ప్రధాన వార్తలు

తెలుగు సెంటిమెంట్ పండుతుందా?
మోకాలికి... బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే. రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకునే పక్షానికే తాము ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతి ఇస్తామని బీఆర్ఎస్ చెప్పడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమల్లోకి రావాలంటే కాంగ్రెస్ అధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని గెలిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరూ కలిసి రావాలని కూడా ఆయన కోరారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఆయన లోక్ సభకు ఎన్నిక అవ్వడానికి అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు మద్దతిచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సెంటిమెంట్ రాజకీయాలు పనిచేసే అవకాశం తక్కువే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇస్తే తాను కలిసి మద్దతు కోరతానని రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ ఒక చిల్లరపార్టీ అని, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తేల్చేశారు. మరో వైపు తాము బీఆర్ఎస్ మద్దతు కోరలేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదన్నమాట. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్ను సంప్రదించలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.మరోవైపు జస్టిస్ సుదర్శనరెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబధాలు ఉన్నట్టుగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణకు చెందిన పార్టీ. ఆ రాష్ట్రానికే చెందిన ప్రముఖుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతివ్వడం ఒక నైతిక బాధ్యత. జస్టిస్ సుదర్శనరెడ్డి పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండదు కానీ ఆయన కాంగ్రెస్ కూటమి పక్షాన పోటీలో ఉండడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా బీఆర్ఎస్ పోటీపడుతోంది. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ఇస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందన్నది వారి భయం కావచ్చు.అలాగని బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతిస్తే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసిపోయాయన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఉన్న నాలుగు ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. తటస్థంగా ఉండే అవకాశం ఉంది. పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్సభకు పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనకు మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ.. తరువాతి కాలంలో పీవీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీని చీల్చి ఏడుగురు ఎంపీలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. పైగా... పీవీ ప్రధానిగా ఉండగా.. ఆ తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పుడు ఎత్తి చూపుతున్నాయి. పీవీ మరణాంతరం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీస్ ఆవరణలోకి అనుమతించలేదని ఆ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయం. ప్రముఖ నేత నీలం సంజీవరెడ్డి తొలిసారి కాంగ్రెస్ అధికారిక అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్ర అభ్యర్ది వీవీ గిరికి మద్దతిచ్చారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డికి కాకుండా వీవీ గిరికి మద్దతిచ్చింది. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా తెలుగు సెంటిమెంట్ పట్టించుకోలేదన్నమాట. నీలం సంజీవరెడ్డి రెండోసారి జనతా పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సపోర్టు చేసిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గోపాలకృష్ణ గాంధీని బలపరిచింది. ఇక ఏపీ విషయాన్ని చూస్తే రెండు సభలలో కలిపి తెలుగుదేశం కు 17 మంది ఎంపీల బలం ఉంది. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్కు 11 మంది ఎంపీలున్నారు. తమకు మద్దతివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కోరారు. రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు అనుసరించడానికి జగన్ ఒక పద్దతి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక టీడీపీ, జనసేనలు ఎన్డీయేలోనే ఉన్నందున అవి సుదర్శనరెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదు.చంద్రబాబుకు, రేవంత్ రెడ్డి కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. కాకపోతే జస్టిస్ సుదర్శనరెడ్డి తనకు చంద్రబాబుతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబుతో ప్రత్యేక అనుబంధం ఉందని కాని, సంబంధం లేదని కానీ చెప్పలేనని ఆయన అంటున్నారు. 1995లో ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పు ఇచ్చిన బెంచ్లో తాను కూడా సభ్యుడనని ఆయన వెల్లడించారు. చంద్రబాబు మంచి, చెడు బెరీజు వేసుకోవచ్చని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. సుదర్శనరెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్డీయేను కాదనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక ప్రకటన చేస్తూ సుదర్శనరెడ్డికి మద్దతు ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై ఆశలు పెంచుకుంటున్నట్లుగా ఉంది. బీహారు శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి ఓడిపోతే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం కాని చంద్రబాబుతో కాంగ్రెస్కు ఉన్న రహస్య సంబంధాలను ఆమె తెలియచేసినట్లుగా ఉంది.రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ పెట్టుకున్నారని ఇప్పటికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకు చూస్తే లోక్ సభలో కాంగ్రెస్కు ఎనిమిది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు ఒకటి, బీఆర్ఎస్కు నాలుగు రాజ్యసభ స్థానాలూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సుదర్శనరెడ్డికి కేవలం ఈ 12 మంది మద్దతు మాత్రమే లభించే పరిస్థితి ఉంది. కాగా తెలుగు సెంటిమెంట్ను రేవంత్ రెడ్డి వాడితే, బీజేపీ కూటమి తమిళ సెంటిమెంట్ వాడే అవకాశం ఉంటుంది. అక్కడ మెజార్టీ స్థానాలు డీఎంకే పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకేలు ఒకే కూటమిలో ఉన్నాయి. అక్కడ బీజేపీ పక్షాన ఒక్క ఎంపీ కూడా లేరు. అన్నాడీఎంకేకు మాత్రం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన వారు డీఎంకే, కాంగ్రెస్ కూటమికి చెందినవారే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన బీజేపీ నేతను ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో దించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ ఎంపిక చేసి ఉండవచ్చు. పోటీచేస్తున్న రాధాకృష్ణన్ తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, సుదర్శనరెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి మెజార్టీ మద్దతు పొందలేరన్నమాట. కాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదే,పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన ప్రముఖుడిని అభ్యర్ధిగా ఎలా పెడతారని బీజేపీ, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయి. సుదర్శనరెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది కూడా మోకాలికి, బోడు గుండుకు ముడిపెట్టడమే. కాగా ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందినవారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ బీసీ కార్డు ఈ సందర్భంగా పనిచేసే అవకాశం ఉండదు. మొత్తం మీద జస్టిస్ సుదర్శనరెడ్డిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తన పరపతి పెంచుకునే అవకాశం ఉంది.అంతకు తప్ప ఆయన ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కాని, బిసి రిజర్వేషన్ ల వాదన కాని ఫలించే పరిస్థితి కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. బీఆర్ఎస్కు ప్లస్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న ఐదుగురికి నోటీసులు పంపించారు. నేడు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే, స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానమిస్తానని అన్నారు. తాను అసలు పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.మరోవైపు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్. ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేకి నోటీసులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్కు రాజీనామా చేయని సంజయ్. దీంతో, సంజయ్కు నోటీసులు ఇస్తారా? లేదా? అని స్థానికంగా చర్చ నడుస్తోంది.

వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని: ట్రంప్
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో పుతిన్-జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ముందుగా కలుస్తారో లేదో చూడాలనుకుంటున్నాను. పుతిన్-జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం.. నూనె వెనిగర్ను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ. వారిద్దరూ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఒకవేళ సమావేశం జరగకపోతే, ఎందుకు సమావేశం కాలేదో అందుకు గల కారణాలను తెలుసుకుంటానని అన్నారు. శాంతి చర్చలకు రష్యా ఒప్పుకోని క్రమంలో మాస్కో మరోసారి భారీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు.Q: “How long will you give Putin?”Trump: “A couple of weeks. We’re going to figure this out. It takes two to tango… In the meantime, people continue to die.”Trump is NEVER going to hold Putin accountable. Ever.pic.twitter.com/TusMVxEIXk— Republicans against Trump (@RpsAgainstTrump) August 22, 2025అయితే ఇరు దేశాలూ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రజలను చంపుకుంటూనే ఉన్నారు. ఇది చాలా మూర్ఖత్వం. యుద్ధం వల్ల వారానికి 7,000 మంది చనిపోతున్నారు. నేను ముందు 5,000 అన్నాను కానీ ఇప్పుడు 7,000 మంది వారానికి చనిపోతున్నారు. అందులో ఎక్కువ మంది సైనికులే ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్లో ఒక అమెరికన్ కర్మాగారం దెబ్బతిన్నట్టు వచ్చిన వార్తపై స్పందిస్తూ ట్రంప్ స్పందించారు. రష్యా దాడుల విషయంలో తాను సంతోషంగా లేనని చెప్పారు. తాను ఏడు యుద్ధాలను పరిష్కరించానని చెప్పారు. మొత్తం 10 యుద్ధాలు ఆపిన తాను ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో అస్సలు సంతోషంగా లేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్- పాక్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇండియా–పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని తాను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు.

వామ్మో వెండి హ్యాట్రిక్.. బంగారం భారీ షాక్
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. తులం రూ.లక్షకు చేరిన తర్వాత కొద్దికాలంగా ఫ్లాట్గా కొనసాగుతున్న పసిడి ధరలు నేడు (శనివారం) ఒక్కసారిగా ఎగిసి కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. మరో వైపు వెండి ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగి హ్యాట్రిక్ కొట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఆసియాకప్ పుట్టింది ఇలా.. తొలి టైటిల్ ఎవరిదంటే?
ఆసియా దేశాల మధ్య క్రికెట్ సమరానికి సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇందుకోసం ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ వంటి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో ఈ ఆసియాకప్ ఎప్పుడు మొదలైంది? ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.సెప్టెంబర్ 13.. 1984న ఒక కొత్త వన్డే టోర్నమెంట్ క్రికెట్ ప్రపంచానికి పరిచియమైంది. అదే ఆసియా కప్. దక్షిణాసియా పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్, శ్రీలంకల మధ్య క్రికెట్, దైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచేందుకు 19 సెప్టెంబర్, 1983న ఆసియా క్రికెట్ కౌన్సిల్ను స్ధాపించారు. ఈ ఏసీసీనే ఆసియాకప్ పుట్టుకకు కారణమైంది. తొలి టైటిల్ మనదే..ఆసియాకప్ తొలి ఎడిషన్కు యూఏఈలోని షార్జా అతిథ్యమిచ్చింది. అయితే ఈ టోర్నీలో 1983 ఐసీసీ ప్రూడెన్షియల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా పాల్గొనడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. అయితే ఈ టోర్నీకి 1983 ప్రపంచ కప్ గెలిచిన పూర్తి జట్టును బీసీసీఐ పంపలేదు. కపిల్ దేవ్, కె శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, మోహిందర్ అమర్నాథ్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్దానంలో మనోజ్ ప్రభాకర్, చేతన్ శర్మ, సురీందర్ ఖన్నా వంటి ఆటగాళ్లు మాత్రం తొట్ట తొలి ఆసియాకప్లో భాగమమయ్యారు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లోనే సునీల్ గావస్కర్ సారథ్యంలోని భారత బృందం అద్బుతం చేసింది.ఈ మ్యాచ్లో శ్రీలంకను ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే తొలి ఎడిషన్లో కేవలం శ్రీలంక, భారత్, పాక్ జట్లు మాత్రమే తలపడ్డాయి. ఫైనల్లో పాక్ను చిత్తు చేసిన భారత్ తొట్ట తొలి ఆసియాకప్ టైటిల్ను సొంతం చేసుకుంది.ఏకైక జట్టుగా శ్రీలంక..ఇప్పటివరకు 16 ఆసియాకప్లు జరిగితే అన్ని టోర్నీలో ఆడిన ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక భారత్, పాకిస్తాన్లు చెరో 15 సార్లు ఆసియాకప్లో పాల్గొన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1986 టోర్నమెంట్ను భారత్ బహిష్కరించింది. అనంతరం భారత్ వేదికగా 1990-91 ఆసియాకప్ను పాక్ బాయ్కట్ చేసింది. ఇదే కారణంతో 1993లో ఆసియాకప్ను నిర్వహించలేదు. బంగ్లాదేశ్ కూడా 15 సార్లు ఆసియాకప్లో భాగమైంది.ఐసీసీ జోక్యం..కాగా 2015లో ఆసియాకప్నకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. టోర్నీ నిర్వహించే ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఐసీసీ అధికారాలు తగ్గించింది. ఇకపై ఆసియాకప్ రెండేళ్లకోసారి వన్డే, టి20 ఫార్మాట్లో రొటేషన్ పద్దతిలో జరుగుతుందని తెలిపింది.ఐసీసీ టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫలితంగా 2016లో ఆసియాకప్ను తొలిసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. టీ20 ప్రపంచకప్-2026కు ముందు సన్నాహక టోర్నమెంట్గా అది ఉపయోగపడింది. మొట్టమొదటి ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్ను కూడా టీమిండియానే కైవసం చేసుకుంది.తిరుగులేని భారత్..1984 నుంచి 2023 వరకు 16 సార్లు ఆసియా కప్ను నిర్వహించారు. 2022 లో చివరిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించగా, నాడు ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో భారత జట్టుకు మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇక ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఛాంపియన్గా నిలిచింది. అందులో 7 సార్లు వన్డే ఫార్మాట్లో టైటిల్ను సొంతం చేసుకోగా.. ఒక్కసారి టీ20 ఫార్మాట్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ టోర్నీని ముద్దాడాయి.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం

ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ
మన జీవితంలో మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఉంటారు, అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా మనల్ని ద్వేషించే వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనల్ని ఇష్టపడేవాళ్ళకు దగ్గరగా ఉండాలనుకుంటాం. అయితే అదే ఇష్టం ఎక్కువై, ఆ ఇష్టం మనకి కష్టం తెచ్చిపెడితే ఎలా ఉంటుంది? అన్న సున్నితమైన పాయింట్తో తీసిన ఓ భావోద్వేగంతో కూడిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘మామన్’. ఓటీటీలో సూపర్ హిట్ మూవీఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రశాంత్ పాండ్యరాజన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్. అలా అని దీంట్లో పెద్ద స్టార్, గ్లామర్ యాక్షన్ ఇటువంటివి ఏమీ లేకపోయినా సినిమా చూస్తున్నంతసేపు సీటులోంచి కదలలేరు. అంతలా కట్టిపడేస్తుంది. ప్రముఖ తమిళ కమెడియన్ సూరి కథానాయకుడిగా ఈ సినిమాలో నటించి, మెప్పించారు. ఇంకా చెప్పాలంటే సినిమా చూసే ప్రేక్షకుల మనస్సులను కదిలించారు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం (Maaman Movie Review). కథ‘మామన్’ సినిమా కథ ప్రకారం తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అక్కా తమ్ముళ్ళు. ఇన్బాకు అక్కంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తరువాత అతి కష్టం మీద ఓ బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పేరు లడ్డూ. అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటుంటాడు. ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి రేఖకన్నా లడ్డూ మీదే మమకారం పెంచుకుంటాడు. అయితే అదే సమయంలో ఇన్బా తండ్రి అవుతాడు. ఇక అక్కడి నుండి అసలు సిసలైన కథ మొదలవుతుంది. ఎలా ఉందంటే?అక్క బిడ్డా లేక తనకు పుట్టబోయే బిడ్డా అన్న సంఘర్షణలో కథ ఏ మలుపు తిరుగుతుందో సినిమాలోనే చూడాలి. చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో భావుకతతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టనీయకుండా చక్కటి స్క్రీన్ప్లేతో సినిమాని నడిపిన విధానం నిజంగా అభినందనీయం. ఈ భూమ్మీద భావావేశాలున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అంశం ఈ సినిమాలో ఉంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు, చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఖరుగా ‘మామన్’ మామూలు సినిమా అయితే కాదు. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.– హరికృష్ణ ఇంటూరు

కుప్పం నుంచి కుట్రలకు క్లాప్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో అందుబాటులో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోంది. ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలను నీరుగారుస్తూ ‘డింక్’ (డిజిటల్ నెర్వ్ సెంటర్) పేరుతో ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్లతో పీహెచ్సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లను అనుసంధానించి స్పెషలిస్టులతో వైద్య సేవలు అందించగా గొప్పగా నడుస్తున్న ఈ వ్యవస్థలను అటకెక్కించిన బాబు సర్కారు ముడుపుల కోసం కొత్త ప్రాజెక్టును తెచ్చింది. గతంలో అందించిన టెలీ మెడిసిన్ సేవలకే కలరింగ్ ఇస్తూ సమర్థంగా సేవలు అందించిన విలేజ్ క్లినిక్స్కు పాతరేసింది. వైద్య సేవల్లో ఇప్పుడేదో సరికొత్త వ్యవస్థను తెస్తున్నట్లు మభ్యపెడుతూ ‘డింక్’ పేరుతో రూ.350 కోట్ల ప్రజాధనానికి టెండర్ పెట్టింది! సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం కేంద్ర బిందువుగా ‘పైలెట్’ ప్రాతిపదికన ఈ దోపిడీ వ్యవహారాలకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలలుగా ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘డింక్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ‘డింక్’ ప్రాజెక్టులో భాగంగా రేషనలైజేషన్ పేరిట ఏకంగా 2,500 నుంచి 3 వేల విలేజ్ క్లినిక్లను మూసివేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించిన వ్యవస్థలను నీరుగార్చి ప్రైవేట్ సంస్థల సేవల పట్ల మొగ్గు చూపడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్నికైన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఈ క్రమంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్యులే నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేలా విప్లవాత్మక రీతిలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ ప్రజలందరికీ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్సను పేదలకు ఉచితంగా అందించారు. వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తూ జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఏకంగా 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీ మాటే లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యుల కొరత 50% ఉంటే రాష్ట్రంలో కేవలం 1.4% మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61% ఉంటే ఏపీలో 6.2 శాతం మాత్రమే ఉండేది. కేవలం వైద్య నియామకాలే కాకుండా ఆస్పత్రుల్లో మందుల కొరతకు తావు లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. నిధులు దుర్వినియోగం కాకుండా 2019–24 మధ్య జగన్ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తే నేడు పీపీపీ ప్రాజెక్టుల రూపంలో చంద్రబాబు ప్రజారోగ్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారు. రోగులకు ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు రూ.నాలుగు వేల కోట్లు పెండింగ్లో పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ‘డింక్’ ప్రాజెక్టు ఏమిటంటే..?‘డింక్’ పేరిట కుప్పంలో ఓ సెంటర్ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు అనుసంధానించారు. ఇక్కడికి వచ్చే రోగులకు డిజిటల్ హెల్త్ అకౌంట్ జారీచేసి ఈ సెంటర్ ద్వారా ఫోన్లో స్పెషలిస్ట్ వైద్యసేవలను అందచేస్తారు. అవసరం మేరకు వైద్యుడు వీడియో కాల్ చేసి రోగితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. సెంటర్లో ఉండే ఆరోగ్య సిబ్బంది గర్భిణులు, బాలింతలు, ఇతరులకు ఆరోగ్య సంరక్షణపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. స్థూలంగా చెప్పాలంటే ‘డింక్’ ప్రాజెక్టు అచ్చు టెలీ మెడిసిన్ లాంటిదే. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కుప్పం పరిధిలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి రూ.350 కోట్ల మేర ఖర్చవుతుందని సంబంధిత సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. టెలీ మెడిసిన్తో అంతకంటే మెరుగ్గా..గత ప్రభుత్వం పైసా కూడా దుర్వినియోగం కాకుండా అంతకంటే మెరుగ్గా ప్రజలకు టెలీ మెడిసిన్ సేవలను అందించింది. 26 జిల్లాల్లో వైద్య కళాశాలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ హబ్లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,400కిపైగా పీహెచ్సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్ క్లినిక్లను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి మూడు రకాల స్పెషలిస్ట్ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంచింది. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలీమెడిసిన్ ద్వారా హబ్లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించారు. హబ్లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ ద్వారా రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్ సూచించేవారు. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్లో ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పనిచేసింది. స్మార్ట్ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలు పొందడానికి కూడా ఆస్కారం కల్పించారు. స్మార్ట్ఫోన్ లేనివారు, వినియోగం తెలియని వారికి ఆశావర్కర్లు సహాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసిన గత ప్రభుత్వం వాటన్నింటినీ హబ్లకు అనుసంధానించింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు, నిధుల దుర్వినియోగానికి ఏమాత్రం తావులేకుండా గత ప్రభుత్వంలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు పారదర్శకంగా అందాయి.నాడు దేశానికే ఆదర్శంగా..నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసి టెలీ మెడిసిన్ వైద్యసేవలు అందించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీపీపీ ప్రాజెక్టుల రూపంలో రూ.వందల కోట్ల నిధులు దుబారా చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటైన హబ్లను మరింత బలోపేతం చేసి టెలీవైద్య సేవలు అందించవచ్చని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.ప్రివెంటివ్ కేర్ బలోపేతం.. వైఎస్ జగన్ పాలనలో 2019–24 మధ్య ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ప్రివెంటివ్ కేర్ను బలోపేతం చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణాల్లో 562 యూపీహెచ్సీలను నెలకొల్పారు. మండలానికి రెండు పీహెచ్సీలు/ఒక పీహెచ్సీ, ఒక సీహెచ్సీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు ప్రభుత్వ వైద్యులను సమకూర్చారు. అంతేకాకుండా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్సీలు, పీహెచ్సీలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు, ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్యసేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్ క్లినిక్స్ను నెలకొల్పారు.వైద్యులే ప్రజల వద్దకు..వైద్యం కోసం ప్రజలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేకుండా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్యులనే ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. విప్లవాత్మక రీతిలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ వైద్యులను గ్రామాలకు పంపి వైద్యసేవలు అందించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని వాకబు చేసి వ్యాధులను ముందే గుర్తించడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుచేశారు. ఇందులో భాగంగా ఊరూవాడా స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంపులు నిర్వహించి అనారోగ్య బాధితులకు కొండంత భరోసా కల్పించారు. 16 రకాలు టెస్టులు ఉచితంగా చేశారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. అంతేకాకుండా గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఇళ్ల వద్దే ఖరీదైన మందులను ఉచితంగా డోర్ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్వో ప్రమాణాలతో మందులు అందచేశారు. అంత గొప్పగా ఉన్న ఆరోగ్య రంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు సర్కారు నిధులను దోచిపెట్టే ప్రాజెక్టులకే జైకొడుతోంది.

ట్రంప్ మరో ఎత్తుగడ: భారత రాయబారిగా సన్నిహితుడు సెర్గియో గోర్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను తనదారికి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ పై తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ ఇప్పుడు తన దగ్గరున్న మరో అస్త్రం ప్రయోగించారు. భారత్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్లో తమ దేశ రాయబారిని మారుస్తూ అకస్మాత్తు నిర్ణయం తీసుకున్నారు.భారత్- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ నిర్ణయం కీలకంగా పరిణమంచింది. వైట్ హౌస్లో తనకు అత్యంత సన్నిహితుడు, పర్సనల్ డైరెక్టర్ గా ఉన్న సెర్గియో గోర్ ను ట్రంప్ భారతదేశ నూతన రాయబారిగా నియమించారు. చమురు కొనుగోలు తదితర అంశాలలో భారత్ రష్యా బంధం బలపడుతున్న సమయంలో ట్రంప్.. సర్గియోకు నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ఈ పదవి ఖాళీ అయిన ఎనిమిది నెలల తర్వాత ఈ తాజా నియామకం జరిగింది. సెర్గియో గోర్ అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత విధేయునిగా పేరుగాంచాడు. భారత రాయబాది సెర్గియో గోర్ నియామకాన్ని తన ట్రూత్ సోషల్లో తెలియజేసిన ట్రంప్ త్వరలోనే ఆయన పరిపాలనా విభాగంలో చేరనున్నారని ప్రకటించారు. సెర్గియో గోర్ దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. ఆయనను స్పెషల్ ఎన్వాయ్ ఫర్ సౌత్ సెంట్రల్ ఏసియన్ ఎఫైర్స్గా ట్రంప్ నియమించారు. ఆయన భారత్కు వెళ్లేంతవరకు వైట్హౌస్లోనే తన పాత విధులను నిర్వహిస్తారని ట్రంప్ ఆ పోస్ట్ లో తెలియజేశారు.సెర్గియో తనకు అత్యంత సన్నిహితునిగా ఉన్నారని, చాలా కాలంగా తనకు మద్దుతునిస్తూ, తాను ఎన్నికల్లో గెలిచేందుకు అమితమైన కృషి చేశారని తెలిపారు. అమెరికా అధ్యక్ష సిబ్బందిగా సెర్గియో పాత్ర చాలా కీలకమైనదని ట్రంప్ పేర్కొన్నారు. తాను పాలనలోకి అడుగుపెట్టాక సెర్గియో ఎన్నోమంచి పనులు చేశారన్నారు. ఆయన తన బృందంలో నాలుగువేల మంది దేశ భక్తులను నియమించుకున్నారని,ఫెడరల్ ప్రభుత్వ శాఖల్లోని 95 శాతం ఉద్యోగాలను ఆయన భర్తీ చేశారన్నారు. అతి పెద్ద జనాభా కలిగిన భారత దేశంలో అమెరికా ఎజెండాను పూర్తి చేసేందుకు సెర్గియో తోడ్పడతారని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ జబ్బుకి మందు కనిపెట్టండి ప్లీజ్!
భార్యను బాడీ షేమింగ్ చేయడంఎప్పటి నుంచో ఉంది. శరీర ఆకృతిని బట్టి పేర్లు పెట్టి పిలుస్తూ వేధిస్తారు భర్తలు. తాజాగా ఒక భర్త మరీ శృతి మించాడు. భార్యను నోరా ఫతేహీలా మారమని రోజుకు మూడు గంటలు జిమ్ చేయిస్తున్నాడు. జిమ్ చేయలేని రోజు పస్తు పెడుతున్నాడు. గర్భం వస్తే అబార్షన్కూ వెనుకాడటం లేదు. ఘజియాబాద్లో ఆ భార్య పోలీస్ స్టేషన్కు వచ్చి ‘ఈ భర్త నాకు వద్దు’ అని ఫిర్యాదు చేసింది.అంతా నచ్చి, అన్నీ చూసి వివాహం చేసుకున్నాక భర్తలకు వస్తున్న ఈ పాడు జబ్బుకు మందు వెతకాలి. భార్య పొట్టిగా ఉంటే ఒక నిక్నేమ్, సన్నగా ఉంటే మరొకటి, నల్లగా ఉంటే... లావుగా ఉంటే... పొడవుగా ఉంటే... పలు వరుస సరిగా లేకపోతే... జుట్టు పలుచగా ఉంటే... శరీర అంగాలు పెద్దవో చిన్నవో ఉంటే... భర్తలు వాటిని కేంద్రంగా చేసుకుని నిక్నేమ్స్తో పిలుస్తూ ఇంట్లో, పిల్లల ఎదుట, బంధువుల సమక్షంలో ఆట పట్టించడం ఆనవాయితీ. దీనికి అంగీకారం ఉండటం మన సంప్రదాయం. ఆ నిక్నేమ్స్ ఏదో సరదాగా పెట్టినట్టు అనిపించినా, భర్త అలా పిలవడంలో ఏదో గారాబం కనిపించినా, ఆ పేర్లన్నీ భార్యను బాడీ షేమింగ్ చేసేవే. భార్య తన భర్తకు నిక్నేమ్ పెట్టదు. పెట్టలేదు. పెట్టి నలుగురిలో పిలిస్తే పర్యవసానాలు మనకు తెలుసు. కాని భర్తలు మాత్రం భార్యలను బాడీ షేమింగ్ చేయడం తమ హక్కుగా భావిస్తూ ఉంటారు.ఫిట్నెస్ వేరు... అందం వేరుభార్యాభర్తలు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాల్సిందే. పిల్లలు పెరిగి ఒక వయసు వచ్చాక శారీరక మార్పులు స్త్రీ, పురుషుల్లో వస్తాయి. ఫిట్నెస్ కోసం కనీస వ్యాయామం, వాకింగ్, ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ఇరువురూ పాటించాల్సిందే. భార్య ఫిట్నెస్ కోసం భర్తలు సూచనలు చేయడం, వ్యాయామం కోసం ప్రోత్సహించడం మంచి విషయం. కాని సౌందర్యాభిలాషతో, ఇతర స్త్రీలతో పోలుస్తూ... ఈ విధంగా ఉంటే నువ్వు బాగుంటావు... లేకుంటే నచ్చవు అనే సందేశం ఇస్తున్నట్టుగా మాట్లాడటం ఆమెను హింసించడమే. జన్యువుల వల్ల, శరీర తత్వం వల్ల కొందరు స్త్రీల శరీరంలో వ్యాయామంతో తగ్గని బరువు ఉండొచ్చు. లేదా కాన్పుల వల్ల, మెనోపాజ్ వల్ల కూడా తీవ్రమైన మార్పులు రావచ్చు. వాటిని అర్థం చేసుకుని, భార్య ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి తప్ప అనునిత్యం కించ పరుస్తూ ఉంటే తప్పు,.. నేరం కూడా. కాని భర్తలు ఈ విషయంలో మారడం లేదు. సొంత పిల్లల ఎదుట కూడా భార్యను గేలి చేస్తూ పిల్లలు ఆమెను తేలిగ్గా తీసుకునేలా చూస్తున్నారు.నోరా ఫతేహీలా ఉండుకాని ఆగస్టు 20వ తేదీన ఒక భార్య ఆవేదన ఇలాంటి భర్తల స్వభావాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన ఒక వివాహిత అక్కడి మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చి భర్త మీద కేసు పెట్టింది. ఆమె తన ఫిర్యాదులో– ‘నేను ఈ సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్నాను. నా భర్త ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. పెళ్లిలో మా వాళ్లు 6 లక్షల బంగారం, 24 లక్షల స్కార్పియో, 10 లక్షల రొక్కం ఇచ్చారు. కాని పెళ్లయి వచ్చినప్పటి నుంచి నన్ను నా భర్త నోరా ఫతేహీ ఫిగర్లాంటిది సాధించాలని వేధిస్తున్నాడు. ఇందుకోసం నాకు రోజుకు 3 గంటల వర్కవుట్ చెప్పి చేయిస్తున్నాడు. ఆ వర్కవుట్లు చేసి అలసి ఏ రోజైనా చేయకపోతే ఆ రోజు నాకు అన్నం పెట్టడం లేదు. అత్తామామలు కూడా అతనికి వంత పాడుతున్నారు. నేను చూడటానికి బాగానే ఉంటాను. కాని అతను అది చాలదని, పిల్లలు కూడా ఇప్పుడే వద్దని, గర్భం వస్తే అబార్షన్ చేయించుకోవాలని చెబుతూ నన్ను భయభ్రాంతం చేస్తున్నాడు. ఈ భర్త వద్దు’ అని ఫిర్యాదు చేసింది.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లుఆరోగ్యం, అనురాగంభార్యాభర్తల మధ్య ఉండాల్సింది అనుబంధం, అనురాగం, గౌరవం. వారిరువురూ తమ బంధాన్ని బలపరుచుకుంటూ పరస్పరం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ సంతోషంగా జీవిస్తే రూపం సమస్య కాబోదు. రూపదోషాల నిర్వచనం ఒకరి సొత్తు కాదు. కొలతలతో ఉండేదే ఆకృతి కాదు. సంతోషకర దాంపత్యమే అందం, ఆనందం. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!

కోట్ల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి ఎలా ఇస్తారు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలోని విలువైన స్థలాలను కారుచౌకగా అనుయాయులకు అప్పగిస్తున్న కూటమి ప్రభుత్వం, తాజాగా తన తోకపత్రిక ఆంధ్రజ్యోతికి అర ఎకరం హౌసింగ్ బోర్డు స్థలం విశాఖ నగరపాలక సంఘం ద్వారా కేటాయించాలన్న ప్రయత్నం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కోట్లాది రూపాయల స్థలాన్ని ఆంధ్రజ్యోతికి నామమాత్రపు ధరకు ఎలా కేటాయిస్తారంటూ శుక్రవారం కౌన్సిల్లో వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించడంతో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు.వివరాల్లోకి వెళితే, పరదేశీపాలెంలోని సర్వే నెంబరు 203/2పీలోని అర ఎకరం స్థలం కేటాయింపు అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ ముందుకు తెచ్చింది. నిజానికి రెగ్యులర్ అజెండాను నాలుగైదు రోజులు ముందుగానే కార్పొరేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఈ కేటాయింపును రెగ్యులర్ అజెండాలో చేర్చకుండా టేబుల్ అజెండాగా, అదీ చివరి 67వ అంశంగా ఆఖరు నిమిషంలో కౌన్సిల్ ముందుకు తెచ్చారు.అనంతరం టేబుల్ అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించారు. చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ సభ్యులు 67 వ అంశాన్ని తిరిగి ప్రస్తావించారు. ఇంతటి కీలక అంశాన్ని టేబుల్ అజెండాగా చేర్చి, ఎలా ఆమోదింపజేస్తారంటూ గట్టిగా నిలదీశారు. దీనితో తప్పనిసరి పరిస్థితిల్లో 67వ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు. కాగా, ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా ధర దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా.గతంలోనూ కారుచౌకగా కేటాయింపు, రద్దు చేసిన వైఎస్సార్సీపీ.. వాస్తవానికి 2017లో ఇదే ప్రాంతంలో రూ.7.26 కోట్లు విలువ చేసే స్థలాన్ని రూ.50.50 లక్షలకే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్, ఆమోద పబ్లికేషన్స్కు కేటాయించింది. ఆ కేటాయింపును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసి, ఆ స్థలాన్ని పేదలకు పంచాలని నిర్ణయించింది. ఇప్పుడు బాబు ప్రభుత్వం మరోసారి అదే సంస్థకు భూమిని అతి తక్కువ ధరకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈ జబ్బుకి మందు కనిపెట్టండి ప్లీజ్!
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. బీఆర్ఎస్కు ప్లస్?
ఎర్రబెల్లి వాసికి డాక్టరేట్
ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
రేవంత్.. సినీ కార్మికుల సమ్మెపై చొరవకు ధన్యవాదాలు: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
Punjab: నడిరోడ్డుపై ఎల్పీజీ ట్యాంకర్ దగ్ధం.. ఇద్దరు మృతి
మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక
'కూలీ'తో మారిపోయిన 'రచితా రామ్' ర్యాంక్
థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు
చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ హీరోయిన్
యుద్ధాల విషయంలో స్వర్గప్రాప్తి ఏమోగానీ సుంకాల వేసినందుకు మాత్రం కచ్చితంగా నరకానికే పోతారేమోననిపిస్తుంది సార్!
బంగారం, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్!
Happy Anniversary : వరాహ లక్ష్మి నర్సింహ స్వామి వారి సేవలో మాజీ మంత్రి రోజా (ఫొటోలు)
అనుపమ 'పరదా' సినిమా రివ్యూ
వాళ్లు ఓటేసి నన్ను గెలిపించినా.. ఆ భారం మోయాల్సింది నువ్వే!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ప్రముఖులతో పరిచయాలు
థియేటర్లలో పరదా..ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు!
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ఆగడాలకు చెక్ పెట్టాల్సిందే సార్!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
సంవత్సరం తిరిగే సరికి బంగారం ధర..
ఆస్ట్రేలియా టూర్.. రోహిత్ శర్మ ఊహించని నిర్ణయం!?
చరిత్రపుటల్లోకెక్కిన పాక్ బౌలర్
ఇక గుడ్ బై.. అజింక్య రహానే సంచలన నిర్ణయం
ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
అదృష్టం ఏంటంటే ఈ ప్రపంచంలో మీకెవరూ స్నేహితులేర్సార్!
శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫొటోలు)
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
ఈ జబ్బుకి మందు కనిపెట్టండి ప్లీజ్!
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. బీఆర్ఎస్కు ప్లస్?
ఎర్రబెల్లి వాసికి డాక్టరేట్
ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
రేవంత్.. సినీ కార్మికుల సమ్మెపై చొరవకు ధన్యవాదాలు: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
Punjab: నడిరోడ్డుపై ఎల్పీజీ ట్యాంకర్ దగ్ధం.. ఇద్దరు మృతి
మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక
'కూలీ'తో మారిపోయిన 'రచితా రామ్' ర్యాంక్
థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు
చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ హీరోయిన్
యుద్ధాల విషయంలో స్వర్గప్రాప్తి ఏమోగానీ సుంకాల వేసినందుకు మాత్రం కచ్చితంగా నరకానికే పోతారేమోననిపిస్తుంది సార్!
బంగారం, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్!
అనుపమ 'పరదా' సినిమా రివ్యూ
వాళ్లు ఓటేసి నన్ను గెలిపించినా.. ఆ భారం మోయాల్సింది నువ్వే!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ప్రముఖులతో పరిచయాలు
థియేటర్లలో పరదా..ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు!
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ఆగడాలకు చెక్ పెట్టాల్సిందే సార్!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
సంవత్సరం తిరిగే సరికి బంగారం ధర..
ఆస్ట్రేలియా టూర్.. రోహిత్ శర్మ ఊహించని నిర్ణయం!?
చరిత్రపుటల్లోకెక్కిన పాక్ బౌలర్
ఇక గుడ్ బై.. అజింక్య రహానే సంచలన నిర్ణయం
ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
అదృష్టం ఏంటంటే ఈ ప్రపంచంలో మీకెవరూ స్నేహితులేర్సార్!
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన
పదిహేను కోట్ల ఇంట్లో...
సినిమా

ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
ఇండస్ట్రీలో అవకాశలెప్పుడూ ఒకేలా ఉండవు. వయసు పెరిగేకొద్దీ నటీనటులకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా యాక్ట్రెస్లకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ, బాలీవుడ్ నటి ఉషా నదకర్ణి (Usha Nadkarni) మాత్రం ఎప్పుడూ షూటింగ్స్తో బిజీగా ఉంటోంది. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె గతంలో పవిత్ర రిష్తా సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించిన అంకిత లోఖండే.. తాజాగా నటి ఉషాను ఇంటర్వ్యూ చేసింది.గ్లిజరిన్ లేకుండా..ఈ సందర్భంగా ఉషా గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. ఉషాతో తాను అంత సన్నిహితంగా ఉండేదాన్ని కాదని, అయినా ఆమె తనకు చాలా విషయాలను దగ్గరుండి నేర్పించిందని తెలిపింది. గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తుందని, ఎక్కువ మేకప్ వేసుకోదని పేర్కొంది. ఇప్పటికీ ఒంటరిగా ధైర్యంగా జీవిస్తోందని తెలిపింది. ఆ మాటతో ఉషా భావోద్వేగానికి లోనైంది. నాకంటూ ఎవరూ లేరు'అవును, ఒంటరిగా బతుకుతున్నా.. కానీ నాకూ ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కోసారి భయమేస్తుంటుంది. సడన్గా స్లిప్ అయి కిందపడిపోతే ఎవరికీ తెలియదు. నన్ను చూసేందుకు ఎవరూ రారు. నా కొడుకు విదేశాల్లో నివసిస్తున్నాడు. ఓ సోదరుడిని ఈ మధ్యే కోల్పోయాను. ఇక్కడ నాకోసం ఎవరూ లేరు' అని భావోద్వేగానికి లోనైంది. అంకిత వెంటనే లేచి ఉషను హత్తుకుని నీకోసం నేనున్నానంటూ మాటిచ్చింది. ఏ అవసరమొచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చేస్తానంది. నేను చనిపోతే..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం తన ఒంటరితనం గురించి మాట్లాడింది. 1987 నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను. మొదట్లో భయమేసింది. ఎవరైనా తలుపు తీసుకుని వచ్చి నాపై దాడి చేస్తారేమోనని భయపడేదాన్ని. కానీ, ఇప్పుడా భయం లేదు. ఎవరి మరణం ఎలా రాసిపెట్టుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ నేను నిద్రలోనే చనిపోతే పక్కింటివాళ్లు డోర్ కొడతారు, ఎంతకూ తలుపు తీయకపోతే చనిపోయానని వాళ్లే అర్థం చేసుకుంటారు అని చెప్పుకొచ్చింది.చదవండి: వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య

కీ రోల్కి సై
విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్పై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. విశాల్ కెరీర్లో 35వ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కీ రోల్లో నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ‘‘అంజలి ప్రస్తుతం ఆచితూచిపాత్రలను ఎంచుకుంటున్నారు.ఈ క్రమంలో విశాల్ 35 కథ నచ్చి, ఆమె ఓకే చెప్పారు. ‘మద గద రాజా’ చిత్రంలో అంజలి, వరలక్ష్మిలతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్ తెలిపింది.

నేనే గనుక నిర్మాతనైతే ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది: ఆండ్రియా
ఆండ్రియా( Andrea Jeremiah) అంటే నటి మాత్రమే కాదు.. అంతకు మించి. గాయని, రచయిత్రి.. వీటన్నింటికీ మించి బోల్డ్ నటి. ఏ తరహా పాత్రనైనా చేయడానికి వెనుకాడని డేరింగ్ బ్యూటీ అంటూ కోలీవుడ్లో గుర్తింపు ఉంది. ఈమె పలు భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న ఆండ్రియా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ భామ అన్నది గమనార్హం. ఈమె 2014లో నటించిన పిశాచు చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్కు దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు విజయ్సేతుపతి క్యామియో పాత్రను పోషించిన ఈ చిత్రంలో నటి పూర్ణ, సంతోష్ ప్రతాప్, నమితా కృష్ణమూర్తి, అజ్మల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రాక్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మురుగానందం నిర్మించిన ఈ చిత్రం చాలా కాలం క్రితమే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని సమస్యల కారణంగా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పైగా పిశాచు–2 చిత్రంలో ఆండ్రియా నటన ఆదుర్స్ అంటూ దర్శకుడు మిష్కిన్ ప్రచారం చేశారు. అయితే గత మూడేళ్లుగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కాగా ఈ చిత్రం విడుదల గురించి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి ఆండ్రియాను అడగ్గా తాను నటించడం మాత్రమే చేయగలను కానీ చిత్రాన్ని రిలీజ్ చేయగలనా? అని ప్రశ్నించారు. అలాగే తానే నిర్మాతనైనే పిశాచు చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేసేదాన్ని అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా నటి ఆండ్రియా నటించిన మనుషీ చిత్రం కూడా వివాదాల్లో చిక్కుంది. ప్రస్తుతం ఈ భామ నో ఎంట్రీ, మాస్క్ చిత్రాల్లో నటిస్తున్నారు.పిశాచు–2 ఆలశ్యానికి కారణం ఏంటిఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ అనే సంస్థ ‘పిశాచి–2’ విడుదలను అడ్డుకుంది. సినిమా హక్కుల విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ రాక్ఫోర్ట్ బ్యానర్ వారు తమకు రూ. 4.85 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చట్టపరమైన వివాదాలతో పాటు ఈ సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించినట్లు దర్శకుడు మిష్కిన్ వెల్లడించారు. అయితే, ఈ సన్నివేశాలను పూర్తిగా చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు చెప్పారు. ఈ అంశం కూడా సినిమాపై వివాదాన్ని పెంచింది.

రజినీకాంత్ కూలీ.. మాస్ సాంగ్ వచ్చేసింది!
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్ను కూలీ అధిగమించింది. కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందితాజాగా ఈ మూవీ నుంచి కొక్కి అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను అమోగ్ బాలాజీ పాడగా.. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ మాస్ రజినీకాంత్ను ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు.Electrifying & Addictive #Kokki lyric video is out now!🖤🔥 #Coolie▶️ https://t.co/XC6UiW0qcZ #Coolie ruling in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja… pic.twitter.com/Sxn6Xu4Xe7— Sun Pictures (@sunpictures) August 22, 2025
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్లో ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’ పేరిట ప్రతిఏటా 350 కోట్ల రూపాయల ప్రజాధనానికి టెండర్... కుప్పంలో ప్రారంభమైన పైలెట్ ప్రాజెక్టు

పెద్దల కోసం పేదల భూములు... ‘నాలా’ చట్టం రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపడంపై సర్వత్రా ఆందోళన

నింద మాటున ప్రభుత్వాలను కూల్చేస్తారా?... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై లోక్సభలో విపక్షాల ఆగ్రహం

దివ్యాంగుల జీవితాల్లో పింఛను చిచ్చు... అనర్హులని పేర్కొంటూ పింఛను నిలిపివేస్తున్నట్టు ఏపీలో కూటమి ప్రభుత్వం నోటీసులు

మాతోనే బేరసారాలా?. మద్యం కేసులో ప్రాసిక్యూషన్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ

ఆంధ్రప్రదేశ్లో కారుచౌకగా భూముల విక్రయాలు.. ఎంత భూమైనా 99 పైసలకే.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్..

ఏపీలో విద్యుత్ కొనుగోలులో మరో కనికట్టు... అధిక ధరకు సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం

ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక

రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ విజయం

చంద్రబాబు మోసకారి... పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ...
క్రీడలు

‘కూత’ మారుతోంది
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఫార్మాట్ మారినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 29 నుంచి జరిగే 12వ సీజన్ పీకేఎల్ను మారిన ఫార్మాట్ ప్రకారం నిర్వహిస్తారు. మ్యాచ్ల్లో రసవత్తర పోటీ పెరిగేందుకు అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని పంచేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్తగా టైబ్రేకర్, గోల్డెన్ రెయిడ్ నిబంధనలను తీసుకొచ్చారు. గతంలో గోల్డెన్ రెయిడ్ కేవలం ప్లేఆఫ్స్లోనే ఉండేది. ఇప్పుడు లీగ్ ఆసాంతం కొనసాగిస్తారు. మ్యాచ్ ‘టై’ అయితే కొత్త టైబ్రేకర్తో ఫలితం కచ్చితంగా ఫలితం రానుంది.స్కోరు సమమైన పక్షంలో ఒక్కో జట్టుకు ఫుట్బాల్ తరహాలో 5 రెయిడ్ షూటౌట్ అవకాశాలిస్తారు. ఇరు జట్లు ఏడుగురు చొప్పున ఆటగాళ్లను నామినేట్ చేస్తాయి. ఇందులో ఐదుగురు రెయిడ్ చేస్తారు. ‘షూటౌట్’ స్కోరు సమమైతే అప్పుడు గోలెడ్న్ రెయిడ్ తెరపైకి వస్తుంది. ఇలాంటి మార్పులతో మ్యాచ్లో మరింత నాటకీయత పెరుగుతుందని, ఆటలోనూ పోటీ కూడా అభిమానుల్ని ఆకర్శిస్తుందని పీకేఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సీజన్లో లీగ్ దశలో 108 మ్యాచ్లుంటాయి. ఒక్కో ఫ్రాంచైజీ జట్టు 18 మ్యాచ్లు ఆడుతుంది. పాత పద్ధతిలో ప్లే ఆఫ్స్ ఉంటాయి... కానీ ఇకపై పాయింట్ల పట్టికలో మొదటి 8 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ చేరతాయి. తద్వారా టైటిల్ రేసులో 8 జట్లు పోటీలోనే ఉంటాయి. 5 నుంచి 8వ స్థానంలో నిలిచిన ఫ్రాంచైజీలు ‘ప్లే–ఇన్’ మ్యాచ్లు ఆడతాయి. గెలిచిన జట్లు ముందంజ వేస్తాయి. అలాగే 3, 4 స్థానాల జట్లు ‘మినీ క్వాలిఫయర్’ ఆడతాయి. ఇక్కడ గెలిచిన జట్టు ముందుకెళుతుంది. కానీ ఓడిన జట్టు నిష్క్రమించదు. ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ చేరేందుకు మరో అవకాశముంటుంది. ఈ ప్రక్రియలో మొత్తం మూడు ఎలిమినేటర్ మ్యాచ్లు జరుగుతాయి. ఇక మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫయర్–1 ఆడతాయి. విజేత జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్–2 ఆడుతుంది. ఎలిమినేటర్ ఫలితాల విజేత క్వాలిఫయర్–2కు అర్హత సాధిస్తుంది. అంటే 3 నుంచి 8వ స్థానం వరకు నిలిచే ఏ జట్టయిన ఇకపై ఫైనల్కు చేరే అవకాశంఉందన్న మాట!

విజేత ఎవరో?
కోల్కతా: ఆసియా ఖండంలో అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్గా గుర్తింపు సాధించిన... దేశవాళీ వార్షిక పుట్బాల్ టోర్నీ డ్యురాండ్ కప్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నీ 134వ ఎడిషన్ ఫైనల్లో శనివారం డైమండ్ హార్బర్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ)తో నార్త్ ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్తోనే అరంగేట్రం చేసిన డైమండ్ హార్బర్ జట్టు... తొలిసారే టైటిల్ హస్తగతం చేసుకోవాలని తహలాడుతుండగా... డిఫెండింగ్ చాంపియన్ నార్త్ఈస్ట్ ఫుట్బాల్ క్లబ్ టైటిల్ నిలబెట్టుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. తద్వారా 34 ఏళ్లలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలవాలని చూస్తోంది. ఈ టోర్నీలో చివరగా 1989, 90, 91లో ఈస్ట్ బెంగాల్ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ తర్వాత మరే జట్టు వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలవలేకపోయింది. నార్త్ ఈస్ట్ హెడ్ కోచ్ జాన్ పెడ్రో బెనాలీ మాట్లాడుతూ... ‘తుదిపోరులో ఫేవరెట్స్ ఉండరు. మెరుగైన ప్రదర్శన చేసిన జట్లే ఫైనల్కు చేరుతాయి. మానసికంగా పైచేయి సాధించగల జట్టే ట్రోఫీ చేజిక్కించుకుంటుంది’ అని అన్నాడు. మరోవైపు కిబు వికునా శిక్షణలో రాటుదేలిన డైమండ్ హార్బర్ జట్టు... ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం పోరులో డైమండ్ హార్బర్ జట్టు విజయం సాధిస్తే... ఓపెన్ ఎరాలో అరంగేట్రంలోనే టైటిల్ గెలిచిన తొలి జట్టుగా నిలవనుంది. తొలి సెమీఫైనల్లో నార్త్ ఈస్ట్ 1–0 గోల్స్ తేడాతో షిల్లాంగ్ లాజాంగ్ జట్టుపై విజయం సాధించగా... రెండో సెమీస్లో డైమండ్ హార్బర్ 2–1తో ఈస్ట్ బెంగాల్పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. విజేతకు రూ. 1.21 కోట్లు డ్యురాండ్ కప్ 134వ ఎడిషన్ విజేతకు భారీ ప్రైజ్మనీ దక్కనుంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ప్రైజ్మనీని 250 శాతం పెంచినట్లు డ్యురాండ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ (డీసీఓసీ) వెల్లడించింది. ఫైనల్లో నెగ్గిన జట్టుకు రూ. 1.21 కోట్లు లభిస్తుందని డీసీఓసీ శుక్రవారం పేర్కొంది. రన్నరప్ జట్టుకు రూ. 60 లక్షలు దక్కనున్నాయి. సెమీఫైనల్స్లో ఓడిన జట్లకు రూ. 25 లక్షల చొప్పున... క్వార్టర్ ఫైనల్లో ఓడిన జట్లకు రూ. 15 లక్షల చొప్పున ఇస్తారు. ‘గోల్డెన్ బాల్’, ‘గోల్డెన్ బూట్’, ‘గోల్డెన్ గ్లవ్’ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లకు రూ. 3 లక్షల నగదు బహుమతితో పాటు ఒక మహింద్ర ఎక్స్యూవీ కారు లభించనుంది.

చిన్నస్వామిలో క్రికెట్ బంద్!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్ వేదికల జాబితా నుంచి బెంగళూరును తొలగించారు. ఇక్కడ జరగాల్సిన మ్యాచ్లను నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియానికి తరలించారు. టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న భారత్, శ్రీలంక మధ్య చిన్నస్వామి స్టేడియంలో సెప్టెంబర్ 30న తొలి మ్యాచ్తో పాటు మరో నాలుగు మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ మ్యాచ్ల నిర్వహణకు బెంగళూరు పోలీసుల నుంచి అనుమతి పొందడంలో కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) విఫలమైంది. ఐపీఎల్–2025లో విజేతగా నిలిచిన అనంతరం జూన్ 4న ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించిన సంబరాల్లో ప్రమాదవశాత్తూ 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన దర్యాప్తులో ఆర్సీబీ యాజమాన్యాన్ని, కేఎస్సీఏను తప్పు పట్టిన కమిటీ... చిన్నస్వామి స్టేడియం మ్యాచ్లు నిర్వహించేదుకు సురక్షితం కాదని తేల్చింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అధికారులు ఈ స్టేడియానికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్ కోసం అనుమతి సాధించడం అసాధ్యంగా మారింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కేఎస్సీఏ హామీ ఇచ్చినా పోలీసులు స్పందించలేదు. ఇదే కారణంతో ఇంతకు ముందే అసోసియేషన్ తమ ఫ్రాంచైజీ టోర్నీ మహరాజా ట్రోఫీని బెంగళూరు నుంచి మైసూరుకు తరలించింది. తాజా పరిణామాలన్నీ ఐసీసీ మ్యాచ్ల నిర్వహణా నిబంధనలకు ప్రతికూలంగా ఉండటంతో బెంగళూరు నుంచి మ్యాచ్లు తరలించాల్సి వచ్చింది. బెంగళూరులో సాధ్యం కాకపోతే తాము తిరువనంతపురంలో మ్యాచ్లు నిర్వహిస్తామని కేరళ సంఘం ముందుకు వచ్చినా... అక్కడి నుంచి ప్రధాన నగరాలకు తగినన్ని ఫ్లయిట్లు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టారు. డీవై పాటిల్ స్టేడియంలో సెమీఫైనల్తో పాటు పాక్ అర్హత సాధించకపోతే ఫైనల్ను కూడా నిర్వహిస్తారు. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీకి నవీ ముంబైతో పాటు విశాఖపట్నం, గువహటి, ఇండోర్, కొలంబో ఆతిథ్యం ఇస్తాయి.

‘డ్రీమ్’ బంధం ముగిసినట్లే!
న్యూఢిల్లీ: ‘సెబీ’ నిబంధనలు ఉల్లంఘించిన సహారా గ్రూప్, కాంపిటీషన్ కమిషన్ విచారణను ఎదుర్కొన్న స్టార్ ఇండియా, ఆర్థిక సమస్యలతో ఒప్పో, చెల్లింపులు చేయలేక బాకీపడ్డ బైజూస్... భారత క్రికెట్ జట్టు గత నాలుగు ప్రధాన స్పాన్సర్లు ఏదో ఒక వివాదం లేదా సమస్యతో సహవాసం చేయడం బీసీసీఐకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ జాబితాలో ‘డ్రీమ్ 11’ కూడా చేరింది. ఇందులో నేరుగా కంపెనీ పాత్ర లేకపోయినా... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో పరిస్థితి మారిపోయింది. ఇకపై ‘డ్రీమ్ 11’ భారత టీమ్ స్పాన్సర్గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్, గ్యాంబ్లింగ్ వేదికలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే కేటగిరీలో వచ్చే ‘డ్రీమ్ 11’కు దీని కారణంగా ఆర్థిక పరంగా గట్టి దెబ్బ తగలనుంది. 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్ 11’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ 2026 మార్చి వరకు ఉంది. అయితే ఆసియా కప్కు ముందే స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ‘ఫలానా సంస్థతో ఒప్పందానికి అనుమతి లేదంటే మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతీ పాలసీ, నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ స్పాన్సర్షి-ప్కు సంబంధించి త్వరలోనే మరింత స్పష్టత రావచ్చు. తక్కువ సమయంలో బోర్డు మళ్లీ కొత్త స్పాన్సర్తో ఒప్పందం కుదుర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. మరోవైపు డ్రీమ్ 11 శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘డబ్బులు చెల్లించి ఆడే పోటీలన్నింటినీ మేం నిలిపివేశాం. ఉచితంగా ఆడుకునే ఆన్లైన్ సోషల్ గేమ్లుగా వాటిని మార్చేశాం. ఇన్నేళ్లు మేం నిబంధనల ప్రకారమే పని చేశాం. భారత ప్రభుత్వ చట్టాలను మేం గౌరవిస్తే. ఇకపై మా ఇతర సంస్థలు ఫ్యాన్ కోడ్, డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొంది.
బిజినెస్

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో నిపుణుల కొరత
బీఎఫ్ఎస్ఐ రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) వేగంగా విస్తరిస్తుండడంతో నిపుణులకు తీవ్ర కొరత నెలకొన్నట్టు క్వెస్కార్ప్ తెలిపింది. అంతేకాదు, నైపుణ్యాల్లో అంతరంతోపాటు మానవ వనరులపై అధిక వ్యయాలు చేయాల్సి వస్తున్నట్టు తెలిపింది. భారత్లో బీఎఫ్ఎస్ఐ జీసీసీల విలువ 2023లో 40–41 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2032 నాటికి 125–135 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) డేటా నిపుణులకు కొరత ఉందని.. నైపుణ్యాల్లోనూ 42 శాతం మేర అంతరం ఉన్నట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు మానవ వనరుల పరంగా తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశీయంగా బీఎఫ్ఎస్ఐ రంగానికి సంబంధించి 190 జీసీసీలు ఉండగా, ఇవి 5,40,000 మందికి ఉపాధి కలి్పస్తున్నట్టు వెల్లడించింది. కేవలం బ్యాంక్ ఆఫీస్లుగా కాకుండా, ఆవిష్కరణలకు కేంద్రాలుగా జీసీసీలు మారినట్టు తెలిపింది. టైర్–1 పట్టణాలు అధిక విలువ కలిగిన ఆవిష్కరణలకు కేంద్రాలుగా ఉన్నప్పటికీ.. టైర్–2 పట్టణాలు మెరుగైన వసతులు, తక్కువ వ్యయాలతో జీసీసీలకు ఆకర్షణీయంగా మారినట్టు పేర్కొంది. బీఎఫ్ఎస్ఐ జీసీసీ రంగం భవిష్యత్తు అన్నది.. అవి ఎంత వేగంగా ఆవిష్కరణలను అందించగలవన్న దానిపై ఆధారపడి ఉంటుందని వివరించింది.

బీఎఫ్ఎస్ఐలో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు
ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ) సేవలకు డిమాండ్ బలంగా పెరుగుతోంది. దీంతో ఈ రంగంలోని కంపెనీలు మెట్రోలకే పరిమితం కాకుండా టైర్ 2, 3 పట్టణాల్లోనూ (ద్వితీయ, తృతీయ శ్రేణి) తమ సేవలను విస్తరిస్తున్నట్టు మానవ వనరుల సేవలు అందించే అడెకో ఇండియా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.7% మేర ఈ రంగం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2030 నాటికి ఈ రంగంలో 2.5 లక్షల కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ రంగంలో కొత్త ఉద్యోగాల్లో 48% టైర్ 2, 3 పట్టణాల్లోనే ఉంటున్నట్టు వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నియామకాలు 27 శాతం పెరిగినట్టు తెలిపింది. స్థానిక భాషపై పట్టు, అమ్మకాల్లో అనుభవం కలిగిన వారు ఇతరులతో పోల్చితే 2.5 రెట్లు అధికంగా ఎంపికయ్యే అవకాశాలు కలిగి ఉన్నట్టు.. 10–15% అధిక వేత నం వీరికి లభిస్తున్నట్టు వెల్లడించింది. గృహ పొదుపులు సంప్రదాయ సాధనాల నుంచి మార్కె ట్ ఆధారిత సాధనాలైన మ్యూచువల్ ఫండ్స్, యులి ప్లు, పెన్షన్ ఉత్పత్తుల వైపు మళ్లుతుండడం బీఎఫ్ఎస్ఐ సేవలకు డిమాండ్ను పెంచుతున్నట్టు తెలిపింది. ఈ రంగాల వారికి డిమాండ్.. బ్యాంక్లు సేల్స్, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్లు, డిజిటల్ ప్రొడక్ట్ మేనేజర్లు, క్రెడిట్ రిస్క్ అనలిస్టుల నియామకాలను పెంచినట్టు అడెకో ఇండియా నివేదిక వెల్లడించింది. బీమా సంస్థలు, సంపద నిర్వహణ సంస్థలు ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, డిజిటల్ అండర్రైటర్లు, క్లెయిమ్స్ అటోమేషన్ స్పెషలిస్టుల నియామకాలకు ప్రాధాన్యం పెంచినట్టు తెలిపింది. ఇందోర్, కోయింబత్తూర్, నాగర్పూర్, గువహటిలో 15–18 శాతం, సూరత్, జైపూర్, లక్నో, భువనేశ్వర్ పట్టణాల్లో నియామకాలు 11–13 శాతం పెరిగినట్టు పేర్కొంది. సేవలకు డిమాండ్ పెరుగుతుండడంతో 78 శాతం బీమా కంపెనీలు అదనపు నైపుణ్యాల కల్పనపై దృష్టి సారించినట్టు తెలిపింది. ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడులపై అవగాహన అన్నది మెట్రోలకు వెలుపల కూడా విస్తరిస్తోందని.. దీంతో స్థానిక నిపుణులకు డిమాండ్ పెరుగుతున్నట్టు తెలిపింది. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా అడెకో ఇండియా ఈ వివరాలను విడుదల చేసింది.

భారత్ – బ్రిటన్ మధ్య స్నేహ వారధి.. పాల్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్ పాల్ పంజాబ్లోని జలంధర్లో 1931 ఫిబ్రవరి 18న జని్మంచారు. ఆయన తండ్రి ప్యారేలాల్ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్ పాల్ 1949లో పంజాబ్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్కి వెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్నకు స్వరాజ్ పాల్ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్లోనే అతి పెద్ద స్టీల్ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది. లెజెండ్.. లార్డ్ స్వరాజ్ పాల్ మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్–భారత్ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. వోల్వర్హ్యాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చెయిర్ ఏంజెలా స్పెన్స్ పేర్కొన్నారు. బ్రిటన్లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్’ అని పాల్ను సన్ మార్క్ వ్యవస్థాపకుడు లార్డ్ రామీ రేంజర్ అభివర్ణించారు. భారత్–బ్రిటన్ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్లోని భారత హైకమిషన్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్ చేసింది. ఆయన విదేశాల్లో భారత్కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి.. భారత్–బ్రిటన్ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లార్డ్ పాల్ దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా వ్యవహరించారు. పాల్ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్ రాణి ఆయనకు నైట్హుడ్ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంవత్సరాలుగా బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్ ఆఫ్ లార్డ్స్ డిప్యుటీ స్పీకర్గా పాల్ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా> ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్ టేబుల్కి కో–చెయిర్గా వ్యవహరించారు. 2009లో బ్రిటన్ మోనార్క్కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్ ఫౌండేషన్ పేరును అరుణ అండ్ అంబికా పాల్ ఫౌండేషన్గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్లోని చారిత్రక ఇండియన్ జింఖానా క్లబ్లో లేడీ అరుణ స్వరాజ్ పాల్ హాల్ని ప్రారంభించారు.

అంతర్జాతీయ స్థాయికి భారత ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జీఎస్టీ శ్లాబుల హేతుబద్దీకరణతో భారత ఆతిథ్య రంగం అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యాలను సంతరించుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 5 శాతం పన్ను రేటును ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం సేవలకు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాయి. పన్నుల భారాన్ని తగ్గించేందుకు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను తీసుకురానున్నట్టు స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనను హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) స్వాగతించింది. అంతర్జాతీయంగా పర్యాటకులకు చిరునామాగా భారత్ మారేందుకు జీఎస్టీలో సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇతర దేశాలతో పోల్చితే భారత ఆతిథ్య పరిశ్రమ ఆకర్షణీయంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, 2047 నాటికి ఏటా 10 కోట్ల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలన్న లక్ష్య సాధనకు ఉపకరిస్తుందని పేర్కొంది. భారత్లో టారిఫ్లు (పన్ను రేట్లు) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్న అభిప్రాయాన్ని హెచ్ఏఐ ప్రెసిడెంట్ కేబీ కచ్రు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా టాప్–5 పర్యాటక గమ్యస్థానాల్లో భారత్ను కూడా చేర్చాలంటే దేశ పోటీతత్వాన్ని పెంచాల్సి ఉందన్నారు. హోటళ్లపై 18 శాతం కారణంగా జీఎస్టీతో గదుల రేట్లు అధికంగా ఉంటున్నాయని.. దీంతో అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి ఉన్నట్టు వివరించారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.. ‘‘ప్రస్తుతం హోటళ్లలో రూ.7,500 వరకు గదుల అద్దెపై 12 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. ఇది 6–7 ఏళ్ల క్రితం నిర్ణయించిన రేటు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని రూ.15,000కు పెంచాలి. ఇలా చేయడం వల్ల పర్యాటకులకు గదుల ధరలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం మీద పరిశ్రమ పోటీతత్వం పెరుగుతుంది’’అని హెచ్ఏఐ సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక సేవలపై ఏక రూప 5 శాతం పన్ను రేటును, ఐటీసీ సదుపాయంతో అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్టు పేర్కొంది. ఇలా చేస్తే నిబంధనల అమలు భారం తగ్గుతుందని, వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, మరిన్ని పెట్టుబడులు వచ్చి ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఫ్యామిలీ

ఆంధ్రకేసరి టంగుటూరి.. ప్రజల మనిషి
మహోన్నత స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో తెలుగు బిడ్డ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు (1872–1957) ఒకరు. పదవుల కోసం ఆయన ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి. ఆయన దేనిని నమ్మారో దానినే త్రికరణ శుద్ధిగా ఆచరించారు. లక్షలాది రూపాయలు సంపాదించి, అంతా ప్రజల కోసమే ఖర్చు చేశారు. తన కోసం ఆయన పైసా కూడా మిగుల్చుకోలేదు. నాటి లోక్సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ఆయన ధైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ కొనియాడిన విధానాన్ని చూస్తే ప్రకాశం వ్యక్తిత్వం అర్థమవుతుంది– ‘మనం 1928లో సైమన్ కమిషన్ను బాయికాట్ చేసిన సమయంలో చెన్నపట్నంలో గల ఇతర నాయకులు సైమన్ రాకను ఎదిరించలేక చెన్నపట్నం వదిలి వెళ్ళి పోయారు. ప్రకాశంగారు మాత్రం మిలిటరీ పోలీ సులు అడ్డుకోబోయి నప్పుడు చొక్కా విప్పి కాల్చమని తన ఛాతీని చూపించిన సాహసి అయ్యారు. ఆయన తన సర్వస్వం దేశ స్వాతంత్య్ర సమరంలో త్యాగంచేసిన మహావ్యక్తి, మరణించే నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగుల్చుకోలేదు’.ప్రకాశం మరణించినప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆయన విశిష్టతను ఇలా ప్రశంసించారు: ‘స్వాతంత్య్ర జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశభక్తుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు ప్రకాశంగారు. ముందువెనుకలు చూడని ధైర్యం, దాతృత్వం వలన ఆయన ఒక పురాణ పురుషులయ్యారు. ఆయన ఉత్తేజం వల్లనే వందలాది అనుయాయులు దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ జనకుడే కాదు, ఆయన భారత జాతీయోద్యమ నాయక శ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు’. ఇదీ చదవండి: అప్పుడే... ఏఐకి సార్థకతనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ... ‘నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1920 సంవత్సరం నుండి 1935 వరకు పంతులు గారితో నాకు పరిచయం, సాహచర్యం ఉన్నాయి. ఒకప్పుడు సంపూర్ణంగా మేమిద్దరం ఏకీభ వించకపోయినా ఆయన గుణసంపత్తిని నేను ఎప్పుడూ ప్రశంసా భావంతోనే చూసేవాడిన’ని అన్నారు. ఈనాటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. – డా‘‘ పి. మోహన్ రావుచైర్మన్, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్

అప్పుడే... ఏఐకి సార్థకత
కృత్రిమ మేధ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి తరచూ మన రాజకీయ నాయకులూ, ప్రభుత్వ పెద్దలూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆ యా టెక్నాలజీలను భారత్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడే ఉందన్నది గమనించాలి. అలా అని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అర్థం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏఐ మిషన్ కోసం పదివేల కోట్లనూ, జాతీయ క్వాంటమ్ మిషన్ కోసం ఆరు వేల కోట్లనూ కేటాయించింది. మౌలిక సదుపాయాలకు, డేటా వేదికల రూపకల్పనకు, నైపుణ్య శిక్షణా తరగతుల నిర్వహణకు, ఇతర సాధనాలను అందుబాటులోకి తేవటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కేవలం అధు నాతన టెక్నాలజీలను సమాజానికి పరిచయం చేయటం, పైపై మెరుగుల కోసం, అవసరాల కోసం వీటిని వాడుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఆధునిక సాంకేతికతలను ఉప యోగించి సామాన్య మానవుని జీవనాన్ని సులభతరం చేయడంతో పాటు, అనేక రంగాల్లో సమూల మార్పులు చేసినప్పుడు మాత్రమే ఈ సాంకేతికతలను సరిగా ఉపయోగించుకున్నట్లు లెక్క. ఎన్నికల అవకతవకలపై ఎన్నో ఆరోపణలూ, విమర్శలూ వినిపిస్తున్నాయి. వీటికి తావు లేకుండా చేయాలంటే ప్రతి ఓటునూ ఆధార్ కార్డ్తో అనుసంధానం చెయ్యడమే కాక, ఫేక్ ఓటర్లను గుర్తు పట్టడానికి డీప్ టెక్ను వినియోగించుకోవాలి. అపుడు అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించవచ్చు. అమెరికా, చైనా వంటి దేశాలు తమ వ్యవస్థలను కృత్రిమ మేధ వినియోగించి పునః రూపకల్పన చేస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవ సాయం, భద్రతా రంగాలను కృత్రిమ మేధతో అనుసంధానం చేస్తు న్నాయి. స్మార్ట్ నగరాల రూపకల్పన, డిజిటల్ పరిపాలన, వ్యవ సాయ ప్రణాళికలు, సామాజిక మౌలిక వసతులు వంటి రంగాలకు చైనా కృత్రిమ మేధను అనుసంధానం చేస్తోంది. కేవలం ఏఐ ఆధా రిత ఉపకరణాలను వినియోగించుకుంటూ వివిధ వ్యవస్థల పని తీరును సమూలంగా పునర్నిర్వచిస్తున్నాయి. మనదేశంలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్వంటి ఆధునిక అంశాలను పాఠ్యాంశాలుగా విద్యార్థుల నెత్తిమీద రుద్దుతున్నారు తప్ప, ప్రతి విద్యార్థికీ తాను కోరుకున్నట్టు చదువుకోవడానికి కావలసిన స్వీయ అభ్యాసనా వాతావరణాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చెయ్యడం లేదు. ఏఐ ఉపకరణాలు ఉపయోగించి ప్రతి విద్యార్థి పురోగతినీ అంచనా వేసి, వారి స్వీయ అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్పు చేయవచ్చు.అదే విధంగా వ్యవసాయంలో రైతులకు, స్వర/వాక్ ఆధారిత ఏఐ ద్వారా, ఆ యా ప్రాంతాలకు అనుకూలమైన వ్యవసాయ పద్ధ తుల గురించి, పంటల గురించి సలహాలను అందించవచ్చు. గిట్టుబాటు ధరలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ రుణాలు వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ రైతులు నష్టపోకుండా చూడవచ్చు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. కానీ ఆ మేధను కృత్రిమ మేధ, డీప్టెక్ తదితర రంగాల వైపు మళ్ళించి దేశీయ వ్యవస్థలను పునః రూపకల్పన చెయ్యటానికి పటిష్ఠమైన ప్రణాళికలు రచించడం లేదు. ఈ పని జరిగినప్పుడే ఆధునిక టెక్నా లజీ దన్నుతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. ఆ మేధను కృత్రిమ మేధవైపు మళ్లించి వ్యవస్థలను పునఃరూపకల్పన చెయ్యటానికి ప్రణాళికలను రచించినపుడు టెక్నాలజీ దన్నుతో దేశం అభివృద్ధి చెందుతుంది. – శ్రీవిద్య శ్రీనివాస్, కృత్రిమ మేధ నిపుణులు

అర్జున్ చక్రవర్తి కోసం ముప్పై కేజీలు తగ్గాను
విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. ఈ చిత్రంలో సిజా రోజ్ హీరోయిన్. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ రామరాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గాను. ఆ తర్వాత బరువు పెరిగాను. నేను సిక్స్ ప్యాక్తో ఉన్న సీన్స్ తీసినప్పుడు రెండు రోజులు ఏమీ తినలేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అయితే ట్రైలర్ విజువల్స్ చూసివారు పెద్ద సినిమాలా ఉందని అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా తొమ్మిదేళ్ల కల. ఆరేళ్ల మా టీమ్ కష్టం. విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. బడ్జెట్ పెరిగినా మా నిర్మాత నన్ను స΄ోర్ట్ చేశారు’’ అని చె΄్పారు విక్రాంత్ రుద్ర. ‘‘ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే. కబడ్డీ బ్యాక్డ్రాప్లో రూపొందిన మా సినిమా అదే రోజు రిలీజ్ అవుతోంది’’ అని చెప్పారు శ్రీని గుబ్బల. – విజయ రామరాజు ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్

పర్యాటక ప్రాంతాలకు 'పరుగో పరుగు'
ఉరుకు పరుగుల జీవితాల నుంచి ఉరుకుల పోటీల వైపు దృష్టి సారిస్తున్నారు పలువురు నగరవాసులు. నగరంలో రెగ్యులర్గా నిర్వహించే ఏదో ఒక మారథాన్లో భాగస్వాములు అవుతుంటారు కొందరు.. ఇది క్రమంగా నగరం నుంచి విదేశాలకూ వ్యాపించింది.. పలువురు ఔత్సాహికులు వెకేషన్తో పాటు మారథాన్ కూడా చేస్తున్నారు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మారథాన్లలోనూ పాలుపంచుకుంటున్నారు. మరికొందరు ఏకంగా రికార్డులవైపు పరుగు పెడుతున్నారు.. ఈ క్రమంలోనే రన్కేషన్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది.. మారథాన్ పరుగునే క్రమంగా వెకేషన్తో కలగలిపి రన్కేషన్ అని పిలుస్తున్నారు.. ఈ ట్రెండ్ టూరిజానికి కూడా భారీగా ఊపునిస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నమాట. అనుభవజ్ఞులైన రన్నర్లకు, అంతర్జాతీయ రేసులు అంటే కేవలం ఒక ప్రధాన మారథాన్కు అర్హత సాధించడం లేదా మరో వ్యక్తిగత పరుగు పందెం వేయడం మాత్రమే కాదు.. అవి కొత్త పర్యాటక గమ్యస్థానాలను అన్వేషించడానికి ఒక అవకాశం కూడా. ‘సెలవులు ఇప్పుడు రన్ కేషన్లుగా మారాయి’ అని ప్రముఖ మారథాన్ రన్నర్లు ఈ ట్రెండ్ను నిర్వచిస్తున్నారుఈవెంట్ల కోసమే..‘మారథాన్ టూర్లో పాల్గొనేవారిలో ఎక్కువ మంది పేరున్న అథ్లెట్లు కాదు, ఈవెంట్ల కోసం మాత్రమే శిక్షణ పొందే అమెచ్యూర్ రన్నర్లు. అందుకే మారథాన్ టూరిజం ఊపందుకుంటోంది’ అని మారథాన్ టూర్లను నిర్వహించే గౌరీ జయరామ్ అంటున్నారు. నగరం నుంచి పర్యాటక పరుగుల కోసం ఎంచుకుంటున్న వాటిలో దేశీయంగా ముంబైలో జరిగే టాటా ముంబై మారథాన్, అలాగే న్యూఢిల్లీ, చెన్నైలలో జరిగే రన్స్, అదే విధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిడ్నీ మారథాన్, రియో మారథాన్, అంటార్కిటికా మారథాన్, లండన్, టొరంటో, న్యూయార్క్.. వంటివెన్నో ఉన్నాయి. మారథాన్ టూరిజం అంటే..మారథాన్ అంటే అత్యంత సుదీర్ఘ దూరంలో పాల్గొనే పరుగు పందెం పోటీలు. రోజు రోజుకూ ఆదరణ పెంచుకుంటున్న ఈ మారథాన్ ఈవెంట్స్ దేశంలోని ప్రతి ప్రధాన నగరానికీ ఒక అలంకారంగా మారాయి. అంతర్జాతీయంగానూ అనేక నగరాల్లో విందు, వినోదాల సమ్మేళనంగా సాగే ఈ మోడ‘రన్’ ఫెస్టివల్స్.. రాను రానూ పర్యాటక ఆకర్షణగా కూడా స్థిరపడుతున్నాయి. ఒకసారి స్థానికంగా జరిగే పరుగు పోటీలో పాల్గొని మారథాన్ రన్నర్గా మారిన తర్వాత కాలక్రమంలో.. ఇతర నగరాల్లోని మారథాన్స్లో పాల్గొనడంపై నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది. అదే మారథాన్ టూరిజంకు ఊపునిస్తోంది. ఏటా మారథాన్ టూరిజంలో పాల్గొనే భారతీయ రన్నర్లలో ఐదు రెట్లు పెరుగుదల ఉందని నిపుణులు చెబుతున్న మాట. నిపుణుల సూచనలు.. మారథాన్ పర్యాటకులకు నగరానికి చెందిన నిపుణులు పలు సూచలను చేస్తున్నారు.. అవగాన లేకుండా, శిక్షణ లేకుండా మారథాన్లలో పాల్గొంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. ప్రయాణించే ముందు తగినంత శిక్షణ పొందాలి. మారథాన్ పర్యటనలలో పేరొందిన మారథాన్ ప్రయాణ సంస్థలను ఎంచుకోవాలి. స్థానిక వాతావరణ పరిస్థితులకుసంపూర్ణంగా సిద్ధం అవ్వాలి. హ్యాండ్ లగేజీలో రేస్ డే పరికరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆతిథ్య దేశంలో అత్యవసర కాంటాక్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. మారథాన్ టూరిజం కోసం ప్రణాళిక సాధారణంగా ఆరు నెలల ముందుగానే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సకుటుంబ సమేతంగా ‘రన్’డి.. రన్నర్లు క్రీడ పట్ల తమ మక్కువను పెంచుకుంటూనే కొత్త నగరాలు సంస్కృతీ, సంప్రదాయాలను అన్వేషించేందుకు ఈ ట్రెండ్ వీలు కలి్పస్తోంది. స్థానిక సంప్రదాయాలు హృదయపూర్వక ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ సుందరమైన ప్రకృతి దృశ్యాల మీదుగా పరుగు తీసే అవకాశాన్ని మారథాన్ టూరిజం అందిస్తోంది. ‘పని ఒత్తిడి కారణంగా, నేను నా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. మారథాన్ల కోసం ప్రయాణించే సమయాన్ని పాఠశాల సెలవులతో మేళవింపు చేయడం ద్వారా రన్కేషన్లో ఆ లోటు పూడ్చగలుగుతున్నా’ అని కొన్ని సంవత్సరాలుగా మారథాన్ రన్నర్గా ఉన్న నగరవాసి డాక్టర్ కునాల్ అంటున్నారు. తాము పాల్గొనే మారథాన్ ఈవెంట్స్ కోసం కుటుంబాన్ని తీసుకెళ్లడం అనేది కుటుంబంతో ఒక వెకేషన్ను గడపడం వంటి ప్రయోజనాలతో పాటు స్ఫూర్తిని నింపుతోంది. ‘ఇది నా భార్యను మారథాన్ రన్నర్గా మార్చింది. ఇప్పుడు నా 14 ఏళ్ల కొడుకు 5 కె రన్నర్గా శిక్షణ పొందుతున్నాడు.’ అని కునాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా రన్కేషన్స్ నిర్వహించేందుకు ప్రత్యేక ఈవెంట్ ప్లానర్లు కూడా పుట్టుకొచ్చేశారు. (చదవండి: నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్)
ఫొటోలు


ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)


జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)


విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)


జపాన్లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)


పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)


శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫొటోలు)


'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ (ఫొటోలు)


షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్ ఫోటోలు చూశారా..?


#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్ ఫాదర్.. 'చిరంజీవి' బర్త్డే స్పెషల్ (ఫోటోలు)


హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)
అంతర్జాతీయం

వీసాలపై ట్రంప్ స్పెషల్ ఫోకస్.. 5.5 కోట్ల మంది టార్గెట్
వాషింగ్టన్: అమెరికాలో వీసాల విషయంలో ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికా ఉన్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను మరింత క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది. డ్రైవర్లకు వర్కర్ వీసాలు మంజూరు చేయడం లేదని మార్కో రూబియో బాంబు పేల్చారు. దీంతో, మరిన్ని వీసాలపై కోత విధించే అవకాశం ఉంది.అయితే, అమెరికాలో ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్లు ట్రంప్ యంత్రాంగం తెలిపింది. ఈ సందర్బంగా అమెరికాలో నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చినా, వీసా కాల పరిమితిని మించి అమెరికాలో నివసిస్తున్నా, ప్రజాభద్రతకు భంగం కలిగించినా అలాంటి వ్యక్తులను స్వదేశాలకు తిప్పి పంపించే చర్యల్లో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక, అమెరికా చట్టాల ఉల్లంఘనలను సైతం సమీక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దుచేయడం ఖాయమని గతంలోనే స్పష్టం చేసిన ట్రంప్ ప్రభుత్వం అన్నంతపనీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ, పలురకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలను రద్దుచేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.🚨 BREAKING: The Trump admin is reviewing ALL 55 MILLION PEOPLE with visas in the United States for potentially deportable violations, per APA LOT of people who hate us are about to be sent home! 🔥Visa holders have been allowed to get away with violations for FAR too long! pic.twitter.com/S5bNIMSgA2— Nick Sortor (@nicksortor) August 21, 2025డ్రైవర్లకు వర్కర్కు నో వీసా.. మరోవైపు.. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు మంజూరు చేయమని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, అమెరికన్లకు ఉద్యోగాలు సైతం లేవన్నారు. అయితే, ఆగస్టు 12న ఫ్లోరిడా టర్న్పైక్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రూబియో హెచ్చరించడం గమనార్హం. కాగా, సదరు ట్రక్కు డ్రైవర్.. భారత్ నుంచి వలస వెళ్లడం, అతడు చట్ట విరుద్దంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ల వీసాలపై కూడా ట్రంప్ యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక, అమెరికాలో 2023 నాటికి 16 శాతం ట్రక్కు డైవర్లు ఇతర దేశస్థులే ఉన్నట్టు తెలుస్తోంది. Effective immediately we are pausing all issuance of worker visas for commercial truck drivers. The increasing number of foreign drivers operating large tractor-trailer trucks on U.S. roads is endangering American lives and undercutting the livelihoods of American truckers.— Secretary Marco Rubio (@SecRubio) August 21, 2025నాలుగు వేల వీసాలు రద్దు.. అమెరికా చట్ట నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ ఆరువేల మందిలో దాదాపు నాలుగు వేల మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ‘ఇమిగ్రేషన్, నేషనల్ యాక్ట్లోని మూడో సెక్షన్ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన వారి వీసా రద్దు అవుతుంది. పాలస్తీనా అనుకూల, యూదు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారి వీసా రద్దు అవుతుంది. ఉగ్రసంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాల అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ను అర్థంతరంగా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం తెలిసిందే. జూన్లో మళ్లీ వీసాల అపాయింట్మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా ‘పబ్లిక్’ మోడ్లోనే ఉంచాలని సూచనలు చేసింది. మరోవైపు.. అమెరికాలో రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్లో అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. వారందరినీ అమెరికా నుంచి స్వదేశాలకు పంపించేశారు.

గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్య షురూ
గాజా నగరం: గాజా నగరాన్ని ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ బలగాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. హమాస్కు గట్టి పట్టున్న గాజాను ఆక్రమించుకునే ప్రణాళిక మొదటి దశలో భాగంగా గురువారం ఇజ్రాయెల్ బలగాలు నగర శివారులోకి ప్రవేశించాయి. సెపె్టంబర్ మొదటి వారం నుంచి మొదలయ్యే క్షేత్రస్థాయి సైనిక చర్యకుగాను ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 వేల రిజర్వు బలగాలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే సైనిక చర్యలో పాలుపంచుకుంటున్న మెజారిటీ జవాన్ల స్థానంలో వీరు విధులు నిర్వర్తిస్తారు. అంతేకాకుండా, మరో 20వేల మంది సైనికుల విధులను ప్రభుత్వం పొడిగించనుంది. పది లక్షలకు పైగా జనాభా కలిగిన గాజా నగరంపై గత కొన్ని రోజులుగా బాంబింగ్, ఫిరంగి కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో శివారు ప్రాంతాలైన జెయిటౌన్, సబ్రాల నుంచి వందలాదిగా పాలస్తీనియన్లు నగరంలోని ఇతర ప్రాంతాలకు ప్రాణభయంతో వలసవెళ్తున్నారు. ‘బాంబు ల మోత, పేలుళ్లు, ఫిరంగి కాల్పులు, యుద్ధ విమానాల రొద, అంబులెన్సులు సైర న్లు, జనం ఆర్తనాదాలతో మా ప్రాంతం రాత్రంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది’అని అహ్మద్ అల్–షాంటి తెలిపారు. బాంబుల శబ్దాలకు మా ఇళ్లు ఊగిపోతున్నాయి. కానీ, మేము ఎక్కడికి వె ళ్లాలి? అని ఆయన ప్రశ్నించారు. ‘గత ఒక్క రాత్రి మాత్రమే కాదు. వారం రోజులుగా ఇదే తంతు. గాజాలోని వారెవరికీ కంటిపై కనుకు లేదు. ఫిరంగి కాల్పులు, వైమానిక దాడులు ఆగలే’అని చెప్పారు. సైనిక చర్యను ప్రారంభించేందుకు వీలుగాజెయిటౌన్, జబాలియా ప్రాంతాల్లో బుధవారం నుంచే బలగాలు తమ పనిని ప్రారంభించాయని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. సైన్యం ముందుగా కొన్ని ప్రాంతాలను తాత్కాలికంగా ముట్టడిస్తుందన్నారు. గాజా నగరంలోని లక్షలాది మందిని ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ బలగాలు తీవ్ర ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గాజా నగరంలోని వారిని ఖాళీ చేయించి, ఉత్తరగాజాలో పునరావాసం కలి్పంచాలని ఆరోగ్య యంత్రాంగం, అంతర్జాతీయ సహాయ సంస్థలకు సైతం తాము ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. ఖాళీ చేసి వెళ్లే వారికి పునరావాసం కల్పించేందుకు అవసరమైన టెంట్లను సైతం సిద్ధం చేసి ఉంచామని చెబుతోంది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికలను జారీ చేయలేదు. ఖండించిన గుటెర్రస్.. మండిపడ్డ హమాస్ ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్ ఇజ్రాయెల్ చర్యను తీవ్రంగా ఖండించారు. మరణాలు, విధ్వంసాన్ని ఆపేందుకు వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడులు ఎదురవుతున్నా ఇజ్రాయెల్ మాత్రం ముందుగా ప్రకటించిన విధంగానే గాజా నగర ముట్టడి కొనసాగుతుందని ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక చర్యపై హమాస్ మండిపడింది. నగరంలోని అమాయకులపై క్రూరమైన యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కొనసాగిస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. మధ్యవర్తులు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను సైతం ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. మిలటరీ ఆపరేషన్ కారణంగా హమాస్ వద్ద సజీవంగా మిగిలి ఉన్న బందీల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న భయాందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ తీవ్రమైన మానవీయ సంక్షోభం నెలకొని ఉండగా, తాజా చర్యలు పరిస్థితిని మరింతగా దిగజార్చే ప్రమాదముందంటున్నారు.అలసిపోయిన ఇజ్రాయెల్ ఆర్మీగాజాలోని హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించే లక్ష్యంతో మొదలైన యు ద్ధానికి రెండేళ్లయినా ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు విధుల్లోకి పిలిపించిన సైనికుల్లో కొందరు అసంతృప్తితో ఉన్నా రని ఆర్మీ చీఫ్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైనికులు ఆర్మీని విడిచి వెళ్లే ప్రమాదం సైతం ఉందని చెబుతున్నారు. సైన్యంలోని కనీసం 40 శాతం మంది ఇకపై విధుల్లో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని, కేవలం 13 శాతం మందే ఆసక్తితో ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. మెజారిటీ ప్రజలు సైతం యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలనే కోరుకుంటున్నారు. అతివాదులైన యూదులు కొందరు సైన్యంలో చేరేందుకు నిరాకరిస్తున్నారు. వారిని కూడా బలవంతంగా సైన్యంలో చేర్చేందుకు చట్టాన్ని తీసుకురావడం సైతం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేందుకు కారణంగా మారింది.

డ్రోన్లు, క్షిపణులతో రెచ్చిపోయిన రష్యా
కీవ్: రష్యా మరోసారి భీకర గగనతల దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బుధవారం రాత్రి ఏకంగా 574 డ్రోన్లు, మరో 40 వరకు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. మూడేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య పరమైన ప్రయత్నాలు ఊపందుకున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోని పశ్చిమ ప్రాంతాలు లక్ష్యంగా రష్యా చేపట్టిన ఈ దాడుల్లో ఎక్కువగా జనావాసాలకు నష్టం జరిగిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాదిలో రష్యా జరిపిన మూడో అతిపెద్ద డ్రోన్ దాడి, 8వ క్షిపణి దాడి ఇదని వివరించింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు చనిపోగా 15 మంది గాయపడ్డారంది. పశి్చమ దేశాలు అందించిన ఆయుధ సామగ్రి గోదాములు, ఉక్రెయిన్ సైనిక పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. కొన్ని క్షిపణులు హంగరీ సరిహద్దులకు సమీపంలో పడ్డాయని, అమెరికా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఒకటి ధ్వంసమైందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఫ్లెక్స్ ఫ్యాక్టరీలో 600 మంది పనిచేస్తున్నారన్నారు. వీరిలో దాడి కారణంగా ఆరుగురికి గాయాలైనట్లు వెల్లడించారు. లీవ్ నగరంపై జరిగిన దాడిలో 26 నివాస భవనాలు దెబ్బతిన్నాయన్నారు.

మా మంచి జడ్జి కన్నుమూత
ప్రోవిడెన్స్(అమెరికా): కోర్టుహాల్ అనగానే ఎంతటి సీనియర్ న్యాయవాదికి అయినా జడ్జి అంటే ఒకింత భయం, అమిత గౌరవం. ఏ మాట తూలితే ఎక్కడ కోర్టు ధిక్కారం ఉత్తర్వులు, శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందోన్న భయం. ఇక నిందితుల సంగతి చెప్పనక్కర్లేదు. వంగి వంగి దణ్ణాలు పెడుతూ మమ్మల్ని క్షమించండి జడ్జి గారూ అనే సన్నివేశాలూ ఇప్పటికీ కొన్ని జిల్లా కోర్టుల్లో కని్పస్తాయి. ఆ ఘటనలకూ పూర్తి అతీతంగా అమెరికాలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో, ఎంతో సరదాగా, మరెంతో హాస్యం జోడించి తీర్పులు చెప్పే న్యాయమూర్తిగా పేరుతెచ్చుకున్న కురువృద్ధుడు, జడ్జి ఫ్రాంక్ కాప్రియో తుదిశ్వాస విడిచారు. తనదైన వాక్చాతుర్యం, అపార న్యాయశాస్త్ర అనుభవంతో న్యాయకోవిదుడిగా, ప్రజారంజక తీర్పులకు చిరునామాగా మారిన జడ్జి ఫ్రాంక్ 88 ఏళ్ల వయసులో బుధవారం పాంక్రియాటిక్ క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారని ఆయన అధికారిక సోషల్మీడియా ఖాతాలో ఒక ప్రకటన ద్వారా స్పష్టమైంది. 100 కోట్ల వీక్షణలు అమెరికాలోని రోడ్ఐలాండ్ రాష్ట్రంలోని ప్రోవిడెన్స్ సిటీలో చీఫ్ మున్సిపల్ జడ్జిగా చాన్నాళ్లు పనిచేసి రిటైర్ అయినఫ్రాంక్ ఆ తర్వాత అచ్చం కోర్టుహాల్ సెటప్లో పలు కేసుల వాదోపవాదనల ఎపిసోడ్లు చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన చేసిన వీడియోలు యూట్యూబ్లో ఏకంగా 100 కోట్ల వీక్షణలు దాటాయంటే ఆయన ఎంత హృద్యంగా, సుతిమెత్తగా, సూటిగా తీర్పులు చెప్తారో అర్థంచేసుకోవచ్చు. శిక్షను ఎదుర్కొంటున్న నిందితులతోపాటు నిందితుల కుటుంబసభ్యులతోనూ నేరుగా సహానుభూతితో మాట్లాడి కేసుకు సరైన న్యాయం చేస్తూ తీర్పు చెప్పే విధానం కోట్లాది మందిని మెప్పించింది. చిన్నచిన్న తప్పులు చేసి నిందితులుగా ముద్రపడిన వ్యక్తులను సున్నితంగా, నవ్వుతూ మందలిస్తూ కేసులు కొట్టేసిన సందర్భాలు కోకొల్లలు. ఈయన చీఫ్ మున్సిపల్జడ్జిగా 1985 నుంచి రిటైర్ అయ్యేదాకా అంటే 2023ఏడాదిదాకా ఏకంగా 40 ఏళ్లపాట సేవలందించారు. చిన్నపాటి తప్పిదాలు చేసిన మీ తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష విధించాలో నువ్వే చెప్పు అంటూ వాళ్ల చిన్నారులకే ధర్మాసనం వద్దకు పిలిపించి వారితోనే తీర్పులు చదివించిన సందర్భాలూ ఉన్నాయి. ఎంతో దయతో తీర్పులు చెప్పే జడ్జిగా ఆయన పేరు మార్మోగిపోయింది. 2018 నుంచి 2020 ఏడాదిదాకా ‘కాట్ ఇన్ ప్రోవిడెన్స్’ పేరుతో ఆయన కోర్టు సీన్లతో టీవీ సిరీస్ చేశారు. ఆ సిరీస్ల ఆన్లైన్ వీక్షణలు కోట్లు దాటేశాయి. పారదర్శకత, దయతో తీర్పులు ఇవ్వాలని జడ్జి ఎప్పుడూ చెబుతుండేవారు.
జాతీయం

మన అంతరిక్ష కేంద్రం!
ఇదేమిటో తెలుసా? రోదసిలో మన దేశాన్ని అమెరికా, రష్యా, చైనా సరసన నిలిపే ప్రతిష్టాత్మక భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) తొలి నమూనా! దేశమంతా చిరకాలంగా ఎంతో ఉత్సుకతగా ఎదురు చూస్తున్న ఈ బీఏఎస్–01ను భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) శుక్రవారం సగర్వంగా ఆవిష్కరించింది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం ఇందుకు వేదికైంది. దేశీయంగా రూపకల్పన చేసిన బీఏఎస్ తొలి మాడ్యూల్ (01)ను 2028 కల్లా భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో కృషి చేస్తుండటం తెలిసిందే. 2035కల్లా దాన్ని ఐదు మాడ్యూళ్లకు విస్తరించాలన్నది లక్ష్యం. – న్యూఢిల్లీఎన్నో విశేషాలు.. బీఏఎస్–01⇒ బరువు 10 టన్నులు⇒ పొడవు 8 మీటర్లు⇒ వెడల్పు 3.8 మీటర్లు⇒ దీన్ని భూమికి 450 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలోకి ప్రవేశపెడతారు⇒ అంతరిక్షంలో స్పేస్–లైఫ్ సైన్సెస్, ఔషధ, గ్రహాంతర అన్వేషణ తదితర అత్యాధునిక పరిశోధనలకు వేదికగా నిలవనుంది. ⇒ వాణిజ్య అంతరిక్ష రంగంలో భారత్ పూర్తిస్థాయిలో కాలూనేందుకు వీలు కల్పించనుంది. ⇒ అంతరిక్ష పర్యాటకంతో పాటు అంతర్జాతీయ సహకారాలకు వేదిక కానుంది. ⇒ స్పేస్ టెక్నాలజీ, రీసెర్చ్ను కెరీర్గా మలచుకునేలా భావి తరాలకు స్ఫూర్తినివ్వనుంది. ⇒ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, లైఫ్ సపోర్ట్ సిస్టం (ఈసీఎల్ఎస్ఎస్), భారత్ డాకింగ్ సిస్టం, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హాచ్ సిస్టం వంటి హంగులెన్నో దీని సొంతం. ⇒ ఇవన్నీ పూర్తిగా దేశీయంగా తయారు చేసుకున్న ఫీచర్లే కావడం విశేషం. ⇒ అంతరిక్షంలో మనుషుల ఆరోగ్యంపై సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావంతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, శాస్త్రీయ ఇమేజింగ్ తదితరాలు బీఏఎస్లో జరగనున్నాయి. ⇒ రోజువారీ కార్యకలాపాలకు తోడు రీఫిల్లింగ్ ప్రొపల్లెంట్, ఈసీఎల్ఎస్ఎస్ ఫ్లూయిడ్లు, రేడియేషన్, థర్మల్ ప్రభావం, మైక్రో మీటరాయిడ్ ఆర్బిటల్ వ్యర్థాల (ఎంఎంఓడీ) నుంచి రక్షణ తదితరాలకు అవసరమైన హంగులన్నీ బీఏఎస్లో ఉండనున్నాయి. ⇒ స్పేస్ సూట్లు, ఎయిర్ లాక్స్, ప్లగ్ అండ్ ప్లే తరమా ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వ్యవస్థలకు దన్నుగా నిలుస్తుంది.ఆ దేశాల సరసన... బీఏఎస్–01 భారత్ను సొంత అంతరిక్ష కేంద్రాలున్న అమెరికా, రష్యా, చైనా సరసన నిలపనుంది. అయితే ప్రస్తుతం రెండే అంతరిక్ష కేంద్రాలు పని చేస్తున్నాయి. మొదటిది అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. రెండోది చైనాకు చెందిన టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ⇒ గతంలో తొలుత అమెరికా, అనంతరం సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్–ప్రస్తుత రష్యా) సొంత అంతరిక్ష కేంద్రాలను నిర్వహించాయి. ⇒ అమెరికా స్కైలాబ్ పేరిట, యూఎస్ఎస్ఆర్ మిర్ పేరిట అంతరిక్ష కేంద్రాలను నిర్వహించాయి. ⇒ ఇటీవల టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మించిన చైనా అంతకుముందు టియాంగాంగ్–1, టియాంగాంగ్–2 పేరుతో మాడ్యూళ్లను ఏర్పాటు చేసుకుంది.

క్యాంటిన్ నుంచి తెచ్చిన టీ తాగి..
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ గైనకాలజీ విభాగం పీజీ విద్యార్థిని ఒకరు అనుమానాస్పద స్థితిలో తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి క్యాంటిన్ నుంచి తెచ్చిన టీ తాగుతూనే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నారని అధికారులు తెలిపారు. విష ప్రయోగంగా అనుమానిస్తున్నట్లు ఎయిమ్స్ ప్రతినిధి శనివారం తెలిపారు. గురువారం రాత్రి రిమ్స్ గైనకాలజీ విభాగం ఆర్థోపెడిక్ వార్డులో 25 ఏళ్ల బాధిత విద్యార్థిని ఉన్నారు. క్యాంటిన్ నుంచి ఫ్లాస్్కలో తెచి్చన టీని గ్లాసులోకి వంపుకుని పక్కన పెట్టుకున్నారు. ఖాళీ దొరికిన వెంటనే రెండు సార్లు చప్పరించారు. టీ బాగోలేదని, దుర్వాసన వస్తోందని ఆమె తెలపడంతో తోటి వారు ఆ టీ జోలి పోలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడి వారు వెంటనే ఆమెను ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. ‘బాధిత విద్యారి్థని ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. వచ్చే 48 గంటలు చాలా కీలకం. ఫ్లాస్్కతోపాటు అక్కడున్న ఇతర వస్తువులన్నిటినీ సీజ్ చేసి, టాక్సికాలజీ పరీక్షలకు పంపించాం. ఇది విష ప్రయోగంగా కనిపిస్తోంది’అని ఓ అధికారి తెలిపారు. పరీక్షల ఫలితాలు అందాకే వాస్తవం వెల్లడవుతుందని రిమ్స్ ప్రతినిధి డాక్టర్ రాజీవ్ రంజన్ చెప్పారు. క్యాంటిన్ సీల్ చేసి, టీ ఫ్లాస్క్ తీసుకువచి్చన క్యాంటిన్ ఉద్యోగిని పోలీసులు ప్రశి్నస్తున్నారు.

చిన్నారిని గదిలో ఉంచి తాళం!
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వాకమిది. బెంచీపై నిద్రిస్తున్న రెండో తరగతి చదివే ఎనిమిదేళ్ల చిన్నారిని అలాగే క్లాస్ రూంలో వదిలి, తాళమేసి ఇంటికి వెళ్లిపోయాడు. మెలకువ వచ్చాక ఆ చిన్నారి కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు. రాత్రంతా చీకట్లో, ఒంటరిగా అలాగే భయంభయంగా ఉండిపోయింది. చివరికి కిటికీలోంచి దూరి బయటకు వచ్చేందుకు శతథా ప్రయత్నించింది. వీలుకాక కిటికీ గ్రిల్లో తల ఇరుక్కుపోయింది. ఉదయం గ్రామస్తులు వచ్చి చూసే వరకు కొన్ని గంటలపాటు అలాగే వేదన అనుభవించింది. కియోంఝర్ జిల్లాలో అన్జార్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఘటన చోటుచేసుకుంది. రెండో తరగతి చదువుతున్న జోత్య్స దెహురి(8) అనే చిన్నారి తరగతి గదిలో ఓ బెంచీపై పడుకుని అలాగే నిద్రపోయింది. ఆమెను పట్టించుకోకుండా ఉపాధ్యాయుడు తరగతి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. చిన్నారి చీకటిపడిన రాకపోయేసరికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊరంతా వెదికారు. శుక్రవారం ఉదయం ఆ స్కూలు వైపుగా వెళ్లిన గ్రామస్తులకు కిటికీ గ్రిల్లో తల ఇరుక్కుపోయిన స్థితిలో జోత్స్న రోదిస్తూ కనిపించింది. వెంటనే గ్రిల్స్ను తొలగించి, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో స్కూలు ఇన్ఛార్జి హెడ్మాస్టర్ గౌరహరి మహంతాను అధికారులు సస్పెండ్ చేశారు. తరగతి గది కిటికీ గ్రిల్లో చిన్నారి తల ఇరుక్కున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఉపాధ్యాయుల వైఖరిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సాయంత్రం 4 గంటల తర్వాత తరగతి గదికి తాళాలు వేయాలంటూ 8వ తరగతి విద్యార్థులకు హెడ్మాస్టర్ చెప్పినట్లు విచారణలో తేలిందని డీఈవో వెల్లడించారు.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచేలా.. చిరుత పులినే తరిమికొట్టిన వీధి కుక్క
వీధి కుక్క.. చిరుత పులి.. ఒళ్లు గగుర్పొడిచే పోరాటం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాడోపేడో తేల్చుకుందామన్నట్టుగా.. చిరుత పులితోనే వీధి కుక్క పోరాటానికి దిగింది. ఆ చిరుతను దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఈ దృశ్యం చూసిన అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.నిఫాడ్లో రాత్రి సమయంలో గ్రామంలోకి చేరుకున్న ఓ చిరుత.. వీధి కుక్కపై దాడి చేసింది. దీంతో తిరగబడిన ఆ శునకం.. పులిపైనే దాడికి దిగింది. తన నోటితో ఒక్కసారిగా చిరుత మెడని గట్టిగా పట్టుకుని.. తన అదుపులోకి తెచ్చుకుంది. భయపడకుండా కుక్క కసిగా పట్టేసి దూకుడుగా చిరుతను దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. చివరికి తనను తాను విడిపించుకుని సమీప పొలాల వైపు పరుగులు పెట్టింది. కుక్క పులి దాడి నుంచి బయటపడింది. అయితే, చిరుత గాయపడిందా? ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలపై స్పష్టత రాలేదు.A stray dog and a leopard had a face off in Nashik’s Niphad, with the dog astonishingly overpowering the big cat and dragging it nearly 300 metres before it fled. The video of the encounter has gone #viral .#leopard #StrayDogs #viralvideo #Maharashtra #nashik #MaharashtraNews pic.twitter.com/wMswGJKTQv— Salar News (@EnglishSalar) August 22, 2025
ఎన్ఆర్ఐ

విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని మైమూన్ ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ. 1.75 లక్షలు సహాయం అందించి ఆమెను ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు.రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్ లో ప్రతిభ ప్రదర్శించడంతోపాటు ప్రవేశపరీక్షలో 6,947 ర్యాంక్ సాధించి వెటర్నరీ కాలేజీలో సీటుకు అర్హత సాధించింది. చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలోనే పదవతరగతిలో టాపర్ గా వచ్చిన ఆమె ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మైమూన్ మాట్లాడుతూ, రవి పొట్లూరి గారి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రవి పొట్లూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్
షా ఆలం; ఆగస్టు, 2025: తెలుగు భాషాసంస్కృతులను తర్వాతి తరాలకు అందించడం గొప్ప విషయం అని తెలుగు విశ్వవిద్యాలయ పూర్వాచార్యులు రెడ్డి శ్యామల అన్నారు. భాష బోధన చేయడానికి భాషా శాస్త్ర పరిజ్ఞానం అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈనెల 13 నుంచి 23 వరకు మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్ లో భాగంగా నిర్వహించిన కార్యశాల ప్రారంభ సమావేశంలో ఆమె పాల్గొని, తెలుగు సంఘాన్ని అభినందించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, తెలుగు భాషా సాంస్కృతిక మూలాలను బతికించుకోవాలనుకోవడం గొప్ప విషయమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మలేషియాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం తెలుగు నేర్పించడం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మలేషియా తెలుగు అసోసియేషన్ను ఆమె అభినందించారు. ఈ కార్యశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా. చంద్రయ్య, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు డా. ప్రతాప్, కోఆర్డినేటర్ రమేష్, ఉపాధ్యక్షులు సీతారావు విద్యార్థులు పాల్గొన్నారు.

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం
తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మొల్లమాంబ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గత ఎనిమిదేళ్లుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను శ్రీహరి మందాడి ప్రశంసించారు. మొల్లమంబ వృద్ధాశ్రమానికి నాట్స్ తన వంతు చేయూత అందిస్తుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. కన్న తల్లిదండ్రులను ఎవరూ విస్మరించకూడదని శ్రీహరి అన్నారు. పేద వృద్ధులకు మానవత్వంతో సాయం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.. అమెరికాలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, ముఖ్యంగా పేదల ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తుందని శ్రీహరి తెలిపారు.

తెలుగు విద్యార్ధుల కోసం నాట్స్ రోబోటిక్ వర్క్ షాప్
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మేరీల్యాండ్ విభాగం ఆన్లైన్ ద్వారా రోబోటిక్ వర్క్ షాప్ నిర్వహించింది. ప్రైమరీ, హైస్కూల్ విద్యార్ధులకు రోబోటిక్, అంతర్జాతీయంగా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ పోటీలపై అవగాహన కల్పించింది. రోబోటిక్స్ నిపుణులు అలోక్ కుమార్ ఎన్నో విలువైన అంశాలను ఈ వర్క్ షాప్లో తెలిపారు. అలాగే విద్యార్దుల ప్రశ్నలకు ఎంతో ఓపికగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్ధుల్లో రోబోటిక్స్ పై ఆసక్తి పెరిగేలా ఈ వర్క్ షాప్ జరిగింది. మేరీల్యాండ్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ ఆన్లైన్ వర్క్ షాప్కి మేరీల్యాండ్తో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్ధులు పాల్గొన్నారు. రోబోటిక్స్పై అవగాహన పెంచుకున్నారు. నాట్స్ నాయకులు రవికిరణ్ తుమ్మల, కిరణ్ మందాడిలు ఈ వర్క్షాపు మద్దతు ఇచ్చినందుకు నాట్స్ మేరీ ల్యాండ్ విభాగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్క్ షాప్ నిర్వహణలో నాట్స్ మేరీ ల్యాండ్ చాప్టర్ కో ఆర్డినేటర్ వకుల్ మోర్, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వ మార్ని, మేరీల్యాండ్ నాట్స్ మహిళా విభాగం నాయకురాలు హరిణి నార్ల, కల్చరల్ టీం అధ్యక్షురాలు సువర్ణ కోనగల్లలు కీలక పాత్ర పోషించారు. రోబోటిక్ వర్క్ షాప్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.
క్రైమ్

టెన్త్ క్లాస్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/మూసాపేట: ఆ బాలుడికి క్రికెట్ బ్యాట్పై మక్కువ... ఎన్నిసార్లు అడిగినా తల్లిదండ్రులు కొనివ్వలేదు... పక్క భవనంలోని స్నేహితుడి ఇంటి నుంచి ఆ బ్యాట్ చోరీకి స్కెచ్ వేశాడు. ఒకవేళ బ్యాట్ కనిపించకపోతే అందినకాడికి డబ్బు దోచుకొని ఆ సొమ్ముతో బ్యాట్ కొనుక్కుందామనుకున్నాడు. చోరీ అనంతరం ఇంటిని గ్యాస్ లీక్తో తగలబెట్టాలని వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్పై రాసుకొని మరీ కుట్రపన్నాడు.అయితే చోరీ చేస్తుండగా ఆ ఇంటి యజమాని కుమార్తె చూడటంతో తప్పించుకోవడం కోసం ఆమెను దారుణంగా హతమార్చాడు. కూకట్పల్లి దయార్గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను చంపిన పదో తరగతి బాలుడి వ్యవహారమిది. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్ప లు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు.పుట్టిన రోజున వచ్చి కేక్ తినిపించి...పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి దాదాపు రెండేళ్ల క్రితం హైదరాబాద్ వలసవచ్చి కూకట్పల్లి దయార్గూడలోని ఓ భవనం నాలుగో అంతస్తులో నివసిస్తున్నారు. భర్త గతంలో చిరుద్యోగం చేసి మానేయగా భార్య కొన్నాళ్ల క్రితం వరకు కిరాణా దుకాణం నిర్వహించి ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివే వారి కుమారుడు (15) సక్రమంగా బడికి వెళ్లకుండా టీవీ, ఓటీటీల్లో వచ్చే క్రైమ్, హారర్ చిత్రాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు.కొన్నాళ్లుగా ధ్రువ్ రాఠీ అనే యూట్యూబర్కు చెందిన చానల్ వీక్షిస్తున్నాడు. తమ ఇంటికి ఆనుకొని ఉన్న మూడంతస్తుల భవనంపై ఉన్న పెంట్ హౌస్లో సహస్ర అనే బాలిక తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి సింగిల్ బెడ్రూం ఇంట్లో నివసిస్తోంది. పక్కపక్క భవనాల్లో ఉండటంతోపాటు ఆమె సోదరుడు కూడా బాలుడు చదివే పాఠశాలలోనే చదువుతుండటంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఉంది. మార్చిలో జరిగిన సహస్ర పుట్టిన రోజు వేడుకకు సైతం హాజరైన బాలుడు.. ఆమెకు కేక్ కూడా తినిపించాడు.క్రికెట్ కిట్ కొనివ్వని కారణంగా...సహస్ర సోదరుడితోపాటు కాలనీలో ఉండే పిల్లలతో కలిసి బాలుడు తరచూ క్రికెట్ ఆడేవాడు. కొన్నాళ్ల క్రితమే సహస్ర సోదరుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన ఓ క్రికెట్ బ్యాట్ కొనుక్కోవడంతో తనకు కూడా క్రికెట్ బ్యాట్ కొనివ్వాలని తల్లిదండ్రుల్ని పలుమార్లు అడిగాడు. వారు కొనకపోవడంతో సహస్ర ఇంట్లో చోరీకి స్కెచ్చేశాడు. తరచూ సహస్ర ఇంటికి వెళ్లి వస్తుండటం వల్ల ఆ ఇంట్లో ఏవి ఎక్కడు న్నాయో తెలిసిన బాలుడు.. ఆ ఇంట్లో ఎవ్వరూ లేనివేళ బ్యాట్ కాజేసి.. ఆపై సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు గ్యాస్ లీక్ ద్వారా ఇంటికి నిప్పంటించాలని కుట్ర పన్నా డు. ఇందుకోసం వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్పై రాసుకొని చివర్లో ‘మిషన్ డన్’ అని రాశాడు. పాఠశాలకు సెలవులు కావడంతో...చోరీ కోసం పథకం వేసిన బాలుడు ఈ నెల 18న సహస్ర, ఆమె సోదరుడు స్కూళ్లకు వెళ్లిపోతారని.. తండ్రి మెకానిక్ షాపుకి, తల్లి విధులకు వెళ్తుందని భావించాడు. అయితే సహస్ర చదువుతున్న బోయిన్పల్లి కేంద్రీయ విద్యాలయాలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో నాలుగు రోజులు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. దీంతో ఆమె మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలియని బాలుడు.. తమ భవనం నాలుగో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వచ్చి సైడ్ వాల్ మీదుగా సహస్ర కుటుంబం ఉంటున్న భవనం మూడో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడి పెంట్హౌస్కు చేరుకున్నాడు.తలుపు తీసి ఉండటంతో నేరుగా లోపలకు వెళ్లి చోరీకి ప్రయత్నించాడు. అదే సమయంలో లోపల గదిలోంచి హాల్లోకి వచ్చిన సహస్ర బాలుడిని చూసింది. ఆమె అరిస్తే పట్టుపడతాననే భయంతో బాలుడు ఆమె నోరు నొక్కి తన వద్ద ఉన్న కత్తితో నేరుగా ఆమె గొంతులో పొడిచాడు. దీంతో సహస్ర అరవలేక అక్కడే కూలిపోయింది. అయినప్ప టికీ చావలేదని భావించిన నిందితుడు.. ఆమెను విచక్షణారహితంగా దాదాపు 20 పోట్లు పొడిచి వచ్చిన మార్గంలోనే తన ఇంటికి పారిపోయాడు. బయట ఆరేసిన దుస్తులు తన మీద వేసుకొని రక్తం మరకలు తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంట్లోకి వెళ్లాడు.కత్తి, లేఖను దాచి... రక్తం మరకలు దుస్తుల్ని వాషింగ్ మెషీన్లో పడేసి ఆన్ చేశాడు. ఆపై ఏమీ ఎరగ నట్లు తండ్రితో కలిసి పెంపుడు కుందేలును పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో లంచ్ బాక్స్ కోసం ఇంటికి వచ్చిన సహస్ర తండ్రి.. కుమార్తె రక్తపుమడుగులో మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులనూ తప్పుదోవ పట్టించి..ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు జటిలంగా మారింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు చుట్టుపక్కల అందరితోపాటు ఈ బాలుడినీ విచారించారు. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేలా అతను.. సహస్ర ఇంటి నుంచి డాడీ, డాడీ అంటూ అరుపులు వినిపించాయని చెప్పి బాలిక తండ్రినే అనుమానితుడిగా చేశాడు. దీంతో ఆమె తండ్రిని విచారించిన పోలీసులు.. క్షుద్రపూజల అంశాన్నీ పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేశారు.ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచి్చన సమాచారంతో... స్థానికంగా నివసించే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఈ బాలుడి వ్యవహార శైలిపై అనుమానం వచి్చంది. దీంతో ఆయన ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం ఆ బాలుడు చదివే పాఠశాలకు వెళ్లిన పోలీసులు సహస్ర హత్య విషయమై ప్రశ్నించారు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో సోదాలు చేశారు.దీంతో కత్తి, రక్తం మరకలతో ఉన్న దుస్తులు, లేఖ లభించాయి. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆంగ్లంలో 11 లైన్లలో రాసి ఉన్న ఆ లేఖలో ‘ఫస్ట్ గో హోం... అండ్ టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్ అండ్ నెక్ట్స్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్’అంటూ లేఖలో రాసి ఉంది. దీన్ని పరిశీలించిన పోలీసులు చోరీ తర్వాత ఆధారాలు దొరక్కుండా ఇంటిని గ్యాస్ లీక్ చేసి కాల్చాలని కుట్రపన్నినట్లు భావిస్తున్నారు. ఈ ఉదంతంపై శనివారం అధికార ప్రకటన చేయనున్నారు.

సనత్నగర్: వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి
హైదరాబాద్: వ్యభిచారం గృహంపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు ఒక విటుడిని సనత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో యువతిని రిహబిలిటేషన్ సెంటర్కు పంపించారు. పోలీసులు తెలిపిన మేరకు.. కడప జిల్లా అరవీడు కూర్మయ్యగారిపల్లికి చెందిన పల్లపు నరేష్ (34) నగరానికి వలస వచ్చి మూసాపేట భవానీనగర్లో ఉంటున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన కొండా నాగరాజు (51)తో కలిసి అద్దెకు తీసుకున్న ఇంటిని వ్యభిచార గృహంగా మార్చి రెండు నెలలుగా యువతులతో వ్యభిచారం చేయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సనత్నగర్ పోలీసులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించగా నరేష్ నాగరాజులతో పాటు మూసాపేట రాఘవేంద్రకాలనీకి చెందిన గుణశేఖర్ (26) అనే విటుడిని అరెస్టు చేశారు. అలాగే మరో యువతిని పునరావాస కేంద్రానికి తరలించారు. వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.

కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను పదో తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్లోనే బాలుడు ఉంటున్నాడు. బాలుడిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి చొరబడిన బాలుడు.. చోరీ చేశాడు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్న బాలుడు.. ఆ కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా పొడిచి ప్రాణాలు తీశాడు. దొంగతనం ఎప్పుడు? ఎక్కడ ఎలా చేయాలి?. చేసే సమయంలో ఏదైనా ఆపద వస్తే ఏ విధంగా తప్పించుకోవాలో పక్కాగా ప్లాన్ చేసిన బాలుడు.. బాలిక ఇంట్లో చొరబడి రూ. 80 వేలు దొంగతనం చేశాడు. ఇంకా డబ్బులు కాజేసేందుకు ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీని పగులగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలుడిని చూసి సహస్ర కేకలు వేయడంతో ఆమెపై దాడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని సహస్రపై విచ్చలవిడిగా కత్తిపోట్లు పొడిచాడు.హత్య చేసిన తర్వాత పక్క బిల్డింగ్లో 15 నిమిషాల పాటు బాలుడు దాక్కున్నాడు. ఈ సమాచారాన్ని స్థానికంగా ఉండే ఓ ఐటీ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఐటీ ఉద్యోగి సమాచారం ఆధారంగా బాలుడిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో బాలుడూ ఎంతకీ నోరు విప్పకపోవడంతో అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాలుడు చదువుకుంటున్న స్కూల్కు వెళ్లి కూడా ఎస్వోటీ పోలీసులు విచారించారు.ఇక బాలిక కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్థానికుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. తనీఖీల్లో బాలుడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బాలుడి ఇంట్లో జరిపిన సోదాల్లో సహస్రను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. వచ్చీరాని ఇంగ్లీష్లో దొంగతనం ఎలా చేయాలో బాలుడు నేర్చుకున్నాడు. హౌటూ ఓపెన్ డోర్, హౌటూ ఓపెన్ గాడ్ హుండీ ఇలా నెట్ నుంచి సేకరించిన సమాచారాన్ని ఓ పేపర్ మీద రాసుకున్నాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

బంగారు శంఖం అంటూ రూ. 10 లక్షలు కుచ్చు టోపీ
ఒడిశా, జయపురం: జయపురంలో నకిలీ బంగారు శంఖాల మోసం జరిగింది. ఒక నకిలీ బంగారంతో తయారు చేసిన శంఖాన్ని ఒక వ్యాపారికి ఇచ్చి రూ.10 లక్షలు మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. జగత్సింగపూర్ జిల్లా కుజంగ పోలీసు స్టేషన్ గండకిపూర్ వ్యాపారి నిత్యానంద మహాపాత్రోకి బంగారు శంఖం ఇస్తామని కొందరు మోసగాళ్లు నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ వెల్లడించారు. ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్పోలీసు అధికారి వివరణ ప్రకారం నిత్యానంద మహాపాత్రో భువనేశ్వర్లో వ్యాపారం చేస్తున్నారు. అతడికి జయపురంలో బంగారు శంఖం ఇస్తానని ఓ వ్యక్తి తెలిపాడు. ఈ నెల 16న స్థానిక ఒక హొటల్కు ఆ వ్యక్తి అతడి అనుచరులు వచ్చారు. మహాపాత్రోకు బంగారంలా కనిపించే ఒక శంఖం ఇచ్చి రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. వ్యాపారికి దుండగులుఇచ్చిన నకిలీ బంగారు శంఖంతర్వాత మహాపాత్రో బంగారు శంఖాన్ని పరీక్షించగా అది ఇత్తడి అని బయట పడింది. వారికి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ రాజేంద్ర పంగి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
వీడియోలు


చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం


7 కోట్ల స్థలం 50 లక్షలకే.. ఆంధ్రజ్యోతికి ఇవ్వాలనుకొని బొక్క బోర్లాపడ్డ టీడీపీ


పాఠశాలలో పిల్ల ఏనుగు


కుక్కలతో మాట్లాడుతున్న రాజేష్


ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. నారా రోహిత్ షాకింగ్ రియాక్షన్


అరుణ నోరు తెరిస్తే బండారం బయటపడుతుందని హోంమంత్రి అనితకు భయం


అమెరికా వీసా ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరం


జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్


అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్