వికారాబాద్‌లో దారుణం.. పాయిజన్‌ సిరంజీతో తల్లిదండ్రులను కడతేర్చింది | Shocking Incident In Vikarabad, Daughter Ends Her Parents Lives For Refusing To Get Love Marriage, Watch Video For Details | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో దారుణం.. పాయిజన్‌ సిరంజీతో తల్లిదండ్రులను కడతేర్చింది

Jan 28 2026 1:22 PM | Updated on Jan 28 2026 2:07 PM

daughter poisons parents over love marriage vikarabad

వికారాబాద్‌ జిల్లా: బంటారం మండలం యాచారం గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన మానవ సంబంధాల పతనాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారన్న కారణంతో కూతురే వారిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పోలీసుల కథనం ప్రకారం.. యాచారం గ్రామానికి చెందిన సురేఖ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే ఈ సంబంధానికి ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో సురేఖ వారిపై కక్ష పెంచుకుంది.

ఈ క్రమంలోనే సురేఖ తల్లిదండ్రులను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే హత్య అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తల్లిదండ్రుల మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు కూడా తొలుత ఎలాంటి అనుమానం రాకపోవడంతో విషయం బయటకు రాలేదు. అయితే పోలీసులకు అందిన గోప్య సమాచారం ఆధారంగా కేసు మళ్లీ లోతుగా దర్యాప్తు చేయగా, సురేఖ ప్రవర్తనపై అనుమానాలు బలపడ్డాయి. విచారణలో ఆమె చేసిన నేరం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారనే కారణంతోనే తల్లిదండ్రులను హత్య చేసినట్లు సురేఖ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సురేఖను అదుపులోకి తీసుకుని, ఆమె ప్రియుడి పాత్రపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement