గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఇలియానా.. ఇప్పుడే కాదు కానీ.. | Ileana D’Cruz Confirms Silver Screen Comeback Soon After Motherhood Break | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఇలియానా.. ఇంకా సమయం ఉంది!

Sep 3 2025 2:36 PM | Updated on Sep 3 2025 3:14 PM

Ileana Opens Up on Possibility Of Her Comeback To Movies

ఇలియానా..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్హీరోయిన్‌. ఎన్టీఆర్‌, ప్రభాస్‌, మహేశ్బాబు..ఇలా స్టార్హీరోలందరితోనూ ఆమె నటించింది. తర్వాత బాలీవుడ్ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే పిల్లలు పుట్టడంతో గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇలియానా రీఎంట్రీ ఇస్తే బాగుండని చాలా మంది ఫ్యాన్స్కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తన అభిమానులకు గుడ్న్యూస్చెప్పింది ఇలియానా(Ileana D'cruz). త్వరలోనే మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇస్తానని చెప్పింది.

తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తల్లిగా పూర్తి సమయాన్ని నా ఇద్దరి పిల్లలకే కేటాయిస్తున్నాను. ఇప్పుడే సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. అభిమానులు నన్ను ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోగలను. నటన అంటే నాకు కూడా ఇష్టమే. కానీ దానికంటే ముందు నా పిల్లల బాగోగులు చూసుకేనే బాధ్యత నాకుంది. అందుకే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. అయితే అది ఎప్పుడు, సినిమా అనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేను. రీఎంట్రీ ఇచ్చే ముందు నేను మానసికంగానే కాకుండా శారీరకంగానూ కొన్ని మార్పులు చేసుకోవాలి. దానికి కొంత సమయం పడుతుందిఅని ఇలియానా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఇలియానా వెండితెరపై మెరవనుందని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ఫుల్ఖుషీ అవుతున్నారు.

కాగా, 2006లో దేవదాస్చిత్రంతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. చివరిగా 2018లో రవితేజతో  ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమా చేసింది. 2023లో మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకొని..అదే ఏడాది చివరిలో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. ఏడాది జులైలో రెండో కొడుకు పుట్టినట్లు ఇలియానా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement