breaking news
Crime News
-
ఎనిమిదేళ్లకు గర్భం దాల్చిన భార్య.. షాకైన భర్త!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఏదో ఒక కారణంతో కట్టుకున్న భర్తను హతమార్చడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అదే మాదిరిగా ప్రియునితో కలిసి భర్తను కడతేర్చిన భార్య, మరో ఇద్దరిని దావణగెరె జిల్లా చన్నగిరి పోలీసులు అరెస్టు చేశారు. దంపతులు వేర్వేరుగా మిస్సింగ్.. జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్ కేసు వివరాలను వెల్లడించారు. లింగప్ప తల్లి యల్లమ్మ 2024 జనవరి 22న తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లినవాడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10 రోజుల తరువాత లింగప్ప భార్య లక్ష్మి మిస్సయిందని ఆమె తల్లి మాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు కేసుల్లోనూ దర్యాప్తు చేపట్టారు. లింగప్ప, లక్ష్మికి పెళ్లయి 8 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. లక్ష్మి వక్కతోటలో పనికి వెళ్తూ తిప్పేశ్ నాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడి గర్భం దాల్చింది. ఇది తెలిసిన లింగప్ప కడుపులో ఉన్నది తన బిడ్డ కాదని ఆగ్రహంతో కడుపు మీద కొట్టడంతో అబార్షన్ అయ్యింది. దీంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత తిప్పేనాయక్ను కలిసి భర్తను హతమార్చాలని కుట్ర చేసింది. ఇద్దరూ సంతోష్ అనే మరో వ్యక్తి సహకారంతో లింగప్పను హతమార్చి భద్రా కాలువలో పడేసి కేరళకు పరారయ్యారు. సుమారు ఏడాదిన్నర నుంచి అక్కడే సంసారం కొనసాగిస్తున్నారు. పోలీసులు జాడ పసిగట్టి అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచి్చబౌలి/మణికొండ: కుమార్తెలను స్కూల్ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం, కొండముదుసుపాలెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్ వెళ్లగా వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు. కుమార్తెలను తీసుకొని శాలిని సోమవారం రాత్రి మణికొండకు వచ్చింది. భారతీయ విద్యాభవన్లో పెద్ద కుమార్తె సుదీక్ష 9వ తరగతి, చిన్న కుమార్తె సహస్ర 4వ తరగతి చదువుతున్నారు. మంగళవారం ఉదయం స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్లో బస్సు ఎక్కించింది. ఉదయం 8.45 గంటలకు స్కూటీపై తిరిగి వస్తుండగా మణికొండలోని సుందర్ గార్డెన్ ఎదురుగా వెనక నుంచి అతి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీ కొట్టింది. కిందపడిపోయిన శాలిని తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా ట్యాంకర్ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని మృతురాలి సోదరుడు లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన రోడ్డులో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాగా చంపి ఫేమస్ అయ్యేదా!
హైదరాబాద్: తన అక్క ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందనే కారణంతో ఆమెను హత్య చేసిన నిందితుడు.. పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన రుచిత (21)ను సోమవారం ఆమె తమ్ముడు రోహిత్ (18) గొంతు నులిమి చంపగా పోలీసులు అతన్ని మంగళవారం రిమాండ్కు తరలించారు. స్వగ్రామానికి చెందిన యువకుడితో అక్క ఫోన్లో మాట్లాడుతుండటంతో స్నేహితుల వద్ద పరువు పోతోందని రోహిత్ భావించాడు. దీంతో ఆమెను చంపాలనుకున్నట్లు సమాచారం. అంతకుముందే ఇన్స్టాగ్రామ్లో ‘ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా?’అనే సినీ డైలాగ్కు తాను చేసిన రీల్ను షేర్ చేశాడు. -
తేజేశ్వర్ హత్య కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితులైన ఏ–1 తిరుమలరావు, ఏ–2 ఐశ్వర్య అలియాస్ సహస్రను గద్వాల కోర్టు అనుమతితో ఈ నెల 26న రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు.. గడువు ముగియడంతో సోమవారం కోర్టులో తిరిగి హాజరుపరిచారు. దీంతో కోర్టు జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించడంతో పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. రెండు రోజుల విచారణలో నిందితులు పొంతనలేని సమాధానాలతో కేసు దర్యాప్తును గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేశారని గద్వాల సీఐ శ్రీను పేర్కొన్నారు. అందువల్ల వారిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామన్నారు. -
Hyderabad: అత్తను నరికి చంపిన అల్లుడు
మద్దూరు (హుస్నాబాద్): అల్లుడు వేట కొడవలితో అత్తను నరికి చంపాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ముర్మాముల గ్రామ శివారు బంజెరలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగిలి వజ్రమ్మ (55)కు భర్త యాదగిరి, కుమార్తె భవాని ఉన్నారు. భవానిని ఎనిమిదేళ్ల కిందట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేశ్కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వజ్రమ్మ, భర్త యాదగిరి, కుమార్తె భవాని, అల్లుడు మహేశ్తో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్లోని బోయిన్పల్లి అంజయ్యనగర్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వజ్రమ్మ, కూతురు, అల్లుడి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు ఈనెల 22న స్వగ్రామమైన బంజెరకు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో వాటిని పరిష్కరించుకున్నారు. 26న భవానిని ధర్మారంలోని ఆమె అత్తగారింటికి పంపించారు. కుటుంబ కలహాలను మనసులో ఉంచుకున్న అల్లుడు మహేశ్ తన తమ్ముడైన హరీశ్ను వెంటబెట్టుకుని బైక్పై మధ్యాహ్నం బంజెరకు వెళ్లారు. గ్రామంలో ఓ ఇంటి వద్ద కనిపించిన అత్త వజ్రమ్మపై మహేశ్, హరీశ్ తమ వెంట తెచ్చుకున్న వేట కొడవలితో విచక్షణారహితంగా నరికి చంపారు. నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయి నేరుగా పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ సీఐ కొండ శ్రీను, ఎస్సై షేక్ మహబూబ్, నవీన్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కోనసీమ: మాచవరంలో దారుణం.. ప్రిన్సిపాల్ కాదు.. కీచకుడు
అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక పదోవ తరగతి చదువుతుంది. మూడు నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళితే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్లో బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కాగా, పాఠశాలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువు చెప్పేందుకు అనుమతి ఉంది. అయితే పాఠశాల కరస్పాండెంట్ అనుమతి లేకుండా 10వ తరగతి వరకు విద్యార్థులకు తన పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. పాఠశాలకు 7వ తరగతి వరకు అనుమతి ఉంటే.. పదవ తరగతి బాలికలు ఏ విధంగా చదువుతున్నారన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. బాలికలను వేరే పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చి, అనధికారికంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. దీనిపై రాయవరం ఎస్సై డి.సురేష్బాబును వివరణ కోరగా, ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. -
ఒంటరిగా వస్తేనే అంగీకరిస్తా..!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి జీవించాలని ఆశ పడి బిడ్డను హత్య చేశానని మహిళ వాంగ్మూలం ఇచ్చింది. కోయంబత్తూర్, ఇరుకూరుకు చెందిన తమిళరసి (30). ఈమె భర్త రఘుపతి. వారికి అపర్ణశ్రీ(4) కుమార్తె ఉంది. రఘుపతి కొన్ని నెలల క్రితం భార్య నుంచి విడిపోయాడు. దీని తరువాత, తమిళరసి తన బిడ్డ అపర్ణశ్రీతో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె కట్టడ నిర్మాణ పనులకు వెళుతుంటుంది .ఆ సమయంలో కట్టడ కారి్మకుడు ధర్మపురి జిల్లాకు చెందిన వసంత్ అనే వ్యక్తితో తమిళఅరసికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బిడ్డను గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు తమిళరసిని అరెస్టు చేసి విచారణ జరిపారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ‘నా భర్త విడిపోయిన తర్వాత, వసంత్తో సంబంధం ఏర్పడింది. వసంత్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇందుకు బిడ్డ ఉంటే తాను అంగీకరించనని, ఒంటరిగా వస్తే తాను అంగీకరిస్తానని చెప్పాడు. పిల్లవాడిని హత్య చేయడం తప్ప తనకు వేరే మార్గం లేదని నిందితురాలు తెలిపింది. బిడ్డ హత్యకు ప్రేరేపించినందుకు వసంత్ను ఆదివారం అరెస్టు చేశారు. -
తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్
-
ఫేక్ యాపిల్ ఉత్పత్తుల స్కాం.. ఏకంగా 3 కోట్ల విలువైన..
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ యాపిల్ ఉత్పత్తుల కుంభకోణం బట్టబయలైంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్పురోహిత్లు ముగ్గురని అరెస్ట్ చేశారు. వీరంతా ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.యాపిల్ లోగో, స్టిక్కర్లు, సీల్లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి అసలైనవిగా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నట్లు తెలిపారు. యాపిల్ వాచ్లు, ఎయిర్పాడ్స్, పవర్బ్యాంకులు, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు సీజ్ చేశారు. నిందితులను మీర్చౌక్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ అప్పగించింది. యాపిల్ ప్రతినిధులతో కలిసి టాస్క్ ఫోర్స్ ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. -
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ అట్లూరి నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసుల నేపథ్యంలో.. నగరంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను రాత్రికి రాత్రే ఎత్తేసినట్లు తెలుస్తోంది. సెంటర్కి ఉన్న బోర్డులను తొలగించడంతో పాటు సెల్లార్లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. అదే సమయంలో..విజయవాడ సెంటర్కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైధ్యాధికారులు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం ఉదయం సెంటర్కు ఉన్న బోర్డులు మాయం కావడం గమనార్హం. ఉదయం 11గం. అయినా సిబ్బంది సెంటర్కు రాలేదు. మరోవైపు ల్యాబ్ ఇంఛార్జి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు సిద్ధం అవుతుండగా.. డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ వద్దకు చేరుకుని పరిశీలనలు జరుపుతున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి వీర్యకణాలతో సంతానం కలిగించడం లాంటి గలీజు దందా ఓ కేసు ద్వారా బయటపడింది. సికింద్రాబాద్లో ఇది చోటు చేసుకోగా.. అటుపై విజయవాడ, విశాఖపట్నంలోసెంటర్లలోనూ ఇంతకు మించే వ్యవహారాలు జరిగాయని తేలింది. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది. గతంలోనూ ఈ సెంటర్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షలు రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రతా. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్లో విశాఖకు తీసుకొచ్చి .. కోల్కతాలోని ఓ దంపతులకు సరోగసి బిడ్డగా అప్పగించింది. ఇందుకుగానూ రూ.30 లక్షలు వసూలు చేసి.. ఇదే విధంగా కోట్ల రూపాయల దందా చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై కేసు నమోదు కావడంతో పాటు సెంటర్లకు సీజ్ పడడం, ఆమె లైసెన్స్లు రద్దు కావడం జరిగిది. అయితే.. తీగలాగితే.. సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటనతో.. శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధనరష్మి పెరుమాళ్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీవారు బ్రాంచీలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో హైదరాబాద్ కేపీహెచ్బీ, గోపాలపురం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నమ్రత వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినా(గతంలో) మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తరుణంలో.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాలు తీయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వ్యాపార అభివృద్ధి కోసం బీహార్ నుంచి పూజారులను రప్పించి మరీ 9 రోజులపాటు నమ్రత హోమాలు చేయించింది. బెజవాడ సృష్టిలో.. డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి, డాక్టర్ వైశాలి ఆధ్వర్యంలో సెంటర్ను నమ్రత నడిపిస్తోంది. ఇటు విశాఖలోనూ మహారాణిపేట పీఎస్ పరిధిలోని సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2023లోనే వీటి లైసెన్లు ముగిశాయి. అయినా కూడా రెండు ఫ్లోర్లలో అనధికార సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకుని.. కీలక రికార్డులు స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడా ఇతర డాక్టర్ల లైసెన్స్ల మీద నమ్రత నడిపిస్తున్న దందా బయటపడింది. నమ్రతకు నమ్మిన బంటుగా కల్యాణి..విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మేనేజర్గా పని చేసిన కల్యాణి అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపడంలో కల్యాణి నెట్ వర్క్ కీలకమని, వాళ్లకు బ్రెయిన్వాష్ చేయడంలో కల్యాణి సిద్ధహస్తురాలిగా మారిందని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి నమ్రతతో కలిసి పని చేస్తున్న కల్యాణి.. గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. అయితే ఈ ఐదేళ్లలో నర్సు నుంచి ఏకంగా ఓ యూనిట్ మేనేజర్గా ఆమె ఎదిగడం కొసమెరుపు. -
నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
మహబూబ్ నగర్ జిల్లా: ‘నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చెయ్యొద్దంటూ ప్రాథేయపడినా ఆ తండ్రి కనికరించలేదు. సభ్యసమాజం తల దించుకునేలా మృగంలా మారి కన్న కూతురిపైనే దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాము కథనం ప్రకారం.. కుర్వ కుర్మయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు మక్తల్లోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే చిన్న కూతురు (10)కు రెండు నెలల క్రితం కుక్క కరవటంతో చికిత్స చేయించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే 5వ తరగతి చదివిస్తున్నారు. ఈ నెల 25న తల్లి కూలీ పనులకు, తండ్రి మేకల దగ్గరకు వెళ్లాడు. చిన్న కూతురు పాఠశాల నుంచి వచ్చి సాయంత్రం ఇంట్లో చదువుకుంటుండగా ఇంటికి వచ్చిన తండ్రి కుర్మయ్య.. ఒంటరిగా ఉన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయొద్దని ప్రాథేయపడినా కనికరించలేదు. ఇంట్లో నుంచి బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కాపాడారు. అప్పటికే బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పగా.. గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆర్ఎంపీ చెప్పగా.. భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కుర్మయ్య భార్యను కొట్టి గ్రామం నుంచి పరారయ్యాడు. బాలిక పరిస్థితి మరింత విషమంగా మారడంతో అదే రోజు రాత్రి మరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబ్నగర్కు తీసుకెళ్లాలని చెప్పగా.. కుటుంబ సభ్యులు మరుసటి రోజు శనివారం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పోలీసు కేసు అయితేనే చికిత్స చేస్తామని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రొద్దుటూరులో ఘరానా మోసం.. సచివాలయ ఉద్యోగస్తులమంటూ..
ప్రొద్దుటూరు క్రైం: వృద్ధాప్య పింఛన్ను దివ్యాంగుల పింఛన్కు మారుస్తానని నమ్మించిన ఓ మోసగాడు 5 తులాల బంగారు నగలతో ఉడాయించాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులోని చోటు చేసుకుంది. బద్వేలి గురివిరెడ్డి, లక్ష్మీదేవి వృద్ధ దంపతులు. నెహ్రూరోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. లక్ష్మీదేవికి వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సచివాలయం నుంచి వచ్చానని ఒక వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. మీకు వస్తున్న వృద్ధాప్య పింఛన్ను దివ్యాంగుల పింఛన్గా మార్పు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు.వృద్ధాప్య పింఛన్ కంటే దివ్యాంగుల పింఛన్కు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పడంతో వృద్ధ దంపతులు సంతోషించారు. వెంటనే ఆథార్ కార్డు తీసుకొని వెళ్తే మున్సిపల్ ఆఫీసులో ఒక సర్టిఫికెట్ ఇస్తారని అతను వారితో అన్నాడు. ఆ సర్టిఫికెట్ను తెచ్చి సచివాలయంలో ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గురివిరెడ్డి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లాడు. అతను వెళ్లగానే లక్ష్మీదేవి ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు.ఫొటో అప్డేట్ చేయాలని చెప్పి వృద్ధురాలికి ఫోటో తీసేందుకు సెల్ఫోన్ బయటికి తీశాడు. ఆమె ఒంటిమీద బంగారు నగలు ఉండటంతో వాటిని తీయమని చెప్పాడు. నగలతో ఫొటో దిగితే పింఛన్ రాదని, నగలను పక్కన పెట్టాలని చెప్పాడు. దీంతో ఆమె బంగారు గాజులు, ఇతర నగలను తీసి కిచెన్ రూంలో పెట్టింది. ఫొటో తీయమని ఆమె చెప్పగా ఇక్కడ చీకటిగా ఉందని ఫొటో సరిగా రాదని చెప్పి ఆమెను బెడ్ రూం సమీపంలోకి తీసుకెళ్లాడు.ఇదే అదునుగా భావించిన ఆ అగంతకుడు లక్ష్మీదేవిని బెడ్రూంలోకి తోసేసి గడియ పెట్టాడు. కిచెన్ రూంలో ఉన్న నగలను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వ్యక్తులు గడియ తీశారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి బంగారు నగలను దోచుకెళ్లాడని ఆమె బోరునా విలపించింది. లక్ష్మీదేవి ఐదు తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకెళ్లాడని త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు. -
మాతృత్వాన్ని మరిచిన తల్లి.. ప్రేమికుడి కోసం కన్న బిడ్డల్నే బలి!
-
కుమార్తె చనిపోయింది.. వరకట్నం వెనక్కివ్వండి
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో మహిళ అంత్యక్రియల విషయంలో అనిశ్చితి ఏర్పడింది. ప్రమాదంలో గాయపడి మృతిచెందగా.. కట్నం డబ్బుల విషయమై తలెత్తిన వివాదం అందుకు కారణమైంది. శుక్ర, శనివారాల్లో మృతదేహం ఏరియా ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. పోలీసుల రంగప్రవేశం, పెద్దల పంచాయితీతో వివాదం సమసిపోయింది. వివరాలిలా ఉన్నాయి. రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీనగర్కు చెందిన సింగరేణి కార్మికుడు గాండ్ల సత్యం, ఆయన కూతురు ముద్దసాని లావణ్య ఇటీవల పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సత్యం అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లావణ్య (29) హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయింది. మృతదేహాన్ని శుక్రవారం ఇక్కడికి తరలించగా.. అంత్యక్రియల సమయంలో అనిశ్చితి నెలకొంది. కాగా, లావణ్యకు రామకృష్ణాపూర్లోని భగత్సింగ్నగర్కు చెందిన ముద్దసాని సురేష్తో ఐదేళ్ల క్రితం వివాహామైంది. కొన్నేళ్లుగా వీరి మధ్య కుటుంబ కలహాలతో లావణ్య తల్లిగారింటి వద్ద ఉంటుంది. కట్నం డబ్బుల విషయమై..లావణ్య తల్లిగారింటి వద్దే ఉంటుండడంతో ఆమె కుటుంబ సభ్యులు సురేష్కు ఇచ్చిన కట్నం డబ్బులు ఇవ్వాలని గతంలో నుంచే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. లావణ్య, ఆమె తండ్రి ఇద్దరు మరణించడంతో పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం రూ.50లక్షలు, బంగారం ఇస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని, లేదంటే అత్తారింటి ఎదుట మృతదేహంతో బైఠాయిస్తామని చెప్పడంతో వివాదం తలెత్తింది. మృతదేహాన్ని తమ ఇంటి వద్దకు తీసుకువచ్చే అవకాశం ఉందని గ్రహించిన సురేష్ తండ్రి ముందే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి అంబులెన్స్లోని ఫ్రీజర్లో భద్రపర్చారు. శుక్రవారం నుంచి శనివారం వరకు ఈ ప్రతిష్టంభన కొనసాగింది. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. రూ.50 లక్షల కట్నంలో రూ.20 లక్షలు తిరిగి ఇవ్వడానికి అంగీకారం కుదరడంతో వివాదం సమసిపోయింది. అనంతరం లావణ్య బంధువులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
Hyderabad: వెలుగులోకి మరో ప్రీ లాంచ్ మోసం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల ఘరానా మోసం బయటపడింది. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కు కోట్లు రూపాయలు చెల్లింపులు చేసిన 250 మంది బాధితులను ముంచేశారు. ఐదేళ్ల కిందట ప్రాజెక్ట్ మొదలు పెట్టిన భారతీయ బిల్డర్స్.. కనీసం 25 శాతం పనులు కూడా చేయలేదు.బాధితులకు సాకులు చెబుతూ వచ్చారు. అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి భారతీయ బిల్డర్స్ ల్యాండ్ అమ్మేశారు. దీంతో బిల్డర్స్ను బాధితులు ప్రశ్నించారు. బిల్డర్స్, సునీల్ అహుజా అనే వ్యక్తి బాధితులపై బెదిరింపులకు దిగారు. భారతీయ బిల్డర్స్తో పాటు సునీల్ అహుజాపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది. మోసం చేసి ఆ తర్వాత భారతీయ బిల్డర్స్ పేరును శ్రీభారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా కేటుగాళ్లు మార్చేశారు.ఈ కంపెనీకి 60 శాతం ఆశిష్ అహూజా, మిగిలిన నలభై శాతం వాటాలో భారతీ బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణ లో పేరుతో షేర్లు ఉన్నాయి. ఇలా పేర్లు మారుస్తూ అమాయకులను నట్టేట ముంచుతున్నారు.సిరిసింపద ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్, భారతీ బిల్డర్స్, శ్రీ భారతీ బిల్డర్స్, భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఇలా పేర్లు మారుస్తున్న నిందితులు.. భానూరు, కోకోపేట్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రీలాంచ్ పేరుతో మోసాలకు తెరతీశారు. సునీల్ కుమార్ అహూజా, ఆశిష్ అహూజా, నాగరాజు, శివరామకృష్ణలను అరెస్టు చేయాలని.. తమ నగదును తిరిగి ఇప్పించాలంటున్న బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆంబులెన్స్లో గ్యాంగ్రేప్
ఆమె హోంగార్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ టెస్టులకు హాజరైంది. ఆ సమయంలో ఎక్కువ సేపు లైన్లో ఉండడంతో.. కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో అక్కడి నిర్వాహకులు ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో పలువురు అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.బీహార్ గయ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హోంగార్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ టెస్టులకు వెళ్లిన యువతి(26)పై అఘాయిత్యం జరిగింది. ఫిజికల్ టెస్టులో పాల్గొంటున్న ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. జులై 24వ తేదీన బోధగయలోని బీహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పృహలోని తనపై ఆంబులెన్స్లో నలుగురు అత్యాచారం జరిపారని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఇద్దరిని(ఆంబులెన్స్ డ్రైవర్తో సహా) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజకీయంగానూ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో సిట్ను, ఫోరెన్సిక్ టీంను ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. -
యువతి అనుమానాస్పద మృతి
రాయగడ: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో గల చంద్రశేఖర్పూర్ పోలీసులు చంద్రశేఖర్పూర్ సమీపంలో గల ఒక అద్దె ఇంటిలో ఒక యువతి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలిని జిల్లాలోని కాశీపూర్ సమితి గొరఖ్పూర్ ప్రాంతానికి చెందిన అనుపమ నాయక్ (24)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి పోలీసులు సమాచారం తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం తన కూతురు ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని దీనిపై దర్యాప్తు చేయాలని మృతురాలి తండ్రి జొయల్ నాయక్ చంద్రశేఖర్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలైన తన కూతురు చదువుకునేందుకు చంద్రశేఖర్పూర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన కుమార్తెను బెదిరిస్తున్నాడని, ఈ సంగతిని ఆమె ఫోన్లో చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. -
సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
కర్ణాటక: చెన్నపట్టణ తాలూకా కృష్ణాపురదొడ్డి గ్రామపంచాయతీ సభ్యురాలు చంద్రకళ భర్త లోకేష్ ఆత్మహత్య చేసుకున్న కేసు మలుపు తిరిగింది. భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతనెల 24న లోకేశ్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రకళ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు వెళ్లి పరిశీలించగా మృతదేహం పక్కనే విషం బాటిల్ లభించింది. ఇతనిది ఆత్మహత్యే అని గ్రామస్తులతోపాటు పోలీసులు కూడా నమ్మారు. డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు చంద్రకళ తన భర్త మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ గగ్గోలు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న ఎంకే దొడ్డి పోలీసులు చంద్రకళ ప్రవర్తనపై అనుమానంతో కాల్ రికార్డ్స్ పరిశీలించారు. చంద్రకళకు యోగేశ్ అనే వ్యక్తితో అక్రమసంబంధం ఉన్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భావించి బెంగళూరుకు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు చంద్రకళ నోరు విప్పినట్లు పోలీసులు తెలిపారు. చంద్రకళను అరెస్టు చేసి మిగతా హంతకుల కోసం గాలిస్తున్నారు. -
షాద్ నగర్ చౌరస్తాలో ఘోర ప్రమాదం
రంగారెడ్డి: షాద్ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను షాద్ నగర్కు చెందిన తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రిగా గుర్తించారు.శనివారం ఉదయం తండ్రీకూతురు బైక్పై వెళ్తున్నారు. షాద్ నగర్ చౌరస్తాకు చేరుకోగానే.. వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ వీళ్లను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. -
పాదపూజ చేసినా.. కనికరించని భర్త
దొడ్డబళ్లాపురం: వివాహిత అనుమానాద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్యలో చోటుచేసుకుంది. అంచెపాళ్యలలో అభిషేక్, స్పందన(24) దంపతులు నివాసం ఉంటున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో స్పందన అభిషేక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అభిషేక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. కట్నం కోసం స్పందనను వేధించేవారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన బాధలు చెప్పుకుని ఏడ్చేది. ఇటీవల ఇరు వైపుల పెద్దలు మాట్లాడి రూ.5 లక్షలు ఇప్పించారు. గురువారం భీమన అమావాస్య నేపథ్యంలో భర్తకు పాదపూజ చేసిన స్పందన శుక్రవారం ఉదయం విగతజీవిగా మారింది. స్పందన మృతి చెందినట్లు తల్లితండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు వచ్చి బోరున విలపించారు. అయితే స్పందనను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేశారని మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదనాయకనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
హెచ్సీఏలో మరో భారీ స్కాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సమ్మర్ క్యాంప్ల పేరుతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అండ్ కో.. రూ.4 కోట్ల రూపాయలు కాజేసినట్లు సీఐడీ గుర్తించింది. గతేడాది మే 20 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్లు నిర్వహించిన హెచ్సీఏ.. ప్రతీ క్యాంప్లో 100 మందికి చొప్పున దాదాపు 2500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చెప్పింది.ఒక్కో క్యాంప్పై రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి.. రూ.4 కోట్ల రూపాయలు జగన్మోహన్రావు కాజేశారు. క్యాంప్కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.కాగా, హెచ్సీఏ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. హచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్కు బెయిల్ మంజూరైంది. మరో వైపు జగన్మోహన్రావును కస్టడీ పొడిగించాలని సీఐడీ వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. మల్కాజిగిరి కోర్టులో జగన్మోహన్రావుతో పాటు సీఈవో సునీల్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం బెయిల్ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. -
మా బిడ్డను చంపేశాడు
విశాఖపట్నం: వివాహం చేసుకుంటానని తమ కుమార్తెను వంచించి వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ యశ్వంత్ అనే యువకుడు చంపేశాడని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి ప్రాంతానికి చెందిన కార్తీక రామారావు, కార్తీక రామలక్ష్మి కన్నీరు మున్నీరయ్యారు. కార్తీక నవ్యశ్రీ (25)ని ప్రేమికుడు యశ్వంత్ తామెవరం ఇంట్లో లేని సమయంలో ఈ నెల 2వ తేదీన చంపేశాడని తెలిపారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు కార్తీక నవ్యశ్రీ తల్లిదండ్రులు రామారావు, రామలక్ష్మి తెలిపిన వివరాలివి. 35 ఏళ్ల కిందట బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నామని వారు చెప్పారు. తమ కుమార్తె కార్తీక నవ్యశ్రీ, యశ్వంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. వారి పెళ్లికి రెండు కుటుంబాలు సమ్మతించాయన్నారు. ఈ నేపథ్యంలో కావ్యశ్రీకి హైదరాబద్లో ఉద్యోగం దొరకడంతో వెళ్లి ఉద్యోగం చేసుకోమని యశ్వంత్ ఆమెతో చెప్పాడని పేర్కొన్నారు. అక్కడి నుంచే వేధింపులు ప్రారంభం.. కావ్యశ్రీ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుండగా అనుమానం పెంచుకున్న యశ్వంత్ నీవు ఎవరితోనో తిరుగుతున్నావని తరచూ వేధించేవాడని, కావ్యశ్రీని వైజాగ్ వచ్చేయమని చెప్పడంతో ఆమె మూడు నెలల కిందట వచ్చి వర్క్ ఫ్రం హోం చేస్తుందని తెలిపారు. మేము లేనప్పుడు.. గత నెల 29న ఇంటి పని కోసం కొత్తూరు వెళ్లామని, కావ్యశ్రీ నుంచి ఫోన్ వచ్చిందని, యశ్వంత్ తనను వేధిస్తున్నాడని చెప్పిందన్నారు. మూడు రోజుల పాటు యశ్వంత్ కావ్యశ్రీతోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (2వ తేదీ వేకువ జాము) యశ్వంత్ నుంచి తమకు ఫోన్ వచ్చిందని, కావ్యశ్రీ ఉరి పోసుకున్నట్టు తెలిపాడన్నారు. ఉదయం వచ్చి చూసే సరికి తమ కుమార్తె చనిపోయి ఉందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఇంట్లో ఉన్న హుక్ కూడా ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకునేంతగా ఉండదని, యశ్వంతే తమ కుమార్తెను చంపేసి ఉండాడని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికులు, కావ్యశ్రీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి యశ్వంత్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నాడు. -
భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
మియాపూర్: పదో తరగతి విద్యారి్థని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నింపింది. సీఐ శివప్రసాద్, మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్లోని డీ– బ్లాక్లో నాలుగో అంతస్తులో నివాసముంటున్న బిజయ్ నాయక్, చిన్మయి నాయక్ దంపతులకు కుమార్తె హన్సిక నాయక్ (15), ఓ కుమారుడు ఉన్నారు. హన్సిక మియాపూర్ మాధవ నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం హన్సిక పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పాఠశాల యాజమాన్యం ఇంటికి తిరిగి పంపించింది. దీంతో హన్సిక ఇంటికి వెళ్లి మధ్యాహ్నం తాము నివసిస్తున్న భవనం ఐదో అంతస్తు పైనుంచి కిందికి దూకడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితం.. మాధవనగర్లోని హన్సిక చదువుతున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న షేక్ రిజ్వాన్ (15) ఈ నెల 19న పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రిజ్వాన్, హన్సిక ఒకే తరగతి కావడంతో సన్నిహితంగా మెలిగేవారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసుకునేవారు. వీటిని పాఠశాల టీచర్ చూసి ప్రిన్సిపాల్కు సమాచారం అందించింది. దీంతో ప్రిన్సిపాల్ రిజ్వాన్ తల్లిని పాఠశాలకు శనివారం పిలిపించి మాట్లాడుతుండగా ఈ చాటింగ్ విషయం తల్లికి, పాఠశాల యాజమాన్యానికి తెలిసిందనే మనస్తాపంతో పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో గురువారం విద్యార్థిని హన్సిక, తండ్రి బిజయ్ నాయక్తో కలిసి మృతి చెందిన తోటి విద్యార్థి రిజ్వాన్ ఇంటికి వెళ్లారు. అక్కడ రిజ్వాన్ తల్లిదండ్రులు బిజయ్ నాయక్, హన్సికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల భవనంపై నుంచి దూకి రిజ్వాన్ ఆత్మహత్య చేసుకున్న విధంగానే తన కుమార్తె హన్సికను పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని బెదిరించారని హన్సిక తండ్రి బిజయ్ నాయక్ పోలీసులకు చెప్పారు. పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడం, తోటి విద్యార్థి రిజ్వాన్ కుటుంబ సభ్యులు దూషించడంతో మనస్తాపం చెందిన తన కుమార్తె హన్సిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని మియాపూర్ పోలీసులు తెలిపారు. -
పెదాలు కొరికి.. వీడియోలు తీసి.. కటకటాల్లోకి కామపిశాచులు
ఐటీ మహా నగరం బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రెండు వేర్వేరు ఘటనలో ఇద్దరు కామపిశాచులను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్యంగా అమ్మాయిలను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ డెలివరీ ఏజెంట్ను(19), అలాగే ఓ మహిళ పెదాలను కొరికి పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. మణిపూర్కు చెందిన దిలావర్ హుస్సేన్.. బెంగళూరులో డెలివరీ ఏజెంట్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొత్తనూరులోని బైరాతిలో అద్దెకు గది తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే సాయంత్రం కాగానే నగరంలోని ఎంజీరోడ్డు, చర్చ్ స్ట్రీట్, కొరమంగల ప్రాంతాల్లో అమ్మాయిలను రహస్యంగా ఫోన్లో చిత్రీకరించడం ప్రారంభించాడు. అలా ఆ అశ్లీల ఫొటోలను, వీడియోలను బెంగళూర నైట్ లైఫ్ అనే ట్యాగుతో తన దిల్బర్ జానీ-67 పేజీలో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో అశ్లీల పేజీలు పెరిగిపోతుండడంపై దృష్టిసారించిన అశోక్ నగర్ పోలీసులకు దిలావర్ పేజీ కంటపడింది. దీంతో సుమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ తరహా కంటెంట్ చిత్రీకరించి.. నెట్టింట వైరల్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. మహిళల వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా వీడియోలు తీసినందుకు బీఎన్ఎస్తో పాటు ఐటీ సెక్షన్లు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బెంగళూరులో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. మే చివరి వారంలో.. బెంగళూరు మెట్రో రైళ్లలో యువతులను అసభ్యకర రీతిలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. జులై మొదటి వారంలో.. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీ బాత్రూంలో మహిళా ఉద్యోగిణిని రహస్యంగా చిత్రీకరించబోయి ఓ సీనియర్ అసోషియేట్ జైలు పాలయ్యాడు. ఇక.. రెండు వారాల కిందట గురుదీప్ సింగ్ అనే వ్యక్తి రోడ్ల మీద మహిళలను తన ఫోన్లో బంధించే ప్రయత్నంలో ఓ యువతి చేతికి చిక్కి చెప్పు దెబ్బలు తిని.. ఆపై జైలు పాలయ్యాడు. తాజాగా మరో ఘటనలో.. గోవిందపూర్లో ఓ యువతిని లైంగికంగా వేధించిన వ్యక్తి.. ఆమె పెదాలను కొరికి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని మరూఫ్గా గుర్తించి అరెస్ట్ చేశారు. జూన్ 6వ తేదీన బెంగళూరు కూక్ టౌన్ మిల్టన్ పార్క్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిని మహిళను అసభ్యంగా తాకి.. ఆపై పార్క్లో ఆమె వెంటపడి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. అంతకు ముందు.. ఏప్రిల్ 3వ తేదీన బీటీఎం లేఅవుట్లోనూ ఇదే తరహాలో ఓ ఘటన జరిగంది. ఓ వ్యక్తి ఇద్దరు యువతుల్ని వెంబడించి.. వాళ్లను అసభ్యంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. -
విశాఖ పోలీసుల థర్డ్ డిగ్రీ.. మేజిస్ట్రేట్ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: పొక్సో కేసులో ఏసీపీ చేతివాటం బయటపడింది. ఇంటర్ చదువుతున్న బాలికపై రామకృష్ణ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానంటూ బాలిక ఇంటికి వచ్చి మరి.. బెదిరింపులకు దిగాడు. దీంతో తమ కూతురికి ప్రాణహాని ఉందని.. వేధింపులు భరించలేక పోతుందని హార్బర్ ఏసీపీ కాళిదాసును బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు.పోక్సో కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కాగా, ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలు తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. దాడి చేసినా కానీ బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కాళిదాసు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో పోలీసులు డబుల్ గేమ్ ఆడారు. పోలీస్ స్టేషన్లో గొడవ బయటకి రావటంతో నిందితుడికి పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. నిందితుడి ప్రైవేట్ పార్ట్స్పై వేడి మైనపు చుక్కల్ని వేశారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రామకృష్ణ.. రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట థర్డ్ డిగ్రీ విషయం బయట పెట్టాడు. పోలీసులపై మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ సీపీ శంఖబ్రతబాగ్చికి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రేమించిన మరదలితో వివాహం చేయడం లేదని..
కృష్ణా: ప్రేమించిన మరదలితో కుటుంబ సభ్యులు వివాహం చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇక సెలవు (మిస్యూ మా, మిస్యూ ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ) అంటూ తన ఫొన్లో స్టేటస్ పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని చేగుంటలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. చేగుంటకు చెందిన సంగెంబండ బస్సప్ప – తిమ్మవ్వ దంపతులకు మల్లప్ప, భీమ్రాయ, పరశివ సంతానం. వీరి తల్లి తిమ్మవ్వ కొన్నేళ్ల క్రితం మృతిచెందగా.. మొదటి కొడుకు మల్లప్ప తన భార్యతో కలిసి జీవనోపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లారు. ఆరేళ్ల క్రితం పదో తరగతి పూర్తిచేసుకున్న చిన్నకొడుకు పరశివ (22) కూడా ఉపాధి నిమిత్తం బెంగళూరులోని తన అన్న మల్లప్ప వద్దకు వెళ్లాడు. బెంగళూరులో పరశివ పనిచేసుకుంటూ.. తన రెండో అన్న భీమ్రాయ భార్య సునీత చెల్లెలు నిఖితతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు వరుసకు బావమరదలు కావడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తన సోదరుడు భీమ్రాయ, వదిన సునీతకు చెప్పేందుకు గాను వారం రోజుల క్రితం పరశివ బెంగళూరు నుంచి చేగుంటకు వచ్చాడు. ఈ క్రమంలో పరశివ, నిఖిత వివాహానికి అన్న, వదినలు అడ్డు చెప్పారు. ప్రేమించిన యువతి ఆరోగ్యం బాగా లేదని, నీకు మరో అమ్మాయితో వివాహం చేస్తామని పరశివకు సర్దిచెప్పారు. ఇక వీరి మాటకు ఎదురు చెప్పలేక తిరిగి బెంగళూరుకు బయలుదేరాడు. ఆదివారం బెంగళూరు నుంచి మళ్లీ బయలుదేరిన పరశివ.. రాష్ట్ర సరిహద్దులోని దేవసూగూర్లో గల కృష్ణానది తీరానికి చేరుకున్నట్లు తెలిసింది. అక్కడ తన ఫోన్లో ‘మీస్యూ ఆల్ మై ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీ’ అంటూ స్టేటస్ పెట్టాడు. అలాగే తాను ప్రేమించిన నిఖితతో దిగిన ఫొటోలు, వీడియోలు స్టేటస్లో పెట్టుకొని ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొదట కృష్ణా, ఆ తర్వాత శక్తినగర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే కృష్ణానదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడేమో అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికుల సహాయంతో కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఆచూకీ లభించలేదు. యువకుడి అదృశ్యం ఘటనకు సంబంధించి శక్తినగర్ ఎస్ఐ తిమ్మణ్ణను వివరణ కోరగా.. ఈ విషయంపై బెంగళూరులో కేసు నమోదైందని త తెలిపారు. తాము స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. ఇప్పటికే బెంగళూరులో కేసు నమోదైనందున తాము కేసు చేయలేదని తెలిపారు. -
వాట్స్ ప్ లో ఎమోజీ పెట్టాడని చంపేశారు..
-
ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం..!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో కలిసి భార్య.. భర్తను హత్య చేయించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మూడేళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ చెన్నైలో ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు. ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్ సరకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్లాడు. తిరిగొస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరిమట్టలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భారత్పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానం కలిగింది.భారత్ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. మూడేళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. తన ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి చంపి పారిపోయాడని తెలిపాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వెంటనే నందినితోపాటు సంజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
40 ఏళ్ల అంకుల్తో 10వ తరగతి విద్యార్థిని ప్రేమ..!
తమిళనాడు: తన 40 ఏళ్ల ప్రియుడితో వెళ్లేందుకు యత్నించి పట్టుబడిన ఓ 10వ తరగతి విద్యార్థిని పోలీస్ స్టేషన్ మిద్దె పైనుంచి దూకి కలకలం సృష్టించింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణపాయ స్థితిలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు.. నెల్లై జిల్లాలోని పత్తమడైకి చెందిన మురుగన్ (40). ఇతను కేరళలో కూలీగా పనిచేస్తున్నాడు. అతను పత్తమడై ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సోషల్ మీడియా ద్వారా కలుసుకుని ప్రేమ సంబంధాన్ని పెంచుకున్నారు. తరు వాత, ఇద్దరూ సెల్ఫోన్ల ద్వారా తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈనెల 14వ తేదీన పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అకస్మాత్తుగా అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రులు పత్తమడై పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న చేరన్మా దేవి ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి తిరుచెందూర్ వెళ్లిందని తేలింది. పోలీసులు, విద్యార్థిని తల్లిదండ్రులు తిరుచెందూర్ వెళ్లి ఇద్దరు వ్యక్తులను బుధవారం ఉదయం అక్కడికి తీసుకువచ్చారు. తరువాత, ఆల్–ఉమెన్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించినప్పుడు, విద్యార్థిని తన తల్లిదండ్రులతో వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆమె తన ప్రియుడిని విడిచిపెట్టనని స్పష్టంగా చెప్పింది. అయితే విద్యార్థిని మైనర్ కావడంతో పోలీసులకు అప్పగిస్తామని తేల్చారు. దీంతో నిరాశ చెందిన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ మిద్దెపై నుంచి దూకింది. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోయి ప్రాణపాయ స్థితిలో ఉంది. వెంటనే పోలీసులు అతన్ని రక్షించి చికిత్స కోసం నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మురుగన్ను అరెస్టు చేశారు. మురుగన్కు వివాహం జరిగి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పడం గమనార్హం. -
‘కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
గద్వాల: ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఓ కానిస్టేబుల్ తనను మోసం చేశాడని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి మంగళవారం గద్వాల డీఎస్పీ మొగిలయ్యను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు.. భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బోరంతపల్లెకు చెందిన ప్రియాంక 2023లో ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణకు హైదరాబాద్కు రాగా.. గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్గౌడ్ సైతం శిక్షణ కోసం హైదరాబాద్కు చేరుకున్నారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుందామంటూ రఘునాథ్గౌడ్ యువతి తల్లిదండ్రులను ఒప్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకుందామని నమ్మించారు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వివాహం చేసుకుందామని ఫోన్లో సంప్రదించగా దాటవేస్తూ వచ్చారని బాధితురాలు చెప్పారు. ఈ నెల 17న రఘునాథ్గౌడ్ ఇంటికి వెళ్లి వివాహ విషయం మాట్లాడగా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు తనపై చేయి చేసుకున్నట్లు డీఎస్పీకి వివరించింది.తీవ్ర మనస్తాపానికి గురై వారి ఇంటి ముందే నిద్రమాత్రలు మింగగా స్థానికులు గుర్తించి 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాప్రాయం తప్పిందని తెలిపింది. మంగళవారం ఉదయం కూడా మరోమారు వారి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు కుటుంబంతో కలిసి వెళ్లగా నిరాకరించారన్నారు. ప్రస్తుతం శాంతినగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న రఘునాథ్గౌడ్, దాడి చేసిన కుటుంబ సభ్యులౖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధిత యువతి, తల్లిదండ్రులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేశాం.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ రఘునాథ్గౌడ్పై గట్టు పోలీస్స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైందని డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. కానిస్టేబుల్ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని.. మోసం చేసిన వ్యక్తి ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలికి అన్నివిధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
మచిలీపట్నం: యూ ట్యూబ్ వీడియోలు చూసి..
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో యూ ట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు ముగ్గురూ 9వ తరగతి విద్యార్థులే. వ్యసనాలు, జల్సాలకు అలవాటుపడిన మైనర్లు.. రెండు నెలల్లో నాలుగు దొంగతనాలు చేశారు. ఆ ముగ్గురు నుంచి రూ.10 లక్షల 20 వేలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుర్ల నుంచి చోరీ సొత్తును కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్ అనే వ్యక్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. జువైనల్ హోంకు తరలించారు. మైనర్ల నుంచి చోరీ వస్తువులు కొనుగోలు చేసిన ఇద్దరికి నోటీసులిచ్చి వదిలేశారు. కాగా, చోరీ చేసిన సొత్తును కొన్నవారికి 41 నోటీసులిచ్చి వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్ను వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
పడక సుఖం ఇవ్వని భర్తను..
భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చడం లేదన్న అసహనంతో ఓ భార్య పక్కదారి పట్టింది. భర్తను అడ్డుతొలగించుకునే ప్రయత్నంలో కట్టుకథ అల్లింది. కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు ఊరుకుంటారా?.. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం బయటపెట్టింది.జులై 20వ తేదీన నీహాల్ విహార్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫర్జానా ఖాన్(29) అనే మహిళ తన భర్త మొహమ్మద్ షాహిద్(32)ను హతమార్చింది. ఆపై ఏం ఎరగనట్లు భర్త మృతదేహంతో ఆస్పత్రికి వెళ్లింది. తన భర్త ఆన్లైన్ రమ్మీలో డబ్బు పొగొట్టుకున్నాడని, అప్పుల బాధ భరించలేక కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని కన్నీళ్లు పెట్టుకుంది.అయితే షాహిద్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించిన వైద్యులు.. గాయాలపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె మొబైల్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.సల్పాస్ మందుతో హత్య చేయడం ఎలా?.. చాట్ హిస్టరీ డిలీట్ చేయడం ఎలా? అనే అంశాలను ఆమె సెర్చ్ చేసినట్లు ఉంది. వీటి ఆధారంగా ఆమెను ప్రశ్నించగా.. తానే నేరం చేసినట్లు ఒప్పుకుంది. భర్త తనను శారీరకంగా సంతృప్తిపర్చలేకపోతున్నాడని, ఈ క్రమంలోనే తాను మూడుసార్లు కత్తితో పొడిచి హతమార్చానని చెబుతోంది. అయితే ఆమె ఎవరితో, ఏం చాటింగ్ చేసిందనేది తేలాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తకు నిద్రమాత్రలిచ్చి, ఆపై కరెంట్ షాక్ పెట్టి హతమార్చింది. ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటకు రావడంతో ఈ కేసు వెలుగు చూసింది. అందుకు సంబంధించిన కథనం కింది లింక్లో చదవండి.👇ఇదీ చదవండి: నా భర్త బతికే ఉన్నాడు.. నిద్ర వస్తోంది.. నువ్వు రా -
మాక్ డ్రిల్లో నిర్లక్ష్యం.. విశాఖలో దారుణం
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. మాక్ డ్రిల్ సందర్భంగా అధికారులు అజాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో ఓ చిన్నారికి తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలైంది.గాజువాకలోని భారత్ డైనమిక్ లిమిటెడ్లో అధికారులు ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. అటుగా ఓ కుటుంబం బైక్పై వస్తుంది గుర్తించని అధికారులు బాంబు పేల్చారు. దీంతో కుటుంబంలోని చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆ తర్వాత కూడా ఆ పాపను ఆస్పత్రికి తరలించడంలో అధికారులు జాప్యం ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పతత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెకు సర్జరీ తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. అధికారులు అజాగ్రత్తగా ఉండడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తిట్టిపోస్తున్నారు. -
విశాఖలో వరుస హత్యలు.. ఈ నగరానికి ఏమైంది?
-
తల్లిని అవమానించాడని.. 10 ఏళ్లుగా వెంటాడి..
లక్నో: ఇది సినిమాను తలపించే వాస్తవ కథనం. రచయితలు సినిమా కథలను ఉత్కంఠ కలిగించేలా రాస్తుంటారు. వాటిని తెరమీద చూసినప్పుడు ప్రేక్షకులు నిజమనే భావనకు లోనవుతుంటారు. అయితే ఒక్కోసారి అవి అల్లిన కథలుగా తేలిపోతుంటాయి. ఉత్తరప్రదేశ్ వెలుగు చూసిన ఒక యధార్థ గాథ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం తల్లిని అవమానించిన వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు ఆమె కుమారుడు చేసిన పని ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సోసూ అనే యువకుని తల్లిపై పదేళ్ల క్రితం మనోజ్ అనే యువకుడు దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన సోను, మనోజ్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా చోటుచేసుకుంది. తన తల్లికి జరిగిన ఘోర అవమానానికి కలత చెందిన సోను నాటి నుంచి మనోజ్ కోసం అన్వేషణ ప్రారంభించాడు. కాలం గడుస్తున్నప్పటికీ మనోజ్ తనలో సోనుపై ఉన్న పగను చల్లార్చుకోలేదు. మూడు నెలల క్రితం మనోజ్ను సోను ఇదే ప్రాంతంలోని మున్షి పులియాలో చూశాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు.మనోజ్ రోజువారీ షెడ్యూల్ను నోట్ చేసుకున్నాడు. అతను ఎప్పుడెప్పుడు ఏమేమి చేసేదీ, ఎక్కడకు వెళ్లేదీ సోనూ గమనించాడు. నలుగురు స్నేహితుల సాయంతో మనోజ్ను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడు. ఈ హత్య తర్వాత పార్టీ ఇస్తానని వారికి హామీ ఇచ్చాడు. మే 22న మనోజ్ తన దుకాణాన్ని మూసివేసి, ఒంటరిగా వెళుతున్న సమయంలో, సోనూ తన స్నేహితుల సాయంతో మనోజ్పై దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేరిన మనోజ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మనోజ్ హత్యకు పాల్పడిన వారిని సీసీటీవీలో గుర్తించారు. అయితే వారి ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఇంతలో సోనూ తన నలుగురు మిత్రులకు పార్టీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోనూ స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవే వారిని పోలీసులకు పట్టుబడేలా చేశాయి. సీసీటీవీ ఫుటేజీలలో కనిపించిన ఐదుగురు అనుమానితులలో ఒకరిని పోలీసులు సోషల్ మీడియా ఫోటోలలో గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు ఐదుగురు అనుమానితులను ట్రాక్ చేసి, అరెస్టు చేశారు. నిందితులు సోను, రంజిత్, ఆదిల్, సలాము, రెహమత్ అలీలను పోలీసులు విచారిస్తున్నారు. -
భర్తను చంపేసి ఇంట్లో టైల్స్ కింద పాతిపెట్టి..!
మనకు దృశ్యం సినిమా అనగానే ఠక్కున గుర్తొచ్చేది మాత్రం అందులో మర్డర్ సీన్ చుట్టూ తిరిగిన ఓవరాల్ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చి సుమారు దశాబ్దకాలం పూర్తి కావొస్తున్నా.. ఆ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోయి మరీ చూసేస్తూ ఉంటాం. అందులో హీరో చేసిన హత్య.. ఆపై ఆ శవాన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్ కిందే పాతిపెట్టడం సినిమాకే హైలైట్. అక్కడ తన కూతుర్ని వేధిస్తున్న వ్యక్తిని తండ్రి చంపి మొత్తం కేసునే తప్పుదోవ పట్టిస్తూ సీన్లు అల్లిన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మరి ఇది సినిమా కాబట్టి ఆసక్తికరం అనిపిస్తోంది. మరి నిజ జీవితంతో జరిగితే వామ్మో అనే పరిస్థితి.మరి, ఇదే దృశ్యం సినిమాను ఫాలో అయినట్లుంది ఓ మహిళ. భర్తను చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. లవర్తో కలిసి మరీ భర్తను హత్య చేసి టైల్స్ కింద పూడ్చిపెట్టేసింది. ఇది మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. 35 ఏళ్ల విజయ్ చావన్, 28 ఏళ్ల కోమల చావన్లు భార్యా భర్తలు. ముంబైకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న వీరి జీవితంలోకి ఒక ‘ లవర్’ వచ్చాడు. కోమలకు ప్రియుడు.. విజయ్కు యముడు మాదిరి వారి జీవితంలోకి ప్రవేశించాడు. అతని పేరు మోను. కోమల, మోను కలిసి విజయ్ను చంపేశారు. అంటే కోమల తన భర్త విజయ్ను మోనుతో కలిసి అంతమొందించింది. మరీ ఆ తర్వాత ఏం చేయాలనే ఆలోచన చేస్తే.. ఇంట్లోనే టైల్స్ కిందే శవాన్ని పూడ్చిపెట్టేందని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్నదే చేసేశారు. ఆ తర్వాత కోమల, మోనులు కలిసి ‘లాంగ్ టర్మ్ హనీమూన్’( వేరే చోటకి పరార్) వెళ్లిపోయారు. అయితే విజయ్ సోదరునికి అనుమానం వచ్చి ఇంటికి రాగా, అక్కడ తాళం వేసి ఉంది. ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. ఇక చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అన్నను చంపేసిన వదిన.. ఆ ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టందనే విషయాన్ని తెలుసుకుని షాక్ తిన్నాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణ చేపట్టారు. -
వోక్సెన్ యూనివర్శిటీలో విషాదం.. విద్యార్థి బలవన్మరణం
సంగారెడ్డి: జిల్లాలోని కంకోల్ వోక్సెన్ యూనివర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. క్యాంపస్ రూమ్లో ఓ విద్యార్థి ఫ్యాన్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రుశికేష్(19) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు రుశికేష్,. ఆర్కిటెక్చర్ సెకండ ఇయర్ చదువుతున్న రుషికేష్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే రుషికేష్ మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుషికేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మొబైల్లో తీసుకున్న సెల్ఫీ వీడియోను బట్టి తెలిసే అవకాశం ఉంది. రుశికేష్ స్వస్థలం హైదరాబాద్లోని సరూర్నగర్గా గుర్తించారు. -
బరితెగించిన మానవ మృగం! తప్పించుకుని మరో బాలికను రక్షించి..
పట్టపగలే ఓ మానవ మృగం రెచ్చిపోయింది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లి కాటేసింది. చిన్నారి పారిపోయేందుకు ప్రయత్నించగా.. తీవ్రంగా గాయపరిచింది. అయినా ఆ చిన్నారిని వణికిపోలేదు. ధైర్యం తెచ్చుకుని.. ఎలాగోలా తప్పించుకుంది. అదే దారి వెంట వస్తున్న మరో చిన్నారిని ఆ కిరాతకుడి బారిన పడకుండా రక్షించగలిగింది. తమిళనాడులో హృదయవిదారకమైన ఘటన జరిగింది. తిరువళ్లూరులో పదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఓ వ్యక్తి ఆ చిన్నారిని వెంబడించి మరీ ఎత్తుకెళ్లి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర కలకలం రేపిన ఈ పోక్సో కేసులో అనుమానితుడి ఫొటోలను, ఓ వీడియోను జిల్లా పోలీసులు విడుదల చేశారు. అతనికి సంబంధించిన సమాచారం అందించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జులై 12వ తేదీ జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. పదేళ్ల చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి ఒంటరిగా వెళ్తోంది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి సమీపంలోని మామిడి తోటల్లో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అతను మళ్లీ లాక్కెళ్లి కొట్టాడు. అయితే, ఈలోపు ఆ వ్యక్తికి ఫోన్ కాల్ రావడంతో అతని దృష్టి మరలింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి చిన్నారి తప్పించుకుంది. కాస్త ముందుగా వెళ్లగా అదే దారిలో కిడ్నాప్ వైపు వెళ్తూ మరో చిన్నారి కనిపించింది. బాధిత చిన్నారి ఆ బాలిక వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. అటు వెళ్లొద్దంటూ అక్కడి నుంచి ఊరిలోకి తీసుకెళ్లింది. ఆపై ఇంటికి చేరి అమ్మమ్మకు జరిగినదాన్ని వివరించింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాట దుమారం రేపుతోంది. పౌర సంఘాలతో పాటు విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. డీఎంకే పాలనలో మహిళలకే కాదు.. చిన్నారులకూ రక్షణ లేకుండా పోతోందంటున్నాయి. అన్నామలై వర్సిటీ ఘటన, కదిలే రైలులో గర్బిణిపై జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంకోవైపు తిరువళ్లూరు ఘటనలో నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రన్నింగ్ ట్రైన్లో వచ్చిన నిందితుడు.. బాలికను వెంబడించాడని, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదు అయ్యాయని అన్నారు. అతని ఫోన్ రింగ్ టోన్ హిందీ పాట ఉందని బాధిత బాలిక చెప్పిన ఆచూకీతో ఉత్తరాధి నుంచి వచ్చిన వలస కూలీ అయి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.The suspect in the photos/video is involved in a heinous crime of sexually assaulting a child. It is requested to communicate any information pertaining to him on 9952060948 pic.twitter.com/QBCdi5mQ2K— Thiruvallur District Police (@TNTVLRPOLICE) July 20, 2025 -
ఎమ్మెల్యే కొడుకుపై అత్యాచార ఆరోపణలు..?
కర్ణాటక: కాబోయే భార్యను అత్యాచారం, మోసం చేశాడని ఆరోపణలు వచ్చిన బీదర్ జిల్లా ఔరాద్ బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్ గొడవ ఆ పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ప్రతీక్ చౌహాన్పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె శనివారంనాడు బెంగళూరులో మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. 2023 డిసెంబరులో తమకు నిశ్చితార్థం అయ్యింది, అప్పటినుంచి కలిసి మెలిసి తిరిగామని పేర్కొంది. తామిద్దరం గదిలో ఉన్నట్లు సాక్ష్యాలను విడుదల చేసింది. నిశ్చితార్థానికి ముందే ప్రతీక్ చౌహాన్ తనను బెంగళూరులోని రేస్కోర్స్ సమీపంలోని హోటల్కు తీసుకొచ్చాడని, అక్కడ ఏకాంతంగా గడిపామని తెలిపింది. మహారాష్ట్రలోని ఓ హోటల్కు కూడా తీసుకెళ్లి లైంగికంగా వాడుకున్నాడని వాపోయింది. చివరకు గొడవలు పుట్టించి పెళ్లి చేసుకోనని వంచించారని ఆరోపించింది. వారి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతా కుట్ర: ప్రభుచౌహాన్ ఇదంతా కుట్ర, ఇందులో బీజేపీ మాజీ కేంద్రమంత్రి భగవంత ఖూబా అనుచరుల హస్తం ఉన్నట్టు ప్రభు చౌహాన్ ఆరోపించారు. ఆదివారంనాడు బీదర్లో విలేకరుల భేటీ ఏర్పాటు చేసి మాట్లాడారు. తనపై, కుమారునిపై కుట్రతోనే ఇదంతా చేస్తున్నారన్నారు. యువతికి ఖూబా అనుచరుల అండదండలు ఉన్నాయన్నారు. తన కుమారునికి ఎలాంటి పరీక్షలు అయినా చేసుకోవచ్చని, అతడు అలాంటి వ్యక్తి కాదని అన్నారు. -
నిద్రమాత్రలతో అతడికి ఏమీ కాలేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ భర్తను చంపేందుకు చేసిన ప్రయత్నాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఆమె సెల్ చాటింగ్ వివరాలు పోలీసులకు దొరికాయి. అందులో ఆమె..‘అతడికి ఆహారంలో చాలా నిద్రమాత్రలు కలిపి ఇచ్చాను. అయినా ఏమీ కాలేదు..బాగానే ఉన్నాడు. ఇప్పుడిక కరెంట్ షాకివ్వడమొక్కటే దారి. ఎంత సేపు షాకివ్వాలి?’అంటూ ప్రియుడిని సలహా అడిగింది. అందుకా ప్రియుడు..‘ముందుగా అతడి నోటిని, రెండు చేతులను టేప్తో కట్టేసి, ఆ తర్వాత కరెంట్ షాకివ్వాలి’అంటూ దారి చూపడం గమనార్హం. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఉత్తమ్నగర్కు చెందిన కరణ్(36) భార్య సుశ్మిత, వరుసకు మరిది అయ్యే రాహుల్తో అక్రమ సంబంధం సాగిస్తోంది. వీరిద్దరూ కలిసి కరణ్ను చంపాలని ప్లాన్లు వేస్తున్నారు. ఈనెల 13వ తేదీన మాతా రూప్రాణీ హాస్పిటల్ నుంచి పోలీసులకు కరణ్ అనే వ్యక్తి విద్యుత్ షాక్తో చనిపోయినట్లు సమాచారం అందింది. కరణ్ కుటుంబీకులు తమకు సుశ్మితపై అనుమానం ఉందని, ఆమె రాహుల్తో సన్నిహితంగా ఉంటోందంటూ వివరించారు. పోలీసుల విచారణలో సుశ్మిత దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. ఈ నెల 12న రాత్రి సుశ్మిత సుమారు 15 నిద్రమాత్రలను కరణ్కు వడ్డించిన భోజనంలో కలిపినట్లు తెలిపింది. అయినా కరణ్ చనిపోలేదని రాహుల్కు తెలిపింది. అతడి సలహా మేరకు విద్యుత్షాక్కు గురిచేసింది. చనిపోయాడని నిర్థారించుకున్నాక సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి కరణ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపింది. అంతా కలిసి కరణ్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మరణానికి కారణం కరెంట్ షాకని శవపరీక్షలో తేలింది. అదేవిధంగా, కరణ్ సోదరుడు సుశ్మిత–రాహుల్లు ఇన్స్టాలో చేసిన చాటింగ్ వివరాలను పోలీసులకు అందజేశాడు. -
గొర్రెల కాపరి నుంచి.. డ్రగ్స్ డాన్గా ఎదిగి..
సాక్షి, హైదరాబాద్: బీదర్లో గొర్రెలు కాపుకాసే వ్యక్తి..హైదరాబాద్కు వలస వచ్చి ఏకంగా డ్రగ్స్ డాన్గా ఎదిగాడు. తండ్రిని చూసి మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన కర్ణాటకకు చెందిన సందీప్ అలియాస్ సందేశ్.. క్రమంగా డ్రగ్స్ పెడ్లర్గా ఎదిగాడు. ఇటీవల సైబరాబాద్ నార్కోటిక్ బృందం (ఈగల్) నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారుడు సందీప్ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. సొంతూరులో మూడో తరగతి వరకు చదివిన సందీప్..2006లో ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి బాలానగర్లోని ఓ హోటల్లో పనిలో చేరాడు. సందీప్ తండ్రి బలిరామ్ గంజాయి సేవించేవాడు. ఇదే అలవాటు ఇతడికీ వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. ఇతని వాట్సాప్ గ్రూప్లో వందలాది కస్టమర్ల డేటా ఉండటంతో వీరందరి గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు. కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్.. జల్సాలు, వ్యసనాలకు బానిసైన సందీప్ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యాకుత్పురాకు చెందిన డ్రగ్పెడ్లర్ అహ్మద్తో ఏర్పడిన పరిచయంతో నగరంలో గంజాయి కొనుగోలుదారుల సమాచారం, ఫోన్ నంబర్లు సేకరించాడు. వీరందరితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ సరఫరా చేసేవాడు. మహారాష్ట్ర నుంచి 5 కిలోల మేర ప్యాకెట్లుగా అక్రమ మార్గంలో హైదరాబాద్ తీసుచ్చి..ఒక్కో ప్యాకెట్ (50 గ్రాములు) రూ.3 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవాడు.కోడ్ భాషలో.. డ్రగ్స్ సిటీకి చేరగానే వాట్సాప్ గ్రూప్లో ‘భాయ్..బచ్చా ఆగయా భాయ్’ అని సందేశం పోస్టు చేసేవాడు. ఇది చూసి ఫోన్ చేసిన వారికి లోకేషన్ వివరాలు చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 13న మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి గచ్చిబౌలిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఈగల్ బృందం..సందీప్ను పట్టుకుంది. అయితే అప్పటికే కస్టమర్లు ఎవరూ లొకేషన్కు రాకపోవడంతో పోలీసులే సందీప్ ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయగా అక్కడికి వచి్చన 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ కిట్స్తో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచి్చంది. దీంతో అందర్నీ డీ–అడిక్షన్ కేంద్రానికి తరలించారు. వీరి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని విశ్లేషించగా..మరో 99 మంది కస్టమర్ల వివరాలు పోలీసులకు చిక్కాయి. దీంతో వీరి పేర్లనూ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. -
భార్యకు అదే పిచ్చి... భర్త ఏం చేసాడంటే!
కడప జిల్లా : ప్రవర్తన బాగా లేకపోవడంతో పద్ధతి మార్చుకోవాలని రెండేళ్లుగా భర్త చెబుతూ వస్తున్నాడు .. భార్య వివాహేతర సంబంధంపై పలుమార్లు పోలీసు స్టేషన్లో పంచాయితీలు జరిగాయి. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో భార్యను హతమార్చి శవాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి మైదుకూరు – పోరుమామిళ్ల మధ్య గల ఎద్దడుగు కనుమలో పడేసిన ఘటన శనివారం మండలంలోని చియ్యపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత(40)ను ఆమె భర్త నల్లబోతుల గోపాల్ ఈ నెల 17న గొంతు నులిమి హత్య చేశాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా ఉంటున్న గోపాల్ తన అక్క పార్వతమ్మ కూతురు అయిన సుజాతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్ల క్రితం నుంచి తన ఇంటి నిర్మాణం చేస్తున్న చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో సుజాతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్ పలు సార్లు భార్య సునీతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ పంచాయితీ పలు సార్లు చాపాడు పోలీసు స్టేషన్కు సైతం వచ్చింది. ఇదే విషయంలో బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు కూడా తరలించారు. అయినప్పటికీ సుజాత, బాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో ఈ నెల 17న రాత్రి గోపాల్, సుజాత గొడవ పడ్డారు. తన మాట వినలేదనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా సుజాత శవాన్ని గోపాల్ గోనే సంచిలో కట్టుకుని తన బైక్లో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారి మధ్యలో గల ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్లపొద గుంతలో పడేశాడు.గ్రామంలోనే ఉన్న సుజాత తల్లి పార్వతమ్మ తన కూతురు కని్పంచలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ చిన్న పెద్దయ్య ఈ ఘటనపై గోపాల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా స్వయంగా తానే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎద్దడుగు కనుమలో పడేసిన శవం వద్దకెళ్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్ సీఐ, ఎస్ఐ పరిశీలించారు. సుజాత మృతదేహం కుళ్లిపోవడంతో బయటికి తీసేందుకు వీలు కాక అక్కడే పంచానామా నిర్వహించారు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు. -
నువ్వు రా.. నా భర్త ఇంకా బతికే ఉన్నాడు!
వరుసకు మరిది అయ్యే వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న ఓ మహిళ.. తన భర్తను అతికిరాతకంగా కడతేర్చింది. ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు కరెంట్ షాక్తో ప్రమాదత్తూ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చంపడానికి ముందు ఆ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్.. ఆ మొత్తం ఘోరాన్ని బయటపెట్టింది. దేశ రాజధానిలో జరిగిన ఘోరం వివరాల్లోకి వెళ్తే..తన భర్త కరణ్ దేవ్(36) కరెంట్షాక్కు గురయ్యాడంటూ సుస్మిత ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికుల సాయంతో తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో.. పోస్టుమార్టం కూడా వద్దంటూ అంత్యక్రియల కోసం ఉత్తమ్ నగర్లోని ఇంటికి మృతదేహాన్ని తరలించింది. ఈలోపు..స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. మృతుడి వయసు, చనిపోయిన తీరుపైనా అనుమానాలతో అటాప్సీ కోసం కరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈలోపు కరణ్ సోదరుడు కునాల్ పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిపాడు.భర్త మృతిపై ఓ చానెల్తో మాట్లాడుతూ సుస్మిత కంటతడితన అన్న మరణం విషయంలో వదినతో పాటు తన కజిన్ రాహుల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశాడు. అంతేకాదు.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివరాలను పోలీసులకు స్క్రీన్ షాట్ వీడియో రూపంలో అందించాడు. అందులో కరణ్ను ఎలా హత్య చేయాలని వాళ్లిద్దరూ చర్చించుకున్నారు.పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా.. ఆ ఇద్దరూ నిజం ఒప్పుకున్నారు. కరణ్ తరచూ హింసించే వాడని.. అదే సమయంలో రాహుల్ తనను ఓదార్చేవాడని.. అదే ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారి తీసినట్లు తేలింది. ఈ క్రమంలో కరణ్ అడ్డు తొలగించుకునేందుకు సుస్మిత-రాహుల్ నిర్ణయించుకున్నారు.జులై 13వ తేదీన రాత్రి భోజనంలో కరణ్కు అధిక మోతాదులో(15) నిద్రమాత్రలు ఇచ్చారు. ఆపై మత్తులోకి జారుకున్నాక ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్ సారాంశం.. సుస్మిత: నిద్రమాత్రలు అన్నేసి వేసుకున్నాక చనిపోవడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి నెట్లో చూడు. మూడు గంటలైంది తిని. వాంతి చేసుకోవడం లాంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. ఇంకా చనిపోలేదు. ఏం చేయాలో త్వరగా చెప్పు.రాహుల్: అలాంటిదేం జరగకపోతే.. కరెంట్ షాక్ పెట్టుసుస్మిత: షాక్ ఇవ్వడానికి కట్టేయాలి కదా.. ఎలా?రాహుల్: టేప్తో కట్టేయ్సుస్మిత:నా భర్త ఊపిరి ఆగిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు. నెమ్మదిగా శ్వాస పీలుస్తున్నాడు.రాహుల్: నీ దగ్గర ఉన్న అన్ని మాత్రలు వేసేయ్సుస్మిత: నోరు తెరవడానికి రావట్లేదు. నీళ్లు మాత్రమే తాగిపించడానికి వీలవుతోంది. నువ్వు రా.. ఇద్దరం కలిసి ఆ మందులేద్దాం. నాకు నిద్ర ముంచుకొస్తోందిమృతుడు కరణ్(ఎడమ వైపు).. చాటింగ్ వివరాలు (కుడివైపు)ఈ చాటింగ్ తర్వాత రాహుల్ ఇంటికి రాగా.. ఇద్దరూ కలిసి కరెంట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో మరిది రాహుల్తో కలిసి భర్తను చంపినట్లు సుస్మిత ఒప్పుకుంది. తన భర్త డబ్బుక కోసం తరచూ తనను హింసించేవాడని, కార్వాచౌత్ ముందు రోజు కూడా చితకబాదాడని ఆమె చెబుతోంది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. #WATCH | दिल्ली के उत्तम नगर में 'करंट वाली साजिश' का खुलासा@vishalpandeyk | | https://t.co/smwhXUROiK#Delhi #Uttamnagar #Crime #ABPNews pic.twitter.com/ALtr9GjYrJ— ABP News (@ABPNews) July 19, 2025 -
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
సాక్షి, సిటీబ్యూరో: బంగ్లాదేశ్కు చెందిన రీతూ మోని బతుకుతెరువు కోసం అక్రమంగా నగరానికి వచ్చింది. రీతూ రావుగా మారి ఇక్కడే ఉంటూ సోషల్మీడియా ద్వారా ఎర వేసి పలువుర్ని ఆకర్షించింది. ఇద్దరితో సహజీవనం చేసిన ఆమె మరో వివాహితుడిని వివాహం చేసుకుంది. వీరిలో ఒకరి చిరునామాతో ఆధార్ కార్డు, పాన్కార్డు తీసుకుని.. మరొకరి చిరునామాతో అప్డేట్ చేయించింది. ఈమె వ్యవహారం నాటకీయంగా వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరితో... అక్రమంగా సరిహద్దులు దాటిన రీతూరావు 2020లో హైదరాబాద్ చేరుకుంది. ఉద్యోగం కోసం వచ్చినట్లు ఇక్కడ నివసిస్తూ సోషల్మీడియా ద్వారా ఆసిఫ్నగర్కు చెందిన నరేష్ను పరిచయం చేసుకుంది. అతడితో కొన్నాళ్లు సహజీవనం చేసిన రీతూ.. ఆసిఫ్నగర్ చిరునామాతో ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుంది. ఈ చిరునామాతోనే సిమ్కార్డులు సంగ్రహించింది. కొన్నాళ్లకు సోషల్మీడియా ద్వారా పరిచయమైన గన్ఫౌండ్రీ వాసి శంకర్రావు వద్దకు చేరింది. ఆ సందర్భంలో తన ఆధార్ కార్డును గన్ఫౌండ్రీ చిరునామాకు అప్డేట్ చేసుకుంది. ఈమె ధోరణి కారణంగా శంకర్ తరచు ఘర్షణకు దిగేవాడు. ఓ దశలో అతడిని భయపెట్టడానికి ఇంట్లోనే షాంపూ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో శంకర్ ఆమెను గుడిమల్కాపూర్లోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దీనిపై గుడిమల్కాపూర్ ఠాణాలో కేసు నమోదైంది. ఆస్పత్రిలో వదిలి వెళ్లిపోవడంతో... నరేష్, శంకర్లతో సహజీవనం చేస్తున్న సందర్భంలోనే రీతూ నిజామాబాద్కు చెందిన ప్రవీణ్ను ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం చేసుకుంది. ఓ సందర్భంలో వీరిద్దరూ నగరంలోని ఓయో రూమ్లో గడిపారు. తాను గుడిమల్కాపూర్ ఆస్పత్రిలో ఉన్నానని, శంకర్ వదిలేసి వెళ్లిపోయాడంటూ రీతూ ప్రవీణ్కు ఫోన్ చేసింది. ఆస్పత్రికి వెళ్లిన అతడు బిల్లు చెల్లించిన ఆమెను తీసుకుని వెళ్లి విద్యానగర్లోని తన ఫ్లాట్లో ఉంచాడు. కొన్నాళ్లు సహజీవం చేసింది. అనంతరం, ఆమె ఒత్తిడి మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 15న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. ఓ సందర్భంలో ఆమెకు సంబంధించిన బంగ్లాదేశీ గుర్తింపు పత్రాలను అతడు చూశాడు. నిలదీయగా రీతూ సైతం అసలు విషయం చెప్పింది. అదే సమయంలో పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో భయపడిపోయిన ప్రవీణ్ ఆమెను వదిలి నిజామాబాద్ వెళ్లిపోయాడు. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి... తనను విడిచి వెళ్లిపోయిన ప్రవీణ్ను తన దారికి తెచ్చుకోవాలని భావించిన రీతూ అతడి భార్యకు సోషల్మీడియా ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రవీణ్తో అయిన పెళ్లి ఫొటోలు షేర్ చేసింది. వీటిని చూసిన ప్రవీణ్ భార్య షాక్కు గురై భర్తను నిలదీసింది. నిజం చెప్పిన అతడు ప్రస్తుతం రీతూ డబ్బు కోసం వేధిస్తోందని, బెదిరిస్తోందని వాపోయాడు. దీంతో ఇద్దరూ కలిసి వచ్చి నల్లకుంట ఠాణాలో రీతూపై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా రీతూను పోలీసులు ఠాణాకు పిలిపించారు. ఆమె విచారణ నేపథ్యంలోనే బంగ్లాదేశీగా గుర్తించారు. న్యాయనిపుణుల సలహా మేరకు డిపోర్టేషన్ చేయాలని నిర్ణయించుకుని షెల్డర్ హోమ్కు తరలించారు. అయితే ఆమె ఆధార్, పాన్ కార్డులు పొందినట్లు తేలడంతో బుధవారం కేసు నమోదు చేశారు. రీతూతో పాటు ఆమెను వివాహం చేసుకుని వదిలేసిన ప్రవీణ్ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నరేష్, శంకర్ కోసం గాలిస్తున్నారు. -
HYD: ట్యాక్స్ ఎగ్గొట్టే యత్నం.. పట్టించిన ఏఐ
స్థిరాస్తి విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఎల్టీసీజీ) ట్యాక్స్ ఎగవేయాలని పథకం వేసిన హైదరాబాద్ వ్యాపారి కొన్ని నకిలీ బిల్లులు సృష్టించారు. రూ.21.6 లక్షలు చెల్లించాల్సిన చోట రూ.7200 చెల్లిస్తే చాలన్నట్లు తయారు చేశారు. ఓ బిల్లులోని ఫాంట్పై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై ఉన్న తేదీ నాటికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఆ ఫాంట్ లేదని నివేదిక వచ్చింది. దీని ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. గత్యంతరం పరిస్థితుల్లో సదరు వ్యాపారి రూ.21.6 లక్షలు చెల్లించి కేసు నుంచి బయటపడాల్సి వచ్చింది.హైదరాబాద్లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం పూర్వాపరాలు ఇలా... ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఎల్టీసీజీ ద్వారా వచ్చే లాభంలో 30 శాతం పన్నుగా చెల్లించాలి. అయితే ఈ మొత్తాన్ని మరో స్థిరాస్తి పైన లేదా దాని అభివృద్ధి కోసం వెచ్చిస్తే ఆ మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి 2000కు ముందు రూ.68 లక్షలు వెచ్చించి శివార్లలో ఉన్న ఓ పాత ఇంటిని ఖరీదు చేశారు. దీనికి మరమ్మతులు చేసి అదనపు హంగులు చేర్చారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా రూ.1.4 కోట్లకు విక్రయించారు. ఇలా సదరు స్థిరాస్తి విక్రయం ద్వారా 2002లో రూ.72 లక్షలు లాభం పొందారు. దీనిపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్గా రూ.21.6 లక్షలు చెల్లించాల్సి ఉంది.అయితే 2002–08 మధ్య తనకు చెందిన మరో ఇంటి అభివృద్ధి కోసం రూ.71 లక్షలకు పైగా వెచ్చించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. వీటిని ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తూ చేస్తూ తనకు క్యాపిటల్ గెయిన్గా కేవలం రూ.24 వేలు మిగిలినట్లు చూపించారు. ఇందులో 30 శాతం యడం ద్వారా ఆ మేరకు మినహాయింపు పొంది మిగిలిన రూ.7200 చెల్లించారు. ఈ వ్యవహారాన్ని సందేహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేస్తుండగా దానికి ఆయన నుంచి సమాధానాలు వెళ్తున్నాయి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా వీరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.ఈ బిల్లుల్లోని లోటుపాట్లను గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. వ్యాపారి సమర్పించిన బిల్లుల్లో 2002 జూలై 6 తేదీతో రూ.7.6 లక్షలది కూడా ఉంది. దీన్ని విశ్లేషించిన ఏఐ టూల్ అందులోని ఫాంట్లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపింది. ఆ బిల్లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని కాలిబ్రి అనే ఫాంట్తో ముద్రించి ఉంది. డిజిటల్ సాన్స్–సెరిఫ్ టైప్ ఫేస్ ఫాంట్ అని గుర్తించిన ఏఐ టూల్ మరికొన్ని కీలకాంశాలను బయటపెట్టింది.దీన్ని 2002–2004 మధ్య డచ్ డిజైనర్ లూకాస్ డి గ్రూట్ రూపొందించారని, 2006లో విండోస్ విస్టాతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తేల్చింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఆ ఫాంట్ 2007 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. వర్డ్లో టైమ్స్ న్యూ రోమన్ని, పవర్పాయింట్, ఎక్సెల్, ఔట్లుక్ల్లో ఏరియల్న ఫాంట్కి బదులు ఇది అందుబాటులోకి వచ్చినట్లు ఆ టూల్ నివేదించింది. కంప్యూటర్ ప్రపంచంలోకి 2006లో అందుబాటులోకి వచ్చిన ఫాంట్తో 2002లో బిల్లు ముద్రితం కావడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేక ఆ వ్యాపారి మొత్తం రూ.21.6 లక్షలు చెల్లించిన అధికారులకు క్షమాపణ చెప్పి వెళ్లారు.- శ్రీరంగం కామేష్ -
బెంగళూరులో హైటెన్షన్.. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: ఓవైపు దేశరాజధానిలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. ఇటు నగరంలోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. బెంగళూరు ఈ ఉదయం ఒకేసారి 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.నగరంలోని రాజరాజేశ్వరీనగర్, కెంగేరి తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. నగర పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ టీమ్లు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నాయి. ఇటు.. ఢిల్లీలో 20 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్కడ కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ , ఈమెయిల్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు లక్ష్యంగా మారాయి.40 Bengaluru schools receive bomb threats via emails, bomb squads and police team are at the spot #Bengaluru #Schools #BombThreats pic.twitter.com/3t9NMeZRpQ— News18 (@CNNnews18) July 18, 2025 -
హైదరాబాద్లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
మానవత్వం మంటగలిసిపోతోంది.. అమూల్యమైన సేవలకు సైతం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.. కొందరి అమాయకత్వం, అవసరం.. ఇంకొందరికి వరంగా మారుతోంది.. సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఓ వైపు యువత స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకొస్తుంటే.. మరికొందరు బాధితుల అవసరాన్ని సైతం సొమ్ము చేసుకుంటున్నారు!!.ఇటీవలి కాలంలో రక్తదానంపై అవగాహన పెరగడంతో చాలా మట్టుకు ఆపద సమయాల్లో అవసరం తీరుతోంది. సరిగ్గా అదే అదునుగా కొందరు కేటుగాళ్లు బరితెగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి ఆస్పత్రులకు వచ్చేవారిని టార్గెట్ చేస్తూ బాధితులకు టోకరా వేస్తున్నారు.. మానవత్వం ముసుగులో సమాజం సిగ్గుతో తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు.. బ్లడీ చీటర్స్.. అంతేకాదు.. డబ్బు స్వాహా చేసేదే కాకుండా అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలతో నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్తో పాటు జాతీయ స్థాయిలో పేరొందిన పలు కార్పొరేట్ ఆస్పత్రులకు అనేక మంది బాధితులు వస్తుంటారు. సరిగ్గా వీరినే ఆసరా చేసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. సేవ పేరుతో సమాజం తలదించుకునే మోసానికి తెరతీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమని సోషల్ మీడియాల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెట్టే విజ్ఞప్తులను క్యాష్ చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు.. అమూల్యమైన వారి సమయాన్ని ధనార్జన కోసం ఫణంగా పెడుతున్నారు.సమాచారమే.. వారి డేటా..అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం కుటుంబసభ్యులు, మిత్రుల ద్వారా సామాజిక మాధ్యమైలన వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో సహాయం కోరేవారి వివరాలే వారికి డేటాగా మారుతోంది.. అలాంటి సమాచారాన్ని సేకరించిన మోసగాళ్లు దాతల పేరుతో తక్షణమే బాధితులకు ఫోన్ చేస్తారు. ‘నాకు ఫలానా గ్రూపులో మెసేజ్ కనిపించింది. నేను రక్తం ఇవ్వడానికి సిద్ధం. కానీ నేను నగరానికి దూరంలో ఉన్నాను.. అయితే నా దగ్గర ప్రస్తుతం ట్రావెల్ చేయడానికి డబ్బులు లేవు.. మీరు ఏమీ అనుకోకుండా ఫోన్పేగానీ, గూగుల్పేగానీ చేస్తే వెంటనే వస్తాను.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలంటే సమయం పడుతుంది.. మీరు అర్జెంట్ అంటున్నారు కావబట్టి క్యాబ్ చార్జీలు ఇస్తే చాలు’ అని చెబుతారు.. డబ్బులు వేశాక ఫోన్ స్విచ్ఆఫ్ చేసేస్తారు.. ఆపదలో ఉన్న బాధితులు ఎలాగో పోలీసు స్టేషన్కి వెళ్లే పరిస్థితి ఉండదు.. ఒక వేళ వెళ్లినా వెయ్యి, రెండు వేల కోసం ఫిర్యాదు ఏం చేస్తాంలే.. అనే ఆలోచనతో ఉంటారు.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వేరే దాత కోసం వేటలో పడతారు.. రోజువారీ ఖర్చులకు.. బాధ్యతారాహిత్యంగా.. మానవీయ విలువలు లేని వారు.. పక్కవాడి బాధను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి మోసాలకు పాల్పడరు.. మరీ ముఖ్యంగా రోజు వారీ ఖర్చుల కోసం కొందరు యువత ఇలా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, గేమింగ్, బెట్టింగ్, డేటింగ్ యాప్స్ ఖర్చుల కోసం అవగాహనా రాహిత్యంతో.. మేం చేసేది చిన్న మోసమేగా అనే అపోహతో.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. అంతేకానీ తాము చేసే ఈ చిన్న తప్పిదం వల్ల సమాజానికి ఓ పెద్ద ప్రమాదం జరుగుతోందని, ఓ నిండు ప్రాణం బలైపోయే పరిస్థితి ఉందని, ఓ కుటుంబం రోడ్డున పడుతుందనిగానీ ఆలోచించలేని మైండ్ సెట్ ఉన్నవారు మాత్రమే ఈ తరహా మోసానికి పాల్పడతారని చెబుతున్నారు. వీరి వల్ల నిజంగా రక్తం ఇచ్చే దాతలకు కూడా చెడ్డపేరు వస్తుందని, చివరికి మంచి వారిపై కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆలోచించకుండా మనుషుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు.సైబర్ క్రైమ్ హెల్ప్లైన్..అవసరం, అమాకత్వం వంటివే మోసగాళ్లకు అనుకూలంగా మారే అంశాలు.. మరీ ముఖ్యంగా నగరంలో భాష సమస్య కూడా ఓ కారణమే. ఇలాంటి తరుణంలో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ సెల్కు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలపై సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. హైదరాబాద్ నగరం మరోసారి ‘గివింగ్ సిటీ’గా నిలవాలంటే.. ప్రజలతోపాటు, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది.:::సాక్షి, సిటీబ్యూరో -
ప్రాణం తీసిన ప్రేమ పంచాయితీ!
క్రైమ్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిషన్రావుపేట గ్రామానికి చెందిన చల్లూరి మల్లేశ్ (30) కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఈ విషయంలో యువతి బంధువులు అనేకసార్లు మల్లేశ్కు నచ్చజెప్పారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు, కొట్లాటలు జరిగాయి. ఈ క్రమంలో మల్లేశ్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతనిపై రౌడీషీట్ కూడా నమోదైంది. అయినప్పటికీ మల్లేశ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మల్లేశ్ గతంలో హార్వెస్టర్ నడిపించగా.. ఈ గొడవల నేపథ్యంలో హార్వెస్టర్ అమ్మేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గురువారం ఉదయం కూడా మల్లేశ్ సదరు యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. యువతి తండ్రికి ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. ఈ క్రమంలో యువతి బంధువులు విసిగిపోయారు. ఇంటి నుంచి ద్విచక్రవానంపై బయలుదేరిన యువకుడిని వెంబడించి వెల్గటూర్ మండల కేంద్రంలోని పెద్దవాగుపై విచక్షణారహితంగా కొట్టి ఆటోలో తీసుకెళ్లి కోటిలింగాల రోడ్డులోని పాత వైన్స్ వెనకాల కత్తులతో పొడిచి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడి తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లుకాగా మల్లేశ్ ఒక్కడే కుమారుడు. -
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. నలుగురు ప్రమాద స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పెద్దఅంబర్పేట నుంచి బొంగ్లూరు వెళ్తుండగా ఆదిభట్ల ఓఆర్ఆర్పై ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతోనే ఘోరం చోటు చేసుకుంది. ఘటన తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. కారు నుంచి మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే మృతుల వివరాలు, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
కోనసీమలో దారుణం.. వ్యభిచారానికి ప్రియురాలు అంగీకరించలేదని..
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: వ్యభిచారం చేయడానికి అంగీకరించలేదని ప్రియురాలిని ప్రియుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన కోనసీమలో కలకలం రేపుతోంది. రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. షేక్ షమ్మ (22) అనే యువకుడితో ఓలేటి పుష్ప(22) కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.ప్రియురాలు పుష్పను వ్యభిచారం చేయడానికి తన వెంట రావాలంటూ ప్రియుడు బలవంతం చేశాడు. నిరాకరించిన పుష్పను షేక్ షమ్మ దారుణంగా చాకుతో పొడిచి హత్య చేశాడు. ఘటనలో అడ్డు వచ్చిన పుష్ప తల్లి గంగను, సోదరుడినీ కూడా గాయపరిచి నిందితుడు పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మారిపోయాడనుకున్నారు.. మాయమైపోయాడు!
నెల్లూరు: క్షణికావేశంలో హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో పదేళ్లకు పైగా జిల్లా జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. స్రత్పవర్తన ఖైదీగా పేరు తెచ్చుకున్నాడు. స్రత్పవర్తనతో విడుదలయ్యే ఖైదీల జాబితాలో పేరు కూడా ఉంది. అంతలోనే జైలు నుంచి పరారై ఇన్నాళ్లుగా సంపాదించుకున్న సత్ప్రవర్తన పేరును పోగొట్టుకున్నాడు. సంగం మండలం గాం«దీగిరిజన సంఘం గ్రామానికి చెందిన చౌడయ్య, పుల్లయ్య, జంగాలపల్లి నాంచారయ్య (25) 2011 జనవరి 16న సంక్రాంతి పండగల సమయంలో సాయంత్రం 5 గంటల సమయంలో సరదాగా పేకాట ఆడుతున్నారు. ఇంతలో ఇండ్ల సురేష్ అక్కడికి వెళ్లి తాను ఆడుతానని చెప్పాడు. మధ్యలో పుల్లయ్య వెళ్లిపోయాడు. మిగతా ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సురేష్ క్షణికావేశంలో కత్తితో నాంచారయ్యను పొడిచాడు. దీంతో నాంచారయ్యను భార్య అరుణతోపాటు కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్యం కోసం బుచ్చిరెడ్డిపాళెం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంగం పోలీసులు అదే రోజు రాత్రి ఇండ్ల సురేష్పై హత్య కేసు నమోదు చేశారు. కోర్టులో కేసు విచారణ జరగ్గా, నిందితుడు ఇండ్ల సురేష్పై నేరారోపణ రుజువు అయింది. ఈ క్రమంలో అతనికి జీవిత ఖైదు విధిస్తూ 2015 మార్చిన 9న తీర్పు వెలువడింది. అప్పటి నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా ఉన్నాడు. స్రత్పవర్తన ఖైదీగా ఉండడంతో జైలు అధికారులు సైతం అతనికి ఓపెన్ జైలు పనులు అప్పగించారు. తాజాగా మూడు రోజుల క్రితం సైతం అతని కుటుంబ సభ్యులతో ములాఖత్ ద్వారా మాట్లాడారు. ఇంతలోనే అతను మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్ర కారాగారం నుంచి తప్పించుకుని పరారీ అయ్యాడు. జైలు అధికారులు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న సంగం పోలీసులు గాం«దీజన సంఘం చేరుకుని కుటుంబ సభ్యులను విచారించారు. అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు పదేళ్లకు పైగా జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సురేష్ స్రత్పవర్తన ఖైదీగా త్వరలోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని, అంతలోనే ఇలా జరగడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కోడలి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్..!
తాడేపల్లి రూరల్: తన చావుకు భార్య కారణమని పేర్కొంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన బ్రహ్మయ్య (30) సీసీ కెమెరాల టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. మంగళగిరి టిడ్కో నివాసాల్లో ఉంటున్న యువతితో వివాహం జరిగింది. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని పుట్టింటికి పంపించేశాడు. అందరూ బ్రహ్మయ్యను బతిమిలాడితే ఆమెను కాపురానికి తీసుకొచ్చినట్లు బంధువులు తెలిపారు. అత్తాకోడళ్ల గొడవల కారణంగా బ్రహ్మయ్య సొంత ఇంటి నుంచి ఉండవల్లి అమరావతి రోడ్లోని ఒక ఇంటిలో అద్దెకు దిగాడు. అక్కడ మళ్లీ ఆమె ఫోనులో ఎక్కువగా మాట్లాడుతుండటంతో గొడవలు జరిగాయి. ఈలోగా ఆషాఢ మాసం రావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన చావుకు భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని బ్రహ్మయ్య ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయిన ఏడాదికే ఇలా కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బ్రహ్మయ్య తల్లి కన్నీరుమున్నీరైంది. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందామని చెప్పినా ఎందుకు ఇలా చేశావని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి చావుకు కారణమైన కోడలు, ఆమె ప్రియుడిని శిక్షించాలని డిమాండ్ చేసింది. -
విశాఖ: బాయ్స్ హాస్టల్ పక్కనే లాడ్జి.. ఛీ ఛీ ఇదేం పాడుపని..
సాక్షి, విశాఖపట్నం: న్యూడ్ వీడియోలను చిత్రీకరించారనే ఆరోపణతో నలుగురు యువకులను యువతులు చితకబాదారు. విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.బాయ్స్ హాస్టల్, ఓ లాడ్జి పక్క పక్కనే ఉండటంతో హాస్టల్లో నుంచి లాడ్జి బాత్రూంలో సెల్ఫోన్లతో వీడియోలు తీశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులు నుంచి తన వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ బాధిత మహిళ తెలిపింది. యువకులకు దేహశుద్ధి చేసిన యువతులు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. యువకులు సెల్ ఫోన్లు ద్వారక పోలీసులు పరిశీలిస్తున్నారు. -
భార్యపై కానిస్టేబుల్ అత్యాచారం సహకరించిన భర్త..!
కర్ణాటక: మహిళపై అత్యాచారం కేసులో పోలీసు కానిస్టేబుల్ను దక్షిణకన్నడ జిల్లా మంగళూరు కంకనాడి పోలీసులు అరెస్ట్ చేశారు. కావూరు పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న చంద్రనాయక్ నిందితుడు. మంగళూరు నగర పోలీసు కమిషనర్ సుదీర్ కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు. బాధిత మహిళను ఆమె భర్త నగ్న వీడియోలను తీసి తాను చెప్పినట్లు చేయాలని బెదిరించసాగాడు. భర్త వేధింపులను తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో చంద్రనాయక్ను ఆమెతో మాట్లాడాడు. భర్త ఫోన్లోని వీడియోలను అతడు తొలగించడంతో సమస్య సద్దుమణిగింది. అప్పటినుంచి బాధితురాలికి మాయమాటలు చెప్పిన చంద్రనాయక్ లైంగికంగా వాడుకున్నాడు. ఇందుకు భర్త కూడా సహకరించాడు. ఇద్దరి వేధింపులు మితిమీరడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసు కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డిని కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆయన ఆదేశాలతో చంద్రనాయక్ను, ఘరానా భర్తని అరెస్టు చేశారు. -
నాతో రాకపోతే చంపేస్తా..
హైదరాబాద్: తనతో కలిసి ఉండకపోతే చంపేస్తానని ఓ యువతిని బెదిరించడమే గాక తరచూ ఆమె పనిచేస్తున్న చోటుకు వెళ్లి వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తానికి గురైన బాధితురాలు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా, వట్టికం మన్పహాడ్ గ్రామానికి చెందిన బానోతు రంగమ్మ హౌస్కీపింగ్ పనిచేస్తూ శ్రీకృష్ణానగర్లో తన కుమార్తె రేణుక (20)తో కలిసి ఉంటోంది. రేణుక సమీపంలోని ల్యాండ్ రిడ్జ్లో పని చేసేది. రెండేళ్ల క్రితం ఆమెకు చల్లా వినయ్కుమార్ అనే యువకుడితో పరిచయం కావడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే డ్రగ్స్కు అలవాటు పడిన వినయ్కుమార్ ఆవారాగా తిరుగుతూ రేణుక జీతాన్ని బలవంతంగా లాక్కునేవాడు. దీంతో ఆమె అతడిని దూరం పెట్టింది. ఈ నెల 9న రేణుక డ్యూటీకి వెళ్లింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో వినయ్కుమార్ రేణుక పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి ఆమెతో పాటు అక్కడ పనిచేస్తున్న దివ్య అనే యువతిని కూడా బలవంతంగా లాక్కొచ్చి రేణుక స్కూటీ పైనే వారిని ఎక్కించుకుని వెళ్తుండగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డారు. మద్యం మత్తులో ఉన్న వినయ్కుమార్ బైక్ నడుపుతుండడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బైక్ను సీజ్ చేశారు. ఇంటికి వెళ్లిన రేణుకను బైక్ విషయమై తల్లి ప్రశి్నంచగా రిపేర్కు ఇచ్చానని తల్లికి అబద్దం చెప్పింది.దీంతో మనస్తాపానికి లోనైన ఆమె ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి ఆత్మహత్యకు వినయ్కుమార్ కారణమని తల్లి రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. -
భార్య రాసిన మరణ శాసనం.. ప్లాన్ చేసి కార్ తో గుద్ది..!
-
కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్రేప్
జైపూర్: రాజస్తాన్లోని అల్వార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడుగురు దుండగులు ఓ మహిళను అపహరించి, సామూ హిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తూ ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు. 11 రోజులపాటు బాధితురాలిని నిర్బంధించారు. చివరకు రోడ్డు పక్కన వది లేసి వెళ్లిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 24న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళను ముగ్గురు వ్యక్తులు అపహరించారు. బొలేరో వాహనంలో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లారు. వాహనంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడికి దిగారు. నోట్లో గుడ్డలు కుక్కారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో నలుగురు ఉన్నారు. 11 రోజులు అక్కడే నిర్బంధించారు. ఏడుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలిని నగ్నంగా మార్చి అభ్యంతకరంగా వీడియోలు చిత్రీకరించారు. పోలీసులకు చెబితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించారు. రూ.3 లక్షల ఇస్తామని, నోరు మూసుకోవాలని చెప్పారు. అపస్మారక స్థితికి చేరిన బాధితురాలిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సాయంతో ఆమె తన ఇంటికి చేరుకున్నారు. -
Nalgonda : సినిమా రేంజ్ లో మర్డర్ ప్లాన్
-
‘ప్రేమించి పెళ్లి చేసున్నాం.. మాకు రక్షణ కల్పించండి’
చిత్తూరు: ‘ప్రేమించి పెళ్లి చేసున్నాం.. మాకు మా తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి’ అని నూతన వధువు మానస పోలీసులను వేడుకుంది. వివరాలు .. రొంపిచెర్ల మండలం, చెంచెంరెడ్డిగారిపల్లె పంచాయతీ, శ్రీరాముల వడ్డిపల్లెకు చెందిన చెంగల్రాయులు కుమార్తె మానస (22) తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం, వెత్తలతడుకు గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు(27)తో రెండేళ్లుగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. కలికిరి రాముడు గుడిలో ఈనెల 12వ తేదీ వివాహం చేసుకున్నారు. అయితే తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కల్లూరు సీఐ సూర్యనారాయణను వేడుకున్నారు. మానస తల్లిదండ్రులను సీఐ విచారించి వారికి నచ్చజెప్పి ప్రేమికులను కలిపారు. -
భర్తకు కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి..
వర్ధన్నపేట: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వర్ధన్నపేట ఎస్సై చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ (44) ఈనెల 8న తండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు. పండుగ సందర్భంగా సాయంత్రం ఏడు గంటల సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు. బయటికి వెళ్లొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య, వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసులో కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తండాలో ఉండే తన బావ అయిన వాంకుడోతు దశరు ఇంటికి వెళ్లింది. బాలాజీ పరిస్థితిని గమనించిన తండావాసులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంనుంచి ఈనెల 13న హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు ఎస్ఐ తెలిపారు. భర్తతో గొడవను మనసులో పెట్టుకున్న కాంతి తన బావ దశరు ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశ పూర్వకంగానే బాలాజీకి తాగించినట్లు చెప్పారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బస్సులో ప్రసవం.. బయటకు విసిరి పారేసిన తల్లి
నెలలు నిండిన ఓ యువతి బస్సెక్కింది. సరిగ్గా ప్రయాణంలో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. చప్పుడు కాకుండా ప్రసవించిన ఆమె.. ఆ బిడ్డను గుడ్డలో చుట్టి రోడ్డు మీదకు విసిరి పారేసింది. దీంతో ఆ పసిగుడ్డు అక్కడికక్కడే మరణించింది.మహారాష్ట్ర పర్బానీలో దారుణం జరిగింది. బస్సుల్లోనే బిడ్డను ప్రసవించిన ఓ యువతి.. ఆపై దారుణానికి ఒడిగట్టింది. కళ్లు తెరవని ఆ పసికందును రోడ్డు మీదకు విసిరి ప్రాణం తీసింది. ఈ వ్యవహారంలో 19 ఏళ్ల ఆ యువతితో పాటు భర్తగా చెప్పుకున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పర్బానీ నుంచి పుణే వెళ్తున్న స్లీపర్ బస్సులో ఓ జంట ఎక్కింది. మంగళవారం ఉదయం 6.30గం. ప్రాంతంలో బస్సు సేలు రోడ్డుకు చేరుకోగానే.. బస్సులోంచి ఓ చిన్నమూట బయటకు పడింది. కిటికీలోంచి అది చూసిన డ్రైవర్.. అనుమానం వచ్చి బస్సును ఆపి ప్యాసింజర్ల దగ్గరకు వచ్చి ఆరా తీశాడు. అయితే..తన భార్యకు బస్సు జర్నీ పడలేదని.. వాంతి చేసుకుందని.. దానిని గడ్డలో చుట్టి పడేశామని సదరు వ్యక్తి చెప్పాడు. అయితే బస్సు ఎక్కే సమయంలో ఆమె గర్భంతో ఉన్న విషయం గమనించిన ఓ ప్రయాణికురాలికి ఈ వ్యవహారం అనుమానంగా తోచింది. తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. వాళ్లు విసిరేసిన గుడ్డ మూటను విప్పి చూడగా.. అందులో ఓ పసికందు కనిపించింది. దీంతో.. ప్రయాణికులంతా ఆ జంటను నిలదీశారు. తమ పేర్లు రితికా ధిరే, అల్తాఫ్ షేక్గా చెప్పుకున్న ఆ జంట.. ఏడాదిన్నరగా పుణేలో కాపురముంటున్నామని చెప్పారు. అయితే బిడ్డను పెంచి పోషించే స్తోమత తమకు లేదని.. అందుకే ఇలా చేశామని ఆ ఇద్దరు చెప్పారు. ఆపై ఎమర్జెన్సీ నెంబర్ 112 ద్వారా పోలీసులను ఈ సమాచారం అందించారు.పార్తీ స్టేషన్ పోలీసులు వచ్చి విచారణ జరపగా.. ఆ జంట భార్యభర్తలే అని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ అయిన యువతిని ఆస్పత్రికి.. సదరు వ్యక్తిని జైలుకి తరలించారు. డిశ్చార్జి తర్వాత ఆ జంటను కలిపి విచారణ జరిపే యోచనలో పోలీసులు ఉన్నారు. మరణించిన ఆ మగశిశువుకు పోలీసులే అంత్యక్రియలు జరిపించారు. -
గండికోట: వైష్ణవిది హత్యా? పరువు హత్యా?
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) సోమవారం కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా కనిపిచింది. ఇప్పటిదాకా తేలిన వివరాల ప్రకారం.. ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేశ్తో బైక్పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్పై లోకేశ్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.హత్యా? పరువు హత్యా.?సోమవారం ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేశ్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జన ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
బెంగళూరులో దారుణం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
బెంగళరూరు: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. క్లాస్లో పాఠాలకు సంబంధించి ఓ విద్యార్థినికి టెక్ట్స్ మెసేజ్ చేసిన లెక్చరర్.. ఆపై సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రెండ్ రూమ్కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై మరొక లెక్చరర్, అతని ఫ్రెండ్ కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూడటంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ఓ విద్యార్థినిని ఫిజిక్స్ బోధించే లెక్చరర్ నరేంద్ర పరిచయం చేసుకున్నాడు. చదువులో సాయంతో పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకున్నాడు. ఇలా అనూప్ అనే స్నేహితుడి రూమ్కి తీసుకెళ్లాడు. అక్కడ అనూప్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డ వీడియోను చూపించి మరొక లెక్చరర్ సందీప్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ విద్యార్థినిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వీరు కర్ణాటక మహిళా కమిషన్ను ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. దీంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇదిలావుంచితే, ఒడిశాలో కూడా ఇదే తరహా దారుణం ఇటీవల చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసి ప్రాణాలు తీసుకుంది. ప్రిన్సిపాల్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఒంటికి నిప్పంటించుకుని 90 శాతం కాలిన గాయాల పాలైన ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. ముందే చెబుతున్నా.. న్యాయం జరగకపోతే.. -
“నేను నిన్ను విడిచి ఉండలేను.. నేను నీ దగ్గరకు వస్తున్నాను’
ధర్మపురి సమీపంలో తన భర్త మరణ బాధను తట్టుకోలేక ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని కడ్తూర్ సమీపంలోని తలనాథం గ్రామానికి చెందిన తీతు కుమారుడు దీపమలై (26) ఇంజనీర్. పుట్టిరెట్టిపట్టికి చెందిన గీత (21) ల్యాబ్ టెక్నీషియన్. వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు. వారు పాఠశాల రోజుల నుంచి స్నేహితులు, చివరికి ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారం వారి ఇద్దరి తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. వ్యతిరేకత కారణంగా, వారు ఒక సంవత్సరం క్రితం వారి ఇళ్ల నుంచి బయటకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం తర్వాత కొన్ని నెలలుగా దీపమలై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. తాను చనిపోతానని భావించి, తన ప్రేమ భార్య నుంచి విడిపోయి, ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి జీవించమని చెప్పాడు. దీని కారణంగా గీత రెండు నెలల క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంతలో ఆరోగ్యం క్షీణించిన దీపమలై గత 29వ తేదీన మరణించాడు. తన భర్త మరణం తర్వాత గీత మానసిక వేదనకు గురైంది. ఈ పరిస్థితిలో గీత ఇన్ స్ట్రాగామ్లో “నేను నిన్ను విడిచి ఉండలేను. నేను నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేసి, ఇంట్లోని ఎలుకల మందు తాగి మరణించింది. కడత్తూర్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీని తరువాత, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు దీపమలై మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశానికి సమీపంలోనే అతని గీత మృతదేహాన్ని కూడా ఖననం చేశారు. -
గండికోటలో దారుణం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడి.. హత్య చేశాడు. బాలికను బైక్పై గండికోట తీసుకొచ్చిన ఎర్రగుంట్లకి చెందిన లోకేష్.. గండికోటలోని ధాన్యాగారం వద్ద దారుణానికి ఒడిగట్టాడు. బాలికను వివస్త్రగా విడిచిపెట్టి వెళ్లాడు.బాలిక ప్రొద్దుటూరులోని ఓ ఇంటర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు లోకేష్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. -
లోకేష్ ను ఎన్ కౌంటర్ చేయాలి
-
ముందే చెబుతున్నా, న్యాయం జరగకపోతే..!
హృదయవిదారకమైన ఒడిషా బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హెచ్వోడీ లైంగిక వేధింపుల పర్వాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు చేసిన కాపీ.. అందులో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి. బాలాసోర్ బీఈడీ విద్యార్థిని బలవన్మరణం కేసులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. నిప్పంటించుకునే పది రోజుల ముందు.. 22 ఏళ్ల బాధిత విద్యార్థిని సీఐసీసీ(college's internal complaints committee)కి ఫిర్యాదు చేసింది. అందులో సీనియర్ ఫ్యాకల్టీ నుంచి తనకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూనే.. చర్యలు తీసుకోకుంటే గనుక ప్రాణం తీసుకుంటానని హెచ్చరించింది కూడా. జులై 1వ తేదీన ఆమె రాసిన లేఖలో ఇలా.. గత కొన్ని నెలలగా బీఈడీ డిపార్ట్మెంట్ హెచవోడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహూ నన్ను వేధిస్తున్నారు. తక్కువ మార్కుల వేస్తానని, నన్ను ఫెయిల్ చేస్తానని.. నా గురించి నా కుటుంబంతో లేనిపోనివి చెబుతానని బెదిరిస్తూ వస్తున్నారు. అన్నింటికి మించి తన కోరికెలు తీర్చమంటూ వేధిస్తున్నారు. మనశ్శాంతి కరువై మానసికంగా ఇబ్బంది పడుతున్నా. నా ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే.. నేను బలవన్మరణానికి పాల్పడతాను. నా చావుకు హెచ్వోడీ, కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని లేఖ రాసిందామె. జూన్ 30వ తేదీన ఫకీర్ మోహన్ కాలేజీ ప్రిన్సిపల్ దీలీప్ ఘోష్ దృష్టికి ఆమె విషయాన్ని తీసుకెళ్లింది. ఆ మరుసటిరోజు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదును సమర్పించింది. అంతటితో ఆగకుండా.. పది రోజులపాటు ఆ ఫిర్యాదు కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసి చర్యలు తీసుకోవాలంటూ సీఎం, విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను ట్యాగ్చేసి మరీ కోరింది. అయినా ఫలితం లేకపోయింది. జులై 12వ తేదీన.. ఆమె కాలేజీలోని ప్రిన్సిపల్ గది ఆవరణలో నిప్పటించుకుంది. 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెను రక్షించడానికి వెళ్లిన మరో విద్యార్థిని కూడా 70 శాతం గాయాలపాలై చికిత్స పొందుతోంది. ప్రధాన బాధితురాలిని బాలాసోర్ జిల్లా ఆస్పత్రిలో.. ఆపై భువనేశ్వర్లో ఎయిమ్స్కు ఆమెను తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాధితురాలు కన్నుమూసింది. ఈ కేసుకు సంబంధించిన బీఈడీ హెచ్వోడీ సమీర్ కుమార్ సాహూ, కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్లను కాలేజీ యాజమానయం తొలగించగా.. ఆపై పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఉదయం బాలాసోర్లోని బాధితురాలి స్వగ్రామం పలాసియాకు మృతదేహాన్ని తరలించారు. ఊరు ఊరంతా ఆమె మృతదేహం చూసి కన్నీరు పెట్టుకుంది. ఆమె మృతదేహాంతో కాసేపు రోడ్డుపై ఆందోళనకు దిగింది.ఈ ఘటనపై సీఎం మోహన్ చరణ్ మజ్హీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారాయన. మరోవైపు.. స్వరాష్ట్రం ఒడిశా పర్యటనలో ఉన్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సోమవారం సాయంత్రం AIIMSకి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆపై కాసేపటికే ఆమె కన్నుమూయడం గమనార్హం.ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదు.. బీజేపీ వ్యవస్థ చేసిన హత్య అని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న రాహుల్.. బాధిత విద్యార్థిని ధైర్యంగా తన గొంతుక వినిపించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: నేనేం చావడానికి ఇక్కడికి రాలేదు! -
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, జోగుళాంబ గద్వాల జిల్లా: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరుమలరావు ఏ–1, కుమ్మరి నాగేష్ ఏ–3, చాకలి పరశురాముడు ఏ–4, చాకలి రాజు ఏ–5లను ఈ నెల 10న విచారణాధికారి శ్రీను.. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని వివరాలు సేకరించారు.వాయిస్ మెసెంజర్తో గొంతు మార్చి మాట్లాడినట్లు ఇది వరకే బయటపడగా.. తాజాగా మరో ట్విస్ట్ బయటపడింది. తేజేశ్వర్-సహస్రల మధ్య ఎలాంటి కలయిక ఉండరాదనే ఉద్దేశంతో స్పై కెమెరాను కొనుగోలు చేసి తేజేశ్వర్ బెడ్రూంలో ఏర్పాటు చేశారు.తిరుమలరావు నిత్యం వారి కదలికలను కెమెరా ద్వారా గమనించాడు. కొత్త ట్విస్టు వెలుగులోకి రావడంతో.. సహస్రను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పీటీ వా రెంట్ను కోర్టుకు సమర్పించారు. ఏ–2 సహస్రను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు. -
అద్దె కారుతో భర్తను లేపేసిన భార్య..!
మోటకొండూర్: మోటకొండూర్ మండలం కాటేపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి బైక్ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మృతుడిని అతడి భార్య, బావమర్ది కలిసి హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36), తన స్నేహితుడు మద్దికుంట వీరబాబు ఆదివారం అర్ధరాత్రి భువనగిరి మండలం రాయిగిరి నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా.. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుండి వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ను కారు కొద్దిదూరం లాకెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ వెనుక కూర్చున్న వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్వామి మృతదేహాన్ని, గాయపడిన వీరబాబును స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరబాబును మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా సోమావరం ఉదయం మృతుడు స్వామి బాబాయి ఐలయ్య ఈ ప్రమాదంపై పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ మోటకొండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇది రోడ్డు ప్రమాదం కాదని.. వివాహేతర సంబంధం కారణంగానే స్వామిని అతడి భార్య స్వాతి, స్వాతి సోదరుడు మహేష్ కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు. మృతుడు స్వామికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. -
పదేళ్ల బాలికపై 80 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో పదేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిన్నారికి మాయమాటలు చెబుతూ వారం రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. బాధిత బాలిక అనారోగ్యంగా ఉండటంతో తల్లి ఆరా తీయగా ఈ దారుణం బయటపడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన తెర్రి సత్యనారాయణ (80) భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. సమీప ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక అమ్మమ్మ ఇల్లు వృద్ధుడి ఇంటికి సమీపంలోనే ఉంది. దీంతో బాలిక పాఠశాలకు వెళుతూ తన అమ్మమ్మ ఇంటికి వచ్చే క్రమంలో వృద్ధుడు ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ నిందితుడు సత్యనారాయణపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. -
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
సాక్షి, వరంగల్: రీల్స్ కలిపిన ప్రేమ.. పండంటి కాపురంలో చిచ్చు రాజేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కేసు వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ప్రత్యూష.. హసన్పర్తిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతితో సృజన్ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సృజన్ కార్డియాలజీ డాక్టర్గా పని చేస్తున్నారు. మరో ఆస్పత్రిలో ప్రత్యూష డెంటిస్ట్గా పని చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఓ అమ్మాయి.. డాక్టర్ సృజన్ను ఆ మధ్య ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్గా చేసి ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో.. పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. అయినా సృజన్లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఇలా ఘాతుకానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బిడ్డ మరణానికి కారణమైన సృజన్ను, ఆ యువతిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
‘అన్నా.. మనకు రెక్కలు రాకముందే అమ్మానాన్నను ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి అష్టకష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాము. అమ్మమ్మ అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసింది. నా మనవడు ఉన్నాడన్న ధైర్యంతో బతికేస్తోంది. నేను కూడా తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ మా అన్న చూసుకుంటాడనే ఆశతో జీవిస్తున్నాను. ఇప్పుడు మా అందర్నీ దూరం చేసి వెళ్లిపోయావు. మేమెలా బతికేదన్నా’ అంటూ ఆ సోదరి తన అన్న మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరుల గుండెల్ని మెలిపెట్టింది. శ్రీనివాసులు అంత్యక్రియల సందర్భంగా ఈ దృశ్యం ఆదివారం శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.శ్రీకాళహస్తి: మండలంలోని బొక్కసంపాళెం శోకసంద్రంలో మునిగిపోయింది. జనసేన మాజీ నాయకురాలు వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, మరో ముగ్గురు కలిసి మా అన్నను చంపేశారంటూ మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం వద్ద అతడి సోదరి కీర్తి బోరున విలపించడం అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించింది. ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాం. ఇపుడు నా రక్తసంబంధమైన అన్నను కూడా కోల్పోయాను’ అని విలపించడం చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది. ఏడేళ్ల వయసులో వెంకటగిరి నుంచి వచ్చేసి అమ్మమ్మ వద్ద పెరిగాము. ఇప్పుడు అన్నని పోగొట్టుకున్నానని మృతుని సోదరి, వారిని పెంచిన అమ్మమ్మ రాజేశ్వరి ఆవేదనను చూసి గ్రామస్తులు చలించిపోయారు.మా అన్నని మాట్లాడనివ్వలేదుఅనంతరం మృతుడు శ్రీనివాసులు చెల్లెలు కీర్తి మాట్లాడుతూ ‘మా అన్న వారి(జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి) ఇంటికి పరిమితమయ్యాడు. చాలాకాలంగా చూడడానికి కూడా కష్టంగా ఉండేది. ఒకరోజు కాలు విరిగిందని చెబితే చూడడానికి వెళ్లా. ఇప్పుడు ఎవరైతే చంపేశారో ఆ రోజు మా అన్నను వారు మాట్లాడనివ్వకుండా చేశారు’ అని వెల్లడించింది. మా అన్నను పంపించేస్తామని చెప్పారే గానీ ఇలా చంపేస్తారని అనుకోలేదని కన్నీటి పర్యంతమైంది. తన అన్న చావుకు కారణమైన వారిని ఎవర్నీ వదలిపెట్టనని, వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని తెలిపింది. తనకు అండగా ఉండాలని స్థానికులను కోరింది.‘నాకున్న ఒకే ఒక బంధాన్ని దూరం చేశారు. నా అన్నను అతి కిరాతకంగా చంపేశారు. చిన్నప్పుడే అమ్మానాన్న దూరమయ్యారు. అన్నున్నాడనే ధైర్యంతో బతికేస్తున్నా. ఇప్పుడు ఆ ఒక్క ఆశను కూడా తుంచేశారు. నా అన్నను నాకు లేకుండా చేశారు. పవన్కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి. న్యాయం కోసం ఎందాకై నా వెళ్తాం..’ అంటూ మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి మాట్లాడడం అక్కడి వారిని ఆలోచనలో పడేసింది. -
నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
నంద్యాల: మరో నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. చుంచుఎర్రగుడి గ్రామానికి చెందిన శిరోల్ల రవితేజ(29) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే ఇతనికి కల్లూరు మండలం చిన్నటేకూరులో ఓ అమ్మాయితో వివాహ నిశ్చయం జరిగింది. మరో నెల రోజుల్లో పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఆదివారం రవితేజ తన బంధువు అయిన మరో వ్యక్తితో బెంగళూరులో బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా కారు వచ్చి ఢీకోట్టింది. దీంతో తలకు హెల్మెట్ ఉన్న రవితేజతోపాటు మరో వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీరని శోకంతో బెంగళూరుకు వెళ్లారు. -
వ్యక్తి దారుణ హత్య
మేడ్చల్రూరల్: భార్యాభర్తలు ఓ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ చెందిన ఎదునూరి నరసింహ అలియాస్ చిన్న, తన భార్య అనితతో కలిసి మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్పోస్ట్లో ఉంటూ రోడ్డు పక్కన కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.మెదక్ జిల్లా, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు (37) శనివారం మధ్యాహ్నం మేడ్చల్ చెక్పోస్ట్లోని వెంటకరమణ లిక్కర్ ల్యాండ్ వద్ద మద్యం తాగుతుండగా చిన్న, అతడి భార్య అనితతో స్క్రాప్ విషయమై గొడవ జరిగింది. దీంతో వారిద్దరూ కలిసి నర్సింహులును కర్రలతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి దీనిని గుర్తించిన వైన్ షాప్ నిర్వాహుకుడు మహేష్ మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బీమా చేయించి.. ఆపై చంపించి..
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను హత్య చేయించి..దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా పెద్దమాసాన్పల్లి శివారులో చోటుచేసుకుంది. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ డాక్టర్ బి.అనురాధ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన తొగుట పీఎస్ పరిధిలో దివ్యాంగురాలైన తాటికొండ రామవ్వ(60)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని.. ఆమె అల్లుడు తాళ్ల వెంకటేశ్ డయల్ 100కు కాల్ చేశాడు. దీంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందినట్టు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైట్ కారు ఢీ కొట్టి..ఇప్పుడే వెళ్లిందని ఫిర్యాదులో భాగంగా వెంకటేశ్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు వైట్ కారు డ్రైవర్ను విచారించగా, తన కంటే ముందు బ్లాక్ కలర్ తార్జీపు వెళ్లిందని చెప్పాడు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ తార్ జీపు తుక్కాపూర్ వరకు నంబర్ ప్లేట్ ఉన్నట్టు, తర్వాత దానిని తొలగించి టీఆర్ స్టిక్కర్ వేసినట్టు గుర్తించారు. ఎందుకు నంబర్ ప్లేట్ తొలగించారని ఆరా తీశారు. ఆ తార్ జీపు నంబరు ఆధారంగా వాహన యజమాని దగ్గరకు వెళ్లి పోలీసులు విచారించారు. పెద్దమాసాన్పల్లికి చెందిన కరుణాకర్ సెల్ఫ్ డ్రైవింగ్ నిమిత్తం సిద్దిపేటలో రూ 2,500 చెల్లించి ఆధార్ కార్డు, వివరాలు ఇచ్చి అద్దెకు తీసుకున్నాడు. దీంతో పోలీసులు కరుణాకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. కరుణాకర్ చెప్పిన వివరాల ఆధారంగా మృతురాలి అల్లుడైన వెంకటేశ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. తానే ఈ దారుణానికి ఒడికట్టానని పోలీసులకు చెప్పాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే...సిద్దిపేట కేసీఆర్నగర్కు చెందిన తాటికొండ రామవ్వ–రంగయ్య దంపతుల కుమార్తెను తొగుట మండలం పెద్దమాసాన్పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వెంకటేశ్ తన అత్తను హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి... ఆమె పేరుపై ఇన్సూరెన్స్ చేయించి డబ్బు కాజేయాలనుకున్నాడు. అందులో భాగంగానే ఈ ఏడాది మార్చిలో తాటికొండ రామవ్వ పేరుపై పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 చెల్లించి రూ.15 లక్షల ఇన్సూరెన్స్, ఎస్బీఐలో రూ.2 వేలు చెల్లించి రూ 40 లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు. రైతుబీమా డబ్బు లు వస్తాయని రంగయ్య (మృతురాలి భర్త) పేరు పైన ఉన్న 28 గుంటల వ్యవసాయ భూమిని రామవ్వ పేరు మీద పట్టా మారి్పడి చేయించాడు. ఆపై తన ప్లాన్కు వరుసకు తమ్ముడయ్యే తాళ్ల కరుణాకర్కు చెప్పాడు. వెంకటేశ్ గతంలోనే తాళ్ల కరుణాకర్కు రూ.1.30 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే కరుణాకర్ పౌల్ట్రీఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయాడు. తన అత్త హత్యకు సహకరిస్తే అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదని, వచ్చే ఇన్సూరెన్స్లో ఇద్దరం చెరి సగం పంచుకుందామని వెంకటేశ్ కరుణాకర్ను ఒప్పించాడు. ప్లాన్లో భాగంగానే ఈ నెల 7న కారు తీసుకొని రావాలంటూ వెంకటేశ్ కరుణాకర్కు ఫోన్ చేశా డు. ఇదే సమయంలో విద్యుత్ అధికారులు వస్తున్నారని నీ సంతకం కావాలని చెప్పి వెంకటేశ్ తన అత్త రామవ్వను ఎక్స్ఎల్ వాహనంపై పెద్దమాసాన్పల్లి శివారులోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకొచ్చాడు. కరుణాకర్ సిద్దిపేటలోని కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చే వారి వద్దకు వెళ్లి ఓ తార్ జీపు (టీఎస్ 18జీ 2277)ను అద్దెకు తీసుకున్నాడు. నంబర్ ప్లేట్ కనిపించకుండా టీఆర్ పేపర్ అతికించి పెద్దమాసాన్పల్లి శివారుకు వచ్చాడు. రోడ్డుపైన రామవ్వను ఉంచి వెంకటేశ్ పొలంలోకి వెళ్లాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం...రామవ్వను జీపుతో కరుణాకర్ ఢీకొట్టాడు. ఆపై కొద్ది దూరం వెళ్లాక వెంకటేశ్కు వాట్సాప్ కాల్ చేసి మీ అత్తను చంపిన వెళ్లి చూసుకో అన్నాడు. అనంతరం జీపునకు టీఆర్ పేపర్ తీసేసి దానిని సిద్దిపేటలో ఇచ్చేశాడు. సాంకేతిక సాయంతో పోలీసులు వెంకటేశ్ను అదుపులోకి తీసు కొని విచారించగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే తన అత్త ను చంపించినట్టు ఒప్పుకున్నాడు. ఆధారాలు దొరక్కుండా చేసేందుకు వారు దృశ్యం సినిమా చూశారని పోలీసు లు తెలిపారు. నార్మల్ ఫోన్ కాల్ చేస్తే పోలీసులకు దొరికే ప్రమాదముందని నిందితులిద్దరూ వాట్సాప్ కాల్స్ మా ట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. వెంకటేశ్, కరుణాకర్లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన తార్ జీప్ ఎక్స్ఎల్ వాహనాన్ని స్వా«దీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో కేసును ఛేదించిన తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంతరావు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డు అందజేశారు. -
కోల్కతా ‘అత్యాచారం’ కేసులో ట్విస్ట్
కోల్కతా: వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ఐఐఎంలో అత్యాచారం కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం అయిన వేళ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే ఆమె తండ్రి అత్యాచారం జరగలేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. తన కూతురిపై అసలు అత్యాచారం జరగలేదని, ఆటోలోంచి పడిపోతే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అది కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని అత్యాచారం వార్తలను కొట్టిపారేశారు. దీనిపై శుక్రవారం రాత్రి తనపై అత్యాచారం జరిగిందనే బాధితురాలు ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తండ్రి ఈరోజు(శనివారం. జూలై 12) తన కూతురిపై అత్యాచారం జరగలేదంటూ వెల్లడించారు. ‘ ‘నిన్న రాత్రి మాకు ఫోన్ వచ్చింది. ఆటో రిక్షా నుంచి పడిపోయిందని ఆమె ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ను ట్రేస్ అవుట్ చేసి లొకేషన్ గుర్తించాం. పోలీసులే ఆమెను ఎస్ఎస్కేమ్ న్యూరాలజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. నా కూతురు తనపై అత్యచారం జరగలేదని నాకు చెప్పింది. పోలీసులు మాత్రం దీనిపై కేసు నమోదు చేసి ఇప్పటికే ఒకర్ని అరెస్ట్ చేశామని చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తికి ఈ ఘటనతో ఏం సంబంధం లేదు’ అని తెలిపారు.ఈ కేసుకు సంబంధించి ఐఐఎమ్ క్యాంపస్ బాయ్స్ హాస్టల్లో అత్యాచారం జరిగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. బాధితురాలి తండ్రి తాజాగా ముందుకు అది అత్యాచారం కాదని, కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. -
అందుకే అలా చేశా.. నన్ను ఉరి తీయండి: రాధికా తండ్రి
టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన కుమార్తెను హత్య చేసినందుకు ఆమె తండ్రి దీపక్ యాదవ్ కుమిలిపోతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనను ఉరి తీయాలంటూ.. రాధికా యాదవ్ తండ్రి పశ్చాత్తాపం పడినట్లు దీపక్ యాదవ్ సోదరుడు చెప్పుకొచ్చారు. ఆవేశంలో హత్య చేశానని.. తనను ఉరి తీయాలని పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.ఈ కేసులో తండ్రి దీపక్ యాదవ్కు గురుగ్రామ్ కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన్ను కోర్టు నుంచి జైలుకు తరలించారు. రాధికా యాదవ్ను ఆమె తండ్రే హత్య చేశాడు. కిచెన్లో వంట పని చేస్తున్న రాధికా యాదవ్ను వెనుక నుంచి వెళ్లి తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల బుల్లెట్లు ఒంట్లోంచి దూసుకెళ్లడంతో రాధిక అక్కడికక్కడే మృతి చెందింది.రాధికా యాదవ్ సొంతంగా టెన్నిస్ అకాడమీ నడుపుతుండటంతో ఇరుగుపొరుగు తనను కుమార్తె సంపాదనతో బతుకుతున్నావని హేళన చేస్తున్నారని, దాంతో అకాడమీని మూసివేయమని ఎంత చెప్పినా తన కుమార్తె వినిపించుకోలేదని.. అందుకే ఆమెను హత్య చేశానంటూ పోలీసుల విచారణలో దీపక్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, రాధిక ఇన్స్టాలో పెట్టిన ఓ రీల్ కూడా హత్యకు కారణమంటూ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.కాగా, రాధికా యాదవ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్లలో ఒకరైన అజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్లు, వాయిస్ చాట్లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్ యాదవ్ జాతీయ మీడియాకు తెలిపారు.ఇదీ చదవండి: రాధిక వాట్సాప్ చాట్లో సంచలన విషయాలు..! -
రాధిక వాట్సాప్ చాట్లో సంచలన విషయాలు..!
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో కన్న తండ్రి దీపక్ యాదవ్ చేతిలో దారుణ హత్యకు గురైన టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్లలో ఒకరైన అజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్లు, వాయిస్ చాట్లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్ యాదవ్ ఎన్డీటీవీకి స్పష్టం చేశారు. ఆంక్షలు భరించలేకపోతున్నా.. !తాను ఇంట్లో ఆంక్షలను భరించలేకపోతున్నానని, ప్రతీ దానికి వివరణ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాధికా తనతో వాట్పాప్ చాట్లో తెలిపిందన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్డోబర్, నవంబర్, డిసెంబర్లలో ఇంటికి దూరంగా వెళ్లిపోవాలనుకుందని, అందుకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుందన్నారు. తాను తొలుత చైనా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఫుడ్ తనకు సరిపడదనే విషయంతో ఆగిపోయిందన్నారు. దుబాయ్, ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక నాలుగు నెలల పాటు ఒంటిరిగా ఉండాలని, లైఫ్ను ఎంజాయన్ చేయాలని ఆమె పేర్కొన్నట్లు అజయ్ స్పష్టం చేశారు. తనకు ఏవో కొన్ని లక్ష్యాలున్నాయని, దాని కోసం తండ్రి దీపక్ యాదవ్కు చెబితే కనీసం వినడం కూడా చేయడం లేదని ఆమె మెసేజ్లో వాపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..!మరో కోచ్ అంకిత్ పటేల్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. అసలు అండ్రీ-కూతుళ్ల మధ్య ఇంతటి వివాదం దాగి ఉందనే విషయం ఎప్పుడూ తమకు తెలియదన్నారు. ‘ నాకు రాధికా యాదవ్ 11-12 ఏళ్ల నుంచే తెలుసు. అలాగే ఆమె తండ్రి కూడా బాగా తెలుసు. ఆమె టెన్నిస్ ప్రాక్టీస్కు సంబంధించి తండ్రీ-కూతుళ్ల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. తండ్రి ఎప్పుడూ ఆమె సపోర్ట్గా నిలిచేవారు. ఆమె ఎక్కడ టెన్నిస్ మ్యాచ్ ఆడటానికి వెళ్లినా వెంటే ఉండి అన్నీ చూసుకునే వారు. రాదికా ఎప్పుడూ ఒంటిరగా ఉండటాన్ని కానీ వేరే వాళ్లతో ఉండటం కానీ నేను చూడలేదు. టెన్నిస్ ఆటకు సంబంధించి వీరి మధ్య గొడవలున్నాయనేది వాస్తవం కాదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరి తెలుసు’ అని సదరు కోచ్ అంకిత్ పటేల్ తెలిపారు.ఇదీ చదవండి:ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు..! -
సిద్ధిపేటలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపి..
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ అల్లుడు.. తన అత్తనే చంపించేశాడు.. ఈ నెల జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్.. రూ. లక్షా 50 వేలు సుపారీ ఇచ్చి.. కారుతో ఢీకొట్టించి అత్తను హత్య చేయించాడు. తోగుట మండలం తుక్కాపూర్ దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను హత్య చేయించిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా అల్లుడి బాగోతం బయటపడింది. వెంకటేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య చేసినట్టు అల్లుడు వెంకటేష్ తన నేరాన్ని అంగీకరించాడు. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు వెంకటేష్.. ముందుగానే పోస్టాఫీసు ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, రైతు బీమా చేయించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.పౌల్ట్రీ ఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్.. నష్టాల నుంచి బయటపడేందుకు అత్త హత్యకు ప్లాన్ చేశాడు. అత్త పేరుపై రూ.60 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసిన అల్లుడు.. పొలం పని ఉందని చెప్పి..అత్తను తీసుకెళ్లాడు. దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించాడు. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. -
ఒక్క మార్కుతో ఓటమి.. అయినా ఆగని కలల ప్రయాణం
ఒక్క మార్కుతోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికవలేదని కుంగిపోలేదా యువతి.. చదువు, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు.. తండ్రికి సాయంగా మేకలు కాసేందుకు రోజూ అడవిబాట పడుతోంది. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామానికి చెందిన నూనె నర్సయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. చదువుల్లో రాణిస్తూనే కూతురు కల్యాణి తండ్రికి సాయంగా మేకలతో ఊరి పొలిమేరల్లోని గుట్టల్లోకి వెళ్తోంది. ఆర్మీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని, ఈసారి ఉద్యోగం తనదేనని ధీమాగా చెప్పింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ట్రాక్టర్పై సీతక్క ప్రయాణం ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఎలిశెట్టిపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించింది. కానీ ఎలిశెట్టిపల్లి గ్రామానికి రోడ్డు మార్గం లేదు. దీంతో పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి.. మంత్రి సీతక్క ట్రాక్టర్పై కూర్చొని జంపన్నవాగు దాటి వెళ్లారు. ఈ వాగుపై వంతెన నిర్మించాలని అక్కడి ప్రజలు మంత్రిని వేడుకున్నారు. వంతెన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. -
జనం కళ్ల ముందే వ్యక్తి దారుణ హత్య
ఉదయగిరి(నెల్లూరు): ఉదయగిరిలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న ఆల్ఖైర్ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి జనం చూస్తుండగానే ఓ దారుణ హత్య జరిగింది. కల్యాణ మండపం ఆర్థిక లావాదేవీల విషయంలో బావ, బావమర్ధుల మధ్య నెలకొన్న విభేదాలే ఈ హత్యకు కారణంగా మారింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. ఉదయగిరికి చెందిన హానిఫ్, కొండాపురం మండలం గరిమెనపెంటకు చెందిన హమీద్ (38) (హతుడు) పెద్దమ్మ కూతురును వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న హామీద్ ఉదయగిరిలో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో హానిఫ్, అతని సోదరుడు ఉమర్తో కలిసి హమీద్ ఫంక్షన్ హాల్ నిర్మించారు. కొన్నేళ్ల పాటు అందరూ కలిసి సజావుగానే నిర్వహించారు. ఈ క్రమంలో ఏడాది క్రితం నుంచి హమీద్కు తన బావమర్ధులు ఉమర్, హానిఫ్తో ఆర్థిక పరమైన వివాదాలు తలెత్తాయి. ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు పలుమార్లు పంచాయితీ నిర్వహించారు. కానీ వివాదం పరిష్కారం కాలేదు. దీంతో హమీద్ తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఈ విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు కొద్ది రోజులుగా సొంతూరు గరిమనపెంటలో ఉంటున్నాడు. అయితే ఫంక్షన్ హాల్ను నిర్వహించేందుకు పోలీసులను మధ్యవర్తులుగా పెట్టుకుని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్తి వివాదమై కోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. శనివారం ఫంక్షన్ హాల్లో ఓ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలుసుకున్న హమీద్ శుక్రవారం సాయంత్రం ఉదయగిరికి వచ్చి తన స్నేహితులతో కలిసి ఫంక్షన్ హాల్కు తాళం వేశాడు. ఈ విషయం తెలుసుకున్న హానిఫ్, ఉమర్ కత్తి, ఇనుపరాడ్తో ఫంక్షన్ హాల్ చేరుకున్నారు. లోపలికి పరిగెత్తూ కుంటూ వెళ్లి ఒక్కసారిగా దాడి చేసి రాడ్, కత్తితో దారుణంగా హత్య చేశారు. దీంతో హమీద్ వెంట ఉన్న మిత్రులు భయభ్రాంతులతో పరుగులు తీశారు. అందులో ఒక యువకుడు ఈ హత్యను తన సెల్లో చిత్రీకరించారు. ఈ దారుణ హత్యతో ఉదయగిరి ఒక్కసారిగా ఉలికిపడింది. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూడ్కాల్స్ స్క్రీన్ షాట్లు పంపి..
హైదరాబాద్: న్యూడ్ కాల్స్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను చూపి మాజీ భార్యను వేధిస్తున్న వ్యక్తితో పాటు మరో మహిళపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేగంపేట రసూల్పురాకు చెందిన మహిళ (39)కు సయ్యద్ జావేద్ (44)తో 2005లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జావేద్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో బాధితురాలు అతనితో విడాకులు తీసుకుని వేరుగా నివాసం ఉంటుంది. అతడిపై ఆమె పెట్టిన కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉండగా గత నెల 26న సయ్యద్ జావేద్ బాధితురాలికి ఫోన్ చేసి ఆమెతో కలిసి ఉంటానని చెప్పాడు. తరచూ ఆమెతో మాట్లాడేవాడు. బాధితురాలు కూడా జావేద్ను నమ్మి అతనితో మాట్లాడుతుండేది. ఈ క్రమంలో ఆమెతో బలవంతంగా న్యూడ్కాల్స్ మాట్లాడించిన అతను కాల్స్కు సంబంధించి స్క్రీన్షాట్లను సేవ్ చేసి బాధితురాలి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ యువకుడికి పంపాడు. అతను ఈ విషయం బాధితురాలి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె భర్త ఉంటున్న ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న షాబానా అనే మహిళను నిలదీసింది. దీంతో జావేద్పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో స్క్రీన్షాట్లను అందరికీ పంపతామని బెదిరించారు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సయ్యద్ జావేద్తో పాటు షబానాపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!
నెలకు రెంట్ల రూపంలో రూ. 15 నుంచి 17 లక్షల వరకూ ఆదాయం. ఒక లగ్జరీ ఫామ్ హౌస్. ఇంకా పలు రకాలైన ఆస్తులు. విలాసవంతమైన జీవితం. ఆ ఊరిలో శ్రీమంతుడు అనే హోదా. పెద్ద మనిషి అని ఊరి వాళ్లు తగిలించిన బిరుదు. చేతికి ఒక లైసెన్స్డ్ రివాల్వర్. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనిషి అంటే కాసింతైనా ఇలా బ్రతకాలనిపిస్తుంది కదూ. ఇక్కడ ఆ వ్యక్తికి అన్నీ ఉన్నాయి.. సిరి సంపదలతో విలాసవంతమైన జీవితాన్ని కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. దాంతో పాటు కాస్త అహంకారం, మూర్ఖత్వం కూడా ఉన్నట్లు ఉంది. అదే ఇప్పుడు అతని జీవితాన్ని తలకిందులు చేసింది. అహంకారానికి పోయి కూతురి ప్రాణాల్ని తీసి జైలు పాలయ్యాడు. కారణాలు ఏమైనా మూర్ఖత్వానికి పోయి ఎంతో గారాబంగా చూసుకున్న కూతుర్ని చంపడం ఒకటైతే, ప్యాలెస్ లాంటి భవనంలో బ్రతికిన ఆ వ్యక్తి ఇప్పుడు కఠిన శిక్షకు సిద్ధంగా ఉన్నాడు. 49 ఏళ్ల దీపక్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు కన్న కూతురి హత్య కేసులో ఒక్కసారిగా ‘విలన్’ అయిపోయాడు. ఇన్ స్టా రీల్స్ చేసిందని కూతుర్ని చంపేశాడు..!హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సుశాంక్లో ఫేజ్-2లో నివాసముంటున్న దీపక్ యాదవ్.. టెన్నిస్ ప్లేయర్ అయిన కూతురు రాధికా యాదవ్ను హత్య చేశాడు. తన లైసెన్స్డ్ రివాల్సర్తో ఐదు రౌండ్ల కాల్పులు జరిపి కూతురి ప్రాణాలు తీశాడు. కూతురు భవిష్యత్ మరింత ఎదుగుతున్న తరుణంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. కూతురు తనకు నచ్చని సోషల్ మీడియా వీడియో ఒకటి చేసిందని, అందుకే చంపేశానని దీపక్ యాదవ్ అంటున్నాడు. తనకు వద్దని చెప్పినా వినలేదని, ఈ క్రమంలోనే తమ మధ్య గొడవ జరిగి హత్య చేసే వరకూ వెళ్లిందని దీపక్ పోలీసులకు చెప్పుకొచ్చాడు. దీనిపై ప్రస్తుతం పోలీస్ దర్యాప్తు జరుగుతుండగా, అసలు ఏం జరిగిందనే దానిపై మీడియా ఆరా తీసింది. ఈ క్రమంలోనే జాతీయ మీడియా చానెల్ ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగా అసలు హత్యకు ఈ కారణాలు కాకపోవచ్చనేది ఆ కుటుంబంతో పరిచయమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.కూతురంటే అత్యంత గారం..ఈ ఘటనపై దీపక్ సొంత గ్రామం వాజిరాబాద్లో అతనితో పరిచయమున్న ఓ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం.. అసలు కూతుర్ని చంపాల్సిన అవసరం దీపక్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అతనికి ఆస్తు-పాస్తులు అన్నీ ఉన్నాయి. విలాసవంతమైన జీవితం అతనిది. కూతురంటే అత్యంత గారం. కూతురు టెన్నిస్ ప్లేయర్ అవ్వడం కోసం రూ. 2 లక్షల పెట్టి రాకెట్ తీసుకొచ్చాడు. కూతురు ఈ హోదాకు రావడానికి దీపకే కారణం. కూతురు రాధికా యాదవ్ టెన్నిస్ అకాడమీ పెట్టినందుకో, ఇన్ స్టా రీల్స్ చేసినందుకో ఆమెను దీపక్ హత్య చేశాడనేది నమ్మశక్యంగా లేదు. ఇంకేదో కారణం ఉండి ఉండొచ్చు’ అని సదురు గ్రామస్తుడు తెలిపాడు.25 ఏళ్లకే టెన్నిస్ అకాడమీ..టెన్నిస్లో అంచెలంచెలుగా ఎదిగిన రాధికా యాదవ్.. ప్రస్తుతం అంతర్జాతీయ డబుల్స్ ర్యాంకింగ్స్లో 113వ స్థానంలో ఉంది. ఎన్నో పోటీలు ట్రోఫీలు గెలిచి తనకంటూ ఏర్పరుచుకున్న రాధిక.. 25 ఏళ్ల వయసులోనే టెన్నిస్ అకాడమీ కూడా ప్రారంభించింది. ఇందులో ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తుంది రాధికా. గురుగ్రామ్ సెక్టార్ 57లో ఒక టెన్నిస్ ఇన్స్టిట్యూట్ను రాధికా యాదవ్ రన్ చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. టెన్నిస్ ప్లేయర్ను.. హత్య చేసిన తండ్రి! -
ఎన్టీఆర్ జిల్లా: పోస్టాఫీసులో రూ.50 లక్షల గోల్మాల్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది. జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు పోస్టాఫీసు పరిస్థితి. గ్రామానికి చెందిన పలువురు ఖాతాదారులు పొదుపు చేసుకున్న సొమ్ము, డిపాజిట్లను పోస్టుమాస్టరే కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పోస్టల్ శాఖలో పని చేస్తున్న క్రమంలో తన అకౌంట్ స్టేటస్ని చెక్ చేసుకోగా ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము లేకపోవడంతో అనుమానం వచ్చి పోస్టల్శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఉన్నతాధికారులు గురువారం సున్నంపాడు వచ్చి విచారణ చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.22లక్షల వరకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి మాయమైనట్లు తేలినట్లు తెలిసింది. మొత్తం రూ.50 లక్షలకు పైగానే సొమ్మును పోస్టుమాస్టర్ విత్డ్రా చేసినట్లు తెలుస్తోంది. పోస్టాఫీసులో ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. విచారణ కొనసాగుతుండడంతో ఇవాళ లేదా రేపు (శుక్ర,శని) అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. నగదు గోల్మాల్పై డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. -
Ongole: పాపం పసివాడు
చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ టీచర్లపైనే లక్షిత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
విజయవాడలో దారుణం.. ఇంటి ఓనర్ను పని మనిషే..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. ఆర్అండ్బి రిటైర్డ్ ఇంజనీర్ రామారావు అనుమానాస్పదంగా మృతి చెందారు. రామారావు ఇంట్లో కేర్ టేకర్గా పని చేస్తున్న మహిళే ఆయనను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కేర్ టేకర్ అనూషాతో పాటు మరో యువకుడు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. సీసీ కెమెరా ఫుటేజ్ల్లో అనుషతో పాటు మరో యువకుడు కదలికలను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అనూష నులకపేటలోని నివాసానికి వెళ్లినట్లు గుర్తించారు. అనూషతో పాటు మరో యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.నగరంలోని మాచవరం పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. రామారావు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే యువతిని కేర్ టేకర్గా పెట్టుకున్నారు. ఆమె వారితో పాటే.. అదే ఇంట్లో నివాసం ఉంటోంది.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి.. వెంటనే వచ్చి చూడగా మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆయన పడి ఉన్న మంచంపై కారం కూడా చల్లి ఉంది. కళ్లల్లో కారం కొట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు, బీరువా కూడా పగులగొట్టి ఉంది. ఇంటి పని మనిషి కూడా కనిపించకపోవడంతో అనుమానించిన తల్లి.. పక్క ఫ్లాట్ వాళ్లను పిలిచింది.వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి, కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆహారంలో మత్తు మందు కలిపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్లు నిర్థారించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భార్య దారుణ హత్య
కై కలూరు: ఆస్తిని పెద్ద కొడుక్కి రాసివ్వమని అడిగిన భార్యను అంతమొందించాడో భర్త. ఈ ఘటన ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు (50), జయలక్ష్మి (47) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడికి ఇటీవల పెళ్లయింది. ఇద్దరు కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పెద్దిరాజుకు గ్రామంలో 40 సెంట్ల భూమి ఉంది. దీనిని అమ్మకానికి సిద్ధం చేస్తున్నాడు. పెద్ద కుమారుడికి వివాహం జరగడంతో దంపతులు ఇల్లు కట్టుకుంటారని, స్థలం అతడికి రాయాలని జయలక్ష్మి భర్తను కోరింది. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తన కంటే బిడ్డలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పెద్దిరాజు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిద్రపోతున్న జయలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె ఘటనాస్థలిలోనే ప్రాణం విడిచింది. అనంతరం పెద్దిరాజు భయపడి పురుగు మందు తాగి, చాకుతో పీక కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాణాలతో ఉన్న పెద్దిరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలిని రూమ్లో లాక్ చేసి.. ఆపై ప్రియుడు..
ఏ బంధమైనా నమ్మకం మీదే నడుస్తుంది. అది వైవాహిక బంధమైనా, లివింగ్ రిలేషన్ షిప్ బంధమైనా ఉండాల్సింది నమ్మకం. అటువంటి నమ్మకం చెల్లా చెదురై పోతే జీవితాల్లో అలజడి తప్పదు. ఓ జంట విషయంలో అదే జరిగింది. కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి బంధాన్ని ఏడాదికే ముగించేశారు. ఈ జంటలో ఒకరు మృత్యుఒడికి చేరితే, మరొకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఈ ఘటన లివింగ్ రిలేషన్ అనేది ఫ్రెండ్ షిప్ చేసినంత ఈజీ కాదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. అసలు విషయంలోకి వెళితే.. గువాహటిలోని కహిలిపారాలోని కళ్యాణి నగర్లో ఓ లివింగ్ రిలేషస్ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో ప్రియుడు చనిపోతే, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. నవ్జ్యోతి తలుక్దార్- సుస్మితలు ఏడాది కాలంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. దీనిలో భాగంగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏమైంది ఏమో కానీ ఇందులో తలుక్దార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో సుస్మితను వేరే రూమ్లో బంధించి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంటున్నాడనే సమాచారాని పోలీసులకు చేరవేసింది సుస్మిత. పోలీసులు వచ్చే సరికి తలుక్దార్ విగతజీవిలా కనిపించగా, మరో రూమ్లో ఉన్న సుస్మిత.. చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను హుటాహుటీనా స్థానిక హయత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి మధ్య తరుచు జరుగుతున్న ఘర్షణలే దీనికి కారణమని గువాహటికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి తెలిపారువీరిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కొత్తలో బాగానే ఉన్నారని, ఆపై కొంతకాలానికి వీరి మధ్య ఎప్పుడూఆపార్థాలు చోటు చేసుకుని గొడవలు జరిగేవని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. -
‘మల్నాడు’ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు
హైదరాబాద్: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. 9 పబ్లపై కేసులు నమోదు చేసింది ఈగల్ టీమ్.. పబ్ యాజమానులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వచ్చేవారం తమ ఎదుట హాజరుకావాలని పబ్ యాజమానులకు స్పష్టం చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమానులకు సంబంధాలను గుర్తించింది. మూడు పబ్ యజమానులు కలిసి డ్రగ్ పార్టీ నిర్వహించినట్లు ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి యాజమాన్యాలు. ఈ కేసులో కూడా ఫ్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్ పార్టీలు నిర్వహించాయి, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు. పోలీసులు. క్వాక్ పబ్ ఓనర్ రాజా శేఖర, కోరా పబ్ ఓనర్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు మల్నాడు రెస్టారెంట్ సూర్య విచారణలో పేర్కొన్నారు.కాగా, తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ టీంకు కొత్త పేరు పెట్టిన తర్వాత అతిపెద్ద డ్రగ్ రాకెట్ను గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. అతిపెద్ద నెట్వర్క్ ను బట్టబయలు చేశారు.. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ డ్రగ్ రాకెట్ ని నడుపుతున్నట్లు తేలింది. డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామన్నారు. దీనిలో ‘ఈగల్’ టీమ్ను ఏర్పాటు చేశారు. ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్బీ)ను ‘ఈగల్’ గా మార్చారు. ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లయ్ చేసినా దాన్ని ఛేదించే పనిని ఈగల్కు అప్పగించారు. -
14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి
తమిళనాడు: చెంగల్పట్టు సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న ఓ 10వ తరగతి బాలుడు రోజూ సాయంత్రం వేళల్లో ట్యూషన్కు వెళ్లేవాడు. ఈనేపథ్యంలో చెంగల్పట్టులో మెకానిక్గా పనిచేస్తున్న పాండిచ్చేరి వాసి అమితు అబ్దుల్ ఖాదర్ 13.04.2024న ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలుడిని తన ద్విచక్ర వాహనం ఎక్కమని అడిగాడు. అతను ఎక్కనని చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా, అబ్దుల్ ఖాదర్ ఆ బాలుడిని కత్తితో బెదిరించి తన బైకుపై తీసుకెళ్లి తిరుమణి రైల్వే గేట్ సమీపంలోని ఒక పొదలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.నేను పిలిచినప్పుడల్లా రాకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని కూడా బెదిరించాడు. భయంతో ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఈ సందర్భంలో, గత 03.05.2024న, ట్యూషన్ పూర్తి చేసుకుని, రాత్రి 8.30 గంటలకు కాంచీపురం హై రోడ్కు తిరిగి వస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసి, చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ముళ్ల పొదలో బంధించి కత్తితో బెదిరించి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధను భరించలేక, ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో షాక్ కు గురైన ఆ బాలుడి తల్లిదండ్రులు చెంగల్పట్టు నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అమీద్ అబ్దుల్ ఖాదర్పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా, చెంగల్పట్టు పోక్సో కోర్టు ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. బుధవారం ఈ కేసును విచారించిన ప్రభుత్వ న్యాయవాది లక్ష్మి అమీద్ అబ్దుల్ ఖాదర్కి యావజ్జీవ శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
సిరిసిల్ల: ఇక్కడా.. అక్కడా అని ఏమీ లేదు. జిల్లా వ్యాప్తంగా మహిళలు పనిచేసే ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మహిళా ఉద్యోగిణులు సహచరులతో వేధింపులకు గురవుతున్నారు. ప్రభుత్వ శాఖలతోపాటు బీడీలు చేసే చోట, గార్మెంట్రంగంలో పనిచేసే ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారు. అయినా ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. ‘సిరిసిల్ల పట్టణంలోని ఓ ఇంట్లో కరెంట్ పోయింది. విద్యుత్ సరఫరా లేక పోవడంతో ‘సెస్’ సంస్థకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఓ గంటకు ‘సెస్’ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చే సర్వీసు వైరు పాడైపోయిందని, కొత్తది తెచ్చి వేయాలని సదరు ఉద్యోగి చెప్పడంతో ఆ వైరు ఏదో మీరే తెండి. నాకు తెచ్చే వాళ్లు ఎవరూ లేరని ఇంట్లోని మహిళ కోరింది. రూ.2వేలు ఇవ్వడంతో సదరు ‘సెస్’ ఉద్యోగి కొత్త వైరు తెచ్చి బిగించాడు. అతను చేసిన పనిని గౌరవిస్తూ సదరు మహిళ రూ.500 ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ‘సెస్’ ఉద్యోగి డబ్బులు వద్దు కానీ.. తన కోర్క తీర్చాలని ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ మహిళ చేయి పట్టుకున్నట్లు సమాచారం. ఆ మహిళ తిరగబడడంతో విషయం ఎవరికీ చెప్పొద్దు అంటూ ప్రాధేయపడి వెళ్లాడు.’‘అందరూ సార్లు బాగానే ఉన్నారు. కానీ ఆ ఒక్కసారు చూపులే వేరుగా ఉన్నాయి. అందరి దృష్టిలో అతను మంచోడు. కానీ ఆమెతో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు. ఆ సారు మాట్లాడే తీరు.. చూపులు.. తనకు ఇబ్బందిగా ఉన్నాయి. ఏ డ్రెస్లో వచ్చినా విడ్డూరంగా మాట్లాడడం.. ఆఫీస్లో ఎవరూ లేకుంటే చేయి తగిలించడం వంటివి చేస్తున్నాడు. ఇదంతా ఇంట్లో చెబితే పెద్ద గొడవే అవుతుంది. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే పరువుపోతుంది. ఏం చేయాలో తెలియక అతని నుంచి తప్పించుకు తిరుగుతోంది ఓ ఉద్యోగిని.‘అదో మారుమూల పల్లె. వారికి పెద్దగా వ్యవసాయభూమి లేదు. కుటుంబ పోషణకు భర్త గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అప్పులు ఉన్నాయి. ఇ ల్లు గడిచేందుకు ఆమె ఉపాధిహామీ పనికి వెళ్తుంది. తోటి కూలీలతోపాటు పనిచేస్తుంది. కానీ అక్కడే పనిచేసే ఓ యువకుడు ఆమెపై కన్నేశాడు. పనులు ముగించుకుని వస్తుండగా.. ఒంటరిగా ఉన్న ఆమెను సదరు యువకుడు మాటలతోనే వేధించాడు. అయినా అవేమీ పట్టించుకోలేదు. కానీ ఎవరికైనా చెబితే పరువు పోతుంది. ఇంటి వద్ద భర్త లేడు కాబట్టి తననే తప్పు పట్టే ప్రమాదం ఉంది. అత్తమామలకు చెబుదామంటే.. వాళ్లు వృద్ధులు. ఎవరికీ చెప్పుకోలేక ఉపాధిహామీ పనికి వెళ్లలేక ఇంటి వద్దనే సదరు మహిళ కుమిలిపోతుంది.’‘అది జిల్లాలో విద్యుత్ పంపిణీ చేసే సహకార సంస్థ(సెస్) ఆఫీస్. ఆ ఆఫీస్ పరిధిలో పనిచేసే ఓ ఉద్యోగి అనారోగ్యంతో మంచం పట్టారు. అతను ఉద్యోగం చేసేందుకు అన్ఫిట్ కావడంతో ఆ కుటుంబానికి ఉపాధి కల్పనకు సదరు ఉద్యోగి భార్యకు సంస్థలో ఉద్యోగాన్ని కల్పించారు. సదరు మహిళ కింద స్థాయి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే ఆఫీస్లో పనిచేసే ఓ ఉద్యోగి ఆమెను తరచూ వేధించడంతో భరించలేక ఆఫీస్ నుంచి బదిలీ చేయించుకుని మరో చోటికి వెళ్లింది. కానీ సదరు ప్రబుద్ధుడి వేధింపులు ఆగలేదు. మరింత ఎక్కువయ్యాయి. ఉద్యోగం చేయలేక.. వేధింపులు భరించలేక సదరు మహిళా ఉద్యోగి మానసిక వేదనకు గురవుతున్నారు.’మొక్కుబడిగా ఐసీసీ కమిటీలుపనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి 2013లో మహిళా హక్కుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చట్టం తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీస్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ(ఐసీసీ)లను ఏర్పాటు చేసి మహిళల ఆత్మగౌరవం దెబ్బతినకుండా అంతర్గతంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించారు. కానీ జిల్లాలో ఎన్నో పోక్సో కేసులు నమోదవుతున్నా అంతర్గతంగా విచారణలు జరుపుతున్నా ఐసీసీ కమిటీలు మహిళలను వేధిస్తున్న కేసుల్లో మొక్కుబడిగానే పనిచేస్తున్నారు. జిల్లాలో 200లకు పైగా ప్రభుత్వ ఆఫీస్లు, ప్రైవేటు సంస్థల్లో ఐసీసీ కమిటీలను వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 35 ఆఫీస్ల్లో మాత్రమే కమిటీలు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అవీ కూడా మొక్కుబడిగానే పనిచేస్తున్నారు. ఐసీసీ కమిటీల నిర్మాణంమహిళలు పనిచేసే సంస్థలు, సహకార సంఘాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆఫీస్, లేదా సంస్థ సీనియర్ మహిళా ఉద్యోగి చైర్పర్సన్గా, మరో ఇద్దరు ఇందులో ఒక్కరు మహిళ, మరొకరు మహిళ కానీ వ్యక్తులు, లేదా న్యాయశాస్త్రం చట్టాలపై అవగాహన కలిగిన వ్యక్తులు, మరో వ్యక్తి సమాజ సేవకులు సభ్యులుగా ఉంటారు. మహిళల నుంచి ఐసీసీకి ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే అంతర్గతంగా విషయం బయటకు చెప్పకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళకు ఫిర్యాదు చేసినట్లు రశీదు ఇవ్వాల్సి ఉంటుంది.ఐసీసీ సిపార్సుల మేరకు..నేరం తీవ్రతను బట్టి వేధించిన వ్యక్తిని బదిలీ చే యడం, ఉద్యోగం నుంచి తొలగించడం, హెచ్చరించి వదిలేయడం, ప్రమోషన్ నిలుపుదల చేయడం, జరిమానా విధించడం, బాధితురాలికి ఇప్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 90 రోజుల్లో శిక్ష విధించాలి. విచారణ నివేదికను కలెక్టర్ లేదా జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారికి అందించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఐసీసీ కమిటీ నిర్మాణం, సిపార్సులు పెద్దగా లేవు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో షీటీమ్లు విద్యాసంస్థల్లో, బస్టాండుల్లో, ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలో పూర్తి స్థాయిలో ఐసీసీ కమిటీలను నియమించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.చర్యలు తీసుకుంటున్నాంజిల్లాలో ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేశాం. ఫిర్యాదులు రాగానే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఇవి బహిర్గతం చేయకూడదు కాబట్టి ప్రచారం చేయడం లేదు. ఇప్పుడు ఆన్లైన్లోనూ మెయిల్స్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించే అవకాశం ఉంది. ‘షీ బాక్స్’ అనే కొత్త ఆన్లైన్ ఫిర్యాదులను ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండు గ్రూపులుగా ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ‘షీ బాక్స్’కు ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే నేరుగా మాకు చేరుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం.– లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారిఇలా చేస్తే ఫిర్యాదు చేయండిభౌతికంగా శరీరాన్ని తాకడం.శారీరకంగా కలవాలని అభ్యర్థించడం, బలవంతపెట్టడం.అసభ్య సంభాషణలు, కామెంట్లు, చేష్టలతో ఇబ్బంది పెట్టడం.మానసికంగా బాధ కలిగించేలా మాట్లాడడం, అసభ్యంగా వర్ణించడం.నిస్సహాయురాలిని చేసి ప్రవర్తించడం. అవాంఛనీయంగా, అనైతికంగా బలవంతం చేయడం.ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడడం. దుఃఖం, బాధ కలిగించేలా ప్రవర్తించడం. ఆడవాళ్ల వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించడం, సలహాలివ్వడం, కుళ్లుజోకులు వేయ డం, బూతుబొమ్మలు, ఎస్ఎంఎస్లు, వాట్సా ప్లు, ఈమెయిల్స్, భయపెట్టేలా బ్లాక్ మెయి ల్ చేయడం. మహిళా సిబ్బందికి సముచిత గౌరవం లేకుండా ప్రవర్తించడం, ఆడవారి రూపాన్ని, వేషభాషల్ని గురించి కామెంట్ చేయడం కూడా వేధింపుల కిందకే వస్తాయి. -
నైట్ డ్యూటీకి వెళ్లి.. మిస్టరీగా నర్స్ మృతి
అనంతపురం: నగరంలోని సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు దివ్య (22) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన వడ్డె దివ్య.. మూడేళ్లుగా సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రికి చెందిన హాస్టల్లోనే ఉంటున్నారు. ఆరోగ్యం బాగోలేదని మంగళవారం రాత్రి తోటి నర్సులకు తెలిపి ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రించారు. బుధవారం మధ్యాహ్నమైనా ఆమె లేవలేదు. మధ్యాహ్నం షిఫ్ట్ నర్సులు వచ్చి పలుకరించినా స్పందన లేకపోవడంతో పల్స్ పరిశీలించారు. నాడి చిన్నగా కొట్టుకుంటుండడంతో వెంటనే సవేరా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, దివ్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లి..
మల్కాజ్గిరి జిల్లా: భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి, ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యతి్నంచి కటకటాలపాలైంది. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరి«ధిలో జరిగింది. హత్య వివరాలను బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలి్పన మేరకు..ముషిరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తుండగా, శారద జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుడ్ని తండ్రిగా గుర్తించి..తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతకోసి చంపారని శారద పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ముగ్గురూ కలిసి ... లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లింగం కోపగించి..అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహ్మద్ జావీద్ సహకరించారు. ఈమేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు.కల్లులో నిద్ర మాత్రలు కలిపి... లింగంకు కల్లు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ నెల 5న శారదకు టాబ్లెట్లు అందించాడు. లింగం కల్లు తాగి ఇంట్లో పడుకోగా.. విషయాన్ని శారద..కుమార్తె మనీషా, జావీద్లకు సమాచారం ఇచి్చంది. మనీషా సమీపంలోని వైన్స్లో మద్యం కొనుగోలు చేసి వచి్చ..మరోసారి లింగంకు తాగించారు. అనంతరం శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్లు చేతులు కట్టేసిన జావీద్..అతడి ముఖంపై దిండుతో అదిమి..పిడికిలితో గుండెపై మోది, గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు. సినిమాకు వెళ్లి..క్యాబ్లో శవాన్ని తరలించి.. హత్య అనంతరం ముగ్గురు జావీద్ ఉండే ఇంటికి బైక్పై వెళ్లి.. అటునుంచి సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఎదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఎదులాబాద్లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా..జావీద్ బైక్పై వెనుక అనుసరించి.. శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యుల పైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
KPHB: కల్తీ కల్లు ఘటనలో ఐదుకి చేరిన మృతులు
హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలో కలకలం రేపిన కల్తీ కల్లు మహమ్మారి ఊహించని విషాదంగా మారింది. కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది. కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి మొత్తంగా 31మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో పలువురు నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తొలుత దీని ప్రభావం సాధారణంగానే భావించినా అనూహ్యంగా మృతులు, బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆ 8 మంది ఇక లేనట్లే!
సాక్షి, సంగారెడ్డి: సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు తక్షణ పరిహారం అందించారు. వారు మరణించి ఉంటారని ప్రకటించిన అధికారులు.. అదే సమయంలో వాళ్ల అవశేషాల కోసం సహాయక చర్యలు కొనసాగుతాయని ప్రకటించారు. బుధవారం.. ఇంకా ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సహాయం కింద రూ. 15 లక్షల చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ప్రమాదంలో వాళ్లు పూర్తిగా కాలి బూడిదై ఉంటారని, అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలని, ఆచూకీకి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే చెబుతామని, అప్పటి వరకు బాధిత కుటుంబాలు స్వస్థలాలకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి ఫార్మా కంపెనీలో జూన్ 30న జరిగిన ఘోర పేలుడు ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 44 మంది మరణించారు. గాయపడిన 34 మందిలో 14 మంది డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతున్న వాళ్లలో కొందరు ఇంకా వెంటిలేటర్పైనే చికిత్స పొందుతున్నారు. అయితే.. ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్లు పూర్తిగా కాలి బూడిదైపోయి ఉంటారని భావిస్తున్నారు. పేలుడు సమయంలో వాళ్ల శరీరాలు పూర్తిగా కాలిపోయి ఉండవచ్చని, వారి శరీర అవశేషాలు గుర్తించటం చాలా కష్టమని భావిస్తున్నారు. అయినప్పటికీ అవశేషాల గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యం ప్రతి మృతుడి కుటుంబానికి ₹1 కోటి, గాయపడిన వారికి ₹10 లక్షలు పరిహారం ప్రకటించింది. -
దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోషం..!
జనగామ జిల్లా: అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ తోబుట్టువులే. తమ తల్లిని చంపాడన్న పగతో ఉన్న ఆ ఇద్దరూ భర్తను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం పిట్టలోనిగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్యకు చొక్కమ్మ, గౌరమ్మలిద్దరూ భార్యలు. మే 18న కనకయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయిని (చొక్కమ్మ, గౌరమ్మల తల్లి) మామిడి తోటలో ఉండగా తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు. తెల్లవారుజామున విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటినుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిట్టలోనిగూడెం వచి్చన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మలు.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామంలో నుంచి కొద్ది దూరం తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ చెప్పారు. పీడ విరగడైంది..: నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు. -
శ్మశానంలో చంపి.. నదిలో శవాన్ని పారేసి..
రాయచూరు రూరల్(కర్ణాటక): నటుడు దర్శన్ గ్యాంగ్ చేతిలో రేణుక స్వామి హత్య కేసు మాదిరిగా రాష్ట్రంలో అలాంటిదే మరో హత్య కలబుర్గిలో జరిగింది. రేణుక స్వామి హత్య షెడ్డులో జరగగా, ఈ కేసులో రాఘవేంద్ర నాయక్ను గురురాజ్, అశ్విని, లక్ష్మీకాంత రావులు కలిసి శ్మశానంలో చంపి రాయచూరు సమీపంలోని కృష్ణా నదిలో మృతదేహాన్ని పడేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కలబుర్గిలో మంగళవారం విలేకరుల సమావేశంలో పోలీసు అధికారులు వెల్లడించారు. అశ్విని, రాఘవేంద్ర నాయక్ మొదటి నుంచి స్నేహితులు. అశ్విని మరొకరితో స్నేహం చేయడంతో రాఘవేంద్ర నాయక్ కస్సుబుస్సుమనేవాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవ పడ్డారు. ఆమెను వదిలి పెట్టని రాఘవేంద్ర నాయక్ మొబైల్లో అశ్వినికి అశ్లీల సందేశాలు పంపడం, చిత్రహింసలు పెట్టడం చేశాడు. దీనిని సహించలేక గురురాజ్ అనే మిత్రుడికి ఆమె విషయం తెలిపింది. రాఘవేంద్ర నాయక్ను తుదముట్టడించడానికి ప్రణాళిక రచించారు. అతనిని కారులో కిడ్నాప్ చేసి కలబుర్గి కృష్ణానగర్ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లారు. మర్మాంగాన్ని కోసి హత్య అతడిపై మారణాయుధాలతో దాడి చేసి మర్మాంగాన్ని కోసి హత్య చేశారు. సాక్ష్యం లభించరాదని భావించి రాయచూరు తాలూకా శక్తినగర సమీపంలో కృష్ణా నది వంతెన పైనుంచి నదిలోకి పారేసి చేతులు దులుపుకున్నారు. రాఘవేంద్ర నాయక్ కారవార నుంచి వచ్చి కలబుర్గిలో సురేఖను పెళ్లి చేసుకొని అక్కడే గణేష్ నగర్లో నివాసం ఉన్నారు. సూపర్ మార్కెట్ వద్ద హోటల్లో పని చేస్తున్న రాఘవేంద్ర నాయక్ను మార్చి 12న కిడ్నాప్ చేసి హత్య చేశారు. 14వ తేదీన మృతదేహం లభించింది. ఈ విషయంలో భర్త రెండు నెలలు గడిచినా ఇంటికి రాకపోవడంతో ఆమె మే 25న స్టేషన్ బజార్ పోలీçస్ స్టేషన్లో తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో రాఘవేంద్ర నాయక్ తనకు భార్య ఉన్నా మరొకరితో అనైతిక సంబంధం పెట్టుకోవడంతో అది వికటించగా, అశి్వనికి అశ్లీల సందేశాలు పంపడం, చిత్రహింసలు పెట్టడంతో తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని తెలిపారు. -
దెయ్యం విడిపిస్తానని.. ప్రాణం తీసింది
కర్ణాటక: దెయ్యం పట్టిందని తీవ్రంగా హింసించడంతో ఓ మహిళ మరణించిన ఘటన జిల్లాలోని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు సమీపంలోని జంబరగట్టె గ్రామంలో జరిగింది. మృతురాలు గీతమ్మ (55). వివరాలు.. ఆదివారం సాయంత్రం మృతురాలు గీతమ్మ అసహజంగా ప్రవర్తించింది. ఆమె కుమారుడు సంజయ్ అదే గ్రామానికి చెందిన నిందితురాలు ఆశ (45)ను ఇంటికి పిలిపించాడు. గీతమ్మకు దెయ్యం పట్టిందని, విడిపిస్తానని ఆశా చెప్పింది. ఆశా తనకు చౌడమ్మ దేవి పూనిందంటూ గీతమ్మకు పట్టిన దెయ్యం వదిలిపో అంటూ చర్నాకోలు తీసుకుని కొట్టడం ప్రారంభించింది. రాత్రి 9.30 గంటలకు ఇంటి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న హళేజంబర ఘట్టె చౌడమ్మ గుడి వరకు ఇలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లింది. అయినా దెయ్యం వదిలిపోలేదంటూ తెల్లవారుజామున 2.30 గంటల వరకు చితకబాదుతూనే ఉంది. దాడితో తీవ్రంగా అస్వస్థురాలైన గీతమ్మ కుప్పకూలింది. దయ్యం వదలడం ఏమో గానీ ఆమె ప్రాణం వదిలిపోయింది. ఆమె స్పృహ తప్పి పడిపోయిందనుకున్న ఆశ.. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పి వెళ్లిపోయింది. కళ్లు తెరవకపోవడంతో కొడుకు గీతమ్మను హొళెహొన్నూరులోని సముదాయ ఆస్పత్రికి తరలించగా చనిపోయిందని వైద్యులు తెలిపారు. గీతమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కాగా గీతమ్మపై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆశను అరెస్టు చేశారు. -
జీవితంపై విరక్తితో నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు..!
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడిగినేని చైతన్య (35) సాఫ్ట్వేర్ ఉద్యోగి. గత ఏప్రిల్ 23న నాగ మౌనికతో వివాహమైంది. ఈ దంపతులు కేపీహెచ్బీ, 7వ ఫేజ్లోని ఎల్ఐజీ–43లో నివాసం ఉంటున్నారు. ఆషాఢ మాసం నేపథ్యంలో జూన్ 21న నాగ మౌనిక పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ప్రతిరోజూ ఆమె ఫోన్లో భర్తతో మాట్లాడుతూ ఉండేది. సోమవారం రాత్రి 10 గంటలకు ఫోన్లో అతనితో మాట్లాడింది. అప్పటికే తన భర్త దిగులుగా మాట్లాడటంతో కొద్ది సేపటి తర్వాత ఫోన్ కట్ అయింది. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో చైతన్యకు ఫోన్ చేయగా ఎత్తలేదు. పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవంతో వెంటనే తన మామకి సమాచారం అందించింది. వెంటనే కింది అంతస్తులోకి వెళ్లి చైతన్యను పిలవగా ఎంతకీ స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. చైతన్య సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే విషయాన్ని మౌనికకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన భర్త జీవితం పట్ల విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్బీ పోలీసులు చెప్పారు. -
జైలు నుంచే స్కెచ్ గీసి.. గోపాల్ ఖేమ్కా కేసులో షాకింగ్ విషయాలు
ఎన్నికల వేళ.. బీహార్లో రాజకీయంగానూ కలకలం రేపిన గోపాల్ ఖేమ్కా హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు వికాస్ అలియాస్ రాజా పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరోవైపు.. గోపాల్ హత్యకు జైలు నుంచే కుట్ర జరిగిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందక్కడ. గోపాల్ ఖేమ్కా హత్య (Businessman Murder in Bihar) కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం.. కీలక నిందితుడైన వికాస్ (ఆయుధం సరఫరా చేసింది ఇతనే) కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే పాట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా.. పోలీసులను చూసి కాల్పులు జరిపాడతను. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో నిందితుడికి సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.గోపాల్ ఖేమ్కా.. బీహార్లోనే అతి పురాతన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటైన మగధ హాస్పిటల్ యజమాని. పాట్నా గాంధీ మైదాన్ పీఎస్ పరిధిలోని రాంగులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హోటల్ నుంచి బయటకు వస్తుండగా నిందితులు బైక్ మీద వచ్చి అతి సమీపం నుంచి గోపాల్పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారాయన. 2018లో ఆయన తనయుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇదే తరహాలో బైకర్ల కాల్పులలో మరణించడం గమనార్హం. అయితే ఆ కేసులో నిందితులను ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేకపోయారు.గోపాల్ ఖేమ్కా కేసులో.. అశోక్ కుమార్ సాఫ్ అనే వ్యాపారవేత్త ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కోసం సుపారీ గ్యాంగ్కు 3.5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉమేష్యాదవ్ అనే షూటర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. గోపాల్ అంత్యక్రియలకు హాజరైన రోషన్ కుమార్ అనే మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఇక వికాస్ ఎన్కౌంటర్లో మరణించాడు. పాట్నాలోని బీర్ సెంట్రల్ జైలు నుంచే గోపాల్ ఖేమ్కా హత్యకు కుట్ర జరిగినట్లు భావిస్తున్నామని బీహార్ డీజీపీ వినయ్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే జైలు నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. జైల్లోని నిందితులు.. బయట ఉన్నవాళ్ల సాయంతో ప్లాన్ అమలు చేశారని అన్నారాయన. ఈ సంచలన కేసుకు సంబంధించిన మిగతా వివరాలను మీడియా సమక్షంలో వెల్లడిస్తామని స్థానికంగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.గోపాల్ ఖేమ్కాకు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నీతీశ్కుమార్ పాలనలో బిహార్ నేర రాజధానిగా మారిందని లోక్సభలో విపక్ష నేత, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు. -
తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా తల్లీ!
కరీంనగర్: బతకడం కన్నా... చావడమే చాలా తక్కువ బాధ.. అంటూ వేములవాడకు చెందిన రోహిత్(24) రాసిన సూసైడ్నోట్ కంటతడి పెట్టిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డకు చెందిన దీటి వేణుగోపాల్–రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు రోహిత్ శనివారం అర్ధరాత్రి దాటాక ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు చూడడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇటీవల రోహిత్ బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రోహిత్ మరణం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తండ్రి గోపాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.సూసైడ్నోట్లో ఇలా..నా జీవితంలో గొప్ప సూసైడ్ లేఖ రాయాలన్న కోరిక నెరవేరింది. బతకడం కన్నా చావడం తక్కువ బాధగా అనిపిస్తోంది. చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఇది నా విధి కావచ్చు. ఇక జన్మలు వద్దు. నా శరీరాన్ని కాశీ ఘాటులో దహనం చేయండి. నా కోరికలు నెరవేరినవే.. కానీ కలలు కాదు. నా జీవితం తట్టుకోలేనిది అయిపోయింది. మానవ సంబంధాలు కొన్ని పవిత్రం, మరికొన్ని బాధతో నిండినవే. నేను ఇక జన్మించనక్కర్లేదు. అంటూ ఆ యువకుడు డాక్టర్ డి.ఆర్. అని తన సూసైడ్నోట్లో రాశాడు. -
ప్రియురాలిపై దాడి చేసి అనంతరం యువకుడు ఆత్మహత్యాయత్నం
-
యువతి అనుమానాస్పద మృతి.. యువకుడి పరిస్థితి విషమం!
బండ్లగూడ: సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి-యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామచంద్రాపురం పీఎస్ పరిధిలోని బండ్లడూడ బాలాజీ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో యువతి మృతిచెందగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరూ ప్రేమించుకుని ఆత్మహత్యాయత్నం చేశారా? అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనలో రమ్య అనే యువతి మృతిచెందగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. డిగ్రీ చదువుతున్న రమ్య అనే యువతితో ప్రవీణ్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు. ఈ కారణంగానే ఇరువురు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం .అయితే యువతి గొంతుపై కత్తి గాట్లతో రక్తపు మడుగులో పడి ఉంది. ఇక ఆమె పక్కనే పడి ఉన్న ప్రవీణ్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ యువతి మెడపై కత్తి నాట్లు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారా? లేక యువతిపై ప్రవీణ్ దాడి చేసి ఆపై ఆత్మహత్యకు యత్నించాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దర్శన్ కేసు స్ఫూర్తితో..! కర్ణాటకలో మరో దారుణం
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తన గర్ల్ఫ్రెండ్కు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుశాల్ అనే కుర్రాడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే తర్వాత ఇద్దరికీ బ్రేకప్ కాగా, ఆ యువతి మరో యువకుడితో రిలేషన్ మొదలుపెట్టింది. ఇది భరించలేని కుశాల్.. సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో రగలిపోయిన సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి కుశాల్పై దాడికి పాల్పడ్డాడు. అయితే.. కుశాల్ను కిడ్నాప్ చేసి.. ఓ బహిరంగ ప్రదేశంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. పది మంది అతన్ని చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో తన్నారు. బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. దాడి సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉంది. దాడికి పాల్పడిన టైంలో ఆ గ్యాంగ్ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెచ్చి మరీ కుశాల్పై దాడికి పాల్పడింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్ను చితకబాదారు. ఇది కూడా ఆ కేసులాగే ముగుస్తుందంటూ హెచ్చరించారు కూడా. జూన్ 30వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కన్నడనాట చాలెంజింగ్ స్టార్గా పేరున్న దర్శన్ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించి.. అత్యంత దారుణంగా హింసించి చంపాడని తెలిసిందే. ఈ ఉదంతం కర్ణాటకను మాత్రమే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. -
విశాఖ: సంచలన కేసు.. కూటమి నేతలకు లింకులు?
సాక్షి, విశాఖపట్నం: నగరంలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. అరెస్టుల సంఖ్య పెరగడంతో పాటు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఈ కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నట్లు, వాళ్లను తప్పించే ప్రయత్నాలు జరిగిపోయాయని సమాచారం.ప్రశాంత నగరంగా పేరున్న విశాఖ.. ఏడాది కాలంగా నేరాలకు అడ్డాగా మారిపోయింది. ఎన్నడూ లేనివిధంగా తాజాగా డ్రగ్స్ కేసు బయటపడింది. అయితే ఈ విచారణలో తీగ లాగితే లింకులు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తొలుత త్రీటౌన్ పోలీసులు ప్రకటించారు. అయితే శనివారం నాటికి అందులో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు చూపించారు. అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా, సౌతాఫ్రికాకు చెందిన థామస్ను అరెస్టు చేసినట్టు తెలిపారు. మిగిలిన ముగ్గురిని అనుమానితులుగా పేర్కొన్న పోలీసులు.. ఆదివారం మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నగరానికి చెందిన డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వర్మ రూ. 65 వేల రూపాయలు తో డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని, ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వెల్లడించారు. అయితే.. ఈ కేసులో కూటమి నేతలకు లింకులు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రగ్స్కేసులో కూటమి నేతల కుమారులు ఉన్నారని సమాచారం. దీంతో కూటమి ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఓ ఎమ్మెల్యే ఫోన్ కాల్తో ముగ్గురిని ఈపాటికే బయటకు పంపించేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
కోరుట్ల: చిన్నమ్మా.. ఎంత పని చేశావమ్మా!
కోరుట్ల: పట్ణణంలో శనివారం రాత్రి హత్యకు గురైన ఆరేళ్ల బాలిక హితాక్షి కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారిని ఆమె చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రస్తుతం కథలాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితురాలు మమతను విచారిస్తున్న పోలీసులు, ఇవాళ.. లేదంటే రేపు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కోరుట్ల ఆదర్శనగర్ పాప హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం హితిక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యం కాగా, ఆమె తండ్రి ఫిర్యాదుతో ఈ ఘోర హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఇంటిపక్కనే బాత్రూమ్లో విగతజీవిగా పాప మృతదేహాం లభించగా.. గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. పలు కోణాల్లో బృందాలుగా పోలీసుల విచారణ చేపట్టి అనుమానంతో పలువురిని ప్రశ్నించారు. ముందుగా మృతదేహం దొరికిన ఇంటి యజమానిని అనుమానించినా.. అతడికి ఈ హత్యతో సంబంధం లేదని నిర్ధారించుకున్నారు. అయితే తోటికోడలు పెత్తనం సహించలేకే మమత ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. హత్యలో ఒక్కరే ఉన్నారా..? మరెవరైనా పాలుపంచుకున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆదర్శనగర్కు చెందిన సోదరులు ఆకుల రాము, లక్ష్మణ్లకు నవీన, మమతతో వివాహమైంది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. రాము, నవీన దంపతులకు కుమారుడు వేదాంశ్, కూతురు హితాక్షి (6) ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. లక్ష్మణ్, మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. నాలుగు నెలల క్రితం మమత ఆన్లైన్లో బెట్టింగ్కు పాల్పడి రూ.18 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. దీనిపై కోరుట్ల పోలీస్స్టేషన్లో సైబర్క్రైం కేసు నమోదైంది. వారి కుటుంబంలో కొద్దికాలంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో నవీనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమెపై మమత ద్వేషం పెంచుకున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం వేదాంశ్, హితాక్షిని స్కూల్కు పంపిన నవీన.. ఆడపడుచుతో కలిసి షాపింగ్కు వెళ్లింది. ఇంట్లో అత్తతోపాటు మమత మాత్రమే ఉంది. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మమత వారితో కలిసి పెద్దపులుల వేషధారణలు చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో తన వెంట కూరగాయలు కోసే కత్తి, మొక్కలు కత్తిరించే కట్టర్ను తీసుకెళ్లినట్లు సమాచారం. సమీపంలోని ఇంటికి గేటు, బాత్రూంకు తలుపు లేకపోవడం.. సదరు ఇంటి యజమానికి ఆ ఏరియాలో కొంత వివాదాస్పదుడిగా పేరు ఉండటంతో ఆ ఇంటిని హత్య కోసం ఎంచుకున్నట్లు సమాచారం. రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురు పిల్లలను ఇంటికి పంపిన మమత.. హితాక్షిని సదరు ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుపై కత్తితో కోసి, కట్టర్తో మెడ, గొంతు చుట్టు కత్తిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితాక్షి చనిపోగానే హడావుడిగా ఇంటికి తిరిగి వెళ్లిన మమత.. రక్తం మరకలు ఉన్న దుస్తులు మార్చుకొని వాటిని వాషింగ్ మెషీన్లో వేసి, అందరితోపాటు హితాక్షి కోసం వెతికినట్లు తెలిసింది. హితాక్షి మృతదేహం దొరకగానే నవీనతో కలిసి ఆస్పత్రికి వచ్చిన మమత అక్కడ బోరున విలపించడం గమనార్హం. -
పండుగపూట పూరీ గొంతులో ఇరుక్కుని..
రాజాపూర్: పండుగపూట మహబూబ్ నగర్ జిల్లాలో ఓ విషాదం చోటు చేసుకుంది. పూరీ తింటుండగా గొంతులో ఇరుక్కుని ఒక యువకుడు మృతి చెందాడు. రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి దగ్గర ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్ (25), బాండ్ర గిరయ్య పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తొలిఏకాదశి పండుగ కావడంతో ఆదివారం ఉదయం పొలం పనులు చేస్తున్న కుమార్, గిరయ్య తినడానికి.. రైతు రాంరెడ్డి పూరీలు తీసుకువచ్చాడు. ఇద్దరూ పూరీలు తింటుండగా.. కుమార్ గొంతులో ఇరుక్కుపోయింది. పక్కనే ఉన్న గిరయ్య నీళ్లు తెచ్చి తాగించేందుకు ప్రయత్నిస్తుండగానే.. కుమార్ కింద పడిపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందడంతో.. తల్లి రాజమణి, చెల్లెలు తమకు దిక్కెవరంటూ బోరున విలపించారు. కుమార్ మృతితో ఖానాపూర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. -
గుండెపోటుతో చిన్నారి మృతి
స్టేషన్ఘన్పూర్: ముక్కుపచ్చలారని చిన్నారి గుండె ఆగి చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఉపాధి కోసం వీరు హైదరాబాద్కు వచ్చారు. అశోక్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. రెండో కుమార్తె మిధున (6) శనివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని అంటూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే పాప మృతిచెందింది. కాగా, గుండె పోటుతో తమ కుమార్తె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. -
హెచ్చుమీరిన అసాంఘిక కార్యకలాపాలు.. విచ్చలవిడిగా వ్యభిచారం!
అనంతపురం: నగరంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. పేద కుటుంబాల యువతులకు డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. ఇందులోకి దిగాక.. తిరిగి వెనక్కి వెళ్లలేక.. కుటుంబ కషాలే గుర్తుకు తెచ్చుకుని, ఇష్టం లేకున్నా మనసు చంపుకుని నిర్వాహకులు ఎలా చెబితే అలా నడచు కోవాల్సి వస్తోంది. చదువు రాకపోవడం, ఎవ రితోనూ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి, నెలన్నర వ్యవధిలోనే అనేక కేసులు..గతనెల 30న అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప్పర లలిత అనే మహిళ నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. నిర్వాహకురాలిపై కేసు నమోదు చేశారు. ఇదే కాలనీలో జూన్ 19నసాయంత్రం 7:30 గంటల సమయంలో వ్యభి చారం గృహంపై పోలీసులు రైడ్ చేసి నిర్వాహకు రాలు కె. లక్ష్మిని అరెస్ట్ చేసి, ఓ బాధితురాలిని కాపాడారు. అంతకు ముందు కొన్ని రోజులు అంటే జూన్ 12న హౌసింగ్ బోర్డులోనే ఓ వ్యభిచార గృహంపై దాడులు చేశారు.నిర్వాహకులు కుమ్మర లక్ష్మి, బోయ వనితను అరెస్టు చేసి ఇద్దరు బాధితు లను కాపాడారు. అదే రోజు హౌసింగ్ బోర్డులోనే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న రామాజీ, మేరీ సుజాత, సరస్వతి అలియాస్ సాలమ్మ, విటులు జి. బాబావలి, గార్లదిన్నె లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. మే 11న హౌసింగ్బోర్డు ఎల్బాజీ బస్టాండు సమీపంలో ఒక ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఆకుల నారాయణమ్మ, విటుడు అజయ్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఇద్దరు బాధితులను రక్షించారు. అనతికా లంలోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే నగరం లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.19-25 ఏళ్లలోపు వారే టార్గెట్.. ఒక వైపు పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేసి విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా ఆక్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. హైటెక్ హంగులతో యథేచ్ఛగా వ్యభిచారం. నిర్వహిస్తూ నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా జగ్రత్తపడుతున్నారు. 19-25 ఏళ్ల లోపు ఉన్న యువతులనే ఈ ఊబిలోకి దింపుతున్నారు.నిర్వాహకులు తమ పర్మినెంట్ కస్టమర్లతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి అందులోనే యువతుల ఫొటోలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తు న్నట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు భార్యాభర్తలు కలిసి యువతులతో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కొందరు ప్రముఖుల వద్దకే యువతులను పంపిస్తున్నారు. నగరంలో కొన్ని లాడ్జీలు కేవలం వ్యభిచార కార్యకలాపాల కోసమే నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు. రాత్రి వేళ గస్తీని తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
రహమత్నగర్(హైదరాబాద్): మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే దారుణంగా హింసించి కడతేర్చాడో కిరాతకుడు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలాజీనగర్కు చెందిన నర్సింహ కూలి పనిచేస్తుంటాడు. మొదటి భార్య వదిలి వేయడంతో ఫతేనగర్కు చెందిన సోని(26)ని ఏడేళ్లక్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరు రెండు నెలల క్రితం బోరబండ డివిజన్ సాయాబాబానగర్కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. సోని హౌస్ కీపింగ్ పని చేస్తుండగా..కుమారుడిని గురుకుల పాఠశాలలో చేరి్పంచారు. మద్యానికి బానిసైన నర్సింహ దొంగతనాలు చేశాడు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సోనీ ఇటీవల నర్సింహకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి వచ్చింది. దీంతో కోపం పెంచుకున్న నర్సింహ శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి సోనిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. అరుపులు, కేకలు విన్న పొరుగింటి వారు 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వగా..బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని సోనిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. నర్సింహను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
కోరుట్ల చిన్నారి కేసులో బిగ్ ట్విస్ట్... సొంత పిన్నే..!
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణం ఆదర్శనగర్ చిన్నారి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పాప సొంత పిన్నే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న(శనివారం) సాయంత్రం సమయంలో హితీక్ష అనే ఐదేళ్ల పాప అదృశ్యమవగా.. పాప తల్లీ నవీన పోలీస్ ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటిపక్కనే బాత్రూమ్లో విగతజీవిగా పాప మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు.పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.. పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన పాప తండ్రి రాములు.. హుటాహుటీన అక్కడా నుంచి బయలుదేరారు. పాప సొంత పిన్ని మమతనే హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. హితీక్ష కుటుంబసభ్యుల్లో కొందరిని ప్రశ్నించిన పోలీసులు.. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లుగా అనుమానిస్తున్నారు. సిసీ టీవీ, సెల్ఫోన్ లోకేషన్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 40 మందిని పోలీసులు విచారించారు.శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది.సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్తో పాటు అతని అన్నదమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం.విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
పురివిప్పిన పాత కక్షలు.. వ్యక్తి దారుణ హత్య
ప్రకాశం: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం నల్లగుంట్లలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. 2022 ఫిబ్రవరి 9వ తేదీన కొర్రప్రోలు సమీపంలో జరిగిన మొద్దు వెంకటేశ్వర్లు హత్య కేసులో గ్రామానికి చెందిన బైరబోయిన వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు కక్షతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గ్రామంలో మొహర్రం వేడుకల సందర్భంగా బాదుల్లా షరగత్ను నిర్వహించారు. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థి వర్గీయులు అర్ధరాత్రి సమయంలో కాపు కాసి వెంకటేశ్వర్లుపై కత్తులతో చేసిన దాడి కిరాతకంగా నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గ్రామంలో పోలీస్ పికెట్వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురవడంతో ఆయన కుటుంబం శోక సముద్రంలో మునిగింది. భార్య విజయలక్ష్మి భర్త మృతదేహంపై పడి బోరున విలపించటం అందరినీ కలిచి వేసింది. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో స్పెషల్ పార్టీ పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. -
కోరుట్లలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి హత్య
జగిత్యాల జిల్లా: కళ్ల ఎదుట ఆడుకుంటున్న ఉన్న..అమ్మాయి అకస్మాతుగా కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లో విగతజీవిగా కనిపించింది. బాత్రూంలో బాలిక హర్షిత మెడ కోసి దారుణంగా చంపిన వైనం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. కోరుట్లలోని ఆదర్శనగర్లో నివాసముండే ఆకుల రాము–నవీన దంపతుల కూతురు హర్షిత(6) హత్య స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పెద్దపులులు చూసి వచ్చి...శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది. సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యా..ప్రమాదమా?బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్తో పాటు అతని అన్న, తమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం. విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బాలిక మృతికి కారణాలు అంతుచిక్కడం లేదు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎస్పీ అశోక్కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. -
రెండేళ్లు ఎస్సైగా ట్రైనింగ్.. కట్ చేస్తే కటకటాల్లోకి!
రెండేళ్లు పోలీస్ అకాడమీలో ఎస్సైగా శిక్షణ తీసుకుంది. అకాడమీకి వచ్చే ఉన్నతాధికారులతో సరదాగా మాటలు కలిపింది. డైనమిక్ యంగ్ ఆఫీసర్ అంటూ వాళ్లు కూడా ఆమెను అభినందించేవాళ్లు. అంతేకాదు.. యూనిఫారమ్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకుని సంబురపడిపోయేది. కట్ చేస్తే.. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతోంది. జైపూర్లోని రాజస్థాన్ పోలీస్ అకాడమీ(RPA)లో ఎస్ఐగా రెండేళ్లు శిక్షణ పొందిన మోనా అలియాస్ మూలీ దేవి(Mooli Devi) ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో దొడ్డిదోవ ఎంచుకుంది. మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో ప్రవేశించింది. స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్గా తనను తాను అందరికి పరిచయం చేసుకుంది. అలా అకాడమీ పెద్దలనే బోల్తా కొట్టించి.. రెండేళ్లపాటు అధికారికంగా శిక్షణ పొందింది. ఈ రెండేళ్లలో.. అక్కడికి వచ్చే ఉన్నతాధికారులతో టెన్నిస్ ఆడుతూ ఫొటోలు దిగడమే కాకుండా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రైనింగ్ గ్రూప్లలో యాక్టివ్ మెంబర్గా ఉంటూ వచ్చింది. యూనిఫామ్లో రీల్స్ చేయడమే కాకుండా.. మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేది. అయితే.. ఆమె ఎప్పుడూ ప్రధాన గేట్ ద్వారా కాకుండా.. అధికారుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఉన్న గేట్ ద్వారా అకాడమీకి ప్రవేశించేది. ఈ వీఐపీ వేషాలపై 2023లో కొంతమంది ట్రైనీలకు అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. రెండేళ్లపాటు పరారీలో ఉన్న ఆమెను.. ఇవాళ(జూలై 5న) సికర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి మూడు యూనిఫామ్లతో పాటు నకిలీ గుర్తింపు పత్రాలు, పోలీస్ అకాడమీకి సంబంధించిన పరీక్షా పత్రాలు స్వాధీనపర్చుకున్నారు. మోనా బుగాలియా స్వస్థలం నాగౌర్ జిల్లా అని, ఆమె తండ్రి లారీ డ్రైవర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుగా తన గౌరవాన్ని పెంచుకునేందుకు, తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేందుకే తాను ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందని ఆమె అంటోంది. మరోవైపు ఈ ఘటనతో పోలీస్ అకాడమీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా శిక్షణకు అనుమతించారని మండిపడుతున్నారు పలువురు. అయితే అత్యంత భద్రత కలిగిన అకాడమీలో ఇలా నకిలీ పత్రాలతో ప్రవేశించడం అంత సులువైన పని కాదని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు. -
మరో ఘోరం.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను..!
పాత పరిచయాలు, వివాహేతర సంబంధాలతో భర్తలను కడతేరుస్తున్న భార్యల ఉదంతాలు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుండడం చూస్తున్నదే. పెళ్లై నెల తిరగకుండానే నవవధువులు సైతం ఈ జాబితాలో చేరిపోతున్నారు. తాజాగా తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. క్రైమ్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను హత్య చేసింది ఓ భార్య. ఆపై అత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది దొరికిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ప్రయత్నించగా.. బంధువుల జోక్యంతో ఈ వ్యవహారం బయటపడింది. బాచుపల్లిలో నివాసం ఉంటున్న అంజిలప్ప ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని భార్య రాధ కన్నీరు మున్నీరు అయ్యింది. ఆపై స్వగ్రామం నారాయణపేటకు మృతదేహాన్ని తీసుకెళ్లింది. అయితే గొంతుపై ఉన్న మరకలను చూసి బంధువులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆమెను గట్టిగా విచారించగా.. ఆమె అసలు విషయం చెప్పింది. గత కొంతకాలంగా రాధ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. అయితే అలాంటివి వద్దని, అతనితో ఫోన్ మాట్లాడొద్దని భర్త ఆమెను మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న రాధ.. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతును నులిమి హత్య చేసింది. పోలీసుల విచారణలో అంజిలప్పను తానే హత్య చేసినట్లు రాధ అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. -
పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్యల చేతుల్లో భర్తలు హతమవుతున్న సంఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరు సుద్దగుంట పోలీస్స్టేషన్ పరిధిలో భార్య భర్తను బలితీసుకుంది. భాస్కర్ (40).. భార్య శృతి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని శృతి అప్పుడప్పుడు గొడవ చేసేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తీవ్ర రగడ జరిగింది. శృతి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసింది, తలకు దెబ్బ తగిలిన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆందోళనచెందిన శృతి భర్త శవానికి స్నానం చేయించి ఏమీ జరగనట్లు బెడ్ మీద పడుకోబెట్టింది. బాత్రూంలో పడి చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా గాయాలు బయటపడ్డాయి. దీంతో శృతిని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం వెల్లడించింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. -
చెల్లెలితో మాట్లాడుతున్నాడని హత్య
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అనుమానంతో అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని హత్య చేసి జగనన్న లే అవుట్లో కప్పి పెట్టేశారు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను సీఐ ఎ.కృష్ణభగవాన్ వివరించారు. పి.వేమవరానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన నొక్కు కిరణ్కార్తిక్ (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఆ యువతి అన్నయ్య నూతలకట్టు కృష్ణ ప్రసాద్ అడపాదడపా గ్రామానికి వచ్చినపుడు తన చెల్లి ఎవరితోనో మాట్లాడుతున్న విషయం తెలుసుకుని కార్తిక్ను మందలించాడు. తన చెల్లెలని బాగా చదివించాలనుకుంటున్నానని ఈ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో గత నెల 24వ తేదీ రాత్రి కృష్ణ ప్రసాద్ తన స్నేహితుడు దూలపల్లి వినోద్ సాయంతో కార్తిక్ను పిలిచి పని ఉంది మాట్లాడదాం రమ్మని తీసుకువెళ్లారు. అతడిని అచ్చంపేట శివారు బ్రహ్మానందపురంలోని జగనన్న లేఅవుట్కు తీసుకువెళ్లి అతడితో ఘర్షణపడి కొట్టి హత్య చేసి గోతిలో కప్పిపెట్టేశారు. అనంతరం కృష్ణప్రసాద్ హైదరాబాద్కు వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా గతనెల 24వ తేదీనే ఉప్పాడలోని వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్న కార్తిక్, అతని తండ్రి వెంకటరమణల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. కూలీలకు సొమ్ములిచ్చే విషయంలో తేడా రావడంతో కార్తిక్ను అతని తండ్రి మందలించాడు. దీంతో కార్తిక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఆ రోజు రాత్రి అతడు ఇంటికి రాకపోవడం, రాత్రి పది గంటల తరువాత ఫోన్ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో గాలించారు. ఏ ప్రయత్నమూ ఫలించకపోవడంతో 27వ తేదీన తండ్రి వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు విషయంలో తేడా రావడంతో మందలించడంతో తమ కుమారుడు అలిగి వెళ్లి ఉంటాడని తాము భావించామని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కృష్ణప్రసాద్ తన స్నేహితుడు వినోద్కు తరుచూ పోన్ చేసి ఇక్కడి పరిస్థితిని తెలుసుకునేవాడు. పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని తెలిసి, వారు తమను గుర్తిస్తే కేసు తీవ్రంగా ఉంటుందని భావించి గురువారం రాత్రి కృష్ణప్రసాద్, వినోద్ పోలీసులకు లొంగిపోయినట్లు సీఐ వివరించారు. ముద్దుగా చదివించుకుంటున్న తన చెల్లిని మోసం చేస్తాడనే అనుమానంతో హత్య చేసినట్లు కృష్ణప్రసాద్ చెప్పాడని సీఐ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిందితులను ఘటనా ప్రదేశానికి తీసుకువెళ్లి మండల మెజిస్ట్రేట్, తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు జి.నాగేశ్వరరావు, వై.ముసలయ్య, ఎం.పృథ్వి, సీహెచ్ ప్రసాద్, బాబీ, రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
స్నేహితురాళ్లు అవమానించారని ఇంజినీరింగ్ విద్యార్థిని..
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21) తన స్నేహితులు కళాశాలలో, హాస్టల్లో మానసికంగా వేధించారని, క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిత్య హైదరాబాద్లోని రిషి ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదివే వైష్ణవి, సంజన కొద్ది రోజులుగా చదువులో వెనుకబడ్డావని, హేళన చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. మనస్తాపానికి గురై ఈనెల 1న ఇంటికి వచ్చింది. 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుల సూచనతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తండ్రి కాటిపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థిని..
శాయంపేట/మద్దూరు: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థిని.. గురుకుల పాఠశాలలో సీటు రాలే దని మరో విద్యార్థిని వేర్వేరుచోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ, నారాయణపేట జిల్లా ల్లో చోటుచేసుకున్న ఘటనల వివ రాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల ప్రత్యూష (24) బీటెక్ పూర్తిచేసి రెండేళ్లుగా ఉద్యోగవేటలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల ఎంట్రన్స్లు రాయగా, కొన్ని మార్కుల తేడాతో ఫలితం రాలేదు. దీంతో ప్రత్యూష మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరివేసుకుంది. కొద్దిసేపటికి అమ్మమ్మ లక్ష్మి ఇంట్లోకి వచ్చి చూసి.. భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రత్యూష మృతి చెందింది. తల్లిదండ్రులు కూలీలు. ప్రత్యూష తండ్రి రావుల రమేశ్ ఫిర్యా దుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. గురుకులంలో సీటు రాలేదని నారాయణపేట జిల్లా దమ్గాన్పూర్కు చెందిన నర్సప్ప, లక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారు డు ఉన్నారు. నర్సప్ప బతుకుదెరువుకు హైదరాబాద్ వెళ్లి కూలీ పనిచేస్తుండగా, లక్ష్మి ఊళ్లో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. కుమార్తె మనీషా (14) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగ తి పూర్తి చేసుకొని మద్దూరు బాలికల పాఠశాలలో 9వ తరగతి అడ్మిషన్ పొందింది. గురుకుల పాఠశాల లో సీటు కోసం ఎంట్రన్స్ రాసింది. పరిగి గురుకుల పాఠశాలలో సీటు వచ్చిందని టీసీ తీసుకొని వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక అక్కడ సీటు రాలేదని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన మనీషా 2వ తేదీ రాత్రి పురుగుమందు తాగింది. తల్లి గమనించి మ హబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించింది. అక్కడే చికిత్సపొందు తూ మనీషా గురువారం అర్ధరాత్రి మృతి చెందింది. -
కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమించాడని చంపేసి పూడ్చిపెట్టారు!
కాకినాడ: జిల్లాలో దారుణం వెలుగుచూసింది. సామర్లకోట మండలం పి. వేమవరంలో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితులు పోలీసులకు లొంగిపోయారు. విషయంలోకి వెళ్తే.. కిరణ్ కార్తీక్ అనే యువకుడు.. ఓ యువతిని ప్రేమించాడు. ఇది తెలుసుకున్న యువతి సోదరుడు మరో స్నేహితుడితో కలిసి కిరణ్ కార్తీక్ను హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే 10 రోజుల కిందటే కిరణ్ కార్తీక్ హత్య చేపి శవాన్ని పాతిపెట్టాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులు కృష్ణప్రసాద్, వినోద్లు పోలీసులకు లొంగిపోయారు. -
విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
సాక్షి, విశాఖపట్నం: మరో బెట్టింగ్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో డొంక కదిలింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విశాఖ పోలీసులు.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. బెంగళూరులో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేసి బెట్టింగ్కు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన నిందితుడు కీలక పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠా సభ్యులు వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ టాప్లు, 132 ఏటిఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
అనంతపురం: పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన యువతి సాయినగర్ ఏడో క్రాస్లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది.రెండు సంవ త్సరాల క్రితం అనంతపురం నగరంలోని బస్టాండు వద్ద ఉన్న ప్రియదర్శిని హోటల్లో పార్టం ఉద్యోగం చేస్తున్న ఈమెకు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అగ్రహారంకు చెందిన ప్రవీణ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పగా యువతి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ నగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోంలోన్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరింది.విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. బైకులో బలవంతంగా ప్రసన్నాయ పల్లి రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి దాడి చేశాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుతా అని బెదిరించాడు. తిరిగి బైక్పై హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీనిపై తన సోదరితో కలిసి యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
హైదరాబాద్లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. టాలీవుడ్లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పుగోదావరికి చెందిన జన కిరణ్కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనస్థలిపురంలో ఏసీ టెక్నిషియన్గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 65 సినిమాలకు రికార్డు చేసినట్లు కిరణ్ పేర్కొన్నాడు. హెచ్డీ ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.నిందితుడిపై 66(c), 66(e) ఐటీ యాక్ట్, 318(4),r/w 3(5), 338 BNS, 63, 65 కాపీ రైట్, 6-AA,6AB,7(1A) సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కామ్ కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్కుమార్.. 1TAMILBLASTERS, 5MOVIEZRULZ, 1TAMILMV వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఒక థియేటర్ వేదికగా ఈ పైరసీకి పాల్పడినట్లు తేలింది. పైరసీ కారణంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7కోట్ల నష్టం ఏర్పడింది. టెలిగ్రామ్లో సైతం కొత్త పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారుగా ఏడాదిన్నర నుంచి హైదరాబాద్లోని పలు థియేటర్స్లో 40 సినిమాలు రికార్డింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.సినిమా థియేటర్లోనే పైరసీ చేసి మాఫియాకి అమ్ముతున్న కిరణ్.. ఒక్కొక్క సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని తీసుకుంటున్నాడు. క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ ఛేంజర్, సినిమాల ఫైల్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడు కిరణ్ నుంచి రెండు మొబైల్స్ను సీజ్ చేశారు. -
మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025 -
‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. భర్త, పిల్లలను వదిలేసి రా'
జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్కుమార్తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్కుమార్కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్కుమార్ హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్పాషా తెలిపారు. -
మాదాపూర్లో దారుణం.. బెట్టింగ్ ఆడ్డొదన్న తండ్రిని చంపేశాడు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో దారుణం జరిగింది. బెట్టింగ్ ఆడొద్దని మందలించిన తండ్రిని కుమారుడు చంపేశాడు. కొడుకు చదువు కోసం ఆరు లక్షలు ఇవ్వగా.. కొడుకు బెట్టింగ్ యాప్స్లో పెట్టి పోగొట్టాడు. దీంతో మందలించిన తండ్రి హనుమంత్ని హత్య చేసిన కుమారుడు రవీందర్.. ఆత్మహత్యగా క్రియేట్ చేశాడు. వనపర్తికి తీసుకెళ్లి తండ్రి మృతదేహానికి కర్మకాండ చేసే ప్రయత్నం చేశాడు.బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. రవీందర్ని అదుపులోకి తీసుకున్న విచారించారు. తండ్రిని తానే చంపానని రవీందర్ ఒప్పుకున్నాడు. రవీందర్ను రిమాండ్కు తరలించారు. -
ఆటోలో ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి,బళ్లారి(కర్ణాటక): వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఆశపడ్డారు. కానీ ఆటో రిక్షాలో శవాలై తేలారు. ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యాపించాయి. వివరాలు.. బెళగావి జిల్లాలో గోకాక్ వద్ద సవదత్తి తాలూకా మనవళ్లికి చెందిన రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ఇద్దరు ఊరి బయట ఆటోలో విగతజీవులై కనిపించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిక్కనంది సమీపంలో ఆటోలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సమగ్ర విచారణ జరిపించాలని జాదవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోకాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.లవ్ బ్రేకప్.. ప్రియుడు ఆత్మహత్య మైసూరు: ప్రేమించిన యువతి ముఖం చాటేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా బన్నితాళపుర గ్రామంలో జరిగింది. సాగడె గ్రామానికి చెందిన సంతు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తాను మరో యువకున్ని ప్రేమిస్తున్నట్లు సంతు వాట్సాప్కు మెసేజ్ పంపింది. దీంతో విరక్తి చెందిన సంతునా మరణానికి ప్రియురాలే కారణం, ఆమె వదిలేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు పలువురికి మెసేజ్లు పంపాడు. తమ ఇద్దరి ఫోటోని స్టేటస్లో పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లుపేటె పోలీసులు కేసు నమోదు చేశారు. -
శ్రీవాణి ఆత్మహత్యకు ఫొటోనే కారణమా..
పరకాల: ఓ పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్పేట శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం జరిగింది. పరకాలకు చెందిన ఏకు ఈశ్వర్–నీల కుమార్తె శ్రీవాణి ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం బాత్రూమ్కు వెళ్లింది. చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు ప్రిన్సిపాల్ కృష్ణకుమారికి తెలిపారు. ఆమె వచ్చి బాత్రూం డోర్ను బలవంతంగా తీయడంతో శ్రీవాణి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. శ్రీవాణి బాత్రూంలో జారిపడిందని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు భోరుమని విలపించారు. తమ కుమార్తె చావుకు కారణం తెలపాలంటూ రెసిడెన్షియల్ ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ కృష్ణకుమారి, హౌజ్మాస్టర్ మీరాబాయి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ఫొటోనే కారణమా.. వారం క్రితమే రెసిడెన్షియల్లో చేరిన శ్రీవాణి వద్ద ఓ ఫొటోను చూసిన హౌస్ టీచర్ బలవంతంగా లాక్కున్నట్లు తెలిసింది. తర్వాత విద్యార్థిని సదరు టీచర్ తాళం చెవి కనుక్కొని లాకర్ ఓపెన్ చేసి ఫొటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా.. విద్యార్థినుల సమక్షంలోనే శ్రీవాణిని నోటికి వచి్చనట్లు తిట్టి.. చావచ్చు కదా అన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్ ఆటోలో విద్యారి్థని మృతదేహాన్ని తరలించడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని పరకాల పోలీస్స్టేషన్కు తరలించినట్లు సమాచారం. -
భర్త దారుణ హత్య.. ఇంటికి తాళం వేసి భార్య పరార్..!
నాగోలు(హైదరాబాద్): ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో పడవేసిన సంఘటన నాగోలు పోలీసుల స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల శివారులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద లభించిన వివరాల ఆధారంగా మృతుడు కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్ గా గుర్తించారు. కాచిగూడలో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న అశోక్ యాదవ్కు భార్య క్రాంతి దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్, ఏసీపీ కృష్ణయ్య, నాగోలు ఇన్స్పెక్టర్ సూర్యనాయక్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. అశోక్ యాదవ్ మృతదేమం లభించిన ఫోన్ ఆధారంగా అతని భార్యకు ఫోన్ చేసిన పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇంటి వస్తున్నట్లు సమాచారం అందుకున్న అతడి భార్య ఇంటికి తాళం, జ్యూస్ సెంటర్ మూసి వేసి సెల్ఫోన్ ఆఫ్ చేసి పరారైనట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. -
తమిళనాడులో భారీ పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సత్తూరులోని బాణసంచా యూనిట్పై దట్టమైన పొగ అములుకుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని బాణాసంచా గోడౌన్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. తరచూ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.#JUSTIN சிவகாசி அருகே சின்ன காமன்பட்டி கோகுலேஸ் பட்டாசு ஆலையில் பயங்கர வெடி விபத்து #Sivakasi #FireAccident #News18Tamilnadu | https://t.co/3v5L32pLWJ pic.twitter.com/5g7GYG6V6d— News18 Tamil Nadu (@News18TamilNadu) July 1, 2025VIDEO Credits: News18 Tamil Nadu -
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
నేరేడుచర్ల(నల్గొండ): ప్రియుడికి వీడియో కాల్ చేస్తే స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్న వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఆమె మృతికి ప్రియుడే కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బోడలదిన్నె గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అశ్విని(35) తన భర్తతో కలిసి గత మూడేళ్లుగా హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నివాసముంటోంది. వీరికి ఒక కుమార్తె సంతానం. బోడలదిన్నె గ్రామానికే చెందిన కందుకూరి సురేష్రెడ్డి కూడా ఎల్బీనగర్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అశ్విని, సురేష్రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల అశ్విని, సురేష్రెడ్డి మధ్య దూరం పెరగడంతో.. నాలుగు రోజుల క్రితం అశ్విని సురేష్రెడ్డికి వీడియో కాల్ చేసి ‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని చెప్పింది. దీనికి తాను రానని సురేష్రెడ్డి సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురైన అశ్విని తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత అనుమానం వచ్చి సురేష్రెడ్డి అశ్విని ఇంటికి వెళ్లగా ఆమె ఆపస్మారక స్థితిలో ఉండటం చూసి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతదేహంతో ఆందోళన..అశ్విని మృతికి సురేష్రెడ్డే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి బోడలదిన్నె గ్రామంలోని సురేష్రెడ్డి ఇంట్లో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో బోడలదిన్నె గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాలతో గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిపి సోమవారం అశ్విని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. అశ్విని మృతికి సురేష్రెడ్డి కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
నెల్లూరులో అత్తమామలను నరికి చంపిన అల్లుడు
భార్యపై అనుమానమే పెనుభూతమైంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసింది. అడ్డుకోబోయిన అత్త, మామల ప్రాణాలు తీసింది. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో దుత్తలూరు ఒక్కసారిగా ఉలికి పడింది. పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలే ఈ ఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దుత్తలూరు ఏసీ కాలనీ ఆదివారం అర్ధరాత్రి హత్యల కలకలంతో ఉలికి పడింది. మద్యం మత్తులో భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సాగించిన మారణకాండ ఇది. కాలనీలో నివాసముంటున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం అతనిలో మనిషిని మృగాన్ని చేసింది. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న వెంగయ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు. అప్పటికే భార్య వెంకాయమ్మ సమీపంలోని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన వెంగయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకొని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యను చంపేస్తానంటూ వీరంగం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్తామామలు చలంచర్ల జయమ్మ (60) కల్లయ్య (65)లను కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గాయాలతో బయటపడి కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గట్టిగా నియంత్రించడంతో వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో పరారయ్యాడు. గాయపడిన వెంకాయమ్మను ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్సైలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్టీం ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు వెంగయ్య కోసం స్థానికంగా, సాంకేతకంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడుపడితే అప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
పాశమైలారం ఘటన.. సిగాచి బాధితులకు సీఎం పరామర్శ
పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్యను 45గా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతోంది. తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది. Updates: 42కు చేరిన మృతులుమృతుల సంఖ్య పెరిగే అవకాశంమృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, బిహార్, జార్ఖండ్ వాసులుమృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలుఆసుపత్రుల్లో 35 మంది బాధితులకు చికిత్స12 మంది పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్సపేలుడు ఘటనలో 27 మంది కార్మికులు గల్లంతుశిథిలాల కింద మృతదేహాల కోసం గాలిస్తున్న డీఆర్ఎఫ్ టీమ్సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బందితమవాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళన బాధితులకు సీఎం పరామర్శసిగాచి ఫ్యాక్టరీ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శధృవ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎంఆరోగ్య స్థితిపై ఆరాకార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీమార్చురీ వద్ద రోదనలతో పడిగాపులుపటాన్ చెరులో డిఎన్ఏ శాంపుల్స్ సేకరణ కోసం ప్రత్యేక చర్యలుగుర్తుపట్టేందుకు వీలులేని మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్ లుతమ వారిని గుర్తించలేని కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ సేకరణఇప్పటివరకు 18 మంది డిఎన్ఏ శాంపుల్ సేకరణ మృతదేహాలడీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తరువాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుఇవాళ 11 మంది డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుతమవాళ్ల మృతదేహాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోదనలతో కుటుంబ సభ్యుల పడిగాపులుఘటనపై NHRC కేసు నమోదుపాశమైలారం ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం కేసు నమోదుఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావుకేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీమృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం యాజమాన్యం నుంచి ఇప్పించాలని పిటిషన్తాజా ప్రమాదం నేపథ్యంలో.. తెలంగాణలోని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని కోరిన పిటిషనర్త్వరలో ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు? యాజమాన్యం ఎక్కడ? 24 గంటలు దాటినా యాజమాన్యం రాకపోవడం బాధాకరమన్న మంత్రి శ్రీధర్బాబుఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న శ్రీధర్బాబుప్రమాద ఘటనను కార్మిక, వైద్యశాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: మంత్రి శ్రీధర్బాబుఅంతకుముందు.. యాజమాన్యం ఎక్కడ? అని అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా? అని ప్రశ్న యాజమాన్యం రాకపోవడంపై సీఎం ఆగ్రహం సిగాచి ఘటనపై సీఎం కీలక ఆదేశాలుసిగాచి పరిశ్రమను పరిశీలించిన సీఎం, మంత్రులుఅనంతరం ప్రమాద స్థలిలోనే అధికారులతో సీఎం సమీక్షఫ్యాక్టరీ ప్రమాదంపై అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్సిగాచి పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్పరిశ్రమను తనిఖీ చేశారా?.. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా?పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరు? అంటూ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ను అడిగిన సీఎంఘటనపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా?.. కారణాలు తెలుసుకోండిఇప్పటికే తనిఖీలు చేసినవాళ్లతో కాకుండా.. కొత్త వాళ్లతో విచారణ జరిపించండిఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించి నివేదిక ఇవ్వండిఇలాంటి ప్రమాదాలపై అధికారులు అలర్ట్గా ఉండాలితక్షణ సాయం కింద.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలని సీఎం ఆదేశంపాశమైలారం ఘటనా స్థలిలో సీఎం రేవంత్పాశమైలారం సిగచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డివెంట మంత్రులు పొంగులేటి, వివేక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి..ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రిప్రమాదం జరిగిన తీరును.. సహాయక చర్యలపై అధికారులను ఆరా తీస్తున్న సీఎం రేవంత్పటాన్చెరు మార్చురీలో 37 మృతదేహాలు11 మృతదేహాల గుర్తింపు పూర్తి పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలుడీఎన్ఏ టెస్ట్కు ఒకరోజు నుంచి రోజున్నర టైం పడుతుందంటున్న అధికారులు సిగచి ప్రమాద స్థలికి కేంద్రమంత్రి కిషన్రెడ్డిసంగారెడ్డి పటాన్ చెరువు సిగచి కంపెనీ ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిమధ్యాహ్నం ప్రమాద స్థలిని పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్న కిషన్రెడ్డికిషన్రెడ్డి వెంట బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్రావు కూడాకొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుపాశమైలారం ఘటనలో కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుడీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లుఘటనాస్థలానికి వచ్చిన డీఎన్ఏ పరీక్షలు చేసే బృందాలుఇప్పటిదాకా కేవలం 6 మృతదేహాలకు మాత్రమే గుర్తింపుపటాన్చెరు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డికాసేపట్లో పటాన్చెరు పాశమైలారం పారిశ్రామికవాడకు సీఎం రేవంత్ రెడ్డిఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు ఆస్పత్రిలో పరామర్శపాశమైలారం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎంసీఎం వెంట మంత్రులు కూడాసిగచి ఆవరణలో పోలీసు ఆంక్షలుసిగచి ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డిఅంతకంటే ముందు.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శసీఎం రాక నేపథ్యంలో సిగచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలుసిగచి కంపనీ వైపు ఎవరిని అనుమతించని పోలీసులునిన్న ప్రమాదం తర్వాత బాధిత కుటుంబాలతో పోలీసులకు వాగ్వాదంతమ వారి గురించి సరైన సమాచారం లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులుతోసేసిన పోలీసులు.. ఫ్యాక్టరీ వద్ద కాసేపు ఉద్రిక్తత42కు చేరుకున్న మృతుల సంఖ్యశిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగింపు..మరో రెండు గంటల పాటు శిధిలాల తొలగించే ప్రక్రియ కొనసాగే అవకాశం..కుప్పకూలిన సిగచి ప్రొడక్షన్ బిల్డింగ్చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారే..వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 34 మంది క్షతగాత్రులుమూడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులుశిథిలాల కింద మరో 20 మంది42కి చేరిన మృతుల సంఖ్యశిథిలాల కిందే మరో 20 మంది?మృతుల సంఖ్య 55కి చేరే అవకాశంకొనసాగుతున్న శిథిలాల తొలగింపుధ్వంసమైన ప్లాంట్ను పక్కకు తొలగించిన సహాయక బృందాలుగుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలుమృతుల్లో తమిళనాడు, యూపీ వాసులేక్కువడీఎన్ఏ పరీక్షల అనంతరమే కుటుంబ సభ్యులకు అప్పగించే ఛాన్స్ఇప్పటివరకు గుర్తు పట్టినవి ఆరు మృతదేహాలు మాత్రమేఅంతకు ముందు.. ఈ ఉదయం ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. ఘటన వివరాలతో పాటు సహాయక చర్యలు ఇతరత్రా వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో 47 మంది గల్లంతు అయ్యారుఇప్పటివరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అందులో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించాం.ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరికొందరు మృతిగుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు ఉన్నాయి మరో 27 మంది జాడ తెలియాల్సి ఉందిఆస్పత్రిలో తీవ్ర గాయాలతో 35 మందికి చికిత్స అందుతోంది.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది57 మంది సరక్షితంగా ఇంటికి వెళ్లారుప్రమాద సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయిందిశిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారు.. వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయిసహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు ఇదీ చదవండి: పరిశ్రమల్లో ప్రాణాలు.. గాలిలో దీపాలు సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంతక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చన్న కలెక్టర్ ప్రావీణ్యబ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ ఉత్పత్తి ప్రాథమికం సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యిందన్న ప్రత్యక్ష సాక్షులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న కొందరు కార్మికులు అయితే ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి?మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడుసంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు అగ్నికీలల్లో పలువురి సజీవదహనం.. కార్మికులు, ఉద్యోగులు దుర్మరణం! సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు మృతుల్లో ఎక్కువమంది ఒడిశా, బిహార్, యూపీ వారే.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం 36 మందికి కాలిన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కింద మరికొందరు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్... ఘటనా స్థలాన్ని,ఆస్పత్రులను సందర్శించిన మంత్రులు.. నేడు ఘటనా స్థలానికి సీఎం రేవంత్ ఆస్పత్రిలో బాధితులకు సీఎం పరామర్శ -
బతుకులు బుగ్గి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/పటాన్చెరు/రామచంద్రాపురం/జిన్నారం/చందానగర్: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని సిగాచి అనే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఇద్దరు ఆస్పత్రుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 16 మంది మరణించినట్లు అనధికారిక సమాచారంకాగా, మంత్రులు దామోదర, వివేక్ మాత్రం 12 మంది మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తదితర ప్రముఖులు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ను ఉ త్పత్తి చేస్తారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి? మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్కు పలు సూచనలిచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పరిశ్రమల శాఖ ఫైర్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్గ్రేషియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రులు దామోదర, వివేక్ రాజకీయం చేయొద్దు: మంత్రులు పేలుడు ఘటనలో గాయపడిన వారిలో హేమ సుందర్, ధర్మరాజ్ ప్రసాద్, రాజేష్ కుమార్ చౌదరి, కమలేష్ ముఖియా, చందన్కుమార్ నాయక్, నగ్నజిత్, అభిషేక్ కుమార్, అజిత్ తివారి, సంజయ్కుమార్, యశ్వంత్ కుమార్, ధన్వీర్ కుమార్, సంజయ్ ముఖియా, రాజశేఖర్రెడ్డి, దేవనంద్, గణేష్ కుమార్, సంజయ్కుమార్ యాదవ్, నీలాంబర్ బట్రా, సమీర్, అమర్జిత్, అర్జున్కుమార్, అజిమ్ అన్సారీలను మియాపూర్ మదీనాగూడలోని ప్రణామ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ అభిషేక్ కుమార్, అజిత్ తివారి మృతి చెందారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నవారిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎవరూ ఎలాంటి రాజకీయం చేయవద్దని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సీఎం సందర్శన సిగాచి పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడనున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కేసీఆర్ సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలావుండగా పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పలువురు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధానిసాక్షి, న్యూఢిల్లీ: సంగారెడ్డి జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదం గురించి విని చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపడుతున్నారు..’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం ఎంతో దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం..’ అని ఖర్గే అన్నారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. ప్రమాదంపై ఆరా సాక్షి, హైదరాబాద్: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ జితేందర్, సీఎస్ రామకృష్ణారావుతో సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజాస్టర్మేనేజ్మెంట్స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫైర్సరీ్వసెస్అడిషనల్డీజీని సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య అనుమానాస్పద మృతి
పీలేరు(అన్నమయ్య): అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ బందారువాండ్లపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వెంగంపల్లెకు చెందిన లోకనాథరెడ్డి, జీవనజ్యోతి కుమార్తె ఇందుజా (30)కు ఐదేళ్ల క్రితం బందారువాండ్లపల్లెకు చెందిన వరంపాటి శంకర్రెడ్డి కుమారుడు విజయశేఖర్రెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంపాటు వారి సంసారం సజావుగా సాగింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. విజయశేఖర్రెడ్డి వేరే మహిళతో వివాహేతర సంబంధం కలిగి వుండడంతో తరచూ భార్య భర్తలు గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇందుజా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు పీలేరుకు చేరుకుని తమ కుమార్తెను అత్తింటివారే కడతేర్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్రెడ్డి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి, బంధువుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు.. ఫ్యాక్టరీ ప్రమాదంపై మంత్రి వివేక్
పటాన్చెరు పారిశ్రామికవాడ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. షిఫ్ట్లో 150 మంది కార్మికులు ఉండగా.. ప్రమాదం జరిగిన బ్లాక్లోనే 90 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. మృతుల సంఖ్య 15కి చేరింది. కంపెనీ మేనేజర్ ఒకరు సైతం మృతి చెందినట్లు సమాచారం. 26 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో పలువురిపరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 9గం. సమయంలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు పడిపోయారు. ప్రమాద సమయంలో లోపల కార్మికులు చాలామందే ఉన్నారు. మంటల్లో.. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకునిపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. అలాగే అధికారులు సకాలంలో స్పందించి చుట్టపక్కల ప్రజలను ఖాళీ చేయించడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో.. సహాయక చర్యలపై మంత్రులు కీలక ప్రకటనలు చేస్తున్నారు.భవన శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులుశిథిలాలను తొగించిన కొద్దీ బయటపడుతున్న మృతదేహాలుగుర్తు పట్టరాని స్థితిలో మృతదేహాలుపాశమైలారంలోని ప్రమాద స్థలం నుంచి మరో రెండు మృత దేహాలు వెలికితీత15కి చేరిన మృతుల సంఖ్యమరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై వెలువడని అధికారిక ప్రకటనపరిశ్రమ వద్ద, ఆస్పత్రుల వద్ద కార్మికుల కుటుంబాల నిరీక్షణ.. రోదనలుఆచూకీ లభించక శోకసంద్రంలో కుటుంబాలుభారీ వర్షంలోనూ కొనసాగుతున్న సహాయక చర్యలురేపు సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డిరేపు ఉదయం పాశమైలారం ప్రమాద ఘటన స్థలానికి వెళ్లనున్న రేవంత్పాశమైలారం ఘటనపై సీఎం విచారంక్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరాప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశంగాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎంబాధాకరం: ప్రధాని మోదీ సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతిచాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరంతమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుక్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాంసీఎం రేవంత్ విచారంపాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై సీఎం రేవంత్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలిచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిపటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన రియాక్టర్ పేలుడుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతికార్మికులు చనిపోవడం అత్యంత విషాదకరంగాయపడిన వారిని రక్షించి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధ్యులను శిక్షించాలి 15 నిమిషాల్లో స్పందించాం: మంత్రి వివేక్ఘటన జరిగిన 15నిమిషాల్లో స్పందించాం. కలెక్టర్, జిల్లా యంత్రాగ సమన్వయంతో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వెంటనే 34మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం.. 12మంది ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. మొత్తం ఘటనలో12మంది చనిపోయారు. ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చర్మం, శరీరం తీవ్రంగా కాలిపోయాయి. హైడ్రా కూడా చేరుకుంది.. షాకిలాలను తీసివేస్తున్నారు. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది.. రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు. నిర్లక్ష్యం ఏంటి అనేది ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది. నిజంగా విచారణ జరిపి బాద్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం అని మంత్రి వివేక్ మీడియాకు తెలిపారు.ఎక్కడా నిర్లక్ష్యం లేదు: మంత్రి రాజనర్సింహసిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని.. సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు. సిగచి కంపెనీ ప్రమాదం బాధాకరం. ఉదయం 9గం.ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మూడు గంటల నుంచి ప్రమాద స్థలంలోనే ఉన్నాం. సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఎమర్జెన్సీ సిస్టం ద్వారా త్వరితగతిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాం. ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టల్ పౌడర్ ని తయారు చేస్తుంటారు. మార్నింగ్ 60మంది వర్కర్స్ పనిలో ఉన్నారు. జనరల్ వాళ్ళు 20మంది ఉన్నారు. ఆస్పత్రిలో 34మందికి చికిత్స అందుతోంది. 12 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశాం. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం వైద్యం అందిస్తుంది.. ఎక్కడ నిర్లక్ష్యం లేదు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తాం. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటాం. ప్రతి కార్మిక కుటుంబాన్ని అదుకుంటాం. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదు అని మంత్రి రాజనర్సింహ అన్నారు. ఇదీ చదవండి: ఫ్యాక్టరీ ప్రమాదం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే!👉ఐజీ సత్యనారాయణ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. రియాక్టర్ పేలడంతో ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన టైంలో.. షిఫ్ట్లో 150 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటిదాకా 8 మంది మరణించారు. మూడు ఆస్పత్రుల్లో 26 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉంది.. అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని తెలిపారు. 👉ప్రమాదం తర్వాత.. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ప్రమాదం గురించి తెలియగానే కలెక్టర్, ఐజీ, సంగారెడ్డి ఎస్పీ, అడిషనల్ కలెక్టర్.. అధికార యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 👉ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండడంతో అక్కడున్నవాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరూ రావొద్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు అక్కిడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా ఆంబులెన్స్లు చేరుకుని క్షతగాత్రుల్ని తరలిస్తున్నాయి. భారీ క్రేన్లు, కట్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా బృందం.. అడ్మిన్స్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. -
మరో మలుపు తిరిగిన యాంకర్ స్వేచ్ఛ కేసు
తెలుగు యాంకర్ స్వేచ్ఛ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. మృతురాలిపై సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. ఇటు తన భర్త అమాయకుడంటూ చెబుతోంది. హైదరాబాద్, సాక్షి: న్యూస్ రీడర్ స్వేచ్ఛా వొటార్కర్(Swetcha Votarkar Case) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడు పూర్ణ చందర్ భార్య స్వప్న మీడియా ముందుకు వచ్చింది. స్వేచ్ఛపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఇటు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదంటూ సాక్షికి తెలిపింది. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ నాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం మొదట్లో నాకు తెలియదు. అది తెలిశాకే పూర్ణను వదిలేశాను. స్వేచ్ఛ నన్ను మానసికంగా వేధించింది. నా పిల్లలను కూడా ‘అమ్మా’ అని పిలవాలని భయపెట్టింది. నా భర్త పూర్ణ నిర్దోషి, అమాయకుడు. .. పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యం. అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడు. పూర్ణనే స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసింది అని స్వప్న మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే.. పలు టీవీ ఛానెల్స్లో న్యూస్రీడర్, యాంకర్గా పని చేసిన స్వేచ్ఛ(40) శుక్రవారం రాత్రి తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని చెబుతూ.. స్వేచ్ఛ సహజీవనం చేసిన పూర్ణచందర్పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పూర్ణచందర్.. చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగానే.. స్వేచ్ఛ కూతురు అరణ్య తనను పూర్ణ వేధించేవాడంటూ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో.. ఇప్పుడు పూర్ణ భార్య మీడియా ముందుకు రావడం గమనార్హం.యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మానసిక వేదన వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న ఆయన.. కేసు నుంచి రక్షించుకోవడానికే పూర్ణ చందర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్ణ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు.. పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవం అని అన్నారాయన. లొంగిపోయే ముందు పూర్ణ చందర్ మీడియాకు విడుదల చేసిన ఐదు పేజీల లేఖలో ఏం ఉందంటే.. నాకు స్వేచ్ఛ 2009 నుంచే తెలుసు. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఓ ఛానెల్లో పని చేశాం. అప్పట్లో స్వేచ్ఛ తన వ్యక్తిగత బాధలు, కుటుంబ సమస్యలను నాతో పంచుకుంటూ ఉండేది. కానీ నిజమైన సాన్నిహిత్యం మాత్రం 2020 తర్వాత మొదలైంది. స్వేచ్ఛ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆమె తల్లిదండ్రుల తీరే. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఆమెను వదిలేసి ఉద్యమాల్లో భాగమయ్యారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిసేవారు. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు నాతో పంచుకుంది. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఆమెని మనోవేదనకు గురి చేశాయి. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హైదరాబాద్లోని కవాడిగూడలో ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇక 2022లో తన కూతురు అరణ్యని కూడా నా వద్దకు తీసుకువచ్చింది. కుమార్తె భవిష్యత్తు పట్ల చాలా ఆందోళనగా ఉండేది. తన కూతురికి తనలాంటి జీవితాన్ని అందించకూడదని చెప్పేది. అందుకే ఆమె అన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. తాను ఒక తండ్రి లా ఆ పిల్ల బాధ్యతలు చూసుకున్నాను. స్వేచ్ఛ జీవితంలో ఎప్పుడూ పూర్తిగా సంతోషంగా లేదు. తన బాధను మర్చిపోవడానికి కుమార్తెతో ఎక్కువ సమయం గడిపి ఓదార్పు పొందేది అని పూర్ణ చందర్ పేర్కొన్నాడు. -
నాన్నా.. ఈ మెంటల్ టార్ఛర్ భరించలేకున్నా!
అన్నానగర్: తిరుప్పూర్ జిల్లా అవినాశిలోని కైకాట్టిపుదూర్ ప్రాంతానికి చెందిన అన్నాదురై బనియన్ కంపెనీ నడుపుతున్నాడు. ఇతని కూతురు రిదన్య ( 27). ఈమెకి కైకట్టిపుదూర్ లోని జయం గార్డె¯న్కు చెందిన కవింకుమార్కు మూడు నెలల క్రితం వివాహమైంది. శనివారం ఇంటి నుంచి కారు తీసుకెళ్లిన రిదన్య ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇంతలో, మొండిపాళయం సమీపంలోని చెట్టిపుత్తూరులో కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు మింగి రిదన్య తన కారులో మృతి చెంది కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న సేవూర్ పోలీసులు రిదన్య మతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కుటుంబ వివాదం కారణంగా రిదన్య విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు రిదన్య తన తండ్రికి వాట్సాప్ ద్వారా కొన్ని ఆడియోలను పంపింది. పోలీసులు వాటిని స్వా«దీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భర్త కవిన్కుమార్, మామగారు ఈశ్వరమూర్తి, అత్తగారు చిత్రాదేవి, ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొంది. ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని వెల్లడించింది. రిదన్యకు పెళ్లయి 3 నెలలే కావడంతో, ఆర్టీఓ దర్యాప్తు కూడా జరుగుతోంది. -
అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..!
వారిది కచ్చితంగా అన్యోన్య దాంపత్యమనే చెప్పొచ్చు. కానీ వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక్కడ అన్యోన్య దాంపత్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అది సీసీ టీవీ ఫుటేజ్ చెబుతున్న మాట. మనిషి మాట నమ్మని ఈ రోజుల్లో.. సీసీ టీవీ ఫుటేజ్ ‘మాట’ కచ్చితంగా నమ్ముతాం. వీరు శవాలుగా మారకముందు గత రెండు రోజుల సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించి చూస్తే వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మరి ఈ జంట ఎలా చనిపోయిందనేది ప్రశ్న. ఏమైనా చిన్నపాటి మనస్పర్థలు తలెత్తి అది ఆత్మహత్య వరకూ వెళ్లిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగానే ఈ కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.రాజస్థాన్ రాష్ట్రంలోనే జైపూర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దంపతుల్లో భర్త పేరు ధర్మేంద్ర కాగా, భార్య పేరు సుమన్. వీరికి 11, 8 ఏళ్లు కల్గిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి ఇద్దరు భరత్పూర్ గ్రామంలో తమ నానమ్మ, తాతయ్యలు దగ్గర ఉంటున్నారు. సమ్మర్ హాలీ డేస్కు తాతయ్య ఇంటికి వెళ్లిన ఆ పిల్లలు ఇంకా రాలేదు.ధర్మేంద్ర- సుమన్ జంట ఈ శుక్రవారం(జూన్ 27వ తేదీ) తమ ఫ్లాట్లో విగతజీవులుగా కనిపించారు. అంతకుముందూ వరకూ ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట.. ఎందుకు ఇలా చేశారు అనేది చర్చగా మారింది. ధర్మేంద్ర బ్యాంక్ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ధర్మేంద్ర బ్యాంక్కు వెళ్లకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని సదర ఉద్యోగి.. ధర్మేంద్ర బంధువులకు తెలియజేశాడు. దీంతో వారు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఆ జంట విగతజీవులుగా కనిపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు. ఇటీవలే రీసెంట్గా ఫ్లాట్ కొనుగోలు చేసిన వీరి ఆర్థికపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు అంటున్నారు. మూడు సీసీ ఫుటేజ్లో ఇలా..ఒక సీసీ ఫుటేజ్లో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వారు ఫ్లాట్లో కారు పార్కు చేసే క్రమంలో భార్య సుమన్.. భర్త ధర్మేంద్ర భుజంపై తలపెట్టుకుని అతని చేతుల్ని పట్టుకుని ఉంది. ఆపై కారు దిగి వెళ్లిపోతున్న వీడియోలో ఆమె భుజంపై భర్త ధర్మేంద్ర చేయి వేసి నడుచుకుంటూ వెళ్లినట్లు ఉంది. అయితే వారు చనిపోవడానికి ముంద రోజు గురువారం మాత్రం ఇద్దరికీ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం భార్య సుమన్.. ఒక క్యారీ బ్యాగ్ తీసుకుని వెళుతున్నట్లు కనిపించింది. అదే వారు చివరిసారి సజీవంగా కనిపించడం. ఆ తర్వాత రోజే ఈ దారుణం చోటు చేసుకుంది. సుమన్ ఒంటిపై గాయాలుఅయితే భార్య సుమన్ ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబంలో ఎటువంటి వైవాహిక విభేదాలు ఉన్నట్లు తమకు కనిపించలేదని పోలీస్ అధికారి అజయ్ సింగ్ తెలిపారు. అయితే ఇద్దరూ సూసైడ్ చేసుకుని ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏమైనా క్లూ దొరుకుతుందనే కోణంలో వారి మొబైల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. -
వివాహితపై అమానవీయ దాడి ఘటన.. పోలీసుల అదుపులో నిందితులు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఓ వివాహితను వివస్త్రను చేసి అమానవీయంగా దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనా ని కి జిల్లా యంత్రాంగం స్పందించింది. న్యా యసేవా అధికార సంస్థ హనుమకొండ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండేతోపాటు మరో జడ్జి శ్రావణ స్వాతి, వివిధ శాఖల అధికారులు, పోలీసులు హుటాహుటిన తాటికాయల గ్రామానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. ఏదైనా సమస్య వచి్చనప్పుడు ప్రజలు పోలీసులను లేదా కోర్టును ఆశ్రయించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జడ్జీలు హెచ్చరించారు. జిల్లాలో న్యాయసేవా అధికార సంస్థను ఏర్పాటు చేశామని.. దీనిద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందుతాయన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనిఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిని కూడా నేరస్తులుగా పరిగణించి శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అశ్లీల వీడియోలు షేర్ చేయడం నేరం ఈ అంశంపై కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై వివరాలు సేకరించగా దాడి జరిగింది నిజమేనని తేలిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని.. బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకరు తప్పు చేశారని, మరొకరు ఇంకో తప్పు చేస్తే పెద్దశిక్షలు పడతాయని చెప్పారు. నిందితులు తమ అదుపులోనే ఉన్నారని, వారిని విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం నేరమని.. అశ్లీల కంటెంట్ను షేర్ చేస్తే సెక్షన్ 67 కింద కనీసం 5 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమామా పడుతుందన్నారు. -
కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రికి సోనీ
హైదరాబాద్: రైలు పట్టాలపై కారు నడిపిన కేసులో నిందితురాలైన వోమికా సోనీని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె మానసిక స్థితి బాగోలేనందున తొలుత చికిత్స తీసుకోవాలని, అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు పర్చాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. 2025 జూన్ 26న(గురువారం) శంకర్పల్లి (రంగారెడ్డి జిల్లా) నాగులపల్లి వద్ద ఓ మహిళ రైలు పట్టాలపై కారు నడిపి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్లపాటు ఆమె అలా పట్టాలపై కారు పోనిచ్చింది. అది గమనించిన స్థానికులు, రైల్వే పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో రాడ్తో ఆమె అందరిపై దాడికి యత్నించింది. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి కారు ఆగిపోగా.. ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఫలితంగా 45 నిమిషాల పాటు రైలు సేవలు నిలిచిపోయాయి. బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిచే 15 రైలు దారి మళ్లించారు. ఘటనకుగానూ ఆమెపై పోలీసులు, రైల్వే పోలీసులు విడివిడిగా కేసు నమోదు చేశారు. తొలుత మద్యం మత్తులో ఆ మహిళ అలా చేసి ఉండొచ్చని పోలీసుల భావించారు. అయితే.. ఆమె పేరు వోమికా సోని(34) అని, లక్నో(యూపీ)కి చెందిన మహిళ అని తర్వాత నిర్ధారించుకున్నారు. ఐటీ జాబ్ పొగొట్టుకున్న ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని.. ఆపై తన కియా కారుతో ఇలా పట్టాలపై బీభత్సం సృష్టించిందని పోలీసులు తేల్చారు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక.. ఆమెపై చర్యల అంశాన్ని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.Video: Woman Drives Car On Railway Track, Disrupts Train Services pic.twitter.com/5MSyXJXzbG— NDTV (@ndtv) June 26, 2025 -
Hyderabad: కోడలితో అఫైర్.. ప్రాణం తీసింది
కుషాయిగూడ(హైదరాబాద్ ): వరుసకు కోడలయ్యే యువతితో సన్నిహితంగా ఉన్నాననే విషయం బయట పడిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చర్లపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లికి చెందిన పంగా భానుచందర్ (30) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు. దమ్మాయిగూడకు చెందిన పెయింటింగ్ కాంట్రాక్టర్, వరుసకు బావ అయ్యే వ్యక్తి వద్ద పని చేస్తూ చర్లపల్లి ఐజీ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బావ కూతురితో పరిచయం పెరిగి ఆమెకు సన్నిహితమయ్యాడు. విషయం తెలిసిన బాధితురాలి తండ్రి, అతడి భార్య గురువారం రాత్రి భానుచందర్కు ఫోన్ చేసి మందలించారు. ఈ విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టామని భార్యాభర్తలిద్దరూ హాజరు కావాలని చెప్పినట్లు మృతుడి భార్య పోలీసులు అందించిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో భానుచందర్ శుక్రవారం పిల్లలను స్కూల్ పంపి పంచాయితీకి వెళ్దామంటూ భార్యకు చెప్పడంతో ఆమె స్నానానికి వెళ్లింది. దీంతో బాత్రూం బయట నుంచి గడియ పెట్టిన భానుచందర్.. నలుగురిలో తన పరువు పోతుందన్న భయంతో ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. బాత్రూం తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడంతో గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విన్న ఇరుగు పొరు గు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా భానుచందర్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న భానుచందర్ను కిందికి దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ‘సాక్షి’కి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడి (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
కోల్కతా: దేశమంతటా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ కాలేజీ మెడికోపై హత్యాచార ఘటనను మరవకముందే కోల్కతాలో అలాంటిదే మరో దారుణం జరిగింది. సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు.అతనో క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అదే లా కాలేజీలో చదివాడు. 45 రోజుల కాంట్రాక్టుపై ప్రస్తుతం కాలేజీలో బోధనేతర విధుల్లో పనిచేస్తున్నాడని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నైనా చటర్జీ చెప్పారు. అంతేగాక అలీపోర్ పోలీస్ అండ్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్గా చేస్తున్నట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. టీఎంసీకి చెందిన పలువురు నేతలతో మోనోజిత్కు దగ్గర సంబంధాలున్నట్లు సమాచారం. ఘటనపై వామపక్ష విద్యార్థి విభాగం, కాంగ్రెస్ శ్రేణులు కస్బా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.తృణమూల్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు అత్యాచారోదంతంపై తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘యువతులు తాము ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నామో చూసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి చోటా మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ ఉదంతంపై నిరసనలు పెరిగి పెద్దవవుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ప్రధాన నిందితుడు మోనోజిత్తో పారీ్టకి సంబంధం లేదని ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొంది. కానీ తృణమూల్ ప్రకటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ తృణమూల్ నేతలతో పాటు మోనోజిత్ ఎన్నోసార్లు వేదికలపై కని్పంచినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతకు సీఎంగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి మండిపడ్డారు. -
విశాఖలో ఆరుగురిని హత్య చేసిన కేసులో సంచలన తీర్పు
-
నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?
మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు. ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే ఆ ట్రైన్ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్లో..ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది. ఇటీవల సియోల్కు చెందిన వాన్ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు. సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ట్రైన్ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్ డబ్బా బ్యాగ్తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్ కోచ్లో జనం కాస్త సంతోషంగా కనిపించారు. తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్లోని ప్రయాణికులు పరుగులు తీశారు. పెట్రోల్ మొత్తం కోచ్ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి. సముద్రగర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిందితుడు వాన్ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 240,000 యూఎస్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వాన్పై హత్యాభియోగాలుఈ దారుణానికి పాల్పడ్డ వాన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కదులుతున్న ట్రైన్లో ఘటన జూన్ 9న జరగ్గా, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు. ట్రైన్లో పెట్రోల్ పోసిన ఘటన వీడియో వైరల్గా మారింది.서울지하철 5호선 방화범 CCTV사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH— 브이몬 (@XXV_mon) June 25, 2025 -
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదం
ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యవేములవాడరూరల్: ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్లకు చెందిన వాణి–లింగయ్యలకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి ఫ్యాన్లు రిపేర్ చేస్తుండగా, తల్లి గ్రామంలోనే గాజులషాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె చేని వైష్ణవి(20) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. 15 రోజుల క్రితం ఇంటికొచి్చంది. పలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది గురువారం ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఇంట్లోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సిరిసిల్ల బైపాస్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కామారెడ్డికి చెందిన ఇద్దరు వేములవాడ నుంచి సిరిసిల్ల బైపాస్ మీదుగా కారులో వెళ్తున్నారు. వెంకటాపూర్ వద్ద కుడివైపు మళ్లకుండా ఎదురుగా వెళ్లి వాగుమడి రాజయ్య ఇంటిని ఢీకొట్టారు. ఆ సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటికే గ్రామస్తులు గుమిగూడారు. కారు డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. దీంతో కారును అక్కడే వదిలేసి ఇద్దరు పరారయ్యారు. కారులో బీరు బాటిళ్లు, బిర్యాని పొట్లాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారని చెప్పారు. కారును పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. -
మళ్లీ చిక్కిన ఘరానా దొంగ మహ్మద్ సలీం
సాక్షి, సిటీబ్యూరో/పహాడీషరీఫ్: అసలు పేరు మహ్మద్ సలీం... మారు పేరు సునీల్శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 187 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే సునీల్ గత నెల 5న జైలు నుంచి బయటకు వచ్చాడు... మరో రెండు నేరాలు చేసి బండ్లగూడ పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజం ఈ సునీల్ శెట్టి నైజం. ఈ ఘరానా దొంగను బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్ గురువారం వెల్లడించారు. మార్చిన ‘ఆమె’ పరిచయం... ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్ఘాట్లోని ఓ హోటల్లో కారి్మకుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు. ఇంటి తాళం ముట్టనే ముట్టడు... ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్ఫోన్లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్పాస్ చేస్తాడు. చిన్న టార్చ్లైట్, కటింగ్ ప్లేయర్తో ‘రంగం’లోకి దిగే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచి్చనా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు దృష్టిపెట్టరని ఇలా చేస్తుంటాడు. లోపలకు వెళ్లాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి.