె కోడలు పద్మశ్రీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కావలి రూరల్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ రమణకుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పద్మశ్రీకి అదే గ్రామానికి చెందిన తన భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో అత్త మాధవి ఇలాంటి పనులు మానుకోవాలని కోడలు పద్మశ్రీకి చెప్పింది.అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో కులపెద్దల వద్ద పంచాయితీ జరిగింది. వారు కూడా ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు. ఈక్రమంలో కోపోద్రిక్తురాలైన పద్మశ్రీ తన అత్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. మే 8వ తేదీ తన తల్లి పుచ్చలపల్లి మాధవి సహాయంతో ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై దిండుపెట్టి గొంతు నులిమి హత్య చేసింది. యూట్యూబ్లో సీరియల్స్ చూసి ప్రజలు పక్కదోవ పడుతున్నారని, నేరాలు చేసిన వారు తప్పించుకునే అవకాశం లేదన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. రూరల్ సీఐ శివశంకర్, ఎస్సై జంపాని కుమార్, సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డులివ్వాలని ఉన్నతాధికారులకు సిఫార్స్ చేశారు. -
నా అల్లుడు ఓ అమ్మాయిని నవ వధువు మృతి కేసులో ట్విస్ట్
-
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
పెళ్లి చేసుకుందామనుకున్నా.. నా మరదలినే ప్రేమిస్తావా..!
హైదరాబాద్: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్నగర్లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిïÙటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. -
‘యావన్ను హత్య చేయడానికి కారణం అదే’
సికింద్రాబాద్: చిలకలగూడకు చెందిన యావన్ హత్య ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత స్పష్టం చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నారు. అమ్మాయి తండ్రి, బాబాయి, బావ, అన్న, కజిన్ బ్రదర్స్ కలిసి యావన్ను హత్య చేసినట్లు గుర్తించామన్నారు. మే 7వ తేదీ జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ మీడియాకు వెల్లడించారు.మే 7 అర్ధరాత్రి యావన్ హత్య జరిగింది. ఐదు ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసాము.. యావన్, చంద్రికలు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్.. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ ను హేచ్చరించారు. హత్యకు ఐదు రోజుల ముందే హత్య కోసం నిందితులు ప్లాన్ చేసుకున్నారు. అందరూ కలిసి రెక్కి నిర్వహించారు. A1 అల్లబోయిన సాయి కిరణ్ యువతి బావ.. ప్రధాన నిందితుడు..హత్య కు ప్లాన్ చేశారు. సాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశాం. నిందితులలో ఇద్దరికి గాంజా పాజిటివ్ వచ్చింది ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఓ మైనర్ అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. ప్రేమించాడని నరికి చంపారు.. -
భర్తను చంపిన కేసులో భార్య, ప్రియునికి ఉరిశిక్ష..14 లక్షల జరిమానా..!
బెంగళూరు: అనైతిక బంధానికి ఒడిగట్టిన భార్య చివరకు హత్యకూ వెనుకాడలేదు, ఫలితంగా కఠిన శిక్షకు గురైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియునికి శివమొగ్గ జిల్లా భద్రావతి కోర్టు మరణశిక్షతో పాటు రూ. 14 లక్షల జరిమానా విధించింది. మత్తు మందు ఇచ్చి.. వివరాలు... 2020 జనవరి 15న, భద్రావతిలోని పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురగీ టాప్కు చెందిన ఫ్లోరా నాన్సీ అనే మహిళ, తన ప్రియుడు రాజశేఖరయ్యతో కలిసి భర్త ప్రకాష బాబుకు మత్తుమందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి, సీఐ మంజునాథ్.. దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషిట్ సమర్పించారు. భద్రావతిలోని 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ రత్నమ్మ వాదనలు వినిపించారు. ఫ్లోరా నాన్సీ, ప్రియునికి ఉరే సరైన శిక్ష అని వాదిస్తూ ఆధారాలను సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఇందిరా మైలస్వామి చెట్టియార్.. ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో పాటు రూ.14 లక్షల జరిమానా విధించారు. మృతుని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
ఆంటీతో యువకుడి వివాహేతర సంబంధం..!
బనశంకరి(బెంగళూరు): సహజీవన బంధాలు ఎక్కువగా విషాదంతోనే ముగుస్తున్నాయి. అలాంటి ఉదంతమే ఇది. మహిళతో కలిసి జీవిస్తున్న యువకుడు ఉరివేసుకున్న రీతిలో శవమయ్యాడు, బెంగళూరు రాజగోపాలనగర పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి(28), దావణగెరె (35) మహిళ ఒకే గార్మెంట్స్లో పనిచేస్తూ ఇన్స్టా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త , పిల్లలను వదిలిపెట్టి తిప్పేస్వామితో వచ్చేసింది. రెండునెలల క్రితం బెంగళూరు శ్రీగంధనగరలో బాడుగ ఇల్లు తీసుకుని భార్యాభర్తలం అని చెప్పి జీవిస్తున్నారు. కొంతకాలంగా మహిళ గొంతెమ్మ కోర్కెలతో తిప్పేస్వామిని ఇబ్బంది పెడుతోంది. దీంతో విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ పరారైంది. యువకుని సంబంధీకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది.ప్రత్యేక బృందాలతో...ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేçపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు.బిహార్లో నగలు విక్రయిస్తుండగాదర్యాప్తులో భాగంగా దొంగలు ఘటన అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్ బైక్ను వదిలిపెట్టి గోదావరినదిని దాటి పరారైనట్లు సీసీ కెమెరాలు, స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, పాతనేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను, సేకరించిన సమాచారంతో బిహార్ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
మహబూబ్నగర్లో ఘోర ప్రమాదం
సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేసింగ్ బైక్, కారు ఢీ కొని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.పాలకొండ చౌరస్తాలో అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. కారు డివైడర్ దగ్గ యూటర్న్ తీసుకుంటుడగా.. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్తో కారు, బైక్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు మహబూబ్నగర్ న్యూప్రేమ్ నగర్కు చెందిన కుటుంబంగా గుర్తించారు. మృతుల్లో.. ఆర్షియా బేగం(30), MD. ఉజేప (7), MD. అమర్ (2).. హైదరాబాద్కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్ (25) ఉన్నారు. మరో మృతదేహంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బైక్ హర్యానా రిజిస్ట్రేషన్తో ఉంది.పోలీసుల నిర్లక్ష్యంతోనే..ఈ ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో రాత్రి 11గం. తర్వాత నుంచి తెల్లవారుజాము దాకా బైక్ రేసింగులు జరుగుతున్నాయని.. అటుగా వెళ్లే వాహనదారుల్ని భయానికి గురి చేస్తున్నాయని.. ఎన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే.. ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
కాకినాడలో కానిస్టేబుల్ దారుణ హత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో సంచలన ఘటన వెలుగు చూసింది. కానిస్టేబుల్ నాగేశ్వర రావు హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, సదరు కానిస్టేబుల్ కొంత కాలంగా సస్పెన్షన్లో ఉన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడలోని గాంధీనగర్ రెడ్ క్రాస్ సమీపంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి.నాగేశ్వరరావు (46) సోమవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి దాడిలో హత్యకు గురైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
భర్త కదలికలు ప్రియుడికి తెలిసేలా సీసీ కెమెరాలు
హైదరాబాద్: ఓ వ్యక్తిపై భార్యతోపాటు ఆమె ప్రియుడు హత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు శనివారం తెలిపిన మేరకు.. చౌదరిగూడలోని విజయపురి కాలనీకి చెందిన రమావత్ సుజాత అదే కాలనీకి చెందిన జటోతు మంగిలాల్తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం భర్త రమావత్ బిక్కుకు తెలియకుండా ఇంట్లో నాలుగు స్పై కెమెరాలను అమర్చి, భర్త కదలికలు ప్రియుడికి తెలిసేలా ఏర్పాట్లు చేసింది. ఇది తెలుసుకున్న బిక్కు తన భార్య సుజాతను గట్టిగా మందలించాడు. ఈ క్రమంలో మంగిలాల్తో సుజాత కలిసి తన భర్తను చంపేందుకు కత్తితో దాడి చేసింది. దీంతో బిక్కు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు సుజాత, మంగిలాల్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపారు. -
‘దండుపాళ్యం’కు ఏమాత్రం తీసిపోకుండా..
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నా కొద్దీ.. నేరాల తీరు కూడా మారిపోతోంది. ఏ తరహాలో క్రైమ్ చేయాలి?.. చేతులకు మట్టి అంటకుండా ఎలా చూసుకోవాలి.. ఎలా తప్పించుకుని తిరగాలి.. ఒకవేళ దొరికితే అందులోంచి ఎలా బయటపడాలి.. లాంటి విషయాలను కూడా ఆన్లైన్లోనే వెతికేస్తున్నారు. ఈ క్రమంలో.. పొరుగు రాష్ట్రంలో ఓ షాకింగ్ వెలుగు చూసింది. దండుపాళ్యం బ్యాచ్కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ ముఠా కర్ణాటక రాజధాని బెంగళూరులో అఘాయిత్యానికి పాల్పడింది. ఒంటరి మహిళపై సుదీర్ఘకాలం నిఘా ఉంచి.. డబ్బు కోసం పథకం ప్రకారం ఆమెను మట్టుపెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 20వ తేదీన కురుబరహల్లి ప్రాంతాలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఓ బైక్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైందామె. దీంతో అక్కడే ఉన్న కొందరు యువకులు ఆమెను హుటాహుటిన ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రెండ్రోజుల తర్వాత.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే..అది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని.. పైగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించే టైంలో ఘోరం జరిగిందని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాక్సిడెంట్ చేసినోడే.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించానంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్లో మరో కొసమెరుపు.మహాలక్ష్మి లేఅవుట్ పీఎస్ పరిధిలో మహాలక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. తెలిసినవాళ్ల ద్వారా చేతన్ అనే వ్యక్తి ఆమె దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. అయితే ఆమె దగ్గర మరింత డబ్బు, నగలు ఉన్నట్లు భావించాడు. ఈ క్రమంలో.. స్నేహితులు రాకేష్, మంజునాథ్, చిప్స్ ప్రదీప్, యోహాన్ జాన్తో కలిసి ఓ పథకం వేశాడు.ప్లాన్ ప్రకారం.. రాకేష్ తన బైక్తో నడుచుకుంటూ వెళ్తున్న మహాలక్ష్మిని ఢీ కొట్టాడు. ఆ వెంటనే మిగతా నిందితులు ఆటోతో పాటు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించడానికి ప్రయత్నించినట్లు నటించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే వంకతో ఆమె పర్సులోని ఇంటి తాళం కొట్టేశాడు మంజునాథ్. ఆపై ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి తాళం తెరవబోయాడు. అయితే అది చూసిన ఇంటి యాజమాని అతన్ని నిలదీశాడు. మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయ్యిందని.. ఆస్పత్రిలో చేర్పించామని.. ఆస్పత్రివాళ్లు ఆధార్ కార్డు అడుగుతున్నారని చెప్పాడు. దీంతో యాజమాని హుటాహుటిన మంజునాథ్తో ఆస్పత్రికి బయల్దేరాడు. ఈలోపు.. మంజునాథ్ మిగతా వాళ్లకు సమాచారం ఇవ్వడంతో తమ పథకం విఫలమైందని భావించి ఆమెను విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు.అయితే.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. రెండ్రోజుల తర్వాత మంజునాథ్ ఇంటి తాళం తెరవబోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు ఆ ఇంటి ఓనర్. దీంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మంజునాథ్ను.. అతనిచ్చిన సమాచారంతో మిగతా వాళ్లనూ అరెస్ట్ చేశారు. మహాలక్ష్మికి బైక్తో ఢీ కొట్టాక.. సరాసరి ట్రాఫిక్ పీఎస్కు వెళ్లిన రాకేష్ ‘‘గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని.. తాను ఆస్పత్రిలో చేర్పించానని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసులు అసలు విషయం తేల్చేయడంతో.. దొంగతనం చేయడానికి ఆమెకు యాక్సిడెంట్ చేశామని, ప్రాణం పోతుందని అనుకోలేదని ఆ యువకులు ఒప్పుకున్నారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకుని నిందితుల్ని రిమాండ్కు తరలించారు.Accident Turned Murder: Bengaluru Woman Killed in Chilling Extortion PlotA shocking and well-planned crime has come to light in Bengaluru, where a woman was deliberately killed under the guise of a road accident for financial gain.The incident occurred on April 21 on Pipe Lane… pic.twitter.com/FAJd9SOUZw— Karnataka Portfolio (@karnatakaportf) May 8, 2026 -
అల్లుడు గారు.. ఈ పెళ్లి మా అమ్మాయికి ఇష్టం లేదు..!
తిరుపతి జిల్లా: పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడిని నమ్మించి...అవసరాల నిమిత్తం అతని రూ.11లక్షల 38వేలు తీసుకుని, తీరా పెళ్లి కోసం నిలదీస్తే ఇష్టం లేదని మోసం చేసిన ఓ కుటుంబంపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. బాపట్ల జిల్లా గూడపల్లి గ్రామానికి చెందిన సుజేంద్ర(35) ఏర్పేడు మండలం చింతలపాళెం డీఆర్డీవో ప్రాంగణంలో ఎస్ఎస్సీ ప్రాజెక్టు కింద డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్. సుజేంద్ర పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా, తొట్టంబేడు మండలం తాటిపర్తికి చెందిన కమలాకర్, తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి అతడి నుంచి పలుమార్లు రూ.11,38,756 నగదును ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా తీసుకున్నారు. అలాగే, రూ.2లక్షలు విలువైన రెండు ఐఫోన్లు కూడా తీసుకున్నారు. మార్చి 6న యువతితో సుజేంద్రకు నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 22న పెళ్లి జరిగే విధంగా లగ్న పత్రిక రాసుకున్నారు. అప్పటినుంచి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గట్టిగా నిలదీయడంతో యువతికి పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో తాను ఇచ్చిన నగదు, రెండు ఐఫోన్లు తిరిగి ఇచ్చేయాలని బాధితుడు డిమాండ్ చేశారు. నగదు తిరిగి ఇవ్వలేమని వారు ప్లేటు ఫిరాయించారు. తనను ఉద్దేశపూర్వకంగా పెళ్లి పేరుతో నమ్మించి అధిక మొత్తంలో నగదు తీసుకుని పక్కా ప్లాన్తో మోసగించారని బాధితుడు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో యువతి, ఆమె తల్లిదండ్రులు, సోదరునిపై ఏర్పేడు ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
లిఫ్ట్లో ఇరుక్కొని బాలుడి మృతి
హైదరాబాద్: లిఫ్ట్లో ఇరుక్కొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని రామచంద్రారెడ్డినగర్ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా చంద్రజుపాలెంకి చెందిన వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రాపురంలో నివాసం ఉంటూ వాచ్మేన్గా ఉంటున్నాడు. రాత్రి 7గంటలకు కూతురు వర్షిత, కుమారుడు గిరివర్ధన్(4) ఆడుకుంటున్నారు. అదే సమయంలో గిరివర్ధన్ లిఫ్ట్లోకి వెళ్లగా.. మొదటి అంతస్తులోకి వెళ్లగానే పెద్ద శబ్ధం వచి్చంది. వెంటనే వెళ్లి చూడగా లిఫ్ట్లో బాలుడు ఇరుక్కొని ఉన్నాడు. తీవ్రగాయాలైన అతడిని 108 అంబులెన్స్లో పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఇన్స్పెక్టర్ జగన్నా«థ్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అత్తపై అల్లుడు అత్యాచారం
జోగిపేట(అందోల్): మద్యానికి బానిసై కామంతో కళ్లు మూసుకుపోయి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవను సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై సొంత అల్లుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్లో చోటుచేసుకుంది. సీఐ అనిల్కుమార్ చెప్పిన కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ప్రతీరోజు మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండేవాడు. గురువారం రాత్రి ఘర్షణ పడుతుండగా సయోధ్య కుదుర్చేందుకు అత్త వచి్చంది. నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసింది. అప్పటికే మత్తులో ఉన్న మహ్మద్ గరీబ్...భార్యను గదిలోకి నెట్టేసి గడియపెట్టి అత్తపై అత్యాచారం జరిపి బయటకు పారిపోయాడు. ఈ విషయాన్ని అత్త బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి తెలియజేసి వట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు గరీబ్ను అదుపులోకి తీసుకుని కోర్టుకు రిమాండ్కు పంపుతున్నట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. -
పెళ్లి భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..!
అనంతపురం జిల్లా: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు.అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. -
53 ఏళ్ల రాధ వివాహేతర సంబంధం.. షాకింగ్ నిజాలు!
రాప్తాడు రూరల్: ఓ హత్య కేసు దర్యాప్తులో అంతకు ముందు చేసిన హత్య బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశులు శుక్రవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం సిండికేట్నగర్లో నివాసం ఉంటున్న రాధ (53), చెరుకూరి ఆదినారాయణ కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రాధ కుమారుడు సందీప్కుమార్ చౌదరి తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. అలాగే కుమార్తె కూడా భర్తతో కలసి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల రాధ, ఆదినారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెల 16న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆదినారాయణ టవల్ తీసుకుని రాధ మెడకు బిగించి హతమార్చాడు. అనంతరం ఆమె మొబైల్ తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటి రోజు బెంగళూరులో ఉన్న రాధ కోడలికి, హైదరాబాద్లో ఉంటున్న కుమార్తెకు ఫోన్ చేసి రాధ మృతి చెందినట్లుగా తెలపడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కుమారుడు సందీప్కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆదినారాయణ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సిండికేట్ నగర్లో తచ్చాడుతుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు కథ వెలుగులోకి ఆదినారాయణను విచారణ చేయడంతో సంచనాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం రాధ భర్త రవిచంద్రనాయుడు పసిగట్టి ఇద్దరినీ మందలించడంతో ఆదినారాయణ, రాధ ఇద్దరూ కలిసి 2025 మే 20న రాత్రి రవిచంద్రనాయుడిని హతమార్చారు. నిద్రలో ఉన్న సమయంలో ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పిల్లలను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అప్పటి నుంచి రవిచంద్రనాయుడు హత్య ఉదంతం వెలుగు చూడలేదు. తాజా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదినారాయణపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూరల్ తహసీల్దార్, వైద్యులు, అసిస్టెంట్ సైంటిఫిక్ టీం సమక్షంలో శుక్రవారం రవిచంద్రనాయుడు మృతదేహాన్ని వెలికితీయించి పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అస్థికలను సేకరించి ల్యాబ్కు పంపారు. -
Telangana: కాపాడాల్సిన వారే హత్యలకు పాల్పడుతున్నారా?
సాక్షి, సిద్దిపేట: కొందరు పోలీసులు బెట్టింగ్లకు, చోరీలకు, హత్యలకు పాల్పడటం సర్వత్రా సంచలనంగా మారాయి. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసులు పలువురు బలవన్మరణం, హత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోద్దు.. ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టవద్దని చెప్పేవారే తప్పుదోవ పడుతున్నారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన వారే తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. ఇందుకు జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలే నిదర్శనం. సిద్దిపేటకు చెందిన గౌటే ప్రవీణ్ సీసీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై దాదాపు రూ.60లక్షలకుపైగా నష్టపోయారు. స్థిరాస్తి వ్యాపారి విశ్వనాథం.. బంధువు దగ్గర ప్రవీణ్ భూమిని తాకట్టు పెట్టి రూ.12లక్షల అప్పుగా ఇప్పించారు. డబ్బుల కోసం విశ్వనాథం ఒత్తిడి చేస్తుండటంతో ఈ నెల 2న కారులో కానిస్టేబుల్ ప్రవీణ్, భార్య రజిత కలిసి తీçసుకెళ్లారు. విశ్వనాథంను హత్య చేసి ఒంటిమీద ఉన్న 10తులాల బంగారు నగలను తీసుకుని.. మృతదేహాన్ని ఇమాంబాద్ వద్ద కాలువలో పడేశారు. ఇలా కానిస్టేబుల్ నేరానికి పాల్పడ్డాడు. ఇదే కానిస్టేబుల్ గత నెల 25న బొడ్డు నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకుని ఏమార్చి బంగారు పుస్తెలతాడు దొంగిలించారు. ఏమీ తెలియనట్లుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. దొంగతనాల కేసు రికవరీలో సైతం చేతి వాటం ప్రదర్శించినట్లు సమాచారం. మరో కానిస్టేబుల్ బెట్టింగ్లకు పాల్పడి.. ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోవడంతో కానిస్టేబుల్ నరేశ్ తుపాకితో కుటుంబాన్ని మట్టుబెట్టడమే కాకుండా తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో 2024 డిసెంబర్ 15న భార్య ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ నరేశ్(35), చైతన్య(30), రేవంత్(6), రిషిత(5) ఈ ఘటనలో మరణించారు.మరో ఘటనలో.. ఓ ప్రైవేట్ కంపెనీలో పలు విడతలలో రూ.25లక్షలు వరకు పెట్టుబడి పెట్టాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుపాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో, అప్పులు ఇచి్చన వారితో గోడవలు జరగకుండా ఉండాలంటే మరణం ఒక్కటే మార్గం అని నిర్ణయించుకున్నాడు. దీంతో 2024 డిసెంబర్ 28 రాత్రి ఎలకల మందును టీలో కలుపుకుని ఇద్దరు పిల్లలతో పాటు భార్యభర్తలు తాగి ఆత్మహత్యయాత్నానికి పాల్పడ్డారు. 29న ఉదయం చూసేసరికి అందరు స్పృహలోనే ఉండటంతో పాటు పక్కగదిలో రాజన్న సిరిసిల్ల 17వ బెటాలియన్ హెడ్కానిస్టేబుల్ బండారి బాలకృష్ణ(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొంది బతికి బయటపడ్డారు. -
జూబ్లీహిల్స్.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య
సాక్షి, జూబ్లీహిల్స్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్లోని ఐఏఎస్ క్వార్టర్స్లో శుక్రవారం ఉదయం ఈ హత్య జరిగింది. వినయ్ రంజన్ ఇంట్లో పనిచేసే పని మనిషే ఆమెను హత్య చేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రేమించాడని చంపేశారు..!
-
ప్రియురాలు పిలిచిందని వెళ్తే..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఓ యువకుడిపై కొందరు కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం రాత్రి సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆల్వాల్లోని యాప్రాల్లో నివాసం ఉంటున్న యువన్.. నగర శివారులో ఓ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి చిలకలగూడకు వచ్చి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫోన్లో మ్యాచ్ చూస్తూ మునిగిపోయాడు. ఈలోపు బైకులపై వచ్చిన ఏడుగురు యువన్ను పక్కకు లాక్కెళ్లి దాడి చేశారు. ఈ పరిణామంతో ఆ యువకులు చెల్లాచెదురుకాగా.. కత్తులతో దాడి చేయడంతో తీవ్రగాయాలతో యువన్ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల, మెడ, చేతులు మొత్తం 15 కత్తిపోట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తొలుత భావించగా.. తర్వాత అదే నిర్ధారణ అయ్యింది. యువన్ స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో పెద్దలకు తెలిసి గొడవ జరగడంతో పంచాయితీ పెట్టారు. అయితే కలుద్దామని యువతి గురువారం యువన్కు మెసేజ్ చేసింది. దీంతో యువన్ చిలకలగూడకు రాగా.. తట్టుకోలేకపోయిన యువతి సోదరుడు స్నేహితుల సాయంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. చిలకలగూడలో ఉద్రిక్తతయువన్ హత్య నేపథ్యంలో శుక్రవారం ఉదయం చిలకలగూడలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. అతని తల్లిదండ్రులు, బంధువులు యువతి నివాసం ఎదుట రోడ్డు మీద బైఠాయించి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నంలో తోపులాట జరిగింది. దీంతో లాఠీఛార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సీతాఫల్మండి, నామాలగుండు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు.. ఘాతుకానికి పాల్పడ్డ వాళ్లలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే యువతి కుటుంబం కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. వస్తే చంపేస్తారని చెప్పిందా?ఏడాది నుంచి యువన్ ఆ యువతితో మాట్లాడడం లేదని సోదరి మీడియా ముందు వాపోయింది. ‘‘పెద్దల అంగీకారంతో అప్పట్లో కాంప్రమైజ్ జరిగింది. ఇద్దరి మధ్య మాటలు లేకపోవడంతో అంతా సర్దుమణిగింది అనుకున్నాం. అయితే నిన్న మా తమ్ముడు ఆమె కోసం చిలకలగూడకు వచ్చాడు. వస్తే చంపేస్తారని కూడా యువతి ఫోన్లో చెప్పింది(అందుకు సంబంధించిన కాల్ సంభాషణను బయటపెట్టారు). ఆమె సోదరి, కుటుంబ సభ్యులకు నేర చరిత్ర ఉంది. మా తమ్ముడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. వాళ్లందరినీ ఉరి తీసి మాకు న్యాయం చేయండి’’ అని వాపోయిందామె. -
25 లక్షలిస్తే.. మా అబ్బాయి మీ అమ్మాయి జోలికి రాడు..
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రిచ్కిడ్స్ ట్రాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. తనను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడని బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడి తల్లితో పాటు మేనమామపై కేసు నమోదు చేశారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరిగింది.వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్కు చెందిన ప్రముఖ వ్యాపారి మైనర్ కూతురిని కూకట్పల్లికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ట్రాప్ చేసి రూ.13 లక్షల వరకు వసూలు చేశాడు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ ఆజాద్తో పాటు ఆయన తల్లి మీనాకుమారి, తమ్ముడు రాజీవ్, మేనమామ తరక ప్రశాంత్, మీనాకుమారి స్నేహితుడు వినీల్చౌదరిలతో పాటు మరికొందరు స్నేహితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చంద్రశేఖర్ ఆజాద్ను రిమాండ్కు తరలించారు. మిగతా వారందరినీ అరెస్టు చేశారు.అయితే తన కూతురి జోలికి రావద్దని, డబ్బులు డిమాండ్ చేయవద్దని బాధితురాలి తండ్రి పలుమార్లు మీనాకుమారిని బతిమలాడారు. ‘నీ కూతురి జోలికి నా కుమారుడు రాకుండా ఉండాలంటే, నీ కూతురితో మావాడు తిరగవద్దనుకుంటే రూ.25 లక్షలు ఇవ్వాలంటూ’ మీనాకుమారి బాధిరాలి తండ్రిని డిమాండ్ చేసింది. మీనాకుమారి సోదరుడు ప్రశాంత్ కూడా పలుమార్లు బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుంటే నా మేనల్లుడు మీ అమ్మాయితో అలాగే తిరుగుతాడంటూ హెచ్చరించాడు. దీంతో బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మీనాకుమారితో పాటు ఫ్రశాంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో యువతి ఫిర్యాదు.. సంపన్న యువతులను ట్రాప్ చేస్తూ యువతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ సోదరుడు రాజీవ్ పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో మరో చీటింగ్ కేసు నమోదైంది. తనను ప్రేమ పేరుతో తిప్పుకుని తరచూ శారీరిక వాంఛలు తీర్చుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశాడని నార్సింగ్కు చెందిన ఓ యువతి తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అందుకే ముంబై ఫ్యామిలీ మృతి.. పుచ్చకాయేం చేయలేదని వెల్లడి
ముంబైలో గత నెల ఓ కుటుంబ సభ్యులు భోజనం చేసిన తర్వాత పుచ్చకాయ తిని మృతి చెందిన విషయం సంచలనం రేపింది. దీంతో పుచ్చకాయ తింటే మంచిది కాదంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, ఆ కుటుంబంలోని నలుగురు తిన్న పుచ్చకాయలో ఎలుకల మందు ఉందని ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడింది. ఎలుకల విషంలో సాధారణంగా వాడే జింక్ ఫాస్ఫైడ్ను ఆ పుచ్చకాయ శాంపిల్లో గుర్తించారు.ఇంట్లో మృతిచెందిన ఆ నలుగురు కుటుంబ సభ్యుల పుచ్చకాయ నమూనాలు, విసెరా నమూనాల్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను గురువారం ముంబై పోలీసులకు సమర్పించారు.జింక్ ఫాస్ఫైడ్ అత్యంత విషపూరిత పదార్థమని, ఆ నలుగురి మరణాలకు అదే కారణమై ఉంటుందని ఎఫ్ఎస్ఎల్ అధికారులు తెలిపారు. జింక్ ఫాస్ఫైడ్ను ఎలుకల వంటి వాటిని నియంత్రించేందుకు వాడతారు. పొలాలు, నిల్వ ధాన్యంలోనూ ఉపయోగిస్తారు.ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. “ఇవాళ నివేదిక సమర్పించాం. రెండు నమూనాల్లో జింక్ ఫాస్ఫైడ్ కనిపించింది. అవి పుచ్చకాయ, మృతిచెందిన నలుగురి విసెరా నమూనాలు. సాధారణంగా ఇది పొడి రూపంలో ఉంటుంది. ఎవరో పుచ్చకాయ కోసి, అందులో ఈ పొడి చల్లి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ తర్వాత దాన్ని తిన్నారు. అయితే అసలు ఏం జరిగిందో పోలీసులు తేలుస్తారు” అని అన్నారు.కాగా, గతనెల అబ్దుల్లా డోకాడియా (40), ఆయన భార్య నసీమ్ (35), వారి ఇద్దరు కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13) ఏప్రిల్ 26న దక్షిణ ముంబైలోని వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. బంధువులకు ఇంట్లో విందు ఇచ్చిన కొన్ని గంటల తరువాత ఈ ఘటన జరిగింది. అందరూ కలిసి భోజనం చేసినప్పటికీ, అర్ధరాత్రి తర్వాత ఆ నలుగురు పుచ్చకాయ తిన్నారు.ముంబై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. నివేదిక అందిందని, పుచ్చకాయలో ఎలుకల విషం ఎవరు కలిపారో ఇప్పుడు దర్యాప్తు చేస్తామని తెలిపారు. “ఇది ఆత్మహత్య? లేక హత్య? లేక వ్యవసాయ పొలంలో కలుషితమై పొడి పుచ్చకాయలోకి చేరిందా? అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం” అని చెప్పారు. -
ప్రియుడి మోజులో పడి.. రూ.12 లక్షలు ఇచ్చి..
సాక్షి, ఏలూరు: జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం సుపారీ ఇచ్చిన భార్య.. భర్తను హత్య చేయించింది. గత నెల 17న హత్యకు గురైన ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామానికి చెందిన రెడ్డి సులేమాన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భార్యే అసలు సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలియడంతో దుర్గారాణిని సులేమాన్ రాజు తరచూ వేధించేవాడు. భర్త పెట్టే బాధలు పడలేక చనిపోవాలనుందంటూ దుర్గామణి ప్రియుడికి చెప్పింది. సులేమాన్ రాజు అడ్డు తప్పించాలని దుర్గామణి ప్లాన్ వేసింది.తన బంధువుల సాయంతో సులేమాన్ రాజు హత్యకు వెంకన్నబాబు సుపారీ ఇచ్చారు. రూ.12 లక్షలు ఇచ్చిన దుర్గామణి, వెంకన్నబాబు.. సులేమాన్ రాజు అడ్డు తొలగించుకున్నారు. సెల్ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్తో సులేమాన్ రాజును నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం ఉప్పులూరు రైవస్ కాలువలో సులేమాన్ రాజు మృతదేహాన్ని పడేశారు. సులేమాన్ రాజు భార్య దుర్గామణి, వెంకన్నబాబు, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్, కారు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు ఖాళీ బీరు సీసాలు, రూ. 75 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కోల్కతా సమీపంలో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యంగ్రామ్ ప్రాంతంలో ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురయ్యారు. దోహారియా ప్రాంతంలో బుధవారం రాత్రి కారులో చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తుండగా బైక్పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అత్యంత దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో రథ్తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రథ్ను, డ్రైవర్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రథ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన రెండు రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మధ్యంగ్రాం నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి రథిన్ ఘోష్, ఇతను బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన 2,399 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే తరుణ్జ్యోతి తివారీ మాట్లాడుతూ, ‘మేము నిరంతరం శాంతిని కోరుకుంటున్నాం, కానీ టీఎంసీ ఈ దారుణానికి ఒడిగట్టి అతిపెద్ద తప్పు చేసింది’.. అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరగడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితులను గుర్తించేందుకు, హత్యకు గల కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అనుచరులుగా నటిస్తూ హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో సువేందు అధికారి, భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడించి 'జెయింట్ కిల్లర్' అనే పేరును సంపాదించారు. దాంతో సువేందు అధికారిని ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. -
దొంగల మాస్టర్ ప్లాన్ ఇదే..!
-
భార్య వివాహేతర సంబంధం.. కిరాతకంగా హత్య చేసిన భర్త!
కృష్ణా జిల్లా: భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆమెను అతి కిరాతకంగా ఇనుప రాడ్డుతో మోది హతమార్చిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ పి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం డీఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. దిమ్మిటి ప్రసన్నకుమారి(30) తన భర్త మురళీ కృష్ణతో వివాదాల కారణంగా భర్తను వదిలేసి మరో వ్యక్తితో పామర్రులో సహజీవనం చేస్తోంది. తనతో కాపురం చేయకుండా కుటుంబ పరువు తీస్తున్నట్లుగా భావించిన మురళీకృష్ణ తన అన్నదమ్ములను వెంట బెట్టుకుని ఈనెల 4వ తేదీ ఉదయం రెండు బైక్లపై పామర్రు వచ్చాడు. ప్రసన్నకుమారి ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఇనుప రాడ్డుతో మోది చంపాడు.అనంతరం నిందితులు అక్కడ నుంచి పారిపోతూ దుస్తులు, ఆమెను చంపడానికి ఉపయోగించిన ఇనుపరాడ్డును గుడివాడ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పోదలలో పడవేసి వెళ్లి పోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి గోళ్ల రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీప్రసన్న కుమారిని తన అల్లుడు మురళీ కృష్ణ, అన్నయ్య రాంబాబు, మరో తమ్ముడు నాగేశ్వరరావు అలియాస్ చంటి తన అన్నయ్య రాంబాబు కుమారుడు మైనర్ అయిన మరో వ్యక్తితో కలిసి తన కుమార్తెను ఇనుప రాడ్డుతో కొట్టి చంపినట్లుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు.దీనిపై అప్పటి పామర్రు ఇన్ఛార్జి గుడివాడ టూ టౌన్ సీఐ హనీష్ కొంది మంది సాక్షులను విచారించగా తదుపరి పామర్రు సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ నాగ ప్రసాద్ విచారణను కొనసాగిస్తూ మరి కొందరు సాక్షులను విచారించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పామర్రు నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో కొత్తూరు దాటిన తర్వాత కొడాలి రామేశ్వరరావు మునగతోట పక్కన నిందితులు వారు దాచిన ఇనుప రాడ్డు బట్టలు వెతుకుతుండగా, పామర్రు సీఐ సీహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ కె.శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇనుపరాడ్డు, దుస్తులు, వారు వాడిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను తదుపరి విచారణ కోసం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పామర్రు సీఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు.


