Kollywood
-
స్టార్ హీరో కుమారుడితో పెళ్లి.. హీరోయిన్ మదర్ రియాక్షన్..!
కొత్త లోకా మూవీతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ఈ కోలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. అంతేకాకుండా తమిళం, మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించిన ముద్దుగుమ్మ.. 2022లో వచ్చిన 'హృదయం' చిత్రంలో నటించింది. ఈ మూవీలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు భార్యా, భర్తలుగా మెప్పించారు. తెరపై వీరద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.దీంతో నిజ జీవితంలోనూ వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలొస్తున్నాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ మదర్ లిస్సీ ప్రియదర్శన్ స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్కు హీరోయిన్ కల్యాణి మదర్ లిస్సీ ప్రియదర్శన్ రిప్లై ఇచ్చింది. కళ్యాణి, ప్రణవ్ పెళ్లి కోసం వెయిటింగ్ అని నెటిజన్ కామెంట్ చేయగా.. అది తప్పుడు వార్త అంటూ లిస్సీ రూమర్స్కు చెక్ పెట్టింది. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్, డేటింగ్ లాంటి రిలేషన్స్ లేవని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. కళ్యాణి ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో లేదని లిస్సీ తేల్చి చెప్పంది. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న వీరిద్దరి వెడ్డింగ్ రూమర్స్కు తెరపడింది. -
హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్లను ఎవరూ వాడకూడదని కోరుతూ ఒక పిటీషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫోటోలను ఉపయోగించుకుని పలు ఉత్పత్తులను విక్రయిస్తూ డబ్బు సంపాదించుకుంటూ తన ప్రతిష్ణను దెబ్బతీసేలా చేస్తున్న వారికి ఈ కేసు వర్తిస్తుంది. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ దావా వేశారు. నేడు జస్టిస్ తుషార్ రావు కమిటీ నేతృత్వంలో విచారణకు రానుంది.ఇదే అంశంలో ఇప్పటికే చిరంజీవి , మోహన్ లాల్ , నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, ఐశ్వర్య రాయ్ తదితరులు తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ కేసులలో సినీ ప్రముఖల ప్రైవసీ హక్కులను రక్షించకపోతే వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుందని న్యాయస్థానం స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. -
శానిటరీ నాప్కిన్ యాడ్.. వివాదంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ
లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా మెప్పించింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీని నయనతార సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ సంస్థ, ఎస్ ఎస్. లలిత్కుమార్కు చెందిన సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నిర్మించారు.ఇదిలా ఉండగా.. నయన్, విఘ్నేశ్ శివన్ ఓ శానిటరీ నాప్కిన్ యాడ్లో నటించారు. ఈ యాడ్ ప్రమోషన్ కోసం ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో యాడ్ మేనేజర్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. 'దయచేసి సహకరించండి.. వీళ్లు సాధారణ ప్రజలు కాదు'.. అంటూ అక్కడున్న ఇన్ఫ్లూయన్సర్లను సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన ఇన్ఫ్లుయెన్సర్లు నయన్- విఘ్నేశ్ జంటకు అధిక ప్రాధాన్యత కల్పించడాన్ని విమర్శించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ వివాదానికి గల కారణంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చారు.నిజానికి మేనేజర్ అక్కడ 'మేము సాధారణ ప్రజలం కాదు.. మేము ఇన్ఫ్లుయెన్సర్లం' అని చెప్పారని విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసిన వారు ఎడిట్ చేసి పెట్టారని అన్నారు. లైకులు, వ్యూస్ కోసం 'మేము' అనే పదాన్ని 'వారు'గా మార్చి వక్రీకరించారని తెలిపారు. ఆ తర్వాత మేము ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించగా.. దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నందున ఆ వీడియోను అలాగే ఉంచేలా సహకరించాలని మమ్మల్ని అతను కోరాడని విఘ్నేశ్ వెల్లడించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది. -
హారర్ థ్రిల్లర్ సినిమా.. భయానికి కొత్త నిర్వచనం ఇస్తామంటున్న మేకర్స్
హారర్, మిస్టరీ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే మరో ఆసక్తికరమైన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం “Production No. 4”గా రూపొందుతోంది. “Inspired by True Events” అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమా, నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్నదనే ఆసక్తిని పెంచుతోంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్తో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పోస్టర్లో కనిపిస్తున్న గాఢమైన చీకట్లు, భయానక చిహ్నాలు, మిస్టీరియస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పిస్తూ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్కు మంచి స్పందన లభించగా, చిత్ర యూనిట్ రేపు అధికారిక టైటిల్ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా టెక్నికల్గా కూడా హై స్టాండర్డ్స్లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. ప్రీ లుక్ పోస్టర్తో టైటిల్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు
హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు గతవారం థియేటర్లలోకి వచ్చింది. అటు తమిళంలో గానీ ఇటు తెలుగులో గానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. లాంగ్ రన్ ముగిసేసరికి ఎంత నష్టాలొస్తాయో చూడాలి? అయితే ఈ చిత్ర టైటిల్ వివాదం గురించి విఘ్నేశ్ శివన్ ఇన్నాళ్లకు స్పందించాడు. అసలేం జరిగిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)తొలుత ఈ సినిమాకు 'LIC' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ఈ మేరకు 2024లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. LIC సంస్థ ఈ చిత్రబృందానికి నోటీసులు పంపింది. ఏడు రోజుల్లోగా పేరు మార్చాలని చెప్పడంతో టీమ్ మెట్టు దిగింది. టైటిల్లోని C బదులు K అనే అక్షరాన్ని జోడించారు. అలానే థియేటర్లలో రిలీజైంది.అయితే LIC అనే పేరు ఉపయోగించుకోవాలంటే తమకు రూ.112 కోట్లు ఇవ్వాలని సదరు సంస్థ డిమాండ్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా విఘ్నేశ్ శివన్ బయటపెట్టాడు. ఇన్ని కోట్లు ఇవ్వడం ఎందుకని బదులుగా తను LIP, LIT, LIK, LIF టైటిల్స్ ఆలోచించి పెట్టుకున్నానని.. చివరగా LIK టైటిల్ నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విషయానికొస్తే.. 2040లో జరిగే ఫ్యూచరిస్టిక్ ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. ఫోన్లోని యాప్ చెబితేనే ప్రేమిస్తాననుకునే అమ్మాయి.. లేదంటే ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలనుకునే అబ్బాయి మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగింది? చివరకు వీళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కాన్సెప్ట్తో ఈ సినిమాని తీశారు. కానీ జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అలానే హీరో ప్రదీప్ రంగనాథన్.. హ్యాట్రిక్స్ హిట్స్కి కూడా ఈ చిత్రంలోనే బ్రేక్ పడింది.(ఇదీ చదవండి: మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?)#VigneshShivan about LIK Title- We initially titled #LIK as “LIC” (Love Insurance Company), but LIC demanded ₹112 crores for us to use the name.- Since that wasn’t feasible, I explored alternative options like LIP, LIT, LIK, and LIF.pic.twitter.com/TfjB0D9qlH— Movie Tamil (@_MovieTamil) April 14, 2026 -
రుక్మిణి వసంత్కి మరో సూపర్ ఛాన్స్!
కన్నడ భామ రుక్మిణి వసంత్కి తమిళంలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. నటుడు విజయ్ సేతుపతికి జంటగా 'ఏస్' మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు ఇది హిట్ అవ్వకపోయినా ఛాన్సులు వరిస్తున్నాయి. శివకార్తీకేయన్కి జంటగా గతేడాది 'మదరాసి' చిత్రంలో నటించింది. ఇది కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత సొంత భాషలో చేసిన 'కాంతార' ప్రీక్వెల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ధనుష్కు జంటగా నటించే అవకాశం వరించిందని సమాచారం.ధనుష్ ప్రస్తుతం విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో చేసిన 'కర' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని తర్వాత 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటిస్తాడు. ఇది ధనుష్ 55వ చిత్రం. దీని తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరస పద్యముత్తు దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడ. ఇందులోనే ఈయనకు జంటగా రుక్మిణి వసంత్ని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమచారం.రుక్మిణి.. కన్నడ, తమిళంతో పాటు తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్కు జంటగా 'డ్రాగన్' చేస్తున్నారు. కన్నడంలో చేసిన 'టాక్సిక్' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఇకపోతే ధనుష్ తో నటి రుక్మిణి తొలిసారిగా జోడీ కట్టబోతోందన్న మాట. ఇందులో విజయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించనున్నారనీ టాక్. త్వరలోనే ఈ విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)
-
తమిళ న్యూ ఇయర్.. బిడ్డ పేరు రివీల్ చేసిన జెర్సీ నటుడు
కోలీవుడ్ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గతనెల తండ్రిగా ప్రమోషన్ పొందారు. కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాకు. తన భార్య నర్మదకు మార్చి 2న పాప పుట్టిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు.తాజాగా తమ ముద్దుల కూతురికి పేరు పెట్టారు హరీశ్ కల్యాణ్, నర్మద. తమ బిడ్డ పేరును క్రియగా నామకరణం చేశారు. తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తన బిడ్డ పేరు రివీల్ చేశారు. తమ ముద్దుల బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు హరీశ్ కల్యాణ్ దంపతులు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా..హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు.సినిమా కెరీర్.. 2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) -
రూ.50 లక్షల సాయం.. ఆ హీరో వల్లే నా కొడుకు ఇలా
ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ అప్పుడప్పుడు కొందరు యాక్టర్స్, హీరోలు అనిపించుకుంటుంటారు. తమిళ హీరో శివకార్తికేయన్ కూడా అలాంటి ఓ పని చేశాడు. కాకపోతే ఇది చాన్నాళ్ల క్రితం జరిగినప్పటికీ సాయం పొందిన నటుడు ఇప్పుడా విషయం బయటపెట్టడంతో అదికాస్త వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన 'హీరో' సినిమాలో నటుడు ప్రేమ్ కుమార్ కూడా చేశాడు. అయితే ఈ చిత్రం చేస్తున్న టైంలోనే తన కొడుకు చదువు కోసం నెదర్లాండ్స్ వెళ్లాలని, సమయానికి చేతిలో డబ్బుల్లేవని.. పోని ఇల్లు తాకట్టు పెడదామా అంటే అది ఈఎమ్ఐలో ఉండటంతో బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించాయని ప్రేమ్ అన్నాడు. ఈ విషయం శివకార్తికేయన్కి చెప్పగా బ్యాంకులో తన పేరిట పూచీకత్తుగా రూ.50 లక్షలు ఇప్పించాడని.. అలా తనకు సాయం చేయడంతో ఇప్పుడు తన కొడుకు నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడని, దీనంతటికీ శివకార్తికేయన్ కారణమని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.ప్రేమ్-శివకార్తికేయన్ కలిసి ఓ సినిమాకు మాత్రమే పనిచేశారు. పరిచయం కూడా కొన్నాళ్లముందే జరిగింది. అయినా సరే తనని శివకార్తికేయన్ ఆదుకున్నాడని ప్రేమ్ చెప్పారు. హీరో, నిర్మాతగా బిజీగా ఉన్న శివకార్తికేయన్.. 'సెయాన్' అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ఇది థియేటర్లలోకి రానుంది. రీసెంట్గా 'తాయ్ కిళవి' మూవీతో నిర్మాతగానూ ఈ హీరో సూపర్ హిట్ కొట్టారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'దేవర' నిర్మాత కొత్త సినిమా)#Sivakarthikeyan helped with my son’s education in Netherlands.We didn’t get any loan as I only had my house 🏡. He gave me ₹50 lakhs as collateral in bank. Today, my son is earning ₹4–5 lakhsall because of him.- Actor #Premkumar pic.twitter.com/47KW1hGdwE— Movies Singapore (@MoviesSingapore) April 13, 2026 -
'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో
తమిళ హీరో ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారణాసిలోని కొందరు సాధువులు నకిలీ అని, వాళ్లంతా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తాను ఓ మూవీ షూటింగ్ సందర్భంగా తెలుసుకున్నానని చెప్పాడు. ఇతడు హీరోగా నటించిన 'మిస్టర్ ఎక్స్' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)'నాన్ కడవులే(నేనే దేవుడిని) షూటింగ్ కోసం వారణాసి వెళ్లాం. అయితే అక్కడ కనిపించేవారిలో చాలామంది నకిలీ సాధువులే. అలాంటి వాళ్లు 40 శాతం మంది ఉంటారు. వీరిలో కొందరు తీవ్రమైన నేరాలు చేసినవాళ్లు. ఇక్కడికి వచ్చి వేషం మార్చి దాక్కుంటారు. నా వరకు నిజమైన సాధువులు 60 శాతమే ఉంటారు. ఈ నకిలీ స్వాములందరూ తమ అసలు పేర్లు చెప్పారు. స్వామి అని మాత్రమే చెప్పుకొంటారు. వారిలో చాలామందికి రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు ఉండవు. కొంతకాలం అక్కడ దాక్కుని తర్వాత వెళ్లిపోతారు' అని ఆర్య తన అభిప్రాయాన్ని చెప్పాడు.కుంభమేళా జరుగుతున్నప్పుడు కూడా షూటింగ్ వెళ్తే, పోలీసులు తమని ప్రత్యేకంగా హెచ్చరించిన విషయాన్ని ఆర్య బయటపెట్టాడు. పోలీసులు ఇక్కడ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నారు. తమ వద్ద సాధారణ తుపాకీలు మాత్రమే ఉన్నాయని, కానీ జనసమూహంలోని కొందరి దగ్గర ఏకే-47 లాంటి ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని తమని పోలీసులు హెచ్చరించిన విషయాన్ని కూడా బయటపెట్టాడు.ఆర్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇతడి మతాన్ని బయటకు తీస్తున్నారు, ఆర్య అసలు పేరు జంషద్ షీర్ అలీ అని, ఇతడో ముస్లిం కావడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో?(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు) -
కోలీవుడ్లో సీక్వెల్స్ జోరు.. లైన్లో పది హిట్ సినిమాలు
‘ముదల్ పగుది’ (ఫస్ట్ పార్ట్) అదిరింది. అయితే ఆ కథ అక్కడితో ఆగలేదు. కొనసాగించే స్కోప్ ఉంది. అంతే... ‘ఇరండామ్ పగుది ఇరుక్కు’ (సెకండ్ పార్ట్ ఉంది) అంటూ సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ ఇరండామ్ పగుది రెండింతల మజానివ్వాలని ప్రేక్షకులకు, ఆయా చిత్రాల హీరోల అభిమానులకు ఉంటుంది కదా. అది దృష్టిలో పెట్టుకునే మరింత జాగ్రత్తగా సీక్వెల్ కథలను సిద్ధం చేసుకున్నారు దర్శకులు. 2026–2027లో తమిళ ‘వెండి తిరై’ (వెండి తెర) బోలెడన్ని సీక్వెల్స్ చూడబోతోంది. చెప్పాలంటే... కొన్ని సినిమాలకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ తెలుగులోనూ విడుదలైంది. సో... ఇరండామ్ పగుది కూడా ఇక్కడ విడుదల కాకుండా ఉండదు. మరి... ఏయే సినిమాకి సీక్వెల్ రానుందో పడిక్కలాం (చదువుదాం) వాంగ (రండి). మరింత యాక్షన్ డోస్తో...టైగర్ ముత్తువేల్ పాండియన్ రాక కోసం అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముత్తువేల్ పాత్రను రజనీకాంత్ అంత స్టైలిష్గా చేశారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023)లో రజనీ పాత్ర పేరు ముత్తువేల్ పాండియన్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివ రాజ్కుమార్ వంటి స్టార్స్ అతిథులుగా నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అయింది. ఇక జైలర్గా రజనీ తనదైన స్టైల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం సీక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం కన్నా మలి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రకు మరింత యాక్షన్ డోస్ పెంచి, రజనీని మరింత స్టైలిష్గా చూపించనున్నారు నెల్సన్. ఈ సీక్వెల్ కథ అంతర్జాతీయ క్రైమ్ నెట్ వర్క్ నేపథ్యంలో సాగుతుందని, ముత్తువేల్ పాండియన్ గతాన్ని కూడా చూపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ‘జైలర్ 2’లోనూ మోహనల్ లాల్, శివ రాజ్కుమార్ కనిపించనున్నారు. విజయ్ సేతుపతి కూడా అతిథి పాత్ర చేశారు. అదనపు ఆకర్షణగా షారుక్ ఖాన్ కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. విద్యా బాలన్, మిథుర్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్ని మరింత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారన్నది ప్రస్తుత సమాచారం. తొలి భాగంలానే మలి భాగం కూడా అదే టైటిల్తో తెలుగులో విడుదల కానుంది. త్వరలో సెట్స్కి కంగువ 2గతం, వర్తమానం... ఇలా రెండు టైమ్లైన్స్లో సాగే చిత్రంగా ‘కంగువ’ (2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో కంగువాగా, ఫ్రాన్సిస్ థియోడోర్గా డ్యుయల్ రోల్లో కనిపించి, ఆకట్టుకున్నారు సూర్య. ‘కంగువ’ విడుదల సమయంలోనే సెకండ్ పార్ట్ ఉంటుందని చిత్రనిర్మాత జ్ఞానవేల్ రాజా స్పష్టం చేశారు. సీక్వెల్ కథ కూడా సిద్ధమైంది. గత ఏడాది చివర్లోనే క్లాప్ కొట్టి, చిత్రాన్ని ఆరంభిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరగలేదు. త్వరలో చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది విడుదల చేయాలన్నది టీమ్ ప్లాన్. ఇదిలా ఉంటే... తొలి భాగం చివర్లో కార్తీ పాత్ర పరిచయం అవుతుంది. దాంతో ఈ సీక్వెల్ సూర్య, కార్తీ మధ్య సాగే భారీ యాక్షన్ మూవీగా ఉంటుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. తమిళ, తెలుగులో భాషల్లో తొలి భాగం విడుదలైనట్లుగానే ‘కంగువ 2’గా ఈ రెండు భాషల్లో విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో సర్దార్ 2... 2027లో సెట్స్కి డిల్లీ ఒకటి కాదు... రెండు సీక్వెల్స్లో కనిపించనున్నారు కార్తీ. ఒకటి ఆల్రెడీ విడుదలకు సిద్ధంగా ఉంది అదే ‘సర్దార్ 2’. మరొకటి ‘ఖైదీ 2’. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కావాల్సి ఉంది. సర్దార్ ఎప్పుడు వస్తాడు? కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్దార్’ (2022) సూపర్ హిట్ అయింది. ఈ స్పై థ్రిల్లర్ మూవీకి సీక్వెల్గా ఇదే కాంబినేషన్లో ‘సర్దార్ 2’ రూపొందిన. నిజానికి ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది జూన్లో పూర్తయింది. డిసెంబరులో విడుదలవుతుందని చాలామంది ఊహించారు. కానీ, అది జరగలేదు. చివరికి ఈ ‘సర్దార్’ సమ్మర్కి వస్తాడనే టాక్ ప్రచారంలో ఉంది. అయితే ఏ తేదీకి వస్తాడు? అనే విషయం గురించి చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. తొలి బాగంలో ఏజెంట్ సర్దార్, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్గా డ్యుయల్ రోల్ చేసిన కార్తీ మలి భాగంలోనూ ఈ రెండు పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్లో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందని సమాచారం. తొలి భాగం మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.రెండింతల యాక్షన్... ఎమోషన్ డిల్లీ అంటే ఎవరో ‘ఖైదీ’ (2019) సినిమా చూసినవాళ్లకి తెలుసు. ఆ సినిమాలో హీరో కార్తీ పాత్ర పేరు డిల్లీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని లోకేశ్ గతంలో పేర్కొన్నారు. అయితే ఇంకా పట్టాలెక్కకపోవడంతో ‘ఖైదీ 2’ లేదని చాలామంది ఫిక్స్ అయిపోయారు. మఖ్యంగా డిల్లీ పాత్రను చాలా ఇష్టపడిన కార్తీ అభిమానులను ఈ సీక్వెల్ ఆగిందనే వార్తలు నిరాశకు గురి చేశాయి. నిజానికి ఈ సినిమా ఆగిందని ప్రచారం జరగడానికి కారణం అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి లోకేశ్ కనగరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. అయితే ‘ఖైదీ 2’ ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిల్లీ సెట్స్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ‘ఖైదీ’ సినిమా చివర్లో డిల్లీ తన కూతురు అముదిని కలుసుకోవడానికి బయలుదేరుతాడు. తన కూతురితో కొత్త జీవితం ్ర΄ారంభించాలనుకుంటాడు. కానీ అతను జైలులో ఉన్నప్పుడు పని చేసిన డ్రగ్ మాఫియా గ్యాంగ్ పూర్తిగా నాశనం కాదు. ఆ గ్యాంగ్లో మిగిలిన సభ్యులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయిస్తారు. ‘ఖైదీ 2’ కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం. ఫస్ట్ పార్ట్తో పోల్చితే సీక్వెల్ రెండింతల యాక్షన్, ఎమోషన్తో ఉండేలా లోకేశ్ ΄ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ అంటోంది. కార్తీ అన్ని సినిమాలూ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతాయి కాబట్టి ‘ఖైదీ 2’ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది. మరోసారి అమ్మవారిగా...నయనతార కథానాయికగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ కామెడీ మూవీ ‘మూకుత్తి అమ్మన్’ (2020). దర్శకుడిగా బాలాజీకి ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్ర పోషించారు. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ రూపొందింది. రెండో భాగంలోనూ నయనతార కథానాయికగా నటించారు. అయితే దర్శకుడు మారారు. రెండో భాగాన్ని దర్శకుడు సుందర్. సి తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుష్బూ, స్నేహ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఊర్వశి, రెజీనా కసాండ్రా, సునీల్, యోగిబాబు, అభినయ తదితరులు నటించారు. ఇటీవలే ‘మూకుత్తి అమ్మన్ 2’ షూటింగ్ పూర్తయింది. తొలి భాగం ‘అమ్మోరు తల్లి’ టైటిల్తో తెలుగులో విడుదలైంది. రెండో భాగం కూడా విడుదల కానుంది. ఈ ఏడాదే ఈ సీక్వెల్ సిల్వర్ స్క్రీన్కి వస్తుంది. అయితే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు. మళ్లీ బాక్సింగ్ రెడీబాక్సింగ్ నేపథ్యంలో ఆర్య హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సార్పట్ట పరంపర’ (2021). ఈ చిత్రం అదే పేరుతో తెలుగులోనూ విడుదలైంది. తమిళనాడులోని అట్టడుగు వర్గాలు నివాసం ఉండే ప్రాంతం నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ డ్రామాని రూపొందించారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే సీక్వెల్ ప్రకటించారు. ఈ జూన్లో సీక్వెల్ షూటింగ్ని ప్రారంభిస్తామని తాజాగా ఆర్య స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే... పా.రంజిత్ దర్శకత్వంలోనే ఆర్య హీరోగా ఆరంభమైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘వెట్టువమ్’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల ఓ లీడ్ రోల్లో కనిపిస్తారు. ఈ ఏడాదే ‘వెట్టువమ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమా పనులు ఒక కొలిక్కి రావడంతో ‘సార్పట్ట పరంపర 2’ షూటింగ్ని జూన్లో ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘తని ఒరువన్ 2’ ఆగదు‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘తని ఒరువన్’ (2015). ఈ చిత్రకథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్, ‘జయం’ రవి పర్ఫార్మెన్స్... ఇలా అన్నింటికీ ప్రశంసలు దక్కాయి. వసూళ్ల పరంగా కూడా భేష్ అనిపించుకుంది. ఈ చిత్రం తెలుగులో రామ్చరణ్ హీరోగా ‘ధ్రువ’ పేరుతో రీమేక్ అయింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘తని ఒరువన్’కి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. అయితే పదేళ్లయినా సీక్వెల్ ఇంకా పట్టాలెక్కక΄ోవడంతో రెండో భాగం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమా ఆగలేదని, గత ఏడాది సెప్టెంబర్లో త్వరలో ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఆ తర్వాత వేరే న్యూస్ ఏదీ రాలేదు. నిర్మాణంలో జాప్యం జరుగుతుందే కానీ సీక్వెల్ నిర్మించాలనే ఆలోచనను యూనిట్ విరమించుకోలేదని కోలీవుడ్ టాక్. కుస్తీకి రెడీవిష్ణు విశాల్ హీరోగా రెజ్లింగ్ నేపథ్యంలో చెల్లా అయ్యవు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గట్ట కుస్తీ’ (2022). ‘మట్టి కుస్తీ’గా తెలుగులో విడుదలైంది. మరోసారి ఈ హీరో–దర్శకుడు వెండితెరపై కుస్తీ చూపించడానికి రెడీ అయ్యారు. ‘గట్ట కుస్తీ 2’ టైటిల్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. నీలాంబరి రిటర్న్స్రజనీకాంత్ హీరోగా నటించిన ‘పడయప్పా’ (1999 – తెలుగులో ‘నరసింహా’) లో నీలాంబరిగా రమ్యకృష్ణ కనబర్చిన నటనను అంత సులువుగా మరచిపోలేం. ఈ సినిమా విడుదలై పాతికేళ్లు అవుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కాగా, ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. రెండో భాగానికి రజనీకాంత్ కథ రాస్తున్నారని ఆయన రెండో కుమార్తె సౌందర్య పేర్కొన్నారు. కానీ ఎవరు నటిస్తారు? దర్శకత్వం వహిస్తారు వంటి విషయాలు తెలియజేయడానికి ఇది ‘టూ ఎర్లీ’ అవుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. కథ పూర్తయ్యాక ఆ వివరాలను తెలియజేస్తారు. అయితే టైటిల్ మాత్రం ‘నీలాంబరి’ అనుకుంటున్నారట. మరగద నాణ్యం 2‘మరకతమణి’గా విడుదలైంది. ఈ ఫ్యాంటసీ కామెడీ మూవీకి సీక్వెల్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మరగద నాణ్యం 2’ని ఆరంభించారు. ఆది పినిశెట్టి హీరోగా, నిక్కీ గల్రానీ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా ఏఆర్కే శరవణన్ దర్శకత్వంలోనే రెండో భాగం రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లానే సీక్వెల్ కూడా ఫ్యాంటసీ కామెడీ నేపథ్యంలోనే సాగుతుంది. కాగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆది, నిక్కీ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ఇద్దరూ 2022లో పెద్దల సమ్మతంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులోనూ విడుదలవుతుంది. -
రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. నిద్రలేకుండా రిహార్సల్స్
రీసెంట్ టైంలో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్ ఎవరంటే చాలామంది కాయదు లోహర్ అని చెబుతారు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్తో చేసిన 'డ్రాగన్' మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ అంతకుముందే తెలుగులో ఓ మూవీ చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో హీరోయిన్గా చేస్తోంది. ఈమె నటించిన తొలి మలయాళ మూవీ 'పల్లి చట్టంబి' ఈ వీకెండే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తాను చేసిన తొలి ఆల్బమ్ సాంగ్ గురించి, అందులో అవకాశం రావడం గురించి కూడా మాట్లాడింది.(ఇదీ చదవండి: శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్)'డ్యూడ్' మూవీతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సాయి అభ్యంకర్.. మరోవైపు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. అలా ఇతడి నుంచి 'పవళ మల్లి' పేరుతో గత నెలలో ఓ సాంగ్ వచ్చింది. ఇందులోనే సాయికి జోడీగా కాయదు కనిపించింది. యూట్యూబ్లో హిట్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో అవకాశం ఎలా వచ్చిందో కాయదు తాజాగా బయటపెట్టింది.'పవళ మల్లి' పాటలో అనుకోకుండానే నాకు అవకాశమొచ్చింది. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు సంగీత దర్శకుడు సాయి నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ టైంలో ఫోన్ చేసేసరికి కంగారుపడ్డా. ఏమైందని అడిగితే.. తాను ఓ పాట కంపోజ్ చేశానని, చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అందులో కచ్చితంగా ఉండాలని నన్ను అడిగాడు. తర్వాత పాట విన్నా, బాగా నచ్చేసరికి వెంటనే ఓకే చెప్పేశా. ఎంజాయ్ చేస్తూనే ఆ పాట పూర్తిచేశాం. ఇందుకోసం 2 రోజులు నిద్రలేకుండా రిహార్సల్స్ చేశాం. ఆడియెన్స్ కూడా పాటని ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా అనిపించింది' అని కాయదు చెప్పుకొచ్చింది. ఈ పాటని సాయి, శ్రుతి హాసన్ కలిసి పాడారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)#KayaduLohar Recent- #Sai called me at 2 AM and said, #Kayadu, we have a beautiful song, and I really want you to be a part of it.- I think it’s going to be a blast, and you’re the perfect one. When I heard it, I immediately fell for it.pic.twitter.com/UHWoT6824v— Movie Tamil (@_MovieTamil) April 11, 2026 -
'జన నాయగణ్' లీక్.. కావాలనే చేశారు: కమల్ హాసన్
దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగణ్. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్య కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దీంతో ఓటీటీ డీల్ కూడా రద్దయింది. ఈ క్రమంలో జననాయగణ్ సినిమా సోషల్ మీడియాలో లీకవడం సంచలనంగా మారింది. ప్రారంభ సన్నివేశాలు సహా సినిమాలోని అనేక సీన్స్ ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి.అందుకే ఇలా..ఈ ఘటనపై శివకార్తికేయన్, చిరంజీవి సహా ఎంతోమంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టాలని, తమ కష్టాన్ని గౌరవించాలని కోరారు. తాజాగా ఈ వ్యవహారంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో సకాలంలో రిలీజ్ అవలేదని, ఈ కారణం వల్లే పైరసీకి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఎవరు కాపాడతారు?ఇది కళ, కళాకారుడిపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి చర్యలు వందలాది కళాకారులు, సాంకేతిక నిపుణులు, థియేటర్ ఓనర్లు, నిర్మాతలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. సినీ ప్రియులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి పైరసీ చేసేవాళ్లకు గట్టి సమాధానమివ్వాలని కోరారు. గతంలో తనకు మద్దతుగా నిలబడినట్లే జననాయగణ్ సినిమాకు సైతం అంతే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రజనీ రియాక్షన్ఈ ఘటనపై రజనీకాంత్ సైతం స్పందిస్తూ.. 'ఇంటర్నెట్లో జననాయగణ్ రిలీజైందన్న విషయం తెలిసి షాకయ్యాను. సినిమా సంఘాలు ఇటువంటి విషయాలపై తీవ్రంగా స్పందించాలి. ప్రభుత్వం పైరసీకి పాల్పడ్డ వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు' అని ట్వీట్ చేశారు. The leak of #Jananayagan is not an accident - it is the result of systemic failure. Had due process been timely, we would not be here. Inordinate delays in certification created fertile ground for piracy. When legal access is stalled, illegitimate channels take over.Piracy is…— Kamal Haasan (@ikamalhaasan) April 10, 2026ஜனநாயகன் திரைப்படம் இணையத்தில் யாராலோ வெளியிடப்பட்டிருப்பது அதிர்ச்சியையும்,வேதனையையும் அளிக்கிறது. திரை அமைப்புகள் இதற்கு எதிராகக் குரல் எழுப்பி, அரசு இதைச் செய்தவர்களைக் கண்டுபிடித்து கடுமையான தண்டனை அளிக்க வேண்டும். இது போன்ற குற்றம் இனியும் தொடரக்கூடாது.— Rajinikanth (@rajinikanth) April 10, 2026 చదవండి: మా సినిమాను ధురంధర్తో పోల్చకండి: దర్శకుడు -
మా సినిమాను ధురంధర్తో పోల్చకండి: దర్శకుడు
ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్. గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. అనగా, అతుల్య రవి, రైసా విల్సన్, సంజనా సింగ్, కాళీ వెంకట్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎఫ్ఐఆర్ ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ గురువారం (ఏప్రిల్ 9న) ప్రీరిలీజ్ కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా మంజు వారియర్ మాట్లాడుతూ.. స్పై థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొంది. గౌతమ్ రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఇది 70 శాతం యాక్షన్ సన్నివేశాలతో కూడిన సినిమా అన్నారు. దర్శకుడు మను ఆనంద్.. ఈ మూవీ ప్రపంచంలో ఏడు చోట్ల జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని తెలిపారు. హిందీ మూవీ ధురంధర్ కూడా వాస్తవ సంఘటనలతో రూపొందినా.. ఆ చిత్రాన్ని మిస్టర్ ఎక్స్తో పోల్చరాదని పేర్కొన్నారు. -
పవన్ కల్యాణ్.. ఏ మాత్రం నమ్మలేని రూమర్!
పవన్ కల్యాణ్కి ప్రస్తుతం సినిమాలు చేయడంపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లయితే కనిపించట్లేదు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితమే ఈయన నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రకటన వచ్చింది. కొత్తగా ఏ మూవీస్ ఒప్పుకోలేదని, ఒకవేళ కొత్త ప్రాజెక్టులు అంగీకరిస్తే ఆయన వెల్లడిస్తారనేది సదరు పోస్ట్ సారాంశం. దీంతో పవన్ ఇప్పట్లో కొత్తగా ఏం చేయరని చాలామందికి క్లారిటీ వచ్చేసింది. ఇంతలోనే ఓ రూమర్ వినిపిస్తోంది. 'జైలర్ 2'లో ఏకంగా అతిథి పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)చూస్తుంటే ఈ రూమర్లో ఏ మాత్రం నిజం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ తన సినిమాలకే సరిగా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఆయనతో మూవీ అంటే అనుకున్న టైం కంటే చాలా ఆలస్యమైపోతుంటాయి. రీసెంట్గా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు.. ఏది తీసుకున్నా సరే పూర్తవడానికి ఏళ్లకు ఏళ్లు పట్టాయి. అలానే పవన్ ఇప్పటివరకు చిరంజీవి సినిమాల్లో తప్పితే వేరే వాటిలో అతిధి పాత్రలు చేయలేదు.అలాంటిది 'జైలర్ 2'లో షారూఖ్ ఖాన్ చేయాల్సిన పాత్రని పవన్ చేస్తారని అనుకోవడం అస్సలు నమ్మేలా లేదు. రూమర్ అంటే కనీసం నమ్మేలా అయినా ఉండాలి. కానీ తమిళ మీడియాలో ఏ మాత్రం నమ్మశక్యం కాని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే మూవీలో క్యామియో కోసం హీరో బాలకృష్ణని కూడా సంప్రదించారని, కానీ వర్కౌట్ అవ్వలేదని టాక్ వినిపించింది. చూస్తుంటే 'జైలర్ 2'లో అతిథి పాత్రలు ఎవరు చేస్తారనే సస్పెన్స్ ఎన్నాళ్లు కొనసాగుతుందో ఏంటో?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా) -
నా ఇంట్లో కోట్లు లేవు, రూ.40 వేలే ఉన్నాయి: నిర్మాత
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యారు నిర్మాత జాఫర్ సాదిక్. ఈయన నిర్మిస్తున్న మంగై, ఇరైవన్ మిగ పెరియవన్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఏప్రిల్ 6న ఐటీ అధికారులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు చెన్నైలో జాఫర్ సాదిక్కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై జాఫర్ స్పందించారు.ఆ ప్రచారంలో నిజం లేదుఅధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం వాస్తవమేనని, అయితే పలు కోట్ల రూపాయలు, ఇతర డాక్యుమెంట్లు పట్టుబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 5వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారని, ఎలాంటి అనధికారిక డబ్బుకానీ, ఇతర డాక్యుమెంట్స్ గానీ లభించలేదని చెప్పి పత్రాలపై సంతకం చేయించుకుని వెళ్లిపోయారన్నారు.ఇంట్లో అంతే ఉందితన ఇంట్లో ఒక సాధారణ కుటుంబ ఖర్చులకు సరిపోయే రూ.40 వేలు మాత్రమే ఉన్నాయన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా పలు శాఖలకు చెందిన అధికారులు తన ఇళ్లల్లో తనిఖీలు చేశారని, అయితే ఐటీ అధికారులు మాత్రమే కరెక్ట్గా సోదాలు నిర్వహించారన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తన గురించి అసత్య ప్రచారం చేయకూడదన్నారు. తాను ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తను నిర్మిస్తున్న సినిమాలు రిలీజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. -
నాకు నచ్చిందంటే నా భార్య వద్దన్నా వినను: హీరో
దివంగత నటుడు ముత్తరామన్ మనవడిగా, ప్రముఖ నటుడు కార్తీక్ కుమారుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ రామ్ కార్తీక్. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవగా, తొలి చిత్రంతో మంచి గుర్తింపు పొందాడు. ఆ తరువాత వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోయాడు. 2022లో నటి మంజిమ మోహన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు క్రిమినల్, మిస్టర్ ఎక్స్, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, లెగసీ వంటి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఆయనతో నటించడం..తాజాగా అతడు మాట్లాడుతూ.. లెగసీ చిత్రంలో నటుడు మాధవన్తో కలిసి నటించడం మంచి అనుభవం అన్నాడు. ఆయన తనకు చాలా సూచనలు ఇచ్చారన్నాడు. ఈ చిత్రంలో తనది కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనీ, అయితే అలా ఎందుకు ప్రవర్తిస్తాను? అన్న దానికి కారణం కూడా ఉంటుందన్నాడు. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నీ యాక్షన్ కథా చిత్రాలేనని, మంచి రొమంటిక్ కామెడీ కథా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తాను అంగీకరించే కథల గురించి తన భార్య మంజిమ మోహన్తో చర్చిస్తానని తెలిపాడు. భార్య చెప్పినా విననుఆమె నటి కాబట్టి సలహాలు తీసుకుంటానన్నాడు. అయితే ఒక్కోసారి ఆమె వద్దని చెప్పినా, తాను ఆ పాత్రకు న్యాయం చేయగలనని అనిపిస్తే నటించడానికి అంగీకరిస్తానన్నాడు. తన తండ్రి కార్తీక్తో కలిసి నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని, కాకపోతే అందుకు తగ్గ మంచి కథ కుదరాలన్నాడు. భార్య మంజిమ మోహన్తో నటించరా? అని అడుగుతున్నారని, ఆమెతో నటించడానికి ఎప్పుడూ రెడీనే అని, మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. -
హీరో విజయ్ ర్యాలీలో ప్రమాదాలు.. యువతను హెచ్చరించిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్–2 మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్హాసన్తో కలిసి రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ బుధవారం ఉదయం చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. విజయ్ నటించిన జననాయకన్ చిత్ర విడుదలకు ఆటంకాలు కలగజేయడం, విజయ్ కారు వెంటపడి యువత ప్రమాదాలకు గురవడం, కమల్హాసన్తో నటించడం వంటి పలు విషయాల గురించి విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు.చదువుకోండికాగా విజయ్ నటించిన జననాయకన్ సినిమాపై స్పందించేందుకు రజనీకాంత్ ఇష్టపడలేదు. అయితే నటుల వాహనాల వెనక పడి యువత ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. చదువుకునే వయసులో విద్యపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టాలని, చదువుకునే సమయాన్ని అశ్రద్ధ చేస్తే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. దూరంగా ఉండండిఅదేవిధంగా యువత మద్యానికి, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదన్నారు. అలాంటి దురలవాట్లు కలిగిన ఫ్రెండ్స్ను దూరం పెట్టాలన్నారు. ఇకపోతే తాను, కమల్ హాసన్ కలిసి నటించనున్న చిత్రం ఆగస్టులో ప్రారంభం అవుతుందని రజనీకాంత్ తెలిపారు. విజయ్ ప్రచార కార్యక్రమాలకు యువత భారీ సంఖ్యలో హాజరవుతున్న తరుణంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. -
శింబు కోసం రాలేదు, కానీ ఒక్కటి అడుగుతా..: హీరో తండ్రి
కోలీవుడ్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'అరసన్'. వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ రెండో షెడ్యూల్ చైన్నెలో జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్ను తమిళ సినీ నిర్మాతల మండలి, పెప్సీ కలిసి నిలిపేసినట్లు సమాచారం. ఈ విషయంపై శింబు తండ్రి, దర్శక నిర్మాత టి.రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అరసన్ చిత్రం కోసమో, శింబు కోసమో వాదించడానికి నేను రాలేదు. ఆ గొడవ ఎప్పుడో అయిపోయిందితమిళ చిత్ర నిర్మాతల మండలి, దానికి సహకరిస్తున్న దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధర్మంగా ప్రవర్తించకూడదని చెప్పడానికే నేను వచ్చాను. ఇంతకు ముందు శింబు నటించిన 'వెందు తనిందదు కాడు' చిత్ర నిర్మాత ఐసరి గణేష్.. శింబుకు వ్యతిరేకంగా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తర్వాతి సినిమా కోసం రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు కానీ ఆ మూవీ పట్టాలెక్కలేదు. అయితే ఈ కేసులో శింబు సరసన చట్టపరంగా నేను పోరాడి గెలిచాను. నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ శింబుకే చెందుతుంది అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ నకళ్లు నా చేతిలోనే ఉన్నాయి. నటుడికి మద్దతుగా నిలబడరా?ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాత కేసును దృష్టిలో పెట్టుకుని నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య.. ఈ రోజు అరసన్ చిత్ర షూటింగ్ను నిలిపివేసినట్లు తెలిసింది. ఈ విషయంలో నేడు అడగదలచుకున్నది ఒక్కటే. ఒక నిర్మాత కోసం నిర్మాతల సంఘం, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య పోరాడుతుంటే ఒక నటుడికి దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎందుకు మద్దతుగా నిలబడడం లేదు. ఈ సంఘం నటుడికి మద్దతుగా నిలబడాలి. అతడికి న్యాయం చేయాలి. మంచి పరిష్కారాన్ని చూపాలి అని టి.రాజేంద్రన్ పేర్కొన్నారు.చదవండి: నయనతార సర్ప్రైజ్.. ఎమోషనలైన విఘ్నేశ్ శివన్ -
నయనతార సడన్ సర్ప్రైజ్.. స్టేజ్పై భర్త ఎమోషనల్
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలు చేస్తుంది, కానీ ప్రమోషన్స్పై పెద్దగా ఆసక్తి చూపదు. సినిమాల్లో నటించడం వరకే తన పని అన్నట్లుగా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఇటీవల చిరంజీవి 'మన శంకరవరప్రసాద్గారు' మూవీ కోసం మాత్రం ఆ రూల్ బ్రేక్ చేసింది. ప్రమోషనల్ వీడియోలో కనిపించడంతో పాటు సక్సెస్మీట్లోనూ పాల్గొని సందడి చేసింది.సర్ప్రైజ్తాజాగా మరోసారి ప్రమోషన్స్లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. నయనతార నిర్మిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆమె భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ మంగళవారం (ఏప్రిల్ 7న) గ్రాండ్గా జరిగింది. విఘ్నేశ్ మాట్లాడుతున్న సమయంలో నయన్ సడన్గా స్టేజీపై ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఆమె రాకను చూసి విఘ్నేశ్ భావోద్వేగానికి లోనయ్యాడు. వీడియో వైరల్భార్యను కొద్ది క్షణాల పాటు హత్తుకుని షాక్లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భర్త కోసమే నయన్ ఈ ఈవెంట్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎల్ఐకే (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. లవ్టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా యాక్ట్ చేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.#LIK -;#Nayanthara appears for an Audio Launch function, after a long time, just because for #VigneshShivan ❤️ pic.twitter.com/R6cdrCWE3J— AmuthaBharathi (@CinemaWithAB) April 7, 2026 -
కీర్తి సురేశ్కు మందు అలవాటు లేదు కానీ..: సమంత
మాతృభాష మలయాళంలో బాలనటిగా రంగ ప్రవేశం చేసి ఆ తరువాత కథానాయికగా పరిచయం అయింది కీర్తి సురేష్. ఆ వెంటనే తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంది. మహానటి చిత్రంతో సత్తా చాటింది. ఈ మధ్య బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ హిందీ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఏదేమైనా ఇటీవల ఈమె నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు.సినిమాకీర్తి చివరిగా నటించిన హిట్ చిత్రం మామన్నన్. ఈమె ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవర కొండకు జంటగా రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ఈమె నటించిన కన్నివెడి చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇకపోతే కీర్తి సురేష్, హీరోయిన్ సమంత మంచి స్నేహితురాళ్లు అన్నది తెలిసిందే. కాగా నటి కీర్తి సురేష్కి మద్యం తాగే అలవాటు ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ అలవాటు లేదు కానీ..దీని గురించి సమంత స్పందిస్తూ.. కీర్తి సురేష్కు మద్యం అలవాటు లేదు కాని ఒక్క అలవాటు మాత్రం ఉందని చెప్పింది. అదేమిటంటే హైపర్ మ్యాక్ అనే అధికంగా నవ్వించే గుణం ఉందని తెలిపింది. అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ నవ్విస్తూనే ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అతి వేగంగా రైమింగ్ మాటలతో ఇతరులను ఆటపట్టిస్తుందని సమంత చెప్పుకొచ్చింది. -
సినిమాలకు పూర్తిగా గుడ్ బై.. నటుడి కామెంట్స్ వైరల్..!
ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్తో ఆమెకు రిలేషన్ ఉందని రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో వాటి మరింత బలం చేకూరింది. ఆ తర్వాత కోలీవుడ్లో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది.ఈ సంగతి పక్కన పెడితే తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని మాట్లాడారు. యూట్యూబ్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు త్రిష టీమ్ నుంచి ఎలాంటి స్పందనైతే రాలేదు. ఇదే నిజమైతే వెండితెరపై త్రిషను చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. చిత్ర లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
10 ఏళ్లుగా ట్రోలింగ్.. ధోనికే తప్పలేదు, ఇంకేం చేస్తాం!: విఘ్నేశ్
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులతో నిత్యం టచ్లో ఉంటారు. కానీ కొందరు మాత్రం తమ పనేదో తాము చేసుకుని పోతారు, సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆన్లైన్లో తాము పెట్టే ఫోటోలు చూసి సంతోషపడేవారి కన్నా తిట్టుకునేవారే ఎక్కువయ్యారంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్.నా ఆన్సరేంటంటే..ఇతడు దర్శకత్వం వహించిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా విఘ్నేశ్ శివన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. మన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడితే ఏం వస్తుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. దానికి నా సమాధానమేంటంటే.. ఇప్పుడు నేను, నయనతార, మా పిల్లలతో కలిసి ఓ ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశామనుకోండి. అంతా మారిపోయింది!కాస్త దిగులుగా, డల్గా ఉన్నవాళ్లు ఆ పిక్స్ చూసినప్పుడు కాస్త ప్రశాంతంగా ఫీల్ అవొచ్చు. కానీ ఇప్పుడంతా మారిపోయిందిలెండి. ప్రతీదాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. నన్నయితే 10 ఏళ్లుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినా ఎంఎస్ ధోనిలాంటివారికే ఈ విమర్శలు తప్పలేవు. గతంలో ఐపీఎల్లో సరిగా ఆడనప్పుడు ఆయన్ని ఎంత విమర్శించారో! ఇది చాలా బాధాకరం.. కానీ మనమేం చేయగలం?నన్ను ఆడేసుకుంటున్నారుఇలాంటి కామెంట్లను లైట్ తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేం. అప్పుడప్పుడూ ఈ ట్రోల్స్ గురించి నయన్, నేను సరదాగా మాట్లాడుకుంటాం. నిన్ను పెద్దగా ఏమీ అనట్లేదు కానీ నన్నయితే ఆడేసుకుంటున్నారు అని చెప్తుంటాను. ఇలా ట్రోల్స్ చేసేవారు ఎలాగో మారరు, కాబట్టి మనమే వాటిని తేలికగా తీసుకుని ముందుకు సాగాలి అని చెప్పుకొచ్చాడు.ప్రేమ- పెళ్లికాగా విఘ్నేశ్ శివన్ నానుమ్ రౌడీ ధాన్ (నేనూ రౌడీనే) సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈ మూవీలో నయనతార కథానాయికగా నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2022 జూన్లో వీరు పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్లో సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.చదవండి: నేను మంచివాళ్లకే మంచివాడిని.. అనవసరంగా నాలో రాక్షసుడిని నిద్రలేపొద్దు: బిగ్బాస్ పవన్ -
జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరో ధనుష్ ఒకప్పుడు కలిసి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు వీళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం మాత్రమే ఉంది. దానికి కారణం నయనతార పెళ్లి డాక్యుమెంటరీ. ఇది రిలీజైన టైంలో జరిగిన హంగామా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్తో పాటు ఈమె భర్త విఘ్నేశ్ శివన్.. ధనుష్ని టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు చాన్నాళ్లకు వాటిపై విఘ్నేశ్ శివన్ స్పందించాడు. ధనుష్తో స్నేహం చెడిపోవడం తన జీవితంలోనే అతిపెద్ద పశ్చాత్తాపం అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్)'ధనుష్ అంటే చాలా ఇష్టం. జూలై 28న ఆయన పుట్టినరోజు. అదేరోజు మా నాన్న చనిపోయారు. దీంతో ధనుష్లో నాన్నని చూసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇలాంటి జీవితం గడుపుతున్నానంటే దానికి ముఖ్య కారణం ఆయనే. వీఐపీ (రఘువరన్ బీటెక్) సినిమా షూటింగ్ టైంలో రెండేళ్లు ఆయనతోనే ఉన్నాను. ఆయన తిన్న తర్వాతే తినేవాడిని. ఒకప్పుడు మా మధ్య అంత అనుబంధం ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ లేదు. జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ అలాంటిదేం జరగలేదు. దూరం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ధనుష్తో స్నేహం కోల్పోవడం నా జీవితంలో పెద్ద పశ్చాత్తాపం' అని తాజా ఓ ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్ తన మనసులోని బాధని బయటపెట్టాడు.అసలేంటి వివాదం?విఘ్నేశ్ శివన్ తీసిన రెండో సినిమా 'నానుమ్ రౌడీ దాన్'కి ధనుష్ నిర్మాత. విజయ్ సేతుపతి, నయనతార ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. తెలుగులోనూ నేను రౌడీనే' పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో విఘ్నేశ్, నయనతార ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లిని చూపిస్తూ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో ఓ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీ.. తన నిర్మించిన 'నానుమ్ రౌడీ దాన్' సీన్స్ ఉండటంపై ధనుష్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.నిర్మాత అనుమతి లేకుండా సీన్స్ ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్ వేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఓ లెటర్ రిలీజ్ చేసింది. డాక్యుమెంటరీలో కేవలం మూడు సెకన్ల ఫుటేజీ ఉపయోగించినందుకు ధనుష్ ఏకంగా రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించింది. ఇది జరుగుతున్న టైంలో విఘ్నేష్ శివన్ కూడా ధనుష్ని విమర్శిస్తూ ఇన్ స్టాలో పలు పోస్టులు పెట్టాడు. తర్వాత వాటిని డిలీట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత విఘ్నేశ్-ధనుష్ స్నేహం బ్రేక్ అయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు అప్పటి సంగతులని గుర్తుచేసుకున్న విఘ్నేశ్.. పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'.. ఈ శుక్రవారమే(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. నయనతార ఓ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే ధనుష్తో వివాదం గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు: యాంకర్ రష్మి) -
సడన్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి మృత్యుంజయ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి, సితారే జమీన్ పర్ తదితర తెలుగు సినిమాలు స్ట్రీమింగ్లోకి వచ్చాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ఎలాంటి హడావుడి లేకుండా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)2024లో తమిళ వచ్చిన ఆంథాలజీ థ్రిల్లర్ మూవీ 'అధర్మ కదైగల్'. వెట్రి, అమ్ము అభిరామి, సాక్షి అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కామరాజ్ వెల్ దర్శకుడు. ఇప్పుడీ ఈ సినిమానే '4వ అధ్యాయం' పేరిట తెలుగులో ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. తాజాగానే స్ట్రీమింగ్ అవుతోంది.'4వ అధ్యాయం' విషయానికొస్తే.. మొదటి కథలో నందిని అనే నర్స్, గాయపడిన ఓ రౌడీ విషయంలో సమస్యలు ఎదుర్కొంటుంది. రెండో కథలో ఆన్లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు.. డబ్బుల కోసం చిన్నపిల్లని కిడ్నాప్ చేస్తాడు. మూడో స్టోరీలో బీచ్ దగ్గర తిరిగే రౌడీలు వరసగా హత్యకు గురవుతుంటారు. నాలుగో కథలో దివ్య అనే అమ్మాయి, తన తండ్రి ఆపరేషన్ డబ్బులు చెల్లించేందుకు అద్దె గర్భానికి రెడీ అవుతుంది. ఈ నాలుగు చివరకు ఎలా ముగిశాయనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు) -
అరుణాచలంలో అన్నదానం చేసిన హీరోయిన్
హీరోయిన్ మృణాళిని రవి మంచి మనసు చాటుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో అన్నదానం చేసింది. దాదాపు వెయ్యిమంది భక్తులకు భోజనం పెట్టింది. మృణాళిని రవి మాట్లాడుతూ.. ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాలన్న సేవాతత్వాన్ని మా నాన్న నేర్పించాడు. వీలైనప్పుడల్లా ఇతరులకు సాయం చేసేలా నా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారు. అన్నిదానాల్లోకెల్లా అన్నదానమే గొప్పదని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. అందుకే నాకు తోచినంత చేశాను అని చెప్పుకొచ్చింది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. మృణాళిని రవి 'సూపర్ డీలక్స్' చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 'గద్దలకొండ గణేశ్' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు', 'మామా మశ్చీంద్ర' సినిమాల్లో మెరిసింది. తెలుగులో కన్నా తమిళంలోనే అనేక సినిమాలు చేసింది. చివరగా 'రోమియో' అనే తమిళ చిత్రంలో తళుక్కుమంది.చదవండి: ఈ ధురంధర్ నటుడికి టిఫిన్ చేసే అలవాటే లేదు -
భానుప్రియ మతిస్థిమితం బాగోలేదా? సోదరి ఏమందంటే?
ఆకట్టుకునే ఆహార్యం, అద్భుతమైన నటన, నెమలిలా నాట్యం చేస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది హీరోయిన్ భానుప్రియ. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసింది. అయితే భర్త మరణించాక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె డిమెన్షియా అనే వ్యాధి బారిన పడింది. డిమెన్షియా అంటే జ్ఞాపకశక్తిని కోల్పోవడం!భానుప్రియ గురించి దుష్ప్రచారంఈ వ్యాధి వల్ల డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన కూడా విరమించుకుంది. కొద్దిరోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదని, మతిస్థిమితం కోల్పోయిందంటూ దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై భానుప్రియ సోదరి, హీరోయిన్ శాంతిప్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. మా అక్క కొంతకాలంగా తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది. ఆమెకు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. తీరా చిత్రీకరణ సమయానికి ఆ పాత్రలో అనేక మార్పుచేర్పులు చేస్తున్నారు.ఇలా మోసం చేయడం సరికాదుఅది ఆమెను బాధిస్తోంది. ముందొకటి చెప్పి.. తీరా సెట్కు వెళ్లాక మాట మార్చేయడం పట్ల ఆమె ఎంతగానో కలత చెందింది. దాదాపు 280 సినిమాలు చేసి, ఎన్నో అవార్డులు గెలిచిన వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితిలో నా సోదరిని చూడలేకపోతున్నాను. భర్త చనిపోయాక అక్క మానసికంగా కుంగిపోయింది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటికే పరిమితమైంది. తనను కనీసం 80's స్టార్స్ రీయూనియన్కు కూడా ఎవరూ ఆహ్వానించరు.రీయూనియన్కి పిలవరుదీని గురించి మాట్లాడొద్దని అక్క నన్ను హెచ్చరించింది, అయినా సరే నిర్మొహమాటంగా చెప్తున్నా.. తనను ఎవరూ రీయూనియన్ పార్టీకి పిలవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు.. పోనీ తన నెంబర్ మీ దగ్గర లేకపోతే నాకు లేదా మా అన్నయ్యకు ఫోన్ చేయొచ్చుగా.. ఇండస్ట్రీలో అందరికీ మా అన్నయ్య తెలుసు. కానీ ఎవరూ సంప్రదించరు. ఇకపోతే అక్క ఇకపై సినిమాలు చేయదు. నేను మాత్రం సినిమాల్లో కొనసాగుతాను. నాకోసం డబ్బింగ్బ్యాడ్ గర్ల్ సినిమాలో అక్క నాకోసం డబ్బింగ్ చెప్పింది. తన మానసిక స్థితి చెడిపోలేదు. బాగానే ఉంది. దయచేసి సోషల్ మీడియాలో అక్క గురించి అసత్య ప్రచారం వ్యాప్తి చేయొద్దు. యూట్యూబ్లో ముందూవెనకా ఆలోచించకుండా, ఏదీ తెలుసుకోకుండా అక్క గురించి నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అని మండిపడింది. కాగా భానుప్రియ.. సితార చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. బంగారు చిలక, అన్వేషణ, ఆలాపణ, అపూర్వ సహోదరులు, చక్రవర్తి, దొంగ మొగుడు, స్వర్ణకమలం, పెదరాయుడు, అన్నమయ్య, జయం మనదేరా.. ఇలా అనేక సినిమాలు చేసింది. పర్సనల్ లైఫ్చివరగా అయలాన్ మూవీలో హీరో తల్లిగా కనిపించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. భానుప్రియ 1998లో గ్రాఫిక్స్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్ను పెళ్లాడింది. వీరికి 2002లో కూతురు పుట్టింది. ప్రస్తుతం ఆమె లండన్లో చదువుకుంటోంది. పెళ్లయిన ఏడేళ్లకే దంపతులిద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కానీ విడాకులు తీసుకోలేదు. 2018లో ఆదర్శ్ గుండెపోటుతో మరణించాడు.చదవండి: నేను కాలితో తన్నడం వల్ల అనుష్కకు గాయం: అడివి శేష్ -
ఆయనతో నావల్ల కాదు.. ఆ సినిమా చేయను: ఆండ్రియా
కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాటిని రీరిలీజ్ చేసినా, సీక్వెల్ తీసినా చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలా యుగానికి ఒక్కడు (ఆయిరత్తిల్ ఒరువన్) సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కార్తీ హీరోగా, ఆండ్రియా జెర్మియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే దర్శకుడు ప్రకటించాడు. ఆషామాషీ కాదుకానీ ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా పనులు జరగలేదు. గతేడాది చివర్లో మరోసారి సీక్వెల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సెల్వ. ధనుష్, కార్తీతో కలిసి సీక్వెల్ తీస్తానని, కాకపోతే ఏడాదిపాటు వారు కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. ఇప్పటికే చేతిలో సినిమాలతో బిజీగా ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఏడాదిపాటు డేట్స్ ఇవ్వాలంటే ఆషామాషీ కాదు. అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి!సీక్వెల్లో నేనుండనుఇకపోతే యుగానికి ఒక్కడు సీక్వెల్పై నటి, సింగర్ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యుగానికి ఒక్కడు సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆ మూవీ నటిగా ఎదిగేందుకు తోడ్పడింది. అయితే రెండో భాగంలో నేను ఉంటానని మాత్రం ఊహించకండి. యుగానికి ఒక్కడు సీక్వెల్ తెరకెక్కితే సంతోషమే కానీ నేను మాత్రం అందులో చేయలేను.ఆయనతో పని చేయడం కష్టంఎందుకంటే మొదటి భాగమే 200 రోజులు తెరకెక్కించారు. అన్ని రోజులు పని చేయడమంటే మాటలు కాదు. అక్కడ అంత కష్టపడ్డాను గనుకే తర్వాత చేసిన సినిమాలు ఎంతో సులువుగా అనిపించాయి. ఏదేమైనా దర్శకుడు సెల్వరాఘవన్తో కలిసి పని చేయడం చాలా కష్టం అని పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రియా చేతిలో మనుషి, పిశాచి 2, నో ఎంట్రీ సినిమాలున్నాయి.చదవండి: బండ్ల గణేశ్ ఇంట శుభకార్యం.. కూతురి పెళ్లి వేడుక -
శింబుతో జోడీ కట్టనున్న కాంతార హీరోయిన్!
హిట్ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు తమిళ హీరో శింబు. నిజానికి ఆయన సరైన హిట్ చూసి చాలాకాలమే అయింది. అదే విధంగా సినిమాలు చేయడంలో కాస్త వెనకబడ్డ శింబు ఆ మధ్య మణిరత్నం డైరెక్షన్లో థగ్లైఫ్లో నటించగా అది పూర్తిగా నిరాశపర్చింది. ప్రస్తుతం ఇతడు వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ మూవీ చేస్తున్నాడు. డ్రాగన్ డైరెక్టర్తో..విజయ్ సేతుపతి పోలీస్ అధికారికగా కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పుడు శింబు మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఓమై కడవులే మూవీతో దర్శకుడిగా పరిచయమైన అశ్వద్ మారిముత్తు డ్రాగన్తో సంచలన సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు శింబును డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట! ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. కాంతార బ్యూటీసంతానం ముఖ్య పాత్ర పోషించనున్నాడు. చాలా గ్యాప్ తర్వాత శింబు, సంతానం కలిసి నటించనున్న చిత్రం ఇదే! ఈ మూవీలో శింబుకు జంటగా కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాకు గాడ్ లవ్ అనే టైటిల్ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం! -
భార్య ఉండగా నటుడి రెండో పెళ్లి.. DNA రిపోర్ట్తో నిజం బయటకు!
ప్రముఖ చెఫ్, నటుడు మాధంపట్టి రంగరాజ్ కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిజిల్డాను ఏడాదిన్నర క్రితం సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలి మెడలో తాళి కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ వీరి బంధం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. రంగరాజ్.. ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో జాయ్.. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా తాను ఆరోనెల గర్భిణీ అని ప్రకటించింది. అయితే కడుపులో బిడ్డకు, తనకు సంబంధం లేదని పారిపోయే ప్రయత్నం చేశాడు నటుడు.DNA టెస్ట్దీంతో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్.. నువ్వేం తండ్రివి అని భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగరాజ్ మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. డీఎన్ఏ టెస్టులో బాబుకు తనే తండ్రినని తేలితే దేనికైనా రెడీ అని సవాలు విసిరాడు రంగరాజ్. ఈ క్రమంలో కోర్టు సమక్షంలో వీరికి డీఎన్ఏ టెస్టు నిర్వహించారు. తాజాగా వాటి ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చాయంటోంది జాయ్. డీఎన్ఏ రిపోర్టులో తన బిడ్డకు తండ్రి రంగరాజే అని తేలిందని వెల్లడించింది.పోస్ట్ డిలీట్ఇలా ఎన్ని టెస్టులు చేసినా విజయం ఎప్పుడూ తల్లిదేనని రాసుకొచ్చింది. ఈ పోరాటంలో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. గర్భం దాల్చినప్పటి నుంచి రాఘ పుట్టేవరకు ఎన్నో కష్టాలు చూశాను. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను. నా కొడుకు కోసం ధృడంగా నిలబడ్డాను. నా బిడ్డ అన్యాయమైపోకూడదని న్యాయ పోరాటం చేశాను. ఈరోజు నేను గెలిచాను అని పేర్కొంది. కానీ కాసేపటికే ఈ పోస్టును డిలీట్ చేసింది.సినిమాకాగా రంగరాజ్.. కూకు విత్ కోమలి రియాలిటీ షో జడ్జిగా పాపులర్ అయ్యాడు. మెహందీ సర్కస్, పెంగ్విన్ సినిమాల్లో నటించాడు. ఇతడు లాయర్ శృతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. జాయ్ క్రిజిల్డా విషయానికి వస్తే దాదాపు పాతిక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్గా పని చేసింది. విజయ్, శివకార్తికేయన్, ప్రభుదేవా, అనిరుధ్ రవిచందర్, రెజీనా.. ఇలా ఎందరో సెలబ్రిటీల దగ్గర స్టైలిస్ట్గా వర్క్ చేసింది. జాయ్.. 2018లో జేజే ఫ్రెడరిక్ను పెళ్లి చేసుకోగా వీరు 2023లో విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల కిందట రంగరాజ్, జాయ్ క్రిజిల్డా ప్రేమలో పడ్డారు. దీంతో భార్య ఉండగానే జాయ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే ఆమె పర్సనల్ ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించడం వల్లే పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. Madhampatty Ragha Rangaraj 🧿@MadhampattyRR #madhampattyrangaraj #chefrangaraj #chefmadhampattyrangaraj #joycrizildaa #ragharangaraj pic.twitter.com/kvcT4uqyud— Joy Crizildaa (@joy_stylist) March 12, 2026 చదవండి: ఏడాదిగా ట్రెండింగ్లో తమిళ్ సాంగ్.. తెలుగు వర్షన్ రిలీజ్ -
32 ఏళ్ల తర్వాత కాంబినేషన్ రిపీట్
ఒక సూపర్హిట్ కాంబో 32 ఏళ్ల తరువాత మళ్లీ కలసి పనిచేస్తోంది. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ అధినేత టీజీ.త్యాగరాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి ప్రముఖ హీరోలతో పలు సూపర్ చిత్రాలను నిర్మించిన నిర్మాత ఈయన. ఇప్పటికీ ఈ తరం నటీనటులతో చిత్రాలు చేస్తున్నారు. అదేవిధంగా సంగీత జ్ఞాని ఇళయరాజా గురించి అందరికీ తెలిసిందే!32 ఏళ్ల తర్వాత రిపీట్కాగా సత్యజ్యోతి ఫిలింస్ త్యాగరాజన్, ఇళయరాజాలది సూపర్హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో పలు అద్భుతమైన చిత్రాలు రూపొందాయి. అలాంటి సూపర్ హిట్ కాంబో 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్న చిత్రం లెనిన్ పాండియన్. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ.త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. దివంగత నటుడు శివాజీగణేషన్ మనవడు దర్శన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.వీడియో వైరల్సీనియర్ దర్శకుడు, సంగీత దర్శకుడు గంగై అమరన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఆయన సరసన ప్రముఖ నటి రోజా నటించడం విశేషం. దీనికి డీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపోతే టీజీ త్యాగరాజన్, ఇళయరాజా తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న వీడియోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sathya Jyothi Films (@sathyajyothifilms) -
సూరి సినిమాలో హీరోయిన్గా 'డ్యూడ్' బ్యూటీ!
సినిమా ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో నిలబెడుతుందో చెప్పలేం. అప్పటివరకు ప్రయత్నలోపం లేకుండా శ్రమిస్తూనే ఉండాలి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సహాయనటుడి నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు నటుడు సూరి. విడుదలై మూవీతో హీరోగా ట్రాక్ ఎక్కిన ఈయన ఇటీవల విడుదలైన మామన్ మూవీ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ నుంచి హీరోగా..ప్రస్తుతం ఇతడు మండాడి సినిమా చేస్తున్నాడు. సముద్రతీరంలో జాలర్ల పడవల పోటీ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమిది. మదిమారన్ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఇది నిర్మాణంలో ఉండగా మరో సినిమాకు కమిటయ్యాడు సూరి.రియల్ స్టోరీ ఆధారంగా మూవీరవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుంది. 2015లో చెన్నైలో బీభత్సం సృష్టించిన వరదల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇందులో సూరికి జంటగా మమిత బైజు హీరోయిన్గా నటించనున్నట్లు వినికిడి. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ డ్యూడ్ సినిమాతో మరో హిట్ అందుకుంది. హీరోయిన్ ఎవరంటే?విజయ్ హీరోగా నటించిన జననాయకన్లోనూ కీలక పాత్ర పోషించింది. సూర్యకు జంటగా విశ్వనాథ్ అండ్ సన్స్, ధనుష్తో కర సినిమాలు చేసింది. ఇవన్నీ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సూరితో మమిత బైజు జోడీ కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
సైలెంట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్
హీరోయిన్గా తమిళంలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జనని అయ్యర్ (Janani Iyer) ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. గతేడాది ఏప్రిల్లో నిశ్చితార్థం చేసుకోగా.. దాదాపు పదకొండు నెలల తర్వాత ఇప్పుడు పైలట్ సాయి రోషన్తో ఏడడుగులు వేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని జనని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)2011లో వచ్చిన విశాల్-ఆర్య 'వాడు-వీడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన జనని.. తర్వాత మలయాళ, తమిళంలో వరస మూవీస్ చేస్తూనే ఉంది. చివరగా 2024లో 'హాట్ స్పాట్'లో ఓ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. అలానే తమిళ బిగ్బాస్ రెండో సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది గానీ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా నటిగా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు నచ్చితే ఈ సినిమాకు రూ.1000 కోట్లు) -
అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా అంటే తమను జనాలతో కలిపే వారధిగా భావిస్తారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలను పంచుకుంటూ ఉంటారు. మరికొందరు ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు పెట్టరు. అయితే సెలబ్రిటీల పేరుతో కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడదే జరిగింది. ఎక్స్ (ట్విటర్)లో ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి పేరిట ఓ అకౌంట్ ఉంది. త్వరలోనే కొత్తది..దానికి సంబంధించిన స్క్రీన్షాట్ను ఖుష్బూ షేర్ చేస్తూ.. అది ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేసింది. తన భర్త ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లేడని వెల్లడించింది. కాబట్టి సుందర్.సి పేరుపై కనిపించే ఖాతాలను నమ్మవద్దని కోరింది. త్వరలోనే అతడికి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన ఖుష్బూ.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. మొదట్లో డీఎంకేలో చేరింది. నాలుగేళ్లకే ఆ పార్టీని వదిలి కాంగ్రెస్లో అడుగుపెట్టింది. రాజకీయ ప్రవేశంఆరేళ్లకే కాంగ్రెస్ను సైతం వీడి బీజేపీలో చేరింది. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఇదిలా ఉంటే త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ఖుష్బూ భర్త సుందర్. సి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే కూటమి మిత్రపక్షమైన పుతియ నీది కట్చి (Puthiya Neethi Katchi (PNK) పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నాడు. మధురై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నాడు. This is a fake account of Director #SundarC . He is not not any social media platform as on date. Pls do not follow this or interact on this or any other similar account on any social platform. . Shall be creating a new and verified account for him soon. 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/9P1VYV67U7— KhushbuSundar (@khushsundar) March 30, 2026 చదవండి: ప్రేమిస్తే ఛాన్స్ మిస్ అయ్యేది.. ముఖానికి గ్రీజు పూసుకోవడంతో..: హీరో -
'ప్రేమిస్తే' ఆడిషన్కు గ్రీజు పూసుకుని వెళ్లా.. అప్పుడుకానీ..!
తమిళ హీరో భరత్.. బాయ్స్, ప్రేమిస్తే, స్పైడర్, హంట్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడు. ప్రస్తుతం ఇతడు 'కాళిదాస్ 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అతడు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. భరత్ మాట్లాడుతూ... దర్శకుడు బాలాజీ శక్తివేల్ నాకు కాదల్ (తెలుగులో ప్రేమిస్తే పేరిట డబ్ అయింది) కథ చెప్పాడు. హీరో ఎంపిక కరెక్టేనా?చిన్న టౌన్లో మెకానిక్ పనిచేసుకునే అబ్బాయిగా నటించాల్సి ఉంటుందని పాత్ర పరిచయం చేశాడు. నేను కూడా ఒప్పుకున్నాను. తీరా దర్శకుడు హీరోగా నేను కరెక్టేనా? అన్న డైలమాలో పడ్డాడు. నా రంగు, మాటతీరు.. అన్నీ సిటీ అబ్బాయి లక్షణాలే ఉన్నాయి.. పక్కా పల్లెటూరి భాష మాట్లాడే మెకానిక్ రోల్కు సెట్ అవుతానా? లేదా? అన్న అనుమానం ఆయన మెదడును తొలిచేసింది.అదే వీధిలో ఇల్లు కొన్నా..నేనేమో ఎలాగైనా ఈ సినిమా చేయాలనుకున్నాను. ముఖానికి గ్రీజు పూసుకుని ఆడిషన్కు వెళ్లాను. పైగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వారిలాగే మాట్లాడాను. నా తాపత్రయం నిర్మాత ఎస్.శంకర్కు అర్థమైంది. ఆయన ఆఫీసులోనే స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. అలా కాదల్ మూవీ చేయగా, మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆ ఆఫీస్ ఉన్న వీధిలోనే నేను ఇల్లు కొనుక్కున్నాను. అదెంతో గర్వకారణంగా అనిపించింది అని భరత్ చెప్పుకొచ్చాడు.చదవండి: నేను సినిమాలు చూడను: ఆమిర్ ఖాన్ -
సూపర్ హిట్ కాంబో రిపీట్.. ఆ మూవీకి సీక్వెల్ రానుందా?
మంగాత్తా చిత్ర కాంబో రిపీట్ కానుందా? అంటే కోలీవుడ్లో అవుననే టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరో అజిత్, దర్శకుడు వెంకట్ ప్రభులది హిట్ కాంబినేషన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో 2010లో తెరకెక్కిన మంగాత్తా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో నటుడు అజిత్ను విలనిజంతో కూడిన స్టైలిష్ పాత్రలో చూపించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్.దీంతో వీరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు రానుంది. దర్శకుడు వెంకట్ ప్రభు.. శివకార్తికేయన్ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని నటుడు శివకార్తికేయన్ కూడా తెలిపారు. అయితే ఈ చిత్రం ప్రారంభంలో ఆలస్యం జరగనున్నట్లు తెలిసింది. దీంతో దర్శకుడు వెంకట్ ప్రభు ఇటీవల నటుడు అజిత్ను కలిసి కథ వినిపించినట్లు సమాచారం.అది ఆయనకు నచ్చడంలో అందులో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అజిత్ 2027 జనవరి వరకు చిత్రాల్లో నటించనని ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయన 64వ చిత్రాన్ని గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో అజిత్ నటించే చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి? అన్నది తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. ఇకపోతే ఇది మాంగాత్తాకు సీక్వెల్గా ఉంటుందా? లేక కొత్త కథా చిత్రంగా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. -
వివాదంలో మురుగ.. రూ.10 కోట్ల డిమాండ్.. చివరకు ఫ్రీగా
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా వెలుగువెలిగిన ఏఆర్ మురుగదాస్.. ఇప్పుడు కెరీర్ పరంగా పూర్తిగా డౌన్ అయిపోయాడు. చేసిన సినిమాలు చేసినట్లు అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఒక్కరూ కూడా ఇతడిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది చాలదన్నట్లు ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. టాలీవుడ్ నిర్మాత.. తాజాగా ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏమైంది?(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?)గతేడాది మురుగదాస్ నుంచి రెండు మూవీస్ వచ్చాయి. వాటిలో సల్మాన్ ఖాన్తో చేసిన 'సికందర్' ఒకటి కాగా శివకార్తికేయన్తో చేసిన 'మదరాశి' ఒకటి. ఇవి రెండు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. 'మదరాశి' చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఇప్పుడు తమిళ దర్శకులు, నిర్మాతల కౌన్సిల్లో ఏఆర్ మురుగదాస్పై ఫిర్యాదు చేశారు. తొలుత రూ.115 కోట్ల బడ్జెట్ అని చెప్పి షూటింగ్ పూర్తయ్యేసరికి రూ.170 కోట్ల మేర ఖర్చు చేశాడని తన కంప్లైంట్లో పేర్కొన్నారు.అయితే బడ్జెట్ పెరగడానికి మురుగదాస్కి సరైన ప్లానింగ్ లేకపోవడం, దీనితో పాటు 'సికందర్' సమాంతరంగా చేయడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. తమకు జరిగిన నష్టానికిగానూ రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరువర్గాల మధ్య చర్చ జరగ్గా.. అంతిమంగా కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకుంది.దీని ప్రకారం.. ఏఆర్ మురుగదాస్, తన రమణ 2(ఠాగుర్ సీక్వెల్) స్టోరీని సదరు నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడట. అలా ఈ వివాదానికి ఓ పరిష్కారం దొరికిందని కోలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మురుగదాస్ చేతిలో కొత్త ప్రాజెక్ట్ ఏం లేదు. ఈ వివాదం జరిగిన తర్వాత వస్తుందా అనే నమ్మకం కూడా కలగట్లేదు!(ఇదీ చదవండి: అందాల 'చిచ్చుబుడ్డి'.. ఎవరీ జోనితా గాంధీ?) -
అప్పుడు 'లెజెండ్' ఇప్పుడు 'లీడర్'.. యాక్షన్ ట్రైలర్ రిలీజ్
తమిళనాడులో శరవణనన్ స్టోర్స్ అనే వస్త్రదుకాణ యజమానిగా గుర్తింపు తెచ్చుకున్న లెజెండ్ శరవణనన్.. నాలుగేళ్ల క్రితం తన పేరుతోనే తీసిన 'లెజెండ్' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ప్రమోషన్ల టైంలోనే విపరీతంగా ట్రోలింగ్కి గురైన ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత అంతకు మించిన విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈ హీరో ఇప్పుడు నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని ఈసారి కొత్తగా 'లీడర్' మూవీతో వస్తున్నాడు.(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్)ఈ మూవీకి ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా చేసింది. ఆండ్రియా, శ్యామ్, లాల్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతమందించాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్లోనూ భారీతనం కనిపిస్తున్న ఈ మూవీ అయినా శరవణనన్కి హిట్ ఇస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
హవ్వ, పెళ్లి కాలేదా? ప్రియురాలి కోసం అబద్ధమాడిన హీరో!
తమిళ హీరో రవి మోహన్ ఓపక్క విడాకుల వ్యవహారం, మరోపక్క సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో డేటింగ్ రూమర్స్తో వార్తల్లో ఉంటున్నాడు. విడాకులు మంజూరవకముందే సింగర్తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలాసార్లు విమర్శలపాలయ్యాడు. అయితే ఏకంగా అతడికి అసలు పెళ్లే కాలేదని చెప్తూ ప్రియురాలి కోసం ల్యాండ్ కొన్నట్లు ఓ వార్త కోలీవుడ్ టౌన్లో వైరల్గా మారింది.ఇంకా పెళ్లవలేదు!రవి మోహన్, కెనీషా ప్రాన్సిస్ గోవాలో భూమి కొనుగోలు చేశారట. ఈ ప్రాపర్టీ ఖరీదు రూ.40-42 లక్షలని తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాల్లో రవి మోహన్.. అన్ మ్యారీడ్ అంటూ తనకింకా పెళ్లవలేదని పేర్కొన్నాడట! విడాకులు మంజూరు కాకముందే సింగిల్ అని ఎలా పేర్కొంటారని పలువురు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో.. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సిబ్బంది పొరపాటున అన్మ్యారీడ్ సెలక్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.పేరు మార్పుకాగా రవి మోహన్.. ప్రముఖ నిర్మాత సుజాత విజయ్కుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ సంతానం. 2024లో రవి మోహన్, ఆర్తి విడిపోయారు. అయితే చట్టపరంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఇకపోతే జయం మూవీతో బ్రేక్ అందుకుని జయం రవిగా కొనసాగుతున్న ఆయన.. గతేడాది జనవరిలో తన పేరు మార్చుకున్నాడు. ఇకపై జయం రవి కాకుండా రవి మోహన్ అనే పిలవాలని కోరాడు. చివరగా పరాశక్తి సినిమాలో విలన్గా నటించాడు.చదవండి: నిన్ను నా అంతగా ఇంకెవరూ ప్రేమించలేరు: విజయ్ ఆంటోని -
నా అంతగా ఎవరూ ప్రేమించలేరు, అదే నీకిచ్చే గిఫ్ట్: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోనీ సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అతడు హీరోగా మారాడు. కొన్ని సినిమాలకు తనే ఎడిటర్గానూ వ్యవహరించాడు. లిరిసిస్ట్గా, సింగర్గానూ టాలెంట్ చూపించాడు. అయితే విజయ్ ఆంటోని వైవాహిక జీవితం మొదలుపెట్టాకే హీరోగా ప్రస్థానం ప్రారంభించాడు. 2006లో ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు.నువ్వే నా ప్రపంచంఅన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఎంతో అందంగా ఉంటుందీ జంట. నేడు (మార్చి 29న) ఫాతిమా పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్య కోసం స్పెషల్ పోస్ట్ పెట్టాడు విజయ్. మిసెస్ విజయ్ ఆంటోని.. మై డియర్ లవ్, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా యజమానివి. మై డియర్ పట్టు.. ఈరోజు నేను చేస్తున్న వాగ్ధానమే నీకిచ్చే బహుమతి. నీ జీవితంలో నేను నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. ఆఖరికి భగవంతుడు కూడా నీ జీవితంలో నా అంత ప్రేమను పంచలేడు.సినిమానువ్వు నా సహచరివి, సర్వస్వానివి, నా జీవితానికే పరమార్థానివి.. ఐ లవ్యూ అని రాసుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ ఆంటోని నూరు సామి సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో వంద దేవుళ్లు పేరిట రిలీజ్ కానుంది. బిచ్చగాడు డైరెక్టర్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.చదవండి: సినిమాలు మానేయాలని కండీషన్.. హీరోతో పెళ్లి రిజెక్ట్ చేశా: హీరోయిన్ -
అతను నా క్లాస్మేట్.. స్టార్ హీరోపై శృతి హాసన్ కామెంట్
పాన్ ఇండియా కథానాయికల్లో ఒకరు శృతి హాసన్. ఈమె నటుడు కమలహాసన్ వారసురాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథానాయకి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్న నటి ఈమె. అంతేకాకుండా సంచనాలకు నిలయం శృతి హాసన్(Shruti Haasan) అనే ట్యాగ్లైన్ను కూడా వేసుకున్నారీమె. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూ అభిమానుల్లో జోష్ నింపే ఈమె ప్రేమ వ్యవహారం కూడా తెలిసిన పుస్తకమే. కాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరిగా ఉన్నారు. కాగా ఇటీవల ఒక బేటిలో శృతిహాసన్ తన పాఠశాల జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అందులో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్ గురించి తెలిపారు. దుల్కర్ సల్మాన్ తాను బాల్యంలో చెన్నైలో ఓకే స్కూల్లో కలిసి చదువుకున్నామని చెప్పారు. రెండు ప్రముఖ పాఠశాలల్లో తమ విద్యాభ్యాసం జరిగిందన్నారు. ఆ సమయంలో తాము తరచూ కలుసుకునేవారుమని చెప్పారు. ఆయన తనను సోంబి అని పిలిచేవాడన్నారు. అప్పట్లో పలువురు సహా విద్యార్థులతో కలిసి తాను సోంబి పాటను పాడిన అనుభవం ఉందన్నారు. ఆ తర్వాతనే తనను దుల్కర్ సల్మాన్ సోంబి అని పిలిచే వాడిని పేర్కొన్నారు. అతనితో కలిసి చదివిన విద్యార్థులకు తాను కమలహాసన్ కూతురు అన్న విషయం మాత్రమే తెలుసు అని, తన పేరు తెలియదని చెప్పారు. కాగా తాజాగా ఈ భామ దుల్కర్ సల్మాన్తో కలిసి ఆకాశంలో ఒక తార అనే తెలుగు చిత్రం లో నటించడం విశేషం. ఈ చిత్రం తమిళం, కన్నడం మలయాళం హిందీ భాషల్లో రూపొందుతోంది. -
అలనాటి హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం
అలనాటి హీరోయిన్లు భానుప్రియ, శాంతిప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి ఎం. లక్ష్మి (83) ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం.లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు లక్ష్మి. భానుప్రియకాగా భానుప్రియ 1998లో ఆదర్శ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. వీరికి కూతురు అభినయ సంతానం. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2005లో అతడి నుంచి విడిపోయి కూతుర్ని తీసుకుని చెన్నైకి వచ్చి తల్లితోనే కలిసి ఉంటోంది. 2018లో నటి మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో మరణించాడు. శాంతిప్రియభానుప్రియ చివరగా అయాలన్ అనే తమిళ సినిమాలో కనిపించింది. శాంతిప్రియ విషయానికి వ్తే.. ఈమె ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం మనవడు, నటుడు సిద్దార్థ్ రాయ్ను పెళ్లి చేసుకుంది. 1992లో వీరి వివాహం జరగ్గా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. 2004లో సిద్దార్థ్ కూడా గుండెపోటుతోనే కన్నుమూశాడు. -
కరుప్పు ఫస్ట్ విజయ్కే చెప్పా.. ఆయనకు నచ్చింది.. కానీ!
స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో కరుప్పు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ సూర్య కంటే ముందు దళపతి విజయ్ చేతికి వెళ్లిందట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్ కెరీర్లో భాష, ముత్తు, పడయప్ప (నరసింహ) వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ చాలామంది జనాలు వీటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. 2023లోనే..అలాంటి ఒక ఫుల్ ఎంటర్టైనర్ సినిమాని తీయాలని నా కోరిక. యాక్టింగ్ అంటే గట్టిగా అరవడం, ఏడవడం కాదు. అన్ని రకాల ఎమోషన్స్ను సమపాళ్లలో పండించాలి. అది సూర్యకు వెన్నతో పెట్టిన విద్య.. తను బాగా డ్యాన్స్ చేస్తాడు, అద్భుతంగా నటిస్తాడు, ఏదైనా సింపుల్గా చేసేస్తాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. నిజానికి 2023లో కరుప్పు కథ రాయడం మొదలుపెట్టాను. విజయ్కు కథ చెప్పా..ఈ కథకు బలమైన స్టార్ ఉంటే బాగుంటుందనిపించింది. అలా హీరో విజయ్ను కలిశాను.. పైగా ఆయన 2021లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగాడు. ఈ రెండు కారణాల వల్ల తనను కలిశాను. కరుప్పు విజయ్కు చాలా బాగా నచ్చింది. ఇది భారీ సినిమా.. వెంటనే మొదలుపెడదాం అన్నారు. కానీ విజయ్ వంటి స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే పెద్ద బాధ్యత.. నచ్చింది కానీ..అలా హడావుడిగా మొదలుపెట్టలేనని చెప్పాను. తర్వాత కొన్నిసార్లు కలిశాం, మాట్లాడుకున్నాం.. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆయన నా నుంచి కుటుంబ కథా చిత్రం ఆశించాడు. అయినప్పటికీ ఈ కథ తనకెంతో నచ్చింది.. అదే సంతోషం అని ఊరుకున్నాను. తర్వాత సూర్యను సంప్రదించగా ఆయన ఓకే చెప్పాడు అని తెలిపాడు.సినిమాకరుప్పు విషయానికి వస్తే.. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.చదవండి: ధురంధర్ 2 ప్రభంజనం.. 28 ఏళ్ల కిందటి లేఖ వైరల్ -
తమిళ సాంగ్ రిలీజ్.. స్టెప్పులేసిన రోజా
మిలియన్ డాలర్స్ స్టూడియోస్, నీయో కాస్టిల్స్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అన్బే డయానా. జమా చిత్రం ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తుండటంతో పాటు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్య రంగనాథన్ నటిస్తోంది.సాంగ్ రిలీజ్తమిళనాడులోని ఒక గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగిల్ సాంగ్ను విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు నటి రోజా కూడా స్టెప్పులేశారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు సంగీత ప్రియులు రిపీట్ మోడల్ వింటున్నారు. సినిమారొమాంటిక్ వైబ్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే అన్బే డయానా ఆడియో, ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నటుడు చేతన్, వైరల్ యూట్యూబర్ పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ గెలిస్ట్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. -
లాభాల్లో 70% వాటా డిమాండ్ చేస్తున్న హీరో
అమరన్ సినిమా తర్వాత శివకార్తికేయన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన సినిమాలకు మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది. అది దృష్టిలో పెట్టుకున్న హీరో కేవలం పారితోషికం కాకుండా లాభాల్లో వాటా అడుగుతున్నాడు. మదరాసి, పరాశక్తికి ఇదే రూల్ ఫాలో అయ్యాడట.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నాడంటూ కోలీవుడ్లో తెగ ప్రచారం జరుగుతోంది.సెయాన్ అంటే..శివకార్తికేయన్ ప్రస్తుతం సెయాన్ సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. అమరన్ వంటి బ్లాక్బస్టర్ తర్వాత రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై శివకార్తికేయన్ చేస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీతోనే శివకుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెయాన్ అంటే కుమారస్వామికి మరో పేరు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.లాభాల్లో వాటాఈ మూవీకి శివకార్తికేయన్ భారీ పారితోషికాలు గట్రా అడగలేదట! లాభాల్లో వాటా అడిగాడట! ఇప్పటికే రూ.10 కోట్ల అడ్వాన్స్ తీసుకున్న హీరో సినిమా రిలీజయ్యాక 70% లాభాలను డిమాండ్ చేశాడని తెలుస్తోంది. అంటే మిగిలిన 30% మాత్రం కమల్ హాసన్ బ్యానర్కు వెళ్తాయి. సెయాన్ బడ్జెట్ రూ.35 కోట్లని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత జరగనుంది? బాక్సాఫీస్ వద్ద ఎంత రాబడుతుంది? అన్నది చూడాలి!చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రయిన బాలీవుడ్ నిర్మాత -
పిచ్చి రీల్స్ పంపుతాడు.. ఆంటీ బాలేదు నాన్న అనగానే..
బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీ అవుతుందని చాలామంది వాదన. ఆ విషయం తాను కూడా అంగీకరిస్తానంటోంది హీరోయిన్ శృతి హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నెపోకిడ్ వంటి అంశాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేనస్సలు ఫైట్ చేయను. ఎందుకంటే నాకు తొలిసారి పాట పాడే అవకాశం చాలా ఈజీగా లభించింది. నా గొంతు ఇబ్బందిఇళయారాజా సర్ సంగీత దర్శకత్వంలో నాన్న సినిమాలోనే తొలిసారి పాట పాడాను. నా వాయిస్ గంభీరంగా ఉంటుందని ఇళయరాజా అంటుండేవారు. ఒకసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్పై అరుస్తున్నాను. అప్పుడాయన నీ గొంతులో మంచి రేంజ్ ఉందన్నారు. అయితే ఆయన్ని ఇంప్రెస్ చేసిన నా గొంతు చాలామందికి మాత్రం డామినెంట్గా అనిపించింది.నాన్న సలహా తీసుకోనునేను చిన్నప్పుడే పండిత్ మనోహర్ కులకర్ణి, సురేశ్ వాడక్కర్ వంటి మహామహుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. అలా నాకు మంచి గురువులు లభించారు. కెరీర్లో ఏం చేయాలి? ఎటువైపు అడుగులు వేయాలి? అనే విషయంలో ఎన్నడూ నాన్న సలహా తీసుకోలేదు. అలాగే రజనీకాంత్ను కూడా సలహా అడగలేదు. కాకపోతే వాళ్లిద్దరూ చాలా కష్టపడతారు. పిచ్చి రీల్స్ దాన్ని ఇబ్బందిగా ఫీలవకుండా ఇష్టంగా, నిశ్శబ్ధంగా కష్టపడతారు. సినిమా కోసం ప్రాణాలైనా ఇస్తారు.. ఇద్దరూ పని రాక్షసులు. అటు ఆఫీసును, ఇటు ఇంటిని చక్కగా నిర్వహిస్తారు. నాన్నయితే ఇన్స్టాగ్రామ్లో కనిపించే పిచ్చి రీల్స్ ఏవేవో పంపుతాడు. అది చూసినప్పుడు ఈ ఆంటీ ఫన్నీగా ఏం లేదు నాన్నా అంటుంటాను. అప్పుడాయన కొన్ని మంచి రీల్స్ పంపుతాడు.. అలాంటి వీడియోలు ఇష్టంచిన్న పాప అందంగా పాడుతున్నట్లు, గ్రామాల్లో వంట చేసే వీడియోలు.. ఇలాంటివి చూసి ఆయనెంతగానో సంతోషిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఐదేళ్లకే సింగర్గా పరిచయమైంది శృతి హాసన్. తేవార్ మగన్ (1992) మూవీలో పొట్రి పాడది పొన్నె అనే పాట ఆలపించింది. తర్వాత హీరోయిన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సింగర్గా, హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: మహేశ్బాబు సెట్లో ఎలా ఉంటారంటే?: బాలీవుడ్ నటి -
విజయ్- సాయిపల్లవితో మణిరత్నం కొత్త మూవీ
సాయిపల్లవికి పెద్ద అభిమానిని అని చెప్పుకునే మణిరత్నం తనతో సినిమా ప్రకటించాడు. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఓ ప్రేమకథతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటించనున్నారు.అదిరిన కాంబినేషన్లైకా ప్రొడక్షన్స్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ కాంబో చూస్తుంటే సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని అభిమానులు అప్పుడే ఆశలు పెట్టేసుకుంటున్నారు. రూమర్స్నిజానికి ఈ సినిమాలో మొదటగా ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తర్వాత వారి స్థానంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవిని తీసుకున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు అదే నిజమైంది. అలాగే సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు ఆయన స్థానంలో రెహమాన్ను తీసుకున్నారు.సినిమాకాగా విజయ్ సేతుపతి స్లమ్డాగ్, జైలర్ 2 సహా మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సాయిపల్లవి హిందీలో రామాయణ, ఏక్ దిన్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి! View this post on Instagram A post shared by Madras Talkies (@madrastalkies) -
అమ్మాయిలతో జాగ్రత్త.. యూత్కు హీరోయిన్ సలహా
నటి పూనం బాజ్వాను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ప్రస్తుతం చిత్రాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఈమె తరచూ హల్చల్ చేస్తూనే ఉంటారు. పలు భాషల్లో కథానాయకిగా నటించిన బ్యూటీ తెలుగులో మెదటి సినిమా (2005)లో ఎంట్రీ ఇచ్చింది. అయితే, పరుగు, బాస్ సినిమాలతో పాపులర్ అయింది. తమిళంలో తేనావట్టు , కచేరి ఆరంభం, సేవల్ , తంబికోట్టై వంటి పలు చిత్రాలు నటించింది. అయితే స్క్రీన్ ప్లే అందాల ఆరబోతలో హద్దులు చెరీపేస్తూ కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటించిన ఈ అమ్మడు కథానాయకిగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయారనే చెప్పాలి. అయితే ఇంటర్నెట్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యువత దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న ఈమె ఇన్ స్ట్రాగామ్లో దాదాపు 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. కాగా ఇటీవల తన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నటి పూనం బాజ్వా(Poonam Bajwa) పేర్కొంటూ మీకు స్నేహితురాలుగానో, ప్రేయసి గానో, భార్యగానో కలిసి ప్రయాణించే యువతి ఏ దేశానికి మహారాణి కాక పోవచ్చుగాక, అయినా ఆమెను రాణి మాదిరిగానే భావించాలన్నారు. ఆమె అందాన్ని, ప్రేమను, శక్తిని అభినందించాలన్నారు. అంతేకాకుండా అన్ని మర్చిపోదాం అని చెప్పే యువత మరింత జాగురూకత వహించాలన్నారు. ఎందుకంటే మహిళలు ఏ విషయాన్ని మర్చిపోరని ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఇతర అమ్మాయిలకు సంబంధించిన విషయాలను మర్చిపోరన్నారు. కాబట్టి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని నటి పూనం బాజ్వా పేర్కొన్నారు. ఇవే పేర్కొన్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
'ఒత్తిడిలో మెడిసిన్లా ఈ సినిమా..' డైరెక్టర్పై నాగార్జున ప్రశంసలు
మేడ్ ఇన్ కొరియా మూవీపై టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్ఏ కార్తీక్ను అభినందించారు. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూశానని.. పూర్తిగా అస్వాదించానంటూ ట్వీట్ చేశారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా మంచి మెడిసిన్గా పనిచేస్తుందని నాగ్ కొనియాడారు. ఈ సినిమాలో మెప్పించిన ప్రియాంక మోహన్ను ప్రత్యేకంగా అభినందించారు.కొరియన్ కాన్సెప్ట్తో తీసిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీలో ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో నంబర్వన్గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రశంసించారు. Congratulations to my director @Rakarthik_dir for this uplifting film feel good #MadeinKorea on Netflix!! Totally enjoyed it 😊the right medicine for these stressful times💐 special shout out to @priyankaamohan https://t.co/vV5Kqa3Pdq— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2026 -
'అలా చేయడం చాలా అసహ్యాంగా ఉంది'.. మంచు విష్ణు పోస్ట్ వైరల్
తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలిటిక్స్లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే కాదని.. ఎక్కడ జరిగినా సమంజసం కాదన్నారు. నటులు ఉంటే కేవలం రాజకీయాల్లో పావుగా వాడుకునే వస్తువులు కాదని ట్వీట్ చేశారు. వారికి కుటుంబం, గౌరవం, పర్సనల్ లైఫ్ అనేవి కూడా ఉంటాయన్నారు. ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని సూచించారు. మన భారతీయ సంస్కృతి, దాని మూలాల్లోనే మహిళలను శక్తిగా గౌరవిస్తామని రాసుకొచ్చారు. అలాంటి శక్తిగా భావించే మహిళలను వారిని వార్తా శీర్షికల కోసం అవమానించేలా ఉండకూడదని పోస్ట్ చేశారు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దామని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.విజయ్- త్రిష ఎపిసోడ్పైనే..ఇటీవల కోలీవుడ్లో విజయ్-త్రిష వ్యవహారం అనూహ్యంగా తెరపైకొచ్చింది. విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష గురించి చర్చ నడుస్తోంది. త్రిష- విజయ్ల మధ్య రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిషకు అండగా పలువురు కోలీవుడ్ నటీనటులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అది వారి వ్యక్తిగత జీవితమని.. మనం కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చించాలని ఓ సీనియర్ నటుడు అన్నారు. తాజాగా మంచు విష్ణు సైతం ఈ విషయంతో త్రిషకు మద్దతుగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. Reading about the political campaigns in my Tamil Nadu. Felt It’s in extremely poor taste to drag actresses into political narratives. Not just in TN but anywhere. Actors are not political punching bags. They are individuals with families, dignity, and a life beyond the…— Vishnu Manchu (@iVishnuManchu) March 17, 2026 -
'యూత్' ట్రైలర్: హీరో వెనక పడుతున్న ముగ్గురమ్మాయిలు
తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం యూత్. ఈ మూవీకి కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా సంగీతం అందించాడు. ఇటీవలే తమిళ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా యూత్ తెలుగు ట్రైలర్ వదిలారు. యూత్ తెలుగు ట్రైలర్'మీకు పుట్టినవాడు సాధారణమైన అబ్బాయి కాదు మేడమ్.. ఆ దేవుడే మీకు బిడ్డగా పుట్టాడు. వాడిని బ్యాడ్ బాయ్స్తో చేరనివ్వకండి' అన్న సంభాషణతో వీడియో మొదలవుతుంది. తీరా హీరో.. తనను ముగ్గురమ్మాయిలు ప్రేమిస్తున్నారని తెగ సంబరపడిపోతాడు. ఫైటింగ్, లవ్, కామెడీకి ఏమాత్రం కొదవ లేనట్లుగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. -
నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల! గడిచిన పది రోజుల్లో రెండుసార్లు సారీ చెప్పాడు తమిళ దర్శకుడు, నటుడు ఆర్.పార్తీబన్. ఓపక్క హీరో విజయ్ విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగా త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లాడీ హీరో. దీంతో కొన్నాళ్లపాటు త్రిష బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని పార్తిబన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది.కుల ప్రస్తావనఇంతలోనే మరో వివాదంలో ఇరుక్కున్నాడు పార్తిబన్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కులం గురించి ప్రస్తావిస్తూ స్పీచ్ మొదలుపెట్టాడు. స్టేజీపై కులం ప్రస్తావన తేవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టాడు. నేను ఎలాంటి తప్పునైనా సరే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని. నిజం చెప్తున్నా.. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు. ఇదే మొట్టమొదటిసారిఏదో నోరు జారాను. ఇన్నేండ్ల అనుభవంలో కుల ప్రస్తావన తేవడం ఇదే మొట్టమొదటిసారి. కానీ, కులానికి ప్రాధాన్యతనిచ్చేవారిని నేను అస్సలు ఇష్టపడను. కుల వ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాను. అనుకోకుండా పొరపాటు జరిగింది. అందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలతో ఎంతోమందిని బాధపెట్టానని అర్థమైంది.క్షమించండినేను కేవలం నా ప్రతిభను నమ్ముకుంటానే తప్ప కులాన్ని వాడుకునే వ్యక్తిని కాను. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదని మాటిస్తున్నాను. వాస్తవానికి ఈ విషయం గురించి మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయి ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహించండి. సినిమామీరు నాపై ఉంచిన ప్రేమను, నమ్మకాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తాను అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.చదవండి: పీలింగ్స్ సాంగ్ బానే చూశారుగా.. ఈ పాటకెందుకంత రాద్ధాంతం? -
సినిమాపై భయం.. అబ్బాస్కు మంచి కమ్బ్యాక్!: హీరో
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్. నటి శ్రీగౌరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ద్వారా నటుడు అబ్బాస్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరియరాజు ఇళంజెలియన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధ నిర్మించిన ఈ మూవీకి జయకాంత్ సురేశ్ సహనిర్మాతగా వ్యవహరించాడు.దేనికీ భయపడని వ్యక్తి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 27న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు మరియరాజు దేనికీ భయపడని వ్యక్తి అన్నారు. ఆయన చెప్పిన కథ నచ్చిందని, అయితే మంచి నిర్మాత కోసం ఎదురుచూస్తున్న సమయంలో జయకాంత్, జయవర్ధ ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. మధ్యలోనే వదిలేస్తారా?కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతలు కావడంతో ఈ మూవీని పూర్తి చేస్తారా? మధ్యలోనే వదిలేస్తారా? అన్న భయం కలిగిందన్నారు. ఇదే విషయాన్ని వారిని అడిగానన్నారు. అయితే వారు ఈ సినిమాను చాలా బాగా రూపొందించి, బిజినెస్ పూర్తి చేసి రిలీజ్కు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. హ్యాపీరాజ్ చిత్రం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. అందరికీ ఏమో కానీ అబ్బాస్కు కచ్చితంగా ఈ మూవీ కంబ్యాక్గా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన అంత బాగా నటించారని కితాబిచ్చారు. -
అనిరుధ్తో జట్టుకట్టిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా
యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్నకు చెందిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా.. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇటీవల ప్రారంభించిన స్వతంత్ర రికార్డ్ లేబుల్ అల్బుక్వెర్క్ రికార్డ్స్తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, అల్బుక్వెర్క్ రికార్డ్స్, అనిరుధ్ రూపొందించే పాప్, హిప్-హాప్ సంగీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ లేబుల్ ద్వారా విడుదలయ్యే తొలి సంగీత ప్రాజెక్ట్లో అనిరుధ్ పాల్గొనగా, వచ్చే నెల ప్రారంభంలో దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)2012లో అరంగేట్రం చేసిన అనిరుధ్.. 'వై దిస్ కొలవెరి డి' ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించాడు. తర్వాత విడుదలైన తన 770కి పైగా పాటల ద్వారా మొత్తం 13 బిలియన్కు పైగా ఆడియో స్ట్రీమ్స్ సాధించాడు. దీంతో మొత్తం స్ట్రీమ్స్ పరంగా స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ పొందిన దక్షిణ భారతీయ కళాకారుడిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తమిళ ఒరిజినల్ సౌండ్ట్రాక్ (ఓఎస్టీ) రంగంలో ఎక్కువగా కోరుకునే సంగీత దర్శకుల్లో ఇతడొకరు. హుకుమ్, వాతీ కమింగ్, అరబిక్ కుతు, మోనికా, ఏ23 థీమ్, ఆజా రాజా, అయా షేర్ తదితర గ్లోబల్ హిట్లు ఇతడి ఖాతాలో ఉన్నాయి.(ఇదీ చదవండి: బూతు పాటపై కేంద్రం సీరియస్) -
విజయ్- త్రిష ఎపిసోడ్పై మరో కొత్త పుకారు!
కోలీవుడ్లో విజయ్- త్రిష ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.అయితే అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్ ఉమా కృష్ణన్ ఆ వీడియోను లైక్ కొట్టింది.ఈ రీల్కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్కు లైక్స్ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. -
సినీ నటీనటులు వెబ్సిరీస్ల్లో నటించకూడదు
తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా తమిళ సినీ నిర్మాతల మండలి ఇటీవల చైన్నెలో సమావేశమైంది. తమిళ సినీ యాక్టివ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు టీజీ త్యాగరాజన్, తమిళనాడు సినీ థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రహ్మణ్యం, తమిళనాడు సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు ఆరుళ్పతి ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా ‘‘ నటీనటులు గానీ, దర్శకులు, ఇతర ప్రముఖ సాంకేతిక నిపుణులు ఓ నిర్మాత నుంచి అడ్వాన్స్ పొంది ఉంటే ముందుగా ఆయన చిత్రాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత నివ్వాలి. సినిమాల్లో నటించే నటీనటులు, దర్శకులు, సాంకేతిక వర్గం వెబ్ సిరీస్లో నటించడం గానీ, దర్శకత్వం వహించడం గానీ చేయరాదని తీర్మానించారు. అలా కాని పక్షంలో వారికి సినిమాల్లో పనిచేయడానికి సహకరించబోమని స్పష్టం చేశారు. ప్రముఖ నటులు రెవెన్యూ షేర్ విధానంలో చిత్రాల్లో నటించడానికి సహకరించాలి. చిత్రాలు విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఈ విధానాన్ని తమిళనాడులో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లోనూ అమలు పరిచేలా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. ఈ తీర్మానాన్ని అమలు పరచడానికి డిస్టిబూటర్లు, థియేటర్లతో కలిపి ఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకు చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని సంఘాలు కట్టుబడి ఉండాలని తీర్మానం చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్వాహకులు స్పష్టం చేశారు. -
ఊహించని కాంబో.. స్టార్ డైరెక్టర్తో రానా దగ్గుబాటి..!
సినీ ఇండస్ట్రీలో ఒక రేర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైవిద్య భరితమై కథా చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరువాత ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం రానా కేవలం నటుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా రాణిస్తున్నారు. ఈయన 2005లోనే స్పిరిట్ మీడియా పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే దుల్కర్ సల్మాన్తో కలిసి కాంత చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.అయితే కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి తెలియని వారు ఉండరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా.. కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్బెంట్ సంస్థ కలిసి నీళిరా అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించాయి. దీనికి శ్రీలంక తమిళుడు సోమిధరన్ దర్శకత్వం వహించారు. ఇందులో నటుడు నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్న ట్లు యూనిట్ వర్గాలు ఎక్స్ మీడియాలో పేర్కొ న్నారు. ఆ చిత్ర టైటిల్తో కూడిన పోస్టర్ను పోస్ట్ చేశారు. -
విజయ్ జన నాయగన్.. ఈ సారైనా మోక్షం లభించేనా?
కోలీవుడ్ స్టార్ దళపతి హీరోగా నటించిన చిత్రం జన నాయగన్. రాజకీయల్లో ఎంట్రీకి ముందే ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. దీంతో ఈ మూవీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సినిమా వ్యవహారం కోర్టుకు చేరడంతో రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.ఈ మూవీని సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ రివ్యూ చేయాల్సి ఉంది. ఈనెల 9న జరగాల్సిన రివైజింగ్ కమిటీ ప్రదర్శన వాయిదా పడింది. బోర్డ్ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాను మార్చి 17న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ జరుగుతుందని సీబీఎఫ్సీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం జరగనుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్కు స్క్రీనింగ్కు సంబంధించి అధికారిక మెయిల్ అందినట్లు తెలుస్తోంది.జన నాయగన్ను జనవరి 9న గ్రాండ్గా విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. కానీ ఈ చిత్రం ఒక వర్గం ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ను నిలిపివేసింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చూసిన ఒక సభ్యుడు సైన్యానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆ తర్వాత, జన నాయగన్ నిర్మాతలు జనవరి 6న కోర్టును ఆశ్రయించారు. సెన్సార్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ చర్యలతో జన నాయగన్ మేకర్స్, సెన్సార్ బోర్డ్కు మధ్య నెల రోజుల పాటు వివాదం కొనసాగింది. అయితే మూవీ టీమ్ తమ కేసును ఉపసంహరించుకోవడంతో ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపడానికి సెన్సార్ బోర్డ్ అంగీకరించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని రాజకీయ సందేశాలు ఉన్నందున.. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతిస్తుందో లేదో చూడాల్సిందే. -
అజిత్ కేరవాన్లో వంట చేసిపెట్టాడు: తమన్నా
సినిమారంగంలో భాషాబేధాలకు తావుండదు. ప్రతిభే కొలమానం. అలా స్వశక్తితో ఎదిగిన నటీమణుల్లో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఒకరు. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలో అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కథానాయికగా సత్తా చాటుతూనే మరోపక్క ఐటమ్ సాంగ్స్లో నటిస్తూ అలరిస్తోంది. అలా ప్రత్యేక పాటల కోసం తమన్నా దాదాపు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్!ఆ మూవీ ఎంతో స్పెషల్ఇకపోతే ఈ హీరోయిన్ ఇటీవల చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తమిళంలో కల్లూరి చిత్రంలో నటించానని, అది తన సినీజీవితంలో చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఆ సినిమాలోలాగే కాలేజీ లైఫ్ను విద్యార్థులు ఎంజాయ్ చేయాలంది. కాలేజీడేస్ మళ్లీ తిరిగిరావంది.స్వయంగా వంట చేసి..తాను సినీ పరిశ్రమలో 21 ఏళ్లుగా కొనసాగుతున్నానని, ఇంతలా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని సంతోషం వ్యక్తం చేసింది. తమిళంలో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించినట్లు తెలిపింది. నటుడు విజయ్ చాలా నిరాడంబరుడు, మంచి మనసు కలవాడంది. విజయ్, జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్స్ అని కితాబిచ్చింది. అజిత్ గురించి చెప్పాలంటే వీరం సినిమా సమయంలో తనకు ఆయన కేరవాన్లో ఇడ్లీ వండిపెట్టారని గుర్తు చేసుకుంది. ఆయనకు వంట చేయడం చాలా ఇష్టమని, మంచి కుటుంబ సభ్యుడిలా ఉంటాడని పేర్కొంది.చదవండి: ఆస్కార్ పండగ.. అత్యధికంగా ఆ చిత్రానికే ఎక్కువ అవార్డులు -
ఆ సినిమాలన్నీ ఫ్లాప్.. లాభమే లేదు: విజయ్ సేతుపతి
సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద వైఫల్యం మూటగట్టుకోవడం తథ్యం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే.. కొడితే కుంభస్థలాన్ని కొడతారు.. లేదంటేనేమో తీవ్ర నష్టాలు చూస్తారు. అలా తాను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదంటున్నాడు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.ఆ నాలుగు ఫ్లాప్తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నా బ్యానర్లో సంగుతేవన్ అనే సినిమా స్టార్ట్ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. అవే.. ఆరెంజ్ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి. సినిమాబాక్సాఫీస్ లెక్కలపరంగా అవి ఫ్లాప్ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్ నోవెల్, జైలర్ 2, అరసన్తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి: ప్రియదర్శన్ -
పురుషులే అసలైన బాధితులు.. హీరో భార్య కౌంటర్
ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరడం వల్లే ఈ విడాకులు ఎక్కువవుతున్నాయి. తమ విడాకుల వ్యవహారానికి కూడా మూడో మనిషే (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్) కారణమని తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆర్తి. తమిళ స్టార్ జంట రవి మోహన్- ఆర్తి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో కనసాగుతోంది.పురుషులే అసలైన బాధితులుఇదిలా ఉంటే రవి ఇటీవల ఓ పోస్ట్ పెట్టాడు. అందులో మహిళలే కరెక్ట్ అని అందరూ అనుకుంటారు, కానీ పురుషులే అసలైన బాధితులు. అది మన న్యాయవ్యవస్థకు కూడా అర్థమవుతోంది. నేను ప్రేమించినవారికోసం ఏం చేశాను? నా మనసేంటి? అనేది ఏదో ఒకరోజు మీక్కూడా అర్థమవుతుంది. దయచేసి ప్రశాంతంగా బతకనివ్వండి.. మీ వికారమైన ఆలోచనలను మీదగ్గరే ఉంచుకోండి అని రాసుకొచ్చాడు.పిల్లల్ని ఎవరు పెంచారు?అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరుత్తు కన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు మంజూరవకముందే మరో అమ్మాయితో తిరుగుతున్న ఈయన సుద్దపూసలా మాట్లాడుతున్నాడు. ఇంతకూ పిల్లల్ని నువ్వే పెంచావా? లేదా ఆ బాధ్యతను ఆర్తిపై వేశావా? న్యాయవ్యవస్థ గురించి మాట్లాడేముందు పిల్లల్ని ఎవరు పెంచారో చెప్పు.. భరణం గురించి కాదు!ఎందుకీ దొంగ ఏడుపు?నువ్వేమో మరో అమ్మాయితో దర్జాగా తిరుగుతున్నావు. నీ భార్య మాత్రం నీ పిల్లలను చూసుకోవడంలోనే మునిగిపోయింది. పైగా నువ్వే అసలైన బాధితుడివి అని ఏడుస్తున్నావ్. నువ్వు చేసిన పని నీ భార్య చేసుంటే? విడాకులు ఫైనలైజ్ కాకముందే మరో మగాడితో ఆర్తి బయట తిరుగుతే ఈ ప్రపంచం ఊరుకుంటుందా? అదే పని ఆర్తి చేస్తే..ఒకవేళ తిరిగిన తర్వాత కూడా నేనే అసలైన బాధితురాలిని అని చెప్తే అందరూ నమ్ముతారా? లేదు కదా.. నువ్విలా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం చాలా చెండాలంగా ఉంది అని ఆగ్రహించింది. ఈ పోస్ట్ను ఆర్తి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నిశ్శబ్ధంగా ఉండటానికి బదులుగా నిజాయితీగా గొంతెత్తి ప్రశ్నించినందుకు గర్వంగా ఉంది.. అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది. View this post on Instagram A post shared by Karuththu Kannammaa (@karuththu_kannammaa2015) చదవండి: వారి కాళ్లకు నమస్కరించడం తప్ప ఏం చేయగలం?: మోహన్బాబు -
MGRపై చౌకబారు వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.కొద్దిగా నోరు జారా..ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తమిళ సినీ ప్రేక్షకులు ఎంజీఆర్ను దైవంలా భావిస్తారు. నేను కూడా ఆయన్ను దేవుడిలాగే భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో కొద్దిగా నోరు జారాను. అది కావాలని అనలేదు. కొందరు దీన్ని పెద్దది చేశారు. ఆయనపై కామెంట్స్ చేసేంత ధైర్యం నాకెక్కడిది? నేను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడతానా? ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి కామెంట్స్ చేయను అని క్షమాపణలు తెలిపాడు.ఏం జరిగింది?కాగా ఇటీవల ఓ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలు విశాల్, నాజర్ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. வருத்தம் தெரிவித்த நடிகர் ராஜேந்திர பிரசாத்!#ActorRejendraprasad #mgr #nadigarsangam #nasser#vishal pic.twitter.com/8dpyBRPW5Z— FridayCinema (@FridayCinemaOrg) March 13, 2026 -
గుండె ముక్కలైందన్న హీరో! బ్రేకప్ పోస్ట్?
తమిళ హీరో అర్జున్దాస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఎప్పుడూ సినిమా అప్డేట్స్ తప్ప పర్సనల్ విషయాలను పెద్దగా ఫ్యాన్స్తో పంచుకోడు. అలాంటిది ఆయన హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.అంతలా ప్రేమిస్తే..ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందంటే.. మనం ఎవర్నైనా గాఢంగా ప్రేమిస్తే.. వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు? అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. దీనికి హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశాడు. అర్జున్దాస్కు బ్రేకప్ఇది చూసిన అభిమానులు అర్జున్దాస్కు బ్రేకప్ అయిందా? అని చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్స్ అయుంటుంది, అంతా పబ్లిసిటీ స్టంట్ అని భావిస్తున్నారు. మరి ఈ పోస్ట్ వెనక మర్మమేంటో అర్జున్ దాసే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.సినిమాకాగా అర్జున్ దాస్ గతంలో ఐశ్వర్య లక్ష్మితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు. ఇకపోతే ఇతడు చివరగా ఓజీ సినిమాలో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం కాన్ సిటీ సినిమా చేస్తున్నాడు.చదవండి: ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్ పోస్ట్ -
ఇప్పటికీ భార్యనే డబ్బు అడుగుతా: శివకార్తికేయన్
తనకు డబ్బు కావాల్సి వస్తే భార్య దగ్గర చేయి చాస్తానంటున్నాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. తన బ్యాంకులో ఎంత డబ్బుందన్న విషయం కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన 'తాయ్ కిళవి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. రాధికా శరత్కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం రూ.50 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.చేయి చాచి అడుగుతాఆయన మాట్లాడుతూ.. పెళ్లయినప్పటి నుంచి నా ఆర్థిక వ్యవహారాలన్నీ భార్య ఆర్తియే చూసుకుంటోంది. నా అకౌంట్లో ఎంత డబ్బుందన్న విషయం కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు, ఏ ఖర్చు పెట్టాలన్నా తనను అడిగి తీసుకుంటాను. ఒక టికెట్ కొనాలన్నా కూడా తనను చేయి చాచి మనీ అడుగుతాను. అందుకు నేను ఏమీ బాధపడను, పైగా గర్వపడుతున్నాను. తన ముందుచూపు, దూరదృష్టి, పొదుపు చేసే వైఖరి వల్లే ఈరోజు నేను నిర్మాతగా సినిమాలు తీయగలుగుతున్నాను. వాళ్లందరికీ సినిమా అంకితంతను అవన్నీ చూసుకోకపోయుంటే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. రేపటికోసం జాగ్రత్తపడే ప్రతి మహిళకు మా సినిమా అంకితం. సంపాదన ఎంతున్నా సరే దానిలో ఎంతో కొంత వెనకేయాలనే ఆడవారు ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన తాయ్ కిళవి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగం పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ముత్తుకుమార్, రేచల్ రెబెకా, జార్జ్ మరియణ్ ప్రధాన పాత్రలు పోషించారు. నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించాడు.చదవండి: భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్ హన్సిక -
పూరి జగన్నాథ్ - సూర్య క్రేజీ కాంబినేషన్!
-
చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా మరో ఛాన్స్
తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. సొంత భాషలో హిట్స్ ఉన్నప్పటికీ తెలుగు, తమిళంలో చేసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా చేస్తోంది. అయితే తమిళంలో చేసిన మూవీస్ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు రుక్మిణి మరో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)వరుస సినిమాలతో అలరిస్తున్న తమిళ హీరో ధనుష్.. ప్రస్తుతం విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో 'కర' మూవీ చేశాడు. మమిత బైజు హీరోయిన్. వచ్చే నెల 30న థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'అమరన్' తీసిన రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలోనూ ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. డీ55 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్స్. సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీని తర్వాత ధనుష్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నట్లు టాక్.ఇందులోనే దక్షిణాది క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్.. ధనుష్ సరసన నటించనుందట. ఇదే నిజమైతే వీళ్లిద్దరి కాంబోలో రూపొందే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ ప్రాజెక్టుకి అనిరుధ్ సంగీంతమందించనున్నాడట. ఇందులో ప్రతినాయకుడిగా విజయ్ కుమార్ నటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో) -
ఇద్దరు బ్యూటీస్తో ఆర్య.. ఇందులో 'బేబి' కూడా
డిఫరెంట్ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు ఆర్య. ఇంతకు ముందు నాన్ కడవుల్, మద్రాసు పట్టణం, మహాముని, టెడ్డీ, సార్పట్ట పరంపరై తదితర మూవీస్ చేశాడు. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో 'వెట్టవన్'లో నటిస్తున్నాడు. దీని తర్వాత 'సార్పట్ట పరంపరై 2'లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు. తన 40వ చిత్రాన్ని జీవశంకర్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. ఇందులో నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)నిఖిల్ మురళి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 12న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఆర్యతో హీరోయిన్లు నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య జిమ్లో కలిసి వర్కౌట్స్ చేస్తున్నట్లు ఫొటోలకు పోజులిచ్చారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం.. రొమాంటిక్ ప్రేమకథగా ఉండనుందని తెలుస్తోంది. 'బేబి' మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్యకు ఇదే తమిళంలో తొలి మూవీ.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడూ విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో) -
ఆయన్ని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా
ఇండస్ట్రీలో నటీనటులు అందరూ ఒకేలా ఉండరు. కొందరు వచ్చామా పనిచేశామా వెళ్లిపోయామా అన్నట్లు ఉంటారు. మరికొందరు మాత్రం తమ చర్యలతో తోటి నటీనటుల్ని చాలానే ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా తమిళ నటి సోనా.. ప్రముఖ కమెడియన్ వడివేలు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన వల్ల నరకం చూశానన చెప్పుకొచ్చింది. అందుకే 16 సినిమాల్లో ఆయనకు జంటగా నటించే అవకాశమొచ్చినా తిరస్కరించినట్లు మరోసారి స్పష్టం చేసింది.(ఇదీ చదవండి: మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్)'కుశేలన్ (తెలుగులో 'కథానాయకుడు') తర్వాత వడివేలుతో కలిసి నటించమని నాకు 16కు పైగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే వాటిని మర్యాదపూర్వకంగా తిరస్కరించాను. ఎందుకంటే నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆయనని నేను తట్టుకోలేనేమో అనిపించింది. ఓ రకంగా నరకం చూశాను. అందుకే ఆయనతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడకపవడమే మంచిదని అనుకుంటున్నాను' అని సోనా చెప్పుకొచ్చింది.తమిళంలో నటి, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సోనా.. ఎక్కువగా శృంగార తరహా పాత్రలే చేసింది. రజనీకాంత్ హీరోగా నటించిన కుశేలన్ చిత్రం తెలుగులో కథానాయకుడు పేరుతో రిలీజైంది. మూవీ ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇందులో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. సోనా-వడివేలు కాంబినేషన్లోని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అయితే సెట్లో సోనాని వడివేలు ఎంతలా ఇబ్బంది పెట్టాడో ఏమో గానీ ఇలా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వడివేలుపై గతంలోనూ పలువురు నటీనటులు ఇలాంటి ఆరోపణలే చేశారు. అందుకే చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి టైంలో సోనా, వడివేలుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సోనా తెలుగులోనూ ఆయుధం, వీడే, విలన్, ఆంధ్రావాలా తదితర సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే తమిళ, మలయాళ మూవీస్లోనే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన) -
పర్సనల్ లైఫ్ జడ్జ్ చేయడానికి మీరెవరు?.. విజయ్- త్రిష వివాదంపై స్టార్ డైరెక్టర్
కోలీవుడ్లో విజయ్- త్రిష పేర్లే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా త్రిష పేరు తెరపైకొచ్చింది. ఇటీవల వీరిద్దరు జంటగా ఓ వివాహానికి కూడా హాజరు కావడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే త్రిషపై కోలీవుడ్ దర్శకుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత దర్శకుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.తాజాగా విజయ్- త్రిష వివాదంపై ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ స్పందించారు. మనం కేవలం నటీనటుల సినిమాల గురించి మాత్రమే చర్చించాలని సూచించారు. వారి వ్యక్తిగత జీవితాలపై చర్చించే హక్కు.. వారిని జడ్జ్ చేసే రైట్ మనకు లేదన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వివాదం కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హాట్ టాపిక్గా మారింది..విక్రమ్ భట్ తన పోస్ట్లో రాస్తూ.. ' విజయ్- త్రిషల వ్యక్తిగత జీవితాలపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ నిజమో, కాదో నాకు తెలియదు. ఒకవేళ అవి నిజమైతే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరూ ఎంతో హుందాగా ఉన్నారు. ఏ విషయాన్ని దాచిపెట్టడం లేదు. ఇప్పుడు వాళ్లను ఎంతోమంది జడ్జ్ చేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి మాట్లాడేవారంతా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నటీనటుల సినిమాలు మాత్రమే మనం చూడాలి. వారి పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు' అని రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల రూ.30కోట్ల చీటింగ్ కేసు విషయంలో విక్రమ్ భట్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విక్రమ్, అతడి భార్య శ్వేతాంబరి భట్లకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ దంపతులు దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
మిషన్ నొక్కితే డబ్బే డబ్బు.. కాన్ సిటీ టీజర్ చూశారా?
డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వస్తున్న తమిళ సినిమా "కాన్ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్కు కాస్తున్నాయి. అవును, బటన్ నొక్కితే చాలు లిమిట్ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్ చేస్తూనే ఉంది.డబ్బులు ప్రింట్ చేసే మిషన్సోమవారం సాయంత్రం కాన్సిటీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.చేతులు మారిన యంత్రందాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్ కనిపిస్తుంది. బటన్ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్గా మిషన్ కనిపించకుండా పోతుంది. వీధిలో నోట్ల వర్షంఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్ సిటీ చూడాల్సిందే! హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ మూవీకి సేన్ రోల్డన్ సంగీతం అందించాడు. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్ తెలుగులో తీసుకురానుంది. -
రూ.50 కోట్లు కొల్లగొట్టిన రాధిక శరత్ కుమార్ మూవీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అలరించిన రాధిక శరత్కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే 'తాయ్ కిళవి' కోసం ఆమె ముసలమ్మగా నటించింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. 75 ఏళ్ల బామ్మగా రాధిక నటించడం, హీరో శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హాఫ్ సెంచరీపాజిటివ్ రివ్యూలతో తొలిరోజు నుంచే బాక్సాఫీస్పై మంచి పట్టు సాధించింది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తాయ్ కిళవి రూ.50 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక సినిమా రిలీజైనప్పటినుంచి టాప్ హీరోలు, దర్శకుడు, హీరోయిన్లు అందరూ సినిమాను, ముఖ్యంగా రాధికను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. #ThaaiKizhavi crosses ₹50 Crore Worldwide GBOC in just 10 days! 💥Overwhelmed by the incredible love and support from everywhere. Thank you for making it a #MegaBlockbusterThaaiKizhavi ❤️#MorattuVasool@Siva_Kartikeyan @Sudhans2017 @KalaiArasu_ @SKProdOffl… pic.twitter.com/4aKJASW3hg— Sivakarthikeyan Productions (@SKProdOffl) March 9, 2026 చదవండి: వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ ఏవీ లేవు: నటి -
జన నాయగన్కు మరో షాక్.. స్క్రీనింగ్ వాయిదా..!
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వస్తోన్న మూవీ జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ బోర్డ్ వివాదంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జన నాయగన్ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా జన నాయగన్ రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ప్రదర్శన రద్దు చేశారు. దీని వల్ల సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న జన నాయగన్ మేకర్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దీనిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్క్రీనింగ్ కోసం మరో తేదీని కేటాయిస్తారో? లేదో తెలియాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సిన ఉన్నా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే గతేడాది రివ్యూ చేసిన సెన్సార్ బోర్డ్ కొన్ని సవరణలు సూచించింది. అయినప్పటికీ కొన్ని మతపరమైన అంశాలు, సాయుధ దళాల లోగోలను ఉపయోగించడంపై సెన్సార్ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూవీని మరోసారి సెన్సార్ చేయాలని రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్కు పంపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. -
త్రిషపై అనుచిత కామెంట్స్.. సారీ అంటూ పోస్ట్
కోలీవుడ్ స్టార్ విజయ్ విడాకుల వివాదం తెరపైకి వచ్చాక అనూహ్యంగా హీరోయిన్ త్రిష పేరు వైరలవుతోంది. విజయ్కు అమెతో రిలేషన్ ఉందంటూ ఆయన భార్య సంగీత ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉండగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు త్రిషపై అనుచిత కామెంట్స్ చేశారు. ఓ ఈవెంట్లో పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.ఇది కోలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హీరోయిన్ త్రిష కూడా అదేస్థాయిలో ఇచ్చిపడేసింది. ఆ నటుడికి అసలు బుర్రనే లేదంటూ ఎద్దేవా చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పార్తిబన్ స్పందించారు. ఈ మేరకు ఆయన క్షమాపణలు కోరారు. ఇప్పుడు జరిగిన దానికి నేనే సారీ చెప్పడం తప్ప వేరే మార్గం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదానికి ఇకపై ఫుల్స్టాప్ పడినట్లే.అసలేం జరిగిందంటే..తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. -
నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్
హీరోయిన్ త్రిష రీసెంట్ టైంలో పెద్దగా సినిమాలు చేయలేదు. అయినా సరే సోషల్ మీడియా అంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్తో ఈమె రిలేషన్లో ఉందనే రూమర్సే దీనికి కారణం. ఎక్కడా ఈ విషయాన్ని అధికారికం చేయనప్పటికీ.. దాదాపు అందరూ వీళ్లిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. తమిళ నటుడు పార్తిబన్ కూడా వీళ్ల బంధం గురించి పరోక్షంగా అర్థం వచ్చేలా చిల్లర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ అవార్డ్ వేడుకలో నటుడు దర్శకుడు పార్తిబన్, త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఇంట్లో ఉంటేనే మంచిది. బయటకు వస్తే ఎక్కడలేని సమస్యలన్నీ వస్తున్నాయి అని అన్నాడు. ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలోనూ గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయం కాస్త త్రిష వరకు చేరడంతో ఆమె కుడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్తిబన్కి అసలు బుర్ర లేదనేలా రాసుకొచ్చింది.'ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నా పేరు, ఫొటో చేర్చుతున్నామని చివరి నిమిషంలో నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఓ వ్యక్తి తన సహాయుకుడిని పంపించి నన్ను అడిగారు. అయితే మైక్రోఫోన్లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన వ్యాఖ్య లేదా కామెడీనో అవదు. అది కేవలం మూర్ఖత్వాన్ని ఎక్కువ వినిపించేలా చేస్తుంది. జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్య పదాలు, అవి ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయో అనేదాని కంటే మాట్లాడిన వ్యక్తి తత్వాన్ని బయటపెడతాయి' అని త్రిష ట్వీట్ చేసింది. పార్తిబన్కి అసలు బుర్ర లేదు అని అర్థం వచ్చేలా త్రిష రాసుకొచ్చింది. -
త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు
తమిళనాడులో ఓవైపు ఎన్నికల హడావుడి ఉంది. మరోవైపు స్టార్ హీరో విజయ్ వైవాహిక బంధం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రీసెంట్గానే ఇతడి భార్య సంగీత, కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే కారణాన్ని పిటిషన్లో పేర్కొంది. ఇదలా ఉండగానే త్రిషతో కలిసి విజయ్ ఏకంగా ఓ పెళ్లికి వెళ్లడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. వీళ్లిద్దరి మధ్య ఏముందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంతలోనే తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్.. త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్)తాజాగా ఓ మూవీ ఈవెంట్లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.ఏదేమైనా పార్తిబన్ లాంటి ఓ సీనియర్ నటుడు, దర్శకుడు.. త్రిష లాంటి హీరోయిన్ గురించి పబ్లిక్గా ఇలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం పలువురు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ నటుడు హీరోయిన్ల గురించి నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలో కథ ఉందా? లేదా అనేది ప్రేక్షకులు చూడటం లేదు. హీరోయిన్ డ్యాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది అని అన్నారు. తర్వాత తన మాటలపై విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పుకొచ్చాడు.పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)Parthiban attacks Trisha😝“Intha Kunthavai ah veetukullaye Kunthavaikirathu nalathu”😀pic.twitter.com/X5St5Ycnvk— Christopher Kanagaraj (@Chrissuccess) March 8, 2026 -
విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇతడి భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్కి రిలేషనే ఉందనే రూమర్స్ ఓ వైపు చక్కర్లు కొడుతుండగానే ఓ పెళ్లికి ఆమెతోనే కలిసి రావడం లాంటివి హాట్ టాపిక్ అయిపోయాయి. అలానే విడాకులు మంజూరు అయ్యేంతవరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ చర్చనీయాంశమైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. తన విడాకులపై తొలిసారి స్పందించాడు.(ఇదీ చదవండి: బెస్ట్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్.. తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు.'నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది' అని విజయ్.. తన విడాకుల గురించి ఇన్ డైరెక్ట్గా మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు, వీడియో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)Recently, there have been a few problems happening. I see that you are getting hurt while fighting for it. I’m getting hurt seeing you guys getting hurt. I’ll take care of the problems. Don’t get hurt. Nothing to worry about..- #ThalapathyVijay's speech pic.twitter.com/8QFSWVjklU— Laxmi Kanth (@iammoviebuff007) March 7, 2026 -
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సరసన గిల్లిలో హీరోయిన్గా యాక్ట్ చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్ కంటే ముందు వేరే హీరోలతో లవ్లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..హీరోలతో లవ్త్రిష తమిళంలో పలువురు స్టార్స్తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్ దానంతటవే ఆగిపోయాయి.ప్రకంపనలు రేపిన సుచీలీక్స్అనంతరం త్రిష టాలీవుడ్ హీరో రానాకు క్లోజ్ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లి క్యాన్సిల్వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్తో త్రిష అంత క్లోజ్గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని అంటుంటారు.విజయ్తో లవ్ఇప్పుడు మరోసారి విజయ్తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్కు వరలక్ష్మి శరత్కుమార్ కౌంటర్ -
వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా.. హీరోయిన్ ఎవరంటే..?
విక్టరీ వెంకటేష్ ఐదవసారి హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో చేతులు కలిపాడు. 2027 సంక్రాంతికి మరో సినిమాతో రానున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో F2 , F3 , సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలు తెరపైకి వచ్చాయి. అయితే, 2027 పొంగల్ రేసులో బరిలోకి దిగబోతున్నట్లు వారు ఇప్పటికే ప్రకటించారు. ఈసారి వెంకటేష్ (Venkatesh), కల్యాణ్రామ్ (Nandamuri Kalyan Ram) ప్రధాన పాత్రల్లో సినిమా ఉండనుంది. అయితే, హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చర్చగా మారింది.తాజా సమాచారం ప్రకారం వెంకటేశ్ సరసన నటించేందుకు మహానటి కీర్తి సురేష్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై ఆమె సంతకం చేసిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన మరో హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి వెతుకుతున్నాడని చెబుతున్నారు. కీర్తి గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన విజయం లేకపోడంతో కాస్త వెండితెరకు దూరమైంది. మరి అనిల్ రావిపూడి అయినా మహానటికి విజయాన్ని అందిస్తారేమో చూడాలి. భారీ బడ్జెట్తో సిద్ధం అవుతున్న ఈ మూవీకి నిర్మాత ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. -
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్పై ఫైర్
స్టార్ హీరో విజయ్- సంగీత విడాకుల వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నేళ్లుగా ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత తన విడాకుల పిటిషన్లో పేర్కొంది. దీంతో విజయ్- సంగీత విడాకులకు హీరోయిన్ త్రిష కారణమా? అన్న చర్చ మొదలైంది.విడాకులుఆన్స్క్రీన్పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్లోనూ విజయ్- త్రిష ప్రేమాయణం నడుపుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. సంగీత విడాకుల పిటిషన్ వేసిన తర్వాత విజయ్.. దర్జాగా త్రిషను తీసుకుని ఓ పెళ్లికి హాజరయ్యాడు. జంటగా నిల్చుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఇప్పటికే విజయ్- సంగీత కలిసుండాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో భార్యతో కలిసుండే ప్రసక్తే లేదని హింటిస్తూ ఇలా త్రిషతో పెళ్లికి వెళ్లడం అందర్నీ షాక్కు గురి చేసింది.అవతలివారి బాధను లెక్కచేయరా?ఈ వ్యవహారంపై విజయ్ అభిమాని, నటి సనం శెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్, త్రిష పెళ్లికి హాజరైన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోకపోవడం విచారకరం. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటివాళ్లను మీరు తీవ్రంగా నిరాశపర్చారు అని రాసుకొచ్చింది. ఆమె కామెంట్స్ను కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం విమర్శించారు.ఎవరీ సనం శెట్టి?కాగా సనం శెట్టి విజయ్కు వీరాభిమాని. కరూర్ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా విజయ్ తప్పు లేదని బాధితులే చెప్పారంటూ అతడిని వెనకేసుకొచ్చింది. కానీ, ఈసారి మాత్రం భార్య బాధను పట్టించుకోకుండా ఇలా ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం సభ్యత కాదని చురకలంటించింది. సనం శెట్టి.. తమిళ బిగ్బాస్ నాలుగో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, సింగం 123 చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: అప్పుడు భార్యను కొట్టి.. ఇప్పుడు అందరి ముందు క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ -
డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్ గార్డెన్లో డూప్లెక్స్ అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఉన్న ఏరియాలోనే నయన్ జంట ఈ ఇల్లు కొనడం విశేషం. డూప్లెక్స్ అపార్ట్మెంట్ తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్ట్లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఉంది. ఇది 14,369 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను కలిగి ఉంది. దీని ధర చదరపు అడుగుకు రూ.21,946గా ఉంది. ఈ అపార్ట్మెంట్కు 8 కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. కాగా లేడీ సూపస్టార్ నయనతారకు కేరళలో పూర్వీకుల ఇల్లు ఉంది. సినిమాహైదరాబాద్లోని బంజారాహిల్స్లో రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై, కేరళలోని ఇతర ప్రాంతాల్లోనూ తనకు ప్రాపర్టీలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే నయనతార చివరగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో అలరించింది. ప్రస్తుతం టాక్సిక్ సహా నాలుగైదు మూవీస్ చేస్తోంది.చదవండి: హీరోయిన్ను అవమానించిన యామీ గౌతమ్? -
రీల్స్ పేరుతో ఇలాంటి ఫోటోలా.. రుక్మిణి వసంత్ ఫైర్
రుక్మిణి వసంత్కు కోపమొచ్చింది. చూడటానికి సాఫ్ట్గా ఉన్నా ఈ బ్యూటీలో కట్టలు తెంచుకునే ఆవేశం కూడా ఉందన్నది తేటతెల్లమైంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు పరిశ్రమను కన్నడ బ్యూటీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాప్ హీరోల సరసన వరస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తుంది. ఇటీవల విడుదలైన ‘కాంతార-చాప్టర్ 1’ లోనూ యువరాణి పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నాయకిగా నటిస్తున్న ఈమె రాంగ్ యాంగిల్ ఫొటోలను తీసే ఫొటోగ్రాఫర్లపై ధ్వజం ఎత్తారు. సాధారణంగా షూటింగ్స్లోనే, ఇతర కార్యక్రమాలలోనో సెలబ్రిటీలు కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు తన చేతి నైపుణ్యానికి పని చెబుతుంటారు. ఇక సినీ కథానాయికలను అయితే వివిధ భంగిమల్లో ఫొటోలు తీయడానికి తెగ ఉత్సాహపడతారు. కొందరైతే సొగసులను చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి వైరల్ చేస్తుంటారు. ఇలాంటి చర్యలు తప్పుకాదు. అయితే హీరోయిన్లను రాంగ్ యాంగిల్లో ఫొటోలు తీసి రీల్స్ పేరుతో అన్ పాపులర్ చేసే ప్రైవేట్ ఫొటోగ్రాఫర్లతోనే సమస్య. ఇలాంటి విషయాలపైనే నటి రుక్మిణి వసంత్ మండిపడ్డారు. దీని గురించి ఆమె తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ నటీమణులను కించపరిచే విధంగా ప్రవర్తించే ఫొటోగ్రాఫర్ల చర్యలు ఖండించదగ్గవి అన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవడానికి తాము ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. తాను వృత్తిలో భాగంగా నటించడానికి వేస్తున్నామని, అదే విధంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. అలాంటి సమయాల్లో తమను రాంగ్ యాంగిల్ చిత్రీకరించే కొందరు ప్రైవేటు ఫొటోగ్రాఫర్ల చర్యలను తీవ్రంగా ఖండిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నటీమణులను కించపరిచే వారిపై చర్యలకూ వెనుకాడబోమని నటి రుక్మిణి వసంత్ అన్నారు. -
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష.. వీడియో వైరల్
కోలీవుడ్ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు తాజాగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సరదాగ పలకరించుకున్నారు. వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కొద్దిరోజల గ్యాప్లోనే విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. విజయ్ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నారని అందుకే విడాకులు కావాలంటూ పేర్కొంది. అయితే, ఈ కథలో త్రిష పేరు ప్రధానంగా వైరల్ అయింది. ఇప్పుడు విజయ్, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లడంతో వీడియో వైరల్ అవుతుంది.#Thalapathy @TVKVijayHQ President #Vijay and #Trisha attend #KalpathiSSuresh - #MeenakshiSuresh 's son wedding reception @actorvijay @trishtrashers pic.twitter.com/iQOQet9Z0A— Nikil Murukan (@onlynikil) March 5, 2026 -
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నటుడు విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎడాపెడా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్లో శింబు హీరోగా నటిస్తున్న అరసన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్న ఈయన తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.బాలీవుడ్ బ్యూటీవిడాముయుర్చి ఫేమ్ మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు భోగట్టా! ఇకపోతే ఇందులో విజయ్ సేతుపతికి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్కుగానీ ఆమె ఒప్పుకుంటే కోలీవుడ్లో మరో క్రేజీ కాంబో షురూ అయినట్లే! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
ఓజీ హీరోయిన్ ఓటీటీ మూవీ.. ఎమోషనల్గా ట్రైలర్
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్ సినిమాలు, సిరీస్లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!ఓటీటీ సినిమాదీంతో ఈ కొరియన్ కాన్సెప్ట్తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్ ఇన్ కొరియా. ఆర్.ఏ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదే ట్రైలర్లో చూపించారు.మనసు చెప్పేది వినండిమనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగుంది. మేడ్ ఇన్ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది. చదవండి: ఆస్తుల్లేవ్.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి -
8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే
హీరోయిన్ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో హోమ్లీ పాత్రలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ చాలానే మూవీస్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. తనకు గతంలో పెద్ద ప్రమాదం జరిగిందని, 8 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఓ దర్శకుడి వల్లే మళ్లీ ఇలా ఇప్పుడు మీ ముందున్నానని చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో మాట్లాడుతూ ఈ విషయాల్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'కెరీర్ పీక్ స్టేజీలో వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఓ ఘోర ప్రమాదం జరిగింది. అందులో నా చేతులు, కాళ్లు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం నిలబడటానికి కూడా ఎనిమిది నెలలు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నరకం అనుభవించాను. కెరీర్ అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాను. ఆ టైంలో దర్శకుడు కరు పళనియప్పన్ 'పార్థిబన్ కనవు' స్టోరీతో నా దగ్గరకు వచ్చారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిసినా సరే నాపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం. ఆయన ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చనాను. ఆ దశ చాలా కష్టమైనది. కానీ అదే నన్ను మరింత బలంగా మార్చింది' అని స్నేహ ఎమోషనల్ అయింది.తెలుగు కుటుంబానికే చెందిన స్నేహ అసలు పేరు సుహాసిని. ముంబైలో పుట్టి, షార్జాలో పెరిగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈమెని చూసిన ఓ మలయాళ నిర్మాత.. హీరోయిన్గా అవకాశమిచ్చాడు. అలా 2000లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'ప్రియమైన నీకు' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, మధుమాసంతో పాటు చాలానే మూవీస్ చేసింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకుంది. అనంతరం సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. రీసెంట్ టైంలో అయితే దళపతి విజయ్ 'గోట్'లో కనిపించింది.(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ) -
నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు(85) అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం ఆయన కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వృద్ధాప్యం కారణంగా చికిత్స కూడా ఆయన శరీరం సహకరించకపోవడంతో హైదరాబాద్ మధురానగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రామరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత శివాజీకి ఫోన్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మాట్లాడి ధైర్యం చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో నటి.. కారు టైర్ పంక్చర్ కావడంతో..
తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదంలో బుల్లితెర నటి దేవి ప్రియ(38) ప్రమాదానికి గురయ్యారు. ఆమె కేవలం సీరియల్స్లలో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నై నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు థేని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెరంబలూర్ వద్ద తన కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేశ్(38) రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తున్న క్రమంలో అటువైపు వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి దేవిప్రియ కారును బలంగా ఢీకొంది. దీంతో కారు డ్రైవర్ ముత్తుగణేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న దేవిప్రియ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ, ఆమె సహాయకుడు దివాకర్ (36) తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్థానికులు పెరంబలూర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
తండ్రిగా ప్రమోషన్ పొందిన 'పార్కింగ్' హీరో
తమిళ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నాకు, నర్మదకు ఈరోజు (మార్చి 2న) పాప పుట్టింది. ఆనందంగా ఉందితల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమఃశివాయ అంటూ ఓ లేఖ షేర్ చేశాడు. కాగా హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు.సినిమా2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న హరీశ్ కల్యాణ్ నూరు కోడి వానవిల్ మూవీ చేస్తున్నాడు. Elated to share the most wonderful news with all my dear family ❤️🤗God willing 🙏 pic.twitter.com/11Icq8OMMz— Harish Kalyan (@iamharishkalyan) March 2, 2026 చదవండి: పెళ్లికి ముందు సహజీవనం.. నాకు అవకాశం ఇచ్చుంటే..: లయ -
దుబాయ్లో మెగా డాటర్ శ్రీజ.. సోషల్మీడియాలో పోస్ట్
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో పశ్చిమాసియాలోని పలు దేశాలు ఉన్న భారతీయులు ఆందోళనలో ఉన్నారు. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్నందున చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో దుబాయ్లో ఉన్న చిరంజీవి కూతురు శ్రీజ తాజాగా ఒక పోస్ట్ చేశారు.దుబాయ్లో తాను పిల్లలతో క్షేమంగా ఉన్నానంటూ శ్రీజ పోస్ట్ చేసింది. అక్కడి పరిస్థితిని తెలుసుకొని చాలామంది ఫోన్లు, మెసేజ్లు చేస్తూ తమ క్షేమం కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాలామంది తమ పట్ల ప్రేమను చూపించడం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. దుబాయ్లో ప్రస్తుతం శాంతియుతంగానే ఉందన్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఫోటోని షేర్ చేస్తూ.. మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము. కాబట్టి, ఈ దేశానికే కట్టుబడి ఉంటాం అని ఆమె పోస్ట్ చేశారు. శ్రీజ ఈ పోస్ట్ చేయడంతో ఆమె తన తన పిల్లలతో కలిసి దుబాయ్లో స్థిరపడినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
చదువుకోకపోవడం వల్లే ఈ దుస్థితి! స్పందించిన కమెడియన్
చెక్ బౌన్స్ కేసు కారణంగా కమెడియన్ రాజ్పాల్ యాదవ్ పేరు కొంతకాలంగా వార్తల్లో నానుతూ వస్తోంది. ఇటీవలే తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. అందులో వ్లాగ్స్, కామెడీ, మినీ సిరీస్.. ఇలా ఏదో ఒకటి చేస్తూ అందరికీ వినోదాన్ని పంచుతానన్నాడు. విద్య కారణం కాదుఇకపోతే అతడికి చదువు రాకపోవడం వల్లే ఇలా కేసులో చికుక్కున్నాడని మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడు మంచివాడే కానీ, పెద్దగా చదువుకోకపోవడం వల్లే ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సానుభూతి చూపించాడు. ఈ వ్యాఖ్యలపై రాజ్పాల్ యాదవ్ తాజాగా స్పందించాడు. తనకు చదువు రాదని ఎవరు చెప్పారని ప్రశ్నించాడు. కొన్ని సమస్యలకు చదువు సంద్య కారణం కాదు. నేను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనడం కరెక్ట్ కాదు.కొన్నిసార్లు తప్పవునేను బాగానే చదువుకున్నాను. ఇప్పుడు నాకు 55 ఏళ్లు. 11 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాను. నేను చదువురాని వాడినైతే ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా కొనసాగేవాడినే కాదు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒకానొక సందర్భంలో సమస్యల్లో చిక్కుకుంటారు. దానికి చదువుతో సంబంధమే లేదు అని చెప్పాడు. అదే సమయంలో ప్రియదర్శన్ అలా అన్నందుకు తనపై ఎటువంటి కోపం లేదన్నాడు. నీ కొడుకులాంటివాడినిఇంకా మాట్లాడుతూ.. నా జీవితంలో ముగ్గురు దర్శకులకు ప్రత్యేక స్థానం. రామ్ గోపాల్ వర్మ, డేవిడ్ ధావన్, ప్రియదర్శన్.. వీరిపై నాకు అపారమైన గౌరవం. కేవలం ఈ ముగ్గురి డైరెక్షన్లోనే దాదాపు 50 సినిమాలు చేసుంటాను. ప్రియదర్శన్కైతే నేనొక కొడుకులాంటివాడిని. కాకపోతే ఆయనకు పూర్తి విషయం తెలీదు.సినిమాకాబట్టి ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదు అని వివరణ ఇచ్చాడు. ఇకపోతే రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా చేస్తున్నాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజ్పాల్ యాదవ్.. వెల్కమ్ టు ద జంగిల్, హైవాన్, మరో రెండు సినిమాలు, రెండు వెబ్ సిరీస్లు చేస్తున్నాడు.చదవండి: వారణాసి అప్డేట్ ఇచ్చిన ప్రియాంక -
ఫ్యామిలీ మ్యాన్గా సూర్య.. టైటిల్ ఏంటో తెలుసా?
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో ఇతర భాషా హీరోలకు ఘన విజయాలను అందించాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు ఈయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను సోమవారం (మార్చి 2న) రిలీజ్ చేశారు. సూర్య కెరీర్లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్కు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాపోస్టర్లో కళ్లజోడు ధరించిన హీరో సూర్య చిన్న బాబును ఎత్తుకుని స్టైలిస్ట్గా కనిపిస్తున్నాడు. ఇది మనసును తాకే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని మూవీ టీం ప్రకటించింది. జూలైలో సినిమా రిలీజ్ చేస్తామని పేర్కొంది. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.సినిమామరోవైపు సూర్య చేతిలో ఇంకో రెండు సినిమాలున్నాయి. ఒకటి.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న కరుప్పు మూవీ.. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో త్రిష కథానాయిక. మరోటి.. మలయాళ డైరెక్టర్ జిత్తు మాధవన్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. ఇందులో సూర్య పోలీసాఫీసర్గా నటిస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్గా కనిపించనుంది. Power in his presence. 🔥Warmth in his embrace.🤍Bringing back the vintage magic of @Suriya_offl in a heart-touching family spectacle. 🤩#VishwanathAndSons ~ The biggest family drama of the year arrives this July. 🫶🏻#VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/frvwNwuU8f— Sithara Entertainments (@SitharaEnts) March 2, 2026 చదవండి: అల్లు ఫ్యామిలీలో నయనిక సిస్టర్స్.. ఫోటో వైరల్ -
హీరో విజయ్ను అన్ఫాలో కొట్టిన కుమారుడు!
తమిళ స్టార్ హీరో విజయ్ నుంచి విడాకులకు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించింది. ఓ నటితో విజయ్కు ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిసిందే! దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.విజయ్ను అన్ఫాలో కొట్టిన జేసన్ఇదే సమయంలో నెటిజన్లు ఓ విషయాన్ని గుర్తించారు. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్.. తన తండ్రిని దూరం పెట్టినట్లు గమనించారు. ఇన్స్టాగ్రామ్లో దళపతిని అన్ఫాలో కొట్టాడంటున్నారు. అయితే జేసన్.. తన తల్లి విడాకులకు దరఖాస్తు చేశాకే తండ్రిని అన్ఫాలో చేశాడని కొందరు అంటుంటే.. అంతకుముందు నుంచే అతడు తండ్రిని ఫాలో అవట్లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి - విడాకులుఏదేమైనా జేసన్.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది. ఆరోజు విజయ్ న్యాయస్థానం ఎదుట హాజరు కానున్నాడు.చదవండి: ఓటీటీలో విత్ లవ్.. రిలీజ్ ఎప్పుడంటే? -
ఓటీటీలో హిట్ సినిమా.. విత్ లవ్ రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడిగా, హీరోగా తొలి సినిమాలకే హిట్టు కొట్టి సెన్సేషన్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఇతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.90 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. నెక్స్ట్ సినిమా ఎవరితో అనుకుంటున్న తరుణంలో ఈ యంగ్ డైరెక్టర్ హీరోగా మారాడు. విత్ లవ్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు.ఓటీటీలో విత్ లవ్అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరించింది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా విత్ లవ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తుంది. మార్చి 6 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి మరి.కథేంటంటే?సత్య (అభిషన్ జీవింత్) ఆర్కిటెక్ట్.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అలా ఒకరోజు అక్క బలవంతంతో కాఫీ షాప్లో ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్తాడు. ఆ అమ్మాయే మోనీషా (అనస్వర రాజన్). మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్లో చదివామని, ఇద్దరూ సీనియర్- జూనియర్ అని తెలుస్తుంది. తమ చిన్నతనంలో ఎవర్నైతే ప్రేమించారో వారిని ఒకసారి కలవాలనుకుంటారు. మరి తర్వాతేం జరిగింది? వాళ్లని కలిశారా? ఈ పెళ్లి చూపులు ఏమయ్యాయి? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! #WithLove will be streaming from March 6 on NETFLIX. pic.twitter.com/IoSzc2TXwW— Christopher Kanagaraj (@Chrissuccess) March 1, 2026 చదవండి: దుబాయ్లో చిక్కుకున్నా.. నన్ను భారత్కు తీసుకురండి: బాలీవుడ్ నటి -
ఆ హీరోయిన్ బయోపిక్లో నటించాలనుంది!
వివిధ భాషల్లో హీరోయిన్గా రాణిస్తోంది ప్రియాంక మోహన్. ఒంద్ కథే హెల్లా అనే కన్నడ చిత్రంతో కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందీ బ్యూటీ. అదే ఏడాది నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగువారికీ పరిచయమైంది. ఆ వెంటనే డాక్టర్ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇలా తక్కువ కాలంలోనే మూడు భాషల్లో నటించే అవకాశాలను అందుకుని పక్కింటి అమ్మాయి ఇమేజ్ సొంతం చేసుకుంది.సినిమాఅయితే ఈ బ్యూటీకి 2025 పెద్దగా కలిసి రాలేదు, సరైన హిట్ పడలేదు. అంతే కాకుండా ఇప్పుడు తన చేతిలో భారీ ప్రాజెక్టులు కూడా ఏమీ లేవు. ప్రస్తుతం తమిళంలో నటుడు కెవిన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. కన్నడలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అనే చిత్రంలో యాక్ట్ చేస్తోంది. మరోవైపు ఈమె ప్రధాన పాత్రలో నటించిన మేడిన్ కొరియా నేరుగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.ఆమె బయోపిక్లో నటించాలనుందిఇకపోతే ప్రతి నటికి ఏదో ఒక బయోపిక్లో నటించాలనే కోరిక ఉంటుంది. అలాంటి కోరిక మీకు ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు ప్రియాంక ఇలా స్పందించింది. దివంగత నటి సౌందర్య బయోపిక్లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. కన్నడ నటి సౌందర్య.. మాతృభాషలో కన్నా తెలుగు, తమిళం భాషల్లోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకుంది. స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టింది. తక్కువకాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. అంతే తక్కువ కాలంలో విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైంది. మరి సౌందర్య బయోపిక్ తెరకెక్కిస్తారా? ఒకవేళ తీస్తే ప్రియాంకను హీరోయిన్గా తీసుకుంటారా? చూడాలి! -
తెలుగు పరిశ్రమపై తాప్సీ ప్రశంసలు
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధానపాత్రలో నటించిన అస్సీ మూవీ తాజాగా విడుదలైంది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తెలుగులో తన కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ కొంత కాలంగా టాలీవుడ్ పరిశ్రమ పట్ల చేస్తున్న విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. సౌత్ఇండస్ట్రీలో హీరోయిన్లు మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని ఇక్కడి ఫిల్మ్మేకర్స్ తనపై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించింది. అయితే, ఆమె ఇప్పుడు యూటర్న్ తీసుకొని తెలుగు పరిశ్రమపై ప్రశంసలు కురింపించింది.తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ.. 'చష్మే బద్దూర్' మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పింక్, థప్పడ్ వంటి సినిమాలతో తనకంటూ స్టార్ ఇమేజ్ని అక్కడ క్రియేట్ చేసుకుంది. తాజాగా బాలీవుడ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమపై మక్కువను చాటుకుంది. తెలుగు సినిమాలో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలు ఉంటాయని ఆమె గుర్తు చేసుకుంది. అయితే, తెలుగులో మాదిరి తమిళ పరిశ్రమలో అలాంటివి తక్కువగా కనిపిస్తాయని ఆమె పేర్కొంది. టాలీవుడ్ నుంచి తనకు మంచి పాత్రలే దక్కడంతో తెలుగు వారు తనను బాగా అభిమానిస్తారని చెప్పింది. తన విలువను పెంచిన సినిమాలన్నీ కూడా తెలుగు నుంచే ఉన్నాయని తెలిపింది. తన కెరీర్కు టాలీవుడ్ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ఝుమ్మంది నాదం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2022లో చివరిగా ‘మిషన్ ఇంపాజిబుల్’లో మెరిసింది. -
తెలుగమ్మాయికి కోలీవుడ్ నుంచి పిలుపు!
వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ దగ్గర మొదలైన ఆమె జర్నీ ఇప్పుడు సినిమా వరకు చేరింది. మొదట్లో అల వైకుంఠపురములో, రంగ్దే, టక్ జగదీశ్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమాతో హీరోయిన్గా మారి ఫస్ట్ మూవీకే మంచి మార్కులు కొట్టేసింది. ఈ ఒక్క సినిమాతోనే విశేషమైన గుర్తింపు, ప్రేమ, అవార్డులు అందుకుంది. కోలీవుడ్ ఎంట్రీప్రస్తుతం ఎపిక్: ద సెమిస్టర్ మూవీ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఓ వార్త వైరల్గా మారింది. జీవీ ప్రకాశ్ హీరోగా విఘ్నేశ్ కార్తీక్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. ఇప్పటికే 'హాట్స్పాట్ టూ మచ్'తో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఈసారి ఏం ప్లాన్ చేయబోతున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాఈ క్రమంలో అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్లో జీవీ ప్రకాశ్ హీరోగా, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి అజిత్ హీరోగా నటించిన వాలిమై అనే తమిళ మూవీలో వైష్ణవి చైతన్య చిన్న రోల్ చేసింది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం కోలీవుడ్లో కథానాయికగా ఇదే తన తొలి సినిమా కానుంది.చదవండి: పెళ్లి వేడుకలో వరుణ్- లావణ్య.. ఎక్కడంటే? -
నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య
తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ(73) హత్యకు గురయ్యారు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టించింది. కొందరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అలానే మృతుడి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరం లాంటి విలువైన వస్తువులు తీసుకుని పరారయ్యారు.సూర్యనారాయణ.. కొడైక్కెనాల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈయనకు అక్కడే ఓ పెద్ద బంగ్లా కూడా ఉంది. అందులో ఆరుముగం, మురళి అనే ఇద్దరు పనివాళ్లు కూడా ఉన్నారు. రెండురోజుల క్రితం విహారయాత్ర కోసం అని వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. దగ్గరలో బసకు దిగారు. శనివారం రాత్రి, బంగ్లా దగ్గరకు వచ్చిన వ్యక్తులు.. పనిమనుషులని చితకబాదారు. తర్వాత సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి దారుణంగా హింసించారు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక చనిపోయారు.సూర్యనారాయణని హత్య చేసిన అనంతరం ఆయన మెడలోని బంగారు గొలుసు, ఉంగరంతో పాటు సీసీటీవీల హార్ట్ డిస్క్లు తీసుకుని పరారయ్యారు. కాగా సూర్య 'మాయావి' సినిమాలో సహాయ నటిగా చేసిన విష్ణుప్రియ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. 2018లో ఈమెని ప్రేమించిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇప్పుడు సూర్యనారాయణ హత్యకు.. అప్పటి హత్యకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చిరంజీవికి సన్మానం.. గ్రాండ్ పార్టీలో సెలబ్రిటీలు
మెగాస్టార్ చిరంజీవి- దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం మన శంకరవరప్రసాద్గారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఘన విజయాన్ని అందుకున్న చిరంజీవి, చిత్ర యూనిట్ను కాకినాడ పోర్ట్ ఛైర్మన్ కె.వి.రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లో జరిగిన ఈ పార్టీలో చిత్ర నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటితోపాటు, దర్శకుడు అనిల్ రావిపూడి, కె.రాఘవేంద్రరావు, సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, డి.సురేష్బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, వి.వి.వినాయక్, బాబీ, బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. ఈ ఫోటోలను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయడు తన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. Blockbuster celebrations continue for #MSG ✨Megastar #Chiranjeevi garu was felicitated at an exclusive gathering hosted by Shri K.V Rao, attended by eminent personalities including K. Raghavendra Rao, Ashwini Dutt, Anil Ravipudi, Bobby Kolli and several distinguished guests. pic.twitter.com/TP4gfApmg3— Ravanam Swami naidu (@swaminaidu_r) February 22, 2026 -
పిల్లలు నా మూవీ ఒక్కటి కూడా చూడలేదు: షాలిని
చిన్న వయసులోనే కెమెరా ముందు నటించడం మొదలుపెట్టింది షాలిని. బాలనటిగా 50కి పైగా సినిమాలు చేసింది. వాటిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలున్నాయి. తెలుగులో బెజవాడ బెబ్బులి, జైలు పక్షి, శారదాంబ, చిన్నారి దేవత, బ్రహ్మ పుత్రుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.బాలనటిగా, హీరోయిన్గా..1997లో అనియతిప్రావు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. మలయాళంతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కథానాయికగా మెప్పించింది. తమిళ స్టార్ హీరో అజిత్ను పెళ్లాడాక సినిమాలకు స్వస్తి చెప్పింది. ఇద్దరు పిల్లలు పుట్టాక వారిని చూసుకోవడంలోనే బిజీ అయిపోయింది. అయితే పిల్లలిద్దరూ ఇంతవరకు తన సినిమాలేవీ చూడలేదంటోంది షాలిని. ఒక్క సినిమా చూడలేదుతాజాగా ఓ అవార్డుల ఫంక్షన్కు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా పిల్లలు ఇంతవరకు నేను నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదు. ఎప్పుడైనా చూద్దామని ప్లాన్ చేసుకుంటారు. తీరా సమయం దగ్గరపడ్డాక తర్వాత చూద్దాం అని వాయిదా వస్తుంటారు. అయితే నేను యాక్ట్ చేసిన సాంగ్స్ మాత్రం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఒక్క మూవీ కూడా పూర్తిగా చూడలేదు. ఇప్పటికైనా ఒక్క సినిమా అయినా చూడండ్రా.. అని స్టేజీపైనే పిల్లలను అభ్యర్థించింది షాలిని. View this post on Instagram A post shared by Reji babu Suresh babu (@rejibabusuresh) చదవండి: కుర్రాడైనా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న హీరోయిన్స్ -
కోలీవుడ్ కు షాక్ ఇచ్చిన విక్రమ్
-
అజిత్, విజయ్ మధ్య శత్రుత్వం? ఎలా ఉంటారో చెప్పిన షాలిని
కోలీవుడ్ స్టార్స్ అజిత్, విజయ్ మధ్య పోటీ సంగతేమో కానీ, వారి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఎప్పుడూ మా హీరో గొప్ప, మా హీరో తోపు అని వాదులాడుకుంటూనే ఉంటారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద రణరంగం లాంటి పరిస్థితే కనిపిస్తుంది.షాలిని ఆసక్తికర వ్యాఖ్యలుహీరోల మధ్య కూడా ఈ శత్రుత్వం ఉందని చాలామంది భావిస్తుంటారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటోంది అజిత్ సతీమణి, నటి షాలిని. తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్లో షాలిని మాట్లాడుతూ.. అజిత్, విజయ్.. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఒకరి సక్సెస్ను చూసి మరొకరు అభినందిస్తుంటారు. ఒకరిపై మరొకరికి సానుకూల అభిప్రాయం ఉంది అని పేర్కొంది. అప్పుడు కూడా వివాదంఇది విన్న అభిమానులు ఇద్దరు హీరోలు మనసున్న మనుషులే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది అజిత్ను కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్తో సత్కరించింది. అప్పుడు విజయ్ అజిత్కు కంగ్రాచ్యులేషన్స్ చెప్పలేదని వివాదం చెలరేగింది. దీంతో అతడి టీమ్ స్పందిస్తూ.. . అజిత్ సర్కు మొదటి కృతజ్ఞతలు చెప్పినవారిలో విజయ్ ఒకరు. సినిమాఇద్దరూ స్నేహపూర్వకంగా మెదులుతారు. అజిత్ సర్కు విజయ్ విషెస్ చెప్పలేదనడంలో ఎటువంటి నిజం లేదు అని వివరణ ఇచ్చింది. కాగా విజయ్ చివరగా నటించిన సినిమా జన నాయగణ్. జనవరిలో విడుదలవాల్సిన ఈ మూవీ సెన్సార్ కారణంగా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అజిత్.. ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల్లో బిజీగా ఉన్నాడు.చదవండి: తిరుమల గుడిలో అలాంటి అనుభవం.. శివానీ కామెంట్స్పై వివాదం -
మీవల్లే ఈ వేదన.. కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు: మీనా
సౌత్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది మీనా. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేశ్, మోహన్లాల్, మమ్ముట్టి.. ఇలా అందరు హీరోలతోనూ యాక్ట్ చేసింది. కొన్నేళ్ల క్రితం మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో ఆమె కొంతకాలంపాటు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.రెండో పెళ్లంటూ ప్రచారంతీరని మనోవేదనతో ఆమె నరకం అనుభవిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం మీనాకు రెండో పెళ్లి అంటూ అసత్య ప్రచారం ఊపందుకుంది. దయచేసి ఇటువంటి రూమర్స్ వ్యాప్తి చేయకండి అని మీనా కోరడంతో కొంతకాలం ఆ గాసిప్స్ పత్తా లేకుండా పోయాయి. కానీ తర్వాత మళ్లీ అదే తంతు. ఏదో ఒక హీరోతో మీనాకు లింక్ పెట్టడం, త్వరలోనే రెండో పెళ్లంటూ ప్రచారానికి తెర తీయడం సర్వసాధారణమైపోయింది.ఒంటరి ఆడదాన్ని అనేకదా!ఈ వ్యవహారంపై మీనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నాకు రెండో పెళ్లి అని చెత్తంతా రాస్తున్నారు. అందులో నిజం ఉంటే మీరు మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ మీకు మీరే ఏదో ఊహించుకుని, కల్పించుకుని రాయడం ముమ్మాటికీ తప్పే! నేనొక ఒంటరి మహిళను, అందులోనూ సెలబ్రిటీని అనే కదా మీకు నచ్చినట్లు రూమర్స్ సృష్టిస్తున్నారు. నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. పైగా నాకు ఓ కూతురుంది. మంచివాటిపై ఫోకస్ చేస్తా..తను ఇవన్నీ చూస్తే ఏమనుకుంటుంది? ఇదంతా నాకెంతో అసౌకర్యంగా ఉంది, చాలా చిరాకు తెప్పిస్తోంది. దీన్ని భరించడం నావల్ల కావడం లేదు. కానీ కర్మ అనేది ఒకటుంది. అదెవర్నీ వదిలిపెట్టదు. ఈ అనవసర ప్రచారంపై స్పందించి నా సమయం, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకోలేదు. నేను చాలా పాజిటివ్ వ్యక్తిని. ఎప్పుడూ సంతోషంగా, పాజిటివ్గా ఉండటానికే ప్రయత్నిస్తాను. మంచివిషయాలపైనే ఫోకస్ చేస్తాను అని మీనా చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మ ఉగ్రరూపం.. గొంతు పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది: ప్రియాంక -
'అర్ధరాత్రి 2 గంటలకు అతనికే కాల్ చేస్తా'.. అనుపమ షాకింగ్ ఆన్సర్
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది వరుస సినిమాలతో అలరించింది. బైసన్, పరదా, కిష్కింధపురి చిత్రాలతో అభిమానులను మెప్పించింది. అయితే ప్రస్తుతం ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. దర్శకుడు ఆర్జే షాన్ కాంబినేషన్లో మరోసారి కనిపించనుంది.అయితే ఇటీవల ముంబయిలో ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న అనుపమ అందరి దృష్టిని ఆకర్షించింది. బైసన్ కో స్టార్ ధృవ్ విక్రమ్తో కలిసి సందడి చేసింది. ఈ వేదికపై అనుపమకు హ్యాపీ బర్త్ డే అంటూ ధృవ్ విక్రమ్ విషెస్ తెలిపాడు. ఆ తర్వాత యాంకర్ అనుపమకు ఓ ప్రశ్న వేసింది. ఇండస్ట్రీలో అర్ధరాత్రి రెండు గంటలకు కాల్ చేయాలంటే ఎవరికీ చేస్తావ్ అని ప్రశ్నించింది. దీనికి అనుపమ ఆసక్తికర సమాధానమిచ్చింది. నేను ధృవ్కు కాల్ చేస్తానని నవ్వుతూ ఆన్సరిచ్చింది.ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన మరో అవార్డుల ఫంక్షన్లోనూ అనుమపతో ఉన్న సెల్ఫీని ధృవ్ విక్రమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ మరింత బలంగా వినిపిస్తున్నాయి. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఎవరూ కూడా స్పందించలేదు. Dhruv and anupama something something 🤭🫣 pic.twitter.com/vFvE5hM7qm— 𝓓𝓸𝓵𝓵𝔂 🤍 (@dollybiblio) February 18, 2026 -
హీరోయిన్ నిత్యా మేనన్ మరో ముందడుగు
హీరోయిన్ నిత్యా మేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నాని, నితిన్ తదితర హీరోలతో పలు సినిమాలు చేసింది. హిట్స్ కొట్టింది. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్లో నటించిన ఈమె.. ప్రస్తుతం ఇతర దక్షిణాది భాషలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది ఈమె నుంచి మూడు తమిళ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతానికి నిత్య చేతిలో కొత్త ప్రాజెక్టులు అయితే ఏం లేనట్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతగా ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు ప్రకటించింది.(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)'కేయూరి ప్రొడక్షన్ (Keyuri Productions)' పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడించిన నిత్యా మేనన్.. ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. వ్యాపార లాభాల కంటే కథాబలం, లోతైన పాత్రలు, సమాజంపై ప్రభావం చూపే సినిమాలకే తన ప్రాధాన్యం అని పేర్కొంది. ప్రస్తుతానికి కొత్తగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ప్రాజెక్టులేం ప్రకటించలేదు. చూస్తుంటే తనకున్న యాక్టింగ్ కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత నటి, నిర్మాత కొనసాగనుంది. 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా మేనన్.. ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్ తదితర చిత్రాల్లో కనిపించింది.(ఇదీ చదవండి: ప్రముఖ హీరో ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత) View this post on Instagram A post shared by Keyuri (@keyuriproductions) -
ఏఐతో అద్భుతం.. రజినీకాంత్ మూవీ టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం కొచ్చాడయాన్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించింది. గతంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కార్టూన్ సినిమాను తలపించేలా ఉందంటూ ఆడియన్స్ ట్రోల్స్ చేశారు.అయితే తాజాగా ఈ మూవీకి సరికొత్త హంగులతో టీజర్ను రిలీజ్ చేశారు. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో రూపొందించిన టీజర్ తలైవా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొత్తాన్ని ఏఐ సాయంతో రీ జనరేట్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రజినీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
విశాల్కు బిగ్ షాక్.. పది కోట్లు చెల్లించాల్సిందే..!
కోలీవుడ్ హీరో, నిర్మాత విశాల్కు మద్రాస్ హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు సంబంధించిన కేసులో విశాల్కు చుక్కెదురైంది. డబ్బులు చెల్లించేందుకు మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ కేసులో మొదట లైకాకు చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. విశాల్ రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లు చెల్లించేందుకు ఆరు వారాల గడువు కావాలని విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం అందుకు విముఖత వ్యక్తం చేస్తూ విశాల్ పిటిషన్ను కొట్టివేసింది. కాగా.. సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని.. ఆ డబ్బు తిరిగి చెల్లించలేదంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. -
కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దు: మంచు లక్ష్మీ సలహా
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని అక్క కొడుకు అజయ్ దీషన్ కథానాయకుడిగా నటించిన లేటేస్ట్ మూవీ బూకీ(తమిళంలో పూకీ). ఈ సినిమాకు గణేశ్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగులో బూకీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించడంతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో కూడా నటించారు. తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై హీరో అజయ్ దీషన్ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. రిలేషన్షిప్ విషయంలో విజయ్ ఆంటోనీ మీకు ఎలాంటి సలహా ఇచ్చారని హీరోను అడిగింది. రిలేషన్షిప్లో ఒక ఫ్రెండ్గా ఉండమని చెప్పాడని.. ఆ స్నేహం ఒక ఐదేళ్ల పాటు కొనసాగితే అప్పుడు ఆలోచించాలని సలహా ఇచ్చాడని అన్నారు. ఇది విన్న మంచు లక్ష్మీ కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు అని సలహా ఇచ్చింది.అంతేకాకుండా ఈ మూవీ టైటిల్ గురించి కూడా మంచు లక్ష్మీ మాట్లాడింది. పూకీ అనే పదం తమిళంలో క్యూటీ అని అర్థమని చెప్పుకొచ్చింది. యంగ్స్టర్స్ ఎక్కువగా ఈ పదాన్ని వాడతారని తెలిపింది. సినిమాల వల్ల డబ్బులు పొగొట్టుకున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంచు లక్ష్మీ స్పందించింది. అవునండి.. అప్పులు అనేవి వందశాతం నిజం.. ఐదేళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నానని తెలిపింది. కాగా.. ఈ చిత్రంలో ధనుషా హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో పాండియరాజన్, సునీల్, ఇందుమతి, మణికంఠన్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పాండి, ఆదిత్య కతిర్, ప్రియాంక తదితరులు నటించారు. కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు.. - మంచు లక్ష్మి రిలేషన్ షిప్ అడ్వైజ్#ManchuLakshmi #Bookie #AjayDhishan #VijayAntony pic.twitter.com/tzYpB01CQt— Filmy Focus (@FilmyFocus) February 17, 2026 -
రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: స్టార్ హీరోయిన్
ప్రేమలో మోసపోయిన సినీ తారల్లో నటి మమతమోహన్దాస్ ఒకరు. ఈమె బహు భాషా నాయకి. మలయాళం, తమిళం,తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా రాణించారు. తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, రుద్రంగి సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో శివప్పధికారం, గురు ఎన్ ఆళు, తడయార తాక్క,ఎనిమి,మహారాజా తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళంలో ప్రభు జయరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మైడియర్ సిస్టర్ చిత్రంలో అరుళ్నిధితో కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఆ మధ్య క్యాన్సర్ మహ్మమారి బారిన పడ్డారు. అయితే దాని నుంచి పోరాడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత మళ్లీ నటించడం మొదలెట్టిన మమత మోహన్దాస్ (Mamta Mohandas) తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో క్యాన్సర్ వ్యాధి నుంచి బయప పడి మళ్లీ నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ ప్రేమపై దృష్టి మళ్లిందన్నారు. అలా మలయాళ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడితో డేటింగ్కు వెళ్లానని చెప్పారు. అయితే అతను మరో యువతితో నిశ్చితార్థం జరిగిందన్న విషయం తనకు ఆ తరువాతనే తెలిసిందన్నారు. దాంతో తన మనసు ముక్కలైయ్యిందన్నారు. ఒక అమ్మాయి నమ్మకాన్ని బద్ధలు కొట్టడానికి వారికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన చెందానన్నారు. దీని గురించి ఆ నటుడిని అడగ్గా చాలా లైట్గా తీసుకున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం ఆ ఘటనను జీర్ణించుకోలేకపోయానన్నారు. తన మాజీ భర్తతో మొదటిసారి పరిచయం ఎలా అయిందో కూడా ఆమె పంచుకున్నారు. ఒక కార్యక్రమంలో తనను చూసి వివాహం చేసుకుందామని ఆకాంక్షను వ్యక్తం చేశారని, అందుకు తాను తన తల్లిదండ్రులను అడగమని చెప్పానట్లు గుర్తు చేసుకున్నారు. అలా అప్పుడు తమ పెళ్లి జరిగిందని చెప్పారు. కాగా వివాహ బంధంపై తనకు నమ్మకం ఉందని, అది ఎప్పటికీ చెరగదని అన్నారు. ప్రస్తుతం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన మాదిరిగానే అర్థం చేసుకోగలిగిన వ్యక్తి తారసపడితే కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు నటి మమత మోహన్దాస్ పేర్కొన్నారు. మమతకు 2011 నవంబరు 11న బహ్రెయిన్కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్తో నిశ్చితార్థం జరిగింది. వీరికి 2011 డిసెంబరు 28న కోజికోడ్లో వివాహం జరిగింది. 2012 డిసెంబరు 12న అంటే కేవలం ఏడాదిలోనే ఈ జంట విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు క్యాన్సర్ కారణంగానే వారిద్దరూ విడిపోయారని కొన్ని కథనాలు కూడా వచ్చాయి. -
లేటేస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. మణిరత్నం రివ్యూ
శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ తూ యా మైన్. సర్వైవల్ థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ వహించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో . ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం వీక్షించారు. ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆయన ఈ సందర్భంగా తు యా మైన్ చిత్రబృందాన్ని అభినందించారు. మణిరత్నం మాట్లాడుతూ.. " ఈ మూవీతో బిజోయ్ నంబియార్ ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకొచ్చారు. ఇది థియేటర్లలో ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం" అని ప్రశంసించారు.ప్రత్యేక ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు సైతం సినిమాపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు అద్భుతమైన సినిమాగా అభివర్ణించగా.. మరికొందరు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, స్టోరీ టెల్లింగ్ కొత్త అనుభూతి ఇచ్చాయని పేర్కొన్నారు. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ప్రశంసలు లభించడం సినిమా విజయంపై మరింత ధీమాగా ఉందన్నారు.కాగా.. ఈ మూవీని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి సంయుక్తంగా నిర్మించారు. యువతను లక్ష్యంగా చేసుకుని.. మునుపెన్నడూ చూడని ఎమోషన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందించారు. -
బీజేపీ నేత దారుణ కామెంట్స్పై స్పందించిన త్రిష
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. విజయ్ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్కి రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా అనేశాడు. దీంతో పెద్ద చర్చే నడిచింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు.. ఈ విషయాన్ని ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పుడు త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.(ఇదీ చదవండి: అలాంటి కంటెంట్కి లేని సమస్య.. టైటిల్స్కి ఎందుకు?)'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.దళపతి విజయ్, త్రిష పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. చివరగా విజయ్ హీరోగా నటించిన 'గోట్' మూవీలో త్రిష, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారనే రూమర్స్ చాన్నాళ్లుగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వీటిని విజయ్పై విమర్శల చేయడానికి ఉపయోగించడమే ఈ మొత్తం వివాదానికి కారణమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)Disrespect should and always will be called out. pic.twitter.com/FmXdIBvAJ6— Trish (@trishtrashers) February 16, 2026 -
అప్పుడు రూ.500 అప్పు.. ఇప్పుడు రూ.90 కోట్ల కలెక్షన్స్!
ఏదో ఒక కథ రాసుకున్నామా? పెద్ద హీరోను పెట్టామా? రెండు ఫైట్ సీన్లు, రెండు లవ్ సాంగ్స్తో మమ అనిపించేశామా? అంటే కుదరదు. ఈరోజుల్లో ప్రేక్షకులను థియేటర్కు రప్పించాలంటే వారి మనసును కదిలించేలా సినిమా ఉండాలి. వారు పెట్టిన డబ్బుకు సంతృప్తినిచ్చేదై ఉండాలి. అలాగైతేనే జనం సినిమాకు ఓటేస్తున్నారు, లేదంటే మూవీ చిన్నదైనా, పెద్దదైనా జనం ముఖం చాటేస్తున్నారు.ఫస్ట్ సినిమాతోనే హిట్అలాంటిది తొలి సినిమాతోనే టాలెంట్ చూపించాడు తమిళ దర్శకుడు అభిషన్ జీవింత్. యూట్యూబర్గా కెరీర్ మొదలు పెట్టిన అతడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అభిషన్. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది మే 1న విడుదలవగా ప్రేక్షకులను నవ్విస్తూనే హృదయాలను కదిలించింది. సుమారు రూ.7 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ప్రేమ వివాహంపెద్ద డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయకపోయినప్పటికీ సొంత టాలెంట్తో గొప్ప సినిమా తీసి అందరి మన్ననలు పొందాడు. రజనీకాంత్, సూర్య, రాజమౌళి, నాని.. ఇలా ఎందరో ప్రముఖులు ఆయన ప్రతిభను ప్రశంసించారు. ఈ ఆనందంలోనే అభిషన్.. ప్రియురాలిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ వివాహానికి టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మగేశ్ రాజు హాజరై బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చాడు. హీరోగానూ టాలెంట్ఇక దర్శకుడిగా నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడు? అనుకుంటే హీరోగా మారాడు. విత్ లవ్ మూవీతో కథానాయకుడిగానూ విజయం సాధించాడు. అయితే ఒకప్పుడు అభిషన్ రోజూవారీ ఖర్చుల కోసం రూ.500 స్నేహితుడిని అప్పడిగాడు. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు బాక్సాఫీస్పై కోట్లు కురిపించే సినిమాలు తీసే రేంజ్కు ఎదిగాడు. 26 ఏళ్ల వయసులోనే ఇంత సక్సెస్ చూస్తున్న అభిషన్ మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం!చదవండి: ఆ హీరోయిన్కు ఫోన్ చేసి సారీ చెప్పా: రవీనా టండన్ -
సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం
సూపర్స్టార్ రజనీకాంత్ చేసిన సినిమాల్లో 'బాషా'కి ప్రత్యేక స్థానముంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత మరణించారు. వృద్ధాప్య సమస్యలతో నిర్మాత తమిళగన్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల.. రజనీ సంతాపం వ్యక్తం చేశారు. బాధపడుతూ ట్వీట్ చేశారు.(ఇదీ చదవండి: హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్)'సోదరుడు లాంటి అళగన్ మృతి నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా సానుభూతి' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. నేటి సాయంత్రం (ఫిబ్రవరి 15) తమిళగన్ అంత్యక్రియలు జరగనున్నాయి. రజనీ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'బాషా' చిత్రాన్ని తమిళగన్, తన తల్ల రాజమ్మాళ్తో కలిసి నిర్మించారు. ఇతడి తండ్రి ఆర్ఎం వీరప్పన్ సమర్పకుడిగా వ్యవహరించారు. దీనితోపాటే మూండ్రు ముగం, పణక్కారన్, రాణువ వీరన్ కూడా తమిళగన్ నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకుడిగానూ వ్యవహరించారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)மதிப்பிற்குரிய அமரர் ஆர்.எம். வீரப்பன் அவர்களின் புதல்வர், எனது அன்புத் தம்பி தமிழழகன் அருமையான மனிதர். அவரது திடீர் மறைவு எனக்கு மிகுந்த வேதனையளிக்கிறது. அவருடைய ஆத்மா சாந்தியடையட்டும். குடும்பத்தாருக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள்.— Rajinikanth (@rajinikanth) February 15, 2026 -
ప్రియుడిని పెళ్లాడిన 'సార్ మేడమ్' నటి
తమిళ నటి రోషిణి హరిప్రియణ్ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కేఎస్ సుందర మూర్తిని ఆదివారం (ఫిబ్రవరి 15న) వివాహం చేసుకుంది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సినిమాకాగా రోషిణి హరిప్రియణ్ భారతి కన్నమ్మ సీరియల్తో పాపులర్ అయింది. ఆ తర్వాత 'కూకు విత్ కోమలి' రియాలిటీ షో మూడో సీజన్లోనూ పాల్గొంది. అనంతరం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. గరుడన్, మద్రాస్ మ్యాట్నీ మూవీస్ చేసింది. చివరగా 'తలైవా తలైవి' సినిమాలో నటించింది. ఈ చిత్రం తెలుగులో 'సార్ మేడమ్' పేరిట రిలీజైంది. Bharathi Kannama serieal fame #RoshniHariPriyan getting married. pic.twitter.com/MRKxSFH4NG— CineFriday (@Cine_Friday) February 15, 2026 చదవండి: అది నా దురదృష్టం: రణ్బీర్ కపూర్ -
ప్రముఖ నటుడి కుమారుడి కారు బోల్తా..
తమిళ సినీ ప్రపంచంలో మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ విలన్గా, సహనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. లియో మూవీ విడుదల తర్వాత నటి త్రిషపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. అయితే, ఆయన కుమారుడు తుగ్లక్ తన కారులో చెన్నై హాడోస్ రోడ్డు నుండి ఉత్తమర్ గాంధీ రోడ్డు వైపు వెళ్తుండగా..అకస్మాత్తుగా అదుపు తప్పి శాస్త్రి భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, కారులో ఉన్న తుగ్లక్ స్వల్ప గాయాలతో కిందపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని రక్షించి, ఘటన స్థలంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మైలాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రమాదం జరిగినప్పుడు తుగ్లక్ మద్యం సేవించలేదని తెలిసింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గత సంవత్సరం మాదకద్రవ్యాలు ఉపయోగించినందుకు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు తుగ్లక్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం గమనార్హం. -
ధనుశ్ వల్లే భారీ నష్టం.. రూ.20 కోట్లు చెల్సించాల్సిందే..!
కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి చిత్రాల తరువాత ధనుష్ నటిస్తోన్న తాజా చిత్రం కర. ఈ మూవీ టైటిల్ను పొంగల్ సందర్భంగా ప్రకటించారు. ఆయన కెరీర్లో ఇది 54వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాలో మమతా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే తాజాగా ధనుశ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2016లో ప్రకటించిన ఓ ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంతో నిర్మాణ సంస్థ ఆయనపై లీగల్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగిపోవడం వల్ల రూ.20 కోట్ల పరిహారం కోరుతూ ధనుశ్కు.. తేనాండల్ ఫిల్మ్స్ లీగల్ నోటీసు పంపినట్లు తెలుస్తోంది.2016లో నాన్ రుద్రన్ అనే సినిమాను దర్శకత్వం వహించడంతో పాటు నటించడానికి ధనుష్ అంగీకరించారని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే ఈ సినిమా ఆగిపోవడంతో.. తమకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చారని తేనాండల్ ఫిల్మ్స్ ఆరోపిస్తోంది. చివరికీ ఆ సినిమా నుంచి కూడా ధనుశ్ తప్పుకున్నారని అంటోంది.ఈ మూవీ కోసం ముందస్తు చెల్లింపులు, ప్రీ-ప్రొడక్షన్ ఖర్చులకు గానూ దాదాపు రూ.20 కోట్ల నష్టాలు వచ్చాయని తేనాండల్ ఫిల్మ్స్ తెలిపింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టులో భాగమైన టాలీవుడ్ హీరో నాగార్జున, ఎస్జే సూర్య లాంటి స్టార్ నటులకు చెల్లించిన పారితోషికం కూడా ఇందులో భాగమని తెలుస్తోంది. ముఖ్యంగా ధనుష్ పూర్తి స్క్రిప్ట్ సమర్పించడంలో విఫలమవడం.. ఇతర ప్రొఫెషనల్ కమిట్మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే మా సినిమా ఆగిపోయిందని.. దీనివల్ల తమకు తీవ్ర నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అందువల్లే చట్టపరమైన చర్యలకు దిగినట్లు తేనాండల్ ఫిల్మ్స్ ప్రకటించింది. -
సూర్య- జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు!: హీరో తండ్రి
ప్రేమించడం ఈజీయేమో కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మాత్రం కొంత కష్టమైన పనే! కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక ప్రేమాయణం హీరో తండ్రి, నటుడు శివకుమార్కు ఏమాత్రం ఇష్టం లేదట. కానీ సూర్య పట్టుపట్టి సాధించి, ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ విశేషాలను శివకుమార్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.జీవితాంతం ఒంటరిగానే..శివకుమార్ మాట్లాడుతూ.. మొదట్లో సూర్య ప్రేమను నేను ఒప్పుకోలేదు. పెళ్లంటూ చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానన్నాడు. వెంటనే నాకు నేను నటించిన 150 సినిమాలు కళ్లముందు కదిలాయి. అందులో చాలావరకు ప్రేమకథలే ఉన్నాయి. దీంతో వెంటనే అతడి ప్రేమను అంగీకరించాను.ఎలా ఉండేవాడు?వాడు మొదట్లో చాలా బిడియంగా ఉండేవాడు. రాధికా శరత్కుమారే వాడిని జ్యోతికతో మాట్లాడించింది. అలా మొదలైన మాటలు తర్వాత ప్రేమకు దారితీశాయి. ఎంతో మొహమాటంతో ఉండే వీడేనా ఈరోజు ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నాడు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని శివకుమార్ సరదాగా చెప్పుకొచ్చాడు.ప్రేమ- పెళ్లిసూర్య, జ్యోతిక అనేక సినిమాల్లో కలిసి నటించారు. 'పూవెల్లం కేట్టుప్పార్' మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ 2006 సెప్టెంబర్ 11న పెళ్లితో మరింత బలపడింది. ఈ దంపతులకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం. సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం 'కరుప్పు' సినిమా చేస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. అలాగే హీరోయిన్ నజ్రియాతో సూర్య మరో సినిమా చేస్తున్నాడు.చదవండి: కొడుకు- కోడల్ని అభినందించిన మెగాస్టార్ -
లోకేశ్ హీరోగా 'డీసీ'.. వాలంటైన్స్ స్పెషల్ గ్లింప్స్
దర్శకులందరూ హీరోలవుతున్నారు. అలా తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూడా 'డీసీ' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని గతేడాది ప్రకటించారు. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా.. బ్లడీ వాలంటైన్ అంటూ డీసీ గ్లింప్స్ వదిలారు. అందులో ప్రేమ కన్నా రక్తపాతమే ఎక్కువ చూపించారు. లోకేశ్ పీకలు కోస్తూ కనిపించాడు. చివర్లో కారుపై కూడా రక్తమే కనిపిస్తోంది. చిన్న వీడియోలోనే ఇంత వయొలెన్స్ ఉంటే సినిమాలో ఎంతుంటుందో చూడాలి!డీసీ విషయానికి వస్తే.. లోకేశ్ దేవదాస్గా, వామిక గబ్బి.. చంద్ర పాత్రలో కనిపించనున్నారు. వీరి పేర్ల కలయిక ఆధారంగానే డీసీ (దేవదాస్ + చంద్ర) అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకతత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. కాగా ఖైదీ, విక్రమ్, కూలీ సినిమాలతో దర్శకుడిగా క్రేజ్ అందుకున్న లోకేశ్ హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి! చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివ జ్యోతి -
చిన్నతనం నుంచే నాకు గుర్తింపు లేదు: సింగర్
గాయని కెనిషా పేరు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈమె మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. గాయని, గీత రచయిత, డాన్సర్, నటి ఇలా పలు టాలెంట్స్ కలిగిన బెంగళూరు భామ కెనిషా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల నటుడు రవిమోహన్ స్నేహితురాలిగా వార్తల్లో నానుతున్న గాయని ఈమె. అంతే కాదు నటుడు రవిమోహన్కు ఆయన భార్యకు మధ్య మనస్పర్థలకు, వారు విడిపోవడానికి కారణం ఈమె అనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి బలం చేకూర్చే విధంగా రవిమోహన్, కెనిషా జంటగా తిరున్నారు.రవి మోహన్పై పొగడ్తలుఇలాంటి పరిస్థితుల్లో నటి కెనిషా సందర్భం వచ్చినప్పుడల్లా రవిమోహన్పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇటీవల శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రంలో రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రవిమోహన్ హీరో అయినా విలన్ అయినా ఆయన వల్లే ఈ చిత్రం ఆడుతోంది. ఎవర్ గ్రీన్ రవిమోహన్ ముందు తన కళ్లకు ఎవరు కనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవితో బర్త్డే సెలబ్రేషన్స్రవిమోహన్కు నీడలా ఉంటున్న కెనిషా గత 7వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా రవిమోహన్ హాజరై పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల ఈ గాయని తన ఎక్స్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో తనకు చిన్న వయసులోనుంచే గుర్తింపు లేదంది. ప్రపంచమే మారిపోయిందితాను ఇతరుల నుంచి చిన్న గుర్తింపు, ప్రేమనే ఆశించానని తెలిపింది. అలాంటిది రవిమోహన్ వచ్చిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని, తన ఆలోచనలు, భావాలు, ప్రేమ తదితర విషయాలు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయంది. ఎవరేమనుకున్నా తాను బాధ పడనని, తాము నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నామంది. ఈ విషయం తమను అర్థం చేసుకున్న వారికి తెలుసని, కష్టాల్లో అండగా నిలబడినవారికి, రవిమోహన్కు ధన్యవాదాలని కెనిషా పేర్కొంది. -
మమితా బైజు కొత్త సినిమా.. నిర్మాతగా మారిన స్టార్ హీరో
నటి మమితా బైజు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత ఎనిమిదేళ్లగా మలయాళం, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్ రేట్ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తను నటించిన మలయాళం చిత్రం ప్రేమలు మాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల్లోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెబల్ చిత్రంతో జివీ.ప్రకాష్ కుమార్కు జంటగా కోలీవుడ్కు పరిచయమైన బ్యూటీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రదీప్ రంగనాథన్కు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ చిత్రంలోనూ మమితా బైజు కీ రోల్ చేశారు. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కారా చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. అదేవిధంగా బెత్లెహేమ్ కుడుంబ అనే మలయాళం చిత్రంలోని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు జంటగా కాకుండా ఆయన నిర్మించనున్న చిత్రంలో మమితా బైజు నాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలామంది నటుల మాదిరిగానే ప్రదీప్ రంగనాథన్ కూడా నిర్మాతగా మారిపోతున్నారు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలుతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఎన్నో హిట్లు.. కానీ, స్కిన్ షో తప్పడం లేదా?
చిత్రపరిశ్రమలో కథానాయికలు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేది అందాల ప్రదర్శనకే అని చెప్పవచ్చు. అవకాశాల కోసం స్కిన్ ప్రదర్శనతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తుంటారు. టాప్ హీరోయిన్గా ఎదిగినా, ఆ స్థానాన్ని నిలుపుకోవడానికి వారికి ఒకే ఒక్క ఆయుధం అందాలారబోతే. నటి రాశీఖన్నా ఇందుకు ఆతీతం కాదు. చూడ చక్కని నటి ఈ బ్యూటీ. అంతే కాదు పాన్ ఇండియా నటి అన్నది అదనపు గుర్తింపు. 2013లో మెడ్రాస్ కఫే అనే చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తు మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలోకి ఇమైకా నొడిగల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే అందులో హీరో అక్కగా నటించిన నయనతార ఆ క్రెడిక్ట్ను కొట్టేశారు. అయితే నటి రాశీఖన్నాకు ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది. అలా నటుడు రవిమోహన్కు జంటగా అడంగుమరు అనే చిత్రంలో నటించారు. ధనుష్తో కలిసి తిరుచిట్రంఫలం (తిరు) చిత్రంలో క్యామియో పాత్రలో నటించారు. సర్ధార్ చిత్రంలో నటుడు కార్తీకి జంటగా నటించారు. సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో తమన్నతో పోటీ పడి అందాలను ఆరబోశారు. విశేషం ఏమిటంటే కోలీవుడ్లో ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. తెలుగులోనూ హిట్ చిత్రాల్లో నటించారు. అలా నటిగా పుష్కర కాలాన్ని అధిగమించారు. అయినా ఈమెకు స్టార్ ఇమేజ్ రాకపోవడం గమనార్హం. అంతే కాదు ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ప్రత్కేక ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని హాట్హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఇవి ఎంత వరకు అవకాశాలను తీసుకొస్తాయో చూడాలి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
అర్ధరాత్రి రజనీతో బైక్ రైడ్.. అనిరుధ్ తండ్రి మమ్మల్ని అడ్డుకుని!
దక్షిణాదిన ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ కట్టిన రాధికా శరత్కుమార్ ఈసారి చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది. తను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ "తాయి కిళవి". ఈ చిత్రంలో తను ఊరిలో రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.బైక్పై తిరిగాంఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఒకరోజు రజనీకాంత్, నేను బైక్పై చెన్నై అంతా తిరిగాం. నేను ఇక్కడే తిన్నాను, ఇక్కడే నిద్రపోయాను, ఇక్కడే కొన్నాళ్లు ఉన్నానంటూ రజనీ తను తిరిగిన ప్రదేశాలన్నీ నాకు చూపించాడు. రజనీ లైఫ్ స్టోరీ తన నోటి నుంచి వింటున్నప్పుడు చలించిపోయాను.జీవితంలో అనేక కష్టాలుఇన్ని కష్టాలు పడ్డాడా? అని ఫీలయ్యాను. చాలామంది జీవితంలో అనేక కష్టాలు చూసుండొచ్చు. కానీ, రజనీకాంత్ తన బాధ, కష్టం, శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని అట్టడుగు స్థాయి నుంచి తారాస్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే మేము అలా బైక్పై తిరుగుతూ ఉంటే సడన్గా ఒక కారు మమ్మల్ని చేజ్ చేసుకుంటూ వచ్చి మా ముందు ఆగింది. నాకు ఒక్కసారిగా భయమేసింది. సీక్రెట్ షికారు అనుకుని..అయితే వచ్చింది మరెవరో కాదు, రజనీకాంత్ భార్య లత సోదరుడు, నటుడు రాఘవేంద్ర. రజనీకాంత్ అర్ధరాత్రి ఒక మహిళను వెంటేసుకుని రహస్యంగా షికార్లు చేస్తున్నాడని భావించి మమ్మల్ని ఆపేందుకు వచ్చాడు. కానీ.. రజనీ, నేను షికారుకు వెళ్లామని లతకు ముందే తెలుసు. దీంతో అతడి ఆందోళన నీరుగారిపోయింది అని చెప్పుకొచ్చింది. కాగా రజనీకాంత్ భార్య, నిర్మాత, సింగర్ లత తమ్ముడే నటుడు రవి రాఘవేంద్ర. ఈయన కుమారుడు అనిరుధ్ రవిచందర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు.చదవండి: సంతోషంగా లేను, మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు: శ్రీజ దమ్ము -
వైఎస్ జగన్ను కలిసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ కలిశారు. చెన్నైలో జరిగిన సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలు కార్తీ, సూర్య వైఎస్ జగన్ను ఆత్మీయంగా పలకరించారు. పెళ్లి వేడుకలో హీరోలు కార్తీ, సూర్యతో వైఎస్ జగన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు అటు రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చలకు దారి తీసింది. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews) -
శరణ్య కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్ హీరోలు
ప్రముఖ నటి శరణ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నటి శరణ్య- దర్శకనటుడు పొన్వన్నన్ దంపతుల చిన్న కూతురు చాందిని పెళ్లి పీటలెక్కింది. ఫిబ్రవరి 2న వివాహం జరగ్గా శుక్రవారం చెన్నైలో ఎంతో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్కు తమిళ స్టార్ హీరోలు ధనుష్, కార్తీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇద్దరూ డాక్టర్సే..చాందిని డాక్టర్ కాగా, అతడి భర్త ఫిలిప్ కూడా డాక్టర్ అని తెలుస్తోంది. 2025 డిసెంబర్లోనే వీరి నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇకపోతే నటి శరణ్య.. తల్లి, అత్తమ్మ పాత్రలతో పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్ హీరోలకు వెండితెరపై అమ్మగా కనిపించింది. గ్యాంగ్ లీడర్, రఘువరన్ బీటెక్, 24.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఈవిడ దర్శకుడు పొన్వన్నన్ను పెళ్లి చేసుకోగా వీరికి ప్రియదర్శిని, చాందిని సంతానం. కూతుర్లిద్దరూ డాక్టర్స్గా స్థిరపడ్డారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026Dhanush at Saranya Ponvannan’s Daughter Wedding Reception💥pic.twitter.com/Ox0Yn0hpgt— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్ -
ఆవేశంతో చితక్కొట్టా.. దర్శకుడు, హీరో ఆపారు: విశాల్ ప్రేయసి
సెట్లో ఒకసారి ఓ వ్యక్తిని చితకబాదానంటోంది హీరోయిన్ సాయి ధన్సిక. ఆవేశం పట్టలేక అతడిని కొడుతూ ఉంటే అది చూసి దర్శకుడు, హీరో తనను ఆపారంటోంది. సాయిధన్సిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా యోగి డా. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది.ఫోటో అడిగితే..అందులో సాయి ధన్సిక మాట్లాడుతూ.. కేరళలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ వ్యక్తి నాతో ఫోటో దిగాలని మా అంకుల్(నా పర్యవేక్షకుడు)ని అడిగాడు. అయితే అతడు తాగి ఉన్నాడని గమనించి ఫోటో ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వెంటనే ఆ తాగుబోతు మా అంకుల్ను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదంతా చూసి నాలో కోపం కట్టలు తెచ్చుకుంది.చితకబాదా..ఆత్మరక్షణ కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ టాలెంట్ అంతా అప్పుడు ఉపయోగించాను. వాడ్ని పరిగెత్తి వెళ్లి మరీ పట్టుకుని చితకబాదాను. పదినిమిషాలు కొడుతూనే ఉన్నాను. డైరెక్టర్, హీరో నా చేతులు పట్టుకుని నన్ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. నా మనుషుల్ని ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే విచక్షణారహితంగా కొట్టాను అని సాయి ధన్సిక చెప్పుకొచ్చింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో షికారు సినిమాలో నటించింది.పెళ్లిఇకపోతే సాయిధన్సిక, హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే! గతేడాది ఆగస్టు 29న (విశాల్ పుట్టినరోజున) వీరి వివాహం జరగాల్సింది. కానీ నడిగర్ సంఘం భవనం ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుని ఎంగేజ్మెంట్తో సరిపెట్టుకున్నారు. మరి ఈ ఏడాది ఆగస్టు 29కైనా సాయి ధన్సిక మెడలో విశాల్ మూడు ముళ్లు వేస్తాడో, లేదో చూడాలి!చదవండి: నా సినిమా ఎఫెక్ట్ అవుతుందని భయపడ్డా: ఏడ్చేసిన చంద్రహాస్ -
అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్..
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్రెడ్డి వంగా పేరు పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. ఈ మూవీ టేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే, తాజాగా విడుదలైన 'నిలవే' మూవీ ట్రైలర్కు ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. ఈ ట్రైలర్ను చూసిన నెటిజన్లు చిత్ర దర్శకుడిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీడేంటి సందీప్రెడ్డి స్టూడెంట్లా ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్లో కట్స్, ఎడిటింగ్, సంగీతం సూపర్ అంటూనే హీరోయిన్ పాత్రలో కనిపించిన శ్రేయాసి సేన్ నటన అదుర్స్ అంటున్నారు.సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూనే సాయి కె.వెన్నంతో కలిసి నిలవే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రేయాసి సేన్ కథానాయికగా నటిస్తుంది. రాజ్ అల్లాడ, గిరిధర్రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్కు మంచి ఆదరణ రావడంతో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న శ్రేయాసి సేన్కు మంచి గుర్తింపు వస్తుంది. -
'360 గ్రాముల బంగారం'.. పాదపూజ చేసిన నటుడు
'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు! నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..' నిజమే కదా.. పాటలో చెప్పినట్లుగా ఈరోజుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పేరాశతో దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీకి యావత్ దేశం చప్పట్లు కొడుతోంది.నిజాయితీజనవరి 11న చెన్నైలోని టీ నగర్లో పద్మ అనే మహిళ రోజూలాగే రోడ్డు శుభ్రం చేస్తోంది. చెత్త ఊడుస్తుండగా ఆమెకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.45 లక్షలు విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉండటంతో నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీ చాటుకుంది. అది తెలుసుకున్న రజనీకాంత్ ఆమెను నేరుగా ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు.ఘనంగా సన్మానంఅప్పటినుంచి పద్మ పేరు మారుమోగుతూనే ఉంది. తాజాగా దర్శకనటుడు పార్తీబన్ (R Parthiban) ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్కు వెళ్లాడు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను కూడా ఆహ్వానించాడు. స్టేజీపై అందరిముందు ఆమెను ఘనంగా సన్మానించాడు. ఆమెకు చెప్పులు తొడిగి, కాళ్లకు నమస్కరించి చీర కానుకగా ఇచ్చాడు. అలాగే నెత్తిన కిరీటం పెట్టాడు. ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశాడు.అందుకే పాదపూజ చేశా..బంగారం విలువ పెరిగేకొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఒక గ్రాము లక్ష రూపాయలకు చేరుకుంటున్నప్పుడు దానికోసం వేలాది మంది ప్రాణాలే పోవచ్చు. కానీ, పద్మ అనే మహిళ బంగారం కన్నా మానవత్వమే గొప్ప అని నిరూపించింది. సంవత్సరంలో 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజీ ఫంక్షన్కు తననూ తీసుకెళ్లాను. తనకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని రాసుకొచ్చాడు. సినిమాఇది చూసిన నెటిజన్లు మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు. తమిళ నటుడు ఆర్.పార్తీబన్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు నిర్మాత కూడా! సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన వందకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. యుగానికి ఒక్కడు, రచ్చ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, ఇడ్లీ కొట్టు వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ వెబ్ సిరీస్లోనూ కనిపించాడు. தங்கத்தின் மதிப்பு ஏற ஏற, மனிதத்தின் மரியாதை குறைந்துகொண்டே போய், ஒரு கிராம் ஒரு லட்ச ரூபாயை நெருங்கும்போது, லட்சக்கணக்கான உயிர்கள் கொல்லப்படுவது உறுதியாகிவிடும்.வருடத்தில் 360 நாளாவது உழைக்கும் துப்புரவு பணியாளர் திருமதி பத்மா அவர்கள், குப்பையில் கிடந்த 360 கிராம் நகையை… pic.twitter.com/tTRtd6gLWP— Radhakrishnan Parthiban (@rparthiepan) February 4, 2026 చదవండి: ఆరుసార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. నిక్ ఎమోషనల్ -
'పిల్లలందరికీ తండ్రులే హీరోలురా'.. ఆసక్తిగా గ్లింప్స్
బిజినెస్మేన్గా కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అరుల్ శరవణన్. ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన లెజెండ్ శరవణన్గా ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లీడర్. ఈ మూవీకి దురై సెంథిల్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఫైట్ సీన్స్ చూస్తుంటే కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్తో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చివర్లో పిల్లలందరికీ తండ్రులే హీరోలురా అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
అతడి వల్లే 4 ఏళ్లు సినిమాలకు దూరమయ్యా: మాధవన్
ఒకతను చేసిన చిన్న పని వల్ల నాలుగేళ్లు సినిమాలకే దూరంగా ఉన్నానంటున్నాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్. సాలా ఖడూస్ (2016) సినిమాకు ముందు బ్రేక్ తీసుకున్నానని, అది తనకెంతో పనికొచ్చిందంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్లో ఓ తమిళ పాట చిత్రీకరణ కోసం ఆరెంజ్ ప్యాంట్, గ్రీన్ షర్ట్ ధరించి రోడ్డు మధ్యలో నిల్చున్నాను. నేనెవరో చూపిస్తా అన్నంత కోపంఅక్కడే కూర్చున్న ఓ రైతు నన్ను నిర్లక్ష్యంగా ఓ చూపు చూశాడు. అది నాకసలు నచ్చలేదు. చెన్నైకి రా.. నేనెవరో నీకు చూపిస్తా అని మనసులో అనుకున్నాను. కానీ ఎందుకో ఆ చూపు నన్ను వెంటాడింది. నన్ను ఆలోచింపజేసేలా చేసింది. నిజంగానే అసలు నేనేం చేస్తున్నాను అని అంతర్మథనానికి లోనయ్యాను. అందుకే బ్రేక్ తీసుకున్నాను. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. అదిప్పటికీ పనికొస్తోందిసినిమాలు మానేసి ప్రదేశాలు తిరగడం మొదలుపెట్టాను. రిక్షా తొక్కేవారి దగ్గరి నుంచి చాలామందితో మాట్లాడాను. వారి జీవనశైలి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ఇలా అన్నింటినీ పరిశీలించాను. ఆ పర్యటన నాకెన్నో పాఠాలు నేర్పింది. ఎలాంటి పాత్రలు చేయాలి? ఎలాంటి సినిమాల్లో కనిపించాలన్నదానిపై స్పష్టత వచ్చింది. ఆ నాలుగేళ్లలో నేర్చుకున్నదాని ఫలితాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మాధవన్ చివరగా ధురంధర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ధురంధర్ 2తో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాడు.చదవండి: నాకు స్టార్డమ్ తెచ్చిన మూవీ అదే.. : మహేశ్బాబు -
తలైవా మెచ్చిన కార్మికురాలు.. నిజాయితీలో బంగారం..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నారు. నిజాయితీ గల పారిశుద్ధ్య కార్మికురాలిని ఆయన అభినందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. ఆమె నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును బహుకరించారు.అసలేం జరిగిందంటే..చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించడంపై ఆమె ప్రశంసలు వర్షం కురిసింది. ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా ఆమెను ఇంటికి పిలిచి సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్.. ఆమెకు ఒక బంగారపు గొలుసు గిఫ్ట్గా అందించారు. దీంతో ఆమె ముఖంలో ఆనందంతో నిండిపోయింది.అంతేకాకుండా పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది. పరుల సొమ్ము తనకు వద్దని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ⭐ A Heartwarming Gesture by #SuperstarRajinikanth ⭐Superstar #Rajinikanth personally called Padmaa and honoured her with a gold chain 👑✨Padmaa, a frontline worker, earned widespread appreciation after she recovered 45 sovereigns of gold jewellery found on the road and… pic.twitter.com/1vHv6NBF7u— Danishkumar Sankaran (@S_Danishkumar) February 3, 2026 -
శ్రియా శరణ్ మూవీ.. రిలీజ్ కాకుండానే మూడు అవార్డులు..!
ఏదైనా సినిమా రిలీజై హిట్ అయితే ప్రశంసలు కురిపిస్తారు. అలాగే అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కథ బాగుండి సూపర్ హిట్ అయిన సినిమాలకు ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకంగా అవార్డులు ఇస్తుంటారు. కానీ రిలీజ్ కానీ సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్ ఇవ్వడం మీరెక్కడైనా చూశారా? కానీ సరిగ్గా అదే జరిగింది. ఐదేళ్ల క్రితమే షూటింగ్ పూర్తయి రిలీజ్ కావాల్సిన మూవీ ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు. కానీ తాజాగా అవార్డుల వేడుకలో మాత్రం ఏకంగా మూడింటిని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరేంటో తెలుసుకుందామా? విమల్, శ్రియా శరణ్ జంటగా నటించిన చిత్రం 'సందకరి'. తాజాగా ఈ చిత్రం మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 29న తమిళనాడు ప్రభుత్వం 2016 నుంచి 2022 సంవత్సరాల వరకు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో చాలా మంది అగ్రశ్రేణి నటీనటులు, చిత్రాలు, సాంకేతిక నిపుణులను ప్రభుత్వం గుర్తించి అవార్డులు అందించింది.అయితే 'సందకరి' అనే సినిమారు 2020 ఏడాదిగానూ మూడు అవార్డులను గెలుచుకుంది. ఇదే ఇప్పుడు ఆడియన్స్ను షాక్కు గురిచేసింది. అసలు ఈ సినిమా విడుదల కాలేదని.. మరి ఇలాంటి చిత్రానికి అవార్డులకు ఎలా ఇచ్చారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ మూవీ ఉత్తమ చిత్రం (మూడవ బహుమతి) అవార్డును గెలుచుకోగా.. ఉత్తమ నేపథ్య గాయకుడు అమ్రిష్ (మేల్), అయ్యప్పన్ ఉత్తమ కళా దర్శకుడిగా అవార్డులకు ఎంపికయ్యారు. రిలీజ్ కానీ సినిమాకు అవార్డులు రావడమేంటని కోలీవుడ్ ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.అయితే తమిళనాడు రాష్ట్ర అవార్డులకు అర్హత పొందాలంటే ఆ చిత్రం థియేటర్లలో విడుదల అయి ఉండాలని నివేదికలు చెబుతున్నాయి. అంతే కాకుండా అవార్డుల కోసం ఆ ఏడాదిలో రిలీజైన ఎన్నో చిత్రాలు ఉండనే ఉన్నాయి. అవన్నీ కాదని.. ఒక మలయాళ రీమేక్కు మూడు అవార్డులు ఇవ్వడంపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఆశ్చర్య వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.కాగా.. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ మూవీ 'మై బాస్'కు రీమేక్గా సందకారిని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దిలీప్, మమతా మోహన్దాస్ నటించారు. ఈ తమిళ వర్షన్లో విమల్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్ మదేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే అనేక కారణాలతో ఇప్పటికీ విడుదల కాలేదు. -
రజినీకాంత్ పొలిటికల్ నిర్ణయం.. కుమార్తె ఏమన్నారంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్లోకి రానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తాజాగా తండ్రి నిర్ణయంపై ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ స్పందించారు. విత్ లవ్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. తన తండ్రి నిర్ణయం పట్ల తమకెలాంటి బాధ లేదన్నారు. ఆయనకు ఏది నచ్చితే కుటుంబమంతా మద్దతుగా ఉంటుందని తెలిపారు.అంతేకాకుండా రజనీ- కమల్హాసన్ సినిమాపై జరుగుతున్న ప్రచారంపై కూడా స్పందించారు. ఈ కాంబినేషన్ మూవీకి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అవీ ఓకే అయితే త్వరలోనే వివరాలను ప్రకటిస్తామన్నారు. కాగా.. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్ లవ్. ఈ మూవీకి మదన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.నాన్నగారి రాజకీయ ప్రస్థానం విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు - సౌందర్య రజనీకాంత్#AbishanJeevinth #AnaswaraRajan #Madhan #WithLove #SoundaryaRajinikanth pic.twitter.com/BXkhJE02Z4— Filmy Focus (@FilmyFocus) January 30, 2026 -
ఒకే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్లు.. అందరూ తోపులే!
మన దేశంలో వ్యాపార, రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ కొన్ని కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా వరకు నటుల నుంచి నిర్మాతల వరకు, తమ కుటుంబ సభ్యులను సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చి, వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు మరే ఇతర భాషా చిత్ర పరిశ్రమలో అయినా వారసుల హవా ఎప్పుటి నుంచో నడుస్తుంది. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయం మీకు తెలుసా.? అంతేకాదు అదే కుటుంబం నుంచి ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ చిత్ర పరిశ్రమను శాసించారంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. తమిళ సినిమాకు 'తొలి డ్రీమ్ గర్ల్'గా పేరొందిన 'టీఆర్ రాజకుమారి' కుటుంబమే దీనికి సాక్ష్యం. ఈ అరుదైన సినీ వంశం గురించి తెలుసుకోవాలంటే, ముందుగా రాజకుమారి నాయనమ్మ గుజ్జలాంబాళ్ నుంచి ప్రారంభించాలి. ఆమె ఒక ప్రసిద్ధ కర్ణాటక గాయని, సంగీత ప్రపంచంలో ఆమెకు గొప్ప పేరుంది. తంజావూరు వారి స్వస్థలం. ఈ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదటి వ్యక్తి ‘ఎస్పీఎల్ ధనలక్ష్మి’. 1935లో 'నేషనల్ మూవీ టోన్' అనే నిర్మాణ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం 'పార్వతి కళ్యాణం'లో ధనలక్ష్మి హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఆమె సోదరి తమయంతి కూడా 1930వ దశకంలో కొన్ని చిత్రాలలో హీరోయిన్గా పని చేసింది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో హీరోయినే టీఆర్ రాజకుమారి.ఆమె అసలు పేరు రాజయ.1930లలోప్రముఖ దర్శకుడు కె.సుబ్రమణ్యం ఎస్పీఎల్ ధనలక్ష్మిని కలవడానికి వెళ్లాడు. ఆ సమయంలో ధనలక్ష్మి సోదరి కుమార్తె రాజయ కూడా అక్కడే ఉంది. ఆ అమ్మాయిని చూసి వెంటనే తన సినిమాలో హీరోయిన్గా చేయమని సుబ్రమణ్యం అడిగారట. రాజయ పేరును రాజకుమారిగా మార్చి, తన చిత్రం 'కచ్ఛ దేవయాని' (1941)లో ఆమెను నటింపజేశాడు. తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా రాజకుమారి తమిళ సినిమాకు 'డ్రీమ్ గర్ల్'గా తిరుగులేని విజయం సాధించింది.రాజకుమారి స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత ఆమె ఫ్యామిలీ నుంచి మరికొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చాయి.వారిలో అత్యంత ముఖ్యమైన వారు టీఆర్ రామన్న. టీఆర్ రామన్న తమిళ సినిమాకు ప్రముఖ దర్శకుడు, నిర్మాతగా పేరుగాంచారు. ఎం.జీ.ఆర్, శివాజీ వంటి దిగ్గజాలతో సినిమా తీసిన ఏకైక నిర్మాత ఆయనే కావడం విశేషం.ఆ తర్వాత టీఆర్ రాజకుమారి కోడలు కుశల కుమారి కూడా 70వ దశకంలో చిత్రాలలో హీరోయిన్గా వెలుగొందింది. కొన్నాళ్ల తర్వాత ఎస్పీఎల్ ధనలక్ష్మి ఇద్దరు కూతుళ్లు కూడా సినిమాల్లోకి వచ్చింది. వాళ్లే జ్యోతి లక్ష్మి, జయమాలిని. ధనలక్ష్మికి మరో సోదరికి పిల్లలు లేకపోవడంతో జ్యోతి లక్ష్మిని వారికి దత్తత ఇచ్చారు. జ్యోతి లక్ష్మి, జయమాలిని ఇద్దరూ తమ గ్లామరస్ పాటలలో నృత్యం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. జ్యోతి లక్ష్మి సుమారు 300 చిత్రాలలో నటించగా, జయమాలిని 500 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించింది.ఈ కుటుంబానికి చెందిన తదుపరి, చివరి తరం జ్యోతి మీనా. 'ఉళ్ళత్తై అళ్లిత' చిత్రంలో కౌండమణి పక్కన నటించిన జ్యోతి మీనా విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులతో కూడా డ్యాన్స్ చేసింది. ఆమె కొన్ని సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేసింది. జ్యోతి మీనా తండ్రి ఒక కెమెరామెన్ కావడంతో, ఈ కుటుంబం నుండి సాంకేతిక రంగంలోకి కూడా ఒక వ్యక్తి వచ్చారు. ఇలా ఒకే కుటుంబం నంచి మొత్తంగా ఏడుగురు హీరోయిన్లు, ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ వచ్చి.. కొన్నేళ్ల పాటు తమిళ ఇండస్ట్రీని శాసించారు. -
కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మృణాల్.. హీరో ఎవరంటే..?
‘సీతారామం, ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సుపరిచితురాలే. అయితే మృణాల్ ఠాకూర్కు కోలీవుడ్ నుంచి కబురు వచ్చిందట. శింబు హీరోగా తమిళంలో ‘ఓ మై కడవులే, డ్రాగన్ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ’గా విడుదలైంది)’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మృణాల్ ఠాకూర్ను ఎంపిక చేసుకున్నారట చిత్రం యూనిట్. మృణాల్కు ఆల్రెడీ మేకర్స్ ఈ సినిమా కథ వినిపించారని, ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.ఒకవేళ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనున్న విషయం అధికారికంగా వెల్లడైతే, మృణాళ్కు తమిళ్లో ఇదే తొలి చిత్రం అవుతుంది. మరి..ఈ సినిమాతోనే మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ జరుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా, అడవి శేష్ హీరోగా చేస్తున్న ‘డెకాయిట్’ చిత్రాలతో మృణాల్ ఠాకూర్ బిజీగా ఉన్నారు. అలాగే ఆమె హిందీలో నటించిన ‘దో దీవానే షెహర్ మే’ చిత్రం ఈ ఫిబ్రవరి 20న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు..మరికొన్ని హిందీ చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు.ప్రియాంకా చోప్రా లైఫ్ జర్నీ నాకు స్ఫూర్తి: మృణాల్ ఠాకూర్బాలీవుడ్ సక్సెస్ఫుల్ టాప్ హీరోయిన్ ప్రియాంకా లైఫ్ జర్నీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతున్నారు మృణాల్ ఠాకూర్. ఈ అంశంపై ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘సినీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండ సినిమాల్లోకి వచ్చారు ప్రియాంకా చోప్రా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, కష్టపడి గ్లోబల్ రేంజ్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలాగే ప్రియాంక చోప్రా యువతకు ఇచ్చే సూచనలు, సలహాలు నాకు చాలా ఇష్టం. ఇలా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ప్రియాంకా చోప్రా నాకు కూడా స్ఫూర్తి. నా ప్రయాణం, ప్రియాంక చోప్రా ప్రయాణం పూర్తిగా భిన్నమైనవి. కానీ మా ఇద్దరి మధ్యలో ఓ కామన్ పాయింట్ ఉంది. ఇద్దరం కూడా కష్టకాలంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా కృషి, పట్టుదలతో ముందుకు వెళ్తున్నాం’’ అని చెప్పారు మృణాల్. -
హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నారా? తమిళలోనూ అదే తంతు
గత కొన్నాళ్లలో ప్రెస్మీట్స్ అంటే తెలుగు సినిమా హీరోహీరోయిన్లు చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే చిత్రవిచిత్రమైన ప్రశ్నలు, కొన్నిసార్లయితే మరీ దారుణమైనవి అడుగుతూ సదరు సెలబ్రిటీలని పలువురు రిపోర్టర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు తమిళంలోనూ ఒకరిద్దరు రిపోర్టర్లు ఇలానే తయారైనట్లు కనిపిస్తున్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్కి ఇలాంటి ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది.(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'పై రీమేక్ రూమర్స్)గతేడాది 'కూలీ'తో వచ్చిన లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం చేయనున్నాడు. రెండు వారాల క్రితం దీని ప్రకటన వచ్చింది. వీటి గురించి చెప్పేందుకు చెన్నైలో ఆదివారం ప్రెస్మీట్ పెట్టాడు. తన గత, ప్రస్తుత చిత్రాల గురించి వివరాలు వెల్లడించాడు. అలానే 'ఖైదీ 2' ఎప్పుడు ఉండబోతుంది? ఎల్సీయూ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశాడు.ఇదే ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్.. దర్శకుడు లోకేశ్ని ఇబ్బందికర రీతిలో ప్రశ్నించాడు. మీరు ఓ హీరోయిన్తో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని సదరు రిపోర్టర్ అడగ్గా.. లేదు సర్ నాకు కుటుంబం ఉంది అని లోకేశ్ సమాధానమిచ్చాడు. అయినా సరే రిపోర్టర్ వదలకుండా.. రెండో ఫ్యామిలీ వద్దా? అన్నట్లు అడిగాడు. దీనికి ఆన్సర్ ఇవ్వని లోకేశ్.. ప్రెస్మీట్ అక్కడితో ముగించేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో సదరు రిపోర్టర్పై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. చీప్ బిహేవియర్ అని కామెంట్స్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్.. 2012లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)Loki-Enaku already family irukanga sirReporter-2nd family 🤮Poi un wife ta kelu da 2nd family venuma nu 😡 pic.twitter.com/uOSKTiMpXp— Shyam (@Shyam_1200) January 26, 2026 -
పరోటా మాస్టర్కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్
సూపర్స్టార్ రజనీకాంత్.. ఎప్పటికప్పుడు గోల్డ్ చెయిన్స్ గిఫ్ట్ ఇస్తుంటారు. వీటిని అందుకున్న వాళ్లలో సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటుంటారు. ఏదైనా సినిమా నచ్చితే.. హీరో లేదా దర్శకుడిని పిలిచి రజనీ.. బంగారు చెయిన్స్ ఇస్తుంటారు. ఈసారి మాత్రం పరోటాలు చేసే ఓ వ్యక్తికి ఇచ్చారు. అతడి కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఈ బహుమానం అందజేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇతడి పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే తలైవర్కి అంత వీరాభిమాని కాబట్టి. ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. తాజాగా శేఖర్ని ఇంటికి పిలిపించుకున్న రజనీకాంత్.. అతడికి బంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు. (ఇదీ చదవండి: 'హుక్ స్టెప్' అలా పుట్టింది: కొరియోగ్రాఫర్ ఆట సందీప్) -
సూర్య వర్సెస్ ధనుష్.. కోలీవుడ్ లో బిగ్ క్లాష్..
-
నా కంటే ముందు చాలామందితో డేటింగ్ చేశాడు.. కాకపోతే: హీరోయిన్
సాధారణంగా హీరోయిన్లు ప్రేమలో ఉన్నాసరే దాన్ని బయటపెట్టరు. చాలా రహస్యంగా ఉంచుతారు. టాలీవుడ్లో అయితే రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు టాక్. అయినా సరే తమ బంధాన్ని రివీల్ చేయట్లేదు. కానీ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ మాత్రం పదేళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఆ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టింది. తాజాగా ఈమె తన ప్రియుడి గురించి చెబుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిలేషన్షిప్ గురించి ఓ విలువైన సలహా కూడా ఇచ్చింది.న్యూస్ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియా భవానీ శంకర్.. తమిళంలో మిడ్ రేంజ్ సినిమా హీరోయిన్గా అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. తాజాగా ఈమె లీడ్ రోల్ చేసిన 'హాట్ స్పాట్ 2' థియేటర్లలోకి వచ్చింది. అయితే కొన్నిరోజుల క్రితం ఈమె, తన బాయ్ఫ్రెండ్తో విడిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని వీళ్లిద్దరూ కలిసి చేసిన పోస్టుతో క్లారిటీ వచ్చేసింది. ప్రియ.. తన కాలేజీ మేట్ రాజ్ వేల్తో గత పదేళ్లుగా ప్రేమలో ఉంది. గతేడాదే వీళ్లు పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన వీళ్లిద్దరికీ లేనట్లే కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ)తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ప్రియా భవానీ శంకర్ ఏం చెప్పిందంటే.. 'నాకు మొదటి, చివరి బాయ్ఫ్రెండ్ అతడు, ఎంతో బాధతో ఈ విషయాన్ని చెబుతున్నా(నవ్వుతూ). నాతో రిలేషన్ మొదలుపెట్టకముందు కాలేజీ టైంలో అతడు చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. నేను చెప్పేదేంటంటే మీ విధేయత చూపించడానికి ఎక్కువ కాలం రిలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ టాక్సిక్ రిలేషన్షిప్ అనిపిస్తే వెంటనే బ్రేకప్ చెప్పేసి బంధం నుంచి బయటకొచ్చేయండి' అని చెప్పుకొచ్చింది.తెలుగులో ఈమె.. కల్యాణం కమనీయం, భీమా, జీబ్రా సినిమాల్లో హీరోయిన్గా చేసింది. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో టాలీవుడ్లో ప్రియకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతానికైతే తమిళంపైనే ఫోకస్ చేసింది.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)I am sad to say that he's my first & last boyfriend. But he dated many girls before our relationship. I would say that, you don't have to be in long relationship only to show your loyalty. If you feel it's toxic, come out of it 👏🏽— #PriyaBhavaniShankar pic.twitter.com/GFiEZovQxl— VCD (@VCDtweets) January 24, 2026 -
మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ప్రేమలో ఉన్నారని.. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్నిరోజుల ముందు షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమని చాలామంది నమ్మేశారు కూడా. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని స్వయానా మృణాల్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో రిలాక్స్ అవుతారనుకుంటే ఇప్పుడు ఏకంగా ధనుష్-మృణాల్ పెళ్లి చేసేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)రీసెంట్ టైంలో ఏఐ(కృత్రిమ మేధ) వినియోగం చాలా పెరిగిపోయింది. తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలని యూజర్స్ తయారు చేసుకుంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ నెటిజన్.. ఇలానే ధనుష్-మృణాల్ పెళ్లి జరిగినట్లు, ఈ కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన దళపతి విజయ్, అజిత్, త్రిష, అనిరుధ్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు హాజరైనట్లు కూడా సృష్టించారు. ఇది ఫేక్ వీడియోనే అయినప్పటికీ యూజర్స్ని ఎంటర్టైన్ చేస్తుండటం విశేషం.ఈ పెళ్లి రూమర్స్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ధనుష్ ఒంటరిగానే ఉంటున్నాడు. రీసెంట్ టైంలో మృణాల్ చేసిన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ జరిగితే వీటిలో ధనుష్ కనిపించడం, డేటింగ్ రూమర్స్ రావడానికి కారణమైంది. ఈ క్రమంలోనే పెళ్లి గాసిప్స్ కూడా వచ్చాయి. అవి అబద్ధమని తెలిసినప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఏఐ వీడియోలు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)Dey 😂😂😂Wedding 🙏🏻🙏🏻🙏🏻🙏🏻#MrunalThakur #Dhanush pic.twitter.com/tCWx7bTVcE— Swaasthi (@swaasthi) January 24, 2026 -
చెప్పు విసిరిన ఘటన.. 'నన్ను నేను మర్చిపోయా!'
సినీగేయరచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇటీవల కలకలం రేపింది. తమిళనాడులోని తిరుప్పూర్లో కొంగు కళ, సాహిత్య సంస్కృతి మండలి ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకుగానూ తిరుప్పూర్ కలెక్టరేట్కు రాగా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడున్న ఓ మహిళ చెప్పు విసిరింది. తొలి పోస్ట్అయితే అది వైరముత్తుపై కాకుండా మరోవైపు పడింది. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఈ ఘటన తర్వాత వైరముత్తు సోషల్ మీడియలో తొలిసారి ఓ పోస్ట్ పెట్టాడు. తిరుప్పూర్లో తను హాజరైన మరో కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. రెండువేలమంది విద్యార్థులు ఒక్కచోట చేరి చప్పట్లు కొడుతుంటే తనను తాను మర్చిపోయానన్నాడు.గతంలో ఆరోపణలుకాగా వైరముత్తు గతంలో మీటూ ఉద్యమ సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చాలామంది మహిళలతో వైరముత్తు అసభ్యంగా నడుచుకున్నారంటూ సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను వైరముత్తు కొట్టిపారేశాడు. திருப்பூரில்வெற்றித் தமிழர் பேரவை ‘வள்ளுவர் மறை வைரமுத்து உரை’கையொப்பத் திருவிழாவைநிகழ்த்தியதுஏ.வி.பி அரங்கு முழுக்கஆயிரத்துக்கு மேற்பட்டபள்ளிப் பிள்ளைகள்;கல்லூரிக் கண்மணிகள்வெற்றித் தமிழர் பேரவையின்அவைத் தலைவர்ராம்ராஜ் நாகராஜன்அற்புதமான அறவுரை ஆற்றினார்… pic.twitter.com/Sjx88vuwvL— வைரமுத்து (@Vairamuthu) January 23, 2026 చదవండి: ప్రెగ్నెన్సీ అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన బిగ్బాస్ శివజ్యోతి -
పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ.. వీడియో వైరల్
తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.గత బుధవారం తిరుప్పూర్లో జరిగిన కొంగు కళ, సాహిత్య, సంస్కృతి మండలి ప్రారంభోత్సవానికి వైరముత్తుకి ఆహ్వానం అందింది. ఇందులో పాల్గొనేందుకు వైరముత్తు తిరుప్పూర్ కలెక్టరేట్కు వచ్చినప్పుడు ఎవరో చెప్పు విసిరారు. అయితే ఆ చెప్పు ఆయనపై కాకుండా మరో వ్యక్తిపై పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చెప్పు విసిరిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెప్పు విసిరిన మహిళ పేరు జయ. 45 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళకు మతిస్థిమితం లేదు. కలెక్టర్ ఆఫీస్తో పాటు కోర్టు దగ్గర కూడా పలుసార్లు ఇలానే చెప్పులు విసిరిందట. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలియజేస్తూ..ఆమెను అరెస్ట్ చేసినట్లుగా అధికారికంగా వెల్లడించారు. பாடல் ஆசிரியர் வைரமுத்துவை நோக்கி காலணிகள் வீச்சு..! என்ன காரணம்..? திருப்பூரில் பரபரப்பு..#tiruppur | #vairamuthu | #polimernews pic.twitter.com/I5EscQ5cWv— Polimer News (@polimernews) January 22, 2026ఈ ఘటన జరిగిన తర్వాత వైరముత్తు తొలిసారిగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. తాజాగా ఆయన తిరుప్పూర్ లో విక్టోరియస్ తమిళ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘రెండు వేల మంది యువకులు ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టడం చూసి, నన్ను నేను మర్చిపోయాను’ అంటూ రాసుకొచ్చాడు. చెప్పు విసిరిన ఘటనపై ఆయన స్పందించపోవడం గమనార్హం. అయితే ఆమెకు మతి స్థిమితం లేదనే విషయం తెలిసి.. వైరముత్తు ఆ ఘటనను లైట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వైరముత్తు వరుస వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. 2018లో, మీటూ ఉద్యమం సమయంలో, గాయని చిన్మయి శ్రీపాద భువన శేషన్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వైరమత్తు మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. திருப்பூரில்வெற்றித் தமிழர் பேரவை ‘வள்ளுவர் மறை வைரமுத்து உரை’கையொப்பத் திருவிழாவைநிகழ்த்தியதுஏ.வி.பி அரங்கு முழுக்கஆயிரத்துக்கு மேற்பட்டபள்ளிப் பிள்ளைகள்;கல்லூரிக் கண்மணிகள்வெற்றித் தமிழர் பேரவையின்அவைத் தலைவர்ராம்ராஜ் நாகராஜன்அற்புதமான அறவுரை ஆற்றினார்… pic.twitter.com/Sjx88vuwvL— வைரமுத்து (@Vairamuthu) January 23, 2026 -
గాయని ఎస్.జానకి కుటుంబంలో విషాదం
ప్రముఖ గాయని ఎస్.జానకి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ సింగర్ చిత్ర సోషల్మీడియా ద్వారా తెలిపారు. మురళీకృష్ణ మరణం తనను షాక్కు గురిచేసిందని తాను మంచి సోదరుడిని కోల్పోయానంటూ తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరారు. మురళీకృష్ణకు కూడా సినీ రంగంతో అనుబంధం ఉంది. వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాల్లో ఆయన నటించారు. భరతనాట్యంలో ఆయనకు ప్రావీణ్యం ఉంది. పలువురు విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. మురళీకృష్ణ మరణంతో సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. -
డేటింగ్లో ఉన్నా.. కానీ, తను ముస్లిం కాదు: ఫరియా అబ్దుల్లా
తొలి సినిమా 'జాతిరత్నాలు'తో 'చిట్టి' పేరుతో యూత్కు దగ్గరైన బ్యూటీ ఫరియా అబ్దుల్లా .. రీసెంట్గా గుర్రంపాపిరెడ్డి మూవీతో పాటు అనగనగా ఒక రాజులో ప్రత్యేక పాత్రలో మెరిసింది. కెరీర్ ప్రారంభంలో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు. కానీ, ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది.ఫరియా అబ్దుల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ఓపెన్గా మాట్లాడింది. ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని తెలిపింది. తన ప్రియుడి గురించి మాట్లాడుతూ.. అతడు ముస్లిం కాదని, హిందూ కుటంబానికి చెందిన యువకుడని స్పష్టం చేసింది. అందరూ అనుకుంటున్నట్లు అతడు తన బాల్య స్నేహితుడు కాదని క్లారిటీ ఇచ్చింది. అయితే, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనంటూ క్లూ ఇచ్చింది. అతను ఒక కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడని చెప్పింది. తాము ఇద్దరం కలిసి వర్క్ చేస్తూ ఒక టీమ్లా ముందుకు వెళ్తున్నట్లు మాట్లాడింది. కొంత కాలంగా తనలోని డ్యాన్స్, ర్యాప్లో వచ్చిన మార్పులకు అతనే కారణమని ఫరియా గుర్తుచేసుకుంది. తమ మధ్య ఉండే బంధం లవ్ అఫైర్ కాదని అదొక అనుబంధం అంటూ తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి చెప్పింది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
తెలుగు హీరోయిన్లపై రాజాసాబ్ బ్యూటీ విమర్శలు
మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్.. మలయాళంతోపాటు సమానంగా తమిళంలోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్లో తను నటించిన మాస్టర్, పేట, తంగలాన్ చిత్రాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 మూవీలో యాక్ట్ చేస్తోంది.డైలాగులు బేఖాతరుతాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. చాలాకాలం కిందట సంగతి ఇది. తెలుగు, తమిళంలో కొందరు హీరోయిన్లు డైలాగులను అసలు పట్టించుకునేవారే కాదు. ఒక సన్నివేశంలో బాధగా కనిపించాలంటే ఏడుపు ముఖం పెట్టి ఒకటి, రెండు, మూడు, నాలుగు అని లెక్కపెట్టేవారు. అంతే..! ఆవేశం, కోపం కలగలిపిన సీన్లలో ఏబీసీడీ అనే అక్షరాలను చదువుతూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. మమ అనిపించేవారుఏబీసీడీ అన్న అక్షరాలను పదేపదే చదువుతూ ఉంటే పెదాలు కలుస్తూ ఉంటాయి. ఆ లిప్ సింక్ వల్ల డబ్బింగ్లో చెప్పే డైలాగ్స్కు సరిగ్గా సరిపోయేవి. కెరీర్ మొత్తం వాళ్లిలాగే నెట్టుకొచ్చారు. నేనైతే వారిలా అస్సలు చేయలేను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర భాషా నటుల్ని తీసుకొచ్చి పెడితే ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే.. మాస్టర్ మూవీలో నిన్ను ట్రోల్ చేసిందెందుకో మర్చిపోయావా? అని మరికొందరు మాళవికపై సెటైర్లు వేస్తున్నారు. #MalavikaMohanan Acting in Master was trolled by all with her expression But She Commenting on others pic.twitter.com/tASuISbGrh— SillakiMovies (@sillakimovies) January 21, 2026 చదవండి: మమ్ముట్టి సినిమాలు రిజెక్ట్ చేశా..: హీరోయిన్ భావన -
'ఇంకా నిద్రపోతున్నారా?'.. హీరోను అవమానించేలా ప్రశ్న
తమిళ హీరో అశ్విన్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. తను ప్రధాన పాత్రలో నటించిన హాట్స్పాట్ 2 మచ్ మూవీ త్వరలో రిలీజవుతోంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సినిమా ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్ అతడిని అవమానించేలా ప్రశ్న అడిగాడు. మీకు కథలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నారా? లేదా మెలకువతో ఉండి వింటున్నారా? అని ప్రశ్నించాడు. అది విని అశ్విన్ అసహనానికి లోనయ్యాడు.హీరో కౌంటర్మీరెప్పుడూ సినిమా చూసేటప్పుడు థియేటర్లో నిద్రపోలేదా? అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడేదో 40 కథలు చెప్పేసరికి నిద్రపోయానన్నాను. బహుశా ఆ సంఖ్య 40 కన్నా ఎక్కువే ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. అయినా దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చాను. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? నన్ను అవమానించడానికా? అని కోప్పడ్డాడు.గతంలో ఏం జరిగింది?2022లో ఎన్న సొల్ల పోగిరై మూవీ ఆడియో లాంచ్లో అశ్విన్ కుమార్ మాట్లాడాడు. ఒకేరోజు దాదాపు 40 కథలు విన్నానని, అవి చాలా చప్పగా ఉండటంతో సగంలోనే నిద్రపోయానన్నాడు. ఆయన కామెంట్స్పై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన.. ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదంటూ క్షమాపణలు చెప్పాడు. అక్కడితో ఆ వివాదం సమసిపోయింది.హాట్స్పాట్ 2 మచ్ విషయానికి వస్తే.. ఇది 2024లో వచ్చిన హాట్స్పాట్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. విఘ్నేశ్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. అశ్విన్ కుమార్తో పాటు ప్రియ భవానీ శంకర్, ఆదిత్య భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ తమిళ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. కాగా సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ కుమార్ (Ashwin Kumar Lakshmikanthan).. తెలుగులో అన్నీ మంచి శకునములే సినిమాలోనూ యాక్ట్ చేశాడు. #Reporter: Are you sleeping now listening to stories or you woke up❓#AshwinKumar: 40 is the number which I said generally, it could be more or less. Have you never slept while watching films in theatres? Why are you bringing this question now & degrading me? It was not to hurt… pic.twitter.com/RPhtEoSfo0— AmuthaBharathi (@CinemaWithAB) January 20, 2026 చదవండి: రాజాసాబ్ ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ ఏంటో చెప్పిన నిధి అగర్వాల్ -
బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్
తమిళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి.. బాలీవుడ్ వరకు వెళ్లి.. ఇప్పుడు అల్లు అర్జున్తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న దర్శకుడు అట్లీ.. గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని బయటపెట్టాడు. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.(ఇదీ చదవండి: క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)తమిళ డైరెక్టర్ శంకర్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన అట్లీ.. 'రాజారాణి' మూవీతో దర్శకుడిగా మారాడు. తర్వాత దళపతి విజయ్తో తెరి, బిగిల్, మెర్సల్ లాంటి హ్యాట్రిక్ మూవీస్ తీశాడు. 2023లో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్తో తీసిన 'జవాన్'.. అదిరిపోయే సక్సెస్ అయింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్తో అట్లీ ఓ మూవీ చేస్తున్నాడు.అట్లీ వ్యక్తిగత విషయాలకొస్తే.. నటి ప్రియని 2014లో పెళ్లి చేసుకున్నాడు. 2023లో ఈమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి మీర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ప్రియ మరోసారి తల్లి కానుంది. చూస్తుంటే బన్నీతో మూవీ రిలీజయ్యేలోపే అట్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు ప్రియ బేబీ బంప్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు) -
'తెరి' వాయిదా.. కృతజ్ఞతలు చెప్పిన నిర్మాతలు
నటుడు విజయ్ చిత్రం విడుదలవుతోందంటే దాని ప్రభావం ఆయన అభిమానుల్లోనే కాకుండా చిత్ర పరిశ్రమలోనూ చాలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన గతంలో నటించిన చిత్రం 'తెరి' ( పోలీసోడు) రీ రిలీజ్ కానుంది. దీంతో ఇతర చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నటుడు విజయ్ హీరోగా వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించిన తెరి సినిమాలో నటి సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. జన నాయగన్ వాయిదా పడటంతో విజయ్ ఫ్యాన్స్ కోసం తెరి చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. దీంతో పాటు అజిత్ హీరోగా నటించిన మంగాత్తా చిత్రం కూడా అదే తేదీన రీ రిలీజ్ కానుంది. అయితే అదే తేదీన కొత్త చిత్రాలైన ద్రౌపది–2, హాట్స్పాట్–2 విడుదల కానున్నాయి. ఈ క్రమంలో విజయ్ నటించిన తెరి చిత్రం రీ రిలీజ్ కానుండడంతో ఈ చిన్న చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో హట్స్పాట్–2 చిత్ర దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్ తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో తెరి చిత్ర విడుదలను వాయిదా వేయాల్సిందిగా నిర్మాత కలైపులి ఎస్.థానుకు విజ్ఞప్తి చేశారు. తెరి చిత్రం విడుదల కారణంగా తమ చిత్రానికి థియేటర్ల సమస్య వస్తోందని అందులో పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని ద్రౌపది–2 ,చిత్ర దర్శక, నిర్మాతలు ఎక్స్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దీంతో చిన్న చిత్రాలను కాపాడేవిధంగా నిర్మాత కలైపులి ఎస్.థాను తెరి చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ద్రౌపది–2 చిత్ర దర్శక నిర్మాతలకు కాస్త రిలీఫ్ వచ్చినట్లు అయ్యింది. వెంటనే ఆ చిత్ర దర్శకుడు మోహన్.జీ, నిర్మాత చోళ చక్రవర్తి నిర్మాత కలైపులి ఎస్.థానును కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
మరోసారి స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్..
కోలీవుడ్లో కమల్ హాసన్, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి కథానాయకులుగా రాణిస్తున్న నటులు విజయ్, అజిత్. వీరిద్దరి మధ్య మంచి మిత్రభావం ఉంది. అయితే వీరి అభిమానులు మధ్య మాత్రం ఎప్పటినుంచో పోటీ తత్వం నెలకొంది. ముఖ్యంగా అజిత్, విజయ్ నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలైతే ఆ సమయాల్లో వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.30 ఏళ్లుగా..రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా మరో హీరోపై విమర్శల దాడి జరుగుతుంటుంది. అలా గత 30 ఏళ్లకు పైగా విజయ్, అజిత్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటూ వస్తోంది. ఇకపోతే విజయ్ నటించిన చివరి మూవీ జననాయకన్ ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఇతర చిత్రాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. రీరిలీజ్అదేవిధంగా గతంలో విడుదలైన కొన్ని చిత్రాలు ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయి. అలాంటి వాటిలో నటుడు విజయ్ నటించిన తెరి, అజిత్ నటించిన మంగాత్తా చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. గతంలో మంచి విజయాలను సాధించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 23వ తేదీన రీరిలీజ్ కావడం మరో విశేషం. దీంతో ఈ చిత్రాలు సాధించే వసూళ్లపై ఆసక్తి నెలకొంది.1996 సంక్రాంతికి మొదలుఇకపోతే విజయ్, అజిత్ గతంలో నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలను పరిశీలిస్తే 1996 సంక్రాంతి సమయంలో విజయ్ నటించిన కోయంబత్తూర్ మాప్పిళై, అజిత్ నటించిన వాన్మతి చిత్రాలు రిలీజయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ నటించిన పూవే ఉనకాగా, అజిత్ నటించిన కల్లూరి వాసన్ చిత్రాలు మూడు రోజుల గ్యాప్తో విడుదలయ్యాయి. 1997లో విజయ్ నటించిన కాలమేల్లామ్ కార్తిరుప్పేన్ , అజిత్ నటించిన నేశం చిత్రాలు, అదే ఏడాది విజయ్ నటించిన కాదలుక్కు మర్యాదై, అజిత్ నటించిన రైట్టె జెండాపై వయసు చిత్రాలు వచ్చాయి.స్టార్ హీరోల సినిమాలు రిలీజ్1999లో విజయ్ నటించిన తుల్లాద మనం తుళ్ళుమ్ ,అజిత్ నటించిన ఉన్నైతేడి చిత్రాలు, 2000వ సంవత్సరంలో అజిత్ నటించిన ఉన్నై కొడు ఎన్నై తరువేన్ విజయ్ నటించిన ఖుషి చిత్రాలు, 2001లో విజయ్ నటించిన ఫ్రెండ్స్, అజిత్ నటించిన దీనా చిత్రాలు, 2002లో విజయ్ నటించిన భగవతి, అజిత్ నటించిన విలన్ చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇప్పుడు మరోసారి..2003లో విజయ్ నటించిన తిరుమలై , అజిత్ నటించిన ఆంజనేయ చిత్రాలు, 2006లో విజయ్ నటించిన ఆది ,అజిత్ నటించిన పరమశివం.., 2007లో విజయ్ నటించిన పోకిరి , అజిత్ నటించిన ఆల్వార్ .., 2014లో విజయం నటించిన జిల్లా, అజిత్ నటించిన వీరం చిత్రాలు, 2023లో అజిత్ నటించిన తుణివు, విజయ్ నటించిన వారిసు చిత్రాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ స్టార్ హీరోల తేరి, మంగాత్తా సినిమాలు ఒకేసారి రీ రిలీజ్ అవుతున్నాయి. -
దళపతి రేంజ్కు 'అల్లు అర్జున్'.. బిగ్ లైనప్తో ప్లాన్
అల్లు అర్జున్ పుష్పలో "ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా" అనే పాట తన నిజ జీవితానికి బాగా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. బన్నీ సినిమా విడుదలవుతుంది అంటే చాలు.. అందరికీ తెలిసిన ఒక వర్గం తనను కిందకు లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే, బన్నీ కూడా అంతే రేంజ్లో "ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను" అంటూ తనను ట్రోల్ చేసే వారి గుండెల్లో దడ పుట్టిస్తాడు. టాలీవుడ్లో తన ఫ్యాన్స్ బేస్ చాలా బలంగానే ఉంది. ఇప్పుడు తన చూపు ఇతర ఇండస్ట్రీల మీద ఉంది. ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో మల్లు అర్జున్ అయ్యాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్కు తన మార్కెట్ సత్తా చూపాడు. ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్ మూవీస్తో తమిళ పరిశ్రమపై కన్నేశాడు. తన ప్లాన్ వర్కౌట్ అయితే, తమిళ్లో బిగ్స్టార్గా పాతుకుపోతాడు. అందుకే ఇప్పుడు వరుసగా తమిళ టాప్ దర్శకులతో ప్రాజెక్ట్లు మొదలుపెట్టాడనిపిస్తుంది.దళపతి బాయ్స్తో అల్లు అర్జున్దళపతి విజయ్ బాయ్స్గా అట్లీ, లోకేశ్ కనగరాజ్లకు ఇమేజ్ ఉంది. బిగిల్, మెర్సిల్, తేరి చిత్రాలతో విజయ్కి అట్లీ హిట్స్ ఇస్తే.. లియో, మాస్టర్ మూవీస్తో లోకేశ్ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్తో వరుసగా సినిమాలు చేస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ కన్ను అల్లు అర్జున్ మీద పడింది. లోకేశ్ తన నెక్ట్స్ మూవీ బన్నీతో అని చెప్పగానే విజయ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. విజయ్, అల్లు అర్జున్ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్మీడియాలో పంచుకుంటున్నారు.చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్లో బన్నీ తమిళంలోనే మాట్లాడి వారి ప్రేమను పొందాడు. తమిళ ప్రజలకు కావాల్సింది కూడా అదే.. వారి భాషలో మాట్లాడే హీరోలను తప్పకుండా అక్కున చేర్చుకుంటారు. కన్నడకు చెందిన రజనీకాంత్కు తమిళనాట ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.అల్లు అర్జున్కు తమిళనాడులో సానుకూలతప్రస్తుతం అల్లు అర్జున్ చూపు తమిళనాడుపై ఉంది. కోలీవుడ్లో దళపతి విజయ్ సినిమాలకు గుడ్బై చెప్పి రాజకీయాల వైపు వెళ్తున్నారు. రజనీకాంత్ వయసు కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు చేసే ఛాన్స్ తక్కువగానే ఉండొచ్చు. ఆపై తమిళ మరో బిగ్ హీరో అజిత్ కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి.. కార్ రేసింగ్పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ముగ్గురి తర్వాత ఏర్పడుతున్న ఆ స్పేస్ను ఉపయోగించుకునేందుకు పక్కా వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళపతి విజయ్ మెచ్చిన దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన ప్లాన్ సక్సెస్ అవుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్కు టాప్ ఇమేజ్ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడులో కూడా తన ప్లాన్ వర్కౌట్ అయితే సౌత్ ఇండియాలో బన్నీకి సినిమాలకు బిగ్గెస్ట్ మార్కెట్ ఏర్పడుతుంది.బిగ్ లైనప్ సినిమాలతో ప్లాన్అల్లు అర్జున్ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్తో పాటు టాప్ దర్శకులతోనే ఉన్నాయి. అట్లీ, లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ ఇలా వరుసగా పేరున్న డైరెక్టర్స్తో లైనప్ ఉంది. ఆపై తను ఎంచుకున్న స్టోరీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అట్లీ సినిమా హిట్ కొడితే చాలు.. సౌత్ ఇండియాలో తన మార్కెట్ పునాది బలంగా పడుతుంది. బాలీవుడ్లో ఎటూ ఖాన్ల మూవీస్కు పోటీగా బన్నీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బన్నీ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఆపై తన ఫ్యూచర్ సినిమాల లైనప్ మరింత బలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో అల్లు అర్జున్ చూపించబోతున్నాడని తెలిసిపోతుంది. -
ధనుష్తో మృణాల్ ఠాకూర్ పెళ్లి? అసలు నిజమిదే!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ రూమర్ తెగ వైరలవుతోంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఏంటి.. నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు.ఇంత సడన్గా పెళ్లేంటి?అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో మృణాల్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలు ఉట్టి రూమర్సేనని హీరోయిన్ టీమ్ కొట్టిపారేసింది. ఫిబ్రవరిలో ఆమె సినిమా రిలీజ్ ఉంది, మార్చిలో మరో తెలుగు మూవీ వస్తోంది.. సినిమాలతో అంత బిజీగా ఉంటే ఇప్పుడింత సడన్గా పెళ్లెందుకు చేసుకుంటుందని ఆమె టీమ్ తిరిగి ప్రశ్నించింది. తనకసలు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదని, అనవసరంగా దీన్ని ఎవరో సృష్టించారని చెప్తోంది. దీంతో మృణాల్ పెళ్లి రూమర్స్కు ప్రస్తుతానికి ఫుల్స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. ధనుష్ చివరగా తేరే ఇష్క్ మే మూవీతో పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం కార మూవీ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ చివరగా సన్ ఆఫ్ సర్దార్ మూవీతో పలకరించింది. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో హీరోయిన్గా నటించిన డెకాయిట్ మార్చిలో విడుదల కానుంది. అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది.చదవండి: నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు.. :శర్వానంద్ -
ధనుష్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ధనుష్ నటిస్తున్న తాజా చిత్రానికి పొంగల్ పండగ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈయన నటిస్తున్న 54వ చిత్రం ఇది. దీనికి కర అనే టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను, ఓ వీడియోను విడుదల చేశారు. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజురముడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేశ్.. థింక్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా కర చిత్రంలో ధనుష్ పేరు కరసామి అని వీడియోలో పేర్కొన్నారు. ధనుష్ను మాస్ గెటప్లో చూపించారు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్గా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది.


