ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముఖాముఖి పోరు | INDIA bloc Vice-Presidential candidate B Sudershan Reddy files nomination | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముఖాముఖి పోరు

Aug 23 2025 5:18 AM | Updated on Aug 23 2025 5:18 AM

INDIA bloc Vice-Presidential candidate B Sudershan Reddy files nomination

పూర్తయిన నామినేషన్ల పరిశీలన

న్యూఢిల్లీ: దేశ 17వ ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్‌ 9వ తేదీన జరిగే ఎన్నిక బరిలో అధికార ఎన్‌డీయే బలపరిచిన సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి బి.సుదర్శన్‌ రెడ్డి మిగిలారు. ఈ ఇద్దరు అభ్యర్థులు అందజేసిన నాలుగేసి సెట్ల నామినేషన్‌ పత్రాలు సరిగ్గా ఉన్నాయని ఈ ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ తెలిపారు. 

వీటిని అంగీకరించామని చెప్పారు. శుక్రవారంతో నామినేషన్ల పరిశీలనకు గడువు ముగియడంతో, దక్షిణాదికే చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ ఖరారైనట్లయింది. ఈ నెల 7 నుంచి 21వ  తేదీ వరకు మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. సీపీ రాధాకృష్ణన్, సుదర్శన్‌రెడ్డిల నామినేషన్లు మినహా సరిగా లేని మిగతా అన్ని నామినేషన్‌ పత్రాలను తిరస్కరించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement