Bollywood Actress
-
అహ్మదాబాద్ ఘటన.. ఎయిరిండియాపై ప్రియాంక చోప్రా సిస్టర్ ఆగ్రహం!
అహ్మదాబాద్ విమానం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మనిషి ప్రాణాలు పోవడానికి ఒక్క సెకను చాలు అనేది కళ్లముందు కనిపిస్తోంది. ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటేనే ఆలోచించే పరిస్థితి ఎదురవుతోంది. విమాన ప్రయాణం ఇంత విషాదంగా మారడంతో భద్రతపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి.ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు టికెట్స్ రద్దు చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ మీరా చోప్రా భర్త కూడా ఉన్నారు. ఆమె భర్త ఈనెల 15న దుబాయ్కు ఎయిరిండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతపై నమ్మకం లేకపోవడంతో టికెట్ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీరా చోప్రా తెలిపింది. అయితే ఎయిరిండియా తమ టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ సిబ్బంది తీరుపై మీరా చోప్రా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.మీరా చోప్రా ట్వీట్లో రాస్తూ.. 'ఎయిరిండియా తీరు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్కు ప్రయాణించాల్సి ఉంది. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో మేము ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నాం. కానీ ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సలహా రాలేదని పేర్కొంటూ టికెట్ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. ఎయిర్ ఇండియాను నడపడంలో మేమందరం గర్వపడ్డాం. ఎందుకంటే ప్రముఖ టాటా గ్రూప్ నడుపుతున్న మన జాతీయ విమానయాన సంస్థ. కానీ ఈ రోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఇప్పుడు వారు విమానాలు ఎలా నిర్వహిస్తున్నారో తీవ్ర నిరాశపరిచింది. ఈ ఘటన వారికి సిగ్గుచేటు. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎయిరిండియా వీటిని అస్సలు పట్టించుకోదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే మీరా చోప్రా టికెట్ రీఫండ్ చేయమని అడగడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. టికెట్ రద్దు విధానాన్ని ముందుగా చదుకోవాలని ఆమెకు సలహాలిచ్చారు. నిబంధనల ప్రకారం మీరు విమాన సమయాన్ని మార్చినట్లయితే రద్దు చేసి డబ్బులిస్తారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా మీ సొంత కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మరో నెటిజన్ మీరాకు కౌంటరిచ్చారు. కాగా.. గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఒక్కరు మినహా 241 అందరూ ప్రాణాలు కోల్పోయారు. #AirIndia insensitivity is beyond shocking..My husband is scheduled to travel to Dubai on 15th June on @airindia and we wanted to cancel the flight due to the lack of safety measures. But Air India declined to refund any amount citing no advisory has come to them. We all took…— Meerraa Chopraa (@MeerraChopra) June 12, 2025 -
కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?
సెలబ్రిటీలు అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కావు. పిల్లల పక్కన నిల్చుంటే వారికి అక్కలానో, అన్నలానో ఉంటున్నారు తప్ప పేరెంట్స్లా మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే! ఇంతకీ కూతురి బర్త్డేకు కేక్ కట్ చేయించి తనకు ప్రేమగా తినిపిస్తున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?ఫేమస్ సాంగ్..తెలుగులో ఓ ఫేమస్ పాటతో ఓ ఊపు ఊపేసింది. ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమ.. అనుకుంటేనే ఉన్నా రామ్మా.. అంటూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆవిడే మహిమ చౌదరి (Mahima Chaudhry). శ్రీకాంత్, జగపతిబాబు నటించిన 'మనసులో మాట' సినిమాలోనిదే ఈ పాట. ఎక్కువగా హిందీ సినిమాలే చేసిన మహిమ 2016 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. కానీ, 8 ఏళ్ల తర్వాత ద సిగ్నేచర్ అనే హిందీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఎమర్జెన్సీ, నడానియన్ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. కూతురి బర్త్డే..తన కూతురు అరియానా పుట్టినరోజు సెలబ్రేషన్స్ను అభిమానులతో పంచుకుంది. హ్యాపీ బర్త్డే మై బేబీ అని క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వీడియోలో తల్లి చేతుల్ని పట్టుకుని నమస్కరించింది అరియానా. ఆ తర్వాతే క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మహిమ అసలు తల్లిలా కాదు, ఆమెకు అక్కలా కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.అందమైన కూతురుఅరియానా ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తనను చాలా మంది అయితే హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్తో లేదంటే పాతకాలం నాటి అమూల్ యాడ్లో కనిపించే అమాయకపు అమ్మాయితో పోలుస్తారు. షారూఖ్ ఖాన్ పర్దేశ్ సినిమాతో కెరీర్ ఆరంభించిన మహిమా 35కు పైగా సినిమాలు చేసింది. 2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడగా.. ఆత్మస్థైర్యంతో దాన్ని జయించింది. View this post on Instagram A post shared by Mahima Chaudhry (@mahimachaudhry1) చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
UNEP అంబాసిడర్, నటి లగ్జరీ కారు చూశారా? ధర ఏంత?
బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) తన ఖరీదైన కార్ల లిస్ట్లో మరో లగ్జరీ కారును జోడించింది. లగ్జరీ కంపెనీ బీఎండబ్లయూకి చెందిన ఈ ఎలక్ట్రిక్ కార్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 635 కి.మీ. దూసుకుపోతుందట. మరీ దీని ఖరీదెంత? ఆమె గ్యారేజీలో ఇంతకుముందున్న కార్ల లిస్ట్ ఏంటి?బాలీవుడ్ ప్రముఖులు నెమ్మదిగా లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ జాబితాలో ఇపుడు దియామీర్జా చేసింది. భారత మార్కెట్లో విలాసవంతమైన ఎలక్ట్రిక్ వాహనంగా పేరొందిన, రూ.1.39 కోట్ల (ప్రారంభధర) విలువైన BMW iX ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. UNEP (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్) అంబాసిడర్ దియా గ్యారేజీకి సరిగ్గా సరిపోయేలా ఉంది అంటున్నారు ఫ్యాన్స్.BMW బ్రాండ్పై దియాకు చాలా ప్రేమ ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె లగ్జరీ కార్ కలెక్షన్లో BMW X3,BMW X5 కూడా ఉన్నాయి. భారతదేశంలో BMW X3, ధర సుమారు రూ.45 లక్షలు. 2013లో గుర్గావ్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో BMW X1ని లాంచింగ్ ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ వెహికల్ ప్రౌడ్ ఓనర్గా ప్రకటించుకుంది. ఇంకా గ్యారేజీలో లెక్సస్ LX 570 , ఆడి Q7 వంటి ఇతర హై-ఎండ్ SUVలు కూడా ఉన్నాయి. చదవండి: ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?దియా మీర్జా కొత్త EVలో 12.3-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్,14.9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ను,కర్వ్డ్ డిస్ప్లే లాంటి స్పెషల్ ఫీచర్స్తోపాటు, ఎలక్ట్రోక్రోమిక్ పనోరమిక్ గ్లాస్ రూఫ్ , మెమరీ ,మసాజ్ సామర్థ్యాలను అందించే మల్టీ-ఫంక్షనల్ సీట్లు ఉన్నాయి. 195 kW DC ఛార్జర్ని ఉపయోగించి దాదాపు 35 నిమిషాల్లో బ్యాటరీని 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు, 50 kW DC ఛార్జర్ని ఉపయోగించి 97 నిమిషాల్లో, 22 kW AC ఛార్జర్ని ఉపయోగించి దాదాపు 5.5 గంటల్లో, 11 kW AC ఛార్జర్ని ఉపయోగిస్తున్నప్పుడు దాదాపు 11 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది ఒకే ఛార్జ్పై 425 కి.మీ ప్రయాణించగలదట.బ్లాక్ సఫైర్ మెటాలిక్ కలర్లో ఈ కారులో లోపలి భాగం కాస్టానియా చెస్ట్న,నలుపు రంగుల క్లాసిక్ డ్యూయల్-టోన్ షేడ్స్లో ఉంది ఈ కారు. రితేష్ దేశ్ముఖ్,నుష్రత్ భరుచ్చా ,ఇబ్రహీం అలీ ఖాన్ వంటి నటులతోపాటుగా , కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ లగ్జరీ కారు సొంత చేసుకున్నారు. ఇదీ చదవండి: To day recipes : మోకాళ్ల నొప్పులకు బెస్ట్ ఇది, మరి జీర్ణశక్తికి! -
బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన షిరీన్.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత మొదటి బిడ్డకు ఆహ్వానం పలికింది. జూన్ 9న తమకు బాబు పుట్టాడని దంపతులిద్దరూ ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.కాగా.. షిరీన్ మీర్జా బాలీవుడ్లో యే హై మొహబ్బతేన్ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోహోత్ ప్యార్ కర్తే హై, దై కిలో ప్రేమ్, యే హై ఆషికి, గుతుర్ గు, అన్హోనియోన్ కా అంధేరా లాంటి సీరియల్స్లో మెప్పించింది. షిరీన్ చివరిసారిగా యే హై చాహతేన్ షోలో కనిపించింది. షిరీన్ 2021లో హసన్ సర్తాజ్ను వివాహం చేసుకుంది. దాదాపు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టడంతో బుల్లితెర దంపతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza) -
'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్ ఇదే!
30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా వినిపిస్తుంటాయి. కెరీర్, జాబ్ అంటూ వివాహాలు చేసుకోకుండా చాలామంది సింగిల్స్గానే బతికేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వాళ్లయితే ఏకంగా 40 పదుల వయస్సు దాటినా సింగిల్గానే ఉంటున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, త్రిష, ప్రభాస్ లాంటి అగ్రతారలేందరో ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో 40 పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నవారిలో మరో బాలీవుడ్ భామ దివ్య దత్తా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.దివ్య పెళ్లి బంధం గురించి మాట్లాడుతూ.. “మీరు మంచి భాగస్వామి దొరికితే వివాహం చేసుకోవడం చాలా బాగుంటుంది. అదే పెళ్లి లేకపోతే జీవితం ఇంకా అందంగా సాగుతుంది. అందుకే పెళ్లి చేసుకోవడం కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మంచిది. నాపై చాలా మంది పురుషులు శ్రద్ధ పెడుతుంటారు. నేను వాటిని ఆస్వాదిస్తా అంతే. కానీ మీరు కనెక్ట్ అయితేనే రిలేషన్లో ఉండాలి. ఆ వ్యక్తి మీ చేయి పట్టుకోగలడని మీరు భావించాలి. ఒకవేళ అది జరగకపోతే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా కోసం నేను ఉన్నా.' అని మాట్లాడింది.దివ్య దత్తా ఇంకా మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కేవలం ఎవరైనా నాతో ప్రయాణించగల సహచరుడిగా ఉండటానికి ఇష్టపడతా. అది లేకపోయినా నేను ఇప్పటికీ సంతోషంగా ఉన్నా. నా ప్రాణ స్నేహితుడు నాకు ఒక కోట్ పంపాడు. 'నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నావు' కదా అని అడిగాడు. దానికి నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయానని చెప్పా. మంచి భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణం కావాలని అవసరం లేదు. గతంలో నాకు కూడా ఆ అపోహ ఉండేది." అని పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది బాలీవుడ్ భామ.ఇక సినిమాల విషయానికొస్తే దివ్య దత్తా చివరిసారిగా ఛావా చిత్రంలో కనిపించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ , అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం దివ్య అర్జున్ రాంపాల్తో కలిసి నాస్టిక్లో కనిపించనుంది. ఈ సినిమాకు శైలేష్ వర్మ దర్శకత్వం వహించారు. -
బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న కేంద్ర మాజీ మంత్రి.. మరోసారి అలరించనుందా?
సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు చాలామందే ఉన్నారు. అలా వచ్చినవారు చాలామంది పొలిటికల్గా సక్సెస్ కూడా అయ్యారు. అలాంటి వారిలో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా? బుల్లితెరపై తన అందంతో అలరించిన మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. భాజపాలో కీలకనేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలదించారు.బుల్లితెరపై రీ ఎంట్రీ?అయితే గతంలో బాలీవుడ్లో ఆమె నటించిన సూపర్ హిట్ సీరియల్ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి'. ఈ సీరియల్కు మేకర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ కోసం నటి స్మృతి ఇరానీ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. దాదాపు 150 ఎపిసోడ్లు ఉన్న ఈ షోలో ఆమె మరోసారి తులసి విరానీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా నివేదిక ప్రకారం స్మృతి ఇరానీ జూన్ 8న 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2' కోసం ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిసింది. రెండో వారం ప్రారంభంలోనే ఏక్తా కపూర్కో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం.కాగా.. ఇటీవల స్మృతి కపూర్ ఈ సీరియల్లో మిహిర్ విరానీ (మొదటి సీజన్) పాత్ర పోషించిన అమర్ ఉపాధ్యాయ్తో పాటు ఏక్తా కపూర్ పుట్టినరోజు వేడుకలో కనిపించారు. కరిష్మా తన్నా, అనితా హసానందనీ కూడా పార్టీకి హాజరయ్యారు. 'క్యుంకి సాస్ భీ కభీ బహు థి' అనే సీరియల్ హిందీ బుల్లితెర చరిత్రలో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఈ సీరియల్లో నటించిన వారి కెరీర్ కూడా మలుపు తిరిగింది. గతంలో ఈ షో 2000 నుంచి 2008 వరకు ప్రసారమైంది. ఆ తర్వాత స్మృతి ఇరానీకి ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటిగా వరుసగా ఐదు అవార్డులను గెలుచుకుంది. అంతే కాకుండా రెండు భారతీయ టెలీ అవార్డులు కూడా దక్కించుకుంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చాణక్యుడు మూవీ హీరోయిన్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.తాజాగా ఈ ఈ ముద్దుగుమ్మకు రెండోసారి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంది. ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం.. ఇప్పుడు మా ఫ్యామిలీ సంపూర్ణమైంది.. నాకు కూతురు పుట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.కాగా.. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం -2'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ సేత్ చివరిసారిగా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం -1, దృశ్యం- 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
తండ్రి బర్త్ డే.. ఆయన ఆశయం దిశగా దీపికా పదుకొణె!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె తన తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన తన తండ్రి బర్త్ డే సందర్భంగా గొప్ప కార్యక్రమం చేపట్టింది. ప్రకాశ్ పదుకొణె 70వ పుట్టినరోజు సందర్భంగా పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన తండ్రి, బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనేకు అంకితమిస్తున్నట్లు వెల్లడించింది.దీపికా తన ఇన్స్టాలో రాస్తూ.. "బ్యాడ్మింటన్ ఆడుతూ పెరిగిన వ్యక్తిగా.. ఈ క్రీడ ఒకరి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతగా మారుస్తుందో నేను ప్రత్యక్షంగా అనుభవించా. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ (PSB) ద్వారా అన్ని వర్గాల ప్రజలకు బ్యాడ్మింటన్ ఆడితే కలిగే ఆనందం, క్రమశిక్షణ అందించాలని అనుకుంటున్నా. ఆరోగ్యకరమైన క్రీడ ద్వారా ప్రేరణ పొందిన తరాన్ని నిర్మించాలని మేము ఆశిస్తున్నాం. డాడీ, మీ గురించి బాగా తెలిసిన వారికి.. ఈ క్రీడ పట్ల మీకెంత మక్కువో తెలుసు. 70 ఏళ్ల వయసులో కూడా తినడం, నిద్రపోవడం, బ్యాడ్మింటన్ ఆడడమే మీ ప్రపచం. అందుకే మీ ఇష్టాన్ని నిజం చేయడానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. బ్యాడ్మింటన్ ఫర్ ఆల్! మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా" అంటూ పోస్ట్ చేసింది. కాగా.. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఇప్పటికే పలు నగరాల్లో స్థాపించారు. దాదాపు ఇప్పటికే 75 కేంద్రాల్లో నెలకొల్పారు. కాగా.. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణె మాజీ ప్రపంచ నంబర్ వన్ మాత్రమే కాదు.. బ్యాడ్మింటన్లో ఆల్-ఇంగ్లాండ్ ఛాంపియన్గా నిలిచారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీలో మెప్పించిన దీపికా.. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రానున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
కత్రినా కైఫ్కు క్రేజీ ఛాన్స్.. ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్గా!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్కు అరుదైన ఛాన్స్ దక్కింది. ఆమె పర్యాటక అభివృద్ధికి అంబాసిడర్గా ఎంపికైంది. అయితే కత్రినాను ఎంపిక చేసింది మాత్రం మన దేశానికి కాదు. గతేడాది మనదేశంతో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన దేశానికి ఆమె గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఆ దేశం మరెదో కాదు.. మన దగ్గర్లోనే ఉన్న మాల్దీవుస్. కత్రినా కైఫ్ను మాల్దీవులకు ప్రపంచ పర్యాటక రాయబారిగా నియమించినట్లు మాల్దీవుల మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ వెల్లడించింది. భారత చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన కత్రినా కైఫ్ను మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు బాలీవుడ్ హీరోయిన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అవకాశం రావడంపై బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ స్పందించింది. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై సంతోషం వ్యక్తం చేసింది. మాల్దీవులు అందించే లగ్జరీ, అందాలను సూచించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది.గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా తన కొత్త రోల్ గురించి కత్రినా మాట్లాడుతూ.. 'మాల్దీవులు లగ్జరీ, సహజ సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. చక్కని ప్రశాంతంగా ఉండే ప్రదేశం. సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్గా ఎంపికైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నా. ఈ సహకారం ప్రపంచ పర్యాటక ప్రేక్షకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అద్భుతమైన గమ్యస్థానం, ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రపంచ స్థాయిలో పేరు పొందేలా సహాయపడటానికి ఉత్సాహంగా ఉన్నానని" తెలిపింది. అయితే ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఈ ప్రకటన రావడం విశేషం. వచ్చే నెలలో మాల్దీవుస్లో ప్రధాని పర్యటించనున్నారు. View this post on Instagram A post shared by Visit Maldives (@visitmaldives) -
ప్రముఖ రాజకీయ నాయకుడితో రిలేషన్.. సోనాలి బింద్రే క్లారిటీ!
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి తన కెరీర్లో ఎదుర్కొన్న అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. సల్మాన్ ఖాన్తో ఓ మూవీ సెట్లో ఎదురైన సంఘటనను ఇటీవలే వెల్లడించింది. ఆ సమయంలో అతనిపై విపరీతమైన కోపం వచ్చేదని తెలిపింది. అయితే తన క్యాన్సర్ చికిత్స సమయంలో అమెరికా వచ్చి తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడని కూడా చెప్పుకొచ్చింది.తాజాగా ప్రముఖ రాజకీయ నాయకుడు రాజ్ థాకరే 20 ఏళ్ల క్రితం తనను ఇష్టపడ్డారన్న రూమర్స్పై బాలీవుడ్ నటి సోనాలి బింద్రే స్పందించారు. ఈ వార్తలపై సోనాలి అసంతృప్తి వ్యక్తం చేసింది. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ఎప్పుడూ అలాంటి వార్తలను పట్టించుకోలేదని సోనాలి తెలిపింది. సోనాలి మాట్లాడుతూ.. 'నాపై ఇలాంటి ప్రచారం జరిగినట్లు నాకే తెలియదు. కొందరు సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. నిజంగా ఇది చాలా బాధాకరం. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రాజ్ థాకరే భార్య షర్మిలా, ఆమె తల్లికి మా పిన్ని మంచి స్నేహితురాలు. ఆ విధంగా ఇరు కుటుంబాల మధ్య మా చిన్నతనం నుంచే మంచి స్నేహం ఏర్పడింది. అలా ఇరు కుటుంబాల మధ్య నా చిన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ ఆ రిలేషన్ అలాగే ఉందని' తెలిపింది. కాగా.. సోనాలి బింద్రే చివరిసారిగా 'ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2'లో కనిపించింది. ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. -
క్యాన్సర్తో పోరాటం.. ఆ స్టార్ హీరో సపోర్ట్ మరిచిపోలేను: సోనాలి బింద్రే
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. ఆ సినిమాతో ఒక్కసారిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆ తర్వాత కూడా తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తాను క్యాన్సర్ చికిత్స తీసుకున్న అనుభవాలను పంచుకుంది. ఆ సమయంలో తనకు ఓ స్టార్ హీరో పూర్తి మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో తెలుసుకుందామా?2018లో సోనాలి బింద్రేకు క్యాన్సర్ రావడంతో అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుంది. ఆ సమయంలో తన చికిత్స గురించి పదే పదే ఆరా తీశారని తెలిపింది. నేను చికిత్స పొందుతున్నప్పుడు ఒకటి కాదు.. ఏకంగా రెండుసార్లు న్యూయార్క్ వచ్చాడని సోనాలి వెల్లడించింది. తనకు అత్యంత అవసరమైన సమయంలో హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచారని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తన భర్తకు ఫోన్ చేసి అక్కడ సరైన వైద్యులు ఉన్నారో లేదో తెలుసుకోవాలి.. అంతేకాదు వారితో కూడా మాట్లాడాలని సల్మాన్ అడిగారని తెలిపింది.అయితే ఇటీవల 'హమ్ సాత్ సాత్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్ తీరుపై సోనాలి విమర్శలు చేసింది. తనను కొట్టాలన్నంత కోపం వచ్చిందని తెలిపింది. 1999లో వచ్చిన హమ్ సాత్ హై సినిమా షూటింగ్లో సల్మాన్ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లమని వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే సోనాలి బింద్రే 'ది బ్రోకెన్ న్యూస్' రెండో సీజన్లో కనిపించింది. -
బీ గ్రేడ్ చిత్రాలతో కెరీర్ నాశనం.. పెద్ద సినిమాలు చేజార్చుకున్నా!
దీప్శిఖ నగ్పాల్ (Deepshikha Nagpal).. కోయిల, బాద్షా, దిల్లగీ, పార్ట్నర్ వంటి బాలీవుడ్ (Bollywood) హిట్ సినిమాల్లో నటించింది. హిందీ బిగ్బాస్ 8వ సీజన్లోనూ పాల్గొంది. బుల్లితెరపైనా పలు సీరియల్స్లో తళుక్కుమని మెరిసింది. అయితే కొన్ని చెత్త సినిమాలను సెలక్ట్ చేసుకోవడం వల్ల అవకాశాలు తగ్గడంతో బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చిందంటోంది.తప్పుడు నిర్ణయాలతో కెరీర్ తలకిందులుఇన్స్టంట్ బాలీవుడ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్శిఖ మాట్లాడుతూ.. నేను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కెరీర్ను దెబ్బకొట్టాయి. అప్పట్లో ఎలా ఉండేదంటే.. యశ్ రాజ్, సుభాష్ వంటివారు నిర్మించేవి మాత్రమే ఏ గ్రేడ్ సినిమాలుగా పరిగణించేవారు. కొత్త నిర్మాణ సంస్థ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుందంటే అది బీ గ్రేడ్ సినిమాలకిందే లెక్కేసేవారు. నాకు ఏవి సెలక్ట్ చేసుకోవాలనేది అర్థం కాలేదు.ఏదైనా పనే అనుకున్నా..పైగా నా ఫ్యామిలీలో ఎవరికీ సినీరంగంతో పరిచయమే లేదు. కానీ సినీరంగంలో మనకు సలహాలిచ్చే వ్యక్తి ఉంటే బాగుంటుందని నాకిప్పుడనిపిస్తుంది. సినిమాల ఎంపికలో చాలా తప్పులు చేశాను. మా తాతయ్య ఏమనేవారంటే.. ఏ పనీ చిన్నది, పెద్దది అని వ్యత్యాసం చూపించకూడదనేవారు. ఏదైనా పనే అనేవారు. దాన్ని నేను సీరియస్గా తీసుకున్నాను. అందుకనే నాకు ఏ అవకాశం వచ్చినా ముందూవెనకా ఆలోచించకుండా చేసుకుంటూ పోయాను. ఈ క్రమంలో ఎన్నో చెత్త సినిమాలు చేశా.. అవి ఇప్పటికీ రిలీజ్ కాకుండా ఆగిపోయాయి.(చదవండి: అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి)ఆ పోస్టర్ దెబ్బ కొట్టిందికొన్ని విడుదలయ్యాయి.. కానీ, అవి నా కెరీర్ను దెబ్బకొట్టాయి. ఉదాహరణకు ట్రేడ్ గైడ్ అనే సినిమా చేసినప్పుడు ఓ పోస్టర్ వదిలారు. అప్పటికే నేను చాలా పెద్ద సినిమాలకు సంతకం చేశాను. కానీ ఆ పోస్టర్ చూశాక నేను బీ గ్రేడ్ సినిమాలు చేస్తున్నానని పక్కన పెట్టేశారు. నాకు విషయం అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ సినిమాల గురించి మర్చిపోదాం అని కోరినా కూడా వాళ్లు వినలేదు. నిన్ను తీసుకుంటే మేము నష్టపోవాల్సి వస్తుంది అని రిజెక్ట్ చేశారు. చెత్త సినిమాలు చేసినందున జనాలు నన్ను నమ్మడం మానేశారు.ఆ కోపంతో బుల్లితెరకు షిఫ్ట్పెద్ద సినిమాల్లో పని చేసే అర్హత లేదని భావించారు. నాకు పట్టరానంత కోపం వచ్చింది. అందుకే బుల్లితెరపై ఫోకస్ పెట్టాను. ఇక్కడ సీరియల్స్, షోలు చేయడం స్టార్ట్ చేశాను. శాశ్వతంగా కనుమరుగైపోకుండా నటిగా నిలబడ్డాను అని చెప్పుకొచ్చింది. దీప్శిక.. సన్ పరి, రామాయణ్, కరిష్మా- ద మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ, బల్వీర్, మధుబాలా- ఏక్ ఇష్క్ ఏక్ జునూన్, సంతోషి మా వంటి పలు సీరియల్స్లో నెగెటివ్ పాత్రలు చేసింది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి -
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం.. మా ఇద్దరి కెరీర్ ముగిసింది: రియా చక్రవర్తి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తీవ్ర విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బాలీవుడ్ను కుదిపేసింది. అతని మరణం తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెను పోలీసులు సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆమెతో తమ్ముడైన షోయిక్ చక్రవర్తిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో వారిద్దరి జీవితం అనేక మలుపులు తిరిగింది.తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన రియా చక్రవర్తి..సుశాంత్ మరణం తర్వాత తాను, తన తమ్ముడు అనుభవించిన బాధను పంచుకుంది. సుశాంత్ మృతి తర్వాత మాపై ఆరోపణలు రావడంతో మా ఇద్దరి కెరీర్ ఒక్కసారిగా తలకిందులైందని వెల్లడించింది. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయని తెలిపింది.రియా మాట్లాడుతూ.. "సుశాంత్ మరణం తర్వాత మేము ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణం. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయి. నాకు నటనాపరంగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అంతేకాకుండా నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96 పర్సంటైల్ పొందాడు. కానీ అదే సమయంలో నాతో పాటు అతను అరెస్టు అయ్యాడు. జైలు నుంచి నా తమ్ముడు తిరిగి వచ్చాక మొదటి త్రైమాసిక పరీక్షలు మిస్సయ్యాడు. దీంతో అతని ఎంబీఏ కెరీర్ భవిష్యత్తును కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఏదైనా కార్పొరేట్లో ఉద్యోగం పొందడం చాలా కష్టమైంది. ఎందుకంటే నా తమ్ముడిని నియమించుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. కొద్దిరోజులు మా జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాలేదు. ఆ తర్వాత ఛాప్టర్-2 డ్రిప్ అనే దుస్తుల బ్రాండ్ను ప్రారంభించాలనే ఆలోచన తనకు, షోయిక్కు వచ్చిందని.. దాన్నే కెరీర్గా ఎంచుకున్నామని " అని తాము ఎదుర్కొన్న బాధలను వివరించింది.అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్కాస్ట్ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి
కుంకుమ్ భాగ్య సీరియల్ ఫేమ్ పూజా బెనర్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తాను రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పలు సీరియల్స్తో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామకు ఇప్పటికే సనా అనే మూడేళ్ల కూతురు ఉన్నారు. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను అందరితో పంచుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడు నలుగురు కుటుంబ సభ్యులం అయ్యామంటూ శనివారం తన జీవితంలోకి మరో బిడ్డకు ఆహ్వానం పలికింది బాలీవుడ్ బ్యూటీ.అనేక టీవీ సీరియల్స్తో తన నటనకు పేరుగాంచిన పూజా బెనర్జీ ప్రముఖ స్విమ్మర్, ఒలింపియన్ సందీప్ సెజ్వాల్ను వివాహం చేసుకుంది. పూజ ఈ రోజు ఉదయం మగబిడ్డను ప్రసవించింది.. మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని ఆమె భర్త సందీప్ తెలిపారు. కాగా.. కొత్త ఏడాది ప్రారంభంలో తాను గర్భం ధరించినట్లు అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత తన బేబీ బంప్ ఫోటోషూట్ను షేర్ చేసింది.పూజా బెనర్జీ బాలీవుడ్లో చంద్ర నందిని, దిల్ హి తో హై, కసౌతి జిందగీ కే 2, కుంకుమ్ భాగ్య, బడే అచ్చే లగ్తే హై 2 లాంటి ప్రముఖ సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా పూజా కొన్ని వెబ్ సిరీసుల్లో కూడా భాగమైంది. కెహ్నే కో హమ్సఫర్ హై అనే షోలో నటనతో పూజా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చివరిసారిగా 2023లో వచ్చిన బడే అచ్చే లగ్తే హై -2 సీరియల్లో కనిపించింది. ఆ తర్వాత పూజ నటనకు దూరంగా ఉంది. తాజాగా ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వడంతో నటనకు కొద్ది రోజులు విరామం తీసుకోనుంది. -
మొత్తానికి శ్రీవారు ప్రపోజ్ చేశారు, సీక్రెట్ చెప్పిన ‘ప్రేమపావురం’ (ఫొటోలు)
-
వ్యాపారవేత్తతో నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్వైట్ షేర్వానీషాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్తో తన బ్రైడల్ లుక్ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.హౌస్ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్గా సంగీత్తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.(ఇది చదవండి: ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!)ఇక షాజన్ సినీ కెరీర్ విషయానికొస్తే హౌస్ఫుల్-2 చిత్రంతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది. -
బాయ్ఫ్రెండ్ బర్త్ డే వేడుకల్లో జాన్వీకపూర్ సిస్టర్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ తన ప్రియుడి బర్త్ డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. బాలీవుడ్ నటుడు వేదాంగ్ రైనాతో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ జూన్ 2న అతని పుట్టినరోజును కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలను వీరి స్నేహితురాలు కరీమా బారీ ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ బర్త్ డే పార్టీలో అనురాగ్ కశ్యప్ కుమార్తె, యూట్యూబర్ ఆలియా కశ్యప్ కూడా పాల్గొన్నారు.కాగా.. వేదాంగ్ రైనా రెండేళ్ల క్రితం ది ఆర్చీస్ (2023)తో హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన జిగ్రా (2024) మూవీలో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె తమ్ముడిగా ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వేదాంగ్ రైనా తన రాబోయే చిత్రంలో అనన్య పాండేతో స్క్రీన్ను పంచుకోనున్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ డైరెక్టర్ మేనకోడలు!
హీరామండి వెబ్ సిరీస్తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలైన షెర్మిన్ హీరామండిలో కీలక పాత్రలో మెప్పించింది. అంతకుముందు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నటనలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. హీరామండి వెబ్ సిరీస్తో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించలేదు. షెర్మిన్కు బాబు పుట్టాడని జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. మే 28న ఆమె తల్లిగా ప్రమోషన్ పొందారని వెల్లడంచారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. షెర్మిన్ 2023 నవంబర్లో అమన్ మెహతాను పెళ్లాడారు. వీరిద్దరి వివాహం ఇటలీలో గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత అహ్మదాబాద్లో ఉంటున్న షర్మిన్ సెగల్ ఇటీవలే ముంబయికి షిఫ్ట్ అయింది.ఇక సినిమా విషయానికొస్తే షర్మిన్ చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో కనిపించింది. ఈ సిరీస్లో అలం జేబ్ పాత్రను అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె ఆమె నటనకు తీవ్రంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. హీరామండిలో షర్మిన్ తన గ్లామర్తో గుర్తింపు దక్కించుకుంది.కాగా.. సినీ ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ హెడ్గా పనిచేశారు. తల్లి బేలా సెగల్ పాపులర్ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్ లాంటి ఎన్నో చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు. View this post on Instagram A post shared by Vickey Lalwani (@iamvickeylalwani) -
రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ సింగర్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ జాంకీ పరేఖ్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెర నటుడు నకుల్ మెహతాను పెళ్లాడిన ముద్దుగుమ్మ రెండోసారి గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా.. ఈ జంటకు ఇప్పటికే ఓ కుమారుడు జన్మించారు. మా రెండో బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పోస్ట్ చేశారు.ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు అభినందనలు చెబుతున్నారు. దియా మీర్జా, అదితి శర్మతో పాటు పలువురు సినీతారలు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేశారు. కాగా.. 13 ఏళ్ల క్రిత జాంకీ పరేఖ్.. నకుల్ మెహతాను పెళ్లాడింది.బుల్లితెర నటుడైన నకుల్ మెహతా 'ఇష్క్బాజ్', 'బడే అచ్చే లగ్తే హై 2' వంటి ప్రముఖ టీవీ షోలతో ఫేమస్ అయ్యారు. ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బుల్లితెర నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నకుల్ మెహతా నటించారు. View this post on Instagram A post shared by Nakuul Mehta (@nakuulmehta) -
భారీగా బరువు పెరిగా.. 33 ఏళ్ల వయసులోనే ఆంటీ పాత్రలు వచ్చాయి : బాలీవుడ్ నటి
సినిమా తారలకు ఫిట్నెస్ చాలా అవసరం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సివస్తోంది. కొంచెం బొద్దుగా కనిపించినా సరే.. వాళ్లను దూరం పెట్టేస్తుంటారు. అందుకే హీరోయిన్లు తమ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. బరువుని కంట్రోల్ చేసేందుకు డైటింగ్తో పాటు డేటింగ్ కూడా చేస్తుంటారు. అయినప్పటికీ వారి శరీరంపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి కుషా కపిల(Kusha Kapila) శరీరంపై కూడా నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఉన్నపళంగా బరువు తగ్గడంపై రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై స్వయంగా కుషానే వివరణ ఇచ్చింది. తన బాడీ గురించి ఇతరులతో మాట్లాడాల్సిన అవరసం లేదని..తనకు నచ్చినట్లుగా తాను ఉంటానని చెబుతూనే ఎందుకు బరువు తగ్గాల్సి వచ్చింది వివరించింది.బరువు తగ్గడం నాకేమి కొత్తకాదు. స్కూల్ డేస్లో ఉన్నప్పుడే నేను బరువు పెరిగాను. దీంతో మా అమ్మ నన్ను జిమ్లో జాయిన్ చేయించడంతో మళ్లీ మాములు స్థితికి వచ్చాను. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో మళ్లీ నా బరువు విపరీతంగా పెరిగింది. ఎందుకు అలా జరిగిందో తెలియదు. నా బాడీని పట్టించుకోకుండా నా కామెడీపైనే ఎక్కువ ఫోకస్ చేశాను. లెక్చర్లు కూడా నా చదువుని పట్టించుకోకుండా నా కామెడీని ఎంజాయ్ చేసేవాళ్లు. 22 ఏళ్ల వయసులో నేను చాలా బరువు పెరిగాను. దీంతో నా ఫ్రెండ్స్ ఫోటోలు షేర్ చేసి ‘ఇలా మారిపోయావేంటి?’ అని అడిగారు. వారి మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. నా బాడీపై ఫోకస్ పెట్టాను. ఆరు నెలల్లో విపరీతంగా తగ్గిపోయాను. రోజుకు 800 క్యాలరీస్ కంటే తక్కువ ఆహారాన్ని తీసుకున్నాను. ఆ సమయంలో నా శరీరంలో భారీగా మార్పులు జరిగాయి. చాలా సన్నబడిపోయాను. 12 రోజుల పాటు జ్వరం వచ్చింది. కొన్నాళ్ల పాటు అన్నం కూడా తినలేదు. ఆస్పత్రికి వెళితే.. టీబీ అటాక్ అయిందని చెప్పారు. తక్కువ తినడం కారణంగానే టీబీ వచ్చిందని చెప్పారు. ఇమ్యునిటీ పవర్ పూర్తిగా తగ్గిపోయింది.టీబీ కారణంగా బరువు తగ్గినా.. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అంతలా నా మైండ్ మారిపోయింది. కానీ నేను 30 ఏళ్లకు వచ్చేసరికి.. పనిపై ఫోకస్ పెట్టి శరీరాన్ని పట్టించుకోవడం వదిలేశాను. డైట్ ఫాలో కాలేదు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రం తీసుకున్నాను. ముంబైకి వెళ్లిన తర్వాత బరువు పెరగడం, తగ్గడం స్టార్ట్ అయింది. అయినా కూడా నేను నా పనిపైనే ఫోకస్ పెట్టాను. వైద్యులను సంప్రదిస్తే.. నీ లైఫ్స్టైల్ని పూర్తిగా మార్చుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి నేను మళ్లీ నా బాడీపై ఫోకస్ చేశాను.డైట్ ఫాలో అయ్యాను. 33 ఏళ్ల వయసులో నేను కాస్త లావుగానే ఉన్నాను. దీంతో 45-50 ఏళ్ల ఆంటీ పాత్రలే ఎక్కువ వచ్చాయి. అప్పట్లో ఆ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా చేశానో ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు బరువు తగ్గడానికి కారణం కూడా సినిమా చాన్స్ల కోసమే. జిమ్ చేస్తూ డైట్ ఫాలో అవుతున్నాను. నా బాడీపై ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నాను. నా శరీరంతో నేను ఏదైనా చేస్తా. ఏం చేస్తున్నానని ఇతరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అని కుషా కపిల చెప్పుకొచ్చింది.కుషా కపిల కెరీర్ విషయానికొస్తే.. కామెడీ కంటెంట్తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ నటించారు. అనంతరం 2017లో కుషా కపిల.. జోరావర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారామె. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2023లో విడిపోయారు. -
Miss World 2025: ఆరడుగుల బ్యూటీ.. బెడ్రూమ్లో భర్త చేతిలో నరకం
అందాల సుందరి కిరీటం గెలుచుకోవడం గొప్ప గౌరవం. అంతకు మించి గొప్ప అవకాశాలకు మార్గం. అందులోనూ ప్రపంచ సుందరి కిరీటం అంటే... అంతకు మించి.. అయితే మిస్ వరల్డ్ కిరీటం దక్కగానే అన్నీ దక్కేసినట్టే అనేది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం అనేది నిజం. అడ్డంకులెన్నో అధిగమించి.. అందాల రాణి అనే అంతర్జాతీయ కిరీటం అందుకున్నా... అత్తింట్లో అష్టకష్టాలు పడే సాదా సీదా అమ్మాయిలు కూడా ఉంటారు. అలాంటి మహిళే యక్తా ముఖి.ఆమె 1999లో మిస్ వరల్డ్గా భారతదేశానికి గౌరవం తీసుకువచ్చిన యుక్త ముఖి(Yukta Mukhi)... 5.11 అంటే షుమారు 6 అడుగుల హైట్తో కిరీటం దక్కించుకుందే కానీ అందలాలు అందుకోవడంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఆ ఒక్క గెలుపు తప్ప ఆ తర్వాత ఏ రకమైన సంతృప్తినిచ్చే గమ్యాన్నీ ఆమె చేరుకోలేకపోయింది.మిస్ వరల్డ్గా టైటిల్ సాధించిన తర్వాత, ఎన్నో ఆశలతో, తన ముందున్న ఐశ్వర్య రాయ్ వంటివారి విజయాల స్ఫూర్తితో యుక్త ముఖీ వెండితెరపై అడుగుపెట్టింది. తొలిగా 2001లో పూవెల్లమ్ ఉన్ వాసమ్ అనే తమిళ చిత్రంలో ‘యుక్తాముఖి’ అనే పాటలో కనిపించే అతిధి పాత్రతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం 2002లో అఫ్తాబ్ శివ్దాసాని పక్కన ’ప్యాసా’ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసినా.. ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మార్కెట్ అనే సినిమా షూటింగ్లో ఉండగా, గాయం వల్ల ఆ సినిమా నుంచి వైదొలగింది. అనంతరం కబ్ క్యోం కహా, హమ్ తీనోం..సినిమాలకు సంతకం చేసినా, అవి క్లాప్ కొట్టకుండానే అటకెక్కాయి. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా అలాగే జరిగాయి. తర్వాత ’కట్పుత్లీ’, ’లవ్ ఇన్ జపాన్’, ’మెమ్సాహబ్’ వంటి చిత్రాల్లో నటించినా, అవి కూడా విజయవంతం కాలేదు. దాదాపు 9 ఏళ్ల తర్వాత 2019లో ’గుడ్ న్యూస్’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మాత్రమే ఆమె కనిపించింది. విచిత్రంగా వ్యక్తిగత జీవితం కూడా ఆమెకి విషాదాన్నే మిగిల్చింది. న్యూయార్క్కు చెందిన వ్యాపారవేత్త ప్రిన్స్ తులిని 2008లో యుక్త ముఖీ, వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అయితే, కొన్నేళ్ల పాటు భర్త చేతిలో అసహజ లైంగిక వాంఛలతో, చిత్రహింసలకు గురైన యుక్తా ముఖి 2013లో భర్త , అత్తింటి వారిపై సదరు సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసు పెట్టింది. చివరికి 2014లో ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. సినీ రంగం నుంచి దూరమైన తర్వాత, ప్రస్తుతం 48 ఏళ్ల వయసులో యుక్త ముఖీ సామాజిక సేవలో నిమగ్నమైంది. ఎయిడ్స్ బాధితులు, థలసీమియా, బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల కోసం పనిచేస్తోంది. అలాగే అవయవదానాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. మురికివాడల్లోని బాలికలకు ఆరోగ్యం, శారీరక అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటోంది. -
'సినీ ఇండస్ట్రీలో మహిళలను అలానే చూస్తారు'.. మాజీ మిస్ వరల్డ్ పోస్ట్ వైరల్!
మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మనదేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరుతుగున్న వేళ.. ఏ రంగంలోనైనా మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కేవలం గ్లామర్ వస్తువుగానే చూస్తున్నారని మానుషి చిల్లర్ అభిప్రాయపడింది. తాజాగా ట్విటర్ వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది.మానుషి తన ట్వీట్లో రాస్తూ.. 'స్త్రీల పట్ల ద్వేషపూరిత మనస్తత్వం ఉన్నవారు.. స్త్రీ సాధించిన విజయం కంటే ఆమె వెనుక పురుషుడి ఉన్నాడని ఆపాదించడం సులభంగా భావిస్తారు. వాస్తవ ప్రపంచంలో ఎటువంటి ప్రభావం చూపని ఇలాంటి తెలివితక్కువ వ్యాఖ్యలను పట్టించుకోవడం నేను ఎప్పుడో మానేశా. కానీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే మహిళలను అగౌరవంగా చూడడం.. నేను నిరంతరం గమనిస్తూనే ఉన్నా. లింగ భేదం లేకుండా మనమందరం సమాన విలువ, సాధికారత, విద్యావంతులైన వాతావరణంలో పెరిగాం. కానీ పురుషులు విజయం సాధిస్తే కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులని పొగుడుతారు. అదే మహిళలు సాధిస్తే అవకాశవాదులని ముద్రవేస్తారు. ఇలాంటి అనుభవాన్ని నేను కూడా ఎదుర్కొన్నా. ఒక స్త్రీ గురించి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు చెడుగా మాట్లాడడం అంత సులభమా? లేదా ఏళ్లుగా పాతుకుపోయిన పక్షపాతమా' అని ప్రశ్నించింది. ముఖ్యంగా మహిళల విజయాన్ని పురుషులకు అపాదించడాన్ని మానుషి చిల్లర్ విమర్శిస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే మానుషి చిల్లర్.. అక్షయ్ కుమార్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'సామ్రాట్ పృథ్వీరాజ్'తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. విక్కీ కౌశల్ సరసన'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ'లో నటించింది. టాలీవుడ్లో వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలెంటైన్'లో ఎయిర్ ఫోర్స్ పైలట్గా కనిపించింది. మానుషి చివరిసారిగా 'బడే మియాన్ చోటే మియాన్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ మాజీ మిస్ వరల్డ్ జాన్ అబ్రహం థ్రిల్లర్ మూవీ'టెహ్రాన్'లో కనిపించనుంది. ఈ బాలీవుడ్ భామ 017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.A misogynistic mindset finds it easier to attribute a woman’s success to a man’s patronage than her own merit.I’ve always really ignored silly comments which have no consequence in the real world, but I constantly see working women, specially in the entertainment industry being…— Manushi Chhillar (@ManushiChhillar) May 31, 2025 -
కెమెరా ముందు అలా చేయమన్నారు..నటి షాకింగ్ కామెంట్స్
సినిమా సన్నివేశాల్లో సహజత్వం కోసం దర్శకులు పడే తాపత్రయంలో అద్భుతమైన కళాదృష్టి ఉంటే ఉండొచ్చు గాక..ఒక్కోసారి అది నటీనటులకు ప్రాణ సంకటంగా మారొచ్చు. ఎంత సహజత్వం కోసం తాపత్రయపడే ప్రేక్షకులైనా కొన్ని నిజజీవితంలో చేసే పనులు తెరమీద నేరుగా చూపిస్తే జుగుప్సాకరంగా ఫీల్ అవకుండా ఉండలేరు. అలాంటి వాటిలో వాష్ రూమ్ సన్నివేశాలు ముందు వరుసలో ఉంటాయి. అయితే అచ్చంగా అలాంటి ఒక సన్నివేశాన్ని చిత్రీకరించిన దర్శకుడు సహజత్వం కోసం సదరు నటిని చేయమన్న పని ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.హిందీలో షైతాన్ గా రీమేక్ చేయబడిన గుజరాతీ హర్రర్ చిత్రం వాష్(Vash) లో నటించిన నటి జాంకి బోడివాలా(Janki Bodiwala) ఆ సినిమా లో సనిన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా తాను ఎదుర్కున్న అనుభవాలను నుంచి ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఫిల్మ్ఫేర్తో జరిగిన రౌండ్టేబుల్ చర్చలో, ఆమె మాట్లాడుతూ వాష్ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో తాను మూత్ర విసర్జన చేసే సీన్ ఉందన్నారు. అయితే ఆ సీన్ను రీమేక్ చేస్తున్న సమయంలో సహజత్వం కోసం దర్శకుడు కృష్ణదేవ్ యాగ్నిక్ నిజంగా మీరు మూత్ర విసర్జన చేయగలరా అని తనను అడిగినట్లు ఆమె వెల్లడించింది. సినిమాలో ఆ మూత్ర విసర్జన సన్నివేశం చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుందనీ కాబట్టి, ఆ సీన్లో నిజంగా ఆ పని చేయగలరా? అని దర్శకుడు అడిగినట్టు ఆమె తెలిపింది. అయితే ఆ మాటకి ముందు షాక్ తిన్నా... ఆ తర్వాత తాను చాలా ఉద్విగ్నంగా ఫీల్ అయ్యానని ఆమె చెప్పింది. ఓహ్! నటుడిగా, నాకు తెరపై చేసే అవకాశం లభిస్తోంది. ఎవరూ చేయనిది.’’అంటూ సంతోషపడ్డానని వివరించింది.అయితే, వారు సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సిద్ధమైన తర్వాత తనకి దర్శకుడు కోరుకున్న విధంగా చేయడం అసాధ్యం అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సన్నివేశం తనను నటిగా ఉత్సాహపరిచింది కాబట్టి తాను చేయడానికి అంగీకరించానని వెల్లడించింది. ‘‘కానీ తరువాత, అది జరగలేదు మరియు దీనికి చాలా రీటేక్లు తీసుకున్నాం. ఇది సెట్లో ఆచరణాత్మకంగా సాధ్యం కాదని నాకు అర్ధమైంది. కాబట్టి మేము దానిని చేయడానికి వేరే మార్గాన్ని కనుగొన్నాం’’ అంటూ ఆమె తెలిపింది. నిజ జీవితంలో తాను చేయలేని పనులు చేయగలిగినందుకు సంతోషంగా ఉన్నానని ఆ సన్నివేశం చేసినందుకు తను ఎలాంటి బాధ లేదని స్పష్టం చేసింది.కనోడియా, నీలమ్ పాంచల్ హితేన్ కుమార్ నటించిన వాష్ చిత్రాన్ని హిందీలో అజయ్ దేవ్గన్, జ్యోతిక ఆర్ మాధవన్లతో షైతాన్గా రీమేక్ చేశారు. ఒక రహస్యమైన అపరిచితుడు ఒక యువతిపై నియంత్రణ సాధించడం ద్వారా వారి ఇంట్లోని కుటుంబంపై ఎలా ప్రవర్తించాడు? అనే హారర్ కథ ఇది. రెండు భాషా చిత్రాలలోనూ నటించిన జానకి అపరిచితుడి ఉచ్చులో పడే కుమార్తెగా ఆకట్టుకుంటుంది. -
పంజాబ్ ఓటమి.. పాపం.. చాహల్ గర్ల్ఫ్రెండ్ రియాక్షన్ చూశారా?
ఇటీవల ఆర్జే మహ్వశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నుంచే ఆమె పేరు తెగ వైరలవుతోంది. ఎందుకంటే టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో ఆమె కనిపించడమే ప్రధాన కారణం. దుబాయ్లో వీరిద్దరు జంటగా మెరవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆర్జే మహ్వశ్పైనే పడింది. ఇంతకీ చాహల్తో ఉన్న ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీశారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారేమో అంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్లకు హాజరు కావడంతో డేటింగ్ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురువారం ఐపీఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్కు కూడా హాజరైంది. మొదటి నుంచి ఈ సీజన్లో చాహల్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆర్జే మహ్వశ్ మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో తుది జట్టులో చాహల్ లేకపోయినప్పటికీ ఆమె స్టేడియంలో సందడి చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలవ్వడంచో ఆర్జే మహ్వశ్ తీవ్ర నిరాశకు గురైంది. ఆనందంగా మ్యాచ్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఆమెకు పంజాబ్ ఓడిపోవడంతో అప్సెట్ అయినట్లు కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. యుజ్వేంద్ర చాహల్ వేలు గాయం కారణంగా పంజాబ్ చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.ఆర్జే మహ్వశ్- చాహల్ డేటింగ్ రూమర్స్..యుజ్వేంద్ర చాహల్ తన భార్య కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నుంచి మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాహల్ -ఆర్జే మహ్వశ్ జంటగా కనిపించడంతో డేటింగ్ వార్తలొచ్చాయి. అయితే ఆర్జే మహవాష్ తాము కేవలం స్నేహితులమని స్పష్టం చేసింది. చాహల్ తన భార్యతో విడాకుల తర్వాత ఆర్జే మహ్వశ్తో అనేక సందర్భాల్లో జంటగా కనిపించారు. आज #RCBvsPBKS मैच का दो फोटो सबसे ज्यादा सुर्खियों में है।First Virat Kohli and Anushka Sharma Second Shubhankar mishra and Rj mahvashRCB INTO THE FINALS Congratulations RCB#IPLPlayoffs #Qualifier1 pic.twitter.com/T1agohOxUG— Chandan Yadav (@ChandankryadavN) May 29, 2025 -
సౌత్ డైరెక్టర్తో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం.. రివీల్ చేసిన రానా నాయుడు నటి!
సినీ ఇండస్ట్రీలో క్యౌస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో ఛాన్సుల పేరుతో చాలామందికి ఇలాంటి అనుభవం ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. సినీ ఇండస్ట్రీతో పాటు చాలా చోట్ల క్యాస్టింగ్ కౌచ్ అనే తరచుగా వింటుంటాం. అలా తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెబుతోంది బాలీవుడ్ భామ సుర్వీన్ చావ్లా. తన కెరీర్లో కాస్టింగ్ కౌచ్ ఎదురైన చేదు అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. చావ్లా తన వివాహం తర్వాత కూడా జరిగిన కొన్ని చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నారు.ఓ దర్శకుడి కార్యాలయంలో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని సుర్వీన్ చావ్లా. ఒకసారి అతని ఆఫీస్ క్యాబిన్లో మీటింగ్ తర్వాత నేను వెళ్తుండగా.. సెండాఫ్ చెప్పేందుకు డోర్ వద్దకు వచ్చాడని తెలిపింది. నాకు వీడ్కోలు చెప్పడానికి తలుపు దగ్గరకు వచ్చి.. తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని ఆ చేదు అనుభవాన్ని వెల్లడించింది. నేను వెంటనే అతన్ని వెనక్కి నెట్టివేశానని తెలిపింది. అతని ప్రవర్తనతో షాక్కు గురయ్యానని.. అసలేం ఏం చేస్తున్నారంటూ గట్టిగా అరచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వివరించింది. అతను నా వ్యక్తిగత జీవితం గురించి.. అలాగే నా భర్త ఏం చేస్తున్నారని అడిగాడని గుర్తు చేసుకుంది. ఇలాంటి అనుభవం తనకు చాలాసార్లు ఎదురైందని పంచుకుంది. మరోసారి సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్తో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని సుర్వీన్ చావ్లా వెల్లడించింది. దక్షిణాదికి చెందిన ఓ దర్శకుడు షూటింగ్ సమయంలో తనతో పడుకోవాలని అడిగాడని వివరించింది. అతనికి హిందీ బాష రాకపోవడంతో ఓ మధ్యవర్తి ద్వారా చెప్పించాడని తెలిపింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదామె. అంతకుముందు ఇంటర్వ్యూలో ఆడిషన్ల సమయంలో తన బాడీ షేమింగ్కు గురైనట్లు సుర్వీన్ చావ్లా పంచుకుంది. పరిశ్రమలోని మహిళలను తక్కువగా చూస్తారని.. దాని కారణంగా మహిళలు తమను తాము తక్కువగా భావిస్తారని అన్నారు. కెరీర్లో ఎన్ని అడ్డంకులు ఎదురైన చావ్లా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆమె ఇటీవలే 'క్రిమినల్ జస్టిస్ సీజన్ 4' వెబ్ సిరీస్లో కనిపించింది. అంతకుముందు నెట్ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడులోనూ నటించింది. ప్రస్తుతం ఆమె 'రానా నాయుడు సీజన్ 2'లోనూ కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్లో రానా దగ్గుబాటి సరసన మెప్పించనుంది. -
రెండేళ్ల క్రితమే బ్రేకప్.. మరో నటుడితో యంగ్ హీరోయిన్ డేటింగ్!
సినీ ఇండస్ట్రీలో బ్రేకప్, డేటింగ్ అనే పదాలు చాలా కామన్. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమలో అయితే ఇవీ కాస్తా ఎక్కువగానే వినిపిస్తుంటాయి. తాజాగా మరో బాలీవుడ్ భామ డేటింగ్కు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ తారా సుతారియా మరో నటుడితో డేటింగ్ ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. అడార్ జైన్తో బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ మరో బాయ్ఫ్రెండ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ నటుడు వీర్ పహరియాతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు కొన్ని నెలల క్రితం డేటింగ్ ప్రారంభించారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇటీవల కొద్ది కాలంగా ఈ జంట పలుసార్లు ఈవెంట్లకు హాజరైనట్లు తెలుస్తోంది. లక్మే ఫ్యాషన్ వీక్తో పాటు ఎ సమ్మర్ ఆఫ్ స్టైల్ అనే ఈవెంట్లో జంటగా కనిపించారు. (ఇది చదవండి: కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!)కాగా.. మరోవైపు వీర్ పహారియా గతంలో సారా అలీ ఖాన్తో డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరు జంటగా స్కైఫోర్స్ అనే మూవీలో నటించారు. అయితే తమపై డేటింగ్ వార్తలపై ఎవరూ కూడా స్పందించలేదు. కాగా.. తారా సుతారియా అంతకుముందు ఆడార్ జైన్తో రిలేషన్లో ఉంది. అయితే 2023లో వారు విడిపోయిన తర్వాత.. అడార్ జైన్ తన స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నారు.గతంలో డేటింగ్పై వీర్ పహారియా మాట్లాడుతూ.. 'నా రిలేషన్స్ గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. నాకు కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ వార్తలు వింటున్నా. అప్పుడు నేను పబ్లిక్ ఫిగర్ కాదు. అందుకే ఎవరూ నన్ను అడగలేదు. సోషల్ మీడియాలో ఏది ఉన్నా అది ప్రజలకు నిజమనిపిస్తుంది. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. కానీ నేను ఏం చేయగలను? అలాంటి వాటిని పట్టించుకోవటం మానేశాను.' అని అన్నారు. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!
బాలీవుడ్ భామ కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం మా(Maa Movie). ఈ సినిమాకు విశాల్ రేవంతి ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై అజయ్ దేవగన్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఈ మూవీ హారర్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో దెయ్యం సీన్స్ ఆడియన్స్కు వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నయి. ట్రైలర్ ఆద్యంతం ఆడియన్స్లో అత్యంత ఉత్కంఠ పెంచేలా ఉంది. దెయ్యం బారిన పడిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన యుద్ధమే ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో తనూజ దేవ్గణ్, రోనిత్రాయ్, సుభద్ర సేన్గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. -
వయస్సు తేడా ఉన్నప్పటికీ: యంగ్ హీరో
బాలీవుడ్ యువనటుడు ఇషాన్ ఖట్టర్ ప్రస్తుతం హోమ్బౌండ్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే 78వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్కు జాన్వీ కపూర్, నిర్మాత కరణ్ జోహార్, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇషాన్.. టబుతో నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమెతో ఇంటిమేట్ సీన్స్ చేయండపై మాట్లాడారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నప్పటికీ ఆమెతో అలాంటి సీన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదని అన్నారు.ఇషాన్ మాట్లాడుతూ.. " నిజాయితీగా చెప్పాలంటే టబు లాంటి నటితో దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది మీకు వింతగా అనిపించవచ్చు.. ఆమెతో ఇంటిమేట్ సీన్ చేయడానికి నేను భయపడలేదు. నిజానికి నేను చాలా సేఫ్గా భావించా. ఎందుకంటే నేను ఏమి చేస్తున్నానో అర్థం చేసుకోవడమే కాకుండా.. దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లగలిగే నటితో నేను నటించా. అదే టబులో ఉన్న గొప్పదనం. మనం ఒక సన్నివేశంలో ఏమి చేస్తున్నామో దాని గురించి ఎప్పుడూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమెతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఆమె సెట్లో చిన్నపిల్లాడిలా ఉంటుంది. జోక్స్ వేస్తూ అందరినీ నవిస్తుంది " అని అన్నారు.కాగా.. ఇషాన్ ఖట్టర్ గతంలో 'ఎ సూటిబుల్ బాయ్' అనే వెబ్ సిరీస్లో టబుతో కలిసి నటించారు. 1993లో విక్రమ్ సేథ్ రాసిన అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్లో టబు నటించింది. సీనియర్ హీరోయిన్ టబుతో ఇషాన్ ఖట్టర్ ఇంటిమేట్ సీన్స్ను తెరకెక్కించారు. మరోవైపు ఇషాన్ చివరిసారిగా 'ది రాయల్స్'లో కనిపించాడు. ఇది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో భూమి పెడ్నేకర్, నోరా ఫతేహి, డినో మోరియా, మిలింద్ సోమన్, ల్యూక్ కెంట్ కీలక పాత్రల్లో నటించారు. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్ అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఇద్దరం ఉన్న మేము ఇప్పుడు ముగ్గురం అయ్యామంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. బాలీవుడ్లో 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. మాల్వికా రాజ్ రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది మాల్వికా రాజ్. కొన్ని డేటింగ్ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. బీచ్లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలో పలువురు సినీతారలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
కరోనా బారిన బాలీవుడ్ నటి ఫ్యామిలీ, ఎమోషనల్ పోస్ట్
కరోనా మహమ్మారి మరోసారి దేశంలో విస్తరిస్తోంది. తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 250 కి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక మరణం సంభవించింది. గత 24 గంటల్లో, మహారాష్ట్రలో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఇది రెండవ అత్యధికం. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మహిళలకు కోవిడ్ సోకినట్ట నిర్ధారణ అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ఆందోళన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మహారాష్ట్ర ఈ సంవత్సరం రెండు COVID-సంబంధిత మరణాలను కూడా నివేదించింది బాలీవుడ్ నటి, బిగ్ బాస్ 18 పోటీదారు శిల్పా శిరోద్కర్ తనకు సోకిందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నటి కోవిడ్ బారిన పడినట్టు జాతీయమీడియా నివేదించింది. కబీర్ సింగ్, ది జ్యువెల్ థీఫ్ మూవీల్లో నటించిన నికితా దత్తాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమెతో పాటు, ఆమె కుటుంబంలో తల్లి ఇద్దరూ వైరస్ బారిన పడ్డారని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆహ్వానం లేని అతిథి (COVID-19) తన ఇంటి తలుపు తట్టిందంటూ దత్తా తెలిపింది. స్వల్ప లక్షణాలతో, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపింది. ఇది తొందరగా తగ్గిపోతుందని ఆశిస్తున్నానీ, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గతంలో కూడా నికిత కోవిడ్ బారిన పడి కోలుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. -
Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఐశ్వర్యరాయ్
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సందడి చేసింది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వైట్ శారీలో మెరిసింది. నుదుటన సింధూరం ధరించిన కేన్స్ ఫెస్టివల్లో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇటీవల పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్కు భారత ప్రభుత్వం సింధూర్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకగానే ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సింధూరం పెట్టుకుని కనిపించింది. గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు కేన్స్ వేదికగా తన లుక్తో మద్దతుగా నిలిచారు ఐశ్వర్య. ఈ సందర్భాన్ని చాటిచెప్పేలా ఐశ్వర్య సిందూరం పెట్టుకుని బలమైన సందేశం ఇచ్చారని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరుగుతోంది. ఈ సారి వేడుకల్లో చీరకట్టులో మెరిసిన ఐశ్వర్యరాయ్ ఆమె నటించిన దేవదాస్ సినిమాను గుర్తుకు తెచ్చారు. 2002లో తొలిసారి ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్కు చీరకట్టులో హాజరయ్యారు. సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ చిత్రం కోసం ఈ వేడుకల్లో చీరలో కనిపించారు. కొత్త లుక్ను చూసిన తర్వాత అభిమానులు దేవదాస్ చిత్రంలోని పార్వతిని గుర్తు చేసుకుంటున్నారు.ఎందుకంటే ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ కనిపించినా ఫ్యాషన్ దుస్తుల్లోనే మెరిశారు. సినీ వేడుకల్లో ఐశ్వర్య లుక్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ ఏడాది ఆమె లుక్ మాత్రం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ ష్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆె చీరను డిజైన్ చేశారు. ఆమె ధరించిన నెక్లెస్ను 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపులు, వజ్రాలతో తయారు చేశారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్ (ఫొటోలు )
-
కాన్స్లో బాలీవుడ్ నటి రుచి : ప్రధాని మోదీ ఫోటో నెక్లెస్పై చర్చ
78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Canne Film Festival 2025) వేడుక వైభవంగా జరుగుతోంది. ఫ్యాషన్ స్టైల్స్, గ్రామ్ లెన్స్, రెడ్ కార్పెట్ మెరుపులతో సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. అత్యంతప్రతిష్టాత్మక కాన్స్రెడ్ కార్పెట్పై ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటున్నారు. నటులు, మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా అందరూ ఫ్యాషన్ గేమ్ను నెక్ట్స్ లెవల్ అనిపించుకుంటన్నారు. తాజాగా బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar) లుక్ నెట్టింట వైరల్గా మారింది. ప్యారిస్లో జరుగుతోన్నకాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రుచి ధరించిన మూడు మోదీ ఫోటోలతో ఉన్న నెక్లెస్ ఇప్పుడు వైరల్గా మారింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో ఉన్న నెక్లెస్తోపాటు, అందమైన లెహెంగాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దీనికితోడు రుచి అందమైన లెహంగాతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ఔరా అనిపించుకుంది. సాంప్రదాయ గాజులు, భారీ మాంగ్-టీకా, దానికి సరిపోయే చెవిపోగులతో, ఆమె తన లుక్ను అందంగా తీర్చిదిద్దుకుంది. లేత గోధుమ రంగు లెహంగాకు నక్సీ వర్క్ ఉన్న డీప్-ప్లంగింగ్ బ్లౌజ్, స్కర్ట్ను జత చేసింది. హర్యాన్వి బంధానీ దుప్పట్టా ఆకర్షణీయంగా నిలిచింది. స్కర్ట్ అంతా అద్దాలను పొందుపరిచారు. బంధానీ దుప్పట్టాను జరిబారికి చెందిన రామ్ రూపొందించారని, దీని ద్వారా రాజస్థాన్ ఆత్మను కప్పుకున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించింది. View this post on Instagram A post shared by Ruchi Gujjar (@ruchigujjarofficial)స్టేట్మెంట్ నెక్లెస్, హైలైట్కాన్స్లో రుచి గుజ్జర్ లుక్ చర్చకు దారితీసింది. పీఎం మోదీ ముఖంతో డిజైన్ చేసిన డబుల్ లేయర్డ్, నెక్లెస్ ధరించి తళుకున్న మెరిసింది. ఒకటి మినీ-పెర్ల్స్తో తయారు చేసిన చోకర్ కాగా, మరొకటి స్టేట్మెంట్ పీస్. స్పెషల్ నెక్లెస్పై మూడు కమలాల మోటిఫ్లో మోదీ ఫోటోను జతచేసి ఉండటం హైలైట్. తన నెక్లెస్ గురించి మాట్లాడుతూ..ఇది ప్రత్యేకమైందీ, ప్రతీకాత్మకమైనదని చెప్పింది రుచి. ఇది కేవలం నెక్లెస్ కాదు, భారతదేశం బలానికి ఉన్నతికి చిహ్నం. ప్రపంచ వేదికపై దేశం బలాన్ని, పటిష్టతను ఇది చాటి చెప్పుతుందని తెలిపింది. భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ప్రధాని మోదీని గౌరవార్ధం దీన్ని ధరించినట్టు చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. రుచి గుజ్జర్ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కొందరు ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. ఒక యూజర్ మాత్రం "యే క్యా బక్వాస్ హై" అని కామెంట్ చేశారు. మరొక యూజర్ "మీ తలపై హర్యాన్వి దుపట్టా" అని కామెంట్ చేశారు. మూడవ వినియోగదారుడు, "అన్నీ ఆర్గానిక్గా బాగున్నాయి కానీ మోదీజీ ఫోటో ఎందుకు?" అంటూ నిట్టూర్చాడు. -
23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్ హీరోయిన్స్ (ఫోటోలు)
-
చికెన్ లెగ్స్.. అగ్గిపుల్ల అని బాడీ షేమింగ్ చేశారు : హీరోయిన్
సినిమా తారలు కూడా మనషులే. వాళ్లకి మనసు ఉంటుంది. వాళ్లపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేస్తే ఆ మనసు బాధపడుతుంది. కానీ కొంతమంది మాత్రం ఇవేవి పట్టించుకోకుండా.. హీరోయిన్లపై ఇష్ట వచ్చినట్లుగా కామెంట్ చేస్తుంటారు. ముఖ్యంగా వాళ్ల శరీర సౌష్ఠవంపై రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇవన్ని తట్టుకొని నిలబడితేనే మనం మన కెరీర్లో విజయం సాధిస్తాం అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Panday). 2019లో విడుదలైన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రం ద్వారా వెండితెర ఏంట్రీ ఇచ్చిన ఈ భామ..తొలి చిత్రంతోనే తనదైన నటనతో ఆకట్టుకుంది. రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, గెహ్రైయాన్, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహాన్, బాడ్ న్యూజ్, ఖేల్ ఖేల్ మే, సీటీఆర్ఎల్ చిత్రాలలో స్టార్ హీరోయిన్గా మారింది. అయితే తన కెరీర్ తొలినాళ్లలో చాలా మంది హీరోయిన్లలానే తాను కూడా బాడీ షేమింగ్కు గురయ్యాయని చెబుతోంది అనన్య.తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను 18-19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉన్నాను. దీంతో చాలా మంది నా శరీరంపై కామెంట్స్ చేశారు. కోడీ కాళ్లు.. అగ్గిపుల్లలా ఉన్నావంటూ నా బాడీపై విమర్శలు చేసేవారు. నీ శరీరం సరైన ఆకారంలో లేదనే కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు నా శరీరం సహజంగానే మారుతుంటే.. ‘ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది’ అంటున్నారు. మనం(మహిళలు) ఏ విధంగా ఉన్నా ఈ విమర్శలు తప్పవు. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసూకుంటూ పోతేనే విజయం సాధిస్తాం’అని అనన్య చెప్పుకొచ్చింది. -
కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!
లాపతా లేడీస్ సినిమాతో లైమ్లైట్లోకి వచ్చిన యంగ్హీరోయిన్ నితాన్షి గోయల్ (Nitanshi Goel). ఈ మూవీలో తనదైన నటనతో అటు విమర్శకులు, ఇటు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటైన లాపతా లేడీస్లోని ఫూల్ పాత్రతో అభిమానులను కట్టిపడేసింది. ఇన్స్టాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న అతి పిన్న వయస్కురాలైన నటి కూడా నితాన్షి కావడం విశేషం.ఇపుడు మరో విశేషం ఏమిటంటే... నితాన్షి 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరంగేట్రం చేసింది. అరంగేట్రం చేయడం మాత్రమే కాదు కాన్స్లో తన లుక్స్తో వావ్ అనిపించింది. 17 ఏళ్ల యువతార బ్లాక్ అండ్ గోల్డ్ గౌన్తో తళుక్కున మెరిసి అభిమానులను ఫిదా చేసింది. ఆమె లుక్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆమె డిజైనర్ దుస్తులు, స్టైల్, సీనియర్ నటీమణులకు ఆమె ఇచ్చిన గౌరవం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. అందరి దృష్టి నితాన్షి గోయల్ జుట్టుపైనే ఉంది, ఆమె రేఖ-మధుబాలతోపాటు, శ్రీదేవికి లాంటి స్టార్లను తన జడలో చుట్టేసుకుంది.నితాన్షి లుక్లో ప్రధాన ఆకర్షణ, ముత్యాల జడలో కేన్స్ 2025లో తన ముత్యాల జుట్టుతో 8 మంది బాలీవుడ్ నటీమణులకు నివాళి అర్పించింది. నితాన్షి గోయెల్ అలనాటి బాలీవుడ్ అందాల తారలు మధుబాల, నర్గీస్, మీనా కుమారి, నూతన్, వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, వైజయంతిమాల, హేమ మాలిని, రేఖ , శ్రీదేవి వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణుల సూక్ష్మ ఫోటో ఫ్రేమ్లున్న (miniature photo frames) కస్టమ్-మేడ్ హెయిర్ యాక్సెసరీతో అదరగొట్టేసింది. హిందీ సినిమా ప్రపంచంలో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటీమణులపై తన ప్రేమను చాటుకున్న వైనం పలువుర్ని ఆకట్టుకుంది. కాన్స్ 2025కి ఈ డ్రెస్ వేసుకోవాలని నిర్ణయించుకోవడానికి తనకు 10-15 నిమిషాలు పట్టిందని చెప్పింది.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?ముత్యాల చీర,పూసలు, ముత్యాలు, సీక్విన్లతో తయారు చేసిన ప్రీ-డ్రేప్డ్ చీరలో అందంగా ముస్తామైంది. దానిపై మల్టీ లేయర్ల , 3D వర్క్ , ఇంకా దీనికి భారీ పల్లూ కూడా ఉంది. ఈ చీరకు ముత్యాలు పొదిగిన స్ట్రాపీ బ్లౌజ్ను జత చేసింది. తన ఫ్యాషన్ ఐకాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని చెప్పిన నితాన్షి, కాన్స్లో ఉన్నప్పుడు అలియా భట్ ధీటుగా ఉండాలని కోరుకున్నానని వెల్లడించింది. నితాన్షి లుక్ డిస్నీడాల్గా చాలా ముద్దుగా ఉంది.నితాన్షి రికార్డులాపతా లేడీస్ చిత్రంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్. లోరల్ పారిస్కు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆమె గురువారం కాన్స్ రెడ్ కార్పెట్లోకి అడుగుపెట్టింది, ఈఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ నటిగా నిలిచింది. ఇదీ చదవండి: మాయమైపోతున్న మనిషి కోసం..శాలిని -
బాలీవుడ్ బ్యూటీ ఆశలపై నీళ్లు.. కేన్స్ ఫెస్టివల్ ఛాన్స్ మిస్!
బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు ఉర్ఫీ జావెద్. వింత వింత దస్తులు ధరించి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతలా ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీకి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మన జీవితంలో ఇలాంటి వాటికి కుంగి పోవాల్సిన అవసరం లేదని తెలిపింది. మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే షేర్ చేయండి అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి.ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. అందులో భాగంగానే వీసాకు కూడా దరఖాస్తు చేసింది. కానీ ఊహించని విధంగా ఉర్ఫీ జావెద్ వీసాను అధికారులు తిరస్కరించారు. ఈ విషయం తెలుసుకున్న బ్యూటీ తాను, తన టీమ్ చాలా నిరాశకు గురయ్యామని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. నా లైఫ్తో వ్యాపారంలోనూ ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఉర్ఫీ తెలిపింది. ఇలాంటి వాటితో బాధపడకుండా మరింత స్ట్రాంగ్గా ముందడుగు వేయాలని చెబుతోంది. మీలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే షేర్ చేసుకుని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని అంటోంది.(ఇది చదవండి: కాపీ కొట్టావ్.. చిలుక బ్యాగ్, ఊర్వశీ రౌతేలా లుక్పై ట్రోలింగ్!)ఉర్ఫీ తన పోస్ట్లో రాస్తూ..'నాకు కేన్స్కు వెళ్లే అవకాశం వచ్చింది. కానీ విధిరాతతో నా వీసా తిరస్కరణకు గురైంది. కొన్ని డిఫరెంట్ దుస్తులను ప్రదర్శించాలని ఆలోచించాం. వీసా రిజెక్ట్ కావడంతో నేను, నా బృందం చాలా నిరుత్సాహపడ్డాము. మీలో చాలా మంది తిరస్కరణలను స్వయంగా ఎదుర్కొని ఉంటారు. అలాంటి వారి స్టోరీలను కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. తిరస్కరణల తర్వాత దాని గురించి నిరాశ చెందడం, ఏడవడం సాధారణం. నిజానికి మనకు ఆరోగ్యకరమైంది కూడా. నేను కూడా ఏడుస్తాను.. కానీ తర్వాత ఏం జరుగుతుంది? మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి తిరస్కరణ మనకు ఒక అవకాశం. జీవితంలో చాలా రిజెక్షన్స్ తర్వాత కూడా నేను ఎక్కడా ఆగిపోలేదు. మీరు కూడా అలాగే ఉండండి' అంటూ మోటివేషనల్ పోస్ట్ చేసింది. కాగా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 24 వరకు జరగనుంది. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
'మీ త్యాగం మరువలేనిది'.. ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ భామ ఆలియా భట్ మన సైన్యం సేవలను గుర్తు చేసుకుంది. మదర్స్ డే సందర్భంగా దేశానికి సేవ చేస్తున్న సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించింది. తమ హీరోలను దేశానికి అందించి.. ప్రతి క్షణ నిశ్శబ్దంగా తమ బిడ్డకోసం కలవరపడుతూనే ఉంటారని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సైనికులు, వారి మాతృమూర్తుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మాతృ దినోత్సవం సందర్భంగా సైనికుల తల్లులను తలచుకుని భావోద్వేగానికి గురైంది.ఆలియా భట్ తన నోట్లో రాస్తూ.. "గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఎక్కడా చూసినా నిశ్శబ్దమే వినిపించింది. గత కొన్ని రోజులుగా మేము ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దం, ఆందోళన చుట్టూ మోగుతున్న ఉద్రిక్తత.. ఎక్కడో, పర్వతాలలో మన సైనికులు మేల్కొని అప్రమత్తంగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారనే బాధను మేము అనుభవించాం. ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా జరుపుకున్నాం. అందుకే ఈ రోజు మన దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. అంతులేని త్యాగం, ప్రతి సైనికుడి యూనిఫామ్ వెనక నిద్ర లేని రాత్రులు గడిపే ఆ వీరుడి తల్లి ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రి కూడా ప్రశాంతంగా ఉండదని ఆ అమ్మకు తెలుసు. ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలవ్వొచ్చు. కానీ సైనికుల తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోంది. కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులకు మన ప్రేమను పంపండి. మీ బాధను పంటి బిగువున నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉంటాం. మీ కోసం మేమంతా కలిసి నిలబడతాము. మన రక్షకుల కోసం.. భారతదేశం కోసం.. జై హింద్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా సైతం పాకిస్తాన్పై దాడులు చేసింది. దాదాపు వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ సిందూర్కు ప్రముఖులు సైతం తమ మద్దతును ప్రకటించారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
మెట్ గాలాలో మెరిసిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. బేబీ బంప్తో ఎంట్రీ!
ప్రతిష్టాత్మక ఈవెంట్లో గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ మెరిసింది. న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్లో జరిగిన మెట్గాలాలో బాలీవుడ్ సినీ తారలంత సందడి చేశారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. తన బేబీ బంప్తో వేదికపై ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తులను కియారా ధరించి ఈవెంట్లో మెరిసింది.కాగా..'సూపర్ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్తో మెట్ గాలా- 2025 ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బేబీ బంప్తో మెట్ గాలా కార్పెట్పై ఎంట్రీ ఇచ్చిన మొదటి భారతీయ నటిగా నిలిచింది. ఈ సందర్భంగా నా జీవితంలో ఒక నటిగా, కాబోయే తల్లిగా మెట్ గాలా అరంగేట్రం చేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందని కియారా పేర్కొంది. నా స్టైలిస్ట్ లుక్ను డిజైన్ చేయడానికి గౌరవ్ సృష్టించిన డ్రెస్ కోడ్ చాలా అందంగా ఉందని తెలిపింది.సినిమాల విషయానికొస్తే కియారా అద్వానీ చివరిసారిగా రామ్ చరణ్ సరసన కనిపించింది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో సక్సెస్ కాలేకపోయింది. కాగా.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ కొత్త ఏడాదిలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కియారా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. -
నా వయసు 12 ఏళ్లు.. బస్సులో భయానక సంఘటన: బుల్లితెర నటి
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి గౌతమి కపూర్ బీ టౌన్లో పరిచయం చేయాల్సిన పనిలేదు. సీరియల్స్తో పాటు పలు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. గౌతమి చివరిసారిగా కొరియన్ డ్రామా రీమేక్ అయినా గ్యారహ్.. గ్యారహ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో కనిపించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్లతో పాటు సినిమాలతో బిజీగా ఉన్న గౌతమి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన చిన్నతనంలో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది.ముంబయిలో పాఠశాల ఇంటికి వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తాను ఆరో తరగతిలో ఉండగా ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా తన ప్యాంట్ లోపలికి చేయి పెట్టాడని ఆ భయానక అనుభవాన్ని పంచుకుంది. అప్పుడు నా వయసు 12 ఏళ్లు కావడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపింది. ఆ తర్వాత భయంతో వెంటనే బస్సుదిగి వెళ్లిపోయానని గౌతమి కపూర్ ఆ చేదు సంఘటనను వివరించింది. ఆ వ్యక్తి నన్ను అనుసరిస్తున్నాడా అని నేను ఆలోచిస్తూనే ఉన్నానని వెల్లడించింది. ఈ విషయాన్ని అమ్మతో చెప్పడానికి భయపడ్డానని గౌతమి చెప్పింది.ఈ సంఘటన జరిగినప్పుడు తాను తన స్కూల్ యూనిఫాంలోనే ఉన్నానని గౌతమి పంచుకుంది. ఇంటికి వచ్చి నా తల్లికి జరిగిందంతా వివరించానని తెలిపింది. వెంటనే 'నీకు పిచ్చి పట్టిందా? నువ్వు వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి కాలర్ పట్టుకుని ఉండాల్సిందని.. ఎప్పుడూ భయపడవద్దని అమ్మ నాకు ధైర్యం చెప్పిందని తెలిపింది. ఎవరైనా అలా చేస్తే.. వారి చేతిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరవండి.. భయపడకుండా పెప్పర్ స్ప్రే వారి ముఖంపై కొట్టండి అని సలహా ఇస్తోంది బాలీవుడ్ భామ. -
'పెళ్లి చేసుకుంటానని వాడుకున్నాడు'.. అజాజ్ ఖాన్పై నటి తీవ్ర ఆరోపణలు!
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. అతను హోస్ట్గా వ్యవహరిస్తోన్న హౌస్ అరెస్ట్ అనే షోలో విపరీతమైన, అసభ్యకరమైన కంటెంట్తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోను ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ బ్యాన్ చేసింది. ఈ అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తోన్న అజాజ్ ఖాన్పై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వివాదంలో నడుస్తుండగానే అజాజ్ ఖాన్పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అజాజ్ ఖాన్పై చార్కోప్ పీఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.అజాజ్ ఖాన్ తన ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో తనకు ఓ పాత్ర ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేశాడని నటి ఆరోపించింది. మార్చి 25న తన నివాసంలోనే నాపై అత్యాచారం చేశాడని.. రెండు సార్లు తనను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని చార్కోప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాకు నాలుగు వివాహాలకు అనుమతి ఉందని తనకు చెప్పాడని నటి ప్రస్తావించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసిన చార్కోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో మహిళలను అసభ్యకరంగా చూపించినందుకు అజాజ్ ఖాన్పై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
బాలీవుడ్ స్టార్లు... ఇష్టమైన టూర్లు... ఎందుకు ఇష్టమంటే..!
బాలీవుడ్ సెలబ్రిటీల జీవితాలు మనలో చాలా మందికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనకు స్ఫూర్తినిచ్చేది ఆకర్షణీయమైన జీవనశైలి మాత్రమే కాదు, వారి ప్రయాణ గమ్యస్థానాల ఎంపిక కూడా. మరీ ముఖ్యంగా అందరం సమ్మర్ సీజన్ సందర్భంగా ఇలా టూర్ల వేటలో పడినప్పుడు...స్టార్లు ఎంచుకునే ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం అంటే మన అభిరుచులను కలుసుకోవడం కూడా. కలలు కనే బీచ్ అయినా లేదా సందడిగా ఉండే నగరమైనా, బిజీ షెడ్యూల్ నుండి తప్పించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగిన ప్రదేశాలను కనుగొనే నైపుణ్యాన్ని లేదా వారి ఉత్తమమైన కలిగి ఉంటారు.– నేహా ధూపియా, జైపూర్ పాత–ప్రపంచ ఆకర్షణ ఆధునిక సౌకర్యాల కలయికను ఇష్టడుతుంది. కరీనా కపూర్ ఖాన్ తరచుగా నూతన సంవత్సర కాలంలో కుటుంబ సెలవుల కోసం స్విట్జర్లాండ్ను, ముఖ్యంగా గ్సా్టడ్ను సందర్శిస్తుంది.–షాహిద్ కపూర్ మీరా రాజ్పుత్ కపూర్: గ్రీస్, స్పెయిన్ స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ గమ్యస్థానాలను తమ పిల్లలతో సేదతీరుతుంటారు.–కర్ణాటకలోని కూర్గ్ను తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా బోమన్ ఇరానీ చెబుతారు.–సోను సూద్: షాపింగ్ కుటుంబ సందర్శనల కోసం వాషింగ్టన్, డి.సి.ని ఇష్టపడతాడు. –పారిస్కు తరచుగా వచ్చే సందర్శకురాలు ఫరా ఖాన్ కళ, చరిత్ర ఫ్యాషన్ మిశ్రమాన్ని :ఇష్టపడుతుంది.– తన కుటుంబంతో కలిసి దుబాయ్లో న్యూ ఇయర్కి నయనతార స్వాగతం పలికింది. –శ్రీలంకలో ప్రశాంతమైన బీచ్ స్నాప్షాట్లను దియా మీర్జా ఆస్వాదిస్తుంది. –బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా సందర్శించే గమ్యస్థానాలలో లండన్ ఒకటిగా నిలిచింది. సోనమ్ కపూర్, రియా కపూర్, సారా టెండూల్కర్ పరిణీతి చోప్రా వంటి తారలకు ఈ నగరం ఒక రొటీన్ ఎంపిక. ఐకానిక్ హైడ్ పార్క్ మీదుగా షికారు చేయడం నుంచి నగరంలోని ట్రెండీ రెస్టారెంట్లు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ను అన్వేషించడం వరకు లండన్ సరదాలను సాహసాలను వారు తరచుగా అభిమానులతో పంచుకుంటారు.–పారిస్ అనేది బాలీవుడ్ సెలబ్రిటీలు వదల్లేని మరొక హాట్స్పాట్. ఈ ’సిటీ ఆఫ్ లైట్స్’ దిల్జిత్ దోసాంజ్, మలైకా అరోరా వంటి తారలను తరచు రారమ్మంటుంది. ఫ్రెంచ్ వంటకాలను ఆస్వాదించడం నుంచి రిటైల్ థెరపీలో పాల్గొనడం వరకు భిన్న రకాలుగా స్టార్లు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు.–బాలీవుడ్ సెలబ్రిటీల ఎంపికలో మాల్దీవులు సైతం అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. ప్రశాంతమైన బీచ్లు, అందమైన వాతావరణం అద్భుతమైన సూర్యాస్తమయాలతో, తమ బిజీ జీవితాల నుంచి తప్పించుకోవాలనుకునే తారలకు ఇది తరచుగా విహారయాత్రగా మారుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, నేహా ధూపియా పరిణీతి చోప్రా ఇలా ఈ ద్వీప స్వర్గంలో కనిపించిన ప్రముఖులు ఎందరో.–న్యూయార్క్ నగరం కూడా సెలబ్రిటీలకు తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మారింది. మీరా కపూర్, కరిష్మా కపూర్, ప్రియాంక చోప్రా అమీర్ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా న్యూయార్క్పై తమ ఇష్టాన్ని ప్రదర్శించారు, . సెంట్రల్ పార్క్ , టైమ్స్ స్క్వేర్ వంటి ఐకానిక్ ల్యాండ్మార్క్ల స్నాప్షాట్లను పంచుకున్నారు.–స్వదేశానికి దగ్గరగా ఉండాలి అలాగే రిలాక్స్డ్గా ఉండాలి అనుకునే స్టార్స్ను గోవా ఆకర్షించడం కొనసాగుతూనే ఉంది. భూమి పెడ్నేకర్, సారా అలీ ఖాన్ శిల్పా శెట్టి అక్కడి ప్రశాంతమైన బీచ్లను ఆస్వాదిస్తుంటారు. . గోవా లో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకునే ఫోటోలు ఆ ప్రదేశం పట్ల వారి అభిమానాన్ని మనకు చూపిస్తాయి.–స్టార్ క్రికెటర్ను పెళ్లాడిన బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ... ఇష్టమైన గమ్యస్థానాలలో కరేబియన్ దీవులను పేర్కొంటారు. ఈ దీవులపై వారు పంచుకునే సోషల్ మీడియా పోస్ట్లు వారి ఇష్టాన్ని మనకు పట్టిస్తాయి. =తన బైక్పై రోడ్ ట్రిప్లకు వెళ్లడాన్ని ఇష్టపడే అమిత్ సాద్ ఇటీవల ముంబై నుంచి లేహ్–లడఖ్కు 5,288 కి.మీ. ప్రయాణించి నెలరోజుల పర్యటన చేపట్టారు. ‘‘రోడ్డులోని ప్రతి మలుపు వ్యక్తిగత పరివర్తనకు అవకాశం. తెలియని వాటిని తెలుసుకోవడం’’ అంటారాయన.–హిమాలయ శ్రేణి పట్ల సారా అలీఖాన్ ప్రేమ అంతులేనిది. కొన్ని నెలల క్రితం, ఆమె కాశ్మీర్కు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేసింది. ఓ ఇంటర్వ్యూలో, సారా‘‘నాకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా ఇష్టం. అలాఏ కాశ్మీర్ అంటే కూడా చాలా ఇష్టమని షేర్ చేసింది. మసాయి మారాలో అలియా భట్కు ప్రపోజ్ చేశాడు. రణ్బీర్ కపూర్ అప్పటి నుంచి ఈ జంటకు కెన్యా నేషనల్ రిజర్వ్ ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారింది. -
మూడేళ్లుగా డేటింగ్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సింగర్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ప్రకృతి కకర్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అయిన వినయ్ ఆనంద్తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. నా జీవితంలో ఏ విషయమైనా సరే జరిగే వరకు సీక్రెట్గానే ఉంచుతానని సింగర్ ప్రకృతి చెప్పుకొచ్చింది.వచ్చే ఏడాదిలో తామిద్దరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామని ప్రకృతి కాకర్ వెల్లడించింది. తన కాబోయే భర్త ఇండస్ట్రీకి చెందినవారు కాదు.. అందువల్ల ప్రశాంతమైన జీవితాన్నే ఇష్టపడతాడని తెలిపింది. ఇదంతా రాత్రికి రాత్రే జరిగిన విషయం కాదని.. అతనితో మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నానని పేర్కొంది. తమ రిలేషన్ను పెళ్లి బంధంగా మార్చుకుంటున్నట్లు సింగర్ వివరించింది.తన ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. "మేము ఒక కుటుంబ వివాహానికి హాజరు కావడానికి లండన్ వెళ్లాం. అక్కడే వినయ్ అద్భుతంగా ప్లాన్ చేసిన వేడుకలో నాకు ప్రపోజ్ చేశారు. మా బంధువుల వివాహంలో అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. అదే సమయంలో వినయ్ తనకు ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని నా సిస్టర్స్తో పాటు అందరూ రహస్యంగా ఉంచారు. నాకు ఇప్పుడు కృతజ్ఞత తప్ప మరేలాంటి అనుభూతి చెందడం లేదు.. ఎందుకంటే నేను ఎప్పుడూ కలలు కనే విషయం.. చాలా అద్భుతంగా జరిగింది,' అని తెలిపింది. -
ప్రముఖ బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. వీడియో షేర్ చేసిన బ్యూటీ!
ప్రముఖ బుల్లితెర నటి షీనా బజాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్త, నటుడు రోహిత్ పురోహిత్తో కలిసి ఈ శుభవార్తను షేర్ చేసింది. ఈ మేరకు ఇన్స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఇలాంటి సమయంలో మీ అందరి ప్రార్థన, ఆశీస్సులు కావాలి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు ఈ బుల్లితెర భామకు విషెస్ చెబుతున్నారు.కాగా.. బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ అనే సీరియల్తో షీనా బజాజ్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్తో పాటు ఒకట్రెండు సినిమాల్లోనూ నటించింది. 2019లో రోహిత్ పురోహిత్ను షీనా బజాజ్ పెళ్లాడింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో జైపూర్లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. ఆమె భర్త రోహిత్ ప్రస్తుతం యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్లో నటిస్తున్నారు. మరోవైపు షీనా బజాజ్ చివరిసారిగా వంశజ్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. View this post on Instagram A post shared by sheena (@imsheenabajaj) -
బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ నాగిని సీరియల్తో సౌత్లో ఫేమస్ అయింది. బాలీవుడ్లో పలు సూపర్ హిట్ సీరియల్స్లో నటించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ది భూత్నీ అనే హారర్ మూవీలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మౌనీ రాయ్.. ఎక్కడికెళ్లినా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మపై ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. గ్లామర్ కోసం చాలాసార్లు సర్జరీ చేయించుకుందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆమె కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని.. దాన్ని కవర్ చేసేందుకు తన హెయిర్స్టైల్ను మార్చుకుందని నెటిజన్స్ విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్పై బాలీవుడ్ భామ స్పందించింది. ఇలాంటి వారిని చూసినప్పుడు తనకు జాలేస్తుందని చెప్పుకొచ్చింది.మౌనీ రాయ్ మాట్లాడుతూ.. 'నేను అలాంటి వ్యాఖ్యలను చదివినప్పుడు.. కొన్నిసార్లు ఏఐ వీడియోలను చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపిస్తుంది. మీరు ఇతరులను అలా చూడటం ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ముఖాన్ని ఇతరుల శరీర ఆకృతిపకి జత చేసి వక్రీకరించడం చూస్తే అది చాలా అసహ్యంగా అనిపించింది. ఈ రకమైన వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు? దీంతో ఏమి సాధించాలనుకుంటున్నారు? వారి లక్ష్యం ఏమిటి? ఎందుకంటే మీరు చేస్తున్న దానితో ఎవరికీ ఉపయోగం లేదు. అలా చేస్తున్న వ్యక్తుల మంచిని ఎవరూ కోరుకోరు' అని తెలిపింది."మొదట సోషల్ మీడయాలోకి వచ్చినప్పుడు నా పట్ల చాలామందిలో ద్వేషం కలిగింది. అలాంటి వారి ప్రొఫైల్స్ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ సమయంలో నాకు చాలా జాలిగా అనిపిస్తుంది. అలాంటి వారితి సరైన బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు లైక్ల కోసం ఏమైనా చేస్తారు. ఇతరుల గురించి చెత్తగా రాస్తూ ప్రచారం చేస్తారు. కానీ నా అభిమానుల నుంచి లభించే ప్రేమను ఎప్పటికీ తిరస్కరించలేను' అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. -
రాజకీయాల్లో ఎంట్రీపై హీరోయిన్కు ప్రశ్న.. నెటిజన్కు క్షమాపణలు చెప్పిన బ్యూటీ!
బాలీవుడ్ భామ ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ యజమానిగా ఉన్న ప్రీతి బాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా మూవీలో మెప్పించింది. ప్రస్తుతం లాహోర్1947 అనే మూవీతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ప్రీతి జింటా తాజాగా ఎక్స్తో అభిమానులతో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరు బీజేపీలో చేరుతున్నారా? అంటూ ప్రీతి జింటాను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆమె కాస్తా ఘాటుగానే స్పందించారు. దీంతో ప్రీతిపై పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతనికి క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ప్రీతి జింటా ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసుకుందాం.ప్రీతి జింటా మాట్లాడుతూ.. 'నా సమాధానం మీకు కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. సోషల్ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను దేవాలయాలకు, కుంభమేళాలకు వెళ్తే భాజపాలో చేరతానని కాదు. విదేశాల్లో ఉన్న సమయంలో దేశం విలువ ఏంటో నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నా. విదేశాల్లో నివసించినా కూడా నా పిల్లలు సగం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నా. అంతేకాదు మా పిల్లలను హిందువులుగానే పెంచుతున్నా. దురదృష్టవశాత్తూ నాపై విమర్శలు వస్తున్నాయి. నేను ఎవరో.. నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి బోధిస్తున్నందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. అయితే ఇంత ఈ చిన్న ప్రశ్నకు ఇంతలా స్పందించాలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రీతి జింటాను విమర్శిస్తున్నారు. I’m sorry if I sounded abrupt ! I have PTSD from this question. Appreciate your clarification 🙏After becoming a mom & living in a foreign country I wanna make sure my kids don’t forgot they are half Indian. Since my husband is agnostic we are bringing up our kids as Hindus.… https://t.co/ce0pHFKj8H— Preity G Zinta (@realpreityzinta) April 28, 2025 -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి.. వీడియో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ విషయాన్ని తన భర్తతో కలిసి ఓ వీడియో ద్వారా పంచుకుంది. తల్లిదండ్రులుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా.. ఈ బుల్లితెర భామ యే హై మొహబ్బతీన్ బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్లో నటించింది.తాజాగా షేర్ చేసిన వీడియోలో బేబీ బంప్తో కనిపించింది. కాగా.. ఆమె హసన్ సర్తాజ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. 2021లో ఆమె స్వస్థలమైన జైపూర్లో వివాహం చేసుకుంది. షిరీన్ మీర్జా ప్రెగ్నెన్సీ ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శ్రేయోభిలాషులు, సన్నిహితులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. బాలీవుడ్లో యే హై చాహతీన్, బహుత్ ప్యార్ కర్తే హై, యే కహా ఆగయా హమ్, ధర్మక్షేత్ర్ లాంటి సీరియల్స్లో నటించింది. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza) -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటి.. ధర ఎంతంటే?
సెక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కుబ్రా సైత్. ఇటీవలే విడుదలైన షాహిద్ కపూర్ మూవీ దేవాలో కీలక పాత్రలో కనిపించింది. పూజా హేగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాలో కుబ్రా ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ల్లో నటించింది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రముఖ కార్ల బ్రాండ్ అయిన మహీంద్రా ఈవీని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఈవీ కారు ధర దాదాపు రూ.31 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై తాను పెట్రోల్ బంకుల్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది కుబ్రా సైత్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బాలీవుడ్ భామకు అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) -
ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం.. ప్రపంచస్థాయి అవార్డ్కు ఎంపిక
బాలీవుడ్ హీరోయిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న తొలి చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషించనుంది. ఇటీవలే ఒడిశాలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది.అయితే తాజాగా ప్రియాంక చోప్రాకు అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్గార్డ్ హానర్ అవార్డ్కు ఎంపికైంది. ఈ బాలీవుడ్ స్టార్తో పాటు హాలీవుడ్ రాపర్ మేగాన్ థీ స్టాలియన్, అకాడమీ అవార్డు దర్శకుడు ఆంగ్ లీ, చిత్రనిర్మాత జాన్ ఎంచు కూడా ఈ అవార్డ్కు ఎంపికయ్యారు. ఈ అవార్డ్ను ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన లీడర్లకు అందించనున్నారు. ఈ అవార్డ్ను మే 10న లాస్ ఏంజిల్స్లోని మ్యూజిక్ సెంటర్లో జరిగే గోల్డ్ హౌస్ గాలా నాల్గవ వార్షిక సమావేశంలో ప్రియాంక చోప్రాను సత్కరించనున్నారు.గోల్డ్ హౌస్ గాలా- ఏ100 జాబితాను వెల్లడించనుంది. సంస్కృతి, వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన 100 ఆసియా పసిఫిక్ లీజర్లను ప్రతి ఏటా ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం ఏ100 జాబితా మే 1న వెల్లడించనున్నాురు. ఈ వేడుకకు ముందు సినిమా, సాంకేతికత, మీడియాతో సహా వివిధ పరిశ్రమలకు చెందిన 600 మందికి పైగా అతిథులను ఆహ్వనించనున్నారు.కాగా.. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హిందీ సినిమాలో దాదాపు 25 ఏళ్ల తన కెరీర్లో రాణించింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె ఆమె జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో కలిసి హాలీవుడ్ చిత్రం 'హెడ్స్ ఆఫ్ స్టేట్'లో కూడా కనిపించనుంది. -
డేటింగ్లో స్టార్ హీరోయిన్ సోదరి.. ప్రియుడికి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్!
బాలీవుడ్ భామ ఆలియా భట్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా జన్మించింది. గతేడాది జిగ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఈ ఏడాది ఆల్ఫా అనే మూవీలో కనిపించనుంది.అయితే ఆలియా భట్కు పూజా భట్, షాహీన్ భట్ అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన షాహీన్ భట్ ప్రముఖ ఫిట్నెస్ కోచ్ ఇషాన్ మెహ్రాతో డేటింగ్లో ఉన్నారు. ఇవాళ అతని బర్త్ డే కావడంతో షాహీన్ భట్ విషెస్ చెబుతూ అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో అతనితో రిలేషన్లో ఉన్నట్లు అఫీషియల్గా ప్రకటించింది.ఇది చూసిన అలియా భట్ తన సిస్టర్ షాహీన్ భట్కు మద్దతుగా నిలిచింది. ఇషాన్ మెహ్రా పుట్టినరోజు సందర్భంగా అలియా భట్ శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా షాహీన్ చేసిన పోస్ట్ను అలియా భట్ షేర్ చేసింది. ఈ పోస్ట్పై నీతూ కపూర్, పూజా భట్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, అనన్య పాండే, పరిణీతి చోప్రా, బాద్షా,మసాబా గుప్తా సైతం స్పందించారు. షాహీన్ భట్ భాయ్ఫ్రెండ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. షాహీన్ భట్ గతంలో హాస్యనటుడు రోహన్ జోషితో రిలేషన్ షిప్లో ఉన్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో షాహీన్ భట్.. ఇషాన్తో ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. కానీ అతని ఎవరు అనేది వెల్లడించలేదు. ఈ ఏడాది కపూర్, భట్ కుటుంబాలు న్యూ ఇయర్ సందర్భంగా థాయ్లాండ్ పర్యటనకు వెళ్లాయి. ఇన్స్టాగ్రామ్లోకి షాహీన్ తన ట్రిప్కు సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఒక ఫోటోలో ఆమె ఇషాన్ పక్కన నిలబడి పోజులిచ్చింది. మరో చిత్రంలో క్రూయిజ్లో ఉన్నప్పుడు వారిద్దరు కౌగిలించుకున్నారు. అప్పటి నుంచే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ వయస్సు దాటితే హీరోయిన్గా కష్టమే: దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల అవకాశాలపై ఆమె మాట్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోతాయని వెల్లడించింది. పెళ్లి తర్వాత తన కెరీర్ ఎలా ప్రభావితం అయిందో వివరించింది. దాదాపు 25 ఏళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగిన దియా మీర్జా ఇటీవల నాదానియాన్ మూవీలో ఓ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో ఇబ్రహీమ్ అలీ ఖాన్కు తల్లిపాత్రలో నటించింది. అయితే ప్రస్తుతం ఓటీటీల వల్ల కొత్తగా అవకాశాలు వస్తున్నాయని పేర్కొంది. తాను నటించిన 2019 వెబ్ సిరీస్ను మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ల అవకాశాలపై స్పందించారు.దియా మీర్జా మాట్లాడుతూ..' నిజ జీవితంలో మాతృత్వాన్ని స్వీకరించిన తర్వాత సినిమాల్లో ఎంపిక చేసే విధానం మారింది. గత ఐదేళ్లలో నేను నా కొడుకు పుట్టడానికి ముందు.. పుట్టిన తరువాత నేను చేసిన ప్రతి క్యారెక్టర్ అతను చూడాలని కోరుకునే ప్రాజెక్ట్లు. కథలను ఎంచుకోవడంలో నా ప్రాధాన్యత అలానే ఉంటుంది. హీరోయిన్లకు వయస్సు, పెళ్లి, మాతృత్వం తర్వాత అవకాశాలపై ప్రభావం ఉంటుంది. నా వయస్సు కారణంగా ఛాన్సులు రావడం లేదని నమ్మడం ప్రారంభించా. చాలా సినీ ఇండస్ట్రీల్లోనూ ఇదే జరుగుతుంది. దాదాపు 35 నుంచి 48 వయస్సు మధ్యలో హీరోయిన్గా అవకాశాలు కష్టమే. ఆ తర్వాత మీరు తల్లి, సోదరి పాత్రలు చేయడం ప్రారంభిస్తారు. కానీ ఓటీటీ వల్ల మహిళలకు అవకాశాలను పెంచిందని' తెలిపింది.దియా మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్పై విచారం వ్యక్తం చేసింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సరికొత్త అర్ధంలేని పని జరుగుతోంది. సోషల్ మీడియాలో వ్యక్తులకున్న పాపులారిటీ ఆధారంగా చాలా మంది నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇది చాలా అన్యాయం. కొందరు అత్యద్భుతమైన ప్రతిభావంతులు సోషల్ మీడియాలో తమ వాయిస్ని బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ దాని అర్థం వారికి అర్హత లేదని కాదు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త సంస్కృతి" అని ఆమె అన్నారు. -
'ఉత్తరాఖండ్లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టాలీవుడ్లోనూ ఫుల్ ఫేమస్ అయింది. డాకు మహారాజ్ తర్వతా మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇటీవల రిలీజైన సన్నీ డియోల్ మూవీ జాట్లో ఓ ఐటమ్ సాంగ్లో మెరిసింది. ఎప్పుడు వార్తల్లో నిలిచి ఈ ముద్దుగుమ్మ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ సారి ఏకంగా తనకు గుడి కట్టారంటూ కామెంట్స్ చేసింది. ఉత్తరాఖండ్లో నాకు ఓ గుడి కట్టారు. బద్రీనాథ్కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉంది. జనాలు అక్కడికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నన్ను భక్తిగా పూజ చేసి నా ఫోటోకు దండలు కూడా వేస్తారని చెప్పుకొచ్చింది. నన్ను ఆ గుడిలో దండమామై అని పిలుస్తుంటారని కూడా తెలిపింది. బద్రీనాథ్కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి అంటూ సలహా కూడా ఇచ్చింది.తాజాగా ఆమె వ్యాఖ్యలపై స్థానికి పూజారులు స్పందించారు. ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్పై మండిపడుతున్నారు. ఊర్వశి రౌతేలా వాదన అందరినీ తప్పుదారి పట్టించేలా ఉందని పూజారి భువన్ చంద్ర ఉనియాల్ అన్నారు. బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని.. కానీ ఆలయంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆమె వ్యాఖ్యలతో స్థానిక పూజారులు, మత అధికారులు, బద్రీనాథ్ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆమె గుడి కాదు. ఇలాంటి ప్రకటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఊర్వశీ వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపరచడమే అని బ్రహ్మకపాల్ తీర్థ్ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ మండిపడ్డారు.(ఇది చదవండి: బద్రీనాథ్ పక్కనే నా పేరుపై గుడి.. నాకు పూజలు, పూలదండలు: ఊర్వశి)బద్రీనాథ్ ధామ్ సమీపంలోని బామ్నిలో ఉన్న ఊర్వశి ఆలయం.. పురాణాల ప్రకారం సతీదేవి శరీరం భాగాలు పడిపోయిన ప్రదేశం నుంచి ఉద్భవించిందని విశ్వసిస్తున్నారు. ఈ పవిత్రమైన ఆలయాన్ని ఊర్వశి దేవికి అంకితం చేశారని చెబుతున్నారు. ఊర్వశి దేవాలయం హిందూ పురాణాలలో సతీదేవితో ముడిపడి ఉందని అంటున్నారు. ఈ ఆలయం 108 శక్తిపీఠాలలో భాగంగా పరిగణించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. వారి సంప్రదాయంలో భాగంగా పూజించే బామ్ని, పాండుకేశ్వర్ గ్రామాల నివాసితుల ఆధ్యాత్మిక ఆలయంంగా అనుసంధానించబడి ఉందని ఆయన తెలిపారు. బ్రహ్మ కపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ సతీ కూడా రౌతేలా వ్యాఖ్యలను ఖండించారు. ఈ ఆలయం పురాతనమైనదని.. ఊర్వశి దేవితో ముడిపడి ఉందని.. ఏ వ్యక్తితోనూ కాదని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ఇక్కడి ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఊర్వశి రౌతేలాపై స్థానికులైన బామ్ని, పాండుకేశ్వర్ గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు రాహుల్తో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. వీరి వివాహా వేడుక ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్హౌస్లో గ్రాండ్గా జరిగింది. ఇటీవల పుట్టిన బిడ్డకు ఇప్పటి వరకు పేరు పెట్టలేదు. రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్తో బిజీగా ఉన్నారు.అయితే తాజాగా అతియాశెట్టి- కేఎల్ రాహుల్ తమ ముద్దుల కూతురికి నామకరణం చేశారు. ఈవారా విపుల రాహుల్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అతియాశెట్టి శెట్టి సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు ఈ పేరుకు అర్థం కూడా చెప్పేసింది. ఈవారా అంటే దేవుని గిఫ్ట్ అని.. విపుల అంటే అమ్మమ్మ (అతియా శెట్టి వాళ్ల అమ్మమ్మ) (మనా శెట్టి తల్లి) పేరు వచ్చేలా ఆమెకు గౌరవంగా.. రాహుల్ అంటే పాపా(నాన్న) అని అర్థం వచ్చేలా పెట్టినట్లు వివరించింది.కాగా.. ఇటీవల అతియాశెట్టికి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు. తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపారు. తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్లో రాసుకొచ్చారు. తన మనవరాలి చేయి పట్టుకుని ఉన్న తన తల్లిని చూడటం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అందమైన క్షణమని చెప్పారు. -
ఆరెంజ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ దిశ పటాని (ఫొటోలు)
-
MAMI ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ప్రియుడితో బుల్లితెర నటి బ్రేకప్.. కన్ఫామ్ చేసేసిందిగా!
బాలీవుడ్ భామ ప్రియాంక చాహర్ చౌదరి తనపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. ప్రియుడు అంకిత్ గుప్తాతో బ్రేకప్ అయినట్లు ఇటీవల కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బుల్లితెర బ్యూటీ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా సరే తమ జీవితంలో మార్పు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. జీవితంలో ముందుకు సాగాలే తప్ప వెనకడుగు వేయకూడదని అంటోంది. ఆమె మాటలను చూస్తుంటే వీరిద్దరి మధ్య బ్రేకప్ నిజమేనని తెలుస్తోంది.ప్రియాంక చాహర్ మాట్లాడుతూ.. ' మార్పు అనేది ఎల్లప్పుడూ మంచిదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మనం జీవితంలో అభివృద్ధి చెందడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగాల్సిందే. అది రిలేషన్లో అయినా.. ఫ్యాషన్లో అయినా అదే మంచి నిర్ణయం" అని తెలిపింది. కాగా.. ఇటీవల ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఈ జంటపై బ్రేకప్ రూమర్స్ మొదలయ్యాయి. (ఇది చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!)అంతుకుముందు వీరిద్దరు కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'తేరే హో జాయేన్ హమ్' అనే టీవీ షో నుంచి సైతం అంకిత్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ప్రియాంక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజా పరిణామాలతో ఈ జంట తమ రిలేషన్షిప్కు దాదాపు ఎండ్ కార్డ్ వేసినట్లేనని అర్థమవుతోంది. కాగా.. వీరిద్దరు మొదటసారిగా 'ఉదారియన్' సెట్స్లో కలుసుకున్నారు. ఆ తరువాత బిగ్ బాస్- 16లో కనిపించారు. అంతేకాకుడా అంకిత్ గుప్తా, ప్రియాంకతో కలిసి బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్లో జంటగా నటించారు. మరోవైపు ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది. -
బుల్లితెర జంటపై విడాకుల రూమర్స్.. నటుడు ఏమన్నారంటే?
సినీ తారలపై రూమర్స్ రావడం ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా డేటింగ్, బ్రేకప్, విడాకుల వార్తలు ఎక్కువ వింటుంటాం. ప్రస్తుత సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాటికి కొదువే లేదు. అయితే ఇలాంటి సినీ తారలు కూడా పెద్దగా పట్టించుకోరు. అలా ఓ బుల్లితెర జంటపై ఇటీవల కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో ప్రముఖ జంటగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ దహియా, దివ్యాంక త్రిపాఠి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి.ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్పై నటుడు వివేక్ దహియా స్పందించారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు. అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు. వాటిని చూసి తాము నవ్వుకుంటున్నామని తెలిపారు. తన మ్యూజిక్ వీడియో ఇష్టం లాంఛ్ సందర్భంగా మీడియాకు క్లారిటీ ఇచ్చారు.వివేక్ దహియా మాట్లాడుతూ..' అలాంటి వార్తలు చూసి నేను, దివ్యాంక నవ్వుకుంటాం. ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తాం. ఇంకా చాలాసేపు మాట్లాడుకోవాలనుకుంటే అలాగే పాప్కార్న్ ఆర్డర్ చేసుకుని మరీ తింటాం. నేను కూడా యూట్యూబ్ వ్లాగింగ్ చేస్తా. కాబట్టి క్లిక్ బైట్ ఎలా పని చేస్తుందో నాకు బాగా తెలుసు. ఇవన్నీ నాకు బాగా అర్థమవుతాయి. మీరు ఏదైనా సంచలనాత్మకంగా ఉంచితేనే ప్రజలు వాటిని చూస్తారు. కానీ అందులో అసలు నిజం ఉండదు. అలాంటి అవాస్తవాలను మనం ప్రోత్సహించకూడదు' అని అన్నారు.కాగా.. ఫీల్ గుడ్ ఒరిజినల్స్ బ్యానర్పై సురభి చందనా నిర్మించిన 'ఇష్టం' అనే కొత్త మ్యూజిక్ వీడియోలో నటుడు అనైరా గుప్తా సరసన వివేక్ దహియా నటించారు. ఈ వీడియో ఏప్రిల్ 14న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో వివేక్ మాట్లాడారు. అంతకుముందు వివేక్ దహియా, నటి దివ్యాంక త్రిపాఠి 'యే హై మొహబ్బతే' సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాత డేటింగ్ ప్రారంభించారు. అనంతరం 2016లో వివాహం చేసుకున్నారు. -
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుక ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్హౌస్లో గ్రాండ్గా జరిగింది.అయితే అతియాశెట్టి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు. తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపారు. తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్లో రాసుకొచ్చారు. తన మనవరాలి చేయి పట్టుకుని ఉన్న తన తల్లిని చూడటం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అందమైన క్షణమని చెప్పారు.సునీల్ తన పోస్ట్లో రాస్తూ.. 'ఇటీవల తాతగా మారడం నాకు వర్ణించలేని అనుభూతి. ఇది ప్రపంచం ఇచ్చే స్వచ్ఛమైన ఆనందం. నేను దశాబ్దాలుగా వ్యాపారాలు నడుపుతున్నా. సినిమాలు చేస్తున్నా. నా జీవితంలో అర్ధవంతమైన పనిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా. ఈ విషయంలో నేను గర్వపడుతున్నా. కానీ నేను నా మనవరాలిని పట్టుకున్నప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదు. ఇప్పుడు నా మనస్సు మంగుళూరులోని నా చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చింది. చెప్పులు లేకుండా పరిగెత్తడం, బహిరంగ మైదానంలో ఆడుకోవడం, ప్రేమ తప్ప మరేమీ లేకుండా చేసిన తాజా భోజనం తినడం నిజమైన ఆనందాన్ని ఇచ్చిందని' రాసుకొచ్చారు. నా కుమార్తె అతియా శెట్టి తల్లి కావడం చూస్తుంటే తన మనసుకు చాలా ప్రశాంతంగా ఉందని ఒక తండ్రిగా గర్వంగా కూడా ఉందని పోస్ట్ చేశారు. కాగా.. అతియా శెట్టికి మార్చి 24న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితేఇంకా పాప పేరును ప్రకటించలేదు. -
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. చాలా ఏళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే అంతకుముందే తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి అభిమానులకు షాకిచ్చింది ముద్దుగుమ్మ.ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ.. గతేడాది చివరిసారిగా ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా అనే మూవీలో కనిపించింది. ఈ చిత్రాన్ని గతంలో విడుదలైన హసీన్ దిల్రుబాకు సీక్వెల్గా తెరకెక్కించారు. అంతకుముందు షారూఖ్ ఖాన్ నటించిన డుంకీ చిత్రంలోనూ కనిపించింది. ప్రస్తుతం గాంధారీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు.అయితే తాజాగా హీరోయిన్ తాప్సీ తన మంచి మనసును చాటుకుంది. సినిమాలే కాదు సమాజ సేవలోనూ ముందుంటానని చెబుతోంది. వేసవికాలం కావడంతో ఎంతోమంది పేదలకు అండగా నిలిచింది. ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న పేదలకు టేబుల్ ఫ్యాన్స్, కూలర్లను అందజేసింది. తన భర్త మథియోస్ బోతో కలిసి వారి ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందించింది. దీంతో తాప్సీ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు తాప్సీ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే తన బయోలో లింక్ కూడా ఉందని ఇన్స్టాలో షేర్ చేసింది హీరోయిన్ తాప్సీ. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Hemkunt Foundation (@hemkunt_foundation) -
'వారికి ఆనందమైతే మనమేం చేస్తాం'.. ట్రోల్స్పై బుల్లితెర నటి రియాక్షన్
బాలీవుడ్ భామ, బుల్లితెర నటి మౌనీ రాయ్ తెలుగువారికి సైతం సుపరిచితమైన పేరు. నాగిని సీరియల్తో తెలుగులోనూ ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్లోనే ఉంటుంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటోంది. అయితే సన్నగా.. మరింత అందంగా కనిపించే మౌనీ రాయ్.. ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వార్తలొచ్చాయి. ఆమె ఇన్స్టా కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేయగా తనపై నెట్టింట విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. తాజా ఈవెంట్లో తనపై వస్తున్న ట్రోల్స్పై స్పందించింది ఈ బుల్లితెర నటి.తాజాగా 'ది భూత్నీ' అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను ముంబయిలో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన ముద్దుగుమ్మ తనపై వస్తున్న ట్రోల్స్పై స్పందించింది. ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తూ ఆనందం పొందే వారి ట్రోల్స్ను తాను అస్సలు పట్టించుకోనని మౌనీ రాయ్ తెలిపింది. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చిపడేసింది.మౌనీ రాయ్ మాట్లాడుతూ.. "ట్రోల్స్ వల్ల నాకు ఎలాంటి బాధ లేదు. నేను అలాంటి వాటిని చూడను కూడా. ప్రతి ఒక్కరూ వారి పనిని చేయనివ్వండి. నేను అలాంటి వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇతరులను ట్రోల్ చేయడానికి మీరు తెర వెనుక దాక్కుని.. వాటితో ఆనందాన్ని పొందితే మనమే చేస్తాం. అలాంటి వారిని అలానే ఉండనివ్వండి" అంటూ కామెంట్స్ చేసింది.కాగా.. మౌనీ రాయ్ ప్రస్తుతం హారర్ యాక్షన్ కామెడీ చిత్రం 'ది భూత్నీ'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమె మొహబ్బత్ అనే దెయ్యం పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో సంజయ్ దత్, సన్నీ సింగ్, పాలక్ తివారీ, బెయోనిక్, ఆసిఫ్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ది భూత్నీ' ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా అక్షయ్ కుమార్ 'కేసరి- 2'తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
మెనోపాజ్ గురించి ఎంత మాట్లాడితే అంత అర్థమవుతుంది.. అర్థమైతేనే దాని మేనేజ్మెంట్ తెలుస్తుంది! అందుకే మెనోపాజ్ ఎక్స్పీరియెన్స్ను షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చారు టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి.. ప్లాట్ఫామ్ దొరికినప్పుడల్లా మెనోపాజ్ గురించి మాట్లాడుతూంటే అది చర్చగా మారుతుంది. అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల పట్ల కేర్ పెరుగుతుంది అంటున్నారు...నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎక్స్పీరియెన్స్ చేస్తున్న ఫేజ్. మానసికంగా ఇదెంత ప్రభావం చూపుతోందంటే.. కోపం.. బాధ.. దుఃఖం.. ఆవేశం.. ఇలా ఎమోషన్స్ ఏవీ మన కంట్రోల్లో ఉండవు. దేనికి ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలియదు. ఒకరకమైన అలజడి. వణుకు తెప్పిస్తుంది. భయపెడుతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితిని కల్పిస్తుంది.గట్టి దెబ్బే కొడుతుంది.. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ సమయంలో మన పనులు డ్యామేజింగ్గా కూడా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులను హర్ట్ చేయొచ్చు. మన ఈ ప్రవర్తన ఇంట్లో వాళ్లకూ అర్థమవడం కష్టం. ఫ్రెండ్స్కి చెప్పుకుందామనుకుంటే.. ఎక్కడి నుంచి .. ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అసలు ఇది షేర్ చేసుకునే విషయమేనా అనే సంశయం. ఇలా అన్నిరకాలుగా ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది. మానసికంగా గట్టి దెబ్బే కొడుతుంది.ముందు మనల్ని మనం.. ఈ ఫేజ్ను డీల్ చేస్తూ నేను తెలుసుకున్నదేంటంటే.. డైట్, మెడిసిన్ అంతగా హెల్ప్ చేయవని. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే ఈ మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్నిస్తుందని. అందుకే ఎక్సర్సైజ్, యోగాను లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవాలి. ట్రావెల్ లేదా మనకు నచ్చిన పనితో మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. నేను నేర్చుకున్నది ఇదే! దీన్ని ఫాలో అవుతూ నా ప్రొఫెషనల్ లైఫ్ ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే అదే ఇన్కమ్ సోర్స్ కాబట్టి. అంతేకాదు మన వ్యక్తిగత సమస్యలు వర్క్ ప్లేస్లో చర్చకు తావు ఇవ్వకూడదు! ఇంకో విషయం ఏంటంటే.. మన మూడ్స్వింగ్స్ నేరుగా ప్రభావం చూపించేది కుటుంబం మీదనే. ఎంత ఇబ్బంది అయినా వర్క్ ప్లేస్లో ఒక ఎరుకతో ఉంటాం.. ఉండాలి కూడా! అందుకే ముందు మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లతో మన పరిస్థితిని వివరించి.. వాళ్ల సపోర్ట్ కూడా తీసుకోవాలి. దీనివల్ల వర్క్ ప్లేస్లో డీల్ చేయడమూ తేలికవుతుంది. సందర్భం దొరికినప్పుడు.. ఈ ఫేజ్లోని ఆడవాళ్లకు కచ్చితంగా సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఆ ఫేజ్ను అధిగమించిన వాళ్లు తమ అనుభవాలను, డీల్ చేసిన తీరును షేర్ చేసుకోవడం వల్ల ఆ ఫేజ్లోకి ఎంటర్ అయిన మహిళలు ధైర్యం తెచ్చుకుంటారు. ఈజీగా మేనేజ్ చేయగలమనే భరోసా వస్తుంది. దీనివల్ల సిస్టర్హుడ్ డెవలప్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సందర్భం, ప్లాట్ఫామ్ దొరికినప్పుడల్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మహిళలు దీనిగురించి మాట్లాడటమో.. తమ అనుభవాన్ని పంచుకోవడమో చేస్తే.. మెనోపాజ్ మీద అందరికీ అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల సమస్యలు, బాధలు అర్థమవుతాయి. ఇంటా, బయటా కూడా సపోర్ట్ అందే ఆస్కారం పెరుగుతుంది. నార్మలైజ్ చేయాలి‘మెనోపాజ్ను అనకూడని, వినకూడని మాటలా భావిస్తారు మన సమాజంలో! దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఎంతగా చర్చిస్తే అంతగా అవగాహన పెరుగుతుంది.. అంత ఎక్కువగా మహిళలకు మద్దతు అందుతుంది. సమాజం మీద సెలబ్రిటీల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ బాధ్యతలోనూ వాళ్లు ముందుండాలి. మెనోపాజ్ గురించి మాట్లాడుతూ దాన్ని నార్మలైజ్ చేయాలి!’– లారా దత్తా, బాలీవుడ్ నటి.– శిరీష చల్లపల్లి -
బాలీవుడ్ లో తమన్నాకు వింత పరిస్థితులు హీరోయిన్ గా కెరీర్ ఖతమేనా ?
-
రెండోసారి విడాకులు.. నాతో ఎవరూ పనిచేయట్లేదు: నటి ఆవేదన
బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది. 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడగా నాలుగు నెలలకే విడాకులిచ్చింది. అనంతరం 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతడి దగ్గరా విడాకులు తీసుకుంది. అయితే ఈ విడాకులు తన కెరీర్కు అడ్డంకిగా మారాయంటోందీ బ్యూటీ.విడాకులు.. కష్టమేచాహత్ ఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెండోసారి విడాకులు తీసుకున్నప్పుడు ఎంతో కష్టంగా అనిపించింది. ఒక కూతురు నాతో, మరొకరు ఫర్హాన్తో ఉంటున్నారు. పిల్లల్ని బాగా చూసుకోవడం మా బాధ్యత. వారి కోసం అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదేమైనా విడాకులనేవి మనసును పట్టి పిండేస్తాయి. అదంత ఈజీ కాదు. ఎవరికీ ముఖం చూపించుకోలేము. ఎందుకంటే వాళ్లు ఏదో ఒకటి మాట్లాడి మనల్ని మరింత బాధపెడతారు. అందుకో బయటకు వెళ్లాలంటే కూడా పెద్దగా ఇష్టపడను. భరణం తీసుకోలేఇద్దరు భర్తల దగ్గర ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోలేదు. కానీ జనాలు మాత్రం విడాకులు తీసుకుని భరణంగా భారీగా ఆస్తి, బంగారం లాగి ఉంటుంది అంటూ రకరకాలుగా మాట్లాడుతుంటారు. కేవలం భరణంతోనే బతికేస్తున్నానని కూడా అంటుంటారు. అందులో ఆవగింజంత కూడా నిజం లేదు. ఈ విడాకుల వల్ల నాపై నెగెటివిటీ పెరిగింది. చాలామంది నాతో కలిసి పని చేయడానికి కూడా ఇష్టపడలం లేదు. నాతో ఎవరూ పనిచేయరు!మీడియాలో నా వ్యక్తిగత జీవితం గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే ఎవరు మాత్రం నాతో కలిసి నటించేందుకు ఇష్టపడతారు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు నన్ను పట్టించుకోవు. మీడియాలో నా పేరు మార్మోగిపోతోంది కాబట్టి.. సైడ్ చేస్తున్నాం అని కొందరు నా ముఖం మీదే చెప్పారు అని వాపోయింది. చాహత్.. ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలు చేసింది. బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్లో నటించింది.చదవండి: గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా? -
ఈవెంట్లో మాజీ భాయ్ ఫ్రెండ్.. అస్సలు పట్టించుకోని బాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భామ.. ప్రస్తుతం వెబ్ సిరీస్లతో అభిమానులను అలరిస్తోంది. సూపర్ హిట్ సిరీస్ ఆర్యలో నటించింది. అంతేకాకుండా తాళి అనే వెబ్ సిరీస్లోనూ మెరిసింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించని సుస్మితా సేన్.. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైంది. ముంబయిలో జరిగిన ఈ ఈవెంట్లో తన మాజీ భాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్తో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా.. సుస్మితా సేన్ నటుడు రోహ్మన్ షాల్తో డేటింగ్ చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్బై చెప్పేసింది. తాజాగా వీరిద్దరు మరోసారి ఓకే ఈవెంట్లో మెరవడంతో బాలీవుడ్లో చర్చ మొదలైంది. ఈ జంట మళ్లీ కలవబోతున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈవెంట్లో రోహ్మాన్ షాల్ను సుస్మితాతో ఫోజు ఇవ్వాలని అక్కడున్న వారు అడగడంతో సరదాగా వెనక నిలబడి కెమెరాకు పోజులిచ్చాడు. అయితే సుస్మితా మాత్రం అతన్ని పట్టించుకోకుండా తన స్నేహితులతో మాట్లాడుతూ కనిపించింది.కాగా.. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఊర్వశి రౌతేలా క్రేజ్.. డాకు మహారాజ్ చిత్రానికి అవార్డ్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఈ ఏడాది డాకు మహారాజ్తో టాలీవుడ్ ప్రియులను అలరించింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఈ సినిమాలో దబిడి దిబిడి సాంగ్తో ఫ్యాన్స్ను మెప్పించింది. అయితే ఈ పాటపై పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సాంగ్ కొరియోగ్రఫీపై పలువురు విమర్శలు చేశారు.ఇవన్నీ పక్కన పెడితే తాజాగా బాలీవుడ్ భామను ఓ అవార్డ్ వరించింది. ఫ్యాన్స్ ఫేవరేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్-2025కు ఎంపికైంది ముద్దుగుమ్మ. డాకు మహారాజ్ చిత్రంలో ప్రదర్శనకు గానూ గోల్డెన్ క్వీన్ అవార్డ్ను దక్కించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అవార్డ్ చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా తనకు సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవు.. బోరున ఏడ్చేసిన నటి
కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందులోనూ ఏళ్లతరబడి కష్టపడుతున్నా దానికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం లేకపోతే ఆ బాధ తట్టుకోలేం. ఒకప్పుడు నటి తిలోత్తమ షోమ్ (Tillotama Shome) పరిస్థితి కూడా ఇదే! ఈ బెంగాలీ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలవుతోంది. బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్లో అనేక సినిమాలు చేసిన ఆమె ఇటీవలే షాడోబాక్స్ చిత్రంతో అలరించింది. తాజాగా ఈమె తన అనుభవాలను చెప్తూ బోరున ఏడ్చేసింది.పారితోషికంతో కారు కొంటా..తిలోత్తమ మాట్లాడుతూ.. నేను నటించిన సినిమాకు ఓ డైరెక్టర్ చాలా తక్కువ పారితోషికం ఇచ్చాడు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక జరిగిన పార్టీలో అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. నువ్వు దేనిపై అయినా మనసు పారేసుకున్నావా? అని అడిగారు. అందుకు నేను అవును, ఫలానా కారు అంటే నాకిష్టం. ఆ కారు రేటుకు తగ్గట్లుగా నాకు పారితోషికం వచ్చినప్పుడు కచ్చితంగా దాన్ని కొంటాను అని చెప్పాను.అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవ్ఇంతలో ఆ డైరెక్టర్ మధ్యలో కలగజేసుకుని.. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు.. కానీ ఎప్పటికీ నువ్వు ఊహించినంత డబ్బు సంపాదించలేవు అన్నాడు. ఇదెంత అన్యాయం కదా..! కానీ ఇండస్ట్రీలో ఇలాగే ఉంటుంది. దురదృష్టవశాత్తూ.. మనకెంత టాలెంట్ ఉన్నా సరే దానికి తగ్గట్లు రెమ్యునరేషన్ ఇవ్వరు. ఇప్పటికీ ఆ దర్శకుడు అన్న మాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.రెట్టింపు తీసుకున్నా..అయితే అతడి మాటలు నాలో కసిని పెంచాయి. నేను ఎలాగైనా చెప్పినంత సంపాదించి తీరాలనుకున్నాను. తర్వాత నాకో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను అడిగినంత ఇవ్వాలన్నాను. నాలుగు నెలల తర్వాత మా చర్చలు సఫలమయ్యాయి. నేను కలగన్నదానికంటే రెట్టింపు పారితోషికం తీసుకున్నాను. ఆ సినిమా పేరు చెప్పలేను అంటూ నటి కన్నీళ్లు పెట్టుకుంది. తిలోత్తమ.. సర్, ద నైట్ మేనేజర్, మాన్సూన్ వెడ్డింగ్, ఢిల్లీ క్రైమ్, లస్ట్ స్టోరీస్ 2, పాతాళ్ లోక్ 2 వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులకు దగ్గరైంది.చదవండి: నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్ బిల్లు.. కంగనా షాక్ -
మ్యాడ్డాక్ ప్రొడక్షన్ 20 ఇయర్స్ సక్సెస్ పార్టీలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ నటి ఆదితి పోహంకర్ బాలీవుడ్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ నటించింది. లాల్ భారీ అనే మరాఠీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆదితి.. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ కనిపించింది. బాలీవుడ్లో షీ, ఆశ్రమ్ లాంటి వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆశ్రమ్ వెబ్ సిరీస్లో బాబీ డియోల్తో చేసిన ఇంటిమేట్ సీన్లపై స్పందించింది.ఇద్దరు నటీనటులు సన్నిహితంగా ఉండే సన్నివేశాలు చేయడం చాలా కష్టమని ఆదితి పోహంకర్ తెలిపింది. ఇలాంటి సీన్స్లో పురుషులే ఎక్కువగా కష్టపడతారని ఒకరు నాతో చెప్పారని గుర్తు చేసుకుంది. ఇలాంటి విషయాల్లో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని తెలిపింది. ఆశ్రమ్ సిరీస్లో నటించే సమయంలో మా మధ్య రిలేషన్ బలంగా ఉందని.. ఏదైనా సీన్స్ మళ్లీ చేయాల్సి వస్తే.. తప్పకుండా చేసే వాళ్లమని వెల్లడించింది.ఇంటిమేట్ సీన్స్పై అదితి మాట్లాడుతూ.. " అసలు అలాంటి కాన్సెప్ట్ ఉందని నాకు తెలియదు. కానీ ఇద్దరు నటీనటుల మధ్య దూరం ఉంటే.. అది తెరపై మరింత ఇబ్బందికరంగా మారుతుందని నేను నిజంగా నమ్ముతున్నా. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, మీ స్వంత లయను కనిపెట్టడం మంచిది. ఈ విషయాల్లో కచ్చితంగా దర్శకుడు సాయం చేస్తాడు. కానీ ఇద్దరి మధ్య మానసికంగా దూరం లేనప్పుడే నిజమైన ఫలితం వస్తుంది. ఇలాంటి సన్నివేశాల్లో ఎంత సహజంగా నటించారనేదే ముఖ్యం. ఎందుకంటే ఆ సీన్లో లిమిట్స్ మనకు తెలుసు. అందుకే నటీనటులు భయపడకూడదు" అని అన్నారు. -
సోనూ సూద్ భార్యకు ప్రమాదం.. అభిమానులకు హీరో సందేశం
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. పలు సినిమాల్లో సహాయ నటుడు, విలన్ పాత్రలతో మెప్పించారు. సోనూసూద్ ప్రస్తుతం హిందీలో మాత్రమే మూవీస్ చేస్తున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్నారు.అయితే ఇటీవల సోనూ సూద్ భార్య సోనాలి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సోనాలితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ నేపథ్యంలో అభిమానుల కోసం సోనూ సూద్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల నా భార్యకు యాక్సిడెంట్ జరిగిన విషయం మీకు కూడా తెలుసని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. సీట్ బెల్ట్ లేకపోతే.. మీరు మీ కుటుంబాన్ని కోల్పోయినట్లే అని సోనూ సూద్ తెలిపారు. మీరు వెనుక సీటులో కూర్చున్నప్పటికీ కూడా సీట్ బెల్ట్ ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
ఓర చూపు, మైమరపించే అందాలతో మాయ చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్
-
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
విడాకులు అనే పదం ఈ రోజుల్లోనే కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెళ్లైన కొన్నేళ్లలోనే పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ బుల్లితెర నటి తన వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ బుల్లితెర నటి ముగ్ధా చాఫేకర్ విడాకులు తీసుకున్నట్లు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రవీశ్ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత భర్త రవీశ్ దేశాయ్తో విడిపోయింది.రవీశ్ దేశాయ్ తన ఇన్స్టాలో రాస్తూ.. "చాలా ఆలోచనల తర్వాత, ముగ్ధ , నేను మా సొంత మార్గాల్లో ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నాం. అందుకే భార్య,భర్తలుగా విడిపోవాలని డిసిషన్ తీసుకున్నాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పట్టింది. ఇప్పటివరకు పరస్పరం ప్రేమ, స్నేహం, గౌరవంతో కలిసి ప్రయాణించాం. ఆమెతో ఉన్న రోజులు జీవితాంతం గుర్తుంటాయి." అని పోస్ట్ చేశారు. ఈ సమయంలో తమకు గోప్యత కావాలని అభిమానలను అభ్యర్థించాడు. అభిమానులు, మీడియా మాపై దయతో మద్దతుగా ఉండాలని.. ఎటువంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని నటి భర్త కోరారు.కాగా.. రవీశ్ దేశాయ్, ముగ్ధా చాఫేకర్ 2014లో సత్రంగి ససురల్ సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ సీరియల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత డిసెంబరు 2016లో ముంబయిలో జరిగిన గ్రాండ్ వేడుకలో వీరి వివాహం జరిగింది. ప్రముఖ టీవీ సీరియల్ కుంకుమ భాగ్య సీరియల్లో ప్రాచీ మెహ్రా కోహ్లి పాత్రకు గానూ ముగ్ధా చాఫేకర్ బాగా ఫేమస్ అయింది. అలాహే రవీశ్ దేశాయ్ మేడ్ ఇన్ హెవెన్, షీ (సీజన్ 2), స్కూప్ లాంటి వెబ్ సిరీస్ల్లో కనిపించారు. చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా విజయ్ 69లో కనిపించారు. -
‘ఆడజన్మ’ పై నటి నీనాగుప్తా సంచలన వ్యాఖ్యలు
తన మనసులోని భావాలను అభిప్రాయాలకు నిక్కచ్చిగా చెప్పే మహిళల్లో ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా ఒకరు. ‘సచ్ కహో తో’ అంటూ తన ఆటోబయోగ్రఫిలో నీనా గుప్తా ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే రేపారు. తల్లిని తన తండ్రి మోసగించిన తీరు.తల్లి ఆత్మహత్యాయత్నం చేయడం లాంటి ఇందులో ప్రస్తావించారు. అలాగే క్రికెటర్ రిచర్డ్స్తో సహజీవనం, మసాబాకు జన్మనివ్వడం, సింగిల్ పేరెంట్గా ఆర్థిక ఇబ్బందులు, బాలీవుడ్లో దర్శక, నిర్మాతల వేధింపులు బాలీవుడ్లో దర్శక, నిర్మాతల వేధింపులు ఇలా చాలా విషయాలను కూడా ఆత్మకథలో నిర్మొహమాటంగా రాసుకొచ్చారు.ఆడబ్రతుకు శాపం కన్నా తక్కువేమీకాదుఇటీవల ఫాల్తూ ఫెమినిజం అంటూ స్త్రీ పురుషు సమానత్వంపై మనసులోని మాట బెట్టింది నీనాగుప్త. స్త్రీ పురుషులు ఎప్పటికీ సమానంగా ఉండలేరంటూ స్త్రీవాద ఉద్యమం వేస్ట్ కొట్టి పారేసిన నీనా గుప్త తాజాగా మరోసారి దేశంలోని మహిళల భద్రత, దేశంలోని మహిళల పరిస్థితిపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. మహిళగా పుట్టడం శాపమే నని, ముఖ్యంగా పేద మహిళగా పుట్టడం శాపం కంటే తక్కువేమీ కాదని పేర్కొనడం గమనార్హం. యూట్యూబ్ పాడ్కాస్ట్లో మాట్లాడిన నీనా గుప్త గత వివాదాలు, స్త్రీవాద చర్చ, స్త్రీగా పుట్టడంపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే భారతదేశంలోని మహిళల కోసం తాను ఏమి కోరుకుంటున్నాడో అడిగినప్పుడు,“నేను కోరుకునేది సాధ్యం కాదు. మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ అదీ సాధ్యం కాదు. మహిళలకు విద్య నేర్పించాలి.. చదువుకోవాలి అంటారు...ఆ తరువాత వాళ్లు ఉద్యోగం చేయాలను కుంటారు. తీరా ఉద్యోగానికి వెళితే అత్యాచారానికి గురవుతారు. మరిది శాపం గాకపోతే మరేమిటి? ‘స్త్రీగా, పేద మహిళగా పుట్టడం శాపం’ గానే భావిస్తున్నాను. ఈ పరిస్థితి చాలా బాధగా ఉంటుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆశావహంగా ఎలా మాట్లాడగలను అంటూ ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు దేశంలోని ఒక వర్గం మహిళలు శారీరక సాన్నిహిత్యాన్ని వివాహం తర్వాత కేవలం ఒక విధిగా మాత్రమే చూడాలి. ఆనందం కోసంగా కాదు అనేలా ఉన్న సామాజిక కట్టుబాటుపై కూడా ఆమె స్పందించారు.‘ఫాల్తూ’ స్త్రీవాద వివాదంపై స్పందననీనా గుప్తా లింగ సమానత, సమస్యలపై నీనా గుప్తా వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించడం ఇదే మొదటిసారి కాదు. ‘సమానత్వం అనే ఆలోచనను నమ్మాల్సిన అవసరం లేదు దీనికి బదులుగా, ఆర్థిక సాధికారత, పనిలో నైపుణ్యంపై మీ పనిపై శ్రద్ధ చూపాలి. గృహిణి అయితే, ఏం తక్కువ. నిజానికి ఇది ఒక ముఖ్యమైన పాత్ర. మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోకండి. ఆత్మగౌరవాన్ని పెంచుకోండి ఇదే మహిళలకు చెప్పాలనుకుంటున్న ప్రధాన సందేశం’’ అన్నారామె. చదవండి: చెక్క ముక్కను నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీపురుషులు, మహిళలు సమానం కాదు. పురుషులు గర్భం దాల్చడం ప్రారంభించిన రోజే సమానత అని చెప్పింది నీనా గుప్తా. అయితే కాంటెక్ట్స్ సంబంధం లేకుండా మొత్తం ఇంటర్వ్యూలోని ఒక భాగాన్ని ప్రమోషన్ల కోసం మాత్రమే ఉపయోగించారని తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. కాగా పంచాయత్ సిరీస్తో నటిగా విశ్వరూపం చూపించారు నీనా. బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పంచాయత్ సీజన్ 4 విడుదలకు సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: ‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య -
'30 ఏళ్లు గ్యాప్ అయితే ఏంటి?'.. సల్మాన్- రష్మిక జోడీపై బాలీవుడ్ హీరోయిన్
సల్మాన్ ఖాన్ ఇటీవలే సికందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే ఊహించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజ్కు ముందు సల్లు భాయ్ ప్రమోషన్స్లో బిజీగా పాల్గొన్నారు. అదే సమయంలో రష్మికతో సల్మాన్ ఏజ్ గ్యాప్పై పలువురు ప్రశ్నించారు. మీ కూతురి వయస్సున్న అమ్మాయితో ఎలా నటిస్తారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. దీనిపై సల్మాన్ సైతం స్పందించారు. ఆమెకు లేని ఇబ్బంది.. మీకు ఎందుకని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. భవిష్యత్తులో రష్మికకు పాప పుడితే ఆమెతో కూడా నటిస్తానని సల్మాన్ ఖాన్ అన్నారు.తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కూడా స్పందించారు. సినిమాల్లో నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ అనేది సాధారణ విషయమన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అమీషా పటేల్ మాట్లాడారు. అలాగే తనకు కూడా గదర్ చిత్రంలో సన్నీ డియోల్కు, నాకు దాదాపు 20 ఏళ్ల అంతరం ఉందని ఆమె గుర్తు చేశారు.అమీషా మాట్లాడుతూ..' గదర్-2 సినిమాలో నాకు సన్నీ డియోల్కు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. అందుకే మూవీ సూపర్హిట్గా నిలిచింది. అలాగే సల్మాన్, రష్మిక జోడిని అభిమానులు ఇష్టపడుతున్నారు. నేను కూడా నాకంటే వయసులో చాలా పెద్ద హీరోలతో కలిసి పనిచేశానని' తెలిపింది. -
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. సైఫ్ వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో స్కై ఫోర్స్తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్ను ఉద్దేశించి మాట్లాడింది. తన నటనపై సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అవీ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు ధ్యానం చేస్తానని తెలిపింది.సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నేను సాధ్యమైనంత వరకు వాటిని ఫిల్టర్ చేయడం ప్రారంభించా. ఈ విషయంలో నాకు సహాయపడేది ధ్యానం. ఇలా చేయడం వల్ల నాకు నిజమేంటో తెలుస్తుంది. నేను నా స్వంత ఆలోచనలతో చూడటం ప్రారంభించా. ప్రతి ఆలోచనకు కూడా నన్ను సమర్థించుకోను. ఒక నటిగా నేను ఉన్నతమైన స్థానంలో లేను. కొంతమందికి కొందరు నటీనటులు అంటే ఇష్టం. మరికొందరికి ఇష్టం ఉండదు. నటిగా ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాలి. ఆ భగవంతుడు కోరుకుంటే సుదీర్ఘ జీవితం సినిమాల్లో ముందుకు సాగుతా. ఆ తర్వాత ప్రొడక్షన్, ఎంటర్ప్రెన్యూర్షిప్పై దృష్టి సారిస్తా.' అని తెలిపింది. -
మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
బాలీవుడ్ భామ షాలిని పాండే తెలుగువారికి సుపరిచితమైన పేరు. విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే సినిమాలతో మెప్పించింది. అయితే గతేడాది మహరాజ్ చిత్రంతో నటించిన ముద్దుగుమ్మ.. ఇటీవల జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్లో కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనను ఆలియా భట్తో పోల్చడంపై కూడా మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని కోరుకుంటానని తెలిపింది. అంతేకానీ మరొకరితో తనను పోల్చడం సరికాదని హితవు పలికారు. మనకు మరో ఆలియా భట్ అవసరం లేదని షాలిని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.షాలిని మాట్లాడుతూ.. "మనకు మరొక అలియా అవసరం లేదు. ఎవరూ మరో ఆలియా భట్ కాకూడదు. ఎందుకంటే ఆమె చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఆమె సినిమాల వల్ల మాత్రమే కాదు. తెరపై మాత్రమే కాదు.. నేను వ్యక్తిగతంగా అలియా భట్ను అభిమానిస్తాను. అందువల్లే నేను మరో ఆలియా భట్ కావాలనుకోవడం లేదు. నాకంటూ స్వంత వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఎవరైనా నన్ను షాలిని లాగే చూడాలని కోరుకుంటున్నా. అది నాకు చాలు.' అని అన్నారు. కాగా.. రణ్వీర్ సింగ్ సరసన జయేష్భాయ్ జోర్దార్లో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన షాలిని.. తెలుగులో అర్జున్ రెడ్డి మూవీతో ఫేమస్ అయింది. -
ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు?
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్ షో మెరిసింది. తన ర్యాంప్వాక్తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బంధువుల పెళ్లిలో ఐశ్వర్య- అభిషేక్.. ఇకనైనా ఆపేస్తారా?
బాలీవుడ్ జంటల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అభిషేక్ సినీ ఇండస్ట్రీలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ వారసుడు కావడంతో ఏ చిన్న విషయమైనా అందరిదృష్టి వారిపైనే ఉంటుంది. గతంలో వీరిద్దరిపై పలుసార్లు విడాకుల రూమర్స్ వినిపించాయి. ఈ జంట త్వరలోనే విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.అయితే గత కొద్ది నెలలుగా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఏదైనా శుభకార్యం జరిగితే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇటీవల తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. మహారాష్ట్రలోని పూణెలో తన కజిన్ శ్లోకా శెట్టి సోదరుడి వివాహానికి తన ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నుంచైనా సోషల్ మీడియా వీరిపై వస్తున్న విడాకుల వార్తలకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాగా.. అభిషేక్ - ఐశ్వర్య రాయ్ 2007లో వివాహ చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో వీరిద్దరి కుమార్తె ఆరాధ్య జన్మించింది. గతేడాది డిసెంబర్లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఆరాధ్య వార్షిక కార్యక్రమానికి కూడా జంటగా కలిసి వచ్చారు. దీంతో విడాకుల వార్తలకు చెక్పెట్టేశారు. కొత్త ఏడాది జనవరిలో న్యూ ఇయర్ వేకేషన్ నుంచి తిరిగి వస్తూ విమానాశ్రయంలో కూడా కనిపించారు. వరుసగా ఐశ్వర్య దంపతులు కలిసి హాజరు కావడంతో ఇకపై విడాకుల వార్తలకు చెక్ పడినట్లే.ఇక సినిమాల విషయానికొస్తే అభిషేక్ చివరిసారిగా బి హ్యాపీలో కనిపించాడు. ఈ చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ముఖ్లతో కలిసి హౌస్ఫుల్- 5లో కనిపించనున్నారు. అంతేకాకుండా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించబోయే షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం కింగ్లో విలన్గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే చివరిసారిగా పొన్నియన్ సెల్వన్- 2లో కనిపించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. -
ఇంటికి చేరుకున్న అతియా శెట్టి.. కేఎల్ రాహుల్ వారసురాలికి ఘనస్వాగతం!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈనెల 24న పాప తమ జీవితంలోకి అడుగుపెట్టిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత పలువురు సినీతారలు, అభిమానులు అతియా శెట్టి దంపతులకు అభినందనలు తెలిపారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బిడ్డతో కలిసి ఇంటికి చేరుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ లభించింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. పూలు, కుంకుమతో తనకు స్వాగతం పలికి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతియా పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోటోలో 'ఓం' దేవుడి పేరును కూడా ప్రస్తావించింది.కాగా.. అతియాశెట్టి, కేఎల్ రాహుల్ గతేడాది నవంబర్ 2024న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రెండు వారాల క్రితమే అతియా శెట్టి తన ప్రసూతి ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతకుముందు కేఎల్, అతియా 2019లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ సినీతారలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్హౌస్లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. -
నా డబ్బులతో పారిపోయారు.. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు: సింగర్ ఆవేదన
బాలీవుడ్ సింగర్ నేహ కక్కర్కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్లారు. కానీ ఆమె ఆ ఈవెంట్కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆ తర్వాత లేట్గా రావడంపై అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు సింగర్. ఆయితే నేహాకు ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం ఊహించని విధంగా షాకిచ్చారు. ఈవెంట్ ముగిశాక నేహా కక్కర్కు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. ఈ విషయాన్ని నేహా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.నేహా కక్కర్ తన ఇన్స్టాలో రాస్తూ.. "నేను మెల్బోర్న్ కన్సర్ట్ను ప్రేక్షకులకు పూర్తిగా ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని మీ అందరికీ తెలుసా? నిర్వాహకులు నా డబ్బుతో పారిపోయారు. నా టీమ్కు కనీసం ఆహారం, హోటల్, నీరు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని స్నేహితుల వెళ్లి వారికి ఆహారం అందించారు. అయినా కూడా మేము స్టేజ్పైకి వచ్చాం. మేము ఆలస్యంగా వచ్చామని మాకు డబ్బు ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్వాహకులు నా మేనేజర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు' అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కన్సర్ట్కు హాజరైన కొంతమంది కక్కర్పై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆలస్యం రావడంపై నిరాశ వ్యక్తం చేశారు.అభిమానులకు కృతజ్ఞతలు..అయితే సింగర్ నేహా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు జరిగిన విషయం గురించి మాట్లాడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు నా కచేరీకి హాజరైన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) -
ఓటీటీకి పూజా హెగ్డే డిజాస్టర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆదరణ కరవైంది. యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన దేవా అభిమానులను థియేటర్లలో రప్పించడంలో విఫలమైంది.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈనెల 28 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ మేరకు దేవా పోస్టర్ను పంచుకుంది.కాగా..2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అదే సినిమాని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఇక్కడ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమానే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తెరకెక్కించగా డిజాస్టర్గా నిలిచింది. మరీ ఓటీటీలోనైనా అభిమానులను ఏమేర అలరిస్తుందో వేచి చూడాలి.Bhasad macha 🥁🥁🥁 Trigger chala 🚨🚨🚨 Deva aa raha hai 🔥#DevaOnNetflix pic.twitter.com/9eHQGvnjWn— Netflix India (@NetflixIndia) March 27, 2025 -
ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ముంబయిలో ఆమె కారును ఓ బస్సు ఢీకొట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ సమయంలో ఐశ్వర్య బాడీ గార్డ్స్ వెంటనే కారులో నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో లేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.ఐశ్వర్యరాయ్ కారును బస్సు వెనుక నుంచి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే కారుకు ఎలాంటి తీవ్రమైన నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తర్వాత కారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.అక్కడ పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని జుహుకి చెందిన ఒక పోలీసు అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్యరాయ్ అభిమానులు కాస్తా ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆమె క్షేమం గురించి పలువురు ఆరా తీశారు.కాగా.. ఐశ్వర్యరాయ్ చివరిసారిగా పొన్నియిన్ సెల్వన్: పార్ట్- 2లో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. దుబాయ్లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో ఆమె ఉత్తమ నటిగా ప్రధాన పాత్ర (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం 2023లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) -
తండ్రైన కేఎల్ రాహుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి
బాలీవుడ్ భామ అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు పాప పుట్టారని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు. పలువురు సినీతారలు సైతం కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలోనే అతియాశెట్టి గర్భంతో ఉన్నట్లు రాహుల్ సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాదిలోనే మా ఇంటికి అందమైన ఆశీర్వాదం రాబోతుందని పోస్ట్ చేశారు.కాగా.. అతియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో 'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది.కేఎల్, అతియా శెట్టి ప్రేమ వివాహంఅయితే కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం 2023, జనవరి 23న ముంబయిలోని ఫామ్హౌస్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ సినీతారలు, పలువురు క్రికెటర్ల సందడి చేశారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
'ఒకప్పటిలా లేదు.. ప్లాస్టిక్ సర్జరీ'.. పెదవి విప్పిన హీరోయిన్
చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తోంది అవనీత్ కౌర్ (Avneet Kaur). అయితే అప్పటికి, ఇప్పటికీ అవనీత్ చాలా మారిపోవడంతో తను ఏదైనా సర్జరీ చేయించుకుందన్న పుకార్లు కూడా వచ్చాయి. వీటన్నింటికీ ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో చెక్ పెట్టింది. అవనీత్ కౌర్ మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి నేను కెమెరా చూస్తూనే పెరిగాను. చాలామంది నా గురించి విచిత్రంగా మాట్లాడుతుంటారు. ప్లాస్టిక్ సర్జరీ.. గట్రా!చిన్నప్పుడు ఎలా ఉండేది.. ఇప్పుడెలా అయింది.. చాలా మారిపోయింది. కచ్చితంగా తన ముఖానికి ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంది అంటుంటారు. ఈ తరహా కామెంట్లు చదివినప్పుడు కోపమొస్తుంది. ఎందుకంటే ఏడెనిమిదేళ్ల వయసులో నేను చిన్న పిల్లను. ఎదుగుతూ ఉండేకొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు నాకు 23 ఏళ్లు. చిన్నప్పటిలా ఎలా ఉంటాను?కేవలం అది మాత్రమే..నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. ఏ ఫిల్లర్స్ వేయించుకోలేదు. కాకపోతే ముఖానికి ఫేషియల్ మాత్రం చేయించుకుంటాను. చర్మసంరక్షణ కోసం ఆమాత్రమైనా చేయాలి కదా! చర్మం వదులుగా కాకుండా బిగుతుగా ఉండేలా చూసుకుంటాను అని చెప్పుకొచ్చింది. అవనీత్ కౌర్ జన్మస్థలం పంజాబ్. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలా ఎనిమిదేళ్ల వయసు నుంచే పలు స్టేజ్ షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోల నుంచి సినిమాల దాకా..‘డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్’, ‘డాన్స్ కీ సూపర్ స్టార్స్’, ‘ఝలక్ దిఖ్లా జా 5’ తదితర డ్యాన్స్ షోలలో పాల్గొంది. ‘మేరీ మా’, ‘సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ’, ‘హమారీ సిస్టర్ దీదీ’ వంటి సీరియల్స్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. అలాద్దీన్ సీరియల్లో యాస్మిన్ పాత్రతో ఫేమస్ అయింది. అలా మర్దానీ సినిమాలో నటించింది. ‘దోస్త్’, ‘బ్రూనీ’, ‘ఏక్తా’, ‘మర్దానీ 2’, 'టీకూ వెడ్స్ షెరూ', 'లవ్కీ అరేంజ్ మ్యారేజ్' చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: నిజం ఎంతోకాలం దాగదు, ఈ రోజు వస్తుందని తెలుసు: మంచు లక్ష్మి -
ప్రభాస్కి అన్నయ్యగా..?
ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించనున్నారట. అది కూడా ప్రభాస్కి అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. తనదైన యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారట సందీప్. ఈ మూవీలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్.ఇందులో యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుందని భోగట్టా. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. బాలీవుడ్లో సంజయ్ దత్కి ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్కి అన్నయ్యగా ఆయన్ని తీసుకోనున్నారట సందీప్. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి సంజయ్ అయితే పక్కాగా సరితూగుతారన్నది దర్శకుడి ఆలోచనట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. మరి ‘స్పిరిట్’లో సంజయ్ దత్ భాగం అవుతారా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
జాన్వీ కపూర్ ఫాదర్తో ఎవరైనా పెట్టుకుంటారా?.. నిర్మాత నాగవంశీ కామెంట్స్
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ మూవీని 2023లో వచ్చిన మ్యాడ్కు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే వచ్చార్రోయ్.. మళ్లొచ్చార్రోయ్ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రనిర్మాత సూర్య దేవర నాగవంశీ, డైరెక్టర్ కల్యాణ్ శంకర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరిని సంగీత్ శోభన్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. వీరి మధ్య జరిదిన సరదా సంభాషణలో బోనీకపూర్ అంశం తెరపైకి వచ్చింది. బోనీ కపూర్తో జరిగిన డిబేట్లో ఆయనను కొంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడారని వార్తలొచ్చాయి. ఇంతకీ అక్కడ అసలేం జరిగిందని సంగీత్ శోభన్ ప్రశ్నించారు.దీనిపై నాగవంశీ స్పందిస్తూ..'అసలు అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే.. జాన్వీ కపూర్ లాంటి అమ్మాయికి ఫాదర్ ఆయన. అలాంటి వ్యక్తితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా డిస్రెస్పెర్ట్ చేస్తారా? అది కూడా ఆలోచించకుండా నేను బోనీ కపూర్ను గౌరవించలేదని అంటున్నారు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు.కాగా.. ముంబయిలో జరిగిన నిర్మాతల డిబేట్లో బాలీవుడ్, దక్షిణాది సినిమాల విషయంలో గతంలో నాగవంశీ మాట్లాడారు. నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. అయితే నాగవంశీ వ్యాఖ్యలను బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఖండించారు. -
'ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యా'.. మహిళపై ప్రియాంక చోప్రా ప్రశంసలు
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ మూవీతో బిజీగా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తి కావడంతో ప్యాకప్ చెప్పేశారు. దీంతో చిత్రబృందంతో పాటు ప్రియాంక చోప్రా ముంబయికి ప్రయాణమైంది. అయితే తాజాగా ఇవాళ షూటింగ్ లోకేషన్ నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్కు వస్తుండగా దారిలో ప్రకృతి అందాలను తన సెల్ఫోన్ కెమెరాలో బంధించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే అందులో ప్రియాంక చోప్రా ఓ వీడియోను కూడా పంచుకుంది. ఓ మహిళను చూసి తాను ఇన్స్పైర్ అయ్యానని తెలిపింది. ఆమె తనలో స్ఫూర్తి నింపిందని కొనియాడింది. అందుకే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవాలనిపించిందని తెలిపింది.(ఇది చదవండి: SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్)వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను ఇలా తరచుగా చేయను. కానీ ఈరోజు ఎందుకో నాకు చాలా స్ఫూర్తినిచ్చే సంఘటన ఎదురైంది. నేను ముంబయికి వెళ్లేక్రమంలో విశాఖపట్నం విమానాశ్రయానికి కారులో వెళ్తున్నా. వైజాగ్ ట్రాఫిక్లో ఓ మహిళ జామపండ్లు అమ్ముతుండటం చూశాను. నాకు కచ్చా (పచ్చి) జామపండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను వెంటనే ఆమెను ఆపి మీ జామపండ్లన్నింటికీ ఖరీదు ఎంత? అని అడిగాను. ఆమె 150 రూపాయలు అని చెప్పింది. నేను తనకు 200 రూపాయల నోటు ఇచ్చా. కానీ ఆమె నాకు చిల్లర ఇవ్వడానికి ప్రయత్నించింది. వద్దు.. దయచేసి మీరే ఉంచుకోండి అని తనతో అన్నా. ఎందుకంటే జీవనోపాధి కోసం ఆమె జామపండ్లు అమ్మింది. కానీ ట్రాఫిక్లో గ్రీన్ సిగ్నల్ పడేలోపే ఆమె తిరిగి వచ్చి నాకు మరో రెండు జామపండ్లు ఇచ్చింది. అంటే ఆ మహిళ నా నుంచి ఎలాంటి దాతృత్వాన్ని కోరుకోలేదు. ఆమె తీరు నిజంగా నన్ను కదిలించింది' అని పంచుకుంది.ఈ వీడియోతో పాటు ఎస్ఎస్ఎంబీ29 సెట్లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమా ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఇది 2019 లో విడుదలైంది. ఇటీవల సిటాడెల్ రెండవ సీజన్ షూటింగ్ ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ప్రస్తుతం మహేశ్ బాబు మూవీలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!
బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న జంట ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా. బిగ్ బాస్ సీజన్- 16లో వీరిద్దరు కంటెస్టెంట్స్గా పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రియాంక సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఆ రియాలిటీ షో తర్వాత వీరిద్దరు పలు సీరియల్స్లోనూ నటించారు. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం కాబోయే తేర్రే హో జాయేన్ హమ్ షో కోసం జతకట్టనున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ బుల్లితెర జంట ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక, అంకిత్ తమ రిలేషన్కు గుడ్ బై చెప్పనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని టాక్ వినిపించింది. కానీ తాజా పరిణామాలతో ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నట్లు బీటౌన్లో టాక్ నడుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే ఒకరినొకరు అన్ఫాలో చేసినప్పటికీ.. ఇన్స్టాగ్రామ్ ఫోటోలు తొలగించలేదు. అయితే ఇదంతా రాబోయే కొత్త షో కోసం ఇలా చేశారా? అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. అంకిత్ గుప్తా, ప్రియాంకతో బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్లో జంటగా నటించారు. ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రం హీరో హీరోయిన్లో కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది. -
తండేల్ను వెనక్కి నెట్టిన ఎమర్జన్సీ.. సిల్లీ ఆస్కార్ అంటూ కంగనా కామెంట్స్!
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). చాలాసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో కంనగా ఇందిరా గాంధీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా ఆడియన్స్ను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఓటీటీలో దూసుకెళ్తోంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్ సినిమాల జాబితాలో టాప్ ప్లేస్లో ట్రెండింగ్ అవుతోంది. నాగచైతన్య మూవీ తండేల్, అజయ్ దేవగణ్ ఆజాద్ సినిమాలను వెనక్కి నెట్టేసింది.ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్స్ ఎమర్జన్సీ చిత్రాన్ని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు. ఈ చిత్రాన్ని భారత్ నుంచి ఆస్కార్ పంపాలని పోస్ట్ చేశాడు. వీటికి సోషల్ మీడియా వేదికగా కంగనా రిప్లై ఇచ్చింది. ఇన్స్టా లో ట్వీట్స్ను షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందించింది. అమెరికా లాంటి దేశం ఇలాంటి సినిమాలను గుర్తించడానికి ఇష్టపడరు. వారు అభివృద్ధి చెందుతున్న దేశాలను అణచివేస్తారు. అదే ఈ ఎమర్జన్సీలో చూపించాను. వారి సిల్లీ ఆస్కార్ అవార్డ్ను వాళ్ల వద్దే ఉంచుకోనివ్వండి. మాకు నేషనల్ అవార్డులు ఉన్నాయని నెటిజన్కు రిప్లై ఇచ్చింది.బాలీవుడ్ చిత్ర నిర్మాత సంజయ్ గుప్తా కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ రోజు నేను ఎమర్జెన్సీ మూవీని చూశాను. చాలా స్పష్టంగా చెప్పాలంటే.. నేను ముందుగా అంచనా వేసినట్లుగా ఈ సినిమాను ప్లాన్ చేయలేదని అన్నారు. ఈ సినిమాలో కంగనా నటన, దర్శకత్వం రెండూ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీనికి కంగనా బదులిస్తూ 'సినిమా పరిశ్రమ తన ద్వేషం, పక్షపాతాల నుంచి బయటపడాలి.. మంచి పనిని ఎప్పటికీ గుర్తించాలి సంజయ్ జీ.. మీరు ఆ అడ్డంకిని బద్దలు కొట్టినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది.కాగా.. నెట్ఫ్లిక్స్లో శుక్రవారం విడుదలైన ఎమర్జెన్సీ మూడు రోజుల్లోనే నెట్ఫ్లిక్స్ సినిమాల జాబితాలో టాప్ ట్రెండింగ్లో ఉంది. అజయ్ దేవగన్ ఆజాద్, నాగ చైతన్య తండేల్ చిత్రాలను అధిగమించింది. ఈ చిత్రం కంగనా రనౌత్ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి విధించిన 21 నెలల ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కూడా నటించారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. -
అమిర్ ఖాన్తో డేటింగ్.. తొలిసారి అలా కనిపించిన గౌరీ స్ప్రాట్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. తాను డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దాదాపు 60 ఏళ్ల వయసులో అమిర్ ఖాన్ రిలేషన్లో ఉన్నానంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన తన ప్రీ బర్త్ డే ఈవెంట్లో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ను మీడియా ముందు అందరికీ పరిచయం చేశాడు. దీంతో అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేశారు.అయితే తాజాగా అమీర్ ఖాన్తో రిలేషన్ తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది గౌరీ. అమిర్ ఖాన్ పుట్టినరోజు పార్టీలో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అసలు ఎవరీ గౌరీ స్ప్రాట్..కాగా.. ఇటీవల ముంబయి నిర్వహించిన ప్రెస్మీట్లో గౌరీతో తన రిలేషన్షిప్ను అమీర్ ఖాన్ ధృవీకరించారు. దాదాపు ఏడాదిగా తాము డేటింగ్లో ఉన్నామని పేర్కొన్నారు. ఆమెకు ఆరేళ్ల పాప కూడా ఉందని తెలిపారు. గత 25 ఏళ్లుగా ఆమె తెలుసని కూడా అన్నారు. అంతేకాకుండా గౌరీ ఇటీవలే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్లను కలిశారని ఆయన ప్రస్తావించారు. కాగా.. ఇప్పటికే అమిర్ ఖాన్ కిరణ్ రావు, రీనా దత్తాలతో విడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగళూరుకు చెందిన గౌరీ.. రీటా స్ప్రాట్ కుమార్తె. ప్రస్తుతం ఆమె ముంబయిలోనే ఓ సెలూన్ను నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
హోలీ వేడుకల్లో సోనాక్షి సిన్హా.. ఆయన ఎక్కడంటూ నెటిజన్ల ట్రోల్స్!
సినీ తారలంతా హోలీ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఫ్యామిలీతో కలిసి రంగులు చల్లుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటున్నారు. అందరిలాగే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సైతం హోలీ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ఈ ముద్దుగుమ్మకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోనాక్షిని ట్రోల్ చేశారు. హోలీ వేడుకల్లో మీ భర్త జహీర్ ఇక్బాల్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అయితే నెటిజన్ల కామెంట్స్కు సోనాక్షి కూడా స్పందించింది. 'నేను ప్రస్తుతం జటాధర మూవీ షూట్లో ఉన్నా.. నా భర్త జహీర్ ముంబయిలో ఉన్నారు.. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి' అంటూ విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది.కాగా.. గతేడాది జూన్లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి, జహీర్ దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. సల్మాన్ఖాన్ నిర్వహించిన పార్టీలో తొలిసారిగా వీరిద్దరు కలుసుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 'నోట్బుక్'తో అరంగేట్రం చేసిన జహీర్.. సోనాక్షితో కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. గతేడాది జూన్ 23, 2024న ముంబయిలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సల్మాన్ ఖాన్, కాజోల్, విద్యాబాలన్ లాంటి అగ్రతారలు హాజరయ్యారు.ఇక సినిమాల విషయానికొస్తే సోనాక్షి సిన్హా ప్రస్తుతం జటాధార చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ (Bhagyashree) ఆస్పత్రిపాలైంది. ఈ మధ్య ట్రెండింగ్లోకి వచ్చిన పికెల్బాల్ ఆడుతుండగా తలకు గాయమైంది. దీంతో ఆస్పత్రిలో చేరగా వైద్యులు ఆమె నుదురుకు 13 కుట్లు వేశారు. తలకు కట్టుతో ఉన్న భాగ్యశ్రీ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ భాగ్యశ్రీ?అందాల తార భాగ్యశ్రీ.. ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించింది. 1989లో మైనే ప్యార్ కియా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇందులో సల్మాన్ ఖాన్తో జోడీ కట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ మరుసటి ఏడాదే వ్యాపారవేత్త హిమాలయ్ దస్సానిని పెళ్లి చేసుకుంది.తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. త్యాగి, పాయల్, అమ్మవ్రా గంద (కన్నడ), మా సంతోషి మా, రెడ్ అలర్ట్: ద వార్ వి, ఛత్రపతి, ససాజిని షిండేకా వైరల్ వీడియో వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఓంకారం, యువరత్న రానా, రాధేశ్యామ్ సినిమాలతో మెప్పించింది. ఈమె చివరగా లైఫ్ హిల్ గయూ అనే హాట్స్టార్ వెబ్ సిరీస్లో కనిపించింది.చదవండి: అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్ -
ప్రముఖ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. కర్ణాటకలోని ప్రముఖ కుక్కే శ్రీ సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించారు. ఇటీవలే కుంభమేళాలోనూ కత్రినా కైఫ్ పుణ్యస్నానమాచరించారు. తాజాగా శ్రీ సుబ్రమణ్య ప్రత్యేకమైన పూజులు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ను పెళ్లాడిన కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. 2023లో మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టిస్తోంది.కాగా... కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డ్స్- 2025 వేడుకలో మెరిసింది. జైపూర్లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డ్స్లో కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. -
ఆ సీన్స్ చేయకపోవడానికి కారణమిదే: కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది సింగం ఏగైన్, క్రూ, ది బకింగ్హమ్ మర్డర్స్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. ది బకింగ్హామ్ మర్డర్స్ మూవీలో పోలీసు పాత్రలో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అలాంటి సన్నివేశాలను చేయడం తనకు ఎప్పుడూ సౌకర్యంగా అనిపించలేదని తన 25 ఏళ్ల సినీ కెరీర్ గురించి మాట్లాడింది.కరీనా కపూర్ మాట్లాడుతూ.. "ఇది మొత్తం మనం చూసే ఆలోచన విధానంపై ఆధారపడి ఉంది. లైంగికతను మానవ అనుభవంగా మనం చూడం. ఇలాంటి సీన్స్ తెరపై ఉంచే ముందు మనం దానిని మరింతగా లోతుగా చూడటం, గౌరవించడం ప్రారంభించాలి. ఇదే నా నమ్మకం," అని ఆమె అన్నారు. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి మీరెందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించగా.. కరీనా కపూర్ స్పందించింది. కథను అలా ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం కాదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా.. కథ పరంగా అయితే అది తప్పనిసరి అని నేను నమ్మను.. ఎందుకంటే అలా చేయడం సౌకర్యంగా ఉండదని నాకు తెలుసు. నేను ఎప్పుడూ అలా చేయలేదు' అని తెలిపింది.(ఇది చదవండి: సీక్రెట్గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!)కాగా.. కరీనా కపూర్ తన 25 ఏళ్ల సినీ కెరీర్లో తెరపై ఎప్పుడూ లైంగిక సన్నివేశాల్లో నటించలేదు. 2003లో వచ్చిన 'చమేలి' సినిమాలో కపూర్ ఒక సెక్స్ వర్కర్ పాత్ర మాత్రమే పోషించింది. ఈ సినిమాలో నటించడంపై కరీనా మాట్లాడుతూ..ఈ సినిమా ద్వారా నేను చాలా విషయాలను గ్రహించానని తెలిపింది. స్త్రీ తత్వం, అందంగా ఉండటం వంటి సాంప్రదాయ భావనలకు అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదని అనిపించింది. ఈ సినిమా నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అని వివరించింది. అది చిన్న వయసులో నా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. ఆ పాత్ర పోషించినందుకు నేను సంతోషంగా అనిపించిందని తెలిపింది. కాగా.. కరీనా కపూర్ కభీ ఖుషీ కభీ ఘమ్, ఐత్రాజ్, చుప్ చుప్ కే, గోల్మాన్ రిటర్న్స్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. -
అవార్డ్ అందుకున్న సుకుమార్ భార్య.. వైట్ డ్రెస్లో మంచు లక్ష్మీ పోజులు!
డిఫరెంట్ లుక్స్తో ఆదా శర్మ హోయలు..ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మెరిసిన కత్రినా కైఫ్..అవార్డ్ అందుకున్న తబిత సుకుమార్..వైట్ డ్రెస్లో మంచు లక్ష్మీ పోజులు..వేకేషన్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ నీలం ఉపాధ్యాయ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
హీరోయిన్తో శుభ్మన్ గిల్ డేటింగ్.. ఆ ఒక్క ఫోటో వల్లే !
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి సగర్వంగా ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్పై ఘనవిజయం సాధించిన. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో విజయం భారత్ను వరించింది. దీంతో టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. దుబాయ్లో జరిగిన పలువురు బాలీవుడ్ సినీ తారలు సైతం ఈ మ్యాచ్ను వీక్షించారు.అయితే ఈ మ్యాచ్ తర్వాత భారత ఓపెనర్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్తో శుభ్మన్ గిల్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసిన ఫోటోలను అవనీత్ కౌర్ ఇన్స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ సందర్బంగా అవనీత్ కౌర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.తాజాగా టీమిండియా కప్ గెలవడంతో మరోసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాకుండా గతేడాది శుభ్మన్ బర్త్ డే సందర్భంగా అవనీత్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది. గిల్తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై మరోసారి డేటింగ్పై చర్చ మొదలైంది. ఈ రూమర్స్ నేపథ్యంలో ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా.. క్రికెటర్ గిల్పై గతంలో కూడా సారా అలీ ఖాన్తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. 26 ఏళ్ల అవనీత్ కౌర్ బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ కనిపించింది. ఎనిమిదేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అవనీత్ కౌర్ మొదటిసారిగా 2010లో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షోలో కనిపించింది. ఆ తర్వాత ఆమె 'డ్యాన్స్ కే సూపర్స్టార్స్'లో పాల్గొంది. ఆ తర్వాత 2012లో 'మేరీ మా' టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఝలక్ దిఖ్లా జా (2012), మసావిత్రిక్, ఏక్ ముత్తి ఆస్మాన్ లాంటి సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత 'మర్దానీ' మూవీతో బిగ్ స్క్రీన్లోకి అడుగుపెట్టింది. 2023లో కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షేరు చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన రొమాంటిక్ పాత్రలో కనిపించింది. కౌర్ చివరిసారిగా 2024లో వచ్చిన 'పార్టీ టిల్ ఐ డై'అనే మర్డర్ మిస్టరీలో నటించింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
శ్రీదేవి చివరి చిత్రానికి సీక్వెల్.. ఖుషీ కపూర్పై నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ అగ్రనిర్మాత, డైరెక్టర్ బోనీ కపూర్ తాజాగా ఓ సినిమాను ప్రకటించారు. తన భార్య, దివంగత నటి శ్రీదేవి నటించిన చివరి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించునున్నట్లు వెల్లడించారు. 2017లో వచ్చిన మామ్ మూవీకి కొనసాగింపుగా తాజాగా ఉండనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో తన చిన్న కూతురైన ఖుషీ కపూర్ సైతం నటిస్తున్నట్లు తెలిపారు. ఐఐఎఫ్ఏ-2025 అవార్డుల వేడుకకు హాజరైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.అయితే శ్రీదేవి సీక్వెల్ మూవీలో ఖుషీ కపూర్ను ఎంపిక చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవి స్థానంలో ఖుషీ చేయడమేంటి? ఇది చూస్తుంటే పెద్ద జోక్గా ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదే నిజమైతే డిజాస్టర్ ఖాయమని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దయచేసి ఈ సినిమాకు జాన్వీ కపూర్ను తీసుకోవాలని ఓ నెటిజన్ కోరాడు. వీలైతే యామీ గౌతమ్, కంగనా రనౌత్, బిపాసా బసుని తీసుకోండి కానీ.. ఖుషీ కపూర్కు నటనా నైపుణ్యాలు లేవని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.నటన విషయానికొస్తే ఖుషీ కపూర్ చివరిసారిగా ఇబ్రహీం అలీ ఖాన్తో నాదానియన్లో కనిపించింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా బోనీ కపూర్ చేసిన ప్రకటనతో నెటిజన్స్ తీవ్ర నిరాశకు గురువుతున్నారు. శ్రీదేవీ మూవీ సీక్వెల్లో మాత్రం ఖుషీ కపూర్ వద్దని తెగేసి చెబుతున్నారు. మామ్ సీక్వెల్ కోసం ఖుషీని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. 2018లో ఆమె మరణానికి ముందు నటించిన చివరి చిత్రమిదే. శ్రీదేవి కెరీర్లో 300వ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, పాకిస్థానీ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీదేవి మరణానంతరం 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మామ్ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. -
తెలుగు హీరో... హిందీ విలన్
తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్ల హవా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసేందుకే బాలీవుడ్ యాక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తొలిసారిగా తెలుగు తెరపై విలన్గా కనిపించనున్న కొందరు బాలీవుడ్ యాక్టర్స్, వారు ఓకే చేసిన సినిమాలు వివరాలు ఇలా ఉన్నాయి.మల్టీ మిలియనీర్‘నీర్జా, పద్మావత్, సంజు, గంగుభాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటుడిగా బాలీవుడ్లో నిరూపించుకున్నారు జిమ్ సర్భ్. ఈ నటుడికి టాలీవుడ్ ఎంట్రీ చాన్స్ లభించింది. నాగార్జున–ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ మల్టీ మిలియనీర్ పాత్రను జిమ్ సర్భ్ చేస్తున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పీరియాడికల్ ఫిల్మ్ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హైప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ భిక్షగాడిగా కనిపిస్తారని, ఓ ఆఫీసర్గా నాగార్జున, మల్టీ మిలియనీర్ పాత్రలో జిమ్ సర్భ్ కనిపిస్తారని తెలిసింది. ఓ బలమైన సామాజిక అంశం, డబ్బు ప్రధానాంశాలుగా ‘కుబేర’ కథనం సాగుతుందని సమాచారం.ఇటు ఓజీ... అటు జీ2‘మర్డర్, గ్యాంగ్స్టర్, ముంబై సాగ, టైగర్ 3, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మి గురించి తెలుగు ఆడియన్స్కు తెలిసిందే. ఈ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఖరారైంది. ప్రజెంట్ రెండు తెలుగు సినిమాల్లో విలన్గా నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మి. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలోని గ్యాంగ్స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్ – ప్రచారంలో ఉన్న టైటిల్)లో ఇమ్రాన్ హష్మీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓమి భావ్ అనే పాత్రలో హష్మి కనిపించనున్నట్లుగా తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ΄్లాన్ చేస్తోంది. మరోవైపు అడివి శేష్ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. కాగా ‘జీ 2’ సినిమా షూటింగ్లో ఆల్రెడీ ఇమ్రాన్ హష్మీ జాయిన్ అయ్యారు. గత ఏడాది అక్టోబరులో ‘జీ 2’ కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్గా ‘జీ 2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో విలన్గా నటిస్తూ, డబుల్ విలన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇమ్రాన్ హష్మి.ఇన్స్పెక్టర్ స్వామిఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం విజయ్ సేతుపతి ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘రైఫిల్ క్లబ్’ వంటి చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అనురాగ్ కశ్యప్ యాక్టర్గా తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని కొందరు తెలుగు ఆడియన్స్ ఆశపడ్డారు. వారి ఆశ నిజమైంది. అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్: ఓ ప్రేమకథ’ అనే సినిమా రూపొందుతోంది.ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఇన్స్పెక్టర్ స్వామి అనే కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ఉంటుందని తెలిసింది. కథ రీత్యా... ఇద్దరు ప్రేమికులు బ్రేకప్ చెప్పుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా... వీరిద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రైమ్ను అడ్డుకోవాల్సిన బాధ్యత ఇన్స్పెక్టర్ స్వామిది. మరి... క్రిమినల్స్ అయిన ఈ ప్రేమికులను పోలీసాఫీసర్గా ఇన్స్పెక్టర్ స్వామి పట్టుకున్నాడా? అనేది ‘డెకాయిట్’ సినిమా చూసి తెలుసుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగం వంటి అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘డెకాయిట్’ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు నటుడిగానే కాదు... ‘పాంచ్, బాంబే టాకీస్, అగ్లీ, మ్యాడ్లీ, దో బార’ వంటి హిందీ చిత్రాలతో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్లో దర్శకుడిగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగానూ, రైటర్గానూ ఆయన రాణిస్తున్న విషయం కూడా విదితమే.అర్జున్కు విలన్గా...స్క్రీన్పై నందమూరి కల్యాణ్రామ్తో ఢీ అంటే ఢీ అంటున్నారు బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్గా నటిస్తున్నారు విజయశాంతి. ఇక ఈ మూవీలో విలన్గా నటిస్తున్నారు సోహైల్ ఖాన్. ‘పార్ట్నర్, వీర్, దబాంగ్ 3’ వంటి చిత్రాల్లో నటుడిగా అభినందనలు అందుకున్న సోహైల్ ఖాన్కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాకీ పార్టు పూర్తయింది. రామ్చరణ్కు విలన్గా...రామ్చరణ్కు విలన్గా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు. హీరో రామ్చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్కుమార్, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలోప్రారంభం కానుందని తెలిసింది.కాగా ఈ మల్టీ స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తీ తదితర క్రీడలు) డ్రామాలో దివ్యేందు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ దివ్యేందు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో రామ్చరణ్ పాత్రకు విలన్గా కనిపిస్తారట దివ్యేందు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మార్చి 27న రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావొచ్చని, దీపావళికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందనీ సమాచారం. మరోవైపు ‘ప్యార్కా పంచనామా, టాయిలెట్: ఏక్ ప్రేమకథ, ఓల్డ్ కపుల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా రాణించారు దివ్యేందు. కాగా ‘మిర్జాపూర్, సాల్ట్ సిటీ, ది రైల్వే మెన్’ వంటి వెబ్ సిరీస్లతో దివ్యేందు మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. కొందరు బాలీవుడ్ యాక్టర్స్ ఆల్రెడీ తెలుగులో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా చేసిన ‘భగవంత్ సింగ్ కేసరి’లో అర్జున్ రామ్పాల్, ‘డాకు మహారాజ్’లో బాబీ డియోల్ విలన్స్గా నటించారు. కాగా పవన్ కల్యాణ్ ‘హరిహరవీర మల్లు’ చిత్రంలో ఎంతో కీలకమైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర 2’ చిత్రంలోనూ బాబీ డియోల్ విలన్గా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఏడాది విడుదలైన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేశారు సంజయ్ దత్. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాల్లోనూ లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ప్రభాస్ ‘ఫౌజి’ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లీడ్ యాక్టర్స్గా చేస్తున్నారు. నాగార్జున–నానీల ‘దేవదాసు’ (2018)లో విలన్గా యాక్ట్ చేసిన కునాల్ కపూర్ ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో మళ్లీ విలన్గా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్ ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్ ఎంతటి బలమైన రోల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కల్కి 2’లోనూ అమితాబ్ బచ్చన్ రోల్ కొనసాగుతుందని తెలిసిందే... ఇలా విలన్స్గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ మరికొందరు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తోన్న బాలకృష్ణ హీరోయిన్..!
రక్త చరిత్ర, లెజెండ్, లయన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఆ తర్వాత అయితే తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్, తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తోంది. గతేడాది మేరీ క్రిస్మస్, సిస్టర్ మిడ్నైట్ లాంటి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం లాస్ట్ డేస్ అనే మూవీలో కనిపించనుంది.ఇదిలా ఉండగా తాజాగా రాధిక ఆప్టేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. త్వరలోనే రాధికా ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో తెరకెక్కించబోయే కోట్యా అనే ఓ యాక్షన్ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సినీవీ-సీహెచ్డీ వెల్లడించిది. ఈ సినిమాను నిర్మాత విక్రమాదిత్య మోత్వానే నిర్మిస్తారని సమాచారం. ఏదేమైనా బాలయ్య హీరోయిన్ డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా..రాధికా ఆప్టే ప్యాడ్మ్యాన్, అంధాధున్, విక్రమ్ వేద, ఎ కాల్ టు స్పై, కబాలి, లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలతో అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా నటించిన సిస్టర్ మిడ్నైట్ బాఫ్టాకు నామినేట్ అయింది. అంతేకాకుండా సిస్టర్ మిడ్నైట్ గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. కాగా.. రాధికా ఇటీవల భర్త బెనెడిక్ట్ టేలర్తో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. -
బంగారాన్ని బహుమతిగా ఇచ్చేసిన నటి.. నోరెళ్లబెట్టిన కూతురు
ఎవరైనా మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయనో, బ్యాగు బాగుందనో, నెక్లెస్ బాగుందనో చెప్తే థాంక్స్ అంటూ సంతోషిస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటి మాత్రం బంగారు దిద్దులు బాగున్నాయన్నందుకు ఏకంగా వాటినే తీసి బహుమతిగా ఇచ్చేసింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon). రవీనా తన కూతురు రాషా తడానీతో కలిసి ముంబై ఎయిర్పోర్టులో బుధవారం సాయంత్రం ప్రత్యక్షమైంది. ఆమె కనిపించగానే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తనను వెంబడిస్తూ కెమెరాలో రికార్డు చేస్తున్నారు.బంగారు కమ్మ బహుమతిగా..వారిలో ఒకరు రవీనాను తన చెవిదిద్దులు బాగున్నాయని పొగిడాడు. దాంతో రవీనా ఏ కమ్మ బాగుందని అడుగుతూ దాన్ని తీసేసింది. తనకు కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తిని ఆ బంగారు దిద్దును బహుమతిగా ఇచ్చేసింది. ఇదంతా చూసిన రాహా.. తల్లి చేసిన పనికి నోరెళ్లబెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రవీనా మనసు బంగారం.. ఈ రోజుల్లో బంగారాన్ని దానం చేసే మహానుభావులు ఎవరున్నారు? వావ్, మంచి మనసున్నవాళ్లకే ఇలాంటివి సాధ్యమవుతాయి.. తను నిజంగా గ్రేట్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.రెండు గాజులు గిఫ్ట్గా..రవీనా ఇలా తన ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఓ పెళ్లికి హాజరైన ఆమె పెళ్లికూతురికి తన గాజుల్ని గిఫ్ట్గా ఇచ్చింది. అవి సాధారణ బ్యాంగిల్స్ కావు. వాటిపై రవీనా పేరుతో పాటు ఆమె భర్త అనిల్ పేరు కూడా రాసి ఉంది. అయినా అవేమీ పట్టించుకోకుండా వాటిని కొత్త జంటకు కానుకగా ఇచ్చేసింది. ఆమె సినిమాల విషయానికి వస్తే వెల్కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అనీస్ బజ్మీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఆ డైరెక్టర్ వల్ల బతకొద్దనుకున్నా.. సింగపూర్లో 13 ఏళ్లు టీచర్గా..: హిట్లర్ నటి -
బాలీవుడ్ హీరో ఫ్యామిలీ ఈవెంట్లో శ్రీలీల.. అప్పుడే డేటింగ్ రూమర్స్!
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఉగాది కానుకగా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ మూవీతో పాటు బాలీవుడ్లోనూ ఎంట్రీకి సిద్ధమైంది శ్రీలీల. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను ఇటీవలే విడుదల చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఈవెంట్లో మెరిసింది. హిందీ సాంగ్కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు కార్తీక్ ఆర్యన్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన సోదరి కృతిక తివారీ కోసం ఈ వేడుక ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన నెటిజన్స్ డేటింగ్లో ఉన్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కార్తీక్ ఆర్యన్ గతేడాది సూపర్హిట్ చిత్రం భూల్ భూలైయా- 3లో కనిపించాడు. మరోవైపు శ్రీలీల పుష్ప-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్లో మెప్పించింది. Sreeleela at kartik aaryan's sister celebrationbyu/Medium_Bicycle_1004 inBollyBlindsNGossip -
అభిషేక్ - ఐశ్వర్యపై విడాకుల రూమర్స్.. ఇకపై తెరపడినట్లే!
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్పై గత కొన్ని నెలలుగా విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అనిల్ అంబానీ కుమారుడి పెళ్లి సమయంలోనూ వీరిద్దరు విడిపోనున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ బర్త్ డే రోజు ఆలస్యంగా విషెస్ చెప్పడంతో మరోసారి డివోర్స్ వార్తలు వినిపించాయి. అలా ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.విడాకుల వార్తల నేపథ్యంలో స్టార్ కపుల్ బాలీవుడ్ డైరెక్టర్ కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. దర్శకుడు అశుతోష్ గోవారికర్ కుమారుడి పెళ్లిలో జంటగా కనిపించారు. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఓ శుభ కార్యానికి హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచైనా విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు పడుతుందని భావిస్తున్నారు. ఐశ్వర్య, అభిషేక్ పెళ్లికి హాజరైన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లికి అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, కిరణ్ రావ్, గాయత్రీ ఒబెరాయ్, జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్ముఖ్, విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లాంటి సినీతారలు హాజరయ్యారు. అశుతోష్ కుమారుడు కోణార్క్ మార్చి 2న నియతిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.అభిషేక్-ఐశ్వర్యల పెళ్లి 2007లో జరిగింది. వీరిద్దరికి 2011లో ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె జన్మించారు. జూలై 2024లో అనంత్ అంబానీ పెళ్లి నుంచి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్పై విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ జంట పెళ్లికి హాజరవ్వడంతో ఆ వార్తలకు దాదాపు చెక్ పడినట్లే. View this post on Instagram A post shared by Aishwarya Rai Team🇲🇺 (@aishwarya_raifan) -
రెండో భర్తతో బుల్లితెర నటి విడాకులు.. స్పందించిన భామ!
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. పలువురు సినీతారలు తమ వివాహ బంధానికి మధ్యలోనే ముగించేస్తున్నారు. గతేడాది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సైతం తన భార్య సైరా భానుతో విడిపోయారు. దాదాపు 27 వారి వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మరో బాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెళ్లైన ఏడేళ్లకు వీరిద్దరు విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ప్రముఖ బుల్లితెర నటి దీపికా కకర్ ఆమె రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్పై బుల్లితెర జంట స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ ఫేక్ అన్ని కొట్టిపారేశారు. అవీ చూస్తుంటే తమకు నవ్వాలనిపిస్తోందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దీపికా ఆమె భర్త షోయబ్ విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు.దీపిక కక్కర్, షోయబ్ ప్రముఖ బాలీవుడ్ సీరియల్ ససురల్ సిమర్ కా సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు దీపిక కక్కర్ పైలట్ రౌనక్ శాంసన్ను 2011లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షోయబ్ను పెళ్లాడగా..2023లో కుమారుడు రుహాన్ను స్వాగతించారు. -
ఎవరికీ చెప్పకుండా చేయించుకున్నా: సెక్రేడ్ గేమ్స్ నటి
సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కుబ్రా సైత్. ఇటీవలే షాహిద్కపూర్ హీరోగా నటించిన దేవా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ల్లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కుబ్రా సైత్ కెరీర్తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. గతంలో తనకు అబార్షన్ జరిగినప్పుడు ఎదురైన ఇబ్బందులను వివరించింది. ఆ సమయంలో తాను ధైర్యం కోల్పోయినట్లు వెల్లడించింది. అది తన జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదని తెలిపింది.ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. 'నేను అబార్షన్కు వెళ్లినప్పుడు బలంగా ఉన్నట్లు అనిపించలేదు. ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నా. అలా చేయకుంటే బతుకుతానని చెప్పే ధైర్యం, శక్తి నాకు లేవు. ఆ సమయంలో నేను చాలా బలహీనంగా భావించా. నాకు ఏదో వెలితిగా అనిపించింది. అస్సలు విలువ ఉండదేమో అనుకున్నా. కానీ దాని నుంచి బయటపడేందుకు చాలా కాలం పట్టింది. నా కోసం ఒక నిర్ణయం తీసుకున్నా. అది కూడా నా సొంత ఆలోచనలకు కట్టుబడి నిర్ణయించుకున్నా. ఇక్కడ నేను సామాజిక నిబంధనలను ఉల్లంఘించాను అనడానికి ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేనే స్వయంగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నా. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు' అని వెల్లడించింది. ఓసారి తన స్నేహితురాలతో కలిసి ట్రిప్కు వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్తో ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. ఆ సమయంలో తన కళ్లలో నీళ్లు వచ్చాయని వెల్లడించింది. -
అతనితో హీరోయిన్ డేటింగ్.. ఊహించని విధంగా దొరికేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ పేరు ఇటీవల తెగ మార్మోగిపోతోంది. కొద్ది రోజుల క్రితమే ఓ పెళ్లిలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రాహుల్ మోడీతో కనిపించింది. వీరిద్దరు కలిసి జంటగా సన్నిహితుల వివాహా వేడుకలో పాల్గొన్నారు. దీంతో మరోసారి వీరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. గతంలోనూ అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ జంటగా కనిపించారు. అంతేకాదు పలు ఈవెంట్లలో శ్రద్ధా కపూర్ అతనితో పాటు కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని బాలీవుడ్లో టాక్ తరచుగా వినిపిస్తూనే ఉంది.అయితే తాజాగా శ్రద్ధాకపూర్ మరోసారి హాట్టాపిక్గా మారింది. ముంబయిలో ఓ ఈవెంట్కు హాజరైన ఈ ముద్దుగుమ్మ ఫోటోగ్రాఫర్ల చేతికి చిక్కింది. దీంతో ఆమెను తమ కెమెరాల్లో బంధిస్తుండగా తన ఫోన్ కూడా కనిపించింది. ఆ ఫోన్లో తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రాహుల్ మోడీతో దిగిన ఫోటో వాల్పేపర్గా కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే శ్రద్ధా కపూర్ చివరిసారిగా హారర్ కామెడీ ఫిల్మ్ స్త్రీ- 2లో కనిపించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో మరో మూడు సినిమాల్లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
విజయ్తో సినిమా.. నా కూతురు అసలు ఒప్పుకోలేదు: స్టార్ హీరోయిన్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియాలో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల తన సోదరుడి పెళ్లిలో మెరిసిన ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్లో నటించనుంది. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కించబోతున్న ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక కనిపించనుంది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ విచ్చేసిన ముద్దుగుమ్మ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శించింది. ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసమే భాగ్యనగరానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి.అయితే ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తన కూతురి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మధు చోప్రా తన కూతురి సినీ కెరీర్ గురించి మాట్లాడింది. గతంలో దళపతి విజయ్ సరసన ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. విజయ్కు జంటగా తమిజాన్ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ ప్రాజెక్ట్లో నటించేందుకు ప్రియాంక చోప్రా నో చెప్పిందని ఆమె తెలిపింది. అయితే మూవీ మేకర్స్ నా భర్తను కలిసి మాట్లాడారని వెల్లడించారు. దీంతో ఆయన మాట కాదనలేక ప్రియాంక నటించిందని అసలు విషయం చెప్పింది మధు చోప్రా.మధు చోప్రా తమిజన్ సినిమా గురించి మాట్లాడుతూ.. 'ప్రియాంక మొదట ఆ ప్రాజెక్ట్కి నో చెప్పింది. కానీ వారు ప్రియాంక సోదరుడిని కలిశారు. ఆ తర్వాత ఆమె తండ్రిని కలిసి మాట్లాడారు. కేవలం రెండు నెలల పాటు వేసవి సెలవుల్లో మా మూవీ షూట్కు సమయవివ్వండి అని అడిగారు. వారి మాట కాదనలేక ప్రియాంక చోప్రా ఫాదర్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన తండ్రి మాట కోసం ప్రియాంక చోప్రా నటించింది" అని తెలిపింది.విజయ్ అంటే ప్రియాంకకు చాలా గౌరవం ఉందని మధు చోప్రా తెలిపింది. విజయ్ చాలా ఓపికతో ప్రియాంకకు సెట్స్లో సాయం చేశాడని చెప్పుకొచ్చింది. ప్రభుదేవా బ్రదర్ రాజు సుందరం కొరియోగ్రాఫీలో స్టెప్పులు చాలా కఠినంగా ఉన్నాయి.. విజయ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్.. అతనితో ప్రియాంక డ్యాన్స్ చేసేందుకు చాలా కష్టపడిందని పేర్కొంది. అలాగే కొత్త భాష నేర్చుకోవడం, డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడంలో విజయ్ సాయం సాయం చేశాడని మధు చోప్రా గుర్తు చేసుకుంది. ఇకపోతే ప్రియాంక చోప్రా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ హెడ్స్ ఆఫ్ స్టేట్లోనూ కనిపించనుంది. -
జూబ్లీహిల్స్లో సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఆ వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు: విద్యా బాలన్
బాలీవుడ్ విద్యా బాలన్ గతేడాది భూల్ భూలయ్యా-3 మూవీతో అభిమానులను అలరించింది. ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రల్లో మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్లో వచ్చిన ఈ మూడో చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే విద్యా బాలన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ముఖ్యంగా ఆన్లైన్లో పెద్దఎత్తున తనకు సంబంధించిన వీడియోలపై ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అవన్నీ ఫేక్ అనీ.. కేవలం ఏఐ సాయంతో రూపొందించారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తప్పుదారి పట్టించేలా ఉన్న వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా అని తెలిపింది.విద్యాబాలన్ తన పోస్ట్లో రాస్తూ.. 'నేను మీకు ఇష్టమైన విద్యాబాలన్. ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్లో అనేక వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాకుండా అవీ నన్ను టార్గెట్ చేసేలా ఉన్నాయి. అయితే ఆ వీడియోలు ఏఐ సాయంతో రూపొందించినవి. అవన్నీ ఫేక్ అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. వాటిని క్రియేట్ చేయడం, వ్యాప్తి చేయడంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి కంటెంట్ను నేను ఏ విధంగానూ ఆమోదించను. వీడియోలలో చేసిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇలాంటివీ నా అభిప్రాయాలు, నా పనిని ప్రభావితం చేయలేవు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసేముందు ధృవీకరించుకోండి. ఎందుకంటే ఏఐ సాయంతో రూపొందించిన కంటెంట్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఇలాంటివాటితో జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.' అని రాసుకొచ్చింది. కాగా.. గతంలో విద్యాబాలన్ కంటేముందే రష్మిక మందన్న, దీపికా పదుకొణె, అలియా భట్, కత్రినా కైఫ్, రణ్వీర్ సింగ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ సైతం డీప్ఫేక్ వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
నా కూతుర్ని షూటింగ్కు పంపిస్తా.. ఏదైనా జరిగితే మాత్రం?: మహేష్ హీరోయిన్ తల్లి
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగిన భారతీయ నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న చిత్రంలోనూ ప్రియాంక నటిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి అందాల సుందరి కిరీటం అందుకున్నవారిలో ప్రియాంక చోప్రా స్థాయిలో తారా పధానికి చేరుకున్నవారు లేరనే చెప్పాలి. ఇంతింతై ఎదిగిన ఆమె విజయాల వెనుక ఆమె కష్టం ఎంత ఉందో...ఆమె తల్లి మధు చోప్రా కష్టం కూడా అంతే ఉందని అంటుంటారు బాలీవుడ్ జనాలు.సినిమా రంగంలో ప్రియాంక అడుగుపెట్టిన దగ్గర్నుంచీ ఆమెని అనుక్షణం కంటికి రెప్పలా కాచుకున్నారు ఆమె తల్లి మధుచోప్రా. అందంతో పాటు ప్రతిభ కూడా ఉన్న తన కూతురు టాప్ హీరోయిన్ కావాలనే లక్ష్యంతో కష్టపడ్డారు. మధ్యలో కొందరి వల్ల ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనైనప్పుడు కూడా కూతురికి అండా దండా తానై ప్రియాంక కృంగిపోకుండా వెన్నంటి ఉన్నారు. సినీ హీరోయిన్లను వారి తల్లులు నీడలా అనుసరించడం కొత్త విషయం కాకపోయినా... ప్రియాంక తల్లి మధుచోప్రా.. అంతకు మించి అన్నట్టుగా వ్యవహరించారు. తన కష్టం ఫలించి అంతర్జాతీయ స్థాయిలో తన కూతురు పేరు తెచ్చుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవడంతో మధు చోప్రా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు.ఈ నేపధ్యంలో ఇటీవల పలు ఇంటర్వ్యూల సందర్భంగా ప్రియాంక సినిమా కెరీర్ గురించి మధుచోప్రా పంచుకున్నారు. అదే సమయంలో దోస్తానీ (ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం) దర్శకుడు తరుణ్ మన్షుఖానీ అప్పట్లో ఎలా ప్రవర్శించారో కూడా గుర్తు చేసుకున్నారు. దోస్తానా చిత్రంలో ప్రియాంక తరుణ్తో కలిసి పనిచేసినప్పుడు కొన్ని కారణాల వల్ల వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని మధు చోప్రా చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఒక రోజు ప్రియాంక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిందని, జ్వరంతో వణికిపోయిందని గుర్తుచేసుకున్నారు. తాను ఆమెకు మందులు ఇచ్చానని, అయితే మాత్రలు వేసుకున్న తర్వాత సినిమా షూటింగ్కు వెళదామని ప్రియాంక ప్రయత్నించగా తాను వారించానని చెప్పారు. కాస్త సమయం తీసుకో అని చెప్పానని, గంట తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో ప్రియాంక సూచనల మేరకు తాను దర్శకుడు తరుణ్కి ఫోన్ చేశానని వెల్లడించారు. తరుణ్కి ఫోన్ చేసి ప్రియాంకకు హై టెంపరేచర్ ఉన్నందున ఆ రోజు షూటింగ్కు రావడం కుదరదని చెప్పగా, ‘‘ మీ అమ్మాయి ఎంత సౌకర్యంగా ఉందో చెప్పండి’’ అని తరుణ్ వ్యంగ్యంగా బదులిచ్చాడని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడు తనకు తీవ్రమైన ఆగ్రహం వచ్చిందని దాంతో తాను అతనికి చాలా పరుషంగా మాట్లాడానని వెల్లడించారు. ‘‘ఆమె మీ షూటింగ్ సెట్లో చనిపోవాలని మీరు కోరుకుంటే, సరే... నేను ఆమెను పంపుతాను. కానీ ఆమెకు ఏదైనా జరిగితే, దానికి మీరే బాధ్యులవుతారు’’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించానన్నారు. ఇదంతా గుర్తు చేసుకున్న మధుచోప్రా... అయితే అదంతా గతమని తరుణ్, తాను ఇప్పుడు మంచి స్నేహితులమని, ఇప్పటికీ తాను తరుణ్ని కలిసినప్పుడల్లా అప్పటి నా కోపాన్ని గుర్తు చేస్తూ తనను ఆటపట్టిస్తుంటాడంటూ మధుచోప్రా చెప్పారు. -
డాకు మహారాజ్ బ్యూటీ గొప్ప మనసు .. ఏకంగా 251 మంది అమ్మాయిలకు!
ఈ ఏడాది డాకు మహారాజ్తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా దబిడి దిబిడి సాంగ్తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్లో మెరిసిన ముద్దుగుమ్మ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఇటీవల తన పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది.అయితే తన పుట్టిన రోజు సందర్భంగా ఊర్వశి రౌతేలా తన మంచి మనసును చాటుకుంది. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు సామూహిక వివాహం జరిపించనట్లు ఊర్వశి రౌతేలా వెల్లడించారు. అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది బాలీవుడ్ భామ. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశి చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.During Mahashivratri & her birthday Urvashi Rautela facilitated the marriages of 251 underprivileged orphaned girls along with PM @narendramodi ji & President @rashtrapatibhvn ji 🙏🏻 #NarendraModi #UrvashiRautela #DroupadiMurmu #UrvashiRautelaFoundation #BageshwarDhamSarkar pic.twitter.com/ySjcwnkI9X— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) February 28, 2025 -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
సాహో మూవీతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే గతేడాది విడుదలైన స్త్రీ-2 మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించారు.రైటర్తో డేటింగ్..అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మపై కొన్ని రోజులుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత రాహుల్ మోదీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అంతేకాదు వీరిద్దరు చాలాసార్లు ఈవెంట్లలో జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంట రిలేషన్లో ఉన్నారంటూ బీటౌన్లో టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది శ్రద్ధాకపూర్. తమ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా దీన్ని బట్టి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని అర్థమవుతోంది.పెళ్లిలో జంటగా..తాజాగా తన ప్రియుడిగా భావిస్తోన్న రాహుల్ మోదీతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది ముద్దుగుమ్మ. గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన స్నేహితుల పెళ్లిలో బాయ్ఫ్రెండ్తో కలిసి సందడి చేసింది. ఇద్దరు కలిసి నూతన వధూవరులతో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ సైతం పెళ్లికి హాజరైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు శ్రద్దాకపూర్, రాహుల్ విమానంలో ఎకానమీ క్లాస్లో ప్రయాణించారు. కాగా.. గతేడాది జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్లో శ్రద్ధా కపూర్, రాహుల్ జంటగా కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత వైరలయ్యాయి. Shraddha Kapoor and Rahul Mody at a friend's wedding in Ahmedabad last night ♥️ pic.twitter.com/PBRanqJeoR— 𝒔𝒉𝒓𝒂𝒅𝒅𝒉𝒂__𝒎𝒚__𝒋𝒂𝒂𝒏🦋 (@shraddhasmehnaz) February 22, 2025 -
'అలాంటి వ్యక్తి దొరకాలి.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటా': సుస్మితా సేన్
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్ షాల్తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. -
'26 ఏళ్లుగా ఈ ట్రెండ్ను అధిగమిస్తున్నాం'.. భార్యకు అజయ్ దేవగణ్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. తాజాగా ఈ జంట తమ 26వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు అజయ్ దేవగణ్ మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో దిగిన పాత ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '26 ఏళ్లుగా ఈ ట్రెండ్ను అధిగమిస్తున్నాం.. మనిద్దరికీ హ్యాపీ యానివర్సరీ' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు స్టార్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మొదట వీరిద్దరు 1995లో వచ్చిన హల్చల్ అనే మూవీ సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా కనిపించారు. అదేక్రమంలోనే అజయ్, కాజోల్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1999లో ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు ఇష్క్, ప్యార్ తో హోనా హి థా, యు మే ఔర్ హమ్, తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్ లాంచి చిత్రాలలో జంటగా నటించారు. వీరిద్దరి నైసా దేవగణ్, యుగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే కాజోల్ చివరిసారిగా దో పట్టిలో కనిపించింది. మరోవైపు అజయ్ దేవగణ్ చివరిసారిగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం ఎగైన్లో కనిపించారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
భారత్- పాక్ మ్యాచ్.. ఊర్వశి రౌతేలా క్రేజీ రికార్డ్!
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఐదేళ్ల కుర్రాడి నుంచి డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా వదిలిపెట్టరు. మ్యాచ్ ఎప్పుడు మొదలతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచ క్రికెట్లోనే అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా- పాకిస్తాన్ పోరు మాత్రమే. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్లు లేనందువల్ల అప్పుడప్పుడు వచ్చే ఐసీసీ ఈవెంట్స్లో మాత్రమే తలపడుతున్నారు దాయాది జట్లు. మరి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చే ఈ మ్యాచ్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు క్రీడా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ్యాచ్ లైవ్లో చూసేవారికి ఆ థ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ను మరింత స్పెషల్గా మార్చుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా స్పెషల్? అనేది తెలియాలంటే మీరు లుక్కేసేయండి మరి.తాజాగా ఆదివారం దుబాయ్లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. ఇటీవల డాకు మహారాజ్తో ఫ్యాన్స్ను అలరించిన ముద్దుగుమ్మ సడన్గా మ్యాచ్లో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా డైరెక్టర్ సుకుమార్, పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ లైవ్లో అభిమానులు వీక్షించారు.అయితే చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్కు హాజరైనప్పటికీ అందరి కళ్లు ఊర్వశి రౌతేలాపైనే ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ దుబాయ్లో జరిగిన మ్యాచ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. టీమిండియా- పాక్ మ్యాచ్లో ఏకంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫిల్మ్ ఫేర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తొలి సెలబ్రిటీ అంటూ..భారత్- పాక్ మ్యాచ్లో పుట్టినరోజు జరుపుకున్న తొలి సెలబ్రిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో రికార్డ్ సృష్టిస్తే.. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఊర్వశి తొలిసారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. మరికొందరైతే ఊర్వశి రౌతేలాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరికి ఫిల్మ్ ఫేర్ వాళ్లు కూడా ఊర్వశిపై జోకులు వేస్తున్నారని మరికొందరు రాసుకొచ్చారు. కొందరు రిషబ్ పంత్ పేరును కూడా కామెంట్స్లో ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ.. చివరికీ బాలీవుడ్ భామ మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్లో అందర దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఇటీవల టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఊర్వశి రౌతేలా బర్త్ డే ఈనెల 25న కాగా.. ముందుగానే స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుని హైలెట్గా నిలిచింది. #ViratKohli broke several records during the India vs Pakistan match yesterday but #UrvashiRautela became the first actress to celebrate her birthday during an #IndvsPak cricket match. 🤣#Trending #indvspak #indiavspakistan #iccchampionstrophy pic.twitter.com/OLjHILtvgh— Filmfare (@filmfare) February 24, 2025 -
హీరోయిన్కి అభిమానితో చేదు అనుభవం..వీడియో వైరల్
సినీ తారలు బయట కనిపించడం చాలా అరుదు. ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప బయటకు రారు. అందుకే అలా బయట కనిపించినప్పుడు వాళ్లను చూసేందుకు జనాలు ఎగబడతారు. కొంతమంది సెల్ఫీలు దిగుతూ సంబరపడిపోతారు. హీరోహీరోయిన్లు కూడా తమ కోసం వచ్చిన అభిమానులను నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు ఇస్తుంటారు. కొంతమంది హీరోలు సెల్ఫిలు అడిగినా కొడుతారను..అది వేరే విషయం. కానీ చాలా మంది అయితే అడగ్గానే సెల్ఫీకి ఒప్పేసుకుంటారు. అలాంటి వారిలో నటి పూనం పాండే(Poonam Pandey) కూడా ఒకరు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఫ్యాన్స్తో టచ్లో ఉండే బోల్డ్ బ్యూటీ.. ఇప్పుడు సెల్ఫీ అంటేనే భయపడిపోతుందట.ఫోటో కోసం వచ్చి..తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఫొటో సెషన్లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీనే కదా అని ఆమె నవ్వుతూ ఫోటోకి పోజులివ్వగానే ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో పూనమ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యింది.వెంటనే తేరుకున్న పూనమ్ అతడిని బలంగా నెట్టివేసింది. అలాగే, ఫొటో జర్నలిస్టు ఒకరు వెంటనే అప్రమత్తమై అతడి నుంచి ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.స్క్రిప్టెడా?ఇలాంటి ఘటన పూనమ్ కాకుండా ఇతర హీరోయిన్లలలో ఎవరికి జరిగినా అంతా నిజమనే నమ్మేవారు. కానీ పూనమ్ చరిత్ర తెలిసివాళ్లు ఇది ఫేక్ అని అంటున్నారు. ఇదంత స్క్రిప్టెడ్ అని.. అటెన్షన్ కోసమే పూనమ్ ఇలాంటి పని చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీడియోను గమనిస్తే మొదటి నుంచీ ఆమె తీరు అనుమానాస్పదంగా ఉందని ఒకరు, ఆమె అంత బాగా నటించలేదని కామెంట్ చేస్తున్నారు.గతంలో ఇంతకు మించి.. పూనమ్కి వివాదాలు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి డ్రామాలు చాలానే ఆడింది. క్యాన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఏకంగా తాను చనిపోయినట్లు వార్తలు రాయించుకుంది. అనంతరం తాను బతికే ఉన్నానని, క్యాన్సర్పై అవగాహన పెంచడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చింది.2011లో వరల్డ్ కప్లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. సినిమాల కంటే ఇలాంటి డ్రామాలే పూనమ్కి ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ముద్దు వీడియో కూడా ఫేకే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడితో యానిమల్ బ్యూటీ చెట్టపట్టాల్.. నడిరోడ్డుపై..!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri). ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా తన గ్లామర్తో కుర్రకారుకు పిచ్చెక్కించింది ముద్దుగుమ్మ. యానిమల్ తర్వాత ఈ బాలీవుడ్ భామకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. పలు స్టార్ హీరోల సరసన వరుస చిత్రాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత గతేడాది బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ధడక్-2 చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది.ఇదిలా ఉంటే త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు బీటౌన్లో టాక్ వినిపిస్తూనే ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సామ్ మర్చంట్తో పీకల్లోతు ప్రేమలో ఉందని తెలిసింది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా తన ఇన్స్టాలో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ఈ విధంగా తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.అయితే తాజాగా మరోసారి తన బాయ్ఫ్రెండ్ సామ్ మర్చంట్తో కలిసి జంటగా కనిపించింది. వీరిద్దరు బైక్పై వెళ్తుండగా వీడియో తీసిన నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉందని నిజమేనంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ రూమర్స్ నిజమేనంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తమ రిలేషన్పై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. పోనీ అలా వాటిని ఖండించలేదు కూడా. అందుకే ఈ తాజా వీడియో చూస్తే ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది.(ఇది చదవండి: వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!)సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్లు, హోటళ్ల బిజినెస్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్గా రాణిస్తున్నారు. ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. #TriptiiDimri was seen on a bike with rumoured beau #SamMerchant.🫶🏻#FilmfareLens pic.twitter.com/FvH0s70F7Z— Filmfare (@filmfare) February 19, 2025 -
రవీనా టాండన్ కూతురు రాషా థడానీ బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
అమ్మకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మోనాలిసా..వీడియో వైరల్
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అంటారు. మోనాలిసా అనే అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. మొన్నటి వరకు ఇళ్లిళ్లూ తిరిగి పూసలు అమ్ముకున్న ఈ యువతి.. మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. పూసలు అమ్ముకునేందుకు ఆమె కుంభమేళాకి వెళ్లడం..తన నీలికళ్లు, అందం, చిరునవ్వుకు ఫిదా అయిన ఓ వ్యక్తి ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం..అవికాస్త వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ‘స్టార్’ అయిపోయింది. ప్రస్తుతం ఈ నీలికళ్ల సుందరి తన వ్యాపారాన్ని వదిలేసి..సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.మణిపూర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు.. ఇక ఈ సినిమాకు పారితోషికంగా రూ.21 లక్షలు అందుకున్నట్లు సమాచారం. అయితే మొదటి సినిమాకు పారితోషికం తీసుకున్న అనంతరం మోనాలిసా అన అమ్మకి బంగారు గొలుసు కొనిపెట్టింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా తెలుపుతూ చూడండి అమ్మకి ఏం కొనిచ్చానో అంటూ వీడియో పెట్టింది.ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.లుక్ మార్చేసిన బ్యూటీప్రస్తుతం తనకున్న క్రేజీని మోనాలిసా క్యాష్ చేసుకుంటుంది. సినిమాలతో పాటు షాప్ ఓపెనింగ్స్కి కూడా వెళ్తోంది. తాజాగా ఓ బంగారు ఆభరణాల దుకాణం ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా వెళ్లింది. మొన్నటి వరకు మేకప్ అంటే తెలియని మోనాలిసా..ముఖానికి మేకప్ వేసుకొని తన లుక్నే మార్చేసింది. జుట్టు కూడా చిన్నగా కత్తిరించుకుంది. మేకప్ తర్వాత ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ఒక హీరోయిన్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని మోసాలిసాలో ఉన్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్పై ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీశాయి. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అది కాస్తా వివాదానికి దారితీయడంతో నటిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.స్వర భాస్కర్ చేసిన పోస్ట్పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మన వీరుల చరిత్రతో ఆటలు ఆడుకోవద్దని సూచిస్తున్నారు. ఓ నెటిజన్ ఆమెకు రిప్లై ఇస్తూ.. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్రను అభ్యసించా. ఔరంగజేబ్ చేతిలో శంభాజీ మహరాజ్ చిత్రహింసలతోనే మృతి చెందారనడంలో ఎలాంటి కల్పితాలు లేవు. దయచేసి మీ ఆలోచన విధానంపై ఒకసారి పునరాలోచించుకోండి అంటూ చురకలంటించాడు. (ఇది చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)హిందువులపై ఔరంగజేబ్ చిత్రహింసలను కల్పితం అనడం.. శంభాజీ మహరాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? ఛత్రపతి శివాజీ జయంతి రోజున మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వర భాస్కర్పై మండిపడ్డాడు. ఛత్రపతి శంభాజీ రాజ్ అనుభవించిన హింసలో ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించలేదని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. నటి స్వర భాస్కర్.. ఫహాద్ ఆహ్మద్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు తన వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తూనే ఉంది..బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛావా. మడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా కనిపించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల 'ఛావా' ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.A society that is more enraged at the heavily embellished partly fictionalised filmy torture of Hindus from 500 years ago than they are at the horrendous death by stampede & mismanagement + then alleged JCB bulldozer handling of corpses - is a brain & soul-dead society. #IYKYK— Swara Bhasker (@ReallySwara) February 18, 2025 -
మొదటి ఆడిషన్.. ఆంటీ మాటలతో ఇబ్బందిగా ఫీలయ్యా: హీరోయిన్
బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి ప్రస్తుతం సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సిరీస్లో శ్వేతా బసు ప్రసాద్, జావేద్ జాఫేరి ఐమీ ఐలా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ సిరీస్గా 'ఊప్స్ అబ్ క్యా'ను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాల్ కులకర్ణి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సంఘటనలను వివరించింది. మొదటిసారి సినిమా ఆడిషన్కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నారు.సోనాలి కులకర్ణి మాట్లాడుతూ.. ' ఓ సినిమా ఆడిషన్ కోసం తన వద్ద ఉన్న ఏకైక పంజాబీ సూట్ను ధరించా. నాతో పాటు ఆడిషన్కు మరో 25 మంది అమ్మాయిలు హాజరయ్యారు. అయితే అప్పుడు డైరెక్టర్ గిరీష్ కర్నాడ్ను కలుస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. నేను లోపలికి వెళ్లగానే అక్కడ నా స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరిద్దరు నాకంటే పెద్దవాళ్లు కూడా ఉన్నారు. సిటీలో పేరున్న ఒకామె 'ఎందుకు వచ్చావ్' అని అడిగింది. ఆమె ప్రశ్నలోని వ్యంగ్యం నాకు అర్థం కాలేదు. అందిరిలాగే వర్క్షాప్కు వచ్చానని సమాధానం ఇచ్చా. కానీ ఆమె (ఆంటీ) నన్ను చూస్తూ కెమెరాలో ముదురుగా ఉండే అమ్మాయిలు చాలా బాగా కనిపించరని మీకు తెలియదా? అన్నారు. ఆ సమయంలో నాకు 16 ఏళ్ల వయసు. ఆమె మాటలతో చాలా ఇబ్బంది పడ్డా. చాలా డిస్టర్బ్ అయ్యా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపించింది.' అని వెల్లడించారు.ఆ తర్వాత జరిగిన ఆడిషన్లో డైరెక్టర్ గిరీశ్ కర్నాడ్ అందరినీ పలకరించాడు. ఆయన వచ్చాక నన్ను నేను పరిచయం చేసుకున్నా.. గిరీశ్ కర్నాడ్తో మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు జరిగిన అవమానాన్ని మరిచిపోయేలా చేసింది. తాను 12వ తరగతి చదువుతున్నానని.. అంతేకాకుండా నాటకాల్లో చేస్తున్నట్లు డైరెక్టర్తో చెప్పినట్లు గుర్తు చేసుకుంది సోనాలి కులకర్ణి. -
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. రివీల్ చేసిన భర్త!
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ వాయు అనే కుమారుడు కూడా జన్మించాడు. గతంలో తన కుమారుడిని ఫేస్ రివీల్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం వత్సల్ సేత్ ఈ వార్తలను ధృవీకరించారు. ఇషితా రెండోసారి గర్భం ధరించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని.. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇషిత నాకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు.. ఒక తండ్రిగా నేను సంతోషించానని తెలిపారు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం 2'లో కనిపించింది ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సైప్ అలీ ఖాన్ మాజీ భార్య.. ఎన్ని కోట్లంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి అమృతా సింగ్ ఖరీదైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఈ లగ్జరీ ఫ్లాట్ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ.18 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. కాగా.. అమృతా సింగ్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ను పెళ్లాడారు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు. వీరిద్దరికీ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.కాగా.. అమృతా సింగ్ బేతాబ్ (1983) చిత్రంతో అరంగేట్రం చేశారు. ఈ సినిమాతోనే బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మార్డ్, నామ్, చమేలి కి షాదీ, రాజు బన్ గయా జెంటిల్మన్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె కలియుగ్, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా వంటి చిత్రాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది, తరువాత ఆమె 2 స్టేట్స్ మూవీలో ఆమె పాత్రకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. -
ఈ గుండు పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. బాల్యంలో మన చిలిపి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఎంతలా అంటే వాటిని చూసినప్పుడు.. అసలు అక్కడ నేనేనా అన్నంతలా ఉంటాయి. ఒక్కసారి ఆ బాల్యంలోకి తిరిగి వెళ్తే బాగుంటుందని అనుకోరు ఉండరేమో. ఆ చిన్ననాటి రోజులే బాగుండేవి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవాళ్లమని ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటూనే ఉంటాం. అంతటి అద్భుతమైన క్షణాలు ఆ బాల్యపు రోజులు. ఆ రోజులనే మరోసారి గుర్తు చేసుకుంది మన స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆ తీపి గుర్తులను మీరు కూడా చూసేయండి.బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 1983 నుంచి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్గా కనిపించింది. చిన్నప్పటి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.. మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది. ఇవీ చూసిన కొందరు అచ్చం మీ కూతురు మాల్టీని తలపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..మహేశ్బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
మూడేళ్లు డేటింగ్.. ప్రియుడిని పెళ్లాడిన రానా నాయుడు హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్.. తన చిన్ననాటి స్నేహితురాలు, రానా నాయుడు వెబ్ సిరీస్ నటి ప్రియా బెనర్జీని ఆయన పెళ్లాడారు. ముంబయిలోని బాంద్రాలో జరిగిన వీరి పెళ్లి వేడుకలో సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. దివంగత నటి స్మితా పాటిల్ కుమారుడే ప్రతీక్ బాబర్. తాజాగా తన వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రతీక్. ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఫిబ్రవరి 14న శుక్రవారం జరిగింది. ఫిబ్రవరి 12న మొదలైన హల్దీ, మెహందీ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగాయి.దాదాపు మూడు సంవత్సరాల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ నవంబర్ 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రియా పుట్టినరోజున నవంబర్ 28న ఓ రెస్టారెంట్లో ప్రపోజ్ చేసినట్లు ప్రతీక్ వెల్లడించాడు. ఆ తర్వాత వీరు తమ రిలేషన్ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. అయితే పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్ బాబర్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు.'రానా నాయుడు' వెబ్ సిరీస్లో మెప్పించిన ప్రియా బెనర్జీ. ఈ సిరీస్లో రానాని టెంప్ట్ చేసే అమ్మాయి పాత్రలో నటించింది. కానీ అంతకు ముందే కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి తెలుగులో పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా నటుడు ప్రతీక్ బాబర్ను పెళ్లాడింది. ప్రతీక్ బాబర్ హిందీలో జానే తు యా జానేనా, దమ్ మారో దమ్, ఏక్ దీవానా తా వంటి పలు సినిమాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Priya Banerjee (@priyabanerjee) -
కిస్సిక్ భామ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎవరంటే?
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించింది. ఇటీవల పుష్ప-2 సినిమాలో కిస్సిక్ సాంగ్తో అభిమానులను ఓ ఊపు ఊపేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దక్షిణాదిలో ఓ ఊపు ఊపేస్తోన్న శ్రీలీలకు బాలీవుడ్లోనూ క్రేజీ ఛాన్ కొట్టేసింది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.బాలీవుడ్ కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. -
పెళ్లి, పిల్లలు వద్దంటేనే సినిమా ఛాన్స్..: హీరోయిన్
'పెళ్లి, ప్రెగ్నెన్సీకి దూరంగా ఉంటేనే సినిమా ఛాన్స్' అని హీరోయిన్లతో నిర్మాతలు ఒకప్పుడు బలవంతంగా సంతకం చేయించుకునేవారట. ఎవరిదాకానో ఎందుకు? తనతోనూ అలాంటి అగ్రిమెంట్పై సంతకం చేయించుకున్నారంటోంది సీనియర్ హీరోయిన్ షీబా ఆకాశ్దీప్ (Sheeba Akashdeep Sabir). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు టాప్ హీరోయిన్లందరూ స్టార్ హీరోలతో జత కడుతున్నారు. పెద్దగా తారతమ్యాలు లేవు.హీరోయిన్గా కొంతకాలమే..అయితే అప్పటికీ, ఇప్పటికీ హీరోలు దశాబ్దాలతరబడి కథానాయకులుగానే కొనసాగుతున్నారు. కానీ మాకు ఆ అవకాశం లేదు. హీరోయిన్గా చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. అది అయిపోయాక ఇదిగో నాలా క్యారెక్టర్ రోల్స్ చేయాల్సిందే! గతంలో ఓ భయంకరమైన కండీషన్ ఉండేది. మా తరంవారికి ఎవరికైనా బాయ్ఫ్రెండ్ ఉంటే అది బయటకు చెప్పాలంటేనే భయపడేవాళ్లం. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్ అంటే సింగిల్గానే ఉండాలన్న రూల్ ఉండేది. భయంకరమైన కాంట్రాక్ట్ప్రేమలో ఉన్నామని తెలిస్తే ఏవేవో పుకార్లు పుట్టుకొచ్చేవి. పెళ్లయిందంటే ఏకంగా ప్యాకప్ చెప్పాల్సిందే! అందుకనే నిర్మాతలు మాతో ముందుగానే ఓ అగ్రిమెంట్పై సంతకం చేయించుకునేవారు. మేము పెళ్లి చేసుకోము, పిల్లల్ని కనము అని అందులో రాసుండేది. ఇది అత్యంత భయంకరమైన కాంట్రాక్ట్. అని చెప్పుకొచ్చింది. షీబా ఆకాశ్దీప్.. యే ఆగ్ కబ్ బుజేగి (1991) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. నచ్నేవాలే గానేవాలె, సూర్యవంశీ, హమ్ ఐ కమాల్ కె, ప్యార్ కా రోగ్, సురక్ష, కాలియా, మిస్ 420, కాలా సామ్రాజ్య, దమ్ వంటి చిత్రాలు చేసింది. చివరగా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమాలో మెరిసింది.చదవండి: బాక్సాఫీస్పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్! -
మూడు లగ్జరీ ఫ్లాట్స్ కొన్న బిగ్బాస్ విన్నర్.. ధర ఎన్ని కోట్లంటే?
గౌహర్ ఖాన్.. బాలీవుడ్లో ఆమె పేరు చాలా పాపులర్. బిగ్బాస్ సీజన్-7 విన్నర్, టీవీ స్టార్,మోడల్,హీరోయిన్ ఇలా పలు రంగాల్లో రాణించింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్తో తెలుగు వారికి గౌహర్ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్ సాంగ్తో అభిమానులను ఓ రేంజ్లో అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్ భామ.అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబయిలో ఖరీదైన అపార్ట్మెంట్స్ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వర్సోవా ప్రాంతంలో దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మూడు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. వీటిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుంది. కాగా.. 2013లో బిగ్ బాస్ సీజన్- 7 టైటిల్ గెలిచిన గౌహర్ ఖాన్, మోడలింగ్తో పాటు హిందీ చిత్రాల్లో నటించింది.18 ఏళ్ల వయసులో మోడల్గా కెరీర్ ఆరంభించిన గౌహర్ఖాన్ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్గా కెరీర్ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్లోనూ నటించారు. గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాలతో పాటు తాండవ్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. 2020లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్(25)ను పెళ్లాడింది. ఆమె కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో విమర్శలొచ్చాయి. -
తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్
నచ్చని వారితో పని చేయడం తనకు నచ్చదని అంటోంది హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor). కపూర్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ..పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. వెండితెరపై అరుదుగా కనిపించినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్.. తన వ్యక్తిగత, ప్రొఫిషినల్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.బిడ్డ పుట్టాక మారిపోయానుకెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్ ప్రేమ వివాహం చేసుకుంది. 2018లో తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని సోనమ్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకి ఓ బాబు ఉన్నాడు. పేరు వాయు. కొడుకు పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని అంటోది సోనమ్. ‘తల్లి అవ్వడం అనేది నన్ను పూర్తిగా మార్చేసింది. అది మహిళలకు శారీరికంగా, మానసికంగా.. అన్ని రకాలుగా మార్చేస్తుంది. అసలు ముందు ఉన్న మనిషి కాదేనే అనిపించేస్తుంది.ప్రతి తల్లికి పిల్లలే మీకు మొదటి ప్రాధాన్యత అవుతారు. నా కొడుకు బాగోగులు చూసుకోవడమే నాకు ముఖ్యం. ఆ తర్వాతే సమయం ఉంటేనే సినిమాలు చేస్తా’ అని సోనమ్ చెప్పుకొచ్చింది.నచ్చితేనే చేస్తానా పర్సనల్ లైఫ్ చాలా బాగుంది. భర్త, పిల్లలే నా ప్రపంచం. సినిమాల్లో కూడా నటిస్తాను. నన్ను నమ్మి, సరదాగా పని చేసే దర్శకులతో మాత్రమే సినిమా చేస్తాను. హీరోయిన్గా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇదే ఫాలో అయ్యాను. చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాలను సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. మనిషిగా మనం ఎదిగేలా చేసేవారితోనే ఎక్కువగా పనిచేస్తాను. ఒకరు నాకు నచ్చకపోతే వారితో కలిసి పనిచేయడం చాలా కష్టం. నేను ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్న అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని సోనమ్ వివరించింది. -
'ఎమోషన్స్ అప్పటి వరకు ఎవరికీ అర్థం కావు'.. కరీనా కపూర్ ఆసక్తికర పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో సైఫ్ అలీ ఖాన్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కుటుంబంలో ఉండే రిలేషన్స్ను ఉద్దేశించి కరీనా కపూర్ చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. సమయంతో పాటు ఎవరికైనా నిర్ణయాలు మారవచ్చని తెలిపింది. సైఫ్ అలీ ఖాన్పై దాడి తర్వాత చేసిన పోస్ట్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందో ఓసారి చూసేద్దాం.కరీనా కపూర్ తన పోస్ట్లో రాస్తూ.. " వివాహాలు, విడాకులు, ఆందోళనలు, పిల్లలు పుట్టడం, ఇష్టమైన వ్యక్తి మరణం, పేరెంటింగ్ గురించి సంఘటనలు నిజంగా అర్థం చేసుకోలేరు. ఇది మీ జీవితంలో నిజంగా జరిగే వరకు మీకు ఇలాంటి విషయాలు అర్థం కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోని పరిస్థితులు, సిద్ధాంతాలు, ఊహలు వాస్తవాలు కావు. జీవితంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడితే అంత తెలివైన వారిగా ఎదుగుతారు" అంటూ రాసుకొచ్చింది.కాగా.. ఇటీవల ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో ఉన్నఇంట్లోకి ఒక ఆగంతకుడు చోరీకి యత్నించాడు. అదే క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన సైఫ్ను కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ చివరిసారిగా హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ది బకింగ్హామ్ మర్డర్స్ చిత్రంలో కనిపించింది. -
ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ముంబయిలోని ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా తన ప్రియురాలు నీలం ఉపాధ్యాయ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన డ్యాన్స్తో అదరగొట్టింది. బాలీవుడ్ సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ పెళ్లి వేడుకల్లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తన సోదరుడి పెళ్లి ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. మండపం వద్దకు సోదరుడిని తీసుకురావడంతో పాటు డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో పాటు తన భర్త నిక్ జోనాస్లో కలిసి ఈ పెళ్లి వేడుకలో అలరించింది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
రిలేషన్షిప్లో ఆదిపురుష్ భామ.. మరోసారి భాయ్ఫ్రెండ్తో కలిసి!
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. గతేడాది ఎక్కువగా బాలీవుడ్లో పలు చిత్రాలతోనే మెప్పించింది. అయితే ఇటీవల ఎక్కువగా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించింది. అంతేకాకుండా ఓ వ్యాపారవేత్తలో ఈ ముద్దుగుమ్మ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. గతంలో చాలాసార్లు అతనితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. గతంలో అతని బర్త్ డే సందర్భంగా కృతిసనన్ ఫోటోలను పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లొ నిలిచింది.డిన్నర్కు వెళ్తూ..తాజాగా మరోసారి తన భాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ దహియాతో కలిసి జంటగా కనిపించింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్కు వెళ్తూ జంటగా కనిపించారు. వీరిద్దరితో పాటు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా వెంటే ఉన్నారు. అయితే కృతి మాత్రం ఫ్యాన్స్కు కనిపించకుండా ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. దీంతో వీరిద్దరిపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది. ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ ఖాయమనే అంటున్నారు నెటిజన్స్. అంతేకాకుండా గతేడాది వీరిద్దరు కలిసి గ్రీస్కు పర్యటనకు వెళ్లారు. అక్కడే వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడంతో ఈ జంట రిలేషన్లో ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎక్కడా కూడా నోరు విప్పలేదు.ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా నెట్ఫ్లిక్స్ చిత్రం దో పట్టిలో కనిపించింది. అంతేకాకుండా గతేడాది క్రూ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. కాగా.. కబీర్ దహియా వరల్డ్వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడే కబీర్ దహియా. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
బామ్మర్ది పెళ్లిలో సాంగ్ పాడిన నిక్ జోనాస్.. ప్రియాంక చోప్రా డ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్నారు. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా గ్రాండ్ వెడ్డింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ వేడుకల్లో తన ముద్దుల కూతురు మాల్టీ మేరీకో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. తాజాగా ఇవాళ జరిగిన బరాత్ వేడుకల్లో తన భర్త, సింగర్ నిక్ జోనాస్లో కలిసి సందడి చేసింది. బాలీవుడ్ సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించింది.ఈ వేడుకల్లో ప్రియాంక నీలిరంగు లెహంగాలో అందంగా కనిపించగా.. నిక్ జోనాస్ తెల్లటి షేర్వానీ ధరించి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.అంతకుముందు జరిగిన సంగీత్ వేడుకల్లో నిక్ జోనాస్ పాట పాడారు. ఈ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ బామర్ది పెళ్లిలో బావ అద్భుతమైన ఫర్మామెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా.. తన ప్రియురాలు, నటి నీలం ఉపాధ్యాయను పెళ్లాడనున్నారు. మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) -
'సల్మాన్, షారూఖ్ నన్ను చూసి నవ్వారు'.. హీరోయిన్ కామెంట్స్
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సడన్గా సన్యాసం స్వీకరించడం హాట్ టాపిక్గా మారింది. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసిన మమతా ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత మహాకుంభ్ మేళా కోసం భారత్కు తిరిగొచ్చింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.తాజాగా మమతా బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను కరణ్ అర్జున్ మూవీ గురించి మాట్లాడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనను చూసి సల్మాన్, షారుక్ ఖాన్ నవ్వుకున్నారని తెలిపింది. సల్మాన్ ఖాన్ ఏకంగా తనను చూసి తలుపులు వేసుకున్నాడని పేర్కొంది.మమతా కులకర్ణి మాట్లాడుతూ.. "కరణ్ అర్జున్ మూవీ షూట్ షారుఖ్, సల్మాన్తో కలిసి చేశాను. అక్కడే ఓ సాంగ్ షూట్లో కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్ను సింగిల్ టేక్లో చేశా. కానీ వాళ్లిద్దరూ రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నారు. దాంతో కొరియోగ్రాఫర్కు కోపం వచ్చి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తర్వాత సల్మాన్ అసహనానికి గురయ్యాడు. నేను గదిలోకి వెళ్తుంటే నా ముఖంపై తలుపు వేశాడు. కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సల్మాన్ ఎప్పుడూ నన్ను ఆటపట్టించేవాడు. నేను సెట్లో సమయపాలన పాటిస్తాను.' అని తెలిపింది.(ఇది చదవండి: 23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా)కాగా.. మమతా కులకర్ణి 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్కు గుడ్బై చెప్పేసింది. ఆమె చివరిసారిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్లో కనిపించింది. అంతకుముందు మేరా దిల్ తేరే లియే, తిరంగా, దొంగ పోలీస్, కిస్మత్ లాంటి చిత్రాల్లో నటించింది. -
సోదరుడి పెళ్లిలో ప్రియాంక చోప్రా.. కూతురిని ఎలా రెడీ చేసిందో చూశారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబయిలో బిజీబిజీగా ఉంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చేసింది. తాజాగా జరిగిన హల్దీ వేడుకలో ప్రియాంక డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అంతే తన ముద్దుల కూతురితో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. మామయ్య వివాహా వేడుకల్లో మాల్టీ మేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన లెహంగా ధరించి మెహందీ వేడుకలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్స్టాలో షేర్ చేసింది.కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి కోసమని ముంబయికి వెళ్లిపోయింది. సిద్దార్థ్ చోప్రా పెళ్లి కోసం ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ కూడా ఇవాళ ఇండియా చేరుకున్నారు. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టి మేరీతో కలిసి మెహందీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాహా కోసం ప్రియాంక అత్తమామలు డెనిస్ జోనాస్, కెవిన్ జోనాస్ కూడా భారతదేశానికి వచ్చేశారు. ఈ పెళ్లి వేడుకల్లో ప్రియాంక కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు. కాగా.. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నటి నీలం ఉపాధ్యాయను శుక్రవారం వివాహం చేసుకోబోతున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
కంగనా రనౌత్ రెస్టారెంట్.. తొలి కస్టమర్గా స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాపారం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో తన బిజినెస్ను ప్రారంభించనుంది. అందమైన పర్వతాల మధ్యలో సరికొత్త రెస్టారెంట్ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మనాలిలో ఏర్పాటు చేయనున్న ఈ రెస్టారెంట్కు ది మౌంటైన్ స్టోరీ అనే పేరును కూడా ఖరారు చేసింది. తన కొత్త రెస్టారెంట్కు మొదటి కస్టమర్గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆహ్వానించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఏర్పాటు చేసిన ది మౌంటైన్ స్టోరీ రెస్టారెంట్ను ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా రెస్టారెంట్ను తెరవాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ప్రపంచస్థాయి మెనూను కలిగి ఉండాలనుకునే రెస్టారెంట్ను తెరవాలనుకుంటున్నా అని కంగనా అన్నారు. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకొణె నీ రెస్టారెంట్కు నేనే మీ మొదటి క్లయింట్ అవుతానని చెప్పింది. మరోసారి ఆ వీడియోను షేర్ చేస్తూ దీపికా పదుకొణె నా నా మొదటి కస్టమర్గా వస్తానని ప్రామిస్ చేశావ్ అంటూ కంగనా పోస్ట్ చేసింది. అంతేకాకుండా రెస్టారెంట్ ప్రారంభించడం చిన్ననాటి కల అని వెల్లడించింది. కాగా.. సినిమాల విషయానికొస్తే కంగనా రనౌత్ చివరిగా ఎమర్జెన్సీలో కనిపించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి కంగనానే దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms) -
ఏఐ మోనాలిసా.. బాలీవుడ్ హీరోయిన్ కంటే అందంగా!
ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అమ్మాయి మోనాలిసా. జీవవోపాధి కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు ఊహించని విధంగా ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియా వల్ల ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీంతో ఆమెకు ఏకంగా బాలీవుడ్లో మూవీ ఆఫర్ కూడా వరించింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కించనున్న సినిమాలో మోనాలిసా కనిపించనుంది.అయితే తాజాగా మోనాలిసాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. సినిమాలో నటించేందుకు కోసం హీరోయిన్లా మేకప్ వేసుకుని కనిపించింది. అయితే ఈ వీడియోను ఏఐ సాయంతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఏఐ సాయంతో చేసినప్పటికీ మోనాలిసా మేకోవర్ నెటిజన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అచ్చం హీరోయిన్ కటౌట్ను తలపిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Punjab Kesari (@punjabkesari_pk) -
భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న యానిమల్ బ్యూటీ.. డైరెక్టర్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో ఫేమస్ అయింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ హీరోగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ తర్వాత త్రిప్తి డిమ్రికి ఆఫర్లు వెతక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్లో వరుసగా సినిమాలతో అలరించింది ముద్దుగుమ్మ.అయితే ఇటీవల త్రిప్తి డిమ్రీ రొమాంటిక్ హిట్ సిరీస్ ఆషికి-3లో ఆఫర్ కూడా దక్కించుకుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. కానీ ఊహించని విధంగా ఆమె ఈ ప్రాజెక్ట్ తప్పుకుంది. దీంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వదంతులు మొదలయ్యాయి. ఆమెకున్న బోల్డ్ ఇమేజ్ వల్లే నిర్మాతలు త్రిప్తి ఎంపికపై నిర్ణయాన్ని మార్చుకున్నారని ఊహగానాలొచ్చాయి.తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిప్తి డిమ్రీ తప్పుకోవడంపై ఈ మూవీ డైరెక్టర్ అనురాగ్ బసు స్పందించారు. ఆమె ఎందుకు తప్పుకుందో తననే అడగాలని అన్నారు. నా సినిమాలో చేయకపోయినా ఎప్పటికీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అని.. నటిగా ఆమె అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం తేదీలే సమస్య అయి ఉండవచ్చని అన్నారు. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నామని.. త్రిప్తి ప్రస్తుతం దర్శకుడు విశాల్ భరద్వాజ్ సినిమా షూటింగ్తో బిజీగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మా సినిమాకు టైటిల్ పేరేంటో నాకు తెలియదు.. మేము హీరోయిన్ను ఇంకా ఖరారు చేయలేదని.. వారం రోజుల్లో ప్రకటిస్తామని అనురాగ్ బసు పేర్కొన్నారు. కాగా.. అనురాగ్ బసు బాలీవుడ్లో గ్యాంగ్స్టర్, బర్ఫీ, లైఫ్ ఇన్ ఎ మెట్రో చిత్రాలకు ఫేమస్ అయ్యారు. -
సోదరుడికి పెళ్లి కూతురిని వెతికి పెట్టిన ప్రియాంక చోప్రా.. అదేలాగంటే?
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటి వాడు కానున్నారు. తన ప్రియురాలైన నీలం ఉపాధ్యాయను ఆయన పెళ్లాడనున్నారు. ఈ పెళ్లి కోసమే ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్తో కలిసి ఇండియా చేరుకుంది. తాజాగా సోదరుడి పెళ్లికి హాజరైన ఫోటోలను ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అయితే ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సిద్ధార్థ్ తనకు కాబోయే భార్య నీలం ఉపాధ్యాయను ఓ డేటింగ్ యాప్లో కలిశాడని వెల్లడించింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసిందని తెలిపింది. అయితే ఆ డేటింగ్లో యాప్లో ప్రియాంక చోప్రా పెట్టుబడి పెట్టడం మరో విశేషం. అంతేకాదు ఆమె యాప్కు బ్రాండ్ అంబాసిడర్ కూడా.ఈ విషయంపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. "మేము యూఎస్కు చెందిన డేటింగ్ యాప్ను ఇండియాకు కూడా తీసుకొచ్చాం. నా సోదరుడు తన కాబోయే భార్యను మా యాప్ ద్వారానే కలిశాడు. అతనికి సరైన జోడీ దొరకడంతో నాకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. అ తాను ఎప్పుడూ డేటింగ్ యాప్ను ఉపయోగించలేదని తెలిపింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కలవాలని అనుకున్నా. ఆ విధంగా నేను ఈ తరానికి చెందిన వ్యక్తిలా అనిపించకపోవచ్చు.' అని అన్నారు.సోషల్ మీడియా ద్వారా ప్రియాంక చోప్రా..ప్రియాంక తన భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ను ట్విటర్ ద్వారా కలుసుకుంది. ప్రియాంకకు మొదట నిక్ జోనాస్ సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మనం కలవాలని కొంతమంది స్నేహితులు చెప్పారని ప్రియాంకకు సందేశం పంపించాడు. దీంతో ఒక రోజు తర్వాత ప్రియాంక స్పందించడంతో.. ఆ తర్వాత ఇద్దరూ ఆస్కార్ వేడుక తర్వాత ఓ పార్టీలో కలుసుకున్నారు. 2017లో ఇద్దరూ కలిసి మెట్ గాలాకు హాజరయ్యారు. అనంతరం 2018 ఏడాది చివర్లో ఇండియాలోనే వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
హీరోయిన్తో బ్రేకప్.. పెళ్లిపై స్పందించిన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ప్రస్తుతం 'మేరే హస్బెండ్ కీ బీవీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు చూస్తే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు అర్జున్ కపూర్. తాజాగా ఓ ఈవెంట్కు హాజరయ్యారు. ఇందులో అర్జున్ కపూర్కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో తన వివాహం ప్రణాళికల గురించి నోరు మాట్లాడారు.అర్జున్ కపూర్ మాట్లాడుతూ.."నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీ అందరికీ తెలియజేస్తా. ఈ రోజు, సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సినిమా గురించి మాట్లాడుకునే సమయం. నా వ్యక్తిగత జీవితం గురించి కబుర్లు చెప్పుకోవడానికి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. సమయం వచ్చినప్పుడు మీ అందరితో చెప్పడానికి వెనుకాడను. ఒక వ్యక్తిగా ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు" అని అన్నారు.కాగా.. కొద్ది నెలల క్రితమే బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరాతో బ్రేకప్ చేసుకున్నారు. దాదాపు కొన్నేళ్ల పాటు రిలేషన్లో వీరిద్దరు గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. తాను సింగిల్గానే ఉన్నానని గతేడాది దీపావళి పార్టీలో అర్జున్ కపూర్ వెల్లడించాడు. ప్రస్తుతం అర్జున్ నటించిన మేరే హస్బెండ్ కీ బీవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో శక్తి కపూర్, అనితా రాజ్, డినో మోరియా, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు. -
వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఆయనను గుర్తు చేసుకుని!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. గురుగ్రామ్లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజీపై ర్యాంప్ వాక్ చేస్తున్న ఏడుస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఫ్యాషన్ వేడుకను దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్కు నివాళిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ బల్ను గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. సోనమ్ కన్నీళ్లతో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఆమె మాట్లాడుతూ .. "రోహిత్ బల్ కోసం నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. అతని దుస్తులను చాలాసార్లు ధరించడం సంతోషం కలిగించింది. నా కోసం అతను చాలాసార్లు దుస్తులు డిజైన్ చేయించారు. బహుశా అతని కోసం చివరి ప్రదర్శన చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. వారసత్వ, హస్తకళ వేడుక ప్రతిదీ ఆనందంగా జరుపుకోవడమే. నేను అదే విధంగా దుస్తులు ధరించడం ఇష్టపడతాను.' అని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సోనమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.సోనమ్ తన ఇన్స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. " లెజెండరీ రోహిత్ బల్కు నివాళిగా నడవడం గౌరవంగా భావిస్తున్నా. అతని కళాత్మకత, దృష్టి, వారసత్వం భారతీయ ఫ్యాషన్ను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అతని జ్ఞాపకార్థం ర్యాంప్ వాక్ చేయడం ఉద్వేగభరితంగా అనిపించింది. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక రూపకర్తగా ఆయన ఒక ఐకాన్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. సోనమ్తో పాటు చిత్రనిర్మాత మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ వాలయ, నటులు ఈషా గుప్తా, రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సే కూడా రోహిత్ బల్కు నివాళులర్పించేందుకు ర్యాంప్ వాక్ చేశారు. View this post on Instagram A post shared by The Word. (@thewordmagazine) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
బాలీవుడ్ హీరోయిన్కు షాకిచ్చిన ట్విటర్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటి స్వర భాస్కర్కు ట్విటర్ షాకిచ్చింది. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఆమె ట్విటర్(ఖాతా)ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని స్వర భాస్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నేను చేసిన ట్వీట్స్లో రెండు ఫోటోలు కాపీ రైట్ ఉల్లంఘించినట్లుగా గుర్తించి నా ఖాతాను రద్దు చేశారని తెలిపింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని అని పోస్ట్ చేసింది. ఇలాంటి నిర్ణయాలు తనకు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపింది. అంతా కాకుండా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగిందంటే..ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వర భాస్కర్ పోస్ట్ ఈ ట్విటర్ అకౌంట్(ఎక్స్) సస్పెన్షన్కు ప్రధాన కారణం. ఒకటి హిందీ దేవనాగరి లిపిలో "గాంధీ హమ్ శర్మిందా హై, తేరే ఖాతిల్ జిందగీ హై" అనే నినాదం రాసిన ఫోటో కాగా.. మరొకటి తన కుమార్తె జాతీయ జెండా పట్టుకుని ఉండగా.. ఆ పిల్లాడి మొహన్ని కనిపించకుండా హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అంటూ పోస్ట్ చేసింది. ఈ రెండు పోస్ట్లపై ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ స్వరభాస్కర్ అకౌంట్ను సస్పెండ్ చేశారు. కాగా.. స్వర భాస్కర్ విషయానికొస్తే సమాజ్వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2023లో జనవరి 6న వీరి పెళ్లి జరిగింది. మొదట రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
కేఎల్ రాహుల్ సతీమణి బేబీ బంప్ ఫోటోలు.. అక్కినేని వారి కోడలు కామెంట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(Kl Rahul) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. 2023లో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిని(Athiya Shetty) కేఎల్ పెళ్లాడారు. గతేడాది నవంబర్లో ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. బాలీవుడ్ భామ అతియా శెట్టి ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Sunil Shetty) గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సన్ఫ్లవర్ సింబల్ను పోస్ట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీతారలు సైతం బ్యూటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఫోటోలకు అక్కినేని కోడలు శోభిత ధూళిపాల, ఆదిరావు హైదరీ, సోనాక్షి సిన్హా, అమీ జాక్సన్ లాంటి అగ్ర సినీతారలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం అతియా శెట్టి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్)కాగా.. ఈ ఏడాది జనవరి 23 తమ రెండో వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు కేఎల్ రాహుల్- అతియా జంట. 2023లో పెళ్లి పీటలెక్కిన వీరిద్దరు దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. చివరికీ పెద్దల అంగీకారంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన ముంబయిలోని తన ఫామ్హౌస్లోనే వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటించారు. అతని సరసన పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. 2023లో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇదిలా ఉండగా.. గతేడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ధడక్-2లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది. ఇదిలా ఉండగా యానిమల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ తన ఇన్స్టాలో స్టోరీస్ బర్త్ డే విషెల్ చెబుతూ పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్కు ఇన్స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్రిప్తి డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ అతని బర్త్ డే రోజును విష్ చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా నోరు విప్పలేదు.సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్లు, హోటళ్ల బిజినెస్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్గా రాణిస్తున్నారు.ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. -
'మహిళల జీవితాల గురించి మీకేం తెలుసు?'.. హీరామండి హీరోయిన్ ఫైర్
బాలీవుడ్ భామ రిచా చద్దా చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్లో మనీషా కొయిరాలా కీలక పాత్రలో కనిపించింది. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించడం విశేషం.అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రిచా చద్దా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, నైట్క్లబ్లకు వెళ్లే వారిని ప్రగతిశీల మహిళలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. తెరపై చూపించే స్త్రీల నిజ జీవితం గురించి మీకు తెలుసా అని చిత్రనిర్మాతలను ఆమె ప్రశ్నించారు.రిచా మాట్లాడుతూ..' 2010-2012 కాలంలో బాలీవుడ్లో మహిళలు స్మోకింగ్ చేసేవారని కొందరు చెడుగా చూపించారు. అంటే సిగరెట్ తాగి.. నైట్ క్లబ్ వెళ్లేవారని కొందరు దర్శకులు బ్యాడ్గా రాశారు. అంతేకాదు క్లబ్ల్లో డ్యాన్స్ చేసేవారి పాత్రలను చాలా చెడ్డగా చిత్రీకరించినట్లు గుర్తించా. నేను ఆ చిత్ర నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా.అసలు అలాంటి మహిళల గురించి మీకు తెలుసా?. మహిళల త్యాగం గురించి మీకేం తెలుసు. మా ఎముకల నుంచి ఒక బిడ్డను తయారు చేస్తాం. మా రక్తంతో వారికి పోషకాలు అందిస్తాం. పిల్లల కోసం మా జుట్టు, నిద్ర అన్ని దూరమవుతాయి. అంతకుమించిన త్యాగం ఉంటుందా? అంతకంటే ఎక్కువ ఎవరైనా చేయగలరా? ' అని ఆమె ప్రశ్నించారు.కాగా.. రిచా చద్దా చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: ది డైమండ్ బజార్లో కనిపించింది. ఇందులో సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, తాహా షా బాదుషా కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రిచా ఇటీవల గర్ల్స్ విల్ బి గర్ల్స్ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇది ఇండియాలోని బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న యువతి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
23 ఏళ్లు వయసు.. రూ 250 కోట్ల ఆస్తి.. ఎవరీ బుల్లితెర నటి?
చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిసే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువ. అయితే కొంతమంది హీరోయిన్లకు ఇందులో మినహాయింపు ఉంటుంది. నయనతార, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి స్టార్ హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా నటీమణుల హవా కొనసాగుతుంది. సీరియల్స్ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో తెగ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించిన క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జన్నత్ జుబేర్ రహ్మానీ(Jannat Zubair Rahmani) ఒకరు. ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ ఆస్తుల విలువ మాత్రం దాదాపు 250 కోట్ల వరకు ఉంటుంది. వినడానికి కాస్త షాకింగ్గా ఉన్నా.. ఇది వాస్తవమే.షారుఖ్ని మించిన అభిమానం.. బాలీవుడ్ హీరో షారుక్ఖాన్కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 46 మిలియన్ల ఫాలోవర్స్తో షారుఖ్ అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ జన్నత్ ఇన్స్టా ఫాలోవర్స్లో షారుఖ్ని మించిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాలో 49.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 23 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకోవడం గొప్ప విషయమే. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా బుల్లితెరపై నటించే అవకాశాలు వస్తున్నాయి.ఎపిసోడ్కి 18 లక్షలుజన్నత్ వయసు ప్రస్తుతం 23 ఏళ్లు. ఆగస్ట్ 29, 2001లో ముంబైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలో నటించి మెప్పిస్తుంది. ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొన్న జన్నత్.. ఒక్కో ఎపిసోడ్కి అత్యధికంగా రూ. 18 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్కి రూ. 2 లక్షల వరకు తీసుకుంటుందట. అలాగే సోషల్ మీడియాలో ఆమె ఒక్కో పోస్టుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఇలా ఏడాదికి 25 కోట్ల సంపాదనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది జన్నత్. అంతేకాదు పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టిందట. మీడియా కథనాల ప్రకారం జన్నత్ ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. అందంలోనే కాను ఆస్తుల విషయంలోనూ ఈ బ్యూటీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది. View this post on Instagram A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) -
'దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు'.. క్యాస్టింగ్ కౌచ్పై దంగల్ నటి షాకింగ్ కామెంట్స్!
అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ దంగల్ రికార్డ్ పదిలంగానే ఉంది. ఫాతిమా సనా షేక్ చివరిసారిగా ఆదిత్యరాయ్ కపూర్ సరసన మెట్రో ఇన్ డైనో చిత్రంలో హీరోయిన్గా నటించింది. అంతకుముందు 2023లో బాలీవుడ్ మూవీ సామ్ బహదూర్లోనూ కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీ కెరీర్పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునేవారని ఆరోపించింది. కష్టపడి సంపాదిస్తున్న నటులను మోసం చేసేవారని తెలిపింది. ఆడిషన్స్ పూర్తయ్యాక క్యాస్టింగ్ డైరెక్టర్ 15 శాతం కమిషన్ తీసుకున్నాకే మాకు పేమేంట్ ఇచ్చేవారని పేర్కొంది. కానీ కొందరు మాత్రం మంచివారు కూడా ఉండేవారని తెలిపింది. సినీ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన నటులను దోచుకునే నీచమైన వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించింది. అంతేకాకుండా తన కెరీర్లో తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది.ఓ డైరెక్టర్తో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఫాతిమా సనా షేక్ తెలిపింది. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమేనా? అని ఒక దర్శకుడు నన్ను అడిగారని చెప్పుకొచ్చింది. నేను కష్టపడి పని చేస్తానని.. పాత్రకు అవసరమైనది వందశాతం చేస్తానని అతనితో చెప్పాను.. కానీ అతను అంత దిగజారిపోయి మాట్లాడతారని అనుకోలేదని ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేసింది.అంతేకాకుండా హైదరాబాద్లో చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్న సంఘటనను గుర్తుచేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతున్నానని వెల్లడించింది. మేము ఒక గదిలో ఉండగా.. కొందరు నిర్మాతలు దాని గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారని.. మేం చెప్పినవాళ్లను మీరు కలవాలని నాతో అన్నారని పేర్కొంది. ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయేదని తెలిపింది. అయితే అందరూ అలా ఉండరని కూడా ఫాతిమా సనా షేక్ చెప్పింది. -
విడుదలకు ముందే వివాదం.. రష్మిక చిత్రాన్ని అడ్డుకుంటామంటూ వార్నింగ్!
పుష్ప భామ రష్మిక మందన్నా ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ సరసన నటించింది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఛావా ట్రైలర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే వివాదానికి కారణమైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఛావా మూవీపై మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని ఒక డ్యాన్స్ సీన్పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ సీన్ తొలగించకపోతే సినిమాకు విడుదలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఛత్రపతి చరిత్రను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పే ఇలాంటి ప్రయత్నాలు అవసరమని.. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.కాగా.. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడంపై మంత్రి మండిపడ్డారు. దర్శకుడు ఆ సీన్ కట్ చేయాలని.. అంతేకాదు ఈ సినిమాను చరిత్రకారులు, మేధావులకు చూపించాలని అన్నారు. వారు ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈ సినిమా విడుదల కాదని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాతలు చరిత్రకారులను సంప్రదించి వివాదాస్పద కంటెంట్ ఉంటే విడుదలకు ముందే తొలగించాలని సమంత్ పిలుపునిచ్చారు. మేం సూచించిన మార్పులు చేయకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మహారాజ్ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. కాగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.ఆ సీన్లు తొలగిస్తాం.. డైరెక్టర్శంభాజీ మహారాజ్.. మహారాణి యేసుబాయితో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలను తొలగిస్తున్నట్లు చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెల్లడించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం డ్యాన్స్ సీక్వెన్స్ మాత్రమేనని.. మరాఠా రాజు వారసత్వం కంటే మరేది ముఖ్యం కాదని ఉటేకర్ తెలిపారు. -
బ్లాక్ చీరలో 'అలియా భట్' స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)