
విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్పై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. విశాల్ కెరీర్లో 35వ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కీ రోల్లో నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ‘‘అంజలి ప్రస్తుతం ఆచితూచిపాత్రలను ఎంచుకుంటున్నారు.
ఈ క్రమంలో విశాల్ 35 కథ నచ్చి, ఆమె ఓకే చెప్పారు. ‘మద గద రాజా’ చిత్రంలో అంజలి, వరలక్ష్మిలతో విశాల్ చేసిన సందడికి కాసుల వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు విశాల్, అంజలి కాంబోలో ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్ తెలిపింది.