breaking news
Crime News
-
కొద్దిసేపట్లో విమాన ప్రయాణం.. అంతలోనే దుర్మరణం
శంషాబాద్(హైదరాబాద్): కంటైనర్ చేసిన బీభత్సంతో అదుపుతప్పిన బస్సు హోటల్ల్లో దూసుకెళ్లడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లేందుకు కొద్దిసేపట్లో విమానం ఎక్కాల్సిన అతడు పరలోకాలకు వెళ్లాడు. ఈ విషాదకర ఘటన శంషాబాద్లో కిషన్గూడ ఆర్వోబీ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఆర్జీఐఏ సీఐ సంజీవులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 5.30కు వర్షం కురుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటైనర్ డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొంది. అదే సమయంలో బెంగళూరు నుంచి బాచుపల్లికి వెళుతున్న సెవెన్ హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై స్తంభం విరిగి పడడంతో నియంత్రణ కోల్పోయిన బస్సు డ్రైవర్ సాధిక్ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టి హోటల్లోకి తీసుకెళ్లాడు. చాయ్ కోసం ఆగితే కరీంనగర్ జిల్లా కేంద్రం రజ్వీచమన్ రోడ్డు సిటిజన్ కాలనీకి చెందిన మహ్మద్ మోహియుద్దీన్.. తన కుమారుడు మహ్మద్ అజీమొద్దీన్ (26)ను దుబాయ్కి పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. ఎయిర్పోర్టు బ్రిడ్జి సమీపంలోని హోటల్ వద్ద చాయ్ తాగేందుకు కారు నిలిపారు. కారులోంచి బయటికి వచ్చిన అజీమొద్దీన్ను బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కళ్లెదుటే అజీమొద్దీన్ మృతి చెందడంతో కుటుంబసభ్యులను శోకసంద్రంలో ముంచింది. బీభత్సం బస్సు హోటల్లోకి దూసుకెళ్లడం అక్కడే బోండాలు వేస్తున్న గ్యాస్ స్టవ్కు మంటలందుకున్నాయి. పాన్షాప్ పూర్తిగా ధ్వంసమైంది. వాహనాలు సైతం ధ్వంసం కాగా బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనై హాహాకారాలు చేయడంతో పక్కనే ఈవీ చార్జింగ్ కోసం వచ్చిన ఓ యువకుడితో పాటు హోటల్ వద్ద ఉన్న మరికొందరు యవకులు ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులను బయటికి రప్పించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కరెంటు సరఫరాను నిలిపివేయించారు. స్వల్పంగా గాయపడిన పదిమందిని, తీవ్ర గాయాలపాలైన బస్సు డ్రైవర్ సాధిక్ను ఆస్పత్రికి తరలించారు. -
భర్త పట్టించుకోవడం లేదని.. ప్రియుడి చెంతకు వెళ్లిన భార్య
మంచిర్యాలక్రైం: భర్త సరిగా చూసుకోవడం లేదని ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు విడాకులు ఇప్పించిన అతడు నాలుగేళ్లు ఆమెతో సహజీనం చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. ఆడపిల్ల అని తెలిసి అబా ర్షన్ చేయించాడు. తీరా పెళ్లికి నిరాకరించడంతో అటు భర్త, కన్నవారికి దూరమై.. ఇద్దరు పిల్లలతో ఎలా జీవించాలో తెలియక ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పెల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహామైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతడు విదేశానికి వెళ్లేవాడు. ఇద్దరి మధ్య గొడవల కారణంగా విడిపోయారు. ఈ క్రమంలో బాధిత వివాహిత స్నేహితురాలి స్నేహితుడు మందమర్రికి చెందిన మహేష్తో కలిసి మందమర్రి పాలచెట్టు ప్రాంతానికి చెందిన షారుఖ్పాష పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి తరచూ బాధిత మహిళ ఇంటికి వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో షారుఖ్పాషకు బాధిత మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఆమెతో భర్తకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాడు.ఆడపిల్ల అని తెలిసి అబార్షన్!సదరు వివాహితను పెళ్లి చేసుకుంటానని, ఇద్దరు కూతుళ్లను చూసుకుంటానని షారుఖ్పాష నమ్మించి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని క్యాతనపల్లిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలం సహజీవనం చేశారు. ఈ విషయం అతడి తల్లిదండ్రులకు కూడా తెలియడంతో నాలుగేళ్లుగా కలిసే ఉంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించగా.. మూడోసారి మంచిర్యాల బస్టాండ్ సమీపంలోని ఓ స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో మళ్లీ అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించి షారుఖ్పాషపై ఆమె ఒత్తిడి తేగా నిరాకరించాడు. దీంతో ఆ మహిళ దోమలమందు, జ్వరం గోలీలు వేసుకుని ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ విషయమై సీఐ ప్రమోద్రావు స్పందిస్తూ బాధితురాలి ఫిర్యాదు మేరకు షారుఖ్పాషపై కేసు నమోదు చేసి రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్కు బదిలీ చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: విశాఖలో కలకలం.. పార్క్ వద్ద చిరిగిన కరెన్సీ నోట్ల కుప్ప -
బాలికపై లైంగిక దాడి.. ‘క్షమాపణ చెబితే చాలు’ అని తీర్పు!
పెద్దపల్లి జిల్లా: మాయమాటలు చెప్పి బాలికను లైంగికంగా వేధించిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి(52) ఇదే గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రలోభపెట్టి తన ఇంటికి పిలిపించి అత్యాచారం చేసినట్లు బాలిక తన తండ్రికి వెల్లడించినట్లు సమాచారం. బాలిక మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవటంతో తండ్రి ఆరా తీయగా..ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇస్తూ పాఠశాలకు వెళ్లొద్దని చెబుతున్నాడని తెలిపినట్లు సమాచారం.సదరు వ్యక్తి తనను మధ్యాహ్నం ఇంటికి పిలిపించి లైంగికదాడికి పాల్పడినట్లు చెప్పడంతో తండ్రి గ్రామ పెద్దలను ఆశ్రయించినట్లు తెలిసింది. బాలిక తండ్రి గ్రామ పెద్దలను సంప్రదించగా నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కుమారుడు అందుబాటులో లేని కారణంగా పంచాయితీని కొన్నిరోజులు వాయిదా వేసినట్లు సమాచారం. సోమవారం కుమారుడు గ్రామానికి రావటడంతో పెద్దలు సదరు వ్యక్తిని బాలిక ఇంటికే పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. ఈ క్రమంలో పెద్దమనుషులు అత్యాచారం చేసిన వ్యక్తిని బాలిక తండ్రి కాళ్లు మొక్కి మరోసారి ఇటువంటి తప్పులు చేయనని ప్రాధేయపడాలని సూచించినట్లు సమాచారం. దీంతో అతడు తాను తప్పు చేశానని, క్షమించాలని పంచాయితీ పెద్దల సమక్షంలోనే బాలిక తండ్రిని ప్రాధేయపడుతూ కాళ్లుమొక్కాడు. కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి సదరు వ్యక్తిపై దాడిచేయగా అక్కడ నుంచి పారిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ పోలీసులతో బాలిక ఇంటికి వెళ్లి మహిళా పోలీసుతో బాలికతో మాట్లాడించి వివరాలు సేకరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక వాంగ్మూలం, ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
నా పేరు నమ్రత.. పరేడ్ గ్రౌండ్స్ వద్ద కలుద్దామా!
హైదరాబాద్: ‘నా పేరు నమ్రత.. పరేడ్ గ్రౌండ్స్ వద్ద కలుద్దామా!‘ అంటూ టెలిగ్రామ్లో వచ్చిన ఒక మేసేజ్ ఓ యువకుడిని మోసపోయేలా చేసింది. అమ్మాయి పేరిట నకిలీ గుర్తింపుతో వల పన్ని, కలవడానికి పిలిపించి డబ్బు డిమాండ్ చేసిన ఈ ఉదంతం బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. యూసుఫ్గూడ ఎల్ఎన్నగర్లో నివసించే శనిగరపు అన్వేష్ (24)కు వారం క్రితం ‘సయిద్ రఫత్’ అనే టెలిగ్రామ్ ఐడీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.అన్వేష్ దానికి బదులివ్వడంతో ఇద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది. ఈ క్రమంలో అవతలి వ్యక్తి తన అసలు పేరును దాచిపెట్టి, తనను తాను ‘నమ్రత’గా పరిచయం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా నేరుగా కలవాలని అన్వేషిను కోరాడు. దీంతో ఆమె మాటలను నమ్మిన అన్వేషి.. ఈ నెల 13న మధ్యాహ్నం స్నేహితుడు కొండ్ర ధర్మసేనతో కలిసి పరేడ్గ్రౌండ్స్ సమీపంలోని మెట్రో పిల్లర్ నంబర్ 1230 వద్దకు చేరుకున్నాడు. అక్కడ వారు వేచి చూస్తుండగా.. అన్వేష్ ఎవరు అని కొందరు ప్రశ్నించారు. తానేనని చెప్పగానే టెలిగ్రామ్ చాటింగ్ ప్రస్తావన తెచ్చారు. అయితే అప్పుడు అసలు విషయం బయటపడింది. తనతో చాటింగ్ చేసింది ‘నమ్రత’ కాదని, ఎవరో కేటుగాళ్లు నకిలీ గుర్తింపుతో కావాలనే తనను ఈ వలలోకి లాగినట్లు అన్వేష్ ఆలస్యంగా గ్రహించాడు. అంతలోనే అక్కడకు నలుగురు వ్యక్తులు వచ్చి అన్వేషిను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. షాక్కు గురైన అన్వేష్ భయంతో తప్పించుకున్నాడు. అన్వేష్ స్నేహితుడు ధర్మసేన వారి మోసాన్ని ప్రశ్నించాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు ధర్మసేనను గట్టిగా పట్టుకోగా, మరో దుండగుడు తన వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. బేగంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్మసేనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ నకిలీ టెలిగ్రామ్ ఐడీ మూలాల ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కొంతకాలం హడలెత్తించిన ఐబొమ్మ పైరసీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమంది రవి తాజాగా కోర్టును ఆశ్రయించాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని.. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. సినీ పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రవికి చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో దాదాపుగా రూ.3 కోట్లు అలాగే ఉండిపోయానని తన పిటిషన్లో పేర్కొన్నాడు.తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని.. వాటిని తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్పై ఇవాళ నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టనుంది. విశాఖపట్నంకు చెందిన ఇమంది రవి.. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చి, ఆపై పైరసీ వ్యవహారంతో కోట్లు సంపాదించాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ఆయన తండ్రి పేరు అప్పారావు. విశాఖపట్నంలో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన.. రవి అరెస్టు తర్వాత మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడని, ఆ తర్వాత విదేశాల్లో ఉన్న విషయం కూడా తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. తన కుమారుడు తప్పు చేశాడని తాను సమర్థించబోనని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అప్పారావు అప్పట్లో స్పష్టం చేశారు.ఇక రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలోనే రవి భార్య నుంచి విడాకుల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్కు వచ్చేవాడని, అదే సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని బంధువులు తెలిపారు. రవికి ఓ కుమార్తె ఉంది. అయితే భర్త వ్యవహారంపై స్పందించేందుకు ఆ భార్య అప్పట్లో నిరాకరించింది. అయితే ప్రస్తుతం వాళ్లు కలిసి ఉంటున్నారా? రవి కేవలం తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.పైరసీకి ‘ఐబొమ్మ’ అడ్డాగా..తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ సమస్య ఈనాటిది కాదు. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే వాటి పైరసీ ప్రింట్లు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుండటం ఇప్పటికీ తలనొప్పిగానే ఉంది. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్సైట్ల ద్వారా సినిమాలు అక్రమంగా అందుబాటులోకి వచ్చేవి. ఈ వెబ్సైట్ల వెనుక ఇమంది రవి కీలకంగా వ్యవహరించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.అక్కడే మొదలైన అసలు కథపైరసీ కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఐ బొమ్మ నిర్వాహకులు ఏకంగా పోలీసులకు సవాల్ విసిరారు. తన వెబ్సైట్పై చర్యలు తీసుకుంటే సినీ పరిశ్రమకు చెందిన పలువురి వివరాలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు మరింత సీరియస్గా తీసుకున్నారు. సుమారు ఆరు నెలలపాటు రవి కదలికలపై నిఘా పెట్టి అతని నెట్వర్క్ను ఛేదించే ప్రయత్నం చేశారు.పక్కా స్కెచ్తో అరెస్ట్విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ నెట్వర్క్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 నవంబర్లో రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టారు. చివరకు నవంబర్ 15, 2025న కూకట్పల్లిలోని అపార్ట్మెంట్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. రవి అరెస్ట్ వార్త అప్పట్లో సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీకి సంబంధించిన వెబ్సైట్లను మూసివేయించే చర్యలు చేపట్టారు. 65కుపైగా పైరసీ మిర్రర్ వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. సినీ ప్రముఖులు కూడా పోలీసుల చర్యలను అభినందించారు. రూ.3 కోట్లు ఫ్రీజ్.. 21 వేల సినిమాలు?దర్యాప్తులో భాగంగా రవి బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. కొన్ని నివేదికల్లో ఈ మొత్తం రూ.3.5 కోట్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. రవి వద్ద వేలాది సినిమాల డిజిటల్ కాపీలు, హార్డ్డిస్క్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడో కరేబియన్ దీవుల నుంచి పెద్ద నెట్ వర్క్తో ఈ వ్యవహారమంతా నడిపించడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేయించింది. హైదరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ అప్పట్లో మాట్లాడుతూ.. రవి సుమారు రూ.20 కోట్లు సంపాదించినట్లు దర్యాప్తులో తేలిందని, అతడి వద్ద దాదాపు 21 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల వ్యవహారంరవి వ్యవహారంలో కేవలం సినిమా పైరసీకే పరిమితం కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తులోకి వచ్చాయి. పోలీసుల ప్రకారం.. ఐబొమ్మ వెబ్సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్ను బెట్టింగ్ ప్లాట్ఫామ్ల వైపు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు తర్వాతి నివేదికల్లో వెల్లడైంది. బెయిల్ కోసం వరుస ప్రయత్నాలుఅరెస్ట్ తర్వాత రవి బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ తొలుత నాంపల్లి కోర్టులో ఉపశమనం లభించలేదు. వివిధ కేసుల్లో దర్యాప్తు కొనసాగడంతో అతడు జైలులోనే ఉన్నాడు. పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఐబొమ్మ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? విదేశీ లింకులు ఎలా ఉన్నాయి? పైరసీ కంటెంట్ ఎలా సేకరించేవారు? డబ్బు లావాదేవీలు ఎలా జరిగేవి? అనే అంశాలపై ప్రశ్నించించారు. అదేసమయంలో.. అతన్ని హీరోగా అభివర్ణిస్తూ ఇటు సోషల్ మీడియాలో మద్దతు పెద్ద ఎత్తున కనిపించింది.90 రోజుల తర్వాత బయటకు..దాదాపు మూడు నెలలపాటు జైలులో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు, ఫిబ్రవరి 18న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్లో భాగంగా పాస్పోర్టును కోర్టులో సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించడంతోపాటు అవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని షరతులు పెట్టింది.ఇప్పుడు మళ్లీ కోర్టు మెట్లుఇలా అరెస్ట్, రిమాండ్, కస్టడీ, బెయిల్, విడుదల వంటి దశలు దాటిన తర్వాత తాజాగా రవి మరోసారి కోర్టును ఆశ్రయించడం కేసులో కీలక పరిణామంగా మారింది. తన నుంచి పోలీసులు ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని అంటున్నాడు. ఈ తరుణంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: హైడ్రాకు ఇది ఊహించని షాకే! -
కేంద్ర మంత్రి కాన్వాయ్నే ఓవర్టేక్ చేసి దూసుకెళ్లి..
పుణేలో కేంద్ర మంత్రి, పుణే ఎంపీ మురళీధర్ మొహోల్ భద్రతా కాన్వాయ్ను ఓవర్టేక్ చేశాడు ఓ బైకర్. దీంతో ఆ 32 ఏళ్ల ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో మొహోల్ కాన్వాయ్ శివాజీనగర్లోని సంచైతి చౌక్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మొహోల్ భద్రతా విధుల్లో ఉన్న పోలీసు అధికారి ఈశ్వర్ లక్ష్మణ్ భికులే ఫిర్యాదు మేరకు నానా పేఠ్కు చెందిన శుభం విజయ్ వణిత్పై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వణిత్ అధిక వేగంతో ద్విచక్ర వాహనం నడుపుతూ నిర్లక్ష్యంగా కాన్వాయ్ను దాటాడని పోలీసులు ఆరోపించారు. ఈ చర్యతో ఇతర వాహనదారులు, పాదచారులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొహోల్ ప్రత్యేక విధుల అధికారి వినోద్ సతవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైకర్ మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మొహోల్కు కల్పించిన వై ప్లస్ భద్రతా వలయాన్ని బైకర్ పదేపదే ఉల్లంఘించాడని సతవ్ ఆరోపించారు. “ఇది తీవ్రమైన భద్రతా ఉల్లంఘన” అని ఆయన అన్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
అనంత ఘోర ప్రమాదం: యువతి స్పాట్ డెడ్.. ఆస్పత్రిలో మరొకరు
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్ను ఢీకొట్టి ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అందులో ఉన్న ఓ యువతి అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గాయపడ్డ మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఉదయం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి అనంతపురం వస్తున్న టాటా సఫారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్ను ఢీకొట్టి.. అక్కడి హోటల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని గుత్తికి చెందిన హరితగా పోలీసులు గుర్తించారు.అనంతపురం హౌసింగ్ బోర్డుకు చెందిన శ్రీధర్రెడ్డి, సింగనమల మండలం సలకం చెరువుకు చెందిన కుమార్, గుత్తికి చెందిన హరితతో పాటు మరో యువతి ప్రమాద సమయంలో కారులో ఉన్నారు. మరో యువతి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ఇద్దరు యువకులకు కూడా గాయాలు కావడంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ముగ్గురిలో మరణించిన మరొకరు ఎవరనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ప్రమాద సమయంలో కారు ఎందుకు అదుపుతప్పిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్కు నిద్రమత్తు వచ్చిందా? లేదంటే మద్యం సేవించి వాహనం నడిపారా? అనే కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రియుడితో పట్టాలపై ముచ్చట్లు.. ఇంతలో విషాదం -
‘చచ్చిపో..’ అన్న భర్త.. నిజంగానే చచ్చిపోయిన భార్య!
వరంగల్ జిల్లా: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రిసోల్ గ్రామానికి చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్కు అతడి మేనకోడలు మిల్లీ బిస్వాస్(21)తో ఈ ఏడాది జూన్ 14న పూరి జగన్నాథ దేవాలయంలో వివాహం జరిగింది. వివాహ అనంతరం ఆ దంపతులు వరంగల్కు వచ్చి గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో కిరాయికి ఉంటున్నారు. ఈక్రమంలో గుప్తేశ్వర్ అనుమానంతో తరచూ భర్యను వేధింపులకు గురి చేసేవాడు. దీనిపై ఈ నెల 8న మిల్లీ తన తల్లికి ఫోన్ చేసి తనను భర్త వేధిస్తున్నాడని, తనకు భార్య అవసరం లేదని, ఇంటి నుంచి వెళ్లిపోయవాలని లేదా చనిపోవాలని అంటున్నాడని ఏడుస్తూ చెప్పింది. దీంతో కుటుంబీకులు ధర్మారం చేరుకుని పరిశీలించగా భర్త వేధింపులతో మిల్లీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు గుప్తేశ్వర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఇదీ చదవండి: కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం -
ఆ మిస్టరీ వీడకుండానే.. రియా భర్త కన్నుమూత
భార్యను అతిదారుణంగా హత్య చేసి.. ఆమె తలను భర్త ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన ఆ భర్త.. తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని మీడియా ముందే ప్రకటించుకున్నాడు. అంతేకాదు బయటకు వచ్చాక మరో హత్య చేస్తానంటూ పోలీస్ స్టేషన్ బయటే చెప్పాడు. చివరకు పోలీస్ కస్టడీలో ఉండగానే అతని ప్రాణం పోయింది!.అస్సాం రాజధాని గువాహటిలో సంచలనం సృష్టించిన రియా తాలుక్దార్ (25) హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, ఆమె భర్త రమానుజ్ గోస్వామి పోలీసు వాహనం నుంచి దూకి మృతిచెందాడు. సోమవారం వేకువ జామున ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల రమానుజ్ను వైద్య పరీక్షల అనంతరం సోమవారం తెల్లవారుజామున హటిగావ్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నరకాసుర్ పహార్ ప్రాంతం వద్ద పోలీసులపై ఒక్కసారిగా దాడికి ప్రయత్నించిన అతడు.. కదులుతున్న వాహనం నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి లోయలో పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)కు తరలించగా.. వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.అతనిది పారిపోయే ప్రయత్నమా? లేదంటే కావాలనే దూకి చావాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే రియా కేసులో కొన్ని ప్రశ్నలకు అతని నుంచి పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో ఈ కేసు ఇంకా క్లిష్టతరంగా మారే అవకాశం కనిపిస్తోంది.అసలు కేసులో ఏం జరిగింది?గువాహటి సమీపంలోని హటిగావ్-బసిస్థాపూర్ ప్రాంతంలో రమానుజ్, అతడి భార్య రియా తాలుక్దార్ (25) నివసిస్తున్నారు. దాదాపు ఆరు నెలల క్రితమే వీరికి వివాహమైంది. అయితే భార్యపై అనుమానంతో రమానుజ్ తరచూ గొడవపడేవాడని తెలుస్తోంది. సెప్టెంబర్ 3న జరిగిన గొడవలో రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె తలను, వేళ్లను వేరు చేసి నల్లటి పాలిథిన్ సంచిలో చుట్టి ఫ్రిడ్జ్లో దాచాడు.దుర్వాసనతో వెలుగులోకి..సెప్టెంబర్ 6న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. అయితే తల కనిపించలేదు. ఫ్రిడ్జ్ను తనిఖీ చేయగా పాలిథిన్ సంచిలో ఆమె తలను గుర్తించారు. ఘటన తర్వాత ఇంట్లో రమానుజ్ కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు అతడు పోలీసుల ఎదుట లొంగిపోయి.. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న రక్తపు మరకలున్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.‘షుగర్ డాడీ’ ఎవరు?ఈ కేసులో మరో సంచలన అంశం రమానుజ్ చేసిన వ్యాఖ్యలు. సెప్టెంబర్ 8న పోలీసులు అతడిని ఘటనాస్థలికి తీసుకెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడిన రమానుజ్.. భార్యను చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నాడు. అంతేకాదు.. తన భార్య క్యారెక్టర్ అస్సలు మంచిది కాదని.. జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ ‘షుగర్ డాడీ’ని చంపుతానంటూ హెచ్చరించాడు. ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రశ్నించగా అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రియాకు నిజంగా ఎవరితోనైనా సంబంధం ఉందా? ‘షుగర్ డాడీ’గా అతడు ఎవరిని ఉద్దేశించాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసినా.. అతను నిన్నటిదాకా నోరు విప్పలేదని తెలుస్తోంది.మత్తులోనే హత్య చేసి..అనుమానంతో విచారణలో రమానుజ్.. హత్య జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఖాళీ మద్యం సీసాలు కూడా లభించాయి. రియా కుటుంబ సభ్యులు మాత్రం రమానుజ్కు డ్రగ్స్ అలవాటు, గతంలో ఆర్థిక మోసం కేసులో అరెస్టు వంటి ఆరోపణలు చేశారు. వీటిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రమానుజ్పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని హత్యకు సంబంధించిన సెక్షన్ 103(1), ఆధారాలను మాయం చేయడానికి సంబంధించిన సెక్షన్ 238 కింద కేసు నమోదు చేశారు. అతడికి ఏడు రోజుల పోలీసు కస్టడీ కూడా లభించింది. అయితే విచారణ పూర్తికాకముందే పోలీసు వాహనం నుంచి దూకడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు మిగిలిపోయాయి.ఇదీ చదవండి: దుబాయ్ ఫ్లైట్ ఎక్కాల్సినోడు.. పాడెక్కాడు! -
బెయిల్ వచ్చాకే ఇండియాకు మధుకర్.? అసలు విషయం చెప్పిన లాయర్!
-
రైలు కిందపడి తండ్రి,కొడుకు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు.. కేసు ట్రయల్కు రావడంతో తమకు ఎలాగైనా శిక్ష తప్పదని భావించారు. ఈ క్రమంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్ (52), అతని కుమారుడు నాగరాజు (32) ఇద్దరూ కలిసి 2024లో జయశంకర్ భూపాలపల్లిలో వీఆర్వోగా పనిచేసిన గుల్లకోట గ్రామానికి చెందిన మల్లేశ్ తోడళ్లుడు రమేశ్ను హత్యచేశారు. ఈ కేసులో ఇద్దరూ భూపాలపల్లి జైలుకు వెళ్లారు. భర్త, కుమారుడు జైలుకు వెళ్లడంతో మల్లేశ్ భార్య సువర్ణ అనారోగ్యానికి గురై అదే ఏడాది మృతి చెందింది. జైలు నుంచి బయటకు వచ్చిన తండ్రీ కొడుకులను ఎవరూ ఆదరించడం లేదు. దీంతో కొద్దిరోజులుగా వారు హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేసుకుంటున్నారు. మరోవైపు హత్యకేసు ట్రయల్కు వచ్చింది. తమకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన తండ్రీ కొడుకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నివాసముంటున్న మల్లేశ్ సోదరుడు శ్రీనివాస్ ఇంటికి శుక్రవారం వచ్చారు. శనివారం ఇంటి నుంచి బయలుదేరిన వారు ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో కేరళ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని జీఆర్పీ ఎస్సై తెలిపారు. -
టీ తాగుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు!
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని గంటల్లో దుబాయ్ వెళ్లాల్సిన ఆ యువకుడికి అదే చివరి ప్రయాణమైంది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న కరీంనగర్కు చెందిన అజ్మల్.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. శంషాబాద్ కిషన్గూడా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సృష్టించిన బీభత్సం ఘటనలో ఇది చోటు చేసుకుంది. కరీంనగర్కు చెందిన అజ్మల్ దుబాయ్ ఫ్లైట్ కోసం ఎయిర్పోర్టుకు బయల్దేరాడు. దారిలో టీ కోసమని ఆ హోటల్ వద్ద ఆగాడు. ఆ సమయంలో ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చిన బస్సు అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడతను. బస్సు సరాసరి హోటల్లోకి దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న పలువురు భయాందోళనకు గురయ్యారు.వెంటనే అజ్మల్తో పాటు మరో వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో 50 మందికిపైగా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. అజ్మల్తో పాటు తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితీ విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన బస్సు.. సెవెన్హిల్స్ ట్రావెల్స్కు చెందిందిగా ధృవీకరణ అయ్యింది. ఈ ఘటనలో మూడు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం ధాటికి హోటల్ పరిసరాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.ఓ కంటైనర్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అయితే వేగంగా వస్తున్న ప్రైవేట్ టావెల్స్ బస్సు దానిని తప్పించబోయి హోటల్లోకి దూసుకెళ్లిందని తెలుస్తోంది. అయితే కొన్ని గంటల్లో దుబాయ్ విమానం ఎక్కాల్సిన అజ్మల్.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.ఇదీ చదవండి: కొత్త కారుతో రోడ్డెక్కాలన్నా భయమేనా? -
ముందే పక్కా ప్లాన్.. హోటల్ గదిలో దారుణం
గౌహతి: అస్సాంలోని కామ్రూప్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ హోటల్ గదిలో ప్రియురాలిని ప్రియుడు కత్తెరతో పొడిచి చంపేశాడు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన తర్వాత ఆ యువకుడు ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలిని సోనిత్పూర్ జిల్లాలోని హుగ్రాజులికి చెందిన మాలిని గురియాగా గుర్తించారు. ఉదల్ గురి జిల్లాకు చెందిన అభిజిత్ కిందో.. గురియా తనను మోసం చేస్తోందనే అనుమానంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు.కిందో, గురియా కామ్రూప్లోని రంగాయా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్లో బస చేశారు. ఉదయం పూట ఆ గదిలోనే మహిళ మృతదేహాన్ని గుర్తించారు. అదే గదిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గురియా అంతకుముందు రాత్రి చెన్నై నుండి మరో ఇద్దరు మహిళలతో కలిసి రంగాయా చేరుకుందని.. రైల్వే స్టేషన్లో వారిని రిసీవ్ చేసుకునేందుకు కిందో వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆమె ఇతర పురుషులతో మాట్లాడుతుండటంతో ముందే హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది.ఇదీ చదవండి: కోడలిని హతమార్చి.. బావిలోకి దూకి.. -
HYD: క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి హత్య.. రెండు కుటుంబాలను విషాదంలో ముంచింది. బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు వివరాలు ఆరా తీయడానికి శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లిన ఆయన బంధువు శ్యామ్ గుండెపోటుతో అక్కడిక్కడే చనిపోయారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గురువారం రాత్రి అదృశ్యం.. ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన రాజశేఖర్ (32) నగరానికి వలసవచ్చి బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్లో స్ధిరపడ్డారు. ఈయనకు భార్య లీల, ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమార్తెలు శ్రీనిధి, అనన్య ఉన్నారు. రాజశేఖర్కు రెండు కార్లు ఉండేవి. ఒకదాన్ని తాను నడుపుతూ.. మరో దాన్ని డ్రైవర్ ద్వారా నడిపిస్తున్నారు. రాజశేఖర్ సమీప బంధువు అశోక్ మూడు రోజుల క్రితం ఓ కారు ఖరీదు చేశారు. దీన్ని ప్రస్తుతం రాజశేఖర్ నడుపుతున్నారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబీకులు శుక్రవారం బేగంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహం, కారు వేర్వేరు చోట్ల.. సంగారెడ్డి జిల్లా కోహిర్లోని గోల్డెన్ దాబా సమీపంలో రాజశేఖర్ కారు పోలీసులకు లభించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి వెళ్లారు. రాజశేఖర్ కోసం పోలీసులు, కుటుంబీకులు, స్నేహితులు వెతికారు. శుక్రవారం అర్ధరాత్రి రుద్రారం శివారులోని చెట్ల పొదల్లో రాజశేఖర్ మృతదేహం లభించింది. హతుడి సోదరుడు రాంబాబు ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రాజశేఖర్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. బెల్ట్ వంటి దాంతో మెడకు ఉరి బిగించి చంపినట్లు నిర్ధారించారు ఠాణాలో కుప్పకూలిన బంధువు.. కేసు పూర్వాపరాలు, దర్యాప్తు అంశాలను ఆరా తీయడానికి రాజశేఖర్ బంధువులు, స్నేహితులు శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సమయంలో హతుడి సమీప బంధువు శ్యామ్ గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అటు రాజశేఖర్, ఇటు శ్యామ్ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకొన్నాయి. కారు కోసమే ఘాతుకమా? ప్రాథమిక ఆధారాలను బట్టి రాజశేఖర్ నడుపుతున్న కారు కోసమే ఆయన హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ప్యాసింజర్ల మాదిరిగా కారు బుక్ చేసుకుని, ఆపై వెనుక సీటు నుంచి మెడకు బెల్టు బిగించి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. కారు మరమ్మతులకు లోనుకావడంతోనే అక్కడ వదిలేసి పారిపోయినట్లు భావిస్తున్నారు. ఇదీ చదవండి: నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం -
నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
గ్రేటర్ పరిధిలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మిత్రుడి పుట్టిన రోజు వేడుకకు స్నేహితులతో కలిసి ఆనందంగా వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పడంతో ఇంటర్ విద్యార్థి అసువులు బాశాడు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన కోకాపేటలో చోటుచేసుకోగా.. రోడ్డు పక్కన స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ బాలుడు దుర్మరణం చెందిన మరో ఘటన అత్తాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. కీసర ఓఆర్ఆర్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా, రాంగ్రూట్లో వచ్చిన ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు మృత్యువాత పడిన ఘటన ఎల్బీనగర్ పరిధిలో జరిగింది. హైదరాబాద్: కూకట్పల్లికి చెందిన మదన్మోహన్ రెడ్డి (17) ఇంటర్ విద్యార్థి. మిత్రుడి పుట్టి న రోజు వేడుకల కోసం శనివారం రాత్రి మరో స్నేహితుడికి చెందిన కారు తీసుకుని వెళ్లాడు. వేడుకల అనంతరం కోకాపేట వైపు వెళ్లి వద్దామంటూ స్నేహితులతో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరారు. కోకాపేట నియోపోలిస్ వ్యూపాయింట్ వద్ద తెల్లవారు జామున కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న మదన్మోహన్రెడ్డి డోరులో నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న స్తంభానికి తగలటంతో తలకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయని కోకాపేట సెక్టార్ ఎస్సై మహేందర్, నార్సింగి ఇన్స్పెక్టర్ డి. విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు. స్తంభాన్ని బైక్ ఢీకొని.. వేగంగా దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో మైనర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కార్వాన్ మొగల్ నగర్కు చెందిన పదో తరగతి విద్యార్థి (14), అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడితో కలిసి ద్విచక్ర వాహనంపై కార్వాన్ నుంచి హైదర్గూడ వెళ్తున్నారు. వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డుపక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు. రాంగ్ రూట్లో వచ్చి.. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు చనిపోగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మలక్పేటకు చెందిన సయ్యద్ మాజ్ హుస్సేన్ (16), నారాయణగూడకు చెందిన హంజాలా, న్యూ మలక్పేటకు చెందిన అలీఖాన్ స్నేహితులు. ముగ్గురు కలిసి ఆదివారం తెల్లవారు జామున నమాజు కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తా సితార హోటల్ వద్ద రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. సయ్యద్ మాజ్ హుస్సేన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగతా ఇద్దరు స్నేహితులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి : ముందే పక్కా ప్లాన్.. హోటల్ గదిలో దారుణం -
ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!
హైదరాబాద్: ఓ మేనమామే ఆరేళ్ల వ యసున్న కోడలిపై అఘాయిత్యానికి ఒ డిగట్టాడు. కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆల స్యంగా ఆదివారం వెలుగు లోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ రాఖీ పండుగకు తన ఆరేళ్ల కూతురును తీసుకుని కాగజ్నగర్ పట్టణంలోని తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చింది.ఈ సమయంలో కూతురు అమ్మమ్మ దగ్గర ఉంటానని మారాం చేయడంతో అక్కడే వదిలి వెళ్లింది. అయితే బాలిక మేనమామ అయిన శశిధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శశిధర్కు వివాహమైనా భార్య పుట్టింట్లోనే ఉంటోంది.మూత్రం ఆగిపోవడంతో..ఐదు రోజులుగా బాలికకు మూత్రం రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ తన కూతురుకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లి పుట్టింటికి వెళ్లి కూతురును తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసి బాలికపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. సోదరుడిపైనే అనుమానం వచ్చిన తల్లి పుట్టింటికి వెళ్లి రోదిస్తూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ విషయం స్థానిక కౌన్సిలర్, కాలనీ పెద్దలకు ఆదివారం తెలిసింది.కాలనీలో విషయం వ్యాపించడంతో కాలనీ వాసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. మానవ మృగాన్ని ప్రజల మధ్యలోనే శిక్ష విధించాలని ఆందోళన చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటల తర్వాత పోలీసులు నిందితుడిని ద్విచక్రవాహనంపై పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన -
ఓ మహిళ విషయంలో వివాదం.. ఏడుగురికి గాయాలు
సాక్షి, అనంతపురం: ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మైలారంపల్లి గ్రామంలో ఓ మహిళకు సంబంధించిన విషయంపై ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడినట్లు సమాచారం.ఘర్షణలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వివాదం సద్దుమణగలేదు.దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇరువర్గాలు మరోసారి గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణంగా మారడంతో.. ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అక్కడ భద్రత ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి.. -
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నూరు మండలం శేషయ్యగారిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శేషయ్యగారిపల్లి వద్ద బస్సు వెనుక టైర్ కింద పడి గంగవరం నరసింహులు (18), మాలికా మణి (15) మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతులు కడపలోని లోహియా నగర్కు చెందినవారిగా తెలుస్తోంది. అదే ప్రమాదంలో కానూరు మనోహర్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో శేషయ్యగారిపల్లి వద్ద విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు -
పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు
భోపాల్: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లా జైలులో ఓ విచారణ ఖైదీ.. జైలు గార్డుపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన 9 రోజుల తర్వాత ఈ దృశ్యాలు బయటకు రావడం గమనార్హం. పండ్ల బుట్టలో దాచిన తుపాకీతో ఖైదీ జైలు గార్డుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో తాత్కాలిక జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశారు.ఖైదీ పేరు నీలేశ్ ఠాకూర్. రక్షాబంధన్ సందర్భంగా జైలులో నిర్వహించిన వేడుకల సమయంలో అతడు జైలు గార్డు దిగ్విజయ్ సింగ్ తోమర్పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యాయత్నం కేసులో ఠాకూర్ జైలులో ఉన్నట్లు ఉపవిభాగ పోలీసు అధికారి ప్రతిభా శర్మ తెలిపారు.గార్డును ఠాకూర్ ఒక్కసారిగా పట్టుకుని కాల్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. గార్డు తిరిగి ఎదురుదాడికి ప్రయత్నించగా.. ఖైదీ అతడిని పక్కకు నెట్టేసి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో ఉంది. ఠాకూర్ పండ్ల బుట్టతో ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి దాన్ని తెరవాలని తోమర్ను ఒత్తిడి చేశాడు. గార్డు నిరాకరించడంతో.. బుట్టలో దాచిన దేశీయంగా తయారు చేసిన తుపాకీని బయటకు తీసి అతడిపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.కాల్పుల్లో బుల్లెట్ తోమర్ వీపు ఎడమ వైపున తగలడంతో అతడు కుప్పకూలాడు. జిల్లా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన తర్వాత పరిస్థితి విషమించడంతో భోపాల్లోని ఎయిమ్స్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక జైలు సూపరింటెండెంట్ ఆర్కే.చౌరే, ఇతర గార్డులు వెంటనే అక్కడికి చేరుకుని ఠాకూర్ను పట్టుకున్నారని చెప్పారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అక్రమ ఆయుధం జైలులోకి ఎలా చేరిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.చౌరే సస్పెన్షన్ ఈ ఘటనలో తీవ్రమైన నిర్లక్ష్యం జరిగినట్లు అధికారులు గుర్తించడంతో చౌరేను వెంటనే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ సమయంలో ఆయనను జైలు ప్రధాన కార్యాలయంలో విధులకు కేటాయించారు. దర్యాప్తును జైళ్ల శాఖ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ సంజయ్ పాండేకు అప్పగించారు. మధ్యప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వరుణ్ కపూర్ మాట్లాడుతూ.. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదీ చదవండి: ‘నేను రాజీనామా చేస్తున్నా’.. అభిజీత్ దీప్కే కిర్రాక్ సెటైర్భద్రతా లోపంలో జైలు గార్డుల పాత్ర ఏమైనా ఉందా? ఠాకూర్కు ఆయుధం అందేందుకు ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో.. బయట నుంచి ఎవరో తుపాకీని జైలు లోపలికి విసిరారని ఠాకూర్ చెప్పినట్లు తెలుస్తోంది. రక్షాబంధన్ వేడుకల కోసం జైలులోకి తీసుకొచ్చిన స్వీట్లు, పండ్ల బుట్టల్లో ఒకదానిలో తుపాకీని దాచి ఉండవచ్చని చౌరే అంతకుముందు అనుమానం వ్యక్తం చేశారు. తుపాకీ జైలులోకి ఎలా చేరింది? ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? అనే విషయాలను దర్యాప్తు తేల్చనుంది.🚨 RAISEN : An undertrial prisoner allegedly attacked a jail guard during an escape attempt, firing a shot before striking him and throwing chilli powder into his eyes. The guard fought back and helped stop the escape, while a security probe was ordered. https://t.co/CrMAdCnAHR— indiainlast24hr (@indiain24hr) September 12, 2026 -
భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త!
భార్య వివాహేతర ప్రియుడిని గొంతు కోసి చంపిన భర్తకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ధర్మపురి జిల్లాలోని కరిమంగళంకు చెందిన పార్థిబన్, శారదాను గతంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత పార్థిబన్, అతని భార్య కృష్ణగిరి జిల్లాలోని హోసూర్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ నగర్లో నివసిస్తూ, సిబ్ కాట్ లోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ స్థితిలో హోసూర్ పార్వతీ నగర్ కి చెందిన అమావాసై, శారదాకి మధ్య పరిచయం ఏర్పడి, అది చివరికి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పార్థిబన్, ఆ సంబంధాన్ని వదులుకోమని తన భార్యను చాలాసార్లు మందలించాడు. అయినప్పటికీ, వారు తమ సంబంధాన్ని వదులుకోలేదు. ఈ స్థితిలో, 14.3.2017న, పార్థిబన్ తన భార్యతో తాను పనికి వెళ్తున్నానని చెప్పి, పనికి వెళ్లకుండా ఇంటి దగ్గర దాక్కున్నాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన అమావాసై, శారద సరదాగా గడుపుతున్నారు. ఇది చూసిన పార్థిబన్, తీవ్రమైన కోపంతో అమావాసై గొంతు కోసి చంపేశాడు. ఇది చూసి అతని భార్య శారద పారిపోయింది. ఈ విషయమై సిబ్కకట్ పోలీసులు కేసు నమోదు చేసి పార్థిబన్ ను అరెస్టు చేశారు. హోసూర్ అదనపు జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరుగుతున్న ఈ కేసులో జడ్జి సంతోష్ తీర్పు వెలువరించారు. అందులో, అమావసై గొంతు కోసి హత్య చేసినందుకు పార్థిబన్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
కర్ణాటక: పక్షవాతంతో మంచాన పడిన భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య ఉదంతమిది. ఈ ఘటన బెంగళూరు అవలహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ముబారక్, షహీనాబాను దంపతులకు 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. ముబారక్కు పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. వీరి కుమార్తెకూ ఆరోగ్యం బాగాలేదు. బాలికకు చికిత్స అందించే సాకుతో నహీముద్దీన్ ఖురేషి అనే వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొద్దిరోజులకు షహీనాతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో ఉండడంతో తమ సంతోషానికి అడ్డు అని, పైగా రోగిష్టి అని షహీనా భావించింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రచించింది. తల్లి హసీనా జాన్తో కలిసి భర్త మర్మాంగాన్ని కాలితో తన్ని తలపై దిండు పెట్టి చంపేసింది. కిత్తగనూరులోని యల్లప్ప గార్డెన్లో సెపె్టంబర్ 9న రాత్రి ముబారక్ (45) చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడని విలపిస్తూ షహీనా అందరినీ నమ్మించే యత్నం చేసింది. అయితే షహీనా వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ముబారక్ బంధువులు పోలీసులకు విషయం చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముబారక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ముబారక్ది సాధారణ మరణం కాదని, హత్యని తేలడంతో షహీనాబానును, ఆమె తల్లి హసీనా జాన్ను, షహీనా ప్రియుడు నహీముద్దీన్ ఖురేషిని అరెస్టు చేశారు. -
90 నిమిషాల్లో ఇద్దరు స్నేహితులను చంపిన ఆమె దొరికిపోయింది..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరు కేరళకు చెందిన స్నేహితుల హత్య కేసులో భారత సంతతికి చెందిన అనిలా బేబీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 28న శాన్జోస్, మిల్పిటాస్ ప్రాంతాల్లో 90 నిమిషాల వ్యవధిలో 2 హత్యలు జరిగాయి. మృతులను యాన్ మేరీ మ్యాథ్యూ(35), అంజనా హరి(35)గా గుర్తించారు. అనిలా బేబీతో పాటు మిగతా ఇద్దరు కేరళ మూలాలు ఉన్నవారే.మొదటి ఘటన శాన్జోస్లోని మ్యాథ్యూ ఇంట్లో జరిగింది. ఆమెను గొంతు నులిమి, కత్తితో పొడిచినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శాన్జోస్ పోలీసులు కూడా ఆమెకు కత్తిపోట్లు ఉన్నాయని, ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.దాదాపు 90 నిమిషాల తర్వాత మిల్పిటాస్లోని తమ అపార్ట్మెంట్ సముదాయం పార్కింగ్ ప్రదేశానికి అంజనా హరిని అనిలా బేబీ పిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్ సముదాయంలో నివసించేవారు. అంజనా అనిలా బేబీ వాహనం వద్దకు వెళ్లిన సమయంలో వాహనం ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి ఆమెను ఢీకొట్టి, హత్య చేసింది. అనంతరం అనిలా అక్కడి నుంచి పారిపోయి మరో మూడు వాహనాలను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత పోలీసులు ఓ దుకాణం సమీపంలో నీలిరంగు టయోటా వాహనాన్ని గుర్తించారు. వాహనం నడిపింది అనిలా బేబీనేనని గుర్తించారు. ఆమె అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కనిపించిందని, చేతులు, కాళ్లపై రక్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి శాంటా క్లారా కౌంటీ ప్రధాన జైలుకు తరలించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శాన్జోస్ పోలీసులు తెలిపారు. అనిలా బేబీపై 2 హత్య కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే 50 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.మృతుల భౌతిక కాయాలను భారత్కు, ముఖ్యంగా కేరళకు తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత రాయబార కార్యాలయం, కాలిఫోర్నియాలోని మలయాళీ సంఘం కూడా కుటుంబాలకు సహాయం చేస్తున్నాయి. శవపరీక్ష, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు త్వరగా పూర్తి కావాలని వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. -
ప్రియుడు ఫోన్ ఎత్తట్లేదని ఇద్దరు పిల్లల తల్లి..
బెంగళూరు: ప్రియుడు ఫోన్ చేయడం లేదు, ఆమె కాల్ చేసినా స్పందించడం లేదు.. దీంతో బాధకు లోనై ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలకోటలోని బాంబే కాలనీలో జరిగింది. మొబైల్ సంబంధాల మాయలో తరిగిపోతున్న కుటుంబ బాంధవ్యాలకు ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది. వివరాలు.. మెహబూబ్ బీ (27) మృతురాలు. ఈమె స్థానికంగా ఉంటున్న ఒక యువకునితో సంబంధం కలిగి ఉంది.కొన్నిరోజులుగా అతడు ఈమెకు కాల్ చేయకపోగా, ఈమె ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు. దీంతో మెహబూబ్ బీ సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతనికి పంపింది. నాతో మాట్లాడకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ మెసేజ్ కూడా పంపింది. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. విరక్తి చెందిన మెహబూబ్ బీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రూ.20 కోట్ల చిట్టీలు.. దంపతులు మాయం! అసలు కథేంటి?
హైదరాబాద్: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.20 కోట్లు వసూలు చేసిన దంపతులు అదృశ్యమయ్యారు. 15 రోజులుగా ఆ దంపతులు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం హెచ్ఎంటీ హిల్స్లోని వారి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. హెచ్ఎంటీ సాయిచరణ్ కాలనీకి చెందిన సీత, రమణా రెడ్డి దంపతులు చిట్టీల వ్యాపారం మొదలుపెట్టారు.అయితే చిట్టీల వాయిదాలు పూర్తయినప్పటికీ తమకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని అడిగేందుకు వెళితే వాయిదా వేస్తూ తీరా కనిపించకుండా పోయారు. అందరికి చిట్టీల డబ్బు రూపంలో సుమారు 20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని బాధితులు పేర్కొంటున్నారు. చిట్టీలు పాడుకున్న వారికి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు.పైగా తమకు కోర్టు ద్వారా నోటీసులు పంపించడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సొమ్మును తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితులు ఆరోపిస్తున్నట్లుగా కాకుండా ..రూ.60 లక్షలు మోసపోయినట్లు ఆరుగురు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మిగతా వారు కూడా ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇవీ చదవండి: ‘క్యూర్’ బిల్లు.. హైదరాబాద్ పాలనలో కీలక మార్పులే! -
భార్య, పెళ్లికెదిగిన ముగ్గురు కుమార్తెల హత్య, స్థానికంగా కలకలం
రాజస్థాన్లోని జైపూర్ పరిధిలోని గోవింద్ పురాలో భార్యాబిడ్డల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న భార్య, ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అక్కడి నుంచి ఉడాయించాడో వ్యక్తి. ఈ అమానుషం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ దాడిలో 40 ఏళ్ల గీతా ఝా, ఆమె ముగ్గురు కుమార్తెలు నందిని, గిరీష, రాధిక (17-23 ఏళ్లు) మృతి చెందారు. మృతురాలి భర్త, పిల్లల తండ్రి రాహుల్ ఝాగా నిందితుడిగా గుర్తించారు. కుటుంబంలో చెలరేగిన తీవ్రమైన వివాదాలే ఈ దారుణ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యల అనంతరం ఏమీ ఏరగనట్టుగా పాలవాడి దగ్గర పాలుతీసుకొని, తండ్రికి టీ పెట్టి వచ్చి, ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. రాహుల్ ఝా షేర్ ట్రేడింగ్ చేసేవాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే ఆయన గుజరాత్ నుండి జైపూర్కు తిరిగి వచ్చారు. భార్య గీతా ఝా తమ ఇంటి మొదటి అంతస్తులో ఒక బొటిక్ను నడిపేవారు. వారి పెద్ద కుమార్తె నందిని చదువుకుంటూనే ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు.ఈ హత్యలకు కేవలం మూడు రోజుల ముందు రాహుల్ ఒక పొరుగింటి వ్యక్తి వద్ద రూ. 25,000 అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కాబోయే భార్యని ఇంప్రెస్ చేద్దామని, ఏఐతో ఏకంగా..!వెలుగులోకి వచ్చిందిలాశుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఎలాంటి కదలికలు లేకపోవడంతో పొరుగువారు, బంధువులకు అనుమానం వచ్చి చూడటంతో ఈ ఘోరం బయటపడింది. మరోవైపు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడి 85 ఏళ్ల తండ్రి ఇంట్లోనే ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు, డాగ్ స్క్వాడ్ ప్రదేశాన్ని పరిశీలించి రక్త నమూనాలు, ఆధారాలను సేకరించాయి. దాడికి ఉపయోగించిన ఇటుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసిపి (వెస్ట్) ప్రశాంత్ కిరణ్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నగర సరిహద్దుల్లో తనిఖీలు తీవ్రతరం చేసి, రాహుల్ ఝా ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.ఇదీ చదవండి: రూ. 100 కోట్ల బ్లాక్ బ్లస్టర్ : వారికి లగ్జరీ కార్లు, వామికాకు మొండి చేయి? -
మంటల్లో స్కూల్.. ఆపై తొక్కిసలాట.. 29 మంది మృతి
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. స్కూల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అగ్నికీలల్లో చిక్కుకుని 29 మంది మృతి చెందగా.. వారిలో 24 మంది చిన్నారులే ఉన్నారు. మృతుల్లో 19 మంది బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బుకావు నగరంలో చోటుచేసుకుంది.బుకావు(Bukavu)లోని చింపుండా ప్రాంతంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు తొలుత ఒక ప్రాంతంలో మొదలై.. సమీపంలోని ఉజామా ప్రైమరీ స్కూల్, ఫురాహా సెకండరీ స్కూల్కు వ్యాపించాయి. పాఠశాలలతో పాటు సమీపంలోని దాదాపు 300 చెక్క ఇళ్లు కూడా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ బుకావు రీజియన్ అంతా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండడం గమనార్హం.మంటలు.. ఆపై తొక్కిసలాటమంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు ఒకరినొకరు తొక్కుకుంటూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. మరికొందరు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. తొక్కిసలాటలోనూ పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.స్థానిక క్లినిక్ నర్సు క్రిస్టోఫ్ జిగషానే తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 50 మంది విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులను తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. కొందరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.#RDC – #Bukavu : 15 élèves morts dans un incendie à KashekeLe bilan provisoire des incendies survenus ce jeudi à Kasheke, à Bukavu, fait état de 15 élèves morts et de plusieurs blessés graves, selon les autorités locales.Les victimes sont des élèves des écoles Ujamaa et… pic.twitter.com/HCT2xcL0mL— Steve Wembi (@wembi_steve) September 10, 2026క్షతగాత్రులకు చికిత్సఈ ప్రమాదంలో మరో 29 మంది చికిత్స పొందుతున్నట్లు ఏఎఫ్సీ/ఎం23(AFC/M23) తిరుగుబాటు ఉద్యమ ప్రతినిధి లారెన్స్ కన్యుకా తెలిపారు. వారిలో 21 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 17 మంది కడుటు జనరల్ ఆస్పత్రిలో, మరో నలుగురు బుకావు ప్రావిన్షియల్ జనరల్ ఆస్పత్రిలో ఉన్నట్లు వెల్లడించారు.బుకావు నగరం 2025 ఫిబ్రవరి నుంచి రువాండా మద్దతు ఉన్న AFC/M23 తిరుగుబాటు సంస్థ ఆధీనంలో ఉంది. ఖనిజ సంపదకు పేరుగాంచిన తూర్పు ప్రాంతాల్లో ఈ సంస్థ తన ఆధిపత్యాన్ని విస్తరించుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతంలో ఇంత భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.ఇదీ చదవండి: భారతీయులపై ట్రంప్ మరో పిడుగు -
కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురి విషాదం!
ఆంధ్రప్రదేశ్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోని పీసీ ప్యాపిలి సబ్స్టేషన్ వద్ద బైక్ను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను వజ్రకరూరు గ్రామానికి చెందిన జైనుల్లా, మహాబూబ్ బాషా, మహమ్మద్ రఫీగా గుర్తించారు. అయితే, వీరు ముగ్గురూ ఒకే బైక్పై ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండలో కోర్టు పనిమీద వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. వీరు ప్రయాణం చేస్తున్నటువంటి బైక్ పీసీ ప్యాపిలి సబ్స్టేషన్ సమీపంలోకి చేరుకున్న తరుణంలో ప్రమాదావశాత్తు ఐచర్ వాహనాన్ని బలంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
చౌటుప్పల్లో విషాదం.. డీసీఎం ఢీకొని ఒకరి మృతి
తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరిని డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బైక్పై ఉన్నవారిలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, రోడ్డు ప్రమాదం జరిగిన చోటు కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఆ స్కూల్ నాదే.. ఆ వైపు వెళ్లకండి!
అనంతపురం: నగరంలోని ట్రెల్లీస్ పాఠశాలలో బాలికపై అక్కడ పనిచేస్తున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి వేధించాడన్న అభియోగాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో తరగతి చదువుతున్న బాలిక బాత్రూంకు వెళ్లిన సమయంలో అక్కడ శుభ్రత పనులు చేసే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ తర్వాత కూడా బాలికను వేధించాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి వద్ద బాలిక ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ‘చిన్న విషయం’గా ఎలా చూస్తారు? తమ కుమార్తెపై జరిగిన అఘాయిత్యాన్ని పాఠశాల యాజమాన్యం చిన్న విషయంగా చూస్తోందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కరస్పాండెంట్ వడ్ల శ్రీకాంత్ , డైరెక్టర్ అనిల్ తేజ తమ ఫిర్యాదుపై సరిగా స్పందించలేదన్నారు. ప్రశ్నిస్తే తమకు రాజకీయ, పోలీసు అధికారుల అండ ఉందంటూ బెదిరించారన్నారు. పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్యను చిన్నదిగా చూడటం బాధ కలిగించిందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. ఆ స్కూల్ నాదే.. ఆ వైపు వెళ్లకండి! అనంతపురం సెంట్రల్: నగరంలో ట్రెల్లీస్ స్కూల్లో వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఓ ద్వితియ శ్రేణి టీడీపీ నాయకుడు పెద్దస్థాయిలో మంత్రాంగం నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రెలీస్సూ్కల్ యాజమాన్యం జీసస్ నగర్, బళ్లారి బైపాస్ రోడ్డులో బ్రాంచులు నడుపుతోంది. గత 20 రోజులుగా స్కూల్లో విద్యార్థులపై వరుస ఘటనలు జరుగుతున్నాయి. గత నెల 22న బళ్లారి బైపాస్ బ్రాంచ్లో 10వ తరగతి చదువుతున్న హర్షిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థి విచక్షణా రహితంగా దాడి చేశాడు. కంటి వద్ద బలమైన గాయమైంది. పిల్లలు కొట్టుకున్నా.. విద్యార్థికి తీవ్ర గాయమైనా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా టీసీ తీసుకొని వెళ్లిపోండి అంటూ బెదిరించారు. దీంతో బాధిత విద్యార్థి తల్లి నాగలక్ష్మి న్యాయం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీజగదీష్ ను కలిసి వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇక ఇటీవల బాత్రూమ్కు వెళ్లిన ఓ బాలికపై అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడు. రంగంలోకి టీడీపీ నేత ట్రెల్లీస్ యాజమాన్యంపై చర్యలు లేకుండా ఉండేందుకు అధికార టీడీపీకి చెందిన నేత రంగంలోకి దిగాడు. సదరు స్కూల్లో తనకూ వాటా ఉందని పోలీసులతో బేరసారాలకు దిగాడు. ఇందుకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పేరు వాడుకొని పోలీసు స్టేషన్లలో దుప్పటి పంచాయితీలు చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాణినగర్లో జరిగిన డీజే వివాదంలో కూడా అటు పోలీసులకు.. ఇటు బాధితులకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఇతనికి పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపస్తున్నాయి. అందులో భాగంగానే ట్రెల్లీస్ స్కూల్యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. పోలీసులు చట్టపరంగా కేసు నమోదు చేశామని చెబుతున్నా... నిందితుని అరెస్ట్.. యాజమాన్యంపై కేసులు నమోదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: స్కామ్పై సర్కారు సైలెన్స్! -
పుట్టింటికి పంపడం లేదని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: తనను పుట్టింటికి పంపడానికి భర్త నిరాకరిస్తున్నాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ముద్దం నాగలక్ష్మీ (18) వివాహం ఏడు నెలల క్రితం అదే జిల్లా తూడికుర్తి మండలానికి చెందిన మాదగాని శేఖర్ (32)తో జరిగింది. ఓ హోటల్లో పనిచేస్తున్న శేఖర్ భార్యతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–4లోని సుఖ్దేవ్నగర్లో ఉంటున్నాడు. కొంతకాలంగా నాగలక్ష్మీ పుట్టింటికి వెళ్తానని భర్తను అడుగుతోంది. కొద్ది రోజుల తర్వాత వెళ్లాలని శేఖర్ సర్దిచెప్పి డ్యూటీకి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల రాఖీల పండుగ, బోనాల పండుగ సందర్భంగా అల్లుడు శేఖర్ తన కూతురిని పుట్టింటికి పంపలేదని, దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ సంధ్యారాణి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం! -
భర్తను వదలి మరో వ్యక్తితో సహజీవనం!
అనుమానాస్పద రీతిలో చైత్ర (28) అనే వివాహిత చనిపోయిన ఘటన తాలూకా పరిధిలోని చొక్కహళ్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం తాలూకా ఇనమించేనహళ్లికి చెందిన చైత్ర 8 సంవత్సరాల నుంచి భర్తను వదలి చొక్కహళ్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివాసముంది. ఆమెకు 10, 12 సంవత్సరాల గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచనబలెకు చెందిన షబ్బీర్ అనే వ్యక్తి చైత్రతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చైత్రను కొట్టి తరువాత అతడే ఉరి వేసి చంపాడని చైత్ర బంధువుల ఆరోపిస్తున్నారు. అతడే ఆమెను చిక్క ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడానికి తీసుకెళుతుండగా దారిలో చనిపోయిందని నాటకం ఆడుతున్నాడని వాపోయారు. తరువాత షబ్బీర్ ఆమె మొబైల్ని తీసుకుని పరారు కావడం అనుమానాలకు తావిస్తోంది. నందిగిరి ధామ పోలీసులు కేసు దాఖలు చేసుకొని షబ్బీర్ కోసం గాలిస్తున్నారు.-బెంగళూరు చదవండి: నాకేం తెలియదు.. అంతా నా భర్తే చూసుకుంటాడు -
చిన్న ఖర్చుకూ మామనే అడగాలా?..
సంపన్న కుటుంబానికి ఆమె కోడలిగా వెళ్లింది. అయితే అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెను మనశ్శాంతి కరువైందట. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా. ఏం చేసినా ఓ కన్నేసి చూసే పిసినారి మామ. నచ్చిన దుస్తులు వేసుకుంటే.. సూటిపోటి మాటలు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే ప్రశ్నలు. చిన్న ఖర్చుకూ భార్యభర్తలిద్దరూ ఆయన్నే డబ్బులు అడగాల్సిన పరిస్థితి.. ఇవన్నీ ఆమెలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఆ అసహనం.. కోపంగా మారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్కు చెందిన 63 ఏళ్ల ఫార్మాస్యూటికల్ వ్యాపారి వినీత్ మినోచా దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఆయన కోడలే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చేశారు. మాజీ పనిమనుషులకు సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలిసింది. నేరాంగీకారంలో ఆమె విస్తుపోయే విషయాలే వెల్లడించింది. సెప్టెంబర్ 5 శనివారం రాత్రి తన ఇంట్లో వినీత్ దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఆ కుటుంబానికి గతంలో పనిచేసిన విశాల్ (30), అతడి సహచరుడు రాజ్ కిశోర్పై అనుమానం వచ్చింది. ఆదివారం రాత్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో విశాల్ ఇచ్చిన సమాచారంతో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వినీత్ కోడలు షాలు (36) తన మామను హత్య చేయాలని తమను సంప్రదించిందని విశాల్ పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం రూ.6 లక్షలు ఇస్తానని ఆమె ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు షాలును అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆమె.. ఆ తర్వాత తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.షాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మామ తన కదలికలను నిరంతరం గమనించేవారు. రాత్రిళ్లు పార్టీలకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. తనకు, తన భర్తకు సంబంధించిన చిన్న ఖర్చులకు కూడా మామను డబ్బులు అడగాల్సి వచ్చేదని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.ఆ రాత్రి..జూలై 28న పార్టీ నుంచి షాలు ఆలస్యంగా ఇంటికి రావడంతో మామతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన తర్వాతే ఆమె మామపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వినీత్ దగ్గర గతంలో పని చేసిన విశాల్ను ఆమె సంప్రదించింది. సెప్టెంబర్ 6న రూ.2 లక్షలు, మిగిలిన రూ.4 లక్షలను 15 రోజుల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు హత్య కోసం ఫ్లాట్ డూప్లికేట్ తాళం చెవిని కూడా షాలు ఏర్పాటు చేసి విశాల్ చేతికి అందించింది. జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4న అతడిని ఇంటికి పిలిచి.. హత్య స్కెచ్ను వివరించింది. గుండెపోటుగా..శనివారం రాత్రి షాలు తన భర్త సుబ్రత్, కుమారుడితో కలిసి పార్టీకి వెళ్లింది. వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విశాల్, రాజ్ కిశోర్ ఫ్లాట్కు చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డు మదన్ వారిని అడ్డుకోవడంతో.. విశాల్ వెంటనే షాలుకు ఫోన్ చేశాడు. వాళ్లిద్దరూ మందులు తెచ్చారని.. లోపలికి అనుమతించాలని గార్డుకు ఆమె చెప్పింది. అయితే వినీత్ను దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయడం.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నది వాళ్ల ప్లాన్. అయితే జరిగింది వేరు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరూ.. బెడ్రూమ్లో దాక్కున్నారు. వినీత్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఏకంగా 26 సార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.రక్తపు మడుగులో మామ..పార్టీ ముగించుకుని షాలు, ఆమె భర్త సుబ్రత్ రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్రూమ్లో వినీత్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులేవీ దొంగిలించకపోవడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. దీంతో తొలినుంచే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని.. కుటుంబంలో వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.ప్రస్తుతం షాలు జైలులో ఉంది. మరోవైపు ఆమె భర్త సుబ్రత్ ఈ కుట్ర గురించి ముందే తెలుసా? హత్యలో అతడి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం అతడి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: యూట్యూబర్ రమా నందన సంచలన వాంగ్మూలం -
మాస్క్ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది!
హైదరాబాద్: పోలీసులు గుర్తించకుండా మాస్క్ పెట్టుకొని దొంగతనానికి పాల్పడిన నిందితుడిని కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడిన ఓ మచ్చ పట్టించింది. దొంగతనం జరిగిన 48 గంటల్లోనే జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్రోడ్ నెం.10లో నివసించే ప్రముఖ మద్యం వ్యాపారి శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లోకి గత నెల 31న ఓ దొంగ ప్రవేశించి అల్మారాలోని నగలు తస్కరించి పరారయ్యారు.అంతకుముందు ఇదే రోడ్డులో రెండు ఇళ్లల్లో దొంగతనానికి యత్నించి విఫలమై మూడో ఇల్లు శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లో పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించగా ఆయన భార్య నీలు కౌర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇక్కడ సీసీ ఫుటేజీలు, వేలి ముద్రలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి మాస్క్ ధరించగా కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడ్డ ఓ మచ్చను పోలీసులు గమనించారు. పాత నేరస్తుల కదలికలను పరిశీలించిన కనురొమ్మలపై మచ్చ ఉన్న వ్యక్తిని గుర్తించారు.గత నెల మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన కేసులో నిందితుడి వివరాలు నమోదయ్యాయి. ఈ మచ్చ ఆధారంగా పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పెందుర్తికి చెందిన గౌరేష్(27) బంజారాహిల్స్రోడ్ నెం. 2లోని ఇందిరానగర్లో అద్దెకు ఉంటూ జూనియర్ ఆరి్టస్ట్గా పని చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలపై దృష్టి పెట్టాడు. శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లో పది తులాల బంగారం దొంగతనం చేసి అందులో కొంత విక్రయించి గోవాకు ఫ్లైట్లో వెళ్ళాడు.గోవాలో ఓ క్యాసినోలో జూదం ఆడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. బంగారం రికవరీ చేసే దిశలో పలు కోణాల్లో విచారణ కొనసాగుతున్నది. చోరీ జరిగిన 48 గంటల్లోనే క్రైం పోలీసులు నిందితుడిని పట్టుకోవడంలో విజయం సాధించారు. నిందితుడు గౌరేష్ గతంలో మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోనూ దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చి పేకాట కోసం జూబ్లీహిల్స్లో దొంగతనం చేశాడు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాద ఛాయలు
వైఎస్ఆర్: జిల్లాలోని నందలూరు మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నందలూరు మండలం వెంకట రాజంపేట గ్రామానికి చెందిన చింతకాయల వెంకటరతయ్య (40) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరతయ్య పని నిమిత్తం తన పొలంలో ఉన్నటువంటి కరెంటు మోటార్ గదిలోనికి వెళ్లాడు. అయితే, అతను వెళ్లిన గదిలో విద్యుత్ తీగలు వేలాడుతున్నట్లుగా ఉన్నాయి. అయితే, ప్రమాదావశాత్తు ఆ కరెంటుతీగలు అతనికి తగిలాయి. దీంతో వెంకటరతయ్య ఒక్కసారిగా తీవ్ర విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఈ విషయం గురించి సమాచారం అందుకున్న నందలూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, విద్యుత్ వైరు ఎలా తగిలింది, విద్యుత్ మోటార్ గదిలో భద్రతా చర్యలు ఉన్నాయా లేదా అనే అంశాలపై పోలీసులు విచారణకై మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
జైలు నుంచి వచ్చాక.. ఆ షుగర్ డాడీ పని పడతా!
భార్యపై అనుమానంతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె తలను ఫ్రిడ్జిలో భద్రంగా దాచాడు. ఈ ఘటన దేశం మొత్తాన్ని నివ్వెర పోయేలా చేసింది. అయితే పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తాజాగా మీడియా ఎదుటే.. తన భార్యను చంపినందుకు బాధపడడం లేదని, బయటకు వచ్చాక మరో వ్యక్తిని చంపి తీరతానంటూ నిందితుడు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.అస్సాం రాజధాని గువాహటి(గౌహతి) సమీపంలో జరిగిన ఈ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య రియా తాలుక్దార్ (25)ను హత్య చేసి, ఆమె తలను నరికి ఫ్రిజ్లో దాచి పెట్టాడు రమానుజ్ గోస్వామి. అయితే మంగళవారం కోర్టుకు తరలిస్తున్న సమయంలో హతిగావ్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడాడు. ‘‘జైలు శిక్ష పూర్తయ్యాక బయటకు వచ్చి ఆ షుగర్ డాడీని చంపుతా’’ అంటూ హెచ్చరించాడు.అయితే ఆ వ్యక్తి ఎవరని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించగా.. అతడు కోపంతో ఊగిపోయాడు. ‘‘నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. క్షమాపణ కూడా చెప్పను’’ అని చెప్పాడు. Wife murder accused Ramanuj Goswami allegedly showed no remorse over the killing of Riya Talukdar during questioning at Hatigaon Police Station.Ramanuj reportedly made shocking remarks and even threatened another person referred to as a “sugar daddy.”He also allegedly… pic.twitter.com/hY2uVDyELC— The Sentinel (@Sentinel_Assam) September 8, 2026భార్యపై అనుమానంతోనే?రియా, రమానుజ్లకు సుమారు ఆరు నెలల క్రితమే వివాహమైంది. అయితే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని.. భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో రమానుజ్ వివాదానికి దిగేవాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్ 3న జరిగిన గొడవలో ఆవేశానికి లోనై రియాపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనల క్రమాన్ని దర్యాప్తు ద్వారా నిర్ధారించాల్సి ఉంది.దుర్వాసనతో వెలుగులోకి..సెప్టెంబర్ 6న హటిగావ్-బసిస్థాపూర్ ప్రాంతంలోని దంపతుల నివాసం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకు రెండ్రోజుల ముందు నుంచి.. కుటుంబ సభ్యులు వాళ్లకు కాంటాక్ట్ మిస్ అయ్యారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రియా మృతదేహం కనిపించింది. శరీరం కొంత కుళ్లిపోయిన స్థితిలో ఉండగా.. తల కనిపించలేదు. ఇంట్లోని ఫ్రిజ్ను తనిఖీ చేయగా పాలిథిన్ సంచిలో చుట్టి ఉంచిన రియా తలను గుర్తించారు. ఆమె వేళ్లు కూడా నరికిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులకు లొంగిపోయిన భర్తఘటన అనంతరం రమానుజ్ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులకు అప్పగించాడు. ఆపై మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.‘షుగర్ డాడీ’ ఎవరు?షుగర్ డాడీ అంటే Sugar Daddy సాధారణంగా తనకంటే చిన్న వయసున్న వ్యక్తికి డబ్బు, ఖరీదైన బహుమతులు ఆశచూపి లోబర్చుకోవడం. రమానుజ్ చేసిన తాజా వ్యాఖ్యలు.. ఈ కేసులో మరో కోణాన్ని తెరపైకి తెచ్చాయి. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమా? అనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. పైగా ‘షుగర్ డాడీ’ని శిక్ష పూర్తయ్యాక తిరిగొచ్చి చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి ఎవరు? రియాతో అతడికి ఎలాంటి సంబంధం ఉంది? నిజంగానే అలాంటి సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.పోలీసు కస్టడీకి అనుమతిరమానుజ్ను కోర్టులో హాజరుపరచగా ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఘటన జరిగిన సమయం, నిందితుడి కదలికలు, ఆయుధం వినియోగం తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికలతో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. -
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్ను కొట్టి చంపేశారు
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట జరుగుతున్న గోల, అరుపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన 55 ఏళ్ల మణిపురి సంగీత విద్వాంసుడు చోంగ్థమ్ విక్రమ్ సింగ్ను దారుణంగా కొట్టి చంపారు కొంతమంది దుండగులు. ఇంటి బయట పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది, దాబా సిబ్బందితో జరిగిన వివాదం చివరకు దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనాయి. ఆగ్నేయ ఢిల్లీలోని సన్లైట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలోక్రి వద్ద 17 ఏళ్లుగా ప్రైవేట్ సంగీత ఉపాధ్యాయుడిగా, గిటారిస్ట్గా పనిచేస్తున్న చోంగ్థమ్ విక్రమ్ను కొందరు వ్యక్తులు కొట్టి హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆగ్నేయ ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి ఆదివారం అర్ధరాత్రి విక్రమ్ చెత్త పారవేయడానికి తన మూడవ అంతస్తులోని ఫ్లాట్ నుండి కిందికి వెళ్ళారు. తన ఇంటి వద్ద దాబా కార్మికులు, డెలివరీ బాయ్స్ చేస్తున్న అరుపులు, గోల భరించలేక విక్రమ్ సింగ్ కిందకు వచ్చి గోల చేయ వద్దని కోరారు. ఈ క్రమంలో జరిగిన వివాదంతో రెచ్చిపోయిన ఎనిమిది మంది ఆయనపై దాడికి దిగారు. అపార్ట్మెంట్లో థర్డ్ఫ్లోర్దాకా తరుముకుంటూ వచ్చి కారిడార్లో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విక్రమ్ను ఆయన కుమారుడు యైఫాబా సమీపంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గాయపడిన విక్రమ్ను మెట్ల మీదుగా మోసుకెళ్తున్న దృశ్యాలు, దాడి చేసినవారు అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైనాయి. ఈ కేసులో ఏడుగురుని అరెస్టు చేయడంతో పాటు ఒక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానిక హోటళ్లలో ఫుడ్ ప్యాకింగ్, డెలివరీ పనులు చేస్తున్నారు. అరెస్టు అయిన వారిని భరత్ కుమార్(19), ప్రమోద్(26), రంజాన్ ఖాన్(22), విజయ్(36), దీపాంశు (21), మోహన్ విశ్వకర్మ(32), మన్ను(26) గా గుర్తించారు.Chongtham Vikram Singh ji, a renowned musician from Manipur, went downstairs to ask some men to lower the noise outside his home. He was beaten to death for it.A father, killed outside his own home, in his own country's capital. After many such incidents, every Northeast family…— Rahul Gandhi (@RahulGandhi) September 8, 2026Manipuri musician beaten to death for objecting to shouting, drinking outside his Delhi flat; 7 held#ChongthamVikramSingh pic.twitter.com/U0fZBjClqa— Raajeev Chopra (@Raajeev_Chopra) September 7, 2026చోంగ్థమ్ విక్రమ్ సింగ్ మణిపూర్లో పేరుగాంచిన సంగీత విద్వాంసుడు. ఆయన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు చోంగ్థమ్ ఓంగ్బి కమలా దేవి కుమారుడు. అలాగే భారత్కు చెందిన మొదటి బాఫ్టా (BAFTA) అవార్డు పొందిన చిత్ర దర్శకురాలు లక్ష్మీప్రియ దేవికి విక్రమ్ వరుసకు సోదరుడు అవుతారు. ఆయన ఢిల్లీలో ఒక మ్యూజిక్ స్కూల్ను కూడా నడుపుతున్నారు. ఈ ఘటన అనంతరం, మణిపురి సమాజ సభ్యులు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్ : యజమాని అరెస్ట్ఈ ఘటన సమయంలో అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్ డిప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు బాధితుడి కుటుంబాన్ని, కమ్యూనిటీ సభ్యులను కలిసి చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సింగ్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్లో సింగర్ హఠాన్మరణంహోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖపై రాహుల్ గాంధీ ఆగ్రహంలోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చోంగ్థమ్ విక్రమ్ సింగ్ హత్యను తీవ్రంగా ఖండించారు. విక్రమ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన హోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులు ఏమి చేస్తున్నారని మండి పడ్డారు. సత్వరమే విచారణజరిపి దోషులను శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు.ఈ హత్యను మద్యం మత్తులో జరిగిన హింసాత్మక ఘటనగా కొట్టిపారేయకూడదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా అన్నారు. పెద్ద శబ్దంతో సంగీతం, బహిరంగ గొడవలు, నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి వాటిని ఏళ్లుగా సహించడం వల్లే ఈ స్థితికి దారితీసిందన్నారు. ఢిల్లీలోని తన ఇంటి బయట శబ్ద కాలుష్యంపై అభ్యంతరం చెప్పినందుకు సింగ్ను కొట్టి చంపారని ఖేరా అన్నారు. ఇటువంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా నిబంధనలను స్థిరంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.THIS IS SHOCKING🚨😡Delhi.Modi’s capital.BJP’s city.Manipuri musician Chongtham Vikram Singhobjected to drunk boys making noise outside his home.They beat him on the road.Chased him into his third-floor flat.Beat him again.Hours later, he was dead in hospital.His… pic.twitter.com/QN3cr5TV7x— The Rebel (@TheRebel_IN) September 8, 2026ఇదీ చదవండి: రీల్ స్టంట్ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్లోకి..కట్ చేస్తే! -
భర్త ఫోన్ ఎత్తలేదని భార్య ఆత్మహత్య
భర్త తన ఫోన్ ఎత్తలేదని క్షణాకావేశంతో ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. టౌన్ ఎస్సై బషీరుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామా నికి చెందిన దారావత్ శారద కుమార్తె అఖిల (20)ను రెండేళ్ల క్రితం మహ బూబాబాద్కు చెందిన బానోత్ హుస్సేన్కు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక కుమార్తె. హుస్సేన్ మహబూ బాబాద్ జిల్లా కేంద్రంలో ఓ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో మేనేజ రుగా ఉద్యోగం చేస్తున్నాడు. అఖిల ఇటీవల తన తల్లిగారింటికి వెళ్లింది. పాప ఏడుస్తోందని భర్తతో మాట్లాడేందుకు ఈ నెల 2వ తేదీన వీడియో కాల్ చేయగా, అతను కాల్ లిఫ్ట్ చేయ లేదు. దీంతో అఖిల వెంటనే మహ బూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటికి వచ్చింది. కొంత సమయం తర్వాత ఆమె తల్లి కూడా వారింటికిరాగా అప్పటికే అఖిల అపస్మార కస్థితిలో ఉండటంతో వెంటనే హుస్సేన్కు ఫోన్ చేసింది. అతను ఇంటికి వచ్చి అఖిల ఎలుకల మందు పేస్టు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించగా, సోమవారం తెల్లవారుజామున అఖిల మృతిచెందింది.చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది? -
కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం!
హైదరాబాద్: కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో భౌరంపేట్లోని రుద్ర సంస్థ సమీపంలో ఓ కారు మంటల్లో కాలిపోతోందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఓ వ్యక్తి మంటల్లో కాలిపోయి ఉన్నాడు.భౌరంపేట్లోని ప్రణీత్ ప్రణవ్ మిడోస్కు చెందిన కార్తీక్(40)గా పోలీసులు గుర్తించారు. లాండ్రీ బిజినెస్ చేసే అతను రెండున్నర సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలకు తోడు ఆర్థిక సమస్యలు ఉండటంతో కారులో నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇవి కూడా చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది? -
పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
హైదరాబాద్: వివాహం జరిగిన ఆరు నెలల్లోనే ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతికి చెందిన కాక కీర్తి (28) క్యూర్ ఆర్థో ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తూ కుషాయిగూడ, వైష్ణవి ఎంక్లేవ్లో నివాసం ఉంటోంది. ఏడాది నుంచీ ఇక్కడే ఉంటున్న డాక్టర్ కీర్తి ఆరు నెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాఘవను వివాహం చేసుకుంది.పనిపై భర్త రాఘవ తిరుపతికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో వంటగదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్ ఇంటి పైపోర్షన్లోనే కీర్తి అద్దెకు ఉంటోంది. సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది కీర్తి ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. దీంతో వారు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా కీర్తి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన 6 నెలలకే ఆమె ఇలా ఆత్మహత్యకు పాల్పడటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం క్రితం తిరుపతికి వెళ్లిన భర్త ఎందుకు తిరిగిరాలేదు... భార్యతో గొడవపడి వెళ్లాడా లేక ఏదైనా పనిపై వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు తిరుపతి నుంచి బయలుదేరారని, వారిచ్చే ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి తెలిపారు.ఇవీ చదవండి: కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్! -
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
తెలంగాణ: కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కల్లెడ శివారు ధర్మపురి రోడ్డులో జరిగింది.స్థానికుల సమాచారం ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అంబులెన్స్కి సమాచారం అందించి, క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశారు.అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాత్రి మహేష్ (23) పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురిని చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
రాయచోటి ఘాట్లో ఘోరం.. లారీ బోల్తా, ఇద్దరు సజీవ దహనం!
వైయస్సార్ కడప: జిల్లాలోని రాయచోటి ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాయచోటి నుంచి కడపకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ కడప, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని ఘాట్లో ప్రమాదానికి గురైంది. ఘాట్లోని మలుపు వద్ద లారీ అదుపుతప్పి ఎడమవైపు తిరగకుండా నేరుగా అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.అయితే, లారీ బోల్తా పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో లారీ డ్రైవర్, క్లీనర్ చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.అలాగే, లారీకి అంటుకున్న మంటలు సమీపంలోని అడవికి వ్యాపించగా, అటవీ ప్రాంతం దట్టంగా ఉండటంతో మంటలు వేగంగా విస్తరించి పెద్ద ఎత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. దీంతో ఘాట్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఫైర్ ఇంజన్లను రప్పించి లారీకి అంటుకున్న మంటలతో పాటు అడవిలో వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే, లారీ అదుపుతప్పడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
పుట్టినరోజు నాడే నూరేళ్లు నిండాయి!
విశాఖపట్నం: నేడు పుట్టినరోజు. కొత్త దుస్తులు ధరించి, మిత్రులతో సరదాగా గడపాలి. అమ్మానాన్నల ఆశీస్సులు అందుకోవాలి. ఇదీ ఆ యువకుడి ఆశ. కానీ, విధి మరోలా తలచింది. పుట్టినరోజు సంబరాల ఏర్పాట్లు చేసుకుని బైక్పై ఇంటికి వస్తుండగా మృత్యువు కాటేసింది. స్నేహితుడితో కలిసి బైక్పై వస్తుండగా ఎన్ఏడీ జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బస్సు మీద నుంచి వెళ్లిపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. రెండు బస్సుల మధ్య.. ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్కు చెందిన తంగుడు మదన్ (24) ఆదివారం తన పుట్టినరోజు కావడంతో పార్టీ ఏర్పాట్ల నిమిత్తం మిత్రుడు మణికుమార్తో కలిసి బైక్పై కంచరపాలెం వెళ్లాడు. పనులు ముగించుకుని ఎన్ఏడీ వైపు జాతీయ రహదారిలో వస్తుండగా, ఎన్ఎస్టీఎల్ గేటు ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో వీరు ముందు వెళ్తున్న ఫార్మా బస్సును ఢీకొని కిందపడిపోయారు. ఆ సమయంలో మదన్పై నుంచి ప్రైవేట్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో మదన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న కంచరపాలెం యువకుడు మణికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో కేజీహెచ్కు తరలించారు. బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సొంతింటి ఈఎంఐ కోసం శ్రమిస్తూ.. మదన్ తల్లిదండ్రులు ఎన్ఏడీ జంక్షన్లో తోపుడు బండిపై టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు. మదన్ డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే, ఈవెంట్లలో డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఇటీవలే శాంతినగర్లో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయగా, దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బాధ్యతలు మోస్తూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు.. పుట్టినరోజే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘నువ్వు లేకపోతే మాకెవరురా దిక్కు’ అంటూ ఆ తల్లి పెడుతున్న రోదనలు స్థానికులను కలచివేశాయి. చదవండి: భోగాపురంలో దారుణం.. యువకుడ్ని బైక్కు తాళ్లతో కట్టేసి -
ఢిల్లీ హాస్టల్ ఘటన: పెరిగిన మృతుల సంఖ్య
ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చిన విద్యార్థుల జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్లో ఆదివారం కుప్పకూలిన పీజీ హాస్టల్ భవనం ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రాత్రంతా కొనసాగిన సహాయక చర్యల్లో మరో వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 మందిని రక్షించగా.. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగానే.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో లోపల ఉన్న పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కూలడానికి బేస్మెంట్ పనులు, నిర్మాణంలో లోపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన మరో సీసీటీవీ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా భవనం కూలడం ప్రారంభమైంది. భారీగా దుమ్ము కమ్ముకోవడంతో అప్రమత్తమైన అతడు వెంటనే దుకాణం నుంచి బయటకు పరుగెత్తాడు. క్షణాల వ్యవధిలోనే భవనం కుప్పకూలడంతో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.DELHI: SATYA NIKETAN BUILDING COLLAPSE: CCTV FOOTAGE EMERGESCCTV footage from opposite the building captures the moment a person rushes out of his shop to save his life as the collapse unfolds.Search and rescue operations continue at the site. pic.twitter.com/svxVTwDYhW— Subodh Kumar (@kumarsubodh_) September 7, 2026తప్పిన పెనుముప్పు?సత్య నికేతన్లోని ఈ ఐదు అంతస్తుల భవనంలో సుమారు 15 గదులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉండేవారని చెప్పారు. ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోవడంతో చాలామంది విద్యార్థులు బయట ఉండటం వల్ల ప్రాణనష్టం కొంత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ఇక సుమారు 30 ఏళ్ల నాటి ఈ భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరుతో పీజీ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి ముందు బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలి వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడటం వల్లే భవనం కూలిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.శిథిలాల కింద ఆర్తనాదాలు..భవనం కూలిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారు తమను కాపాడాలంటూ ఫోన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు బాధితులు లోపల నుంచి వీడియోలు తీసి మిత్రులకు పంపించారు. శిథిలాల కింద ఉన్నవారు ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లను పంపించినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు.ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇరుకైన వీధులు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.పీజీల నిర్వహణపై ప్రశ్నలుసత్య నికేతన్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీజీలు, హాస్టళ్లలో ఉంటున్నారు. పాత భవనాలను పీజీలుగా మార్చి నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, నిర్వహణపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ప్రముఖుల సంతాపంఈ విషాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. మృతుల సంఖ్య ఆరుకు చేరడం, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుండటంతో సత్య నికేతన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా బయటపడిన సీసీటీవీ దృశ్యాలు మాత్రం ప్రమాదం కూలిన భవనం లోపలే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారినీ ఎంతటి ముప్పులోకి నెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్ చూసి మోసపోవద్దు! పాపం ఆ అమ్మాయి.. -
వైద్యులపై శివసేన నేతల దాడి.. ఐసీయూలోకి చొరబడి..
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ కార్యకర్తలకు సంబంధించిన మరో వివాదం తెరపైకి వచ్చింది. పాల్ఘర్లో వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై శివసేన పదాధికారులు దాడి చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన రిసెప్షనిస్ట్పై ఓ రాజకీయ కార్యకర్త చెంపదెబ్బ కొట్టినట్లు, ఓ మహిళా ఉద్యోగిని బెదిరించినట్లు సమాచారం.శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున పాల్ఘర్లోని రిలీఫ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ‘దహీ హండి’లో పాల్గొనే కృష్ణ భక్తులను ‘గోవిందాలు’గా పిలుస్తారు. ‘దహీ హండి’ కార్యక్రమంలో పాల్గొని గాయపడిన గోవిందాల వైద్య చికిత్స ఖర్చుల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్ సమయంలో రూ.19,866 బిల్లు చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది కోరడంతో గోవిందాల బృందం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.ఆస్పత్రి సిబ్బంది బిల్లు అందించిన తర్వాత తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న సిబ్బందిని శివసేన కార్యకర్తలు దుర్భాషలాడి, బెదిరించి, దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్పత్రి ఉద్యోగి కుందన్ సాంకే ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శివసేన జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు రాహుల్ ఘరాట్ తదితరులు అత్యవసర విభాగంలోకి ప్రవేశించి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన రిసెప్షనిస్ట్పై వారిలో ఒకరు చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.మరోవైపు కొంతమంది కార్యకర్తలు ఐసీయూలోకి కూడా చొరబడ్డారు. అక్కడ ఉన్న నర్సు గాయపడిన ఓ గోవిందాకు అమర్చిన ఐవీ డ్రిప్ను తొలగించి, అతడిని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లినట్లు ఆస్పత్రి సిబ్బంది ఆరోపించారు. పాల్ఘర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత, వైద్య సేవల రక్షణ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాంకే, ఘరాట్, స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర గవిత్ కుమారుడు రోహిత్ గవిత్ సహా కనీసం 17 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు.ఆస్పత్రిపై దాడితో తీవ్ర ఆగ్రహంఈ ఘటనను ‘సిగ్గుచేటు’గా అభివర్ణించిన కాంగ్రెస్ నేత అతుల్ లొంధే పాటిల్ మాట్లాడుతూ.. “ఇది మహాయుతి రాజకీయ నాయకుల గూండాగిరి. వారికి చట్టంపై నమ్మకం లేదు. పాల్ఘర్లో రిసెప్షనిస్ట్పై దాడి చేశారు. వైద్యులపై కూడా దాడి చేసినట్లు నాకు చెబుతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు. బాధ్యత ఎప్పుడు నిర్ధారిస్తారు?” అని ప్రశ్నించారు.పాల్ఘర్లోని వైద్య వర్గాలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులపై పలు దాడులు జరిగిన నేపథ్యంలో వైద్యుల భద్రతపై వారు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
'రెండు పెళ్లిళ్లు చేసుకున్నా సుఖం లేదు'
తమిళనాడు: తిరువొత్తియూర్ టి.ఎస్.ఆర్ నగర్కు చెందిన కందస్వామి కుమారుడు నవీన్ (35). ఇతను ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. తన మొదటి భార్యకు దూరంగా ఉంటున్నాడు. అదేవిధంగా తన భర్తను వదిలేసిన భవాని అనే మహిళను నెల రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత మరుసటి రోజు మరువలి పుట్టింటికి వెళ్లిన భవాని.. అక్కడే తన తల్లి ఇంట్లోనే ఉండిపోయింది. ఒంటరిగా ఇంట్లో ఉంటున్న నవీన్, రెండో పెళ్లి చేసుకున్నాకూడా సంతోషంగా జీవించలేకపోతున్నానే అని తన తండ్రితో చెప్పి బాధపడినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై న నవీన్, శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరువొత్తియూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సినిమాకు తీసుకెళ్లి భార్య గొంతు కోసిన భర్త -
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
మహారాష్ట్రలోని పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘గుట్టు రట్టయితే గుండెల్లో గుబులు’ అన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె సన్నిహితుడు చేతన్ చౌదరి అరెస్టు కాగా.. తాజాగా వారి కుట్రలో భాగమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రితేష్ హాంగే కూడా పోలీసులకు చిక్కాడు. దీంతో ఈ కేసులో అసలు కథ మరింత ఆసక్తికరంగా మారింది.మూడో నిందితుడు అరెస్ట్జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ను కొండపై నుంచి తోసి హత్య చేసిన కేసులో 22 ఏళ్ల రితేష్ హాంగేను పుణె రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రితేష్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య మూడుకు చేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రితేష్ హాంగే ప్రధాన నిందితుడు చేతన్ చౌదరికి స్నేహితుడు. కేతన్ హత్యకు సంబంధించిన కుట్రలో రితేష్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేతన్ను హత్య చేయాలన్న ప్లాన్ గురించి అతడికి ముందే తెలుసునని పోలీసులు వెల్లడించారు.ముందు పెళ్లిని అడ్డుకోవాలనుకున్నారు..‘అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి’ అన్నట్టుగా ఈ హత్య వెనుక మొదట మరో ప్లాన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేతన్, సియా గోయల్ వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో.. పెళ్లిని అడ్డుకునేందుకు సియా, చేతన్ తొలుత కేతన్ను తీవ్రంగా గాయపరచాలని భావించినట్లు తెలుస్తోంది. కేతన్ చేతులు, కాళ్లు విరగ్గొట్టి అతడిని గాయపరిస్తే పెళ్లి వాయిదా పడుతుందని వారు భావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ప్లాన్ ప్రమాదకరంగా మారొచ్చని భావించిన ఇద్దరూ.. చివరకు ఏకంగా కేతన్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్ర గురించి రితేష్కు కూడా ముందుగానే తెలుసునని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా.. పక్కా స్కెచ్.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ‘పాము చావాలి.. కర్ర విరగకూడదు’ అన్నట్టుగా హత్య చేసినా తమపై అనుమానం రాకుండా ఉండేందుకు పలు మార్గాలను అన్వేషించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఇంటర్నెట్లో సమాచారం వెతికినట్లు, సస్పెన్స్ సినిమాలను కూడా చూసినట్లు పోలీసులు తెలిపారు. టైగర్ పాయింట్, విసాపూర్ కోటతో పాటు పూణే పరిసరాల్లోని మరికొన్ని కోటలను నిందితులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల ఫొటోలను పరస్పరం పంపించుకుని.. కేతన్ మరణాన్ని ప్రమాదంగా చూపించేందుకు ఏ ప్రదేశం అనువుగా ఉంటుందో అంచనా వేశారు. చివరకు లోహగఢ్ కోటను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.హత్య తర్వాత రితేష్కు ఫోన్..అనుకున్నట్టుగానే జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ను కొండపై నుంచి తోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం చేతన్.. తన స్నేహితుడు రితేష్కు ఫోన్ చేసి కేతన్ హత్యకు సంబంధించిన విషయాన్ని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో రితేష్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేతన్ హత్యకు ముందు జరిగిన కుట్ర, ముగ్గురు నిందితుల మధ్య జరిగిన సంభాషణలు, హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు రితేష్ను పోలీసులు విచారిస్తున్నారు. -
అన్నం వడ్డించనందుకు భార్యపై దారుణానికి పాల్పడ్డ భర్త
నాగ్పూర్: అన్నం వడ్డించనందుకు ఓ మహిళను ఆమె భర్త కొట్టి చంపాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణలాల్ (41) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి భార్య యామిని మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ హరేశ్ కల్సేకర్ మాట్లాడుతూ.. కృష్ణలాల్ పని ముగించుకుని ఇంటికి వచ్చి తన భార్య యామినిని భోజనం వడ్డించాలని అడిగాడని తెలిపారు. అయితే యామిని అందుకు నిరాకరించి, తాను డ్యాన్స్ క్లాస్కు వెళ్లాలనుకుంటున్నానని, భోజనం అతడే వడ్డించుకోవాలని చెప్పినట్లు తెలిపారు.దీంతో దంపతుల మధ్య మొదలైన విభేదం తొలుత వాగ్వాదానికి, ఆ తర్వాత భౌతిక ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వారి ఫ్లాట్లో మహిళలకు డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఘర్షణ సమయంలో ఆగ్రహానికి గురైన కృష్ణలాల్ యామినిపై తీవ్రంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మెడ, పొత్తికడుపుపై లోతైన గాయాలయ్యాయి. ఆ గాయాలు ప్రాణాంతకంగా మారడంతో యామిని మృతి చెందింది.పోస్టుమార్టంతో అనుమానాలుయామిని మృతి తర్వాత పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే యామిని కుటుంబ సభ్యులకు ఏదో తప్పు జరిగిందనే అనుమానం కలిగింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. పరీక్షలో తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఆమె భర్తను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో యామినిని హత్య చేసినట్లు కృష్ణలాల్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి వయసు 14 ఏళ్లు కాగా, చిన్న కుమారుడి వయసు 4 ఏళ్లు. -
చిన్నారి ఎక్కడ? అని అడిగితే.. భార్యపై భర్త పైశాచికం!
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తూ.. ఓ భర్త...భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. మల్లాపూర్కు చెందిన లాలుతో 2023లో చెంగిచెర్లకు చెందిన రత్నావత్ అనిత (21)కు ప్రేమవివాహం జరిగింది.వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. రెండు నెలలుగా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో అనిత నెలరోజుల క్రితం ఆర్టీసీ కాలనీలోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 2న లాలు వచ్చి కుమార్తెను తీసుకెళ్లాడు. మళ్లీ 3న చెంగిచెర్లకు వచ్చాడు. అయితే కూతురిని తీసుకురాలేదు.మనవరాలు ఎక్కడ ఉందని అనిత తండ్రి లాలుని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్న పెట్రోల్ను అనితపై పోసి నిప్పంటించాడు. కుమార్తెను రక్షించేందుకు అనిత తల్లి ప్రయత్నించే క్రమంలో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. బయట ఉన్న అనిత తండ్రి కేకలు విని వెంటనే వచ్చి మంటలను ఆర్పి, అనంతరం 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఇవి కూడా చదవండి: తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు -
‘నీ భార్య స్వాతి నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘
హైదరాబాద్: వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జహీరాబాద్ టౌన్ ఎస్సై లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. కోహిర్ మండలం బిలాల్పూర్ గ్రామానికి చెందిన కొనగారి వినయ్కుమార్కు రెండేళ్ల క్రితం తోరమామిడి గ్రామానికి చెందిన బంటు స్వాతితో వివాహమైంది. కాగా పెళ్లికి ముందే స్వాతికి కోహీర్ పట్టణంలోని లాలాగూడకు చెందిన వరుసకు బావ అయిన నాగరిగారి ప్రవీణ్ కుమార్తో ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో స్వాతికి వినయ్కుమార్తో వివాహం జరిగింది. కాగా పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రవీణ్ కుమార్ తన మరదలు స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి భర్త భార్యతో విడిగా ఉంటున్నాడు. కొన్ని రోజుల నుంచి ప్రవీణ్ కుమార్ తరచూ స్వాతి భర్తకు ఫోన్ చేస్తూ, ‘నీ భార్య నా దగ్గరే ఉంది, నువ్వు ఏమీ చేయలేవు‘ అని బెదిరిస్తూ మెసేజ్లు, ఫొటోలు పంపిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాడు. ఈ క్రమంలో వినయ్ కుమార్ను పూర్తిగా మట్టుబెట్టాలని ప్రవీణ్ కుమార్ కర్నాటక బీదర్కు చెందిన తన పెద్దమ్మ కొడుకు ప్రవీణ్తో కలిసి హత్యకు పథకం పన్నాడు. గత నెల 9న సాయంత్రం జహీరాబాద్లోని చెన్నారెడ్డి కాలనీలో వినయ్కుమార్ను అడ్డుకుని గొడవ పెట్టుకున్నారు. ప్రవీణ్ అతనిని వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా నాగరిగారి ప్రవీణ్ కుమార్ వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్ వీపుపై తీవ్రంగా పొడిచాడు. ఈ దాడిలో వినయ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరిని రిమాండ్కు తరలించారు. చదవండి: తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు -
తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు
హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. హాస్టల్ గదుల్లో దాక్కున్న విద్యార్థులను తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి దాడి చేశారు. బుధవారం రాత్రి తీజ్ వేడుకల్లో మధ్య తలెత్తిన వివాదంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ విద్యార్థి మరో విద్యార్థిని ప్రవర్తన మార్చుకోవాలని చెప్పడంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. వీరికి మిగతా విద్యార్థులు సర్ది చెప్పి పంపించారు.ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వా గౌతమి, మంజీరా హాస్టళ్ల వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున చేరి పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ వేరే హాస్టళ్ల గదులకు వెళ్లిపోయారు. వర్సిటీ సిబ్బంది సమాచారంతో కేపీహెచ్బీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణకు కారకులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ జీవీ నరసింహారెడ్డి చెప్పారు. విచారణ చేస్తున్నాం: డీసీపీ జేఎన్టీయూహెచ్లో గొడవకు కారణమైన ఇరువర్గాల విద్యార్థులపై కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. శుక్రవారం ఏసీపీ రవికిరణ్రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయ్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. వర్సిటీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ నిర్వాహకులను, ఇతర సిబ్బందితో విచారణ చేపట్టినట్టు తెలిపారు. ర్యాగింగ్ కారణంగా గొడవ జరిగిందనే విషయం వాస్తవం కాదన్నారు.కేసులు ఇలా.. కాట్రావత్ నవీన్ నాయక్ ఫిర్యాదు మేరకు రాజు, ఆనంద్, వసంత్, దుర్గా ప్రసాద్, ఆదిత్య, సాగర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే విధంగా వసంత్నాయక్ ఫిర్యాదు మేరకు నవీన్ నాయక్, ప్రశాంత్, సందీప్, ఇస్మాయిల్, వెంకట్, చక్రి, సాత్విక్, ప్రకాష్లపై కేసులు నమోద య్యాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్, సందీప్, పూజిత్, రాజే‹Ù, సన్నీ, ఇస్మాయిల్, ఇమ్మాన్యుయేల్లపై కేసులు నమోదు చేశారు. -
బంగారు తల్లుల్ని బలిగొన్న బస్సు!
తమిళనాడులో ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అమ్మాయిలు మరణించారు. ప్రమాదకరమైన మలుపు దాటే క్రమంలో.. వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం సైతం ప్రకటించారు. నమక్కల్ జిల్లా తిరుచెంగోడు(tiruchengode Accident) సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వారి బంధువైన మరో బాలిక.. నలుగురూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న 19 ఏళ్ల యువతి తన ఇద్దరు చెల్లెళ్లను, బంధువైన బాలికను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.సంకరంపాళయం ప్రాంతానికి చెందిన సుభిత కలైసెల్వి (19), ఆమె చెల్లెళ్లు నివేత (17), ధనుశ్రీ (12), బంధువైన అభినయ (11) ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. సుభిత కళాశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం.. ఎలచిపాళయం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తన చెల్లెళ్లు, అభినయను తీసుకుని ఇంటికి బయలుదేరింది. అయితే..రసిపురం–తిరుచెంగోడు రహదారిపై చక్కరంపాళయం జంక్షన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. రసిపురం వైపు నుంచి వచ్చిన ముత్తాయమ్మాళ్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి నలుగురూ రోడ్డుపై పడిపోయారు. సుభిత, అభినయ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన నివేత, ధనుశ్రీని తిరుచెంగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. డ్రైవర్ అరెస్ట్ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎలచిపాళయం పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలించారు. చివరకు డ్రైవర్ ప్రవీణ్ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, మృతికి కారణమైన ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తాజా సమాచారం.Tiruchengode 🚨⚠️Disturbing Visuals🚨4 on a 2 wheeler behind College Bus, taking right turn next to petrol bunk with blocked vision, headON with other Bus.Always look ahead & behind, before taking any such turns.@DriveSmart_IN https://t.co/8hVIFtjdhE— Dave (Road Safety: City & Highways) (@motordave2) September 4, 2026పేద కుటుంబం.. పెద్ద కష్టంమృతుల్లో సుభిత, నివేత, ధనుశ్రీ ముగ్గురూ శేఖర్, అముధ దంపతుల కుమార్తెలు. వారు కూరగాయల వ్యాపారం/కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో సుభిత చదువుకు గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్. ఉమా సహాయం చేసినట్లు సమాచారం. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుఓంది. ఇక అభినయ.. శేఖర్ సోదరుడు రమేశ్బాబు కుమార్తె. ఇలా ఒకే కుటుంబ బంధంలో ఉన్న నలుగురు చిన్నారులు, యువతులు ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో సంకరంపాళయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సీఎం విజయ్ సంతాపం.. రూ.3 లక్షల పరిహారంఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి బాధ కలిగించిందని అన్నారు. మృతులు సుభిత, నివేత, ధనుశ్రీ, అభినయ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు.కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదంచదువుకుని జీవితంలో ఎదగాల్సిన వయసులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వారి బంధువైన మరో బాలిక ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. సుభిత తన చెల్లెళ్లను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్న ప్రయాణమే.. ఆ కుటుంబానికి చివరి ప్రయాణంగా మారింది. అదే సమయంలో.. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. నలుగురు ఒకే బైక్పై ప్రయాణించడం.. అందునా ప్రమాదకరమైన మలుపులో ప్రయాణం.. తప్పంతా యువతులదే అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఇదీ చదవండి: తుక్కుతుక్కైన కారు.. 8 మంది బీటెక్ స్టూడెంట్స్ దుర్మరణం -
పెళ్లి విషయంలో గొడవ.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన ప్రియుడు!
తమిళనాడు: గర్భిణి అని కూడా చూడకుండా ఓ యువతిని గొంతు నులిమి హత్య చేసి, సంచిలో పెట్టి బావిలో పడేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఎడప్పాడి పక్కన కొంగనపురం సమీపంలోని వ్యవసాయ బావి నుంచి కొన్ని రోజుల క్రితం దుర్వాసన వెలువడింది. నీటిలో ఒక తెల్లటి సంచి తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న కొంగనపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారు బావిలో తేలుతున్న సంచిని బయటకు తీసి తెరిచారు. ఆ సంచిలో కుళ్లిపోయిన స్థితి ఓ యువతి మృతదేహం ఉంది. విచారణలో, కరుంగుళ్లవట్టం ప్రాంతానికి చెందిన పేరకౌండర్ కుమార్తె కోకిల (23) అని తెలిసింది. ఆమెని ఎందుకు హత్య చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాశాల చదువు పూర్తి చేసుకున్న కోకిల, పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆగస్టు 20వ తేదీన కోకిల తనకు తీవ్రమైన కడుపునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే వారు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి 7 నెలల గర్భవతి అని వెల్లడించారు..ఈ విషయం తెలుసుకుని కోకిల కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. విచారించగా, పొరుగు గ్రామానికి చెందిన అమ్మసి (26) అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని కోకిల చెప్పింది. దీని తర్వాత, కోకిల కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో, గ్రామంలో ఒక పండుగ ఉందని, ఆ తర్వాత కోకిలను పెళ్లి చేసుకుంటానని అమ్మాసి చెప్పాడు. అప్పటి వరకు ఆమె అక్కడ ఉండడానికి వీలుగా కోకిలను తన ఇంటికి తీసుకువెళ్లాడని తెలుస్తుంది.ఇంతలో, కోకిల 31వ తేదీ నుంచి కనిపించడం లేదని అమ్మాసి, కోకిల కుటుంబానికి తెలియజేశాడు. అంతటా వెతికినా జాడ దొరకలేదు. కోకిల హత్యకు గురైందని, ఆమె మృతదేహం బావిలో తేలుతున్న ఒక సంచిలో లభ్యమైందని తెలిసింది.. కొంగనపురం పోలీసులు అమ్మాసిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా తాను దుపట్టాతో కోకిల గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అమ్మాసి వెల్లడించాడు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసి అమ్మాసిని అరెస్టు చేశారు. -
మహిళను వివస్త్రను చేసి, దాడి : వీడియోలతో బెదిరింపులు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో లోన్ వడ్డీ చెల్లించలేదనే నెపంతో ఒక మహిళను వివస్త్రను చేసి, విచక్షణారహితంగా దాడి చేసిన వైనం కలకలం రేపింది. దీనికి తోడు బాధితురాలిపై దాడి చేసిన ఆ దృశ్యాలను నిందితులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడడం మరింత ఆందోళన రేపింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు రెండేళ్ల క్రితం రేష్మ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అయితే గత ఆరు నెలలుగా వడ్డీ చెల్లించలేక పోయింది. రేష్మా ద్వారా పరిచయమైన నజ్రత్ వద్ద కూడా బాధితురాలు రూ. 50 వేలు రుణం తీసుకుని, వారానికి రూ. 5,000 చొప్పున చెల్లిస్తూ వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల గత నాలుగు వారాలుగా ఈ చెల్లింపులు కూడా నిలిచిపోయాయి అయితే డబ్బులకోసం వేధిస్తారనే భయంతో బాధితురాలు రేష్మా ఫోన్ నంబర్ను బ్లాక్ చేసి, వేరే ప్రాంతానికి మకాం మార్చింది.దాడి జరిగిన తీరుదీనితో నజ్రత్, రేష్మా, సుహైల్, సైఫ్గా కలిసి ఒక పన్నాగం పన్నారు. దీని ప్రకారం నజ్రత్ బాధితురాలికి ఫోన్ చేసి, పని ఇప్పిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మించి తన ఇంటికి పిలిపించింది. బాధితురాలు నజ్రత్ ఇంటికి వెళ్లగానే సుహైల్ ఆమెపై బూతులతో నానా దుర్భాషలాడుతూ దాడి చేశాడు. అనంతరం బాధితురాలిని బలవంతంగా ఆటోరిక్షాలోకి ఎక్కించారు. ఆమె పక్కన రేష్మా, నజ్రత్ కూర్చోగా, సుహైల్ మరికొందరితో కలిసి ఫాలో అయ్యారు. బెంగళూరు శివార్లలోని కుంబళగోడు సమీపంలోని ఒక ఇంటికి తీసుకువెళ్లి బాధితురాలిని బంధించారు. అక్కడ ఆమెను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియోమరోవైపు కుమార్తె కనిపించడం లేదంటూ రేష్మ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆరాగా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని సురక్షితంగా రక్షించి, నలుగురు నిందితులు నజ్రత్, రేష్మ, సుహైల్, సైఫ్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హనీ ట్రాప్ చేసిన లావణ్య!
వరంగల్ క్రైం : ‘వై 99’ యాప్లో మహిళగా పరిచయం చేసుకుని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హనీ ట్రాప్ చేసి రూ.14.75 లక్షలు మోసం చేసిన నిందితుడిని వరంగల్ సైబర్ క్రైం పోలీసులు తమిళనాడులోని సేలం జిల్లాలో అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదైన సీఆర్ నెం.21/2026 కేసులో వరంగల్కు చెందిన తుమ్మ ఉదయ్ కిరణ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు ‘వై 99’ వెబ్సైట్లో ‘లావణ్య’ పేరుతో మహిళగా నటిస్తూ బాధితుడితో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం సన్నిహితంగా మెలుగుతూ నమ్మకం పొందిన నిందితుడు అత్యవసర అవసరాల నిమిత్తం పలుమార్లు డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు వెల్లడైంది. వివిధ బ్యాంకు ఖాతాలు,యూపీఐ లావాదేవీల ద్వారా బాధితుడి నుంచి మొత్తం రూ.14,75,100 మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో సాంకేతిక, ఆర్థిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన ప్రత్యేక బృందం సేలం జిల్లాలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఆదేశాల మేరకు, వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగింది. సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ కె. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బి. శివకృష్ణ, దినేశ్, భరత్, జహూర్ మొహమ్మద్.. నిందితుడి అరెస్ట్లో కీలకంగా వ్యవహరించారు.ఆన్లైన్ పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలిఆన్లైన్లో పరిచయమైన వారు డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైం హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. చదవండి: మినిమం చార్జీ రూ.30 -
ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!
పోలీసుల కంటపడకుండా చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు.. పోలీసులు వెంటపడటంతో ఊహించని పని చేశాడు. ఏకంగా చెరువులోకి దిగి నీళ్ల కింద దాక్కున్నాడు. పోలీసులు వెనక్కి వెళ్లిపోతారని భావించాడు. కానీ.. పోలీసులు అంత ఈజీగా వదులుతారు. అతగాడి జాడను అవలీలగా పట్టేశారు. నీళ్లలోకి దిగి అతడిని పట్టుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన దిలీప్ అలియాస్ కారియా (19)పై మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో రెండు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఓ కేసులో కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో అతడిపై మూడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు.ఈ క్రమంలో దిలీప్ భద్రావతి న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తనను పట్టుకునేందుకు వస్తున్నారని గమనించిన దిలీప్.. అక్కడి నుంచి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఓ నీటి ప్రవాహం వద్దకు చేరుకుని.. ఎక్కడ దాక్కోవాలో తెలియక ఏకంగా నీళ్లలోకి దిగిపోయాడు.పోలీసులు చుట్టుపక్కల ఎంత వెతికినా తొలుత దిలీప్ కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకున్నాడని భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ పోలీసుల కంటికి నీళ్లలో కలుపు మొక్కలు కదలడం, నీటి అడుగు నుంచి గాలి బుడగలు పైకి రావడం కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.అంతే.. అసలు విషయం బయటపడింది. దిలీప్ నీళ్ల అడుగునే దాక్కుని ఉన్నాడు. వెంటనే ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది ప్రసన్న నీళ్లలోకి దిగి అతడిని బయటకు లాగారు. అక్కడికక్కడే చేతులకు బేడీలు వేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా దొరికిపోతానని ఊహించలేదు సర్!” అంటూ ఖాకీలతో ఆ దిలీప్ చమత్కరించాడు.Hide and Seek : Cops dive into a pond to nab a rowdy sheeter hiding under weeds in ShivamoggaPolice in Shivamogga district have arrested a rowdy sheeter who was hiding in a pond to evade arrest despite three non bailable warrants issued against him by the court.The accused,… pic.twitter.com/6K0DBzRTUA— Imran Khan (@KeypadGuerilla) September 4, 2026 -
కారు-లారీ ఢీ.. 8 మంది బీటెక్ విద్యార్థుల దుర్మరణం
కేరళ త్రిసూర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఎనిమిది మరణించారు. మృతుల్లో ఏడుగురు తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. మరొకరు డ్రైవర్గా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.తమిళనాడు దిండిగల్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కారులో వెళ్తున్నారు. కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను సెంటర్ వద్ద NH-66పై శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో ఆ కారు ప్రమాదానికి గురైంది. గురువాయూర్ వైపు నుంచి కొడుంగల్లూర్ వెళ్తున్న టైంలో.. హైవేపై నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో అందులో చిక్కుకున్నవాళ్లను బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊపిరి వదిలారు. ప్రమాదానికి గురైన కారు తమిళనాడు రిజిస్ట్రేషన్తోనే ఉంది. మృతదేహాలను త్రిసూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి అమిత వేగం ఒక కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న రహదారిపై డైవర్షన్, తగిన హెచ్చరికలు, లైటింగ్ వంటి అంశాలపైనా పోలీసులు పరిశీలన చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ మూడు లారీలు నిలిపి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడిగితే తప్పా? -
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసు: ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్ చేతబడి చేస్తున్నాడనే మూఢనమ్మకంతో ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపిన ఘటనలో ఏడుగురు సభ్యుల ముఠాను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ జోన్, ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహ్మద్ మహబూబ్ అలీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసు గుట్టును పోలీసులు విప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితులతో పాటు ఒక మైనర్ను (సిసిఎల్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు యాక్టివా ద్విచక్ర వాహనాలు, ఆరు కత్తులు/బాకులు మరియు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం.. ఫలక్నుమా, వట్టేపల్లిలోని ఫాతిమా నగర్కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ (53) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఆగస్టు 30, 2026 రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో వట్టేపల్లిలోని ఆల్మాస్ హోటల్ ఎదురుగా అతనిపై కొంతమంది దుండగులు కత్తులతో ఘోరంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహబూబ్ అలీని వెంటనే ప్రిన్సెస్ ఎస్రా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.మృతుని కుమారుడు మహ్మద్ షానవాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 439/2026 కింద బిఎన్ఎస్ (BNS) సెక్షన్లు 103(1), 61(2) r/w 3(5) మరియు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 27(2) ప్రకారం కేసు నమోదు చేసి తనిఖీలు చేపట్టారు. విచారణలో భాగంగా లభించిన పక్కా సమాచారంతో సెప్టెంబర్ 3, 2026న ఫలక్నుమా పోలీసులు ఆరుగురు నిందితులను మరియు ఒక మైనర్ను అరెస్ట్ చేశారు.హత్యకు గల కారణాలుజ..ప్రధాన నిందితుడు A1 మీర్జా మోహిన్ బైగ్, మృతుడు మహ్మద్ మహబూబ్ అలీ తన తల్లి తాహిరా బేగంపై చేతబడి చేశాడని, అందుకే ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని బలంగా నమ్మాడు. అంతేకాకుండా, తన మేనమామ మహ్మద్ ఖలీల్ మరణానికి కూడా మహబూబ్ అలీ చేసిన చేతబడే కారణమని అనుమానించాడు.ఈ క్రమంలో బైగ్ తన బావమరిది A2 మహ్మద్ ఇమ్రాన్ అహ్మద్తో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇమ్రాన్ అతనికి సహకరిస్తానని, హత్య చేసిన తర్వాత బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం నిందితులందరూ కలిసి మహబూబ్ అలీని అంతమొందించేందుకు కుట్ర పన్నారు.ఆగస్టు 30న మహబూబ్ అలీ ఆల్మాస్ హోటల్ వద్ద ఉన్నాడనే సమాచారం అందడంతో, నిందితులంతా అయాన్ దర్బార్ హోటల్ వద్ద సమావేశమై ఆరు కత్తులు, బాకులు సమకూర్చుకున్నారు. రెండు యాక్టివా వాహనాలపై వచ్చి, ఆల్మాస్ హోటల్ ఎదురుగా మహబూబ్ అలీని అడ్డుకుని తల, ఛాతీ, చేతులపై తీవ్రంగా నరికి చంపారు. అరెస్టయిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.ప్రజలకు విజ్ఞప్తి..చేతబడులు అనేవి కేవలం మూఢనమ్మకాలని, వాటికి ఎలాంటి వైజ్ఞానిక ఆధారాలు లేవని రాజేంద్రనగర్ జోన్ డిసిపి ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇటువంటి మూఢనమ్మకాలతో హింసకు పాల్పడటం విచారకరమని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి నమ్మకాలను నమ్మవద్దని, శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోకుండా ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఎం. అప్పల నాయుడు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్ మరియు క్రైమ్ టీమ్ను రాజేంద్రనగర్ జోన్ డిసిపి ఎస్. శ్రీనివాస్, ఫలక్నుమా ఎసిపి ఎం.ఎ. జావీద్ అభినందించారు. -
బావ హత్యకు బావమరిదే సూత్రధారి
గుంటూరు: కిడ్నాప్నకు గురైన పాలిష్ వ్యాపారి హత్య కేసులో బావమరిదే ప్రధాన సూత్రధారి అని తేలింది. కేసును తెనాలి రూరల్ పోలీసులు ఛేదించారు. బావ హత్యకు సుపారి ఇచ్చిన బావమరిదిని, కిరాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... తెనాలికి చెందిన చుక్క కోటినాగవీరయ్య (53) అలియాస్ నాగ మహేష్ పాలిష్ వ్యాపారం చేసేవాడు. అతనికి 2006లో విజయవాడ వాసి సంధ్యారాణితో పెళ్లై, ఇద్దరు పిల్లలు. అతనికి 35 ఏళ్ల అట్టలూరి దీప్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రెండేళ్లుగా సరిగా ఇంటికెళ్లడం లేదు. తెనాలి నందులపేటలో దీప్తితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గత నెల 29న అతను సాయంత్రం ఇంటి నుంచి వెళ్లగా, ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో దీప్తి వెతుకుంటూ 30న ఆటోనగర్ వెళ్తుండగా సోమసుందరపాలెం శివారులో స్కూటీ, చెప్పులు కనిపించాయి. దీనిపై తెనాలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అతడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలించారు. విచారణలో విజయవాడ రాజీవ్నగర్లో ఉంటున్న నాగమహేష్ బావమరిది పగడాల రాజేష్ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బావ హత్యకు బావమరిది కీలక సూత్రధారి అని గుర్తించామని చెప్పారు. బుధవారం రాత్రి రాజేష్ను, బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరుకి చెందిన కొమరబత్తిని సందీప్, బుస్సా సంజయ్, కొప్పుల అపర్ణ అలియాస్ బుజ్జి, దేవరకొండ మారుతీవరప్రసాద్ అలియాస్ మారుతీని అరెస్ట్ చేశామన్నారు. ఇసుక క్వారీ వద్ద మృతదేహం నాగమహేష్ దీప్తితో సహజీవనం చేస్తూ, ఆస్తి మొత్తం ఆమెకు రాసిస్తాడని రాజేష్ కక్ష పెంచుకున్నాడు. ఆస్తిని తన సోదరి, ఆమె పిల్లల పేరిట రాయకపోవడంతో బావ హత్యకు పథకం రూపొందించాడు. సందీప్కు రూ.4 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సందీప్ తన అనుచరులతో తెనాలిలోని ఓ హోటల్లో పది రోజులు బస చేసి, నాగమహేష్ కదలికలపై రెక్కీ నిర్వహించాడు. గత నెల 29న సోమసుందరపాలెం వద్ద బైక్పై వెళ్తున్న అతన్ని గుంటూరు నుంచి అద్దెకు తెచ్చిన కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లారు. తేలప్రోలు, అత్తోట, తుములూరు మీదుగా కరకట్టపై రేపల్లె వైపు వెళ్తూ కారులోనే గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. గురువారం ఓలేరు ఇసుక క్వారీ వద్ద మతదేహాన్ని గుర్తించారు. భట్టిప్రోలు తహసీల్దార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ జనార్దన్, తెనాలి గ్రామీణ సర్కిల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్, కొల్లిపర పీఎస్ ఎస్ఐ ప్రసాద్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. చదవండి: ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ -
పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి..
వరంగల్: ఒకరినొకరు ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకుందామని బాస చేసుకున్నారు. నమ్మబలికి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె అడగడంతో నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. సీ రోలు ఎస్సై సంతోష్, మృతురాలి తండ్రి బండి మల్ల య్య కథనం ప్రకారం.. నల్లెల్ల గ్రామానికి చెందిన ఓ యువతి (24), మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన గుదె శ్రీకాంత్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని శ్రీకాంత్ నమ్మబలికి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. దీంతో ఆ యువతి పెళ్లి చేసుకుందామని శ్రీకాంత్ను అడిగింది. పెళ్లి చేసుకోను, నీదిక్కున్న వారికి చెప్పుకో అని బెదిరించాడు. దీంతో బాధితురాలు వెంటనే తండ్రికి విషయాన్ని వివరించింది. గత నెల 30న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విషయంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ సమయంలో శ్రీకాంత్, అతడి తల్లిదండ్రులు వెంకన్న, సునీత, బంధువులు చెలమల సాయి, అన్నారం వాసు, కుమార్, మహేశ్ అందరూ కలిసి యువతిని నానా దుర్భాషలాడారు. ఎందుకు బతికున్నావు, చనిపో అని తిట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈనెల 2 (బుధవారం)న కూతురును తీసుకుని తండ్రి మల్లయ్య సీరోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో సీరోలు సెంటర్ వద్ద శ్రీకాంత్, అతడి తల్లిదండ్రులు వెంకన్న, సునీత, వారి బంధువులు చెలమల సాయి, అన్నారం వాసు, కుమార్, మహేశ్ అడ్డం తిరిగి మావోడి మీద కేసు పెట్టి ఏం చేస్తావు, డబ్బులు ఇస్తాం అని బెదిరించారు. అక్కడి నుంచి నల్లెల్ల గ్రామంలోని ఇంటికి యువతి, తండ్రి మల్లయ్య వచ్చారు. అదేరోజు రాత్రి అందరు పడుకున్న తర్వాత యువతి వేరే గదిలో పడుకుంది. మనస్తాపానికి గురైన ఆమె చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం లేచి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ చనిపోయి ఉందని తండ్రి మల్లయ్య తెలిపారు. తన కుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ఎస్సై సంతోష్ను కోరారు. ఈ మేరకు శ్రీకాంత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు, మిగిలిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతురాలికి గతంలో ఇద్దరితో వివాహం జరగగా విడాకులు అయ్యాయి. -
నువ్వంటే నాకిష్టం.. నువ్వు లేకుంటే చచ్చిపోతా!
కష్టాలు తొలగి, శుభాలు కలగాలని ఓ యువతి గుడికెళితే అక్కడ పూజలు చేసే ఓ ప్రబుద్ధుడు ఆమెను ట్రాప్ చేశాడు. ‘నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకుంటే చచ్చిపోతా’ అంటూ మభ్యపెట్టాడు. గుట్టుచప్పుడు కాకుండా తాళి కట్టాడు. బిడ్డ పుట్టాక నడిరోడ్డుపైకి నెట్టి నరకం చూపిస్తున్నాడు. వివరాలు.. యాడికి మండలానికి చెందిన ఓ యువతి అనంతపురంలో ఉంటోంది. ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తూ జీవనం సాగించేది. జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదురుకావడంతో రాప్తాడు మైనార్టీ కాలనీలోని సుంకులమ్మ గుడికి వెళ్లి పూజలు చేస్తే కష్టాలు తొలుగుతాయని తెలిసిన వారు చెప్పడంతో ఆలయానికి వెళుతూ ఉండేది. అక్కడ పూజలు చేసే శివకుమార్ కన్ను యువతిపై పడింది. తాను చెప్పిన పూజలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని.. జీవితంలో ఉన్నత స్థాయికి వెళతావని నమ్మించాడు. తర్వాత వివిధ ఆలయాల్లో పూజలు చేయించి యువతిని లోబరుచుకున్నాడు. నిలదీయడంతో.. శ్రీశైలంలో పెళ్లి యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శివకుమార్ ఆమెను శారీరంగా కలుస్తూ ఉండేవాడు. దీంతో ఆమె గర్భం దాలి్చంది. గట్టిగా నిలదీయడంతో యువతి బంధువులకు తెలియకుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లి 2025 మేలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి యువతికి వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్త, ఆడపడుచులు నిత్యం వేధించేవారని యువతి కన్నీటి పర్యంతమవుతూ తెలిపింది. ఏడు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త తీవ్రంగా కొట్టడంతో యువతి రాప్తాడు పోలీసులను ఆశ్రయించింది. దంపతులిద్దరినీ పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినా శివకుమార్ ప్రవర్తనలో మార్పు రాలేదు. బాబు పుట్టినా.. పుట్టింటికే పరిమితం తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న సమయంలో కాన్పు కోసం యువతి పుట్టింటికి చేరుకుంది. ఈ ఏడాది మే 25న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మూడు నెలల తర్వాత తనను, తన బిడ్డను తీసుకెళతానని చెప్పిన శివకుమార్ ముఖం చాటేశాడు. ‘నీతో నేను కలిసి బతకలేను.. నీతో ఉంటే నువ్ నన్ను చంపేస్తావ్’ అంటూ బూటకపు మాటలు చెప్పి యువతిని దూరం పెట్టాడు. దీంతో యువతి ఆగస్ట్ 13న రాప్తాడు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త నమ్మించి మోసం చేస్తున్నాడని, న్యాయం చేయాలని వేడుకుంది. చేతిలో రెండు నెలల చిన్నారిని పెట్టుకుని ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసు స్టేషన్ గుమ్మం వద్దే పడిగాపులు కాచింది. అయినా, పోలీసులు ఫిర్యాదును తీసుకోలేదు. సీఐ నిర్లక్ష్యం..! న్యాయం కోసం యువతి 20 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సీఐ వెంకటేశ్వర్లు మనసు కరగలేదు. ‘చెప్పావ్ గా... వాడు కనిపిస్తే తీసుకొస్తాం లే.. నువ్ వెళ్లు..’ అంటూ నిర్లక్ష్యంగా చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో యువతి ఇటీవల ఎస్పీ జగదీశ్ను ఆశ్రయించింది. పీజీఆర్ఎస్లో కలిసి ఫిర్యాదు చేయడంతో అప్పుడు సీఐ స్పందించారని యువతి చెబుతోంది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటోంది. -అనంతపురంచదవండి: నేవి ఉద్యోగి భార్య ఆత్మహత్య -
లవర్ని కత్తితో పొడిచి చంపి, విషం తాగిన ప్రియుడు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలోని లహోరీ గేట్ ప్రాంతంలోని ఒక హోటల్లో నిన్న రాత్రి ఒక మహిళ రక్తపు మడుగులో పడి శవమై కనిపించిన ఘటన పోలీసులకు ఉలిక్కిపడేలా చేసింది. తన ప్రియుడి చేతిలోకత్తిపోట్లకు గురై మరణించిందని, ఆ తర్వాత నిందితుడు విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు గురువారం తెలిపారు.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రాజస్థాన్కు చెందిన నిందితుడు బిహార్కు చెందిన ఆ మహిళ బుధవారం సాయంత్రం 'హోటల్ ప్రిన్స్'లో బస చేశారు. ఏం జరిగిందో తెలియదుగానీ, రాత్రి ఆ వ్యక్తి కత్తితో మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. ఆ తర్వాత తన ప్రాణాలను తీసుకోవాలనే ఉద్దేశంతో అతను విషం సేవించాడు. హోటల్ సిబ్బంది ఆ గదిలో రక్తపు మడుగులో మహిళ పడి ఉండటాన్ని గమనించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు -
సారీ రాధికా.. గుడ్బై
హైదరాబాద్: భార్య పుట్టినరోజు నాడే ఓ ఐటీ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్ (40), రాధిక దంపతులు కూకట్పల్లి దేవి నగర్లోని భాస్కర ప్యాలెస్లో నివాసముంటున్నారు. రమేష్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 1న భార్య రాధిక పుట్టినరోజు కావడంతో ఆమె అక్క, తమ్ముడు ఇంటికి వచ్చారు. అందరూ కలిసి ట్యాంక్ బండ్కు వెళదామని రమేష్ను కోరగా.. తాను రానని చెప్పడంతో వారు వెళ్లారు. ఇంట్లో ఉన్న రమేష్ అర్ధరాత్రి భార్యకు ‘పొరపాటు జరిగింది సారీ గుడ్ బై’ అని మెసేజ్ పంపాడు. కంగారుపడిన భార్య వెంటనే ఇంటికి వచ్చి చూడగా, అప్పటికే రమేష్ చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని విగతజీవుడిగా పడి ఉన్నాడు. భార్య పుట్టినరోజే భర్త ఇలా ప్రాణం తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య -
అనుమానంతో భార్యను చంపిన భర్త
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. కూతురిపై దాడి చేస్తున్న క్రమంలో అడ్డువచ్చిన అత్త కూడా కత్తిపోట్లకు గురై కరీంనగర్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర ఒడ్డరికాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ ఓదెల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం... రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర వడ్డెరకాలనీకి చెందిన గండికోట చంద్రయ్య–ఎల్లవ్వ దంపతుల కూతురు జ్యోతి(28)ని ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన పల్లపు సురేష్కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. కొంతకాలం వీళ్ల కాపురం సజావుగా సాగి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించారు. కొంతకాలంగా దంపతుల మధ్య కలహాలు చోటుచేసుకున్నాయి. ఎనిమిది నెలల క్రితం రెండుసార్లు చీకోడులో జ్యోతిని చంపడానికి సురేష్ ప్రయత్నించాడు. ఒకరోజు నిద్రిస్తుండగా దిండుతో చంపడానికి ప్రయత్నించగా.. తప్పించుకొని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు వెళ్లి జ్యోతిని పుట్టింటికి తీసుకొచ్చారు. అప్పుడు జ్యోతి ఫిర్యాదుతో ముస్తాబాద్ ఠాణాలో సురేష్పై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఎనిమిది నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. గ్రామానికి సమీపంలో ఉన్న అర్బన్పార్క్లో మృతురాలు జ్యోతి దినసరి కూలీగా పని చేస్తుంది. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానంతో సురేష్ పలుమార్లు జ్యోతిని, వారి బంధువులను దూషించాడు. ఈ క్రమంలో సురేష్ మరో ముగ్గురితో కారులో వచ్చి పదిర బస్టాండ్లో మధ్యాహ్నం నుంచి జ్యోతి కోసం కాపు కాశాడు. జ్యోతి తన తల్లి ఎల్లవ్వతో కలిసి కరీంనగర్ ఆస్పత్రిలో చూపించుకోవడానికి వెళ్లింది. చీకటి పడే సమయంలో బస్సు దిగి ఒడ్డెరకాలనీకి వెళ్తుండగా వెంబడించి కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన అత్తపై కూడా కత్తితో దాడి చేశాడు. జ్యోతి మృతి చెందినట్లు నిర్ధారించుకొని కత్తిని అక్కడే వదిలేసి అదే కారులో పరారయ్యాడు. నిందితుడు సురేష్ సిరిసిల్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ‘మాకు డబ్బులు బాగా అవసరం. మా తమ్ముడు, మరదలు విదేశాలకు వెళ్లాలి. నీ పేరు మీద ఉన్న ఆస్తులు విక్రయించి డబ్బులు తీసుకురా’ అంటూ భర్త, అత్తింటి వారు సాగిస్తున్న వేధింపులు తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దేవీనగర్ ప్రాంతంలో నివసి స్తున్న బొమ్మిన హరీష్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. భద్రా చలం కొత్తగూడెం ప్రాంతానికి చెందిన నందిని (32)తో అతనికి 2016వ సంవత్సరంలో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హరీష్ కొంత కాలం నుంచి పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని నందినిని వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని తమ్ముడు భార్గవ్, మరదలు ఉమా విదేశాలకు వెళ్లేందుకు డబ్బులు కావాలని.. ఆమె పేరు మీద ఉన్న ఆస్తులను విక్రయించి డబ్బులు తెస్తావా? లేదా? అంటూ హరీష్తో పాటు అతని కుటుంబ సభ్యులు నందినిపై వత్తిడి తెస్తున్నారు. వారి వేధింపులు భరించలేని నందిని మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకూ పోలీసులు హరీష్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆయన పేరు చెబితే వదిలెయ్యాలి! -
30 ఇళ్లకు నిప్పు అంటించి, దగ్ధం చేసిన దుండగులు
మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ హింస చెలరేగింది. ఆయుధాలతో వచ్చిన దుండగులు మూడు లియాంగ్మై నాగ గ్రామాలపై దాడి చేయడంతో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ గ్రామస్థుడికి బుల్లెట్ గాయం అయినట్లు అధికారులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో టాపోన్ ఖుల్లెన్, టాపోన్ ఖునౌ, మకుయి పిపురామ్ గ్రామాల్లో దాడి జరిగింది. దుండగులు కాల్పులు జరిపి ఇళ్లు, ఇతర ఆస్తులకు నిప్పుపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకునేలోపే భారీగా ఆస్తి నష్టం జరిగింది.పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, దాని కోబ్రా విభాగంతో పాటు మణిపూర్ పోలీసు సిబ్బందిని అదనంగా మోహరించారు. అనంతరం గ్రామాల చుట్టుపక్కల భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇరువైపుల నుంచి కాల్పులు పలు గంటల పాటు కొనసాగి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆగినట్లు అధికారులు తెలిపారు.ఘటనాస్థలిని పరిశీలించిన భద్రతా సిబ్బందికి ఇళ్లు, వాహనాలు, ఇతర వస్తువులు భారీగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే మొత్తం నష్టం ఎంత, ఎన్ని ఆస్తులు ప్రభావితమయ్యాయనే దానిపై అంచనా ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనకు ఒక రోజు ముందు, కాంగ్పోక్పి జిల్లాలోని టెయిఖాంగ్ కుకీ గ్రామంపై దాడి జరిగింది. అందులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు పౌరులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. వరుస దాడులతో ఇంఫాల్ తమెంగ్లాంగ్ రహదారి పరిసరాల్లో ప్రతీకార దాడులపై ఆందోళనలు పెరిగాయి. కుకీ జో, నాగ వర్గాల మధ్య గతంలోనూ వరుస దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి.మే 13 నుంచి ఈ రెండు వర్గాలకు చెందిన 17 మంది వేర్వేరు ఘటనల్లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 27న జరిగిన దాడిలో నలుగురు నాగ పౌరులు, ఆగస్టు 31న కాంగ్పోక్పి-తమెంగ్లాంగ్ పరిసరాల్లో జరిగిన దాడిలో ముగ్గురు కుకీ పౌరులు మృతి చెందినట్లు సమాచారం. తాజా దాడులకు ఇప్పటివరకు ఏ వర్గమూ అధికారికంగా బాధ్యత ప్రకటించలేదు.ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. నష్టం అంచనా, కాల్పులు-దహనం ఘటనల దర్యాప్తు, దాడికి పాల్పడినవారి గుర్తింపు ఇప్పుడు అధికారుల ముందున్న ప్రధాన అంశాలుగా ఉన్నాయి. -
కృష్ణా జిల్లాలో కాల్పుల కలకలం
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఈ ఉదయం కాల్పుల కలకలం రేగింది. తమపై దాడి జరిపి.. పారిపోతున్న ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. దేవరపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన దుండగుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు దుండగుడు నిన్న ఉదయం పోలీసులపై దాడి జరిపి పారిపోయాడు. అయితే అతన్ని పట్టుకునే క్రమంలో మరోసారి పోలీసుల మీదకు దాడికి దిగినట్లు తెలుస్తోంది. కత్తి, రాళ్లతో దాడి చేయగా.. ఈ క్రమంలోనే అతన్ని నిలువరించేందుకు కంకిపాడు సీఐ కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుడిని అవినాశ్గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో అతని రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: గృహ ప్రవేశం చేసిన నాలుగు రోజులకే విషాదం -
"ఇదంతా స్కూల్లో ఓ బ్యాడ్ అంకుల్ చేశాడు" అని చెప్పిన నర్సరీ పాప
ఢిల్లీ ఔటర్-నార్త్లోని బవానా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడేళ్ల నర్సరీ బాలికపై బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు సోమవారం తెలిపారు. పాఠశాల బస్సు నడిపే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వారు చెప్పారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక శరీరంలోని ప్రైవేట్ భాగాల్లో గాయాలను కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఆగస్టు 19న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి అడిగినప్పుడు.. తనకు చాక్లెట్లు ఇస్తున్న ఒక అంకుల్ గురించి తల్లికి ఆ పాప చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చాక్లెట్స్ ఇస్తున్న ఓ బ్యాడ్ అంకుల్ ఇదంతా చేశారని ఆ పాప చెప్పిందన్నారు. ఆగస్టు 24న బాలికకు పాఠశాలలోని వ్యక్తుల ఫొటోలు, సీసీటీవీ దృశ్యాలు చూపించగా, ఆమె నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిపై బవానా పోలీస్ స్టేషన్లో బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో)లోని సెక్షన్లు 8, 10, 21, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు. మహిళపై ఆమె గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగానికి సంబంధించిన సెక్షన్ 74 కింద కూడా కేసు నమోదు చేసి, పాఠశాల నుంచే నిందితుడిని అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై ఆగస్టు 24న బవానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆ పాఠశాల ఢిల్లీ ఔటర్-నార్త్లోని పూత్ ఖుర్ద్లో ఉంది. నిందితుడు సుమారు 8 నెలలుగా పాఠశాల బస్సు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాలికను బాత్రూమ్ వరకు వెంబడించి, అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో బాలికపై 4 సార్లు లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోందని అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్ తన ఫోన్లో పిల్లలకు చాక్లెట్లు ఇస్తున్న వీడియోలను కూడా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.“పాఠశాల ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపిస్తున్నాం” అని అధికారి తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. -
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో ఈ నెల ప్రారంభంలో ఓ స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఆగస్టు 4న పరి చౌక్ సమీపంలో జరిగింది.తన ఫిర్యాదులో బాధితురాలు.. నిందితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తాను ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపించింది. అనంతరం వారు ఆమెను ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలో వదిలి వెళ్లిపోయారు. ఢిల్లీ ఉత్తర జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిహారిక భట్ మాట్లాడుతూ.. డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్లను అదే రోజు టిమార్పూర్లోని పార్కింగ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.పోలీసులు బస్సును కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఆగస్టు 14న బస్సు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. ఈ బాలిక ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి నివాసి అని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో తల్లి మందలించడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. నోయిడా సెక్టార్ 63లో నివసించే తన బంధువు వద్దకు వెళ్లేందుకు ఆమె బయలుదేరింది.భారీ వర్షం, చీకటి కారణంగా తాను పొరపాటున పరి చౌక్ వద్ద దిగిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. తాను వేరే ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని స్లీపర్ బస్సును ఆపినట్లు చెప్పింది. ఆ బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. బస్సు నోయిడా సెక్టార్ 63కు వెళ్తోందని కండక్టర్ చెప్పడంతో ఆమె బస్సు ఎక్కింది.సూరజ్పూర్లోని వర్క్షాప్లో మరమ్మతుల అనంతరం స్లీపర్ బస్సు ఖాళీగా తిరిగి వస్తోందని పోలీసులు తెలిపారు. బస్సు కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే కండక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడని బాలిక ఆరోపించింది. అనంతరం ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, తాను ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది. నిందితులు ఆమెను రింగ్ రోడ్ సమీపంలో వదిలి పారిపోయిన తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది.కుల్దీప్, సందీప్లపై సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దాడి కేసులు నమోదు చేశారు. స్లీపర్ బెర్త్లకు బస్సులో తెరలు ఉంటాయి. ఫోరెన్సిక్ బృందాలు బస్సులో బాలికకు చెందిన వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలల సంక్షేమ కమిటీ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించింది. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 2012లో ఢిల్లీలో బస్సులో 23 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్భయ కేసును తలపించేలా ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. -
భర్తను కాదని.. మరొకరిని నమ్మి.. మూడో వ్యక్తి గొడవలో విషాదం!
హైదరాబాద్: ఇష్టమైన వాడి కోసం కట్టుకున్న భర్తను వదిలివచ్చిన ఓ యువతి రెండో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అతనితో వేగలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ ఎస్ఐ విజయ్ కొట్టూర్ తెలిపిన వివరాల ప్రకారం... అన్నవరానికి చెందిన ఎం.రాజేశ్వరి (23) వివాహం 2023లో ముత్యాలరావుతో జరిగింది. అదే ఏడాది బంజారాహిల్స్ ఇందిరానగర్కు చెందిన అంతటి సాయికుమార్ (28)తో పెళ్లి జరిగిన నెల రోజులకే (ఏప్రిల్లో) ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో ఏడాది జూన్లో సాయికుమార్.. రాజేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెను ఇందిరానగర్ తీసుకువచ్చి కాపురం పెట్టాడు.ఓ నగల షాపులో పనిచేస్తున్న రాజేశ్వరిని అదే ఏడాది నెల తర్వాత జులైలో మొదటి భర్త ముత్యాలరావు వచ్చి తీసుకువెళ్లాడు. అదే ఏడాది ఆగస్టు 13న సాయికుమార్ మళ్లీ వెళ్లి ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చి, 2023 ఆగస్టు 16న తాళి కట్టాడు. అప్పటి నుంచి ఇద్దరూ నివాసముంటున్నారు.నగల షాపులో సేల్స్గర్ల్గా పనిచేస్తున్న రాజేశ్వరి గత నాలుగైదు నెలల నుంచి ఇన్స్ట్రాగామ్లో మరో యువకుడితో చాటింగ్ చేస్తుండడం, ఫోన్లో మాట్లాడుతుండడాన్ని సాయికుమార్ గుర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్దలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్యా తీవ్ర గొడవ జరిగింది. ఈ నెల 25వ తేదీ ఉదయం ఇద్దరి మధ్యా జరిగింది. అనుమానంతో సాయికుమార్ ఆమెను తిట్టడంతో పాటు తీవ్రంగా వేధించి మానసికంగా హింసించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి డ్యూటీలకు వారు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా గొడవ జరిగింది.ఈ అనుమానాన్ని, అవమానాన్ని భరించలేక రాజేశ్వరి బాత్రూమ్లోకి వెళ్లి షవర్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంట గడిచినా బయటకు రాకపోయేసరికి సాయికుమార్ బాత్రూమ్ తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా షవర్ కొక్కానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు సాయికుమార్పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.ఇవి కూడా చదవండి: తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం -
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడలో యువ నర్సు అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. యువతిపై లైంగిక దాడి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. స్థానికంగా మెకానిక్గా పని చేసే సనావుల్లా ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మృతదేహంపై కూడా లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. దీంతో ఈ ఘటనకు.. కోల్కతాలో జరిగిన సంచలన ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనను పోలిన పరిస్థితులు ఉన్నాయనే చర్చ జోరందుకుంది.ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడే ఆవరణలోని హాస్టల్లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ కారణంతో రూమ్మేట్స్ ఊరెళ్లగా.. శుక్రవారం రాత్రి తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాకపోవడంతో సిబ్బంది అనుమానంతో కిటికీలోంచి చూడగా విగతజీవిగా కనిపించింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు.. దర్యాప్తులో లభించిన ఆధారాలతో అత్యాచారం, హత్య కోణంలో విచారణ చేపట్టారు. స్థానికంగా పని చేసే మెకానిక్ మహ్మద్ సనావుల్లా(34) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.కిటికీ గ్రిల్స్ లేకపోవడంతో..ఆస్పత్రి పక్కనే ఉన్న కార్ల మెకానిక్ షాపులో బిహార్కు చెందిన సనుహుల్లా (34) పనిచేస్తున్నాడు. ఇతర కార్మికులు సాయంత్రం వెళ్లిపోయిన తర్వాత అతడు అక్కడే నిద్రించేవాడు. ఈ క్రమంలో.. ఆస్పత్రిలో పనిచేసే నర్సుల కదలికలను కొంతకాలంగా గమనించినట్లు తెలుస్తోంది. యువతి(21) ఒంటరిగా ఉన్న విషయం గమనించి.. అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడ్డాడు. ఆమె ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో దాని ద్వారా లోపలికి ప్రవేశించాడు. లైంగిక దాడికి ప్రయత్నించగా యువతి ప్రతిఘటించి కేకలు వేయడంతో.. బయటకు శబ్దం వినిపించకుండా ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.నిందితుడు సనావుల్లా ఖాన్పోలీసుల అదుపులో నిందితుడుఅంతకు ముందు.. పోలీసుల ముందే నిందితుడు సనావుల్లా ఖాన్ దర్జాగా తిరిగాడు. డాగ్ స్క్వాడ్తో పోలీసులు ఆస్పత్రి ఆవరణలో తనిఖీలు జరుపుతున్న టైంలో.. ఏం జరిగింది? అంటూ పోలీసులనే ఆరా తీశాడతను. అయితే జాగిలాలు నేరుగా మెకానిక్ షాపు దగ్గరకే వెళ్లడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈలోపు.. నేరం జరిగిన అర్ధరాత్రి నిందితుడు తనకు పదే పదే కాల్ చేశాడని షాపు యాజమానికి పోలీసులకు చెప్పాడు. దీంతో తమదైన శైలిలో విచారించగా సనావుల్లా ఖాన్ నేరం అంగీకరించాడు. ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం నివేదికలో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే నిందితుడి ఒక్కడి ప్రమేయమే ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. అలాగే నిందితుడు రోహింగ్యా అంటూ జరిగిన ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. కుటుంబ సభ్యుల ఆందోళనమరోవైపు యువతి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వీళ్లకు మద్దతుగా పలువురు బీజేపీ నాయకులు తరలి వచ్చారు.ఆర్జీకర్ ఘటనలో ఏం జరిగింది?2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఘటన.. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ అర్ధరాత్రి 31 ఏళ్ల ట్రెయినీ డాక్టర్ మృతదేహం లభించింది. ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కేసు సీబీఐ దర్యాప్తులోకి వెళ్లింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాజా తుక్కుగూడ ఘటనలోనూ అర్ధరాత్రే.. అదీ ఆస్పత్రి ఆవరణలోనే అఘాయిత్యం జరగడం గమనార్హం.ఇదీ చదవండి: నీట్ కొట్టింది.. అంతలోనే ఆనందం ఆవిరైంది! -
గాజు పంజరంలో 43 ఏళ్లుగా బందీ.. భయానక ఒంటరి జీవితం
బ్రిటన్లోని అత్యంత ప్రమాదకరమైన నేరస్తులలో ఒకడు రాబర్ట్ మౌడ్స్లీ. అతడి జైలు జీవితం, అతని భద్రతా పరిస్థితులు ఇతర కరడుగట్టిన ఖైదీల కంటే భిన్నంగా ఉంటాయి.బ్రిటన్ జైలు చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్గా పేరుగాంచిన రాబర్ట్ మౌడ్స్లీని సాధారణ ఖైదీల నుంచి వేరు చేస్తూ, అతని కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక "గాజు గది" (Glass Cage / Bulletproof Cell)లో దశాబ్దాలుగా ఒంటరిగా ఉంచారు.రాబర్ట్ మౌడ్స్లీ 1974లో ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. జైలులో ఉన్న సమయంలోనే అతను మరో ముగ్గురు ఖైదీలను (లైంగిక నేరస్థులు/పిడోఫైల్స్) దారుణంగా హత్య చేశాడు. దీంతో మొత్తం 4 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్గా మారాడు.ప్రత్యేక గాజు గది జైలు సిబ్బందికి, ఇతర ఖైదీలకు అతని వల్ల తీవ్ర ప్రమాదం ఉందని భావించిన అధికారులు 'వేక్ఫీల్డ్' జైలులో అతని కోసం ప్రత్యేకంగా ఒక బుల్లెట్ ప్రూఫ్ గాజు గదిని నిర్మించారు. ఈ గది చుట్టూ లామినేటెడ్ గ్లాస్ (గాజు) ఉంటుంది. ఇందులో కాంక్రీట్ మంచం, టేబుల్, మరుగుదొడ్డి వంటి ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే ఉంటాయి.తీవ్రమైన ఐసోలేషన్ మౌడ్స్లీ రోజుకు 23 గంటలు ఈ గాజు గదిలోనే గడుపుతాడు. మిగిలిన గంట మాత్రమే కాపలాదార్ల పర్యవేక్షణలో గాలి వెలుతురు కోసం బయటకు రావడానికి అనుమతిస్తారు. గత 43 ఏళ్లకు పైగా అతను ఎవరితోనూ నేరుగా సంబంధం లేకుండా పూర్తి ఒంటరితనంలో శిక్ష అనుభవిస్తున్నాడు.హన్నిబాల్ లెక్టర్ పోలిక'ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్' సినిమాలో కనిపించే ప్రసిద్ధ కల్పిత పాత్ర "హన్నిబాల్ లెక్టర్" తరహాలోనే ఈయనను కూడా గాజు గదిలో ఉంచడంతో, బ్రిటన్ మీడియా అతనికి "రియల్ లైఫ్ హన్నిబాల్" అని పేరు పెట్టింది. బ్రిటన్ జైలు శిక్షల చరిత్రలోనే అతి సుదీర్ఘకాలం ఇలాంటి నిబంధనలు ఎదుర్కొంటున్న అత్యంత డేంజరస్ ఖైదీ మౌడ్స్లీ. -
సౌజన్య కేసులో సంచలనం జగదీశ్ రెడ్డి ఆస్తిపై కన్నేసిన సాధిక్ ఖాన్
-
'నా భర్తని చంపేస్తానని బెదిరించి నాపై లైంగిక దాడి'
తూర్పు గోదావరి జిల్లా: నర్సరీలో తన భర్తతో పనిచేసే సురేంద్ర అలియాస్ చిన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బుర్రిలంకకు చెందిన 19 ఏళ్ల మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో కలిసి బుర్రిలంక నర్సరీకి ఈ ఏడాది జూలైలో పని కోసం వచ్చారు. అప్పటి నుంచి నర్సరీలో పనిచేస్తూ కార్యాలయ భవనం పక్కన నివసిస్తున్నారు.ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ ఉదయం సుమారు 6:45 గంటలకు, ఆమె భర్త యథావిధిగా పనికి వెళ్లాడు. అనంతరం 7 గంటలకు అదే నర్సరీలో పనిచేస్తున్న సురేంద్ర అలియాస్ చిన్న ఆమె ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన భర్తకు చెపుతానని హెచ్చరించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం 8.50 నిమిషాలకు మళ్లీ వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెప్తే భార్యాభర్తలిద్దరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తన భర్తకు ఆమె విషయాన్ని వివరించింది. దీంతో అతడు నర్సరీ యజమానికి ఆ విషయం చెప్పగా ఆయన సూచన మేరకు బాధితురాలు ఆమె బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా! -
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం రక్తం చిందించింది. గొడ్డలతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఈ దాడుల్లో ఇద్దరూ మృతి చెందగా.. ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఎస్సైకి సైతం తీవ్ర గాయాలయ్యాయి.మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో భుక్యా సైదా, వెంకటేశ్వర్లు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ఉదయం దాని చెట్టు కొమ్మలు నరికేందుకు వెంకటేశ్వర్లు ప్రయత్నించాడు. అది గమనించిన సైదా అడ్డు చెప్పాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సైదా కొడుకు రాము.. అదే గొడ్డలితో వెంకటేశ్వర్లును నరికాడు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. దీంతో కోపోద్రిక్తులైన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు సైదా, సైదా కొడుకు రాముపై దాడికి యత్నించాడు. అది గమనించిన మరికొందరు స్థానికులు సైదా తరఫున కొట్లాటకు వచ్చారు. ఇరు వర్గాల ఘర్షణలో కొందరికి గాయాలు కాగా.. అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఇదే అదనుగా తన కుమారుడిని ఘటనా స్థలం నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు సైదా. అయితే.. పట్టరాని కోపంతో రాము తన తండ్రి సైదాపై గొడ్డలితో దాడి చేశాడు. ఆపై భయంతో ఓ ఇంట్లో దూరి దాక్కున్నాడు. సైదాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు.. రామును అప్పగిస్తేనే ముందుకు కదలిస్తామని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈలోపు.. రామును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్సై నవీన్కు గాయాలయ్యాయి. సైదాను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆలస్యం కావడంతో మార్గం మధ్యలోనే మరణించాడు. ఎస్సై నవీన్ సహా గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వెంకటేశ్వర్లు, సైదా మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ డబుల్ మర్డర్తో ఆ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు -
జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద విషాదం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో ఈ ఉదయం ఘోరం జరిగింది. కారు పూజ కోసం వచ్చిన ఓ కుటుంబంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆ ఇంటి పెద్ద అదే కారు కింద పడి అనూహ్యరీతిలో మృతిచెందారు. మేనల్లుడి కారు పూజ కార్యక్రమం కోసం రామచంద్రరావు(70) అనే వ్యక్తి తన బంధువులతో పెద్దమ్మ గుడికి వచ్చారు. పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత కారును అక్కడి నుంచి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామచంద్రరావు మేనల్లుడు పొరపాటున యాక్సిలరేటర్ను తొక్కడంతో వాహనం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ఆయన కారు కింద చిక్కుకుని గాయపడ్డారు.తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెద్దమ్మ గుడి వద్ద నిత్యం కొత్త వాహనాలకు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఏనాడూ ఇలాంటి ఘటన జరగలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి స్వస్థలం.. ఇలా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: జాబ్ వస్తుందన్న ఆనందం అంతలోనే.. -
TDP ఎమ్మెల్యే అండతోనే... సతీష్ రెడ్డి హత్యపై భార్య షాకింగ్ కామెంట్స్
-
ఫుట్ పాత్ పై పడుకున్న బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు
-
చిరంజీవి భార్యకు ఎలా బోర్డు మెంబర్ ఇస్తారు? ఎంపీ కొడుకు అని వదిలేశారా?
-
ఇంత క్రూరత్వమా?.. 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం
విజయనగరం టౌన్: ఎనిమిది పదులు దాటిన వయసు.. చూపు అంతంతమాత్రమే.. చెవులు కూడా వినపడే స్ధా యి లేదు.. గట్టిగా అరిచే ఓపిక లేదు.. దీనస్ధితిలో కాలయాపన చేసే ఓ పండుటాకుపై కామాంధు డు పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన ఇంటికి వెళ్లి జరిగిందంతా కుటుంబ సభ్యులతో మొరపెట్టుకోవడం, వెంట నే ఆస్పత్రికి తరలించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలిని గురువారం పరామర్శించారు. విషయాన్ని ఎస్పీ ఎఆర్.దామోదర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ నరసింహారావు, సీఐ నరసింహమూర్తి, ఎస్ఐలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధిచి సీఐ, కాలనీవాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం పట్టణంలోని ఓ కాలనీలో నివసిస్తున్న 82 ఏళ్ల వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఇంటికి అరుంధతీనగర్ కాలనీ మీదుగా గాజులరేగ నడక మార్గం నుంచి వెళ్తున్న సమయంలో కామాంధుడు ఆమెపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. కొంతసేపటికి తేరుకున్న ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్లి జరిగిందంతా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే వారు స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. వృద్ధురాలిని ఘోషా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగంలోకి దిగి తమదైనశైలిలో విచారణ ప్రారంభించారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ స్వయంగా ఘోషా ఆస్పత్రికి సిబ్బందితో కలిసి వెళ్లి వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్కా్వడ్, క్లూస్టీమ్లను రంగంలోకి దించారు. నిందితునికోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు! -
సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్ను ఈడ్చుకెళ్లిన లారీ
కాకినాడ: ఆ కుటుంబ సభ్యులు అప్పటి వరకూ సినిమా చూసి, ఆనందంగా గడిపారు. అతడు భార్యాపిల్లలను ఇంటి దగ్గర దింపి, పలావ్ కొనుక్కుని వచ్చేందుకు బయల్దేరాడు. తిరిగి వెళ్తూండగా మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నీలాపు సంతోష్ కుమార్ రెడ్డి (34) ప్రతిపాడులోని సీఎఫ్సీ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తూ, 11 సంవత్సరాలుగా జగ్గంపేట బాలాజీ నగర్లో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి భార్య శ్రీలిఖిత, కుమార్తెలు శాన్వి, లాస్య(చిన్న పిల్లలు)తో కలసి సినిమాకు వెళ్లారు. అనంతరం, భార్యాపిల్లలను సంతోష్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద దించి, పలావు కోసం గోకవరం రోడ్డులోని బిర్యానీ సెంటర్కు మోటార్ సైకిల్పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొంది. దీంతో, సంతోష్ కుమార్ రెడ్డి బైక్ అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ను ఢీకొంది. అందరూ కింద పడిపోగా ఆ లారీ సంతోష్ కుమార్ రెడ్డి బైక్ను కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అతడి చెయ్యి నుజ్జునుజ్జయి ఊడిపోయింది. తీవ్ర గాయంతో రక్తస్రావం అవుతూండగానే సంతోష్ కుమార్ రెడ్డి మరో చేత్తో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి మొబైల్ ఫోన్లో సమాచారం అందించడం స్థానికులను కలచివేసింది. అతడిని స్థానికులు, పోలీసులు, బంధువులు తొలుత స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తూండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్ సైకిల్పై వెళ్తున్న వారు కూడా గాయపడ్డారు. సంతోష్ కుమార్ రెడ్డి భార్య శ్రీలిఖిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.చదవండి: ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం? -
ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం?
కాకినాడ క్రైం: ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనంపై వచ్చిన వ్యక్తితో నలుగురు చుట్టుముట్టారు. వారిలో ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. వారు ప్రతిదాడి చేశారు. వీరికి మిగిలిన ఇద్దరూ తోడయ్యారు. మొత్తం నలుగురూ కలసి మూకదాడికి దిగారు. అక్కడే ఉన్న చెక్కతో ఆ వ్యక్తిపై విచక్షణారహితంగా చావబాదారు. విరిగిన చెక్కలో పదునైన భాగాన్ని.. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ వ్యక్తి గొంతులో పరమ కిరాతకంగా దించేశారు. అయినా బతికేస్తాడేమోననే అనుమానంతో ఆ కర్రను బయటకు తీసి మరింత లోతుగా దించారు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మూడుసార్లు తీసి గుచ్చి, చివరిగా ఆ కర్రను బలంగా గొంతులోకి దిగ్గొట్టి క్రూరాతిక్రూరంగా హతమార్చారు. ఇదంతా మూడంటే మూడు నిమిషాల్లోనే జరిగిపోయింది. ఏదో క్రైం థ్రిల్లర్ కథలా.. సినిమాలోని క్రూర సన్నివేశంలా జరిగిన ఈ దారుణం.. ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకొనే కాకినాడ నగరం నడిబొడ్డున.. భానుగుడి సెంటర్లో.. జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరాన.. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్రెడ్డి (30) క్రూరహత్యోదంతం జిల్లాను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో పోలీసు భద్రతను ప్రశ్నార్థకం చేసింది. హతమార్చింది అందుకేనా? ఈ హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్న వ్యక్తికి రాజకీయ అండదండలున్నాయని చెబుతున్నారు. అతడి భార్య బ్యూటీషియన్గా పని చేస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని సమాచారం. ఆమెతో హతుడు సతీష్ చనువుగా ఉండేవాడని తెలుస్తోంది. అతడి స్నేహితుడు సాయికిరణ్ కూడా ఆమెపై కన్ను వేశాడని, ఆమెకు ఇష్టం లేకపోయినా దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ సతీష్కు చెప్పడంతో అతడికి, సాయికిరణ్కు మధ్య తరచుగా గొడవలు జరుగుతూండేవి. ఈ నేపథ్యంలో సాయికిరణ్ ఆ మహిళ భర్తకు సతీష్ పై లేనిపోని చాడీలు చెప్పి, ఇద్దరి మధ్య కక్షలు పెంచాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్త ఆదేశాలు, అండదండలతో సాయికిరణ్, మరో ముగ్గురు కలసి సతీష్ను ప్రణాళిక ప్రకారం అర్థరాత్రి భానుగుడి సెంటర్కు రప్పించి హతమార్చినట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన కర్రను సాయికిరణ్ అప్పటికే సమకూర్చుకున్నాడని తెలుస్తోంది. ఆ నాలుగు రోజుల్లో ఏం జరిగింది! గత నెల 8 నుంచి 12వ తేదీ మధ్య జరిగిన సంఘటనలే ఈ హత్యకు దారి తీశాయని తెలియవచ్చింది. ఆ మహిళ విషయంలో సతీష్ భార్య జయశ్రీని సాయికిరణ్ కలిశాడు. ఆ మహిళతో సతీష్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమె ఫలానా వ్యక్తి భార్య అని వెల్లడించాడు. టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడిగా చెబుతున్న ఆ వ్యక్తి అప్పటికే తన భర్త సతీష్ ద్వారా జయశ్రీకి తెలుసు. గర్భిణిగా ఉన్న ఆమె పుట్టింట్లో ఉండగా సాయికిరణ్, ఆ వ్యక్తితో జయశ్రీని కలిశాడు. ఆమె భర్తను చంపేస్తానని చెప్పాడు. తనను, కడుపులో ఉన్న బిడ్డను చూసి తన భర్తను విడిచిపెట్టాలని, సతీష్ ఆ మహిళ జోలికి వెళ్లకుండా చూసుకుంటానని ఆమె చెప్పింది. వారు వెళ్లిన తర్వాత రోజు ఆ మహిళ విషయమై సతీష్ను జయశ్రీ నిలదీసింది. ఆమెతో మాట్లాడుతున్నానని ఒప్పుకున్న అతడు.. నిండుగర్భిణిగా ఉన్న తన భార్యకు ఈ విషయం చెప్పిన సాయికిరణ్పై ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండగా, మంగళవారం అర్ధరాత్రి సాయికిరణ్, సతీష్లు ఫోనులో గొడవ పడ్డారు. దమ్ముంటే రా అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన సతీష్ తన ద్విచక్ర వాహనంపై కిరణ్ ఉన్న భానుగుడి జంక్షన్కు రాత్రి 1.45 సమయంలో వెళ్లాడు. ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం అతడిని సాయికిరణ్, అనుచరుల హతమార్చారు. సతీష్కు జయశ్రీతో ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరో నెల గర్భిణి. పొంతన లేకుండా.. ఈ హత్యకు సంబంధించి పోలీసులు చెబుతున్న కారణాలకు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తునికి చెందిన ఓ యువతిని ఇద్దరూ ప్రేమించి గొడవ పడగా అది హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, అది పోలీసుల కల్పిస్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిద్రలో నైట్ డ్యూటీ కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఈ హత్య నేపథ్యంలో పోలీసుల రాత్రి నిఘా పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. హత్య జరిగిన భానుగుడి సెంటర్ జిల్లా పోలీసు కార్యాలయానికి 200 మీటర్ల లోపే ఉంది. హత్య సమయంలో అరగంట పైగా అక్కడ అలజడి చోటు చేసుకుంది. అయినప్పటికీ నైట్ బీట్లు అటువైపు కనీసం దృష్టి పెట్టలేకపోయాయి. పోనీ కూతవేటు దూరంలోనే ఉన్న కమాండ్ కంట్రోల్ సిబ్బంది కూడా సీసీ కెమెరాల ద్వారా ఏమీ గమనించలేదు. రాత్రి వేళ డ్యూటీల్లో ఉన్న వారు గుర్రు పెట్టి నిద్రపోవడం వల్లనే దీనిని గమనించలేదనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారే కనుక మేల్కొని ఉండి, ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గమనించి ఉంటే కనీసం సైరన్ మోగించే అవకాశం ఉండేది. అప్పుడైనా ఈ నేరం ఆగి ఉండేదని పలువురు అంటున్నారు. పోలీసులపై టీడీపీ నేత ఒత్తిళ్లు! రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం రేపిన ఈ హత్యపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. సతష్ హత్యను నగరంలోని ఓ ముఖ్య టీడీపీ నేత అనుచరుడే చేయించాడని ప్రచారం జరుగుతోంది. అతడు సెటిల్మెంట్లు, దందాలతో పేట్రేగిపోతూ నగరంలో గూండాగిరి చేస్తూంటాడని, అతడే ఈ హత్య చేయించాడని సతీష్ కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. అయితే, తమ నోటి వెంట అతడి పేరు రానివ్వకుండా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సతీష్ హత్య రాత్రి 2 గంటల సమయంలో జరిగితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీడీపీ నాయకుడి అనుచరుడు తనకు ఒంట్లో బాగోలేదంటూ సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో 3 గంటల ప్రాంతంలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ కేసు నుంచి తన అనుచరుడిని తప్పించాలంటూ ఆ టీడీపీ నేత ఉన్నతాధికారుల ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నలుగురు దుర్మార్గులూ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు.చదవండి: సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్ను ఈడ్చుకెళ్లిన లారీ -
సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు?
కాకినాడ క్రైం: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వర్రెడ్డి హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జగదీశ్వర్రెడ్డికి అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలంటూ ఆయన చికిత్స పొందిన ఆస్పత్రులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కాకినాడలోని జన్మభూమి పార్కు సమీపంలో ఉన్న అహోబిల ఆసుపత్రికి, సర్పవరం జంక్షన్లో ఎస్కే ఆసుపత్రి, నాగమల్లితోట జంక్షన్లో ఉన్న ఇనోదయ ఆసుపత్రుల్లో జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందగా ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి వివరాలు కోరారు. చికిత్స వేళ ప్రమాదకరమైన పదార్థాలు ఏవైనా శరీరంలో గుర్తించారా, అనుమానాస్పద రీతిలో ఆరోగ్య స్థితి ఉండడాన్ని గమనించారా వంటి ప్రశ్నలకు సమా«ధానంగా వైద్యులు అందించే ఆరోగ్య నివేదికలు దోహదపడనున్నాయి. ఏం ఆర్డర్ పెట్టారు? స్లోపాయిజన్ గుణాలున్న రసాయనంతో సాధిక్ సౌజన్యతో కలిసి జగదీశ్వర్రెడ్డి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎలా తెప్పించాడనే వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంప్రదాయ మార్గాలను ఎంచుకున్నాడా, మరెక్కడి నుంచైనా తెచ్చాడా అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సౌజన్య, సాధిక్లు గడచిన మూడు నెలల్లో పెట్టిన ఆన్లైన్ ఆర్డర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడలో ఇన్స్టా మార్టు, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సహా ఇతర ఆన్లైన్ డెలివరీ కార్యాలయాలకు సాధిక్, సౌజన్యల ఫోన్ నంబర్లతో ఇచ్చిన ఆర్డర్ హిస్టరీలు అడుగుతున్నారు. ఇందుకు అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నారు. లావాదేవీలపై ఆరా... సాధిక్ బ్యాంకు అకౌంట్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మతం మార్చడం, లవ్ జీహాద్, ఉగ్రవాదుల ప్రస్తావనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అక్రమ మార్గాల్లో లేదా మరెవరి నుంచైనా సాధిక్ ఆర్థిక ప్రయోజనాలు పొందాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి బ్యాంకు వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకుగాను, మెయిన్రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు సహా కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు నోటీసులు జారీ చేశారు. రేపు మరికొన్ని బ్యాంకులకు పోలీసుల నోటీసులు అందనున్నాయి. సాధిక్ఖాన్ కస్టడీపై కౌంటర్ దాఖలు కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన షేక్ సాధిక్ఖాన్ను 7రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది జవహర్ అలీ మొబైల్ కోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగనుందిపోలీసులు కనీస మర్యాద ఇవ్వడం లేదు : సాధిక్ఖాన్ సోదరి సాజిదతమని స్టేషన్కి పిలిపిస్తున్న పోలీసులు హీనంగా చూస్తున్నారని, కనీస మర్యాద ఇవ్వడం లేదని సాధిక్ఖాన్ సోదరి సాజిద గురువారం ఆరోపించారు. అవమానకర రీతిలో మాట్లాడుతూ, నిలబెట్టే ప్రశ్నిస్తుండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. స్టేషన్కు వెళ్లిన వెంటనే ఫోన్లు స్వాదీనం చేసుకోవడం, వాటిని ఇవ్వమంటే ముప్పుతిప్పలు పెట్టడం మానసిక క్షోభకు గురిచేస్తోందని తెలిపారు. చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు! -
ఆ దుర్మార్గుడు సాదిక్ ఖాన్ ను ఉరి తీయాలి
-
కస్టోడియల్ డెత్ కేసు: సుప్రీంకోర్టుకు డీజీపీ ఐదుసార్లు సారీ.. అయినా..
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో పోలీసు కస్టడీలో జరిగిన ఓ యువకుడి మరణం కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024లో ఓ యువకుడు కస్టడీలో మృతి చెందగా, ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 2 సంవత్సరాల 7 నెలలు ఆలస్యం కావడంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్దేవ్ గౌతమ్ను కోర్టు తీవ్రంగా ప్రశ్నిస్తూ, ఇలాంటి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇంత సమయం పట్టడం ఏంటని, ఇక పోలీసు అధికారులకు శిక్షణ అవసరమా? అని ప్రశ్నించింది.విచారణ సందర్భంగా.. ఛత్తీస్గఢ్ డీజీపీ పూర్తిగా అసమర్థుడిగా కనిపిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును నిర్వహించే సామర్థ్యం ఛత్తీస్గఢ్ అడ్మినిస్ట్రేషన్కు లేదని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కస్టడీలో మరణం వంటి తీవ్రమైన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో కోర్టు ప్రశ్నించింది.మరో అంశంపై కూడా సుప్రీంకోర్టు డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్ట్మార్టం నివేదికను పరిశీలించకుండానే తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారని కోర్టు పేర్కొంది. ఇది సుప్రీంకోర్టును మోసం చేయడమేనని, కేసులోని ప్రతి అంశంపై కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించింది.మృతుడి మరణానికి మద్యం మానేయడం వల్ల వచ్చిన ఉపసంహరణ లక్షణాలు కారణమని పేర్కొన్నప్పటికీ, పోస్ట్మార్టం నివేదికలో తలకు మొద్దుబారిన వస్తువుతో గాయం అయినట్లు నమోదై ఉండటాన్ని కోర్టు ప్రస్తావించింది. నివేదికలో తలకు గాయం స్పష్టంగా ఉన్నప్పటికీ దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించింది.న్యాయ విచారణ నివేదిక తమకు అందలేదని డీజీపీ చెప్పినప్పుడు కూడా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ నివేదిక జూలై 2024లోనే సమర్పించారని, అంతేకాకుండా డీజీపీ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్లోనే ఆ నివేదిక భాగంగా ఉందని కోర్టు గుర్తు చేసింది.ఈ కేసులో కస్టడీ మరణానికి రూ.లక్ష పరిహారం చెల్లించిన విషయంపైనా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక మనిషి ప్రాణానికి విలువ కేవలం రూ.లక్షేనా అని ప్రశ్నిస్తూ, అది భయంకరమైన విషయం అని వ్యాఖ్యానించింది.తన వాదనలో డీజీపీ.. న్యాయ కస్టడీలో జరిగే ప్రతి మరణంపై న్యాయ విచారణ తప్పనిసరి అని చెప్పారు. న్యాయ విచారణలో అది నేరంగా పరిగణించాల్సిన కేసు అని నిర్ధారణ అయ్యే వరకు పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని వాదించారు. న్యాయ విచారణ నివేదిక రెండేళ్ల పాటు పోలీసు శాఖకు అందలేదని, అది బిలాస్పూర్ కేంద్ర జైలు లేదా జైళ్ల శాఖకు పంపినట్లు తెలిపారు.మరణం హత్యా, ప్రమాదమా, ఆత్మహత్యా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో న్యాయ విచారణ ద్వారా దాన్ని తేల్చాల్సి వచ్చిందని డీజీపీ కోర్టుకు వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పటికే చెల్లించామని చెప్పారు. న్యాయ విచారణకు సంబంధించిన సమాచారం అందిన తర్వాత జూలై 30న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించేందుకు ఓ గెజిటెడ్ అధికారితో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు.5 సార్లు క్షమాపణలువిచారణ సందర్భంగా డీజీపీ అరుణ్దేవ్ గౌతమ్ 5 సార్లు క్షమాపణలు చెప్పారు. న్యాయ విచారణ నివేదికపై జరిగిన చర్చ, నివేదిక తమకు అందకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం, నివేదికల విషయంలో ఏర్పడిన గందరగోళం వంటి అంశాలపై ఆయన క్షమాపణలు కోరారు. చివర్లో కోర్టు తనను పూర్తిగా అసమర్థుడిగా పేర్కొన్న తర్వాత కూడా క్షమాపణలు చెప్పారు.కేసును సీబీఐకి అప్పగింతకేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు కథనం పేర్కొంది. పోస్ట్మార్టం నివేదికలో మృతుడి తలకు మొద్దుబారిన వస్తువుతో గాయం అయినట్లు, కొన్ని చోట్ల రక్తస్రావం జరిగినట్లు నమోదైంది. న్యాయం కోసం మృతుడి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో పాటు బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మొత్తం మీద, కస్టడీలో జరిగిన మరణంపై ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, పోస్ట్మార్టం నివేదికను సరిగా పరిగణనలోకి తీసుకోకపోవడం, తప్పు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ పోలీసు, పరిపాలనా వ్యవస్థను తీవ్రంగా తప్పుబట్టింది.ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు -
లైంగిక వేధింపులు భరించలేకున్నా..
వికారాబాద్: తన కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఓ వ్యక్తి పెడుతున్న లైంగిక వేధింపులు, బెదిరింపులను భరించలేకున్నానని బాధిత మహిళ బుధవారం పరిగి డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇదే ఊరికి చెందిన కర్రె సుధాకర్ నెల రోజులుగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈవిషయమై బాధితురాలు ఈనెల 15న స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, 18న కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకూ అతన్ని అరెస్టు చేయకపోగా, కేసు వాపస్ తీసుకోవాలని ఎస్ఐ తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. దీనిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని డీఎస్పీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన ఎస్ఐ బాలవెంకటరమణతో ఫోన్ మాట్లాడి, నిందితున్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు, చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. -
జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
అన్నయ్య వచ్చేసరికే నేనక్కడ ఉండాలి! చెల్లెలి విషాదం!
ఆంధ్రప్రదేశ్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ప్రైవేటు బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.వీరిలో కొండూరు భావన వర్ష(23)ది విజయవాడ. హైదరాబాద్లో హెచ్ఆర్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు తండ్రి కృష్ణారావు, తల్లి సుభాషిణి ఉన్నారు. వీరు అజిత్సింగ్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆగిరిపల్లి మండలం అడవినెక్కలంలో జ్యూయలరీ వర్క్షాపు ఉంది.దీంతో మంగళవారం మకాం అడవినెక్కలంకు మార్చారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్ సౌదీలో పనిచేస్తున్నారు. ఆయన రాఖీ పండగ కోసం వస్తుండడంతోపాటు తనకు బెంగళూరులో ఉద్యోగం రావడంతో కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉండాలని భావించిన భావన వర్ష చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విజయవాడకు బయలుదేరారు.ముందు వేరే బస్సుకు టికెట్ బుక్ చేసుకున్న ఆమె ఆ బస్సు వెళ్లిపోవడంతో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కారు. రూమ్మేట్స్ బుధవారం వెళ్లొచ్చుకదా అన్నా.. సోదరుడికి రాఖీ కట్టాలని, అన్నయ్య వచ్చేటప్పటికే తాను అక్కడ ఉండాలని ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారారు.ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో విజయవాడ మధురానగర్లోని తాతయ్య బ్రహ్మయ్య ఇంటి వద్దకు తీసుకురావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అమ్ములూ ఒక్కసారి కళ్లుతెరువమ్మా అంటూ ఆమె తల్లి, పెద్దమ్మలు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. సోదరుడు రెశ్వంత్ సౌదీ నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇవీ చదవండి: తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు -
తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ జయప్రకాష్ నగర్కు చెందిన పడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్లో అమెజాన్ కంపెనీలో ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆమెకు తండ్రి రామ్ప్రసాద్, తల్లి కవిత, తమ్ముడు దేవివరప్రసాద్ ఉన్నారు. మిలాద్ ఉన్నబీ, రాఖీ, వీకెండ్ వరుస సెలవులు కావడంతో ఆమె తమ్ముడికి రాఖీ కట్టేందుకు విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆనందంగా బయలుదేరారు. మంగళవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి బుధవారం ఉదయం ఆరు గంటలకల్లా విజయవాడలో ఉంటానని సంతోషంగా చెప్పింది. కూతురి కోసం ఏడు గంటల వరకు వేచి చూసిన తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో ఏం జరిగిందో తెలీక కంగారు పడ్డారు. ఇంతలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగిందని టీవీలో వార్తలు ప్రసారం కావడం, మృతుల జాబితాలో లక్ష్మీతేజ పేరు ఉండడంతో తండ్రి రాంప్రసాద్ హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే లక్ష్మితేజ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. రాత్రి ఫోన్ చేసి ఉదయానికి వస్తాను నాన్న అని చెప్పిన నా కూతురిని ఇలా చూస్తానని అనుకోలేదని రాంప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకొచ్చిన కూతురు మృతదేహంపై పడి తల్లి కవిత విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇంటికి వచ్చినప్పుడల్లా నీ కాళ్ల పట్టీలు కావాలమ్మా.. అని అడిగేదానివి కదా.. లే అమ్మా పట్టీలు ఇస్తాను. తమ్ముడికి రాఖీ కడుదువుగానీ అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. గత రెండేళ్ల నుంచి లక్ష్మితేజకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది ఎలాగైనా కల్యాణం జరిపించాలని అనుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.చదవండి: ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి... -
అక్క కోసం దేనికైనా రెడీ ప్రియాంక సోదరుడు
-
సినిమాను మించిన ట్విస్టులు ఆ 5పేజీల లేఖలో నిజమెంత..?
-
సౌజన్య భర్తను చంపిన.. సైనైడ్ ఎక్కడ దొరికింది.. బయటపడుతున్న సాధిక్ లింకులు
-
పాల వ్యాపారితో వివాహేతర సంబంధం..
తమిళనాడు: ఆవడి సమీపం కర్లబాక్కం యాదవర్ వీధికు చెందిన లతా(45). ఈమె కర్లబాక్కం పంచాయతీలో క్లీనర్గా పని చేస్తోంది. ఈమె భర్త, సుబ్రమణి 8 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి పిల్లలు లేరు. దీంతో ఆమె తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ వచ్చింది. ఈనెల 20వ తేదీ లత పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు రాలేదు. ఆమె ఇంటి తలుపు బయటి నుండి తాళం వేసి ఉంది. ఈ స్థితిలో, మంగళవారం లత ఇంట్లో నుండి దుర్వాసన వచ్చింది. దీంతో ఇరుగుపొరుగు వారు ముక్తపుదుపేట్టై పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ సెల్వి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఆ సమయంలో, పడకగదిలో లత తలకు గాయాలతో, కుళ్లిపోయిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఆమె ధరించిన ఆభరణాలు గానీ, ఇంట్లోని వస్తువులు గానీ ఏవీ దొంగిలించబడలేదు. అనంతరం, పోలీసులు లత మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం చెన్నైలోని కిల్పాకం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. అవడి ముక్త పుదుపేట్టై పోలీసులు అనుమానాస్పద మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విచారణ లో అదే ప్రాంతానికి చెందిన మునివేల్ (65) అనే పాల వ్యాపారితో లతకు అక్రమ సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో, పోలీసులు మునివేల్ను అరెస్టు చేసి విచారణ జరిపారు. విచారణ సమయంలో, తానే లతను చంపానని అతను చెప్పాడు. చాలా కాలంగా లతతో తనకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. లత కొన్ని రోజులుగా చాలా మంది పురుషులతో సంబంధం పెట్టుకోవడంతో కొట్టి చంపినట్లు తెలిపాడు. దీంతో మునివేల్ను పుళల్ జైలుకు తరలించారు. చదవండి: యువతి గదిలో కెమెరా పెట్టిన ఇంటి యజమాని -
యువతి గదిలో కెమెరా పెట్టిన ఇంటి యజమాని
తిరువొత్తియూరు: చెన్నైలోని వానగరం ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి, తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఒక అద్దె ఇంట్లో నివసిస్తూ, ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. వీరి ఇంటి యజమాని కుమారుడు శరవణన్ ఆ యువతి, ఆమె స్నేహితురాళ్లు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు తరచూ వారికి వేధింపులు గురిచేసేవాడని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో, ఆ మహిళలు ఉంటున్న గదిలోని స్విచ్ బాక్స్లో ఓ రహస్య కెమెరా అమర్చిన్నట్లు గమనించారు. అంతేకాకుండా, ఆ కెమెరా ఇంటి యజమాని కుమారుడైన శరవణన్ మొబైల్ ఫో¯న్కు అనుసంధానించబడి (లింక్ అయి) ఉండటం చూసి వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనిపై వానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం, సమాచార సాంకేతిక చట్టం సహా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, శరవణన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సూర్యాపేట: ప్రాణాలు తీసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం -
ఇంటిని అమ్మి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య
వివాహేతర సంబంధం, డబ్బుల గొడవతో భార్యను భర్త హత్య చేసిన ఘటన తళి వద్ద జరిగింది. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని కర్ణాటక సరిహద్దు గ్రామమైన గుమ్మళాపురంలో నారాయణస్వామి (39), భార్య విద్య (30), ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నారు. విద్యకు మరో యువకునితో ఏడాదిగా అక్రమ సంబంధం ఉందని భర్తకు అనుమానంగా ఉంది. ఇలాంటివి వద్దని భార్యను మందలించాడు. దీంతో కొన్నివారాలుగా గొడవలు జరుగుతుంటే పెద్దలు పంచాయతీ చేశారు. పునీత్తో పరారీ నారాయణస్వామికి అప్పులు ఎక్కువ కావడంతో స్థలాన్ని రూ.22 లక్షలకు విక్రయించి అప్పు తీర్చేశాడు. మిగిలిన రూ.5 లక్షలను భార్య ఖాతాలో ఉంచాడు. కొన్నిరోజుల క్రితం విద్య, ప్రియుడు పునీత్తో పరారై బెంగళూరు దగ్గర ఆనేకల్లో మకాం వేసింది. ఇది తెలుసుకొన్న నారాయణస్వామి ఆనేకల్కు చేరుకొని తన డబ్బులు తిరిగి ఇవ్వాలని, తన వెంట రావాలని భార్యను కోరాడు. ఆమె తిరస్కరించడంతో గ్రామానికెళ్లిపోయాడు. ఊరికి బ్యాంకుకు రాగా.. సోమవారం బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసేందుకు విద్య గుమ్మళాపురానికి వచ్చినట్లు తెలుసుకొన్న భర్త అక్కడికెళ్లి డబ్బులు ఇవ్వు, నీ పేరు మీద ఉన్న ఆస్తిని పిల్లల పేరుమీద రాయాలంటూ గొడవ చేస్తూ బ్యాంకు నుంచి ఆమెను బయటకు లాక్కొచ్చి తలపై బండరాయితో బాది హత్య చేసి పారిపోయాడు. డెంకణీకోట డీఎస్పీ, తళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని ఆస్పత్రికి తరలించారు. నారాయణస్వామిని అరెస్ట్ చేయగా ఈ ఘటన తళి ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. తల్లీదండ్రి దూరమై ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. కర్ణాటక : ‘నిన్ను.. నీ ఇద్దరు పిల్లలను చూసుకుంటా లిల్లీ’ -
సూర్యాపేట: ప్రాణాలు తీసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు.బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో డివైడర్ మధ్యలో ఐరన్ లోడ్ లారీ ఆగిపోయింది. అయితే వేగంగా వెళ్లిన బస్సు.. లారీ కంటైనర్ను ఢీ కొట్టింది. దీంతో ఐరన్ దిమ్మెలు బస్సులోకి దూసుకెళ్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన వాళ్లను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.అతివేగం.. ముందు ఆగిఉన్న లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్సీ నరసింహ తెలిపారు. డ్రైవర్ అందుబాటులో లేడని(పరారీ?).. ఉదయం 4గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో.. చిన్ని, మేరీ, నాగేంద్రబాబులను గుర్తించినట్లు తెలిపారు. మిగతా మృతుల పేర్లు.. వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలకి దిగి క్లియర్ చేశారు.టీ విరామం తర్వాత బస్సు ప్రారంభమైన గంటకు ప్రమాదం జరిగిందని.. బస్సు బలంగా ఢీ కొట్టాక ఐరన్ దిమ్మెలు వచ్చి పడ్డాయని క్షతగాత్రుడొకరు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత 20 మందిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్లు కోదాడ ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. వాళ్లలో ముగ్గురిని సూర్యాపేటకు తరలించినట్లు వెల్లడించారు. -
ఇందుకేనేమో యువకులు పెళ్లి చేసుకోవాలంటే వణికిపోతున్నారు!
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ భర్త తన భార్యను ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దీంతో, ఈ సమయంలో తన భార్య తన చేతులను పట్టుకోగా, ఆమె ప్రియుడు తనపై దాడి చేసి.. గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని బాధిత భర్త ఆరోపించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి తనను కాపాడారని తెలిపాడు.బాధిత భర్తకు ఆ మహిళతో సుమారు నెలన్నర క్రితమే వివాహం జరిగింది. ఫిర్యాదు చేసేందుకు భర్త ఝాన్సీ ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెల్లడించాడు. ఈ ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.చిర్గావ్ పోలీస్స్టేషన్ పరిధిలోని అతడు నివసిస్తున్నాడు. అతడు తన తల్లిదండ్రులతో కలిసి ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లాడు. జూన్ 24న మధ్యప్రదేశ్లోని భాండేర్కు చెందిన ఓ యువతితో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగినట్లు తెలిపాడు. పెళ్లయినప్పటి నుంచి తన భార్య తనకు నిద్రమాత్రలు ఇవ్వడం ప్రారంభించిందని, తాను నిద్రపోయాక ఆమె తన ప్రియుడితో మాట్లాడుకునేదని భర్త ఆరోపించాడు.టీ, పాలలో నిద్రమాత్రలు తన భార్య టీ, పాలలో నిద్రమాత్రలు కలిపేదని, ప్రియుడితో కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడిందని బాధిత భర్త ఆరోపించాడు. ఆగస్టు 19న ప్రియుడి ఇంట్లోకి వెళ్లిన తర్వాత, ఆగస్టు 23న రెండోసారి భర్త వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ సమయంలో ప్రియుడు, భార్య కలిసి తన గొంతు నులిమి కొట్టారని ఆరోపించాడు. అతని అరుపులు విని వచ్చిన పొరుగువారు అతడిని కాపాడారు. ప్రస్తుతం తన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెబుతూ బాధితుడు పోలీసులను న్యాయం చేయాలని కోరాడు.ఈ కేసుపై మోంఠ్ పోలీస్ సర్కిల్ అధికారి మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారని, ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇదీ చదవండి: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక -
జూబ్లీహిల్స్ సీఐ పై సస్పెన్షన్ వేటు
-
మద్యం మత్తులో మహిళల వీరంగం.. ఇద్దరు యువకులపై దాడి
-
విషం ఎక్కడ కొన్నాడు? అమ్మిందెవరు? జగదీశ్వరరెడ్డి స్లో పాయిజన్ మిస్టరీ..
-
భార్య హత్య కేసులో ట్విస్ట్.. స్క్రూ మేకుతో బయటపడ్డ భర్త బండారం!
ఏలూరు జిల్లా: ఎలాంటి ఆధారాలు దొరక్కుండా భార్యను హత్య చేసి, ఉప్పుటేరులో పడేసి చేతులు దులుపుకోవాలనుకున్న భర్త పన్నాగం పది రోజులకు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మెడికల్ స్క్రూ మేకు ఇచ్చిన కీలక ఆధారంతో పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. ఈ హత్యోదంతానికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఘటన వివరాలు ఇలా.. భీమవరం టూటౌన్లోని వంశీకృష్ణ అపార్ట్మెంట్లో ఉప్పాడ నారాయణరావు, దేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉండగా, ఆమె అమెరికాలో ఉంటున్నారు. చేపల కమిషన్ వ్యాపారం చేసే నారాయణరావు అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పాటు అనుమానాలు పెరిగాయి. కుటుంబ సభ్యులను దూషించడం, శారీరకంగా దగ్గరకు రానివ్వకపోవడం వంటి విషయాలతో కక్ష పెంచుకున్న నారాయణరావు.. ఈ నెల 8న వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లి, 14న తిరిగి ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగగా, భార్యను నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి తన మారుతి కారు (ఏపీ 37 సీఎల్ 1499)లో మృతదేహాన్ని ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వంతెన వద్దకు తీసుకెళ్లాడు. మందపాడు వెళ్లే రోడ్డు వైపు వెళ్లి ఉప్పుటేరులో పడేసేందుకు ప్రయతి్నంచగా, మృతదేహం గట్టుపైనే పడిపోయింది. దీంతో కారును ముందుకు పోనిచ్చి, అక్కడి నుంచి తిరిగి భీమవరానికి వెళ్లిపోయాడు. విస్తృత దర్యాప్తు.. మహిళ మృతదేహంపై పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ నేరస్థలాన్ని పరిశీలించాయి. డాగ్ స్క్వాడ్ సమీపంలోని చెరువు గట్టు ప్రాంతం వరకు వెళ్లి ఆగిపోయింది. నిందితుడు ఆ ప్రాంతంలో కారును వెనక్కి తిప్పడంతో అక్కడివరకే జాగిలం వెళ్లినట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలకు ఆదేశించారు. ఆయా బృందాలు ఉభయగోదావరి, కృష్ణ, ఇతర ప్రాంతాల్లో పర్యటించి విచారణ చేశారు. స్క్రూ మేకుతో బయటపడిన నిజం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి రెండు రోజులు మార్చురీలో ఉంచారు. పోస్టుమార్టంలో ఆమె ఎడమ కాలుకు స్టీల్ రాడ్డు, సర్జికల్ స్రూ్కలు ఉండటాన్ని గుర్తించారు. వాటిని పరిశీలించగా.. ఇంప్లాంట్ తయారీ కంపెనీ ’దాల్ అండ్ సన్స్’గా తేలింది. ఆ స్టీల్ రాడ్, స్రూ్కలను హైదరాబాద్లోని సుశీల ఆసుపత్రికి పంపినట్లు నిర్ధారించుకుని ఆరా తీయగా.. 2023 జనవరిలో భీమవరానికి చెందిన ఉప్పాడ దేవికి వాటిని అమర్చినట్లు వెల్లడైంది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించగా తాళం వేసి ఉంది. దీంతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. నిందితుడి అరెస్ట్ తరచూ గొడవలు పడటంతో పాటు కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించడం, శారీరకంగా దగ్గరకు రాకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు నారాయణరావు అంగీకరించాడని అదనపు ఎస్పీ తెలిపారు. ఈ నెల 23న రాత్రి 7:15 గంటలకు ఆకివీడు పోలీస్ స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆకివీడు సీఐ కాళీచరణ్, ఎస్సై కే శుభశేఖర్, కాళ్ల ఎస్సై ఏ గణేశ్కుమార్, ఉండి ఎస్సై మల్లికార్జునరావు తదితర సిబ్బందిని ఆయన అభినందించారు. -
తల్లి చనిపోతే కీడు సోకుతుందని.. బావిలో పడేసిన కుమారులు
కరీంనగర్ జిల్లా: తల్లి ఇంట్లో చనిపోతే దోషం వల్ల ఇల్లు వదలాల్సి వస్తుందన్న మూఢనమ్మకంతో కొడుకులే ఆమెను బావిలో పడేసి హత్య చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై హుజూరాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ విలేకరులకు తెలిపిన వివరాలివి. సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ (80)కు నలుగురు కుమారులు సమ్మయ్య, కుమారస్వామి, రవీందర్, శ్రీనివాస్. వెంకటమ్మ వయోభారం, అనారోగ్యంతో మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉండేది. ఇంట్లో చనిపోతే దోషం వల్ల ఇల్లు వదలాల్సి వస్తుందని, ఎవరి ఇంట్లో చనిపోయినా దోషం పట్టుకుంటుందని పెద్ద కుమారుడు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ భావించారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటమ్మను వ్యవసాయ బావిలో వేసి హత్య చేశారు. మర్నాడు తమ తల్లి కనిపించడం లేదని గ్రామంలో వెతికారు. కాగా, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు వ్యవసాయ బావి వద్దకు ఎలా వెళ్తుందన్న అనుమానంతో పాటు కొడుకుల ప్రవర్తనపై పోలీసులు విచారించారు. ఇంట్లో చనిపోతే కీడు సోకుతుందని మూఢనమ్మకంతో తల్లిని బావిలో వేసి హత్య చేసినట్లు సమ్మయ్య, శ్రీనివాస్ విచారణలో ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. -
చిన్న సమస్యతో ఆస్పత్రికి.. చివరికి విషాదం!
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వివాహిత మృతి చెందింది.దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రిని ధ్వంసం చేశారు.వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం పరారైంది. వివరాల్లోకి వెళితే.. కాచిగూడకు చెందిన దివ్య (35) చిన్నపాటి ఆనారోగ్య సమస్యతో మారేడుపల్లిలోని బృందావన్ ఆసుపత్రిలో చేరారు.వారం రోజుల క్రితమే ఆమెను పరీక్షించిన వైద్యులు సోమవారం ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో, ఆదివారం రాత్రి అడ్మిట్ అయ్యారు. సోమవారం ఉదయం చికిత్స ప్రారంభించారు. తొలుత పేషెంట్కు రక్త స్రావం అవుతోందని.. అదనపు రక్తం కావాలని చెప్పారు. ఇంతలోనే పెషెంట్ వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయాయని, బ్లడ్ సెల్స్ తెప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరికొద్ది సేపటికి పేషెంట్ మృతి చెందినట్లు చెప్పి, మృతదేహాన్ని అక్కడే వదిలేసి వైద్యులు తప్పించుకున్నట్లు మృతురాలి బంధువులు పేర్కొన్నారు. దీంతో ఆందోళనకు దిగడంతో మరికొందరు బంధువులు కూడా మద్దతు పలికారు.ఆసుపత్రి అద్దాలు, పూలకుండీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి ఆసుపత్రి యాజమాన్యం, బాధితులతో మాట్లాడారు. ల్యాప్రోస్కోపీ సమయంలో ప్రమాదవశాత్తూ వెయిన్ తెగిపోవడంతో తీవ్రంగా రక్తస్రావంతో పాటు పెషెంట్ గుండెపోటుకు గురై ఉంటుందని వైద్యులు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు రాతపూర్వక సమాధానం అనంతరం బాధితులు శాంతించినప్పటికీ, నిర్లక్ష్యపు వైద్యం చేసిన ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.కేసు నమోదు... మృతురాలి భర్త వికాస్ ఫిర్యాదు మేరకు అస్పత్రి వైద్యులు శ్రీకాంత్, గీతాంజలి పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు.ఎమ్మెల్యే పరామర్శ.. దివ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరామర్శించారు. బృందావన్ ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. -
చిక్కిన నకిలీ డీఎస్పీ..
సాక్షి, హైదరాబాద్: డబ్బులు డబుల్ చేస్తామని వ్యాపారి నుంచి రూ.1.20 కోట్లు కాజేసిన కేసులో కీలక నిందితుడు నకిలీ డీఎస్పీ కొండూరు రెడ్డి వెంకట్ రాజు ఎట్టకేలకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. దాదాపు ఐదేళ్లుగా పరారీలో ఉన్న అతడిపై మరో మూడు కేసులు ఉన్నట్లు డీసీపీ చైతన్యకుమార్ సోమవారం వెల్లడించారు.మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్కుమార్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఆయన స్నేహితుడు కోడటి జయప్రతాప్ 2018 డిసెంబర్లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్లు ఇస్తాడని చెప్పగా.. సునీల్కుమార్ నమ్మలేదు.దీంతో 2019 అక్టోబర్ 28న అప్పుడు సీఐడీ విభాగంలో తిరుపతి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.మునిరామయ్యను జయప్రతాప్ హైదరాబాద్ తీసుకువచ్చి సునీల్ కుమార్ను కలిశారు. రూ.1.20 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ మునిరామయ్య నమ్మించారు. ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్ ప్రశ్నించడంతో.. మునిరామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన రాజు అనే వ్యక్తిని తీసుకువచ్చి టాస్క్ఫోర్స్ డీఎస్పీగా పరిచయం చేశాడు.డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ ఒప్పించారు. రెండేళ్లయినా డబ్బు తిరిగిరాకపోవడంతో సునీల్కుమార్ ఆరా తీయగా రాజు అనే డీఎస్పీనే లేరని తేలింది. సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో జయప్రతాప్, మునిరామయ్య, రాజు సహా ఐదుగురిపై 2021లో కేసు నమోదు చేశారు. 2021, 2022లో కొందరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూడో డీఎస్పీ రాజు బెంగళూరులో ఉన్నట్లు టీమ్–5 ఏసీపీ కె.కిరణ్ కనిపెట్టి పట్టుకున్నారు. -
గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ మృతి
నాగర్కర్నూల్ జిల్లా: ఆ కుటుంబంపై మృత్యువు పగబట్టింది. ఉదయం విధులకు బయలుదేరిన తల్లి బస్టాండ్లోనే అకస్మాత్తుగా మృతి చెందగా, ఈ విషాద వార్త తెలుసుకుని పరామర్శించేందుకు వస్తున్న కుమారుడు, కోడలు, అల్లుడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో కోడలు, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందారు. గంటల వ్యవధిలోనే ముగ్గురూ మృత్యువాత పడటంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రాయవరం గ్రామానికి చెందిన లావుడ్యా లలిత (50) గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. సోమవారం విధులకు వెళ్లేందుకు అచ్చంపేట బస్టాండ్కు చేరుకున్న ఆమె అక్కడే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అంత్యక్రియలకు వస్తూ అనంతలోకాలకు.. లలిత మృతి విషయం తెలుసుకున్న హైదరాబాద్లో నివాసముంటున్న ఆమె కుమారుడు శ్రీకాంత్, కోడలు చంద్రకళ (32), అల్లుడు నాగరాజు (35) అచ్చంపేటకు బయలుదేరారు. ముగ్గురూ ఒకే ద్విచక్రవాహనంపై వస్తుండగా నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేయబోయారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో కారు వీరి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కోడలు చంద్రకళ, అల్లుడు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందడంతో రాయవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. -
మొగుడ్ని చంపి పేగుల్లాగేసింది: కిడ్నీ, లివర్ మాయం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లోని కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో రాజ్ ప్యాలెస్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళ భర్తను అత్యంత అమానుషంగా హత్య చేసింది. పొట్టలో కత్తితో దారుణంగా పొడవడంతో పేగులు బయటకొచ్చిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు మృతుడి కాలేయం, కిడ్నీ అదృశ్యం కావడంపై మరింత ఆందోళన రేపింది. దీనిపై హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.యూపీలోని ధంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, విమలా దేవి భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో భర్తను పొడిచిన తర్వాత, ఆ మహిళ అతని ప్రేగులను భవనం పైకప్పుపై ఉన్న ప్లాస్టిక్ సంచిలో కుక్కుతుండగా,ఇంటి యజమాని కంట్లోపడింది. ఇంటి యజమాని రింకు అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించినప్పుడు, నిందితురాలు విమలా దేవి భవనం పైకప్పు పైనుంచి దూకేసింది. రాజేష్ పొట్టలో తీవ్రమైన గాయాలు అయ్యాయని, బయటకు వచ్చిన ప్రేగులను విమల ఒక ప్లాస్టిక్ సంచిలో పెడుతోందని రింకు పోలీసులకు తెలిపింది. మరోవైపు నిందితురాలు దేవి వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు పోలీసులు.భర్త కాలేయం, మూత్రపిండం అదృశ్యంపోస్ట్-మార్టం నివేదిక ప్రకారం, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ గౌరవ్ కౌశిక్ వివరాల ప్రకారం భర్త రైట్ కిడ్నీ,కాలేయంలోకొంత భాగం కనిపించకుండా పోయాయి. అలాగే పొట్ట భాగంలో సుమారు 37 సెంటీమీటర్ల పొడవైన లోతైన గాటు, ప్రేగులు బయటకు వచ్చి పడి ఉన్నాయి. ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బువిమల, రాజేష్ దంపతులు సుమారు ఏడాది కాలంగా కురుక్షేత్రలో నివసిస్తుండగా, భర్త ఒక కంపెనీలో నీటి సరఫరా విభాగంలో పనిచేసేవాడు. వీరికి పిల్లలు లేరు. అయితే విమలాదేవి చేతబడి, దుష్టశక్తులను వదిలించే ప్రక్రియవంటి పనుల్లో నిమగ్నమై ఉండేదని, వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని ఇంటి యజమాని తెలిపారు.ఇదీ చదవండి: 25 ఏళ్లకే కోట్లు సంపాదించా : ఫ్యూచర్లో ఏం చేయాలి?ఘటనా స్థలం నుండి పోలీసులు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ హత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదు. విచారణకు సహకరించేంతగా ఆమె ఆరోగ్యం కుదుటపడ్డాక ఆమెను విచారిస్తామని ఆదర్శ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సురేందర్ సంధు వెల్లడించారు. ఈ అవయవాలు అదృశ్యం కావడానికి, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్ -
సాదిక్ ఖాన్ గురించి కీలక విషయాలు బయటపెట్టిన పోలీస్
-
పిలిచినప్పుడల్లా రూమ్కు రావాలని..!
బెంగుళూరు: యువకుడి వేధింపులతో యువతి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన బెంగళూరులోని హెచ్ఎస్ఆర్.లేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలోని అగర చెరువులో శనివారం చోటుచేసుకుంది. శివమొగ్గ జిల్లా సాగర తాలూకా బెళలమక్కికి చెందిన వాణి(22), అభిషేక్లు ఒకే కాలేజీలో చదివారు.ఏడాదిక్రితం యువతి ఉద్యోగం కోసం బెంగళూరుకు చేరుకుని బంగారు దుకాణంలో పనిచేస్తోంది. గతంలో ఉన్న పరిచయం కారణంగా వాణికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. వాణికి చెందిన ప్రైవేటు ఫొటోలు సేకరించి వేధించడం ప్రారంభించాడు. పిలిచినప్పుడు రూమ్కు రావాలని మెసేజ్ చేసేవాడు. రాకపోతే నీ పరువు తీస్తానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు చెరువులోకి దూకి ఆత్మహత్యచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. వాణి రాసిన సూసైడ్ నోట్ను స్వాదీనం చేసుకున్నారు. ‘అమ్మనాన్న నన్ను క్షమించండి నన్ను గుర్తుకు తెచ్చుకోకండి, ఇంటి పరువు ముఖ్యం, నా చావుకు అభిషేక్ కారణం. నన్ను బ్లాక్మెయిల్ చేసి వేధించాడు’ అని పేర్కొంది. హెచ్ఎస్ఆర్. లేఔట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి అభిషేక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నేనే చంపా.. గ్యాంగ్ స్టర్ సంచలన ప్రకటన
-
ఏదేదో రాసేస్తున్నారు... ఆరోజు జరిగింది ఇదే..! విశాల్ ఎవరో నాకూడా తెలీదు...
-
ప్రేమను అంగీకరించలేదని...! కన్నవారినే కడతేర్చిన యువతి
-
కొడుకు వివాదంపై సంచలన కామెంట్స్
-
మీనా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలోకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యం కాగా, ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇదిలావుండగా మీనా మృతదేహం బాగా పాడవడంతో కుటుంబీకులు సొంతూరు కాకినాడకు తీసుకెళ్లకుండా, ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంబాలచెరువు (రాజమహేంద్రవరం) -
ప్రియుడి కోసం కన్నవారినే.. కట్ చేస్తే...
-
అంతులేని.. భర్తల క్రూరత్వం
పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని భర్త, అత్త వేధింపులు.. టెక్కీ ఆత్మహత్య. కేజీ బంగారం, రూ.కోటికి పైగా నగదు, వైభవంగా పెళ్లి చేశారు, వారం తిరక్కుండానే వధువు బలవన్మరణం.. ఇలాంటి విషాద ఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని చట్టం చెబుతున్నా ఎవరూ పాటించడం లేదు. పైగా మరింత డబ్బు, బంగారం కావాలని సతాయిస్తూ ఆడపిల్లల ఉసురుతీసే భర్తల అఘాయిత్యాలు పెరిగిపోయాయి.బెంగుళూరు: గత నాలుగేళ్లలో రాష్ట్రంలో బెంగళూరుతో సహా వివిధ జిల్లాల్లో 617 మంది మహిళలు వరకట్న భూతానికి బలయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్ 2022 నుంచి 2026 జూన్ వరకు రాష్ట్రంలో మహిళలపై సంభవించిన నేరాల గురించి విడుదల చేసిన నివేదికలో ధనదాహపు భర్తలు, అత్తమామల హింసోన్మాదం పెల్లుబికింది. శిక్ష 7 మందికి మాత్రమే వరకట్న వేధింపులతో మహిళల మృతి, అత్యాచారం, లైంగిక దాడులు, మహిళలపై భర్తల హింస తదితరాలను నివేదికలో ప్రస్తావించారు. మెట్టినింట కట్న వేధింపులతో 617 మంది మరణించారు. కానీ ఇందులో 7 మందికి శిక్ష పడింది. 467 కేసులు ఇంకా కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. సుదీర్ఘమైన దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ ప్రక్రియ, సాక్షులకు భద్రత కల్పించడం, న్యాయప్రక్రియ అంశాల వల్ల కేసుల విచారణ సవాళ్లు ఎదుర్కొంటోంది. లైంగిక వేధింపులు.. మహిళలపై లైంగిక వేధింపుల కేసులు 2022లో 5,857 నమోదుకాగా, 54 మందికి శిక్షలు పడ్డాయి. 559 నకిలీ ఆరోపణలని తెలిసింది. 2023లో 6,489 కేసులు నమోదుకాగా 651 నకిలీ కేసులుగా వెల్లడైంది. 2024లో 6335 కేసులు నమోదుకాగా ఇందులో 722 నకిలీ కేసులున్నాయి. 2025లో 5843 కేసులు నమోదు కాగా 610 నకిలీ కేసులు. నాలుగేళ్లలో 27,828 లైంగిక వేధింపుల ఘటనలు సంభవించాయి. అత్యాచారం కేసులు.... రాష్ట్రంలో గత నాలుగేళ్లలో మొత్తం 2,527 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. 2022లో 537, 2023లో 600, 2024లో 623, 2025లో 550 కేసులు, 2026లో 262 కేసులు వచ్చాయి. అంతులేని.. భర్తల క్రూరత్వం భర్తల క్రూరత్వ ప్రవర్తనపై 2022లో 2,779 కేసులు నమోదు కాగా ఇందులో 2,467 కేసుల్లో నేరం రుజువైంది. 2023లో 2,946 దౌర్జన్యం కేసుల్లో 329 నకిలీవని తేలింది. 2,556 కేసుల్లో వేధింపులు నిజమేనని నిర్ధారణ అయ్యింది. 2024లో 2,894 కేసులు నమోదు కాగా, ఇందులో 2,566 కేసుల్లో భర్తల దాషీ్టకాలు రుజువయ్యాయి. 2025లో 2,744 కేసులు నమోదుకాగా 231 నకిలీ కేసులున్నాయి. 2026 జూన్ వరకు 1,534 దౌర్జన్యం కేసులు నమోదయ్యాయి. ఏటా 2 వేల కేసులువివాహం, ఆ తరువాత వరకట్న వేధింపుల నియంత్రణ చట్టం కింద 2022లో 2,245 కేసులు నమోదు కాగా, 2023లో 2,348 కేసులు, 2024లో 1,999 కేసులు, 2025లో 2,110, 2026 జూన్ వరకు 1,039 కేసులు నమోదయ్యాయి. తమ వద్ద నమోదైన కేసులను పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డా.నాగలక్ష్మీ చౌదరి తెలిపారు. -
బంగ్లాదేశ్: హిందూ కుటుంబం కేసులో షాకింగ్ విషయాలు
ఓ కుటుంబంలోని అందరి ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంటి తలుపులు లోపలికి మూసివేసి ఉన్నాయి. తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కనిపించిన దృశ్యం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. అయితే దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు మరింత షాక్కు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ రంగ్పూర్లోని దాస్పారా ప్రాంతంలో నివసించే రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్ (12) మృతదేహాలు ఇంట్లోనే చెల్లాచెదురుగా పడి ఉన్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చనిపోయింది హిందూ కుటుంబం కావడంతో.. మత విద్వేష దాడా? అనే కోణంలోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే.. కారణం అది కాదని పోలీసులు తేల్చారు. అంతేకాదు హత్యల తర్వాత కూడా నిందితులు గంటల పాటు అదే ఇంట్లో ఉండటం, అక్కడే తినడం, స్నానం చేయడం వంటి విషయాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.అసలు ఏం జరిగింది?మొదట ఈ ఘటనను దోపిడీకి సంబంధించిన హత్య, మత విద్వేష దాడులా? అనే కోణంలో పోలీసులు అనుమానించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, దోపిడీ జరిగినట్లు కనిపించే పరిస్థితులు ఆ కోణంలో దర్యాప్తుకు దారితీశాయి. అయితే ఆధారాలు సేకరించే కొద్దీ అసలు కథ బయటపడింది.గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పుపైకి పొరుగింటి మార్గం ద్వారా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ‘యాబా’ అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నారు. ఆ శబ్దాలు విని పైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో.. తమను గుర్తిస్తాడనే భయంతో ఆయనను గొంతు నులిమి హత్య చేశారు. చక్రవర్తి ఎంతకీ కిందకు రాకపోవడంతో.. ఆ వెనకాలే వచ్చిన ఆయన భార్య, కుమార్తె, కుమారుడిని కూడా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.గణపతి చక్రవర్తి ఫ్యామిలీ (పాత ఫొటో)గురువారం ఈ ఘోరం జరగ్గా.. ఈ కేసులో ముఘ్దో, సిద్ధార్థ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.హత్యల తర్వాత కూడా ఇంట్లోనే..ఈ ఘటనలో అత్యంత షాకింగ్ అంశం.. హత్యలు చేసిన తర్వాత నిందితులు వెంటనే పారిపోలేదని దర్యాప్తులో తేలడం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఆ ఇంట్లోనే ఆరు నుంచి ఏడు గంటల పాటు ఉన్నారు. ఇళ్లంతా కలియ దిరిగారు. ఖర్జూరాలు, దోసకాయలు తిన్నారని.. స్నానం చేశారని, ఆపైనా మత్తు పదార్థం తీసుకున్న ఆనవాళ్లు లభించాయని చెప్పారు.అంతేకాదు.. దోపిడీ జరిగినట్లు కనిపించేందుకు ఇంట్లో వస్తువులను చిందరవందర చేసినట్లు, ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల మొబైల్ ఫోన్లపై కూడా ఆధారాలు తొలగించే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.హిందువుల భద్రతపై మళ్లీ చర్చఈ ఘటనతో బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. గతంలోనూ అక్కడ హిందూ సమాజంపై దాడులు, దేవాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఘటనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీలపై జరిగిన హింసాత్మక ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గతంలో తెలిపారు. అయితే తాజా ఘటన గంజాయి బ్యాచ్ పనిగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రంగ్పూర్ తాజా ఘటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: హ గదీ భారత్ దెబ్బంటే.. -
జైలుకు వెళ్లొచ్చిన సురేఖ.. విషాదాంతం
సాక్షి, సంగారెడ్డి: ఆరు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితురాలు సురేఖ బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా శాంతినగర్లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆదివారం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. తన ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారనే కోపంతో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఆమె హతమార్చింది. ఈ ఏడాది జనవరి చివర్లో వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ.. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిని హత్య చేయాలని పథకం వేసింది. ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరిని హతమార్చింది. అయితే ఈ కేసులో ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. ఏ ఉద్యోగమూ దొరక్కపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.యాచారానికి చెందిన నక్కలి దశరథం(58), లక్ష్మి(54) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె సురేఖ(25) సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా సంగారెడ్డి జిల్లా కొండాపూర్కు చెందిన ఓ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పిన సురేఖకు వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించడమే కాకుండా.. మరో సంబంధం చూడటం ప్రారంభించారు. దీంతో ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను తొలగించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.వైద్య రంగంలో తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న సురేఖ.. తాను పనిచేస్తున్న ఆస్పత్రి నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మత్తు మందును తీసుకొచ్చింది. అనంతరం ఓ మెడికల్ షాపులో మూడు సిరంజీలు కొనుగోలు చేసింది. జనవరి చివర్లో ఓ రోజు రాత్రి సెలవుపై ఇంటికి వచ్చిన సురేఖ.. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసింది. అనంతరం పెళ్లి విషయం మరోసారి ప్రస్తావనకు రావడంతో వారు ఆమెను మందలించారు. అప్పటికే వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. ముందుగా తల్లి లక్ష్మికి ఒళ్లునొప్పులకు మందు ఇస్తున్నానంటూ మత్తు మందును అధిక మోతాదులో ఇచ్చింది.కొద్దిసేపటికే లక్ష్మి మృతి చెందగా.. ఆమెను నిద్రిస్తున్నట్లు పడుకోబెట్టింది. అనంతరం ఇంటి బయట ఉన్న తండ్రి దశరథం వద్దకు వెళ్లి ఆయనకూ ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.అన్నకు ఫోన్ చేసి.. కన్నీటి నాటకంతల్లిదండ్రుల మరణాలను సహజంగా చూపించేందుకు సురేఖ ప్రయత్నించింది. అన్న అశోక్కు ఫోన్ చేసి.. ‘‘అమ్మా నాన్న చనిపోయారు.. భయంగా ఉంది.. త్వరగా రండి’’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. అన్న వచ్చాక.. తండ్రి అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని, తల్లి షాక్కు గురై గుండెపోటుతో స్పృహ కోల్పోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయిందంటూ కన్నీరు పెట్టుకుంది.అలా బయటపడిన నిజంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో లభించిన సిరంజీలను పరిశీలించారు. సురేఖ చెప్పిన వివరాల్లో అనుమానాలు రావడంతో ఆమెను ప్రశ్నించారు. మొదట అవి మూడు నెలల కిందటివని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె సంచిలో దొరికిన ఉపయోగించని మూడో సిరంజీ, ఖాళీ ఇంజెక్షన్ సీసాలు, వాడిన సిరంజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు విచారణలో తల్లిదండ్రులను తానే హత్య చేసినట్లు సురేఖ అంగీకరించింది. ప్రేమ వివాహానికి అడ్డుపడటమే కారణమని వెల్లడించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికే సురేఖ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, కుటుంబ వ్యతిరేకత నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. -
ఎమ్మెల్యే పీఏ కుమార్తె అనుమానాస్పద మృతి
పూణె: మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అజిత్ దశావతారే కుమార్తె ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు, వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. శనివారం రోజున సదరు బాలిక తన తల్లితో చిన్న విషయమై వాగ్వాదానికి దిగింది. అనంతరం కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంత సమయమైనా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆదివారం ఉదయం బారామతి పరిధిలోని రూయ్ గ్రామం సాయినగర్ ప్రాంతంలో ఆమె నివాసానికి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం బారామతి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్ -
మద్యం మత్తులో బైక్ రైడ్... యువకుడి విషాదం!
సాక్షి హైదరాబాద్: మద్యం మత్తులో ద్విచక్రవాహనం నడుపుతూ అదుపు తప్పడంతో కోల్కతాకు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ భూపతి తెలిపిన వివరాల ప్రకారం... కోల్కతాకు చెందిన అబ్బాస్ సిద్ధిఖీ (26) రెండు రోజుల క్రితం నగరంలో జరిగిన ఎక్స్పోకు వచ్చి వెస్టిన్ బంజరాలో ఉంటున్నాడు. అతని స్నేహితులు అభిరూప్ సింగ్ మిరాజ్ (25), సహస్ర చటోపాధ్యాయలతో కలిసి శుక్రవారం సాయంత్రం మాదాపూర్లోని మధుశాల బార్లో మద్యం తాగారు. అర్ధరాత్రి ముగ్గురూ కలిసి చార్మినార్ చూసేందుకు క్యాబ్లో వెళ్లారు.తెల్లవారుజామున 3 గంటలకు బార్కు తిరిగి వచ్చి పార్కింగ్లో ఉన్న బైక్పై ఖాజాగూడ లేక్ వద్దకు వెళ్లి తిరిగి బయలుదేరారు. చటోపాధ్యాయ మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడుపుతూ ఖాజాగూడ లేక్రోడ్డులో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ వద్ద అదుపు తప్పి ఫుట్పాత్ను ఢీకొట్టాడు. వెనుక కూర్చున్న అబ్బాస్ సిద్ధిఖీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యలో కూర్చున్న అభిరూప్సింగ్ మిరాజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించడంతో సహస్ర చటోపాధ్యాయ ప్రాణాలు దక్కాయి. వీరి ఇద్దరు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వైజాగ్ క్రైమ్ ఫైల్స్!
సిటీ ఆఫ్ డెస్టినీలో రోజురోజుకూ క్షీణిస్తున్న శాంతిభద్రతలు ఫిర్యాదులొస్తున్నా ప్రేక్షకపాత్రలోనే ఖాకీలు పసి మనసుల్లోనూ కక్షలు.. నడిరోడ్డుపై విద్యార్థుల గ్యాంగ్వార్ పోలీస్ విధుల్లో మితిమీరిన ‘రాజకీయ’ జోక్యం కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి, మత్తు పదార్థాల వినియోగంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం, మరోవైపు పోలీసుల నిర్లిప్తత విశాఖలో అశాంతికి కారణమవుతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే పరిస్థితులు నగరంలో కనిపించకపోవడం విస్మయపరుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడం శాంతిభద్రతల వైఫల్యానికి ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖాకీలపై ఖద్దరు పెత్తనం! పోలీసులపై అధికార పార్టీ నేతల పెత్తనం శ్రుతిమించుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ కంటే నేతల ఆదేశాలు పాటించడానికే ప్రాధాన్యమివ్వాల్సిన దుస్థితి నెలకొంది. నిందితులను అదుపులోకి తీసుకుంటే వెంటనే నేతల నుంచి ఒత్తిళ్లు రావడం, నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులపై బదిలీ వేటు వేస్తామని బెదిరించడం నిత్యకృత్యమైంది. తమకు నచ్చిన సీఐలను వేయలేదని ఏకంగా సిటీ పోలీస్ బాస్పైనే నేతలు ఫిర్యాదులు చేసే స్థాయికి పరిస్థితులు దిగజారాయి.బీచ్రోడ్డులో మాస్్కలతో దౌర్జన్యం! విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన ఘటన నగరంలో రౌడీయిజానికి అద్దం పడుతోంది. నంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో, ముఖాలకు మాస్క్లు ధరించి వచ్చిన కొందరు దుండగులు ఏకంగా ఓ ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. అక్కడున్న షెడ్డును, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ దాడి వెనుక అధికార పారీ్టకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు వారిని పట్టుకోలేకపోయారు.బాజీ జంక్షన్లో విద్యార్థుల వీరంగం 2024 ఆగస్టు 6వ తేదీన బాజీ జంక్షన్ వద్ద ఓ కళాశాల విద్యార్థులు ఏకంగా నడిరోడ్డుపై తీవ్ర ఘర్షణకు దిగారు. వీధి రౌడీల్లా కొట్టుకోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస పోలీస్ పర్యవేక్షణ, చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే విద్యార్థులు సైతం ఇలా రోడ్డెక్కి దాడులకు తెగబడుతున్నారు.రుషికొండ వద్ద అర్ధరాత్రి బీభత్సం రామానాయుడు స్టూడియో సమీపంలోని ఓ ప్రైవేట్ స్థలంలో సుమారు 20 మంది దుండగులు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. నంబర్ ప్లేట్లు కనిపించకుండా తెల్లకాగితాలు అంటించిన వాహనా ల్లో వచ్చి ఈ దమనకాండకు తెగబడ్డారు. భూ ఆక్ర మణే లక్ష్యంగా ముందుగా విద్యుత్ వైర్లు కత్తిరించి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడున్న వాచ్మెన్లను కారులో బంధించి తిప్పుతూ, గెస్ట్ హౌస్, కాంపౌండ్ వాల్ను నేలమట్టం చేశారు. రాత్రే ఆ శిథిలాలను లారీల్లో తరలించారు.శాంతి ఆశ్రమం భూముల్లో రౌడీషీటర్ల హల్చల్ శాంతి ఆశ్రమం భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఆగడాలు ఆగలేదు. ఆ భూములను శాంతి ఆశ్రమానికే అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చినప్పటికీ, రౌడీïÙటర్లు పట్టపగలే రంగంలోకి దిగి నానా హంగామా సృష్టించారు. ఈ ఘటనపై కేసులు నమోదైనా ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. చివరికి నిందితులకు బెయిల్ రాకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారిని అదుపులోకి తీసుకున్నారు.పెందుర్తి భూకబ్జా దాడి ఘటనలోనూ అదే తీరు నగరంలో భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. తమ భూములను ఆక్రమిస్తున్నారని బాధితులు, రైతులు స్థానిక పీఎస్లలోనూ, పోలీస్ కమిషనర్కూ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటీవల పెందుర్తిలో జరిగిన ఎన్నారై స్థలం వివాదంలో జనసేన నేతలు చేసిన దాడి వ్యవహారంలోనూ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.మధురవాడలో విద్యార్థుల గ్యాంగ్ వార్! మధురవాడ: నగరంలో శాంతిభద్రతల వైఫల్యం పాఠశాల విద్యార్థులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మారికవలస, వాంబే కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య 10 రోజుల క్రితం వివాదం మొదలైంది. పాఠశాలలో గొడవపడటంతో ఉపాధ్యాయులు సర్దిచెప్పినప్పటికీ.. వాట్సాప్లో పరస్పరం రెచ్చగొట్టే సందేశాలు పంపుకోవడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో 9, 10 తరగతుల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. గురువారం సాయంత్రం ఇరు వర్గాలు మారికవలస–తిమ్మాపురం రోడ్డుకు చేరుకున్నాయి. వారితో పాటు పూర్వ విద్యార్థులు, స్థానిక యువకులు కూడా చేరి కర్రలు, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అదే రోజు రాత్రి శివశక్తినగర్లోనూ మరోసారి ఘర్షణ జరిగి ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఈ ఘటనపై మారికవలసకు చెందిన యర్రా చందు (19), జస్వత్ (20), రాంజగన్ తేజ (21)లతో పాటు మరో ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసినట్లు పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు. -
పెళ్లై మూడేళ్లు, ముత్యాల్లాంటి కవలలు : అల్లుడ్ని కొట్టి చంపేశారు
సాక్షి,న్యూఢిల్లీ: భార్యతో జరిగిన తీవ్ర వాగ్వాదం ఒక యువ టెకీని బలితీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి తన భార్యతో ఇంట్లో వచ్చిన వివాదంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో అది తీవ్రరూపం దాల్చింది. వీరి దాడిలో 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణంగా హత్యకు గురైన సంఘటన ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ప్రాథమిక పోలీసు విచారణ ప్రకారం మృతుడిని లక్ష్మీ పార్క్ నివాసి, నోయిడాలోని 'అడోబ్' (Adobe) సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వినయ్ గుప్తా (31)గా గుర్తించారు. కాగా వినయ్కి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నాలుగున్నర నెలల వయసున్న కవల పిల్లలు (ఒక బాబు, ఒక పాప) ఉన్నారు.ఏం జరిగింది?ఉదయం దంపతుల మధ్య కుటుంబ విషయమై గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటి వారికి సమాచారం అందించగా, వారు నిహాల్ విహార్లోని వినయ్ నివాసానికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన విజిటర్స్ కోసం నీళ్లు, అల్పాహారం తీసుకురావడానికి వినయ్ తల్లి బయటకు వెళ్లిన సమయంలో, భార్య తరఫు బంధువులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. తల్లి వచ్చి అడ్డుపడి, ఆపమని బ్రతిమాలినా వినకుండా దాడిని కొనసాగించారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన వినయ్ను ఆస్పత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదీ చదవండి: కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !మృతుడి భార్యతో పాటు మరో ఆరేడుగురిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించింది. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని యామిని ఆత్మహత్య
చిలకలూరిపేటటౌన్: ఉన్నత చదువులు పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడింది. కుటుంబానికి అండగా నిలవాలనే ఆశలు.. జీవితంలో మరెన్నో మెట్లు ఎక్కాలనే కలలు. కానీ అంతలోనే ఆ కుటుంబాన్ని తీరని విషాదం చుట్టుముట్టింది. చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన యామిని(24) హైదరాబాద్లో మృతి చెందడం తల్లిదండ్రులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది. ఏం జరిగిందో..? చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన సుబ్బారావు, లక్ష్మి దంపతుల కుమార్తె యామిని హైదరాబాద్లోని కేపీహెచ్బీ పరిధిలో ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో తోటి యువతులతో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. గురువారం సాయంత్రం తోటి స్నేహితురాళ్లు బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతూ యామినిని కూడా తమతో రావాలని కోరినట్లు తెలిసింది. ఆమె రానని చెప్పడంతో వారు బయటకు వెళ్లారు.కొంతసేపటి తర్వాత తిరిగి హాస్టల్కు చేరుకున్న వారు గదిలో నుంచి స్పందన లేకపోవడంతో వార్డెన్కు సమాచారం అందించారు. అనంతరం గదిని తెరిచి చూడగా యామిని మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి ఖచ్చితమైన కారణం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో వివరాలు పరిశీలిస్తున్నారు. శోక సంద్రంలో తల్లిదండ్రులు గతంలో పట్టణంలోని పండరీపురంలో నివాసం ఉన్న యామిని కుటుంబం ప్రస్తుతం మండలంలోని కావూరులో ఉంటోంది. కుటుంబ పోషణ కోసం తండ్రి హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. కష్టపడి పెంచిన కూతురు చదువుకుని ఉద్యోగంలో స్థిరపడటంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. తమ బిడ్డ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశల మధ్యే యామిని మృతి చెందడంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. కళ్లెదుటే పెరిగిన కూతురు ఇక తిరిగిరాదన్న నిజాన్ని జీర్ణించుకోలేక వారు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి ఆవేదన కుటుంబ సభ్యులు, బంధువులను కలచివేస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
నిఖితకు ఏం జరిగింది?.. కాంచీపురం వర్సిటీలో కలకలం
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపింది. ఆంధప్రదేశ్ తిరుపతికి చెందిన 20 ఏళ్ల నిఖిత అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించింది. రెండ్రోజులుగా బయట కనిపించని ఆమె.. హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఆమె మరణానికి కారుకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కాంచీపురం ఎనతూర్లోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో తిరుపతికి చెందిన నిఖిత ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. గత కొన్నిరోజులుగా ఆమె ఎవరితోనూ మాట్లాడడం లేదు. రెండు రోజులుగా తరగతులకు హాజరు కాలేదు. హాస్టల్ గదిలోనే ఉంటోంది. గురువారం రాత్రి ఆమె గది నుంచి దుర్వాసన రావడంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వార్డెన్, ఇతర సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. నిఖిత విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పొన్నేరికరై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.విద్యార్థుల ఆందోళనవిద్యార్థిని మృతితో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా నిఖిత తరగతులకు రాలేదని.. ఇటు హాస్టల్ యాజమాన్యం కూడా ఆమెను పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు వర్సిటీ గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.“నిఖిత మృతికి కారకులను శిక్షించాలి” అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కాలేజీ యాజమాన్యంతోనూ ప్రాథమిక చర్చలు జరిపారు. పోలీసుల హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి శాంతియుతంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతోనే?ఘటనా స్థలంలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సంబంధిత కారణాలతోనే నిఖిత తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, తదుపరి దర్యాప్తులో వెల్లడవుతాయని తెలిపారు. ప్రస్తుతం నిఖిత మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నీ ప్రాణం పోయినా.. మా బైక్ రిపేర్ చేయించాల్సిందే!
హైదరాబాద్: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మరమ్మతు విషయంలో తీవ్ర ఒత్తిడి, వేధింపులకు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యచేసుకున్నాడు. మాసబ్ట్యాంక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపిన మేరకు.. చార్మినార్ ప్రాంతానికి చెందిన మీర్ సోఫియాన్ అలీ అలియాస్ ఆదిల్(24) నాలుగు నెలల క్రితం తన స్నేహితుడు పాషను బైక్ తీసుకువెళ్లాడు. అయితే బైక్ ఓ రోడ్డు ప్రమాదంలో దెబ్బతినడంతో పాషాతోపాటు ఇతని మిత్రుడు ఇషాక్ ఉద్దీన్లు మరమ్మతు చేసివ్వాలని.. లేకపోతే డబ్బులివ్వాలని ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బు లేదని ఆదిల్ చెప్పినా వినలేదు. ఈ క్రమంలో ఈనెల 19న అర్థరాత్రి మాసబ్ట్యాంక్ ఫస్ట్లాన్సర్లోని మార్వా లిబర్టీ అపార్ట్మెంట్ ఏడవ అంతస్తు టెర్రస్పై హంజాలా పాషాతో పాటు మిత్రులు ఇషాక్ ఉద్దీన్, మస్తాన్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేసుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆదిల్ను పిలిపించారు. ఆదిల్, షారుఖ్ వెళ్లగా బైక్ రిపేరు గురించి ఒత్తిడి చేశారు. తాను డబ్బులు చెల్లించలేనని, ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆదిల్ చెప్పినా.. నీ ప్రాణం పోయినా మాకు అనవసరం లేదు.. బైక్ రిపేర్ చేసి తీరాల్సిందే అని హెచ్చరించారు. దీంతో ఆదిల్ ఏడో అంతస్తునుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ ఆదిల్ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.ఇదిలా ఉండగా పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో మాసబ్ట్యాంక్ పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు. -
తాను చేసిన స్వీటును తానే తిననని చెప్పిన దుకాణదారుడు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలోని మౌదహా పట్టణంలో పండుగల నేపథ్యంలో ఎస్డీఎం, ఆహార శాఖ అధికారులు కల్తీ స్వీట్లకు వ్యతిరేకంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మా వైష్ణో జై భవానీ స్వీట్ హౌస్ నిర్వాహకుడు బాబాకు ఆయన దుకాణంలో ఉన్న వెండి పూత వేసిన స్వీట్ను తినాలని అధికారులు చెప్పారు. అయితే దానిని తినేందుకు ఆయన స్పష్టంగా నిరాకరించారు. దుకాణదారు తినేందుకు నిరాకరించడంతో ఎస్డీఎం కరణ్వీర్ సింగ్ స్వీట్ల నమూనాలు సేకరించి, ఆ స్వీట్లను పారేయించారు. ఈ చర్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది. అధికారులు పదేపదే చెప్పినప్పటికీ ఆయన ఆ స్వీట్ తినేందుకు నిరాకరించారు. ఈ ఘటన తర్వాత ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి.అపరిశుభ్రత, నిషేధిత వెండి పూత వాడకంఆహార శాఖ సహాయ కమిషనర్ గోరీ శంకర్, ఆహార భద్రత అధికారి మృత్యుంజయ్ కుమార్ నేతృత్వంలోని బృందం పలు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపింది. తనిఖీల్లో 2 దుకాణాల్లో అపరిశుభ్రత కనిపించింది. స్వీట్లలో నిషేధిత వెండి పూతను ఉపయోగించిన విషయం కూడా బయటపడింది. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్డీఎం కరణ్వీర్ సింగ్ తెలిపారు.ఇదీ చదవండి: ఎల్ నినో: మనకు ముప్పు తట్టుకోలేని విధంగా ఏ స్థాయిలో అంటే?మార్కెట్లో కలకలం.. పోలీసు బలగాల మోహరింపుసంయుక్త తనిఖీల విషయం తెలియగానే మౌదహా పట్టణంలోని ఇతర స్వీట్ విక్రేతల్లో కలకలం రేగింది. ఈ చర్యల సమయంలో ప్రాంతీయ అధికారి రాజ్కుమార్ పాండే, కోత్వాలీ ఇన్చార్జ్ సంతోష్ కుమార్ పోలీసు బలగాలతో అక్కడే ఉన్నారు. పండుగల సమయంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేవారిపై చేపడుతున్న ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. View this post on Instagram A post shared by Briefly Scroll (@brieflyscroll) -
తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !
-
బుడ్డోడి తెలివితో తండ్రి అడ్డంగా బుక్!
-
కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా దేవళాయ్ ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఖవ్డా కొండపైకి వెళ్లిన 18 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, అతడిని కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులతో సహా ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మరణించడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.దాదాపు మూడు గంటలు పాటు సాగిన ఈ వ్యవహారం చివరికి విషాదాంతమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో యువకుడు ఖవ్డా కొండ అంచున నిలబడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం ప్రారంభించాడో యువకుడు. దాదాపు 3 గంటల పాటు అతడి తల్లి, స్థానిక గ్రామస్తులు, పోలీసులు అతడిని కిందకు దిగిరావాలని ఎంత బ్రతిమిలాడినా ఫలితం లేకపోయింది.దీంతో ఆందోళనకులోనైన తండ్రి మధ్యాహ్నం 1 గంట సమయంలో, కొండ ఎక్కి కొడుకును కాపాడేందుకు ప్రయత్నించాడు. కొడుకును పట్టుకునే క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి కొండపై నుంచి కిందకు పడిపోయారు. కళ్లముందే భర్త, కొడుకు కిందపడిపోవడం చూసి భయాందోళనకు గురైన తల్లి కూడా కొద్దిక్షణాల్లోనే కొండపై నుంచి దూకేసింది. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.ఇదీ చదవండి: మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్యఈ ఉదంతాన్ని అక్కడున్న పర్యాటకులు, స్థానికులు ఫోన్లలో వీడియో తీశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ -
మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్య
నాగపూర్లోని నరేంద్ర నగర్ పరిధిలో ఉన్న సుందర్బన్ ప్రాంతంలో దారుణ హత్య చోటుచేసుకుంది. రెండు వారాల క్రితమే బెయిల్పై బయటకు వచ్చిన రౌడీషీటర్ గౌరవ్ పంకజ్ రాగ్డే (27) హత్య స్థానికంగా కలకలం రేపింది. స్నేహితుడు, తోటి గ్యాంగ్స్టర్ గౌరవ్ రాంభావో రౌత్ చేతిలోనే అతను దారుణంగా హత్యకు గురయ్యాడు. ఒకమహిళతో వీరిద్దరికీ ఉన్న సన్నిహిత సంబంధిత వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రకటించారు.పోలీసుల సమాచారం ప్రకారం.. మృతుడు గౌరవ్ రాగ్డే ప్రముఖ గ్యాంగస్టర్ గమ్ఛు హత్య కేసుతో పాటు పలు దోపిడీ, హత్య, హత్యాయత్నం కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఇతనిపై అజ్నీ పోలీస్ స్టేషన్లో దాదాపు 9 కేసులు నమోదు కాగా, ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే రాగ్డే జైలులో ఉన్న సమయంలో అతడి ప్రేమికురాలు 'రాణి' (పేరు మార్పు)తో గౌరవ్ రౌత్కు పరిచయం ఏర్పడి, అది సాన్నిహిత్యానికి దారితీసింది. నేర ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్న రాణి, రౌత్తో కలిసి నరేంద్ర నగర్లో క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించి, సమీపంలోనే ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది. గురువారం మధ్యాహ్నం, రాణి గౌరవ్ రౌత్ ఇంటికి వెళ్లింది. అక్కడ రౌత్ ఇతర స్నేహితులు కూడా ఆమెతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాగ్డే తీవ్ర ఆగ్రహంతో అక్కడికి చేరుకున్నాడు. తలుపులు మూసి ఉండటంతో మద్యం మత్తులో ఉన్న రాగ్డే, రాళ్లతో దాడి చేసి, ఇంట్లోని అద్దాలను ధ్వంసం చేస్తూ గొడవకు దిగాడు.దీంతో రౌత్ తన అనుచరులతో కలిసి ఇంటి వెనుక తలుపు గుండా తప్పించుకునేందుకు యత్నించగా, రాగ్డే వారిని వెంటాడాడు. సుందర్బన్ నాలా వద్ద ఉన్న ఒక వంతెన సమీపంలో వీరి మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాగ్డే కిందపడిపోగా, రౌత్ తన అనుచరుడు అభిషేక్ వాస్నిక్తో కలిసి రాగ్డే చేతిలో ఉన్న కత్తిని లాక్కుని అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన రాగ్డే అక్కడికక్కడే కూలిపోగా, నిందితులు పరారయ్యారు.నిందితులైన రౌత్, వాస్నిక్ కూడా వేర్వేరు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్తో కలిసి రాహుల్గాంధీ ధర్నాసినిమా ఫక్కీలో పోలీసుల ఛేజింగ్పెట్రోలింగ్లో ఉన్న అజ్నీ పోలీస్ స్టేషన్ సిబ్బంది మనీష్ భాల్మే, నరేష్ సావన్కర్ తక్షణమే స్పందించారు. కానిస్టేబుల్ మనీష్ భాల్మే సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఛేజ్ చేసి నిందితుడు గౌరవ్ రౌత్ను పట్టుకున్నాడు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’గొడవ అజ్నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభమై, హత్య బెల్తరోడీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును బెల్తరోడీ పోలీస్ స్టేషన్లో నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
గేదె కొమ్ముకు వేలాడుతూ.. యువకుడి విషాదం!
తెలంగాణ: గేదెను బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారంగేట్ సమీపంలో 765డీ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది.ఏఎస్ఐ ఆండాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఆకుల దుర్గాప్రసాద్ (19), రామాయంపేట మండలం కాట్రియాలకు చెందిన మహేశ్ బైక్పై నర్సాపూర్ వైపు నుంచి ఇంటికి వెళ్తున్నారు. అంతారంగేట్ సమీపంలో జాతీయ రహదారిపై గేదెలు అడ్డురాగా బైక్ అదుపుతప్పి వాటిని ఢీకొంది. దుర్గాప్రసాద్ తలలో గేదె కొమ్ము చొచ్చుకుపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.గేదె కొమ్ము తలలో గుచ్చుకుపోవడంతో మృతుడి శరీరం గేదె మెడకు వేలాడింది. దీంతో గేదె గంటపాటు అటు ఇటు పరుగులు పెట్టింది. స్థానికులు, ప్రయాణికులతో కలిసి పోలీసులు గంటపాటు శ్రమించి గేదెను కిందపడేసి కొమ్ము నుంచి మృతుని తలను తొలగించారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లవర్ చాట్ చేయమంటుంది.. ఫోన్ కొనిస్తే వస్తా.. లేదంటే చస్తా!
సాక్షి, హైదరాబాద్: తనకు స్మార్ట్ఫోన్ కొనివ్వాలని తల్లితో వాగ్వివాదానికి దిగిన ఓ బాలుడు తల్లి నిరాకరించేసరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బంజారాహిల్స్ ఎన్బీటీనగర్ బస్తీలో నివసించే ఓ విద్యార్థి (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్ది రోజులుగా ఏపీలోని తునికి చెందిన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు.చాటింగ్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసుకోవడానికి ఫోన్ లేకపోవడంతో బాలిక అఖిల్పై ఒత్తిడి పెంచింది. దీంతో తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలంటూ కొద్ది రోజుల నుంచి అఖిల్ తల్లితో గొడవ పడుతున్నాడు. పదో తరగతిలో బుద్ధిగా చదువుకోవాలని, ఈ వయస్సులో స్మార్ట్ఫోన్ వద్దంటూ తల్లి వారించినా వినిపించుకోలేదు.దీంతో రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పడుకున్నాడు. అక్కడే గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ తీసుకుని తన తల్లికి ఫోన్ చేసి ‘ఫోన్ కొనిస్తే వస్తా.. లేకపోతే చస్తా..’అంటూ చెప్పాడు. అప్పటికే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ కాల్ నెంబర్ ఆధారంగా అఖిల్ను గుర్తించారు. ఠాణాకు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లికి అప్పగించారు. బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'చీకటి అవుతుంది.. వద్దు తమ్మి.. పొద్దున పోదువు'
సాక్షి, సిద్దిపేట: “చీకటి అవుతోంది తమ్మీ.. ఈ రాత్రికి వెళ్లొద్దు.. పొద్దున్నే బయల్దేరు”.. అన్న చెప్పిన ఈ మాటలు ఇప్పుడు ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చాయి. తమ్ముడు మాత్రం “అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఈ రాత్రే వెళ్లనివ్వు” అంటూ భార్య, పిల్లలతో కలిసి కారులో బయల్దేరాడు. కొన్ని గంటల్లోనే ఆ ప్రయాణం తిరిగిరాని ప్రయాణంగా మారింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.బల్వంతపూర్కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కారు బావిలో పడింది. ఈ ఘటనలో నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం కంటే కూడా.. మృతుడు రాజు అన్న రవి చెబుతున్న మాటలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.రవి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటలో వారి బావ దీశెట్టి మల్లేశం మృతి చెందడంతో 19న దశదిన కర్మకు రాజు తన భార్య, పిల్లలతో కలిసి అక్కడికి వచ్చాడు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. సాయంత్రం కావడంతో రాజు ఇంటికి బయల్దేరుతానని అన్నకు చెప్పాడు. దీంతో రవి.. “చీకటి అవుతుంది తమ్మీ.. వద్దు. పొద్దున్నే పోదువు” అంటూ వారించాడు. కానీ రాజు వినలేదు. “అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఈ రాత్రే పోనివ్వు” అంటూ భార్య, పిల్లలతో కలిసి కారులో బయల్దేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది.తమ్ముడిని కాపాడలేకపోయానన్న బాధతో రవి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. “నా మాట విని ఉంటే తమ్ముడు ఇప్పుడు బతికుండేవాడు” అంటూ ఆయన రోదించడం చూసి స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు తమ్ముడిని ఇంటికి వెళ్లొద్దని ఆపిన అన్న.. మరోవైపు కుటుంబంతో కలిసి ఎలాగైనా ఇంటికి చేరుకోవాలన్న తమ్ముడి ఆరాటం.. చివరికి నాలుగు ప్రాణాలను బలిగొన్న విషాదంగా మారింది. -
పెళ్లి వద్దని చెప్పింది.. వేడి నీరు పోసేశారు
ఓ వృద్దుడితో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై వేడినీరు పోసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. హర్యానాలోని కురేషీపూర్ గ్రామంలో ఈ సంఘటన జరగ్గా ప్రస్తుతం ఆ యువతి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఛాతీ, ప్రైవేట్ భాగాలకు తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.బాధితురాలు, ఆమె మేనమామ చెప్పినదాని ప్రకారం.. బిహార్లోని సహాపూర్కు చెందిన యువతికి రెండేళ్ల క్రితం కురేషీపూర్కు చెందిన రోహిత్తో పెళ్లయింది. ఇతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ధర్మేంద్ర, లలిత అనే దంపతులు.. తల్లిదండ్రుల్లా చూసుకుంటామని చెప్పి రెండు నెలల క్రితం సదరు యువతిని తమ వద్దకు తీసుకెళ్లారు. తర్వాత రోహిత్- ఆమె విడాకులు తీసుకునేలా చేశారు. రూ.3 లక్షలకు ఆశపడి తమ దగ్గరే ఉన్న ఈ యువతిని ఓ వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని చూశారు.కానీ ఈ పెళ్లి సదరు యువతి వ్యతిరేకించడంతో ఆగస్టు 16న తెల్లవారుజామున 4 గంటల టైంలో ధర్మేంద్ర, లలిత కలిసి ఆమెపై వేడి నీరు పోసి గాయపరిచాడు. చికిత్స కోసం బయటకు వెళ్లకుండా అడ్డుకుని, ఓ గదిలో బంధించి తాళం వేసి మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారు. ఇదంతా తన సోదరి ద్వారా తెలుసుకున్న యువతి మేనమాన పంకజ్.. పోలీసులతో కలిసి ఆగస్టు 18న కురేషీపూర్కు వెళ్లాడు. అయినా సరే ఇంటి తలుపులు తెరవలేదు. తర్వాత రోజు మళ్లీ వెళ్లారు. ఈసారి పోలీసుల సహాయంతో తాళం పగులగొట్టి గదిలో ఉన్న యువతిని బయటకు తీసుకొచ్చారు. తొలుత ఆమెని ఫరీదాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.యువతిపై జరిగిన దాడి, ఆమెను గదిలో నిర్బంధించిన ఘటనతో పాటు రూ.3 లక్షలకు వృద్ధుడికి పెళ్లి చేయాలన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది?
-
టీచర్ కోపం .. ఎంత పని చేసింది
-
విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండె..! UKG విద్యార్థి మృతి
-
ప్రియాంకని ఎందుకు చంపారు..? పోలీస్ విచారణలో సంచలన విషయాలు
-
డాక్టర్ ప్రియాంక హత్య కేసు: 16 ప్రశ్నలు.. కీలక విషయాలపై ఆరా!
సాక్షి, తూర్పుగోదావరి: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల పోలీస్ కస్టడీ విచారణ రెండో రోజూ కొనసాగుతోంది. దీంతో నిందితులు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్ను పోలీసులు విచారిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్, ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతోంది.16 ప్రశ్నల్లో 6 పూర్తి..ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 16 కీలక ప్రశ్నలను సిద్ధం చేయగా.. ఇప్పటివరకు 6 ప్రశ్నలకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం. నిందితులు ఇచ్చే సమాధానాలను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఘటనకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఇతర కీలక అంశాలపై పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. అయితే, పోలీస్ కస్టడీ విచారణలో భాగంగా ప్రకాష్నగర్ సీఐ బాజీ లాల్ను ఉన్నతాధికారులు తప్పించారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే ఈ నిందితులను విచారిస్తున్నట్లుగా ఏఎస్పీ దేవరాజ్ తెలిపారు.రేపు ఉదయం కస్టడీ పూర్తి..ప్రస్తుతం రెండవరోజు కొనసాగుతున్న నిందితుల పోలీస్ కస్టడీ గడువు రేపు ఉదయం 11 గంటలకు ముగియనుంది. దీంతో కస్టడీ విచారణ పూర్తయిన అనంతరం దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్ను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
తల్లినే ఎక్కువ ఇష్టపడుతున్నారని, ముక్కుపచ్చలారని చిన్నారులపై తండ్రి దారుణం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను నీటి కాలువలోకి నెట్టివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బుధవారం వారి మృతదేహాలను వెలికితీసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులలో తొమ్మిదేళ్ల బాలిక, రెండన్నరేళ్ల బాలుడు ఉన్నారు. ఈ జంట హత్యలకు కారణం తెలిసి పోలీసులు కూడా నివ్వుపోయాడరు.యాద్గిర్ ఎస్పీ పృథ్వీక్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు శాంతప్పకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు (9,6) ఒక అబ్బాయి ( సుమారు మూడేళ్లు). తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుండి బయలుదేరి, మోటార్సైకిల్పై బిగుడి వద్ద ఉన్న కాలువకు వెళ్లాడు. తన ఆరేళ్ల కుమార్తెను మాత్రం వదిలి మిగిలిన ఇద్దర్నీ నిర్దాక్షిణ్యంగా కాలువలోకి నెట్టేశాడు. ఆ తరువాత ఆ చిన్నారని తనతో పాటు యాద్గిర్ పట్టణానికి తీసుకెళ్లాడు. అనంతరం బిగుడి (Bigudi) ప్రాంతంలోని తన ఇద్దరు పిల్లలను కాలువలోకి విసిరినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి అక్కడికి రాగా, పోలీసులు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు తిరిగిచేపట్టారు. అదే సమయంలో కాలువలోకి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ (KBJNL) అధికారులను కోరారు.ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయంప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లి రేణుకకు దగ్గరగా ఉండేవారని, తనతో అంతగా కలిసి ఉండేవారు కాదని అందుకే చంపేశానని పోలీసులకు తెలిపారు. కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శాంతప్పను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని యాద్గిర్ ఎస్పీ వెల్లడించారు. -
భార్యను రెడ్హ్యాండెడ్గా లాడ్జిలో పట్టుకున్న భర్త
జగిత్యాలక్రైం: భార్య, ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని లాడ్జిలో ఉండగా భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం కలకలం సృష్టించింది. సారంగాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు భర్త, కుమార్తె ఉండగా.. కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన వరుసకు మరిది అయ్యే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.ఈ విషయం భర్తకు తెలియడంతో యువకుడిని మందలించినా మార్పు రాకపోవడంతో ఇటీవల దాడి చేశాడు. ఈ ఘటనలో జైలుకు వెళ్లి విడుదలై వచ్చాడు. ఈక్రమంలోనే భార్య, యువకుడిపై నిఘా పెట్టాడు. బుధవారం కొత్తబస్టాండ్ ప్రాంతంలోని ఓ లాడ్జిలోకి వెళ్లడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మహిళతోపాటు యువకుడిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించి విచారణ చేపడుతున్నారు. -
సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్వంతపూర్కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. సిద్ధిపేటలో బంధువు మృతి చెందడంతో అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.అర్ధరాత్రి దాటినా కుటుంబం ఇంటికి చేరుకోకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. రాజు, భాగ్యలకు ఫోన్ చేయగా రెండూ స్విచ్ఛాప్ రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా అప్పనపల్లి శివారులోని బావిలో కారు ఉన్నట్లు గుర్తించారు.సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు కారులో నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను రాజు, ఆయన భార్య భాగ్య, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రమాదాలకు నిలయంగా సిద్ధిపేట రోడ్లు..సిద్ధిపేట జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడం, వేగ నియంత్రణ లేకపోవడం, ప్రమాదకరమైన మలుపులు, రహదారి భద్రతా లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బలవంతపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారులను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. -
ఫోక్ డాన్సర్ గుట్టు బట్టబయలు.. నా భర్త మంచోడే.. ఆమె లొంగదీసుకుంది
-
పెద్ద ప్లాన్ వేసి..చిన్న తప్పుతో దొరికేశారు.. SP సంచలన ప్రెస్ మీట్
-
భర్తను చంపి.. అది చూసిన కొడుకును కూడా..
-
ఆ మాటే హంతకులను పట్టించిందా?
-
రూపారెడ్డి హత్య వెనుక అసలు కథ ఇదే..
-
నా వీల్ చైర్ చూసి కూటమి ప్రభుత్వం వణికిపోతుంది
-
రూపారెడ్డి ఘటనపై టీచర్ల .. మాస్క్, గ్లాజ్ పెట్టుకుని.. షాకింగ్ రియాక్షన్..
-
మైండ్ బ్లోయింగ్ తల్లికొడుకుల క్రైమ్ కథ..
-
పది రూపాయల కోసం వివాదం
ఏలూరు జిల్లా: బిర్యానీకి కోసం హోటల్కి వెళ్లిన వ్యక్తి పది రూపాయలు తక్కువ ఇవ్వడంతో మొదలైన వివాదం చివరికి హోటల్ యజమాని, సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేసే వరకు వివాదం దారి తీసింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఆగిరిపల్లి శివారులో తులిమిల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి రెస్టారెంట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం పోతవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి బిర్యాని కోసం వచ్చి పది రూపాయలు తక్కువగా చెల్లించాడు. రెస్టారెంట్ యజమాని కుమారుడు రూ.10 తక్కువగా ఇచ్చావు అనడంతో వివాదం మొదలై ఇరువురు ఘర్షకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు వచ్చి ఇరువురికి సర్ది చెప్పి పంపించి వేశారు. సాయంత్రం మరలా పోతవరప్పాడు గ్రామానికి చెందిన వ్యక్తి హోటల్ వద్దకి 15 మందిని తీసుకువచ్చి హోటల్ యజమాని శ్రీనివాసరావు, కుమారుడు రాజేష్ హోటల్ సిబ్బంది మంటూ, రాకేష్పై బీరు సీసాలు, కరల్రతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా హోటల్లో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నూజివీడు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆగిరిపల్లిలో సంచలనం రేకెత్తించింది. -
దారుణం: స్క్రూడ్రైవర్తో పొడిచి మహిళ దారుణ హత్య!
నెల్లూరు జిల్లా: తనను దూరం పెడుతోందని సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి మహిళపై కిరాతకానికి ఒడిగట్టాడు. మెడ భాగంలో స్క్రూడ్రైవర్తో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. జలదంకికి చెందిన ఉప్పు సునీత (30)కు 15 ఏళ్ల క్రితం ఉప్పు శీనుతో వివాహమవ్వగా విభేదాలు రావడంతో ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి కుమార్తె (14), కుమారుడు(13) శిశు సంక్షేమ పాఠశాలలో చదువుతున్నారు. మేస్త్రీ పనులకు వెళ్తున్న సునీత, కొండాపురం మండలానికి చెందిన మహేంద్ర (30) ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సునీత, ఉప్పు శీనుకు ఈ నెల 7న జలదంకి పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం మహేంద్ర ఫోన్ నంబర్ను సునీత బ్లాక్ చేసింది. మంగళవారం మహేంద్ర వెంగళరావునగర్లో సునీత ఇంటికి వచ్చాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటి తర్వాత సునీత ఇంట్లో మృతి చెంది కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలికి రాగా..సునీత మెడపై రక్తగాయాలను గుర్తించారు. స్క్రూడ్రైవర్తో సునీతపై దాడి చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. మహేంద్రే హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


