breaking news
National
-
మోదీని ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ కామెంట్స్
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఒకప్పడు సాధారణ కార్యకర్తలా పనిచేసిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎదిగారన్నారు. ప్రధాని మోదీ 1990 దశకంలో ఉన్న చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో జోడిస్తూ ఈ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ను ఇరుకున పడేశాయి.ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే పెనం లోంచి పొయ్యి మీద పడ్డ చందాన కనిపిస్తుంది. ఇప్పటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు తరచుగా ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తూ సంస్థాగత లోపాలను ప్రశ్నిస్తుంటే.. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ కీలక నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు హస్తానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.దిగ్విజయ్ సింగ్, ప్రధాని మోదీకి సంబంధించిన 1990 దశకం చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ చిత్రంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘోలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంలో తీసింది. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఉన్నారు. ఇందులో ప్రధాని మోదీ సాధారణ కార్యకర్తలా అద్వానీ ముందు నేలపై కూర్చొని ఉన్నారు. ఆ చిత్రాన్ని ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేశారు."ఈ చిత్రాన్ని నేను కోరాలో చూశాను. ఇది చాలా ఇంపాక్ట్ పుల్ అనిపించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసంఘ్ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంటుందో ఈ చిత్రం తెలుపుతుంది. ఒకప్పుడు నాయకుల ముందు నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు దేశానికే ప్రధాని అయ్యారు. ఇది సంస్థ యెుక్క గొప్పతనానికి నిదర్శనం. జైశ్రీరామ్" అని దిగ్వీజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆ పోస్టును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ట్యాగ్ చేశారు.ఈ పోస్టుతో బీజేపీ కాంగ్రెస్పై అటాక్ స్టార్ట్ చేసింది. దిగ్విజయ్ సింగ్ పోస్టులకు రాహుల్ సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించిన దిగ్విజయ్ సింగ్ తాను ఆర్ఎస్ఎస్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. తాను కేవలం ఆర్గనైజేషన్ సంస్థగత నిర్మాణాన్ని మాత్రమే తాను ప్రశంసించానని తెలిపారు.కాగా వారం రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలోని లోపాలను బహిరంగంగా ప్రశ్నించారు "రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్కు ఎలా సంస్కరణలు అవసరమో కాంగ్రెస్కు సైతం అదేవిధంగా సంస్కరణలు అవసరం. నాయకత్వ వికేంద్రీకరణ జరగాలి. మీరు అది చేయగలరని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని ఒప్పించడమే పెద్ద ప్రాబ్లం అని రాహుల్ని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలపై గతంలో దుమారం చెలరేగింది. -
గ్రామీణ క్రెడిట్ స్కోర్తో అప్పు!?
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమగ్ర ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ప్రతిపాదించిన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’(GCS)లో నాన్-క్రెడిట్ డేటాను చేర్చాలనే ఆలోచన కీలకంగా మారనుంది.బడ్జెట్ ప్రతిపాదనలు2025-26 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్(GCS)’ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అనుసరించి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ వంటి ప్రముఖ సీఐసీలు తమ సొంత గ్రామీణ క్రెడిట్ స్కోర్లను రూపొందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ స్కోర్లు కేవలం గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులు, క్రెడిట్ మిక్స్, వినియోగం వంటి సంప్రదాయ పారామీటర్ల ఆధారంగానే లెక్కించబడుతున్నాయి.నాన్ క్రెడిట్ డేటా ఆవశ్యకతగ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు ‘థిన్ ఫైల్’ కేటగిరీ కిందకు వస్తారు. అంటే వీరికి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న చరిత్ర (Credit History) చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కేవలం రుణ చరిత్రపైనే ఆధారపడితే, వీరికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనుకాడతాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి సీఐసీలు ఆర్బీఐ, ప్రభుత్వాన్ని నాన్ క్రెడిట్ డేటా వినియోగానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా..విద్యుత్తు బిల్లుల చెల్లింపులునీటి పన్ను, గ్యాస్ సిలిండర్ చెల్లింపులుల్యాండ్లైన్, మొబైల్ బిల్లులు వంటి యుటిలిటీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు.ప్రయోజనాలుయుటిలిటీ బిల్లుల చెల్లింపు రికార్డులను క్రెడిట్ స్కోర్లో చేర్చడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు చెల్లిస్తున్నారంటే, అతనికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. ఇది రుణగ్రహీత ‘క్రెడిట్వర్తినెస్’ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. గతంలో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి కూడా క్రెడిట్ స్కోర్ లభించడం వల్ల వారు సులభంగా రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ప్రవర్తనను లోతుగా విశ్లేషించడం ద్వారా మొండి బకాయిల ముప్పును తగ్గించుకోవచ్చు.చట్టపరమైన, సాంకేతిక సవాళ్లుప్రస్తుతం సీఐసీలు 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (CICRA) పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం, కేవలం ఆర్థిక లావాదేవీల డేటాను మాత్రమే సేకరించే వీలుంది. నాన్ క్రెడిట్ డేటాను వాడాలంటే ఈ చట్టపరమైన నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకే సీఐసీలు తమ అభ్యర్థనలో సీఐసీఆర్ఏ చట్టపరిధిని గౌరవిస్తూనే, కాలానుగుణంగా మార్పులు చేయాలని కోరుతున్నాయి.గ్రామీణ భారతం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో యుటిలిటీ బిల్లుల వంటి డేటాను క్రెడిట్ స్కోరింగ్లో చేర్చడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. ఇది కేవలం బ్యాంకులకే కాకుండా చిరు వ్యాపారులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరసమైన వడ్డీకి రుణాలు అందేలా చేస్తుంది. ఆర్బీఐ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే.. -
ప్రధానిపై విరుచుకపడ్డ రాహుల్
ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వీబీ-జీ-రామ్ జీ బిల్లుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒంటి చేత్తో రాష్ట్రాలతో పాటు పేదల బతుకులపై దాడి చేశారన్నారు.నోట్ల రద్దు మాదిరిగా ఈ నిర్ణయం సైతం ఏక పక్షంగా తీసుకున్నారని తెలిపారు. వీబీ- జీ-రామ్ బిల్లుకు నిరసనగా త్వరలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని రాహుల్ తేల్చి చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్" (వీబీ-జీ రామ్ జీ) బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి పార్లమెంటు లోని ఊభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా ఈ పథకానికి మహత్మా గాంధీ పేరు మార్చడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ చర్యలు ఖచ్చితంగా మహాత్మున్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ ఒంటి చేత్తో రాష్ట్రాల్ని, పేదల్ని దెబ్బకొట్టారు. నోట్లరద్దు సమయంలో మాదిరి ఇప్పుడు అలానే వ్యవహరించారు. ప్రతిపక్షాలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా MGNREGA పథకాన్ని రద్దు చేశారు. దీనిని మేము పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు సైతం మాతో కలిసి వస్తాయని ఆశిస్తున్నాం". అని రాహుల్ అన్నారు.మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. అటువంటి గొప్ప పథకాన్ని రద్దు చేయడం రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడేమనని తెలిపారు. వీబీ-జీ-రామ్ జీ బిల్లుకు నిరసనగా జనవరి 5నుంచి ప్రత్యేకంగా MGNREGA బచావ్ అభియాన్ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. MGNREGA స్థానంలో ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వీబీ-జీ-రామ్-జీ బిల్లు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజుల పని కల్పిస్తుంది. -
‘షార్ట్లతో తిరగొద్దు’.. హుకుం జారీ!
బాఘ్పత్: ఆధునిక పోకడలతో యువత తప్పుదారి పడుతోందని భావించిన ఉత్తరప్రదేశ్లోని బాఘ్పత్ జిల్లా ‘థాంబా దేశ్ పంచాయతీ’ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజంలో సంప్రదాయ విలువలను కాపాడటంతో పాటు, పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా టీనేజర్లపై పలు ఆంక్షలు విధిస్తూ తీర్మానం చేసింది. 18 నుంచి 20 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులు స్మార్ట్ఫోన్లు వాడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో హాఫ్ ప్యాంట్లు (షార్ట్స్) ధరించడంపై నిషేధం విధిస్తున్నట్లు పంచాయతీ పెద్దలు ప్రకటించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని, వీటిని ఉల్లంఘించిన వారిపై సామాజిక చర్యలు ఉంటాయని హెచ్చరించారు.గౌరవ మర్యాదలకు భంగంఈ నిర్ణయానికి గల కారణాన్ని పంచాయతీ పెద్దలు వివరిస్తూ.. స్మార్ట్ఫోన్ల కారణంగా పిల్లలు కుటుంబానికి దూరమవుతున్నారని, ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లను కేవలం ఇళ్లకే పరిమితం చేయాలని, అవసరమైతే తప్ప బయటకు తీసుకురావద్దని వారు సూచించారు. పాశ్చాత్య దుస్తులైన హాఫ్ ప్యాంట్లు ధరించడం వల్ల గ్రామీణ ప్రాంత గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని, అందుకే యువతీయువకులు సంప్రదాయ దుస్తులనే ధరించాలని తీర్మానించారు. యువత తమ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో కాకుండా కుటుంబ పెద్దలతో గడుపుతూ విలువలు నేర్చుకోవాలని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. #WATCH | Bagpat, Uttar Pradesh: Khap Panchayat banned boys from using smartphones and wearing shorts. pic.twitter.com/SiR4r4BQ2A— ANI (@ANI) December 26, 2025వాట్సాప్ ఆహ్వానాలు చాలు..వివాహ వేడుకల విషయంలోనూ పంచాయతీ పెద్దలు పలు మార్గదర్శకాలను తెలిపారు. ఆడంబరాలకు పోయి భారీ ఖర్చులతో పెళ్లిళ్లు చేయవద్దని, ఇళ్ల వద్ద నిరాడంబరంగా వివాహాలు జరపాలని కోరారు. అతిథుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు, ఖరీదైన వివాహ పత్రికలకు బదులుగా వాట్సాప్ ద్వారానే ఆహ్వానాలు పంపుకోవాలని సూచించారు. ఈ నిబంధనలపై పంచాయతీ పెద్దలు చౌధరి ఒంపల్ సింగ్, బ్రజ్పాల్ సింగ్ మాట్లాడుతూ.. సామాజిక ఐక్యతను కాపాడేందుకే ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని, ఇవి ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేవి కావని పేర్కొన్నారు.అన్ని గ్రామాల్లో అమలు? ఈ నిర్ణయం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాఘ్పత్ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతుండగా, యువత మాత్రం ఈ ఆంక్షలపై అసహనం వ్యక్తం చేస్తున్నది. డిజిటల్ యుగంలో ఫోన్లపై నిషేధం విధించడం తగినది కాదని కొందరు విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఆంక్షలను అన్ని గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్.. 285 మంది అరెస్ట్ -
ఢిల్లీలో హై అలర్ట్.. 285 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: కొత్త ఏడాది సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక పోలీసులు చర్యలు ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పరిధిలో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో ఏకంగా 285 మంది నేరగాళ్లను పోలీసులు కటకటాల వెనక్కి తరలించారు. ఈ ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున మారణాయుధాలు, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో అసాంఘిక శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు ఈ మెగా డ్రైవ్ నిర్వహించారు.‘ఆపరేషన్ ఆఘాత్’ (Operation Aaghaat) పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో పోలీసులు పక్కా వ్యూహంతో నేరస్తుల అడ్డాగా పేరున్న పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 40కి పైగా అక్రమ ఆయుధాలు, లక్షలాది రూపాయల నగదు లభ్యమైంది. వీటితో పాటు భారీ పరిమాణంలో డ్రగ్స్, అక్రమ మద్యం నిల్వలను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 1,000 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేర చరిత్ర ఉన్న 285 మందిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్వర్క్ను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి.న్యూ ఇయర్ వేడుకల సమయంలో గొడవలకు దిగే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల పని పట్టేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై ఆయుధ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మందు పార్టీలు చేసుకునే వారిపై, న్యూ ఇయర్ ముసుగులో రెచ్చిపోయే పోకిరీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే! -
UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)ప్రక్రియ ముగిసింది. ఓటర్ల జాబితాలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ భారీ కసరత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించనున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం ఓటర్లలో దాదాపు 18.7 శాతం మంది పేర్లు గల్లంతు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. డిసెంబర్ 31న ఎన్నికల కమిషన్ అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నది.ఈ భారీ కసరత్తుకు సంబంధించి అధికారులు గణాంకాలను వెల్లడించారు. తొలగించిన పేర్లలో దాదాపు 1.25 కోట్ల మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు బూత్ లెవల్ అధికారులు గుర్తించారు. అలాగే సుమారు 45.95 లక్షల మంది ఓటర్లు మరణించగా, 23.59 లక్షల మంది పేర్లు రెట్టింపు (డూప్లికేట్) అయినట్లు నిర్ధారించారు. మిగిలిన వారిలో సుమారు 84 లక్షల మంది ఓటర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం (మిస్సింగ్) గమనార్హం. ముఖ్యంగా రాజధాని లక్నోలోనే ఏకంగా 12 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు సమాచారం.ఈ పరిణామాల నేపధ్యంలో అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల పారదర్శకత కోసమే ఈ చర్యలు చేపట్టామని అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. లక్నో పరిధిలోని మలిహాబాద్, మోహన్లాల్గంజ్ తదితర నియోజకవర్గాల్లో 83 శాతం మంది దరఖాస్తులు సమర్పించగా, లక్నో కంటోన్మెంట్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చట్టబద్ధంగా అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఎన్నికల సంఘం తగిన సమయాన్ని కేటాయించింది.ప్రస్తుతం ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 31న ప్రకటించనున్న ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే 2026, జనవరి 30లోపు ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చు. తుది ఓటర్ల జాబితాను 2026, ఫిబ్రవరి 28న అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ భారీ మార్పులు 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావితం చేస్తాయనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.ఇది కూడా చదవండి: మక్కాలో కలకలం.. వీడియో వైరల్ -
మరో దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి రెడీ: సీడబ్ల్యూసీలో ఖర్గే
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జరుగుతున్న ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఇతర సీనియర్లు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వీబీ జీ రామ్ జీ మార్చడంపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తుడిచి వేసే ప్రయత్నం చేస్తుందని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపైనే దేశవ్యాప్త పోరాటాలు చేయాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ.. ఎంజీఎన్ఆర్ఈజీఏ రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువు. పథకాన్ని రద్దు చేయడం(పేరు మార్చడం)మహాత్మా గాంధీకి అవమానమే. యూపీఏ హయాంలో.. దళితులు, ఆదివాసీలు, మహిళలకు భరోసా ఇచ్చిన పథకం. అలాంటి పథకాన్ని ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేశారు. హయాంలో అమలైన హక్కులను కావాలనే కూల్చేస్తున్నారు. పని హక్కు మీద మోదీ సర్కార్ చేస్తున్న క్రూర దాడి ఇది. పేదల కంటే కార్పొరేట్ల లాభాలే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యం. మూడు నల్ల వ్యవసాయ చట్టాల తరహాలోనే. .. ఎంజీఎన్ఆర్ఈజీఏ MGNREGAపై దేశవ్యాప్త పోరాటం అవసరం. కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధం. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం’’ అని ప్రకటించారాయన. అలాగే.. ఈడీ, ఐటీ, సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల హక్కులపై కుట్ర జరుగుతోంది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీల పేర్లు తొలగించొద్దు. నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయ పోరాటం కొనసాగుతోంది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. అలాగే.. దేశంలో సామరస్యం దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం అని ఖర్గే పేర్కొన్నారు.కాంగ్రెస్ ‘సంస్థా శ్రీజన్ అభియాన్’ కొనసాగుతోంది. ఇప్పటికే 500 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి అయ్యింది. బూత్ స్థాయి వరకూ పార్టీ బలోపేతం చేస్తాం. 2026లో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అని ఖర్గే అన్నారు. థరూర్ పరుగు.. నమస్తేచాలాకాలంగా కాంగ్రెస్ కీలక సమావేశాలకు సైతం దూరంగా ఉంటూ.. హట్ టాపిక్గా మారిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఎట్టకేలకు ఇవాళ సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యారు. ఆ సమయంలో మీడియా కెమెరాలు ఆయన వైపే తిప్పాయి. దీంతో ఆయన వేగంగా పరిగెత్తుకుంటూ డోర్ దాకా వెళ్లారు. అక్కడ నుంచి అందరి చూస్తూ నమస్కారం చేసి లోపలకు వెళ్లిపోయారు. అంతకు ముందు.. ఇందిరా భవన్ ప్రాంగణంలో కనిపించిన ప్రతీ ఒక్కరికీ షేక్హ్యాండ్ ఇస్తూ చిరునవ్వుతో పలకరించారాయన. Delhi: Congress MP Shashi Tharoor reaches the Congress headquarters for the CWC meeting pic.twitter.com/AT3XlczxIG— IANS (@ians_india) December 27, 2025గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక లైన్ అంశాలపై మాట్లాడుతున్న ఆయన.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కీలక భేటీ సహా మూడు సమావేశాలకు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం కేంద్రం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందులో థరూర్ పాల్గొని కాంగ్రెస్ సీనియర్లతోనే విమర్శలు ఎదుర్కొన్నారు.సోనియా, రాహుల్తో రేవంత్ భేటీఇటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, అటు ఏపీ నుంచి సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజులు హాజరయ్యారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ కాసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
డిజిటల్ సంస్కరణలకు జగన్ మోడల్ను అప్లై చేస్తే..
సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే రూపాయిలో.. ప్రజలకు చేరేది కేవలం 15 పైసలు మాత్రమే. మధ్యలో అవినీతి, పరిపాలనా ఖర్చులే అందుకు కారణాలుగా ఉన్నాయ్.. ఈ మాట ఒకప్పడు ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ చేసింది. తరువాతి దశాబ్దాల్లో, సంక్షేమ పథకాలలో లీకేజీలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇన్నేళ్లు గడిచాక డిజిటల్ విప్లవం కారణంలో ఆ పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు కనిపిస్తోంది.తప్పుడు క్లెయిమ్స్, ప్రజా సంక్షేమ పథకాలలో అవినీతి.. అర్హత లేని లబ్ధిదారులు అనేవి ఇందులో ప్రదానంగా సమస్యలు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1–3 ట్రిలియన్ డాలర్ల వరకు ఆ నష్టం జరుగుతోంది. అయితే.. దీనిని తగ్గించడానికి భారత్ సహా అనే దేశాలు ఏఐ, డిజిటల్ ఐడెంటిటీ, ప్రాసెస్ రీడిజైన్ వంటి పద్ధతులను పాటిస్తూ మెరుగైన ఫలితాలు రాబట్టుకోలుగుతున్నాయి.ఆయా దేశాల్లో..ఈ ఏడాది బీసీజీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూఎస్ మెడికెయిడ్(అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం) ఏఐని ఉపయోగించి తప్పుడు క్లెయిమ్స్ను తప్పించుకుని 1 శాతం ఖర్చు.. అంటే దాదాపు 9 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకోగలిగింది. ఆసియా-ఫసిఫిక్ రీజియన్లలో డాక్టర్లు పేషెంట్లకు అత్యధికంగా యాంటీబయటిక్స్ను సూచించిన విషయాన్ని డాటా బేస్ ఆధారంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఆ వెంటనే వైద్యులను కంపేరిజన్ లేఖల ద్వారా అప్రమత్తం చేసింది. దీంతో ఒక ఏడాదిలోనే అలాంటి ప్రిస్క్రిప్షన్లలో 12 శాతం తగ్గుదల కనిపించింది.సింగపూర్లో ప్రజా సంక్షేమ పథకాల కోసం ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ (చాట్బాట్/డిజిటల్ సహాయకుడు) ప్రవేశపెట్టారు. దీంతో కాల్ సెంటర్లకు కాకుండా.. ప్రజలు ఏఐ అసిస్టెంట్ ద్వారా నేరుగా సమాధానాలు పొందగలిగారు. ఈ ప్రభావంతో ఫోన్ కాల్స్ సంఖ్య 50 శాతానికి తగ్గింది. ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రజలకు సమాచారం అందడం సులభతరం అయింది.కెనడా రెవెన్యూ ఏజెన్సీ.. ఏఐను ఉపయోగిస్తూ ట్యాక్స్ మోసాలకు చెక్ పెడుతోంది. యునైటెడ్ కింగ్డమ్లో డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్(DWP) డేటా ఆధారిత ప్లాట్ఫారమ్ను అందుబాటులోకి తెచ్చుకుంది. ఈ డాటా ద్వారా తప్పుగా జరిగే చెల్లింపులను (overpayments) తగ్గించుకుని.. ఈ ఒక్క ఏడాదిలోనే 500 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.5,000 కోట్లకు పైగా) నష్టం జరగకుండా చూసుకుంది.మరి భారత్ విషయానికొస్తే..భారత్లో సంక్షేమ పథకాల లభ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదు. అయితే వీటిల్లో లీకేజీలని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్పలితాలనే ఇస్తున్నాయి. భారత్లో బయోమెట్రిక్, ఆధార్ తరహా డిజిటల్ ఫస్ట్ ఐడీ.. వాటి అనుసంధానాలతో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ డిజిటల్ చెల్లింపుల సంస్కరణలతో ఈ ఏడాది సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న ధనంలో దాదాపు 13% లీకేజీలు తగ్గాయని బీసీజీ నివేదిక ఇచ్చింది. అంటే.. అప్పటిదాకా వెళ్ళిన నిధుల్లో కొంత అర్హత లేని/నకిలీ లబ్ధిదారులకు వెళ్ళిందని సూచించినట్లే కదా.జగన్ మోడల్ కలిస్తే..ప్రజా సంక్షేమంలో భారత్ పూర్తిస్తాయి లీకేజీలను అరికట్టాలంటే .. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిన డీబీటీ వ్యవస్థ(Direct Benefit Transfer) కచ్చితంగా అవసరమనే చర్చ నడుస్తోంది. అందుకు సహేతుకమైన కారణాలను వివరిస్తున్నారు. డీబీటీ మన దేశానికి కొత్తది కాదు. ఇది 2013లోనే ప్రారంభమైంది. అయితే ఇన్నేళ్ల కాలంలో సంపూర్ణంగా.. అదీ సమర్థవంతంగా అమలు చేసింది మాత్రం ఒక్క జగన్ ప్రభుత్వమే!.2019లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని అన్ని సంక్షేమ పథకాలను (అమ్మ ఒడి, రైతు భరోసా.. ఇలా పథకాలెన్నో) వంద శాతం డీబీటీ ఆధారంగా మార్చింది. ఆధార్ అనుసంధానం(తప్పనిసరి), బయోమెట్రిక్ ధృవీకరణలకు బ్యాంక్ ఖాతా లింక్ తప్పనిసరి చేసింది. తద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చేసింది. అలా.. జగన్ స్వయంగా బటన్ నొక్కడం ద్వారా ఐదేళ్ల కాలంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసిన నగదు.. అక్షరాల రూ.2.70 లక్షల కోట్లు.వైఎస్సార్సీపీ హయాంలో మధ్యవర్తుల అవసరం లేకుండా పోయింది. లంచాల రూపంలో అవినీతికి ఆస్కారం కనిపించలేదు. నేరుగా అర్హత ఉన్నవాళ్ల ఖాతాల్లోకే వెళ్తున్నందునా.. ఒక్క పైసా కోత పడేది కాదు. ఆఖరికి కరోనా టైంలోనూ డీబీటీ ద్వారానే సంక్షేమం అందించడం ఇక్కడ మరో రికార్డు. కాబట్టి.. జగన్ డీబీటీ మోడల్ను అనుసరిస్తూనే ఏఐ, బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తే ప్రజా సంక్షేమంలో లీకేజీలను తగ్గించి ప్రతీ రూపాయి కూడా అర్హులైన వారికి చేరగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
యశవంతపుర (బెంగళూరు): ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో మహిళలు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను మొబైల్ఫోన్ రికార్డ్ చేయడానికి యత్నించాడో జూనియర్ టెక్నిషియన్. నాగరబావి సెకండ్ స్టేజ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సువెందు మెహతా (23) అనే కామోన్మాదిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన నిందితుడు ఏడాదిగా ఈ ఆస్పత్రిలో టెక్నిషియన్గా పని చేస్తూ పీజీ హాస్టల్లో ఉండేవాడు. 20న ఉదయం 8:30 గంటలకు శస్త్రచికిత్స విభాగం గదిలో మహిళా సిబ్బంది బట్టలు మార్చుకొనే దృశ్యాలను రికార్డ్ చేయడానికి రహస్యంగా మొబైల్ఫోన్ని పెట్టాడు. ఫోన్ చూసిన నర్సులు కేకలు వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి: ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది! -
బులెట్ బైక్ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు..
యశవంతపుర: అచ్చం సినిమా స్టైల్లో ఈ ఘటన జరిగింది. కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతున్న కారు.. ముందు వెళుతున్న బులెట్ బైక్ను ఢీకొని అర్ధ కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. సుమనహళ్లి వంతెనపై బుధవారం రాత్రి జరిగిన ఘటన వీడియో ఆలస్యంగా వైరల్ అయ్యింది. కారులోని వ్యక్తి ఇస్టానుసారం నడుపుతూ బులెట్ బైకును లాక్కొని వెళ్లాడు. నీ కారుకు బైక్ చిక్కుకుందని పక్కలో వెళ్లతున్న మరో కారు డ్రైవర్ హెచ్చరించినా పట్టించుకోలేదు. బుల్లెట్వాహనదారు రోహిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ రభసకు కారు కింద నిప్పురవ్వుల ఎగజిమ్మాయి, మంటలు వ్యాపించటంతో ఇతర వాహనదారులు భయపడ్డారు. నాయండహళ్లి జంక్షన్ వద్ద కొందరు ఆ కారును అడ్డుకొని పోలీసులకు పట్టించారు. డ్రైవర్ తుమకూరు జిల్లా కుణిగల్కు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. తాగిన మత్తులో ఉన్నాడని తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుదొడ్డబళ్లాపురం: గత నాలుగు రోజుల్లో బెంగళూరులో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసారు. 1,27,938 వాహనాలు తనిఖీ చేయగా మద్యం తాగి నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. नशे में धुत कार ड्राइवर ने बुलेट को मारी टक्कर, 500 मीटर तक घसीटा #BhrashtMahayutiBMC pic.twitter.com/CfJD2pD7NX— HASHTAG BHARAT NEWS (@HTB_tweets) December 26, 2025 -
ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
ఆఫీస్ అయ్యాక మెట్రో రైలులో ఆ యువతి తాను ఉంటున్న ప్లేస్కు బయల్దేరింది. రద్దీలో ఎలాగోలా సీటు సంపాదించుకుని ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చోగలిగింది. ఈలోపు.. తన పక్కన కూర్చన్న వ్యక్తి దిగిపోయి.. మరొకతను ఎక్కాడు. నెమ్మదిగా అతనిలోని కామోన్మాది బయటపడ్డాడు. ఒక్క నిమిషం ఆమెకు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ వెంటనే ధైర్యం తెచ్చుకున్న యువతి ఆ మృగాడి చెంపలు చెడామడా వాయించింది.డిసెంబర్ 23 సాయంత్రం నమ్మా మెట్రో(బెంగళూరు) ప్రయాణిస్తున్న ఒక యువతి, తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘నా ప్రయాణం అప్పటిదాకా సాఫీగా సాగింది. మధ్యలో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దిగిపోవడంతో, మరో వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు. నా మీద పడడం, శరీర భాగాలకు తాకడంతో ఇబ్బంది పడ్డా. అయితే రద్దీ కాబట్టి యాదృచ్ఛికమని భావించా. ఈలోపు.. అతని తీరు మారింది. కావాలనే చేస్తున్నాడని అర్థమైంది. ఇదేమిటన్నట్లు చూస్తే వెకిలినవ్వులు నవ్వాడు. ఇంతలో.. నేను దిగాల్సిన స్టేజ్ వచ్చింది. అతను మరికొందరిని కూడా ఇలాగే వేధించే అవకాశం ఉందని భావించా. అతని చెంప పగలకొట్టి లేవమన్నా. స్టేషన్ బయటకు వచ్చాక మరోసారి చెంప పగలకొట్టా. కెంపగౌడ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ సిబ్బంది అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సర్దుకుపోవాల్సిన అవసరం ఏ అమ్మాయికీ లేదు’’ అంటూ ఆమె వీడియో ఉంచింది. ఈ ఘటనపై ఆ యువతి ఉప్పారపేట పీఎస్లో ఫిర్యాదు చేసింది. అతని పేరు ముత్తప్ప (48) అని తెలిసింది. తర్వాత తప్పయిపోయిందంటూ అతడు యువతి పాదాలపై పడి క్షమాపణలు చెప్పాడు. యువతి అంగీకరించడంతో అతనిని మందలించి పంపించివేశారు. లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న యువతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. Namma Metro Harassment Case | ನಮ್ಮ ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಕಾಮುಕ ಅಂಕಲ್ ಕಾಟ | Bengaluru....#NammaMetro #MetroHarassment #BengaluruNews #WomenSafety #MajesticMetro #PublicSafety #HarassmentCase #bengaluru pic.twitter.com/YaNsNgACW4— Sanjevani News (@sanjevaniNews) December 26, 2025 -
నవ్య– మానస చావులోనూ స్నేహబంధం
సాక్షి, బళ్లారి: బెంగళూరు నుంచి గోకర్ణకు బయలుదేరిన ప్రైవేటు సీబర్డ్ స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సును– కంటైనర్ లారీ ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులోని నలుగురు యువతులు, ఓ బాలిక, లారీ డ్రైవర్ కలిసి ఆరు మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకాలో 48వ హైవేలో జరిగిన ఘోర దుర్ఘటన ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. సుమారు 25 మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ రఫీ మృతి బస్సు డ్రైవర్ మహమ్మద్ రఫీ హుబ్లీ కేఎంసీఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ప్రమాదం జరగగానే కిటికీలో నుంచి రఫీ దూకేశాడు. ఆ సమయంలో కాళ్లు చేతులకు గాయాలు తగిలాయి, కానీ కోలుకోలేకపోయాడు. దీంతో మృతుల సంఖ్య 7కు పెరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గాయపడినవారు ఇప్పటికీ ఆ ఘోరాన్ని తలచుకుని వణికిపోతున్నారు. బయటపడ్డ బండారి యశవంతపుర: కార్వార కుమటాకు చెందిన విజయ్ బండారి అనే యువకుడు ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీ అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఆ తొందరలో మొబైల్ఫోన్, లగేజీని బస్సులోనే వదిలేయడంతో బూడిదయ్యాయి. కుటుంబసభ్యులను సంప్రదించడం వీలు కాకపోయిందని చెప్పాడు. చివరికి ఎలాగో వారికి క్షేమ సమాచారం పంపించాడు.నవ్య– మానస చావులోనూ స్నేహబంధంఅందరి మృతదేహాలు హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో ఉండడంతో కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరారు. నవ్య కుటుంబ సభ్యుల వేదనను ఆపడం ఎవరితరమూ కాలేదు. మృతులు నవ్య, మానస ఒకటవ తరగతి నుంచి స్నేహితులని, ఎంటెక్ వరకు ఒకే కాలేజీలో చదువుకొని బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. హాసన్ జిల్లా చెన్నరాయపట్టణవాసి మానస, మండ్య జిల్లా కేఆర్ పేట తాలూకావాసి నవ్య. నిజానికి ఒకే రోజు తమ తమ పెళ్లిళ్లు జరగాలని కూడా అనుకున్నారు. మృత్యువులోనూ కలిసే వెళ్లారని బంధువులు తెలిపారు. ఎవరి మృతదేహం ఎవరిదో తెలియనంతగా కాలిపోవడంతో మృతుల బంధువుల నుంచి, శవాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. ఆ నివేదికలను బట్టి మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నివేదికలు వస్తాయని చెప్పారు.కళ్ల ముందే స్నేహితురాలు..బనశంకరి: బస్సు ప్రమాదంలో గాయపడిన టెక్కీ గగనశ్రీ బెంగళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో శుక్రవారం ఆ ఘోర దుర్ఘటన గురించి వివరించింది. బస్లో పైన సీటులో నిద్రపోయిన నేను, ప్రమాదం జరిగిన వెంటనే రక్షితతో కలిసి బయటకు దూకాము. రశ్మి కూడా దూకేలోపు ఆమె మంటల్లో చిక్కుకుందని తెలిపింది. గోకర్ణ కు వెళ్లి రశ్మి ఇంటికి వెళ్లాల్సి ఉంది, బస్లోపల ఉన్న లగేజీ బ్యాగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి, రశ్మి బయటకు రావడానికి దేవుడు సమయం ఇవ్వలేదు అని ఆమె ఆవేదన చెందింది. మృతురాలు రశ్మి మురుడేశ్వరవాసి. ఈ ముగ్గురు ప్రమాదానికి ముందు తీసుకున్న ఫోటో వైరల్ కావడం తెలిసిందే. ప్రి వెడ్డింగ్ పారీ్టపై నిప్పులు బాధితుల్లో 7 మంది బృందం బెంగళూరు మావళ్లి, బిన్నిమిల్స్వాసులు. మంజునాథ్– కాబోయే భార్య కవిత, స్నేహితులు దిలీప్, సంధ్య, శశాంక్, బిందు–ఆమె కూతురు గ్రేయ. వీరందరూ బెంగళూరులో టెక్కీలుగా పనిచేస్తారు. మంజునాథ్– కవితకు ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో స్నేహితులకు గోకర్ణలో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలనుకుని అందరూ ఈ బస్సులో ఎక్కారు. మంజునాథ్కు తీవ్ర కాలినగాయాలు కాగా, బెంగళూరు విక్టోరియాలో చికిత్స పొందుతున్నాడు. ఇక దిలీప్కు బిందు సొంత సోదరి అవుతుంది. ఇలా ఒకరికొకరికి బంధుత్వాలు కూడా ఉన్నాయి. బిందు, ఆమె కూతురు ప్రమాదంలో చనిపోయారు. -
బలుపు మాటలకు భారత్ రియాక్షన్
భారత్ దృష్టిలో తాము పరారీలో ఉన్న కీలకమైన వ్యక్తులమంటూ.. లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అలాంటి వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.లలిత్ మోదీ, విజయ్ మాల్యా లండన్లో పార్టీలు చేసుకుంటూ.. భారత దర్యాప్తు సంస్థలను(Enforcement Agencies) ఎగతాళి చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రంధీర్ జైస్వాల్ శుక్రవారం జరిగిన ప్రెస్మీట్లో స్పందించారు. “అలాంటి పరారీలను తిరిగి తీసుకురావడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రక్రియలో అనేక ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. అయితే.. చట్టపరమైన అనేక దశల కారణంగా ఆలస్యం జరుగుతోంది.అంతేతప్ప మరొక ఉద్దేశం లేదు. అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారాయన.VIDEO | Delhi: “The Government of India is committed to bringing back all fugitives who have fled the country and evaded the law. Discussions are ongoing with several countries in this regard, and I want to assure you that we are firm and fully committed to ensuring their… pic.twitter.com/f7wcs5kwrR— Press Trust of India (@PTI_News) December 26, 2025బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం నుంచి పరారై లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా ఇటీవల(డిసెంబర్ 16న) 70వ పుట్టినరోజు చేసుకున్నారు. దీనికి భారత బిలియనీర్ కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆయన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ లలిత్ మోదీ, విజయ్ మాల్యా తాము అతి పెద్ద పరారీలో ఉన్న వ్యక్తులుగా నిలిచామని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘లెట్స్ బ్రేక్ ద ఇంటర్నెట్ డౌన్ ఇన్ ఇండియా ఎగెయిన్ (మళ్లీ భారత్లో ఇంటర్నెట్ను బద్దలు కొడదాం)’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఫ్రాడ్, మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన వీళ్లు ఇలా వెటకారంగా స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయి లండన్లో తలదాచుకున్నాడు. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఆ మధ్య ఓ పాడ్కాస్ట్లో ఆయన వెల్లడించాడు. కానీ, భారత ప్రభుత్వం ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల అబియోగాలు నమోదు చేసింది. ఇక మరో బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్కు కావలసిన నిందితుడు. 2017లో లండన్లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఈడీ ఇప్పటికే మాల్యా ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన నిధులను ఉద్యోగులకు, బ్యాంకులకు తిరిగి ఇచ్చింది. అలాగే.. ఆయన్ని భారత్కు రప్పించే ప్రయత్నాల్లో కూడా పురోగతి కనిపిస్తోంది. అయితే.. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిందటి ఏడాది పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా.. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆర్థిక మంత్రి ప్రకటన సమయంలో.. విజయ్ మాల్యా తీవ్రంగా స్పందించారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే.. ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్ చేశారాయన. అయితే దానికి లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్డే శుభాకాంక్షలు’’ అంటూ ఓ పోస్ట్ చేశాడు. -
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్ట్..
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల(బీఎంసీ) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఎన్నికల చర్చలు విఫలమైనట్టు సమాచారం. పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై వీరి మధ్య జరిగినట్టు తెలిసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అంశంపై సీట్ల పంపకాలపై శుక్రవారం పూణేలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శరద్ పవార్ వర్గానికి కేవలం 35 స్థానాలను మాత్రమే ఇస్తానని, అది కూడా గడియారం గుర్తుపై పోటీ చేయాలని అడిగారు. అయితే, ఈ ప్రతిపాదనను శరద్ పవార్ తిరస్కరించారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం శరద్ పవార్ ముభావంగా అక్కడి నుంచి వెనుదిరిగినట్టు తెలిసింది. అజిత్తో చర్చలు విఫలమైన తర్వాత శరద్ పవార్.. సీట్ల పంపకాలపై చర్చల కోసం మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) వద్దకు తిరిగి వెళ్లారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్తో ముమ్మర చర్చలు జరిపినట్టు సమాచారం. పూణేలోని ఒక హోటల్లో జరిగిన ఎంవీఏ సమావేశంలో శరద్ పవార్ ఎన్సీపీ వర్గం నుండి బాపుసాహెబ్ పఠారే, అంకుష్ కాకడే.. కాంగ్రెస్ నుండి అరవింద్ షిండే, రమేష్ బాగ్వే.. అలాగే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వసంత్ మోరే చర్చల్లో పాల్గొన్నారు. మహాయుతి దూకుడు..మరోవైపు.. బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ‘మహాయుతి’ కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది. మహాయుతి వర్గాల ప్రకారం మొత్తం 227 సీట్లలో బీజేపీ 140 స్థానాల్లో పోటీ చేయనుంది. శివసేన (షిండే వర్గం) 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 210 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని కూటమి ధర్మాన్ని పాటించాలని, మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక, బీఎంసీ ఎన్నికలకు జనవరి 15, 2026న పోలింగ్ జరగనుంది. -
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
యశవంతపుర: ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ వధువు గానవి (26) గురువారం రాత్రి చనిపోయింది. వివరాలు.. అక్టోబర్ ఆఖరిలో సూరజ్తో గానవికి వివాహమైంది. వీరిద్దరూ బెంగళూరువాసులే. ఇటీవల శ్రీలంకకు హనుమూన్కు వెళ్లాగా అక్కడే గొడవపడి తిరిగి వచ్చారు. మూడురోజుల కిందట ఆమె భర్త ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. బ్రెయిన్డెడ్ అయి చివరకు మరణించింది. అతడు మగాడు కాదు గానవి పెద్దమ్మ మాట్లాడుతూ భర్త నపుంసకుడని, సంసారానికి పనికిరాడని గానవి తొలి రాత్రిరోజే తనకు చెప్పి బాధపడిందన్నారు. పెద్దమొత్తంలో బంగారం, స్థలం, కారు, ప్రతి నెలా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని భర్త వేధించేవాడని బంధువులు అరోపించారు. వారి ఫిర్యాదు మేరకు రామమూర్తినగర పోలీసులు నమోదుచేశారు. -
వార్తల వెం‘బడి’!
స్మార్ట్ఫోన్ల స్క్రీన్ల మధ్య నలిగిపోతున్న బాల్యాన్ని అక్షరాల వైపు మళ్లించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప ముందడుగు వేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ’వార్తాపత్రిక పఠనం’ తప్పనిసరి చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం చదవడమే కాదు.. విశ్లేíÙంచడం, నేర్చుకోవడం లక్ష్యంగా ఈ ’పఠన ప్రచారం’ సాగనుంది. నూతన మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో జరిగే మార్పులివే.. అసెంబ్లీలో 10 నిమిషాల పఠనం రోజూ ఉదయపు ప్రార్థన సమయంలో కనీసం 10 నిమిషాలు వార్తాపత్రికలు చదవాలి. జాతీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలతో పాటు ముఖ్యమైన సంపాదకీయాలను విద్యార్థులు అందరికీ చదివి వినిపించాలి. పద సంపద ప్రదర్శన రోజూ దినపత్రికల్లోని ఐదు కఠిన పదాలను ఎంపిక చేసి, వాటిని నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. దీనివల్ల విద్యార్థుల పద సంపద మెరుగుపడుతుంది. పాఠశాల గ్రంథాలయాల్లో మాతృభాష హిందీతో పాటు ఆంగ్ల దినపత్రికలను కూడా అందుబాటులో ఉంచాలి. పువ్వులు వద్దు.. పుస్తకాలే ముద్దు.. నినాదంతో పాఠశాల వేడుకల్లో ట్రోఫీలకు బదులు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్లు, సంపాదకీయ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. పాఠశాల మ్యాగజైన్లు లేదా సొంతంగా పత్రికల నిర్వహణ, సుడోకు, క్రాస్వర్డ్ పోటీలను ప్రోత్సహిస్తారు. చిన్న పిల్లల కోసం వార్తల కటింగ్స్తో స్క్రాప్ బుక్ తయారు చేయిస్తారు. ఫోన్లకు బానిస కాకుండా.. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి పార్థసారథి సేన్ శర్మ తెలిపారు. ‘వార్తాపత్రికలు చదవడం వల్ల పిల్లల్లో జనరల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి సహాయపడుతుంది. ఏది నిజమైన వార్త, ఏది నకిలీ వార్త అనే తేడాను గుర్తించే పరిణతి వారిలో వస్తుంది’.. అన్నారాయన. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి.. విద్యార్థులను అక్షరాల వైపు మళ్లించేందుకు యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ పొట్ట కొట్టింది.. డిజైనర్ దారి తప్పాడు
ఒకవైపు ఆధునిక ప్రపంచం ’ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’ విజయాలను వేడుక చేసుకుంటుంటే.. అదే టెక్నాలజీ ఒక 18 ఏళ్ల కుర్రాడి పొట్ట కొట్టింది. చేతిలోని పనిని ఏఐ లాగేసుకోవడంతో, ఆకలి తట్టుకోలేక ఆ యువకుడు తన స్నేహితురాలితో కలిసి చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఏం జరిగిందంటే? ఇండోర్లోని రావు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 22వ తేదీ రాత్రి ఒక నగల దుకాణంలో సుమారు రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు చోరీ అయ్యాయి. ఈ కేసును ఛేదించిన పోలీసులు, భోపాల్లో తలదాచుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు 18 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ కాగా, మరొకరు డాక్టర్ కావాలని కలలు కంటూ ’నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి. ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా స్ఫూర్తితో.. డీసీపీ శ్రీకృష్ణ లాల్చందాని తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. 2005లో వచి్చన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. బతకడం కష్టమై తప్పు చేశా.. పోలీసుల విచారణలో.. ‘నేను ఒక ఐటీ కంపెనీలో పార్ట్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్గా పని చేసేవాడిని. కానీ కంపెనీ వాళ్లు ఏఐ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టి, నా ఉద్యోగం తీసేశారు. చేతిలో పైసా లేక, బతకడం కష్టమై ఈ దారి ఎంచుకున్నాను’.. అని ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసింది. దొంగతనం చేసిన నగలను అమ్మడానికి వారు ప్రయతి్నంచారు కానీ, చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉండటంతో ఎవరూ వాటిని కొనడానికి ముందుకు రాలేదు. తక్కువ ధర కోట్ చేయడంతో, క్రిస్మస్ సెలవుల తర్వాత నిదానంగా అమ్ముదామని వేచి చూస్తుండగా పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం పోలీసులు వారి దగ్గర నుండి నగలను స్వా«దీనం చేసుకున్నారు. సాంకేతికత తెచి్చన మార్పు ఒక యువకుడిని నేరస్తుడిగా మార్చడం.. నేటి సామాజిక సంక్షోభానికి అద్దం పడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) పేరుతో తెచి్చన కొత్త చట్టంతో పాటు దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీకి అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీల అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో అక్కడి వైఫల్యాలపైనా చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న పశి్చమబెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పారీ్టలతో పొత్తుల అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను భేటీలో విశ్లేíÙంచనున్నారు. దీంతో పాటే యూపీఏ ప్రభుత్వం తీసుకువచి్చన నరేగా పథాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్తగా తెచ్చి జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తెచి్చన నేపథ్యంలో, దీనిపై. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై భేటీలో చర్చించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిరసనలపై రోడ్మ్యాప్ను రూపొందించడానికి సభ్యుల నుంచి ప్రతిపాదనలు కోరనున్నట్లు తెలిసింది. కొత్త చట్టంపై కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ తీసుకునే కార్యాచరణ కీలకం కానుంది. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహా ఢిల్లీకి చేరుకున్నారు. -
అది ‘పండోర బాక్స్’ తెరిచినట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫయర్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలన్న డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలను పక్కనపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు జీఎస్టీని తగ్గిస్తే అది ‘పండోర బాక్స్’తెరిచినట్లవుతుందని, దీనివల్ల భవిష్యత్తులో అనేక క్లిష్ట సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫయర్లను ‘వైద్య పరికరాల’జాబితాలో చేర్చాలని, ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సమాఖ్య వ్యవస్థకు ముప్పు: కేంద్రం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ వాదనలు వినిపించారు. జీఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని గుర్తు చేశారు. పన్ను రేట్ల తగ్గింపు అనేది కేంద్రం, రాష్ట్రాల చర్చల ద్వారా, ఓటింగ్ ద్వారా నిర్ణయించాల్సిన అంశమని స్పష్టం చేశారు. ’ఇప్పుడు కోర్టు ఆదేశాలతో పన్నులు తగ్గిస్తే.. రేపు ప్రతి ఒక్కరూ పిటిషన్లు వేసి పన్నులు తగ్గించమని అడుగుతారు. ఇది ఒక పండోర బాక్స్ తెరిచినట్లవుతుంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాం. కానీ పద్ధతి ప్రకారం వెళ్లాలి’అని కోర్టుకు నివేదించారు. అసలు ఈ పిటిషన్ వెనుక ఎవరున్నారో ఆరా తీయాల్సి ఉందని, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సామాన్యుడు ఎలా కొంటాడు?: హైకోర్టు ఆగ్రహం జస్టిస్ వికాస్ మహాజన్, జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది. ’ఒక ఎయిర్ ప్యూరిఫయర్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేలు వరకు ఉంది. సామాన్యుడు దీన్ని ఎలా కొనగలడు? జీఎస్టీని తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తేవచ్చు కదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విషయాన్ని అత్యవసరంగా జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని గతంలోనే చెప్పామని గుర్తు చేసింది. దీనిపై సమగ్ర సమాధానం ఇచ్చేందుకు (కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు) కేంద్రం గడువు కోరడంతో, కోర్టు 10 రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 9, 2026కి వాయిదా వేసింది. సెలవుల తర్వాత వెంటనే ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు చర్చించగలదో తెలపాలని ఆదేశించింది. విలాసం కాదు.. అవసరం: పిటిషనర్ పిటిషనర్ కపిల్ మదన్ వాదిస్తూ.. ఢిల్లీలో కాలుష్యం ఎమర్జెన్సీ స్థాయికి చేరిందన్నారు. ఎయిర్ ప్యూరిఫయర్ ఇప్పుడు లగ్జరీ కాదని, ప్రాణాలను కాపాడే వైద్య పరికరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని, దీనివల్ల నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్యూరిఫయర్లను తప్పుడు కేటగిరీలో ఉంచి పన్ను వసూలు చేస్తున్నారని వాదించారు. -
ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఏటీఎస్.. యాంటీ టెర్రర్ గ్రిడ్
న్యూఢిల్లీ: దేశంలోని పోలీసు వ్యవస్థ కోసం ఏటీఎస్(అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అదేవిధంగా, యాంటీ టెర్రర్ గ్రిడ్ను కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ఉగ్రదాడులను ప్రతి స్థాయిలోనూ ఉమ్మడిగా వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని చెప్పారు. ‘వ్యవస్థీకృత నేరాలపై 360– డిగ్రీల దాడి’అనే కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జీరో టెర్రర్ పాలసీకి ఇది అత్యంత కీలకంగ మారనుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం మొదలైన రెండు రోజుల యాంటీ టెర్రరిజమ్ కాన్ఫరెన్స్–2025లో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ‘బలవంతంగా డబ్బు వసూలు చేయడమనే ఏకైక లక్ష్యంతో వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు ఏర్పడుతాయి. వాటి నేతలు విదేశాలకు పారిపోయి, అక్కడే స్థిరపడిపోయాక.. ఇక్కడుండే నెట్వర్క్ ఉగ్ర గ్రూపుల ఆ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. అటు తర్వాత, ఆ నెట్వర్క్ ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు దోహదపడుతోంది’అని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్గనైజ్డ్ క్రైం నెట్వర్క్ డేటాబేస్, వెపన్స్ డేటా బేస్ ఫర్ లాస్ట్, లూటెడ్ అండ్ రికవరీ ఆరŠమ్స్కు సంబంధించిన రెండు డేటాబేస్లను ఆయన ప్రారంభించారు. జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) రూపొందించిన ఈ డేటాబేస్లను దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా విభాగాలు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. వీటితోపాటు ఉగ్రవాదులు, నేరగాళ్లకు సంబంధించిన డేటాబేస్లను కూడా రూపొందించాలని సూచించారు. -
‘హెచ్–1బీ’ కష్టాలపై అమెరికాతో చర్చిస్తాం
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా ఇంటర్వ్యూలు హఠాత్తుగా వాయిదా పడడం, తద్వారా అమెరికా ప్రయాణాలు ఆగిపోవడం పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలు నాలుగైదు నెలలపాటు వాయిదా పడ్డాయి. వేలాది మంది భారతీయుల ఇబ్బందులకు గురవుతున్నారు. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ను, వారు చేసిన పోస్టులను నిశితంగా పరిశీలించడానికి వీలుగా ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వారం జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మే నెల దాకా వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఈ–మెయిల్ సందేశాలు రావడం గమనార్హం. దాంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం స్పందించారు. దరఖాస్తుదారుల కష్టాలను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా సంప్రదింపులు జరుపుతామని వివరించారు. వీసా దరఖాస్తుదారుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందుతున్నాయని తెలిపారు. ఇంటర్వ్యూల విషయంలో ఆలస్యాన్ని భారీగా తగ్గించాలన్నదే తమ ప్రయత్నమని వెల్లడించారు. ఇబ్బందులకు త్వరలోనే తెరపడుతుందని రణ«దీర్ జైస్వాల్ ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి హెచ్–1బీ వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మొదట మూడేళ్ల కాలానికి ఈ వీసా జారీ చేస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగిస్తారు. హెచ్–1బీ వీసాలు స్వీకరించినవారిలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉంటున్నారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. రాబోయే రోజుల్లో ఈ వీసాలు పొందడం కష్టతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
బంగ్లాదేశ్లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట పడకపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. మైమన్సింగ్ ప్రాంతంలో గతవారం హిందూ యువకుడిని మూక దాడిలో చంపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత తారిఖ్ రెహ్మాన్ తిరిగి స్వదేశానికి చేరుకోవడంపై ఆచితూచి స్పందించింది. ఆ దేశంలో స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా పార్లమెంట్ ఎన్నికలు జరగాలని భారత్ చేస్తున్న ప్రయత్నాల కోణంలోనే దీనిని చూడాలని పేర్కొంది. బంగ్లా విముక్తి పోరాటం దగ్గర్నుంచి ఆ దేశంతో సన్నిహిత, స్నేహ సంబంధాలనే భారత్ కోరుకుంటోందని చెప్పింది. ఫ్యాక్టరీ కారి్మకుడు దీపు చంద్ర దాస్ను చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులతోపాటు క్రైస్తవులు, బౌద్ధులపైనా అతివాదులు పాల్పడుతున్న దాడులు ఆగకపోవడం తీవ్ర ఆందోళన కరమైన అంశమన్నారు. మధ్యంతర ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా మైనారిటీల హత్యలు, భూ ఆక్రమణలు, దాడులకు సంబంధించిన ఘటనలు 2,900కు పైగా నమోదయ్యాయన్నారు. వీటిని మీడియా చేస్తున్న అతి ప్రచారంగానో లేదా రాజకీయ హింసగానో చూడరాదని జైశ్వాల్ తెలిపారు. -
సిక్కుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
న్యూఢిల్లీ: సిక్కుల పదో మత గురువు గురు గోవింద్ సింగ్ వారసులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ దేశం కోసం మహోన్నత త్యాగం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆనాటి మొగల్ పాలకుల క్రూరత్వం, మతోన్మాదం, ఉగ్ర భావజాలానికి వ్యతిరేకంగా వారు చేసిన ప్రాణ త్యాగం భారతదేశ అసమాన ధైర్యసాహసాలు, వీరత్వం, శౌర్యానికి అత్యున్నత ప్రతీక అని ఉద్ఘాటించారు. గురు గోవింద్ సింగ్ వారసుల త్యాగాన్ని స్మరిస్తూ శుక్రవారం నిర్వహించిన ‘వీర్ బాల్ దివస్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పీడనకు వ్యతిరేకంగా ఇద్దరు యువరాజులు సాగించిన పోరాటాన్ని దేశం ఎప్పటికీ స్మరించుకుంటుందని అన్నారు. వారు మనకు గర్వకారణమని చెప్పారు. వయసు, ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు. చిన్న వయసులోనే మొగల్ పాలకులకు ఎదురొడ్డి నిలిచారని తెలిపారు. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్లను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగితే సాధించలేనిది ఏమీ ఉండదని యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నిజాలను అణచివేశారు ‘‘సిక్కు యువరాజుల త్యాగాల గురించి దేశంలో ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. దురదృష్టవశాత్తూ ఆ పరిస్థితి కనిపించడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వలసవాద ఆలోచనావిధానం కొనసాగుతుండడం విచారకరం. వలసవాద మనస్తత్వానికి బ్రిటిష్ రాజకీయ నాయకుడు మెకాలే ఆద్యుడు. ఇప్పటికీ దాన్ని వదిలించుకోలేకపోతున్నాం. దశాబ్దాలపాటు నిజాలను అణచివేశారు. బ్రిటిష్ కాలంనాటి ఆలోచనా విధానం నుంచి విముక్తి పొందాలన్నదే మన అసలైన సంకల్పం. భారతీయుల ధైర్య సాహసాలు, త్యాగాలు ఇకపై అణచివేతకు గురికాకూడదు. వారి గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవాలను గ్రహించాలి. మెకాలే కుట్రకు 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయి. మరో పదేళ్లలో వలసవాద మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి చెందాలి. అదే మన లక్ష్యం. అప్పుడు మనం స్వదేశీ సంప్రదాయాలు, సంస్కృతులను గర్వకారణంగా భావిస్తాం. ‘స్వయం సమృద్ధి’మార్గంలో ముందుకు పయనిస్తాం’’ అని మోదీ అన్నారు. భాషల వైవిధ్యమే మన బలం జెన్ జెడ్ (1997 నుంచి 2021 మధ్య జని్మంచినవారు), జెన్ అల్ఫా(2010 నుంచి 2025 మధ్య జని్మంచినవారు) భుజస్కందాలపై పెద్ద బాధ్యత ఉంది. ‘వికసిత్ భారత్’అనే లక్ష్య సాధన దిశగా దేశాన్ని ముందుకు నడిపించాలి. వారి నైపుణ్యాన్ని, విశ్వాసాన్ని అర్థం చేసుకున్నా. వారిపై నాకు సంపూర్ణంగా నమ్మకంగా ఉంది. వలసవాద మనస్తత్వాన్ని వదిలించుకుంటే మన భాషల వైవిధ్యమే మనకు బలంగా మారుతుంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 160 మంది ఎంపీలు వారి మాతృభాషలో ప్రసంగించారు. తమిళం, మరాఠీ, బంగ్లా వంటి భాషల్లో ప్రసంగాలు సాగాయి. వేర్వేరు కీలక రంగాల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించినవారికి ప్రతిఏటా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందజేస్తున్నాం, ఈ ఏడాది 20 మందికి ప్రదానం చేశాం’’అని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. -
వీరు దేశానికి గర్వకారణం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు స్వీకరించిన చిన్నారులు వారి కుటుంబాలకు, మొత్తం దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ పురస్కారాలు దేశవ్యాప్తంగా బాలబాలికలందరికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు. రాష్ట్రపతి శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘వీర్ బాల్ దివస్’కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహస బాలలతోపాటు సామాజిక, సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అసమాన ఘనతలు సాధించిన 20 మంది చిన్నారులకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీర్ బాల్ దివస్ ప్రాముఖ్యతను వివరించారు. 320 ఏళ్ల క్రితం గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులు సత్యం, న్యాయం కోసం పోరాడుతూ ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. చిన్న కుమారులైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్లు ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశ విదేశాల్లో గౌరవాన్ని అందుకుంటున్నాయని తెలిపారు. చిన్నారుల్లోని దేశ భక్తి, ఉన్నత విలువలను బట్టి ఒక దేశం గొప్పతనాన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఇద్దరు తెలుగు బాలలకు పురస్కారాలు ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను 18 మంది పిల్లలకు, మరణానంతరం మరో ఇద్దరి తరఫున వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి ముర్ము అందజేశారు. పురస్కారాల గ్రహీతల్లో ఇద్దరు తెలుగు బాలలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. కార్తికేయ పర్వతారోహకుడు. 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సెవెన్ సమ్మిట్ చాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేసిన అతిపిన్న వయసు్కడిగా ఘనత సాధించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన 17 ఏళ్ల పారా అథ్లెట్ శివానీ హోసూరు ఉప్పర సైతం క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. ఈమె షాట్పుట్, జావలిన్ థ్రోలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో అవార్డులు సాధించారు. పురస్కార గ్రహీతలకు మెడల్, సరి్టఫికెట్తోపాటు రూ.లక్ష నగదు ప్రోత్పాహకాన్ని రాష్ట్రపతి అందజేశారు. పురస్కార గ్రహీతలతో ప్రధాని మోదీ భేటీ బాల పురస్కారాలు అందుకున్న చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్ మండపంలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో భాగంగా వారితో ముచ్చటించారు. చిన్న వయసులోనే ఇతరులకు స్ఫూర్తినిచ్చే విజయాలు సాధించారని ప్రశంసించారు. ఈ విజయాలు ఆరంభం మాత్రమేనని, ఇంకా సుదూర ప్రయాణం చేయాల్సి ఉందని చెప్పారు. ఈ తరంలో జని్మంచడం ఈ చిన్నారుల అదృష్టమని, వారి ప్రతిభకు దేశమంతా మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. ప్రతిభావంతులైన బాలలను మరింత ముందుకు నడిపించేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తాత్కాలిక ప్రజాదరణ, గ్లామర్కు ఆకర్షితులు కాకుండా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలని చిన్నారులకు ప్రధాని మోదీ సూచించారు. -
పాక్ గుండెల్లో ‘సిందూర్ 2.0’ గుబులు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచి్చంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరో కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్ను వెంటాడుతోంది. భారత సైన్యం దాడులకు దిగితే తిప్పికొట్టడానికి పీఓకేలోని మూడు సెక్టార్లలో కౌంటర్–అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్(సీ–యూఏఎస్)ను పాక్ సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. రావల్కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో వీటిని నెలకొల్పినట్లు పేర్కొన్నాయి. ఎల్ఓసీ వద్ద 30కిపైగా యాంటీ–డ్రోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గగనతల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎల్రక్టానిక్ యుద్ధ సామర్థ్యాలు పెంచుకోవడం పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.శత్రు డ్రోన్లపై నజర్ భారత్లోని పూంచ్ సెక్టార్కు ఎదురుగా ఉన్న రావల్కోట్లో యాంటీ–డ్రోన్ల వ్యవస్థలను రెండో ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తోంది. రాజౌరీ, నౌషెరా, సుందర్బనీ సెక్టార్లకు ఎదురుగా ఉండే కోట్లీలో వీటి నిర్వహణ బాధ్యతను మూడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్కు, భింబర్లో నిర్వహణను ఏడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్కు అప్పగించినట్లు తెలిసింది. ఎల్ఓసీ వెంట ఎల్రక్టానిక్, కైనటిక్ కౌంటర్–యూఏఎస్లను పాక్ రంగంలోకి దించినట్లు సమాచారం. ఇందులో కీలకమైన స్పైడర్ వ్యవస్థ కూడా ఉంది. ఇది పది కిలోమీటర్ల దూరంలోని శత్రు డ్రోన్లను కూడా సరిగ్గా గుర్తించగలదు. అంతేకాకుండా పాక్ అమ్ముల పొదిలో సఫ్రా యాంటీ–యూఏవీ జామింగ్ గన్ కూడా ఉంది. దీనిని మనుషులు ఆపరేట్ చేస్తుంటారు. 1.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను కూలి్చవేయొచ్చు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు డ్రోన్లను కూల్చడానికి సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా పాక్ ఉపయోగిస్తోంది. జీడీఎఫ్ 35 ఎంఎం ట్విన్ బ్యారెల్ యాంటీ– ఎయిర్క్రాఫ్ట్ గన్స్, అజ్నా ఎంకే–2, ఎంకే–3 మ్యాన్–పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ వద్ద ఉన్నాయి. తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో దూసుకొచ్చే డ్రోన్లను వీటితో కూల్చవచ్చు.తుర్కియే, చైనాలతో పాక్ చర్చలు ఇటీవలి కాలంలో పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు ముమ్మరమయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం తరచుగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పాక్ సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరిస్తున్నారు. ఈ పరిణామాలతో పాక్ అప్రమత్తమైనట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు నూతన డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కోసం తుర్కియే, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కౌంటర్–డ్రోన్ సామర్థ్యాల విషయంలో పాక్ సైన్యం చాలా బలహీనంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ విషయం నిరూపితమైంది. అందుకే డ్రోన్లతో జరిగే దాడిని తట్టుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి. -
ఖర్చు తక్కువైతేనే విదేశీ విద్య!
‘విదేశాల్లోని పేరొందిన యూనివర్సిటీల్లో చదువుకోవాలి. కోర్సు పూర్తి కాగానే మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాలి’అన్నది భారతీయ విద్యార్థుల కల. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిణామాలు, వీసా విధానాలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో యూనివర్సిటీల ర్యాంకుల బదులుగా తక్కువగా ఉండే విదేశీ చదువు ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు, చేసిన ఖర్చుకు వచ్చే రాబడి వంటి అంశాలు విద్యార్థుల ‘విదేశీ విద్య’నిర్ణయాలను అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్కెట్ విలువ ఆధారంగా లెక్కలు.. మంచి జరుగుతుందని వేచి చూసే ధోరణి గతం. ఈ విధానం నుంచి విద్యార్థులు బయటకు వచ్చారు. చేయబోయే కోర్సు లేదా డిగ్రీ ఉత్తమమైనదా కాదా అని బేరీజు వేసుకొనే రోజులు వచ్చాయి. ప్రపంచ పోటీ నేపథ్యంలో ప్రతి డిగ్రీకి మార్కెట్ విలువ ఉందా అని లెక్కలు వేసుకుంటున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే అభ్యర్థులకు సహాయం, సమాచారం అందిస్తున్న లీప్ స్కాలర్ అనే కంపెనీ 2020–2025 మధ్య 30 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణుల దరఖాస్తులు, పరస్పర సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తక్కువ వ్యయంతో.. ‘విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లగలనా’అనే సందేహం స్థానంలో ‘ఈ డిగ్రీ నాకు నిజంగా ఏమి ఇస్తుంది’అని విద్యార్థులు ప్రస్తుతం ప్రశ్నించుకుంటున్నారు. యూఏఈలో చదువుకోవడానికి పెరిగిన 55 రెట్ల ఆసక్తి మొదలు.. ట్యూషన్ ఫీజురహిత జర్మనీలో అడుగుపెట్టాలన్న కుతూహలం వరకు.. భారతీయ విద్యార్థులు తక్కువ వ్యయంతో అధిక నైపుణ్యాన్ని అందించే దేశాల కోసం ప్రపంచ పటాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు వృత్తి నిపుణులు నైపుణ్యాన్ని పెంచుకోవాలన్న డిమాండ్ కారణంగా ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్లో (ఏఐ) మాస్టర్స్ చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఏకంగా 186% పెరిగింది.తిరిగి ఏం లభిస్తుంది? చదువుకు నిధులు సమకూర్చుకోవడం నుంచి కెరీర్కు ఆర్థిక సాయం చేసుకోవడం వైపు విద్యార్థుల ఆలోచనలు మళ్లుతున్నాయి. స్పష్టమైన కెరీర్ మార్గాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగేలా ఉపాధి, దీర్ఘకాలిక నివాస స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2025–26లో ఆశావహులు విద్యను వ్యూహాత్మక పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఒక నిర్దిష్ట డిగ్రీ వారి దీర్ఘకాలిక ఆదాయ సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో లెక్కించడానికి అభ్యాసంపై రాబడిని (రిటర్న్ ఆన్ లెర్నింగ్) కొలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కాలేజీల్లో ప్రవేశాలు కేవలం డిగ్రీ గురించి కాదు.. ప్రపంచ జాబ్ మార్కెట్లో స్థానం సంపాదించడం కోసం అని స్పష్టం అవుతోంది. రూట్ మారింది.. సంప్రదాయ కేంద్రాలకు అతీతంగా విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాలు మారుతున్నాయి. సంప్రదాయ కేంద్రాలైన యూఎస్, యూకే, కెనడా, ఆ్రస్టేలియాలో అధిక ఖర్చులు, మారుతున్న వీసా నిబంధనలు విద్యార్థుల ప్రాథమ్యాలను మార్చాయి. వారసత్వ ప్రతిష్ట కంటే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికిగాను యూఏఈకి 5,400%, న్యూజిలాండ్ 2,900%, జర్మనీకి 377% దరఖాస్తులు పెరగడం ఇందుకు నిదర్శనం. కెరీర్ పురోగతికే పట్టం.. ⇒ 85% మంది అభ్యర్థులు విద్యార్హతల కంటే చదువు తర్వాత కెరీర్ పురోగతికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ⇒ 68% మంది విద్యార్థులు ‘అందుబాటులో వ్యయాలు’అత్యంత ప్రాధాన్యంగా పేర్కొంటున్నారు. ⇒ విదేశాల్లో విద్యనభ్యసించాలనుకున్న అభ్యర్థుల్లో 65.5% మంది 18–25 ఏళ్ల వయస్కులు. ⇒ 26 ఏళ్లకుపైగా ఉన్నవారి వాటా 34.5%. కెరీర్ పురోగతికై ప్రత్యేక డిగ్రీలను వృత్తి నిపుణులు కోరుకుంటున్నారు. ⇒ విద్యార్థుల్లో పురుషులు 58%, మహిళలు 42% ఉన్నారు. ⇒ అభ్యర్థుల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ 54.7%, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కోరుకునేవారు 23.7% ఉన్నారు. ⇒ దరఖాస్తుల్లో 6.3% పీహెచ్డీ కోసం అభ్యరి్థంచినవే. వీటి సంఖ్య ఏడాదిలో 60% పెరిగింది.ఏఐపై పట్టు సాధించేందుకు.. ⇒ ఏఐ కోర్సుల్లో ప్రత్యేక మాస్టర్స్ ప్రవేశాలు 2023తో పోలిస్తే 2024లో దాదాపు 3 రెట్లు పెరిగాయి. ⇒ ఈ విద్యార్థులలో 49.9% మంది పూర్తిగా రంగాలను మార్చడం కంటే మార్కెటింగ్ అనలిటిక్స్, ఫైనాన్స్ వంటి వారి ప్రస్తుత రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ⇒ ఏఐ కోర్సులు చేద్దామనుకుంటున్న ఆశావహుల్లో దాదాపు 36% మంది ఇప్పటికే వృత్తి నిపుణులు. సాంకేతిక నైపుణ్యం పెంచుకోవడం వృత్తిపరంగా అవసరమని వారు రుజువు చేస్తున్నారు. -
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?
సోషల్ మీడియా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనిలో మునిగిపోతున్నారు. పిల్లల్లో అయితే సామాజిక మాధ్యమాల ఎఫెక్ట్ మరింత అధికంగా ఉంటుంది. అయితే మద్రాస్ హైకోర్టు పిల్లల్లో సోషల్ మీడియా వాడకంపై కీలక సూచన చేసింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు వాటిని వాడకుండా నియంత్రించాలని సూచించింది. పిల్లల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మానసికంగా, శారీరకంగా ఎదగాల్సిన వయస్సులో గంటల గంటలు ఫోన్లకు అతుక్కపోయి వాటిలోనే గడపడంతో ఆందోళన, డిఫ్రెషన్, ఒత్తిడి తదితర సమస్యలు చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లకు దూరం చేద్దామని ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తెలిపింది.16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలకు అనుమతించకుండా చట్టం రూపొందించాలని కోర్టు పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఈ మధ్య ఇటువంటి చట్టం రూపొందించారని భారత్లో సైతం ఈ విషయం ఆలోచించాలని తెలిపింది. తద్వారా హానికరమైన, అసభ్యకరమైన కంటెంట్ను పిల్లలు చూడకుండా నియంత్రిచవచ్చని పేర్కొంది. అదేవిధంగా అటువంటి కఠిన చట్టాలు రూపొందించే వరకూ పిల్లలు ఇంటర్నెట్ను సురక్షితంగా వాడేలా రాష్ట్ర ప్రభుత్వం, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా ఓ కార్యాచరణ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. -
అగర్బత్తులకూ బీఐఎస్ ప్రమాణాలు!
వినియోగదారుల భద్రతను.. ఇండోర్ గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అగర్బత్తులకు బీఐఎస్ ప్రమాణాలు ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి 'ప్రహ్లాద్ జోషి' కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ''ఐఎస్ 19412:2025 – అగరుబత్తి - స్పెసిఫికేషన్''ను విడుదల చేశారు.కొత్త నిబంధనల ప్రకారం.. అగర్బత్తులలో వినియోగదారుల ఆరోగ్యం, ఇండోర్ గాలి నాణ్యతకు, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని క్రిమిసంహారక రసాయనాలు & సింథటిక్ సువాసన పదార్థాల వాడకం పూర్తిగా నిషేధం. జాబితాలో అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్ & ఫిప్రోనిల్ వంటి కొన్ని క్రిమిసంహారక రసాయనాలు.. అలాగే బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ & డైఫెనిలమైన్ వంటి సింథటిక్ సువాసన పదార్థాలు ఉన్నాయి.కొత్త ప్రమాణాలు.. అగర్బత్తులను యంత్రాలతో తయారు చేసినవి, చేతితో తయారు చేసినవి మరియు సాంప్రదాయ మసాలా వర్గాలుగా వర్గీకరిస్తుంది. అంతే కాకుండా.. ముడి పదార్థాలు, బర్నింగ్ నాణ్యత, సువాసన పనితీరు & రసాయన పారామితుల కోసం స్పెసిఫికేషన్లను నిర్దేశిస్తుంది. దీంతో అగర్బత్తులు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. ఇవి మానవ, పర్యావరణ హితంగా ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా.. మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది.అగర్బత్తుల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్..ప్రపంచంలో అగర్బత్తుల ఉత్పత్తి & ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటకలోని మైసూరు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అగరుబత్తీ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోంది. మన దేశం సుమారు 150 దేశాలకు అగర్బత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. -
పావురాలకు ఆహారం పెట్టినందుకు.. రూ.5 వేల జరిమానా
ముంబై: బహిరంగ ప్రదేశంలో పావురాలకు ఆహారం (తిండి గింజలు) చల్లిన వ్యాపారవేత్తకు ముంబై కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారని కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ముంబై నగరంలో పలు ప్రాంతాల్లో పావురాలకు గింజలు చల్లడంపై నిషేధం అమలులో ఉంది.నగరంలోని మహిమ్ ప్రాంతంలో ఈ ఏడాది ఆగస్టు 1న దాదర్ నివాసి నితిన్ సేథ్.. పావురాలకు తిండి గింజలు వేశారు. ఆయనపై కేసు నమోదైంది. పావురానికి ఆహారం ఇచ్చే విషయం కోర్టుకు చేరుకుంది. డిసెంబర్ 22వ తేదీన ఆ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వీయూ మిసాల్ ఆ వ్యాపారవేత్తను దోషిగా తేల్చారు. అయితే క్షమాపణ కోరడంతో అతనికి కోర్టు రూ.5 వేల జరిమానా విధించింది.బహిరంగంగా పావురాలకు ఫీడింగ్ చేయడం వల్ల ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 ఉల్లంఘించినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. ఆయనపై బీఎన్ఎస్లోని సెక్షన్ 271 కింద కూడా కేసు నమోదు చేశారు. -
శబరిమలకు పోటెత్తిన భక్తులు
అయ్యప్పస్వామి మండల దీక్ష పూజకు సమయం సమీపిస్తున్న వేళ శబరిమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. మణికంఠ స్వామిని ఇప్పటివరకూ దర్శించుకున్న భక్తుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అయ్యప్పస్వామి అభరణాల ఊరేగింపు "తంగాఅంకి" సందర్భంగా నేడు ( శుక్రవారం) నుంచి పలు ఆంక్షలు విధించినట్లు అధికారులు ప్రకటించారు.అయ్యప్పస్వామి మండలి పూజ డిసెంబర్ 27న జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధానానికి భక్తుల రద్దీ పెరిగింది. డిసెంబర్ 25, 2025 నాటికి స్వామివారిని 30,01,532 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే గతేడాది ఈ సంఖ్య 32,49,756 గా ఉందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొద్దిమేర తగ్గినట్లు తెలిపారు.కాగా అయ్యప్పస్వామికి అభరణాల ఊరేగింపు ఉత్సవానికి అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కుంబజా, పలమారుర్ వంచిప్పాడి, పులిముక్కు, ఇలకొల్లూర్ తదితర ప్రాంతాలలో స్వామివారి అభరణాల ఊరేగింపు సందర్భంగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా రేపు శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మండల పూజ ముగింపు కార్యక్రమం ఉంటుంది. -
పిల్ల కాల్వలతోనూ విద్యుత్తు.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన
కరెంట్..! విద్యుదయస్కాంత తరంగాలను.. అదే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తే కరెంటు ఉత్పత్తి అవుతుందని మనం చదువుకున్నాం. జలవిద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, సౌరవిద్యుత్తు గురించి మనకు తెలుసు. జల విద్యుదుత్పత్తికి నదులపై ఆనకట్టలు అవసరం. కానీ.. ఇవేమీ లేకుండానే కేరళ సర్కారు పిల్ల కాల్వలతో కూడా స్థానిక జనాభాకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లకాల్వలతో విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. చదివేయండి..కేరళ రాష్ట్రం.. భారత్లోనే సామ్యవాద భావజాలాలను మెండుగా కలిగి ఉన్న ప్రాంతం. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం..! పేదరికానికి చరమగీతం పాడి.. ఐక్య రాజ్య సమితి మన్ననలు పొందిన రాష్ట్రం..! మహిళలకు నెలసరి సెలవులు.. సమానత్వ భావజాలంతో ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రం..! సంక్షేమంలోనూ.. ముఖ్యంగా ప్రజలకు విద్య, వైద్యం అందడంలో కేరళను మించాలంటే.. ఇతర రాష్ట్రాలకు దాదాపుగా అసాధ్యమే..! అలాంటి కేరళ రాష్ట్రం విద్యుదుత్పత్తిలోనూ వినూత్నంగా ముందుకు వెళ్లింది. పిల్లకాల్వలపైనా జలవిద్యుత్తు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు కన్నిమారి వంతెన సమీపంలో ఉన్న ఓ చిన్న కాల్వపై ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఈ చిన్న ప్రాజెక్టుతో స్థానికులకు నీటిసరఫరాతో పాటు.. విద్యుత్తు అందుతోంది. పౌరులకు నీరు-వెలుగులను అందించే ఈ పైలట్ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విద్యుదుత్పత్తికి ఉవ్వెత్తున ప్రవహించే భారీ జలపాతాల మాదిరి నీరు అవసరం లేదని ఈ ప్రాజెక్టు నిరూపించింది. పాలక్కాడ్ జిల్లా సరిహద్దు గ్రామం వండితవళం సమీపంలోని పట్టంచేరి పంచాయతీ ఈ ఘనతకు కేంద్ర బిందువైంది.ఒక కాల్వ ద్వారా 100 కుటుంబాలకు విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేఎస్ఈబీ ఏడాది క్రితం ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే.. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైనా.. కేంద్రం నుంచి దీనికి పూర్తిస్థాయిలో సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. ఒకవేళ కేంద్రం పచ్చజెండా ఊపితే.. కేరళ వ్యాప్తంగా ఈ తరహా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లోనూ కరెంటు కొరత అనేది లేకుండా చేయడమే కేరళ సర్కారు ప్రధానోద్దేశం. నిజానికి కేరళలో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది. కొండప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల.. సౌరవిద్యుత్తు సాధ్యం కాదు. దీంతో.. పిల్లకాల్వల ద్వారా విద్యుదుత్పత్తి అక్కడి మారుమూల ప్రాంతాలకు ఆశాజ్యోతిగా నిలుస్తోంది.పిల్ల కాల్వలపై విద్యుదుత్పత్తి ఎలా సాధ్యమవుతుంది? పెద్దపెద్ద హైడల్ పవర్ జనరేషన్ కేంద్రాల వద్ద ఉన్నట్లుగానే.. సూక్ష్మ వ్యవస్థలను పిల్లకాల్వలపై ఏర్పాటు చేశారు. అంటే.. పెద్ద ప్రాజెక్టుల వద్ద జనరేషన్ హౌస్ ఉన్నట్లే.. ఇక్కడ 10 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న చిన్న జనరేషన్ సెటప్ను ఏర్పాటు చేశారు. దాని నుంచి నేరుగా గ్రిడ్కు అనుసంధానం చేశారు. పవర్ జనరేషన్ తర్వాత ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వంటివి సంప్రదాయ పద్ధతుల్లోనే కేఎస్ఈబీ చేపట్టింది.3.5 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహం.. అంటే.. సెకనుకు 3,500 లీటర్ల మేర నీటి ప్రవాహం ఉంటే.. రోజుకు సమీపంలోని 100 కుటుంబాలకు సరిపడా జలవిద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని కేఎస్ఈబీ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ చర్య వల్ల మారుమూల ప్రాంతాల్లో స్థిరమైన వోల్టేజీతో నాణ్యమైన విద్యుత్తును అందజేయవచ్చంటున్నారు. పిల్లకాల్వల ద్వారా ఏడాదంతా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని వివరిస్తున్నారు.పైలట్ ప్రాజెక్టుకు అయిన వ్యయం కేవలం 23 లక్షల రూపాయలేనని పేర్కొంటున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు కావడంతో.. నిత్యం ఇంజినీరింగ్ సాంకేతిక బృందం దీనిని పర్యవేక్షిస్తోందని చెబుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టుకు పర్యావరణ, సాంకేతిక అనుమతులు వస్తే.. కేరళలోని మిగతా ప్రాంతాల్లోనూ విద్యుత్తు ఉత్పత్తి వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు-మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ -
ఆపరేషన్ సిందూర్.. బాలుడి గొప్పమనసు
ఆ పిల్లాడికి నిండా పదేళ్లు కూడా లేవు. ఏది మంచో.. ఏది చెడో తెలిసే వయసూ కాదు. అయితే ఆ చిరుప్రాయంలోనే ..ఆ పిల్లాడు తన దేశభక్తిని చాటుకున్నాడు. పుట్టిన గడ్డ మీద ఉన్న ప్రేమతో తన దేశాన్ని రక్షించేవారికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు.ఎంతో ప్రమాదకర సమయంలోనూ ఎటువంటి భయం లేకుండా సైనికుల వద్దకు వెళ్లి వారి దాహర్తిని తీర్చేలా నీరు, బట్టర్ మిల్క్ అందించాడు. దీంతో అతని సేవలకు మెచ్చిన ప్రభుత్వం ఆయనను రాష్ట్రీయ బాల పురస్కారంతో సత్కరించింది.ఆపరేషన్ సిందూర్ భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మిషన్. ఇండియన్ ఎయిర్ఫోర్స్ పాకిస్థాన్లోకి చొచ్చుకెళ్లి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ప్రపంచం మెుత్తానికి భారత్ని రెచ్చగొడితే సమాధానం ఎలా వస్తుందనే విషయం అర్థమైంది. అయితే ఆపరేషన్ సమయంలో ఒక స్ఫూర్తిదాయక దేశభక్తి ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఉగ్రమూకలతో పోరాడుతూ తమ గ్రామంలోకి వచ్చిన సైనికులకు శ్రావణ్ సింగ్ అనే 10 ఏళ్ల బాలుడు సహాయం చేశారు. తమ దేశం కోసం పోరాడుతున్న జవానులకు పాలు, మజ్జిగ, నీరు, ఐస్ అందించి వారికి కొంత చేదోడుగా ఉండి బాల్యంలోనే తనకున్న అపార దేశభక్తిని చాటుకున్నాడు.దీంతో ఆ బాలుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆ పిల్లాడిని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రావణ్ సింగ్కు స్వయంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ సింగ్ మాట్లాడుతూ' ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో మాగ్రామానికి సైనికులు వచ్చారు. ఆ సమయంలో వారికి సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నా, వారికి పాలు,నీరు,మజ్జిగ,ఐస్ అందించా. ఈ అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు' అని అన్నారు.శ్రావణ్ సింగ్ చాక్ తరన్ వాలి గ్రామంలో నివాసం ఉంటారు. ఇది పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం పాకిస్థాన్తో సరిహద్దు పంచుకుంటుంది. రాష్ట్రీయ బాల పురస్కార్ను ఏటా కేంద్ర ప్రభుత్వం బహుకరిస్తుంది. ఆర్ట్ అండ్ కల్చర్, పర్యావరణం, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, తదితర అంశాలతో పాటు సామాజిక సేవ తదితర అంశాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. -
పది అంతస్తులపైనుంచి జారి కిటికీకి వేలాడి : మొత్తానికి
పది అంతస్తుల పైనుంచి కిందపడితే..వామ్మో ఎముకలు ముక్కలు ముక్కలు అవ్వాల్సిందే. అస్సలు ఆ ఊహే వెన్నులో వణుకి పుట్టిస్తుంది కదా. అసలు ఎంత ఎత్తునుంచి కిందికి చూడాలంటేనే మామూలు మనుషులకి గుండెల్లో గుబులు. అయితే అంత ఎత్తునుంచి జారిపడిన 57 వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఎలా అంటే...గుజరాత్లోని సూరత్ని జహంగీర్పురా ప్రాంతంలోని టైమ్స్ గెలాక్సీ నివాస సముదాయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. 57 ఏళ్ల నితిన్ ఆదియా ఒక ఎత్తైన భవనంలోని తన 10వ అంతస్తు అపార్ట్మెంట్ నుండి పొరపాటున జారిపడి పోయాడు. అపార్ట్మెంట్లోని కిటికీ దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా బ్యాలెన్స్ కోల్పోయి జారిపడ్డాడు. అయితే మధ్యలోనే మిరాకిల్ జరిగింది. పడిపోతున్న క్రమంలో ఎనిమిదో అంతస్తులోని కిటికీ వెలుపల అమర్చిన ఇనుప గ్రిల్కి చిక్కుకున్నాడు. ఆ మెటల్ విండో గ్రిల్కి ఒక కాలు చిక్కుకుంది. ఒకవైపు బాధ, మరోవైపు బాధతో దాదాపు గంటసేపు అలా వేలాడాడు. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది అతడిని జాగ్రత్తగా రక్షించారు. నేరుగా కిందపడకుండా ఉండటం వల్లే అతను తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు.Surat: Dramatic Rescue as 57-Year-Old Man Dangles from 8th Floor Window Grill After Fall from 10th Floor – Fire Brigade Saves Lifepic.twitter.com/s4yitzduXv— Ghar Ke Kalesh (@gharkekalesh) December 25, 2025 జహంగీర్పుర, పాలన్పూర్, అడాజన్ అనే మూడు స్టేషన్ల నుండి అగ్నిమాపక దళ బృందాలు హైడ్రాలిక్ కట్టర్లు,ప్రత్యేక పరికరాలతో మోహరించాయి. ఒక యూనిట్ భద్రతా వలయ కింద రక్షణగా ఉండగా, దిగువ ప్రాంతాన్ని ఇతర బృందాలు 10-8 అంతస్తుల నుండి భవనంలోకి ప్రవేశించి ఒకేసారి చిక్కుకున్న వ్యక్తిని మృత్యు ముఖం నుంచి కాపాడాయి. ఏదైనా అనుకోనిది జరిగితే ఎలా అనే ఆందోళనతో స్థానికులు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరి సహాయక చర్యల్లో పాల్గొనడం విశేషం. తీవ్ర ఉద్రిక్తత మధ్య సాగిన ఈ ఆపరేషన్పై ఒక అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ, ఇది కష్టంగా, చాకచక్యంగా అతణ్ని రక్షించాం అన్నారు. తొలుత బాధితుడిని 10వ అంతస్తు నుండి తాళ్లు ,సేఫ్టీ బెల్ట్తో కట్టేసాం..అతని అతని శరీర బరువుకు మద్దతు లభించింది. అలా గ్రిల్లో చిక్కుకున్న కాలుని విడిపించి , ఆదియను సురక్షితంగా కిందకు దించి చికిత్స కోసం గురుకృప ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కాలికి గాయాలు అయినప్పటికీ, పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడని వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ రెస్క్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతణ్ణి రక్షించిన అధికారులను నెటిజన్లు కొనియాడారు. పలు బృందాలు సమన్వయంతో పెద్ద ప్రమాదాన్ని నివారించారంటూ అధికారులను అభినందించారు. -
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర
కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ రాష్ట్రంలో తొలిసారిగా మేయర్ పదవికి కైవసం చేసుకుంది. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్ పదవిని దక్కించుకుని కాషాయ పార్టీ నవ శకం ఆరంభించింది. బీజేపీకి చెందిన వివి రాజేష్ మేయర్గా ఎన్నికయ్యారు. తిరువనంతపురం నగర చరిత్రలో బీజేపీ పార్టీ అభ్యర్థి మేయర్ పదవిని అధిష్టించడం ఇదే మొదటిసారి. శుక్రవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో రాజేష్కు 51 ఓట్లు వచ్చాయి. ఎల్డీఎఫ్ అభ్యర్థి ఆర్పీ శివాజీకి 29, యూడీఎఫ్కు చెందిన కేఎస్ సబరినాథన్కు 19 ఓట్లు వచ్చాయి. తిరువనంతపురం కార్పొరేషన్లో మొత్తం 101 వార్డులు ఉన్నాయి. తిరువనంతపురం నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని మేయర్ రాజేష్ అన్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని, 101 వార్డులన్నింటినీ సమానంగా చూస్తామని చెప్పారు. కాగా, శుక్రవారం ఉదయం జరిగిన మేయర్ ఎన్నికల్లో 99 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వతంత్ర కౌన్సిలర్ పి. రాధాకృష్ణన్ మద్దతు తెలపడంతో బీజేపీకి 51కి ఓట్లు వచ్చాయి. స్వతంత్ర కౌన్సిలర్ ఒకరు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.ఎవరీ రాజేష్?వృత్తిరీత్యా న్యాయవాది అయిన 50 ఏళ్ల రాజేష్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గతంలో తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో కొడుంగనూర్ వార్డు నుండి 515 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఆయన కౌన్సిలర్గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వట్టియూర్కావు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ(ఎం)కి చెందిన వికె ప్రశాంత్ చేతిలో 21,515 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రశాంత్కు 61,111 ఓట్లు, రాజేష్కు 39,596 ఓట్లు వచ్చాయి. చదవండి: మమ్మల్ని జైల్లో పెట్టండి -
H-1B ఆంక్షలు : భారీగానే ఇండియాలో అమెరికా టెక్ దిగ్గజాల ఉద్యోగాలు
భారతీయ ఐటీ నిపుణుల్లో H-1B వీసా ఆంక్షలు తీవ్ర ఆందోళన పుట్టిస్తున్నాయి. తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక విదేశాల్లో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులు గందరగోళంలో పడిపోయారు. అమెరికాలో రెండోసారిఅధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు,హెచ్1బీ వీసా ఆంక్షల వస్తున్న నేపథ్యంలో భారత ఐటీరంగానికి ఊరట నిచ్చే విషయమిది.మనీ కంట్రోల్ కథనం ప్రకారం అమెరికాకు చెందిన ప్రధాన టెక్ సంస్థలు ఫేస్బుక్ (Facebook (Meta), అమెజాన్ (Amazon) ఆపిల్ (Apple) మైక్రోసాఫ్ట్ (Microsoft), నెట్ఫ్లిక్స్ (Netflix) గూగుల్ (Alphabet) లాంటి FAAMNG సంస్థలు భారతదేశంలో సమిష్టిగా 32వేల మంది కొత్త ఉద్యోగులను నియమించు కున్నాయి. ఇది రానున్న కాలంలో కొనసాగనుంది. పెరగనుంది కూడా అని నిపుణులు అంచనావేస్తున్నారు.స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ Xpheno డేటా ప్రకారం, భారతదేశంలోని టెక్ దిగ్గజాల ఉద్యోగుల నియమాకల్లో ఇది సంవత్సరానికి 18 శాతం పెరుగుదల. అలాగే గత మూడేళ్ల కాలంలో ఇది అత్యధికం కూడా. ఫలితంగా మొత్తం భారతీయ ఐటీ ఉద్యోగుల సంఖ్య సంఖ్య 214,000కి చేరుకుంది. ఈ పెరుగుదల, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న AI ల్యాండ్స్కేప్లో ప్రత్యేక భారతీయ టెక్నాలజీ ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఏడాది మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు, దేశంలో AI మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఉద్యోగులను విస్తరించడం కోసం తమ పెట్టుబడులను రెట్టింపు చేశాయి. డిమాండ్ ఎక్కడ ఉంది?ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, అమెరికన్ టెక్ దిగ్గజాలు సాధారణ పాత్రల కంటే టార్గెటెడ్ రోల్స్లో మాత్రమే నియామకాలను కొనసాగిస్తున్నాయని TeamLease Digital CEO నీతి శర్మ అన్నారు. 2025లో, కంపెనీల్లో ఇంజనీరింగ్లో డేటా పాత్రలు, విశ్లేషణలు, క్లౌడ్ , సైబర్ సెక్యూరిటీ , గవర్నెన్స్ వంటి కొత్త డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి సారించాయి. హెడ్ కౌంట్ తగ్గినా ఈ జాబ్స్కు డిమాండ్ దాదాపు 25-30 శాతం పెరిగిందని టీమ్ లీజ్ డేటా ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుకఅయితే ఏఐ విస్తరణ ప్రభావం ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు.ఎందుకంటే ఈ కంపెనీలు AI సామర్థ్యాకు దగ్గరగా వున్న నైపుణ్యాలను చూస్తున్నాయి తప్ప, నేరుగా AI రోల్స్ వైపు కాదు. నియామాకల్లో ఏఐ ప్రభావం రాబోయే రెండుమూడేళ్లలో స్పష్టంగా కనిపించనుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు పెర్ఫ్లెక్సీటీ AI ,ఓపెన్ AI వంటి న్యూ జెన్ ఏఐ Aకంపెనీలు భారతదేశం తమ అగ్ర వినియోగదారు మార్కెట్లలో ఒకటిగా ఎదగాలని చూస్తున్నాయి, దేశంలో కార్యాలయాలు , డేటా సెంటర్లను ఏర్పాటుకు మొగ్గు చూపు తున్నాయి. అమెరికా టెక్ కంపెనీలు విదేశీ దేశాల నుండి నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను నియమించుకోవడానికి ఉపయోగించే కీలకమైన H-1B వీసా దరఖాస్తు నియమాలలో గణనీయమైన మార్పులతో భారతదేశంపై కూడా ఈ ప్రభావం కనిపించింది. ప్రతీ ఏడాది దాదాపు 70-75 శాతం భారతీయ దరఖాస్తుదారులవే.కానీ 2025లో ట్రంప్ పరిపాలన కొత్త వీసా దరఖాస్తులపై లక్ష డాలర్లు రుసుముతో వీటి సంఖ్య గణనీయంగా పడిపోయింది.కంపెనీలు- పెట్టుబడులుఅక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కృత్రిమ మేధస్సు (AI) హబ్ను ఏర్పాటు చేయడానికి Google 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ఫలితంగా రానున్న ఐదేళ్లలో లక్ష కంటే ఎక్కువ ఉద్యోగాలొస్తాయని అంచనా. మైక్రోసాఫ్ట్ కూడా 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించింది. అలాగే రానున్న ఐదేళ్లలో అమెజాన్ ఇండియాలో 35 బిలియన్లడాలర్లనుపెట్టుబడి పెడుతోంది. ఈ పెట్టుబడుల ఫలితంగా 2030 నాటికి భారతదేశంలో అదనంగా 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టెక్ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఇవి ఇప్పటివరకు భారతదేశంలో ప్రకటించిన టెక్ మేజర్ల అతిపెద్ద పెట్టుబడులు. దీనికి తోడు OpenAI ఈ ఏడాది చివరినాటికి న్యూఢిల్లీలో తన మొదటి భారతదేశ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నామని ఆగస్టులో ప్రకటించింది. అలాగే మైక్రోసాఫ్ట్ హైదరాబాదులో 2.65 లక్షల చదరపు అడుగుల ప్రధాన కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్న విషయం గమనార్హం.H-1B ఆంక్షలు -2026 నియామకాలపై ప్రభావంH-1B ఆంక్షలు 2026లో భారతదేశంలో స్థానిక నియామకాలపై వపరిశ్రమ నిపుణులు ఆశాజనకంగానే ఉన్నారు. 2026లో నియామకాలు పెరగవచ్చు. అయితే టాలెంట్ మూమెంట్, సేవల కొనుగోళ్లు, విదేశాలకు ఉద్యోగులను పంపడం లాంటి అంశాలపై స్పష్టత వవచ్చిన తరువాత గ్లోబల్ టెక్ సంస్థల నియామాకల్లో క్లారిటీ రావచ్చని అంచనా. సాంప్రదాయిక టెక్ ,ఐటీ నియామకాలు ఎక్కువగా భర్తీ పాత్రలకే ఉంటాయి మరియు తక్కువ సింగిల్ డిజిట్లలో పెరుగుతాయి, బిగ్ టెక్ నియామకాలు 2026లో దాదాపు 16-20 శాతం పెరుగుతాయని టీమ్లీజ్ శర్మ తెలిపారు. సామర్థ్యం ఆధారితంగా ఉంటాయి, AI, డేటా ప్లాట్ఫారమ్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలుm భద్రతపై దృష్టి పెడతాయని కూడా చెప్పారు. అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్, నియామకాల మందగమనం ఉన్నప్పటికీ, AI నేతృత్వంలోని ఉత్పాదకత లాభాలతో భారతదేశం పెద్ద టెక్ ఉద్యోగాల కల్పన మాత్రం కొనసాగనుంది అనేది ఐటీ గ్రాట్యుయేట్లకు ఊరటనిచ్చే అంశం. -
కదులుతున్న కారులో గ్యాంగ్రేప్: డ్యాష్ క్యామ్తో సీఈవో గుట్టు రట్టు
రాజస్థాన్లోని ఉదయపూర్లో ఉదయపూర్ సామూహిక అత్యాచార ఉదంతం కలకలం రేపింది. ఈ దురాగతానికి సంబంధించి అత్యంత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ సీఈవో పుట్టినరోజు, లేట్-నైట్ పార్టీలో మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేశారు. బాధితురాలిని ఇంట్లో దింపుతామని నమ్మించి, మార్గమధ్యలో మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. డాష్క్యామ్ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు పార్టీ తర్వాత ఇంటి దగ్గర దింపుతామని చెప్పి కంపెనీ సీఈవో మరో ఇద్దరితో కలిసి కదులుతున్న కారులో మహిళా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ కేసులో కంపెనీ సీఈవో జయేష్, మరో ఎగ్జిక్యూటివ్ గౌరవ్, అతని భార్య శిల్ప సహా ముగ్గురిని ఉదయ్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని, తరువాత స్థానిక కోర్టు రిమాండ్కు తరలించారు.పోలీసుల ప్రకారం.. సీఈవో పుట్టిన రోజు సందర్భంగా శోభాగ్పురాలోని ఒక హోటల్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో పార్టీ ప్రారంభమై దాదాపు తెల్లవారుజామున 1.30 గంటల వరకు కొనసాగింది. బాగా లేట్ అయింది కాబట్టి కారులో ఇంట్లో దింపుతామని ఆఫర్ చేశారు. దారి మధ్యలో సిగరెట్ను పోలిన మత్తు పదార్థాన్ని ఇచ్చారని బాధితురాలు ఆరోపించింది. అది తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాననీ, అనంతరం తనపై కారులోనే అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. మెలకువ వచ్చిన తరువాత చెవిపోగులు, ముఖ్యంగా లోదుస్తులు మాయం కావడం ప్రైవేట్ పార్ట్స్పై గాయాలు ఆమెలో భయాన్ని రేపాయి. దీంతో కారు డాష్క్యామ్ ఫుటేజీలో పరిశీలించాక జరిగిన దారుణమంతా రికార్డ్ అయిందని గుర్తించింది. డిసెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 21 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ యోగేష్ గోయల్ తెలిపారు. బాధితురాలు లైంగిక వేధింపులకు గురయినట్టు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించినట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును అదనపు పోలీసు సూపరింటెండెంట్ మాధురి వర్మకు అప్పగించారు. దర్యాప్తును మరింతగా కొనసాగించడానికి పోలీసులు కారులో ఏర్పాటు చేసిన డాష్క్యామ్ నుండి ఆడియో, వీడియో రికార్డింగ్లను కూడా పరిశీలిస్తున్నారు. -
ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు.. కేంద్రం స్పందన ఇదే..
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున విచారణకు విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ప్యూరిఫైయర్లపై దాఖలైన పిల్ను వ్యతిరేకించారు. దీనిపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు.ఎయిర్ ఫ్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించి.. 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. న్యాయవాది కపిల్ మదన్ దాఖలు చేసిన ఈ పిటిషనుపై కేంద్రానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వెంకటరమణ శుక్రవారం వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా.. జీఎస్టీ రేట్లను సరైన ప్రక్రియ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ మాత్రమే నిర్ణయించగలదు. అలాగే, ఈ పిటిషన్పై స్పందించడానికి రెండు రోజుల సమయం సరిపోదన్నారు.Delhi High Court heard the PIL seeking a reduction of GST on air purifiers, but did not pass any interim order. The Centre said the plea is “not a PIL” and that GST rates can only be decided by the GST Council after due process. The Court raised concerns over public health and…— ANI (@ANI) December 26, 2025ఈ విషయంపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయడానికి పది రోజుల సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. జీఎస్టీ తగ్గింపునకు ఒక ప్రక్రియ ఉందని, ఈ ప్రక్రియను అడ్డుకోలేమని కోర్టుకు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, ఇది సమాఖ్య పన్ను అని వివరించారు. ఈ ప్రక్రియలో అన్ని రాష్ట్రాలు పాలుపంచుకుంటాయని, ఏదైనా విషయంపై ఓటింగ్ జరగాలంటే అది భౌతికంగా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. పార్లమెంటరీ కమిటీ మాకు కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకుంటాము. ఇందులో రాజ్యాంగపరమైన అంశం ముడిపడి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో, తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. చనిపోతున్నా స్పందించరా?అంతకుముందు.. దేశ రాజధాని నగరం ఢిల్లీ సహా చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ గాలి శుద్ధి యంత్రాలపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ.. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీఎస్టీ కౌన్సిలు తక్షణం సమావేశమై గాలిశుద్ధి యంత్రాలపై పన్ను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ‘‘మనం రోజుకు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాం. అలాంటప్పుడు గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఓసారి లెక్కించండి’’ అని వ్యాఖ్యానించింది. పిటిషనుపై స్పందించేందుకు గడువు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారింది. వేల సంఖ్యలో ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా? ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం. అది అందించలేనప్పుడు కనీసం శుద్ధి యంత్రాలనైనా అందుబాటు ధరల్లో ఉంచాలి కదా! ఇలాంటి ఎయిర్ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద తాత్కాలిక పన్ను మినహాయింపును తక్షణం ఎందుకు ఇవ్వకూడదు?’’ అని కేంద్రంపై ప్రశ్నలు కురిపించింది. ప్రజల ప్రాణాల కంటే పన్నులే ముఖ్యమా? అంటూ ప్రశ్నించింది. -
వైభవ్ సూర్యవంశీకి అత్యున్నత పురస్కారం
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం లభించింది. పద్నాలుగేళ్లకే ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న ఈ చిచ్చరపిడుగును.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (Pradhan Mantri Rashtriya Bal Puraskar) వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు శుక్రవారం ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తొలుత దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రంజీల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడి (12)గా రికార్డు సాధించాడు.ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీఅనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫు ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేయడం ద్వారా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట బౌలింగ్ విభాగం ఉన్న జట్టుపై కేవలం 35 బంతుల్లోనే శతకం బాది.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో చిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్గా నిలిచాడు.భారత అండర్-19 జట్టు తరఫున మెరుపులుప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలోనూ యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. ఇటీవల అండర్-19 ఆసియా కప్-2025లోనూ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. తాజాగా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో బిహార్ వైస్ కెప్టెన్గా బరిలో దిగిన వైభవ్.. మరోసారి దుమ్ములేపాడు.అరుణాచల్ ప్రదేశ్తో బుధవారం మ్యాచ్లో కేవలం 36 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా 84 బంతుల్లో 190 పరుగులు సాధించాడు. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్లో అత్యంత వేగంగా 150 పరుగుల మార్కు దాటిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.అత్యున్నత పురస్కారంఇలా చిన్న వయసులోనే క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీని.. పిల్లలకు అందించే అత్యున్నత పురస్కారంతో ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న వైభవ్.. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతాడు. VIDEO | Delhi: Young cricketer Vaibhav Suryavanshi conferred with Pradhan Mantri Rashtriya Bal Puraskar.(Source: Third Party)#VaibhavSuryavanshi (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/JrKqy7ziTN— Press Trust of India (@PTI_News) December 26, 2025కాగా 5-18 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు సాహసం, సంస్కృతి, వాతావరణం, నవకల్పనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు తదితర విభాగాల్లో ప్రధాన్ మంత్రి బాల్ పురస్కార్ అందజేస్తారు.టోర్నీ నుంచి అవుట్భారత అండర్-19 జట్టు తదుపరి జింబాబ్వే పర్యటనతో బిజీ కానుంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జనవరి 15 నుంచి జింబాబ్వేతో మ్యాచ్లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మిగిలిన మ్యాచ్లకు వైభవ్ సూర్యవంశీ దూరం కానున్నాడు.చదవండి: Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే.. -
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఒక కిలో బియ్యం సేకరించి, దాన్ని భద్రపరిచి, రవాణా చేసి లబ్ధిదారుడికి చేరవేసేసరికి దాదాపు రూ.40 వరకు ఖర్చు చేస్తోంది. అంటే, మనం ‘ఉచితం’ అని పిలుచుకుంటున్న ఈ బియ్యం వెనుక సామాన్యుడు పన్ను రూపంలో చెల్లించిన భారీ మూల్యం ఉంది. దురదృష్టవశాత్తు 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే రవాణా, నిల్వ లోపాల వల్ల సుమారు 53,000 టన్నుల ఆహార ధాన్యాలు వృథా అయ్యాయి. ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు గోడౌన్లలో కుళ్లిపోతున్న ధాన్యాలు వెరసి ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పడం లేదు.ఈ భారీ నష్టాన్ని, లీకేజీలను అరికట్టడానికి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ‘నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT)’ పరిష్కారంగా తోస్తుంది. ప్రభుత్వం భరిస్తున్న ఈ రూ.40 ఖర్చును నేరుగా పేదల ఖాతాల్లో వేస్తే వారు మార్కెట్లో తమకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందనే వాదనలున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఆహార భద్రతా పథకంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై విశ్లేషణ.ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా పేరుగాంచిన భారత ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ప్రస్తుతం 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలను అందిస్తోంది. అయితే, పేదల ఆకలి తీరుస్తున్న ఈ పథకం వెనుక ప్రభుత్వం భరిస్తున్న ఆర్థిక భారం, వ్యవస్థలోని లోపాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.ఒక కిలో ధాన్యం ధర ఎంత?సాధారణ పౌరులకు రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు ఉచితంగా లభిస్తున్నప్పటికీ, ప్రభుత్వంపై పడుతున్న వ్యయం సామాన్యమైనది కాదు. ధాన్యాల సేకరణ, నిల్వ, రవాణా, వడ్డీ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే కిలో ధాన్యం రేషన్ షాపుకు చేరడానికి ప్రభుత్వానికి రూ.28 నుంచి రూ.40 వరకు ఖర్చవుతోంది.2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్సీఐ వ్యయంబియ్యం (కిలోకు): రూ.39.75గోధుమలు (కిలోకు): రూ.27.74మొత్తం ఆహార సబ్సిడీ బిల్లు: రూ.2.05 లక్షల కోట్లువ్యవస్థలోని లోపాలు.. వేల కోట్ల నష్టంప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నా ఆ ఫలాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదనే అభిప్రాయాలున్నాయి. గణాంకాల ప్రకారం, సబ్సిడీ ధాన్యాల్లో సుమారు 28 శాతం లక్షిత గృహాలకు చేరడం లేదు. అంటే దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యం పక్కదారి పడుతోంది లేదా వృథా అవుతోంది. దీనివల్ల ఏటా ప్రభుత్వానికి రూ.69,108 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రవాణా, నిల్వ సమయంలో జరుగుతున్న నష్టం కూడా ఆందోళనకరంగా ఉంది. 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే ఎఫ్సీఐ రవాణాలో 40,000 టన్నులు, నిల్వలో 13,000 టన్నుల ధాన్యాన్ని కోల్పోయింది.నగదు బదిలీ(DBT) పరిష్కారమేనా?ఈ లాజిస్టిక్స్ చైన్లోని లోపాలను సరిదిద్దడానికి నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT) ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ధాన్యం పంపిణీకి చేసే ఖర్చును నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధిత బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల..సప్లై చైన్ లీకేజీలను అరికట్టవచ్చు.లబ్ధిదారులు తమకు నచ్చిన నాణ్యమైన ఆహారాన్ని స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు.కర్ణాటకలోని ‘అన్న భాగ్య’ నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులు మెరుగైన ఆహారాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యారు.ముందున్న మార్గంపీడీఎస్ వ్యవస్థను నేరుగా నగదు బదిలీకి మార్చడం ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు. దీనికోసం ప్రభుత్వం కొన్ని వ్యూహాలను అనుసరించాలి.లబ్ధిదారులే స్వచ్ఛందంగా నగదు లేదా ధాన్యం ఎంచుకునేలా 12-18 నెలల సమయం ఇవ్వాలి.ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నగదు బదిలీ మొత్తాన్ని సవరించాలి.మౌలిక సదుపాయాలు లేని చోట్ల నగదుకు బదులు ఆహార కూపన్లను వినియోగించవచ్చు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే పెట్టి పుట్టాల్సిందే! -
ఇదెక్కడి హిపోక్రసీ?.. గాజా కోసం కన్నీళ్లా!.. మరి బంగ్లా ఘటనలపై..
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో.. బంగ్లాదేశ్ శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్ర దాస్ ఉదంతం మరవకముందే మరో హిందూ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ పరిణామాలపై సినీ ప్రముఖులు స్పందించడం మొదలుపెట్టారు.గాజాలో జరిగిన పరిణామాలను అయ్యో.. పాపం అనుకున్న భారతీయులు, పొరుగు దేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మౌనం వీడాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మూక దాడులను.. హత్యలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. దీపు దాస్ ఉదంతానని ఘోరమని.. అమానవీయమని పేర్కొంటున్నారు. హిందువులు ఇకనైనా మేల్కొనాలంటూ పిలుపు ఇస్తున్నారు.మౌనం ప్రమాదకరంయువ నటి జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలు అమానుషమైనవి.. క్రూరమైనవి. ఇలాంటి ఘటనల పునరావృతం కావడం దారుణం. దీపు చంద్ర దాస్ను ప్రజల మధ్యలోనే అమానుషంగా లించ్ చేసిన ఘటన గురించి చదవాలని, వీడియోలు చూడాలని, ఘటనపై నిలదీయాలి. మనం ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలపై కన్నీళ్లు కారుస్తూ, మన సొంత సోదరులు, సోదరీమణులు ఇక్కడే కాల్చి చంపబడుతున్నప్పుడు మౌనం వహించడం ప్రమాదకరమని అన్నారు. ఇంతటి దారుణం జరిగినప్పటికీ మనలో ఆగ్రహం రాకపోతే.. అదే ద్వంద్వ వైఖరి (hypocrisy) మనల్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు.హిందువులారా మేల్కొండి..హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొన్నీమధ్యే ఈ పరిణామాలపై ఓ పోస్ట్ చేశారు. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అంటూ పోస్టర్ సోషల్ మీడియాలో ఉంచారు. అక్కడి మత అతివాదం వల్ల హిందువులు భయాందోళనలో బతుకుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులారా ఇకనైనా మేల్కొండి.. మౌనం మిమ్మల్ని రక్షించదు అంటూ పిలుపు ఇచ్చారామె. అందుకే ప్రశ్నిస్తున్నా..సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద సైతం ఈ ఘటనలపై స్పందించారు. జరుగుతున్న పరిణామాలతో తన హృదయం ద్రవించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారామె. భావోద్వేగాల్ని నియంత్రించుకుని తాను మాట్లాడుతున్నానని.. మూకహత్యలు హిందు మతంపై జరుగుతున్న దాడేనని.. అందుకే మౌనంగా ఉండలేక ప్రశ్నిస్తున్నానని ఓ వీడియో మెసేజ్లో అన్నారామె.హెరా ఫెరీ నటుడు మనోజ్ జోషి.. గాజా, పాలస్తీనా కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చారని, అలాంటిది పక్క దేశంలో అదీ హిందువులపై దాడులు జరుగుతుంటే ఎవరూ సోసల్ మీడియాలోనైనా ముందుకు రారా? అని ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమని.. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన.సింగర్ టోనీ కక్కర్ తన కొత్త ఆల్బమ్ చార్ లోగ్(ఆ నలుగురు)లో.. దీపు దాస్ హత్యోదంతాన్ని ప్రస్తావించాడు. మనుషులు ఇకనైనా మత వివక్షను విడిచిపెట్టాలని, మానవత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చాడు.ఇటీవల మయమన్సింగ్ జిల్లాలో దీపూ చంద్ర దాస్ అనే యువకుడు మూక దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మత వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో.. కొందరు అతనిపై దాడి చేసి హత్య చేసి.. అనంతరం నగ్నంగా చెట్టకు వేలాడదీసి కాల్చేశారు. ఆపై సగం కాలిన ఆ మృతదేహాన్ని రోడ్డు మీద పడేసి పోయారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో యూనస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది మరువక ముందే..బుధవారం రాత్రి రాజ్బర్ జిల్లా పంగ్షా సర్కిల్లో మరో ఘటన చోటుచేసుకుంది. అమృత్ మొండల్ (29) అలియాస్ సామ్రాట్ అనే హిందూ యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపారు. అయితే ఇది మత కోణంలో జరిగిన దారుణం కాదని.. అతనొక గ్యాంగ్స్టర్ అని, డబ్బు వసూళ్లకు పాల్పడడంతో గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. అయితే.. దీపూ చంద్రదాస్పై దాడి తర్వాత ఓ మైనారిటీ వ్యక్తిపై మూకదాడి జరగడం ఈ ఘటనపై అనుమానాలకు తావిస్తోంది. -
సెమీ కండక్టర్ రంగంలోకి ఆలస్యంగా ప్రవేశించినా
గ్వాలియర్/రేవా: సెమీ కండక్టర్ రంగంలోకి మన దేశం కాస్త ఆలస్యంగా ప్రవేశించినా బలోపేతమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించి, ఎగుమతులను కూడా మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. గురువా రం గ్వాలియర్లో జరిగిన అభ్యుదయ మధ్యప్రదేశ్ గ్రోత్ సమిట్లో హోం మంత్రి మాట్లాడారు. కేవలం ఏడాది కాలంలోనే 4.57 లక్షల ఎంఎస్ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ)ల రిజిస్ట్రేషన్లను సాధించినందుకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. భౌగోళికంగా ఎంతో కీలకమైన, సారవంతమైన భూములున్న మధ్యప్రదేశ్లో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వారు సైతం కోట్లాది రూపాయలు సంపాదించగలరన్నారు. ఇండోర్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు అక్కడ వేర్హౌస్లు, హబ్లు ఏర్పాటు చేసుకునేలా ఆహ్వానిస్తామని చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మంత్రి అమిత్ షా రూ.2 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అటల్ జీ గొప్ప వక్త, సున్నిత భావాలున్న కవి, ప్రజాసంక్షేమానికే జీవితం అంకితం చేసిన నేత, రాజకీయాల్లో అజాతశత్రువు’అంటూ కొనియాడారు. సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా, స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆదాయంమనకు వచ్చే ఎన్నో వ్యాధులకు రసాయన ఎరువులే మూల కారణమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అందుకే ప్రకృతి వ్యవసాయమే మేలన్నారు. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతులకు ఆదాయం కనీసం ఒకటిన్నర రెట్లు అధిక ఆదాయం వస్తుందని, నీరు ఆదా అవడంతోపాటు పరిశుద్ధమైన ఉత్పత్తులతో ప్రజారోగ్యానికి దోహదపడుతుందన్నారు. ఒకే ఒక్క దేశ వాళీ ఆవు మూత్రం, పేడను వినియోగించుకుంటూ 21 ఎకరాల్లో వ్యవసాయ చేయవచ్చన్నారు. రేవాలో జరిగిన రైతుల సదస్సులో మంత్రి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి ఉన్న అపారమైన మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని రైతుల వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి మరింత మెరుగ్గా చేరుకునేలా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని షా చెప్పారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని, ఇవి రైతులకు అవసరమైన భూసార, విత్తన పరీక్షలను చేస్తాయన్నారు. -
మోదీ మాటలకు చేతలకు పొంతనేలేదు
న్యూఢిల్లీ: పర్యావరణ సంబంధ అంశాల్లో మోదీ ప్రభుత్వం చెప్పేదానికి, చేసేదానికి పొంతనే లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆరావళి శ్రేణికి సంబంధించి పర్వ తాలపై కేంద్రం తాజాగా తీసుకువచ్చిన నిబంధనలతో 90% పర్వత ప్రాంతాలకు ఎటువంటి రక్షణ ఉండదని, మైనింగ్, రియల్ ఎస్టేట్ తదితర కార్యకలాపాలతో వాటి మనుగడే ప్రమాదంలో పడుతుంద ని తెలిపింది. ఆరావళికి సంబంధించి మో దీ ప్రభుత్వం ఇచ్చిన తాజా నిర్వచనం నిపుణుల సూచనలకు విరుద్ధం, ప్రమాద కరమని పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గురువారం ఎక్స్లో ఈ మేరకు పలు వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ రక్షణ చట్టాలను బలహీనం చేయడం, కాలుష్య నిబంధనలను సడలించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంతో ప్రయత్నిస్తోందని ఆరో పించారు. మరోవైపు, తప్పుడు సమా చారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందంటూ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. -
బహుళ అంతస్తుల భవనంలో మంటలు
ముంబై: ముంబై మహానగరం అంధేరి వెస్ట్లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వీర దేశాయ్ రోడ్డులో ఉన్న 23 అంతస్తుల సొర్రెంటో టవర్లో ఉదయం 10 గంటల సమయంలో మంటలు మొదల య్యాయి. దీంతో, 16వ అంతస్తులో చిక్కు కున్న 30 నుంచి 40 మందిని మెట్ల మార్గం ద్వారా రక్షించినట్లు ఓ అధికారి చెప్పారు. ఒక మహిళ సహా ముగ్గురిని 15వ ఫ్లోర్లోని ఓ ఫ్లాట్ నుంచి సురక్షితంగా కిందికి దించామని చెప్పారు. మంటల కారణంగా 10, 21వ అంతస్తుల మధ్యలోని విద్యుత్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. 12, 13, 14వ అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. 14వ అంతస్తులో ఉంటున్న ప్రముఖ సినీ నిర్మాత సందీప్ సింగ్ నివాసం కూడా దెబ్బతింది. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన ఆయన ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆయన్ను రక్షించారు. అనంతరం సందీప్ సింగ్ను నటి అంకిత లొఖాండే, ఆమె భర్త వికీ జైన్ తమ ఇంటికి తీసుకెళ్లారు. -
అధికారుల ఫ్యూజులు ఎగిరిపోయాయ్!
ప్రజల కష్టాలు అధికారులకు తెలియాలంటే, వాళ్లు కూడా అదే కష్టాన్ని అనుభవించాలి.. ఇదే సూత్రాన్ని నమ్మారు ఉత్తరాఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర జతి. తన నియోజకవర్గంలో గంటల తరబడి విధిస్తున్న విద్యుత్ కోతలపై ఆయన విసిగిపోయారు. దీంతో ఆయన, ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కి అధికారుల ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగించి సంచలనం సృష్టించారు. నిచ్చెన, కటింగ్ ప్లేయర్లతో బయల్దేరి.. మంగళవారం హరిద్వార్ జిల్లా రూరీ్కలో ఈ హైడ్రామా చోటుచేసుకుంది. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి నిచ్చెన, కటింగ్ ప్లేయర్లు పట్టుకుని నేరుగా విద్యుత్ శాఖ అధికారుల నివాసాలకు చేరుకున్నారు. మొదట సూపరింటెండింగ్ ఇంజనీర్ వివేక్ రాజ్పుత్ ఇంటి బయట ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి కనెక్షన్ను తొలగించారు. ఆ తర్వాత ఏకంగా చీఫ్ ఇంజనీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినోద్ పాండేల ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మీకు గంట.. మాకు 8 గంటలా? ‘మా ప్రాంతంలో రోజుకు ఐదు నుండి ఎనిమిది గంటల పాటు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు, వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. పది రోజులుగా మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కేవలం గంటసేపు విద్యుత్ లేకపోతేనే అధికారులకు చెమటలు పడుతున్నాయి.. మరి గంటల తరబడి విద్యుత్ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి?’.. అని వీరేంద్ర జతి ఘాటుగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై విద్యుత్ శాఖ ఫిర్యాదు ఎమ్మెల్యే చర్యపై విద్యుత్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు ’షట్డౌన్’ తీసుకోకుండా విద్యుత్ తీగలు కట్ చేయ డం వల్ల పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇది ప్రభుత్వ పనిలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపిస్తూ రూర్కీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రతినిధి స్వయంగా విద్యుత్ స్తంభమెక్కి నిరసన తెలపడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారులు ఏసీ గదుల నుంచి బయటికొచ్చి ప్రజల కష్టాలను చూడాలని నెటిజన్లు ఎమ్మెల్యే చర్యను సమర్థిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విదేశాలకు మన ‘మేధ’.. వేల కోట్ల సంపద ఆవిరి
న్యూఢిల్లీ: మన దేశ యువత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పోటెత్తుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. 2012లో విదేశాలకు వెళ్లిన వారు కొద్ది మందే ఉండగా.. 2024 నాటికి ఈ సంఖ్య ఏకంగా 13.3 లక్షలకు చేరింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు సరిహద్దులు దాటుతుండడంతో.. మన ’మేధ’తో పాటు వేల కోట్ల రూపాయల సంపద కూడా విదేశాల పాలవుతోంది. ఈ ఆందోళనకర పరిస్థితులకు చెక్ పెట్టి, భారత్ను ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం ‘ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ పేరుతో నీతి ఆయోగ్ ఓ సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు, కీలక విషయాలు ఉన్నాయి. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా, విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నివేదిక సూచించింది. 2025 నాటికి భారతీయ విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే ఖర్చు దాదాపు 70 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6 లక్షల కోట్లు) దాటుతుందని అంచనా. ఇది మన దేశ విద్యాబడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.విదేశీ విద్యలో ఏపీదే అగ్రస్థానందశాబ్దాలుగా విదేశీ విద్యకు చిరునామాగా ఉన్న పంజాబ్, ఆర్థికంగా బలీయమైన మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి, విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సాధారణంగా కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్లడంలో పంజాబ్ విద్యార్థులు ముందుంటారని ప్రచారం ఉంది. కానీ నీతి ఆయోగ్ లెక్కలు ఆ అపోహను తొలగించాయి. 2018 గణాంకాల ప్రకారం.. ఏపీ (62,771) మొదటి స్థానంలో ఉండగా, పంజాబ్ (60,331), మహారాష్ట్ర (58,850) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2016లో దేశవ్యాప్తంగా విదేశాలకు వెళ్లిన వారిలో ఏపీ నుంచి 46,818 మంది విద్యార్థులు ఉండగా.. అప్పటికే ఏపీ అగ్రస్థానంలో ఉంది. 2018లో ఈ సంఖ్య ఏకంగా 62,771కి చేరింది. ఇది దేశంలోనే ఆల్ టైమ్ రికార్డ్. 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా, ఆ ఏడాది కూడా 35,614 మంది విద్యార్థులతో ఏపీ తన హవా కొనసాగించింది. కేవలం ఉత్తరాది రా>ష్ట్రాలే కాకుండా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ కంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముందంజలో ఉంది. 2016లో ఏపీ నుంచి 46,818 మంది వెళ్లగా.. తమిళనాడు (27,518), కేరళ (18,428), కర్ణాటక (17,719) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.మన చదువులకు విదేశీయులు ‘అంతంతే’మనం లక్షల మందిని విదేశీ విద్య కోసం పంపిస్తుంటే.. మన దేశానికి చదువుకోవడానికి వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో కేవలం 46,878 మంది విదేశీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. చైనా, అమెరికా వంటి దేశాలతో పోలి స్తే ఇది చాలా తక్కువ. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ‘ఇంటర్నేషనలైజేషన్ ఎట్ హోమ్’ అనే వ్యూ హాన్ని నీతి ఆయోగ్ తెరపైకి తెచ్చింది. 2047 నాటికి భారతీయ విద్యాసంస్థల్లో 5 లక్షల మంది విదేశీ విద్యార్థులను చేర్చుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. మరోవైపు 2012–13లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 679 మంది విదేశీ విద్యార్థులు ఉండగా 2021–22 నాటికి ఆ సంఖ్య 3,106కు పెరిగింది. దీంతో విదేశీ విద్యా ర్థులను ఆకర్షించే టాప్ – 10 రాష్ట్రాల జాబితాలో ఏపీ 7వ స్థానానికి ఎగబాకింది. 2012–13లో విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో తెలంగాణ (2,700 మందితో 4వ స్థానం) ఏపీ కంటే చాలా ముందు ఉండేది. కానీ 2021–22 నాటికి టాప్– 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ స్థానం కోల్పో గా, ఆంధ్రప్రదేశ్ మాత్రం 3,106 మంది విద్యా ర్థులతో 7వ స్థానానికి ఎగబాకడం గమనార్హం. -
క్రీస్తు బోధనలతో సమాజంలో సామరస్య స్ఫూర్తి
న్యూఢిల్లీ: క్రీస్తు బోధనలతో సమాజంలో సామరస్య స్ఫూర్తి నెలకొంటోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఉదయాన్నే ‘మార్నింగ్మాస్’లో భాగంగా ఢిల్లీలోని ప్రముఖ ‘క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్’కు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఢిల్లీలోని ప్రఖ్యాత క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడమ్షన్కు ఉదయాన్నే వెళ్లా. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నా. అక్కడి సేవా తత్పరత కాలాతీత ప్రేమ, శాంతి, దయాగుణాలకు ప్రతిబింబంగా నిలిచింది. క్రిస్మస్ పండుగస్ఫూర్తి సమాజంలో శాంతి, సామరస్యాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ నా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. శాంతి, నమ్మకం, జాలితో నిండిన సంతోషదాయక క్రిస్మస్ను అందరూ జరుపుకోవాలి. ఏసు క్రీస్తు అద్భుత బోధనలు సమాజంలో సామరస్యాన్ని మరింత పటిష్టవంతం చేయాలని మనసారా ప్రారి్థస్తున్నా’’అని మోదీ అన్నారు. ఉదయం చర్చికి విచ్చేసిన సందర్భంగా ముందు వరస సీట్లో కూర్చుని క్రైస్తవులతో పాటు ప్రత్యేక గీతాలను మోదీ ఆలపించారు. చర్చిలో ఢిల్లీ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ చేసిన బోధనలను మోదీ ఆసక్తిగా విన్నారు. -
భారత్లో రష్యా వైన్ను ఎగబడి తాగుతున్నారు!
ఢిల్లీ: ఇండియన్ మార్కెట్లో రష్యన్ వైన్కి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యూరోపియన్ దేశాల వైన్ను సేవించే భారతీయులు ఇప్పుడు రష్యా వైన్ కోసం క్యూకడుతున్నట్లు పలు గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విడుదలైన ఈ ఏడాది పది నెలల్లో వచ్చిన గణాంకాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. వైన్ దిగుమతులలో రష్యా వాటా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో, హై-ఎండ్ రెస్టారెంట్లు, లగ్జరీ హోటళ్లలో రష్యన్ వైన్ వినియోగం పెరుగుతోంది. భారత యువతలో వైన్ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త రకాల రష్యన్ బ్రాండ్లు మార్కెట్లోకి ప్రవేశించడం ఈ వృద్ధికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు వచ్చిన డేటా ప్రకారం, రష్యన్ వైన్ దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల వైన్లతో పోటీ పడుతూ, రష్యన్ వైన్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. భారత మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్లో రష్యన్ వైన్కి మంచి డిమాండ్ ఉంది. ధరలు తక్కువగా ఉండటం, కొత్త రుచులు అందించడం,మార్కెటింగ్తో పాటు ఇతర కారణాల వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు.రష్యన్ వైన్కి భారత మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ వాణిజ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా–భారత్ మధ్య ఇప్పటికే ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో ఉన్న సహకారం ఇప్పుడు ఫుడ్ అండ్ బేవరేజీస్ రంగంలో కూడా విస్తరిస్తోంది. ఈ వృద్ధి కేవలం వాణిజ్య పరిమితి కాకుండా, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను కూడా బలపరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి భారతీయుని బలి
వాంకోవర్: ప్రశాంత్ శ్రీకుమార్ అనే 44 ఏళ్ల భారత సంతతి వ్యక్తి కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి బలైపోయాడు. ఛాతీలో భరించలేనంత నొప్పి అని మొత్తుకుంటున్నా అతనికి వైద్యమే అందించలేదు. ఈసీజీలో అంతా నార్మల్ గానే వచ్చిందని చెప్పి ఎమర్జెన్సీ గదిలో ఏకంగా 8 గంటల పాటు వేచిఉండేలా చేశారు. ఎట్టకేలకు చికిత్స కోసం తీసుకెళ్తుండగానే అతను తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. కూర్చున్న కుర్చీలోనే ఛాతీ పట్టుకుంటూ ఎగిరెగిరి పడి చివరికి నిస్సహాయంగా మరణించాడు. ‘‘నాన్నా!. ఈ నొప్పి భరించలేకపోతున్నా’ అంటూ చివరి క్షణాల్లో తన కొడుకు అల్లాడిపోయాడని తండ్రి కుమార్ రోదిస్తూ చెప్పారు. అవే తన చివరి మాటలు అయ్యాయంటూ కన్నీరు మున్నీరయ్యారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కెనడాలోని ఎడ్మాంటన్లో ఉండే ప్రశాంత్ తన ఆఫీసులో పని చేస్తున్న సమయంలోనే విపరీతమైన ఛాతీ నొప్పితో అలసిపోయాడు. దాంతో సహోద్యోగి ఒకరు అతడిని వెంటనే గ్రే నన్స్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చాలాసేపు వెయిటింగ్ రూమ్లో కూచోబెట్టాక ఈసీజీ చేశారు. అందులో అంతా నార్మల్గానే ఉందంటూ నొప్పికి ‘టైలీనల్’ అనే మందు ఇచ్చి సరిపెట్టారు. అంతలో ఆస్పత్రికి చేరిన నాన్నతో నొప్పి భరించరానిదిగా ఉందంటూ ప్రశాంత్ వాపోయాడు. ‘తన రక్తపోటు(బీపీ) క్షణక్షణానికి పెరుగుతూనే పోయింది. కానీ ఎంత చెప్పినా నర్సులు పట్టించుకోలేదు’’ అని తండ్రి ఆక్షేపించారు. ‘‘ఎట్టకేలకు తనను చికిత్సకు తీసుకెళ్లేందుకు వచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రశాంత్ నావైపు చూస్తూనే కూర్చున్న కుర్చీలో కుప్పకూలాడు’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఘటన పట్ల ఆస్పత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చింది. దీనిపై సమీక్ష జరుపుతున్నట్టు తెలిపింది. ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రశాంత్కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
పడిపోయినా ప్రాణాలు ‘పది’లం!
బుధవారం ఉదయం.. సూరత్లోని జహంగీర్పురా ‘టైమ్స్ గెలాక్సీ’ అపార్ట్మెంట్ వాసులకు ఒళ్లు జలదరించే దృశ్యంతో ఆరోజు తెల్లారింది. నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. అందరూ తలెత్తి ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. అక్కడ.. ఎనిమిదో అంతస్తు కిటికీ గ్రిల్కు ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు.అసలేం జరిగింది? సూరత్: 57 ఏళ్ల నితిన్ భాయ్ అడియా తన పదో అంతస్తు ఫ్లాట్లో కిటికీ పక్కనే గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో అటు ఇటు దొర్లుతూ, ప్రమాదవశాత్తు కిటికీలోంచి ఒక్కసారిగా బయటకు జారిపోయారు. పదో అంతస్తు అంటే దాదాపు వంద అడుగుల పైచిలుకు ఎత్తు. అక్కడి నుంచి పడితే ప్రాణాలు దక్కడం అసాధ్యం. కానీ, ఆయన అదృష్టం బావుంది. కిందకు పడిపోతున్న వేగంలో, సరిగ్గా ఎనిమిదో అంతస్తు కిటికీకి ఉన్న గ్రిల్ బాక్స్లో ఆయన కాలు బలంగా ఇరుక్కుపోయింది.తలకిందులుగా గంటపాటు.. శరీరం మొత్తం గాలిలో.. ఒకే ఒక్క కాలు ఆ ఇనుప ఊచల మధ్య ఇరుక్కుపోయింది. తలకిందులుగా వేలాడుతూ, కాలి నొప్పిని భరిస్తూ ఆయన దాదాపు గంట కాలం మృత్యువుతో ఆయన పోరాడారు. ఏ క్షణమైనా పట్టు తప్పితే ప్రాణాలు గాల్లో కలిసిపోయే స్థితి. ఆ దృశ్యాన్ని చూస్తున్న చుట్టుపక్కల వారి గుండెలు ఆగిపోయినంత పనయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే జహంగీర్పురా, పాలన్పూర్, అడాజన్ ఫైర్ స్టేషన్ల నుంచి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కింద జనం రక్షణ వలలు పట్టుకోగా, అగి్నమాపక సిబ్బంది పదో అంతస్తు నుంచి తాళ్లు, సేఫ్టీ బెల్టులతో కిందకు దిగారు. గాలిలో వేలాడుతున్న నితిన్ భాయ్ను చాకచక్యంగా పట్టుకుని, ఆయన కాలిని గ్రిల్ నుంచి తప్పించారు. సురక్షితంగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా అతన్ని లోపలికి లాగారు. వెనుదిరిగిన మృత్యువు నితిన్ భాయ్ సురక్షితంగా లోపలికి వెళ్లగానే అపార్ట్మెంట్ నివాసితులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. ప్రాణాలతో బయటపడటం ఒక ఎత్తైతే, ఆ గంట సేపు ఆయన చూపిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తుంది.. కానీ అదృష్టం కలిసొస్తే మృత్యువు కూడా వెనుదిరుగుతుందని ఈ ఘటన నిరూపించింది. -
ఇండియన్ రైల్వే.. టికెట్ ఛార్జీలు పెరిగాయ్.. ఎంతంటే?
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు గమనిక. నేటి నుంచి పెరిగిన కొత్త ట్రైన్ టికెట్ ధరలు అమల్లోకి వచ్చాయి. రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా.. సాధారణ తరగతి ప్రయాణికులకు 215 కి.మీ. దూరం వరకు ఎలాంటి పెంపు ఉండదు. అయితే 216 కి.మీ (కిలోమీటర్) దూరం దాటిన తర్వాత ప్రతి కిలోమీటర్కు ఒక పైసా అదనంగా వసూలు చేస్తోంది. రైల్వే అధికారులు మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లు, అన్ని ఏసీ తరగతులలో ప్రతి కిలోమీటర్కు రెండు పైసలు పెంపు అమలు చేశారు. ఈ పెంపుతో ఈ ఏడాదిలో రెండో సారి ట్రైన్ టికెట్ ధరలను పెంచినట్లైంది. తొలిసారి ఈ ఏడాది జులైలో రైల్వే టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. సవరించిన ధరల ప్రకారం, సబర్బన్ సేవలు, సీజన్ టికెట్లకు ఎలాంటి మార్పులు లేవు. సాధారణ నాన్-ఏసీ (నాన్-సబర్బన్) సేవల్లో రెండో తరగతి, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్లలో ధరలు దశలవారీగా పెంచింది. సెకండ్ క్లాస్ సాధారణ టికెట్లలో 215 కి.మీ. వరకు ఎలాంటి పెంపు లేదు. 216 కి.మీ. నుండి 750 కి.మీ. వరకు ప్రయాణానికి రూ.5 పెంపు ఉంటుంది. 751–1250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.10, 1251–1750 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.15, 1751–2250 కి.మీ. మధ్య ప్రయాణానికి రూ.20 పెంపు అమలు చేసింది. స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ సాధారణ టికెట్లలో ప్రతి కి.మీ.కు 1 పైసా చెల్లించాల్సి ఉంది. ఇది నాన్-సబర్బన్ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ, ఏసీ తరగతులన్నింటిలో ప్రతి కి.మీ.కు 2 పైసా పెంపు ఉంది. ఉదాహరణకు, 500 కి.మీ. ప్రయాణం చేసే ప్రయాణికుడు నాన్-ఏసీ మెయిల్/ఎక్స్ప్రెస్ కోచ్లో సుమారు రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రాజధాని, శతాబ్దీ, దురంతో, వందే భారత్, హంసఫర్, అమృత భారత్, మహామనా, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, జన శతాబ్దీ, యువ ఎక్స్ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ వంటి ప్రధాన రైళ్లలో కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ఏసీ ఎంఈఎంయూ/డీఈఎంయూ సేవలు మాత్రం మినహాయింపు పొందాయి. సవరించిన ధరలు డిసెంబర్ 26, 2025 నుండి బుక్ చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు బుక్ చేసిన టికెట్లకు అదనపు ఛార్జీలు ఉండవు -
తెలంగాణలో తగ్గిన విదేశీ విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకప్పుడు విదేశీ విద్యార్థులతో కళకళలాడిన తెలంగాణలోని యూనివర్సిటీలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో అత్యధిక విదేశీ విద్యార్థులను ఆకర్షించే టాప్–10 రాష్ట్రాల జాబితా నుంచి తెలంగాణ కనుమరుగైంది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నీతి ఆయోగ్’తన తాజా నివేదికలో కుండబద్దలు కొట్టింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా రిపోర్ట్’(2025) ప్రకారం..2012–13 విద్యా సంవత్సరంలో తెలంగాణలో 2,700 మంది విదేశీ విద్యార్థులు ఉండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య దారుణంగా 1,286కు చేరుకుంది. పదేళ్లలో విదేశీ విద్యార్థుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది.తెలంగాణ వెనకడుగు.. ఓవైపు తెలంగాణలో విదేశీ విద్యార్థుల సంఖ్య పాతాళానికి పడిపోతుంటే, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ విషయంలో దూసుకుపోతోంది. 2012–13లో కేవలం 679 మంది విదేశీ విద్యార్థులు మాత్రమే ఉన్న ఏపీలో, 2021–22 నాటికి ఆ సంఖ్య ఏకంగా 3,106కు చేరింది. తద్వారా ఏపీ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు 4వ స్థానంలో వెలుగొందిన తెలంగాణ ఇప్పుడు కనీసం టాప్–10లో కూడా చోటు దక్కించుకోలేక చతికిలపడింది.పశ్చిమ బెంగాల్తో పాటే..దశాబ్ద కాలంలో (2012–2022) అంతర్జాతీయ విద్యార్థుల ఎన్రోల్మెంట్లో టాప్–10 రాష్ట్రాల నుంచి వైదొలిగిన రెండే రెండు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తెలంగాణ కావడం గమనార్హం. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ సామర్థ్యాన్ని పెంచుకుని విదేశీ విద్యార్థులకు గమ్యస్థానాలుగా మారుతుంటే, తెలంగాణ మాత్రం ఉన్న గుర్తింపును కోల్పోయింది. -
మెదడు ఆరోగ్యంలోనూ తేడాలు
మహిళల కంటే వేగంగా పురుషుల మెదళ్లు కుంచించుకుపోతున్నాయి...వయసు పెరిగే కొద్దీ ఈ మార్పు బయటపడుతోంది...ఇది మెదడు ఆరోగ్యంలో తేడాలు, చిత్త వైకల్యం ప్రమాదం గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది...పురుషుల మెదళ్లు వయసు పెరిగే కొద్దీ మహిళల కంటే వేగంగా కుంచించుకుపోతున్నాయని తాజాగా ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురించిన ఈ పరిశోధనలో భాగంగా... పురుషులు– మహిళల మెదడు వయస్సు ఎలా భిన్నంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి వేలాది ఎమ్మారై స్కాన్లను విశ్లేషించారు. కాలక్రమేణా మెదడు నిర్మాణంలో మార్పులను ట్రాక్ చేయడానికి పరిశోధకులు 17 నుంచి 95 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పెద్దల నుంచి 12,000 కంటే ఎక్కువ ఎమ్మారై స్కాన్లను పరిశీలించారు. ముఖ్యాంశాలు... ⇒ పురుషులలో కార్టెక్స్ (మెదడు పైభాగాన పొరగా కప్పబడిన పదార్థం), సబ్కార్టెక్స్ ప్రాంతాలతో సహా అనేక మెదడు ప్రాంతాలలో నిర్మాణాత్మక క్షీణత ఎక్కువగా ఉంది.⇒ మహిళలలో మొత్తం సంకోచం తక్కువగా కనిపించింది. అయినా వృద్ధాప్యంలో ద్రవంతో నిండిన జఠరికల విస్తరణ పెరుగుదల ఉంది.⇒ లింగాల మధ్య మెదడు పరిమాణంలో తేడాలను సర్దుబాటు చేసిన తర్వాత ఈ మార్పులు గమనించారు. ⇒ పురుషుల మెదళ్లు మహిళల కంటే నిర్మాణ స్థాయిలో త్వరగా వృద్ధాప్యం చెందుతాయని నిర్ధారించారు.⇒ ఆయురార్థంలో తేడాలను పరిగణించిన తర్వాత, పురుషులు, స్త్రీల మధ్య అనేక మెదడు–వృద్ధాప్య అసమానతలు తగ్గాయి.⇒ ఇది వృద్ధాప్య స్త్రీ మెదడుపై మరింత సూక్ష్మ పరిశోధన అవసరాన్ని సూచిస్తుంది.ఇది ఎందుకు కీలకం ? మెదడు సంకోచం తరచుగా క్షీణత అని పిలుస్తారు, ఇది వృద్ధాప్యంలో సహజమైన ప్రక్రియే అయినా ఈ సంకోచం యొక్క వేగం, నమూనా విస్తృతంగా మారొచ్చు. ఈ ప్రక్రియలో లింగ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం వల్ల, చిత్తవైకల్యం అల్జీమర్స్ వ్యాధి వంటి కొన్ని వయస్సు సంబంధిత పరిస్థితులు పురుషులు–మహిళలను భిన్నంగా ఎందుకు ప్రభావితం చేస్తాయో శాస్త్రవేత్తలు గుర్తించడంలో ఈ అధ్యయనం సహాయపడుతుంది. ఆసక్తికరంగా, పురుషుల మెదళ్లు వేగంగా కుంచించుకుపోతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మహిళల్లోనే అధికంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ కేసులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మహిళలే.పురుషుల మెదడుల్లో నిర్మాణాత్మక వృద్ధాప్యం వేగంగా ఉన్నప్పటికీ, ఈ తేడాలు మహిళలకు అల్జీమర్స్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువగా ఉందనే దానికి కారణాలు కనుక్కోలేకపోయారు. హార్మోన్లు, జన్యుశాస్త్రం, జీవనశైలి లేదా జీవరసాయన మార్పులు వంటి ఇతర అంశాలు మహిళల చిత్తవైకల్య ప్రమాదంలో పెద్ద పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన సూచిస్తోంది. ‘మహిళల మెదళ్లు మరింత క్షీణించి ఉంటే, అది వారి అధిక అల్జీమర్స్ ప్రాబల్యాన్ని వివరించడానికి సహాయపడి ఉండేది’అని నార్వే ఓస్లో విశ్వవిద్యాలయంలో న్యూరో సైంటిస్ట్, సహ పరిశోధకురాలు అన్నే రావ్డాల్ పేర్కొన్నారు. అయితే మెదడులో వచ్చే మార్పులు, జ్ఞానం, ఆరోగ్యానికి అర్థం ఏమిటో పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు గుర్తించారు.అధ్యయన పరిమితులు...⇒ ఎమ్మారై– ఆధారిత విశ్లేషణ మెదడు వృద్ధాప్య నమూనాలను చూపుతుంది కానీ అంతర్లీన జీవసంబంధమైన కారణాలను వివరించలేదు.⇒ ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై దృష్టి సారించారు. పాల్గొనేవారికి నాడీ సంబంధిత వ్యాధి నిర్ధారణ కాలేదు.⇒ ఈ మార్పులు అల్జీమర్స్ పురోగతికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయనే దానిపై అంతర్దృషు్టలను పరిమితం చేస్తాయి.⇒ఈ అధ్యయనం అభిజ్ఞా పనితీరు లేదా జ్ఞాపకశక్తి ఫలితాలను కాకుండా మెదడు వాల్యూమ్ మార్పులను అంచనా వేసింది.⇒ ముఖ్యమైన ప్రమాద కారకాలు కొలవలేదు.. హార్మోన్ల స్థితి, జన్యుపరమైన ప్రమాదం, జీవనశైలి ప్రభావాలను నేరుగా విశ్లేషించలేదు. -
‘370’ గోడను బద్దలుకొట్టే భాగ్యం మాకే దక్కింది
లక్నో/న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి సందర్భంగా ఆయన భారీ కాంస్య విగ్రహంతో కూడిన జాతీయ స్మారకం ‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్’ను లక్నోలో ఆవిష్కరించిన సందర్భంగా విపక్ష కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శల జడివాన కురిపించారు. దశాబ్దాలుగా అభివృద్ధికి అవరోధంగా తయారైన ‘ఆర్టీకల్ 370’గోడను బద్ధలు కొట్టే అదృష్టం తమ ప్రభుత్వానికి దక్కడంపై బీజేపీ ఎంతో గర్విస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం లక్నోలో 65 అడుగుల ఎత్తయిన శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయీల కాంస్య విగ్రహాలను, 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తామర పుష్పాకృతిలో నిర్మించిన అత్యాధునిక మ్యూజియంను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. విపక్ష కాంగ్రెస్పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘‘బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇప్పుడా సుపరిపాలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమున్నత శిఖరాలకు చేరింది. అయితే స్వాతంత్య్రం తర్వాత దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా, మంచి పనులు పూర్తియినా కేవలం ఒకే ఒక్క కుటుంబం(గాం«దీల) కారణంగా అవన్నీ జరిగాయనే భ్రమలు కల్పించారు. పాఠ్యపుస్తకాలు కావొచ్చు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వరంగ సంస్థలు, వీధులు, రోడ్డు, కూడళ్లు.. అన్నింటికీ ఆ ఒకే ఒక్క కుటుంబం పేర్లు పెట్టేశారు. వాళ్ల విగ్రహాలే నెలకొల్పారు. ఇదే ఆనాటి నుంచి అలాగే కొనసాగింది. ఈ కుటుంబ బంధనాల నుంచి భారత్ను బీజేపీ విముక్తం చేసింది. దేశం కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడిన ప్రతి ఒక్క భరతమాత బిడ్డను బీజేపీ నేడు సమున్నత స్థాయిలో గౌరవిస్తోంది. వీటికి కొన్ని ఉదాహరణలూ చెప్తా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఢిల్లీలో కీలక కర్తవ్యపథంలో ప్రతిష్టించాం. నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన అండమాన్ నికోబార్ దీవుల్లోని ఒక దీవికి నేడు ఆయన పేరును పెట్టాం’’అని మోదీ అన్నారు. ‘‘బాబా సాహెబ్ అంబేడ్కర్ ఘనతను మరుగునపరిచే కుతంత్రాలను మీరంతా చూశారు. కాంగ్రెస్ రాజకుటుంబం ఢిల్లీలో ఎన్నో దారుణాలకు ఒడిగట్టింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అదే పనిచేసింది. అంబేడ్కర్ గొప్పతనాన్ని తగ్గించే కుట్రలను ఇప్పుడు బీజేపీ అడ్డుకుంటోంది. ఢిల్లీ నుంచి లండన్ దాకా అంబేడ్కర్కు సంబంధించిన ఐదు పుణ్యక్షేత్రాలను మేం అద్భుతంగా అభివృద్ధిచేశాం’’అని మోదీ గుర్తుచేశారు. ‘‘బీజేపీని కాంగ్రెస్ ఎప్పుడూ అంటరాని పార్టీగా తప్పుడు ప్రచారంచేశాయి. కానీ బీజేపీ ఎల్లప్పుడూ అన్ని పార్టీలు, నేతలను గౌరవించింది. పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీలకు మేమే భారతరత్న ఇచ్చాం. ములాయం సింగ్ యాదవ్, తరుణ్ గొగోయ్ ఇలా ఎందర్నో గౌరవించాం. ఇలాంటి మర్యాదలను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల నుంచి ఎన్నడూ ఆశించలేం. వాళ్ల హయాంలో బీజేపీ దారుణ అవమానాలను ఎదుర్కొంది’’అని మోదీ అన్నారు.ఈ స్మారకం దేశ ఆత్మగౌరవానికి తార్కాణం ‘‘రాష్ట్రీయ ప్రేరణ స్థల్ జాతీయ స్మారకం.. దేశం చూపిన ఆత్మగౌరవ, సమగ్రత, సేవా మార్గానికి నిదర్శనం. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్దయాళ్, వాజ్పేయీల నిలువెత్తు విగ్రహాలు మనకు సమున్నత స్ఫూర్తినిస్తున్నాయి. మనసావాచా ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని, ఆ ప్రయత్నంలో వందల సార్లయినా త్యాగాగ్నిలో కాలిపోయినా ఫర్వాలేదని గతంలో వాజ్పేయీ అన్నారు. ఇప్పుడీ ప్రేరణ స్థల్ సైతం అదే సందేశం ఇస్తోంది. మన ప్రతి అడుగు దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అభివృద్ధి చెందిన భారత్గా దేశం మారాలంటే ప్రతి ఒక్కరూ ఆ దిశగా సంకల్పించాలి. నూతన జాతీయస్మారకం ద్వారా ఆధునిక స్ఫూర్తిస్థల్కు చిరునామాగా నిలిచిన యూపీకి శుభాకాంక్షలు. ఇప్పుడీ ప్రేరణ స్థల్ నిర్మించిన 30 ఎకరాల ప్రాంతంలో గతంలో దశాబ్దాలపాటు భారీ చెత్తకుప్పలుండేవి. వాటిని పూర్తిగా తొలగించి అధునాతన నేషనల్ మెమోరియల్ కాంప్లెక్స్ను సాకారంచేసిన కారి్మకులు, కళాకారులు, ప్రణాళిక కర్తలు, సీఎం యోగిజీకి నా మనస్ఫూర్తిగా అభినందనలు’’అని మోదీ అన్నారు. -
పొగమంచు దెబ్బ.. 60కి పైగా ఇండిగో విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కమ్ముకున్న దట్టమైన పొగమంచు, తక్కువ దృశ్యమానత కారణంగా దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు భారీ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. గురువారం ఒక్కరోజే వివిధ విమానాశ్రయాల నుండి ఏకంగా 67 విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు, వారణాసి, అగర్తల, చండీగఢ్ తదితర నగరాల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. డిసెంబర్ 10 నుండి పొగమంచు కారణంగా ఇండిగో తరచూ అంతరాయాలను ఎదుర్కొంటోంది.పొగమంచు పరిస్థితుల్లో విమానాల ల్యాండింగ్ కోసం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దీని ప్రకారం 50 మీటర్ల కంటే తక్కువ దృశ్యమానత ఉన్నప్పుడు కూడా ల్యాండ్ చేయగల అధునాతన విమానాలను, ప్రత్యేక శిక్షణ పొందిన పైలట్లను మాత్రమే విమానయాన సంస్థలు ఉపయోగించాలి. అయితే ఈ నిబంధనలను పాటించడంలో, వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో ఏర్పడిన వైఫల్యాలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇండిగో కేవలం వాతావరణం వల్లే కాకుండా, అంతర్గత కార్యాచరణ లోపాలతోనూ సతమతమవుతోంది.ఇటీవల పైలట్ల విశ్రాంతి నిబంధనలు, సిబ్బంది కొరత కారణంగా తలెత్తిన గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపధ్యంలో సంస్థ శీతాకాలపు షెడ్యూల్ను 10 శాతం మేరకు కోత విధించి, రోజువారీ విమానాల సంఖ్యను 1,930కి పరిమితం చేసింది. డిసెంబర్ ఆరంభంలో ఒకే రోజు 1,600 విమానాలు రద్దు అయిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వరుస వైఫల్యాల వెనుక ఉన్న మూల కారణాలను అన్వేషించేందుకు డీజీసీఏ ఇప్పటికే నలుగురు సభ్యుల ఉన్నత స్థాయి ప్యానెల్ను ఏర్పాటు చేసింది, ఈ కమిటీ ఈ వారంలో తన నివేదికను సమర్పించనుంది.మరోవైపు, గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి చూస్తున్న ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఐదు గంటలకు పైగా ఆలస్యమవుతున్న విమానాలు, సరైన సమాచారం లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో ప్రయాణించే వారు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వాతావరణం అనే సాకు చెప్పకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణికులు తమ విమాన రాకపోకల స్థితిని తనిఖీ చేసుకుని బయలుదేరాలని ఇండిగో సూచించింది. ఇది కూడా చదవండి: విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ -
అబ్బాయిలంటే ఇష్టంలేదు, ఇద్దరు యువతుల పెళ్లి
పెళ్లి అంటే పందిళ్లు, సందళ్లు తప్పెట్లు.. తాళాలు... తలంబ్రాలు ఉండాలి. అంతేనా కట్నాలు, కానుకలు, ప్రీవెడ్డింగ్ షూట్లు ఘనంగా జరగాలి. కానీ ఒక జంట మాత్రం అక్షరాలా గ్యాస్ స్టవ్ సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.పెళ్లిసందడి, హంగూ ఆర్బాటం, మూడు ముళ్లు లాంటి హడావిడి లేకుండానే బిహార్లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న ఘటన నెట్టింట సందడిగా మారింది. అబ్బాయిలంటే ఇష్టంలేకనే తాము ఈ పెళ్లి చేసుకున్నామని ఆ యువతులు ప్రకటించారు. బిహార్లోని సుపాల్లో, ఇద్దరు యువతులు ప్రత్యేకంగా వివాహ వేడుకను నిర్వహించారు. మగాళ్లపై ఆసక్తిలేకనే ఇద్దరూ ఒకరికొకరు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. గ్యాస్ స్టవ్ను సాక్షిగా ఏడడుగులు వేయడం విశేషం.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక In Supaul, two young women held a unique marriage ceremony. Both revealed that they have no interest in boys, so they decided to hold hands and live together. They took seven rounds considering the gas stove as witness.pic.twitter.com/rwVaMFjxrJ— Ghar Ke Kalesh (@gharkekalesh) December 24, 2025 -
నేనెవరో నీకింకా తెలీదు.. ఇప్పుడు తెలుస్తుంది
అలీఘడ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్లో బుధవారం రాత్రి దారుణం జరిగింది. యూనివర్సిటీ పరిధిలోని పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో రాష్ట్ర శాంతిభద్రతల గురించి ప్రశంసలు కురిపించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. సహచరులతో కలిసి వెళ్తుండగా.. క్యాంపస్లోని ఏబీకే హైసూ్కల్లో 11 ఏళ్లుగా డానిష్ రావు కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి 8.50 గంటల సమయంలో ఆయన తన ఇద్దరు సహచరులతో కలిసి వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో స్కూటర్పై వచి్చన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. కాల్పులు జరపడానికి ముందు ఒక నిందితుడు డానిష్ తో ‘నేనెవరో నీకింకా తెలియదు.. ఇప్పుడు తెలుస్తుంది’.. అంటూ హెచ్చరించి, పిస్టల్తో కాల్పులు జరిపాడు. ‘లైబ్రరీ సమీపంలో కాల్పులు జరిగినట్లు మాకు రాత్రి 9 గంటలకు సమాచారం అందింది. ఏబీకే స్కూల్ ఉపాధ్యాయుడు డానిష్ రావు తలపై కాల్పులు జరగడం వల్ల ఆయన మరణించారు’.. అని వర్సిటీ ప్రోక్టర్ మొహమ్మద్ వసీం అలీ వెల్లడించారు. ఆసుపత్రికి చేరేలోపే.. దుండగులు డానిష్ పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో రెండు బుల్లెట్లు ఆయన తలలోకి దూసుకుపోయాయి. రక్తపు మడుగులో పడిపోయిన డానిష్ ను వెంటనే జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుల కోసం ఆరు బృందాలు ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ జాదన్ స్పందిస్తూ.. ‘నిందితులు ఇద్దరూ డానిష్ ను లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిపారు. నిందితులను పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. క్యాంపస్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం’.. అని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడానికి కారణం ఇక్కడి భద్రతేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రసంగించిన రోజే, ఒక విద్యాలయంలో ఉపాధ్యాయుడిని కాల్చి చంపడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అలీఘడ్ వర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది కూడా చదవండి: మహనీయుల భారీ స్మృతి చిహ్నం.. ప్రారంభించిన ప్రధాని మోదీ -
మహనీయుల భారీ స్మృతి చిహ్నం.. ప్రారంభించిన ప్రధాని మోదీ
లక్నో: భారత రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా నేడు (గురువారం) దేశానికి ఒక అద్భుతమైన కానుక లభించింది. యూపీలోని లక్నో నగరంలో సుమారు 65 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, రూ. 230 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రాష్ట్రీయ ప్రేరణా స్థల్’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.ఈ స్మారక చిహ్నంలో ప్రధాన ఆకర్షణ.. ఆకాశాన్ని తాకేలా నిలుచున్న మూడు భారీ కాంస్య విగ్రహాలు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయిల 65 అడుగుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. ఈ విగ్రహాలు భారతదేశ రాజకీయ విలువలకు, నిస్వార్థ ప్రజా సేవకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ, సందర్శకులలో దేశభక్తిని పెంపొందిస్తున్నాయి. #WATCH | Lucknow, Uttar Pradesh: Prime Minister Narendra Modi inaugurates Rashtra Prerna Sthal The complex features 65-feet-high bronze statues of Dr. Syama Prasad Mookerjee, Pandit Deendayal Upadhyaya, and Former Prime Minister Atal Bihari Vajpayee, symbolising their seminal… pic.twitter.com/FqZvxkeFT7— ANI (@ANI) December 25, 2025సుమారు 98 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యంత కళాత్మకంగా కమలం ఆకారంలో ఈ మ్యూజియాన్ని రూపొందించారు. ఇందులో అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించారు. తద్వారా ఈ నాయకుల జీవిత ప్రయాణాన్ని, వారు దేశం కోసం చేసిన పోరాటాలను సందర్శకులు కళ్లకు కట్టినట్లు చూడవచ్చు. ఇది కేవలం స్మారక చిహ్నంగానే కాకుండా ఒక గొప్ప విద్యా కేంద్రంగా కూడా రూపొందింది. ఇది కూడా చదవండి: చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం -
రూ. 5 లకే కమ్మటి భోజనం : అటల్ క్యాంటీన్స్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించు కుని, ఢిల్లీ ప్రభుత్వం 'అటల్ క్యాంటీన్' పథకాన్ని ప్రారంభించింది. పేదలు, కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల ఆహారం అందించే లక్ష్యంతో 100 అటల్ క్యాంటీన్లను ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రారంభించారు. ఈ క్యాంటిన్లలో కేవలం రూ. 5కే పోషకమైన భోజనం అందిస్తారు.అటల్ క్యాంటీన్లుఢిల్లీలో ఆర్కె పురం, జంగ్పురా, షాలిమార్ బాగ్, గ్రేటర్ కైలాష్, రాజౌరి గార్డెన్, నరేలా, బవానా, ఇతర ప్రదేశాలలో విస్తరించి ఉన్న 45 అటల్ క్యాంటీన్లు అందుబాటులో వచ్చాయి. మిగిలిన 55 క్యాంటీన్లను రాబోయే రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లు రోజుకు రెండు పూటలా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య భోజనం మరియు సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 గంటల మధ్య రాత్రి భోజనం దాదాపు 500 మందికి అందిస్తాయి. ఈ థాలి (ప్లేట్)లో పప్పు (చిక్కుళ్ళు), బియ్యం, చపాతీ, సీజనల్ కూరగాయలు , ఒక చట్నీ ఉంటాయి.VIDEO | Delhi: On the birth anniversary of former Prime Minister and Bharat Ratna Atal Bihari Vajpayee, Atal Canteens were inaugurated across several parts of the capital, including Nehru Nagar, in the presence of Union Minister Manohar Lal Khattar. In the first phase, 45 Atal… pic.twitter.com/DKJs72OygB— Press Trust of India (@PTI_News) December 25, 2025భోజన పంపిణీ కోసం డిజిటల్ టోకెన్ వ్యవస్థఢిల్లీ ప్రభుత్వం భోజనం పంపిణీ చేయడానికి మాన్యువల్ కూపన్ల స్థానంలో డిజిటల్ టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. సీసీటీవీ కెమెరాలు ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు (DUSIB) డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని కేంద్రాలను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తాయి. పప్పు (చిక్కుళ్ళు), బియ్యం, చపాతీ, కర్రీ, చట్నీతో కూడిన రుచికరమైన భోజనం రెస్టారెంట్ రకం, ప్రాంతాన్ని బట్టి ఢిల్లీలో ఒక్కోథాలీ ధర రూ. 500 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది. దీని ప్రకారం ఒక్క పూటైనా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లలేని పేదలకు కేవలం పదో వంతు ధరకే సంతృప్తికరమైన భోజనం లభించనుంది. -
చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ ఉయికే (69) సహా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం కంధమాల్-గంజాం జిల్లా సరిహద్దులోని దట్టమైన రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్)లతో కూడిన ఉమ్మడి భద్రతా దళంతో జరిగిన ఎన్కౌంటర్గణేష్ ఉయికేతో పాటు ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందించారు. గణేష్ ఉయికే మృతిని ధృవీకరించిరిన అమిత్షా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తాం అంటూ హోం మంత్రి ట్వీట్ చేశారు. ‘‘నక్సల్ రహిత భారత్ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి"గా హోంమంత్రి అభివర్ణించారు. అటు ఇది మన దళాలకు చారిత్రాత్మక విజయం. రూ. 1.1 కోట్ల రివార్డు ఉన్న నాయకుడి నిర్మూలనతో ఈ ప్రాంతంలోని మావోయిస్టుల నడ్డి విరిచినట్టేనని ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ ఆపరేషన్ భారత ప్రభుత్వాన్ని మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశాన్ని చేయాలనే తన లక్ష్యానికి దగ్గరి చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో జనరల్ సెక్రటరీ బసవరాజ్,నవంబర్లో కమాండర్ హిడ్మాలను మట్టు బెట్టడంతో కేంద్ర కమిటీ కుప్పకూలింది. అటు అగ్ర మావోయిస్టు నాయకులతోపాటు లొంగిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది.జిరామ్ ఘాటి మాస్టర్ మైండ్ 2013లో ఛత్తీస్గఢ్లో జరిగిన జిరామ్ ఘాటి మారణకాండ వెనుక గణేష్ ఉయికే ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరణించారు. అంతేకాదు అనేక హై ప్రొఫైల్ మావోయిస్టు దాడులలో ఆయనదే కీలక పాత్రం నమ్ముతారు. గతమూడేళ్లుగా గణేష్ ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, గెరిల్లా కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, మావోయిస్టు నెట్వర్క్లను బలోపేతం చేస్తున్నాడు. -
తగ్గిన ఎయిర్ పొల్యూషన్: ఆ వాహనాలపై నిషేధం ఎత్తివేత!
ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైన నేపథ్యంలో.. బీఎస్4 వాహనాలను నగరంలో ప్రవేశించకుండా నిషేధించారు. అయితే ఇప్పుడు ఆ ఆంక్షలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గాలి నాణ్యత మెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.డిసెంబర్ 13న, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 స్థాయిని దాటిన తర్వాత.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ IV అమలులోకి వచ్చింది. ఈ సమయంలోనే రాజధానిలో కొన్ని నిర్దిష్ట వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఇప్పుడు గాని నాణ్యత మెరుగుపడటంతో.. ఈ నిషేధం తొలగించారు.బీఎస్ 6 వాహనాలు మాత్రమే నగరంలోకి ప్రవేశించాలనే నియమం అమలు చేసిన సమయంలో.. సుమారు 1.2 మిలియన్ వాహనాలను నిషేధించారు. అయితే ఇప్పుడు ఆంక్షలు నిషేధించబడినప్పటికీ.. ఢిల్లీలో రిజిస్టర్ చేసుకున్న BS4 వాహనాన్ని కలిగి ఉంటే, మీ PUC చెల్లుబాటు అయితే, GRAP స్టేజ్ IV సమయంలో.. ఢిల్లీ NCRలో ఉపయోగించవచ్చు. ఢిల్లీలో రిజిస్టర్ కానీ బీఎస్3, బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదు. నియమాలను అతిక్రమించిన వాహనదారులు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక
సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు క్రిస్మస్ కానుక అందించింది. ఫ్రెషర్లకు ఎంట్రీ-లెవల్ జీతాలను పెంచింది, స్పెషల్ టెక్నాలజీ రోల్స్కు ఏడాది రూ. 21 లక్షల దాకా పరిహార ప్యాకేజీలను అందిస్తోంది. AI-ఫస్ట్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి,డిజిటల్గా స్థానిక ప్రతిభను ఆకర్షించేందుకు సంస్తలో నియామకాలను పెంచుతుంది.ఇది ఇండియాలో మిగిలిన ఐటీ కంపెనీలతో పోలిస్తే ఇదే అత్యధిక ఎంట్రీ-లెవల్ వేతనంగా నిలిచింది.ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు ఆఫర్ ఎంత? మనీకంట్రోల్ అందించిన సమచారం ప్రకారం ఇన్ఫోసిస్ 2025 ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేక టెక్నాలజీ ఉద్యోగాల ఎంపికకోసం ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్ను ప్రారంభించనుంది. దీని వార్షిక పరిహారం రూ. 7 లక్షల నుండి రూ. 21 లక్షల వరకు ఉంటుంది.ఈ ఆఫర్లో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (L1 నుండి L3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ) ఉన్నాయి .అ లాగే కంప్యూటర్ సైన్స్, ఐటీ,ఈఈఈ, ఈసీఈలాంటి ఎంపిక చేసిన సర్క్యూట్ బ్రాంచ్ల నుండి BE, BTech, ME, MTech, MCA ,ఇంటిగ్రేటెడ్ MSc గ్రాడ్యుయేట్లకు అవకాశం ఉంది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L3 (ట్రైనీ): రూ. 21 వార్షిక ప్యాకేజీని (ఎల్పీఏ) స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2 (ట్రైనీ): రూ. 16 LPA, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1 (ట్రైనీ): రూ. 11 LPA, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ): రూ. 7 ఎల్పీఏ అందిస్తుంది.AI-ఫస్ట్ విధానంలో భాగంగా క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో సంవత్సరానికి రూ. 21 లక్షల వరకు ప్యాకేజీలతో ఉద్యోగులను ఎంపిక చేస్తామని ఇన్ఫోసిస్ గ్రూప్ CHRO షాజీ మాథ్యూ తెలిపారు.భారతదేశంలోని అగ్ర ఐటీ సంస్థలలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎంట్రీ-లెవల్ జీతాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉంది.అయితే, ప్రత్యేక నైపుణ్యాలతో వచ్చే గ్రాడ్యుయేట్ల విషయంలో ఈ ట్రెండ్ మారుతోందంటున్నారు నిపుణులు. -
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
భువనేశ్వర్: మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో తెలుగు మావోయిస్టు కమాండర్, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్చార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా, గణేష్పై రూ.25 లక్షల రివార్డు కూడా ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్చార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా, గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని పుల్లెమ్ల గ్రామం. గణేష్పై రూ.25 లక్షల రివార్డు ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం గణేష్పై ఈ రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా గణేశ్ అలియాస్ హనుమంతు ఎన్కౌంటర్ను స్పెషల్ ఆపరేషన్స్ ఏడీజీపీ సందీప్ పాండా ధృవీకరించారు. కంధమల్ - గంజాం పరిధి రాంభా అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ లు, ఒక 303 రైఫిల్లను స్వాధీనం చేసుకున్నారు. 2 సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ టీంలతో కలిసి ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ 20 పోలీసు బృందాల జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. గతంలో ఛత్తీస్ ఘడ్ లో హన్మంతు పనిచేశారు. 3 ఏళ్ల క్రితం కేరళ, తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో దళాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా గణేష్ కదలికలను భద్రతా బలగాలు తెలుసుకున్నాయి. ఎస్ఓజీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. -
పండగ సీజన్లో గిగ్ వర్కర్ల షాక్ : 7 రోజుల జాతీయ సమ్మె
సాక్షి,ముంబై: జీతం, భద్రతా ప్రమాణాలు, సామాజిక భద్రత డిమాండ్లతో గిగ్ వర్కర్లు జాతీయ సమ్మెకు పిలుపునిచ్చారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రధాన ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలోని డెలివరీ పార్టనర్స్ డిసెంబర్ 25 నుంచి 31వ తేదీవరకు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారు. పని పరిస్థితులు, సామాజిక భద్రత పరిస్తితులు మరింత దిగజారుతున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా "10 నిమిషాల డెలివరీ" లాంటి వాటిని ఉపసంహరించుకోవాలనేది ముఖ్యమైన డిమాండ్.తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, కర్ణాటక యాప్ ఆధారిత వర్కర్స్ యూనియన్తో సహా , ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. మెట్రో, టైర్-2 నగరాల్లో డెలివరీ భాగస్వాములు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. భారతదేశం అంతటా డెలివరీ కార్మికులు అఖిల భారత సమ్మెను ప్రకటించినందున, క్రిస్మస్ రోజు (డిసెంబర్ 25),నూతన సంవత్సర వేడుకల (డిసెంబర్ 31) నాడు ఆన్లైన్ ఫుడ్, కిరాణా, ఇ-కామర్స్ డెలివరీలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.కంపెనీలు కార్మికులకు న్యాయమైన వేతనాలు, భద్రత, గౌరవం, సామాజిక భద్రతను కల్పించడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఎక్కువ పని గంటలు, హై-రిస్క్ డెలివరీలు ముఖ్యంగా గరిష్ట డిమాండ్ సమయాల్లో, ప్రాథమిక కార్మిక రక్షణ వ్యవస్థ లేవని కార్మికులు ఆరోపిస్తున్నారు. పది నిమిషాల్లో డెలివరీ సర్వీసుతో కార్మికుల్లో ఒత్తిడి తీవ్రమవుతోందంటున్నారు. అంతేకాదు ఇది తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తుందని కార్మికులు చెబుతున్నారు. ఇతర డిమాండ్లలోయు పారదర్శకమైన ఆర్డర్కు చెల్లింపు, మెరుగైన ప్రోత్సాహక నిర్మాణాలు, తప్పనిసరి విశ్రాంతి విరామాలు, సహేతుకమైన పని గంటలు లాంటివి ఉన్నాయి. అదనపు డిమాండ్లలో మెరుగైన భద్రతా చర్యలు, బలమైన సాంకేతిక ,యాప్ మద్దతు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద కవరేజ్, పెన్షన్ ప్రయోజనాలు ,కార్యాలయంలో గౌరవప్రదమైన చికిత్స ఉన్నాయి. యూనియన్లలో చేరినందుకు లేదా పని సంబంధిత సమస్యలపై స్వరం పెంచినందుకు కొంతమందిని బ్లాక్మెయిల్, లేదా వేధిస్తున్నారని కూడా కార్మికులు ఆరోపించారు.అలాగే డెలివరీ ఐడిలను ఏకపక్షంగా బ్లాక్ చేయడం, అక్రమంగా విధించిన జరిమానాలను నిలిపివేయాలని కూడా కార్మికులు డిమాండ్ చేశారు. సరైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు లేకపోవడం, రూటింగ్ మరియు చెల్లింపులను ప్రభావితం చేసే యాప్ లోపాలు మరియు అల్గారిథమ్ ఆధారిత వివక్ష కారణంగా అస్థిరమైన పని కేటాయింపుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, ఆయా ప్లాట్ఫామ్ కంపెనీలను నియంత్రించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, గిగ్ కార్మికులకు సామాజిక భద్రతా చట్రాలను అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. -
ఆయన నమస్కార్తో ఎవరికీ నోట మాట రాలేదు!
భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు అటల్ బిహారీ వాజ్పేయి. రాజనీతిజ్ఞుడిగా, రాజకీయాల్లో అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న ఆయన.. సాహితి లోకానికి కవిగా, ఆరేళ్లపాటు ప్రధానిగా, బీజేపీకి ముఖ్యనేతగా సేవలందించారు. అయితే చివరిసారిగా ఆయన పబ్లిక్కు కనిపించింది ఎప్పుడో, అదీ ఏ సందర్భంలోనో తెలుసా?..గెలుపు-ఓటమి ఈ రెండింటినీ నవ్వుతూ స్వీకరించే నైజం వాజ్పేయిది. 2004లో దారుణ ఓటమి తర్వాత కూడా.. ఎలా ఓడిపోయారు? అంటే.. ‘ఓడిపోయాం.. అంతే’ అంటూ చిరునవ్వు విసిరారు ఆయన. అందుకే అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. అయితే ఆయన పాలనను, ఆదర్శాలను పొగిడేటోళ్లే తప్పించి.. వాటిని ఆచరించే నేతలు ఈరోజుల్లో లేరనే అంటారు రాజకీయ విశ్లేషకులు.2004 ఓటమి తర్వాత వాజ్పేయి.. పార్లమెంటరీ పార్టీ చైర్మన్గా, బీజేపీ కీలక సమావేశాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే 2005 డిసెంబర్లో పుట్టినరోజు దగ్గరపడుతుండగా.. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి, అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద షాక్ ఇచ్చారు ఆయన. ఇక ఎన్నికల బరిలోకి దిగనప్పటికీ.. పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తానని పార్టీ సారధ్య బాధత్యల నుంచి తప్పుకున్నాడాయన. ఆపై అనారోగ్యంతో ఆయన వీల్చైర్కే పరిమితం అయ్యారు.ఫిబ్రవరి 11, 2007.. పంజాబ్లో జరిగిన ఓ బహిరంగ సమావేశం. బీజేపీ టికెట్తో అమృత్సర్ నుంచి లోక్ సభ స్థాన ఉప ఎన్నిక కోసం నవజోత్ సింగ్ సిద్దూ పోటీకి దిగాడు. ఆ ప్రచార సభకు ప్రధాన ఆకర్షణ ఎవరో కాదు.. మాజీ ప్రధాని వాజ్పేయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఓ బహిరంగ సభకు వస్తుండడంతో వేలమంది ఆ సభకు హాజరయ్యారు. టెంట్ల కింద జనం కిక్కిరిసి పోవడంతో.. బయట ఉండేందుకు వీలుగా సుమారు 10 వేల మందికి గొడుగుల్ని అందజేసింది బీజేపీ కమిటీ. కుర్చీలోనే కవితతో మొదలుపెట్టిన ఆయన ఉపన్యాసాన్ని .. ఎలాంటి కోలాహలం లేకుండా ఆసక్తిగా తిలకించారు ఆ జనం. ఆ రాజకీయ ఉద్దండుడి చివరి సభ అదేనని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.చలించిన పోయిన మీడియా ప్రతినిధులుఎంతటి విపత్కర పరిస్థితినైనా జర్నలిజం క్యాష్ చేసుకుంటుందనే ఒక అపవాదు ఉంది. అందుకు తగట్లు కొందరు జర్నలిస్టులు ప్రవర్తించడమే అందుకు కారణం. సాధారణంగా.. నేతలను ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం.. ఇరకాటంలో పడేయడం జాతీయ మీడియా చానెల్స్ జర్నలిస్టులకు వెన్నతో పెట్టిన విద్యం. కానీ, వాజ్పేయి విషయంలో మాత్రం వాళ్లు అలా చేయలేకపోయారు.2007, డిసెంబర్ 25న పుట్టినరోజు సందర్భంగా కొందరు జర్నలిస్టులు వాజ్పేయిను కలవాలనుకున్నారు. ‘2009లో మరోసారి రాజకీయ పోరాటానికి ఆయన సిద్ధమేనా? ప్రచారంలో అయినా పాల్గొంటారా? లేదంటే ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటారా? అద్వానీకి పగ్గాలు అప్పజెప్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఉద్దేశంతో ఓ జర్నలిస్ట్ బృందం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారు.వాళ్ల అజెండాపై స్పష్టత లేని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ దగ్గరుండి 10 మంది జర్నలిస్టులను విజయ్ మీనన్ మార్గ్లో ఉన్న వాజ్పేయి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ కొద్దినిమిషాల మీటింగ్ అరేంజ్ చేయించాడు హుస్సేన్. లోపలికి వెళ్లిన జర్నలిస్టులు.. వాజ్పేయి చూడగానే ఆశ్చర్యపోయారు.ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వాజ్పేయి.. కుర్చీలో కూర్చుకుని పాలిపోయిన ముఖంతో కదల్లేని స్థితిలో కనిపించేసరికి షాక్ తిన్నారంతా. చుట్టూ చేరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా ‘నమస్కార్’ అనే మాట మాత్రమే వచ్చింది ఆయన నోటి నుంచి. అంతే.. వాజ్పేయి పరిస్థితి అర్థం చేసుకుని అంతా బయటకు వచ్చేశారు.ఇంటికెళ్లి మరీ..2009లో ఛాతీ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్లో చేరిన వాజ్పేయి..కాస్త కొలుకున్నాక ఇంటికే పరిమితం అయ్యారు. అనారోగ్యంతో 2009 ఎన్నికల క్యాంపెయిన్కు హాజరు కాలేదు. కానీ, ఆయన పేరు మీద లేఖలు మాత్రం విడుదల చేసింది బీజేపీ. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడంతో.. కీలక నేతలే అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా ఆయన్ని ఇంటికి వెళ్లి ప్రైవేట్గా కలుస్తూ వచ్చారు.వాజ్పేయికి కేంద్రం 2015లో భారతరత్న ప్రకటించింది. మార్చిన ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్పేయి ఇంటికి వెళ్లి మరీ భారత రత్న అందుకున్నారు. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్లోనే అందుకోవాలి. కానీ, వాజ్పేయి ఆరోగ్య దృష్ట్యా, ప్రైవసీని కాపాడాలన్న ఉద్దేశంతో.. స్వయంగా రాష్ట్రపతే వెళ్లి అందించారు. చివరి రోజుల్లో.. ఆ రాజకీయ ఉద్దండుడు మతిమరుపు, కిడ్నీ సమస్యలు.. డయాబెటిస్, కదల్లేని స్థితిలో కనిపించిన ఫొటోలు చాలామందిని కదిలించివేశాయి. అందుకే.. 2018 ఆగస్టు 16వ తేదీన మరణించేంతవరకు ఆయన్ని మీడియా కంటపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు.ఇవాళ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి -
క్రిస్మస్ కాంతులు.. భిన్నస్వరాలు!
ప్రేమ, శాంతి, దయ అనే సార్వత్రిక విలువలు ప్రతిబింబించేది క్రిస్మస్ పండుగ. అందుకే ప్రపంచవ్యాప్తంగా.. అన్నిమతాల వాళ్లు ఈ పండుగను గౌరవిస్తారు. భారత్లోనూ క్రిస్మస్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలు.. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక క్రిస్మస్ ట్రీలు, బహుమతులు, కేక్ల హడావిడి.. చాలా ఇళ్లలో కనిపిస్తోంది. అదే సమయంలో.. కొన్నిచోట్ల అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఒకవైపు శాంటాక్లాజ్ వేషధారణలో క్రైస్తవులు ర్యాలీగా వెళ్తున్నారు. అదే సమయంలో.. వాళ్లకు అనుకోని దృశ్యం తారసపడింది. కేరళ సంప్రదాయ వాయిద్యం చండా వాయిస్తూ ఆ ఎదురు రోడ్డులో మరో ఊరేగింపు వచ్చింది. పైగా శాంటాక్లాజ్ టోపీలతో చండా బృందం సంప్రదాయ పంచెకట్టులో కనిపించింది. అది చూసి అవతలివాళ్లలో కొందరు నిర్ఘాంతపోగా.. మరికొందరు మాత్రం ఆ వైబ్కు ఊగిపోతూ కనిపించారు. May Christmas bring renewed hope, warmth and a shared commitment to kindness.Here are highlights from the Christmas morning service at The Cathedral Church of the Redemption. pic.twitter.com/BzvKYQ8N0H— Narendra Modi (@narendramodi) December 25, 2025During a Christmas procession, Chande Vadya used by players wearing traditional Panche & Shallya!Looks like converts won’t stop until they convert Jesus to Hinduism😭😭😭 pic.twitter.com/5KD2dZ0UBQ— Sree Harsha (@AapathBandhava) December 24, 2025మరో ఘటనలో.. అస్సాం పినాగావ్ నల్బరి ఏరియాలో హిందూ సంఘాల ఓ క్రిస్టియన్ స్కూల్లోకి చొరబడి.. అక్కడి క్రిస్మస్ వేడుకల సామాగ్రిని తగలబెట్టారు. ఆ సమయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు జై శ్రీరామ్.. జై హిందూ రాష్ట్ర నినాదాలు చేశారు. On Christmas Eve, Vishva Hindu Parishad and Bajrang Dal goons entered St. Mary’s School in Panigaon, Nalbari, chanting slogans like “Jai Shri Ram” and “Jai Hindu Rashtra.” They destroyed and set fire to all Christmas decorations prepared at the school. pic.twitter.com/LQHV7FWUvz— Mohammed Zubair (@zoo_bear) December 24, 2025This is why @RahulGandhi said to BJP You can never rule TamilNadu 🔥 pic.twitter.com/WXyqyzjrCy— BAKWAS FELLOW (@bakwasfellow) December 24, 2025స్వామి వివేకానంద బాటలోనే.. బేలూరు రామకృష్ణ మఠం నిర్వహకులు పయనిస్తున్నారు. ప్రతీ ఏడులాగే.. ఈసారి క్రిస్మస్కు జీషూ పూజ నిర్వహించారు. Every Xmas Eve Jishu Puja is organised by the monks of Ramakrishna Mission at Belur & at all their missions the world over in memory of Swami Vivekananda who celebrated it! Peace and Joy from the city of Joy to you all!pic.twitter.com/qTsYm2z1d5 ప్రపంచమంతా ప్రశాంతంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటోంది. అయితే పైన చెప్పుకున్న దృశ్యాలు కలిసినప్పుడు మనకు కనిపించేది భిన్నత్వంలో ఏకత్వం. ఇదే కదా మన భారతం..! pic.twitter.com/SqZomQJSeg— Codex_Indîa (@Codex_India6) December 24, 2025 -
ప్రేమించలేదని యువతిపై దాడి
బెంగళూరు: ఆన్లైన్లో పరిచయమైన యువకుడు ప్రేమించాలని వేధిస్తూ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవీన్కుమార్ అనే నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. వివరాలు.. టెలికాలర్గా పనిచేస్తున్న యువతికి 2024లో ఇన్స్టా ద్వారా నవీన్కుమార్ పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు కాల్స్, మెసేజ్ చేస్తున్న నవీన్కుమార్ ప్రేమించాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అతన్ని తిరస్కరించింది. యువతి గత సోమవారం మధ్యాహ్నం పీజీ హాస్టల్ వద్ద నిలబడి ఉండగా కారులో వచ్చిన నవీన్కుమార్ గొడవపడి దాడి చేసి, యువతి బ్యాగ్ను లాక్కుని ఉడాయించాడు. దాడి దృశ్యాలు పీజీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. pic.twitter.com/glv1rMtE1P Bengaluru's Jnanabharathi area on December 22, 2025, where 21-year-old Naveen Kumar groped, slapped, and attempted to tear the clothes of a woman who rejected his repeated romantic proposals after connecting on Instagram, as captured in attached CCTV…— MdShakeel(PingTV) (@PingtvIndia) December 24, 2025 -
ఏం జరిగిందో చెప్పలేను.. డీకే కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: ఎడతెగని టీవీ సీరియల్ మాదిరిగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పిడి తతంగం కొనసాగుతోంది. హైకమాండ్ నేతలు ఒకమాట, సీఎం సిద్దరామయ్య మరో మాట చెబుతూ ఉంటే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో డీకే శివకుమార్ (Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం, పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. దీంతో, సీఎం మార్పు అనే వ్యవహారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం సిద్ధరామయ్య, నా మధ్య ఏం జరిగిందో నేను వెల్లడించలేను. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి పనిచేశాం. పార్టీ కోసం ప్రతిఒక్క కార్యకర్త ఎంతో కష్టపడ్డాడు. 1980 నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశాను. ఇప్పటికీ పార్టీ వర్కర్గా ఉండేందుకే ఇష్టపడతాను. హైకమాండ్ మాకు స్వేచ్ఛనిచ్చింది. కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. పార్టీ అధికారంలోకి రావడానికి డీకే, సిద్ధూతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేశారు’ అని అన్నారు.ఈ సందర్భంగా సంక్రాంతి తర్వాత నాయకత్వ మార్పునకు సంబంధించిన చర్చల గురించి విలేకరులు ప్రశ్నించారు. అలాంటి చర్చలు మీడియాలో మాత్రమే జరుగుతున్నాయని.. ప్రభుత్వం, పార్టీలో కాదని డీకే స్పష్టం చేశారు. ఇక, ప్రస్తుతం పార్టీ హైకమాండ్ను కలవడం లేదని, విదేశాల నుంచి వచ్చిన రాహుల్గాంధీని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం మాత్రమే సమాధానం చెప్పగలరని వ్యాఖ్యానించారు.27వ తేదీపైనే ఆశలుఇదిలా ఉండగా.. సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ రాహుల్గాంధీకి లేఖ రాసి వేడి పుట్టించారు. ఈ నెల 27న కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు డీకే శివకుమార్ వెళ్తారు. తాను వెళ్లనని సిద్దరామయ్య మొన్ననే చెప్పారు. ఆ సమావేశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని డీకే పట్టుదలతో ఉన్నారు. ఇందులో ఫైనల్ రౌండ్ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు. -
వరుస బస్సు ప్రమాదాలు.. 2025లో భారీగా మరణాలు
దేశంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో బస్సులో సేదదీరుతూ గమ్యం చేరాలనుకునే సుదూర ప్రయాణికులు ఊహించని ప్రమాదాల్లో శాశ్వత నిద్రలోకి వెళ్లడం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఈ ఏడాది(2025) భారీ సంఖ్యలో వరుస బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు.కార్లు, బైకులు, ఇతర ప్రైవేటు వాహనాలతో పోలిస్తే బస్సుల్లో ప్రయాణం సురక్షితం. బస్సులు రోడ్డు ప్రమాదానికి గురైనా ప్రాణ నష్టం అత్యంత స్వల్పంగా ఉంటుంది. కానీ, అదే అగ్ని ప్రమాదానికి గురైన సమయాల్లో ప్రాణ నష్టం ఊహకు అందడం లేదు. ప్రయాణికులు తేరుకునేలోగానే అగ్ని కీలలు వారిని ఎలా ముంచెత్తుతాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఈ ఏడాది జరిగిన బస్సు ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి.మేజర్ ప్రమాదాలు.. సెప్టెంబర్ 14న రాజస్థాన్లో దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీగా మంటలు చెలరేగి 20 మంది సజీవదహనమయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వెనక భాగంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి.సెప్టెంబర్ 23న తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద పెళ్లి బృందం బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 35మంది నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అందరూ కిందకు దిగిన తర్వాత బస్సు దగ్ధమైంది.సెప్టెంబర్ 26న హైదరాబాద్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్ నుంచి బయల్దేరిన బస్సు ఎస్సార్ నగర్ చౌరస్తాలో ఉమేశ్ చంద్ర విగ్రహం వద్దకు రాగానే ఏసీ నుంచి మంటలు వ్యాపించాయి.అక్టోబర్ 24న కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం. అర్ధరాత్రి బైక్ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.అక్టోబర్ 26న యూపీలో స్లీపర్ బస్సులో చెలరేగిన మంటలు.అక్టోబర్ 29న మహారాష్ట్రలోని సమృద్ది హైవేపై బస్సులో మంటలు.నవంబర్ 3న చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం.డిసెంబర్ 12న మారేడుమిల్లి వద్ద లోయలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. తొమ్మిది మంది మృతి, పలువురికి గాయాలు.ఈనెల 16న యూపీలోని మథుర వద్ద ఎక్స్ప్రెస్ హైవేపై ప్రమాదం. పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు, కార్లు. వాహనాల్లో మంటలు చెలరేగి 13 మంది మృతి, దాదాపు 60 మందికి గాయాలు.డిసెంబర్ 24న తమిళనాడులో రెండు కార్లను ఢీకొన్న బస్సు తొమ్మిది మంది మృతి.డిసెంబర్ 25(ఈరోజు) కర్ణాటకలో బస్సు ప్రమాదం. దాదాపు 13 మంది మృతి, పలువురికి గాయాలు. -
ఉన్నావ్ కేసు.. సెంగర్కు షాక్ తప్పదా?
ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం.. దీనిని నిరసిస్తూనే ప్రాణభయంతో బాధితురాలు, ఆమె తల్లి ఆందోళనకు దిగడం.. అందుకు అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపారేయడం.. యోగి ప్రభుత్వ నుంచి కనీస స్పందన లేకపోవడం.. బాధితుల సోనియా-రాహుల్ గాంధీలను కలవడంతో రాజకీయ రగడ నెలకొంది. ఈ తరుణంలో.. న్యూఢిల్లీ: ఉన్నావ్ కేసులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు జరిపిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంగర్ బెయిల్ను సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని భావిస్తోంది. ఢిల్లీ హైకోర్టును సమీక్షించిన తర్వాత పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 2017లో నాడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ మైనర్ అయిన బాధితురాలిని ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం జరపడంతో పాటు ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఆ సమయంలో పోలీసుల చొరవతో ఆమె బయటపడగలిగింది. అయితే న్యాయం కోసం ఆమె పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం వద్ద బలవన్మరణం కోసం ప్రయత్నించడంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. ఈలోపు.. ఆమె తండ్రి హత్యకు గురికాగా.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది కూడా. ఈ కేసు తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా.. సుప్రీం కోర్టు చొరవతో విచారణను కూడా యూపీ నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చారు. 2019లో విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు నిందితుడు కుల్దీప్ సెంగర్కు జీవితఖైదు విధించింది. అయితే.. తాజాగా(డిసెంబర్ 23, 2025) మంగళవారం ఢిల్లీ హైకోర్టు సెంగర్ జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం.. అధికారం ఉన్న వ్యక్తి లైంగిక దాడి చేస్తే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. సెంగార్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారి కిందకు రారని.. కాబట్టి ఆయపై పెట్టిన పోక్సో చట్టంలోని సెక్షన్-5 వర్తించదని ఢిల్లీ హైకోర్టు ద్విసభ ధర్మాసనం తీర్పు సందర్భంగా అభిప్రాయపడింది. కాబట్టి ఆ చట్టంలోని సెక్షన్ 4 మాత్రమే ఆయనకు వర్తిస్తుందని పేర్కొంది.ఈ తీర్పును బాధితురాలి కుటుంబం తీవ్రంగా తప్పుబడుతోంది. సెంగార్ బయటకు రావడం అంటే.. తమ ప్రాణాలకు ముప్పు తప్పదని ఆందోళన చెందుతోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేయబోతోంది. అయితే ఇప్పుడు సీబీఐ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుండడంతో కేసు ఎలాంటి మలుపు తిరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది. ‘‘ దారుణోదంతానికి ఒడిగట్టి దోషిగా తేలిన వ్యక్తికి హైకోర్టు మళ్లీ బెయిల్ మంజూరుచేయడమేంటి? ఇది నా కుటుంబానికి మరణశాసనం రాయడమే. బెయిల్ రద్దు డిమాండ్తో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా’’ అని ఆమె అన్నారు. బెయిల్ను తీవ్రంగా తప్పుబడుతూ బాధితురాలి తల్లితోపాటు మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఇండియాగేట్ సమీప మండీ హౌస్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలికీ గాయాలయ్యాయని యోగిత చెప్పారు. ‘‘దోషికి ఇలాగే బెయిల్ ఇస్తూ పోతే దేశంలోని ఆడబిడ్డలకు రక్షణ అనేదిఉంటుందా? మా విషయంలో మాత్రం ఈ తీర్పు మరణశాసనమే. న్యాయం పొందటంలో ధనికులు లాభపడతారు. మాలాంటి పేదలు ఓడిపోతారు. తీర్పు తర్వాత మమ్మల్ని లాయర్లతోనూ కలవనివ్వట్లేరు. వాళ్లను కలిసేందుకు వెళ్తుంటే సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డుకుని తిరిగి ఇంటికి పంపేస్తున్నారు. నా కుటుంబసభ్యులు, లాయర్లు, సాక్షులకు గతంలో ఇచి్చన పోలీస్భద్రతనూ ఉపసంహరించారు. ఇప్పుడు మాకు ప్రాణహాని ఎక్కువైంది. మా గతేంటి? దోషిని బెయిల్పై విడుదలచేస్తే మమ్మల్ని అయినా జైలుకు పంపండి. అతడి మిగతా జైలుశిక్షను నేను అనుభవిస్తా. అక్కడయినా క్షేమంగా ఉంటాం. సరైన ఉపాధి లేదు. అక్కడయినా తినడానికి తిండి దొరుకుతుందేమో’’ :::ఉన్నావ్ బాధితురాలి ఆవేదనసోనియా, రాహుల్లతో భేటీ ధర్నా తర్వాత బాధితురాలు తన తల్లితో కలిసి 10, జన్పథ్లోని సోనియాగాంధీ అధికారిక నివాసంలో సోనియా, రాహుల్గాంధీలను కలిశారు. నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో నేరాన్ని నిరూపించి దోషిని బోనులో నిలబెట్టేలా అత్యంత ప్రతిభావంతులైన లాయర్ల బృందాన్ని ఇవ్వాలని ఆమె ఇరునేతలను కోరారు. పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ఇరునేతలు బాధిత కుటంబానికి హామీ ఇచ్చారు. అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ‘‘ న్యాయం కోసం పోరాడుతున్నా. ప్రధాని మోదీని కలవాలని నిర్ణయించుకున్నా. న్యాయపోరాటం చేస్తున్నందుకు రాహుల్ అభినందించారు’’ అని బాధితురాలు తర్వాత మీడియాతో చెప్పారు. ‘‘ అమలవుతున్న యావజ్జీవ కారాగారశిక్షను హఠాత్తుగా నిలుపుదలచేసి బెయిల్ ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా. రేపిస్ట్లు అందరూ ఇలాగే విడుదలవుతారనే భయం ఇప్పుడు బాధితులందరి మనసుల్ని పురుగులా తొలిచేస్తోంది. ఇదే ప్రభుత్వం? ఇదేం పాలన?’’ అని బాధితురాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే.. సెంగర్ వర్గ ఓట్ల కోసమే కుల్దీప్ను యూపీ బీజేపీ సర్కార్ బయటకు రప్పించే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సిగ్గుచేటుఉన్నావ్లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో దోషి కుల్దీప్ సెంగర్ జైలు నుంచి విడుదల కావడం దేశానికి సిగ్గు చేటు అని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం రాహుల్ తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘సామూహిక అత్యాచార బాధితురాలి విషయంలో ప్రభుత్వం ఇంత నిర్దయంగా వ్యవహరించడం ఏ విధంగా సమర్థనీయం?. న్యాయం కోసం గొంతు వినిపించడానికి ధైర్యం చేయడమే ఆమె చేసి తప్పా?. బాధితురాలు పదే పదే వేధింపులకు గురవుతూ ప్రాణభయంతో జీవిస్తుంటే దోషికి బెయిల్ మంజూరు చేయడం అత్యంత దారుణం. బెయిల్ రావడం చాలా నిరాశపరిచింది. ఇది సిగ్గుచేటు. అత్యాచారం చేసిన వారికి బెయిల్ ఇవ్వడం, బాధితులను నేరస్థుల్లా చూడడం ఇదేం న్యాయం?. కేవలం ఒక మృత ఆర్థిక వ్యవస్థే కాదు ఇలాంటి అమానవీయ సంఘటనలతో మనం ఒక నిర్జీవ సమాజంగా విపరిణామం చెందుతున్నాం. ప్రజాస్వామ్యంలో అసమ్మతి గళం వినిపించడం హక్కు. దానిని అణచివేయడం నేరం. బాధితురాలు గౌరవం, భద్రత, న్యాయం పొందాలి. కానీ నిస్సహాయత, భయం, అన్యాయం కాదు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
బెంగాల్లో మిన్నంటిన నిరసనలు
కోల్కతా: బంగ్లాదేశ్లో హిందూ కార్మికుడి హత్యతోపాటు మైనార్టీలపై జరుగుతున్న∙దాడుల పట్ల పశ్చిమ బెంగాల్లో హిందూ సంఘాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్, సరిహద్దులోని ఓడరేవుల వద్ద బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.దీంతో, కోల్కతాలో హౌరా బ్రిడ్జి వైపు ర్యాలీగా వస్తున్న జనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బారీకేడ్లను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ సనాతన ఐక్య పరిషత్ ఆధ్వర్యంలో 24 పరగణాల జిల్లా, మాల్డా, కూచ్ బెహార్ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 18న బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ సిటీలో దీపూ చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని అల్లరిమూకలు కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ రాక్షసకాండ పట్ల ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హిందూ సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. అల్లరిమూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన దీపూ చంద్రదాస్ కుటుంబ బాధ్యతను బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వీకరిస్తుందని మధ్యంతర ప్రభుత్వ సీనియర్ సలహాదారు సీఆర్ అబ్రార్ చెప్పారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దీపూ చంద్రదాస్ భార్య, పిల్లలు, తల్లిదండ్రుల బాగోగులను ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు. అమాయకుడిని హత్య చేయడం దారుణమని అన్నారు. ఈ హత్యకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మరోవైపు తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేకూర్చాలని దీపూ చంద్రదాస్ తండ్రి రవి చంద్రదాస్ డిమాండ్ చేశారు. తన కుమారుడిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని అన్నారు. -
నేడు జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం ఉత్తర ప్రదేశ్లో కీలకమైన జాతీయ స్మారకాన్ని ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ, బీజేపీ సిద్ధాంతకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయల భారీ కాంస్య విగ్రహాలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. నేడు(డిసెంబర్ 25) వాజ్పేయీ 101వ జయంతిని పురస్కరించుకుని లక్నోలో ఈ నేషనల్ మొమోరియల్, కాంప్లెక్స్ను ఆరంభిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో హిందీలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ భారత రత్న, దివంగత వాజ్పేయీ జయంతి రోజున లక్నోలో రాష్రీ్టయ ప్రేరణ స్థల్ స్మారకం నా చేతుల మీదుగా ప్రారంభంకావడం నా అదృష్టం. వాజ్పేయీ, ఎస్పీ ముఖర్జీ, పండిత్ దీన్దయాళ్ విగ్రహాలు, ఈ ముగ్గురు దిగ్గజాలు దేశానికి చేసిన సేవను తెలిపే వివరాలతో అధునాతన మ్యూజియం సైతం ఇదే ప్రాంగణంలో అందుబాటులోకి రానుంది’’ అని మోదీ చెప్పారు. ప్రారం¿ోత్సవంలో భాగంగా మోదీ ఆ తర్వాత భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. 65 ఎకరాల విస్తీర్ణంలో రూ.230 కోట్ల వ్యయంతో ఈ మెమోరియల్, కాంప్లెక్స్ను నిర్మించారు. ముగ్గురు నేతల 65 అడుగుల ఎత్తయిన విగ్రహాలను ప్రతిష్టించారు. 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తామర పువ్వు ఆకృతిలో మ్యూజియం కట్టారు. -
మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల సజీవ దహనం
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదంపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. రాంగ్రూట్లో వచ్చిన కంటెయినర్ లారీ ఢీ కొట్టడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 17 మంది మరణించగా.. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది ప్రయాణికులతో( డ్రైవర్, క్లీనర్తో కలిపి 31 మంది అని) కూడిన బస్సు బుధవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా.. బెంగళూరు-హెబ్బులి హైవేపై సిరా-హిరియూర్ మధ్య గోర్లత్తు గ్రామం(చిత్రదుర్గ జిల్లా) వద్ద ప్రమాదానికి గురైంది. ఆ మంటల ధాటికి బస్సుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా కాలిబూడిదైంది. తొలుత ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది. అయితే.. ఈ ఘటన నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, హెల్పర్ సురక్షితంగా బయటపడ్డాడు. వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. అపోజిట్ రోడ్డులోంచి దూసుకొచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగింది. ‘‘డివైడర్కు మరోవైపున ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా నేను వెళ్తున్న రోడ్డు పైకి దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టబోతోందని అర్థమై బస్సును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించా. కానీ అప్పటికే ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మా బస్సు పక్కనే వెళ్తోన్న మరో వాహనాన్ని కూడా తాకింది. అయితే ఆ వాహనం ఏంటో నేను చూడలేకపోయా. అతివేగం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది’’ అని ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వివరించాడు.ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య.. మంత్రులను, అధికార యంత్రాగాన్ని ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లాలని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించాలని ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి గల కారణంపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అన్నారాయన. ప్రమాదం జరిగిందిలా..చిత్రదుర్గ జిల్లాలోని జాతీయరహదారి-48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంక్కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ వద్ద ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో రెండు వాహనాలు కాలి బూడిద అయ్యాయి. కంటెయినర్ డ్రైవర్తో పాటు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది కాలి బూడిదయ్యారు. Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire #chitradurga #karnataka pic.twitter.com/Fdpe5Tg999— Naik Kartik (@mekartiknaik) December 24, 2025 యువకుడి సాహసంతో.. ప్రయాణికుల్లో ఒక యువకుడు సాహసం చేసి బస్సు అద్దాలు పగలకొట్టాడు. దీంతో 9 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. వీళ్లలో కొందరికి గాయాలు కావడంతో చిత్రపురి, సిరా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.సకాలంలో స్పందించినా.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే మంటలు శరవేగంగా అంటుకుని అప్పటికే బస్సు మొత్తం బూడిదైంది. ట్రావెల్స్ నిర్వాహకులు ఇచ్చిన లిస్ట్ ప్రకారం.. మృతుల్లో చాలామంది గోకర్ణవాసులేనని తెలుస్తోంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.తప్పిన ఘోరం!అయితే.. ఈ ప్రమాదం నుంచి 40 మందికి పైగా స్కూల్ విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. టి.దర్శహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఓ టూర్ బస్సు.. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది. ఈక్రమంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారింది. అయితే, పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మేరకు ఆ బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. -
సిగ్గు లేని దేశం...
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూనియన్ డిబేట్లో భారత్, పాకిస్తాన్ విద్యార్థుల మధ్య వాడీవేడిగా సంవాదం జరిగింది. ప్రజలను మెప్పించి, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే పాకిస్తాన్పై భారత్ దాడులు చేస్తోందంటూ పాక్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని భారత విద్యార్థులు గట్టిగా తిప్పికొట్టారు. సిగ్గులేని దేశాన్ని సిగ్గుపడేలా చేయలేమని పరోక్షంగా పాకిస్తాన్ను ఎద్దేవా చేశారు. నవంబర్ 27న ఈ డిబేట్ జరిగింది. భారత్ తరపున న్యాయ విద్యార్థి విరాన్ష్ భానుశాలీ, దేవార్చన్ బెనర్జీ, సిద్ధాంత్ నాగ్రాత్, పాకిస్తాన్ తరఫున మూసా హర్రాజ్, ఇస్రార్ ఖాన్, అహ్మద్ నవాజ్ పాల్గొన్నారు. పాకిస్తాన్ మంత్రి మొహమ్మద్ రజా హయత్ హర్రాజ్ కుమారుడే మూసా హర్రాజ్. భారత్లో ఏం జరిగినా పాకిస్తాన్పై నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నారని మూసా హర్రాజ్ ఆక్షేపించారు. ప్రేమికులు, భార్యాభర్తలు విడిపోయినా, అల్లరి మూక దాడి చేసినా దానికి పాకిస్తానే కారణం అంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇండియా పాలకులు ఎన్నికల్లో లబ్ధి కోసం పాకులాడుతున్నారని, అందుకోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దీనిపై విరాన్ష్ భానుశాలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తన వాదనతో పాక్ ప్రతినిధులను కంగు తినిపించారు. డిబేట్కు సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో వర్సిటీ అధికారులు అప్లోడ్ చేశారు. పాకిస్తాన్ దాషీ్టకాలపై విరాన్ష్ భానుశాలీ వాదన వైరల్గా మారింది. ఒకరకంగా పాకిస్తాన్ను ఆయన కడిగిపారేశారు. పాక్ అండతో భారత్లో జరిగిన పలు ఉగ్రవాద దాడులను ప్రస్తావించారు. ‘ఎలక్షనీరింగ్’ అనడం మూర్ఖత్వం ‘‘2008 నవంబర్ 26(26/11) దాడి నుంచి మా బంధువు తృటిలో తప్పించుకున్నారు. అప్పట్లో నేను స్కూల్లో చదువుకునేవాడిని. ముంబై నగరం మంటల్లో చిక్కుకోవడం టీవీలో చూశా. నా తల్లిదండ్రుల్లో ఆందోళలనను గమనించా. మూడు రోజులపాటు ముంబై ప్రజలకు నిద్రలేదు. 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 250 మందికిపైగా మరణించారు. ఎన్నో విషాదాల నీడన నేను పెరగాల్సి వచి్చంది. పాకిస్తాన్ పట్ల ఇండియా వైఖరిని జనరంజకవాదం(పాపులిజం) అనడం సరైంది కాదు. ఈ డిబేట్లో మేము నెగ్గాలంటే గణాంకాలు కాదు.. క్యాలెండర్ ఉపయోగిస్తే సరిపోతుంది. 1993 మార్చి నెలలో మా ఇంటికి సమీపంలోనే దాడులు జరిగాయి. అప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. మూడేళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఓట్ల అవసరం వల్ల ఈ దాడులు జరగలేదు. భారత ఆర్థిక రాజధానిని దెబ్బకొట్టాలని దావూద్ ఇబ్రహీం, ఐఎస్ఐ కుట్రలు సాగించాయి. ఇది పాపులిజం కాదు.. భారత్పై జరిగిన యుద్ధమే. 26/11 దాడుల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సంయమనం పాటించింది. నిజంగా ఎన్నికల్లో నెగ్గాలనుకుంటే యుద్ధ విమానాలతో పాక్పై దాడులు చేసేది. శత్రువుకు బుద్ధిచెప్పకపోతే శాంతి సాధ్యమవుతుందా? అందుకే పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్లోని పఠాన్కోట్, ఊరీపై భారత సైన్యం దాడులకు దిగింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ను ‘ఎలక్షనీరింగ్’ అనడం మూర్ఖత్వం. అప్పుడు ఎన్నికలు లేవు. అలాంటప్పుడు ఎన్నికల్లో లాభపడడానికి దాడులు చేశారని ఎలా చెప్పగలరు? పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాలి్చచంపారు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారని పర్యాటకులను అడగలేదు కదా! ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ భూభాగాలను భారత్ ఆక్రమించలేదు. ముష్కరులకు బుద్ధి చెప్పింది. ఇది పాపులిజం కాదు.. ప్రొఫెషనలిజం. ఉగ్రవాద దాడుల నుంచి ప్రజలను కాపాడుకోవడం పాపులిజం అవుతుందా? ప్రజలకు కనీసం తిండికూడా పెట్టలేని పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ను బూచీగా చూపించి వారిని మభ్యపెడుతోంది. ప్రజల పేదరికాన్ని అధికారానికి నిచ్చెనగా వాడుకుంటోంది. భారత్ యుద్ధం కోరుకోవడం లేదు. పొరుగుదేశాలతో స్నేహాన్ని, వ్యాపారాన్ని కోరుకుంటోంది. భారతదేశ సహనాన్ని పాకిస్తాన్ పదేపదే పరీక్షిస్తోంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి’ అని భానుశాలీ తేల్చిచెప్పారు. -
2025 వెడ్డింగ్స్.. రాయల్గా పెళ్లి..రీల్స్ మళ్లీ మళ్లీ!
బంగారం ధర కొండెక్కి కూర్చుంది.. వెండి వెల వెలుగులు జిమ్ముతోంది.. అయితే ఏంటట..? పెళ్లి మాత్రం ‘రాయల్’గా జరగాల్సిందే.. 2025 వెడ్డింగ్ సీజన్ కేవలం మూడు ముళ్ల ముచ్చట కాదు.. ఇప్పుడు అదొక భారీ ‘ఇన్స్ట్రాగామ్ ఈవెంట్’. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వంటి ప్రముఖుల పెళ్లిళ్లు ఆగిపోయి వార్తల్లో నిలిచినా.. అదర్ జైన్, అర్మాన్ మాలిక్ వంటి స్టార్ల పెళ్లి సందడి ట్రెండ్ సెట్ చేసింది. కేవలం కోటీశ్వరులే కాదు, మధ్యతరగతి జంటలు కూడా ’లగ్జరీ’ బాట పట్టడంతో వెడ్డింగ్ మార్కెట్ కళకళలాడుతోంది. ఇప్పుడు పెళ్లి అంటే కేవలం అక్షింతలు వేయించుకోవడం కాదు.. ఇన్స్టాలో ట్రెండ్ కావడం.. డెస్టినేషన్ వెడ్డింగ్లో మెరిసిపోవడం.. ఖర్చు భారమైనా, అప్పులైనా.. పెళ్లి వేడుక మాత్రం ‘బ్లాక్ బస్టర్’ సినిమా రేంజ్లో ఉండాల్సిందేనని కుర్రకారు ఫిక్సయిపోయింది. → ఖర్చులో తగ్గేదే లే! ‘వెడ్మిగుడ్’ సంస్థ నివేదిక ప్రకారం.. 2025లో పెళ్లిళ్ల ఖర్చు సగటున 8 శాతం పెరిగింది. ఒక్కో పెళ్లి బడ్జెట్ సగటున రూ.39.5 లక్షలకు చేరింది. ఇక 2026లో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. → డెస్టినేషన్ వెడ్డింగ్కే ఓటు ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకరు సొంతూరు వదిలి గోవా, జైపూర్ లేదా రిషికేష్ లాంటి ప్రాంతాల్లో ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ సెలబ్రేట్ చేసుకున్నారు. రూ.కోటి మించిన బడ్జెట్ ఉన్న పెళ్లిళ్లలో 60 శాతం డెస్టినేషన్ వెడ్డింగ్స్వే. సగటున ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రూ.58 లక్షలు ఖర్చు చేస్తున్నారు. బాలి, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలు ఇప్పుడు ఇండియన్ జంటలకు ఫేవరెట్ వెడ్డింగ్ స్పాట్లుగా మారిపోయాయి. → రీల్స్ కోసమే అసలు గోల.. గతంలో లాగా పాత ఫొటోలు, గంటల కొద్దీ వీడియోలు ఇప్పుడు ఎవరికీ అక్కర్లేదు. పెళ్లి పూర్తవగానే నిమిషాల్లో ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి వీలుగా ’క్విక్ అండ్ క్వాలిటీ’ కంటెంట్ కావాలి. అందుకే ఫొటోగ్రఫీ శైలి కూడా మారింది. క్యాండిడ్ షాట్స్, డాక్యుమెంటరీ స్టైల్ వీడియోల కోసం జంటలు ఎగబడుతున్నాయి. ఫొటోగ్రఫీ మార్కెట్లో అసైన్మెంట్లు కొంచెం తగ్గినా, డిమాండ్ మాత్రం పీక్స్లో ఉంది. → పాత బంగారానికే జై! 2025లో బంగారం ధర ఏకంగా 74 శాతం పెరిగి పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ల తండ్రులకు చుక్కలు చూపించింది. వెండి ధర అయితే ఏకంగా 137 శాతం ఎగబాకింది. దీంతో చాలామంది కొత్త నగలు కొనేకంటే, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని కరిగించి కొత్త డిజైన్లు చేయించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రీసైక్లింగ్ ట్రెండ్ గతంతో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. → హోటళ్లకు కాసుల వర్షం హోటల్ రంగం కూడా ఈ వెడ్డింగ్ సీజన్లో భారీగా లాభపడుతోంది. మునుపటిలా ఒక రోజులో పెళ్లి ముగించకుండా, 2–3 రోజుల పాటు ఈవెంట్లను హోటల్స్లోనే ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాగే ఈ ‘పెళ్లిళ్ల సీజన్’.. హోటళ్ల వ్యాపారంలో దాదాపు 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. → 2026పై గురి.. ముందుముందు పెళ్లిళ్లలో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగనుంది. ప్రణాళికల నుంచి చెల్లింపుల వరకు అంతా డిజిటల్ మయం కాబోతోంది. మొత్తానికి ధరల భారమున్నా.. భారతీయ పెళ్లిళ్ల గ్లామర్ మాత్రం తగ్గట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఊపిరిపై పన్నేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గాలి పీల్చడమే గండంగా మారిన వేళ.. ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై, జీఎస్టీ కౌన్సిల్పై నిప్పులు చెరిగింది. గాలి నాణ్యత ‘అత్యంత ప్రమాదకర’ స్థాయికి పడిపోయి జనం విలవిల్లాడిపోతుంటే, ప్రాణాలను కాపాడే ‘ఎయిర్ ప్యూరిఫయర్ల’పై 18 శాతం పన్ను వసూలు చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బుధవారం జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెలతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఒక మనిషి రోజుకు సగటున 21 వేల సార్లు శ్వాసిస్తాడు. ఈ విషతుల్యమైన గాలిని ఇన్నిసార్లు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఏమవుతాయో ఆలోచించారా? అది మన అదుపులో లేని అనివార్య ప్రక్రియ’.. అని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో అధికారులు విఫలమయ్యారు. కనీసం తాత్కాలికంగానైనా.. వారం లేదా నెల రోజులు ప్యూరిఫైయర్లపై పన్ను మినహాయింపు ఇవ్వలేరా? ఇదొక అత్యవసర పరిస్థితి అని గుర్తించండి’.. అని ఆదేశించింది. న్యాయవాది కపిల్ మదన్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఎయిర్ ప్యూరిఫయర్లు విలాసవంతమైన వస్తువులు కావు, అవి ప్రాణరక్షక పరికరాలు. ప్రస్తుతం వైద్య పరికరాలపై కేవలం 5 శాతం జీఎస్టీ ఉండగా, ఎయిర్ ప్యూరిఫయర్లపై మాత్రం 18 శాతం వసూలు చేస్తున్నారు. భారీ పన్నుల వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. వీటిని కూడా వైద్య పరికరాల జాబితాలో చేర్చి పన్ను తగ్గించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్లోనైనా భేటీ అవ్వండి! జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడానికి సమయం పడుతుందని కేంద్రం చెప్పగా, కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ‘పరిస్థితి తీవ్రతను బట్టి భౌతికంగా వీలు కాకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా వెంటనే సమావేశమై పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకోండి’.. అని స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని తెలియజేయడానికి డిసెంబర్ 26వ తేదీకి శుక్రవారం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. -
సెలెబ్రిటీలను మించిపోయిన క్రియేటర్లు!
బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని టెండూల్కర్ చెప్పాల్సిన పని లేదు.. అందమైన చీరలు షూటింగ్ షర్టింగులు అంటూ విజయశాంతి ఊయలూగుతూ చెప్పే అవసరం లేదు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అంటూ కాజల్ అగర్వాల్ గోడలు అద్దాలు బద్దలుకొట్టుకుని రావాల్సిన అవసరం లేదు.. ఇంకా ఇప్పుడు పట్టణాలు.. నగరాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ లు కటవుట్లు .. ఫ్లెక్సీలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు.. కాలం మారింది.. మారుతోంది.. ఇంకా మారనున్నది.. వివిధ ఉత్పత్తుల ప్రచారం కోసం సెలబ్రిటీలు.. సినిమా నటులు.. క్రీడాకారులు మాత్రమే యాడ్ ఫిలిమ్స్ లో నటించాలని రూలేం లేదు.. వాళ్లకు లక్షలు.. కాదు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది.. మున్ముందు ఇంకా మారుతుంది.సోషల్ మీడియా.. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ ఫారాలు వచ్చాక కమర్షియల్స్ .. అంటే యాడ్ ఫిలిమ్స్ రూపకల్పన తీరు మారిపోతోంది. దీనికోసం సెలబ్రిటీలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు పాతిక లక్షలమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సిద్ధంగా ఉన్నారు.. వీరు సినిమా సెలబ్రిటీలు.. స్పోర్ట్స్ పర్సన్స్ కాదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే ప్రచారం చేస్తారు.ఐదారేళ్ళ క్రితం వరకుఒకప్పుడు భారతదేశంలో మార్కెటింగ్ అంటే హోర్డింగులు, సెలబ్రిటీ ఎండా ర్సుమెంట్లు, మెరుపువెలుగుజిలుగులు.. తళుక్కుమనే టీవీ ప్రకటనలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు.. నేరుగా కష్టమర్లతో మాట్లాడే వారే వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. వారు ఏం కొనాలి.. ఎందుకు కొనాలన్నది ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వివరించి చెబుతున్నారు.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) అనే ఒక ప్రఖ్యాత మార్కెట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారత కంటెంట్ క్రియేటర్ ఎకానమీ కీలక మలుపు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు యాక్టివ్గా ఉన్నారు. వీరంతా సొంత రీల్స్, కంటెంట్ పోస్ట్ చేస్తూనే వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఆదాయం కూడా పొందుతున్నారు.వీరి ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో 30 శాతానికి పైగా మార్పు వస్తుండగా, వార్షికంగా రూ. 350–400 బిలియన్ డాలర్ల (సుమారు లక్షల కోట్ల రూపాయల) వ్యయం ఈ క్రియేటర్ల ప్రభావంలో జరుగుతోంది. 2030 నాటికి ఈ సంఖ్య 1 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశముందని అంచనా.ఈ వీరి ప్రభావం మరింత విస్తృతం అవుతుందని బీసీజీ అంచనా వేస్తోంది. ఇది ఇకపై వైరల్ డ్యాన్స్ వీడియోలు లేదా మేకప్ ట్యుటోరియల్స్కే పరిమితం కాదు. ఫ్యాషన్, టెక్నాలజీ, బ్యూటీ, రోజువారీ అవసరాలు వంటి అన్ని విభాగాల్లోనూ ఈ క్రియేటర్లు దూసుకుపోతున్నారు.BCG అధ్యయనం ప్రకారం:60 శాతం మంది వినియోగదారులు క్రమం తప్పకుండా క్రియేటర్ కంటెంట్ను చూస్తున్నారు.30 శాతం కంటే ఎక్కువ మంది తమ కొనుగోలు నిర్ణయాలకు క్రియేటర్లే కారణమని చెబుతున్నారు. ఎవరెవరో సినిమా నటులు, క్రికెటర్లు చెప్పే ప్రకటనలకన్నా కమ్యూనిటీ ఆధారిత నమ్మకమే ఇప్పుడు ప్రధానంగా మారింది. మనకు తెలిసినవాళ్ళు చెప్పే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది.ఇకముందు ఈ 'కంటెంట్ క్రియేటర్లను తాత్కాలిక ప్రచార సాధనంగా కాకుండా, దీర్ఘకాల భాగస్వాములుగా చూసే బ్రాండ్లే విజేతలుగా నిలుస్తాయి. వాళ్ళ ఉత్పత్తులే ఎక్కువగా మార్కెట్లోకి వెళ్తాయి అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే క్రియేటర్లను కేవలం తమ ఉత్పత్తుల ప్రచారం కోసమే కాకుండా అమ్మకాలు పెంచుకోవడం, ఇంకా ధరను కూడా వారిద్వారానే నిర్ణయించేలా వ్యూహాలు రూపొందించి సక్సెస్ అవుతున్నారు. వీరితో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని తమ వ్యాపారాలు పెంచుకుంటున్నాయి. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే అంతపెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా వారిని గుర్తిస్తూ తమ వ్యాపారంలో భాగస్వాములను చేస్తున్నారు.--సిమ్మాదిరప్పన్న -
కొత్త జట్టు కోసం బీజేపీ జల్లెడ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా యువనేత నితిన్ నబిన్ ఇటీవల పగ్గాలు చేపట్టాక పార్టీ సంస్థాగత పునరి్నర్మాణంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులోభాగంగా నబిన్ సహాయక జట్టును పూర్తిగా యువరక్తంతో నింపేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. జనవరిలోకొత్త అధ్యక్షుడిని అధికారికంగా నియమించిన తర్వాత ఉపా ధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రతినిధులతో కూడిన కొత్త ఆఫీస్ బేరర్ల బృందాన్ని ఎంపిక చేసేందుకు దేశ వ్యాప్తంగా యు వ నేతలను జల్లెడ పడుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా దేశాన్ని నడిపించేలా యువ నాయకత్వానికి అధిక ప్రాతినిధ్యం కలి్పంచే లక్ష్యంతో జట్టు కూర్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీలో మొదలైన ‘తరాల’మార్పు.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే తన నాయకత్వ మార్పు ముద్రను స్పష్టంగా వ్యక్తం చేస్తూ వస్తోంది. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రివర్గ కూర్పులో యువకులకు పెద్ద పీట వేస్తోంది. 56 ఏళ్లున్న సామ్రాట్ చౌదరి, 57 ఏళ్లున్న విజయ్ సిన్హాలను బిహార్లో ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయగా, ఛత్తీస్గఢ్లో 57 ఏళ్లున్న అరుణ్ సావో, 52 విజయ్ శర్మలను ఉపముఖ్యమంత్రులుగా ఎంపికచేశారు. 50 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా, 53 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో కూర్చోబెట్టారు. ఇటీవలే గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మొత్తం మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి 19 మంది కొత్త మంత్రులను చేర్చుకున్నారు. దీంతో మంత్రివర్గం సగటు వయస్సు 60 నుంచి 55 ఏళ్లకు తగ్గింది. 40 ఏళ్ల హర్‡్ష సంఘ్వీని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇవన్నీ రాష్ట్రాల్లో బీజేపీ యువనాయకత్వాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతలకు అద్దంపడుతున్నాయి. 50 ఏళ్లుకూడా లేని నబిన్ను ఏకంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. నబిన్ ఎన్నిక అనేది పార్టీ యువనాయకత్వం వైపు అడుగులేస్తోందనడానికి ప్రబల తార్కాణం. ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు ఇది నిర్ణయాత్మక మార్పే. బీజేపీ రాబోయే పాతికేళ్లకు వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే యువనాయకత్వాన్ని సంసిద్ధం చేసుకుంటోంది’’అని బీజేపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. రెండు దశాబ్ధాలను నడిపించే నేతలకై వెతుకులాట.. 2009 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత, అంతగా తెలియని నితిన్ గడ్కరీని పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. 52 ఏళ్ల గడ్కరీ అప్పట్లో తన జట్టుని పునరి్నరి్మంచినప్పుడు, ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ తీసుకోబోయే దిశను సూచించాయి. ముఖ్యంగా ఆయన తన జట్టులోని ప్రధాన కార్యదర్శులలో అనంత్ కుమార్, వసుంధరా రాజే, అర్జున్ ముండా, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా వంటి నేతలున్నారు. వారంతా గడిచిన పదహారేళ్లుగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు మోస్తున్నారు. మరో పదేళ్ల పాటు సేవలందించే స్థాయిలో ఉన్నారు. అదే మాదిరి ప్రస్తుతం నబిన్ నేతృత్వంలోని జట్టులోనూ భవిష్యత్ నాయకత్వాన్ని ప్రతిబింబించే నేతలకు అవకాశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. రాబోయే రెండు, మూడు దశాబ్దాల పాటు పార్టీకి నాయకత్వం వహించే కొత్త నాయకులను తయారు చేయాలనే రాష్ర్టీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సూచనలకు అనుగుణంగా నవతరం ఆఫీస్ బేరర్లను ఎంపిక చేసే అవకాశాలున్నాయని∙తెలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తమ తమ రాష్ట్రాల్లో పార్టీ కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్న అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకుల వివరాలను పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా తెప్పించి పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీళ్లలో అత్యధికులు 35 నుంచి 50 ఏళ్ల వయస్సు వారేకావడం గమనార్హం. ఇప్పటికే కొందరి నేతలకు భవిష్యత్లో పోషించే పాత్రలకు అనుగుణంగా తీర్చిదిద్దే పనిని సైతం పార్టీ ప్రారంభించినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తంగా జాతీయ కార్యవర్గంలో సగటు వయస్సు 53 ఏళ్లకు మించకుండా ఉండేలా నాయకుల ఎంపిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. -
అయోధ్య రామాలయానికి బంగారు రామయ్య
యశ్వంతపుర : అయోధ్యలోని రామాలయానికి బంగారు రామయ్య విగ్రహాన్ని ఓ భక్తురాలు విరాళంగా అందించారు. రూ.30 కోట్ల విలువ చేసే 10 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో కూడిన బంగారు, వజ్రాలతో కూడిన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని బెంగళూరు రాజాజీనగర్కు చెందిన కళాకారిణి జయశ్రీ ఫణీశ్ స్వయంగా రూపొందించి అందజేశారు. పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో విగ్రహాన్ని తీర్చిదిద్ది... విలువైన మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు, కెంపులతో అలంకరించారు. తంజావూరు చిత్రకళ శైలిలో, బాలరాముని మూలవిరాట్టు పోలికలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శ్రీరాముని విగ్రహంలోనే హనుమాన్, గరుడ, దశావతార చిత్రాలున్నాయి. పెద్ద విల్లు, బాణాలు పట్టుకుని ఉన్న రామయ్య విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలోనే ప్రతిష్టించాలని రామజన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించారు. జయశ్రీ ఫణీశ్తోపాటు ఆమె కుటుంబ సభ్యులు విగ్రహ ఖర్చును భరించినట్లు తెలిసింది. విగ్రహాన్ని నాణ్యమైన ఎర్రచందనం చెక్క పెట్టెలో ఆలయానికి మంగళవారం తీసుకెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణ రామయ్యకు ఆలయంలో విశేష పూజలు చేశారు. -
ముంచనున్న మంచు!
ఫక్తు ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచు తుఫాన్. ఎవరూ ఊహించని ఈ పరిణామం ఇప్పుడు గుబులు రేపుతోంది. అంతర్జాతీయంగా పర్యావరణవేత్తల్లో ఇది పెద్ద చర్చకే దారితీసింది. భూ వాతావరణ వ్యవస్థలోనే అవాంఛనీయమైన మౌలిక మార్పులు భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయని చెప్పేందుకు ఇది ప్రబల సాక్ష్యమని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీని నుంచి ముఖ్యంగా భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు... సౌదీ అరేబియాలోని ఉత్తరాది ప్రాంతాలు తాజాగా మంచులో తడిసి ముద్దయిపోయాయి. ముఖ్యంగా టాబుక్, దాని సమీప పర్వత ప్రాంతా లు పూర్తిగా మంచు దుప్పటి కప్పుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ప్రపంచమంతటికీ ఆశ్చర్యం కలిగించేలా అచ్చం శీతల దేశాల్లో మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. మంచుమయంగా మారిన సౌదీ ఎడారుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారా యి. పర్యావరణ మార్పులు ఇంకెంతమాత్రమూ సుదూర, లేదా కాల్పనిక ముప్పు కాదని, అన్ని దేశాలనూ తీవ్రంగా పట్టి పీడించబోతున్న పెను సమస్య అనీ ఈ పరిణామం స్పష్టంగా చాటింది. విపరీత పరిస్థితులు వాతావరణ మార్పులు అనగానే కేవలం ఎండ ప్రచండంగా మండిపోయే రోజుల సంఖ్య పెరుగుతుందని చాలామంది భావిస్తారు. వాస్తవానికి చాలాసార్లు అందుకు విరుద్ధంగా జరుగుతుందని సైంటిస్టుల మాట. భూమి వేడెక్కిన కొద్దీ వాతావరణం మరింత తేమను, శక్తిని సంగ్రహిస్తుంది. వాటి దెబ్బకు చిరకాలం స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వాతావరణ ధోరణులు కాస్తా గాడి తప్పుతాయి. ఫలితంగా ఇలా అప్పుడే ప్రచండంగా ఎండ, కొద్దికాలానికే విపరీతమైన కుండపోత వానలు, ఆ వెంటనే వణికించే చలి, ఊహించని ప్రాంతాల్లో హిమపాతం... భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఈ ధోరణులు పెరిగిపోతున్నాయి. మనకు వారి్నంగ్ బెల్స్ సౌదీ మంచు తుఫాన్ ఉదంతం నుంచి భారత్ తక్షణం నేర్వాల్సిన పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే పర్యావరణ మార్పుల తాలూకు దు్రష్పభావం కొన్నేళ్లు మన దేశంపై తీవ్రంగానే ప్రభావం చూపు తూ వస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కనిపించిన విపరీత వాతావరణ ధోరణులే ఇందుకు రుజువు. తొలుత ఉత్తర, మధ్య భారతంలో రికార్డు స్థాయి ఎండలు కాచాయి. ఆ వెంటనే ఉత్తరాఖండ్ మొద లుకుని హిమాచల్ ప్రదేశ్, సిక్కిం దాకా క్లౌడ్ బరస్ట్ విలయమే సృష్టించింది. చాలా రాష్ట్రాల్లో వర్షాకా లం ఆలస్యంగా వస్తే కొన్నింటిలో విపరీతమైన వరదలు అపార నష్టం కలుగజేశాయి. ఇవేవీ యా దృచ్చిక ఘటనలు కాదు. వాతావరణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉండనేందుకు స్పష్టమైన సంకేతాలు. తక్షణం మేల్కొనాలి ప్రభుత్వాలు ఇప్పటికీ మేల్కొనకపోతే భారత్లో పర్యావరణ వ్యవస్థే పూర్తిగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే సాగు సీజన్లు, నీటి యాజమాన్యం, పట్టణ ప్రణాళికలు మొదలుకుని విద్యుత్ డిమాండ్ దాకా అన్నింటికీ సజావైన వాతావరణ వ్యవస్థే మూలం. అదే దెబ్బ తింటే పంటల వైఫల్యం మొదలుకుని అన్నీ వినాశకర పరిణామాలే తలెత్తుతాయి. దేశవ్యాప్తంగా కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యలను చిత్తశుద్ధితో అమలు చేయడం అత్యవసరం. అలాగే వాతావరణానికి తగ్గట్టుగా సాగు పద్ధతులు, ధోరణులను కూడా మార్చుకుంటూ పోవడం ప్రస్తుత అవసరం. లేదంటే పరిస్థితి చూస్తుండగానే చేయి దాటిపోతుంది. అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ25 దిశగా భారత్!
సాక్షి, స్పెషల్ డెస్క్: పెట్రోల్లో ఇథనాల్ వాటా మన దేశంలో అక్టోబర్ నాటికి 19.97% వచ్చి చేరింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం గడువు కంటే ముందుగా భారత్ లో సక్సెస్ అయింది. ఈ ఊపుతో కేంద్ర పెట్రో లియం మంత్రిత్వ శాఖ తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ25 లక్ష్యానికి కొన్ని నెలల్లోనే శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా దశలవారీగా ఈ27, ఈ30 కార్యక్రమం సైతం పూర్తవుతుందని ధీమాగా ఉంది.ఈబీపీ కార్యక్రమంలో భాగంగా 2030 నాటికి ఈ20 (పెట్రోల్లో ఇథనాల్ వాటా 20%) సాధించాలని ప్రభుత్వం గతంలో లక్ష్యం విధించుకుంది. కానీ గడువు కంటే వేగంగా.. అది కూడా పదేళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి జోష్ తెచ్చింది. తదుపరి ఈ25 (పెట్రోల్లో ఇథనాల్ వాటా 25%) నిబంధన అమలు దిశగా పావులు కదుపుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశ ఇథనాల్ ప్రయాణం ఆపలేనిదని కొన్ని రోజుల క్రితం పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ వ్యాఖ్యానించారు. ఇథనాల్కు హామీ ధర నిర్ణయించడం, తయారీకి బహుళ ముడిపదార్థాలను అనుమతించడం, దేశవ్యాప్తంగా డిస్టిలేషన్ సామర్థ్యం పెంచడం వంటి స్థిరమైన విధాన సంస్కరణల ద్వారా ఈ విజయం సాధ్యమైందని ప్రభుత్వం చెబుతోంది. బీఐఎస్ ప్రమాణాలు, ఆర్థిక ప్రోత్సాహకాల మద్దతుతో దశలవారీగా ఈ25, ఈ27, ఈ30 వైపు భారత్ మళ్లుతుందని స్పష్టం చేస్తోంది.ఏడేళ్లలో రూ.1.5 లక్షల కోట్లువాస్తవానికి 2022 నవంబర్ నాటికి పెట్రోల్లో ఇథనాల్ వాటా 10.02% మాత్రమే. మూడేళ్లలోనే ఈ వాటా రెండింతలు అయిందంటే ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్లో ఇథనాల్ వాటా 2014లో కేవలం 1.53% మాత్రమే. ఈబీపీ కారణంగా భారత్కు ముడి చమురు దిగుమతి ఖర్చులు భారీగా తగ్గుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెద్ద ఎత్తున అదా అవుతుండడంతోపాటు స్థిరమైన ఇంధన వినియోగం దిశగా ఈ కార్యక్రమం ఒక పెద్ద ముందడుగు అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జీవ ఇంధనం వాడటంతో ఏడేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకుపైగా ఆదా కావడం విశేషం. ఈ20 సాధించేందుకు బ్రెజిల్కు 20 ఏళ్లు పట్టిందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల టెండర్ల ప్రకారం 2025–26 ఇథనాల్ సరఫరా సంవత్సరానికిగాను మన దేశంలో డిమాండ్ను మించి ఇథనాల్ సప్లై ఉంది. మొత్తం డిమాండ్: 1,350 కోట్ల లీటర్లు (ఈబీపీ కోసం 1,050 కోట్ల లీటర్లతో సహా).సరఫరా: 1,775 కోట్ల లీటర్లు.ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం: 1,900 కోట్ల లీటర్లు. -
హైకమాండ్ను ఇబ్బంది పెట్టను
శివాజీనగర/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీకే బుధవారం కర్ణాటక భవన్లో మీడియాతో మాట్లా డుతూ, ‘సీఎం సిద్ధరామయ్య హైకమాండ్ కోర్టులో బంతి వేశారు. హైకమాండ్కు సమస్య కలిగించబోను. రాహుల్గాంధీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పార్టీ కార్యకర్తగానే ఉండేందుకు ఇష్టపడతాను’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో హైకమాండ్ నేతలు ఎవరితోనూ తాను సమావేశం కాలేదని కూడా స్పష్టం చేశారు. సీఎం మార్పుపై ఎలాంటి ఊహాగానాలు లేవని, అల్పాహార విందులు మా మూలు విషయాలేనని కూడా అన్నారు. మైసూరులో సీఎం సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన వర్గీయు లు బీసీ, దళిత (అహింద) సమావేశం జరపబో తున్నారన్న వార్తలను ప్రస్తావించగా, అదంత మంచిది కాదని సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ మార్పి డి వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య పట్టువీడకపోవడం.. హైకమాండ్ కూడా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం.. స్థానికంగానే ఈ సమస్యను పరిష్కరించుకుంటారంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటన వంటి పరిణామాల నేపథ్యంలో శివకుమార్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంత రించుకుంది. దీనితో ఈ అంశంపై తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రం: మంత్రి జమీర్కాగా, సిద్ధరామయ్య సీఎం కుర్చీ భద్రంగా ఉందని కర్ణాటక గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ బుధవారం విలేకరులతో అన్నారు. 2028 వరకు ఆయనే సీఎంగా కొనసాగుతారని పేర్కొన్నారు. ‘హైకమాండ్ తప్ప వేరే ఎవరి వల్లా సీఎం సీటు నుంచి సిద్ధరామయ్యను తొలగించడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు. -
జేఈఈ ప్రశ్నావళి @ ఏఐ
సాక్షి, హైదరాబాద్: జాతీయ పోటీ పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకపాత్ర పోషించబోతోంది. కేంద్ర విద్యాశాఖ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా జేఈఈ మెయిన్స్లో వీలైనంత త్వరగా ఏఐని అందుబాటులోకి తేనున్నారు. కాన్సెప్ట్ క్లారిటీ మాడ్యూల్స్ను రంగంలోకి దించబోతున్నారు. ఐఐటీ ముంబై ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తిచేసింది. సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఐఐటీలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరిగే జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలో కొంతమేర దీన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రయోగంలో ఎదురయ్యే సవాళ్లపై సమీక్షిస్తారు. మార్పులు, చేర్పుల తర్వాత 2027లో పూర్తిస్థాయిలో ఏఐని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. తొలుత జేఈఈ వరకూ పరిమితం చేసి, ఆ తర్వాత నీట్, ఇతర ప్రవేశ పరీక్షలకు ఏఐని అందుబాటులోకి తేవాలనే యోచనలో ఉన్నారు. సెక్యూరిటీ మాడ్యూల్స్పై కసరత్తు జేఈఈ పరీక్షను దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్నారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు ప్రశ్నపత్రం రూపకల్పన మొదలు, మూల్యాంకనం వరకూ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉండాలని ఐఐటీ–బాంబే కేంద్రానికి సూచించింది. ప్రతీ పోటీ పరీక్షకు ప్రత్యేక లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్ అవసరం ఉందని పేర్కొంది. ప్రశ్నపత్రాల తయారీ, ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపింది. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాతోపాటు పలు దేశాల్లో ఏఐ ఆధారిత మాడ్యూల్స్ను ప్రత్యేకంగా రూపొందించారు. సైబర్ నేరాలకు సాధ్యం కాని ఫైర్వాల్స్ రూపొందించినట్లు ముంబై–ఐఐటీ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం జేఈఈ ప్రశ్నపత్రాన్ని దాదాపు పది సెట్లుగా తయారు చేస్తారు. ఇందులో కఠినం, మధ్యస్థం, సాధారణ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో సాఫ్ట్వేర్ ఆధారంగానే పది సెట్ల నుంచి ప్రశ్నలు ఎంపికవుతాయి. ఏఐ టెక్నాలజీతో చాప్టర్స్, సిలబస్ ఆధారంగా డేటాను ఫీడ్ చేస్తారు. వీటిలో ఏఐ మాడ్యూల్స్ అవసరమైన ప్రశ్నలను ఎంపిక చేస్తాయి. తుది కూర్పు తర్వాత ప్రశ్నపత్రం కేంద్రీకృత అధికారి పాస్వర్డ్తోనే పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ అవుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ హాక్ అవ్వడానికి, ప్రశ్నపత్రం లీక్ అయ్యేందుకు ఆస్కారం ఉండదని నిపుణులు అంటున్నారు. ఏఐకి అందించే డేటా కూడా అత్యంత గోప్యంగా ఉండాలని చెబుతున్నారు. సమస్యల పరిష్కారంపై సాధన డేటా ప్రైవసీ, అల్గారిథమ్లో కొన్ని సమస్యలున్నాయని ఐఐటీ–మద్రాస్ నిపుణులు అంటున్నారు. ఫీడ్ చేసే డేటా ఇతర సంస్థలకు వెళ్తే, ఏఐ టూల్ అక్కడా ఉంటే ప్రశ్నలు కొన్ని ముందే తెలిసే వీలుందని భావిస్తున్నారు. సంప్రదాయంగా జరిగే ప్రశ్నపత్రం కూర్పులో మేథ్స్, ఫిజిక్స్లో ట్విస్ట్ చేసే ప్రశ్నల తయారీ కోసం ఏఐకి సరికొత్త మాడ్యూల్స్ అందించాలి. లేకపోతే చాప్టర్ ఆధారంగానే సాధారణ ప్రశ్నావళి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.. అనేక దేశాల డేటా కేంద్రాలకు సమన్వయం అవుతుంది. కాబట్టి ప్రశ్నావళి రూపకల్పనలో ఇతర డేటాను ఏఐ తీసుకుంటే, విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దేశంలోని పోటీ పరీక్షలకు, అందులోనూ ప్రతీ సబ్జెక్టుకు విస్తృతమైన దేశీయ డేటాను డేటా సెంటర్కు ఫీడ్ చేయడం, దాన్ని నిర్వహించడంపై కసరత్తు జరగాలని సూచిస్తున్నారు. కోచింగ్లోనూ ఏఐ దూకుడువాస్తవానికి ఆన్లైన్ కోచింగ్ కేంద్రాలు, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే ఏఐని విరివిగా వాడుతున్నాయి. విద్యార్థి బలాలు, బలహీనతలు,వ్యక్తిగత స్టడీప్లాన్, రోజువారీ ప్రాక్టీస్ ప్రశ్నలు, సందేహాల నివృత్తికి 6.5 లక్షల మంది జేఈఈ రాసే విద్యార్థులు ఏఐ, చాట్బాట్ను వాడుతున్నారు. గత రెండేళ్ల ప్రశ్నల ఆధారంగా ట్రెండ్ అనాలసిస్ను ఏఐ అందిస్తోంది. విద్యార్థి స్థాయికి అనుగుణంగా ప్రశ్నలు తయారు చేస్తూ మాక్ టెస్టులు, అడాప్టివ్ లెర్నింగ్ టెస్టులను ఏఐ ట్యూటర్లు అందిస్తున్నాయి. సమయ పాలన, స్కోర్, ర్యాంకు అంచనాలను ఎప్పటికప్పుడు విశ్లేషించే ఏఐ అనుసంధాన ప్రిపరేషన్ మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏఐ ప్రాక్టరింగ్తో ఫేస్ రికగ్నిషన్, విద్యార్థి ప్రవర్తనను గుర్తించే ఎల్ఎల్ఆర్ఎంలు రెండేళ్లుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీని ఆధారంగా పోటీ పరీక్షల్లో విద్యార్థిస్థాయి, ఆందోళనను ఆన్లైన్లో అందిస్తున్నారు. సలహాలు, సూచనలు ఏఐ నుంచి అందుతున్నాయి. ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫాంతో స్మార్ట్ కోచింగ్ వల్ల గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన కంటెంట్ అందుకుంటున్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నల్లో వేగంగా ఫలితాలు వస్తున్నాయి. -
థాయిలాండ్-కంబోడియాల మధ్య ఉద్రిక్తతలు.. స్పందించిన భారత్
ఢిల్లీ: థాయిలాండ్-కంబోడియా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో విష్ణువు విగ్రహాన్ని కూల్చివేశారనే నివేదికలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నిర్మించిన విష్ణుమూర్తి విగ్రహాన్ని కూల్చివేసినట్లు మాదృష్టికి వచ్చింది. ఇది కొనసాగుతున్న థాయ్లాండ-కంబోడియా సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో ఉంది. ఇటువంటి అగౌరవ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. ఈ ప్రాంతం ఉమ్మడి సాంస్కృతిక, నాగరిక బంధాలను నొక్కి చెబుతూ.. దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా ప్రజలు హిందూ, బౌద్ధ దేవతలను ఎంతో గౌరవిస్తారని, పూజిస్తారని జైస్వాల్ పేర్కొన్నారు. ఇటువంటి చిహ్నాలు, ఈ ప్రాంతం ఉమ్మడి వారసత్వంలో అంతర్భాగమని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు మతపరమైన, సాంస్కృతిక వారసత్వానికి నష్టం తీవ్రతరం చేస్తుందని, ఉద్రిక్తతలను మరింత పెంచుతుందన్నారు. రెండు దేశాలు చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని, ప్రాణనష్టం, ఆస్తినష్టం, వారసత్వ నష్టం జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు. -
బైక్ను ఈడ్చుకెళ్లిన ట్రైన్.. ఐదుగురు దుర్మరణం
లక్నో: ఉత్తరప్రదేశ్ షాహజహాన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం ఒకే బైక్పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని రైలు ఢీకొట్టడ్డంతో మృతులు అక్కడికక్కడే మరణించారు.ప్రమాదంపై రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ప్రమాదం రోసా పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్సలియా రైల్వే క్రాసింగ్ వద్ద సాయంత్రం 6:30 గంటలకు జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న ఐదుగురు ట్రాక్ దాటుతుండగా..బరేలీ నుండి లక్నో వెళ్తున్న సహర్సా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బైక్ రైలులో ఇరుక్కుపోయి సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.మృతులు ఖేరీ జిల్లా ఉచోలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగావాన్ గ్రామానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు.మృతుల్లో ముగ్గురు పెద్దలు,ఇద్దరు పిల్లలు ఉన్నట్లు నిర్ధారించారు. వీరంతా నగరంలోని బుధవారం మార్కెట్ నుండి సరుకులు కొనుగోలు చేసి తిరిగి వస్తున్నారు.జీఆర్పీ ఎస్హెచ్ఓ మదన్పాల్ తెలిపిన ప్రకారం, ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైలు సుమారు అరగంట పాటు అక్కడే నిలిచింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే క్రాసింగ్ వద్ద భద్రతా చర్యలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అండర్పాస్ లేదా ఓవర్బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..
చెన్నై:తమిళనాడు తిరుచారపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు టైర్లు పేలి అదుపు తప్పింది. అవతలి రోడ్డుపై వస్తున్న రెండు కార్లను బస్సు ఢీకొట్టింది. కడలూరు జిల్లా తిట్టకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కార్లలో ప్రయాణిస్తున్న మరో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తిరుచ్చి నుండి చైన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైందని సమాచారం. -
ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్పై నిషేధం
కేంద్ర మైనింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ నిషేధించింది. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాలకు కొత్త మైనింగ్ లీజులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతులివ్వకూడదని పేర్కొంటూ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం మొత్తం అరావళ్లి శ్రేణికి సమానంగా వర్తిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ సదరు ప్రకటనలో పేర్కొంది.అరావళి పర్యతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటిగా భావిస్తారు. ఇవి ఢిల్లీ నుంచి గుజరాత్ వరకూ సూమారు 670 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. ఇవి వాయు కాలుష్యాన్ని తగ్గించంతో పాటు నీటి నిల్వలను కాపాడడంతో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ పర్వతాల్లో జరిగే మైనింగ్ వల్ల జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. తాజాగా.. ఇక్కడి మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నవంబర్ 20 న కీలక తీర్పు ఇచ్చింది. ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్న ప్రాంతంలో భూమట్టానికి 100 మీటర్లు సూమారు 328 అడుగులు ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారని తీర్పు చెప్పింది. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక సిద్దమయ్యే వరకూ అక్కడ ఏలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టవద్దని తెలిపింది. ఈ విషయమై ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆర్డర్ ఇచ్చింది.అయితే సుప్రీం కోర్టు 100 మీటర్ల ఎత్తైన పర్వాతాలనే ఆరావళిగా పరిగణించడాన్ని పర్యావరణ వేత్తలు తప్పుబట్టారు. ఆరావళి పర్వతాల్లో దాదాపు 91శాతం పర్వత శ్రేణులు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ప్రాంతమంతా చట్టపరమైన రక్షణను కోల్పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 100 మీటర్ల నిబంధనపై గుజరాత్లోని ప్రజలు నిరసన తెలిపారు.అయితే తాజా నివేదికలు ఆరావళి పర్వతాలు క్రమంగా కోతకు గురవుతున్నాయని తెలుపుతున్నాయి. వృక్షసంపద దాదాపు మూడింట ఒక వంతు తగ్గిందని.. దశాబ్దం కాలంలోపే మూడువేల కిలోమీటర్లకు పైగా అటవీప్రాంతం కోతకు గురైందని సర్వేలు పేర్కొంటున్నాయి. దీంతో పాటు గిరిజన, ఆదివాసీల జీవనాధారంపైనా ప్రతికూల ప్రభావం పడే పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో.. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం మొదలైంది. ఇటు సోషల్ మీడియాలోనూ సేవ్ ఆరావళి ట్రెండింగ్గా నడిచింది. పరిస్థితులు తీవ్రతరం అయ్యేలా కనిపించడంతో.. అక్కడ నూతన మైనింగ్ను రద్దు చేస్తూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. -
రాహుల్నే కాదు.. ప్రధానిని కూడా కలుస్తా
ఉన్నావ్ కేసు రాజకీయ మలుపు తీసుకుంటోంది. నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్కు బెయిల్ రావడంపై అభ్యంతరాలతో బాధితురాలు, ఆమె తల్లి న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అయితే.. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వాళ్లను మీడియాతో మాట్లాడనీయకుండా.. బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. ఆ తల్లీకూతుళ్లు బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. జర్మనీ పర్యటన ముగించుకుని నిన్ననే వచ్చిన రాహుల్.. ఈ కేసు పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు బెయిల్.. బాధితులను నేరస్తుల్లా చూస్తారా?.. ఇదెక్కడి న్యాయం??. భారతదేశం కేవలం మృత ఆర్థిక వ్యవస్థగా(డెడ్ ఎకానమీ) మాత్రమే కాకుండా.. మృత సమాజంగా(డెడ్ సొసైటీ) కూడా మారుతోందని అంటూ ఇండియన్ గేట్ పరిణామంపై ఓ ట్వీట్ చేశారు. क्या एक गैंगरेप पीड़िता के साथ ऐसा व्यवहार उचित है?क्या उसकी “गलती” ये है कि वो न्याय के लिए अपनी आवाज़ उठाने की हिम्मत कर रही है?उसके अपराधी (पूर्व BJP MLA) को ज़मानत मिलना बेहद निराशाजनक और शर्मनाक है - खासकर तब, जब पीड़िता को बार-बार प्रताड़ित किया जा रहा हो, और वो डर के… https://t.co/BZqrVNXMOy— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2025బుధవారం సాయంత్రం జన్పథ్లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన బాధితురాలు, ఆమె తల్లి.. రాహుల్ గాంధీని కలిసి ఉన్నావ్ కేసు పురోగతిని.. తమకు ప్రాణహాని పొంచి ఉన్న విషయాన్ని తెలియజేయడమే కాకుండా పారామిలిటరీ సిబ్బంది తమతో ఎంత దురుసుగా ప్రవర్తించింది కూడా వివరించినట్లు తెలుస్తోంది. కుటుంబం కోసమే తానింకా బతికి ఉన్నానని.. తన పోరాటం ఆగదని బాధితురాలు రాహుల్కి చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. ప్రతిపక్ష నేతనే కాదు.. ప్రధానిని కూడా కలిసే ప్రయత్నం చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపింది. ‘‘ప్రధాని, కేంద్ర హోం మంత్రి, రాష్ట్రపతిని కూడా కలవాలని ఉంది. వాళ్లను కలిసి మేం ఎదుర్కొంటున్న పరిస్థితులను చెప్పాలనుకుంటున్నాం. మాకు కావాల్సింది న్యాయం.. అంతే’’ అని చెప్పిందామె. కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘ఈ తీర్పుతో దేశంలోని అడబిడ్డలు తమ మానప్రాణాల కోసం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నేరానికి పాల్పడిన వ్యక్తిని మా ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని కోర్టు ఆదేశించింది. అంటే.. మేం ఇంటిలోనే బంధీగా ఉండాలని కోర్టు ఉద్దేశమా?’’ అని ఆందోళన వ్యక్తం చేసిందామె. అయితే తమ ఆశలు చావలేదని.. సుప్రీం కోర్టులో న్యాయం దక్కుతుందనే ఆశ నెలకొందని బాధితురాలు అంటోంది. ఇదిలా ఉంటే.. సెంగర్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో బాధితురాలు ఓ పిటిషన్ వేసింది.2017లో ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆనాడ.. మైనర్ బాలికపై అత్యాచారం జరిపిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్, ఆపై ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఈ ఘటనతో పార్టీ అంతేకాదు.. ఈ కేసు వెలుగులోకి వచ్చాక ఆమె తండ్రి హత్యకు గురికావడంతో పాటు బాధితురాలిపైనా హత్యాయత్నం జరిగాయి. అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడగా ఇద్దరు బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. సీబీఐ దర్యాప్తు అనంతరం.. ఈ అభియోగాలన్నింటిని నిజాలుగా నిర్ధారించుకున్న ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్లో సెంగర్కి జీవితఖైదు విధించింది. ఆ సమయంలో పార్టీ ఆయన్ని బహిష్కరించింది. అయితే ఈ శిక్షను సెంగర్ సవాల్ చేయగా.. మంగళవారం(డిసెంబర్ 23, 2025) ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. దీంతో నిందితుడు బయటకు వస్తే తమకు ప్రాణహాని తప్పదని ఆ తల్లీకూతుళ్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరుగుతుండడం.. సెంగార్ వర్గ ఓట్లను ఆకర్షించేందుకే కుల్దీప్ను బయటకు తెచ్చారనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మంత్రి వ్యాఖ్యల దుమారంఉన్నావ్ బాధిత కుటుంబం నిరసన తెలపకుండా ఢిల్లీ ఇండియన్ గేట్ వద్ద పారామిలిటరీ సిబ్బంది అడ్డుకోవడంపై ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు వెటకారంగా స్పందించారు. ‘‘ఆమెది ఉన్నావ్ కదా.. ఢిల్లీలో ఏం పని?’’ అంటూ యూపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ బిగ్గరగా నవ్వారు. ఈ వీడియో నెట్టింటకు చేరడంతో జనం ఆయన్ని తిట్టిపోస్తున్నారు. -
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘హరియాణా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సవరణ) బిల్లు, 2025’కు ఆమోదం లభించింది. 1958 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రోజువారీ పని గంటలను పెంచడంతో పాటు పలు సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.బిల్లులోని ముఖ్యాంశాలుప్రస్తుతమున్న 9 గంటల పని పరిమితిని 10 గంటలకు పెంచారు. ఇందులో విశ్రాంతి సమయం కూడా కలిసి ఉంటుంది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.త్రైమాసికానికి ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. వ్యాపార గరిష్ట డిమాండ్ సమయాల్లో సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.విరామం లేకుండా చేసే నిరంతర పని సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు.20 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వ్యాపార సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది.వ్యాపార సౌలభ్యమా? బానిసత్వమా?ఈ బిల్లుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘చిన్న సంస్థలపై భారాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 10 గంటల పని విధానం ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సుర్జేవాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రోజుకు 10 గంటలు, దానికి తోడు 2 గంటల ఓవర్ టైమ్ కలిపితే ఒక కార్మికుడు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. ఇలా అయితే ఒక కార్మికుడు తన కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: మీ స్మార్ట్వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా? -
వాయు కాలుష్యం.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో ఇన్ని రోజుల పాటు విధించిన కఠిన నిబంధనలను(GRAP-4) ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వాయు నాణ్యత కొంత మెరుగుపడిన నేపథ్యంలో నిబంధనలు ఎత్తి వేస్తున్నామని.. పరిస్థితులు పునరావృతం అయితే మళ్లీ విధించక తప్పదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.ఢిల్లీలో గత కొద్ది రోజులుగా వాయకాలుష్యం తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నెల 13 త తేదీన వాయునాణ్యత తీవ్ర ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 దాటడంతో గ్రాఫ్-4 కింద కఠిన ఆంక్షలను ప్రభుత్వం విధించింది. నర్సరీ నుండి ఐదవతరగతి వరకూ పాఠశాలలను మూసివేసింది. ఆపైతరగతులకు హైబ్రీడ్ మోడ్ ( ఆన్లైన్లో) క్లాసులు నిర్వహించాలని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి అని తెలిపింది.అయితే బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 271గా నమోదవడంతో కఠిన ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సాధారణ ఆంక్లలు కొనసాగనున్నట్లు ప్రకటించింది. కాగా ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని అరికట్టేలా తగిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఇది వరకే పలుమార్లు హెచ్చరించింది. కాలుష్యాన్ని నియంత్రించేలా తగిన ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. -
డాక్టర్ తంగరాజ్కు విజ్ఞానశ్రీ పురస్కారం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డాక్టర్. కె తంగరాజ్ విజ్ఞాన శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నత సేవలు అందించినందుకు గానూ కేంద్రం ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. మానవ జన్యుశాస్త్రంతో పాటు తదితర అంశాలపై డా.తంగరాజ్ విశేష పరిశోధనలు జరిపారు.డాక్టర్. తంగరాజ్ ప్రస్తుతం హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింటింగ్- అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ విభాగం డైరెక్టర్గా ఉన్నారు. ఈయన భారత జనాభాలోని జన్యు వైవిధ్యం అనే అంశంపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. వాటితో పాటు భారత ఉపఖండానికి సంబంధించిన పూర్వీకుల మూలాలు, వలసలు గురించి శాస్త్రీయంగా సమాకూర్చారు.అండమాన్ గిరిజన తెగలపై ఈయన చేసిన అధ్యయనాలు మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. వీటితో పాటు డాక్టర్ తంగరాజ్ దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే జన్యు వ్యాధులు గురించి పరిశోధనలు జరిపి వాటి నిర్ధారణ పద్ధతులు తదితర అంశాలపై కృషిచేశారు. దీంతో ఈయన సేవలకు మెచ్చిన కేంద్రప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ విజ్ఞాన శ్రీ పురస్కారానికి ఈయనను ఎంపిక చేసింది.విజ్ఞాన్ శ్రీ పురస్కారంవిజ్ఞాన్ శ్రీ పురస్కారాన్ని కేంద్రప్రభుత్వం 2024లో ప్రవేశ పెట్టింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచేవారి గౌరవార్థం ఈ వార్డును అందజేస్తారు. దీనిని నాలుగు విభాగాలుగా అందజేస్తారు.విజ్ఞాన రత్న- అత్యున్నత గౌరవం జీవిత కాల కృషికి విజ్ఞాన్ శ్రీ- మధ్యస్థాయి శాస్త్రవేత్తలకు విజ్ఞాన్ యువ- యువ శాస్త్రవేత్తలకు విజ్ఞాన్ బృందం- శాస్త్రవేత్తల బృందానికి ఇలా నాలుగు విభాగాలలో ఈ అవార్డుని అందజేస్తారు. ఈ పురస్కార ప్రధానం రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. గతంలో ఈ అవార్డును శాంతిస్వరూప్ భట్నాగర్ పేరుతో ప్రధానం చేసేవారు. -
ఇండిగో సంక్షోభం : మరో రెండు ఎయిర్లైన్స్కు గ్రీన్ సిగ్నల్
ఇండిగో సంక్షోభం సృష్టించిన గందరగోళం మధ్య కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దు, ప్రయాణీకుల ఇక్కట్లు, విమానయాన రంగంలో ఉన్న డిమాండ్ను తీర్చే లక్ష్యంతో రెండు విమానయాన సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్ప్రెస్ అనే మరో రెండు కొత్త విమానయాన దరఖాస్తుదారులకు కేంద్రం నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు (ఎన్ఓసి) మంజూరు చేసింది. దీంతో అనుమతుల లభించిన ఎయిర్లైన్స్ సంఖ్య మూడుకు చేరింది. పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. గత వారం రోజులుగా, భారత ఆకాశంలో పరుగులు తీయాలని ఆకాంక్షిస్తున్న కొత్త విమానయాన సంస్థలు శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్ ఫ్లైఎక్స్ప్రెస్ - బృందాలను కలవడం సంతోషంగా ఉందంటూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. గత వారంలో విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మూడు విమానయాన సంస్థల బృందాలతో చర్చలు జరిపిందని పేర్కొన్నారు. ఇప్పటికే శంఖ్ ఎయిర్కు ముందుగా ఎన్ఓసి లభించగా, అల్ హింద్ ఎయిర్ , ఫ్లైఎక్స్ప్రెస్ సంస్థలకు ఈ వారం క్లియర్ అయ్యాయి.Over the last one week, pleased to have met teams from new airlines aspiring to take wings in Indian skies—Shankh Air, Al Hind Air and FlyExpress. While Shankh Air has already got the NOC from Ministry, Al Hind Air and FlyExpress have received their NOCs in this week. It has… pic.twitter.com/oLWXqBfSFU— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) December 23, 2025భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో, టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా గ్రూప్ అనే రెండు ప్రధాన ఎయిర్లైన్స్ 90శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఈ అనుమతులు ప్రాధాన్యతనుసంతరించుకున్నాయి.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
దారి కాచి మరీ భువనేశ్వరిని కాల్చి చంపిన భర్త
నీతో కలిసి జీవించలేను విడాకులు ఇవ్వమని నోటీసులిచ్చిన భార్యను అత్యంత దారుణంగా కాల్చి చంపాడో భర్త. వైవాహిక విభేదాలతో ఆమె భర్తను విడాకులు అడిగింది. అదే ఆమె చేసిన నేరం. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.బాధితురాలిని భువనేశ్వరి (39)గా గుర్తించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వర నగర్ బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. ఈమె భర్త, నిందితుడు బాలమురుగన్ (40) ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక పనిచేసేవాడు. వీళ్లిద్దరూ తమిళనాడులోని సేలం జిల్లాకు చెందినవారు. వీరికి 2011లో వివాహమైంది. 2018లో బెంగళూరుకు మకాం మార్చారు. వీరికిద్దరు సంతానం. అయితే గత నాలుగేళ్లుగా బాలమురుగన్కు ఉద్యోగం లేదు. నెమ్మదిగా తగాదాలు మొదలయ్యాయి. దీంతో భార్యపై అనుమానం మొదలైంది. భువనేశ్వరి చట్టబద్ధంగా విడిపోవాలని కోరింది, దానిని బాల మురుగన్ వ్యతిరేకించాడు దీంతో వేరే బ్రాంచ్కు ఉద్యోగాన్ని బదిలీ చేయించుకున్న భువనేశ్వరి గత ఏడాదికాలంగా 12 ఏళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురితో కలిసి రాజాజీ నగర్లో వేరుగా నివాసముంటోంది. బాలమురుగన్ కేపీ అగ్రహారలో ఒంటరిగా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం భువనేశ్వరి బాలమురుగన్కు విడాకుల నోటీసు పంపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్అటు ఉద్యోగం లేదు, ఇటు భార్యతో గొడవలు, అనుమానం, విడాకుల నోటీసులు దీంతో భార్యపై ఆగ్రహం పెంచుకున్న బాలమురుగన్ ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నారు. భార్య కదలికలను పసిగట్టి, సరిగ్గా ఆమె ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయంలో కాపుగాసి ఆమెను అడ్డుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో, రాజాజీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 1వ ప్రధాన రోడ్డులో చాలా సమీపంనుంచి ఆమెపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పిస్టల్తో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.హొయసల పెట్రోల్ సిబ్బంది గాయపడిన భువనేశ్వరిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అప్పటికేఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా వినిపించిన కాల్పులను భయాందోళనలు రేకెత్తించాయి. జనం పరుగులు తీశారు. రెండు బుల్లెట్లు భువనేశ్వరి తలపై దూసుకుపోగా, మిగిలిన రెండు బుల్లెట్లు ఆమె చేతికి తగిలాయి. నిందితుడు తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడని, ఇదే గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, అతనికి ఆయుధం ఎలా వచ్చింది, దానికి లైసెన్స్ ఉందా? తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఉన్నావ్ బాధితుల్ని ఈడ్చిపడేశారు!
దేశరాజధానిలో జరిగిన మంగళవారం రాత్రి జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎనిమిదేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ లైంగికదాడి కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది తెలిసిందే. ఈ కేసు నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేసిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనిని నిరసిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగగా.. భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపడేశారు. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడికి బెయిల్ దక్కడంపై నిరసనగా బాధితురాలు, ఆమె తల్లి ఇండియా గేట్ వద్ద నిరసన చేపట్టబోయారు. ఆ సమయంలో యోగితా భయానా అనే యాక్టివిస్ట్ వాళ్లతో పాటు ఉన్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడమంటే తమ ప్రాణాలకు గ్యారెంటీ లేదంటూ ఆ తల్లీకూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది వాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేసి అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లి బస్సు నుంచి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. తొలుత ఇండియా గేట్ వద్ద, ఆ తర్వాత మండీహౌజ్ వద్ద బాధితుల్ని సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వాళ్లను బలవంతంగా తమ వాహనాల్లో తరలించారు. ఆ రెండు చోట్లా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి లేదని అధికారుల తెలిపారు. JUSTICE DETAINEDRapist's Sentence SuspendedUnnao rape victim dragged into police van by @AmitShah's Delhi Police, protesting against suspension of sentence of former @BJP4India MLA RAPIST-MURDERER Kuldeep Singh Sengar#KuldeepSinghSengar#StockMarketIndia #PlaneCrash pic.twitter.com/vYApILE9kN— Taj INDIA (@taj_india007) December 24, 20252017లో వెలుగు చూసిన ఉన్నావ్ కేసులో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి (Unnao rape case) పాల్పడడంతో పాటు ఆమెను అమ్మేసే ప్రయత్నం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు.. బాధితురాలి తండ్రి మరణానికి కూడా కారణమయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో.. ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ 16న 2019 దోషిగా తేల్చి.. డిసెంబర్ 20న జీవిత ఖైదు విధించింది. అయితే.. సెంగర్కు శిక్ష పడక ముందే.. ఎన్నో పరిణామాలు జరిగాయి. అదే ఏడాది కేసు సీబీఐ విచారణ జరుగుతుండగానే.. బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి బాధితురాలు బయటపడగా.. ఆమె ఇద్దరు బంధువులు మరణించారు. జీవిత ఖైదు పడడంతో 2020 నుంచి సెంగర్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేసి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2027 అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే కుల్దీప్కు బెయిల్ దక్కిందని రాజకీయ ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు.. తర్వాత పోయేది తన ప్రాణమేనంటూ బాధితురాలు, ఆమె తల్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాకు న్యాయం జరగలేదు. నా కుమార్తెను బంధించారు. మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. అధికారులు (సీఆర్పీఎఫ్)సిబ్బంది బాధితురాలిని బలవంతంగా తీసుకెళ్లి, తాను రోడ్డుపై పడేశారు.సెంగర్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బాధిత కుటుంబానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అతను సంచరించకూడదని.. వాళ్లను బెదరించే ప్రయత్నం చేసినా బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరించింది. అయినప్పటికీ.. నిందితుడికి బెయిల్ రావడంపై అభ్యంతరాలతో నెట్టింట చర్చ నడుస్తోంది. ఉన్నావ్ కేసు టైమ్లైన్జూన్ 4, 2017 – 17 ఏళ్ల బాలిక ఉన్నావ్ జిల్లా, మఖి గ్రామంలో కనిపించకుండా పోయింది. ఆమెను కుల్దీప్ సింగ్ సేంగర్, అతని సోదరుడు అటుల్ సింగ్ ఇతరులు అత్యాచారం చేశారు.జూన్ 21, 2017 – బాధితురాలు ఔరయ్యలో ప్రత్యక్షమైంది.. పోలీసులు ఆమెను రక్షించారుజూన్ 22, 2017 – పోలీసులు IPC సెక్షన్లు 363, 366 కింద కేసు నమోదు చేశారు.ఏప్రిల్ 3, 2018 – బాధితురాలి తండ్రిని సేంగర్ సోదరుడు అటుల్ మరియు అనుచరులు కొట్టి, తర్వాత జైలులో మరణించాడు.ఏప్రిల్ 8, 2018 – బాధితురాలు లక్నోలో CM యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. దీని తర్వాత కేసు దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.ఏప్రిల్ 2018 – CBI దర్యాప్తు ప్రారంభమైంది.జూలై 2019 – బాధితురాలు, ఆమె కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బంధువులు మరణించారు.డిసెంబర్ 16, 2019 – ఢిల్లీ కోర్టు సేంగర్ను అత్యాచారంలో దోషిగా తేల్చింది.డిసెంబర్ 20, 2019 – సేంగర్కు జీవితఖైదు శిక్ష విధించారు.2020–2024 – సేంగర్ జైలులో శిక్ష అనుభవించాడుడిసెంబర్ 23, 2025 – ఢిల్లీ హైకోర్టు సేంగర్ జీవితఖైదు శిక్షను కొట్టేసి.. కండిషన్ బెయిల్ ఇచ్చింది -
మమ్మల్ని జైలులో పెట్టండి: బాధితుల మొర
దయచేసి మమ్మల్ని జైలులో పెట్టండి అని వేడుకంటున్నారు బాధితులు. అదేంటి తప్పు చేసిన వారిని కదా కారాగారంలో పెడతారు? బాధితులు ఎందుకు జైలుకెళతామంటున్నారు? తమను జైలులో ఉంచమని వేడుకుంటున్నది ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు. కనీసం తమకు అక్కడైనా రక్షణ ఉంటుందన్న భావనతో వారు ఈ విధంగా అభ్యర్థిస్తున్నారు. 2017 నాటి ఉన్నావ్ లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత ఉత్తరప్రదేశ్ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్కు (Kuldeep Singh Sengar) ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బెయిల్ రద్దు చేయాలని కోరింది.సెంగార్ జైలు నుంచి బయటకు వస్తే తమకు ప్రాణహాని తప్పదని బాధితురాలి సోదరి భయాందోళన చెందారు. అతడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తన సోదరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. ''నా తండ్రిని హత్య చేశారు, నాపై లైంగికి దాడికి పాల్పడ్డారు. అలాంటి దుర్మార్గుడికి బెయిల్ మంజూరు చేస్తారా, ఇదెక్కడి న్యాయం'' అంటూ బాధితురాలు వాపోయినట్టు వెల్లడించారు. తమ కుటుంబానికి ఇప్పటికీ ముప్పు పొంచివుందన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తమ కుటుంబ సభ్యులపై జరిగిన దాడులను గుర్తుచేసుకున్నారు. సెంగార్ విడుదలైన తర్వాత మరింత హాని జరుగుతుందని తామంతా భయపడుతున్నామని చెప్పారు.ఏం చేస్తారో ఎవరికి తెలుసు?''సెంగార్ విషయంలో కోర్టు నిర్ణయం మాకు తీవ్ర నిరాశ కలిగించింది. అతడు ముందు నా మామను, ఆ తర్వాత నా తండ్రిని చంపాడు. ఆ తర్వాత నా సోదరి విషయంలో ఈ సంఘటన జరిగింది. అతడి నుంచి ఇంకా మాకు ప్రమాదం పొంచివుంది. అతడు జైలు నుంచి బయటకు వస్తే నన్ను, నా కుటుంబం మొత్తాన్ని పొట్టన పెట్టుకుంటాడు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సెంగార్కు సంబంధించిన వ్యక్తులు ఇప్పటికీ మా చుట్టూ తిరుగుతూ బెదిరిస్తున్నారు. వాళ్లు మా తమ్ముడిని ఏం చేస్తారో ఎవరికి తెలుసు? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం. సెంగార్ జైలు నుంచి విడుదలైన మరుక్షణమే మమ్మల్ని జైల్లో పెట్టండి. కనీసం అక్కడైనా మా ప్రాణాలకు భద్రత ఉంటుంద''ని బాధితురాలి సోదరి ఆవేదన చెందారు.మాకు అన్యాయం జరిగిందిఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత బాధితురాలు తన తల్లి, మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానాతో కలిసి ఇండియా గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కోర్టు నిర్ణయంతో అభద్రతా భావానికి లోనయ్యానని బాధితురాలు పేర్కొన్నారు. వ్యవస్థ తనను మోసం చేసిందని వాపోయారు. ''మాకు అన్యాయం జరిగింది. యూపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున అతడిని బెయిల్పై విడుదల చేస్తున్నారు. అతడి భార్య ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇలాంటి నిందితుడు బయటకు వస్తే మాకు రక్షణ ఎక్కడది? భయపడుతూ బతుకుతున్నాం. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామనుకుంటే మా వాళ్లు గుర్తుకు వస్తున్నారు. మమ్మల్ని ఇంత క్షోభకు గురిచేసిన సెంగార్ బెయిల్ రద్దు చేయాలి. న్యాయవ్యవస్థపై మాకు ఇంకా నమ్మకం ఉంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామ''ని తెలిపారు. చదవండి: ఆ కార్ల ఖరీదు 7 కోట్లు.. డెకరేషన్కు 5 కోట్లు! -
ఓడిపోయా,ఇక డబ్బులు వేస్ట్.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బాగాచదివి, మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలని ప్రతీ అమ్మాయి, లేదా అబ్బాయి కలగంటారు. ఎంతో పట్టుదలగా తమ కలను సాకారం చేసుకుంటారు. కానీ ఒక టీనేజ్ అబ్బాయి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. చదువులో రాణించలేకపోతున్నా మీ డబ్బులు దండుగ అంటూ ఏ తల్లిదండ్రీ భరించలేని పనిచేశాడు.గ్రేటర్ నోయిడాలోని హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు భిహార్కు చెందిన ఆకాష్ దీప్. ఢిల్లీ టెక్నికల్ క్యాంపస్ (DTC)లో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) మొదటి సంవత్సరం చదువుతున్న అతను మంగళవారం సాయంత్రం ఆకాష్ దీప్ తన గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు ఇకపై డబ్బు వృధా చేయకూడదనే కారణంతోనే ఈ పని చేసినట్లు ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. బయటకు వెళ్లి, తిరిగి వచ్చిన రూమ్మేట్ ఆకాష్ దీప్ ఉరి వేసుకోవడాన్ని గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాడు. కానీ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఆకాష్ దీప్ ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.సూసైడ్ నోట్లో ఏం ఉంది?క్షమించండి, అమ్మా నాన్న, మీ కొడుకు బలహీనుడు. నా మరణానికి నేనే బాధ్యుడిని. దయచేసి నా మరణం గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. అమ్మా, ఇంటర్లో ఒక ఏడాది వృధా చేశా..రినాలుగేళ్లు బీటెక్ చదివి, డబ్బు వృధా చేయాలనుకోవడం లేదు. తప్పుడు ఆశలు కలిగించడం ఇష్టంలేదు. అందుకే ఇక్కడితో ముగించేస్తున్నా..క్షమించండి." అని రాసుకొచ్చాడు. చదువుల ఒత్తిడి కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అరవింద్ కుమార్ చహల్ తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
ఇస్రో అద్భుతం: అంతరిక్షం నుంచే నేరుగా 5జీ!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ఈరోజు (2025, డిసెంబర్ 24) ప్రయోగించిన ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ ఉపగ్రహం టెలికాం రంగంలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. సాధారణంగా మనం వాడే ఇంటర్నెట్ కోసం ప్రత్యేకమైన డిష్లు లేదా శాటిలైట్ ఫోన్లు అవసరమవుతాయి. కానీ, ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ సాంకేతికతతో ఎటువంటి అదనపు పరికరాలు లేకుండానే మన సాధారణ 4జీ/5జీ స్మార్ట్ఫోన్లకు నేరుగా బ్రాడ్బ్యాండ్ సిగ్నల్స్ అందుతాయి. ఇది మొబైల్ కనెక్టివిటీలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురానుంది. మారుమూల ప్రాంతాలకు డిజిటల్ వెలుగులుభారతదేశంలోని పలు గ్రామీణ, అటవీ, కొండ ప్రాంతాల్లో ఇప్పటికీ మొబైల్ టవర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లూబర్డ్ బ్లాక్-2 ఈ ‘డిజిటల్ డివైడ్’ను శాశ్వతంగా పరిష్కరించనుంది. భౌగోళిక అడ్డంకులు ఏమి ఉన్నా, అంతరిక్షం నుండి వచ్చే సిగ్నల్స్ ప్రతి మారుమూల గ్రామానికి చేరువవుతాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ విద్య, రోగులకు టెలిమెడిసిన్, రైతులకు ఈ-గవర్నెన్స్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి.విపత్తు సమయాల్లో..ఎక్కడైనా వరదలు, భూకంపాలు లేదా తుఫానులు సంభవించినప్పుడు భూమిపై ఉండే మొబైల్ టవర్లు కూలిపోవడం చూస్తుంటాం. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, రెస్క్యూ ఆపరేషన్లు అసాధ్యమవుతుంటాయి. అయితే ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ అటువంటి సమయాల్లో ఆపద్బాంధవునిలా పనిచేస్తుంది. భూ నెట్వర్క్లతో సంబంధం లేకుండా నేరుగా ఉపగ్రహం నుండి సిగ్నల్స్ను అందిస్తుంది. తద్వారా సహాయక చర్యలు వేగవంతం అవుతాయి. బాధితుల ప్రాణాలను కాపాడటానికి అవకాశం మొరుగుపడుతుంది.‘నో సిగ్నల్ లాస్’..మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా అడవుల గుండా వెళ్తున్నప్పుడు తరచుగా కాల్ డ్రాప్స్ లేదా డేటా సిగ్నల్ కోల్పోతుంటాం. అయితే ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ ప్రవేశపెడుతున్న ‘నో సిగ్నల్ లాస్’ ఫీచర్ దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా, ఏ వాతావరణ పరిస్థితుల్లో ఉన్నా స్థిరమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుతుంది. ఫలితంగా డెడ్ జోన్లు అనే మాటే ఉండదు. నిరంతరాయంగా డేటా ప్రసారం అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.గ్లోబల్ స్పేస్ మార్కెట్లో.. ఈ మిషన్ అంతరిక్ష రంగంలో భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతుంది. బ్లూబర్డ్ ఉపగ్రహాలను ఇస్రో తన బాహుబలి రాకెట్ LVM3 ద్వారా ప్రయోగించడం ద్వారా, అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగనుంది. ఇది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) వంటి సంస్థలకు మరిన్ని విదేశీ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి దోహదపడుతుంది.భవిష్యత్ డిజిటల్ విప్లవానికి పునాదిబ్లూబర్డ్ బ్లాక్-2 ప్రయోగం రాబోయే రోజుల్లో 'కనెక్టెడ్ వరల్డ్' కలలను నిజం చేయనుంది. ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక విప్లవం. ప్రపంచ డిజిటల్ మ్యాప్లో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలపనుంది. అలాగే దేశంలోని సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది.ఇది కూడా చదవండి: నింగిలోకి ఎల్వీఎం3- ఎం6 -
ఆరావళి: కొండల్ని తవ్వితే వాళ్లకు చేటు కాదా?
ప్రపంచంలోనే పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులపై వివాదం రాజుకుంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆరావళి పర్వత శ్రేణులకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవి వాయవ్య భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో దాదాపు 700 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల్లోని అత్యధిక ఎత్తు 1,722 మీటర్లు. ఇవి ముడత పర్వతాలు. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నప్పుడు, వాటి మధ్య ఉన్న భూభాగంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల ఆ భూభాగం పైకి లేచి ముడతలు పడుతుంది. ఆరావళి పర్వత శ్రేణులు ఇలాగే ఏర్పడ్డాయి.రాజస్థాన్లోని మౌంట్ అబూ సమీపంలో 5,650 అడుగుల ఎత్తులో ఉండే గురుశిఖర్ ఆరావళి పర్వత శ్రేణులలోనిదే. రాజస్థాన్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు నియంత్రణలో ఉండేందుకు, జల భద్రతకు ఈ పర్వతాలు అత్యంత కీలకమైనవి. ఇవి రాజస్థాన్లోని థార్ ఎడారి వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని నేలలో భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం కనీసం అప్పుడప్పుడు అయినా తగ్గుతోందంటే అందుకు కారణం ఆరావళి పర్వతాలే. ఈ శ్రేణులు, కేవలం రాళ్లతో నిండిన గుట్టలు మాత్రమే కావు. అవి ఉత్తర భారత దేశపు పర్యావరణ వ్యవస్థకు ఊపిరితిత్తుల వంటివి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశంలోని సారవంతమైన భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అయితే, గడచిన కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విచ్చలవిడి మైనింగ్ , ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు ఈ పర్వతాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, ఈ పర్వత శ్రేణులలో దాగి ఉన్న విలువైన ఖనిజ సంపద ఇప్పుడు వాటి పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ‘సేవ్ ఆరావళి’ అనే నినాదం మార్మోగుతోంది.अरावली सिर्फ़ पहाड़ नहीं, राजस्थान की सांस है। हज़ारों सालों से ये पर्वतमाला हमारी ज़मीन, पानी और जीवन की रक्षा करती आ रही है। इसे बचाना मतलब आने वाली पीढ़ियों को बचाना। #SaveAravalli pic.twitter.com/Yf0RAdPzW5— Tribal Army (@TribalArmy) December 19, 2025సుప్రీంకోర్టు ఏం చెప్పింది?ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణ, మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది నవంబరు 20న కీలక తీర్పు ఇచ్చింది. ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్వచనాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. దీని ప్రకారం, ఆరావళి పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు (328 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఒకటికిపైగా ఆరావళి పర్వతాలు, పక్కపక్కనే సగటున 500 మీటర్ల దూరంలో ఉంటే వాటి మధ్యనున్న భూమిని కూడా ఆరావళి పర్వతశ్రేణిగానే పరిగణిస్తారు. ఈ పర్వతశ్రేణుల పరిధిలో పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మైనింగ్ను సుప్రీం కోర్టు పూర్తిగా నిషేధించింది. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక (ఎంపీఎస్ఎం) సిద్ధమయ్యే వరకు ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ అటవీ పరిశోధన, విద్యా మండలి (ఐసీఎఫ్ఆర్ఈ) ద్వారా మొత్తం ఆరావళి శ్రేణికి సంబంధించి ఒక సమగ్ర సుస్థిర మైనింగ్ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆర్డర్ ఇచ్చింది. ఆరావళి శ్రేణులు థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకునే సహజ రక్షణ కవచమని, భూగర్భ జలాల రీఛార్జ్, వాతావరణ సమతుల్యతకు ఇవి అత్యంత అవసరమని కోర్టు నొక్కి చెప్పింది.కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదేంటి? ఆరావళి పర్వత శ్రేణుల భౌగోళిక స్వరూపంపై స్పష్టత కోసమే, వాటికి ఒక నిర్దిష్ట నిర్వచనాన్ని ఇచ్చాం. ఆ పర్వతాల్లో అక్రమ మైనింగ్ జరగకుండా నిలువరించడానికే ఈ చర్యను చేపట్టాం. ఆరావళి పర్వతాలను రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ పర్వత శ్రేణుల్లో క్షీణించిన ప్రాంతాలను పునరుద్ధరించడానికి మేం ఇప్పటికే 'గ్రీన్ ఆరావళి వాల్' ప్రాజెక్టును మొదలుపెట్టాం. సుప్రీంకోర్టు ఇటీవలే ఆమోదించిన నిర్వచనం ప్రకారం ముందుకు సాగుతాం. 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఆరావళి పర్వత శ్రేణులను రక్షిస్తాం. ఆరావళి పర్వత ప్రాంతాల్లో 0.19 శాతం మాత్రమే మైనింగ్కు అనుమతి ఉంటుంది. వాటిలో కొత్త గనులకు మేం అనుమతులు ఇవ్వలేదు. దాదాపు 90 శాతం ఆరావళి పర్వత శ్రేణులకు రక్షణ కొనసాగుతోంది. ఈవిషయంలో ఎలాంటి సడలింపును మేం ఇవ్వలేదు. దీనిపై కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు'' అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టత ఇచ్చారు. जब अरावली बचेगी ..तभी जल, जंगल और जीवन बचेगा !!⛰️#SaveAravalli pic.twitter.com/BYG2bM0IdP— Ronak Choudhary (@Ronak_choudhry) December 19, 2025పర్యావరణవేత్తల ఆందోళన.. ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనంలోని 100 మీటర్ల ఎత్తు నిబంధనపై పలువురు పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరావళి శ్రేణులలోని దాదాపు 91 శాతం పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ కొత్త నిబంధన వల్ల దాదాపు 91 శాతం ఆరావళి పర్వత శ్రేణులు చట్టపరమైన రక్షణను కోల్పోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎత్తులు, కొలతల ప్రాతిపదికన పర్వత శ్రేణుల లాంటి భారీ పర్యావరణ వ్యవస్థలను నిర్వచించలేమని పర్యావరణవేత్తలు అంటున్నారు. కొండలు, అడవులు, పరీవాహక ప్రాంతాలు అనేవి ఒకదానితో ఒకటి పరస్పరం అనుసంధానితమై ఉంటాయని, వాటిని వేరుచేసి చూడలేమని గుర్తు చేస్తున్నారు. అన్ని ఎత్తుల ఆరావళి పర్వతశ్రేణులతో పాటు వాటి పరిసర ప్రాంతాలను రక్షిత జోన్లుగా పరిగణించాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. 100 మీటర్ల ఎత్తు నిబంధన మైనింగ్, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల నిర్మాణ కంపెనీలకు వెసులుబాటును కల్పించేలా ఉందని ఆరోపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల ఇప్పటికే ఆరావళి పర్వత శ్రేణులు దెబ్బతిన్నాయని అంటున్నారు.గుజరాత్లో నిరసనలుప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని సబర్కాంత జిల్లాలోనూ ఆరావళి పర్వత శ్రేణులు ఉన్నాయి. 100 మీటర్ల ఎత్తు నిబంధనపై ఈ జిల్లాలోని విజయనగర్లో ఉన్న దద్వావ్ ఏరియా ప్రజలు మండిపడ్డారు. పెద్దసంఖ్యలో స్థానికులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. తమ ప్రాణాలను త్యాగం చేసైనా ఆరావళిని కాపాడుకుంటామని వారు ప్రకటించారు. తమ సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వారసత్వంలో కీలక భాగమైన ఆరావళి పర్వత శ్రేణులను పరిరక్షించుకుంటామని తేల్చి చెప్పారు. సబర్కాంత జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భావి తరాలు ఆరావళి శ్రేణులను పోస్టర్లలో చూసుకోవాల్సిన పరిస్థితిని తేకూడదని సూచిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర సర్కారుకు విన్నవిస్తున్నారు.అధ్యయనాలు ఇలా.. ఇక, తాజా విశ్లేషణ ప్రకారం గత ఎనిమిది సంవత్సరాలలో ఆరావళిలో పచ్చదనం క్రమంగా కోతకు గురైంది. వృక్షసంపద దాదాపు మూడింట ఒక వంతు తగ్గింది. దశాబ్దం కంటే తక్కువ కాలంలోనే దాదాపు 11,392 చదరపు కిలోమీటర్ల నుండి 7,521 చదరపు కిలోమీటర్లకు అటవీ ప్రాంతం తగ్గిపోయింది. మరోవైపు.. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ (CURaj) పరిశోధకులు 1975, 2019 మధ్య ఉపగ్రహ చిత్రాలు అధ్యయనం చేసి అంచనాలను రూపొందించారు. వారు విశ్లేషించిన డేటా ప్రకారం 44 సంవత్సరాల కాలంలో 5772.7 చదరపు కిలోమీటర్లు లేదా ఆరావళి శ్రేణులు దాదాపు 8 శాతం చదును చేయబడ్డాయని పేర్కొంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్ #సేవ్ఆరావళిఆరావళి పర్వతశ్రేణుల భద్రతపై భారత ప్రజల ఆందోళన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎంతోమంది పర్యావరణ వేత్తలు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, న్యాయవాదులు, పర్యావరణ సంస్థలు #సేవ్ఆరావళి హ్యాష్ట్యాగ్తో 'ఎక్స్' వేదికగా ట్వీట్లు చేస్తున్నాయి. శ్రేణుల భద్రతను బలహీనపర్చొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆరావళికి ఏదైనా జరిగితే తిరిగి పొందలేమని, ఇప్పుడే ఆ పర్వతశ్రేణుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.ఆరావళికి గండం వస్తే నష్టాలివే.. ఆరావళి పర్వతశ్రేణుల భద్రతకు భంగం కలిగితే, వాటిలోని జీవరాశులు, గిరిజన, ఆదివాసీ జాతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రత్యేకించి ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గాలి నాణ్యత మరింత తగ్గుతుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. రాజస్థాన్లోని థార్ ఎడారి వేగంగా విస్తరిస్తుంది.All eyes on Aravali …Reminder - Nature belong to everyone #SaveAravalli pic.twitter.com/g5LcSdfQSH— Tsering Gaphel ༅༎ཚིི་ཪིང་དགའ་འཕེལ།། (@Tsering_gaphel) December 24, 2025 -
ఈ ఏడాది రబీ సాగు..భలే జోరు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రబీ సీజన్ సాగు జోరందుకుంది. వాతావరణం అను కూలించడం, జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు ఉత్సాహంగా సాగు పనులు చేపట్టారు. గత ఏడాదితో పోలిస్తే ఈసా రి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి అందిన సమాచా రం ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 5.80 కోట్ల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి ఇది 5.72 కోట్ల హెక్టార్లుగా ఉండగా, ఈసారి అదనంగా 8.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేయడం విశేషం. ఈ మేరకు మంగళవారం కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. పప్పుధాన్యాలపై పెరిగిన మక్కువఈ సీజన్లో రైతులు పప్పుధాన్యాల సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పప్పుధాన్యాల మొత్తం సాగు విస్తీర్ణం 126.74 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది ఇది 123.01 లక్షల హెక్టార్లు మాత్రమే. అంటే సుమారు 3.72 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. ఇందులో సెనగలదే సింహభాగంగా ఉంది. గత ఏడాది 86.81 లక్షల హెక్టార్లలో సెనగలు సాగు చేయగా, ఈసారి అది 91.70 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే ఒక్క సెనగ సాగులోనే దాదాపు 4.89 లక్షల హెక్టార్ల భారీ పెరుగుదల కనిపించింది. కాగా పెసలు, మినప పంటల సాగు కూడా నిలకడగా సాగుతోంది. కుల్తీ, ఇతర పప్పుధాన్యాల సాగు వివరాలను కూడా కేంద్రం వెల్లడించింది.ఆహార భద్రతకు భరోసా.. ధుమ, వరిదేశ ఆహార భద్రతలో కీలకమైన గోధుమ, వరి సాగు కూడా ఆశాజనకంగా ఉంది. రబీ సీజన్లో ప్రధాన పంట అయిన గోధుమ సాగు 301.63 లక్షల హెక్టార్లకు చేరింది. గతేడాది సుమారు 3 కోట్ల హెక్టార్లతో పోలిస్తే 1.29 లక్షల హెక్టార్ల పెరుగుదల నమోదైంది. అదే సమయంలో రబీ వరి సాగులోనూ మంచి వద్ధి కనిపిస్తోంది. గతేడాది 11.52 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడగా, ఈసారి అది 13.35 లక్షల హెక్టార్లకు పెరిగింది. 1.83 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం పెరగడం వరి రైతుల ఉత్సాహానికి నిదర్శనమని వ్యవసాయ శాఖ పేర్కొంది.నూనెగింజలు, చిరుధాన్యాల తీరు ఇలా..వంటనూనెల కొరతను తగ్గించే దిశగా నూనెగింజల సాగు కూడా సానుకూలంగా ఉంది. మొత్తం 93.33 లక్షల హెక్టార్లలో నూనెగింజలు సాగవుతున్నాయి. ఇందులో ఆవాలు సాగు విస్తీర్ణం 87.95 లక్షల హెక్టార్లకు చేరాయి. చిరుధాన్యాల విషయంలో శ్రీ అన్న (మిల్లెట్స్) సాగు పట్ల రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జొన్నలు, మొక్కజొన్న, రాగులు తదితర పంటలు కలిపి మొత్తం 45.65 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి. జొన్నల సాగు 19.33 లక్షల హెక్టార్లుగా, మొక్కజొన్న సాగు 14.97 లక్షల హెక్టార్లుగా నమోదైంది. బార్లీ సాగు కూడా 6.94 లక్షల హెక్టార్లకు చేరింది. -
‘మహా’ సంచలనం.. 20 ఏళ్లకు కలసిన ‘ఠాక్రేలు’
ముంబై: సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. విభేదాలతో విడిపోయిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒక్కటయ్యారు. నేడు (బుధవారం) జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఇద్దరూ కలసి పాల్గొన్నారు. జనవరి 15న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (ఠాక్రే వర్గం),మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.కుటుంబ సభ్యుల సమక్షంలో..ముంబైలోని ఒక వేదికపై ఇద్దరు సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కనిపించడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. ఈ కలయికను ఉద్దేశించి సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, దీనిని ఒక శుభప్రదమైన ప్రారంభంగా అభివర్ణించారు. ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)తో పాటు ఇతర కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరాలంటే ఈ కలయిక అనివార్యమని ఆయన అన్నారు.వారసత్వ పోరాటమే స్ఫూర్తిఈ సభలో ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగంతో మాట్లాడారు. తమ తాత ప్రబోధన్కర్ ఠాక్రే, తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేల ఆశయాల గురించి గుర్తు చేసుకుంటూ, తాము ఇక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులుగా కాకుండా ఠాక్రే సోదరులుగా నిలుచున్నామని అన్నారు. శివసేన స్థాపించి 60 ఏళ్లు అవుతున్న తరుణంలో, మరాఠీ ప్రజల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ముంబై రక్షణే పరమావధిమాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. కొందరు నేతలు ముంబైని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము విడిపోయి పోరాడితే అది ఇక్కడి అమరవీరులకు చేసే అవమానమవుతుందన్నారు. రాజ్ ఠాక్రే తన ప్రసంగంలో సంఘీభావం చాటారు. వ్యక్తిగత అపార్థాల కన్నా మహారాష్ట్ర గౌరవమే గొప్పదన్నారు. సీట్ల పంపకాల కంటే ముంబై ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నాసిక్ వంటి ఇతర కార్పొరేషన్లలో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని అన్నారు. కాగా ఈ పొత్తు ద్వారా ముంబై పీఠాన్ని దక్కించుకుంటామని రాజ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: ‘విజయ్తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత -
చపాతి లేట్ అయిందనీ, భార్య, నాలుగేళ్ల కొడుకుపై పెనంతో దాడి
గోరఖ్పూర్(యూపీ): ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు.. తాగుబోతుల నిర్వాకాలు ఎటు పోతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రి పూట హాయిగా పిల్లాడితో కలిసి నచ్చింది వండుకుని తిందామనుకున్న ఆ ఇల్లాలికి పిడుగులా మీద పడ్డాడు తాగుబోతు భర్త. డ్రైవర్గా సంపాదించిందంతా తాగుడుకే నీళ్లగా ఖర్చయిపోగా ఆగమేఘాల మీద క్షణాల్లో చపాతి కావాలంటూ భీష్మించుకు కూర్చుని భార్యకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాడు. మెరుపువేగంతో చపాతి చేయకపోతే పిడిగు ద్దులు ఖాయమని హెచ్చరించి చివరకు అనుకున్నంత పనీ చేశాడు. భార్యతో పాటు నాలుగేళ్ల కుమారుడి రక్తం కళ్లజూశాడు. తాగుబోతు డ్రైవర్ నిర్వాకంపై ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్లోని గోరఖ్ నాథ్ పోలీస్స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్లో ఒక్కటే చర్చ జరుగుతోంది. చపాతి ఆలస్యంగా చేసిందన్న చితకబాదుతాడా అంటూ అతడిని తిట్టిపోయని వాళ్లు లేరు. 30 ఏళ్ల భార్యామణి రాధికా సహానీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భార్యాభర్తల చపాతి గొడవ ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబర్ 20వ తేదీన ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు, బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు.. గత శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో లాల్చంద్ సహానీ పూటుగా తాగి ఇంటికొచ్చాడు. లక్నోలో డ్రైవర్గా పనిచేయడం వచ్చిన డబ్బులు తాగుడకు తగలేయడం అతనికి దినచర్యగా తయారైంది. శనివారం రాత్రి ఇంటికి రాగానే ‘రోటీ రెడీ చెయ్’ అని హోటల్లో సర్వర్కు ఆర్డర్ వేసినట్లు ఆర్డర్ వేశాడు. ఇంట్లో అంట్లు తోమడం వంటి ఇంటి పనులు ముగించుకుని రోటీలు చేసి ఇచ్చింది. రోటీ చేయడానికి ఇంత సమయం పడుతుందా? ఇంత ఆలస్యంగా తీసుకొస్తావా? అంటూ లాల్చంద్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. అప్పటికే వంటగదిలో పొయ్యి మీద వేడిమీదున్న పెనం తీసుకుని భార్యను చితక్కొట్టాడు. గొడవతో భయపడి అటుగా వచ్చిన తమ నాలుగేళ్ల కుమారుడి తల మీదా లాల్ చంద్ పెనంతో దాడి చేయడంతో తలకు గాయమై రక్తం ధారగా కారింది. దీంతో భయపడిపోయిన లాల్ చంద్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెల్సిన ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే పిల్లాడిని ఆస్పత్రిలో చేర్పించాడు. పారిపోతూ లాల్చంద్ భార్యను ‘నిన్ను చంపేస్తా’’ అంటూ అరుస్తూ పరుగెత్తాడని పొరుగువాళ్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు తాగుబోతు భర్త కోసం గాలింపు మొదలెట్టారు. లాల్చంద్ను వెంటనే పట్టుకుని తగిన బుద్ధి చెప్తామని గోరఖ్నాథ్ పోలీస్స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శశిభూషణ్ రాయ్ చెప్పారు.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
'కార్లపై చూసిన అతిగొప్ప నినాదం ఇదే'
మంగళూరు: ఫ్రిడ్జ్, ఏసీ, ఆపిల్ ఐఫోన్, ల్యాప్టాప్, కారు, బైక్, వాషింగ్ మెషీన్, ఫర్నీచర్.. ఇలా నిత్యావసర ఎలక్ట్రానిక్ వస్తువులను ఈకాలంలో చాలా మంది ఈఎంఐ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. వాటి ఈఎంఐ గడువు తీరేలోపే వాటికి రిపేర్లు రావడమో, పాడవడమో, ఎవరో కొట్టేయడమో జరిగితే ఆ బాధ వర్ణణాతీతం. ఆ బాధ పడొద్దనే ఉద్దేశంతో ఓ కారు యజమాని వినూత్న రీతిలో ఆలోచించారు.రోడ్లపై సర్రున దూసుకుపోయే వాహనదారుల్లో ఎవరైనా తన కారును ఢీకొడితే రిపేర్ల ఖర్చుల కోసం జేబుకు చిల్లు పడటం ఖాయమని భావించాడు. అనుకున్నదే తడవుగా కారుకు వెనకాల కొత్త తరహాలో బంపర్ స్టిక్కర్గా వినూత్న క్యాప్షన్ రాసి వెనకాల వచ్చే వాహనదారులందర్నీ ఆలోచనల్లో పడేశాడు. ‘‘నా కారును పొరపాటున ఢీకొట్టకండి. అసలే ఇది ఈఎంఐలో కొన్నా. అదింకా పూర్తవలేదు’’ అనే అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ రాశారు.ఇది చూసి ‘కారు కష్టాలు’ అని కొందరు సానుభూతి వ్యక్తపరిస్తే మరికొందరేమో అతని సృజనాత్మకతను మెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటూ తమ దారిలో వెళ్లిపోతున్నారు. ఇతనిలో ఎంతో హాస్యచతురత ఉందని లోలోపల పొగుడుతూనే మరోవైపు అతని నిజాయతీకి, విజ్ఞాపనకు ఫిదా అయిపోతున్నారు.కర్ణాటకలోని మంగళూరులో సర్క్యూట్ హౌస్ రోడ్డులో వెళ్తున్న ఒక తెలుపురంగు మారుతి సుజుకీ ఆల్టో కారుకు (Alto Car) సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటికే ఏకంగా 5.4 కోట్ల మంది ఈ వీడియోను ఆన్లైన్లో చూడడం విశేషం. 33.41 లక్షలకుపైగా లైక్లు వచ్చాయి. వేలాది మంది తమకు నచ్చిన రీతిలో స్పందిస్తున్నారు.ఎంత కష్టపడి కొనుకున్నాడో..‘‘కారు యజమాని తాను చెప్పదల్చుకున్న విషయాన్ని అత్యంత వైవిధ్యభరింతగా చెప్పారు’ అని ఒక నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘ఈఎంఐ (EMI) అనేది సగటు భారతీయుని జీవితంలో ఒక భాగమైపోయిందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘ఎంత కష్టపడి కొనుకున్నాడో. అందుకే కారంటే అతనికి అంత ప్రేమ’’ అని మరొకరు పోస్ట్ చేశారు.చదవండి: ఆ కార్ల ఖరీదు 7 కోట్లు.. డెకరేషన్కు 5 కోట్లు!అతిగొప్ప నినాదం ఇదే..‘‘ఈఎంఐ మంజూరుచేసిన బ్యాంక్కు ఇతను అసలు సిసలు నిఖార్సయిన కస్టమర్’ అని మరో నెటిజన్ (Netizen) వ్యాఖ్యానించారు. ‘‘గుంతల రోడ్డుపై వాయుకాలుష్యంలో కొట్టుకుపోతున్న నాకు ఎదురుగా ఈ క్యాప్షన్ ఎండాకాలంలో చల్లటి మజ్జిగలా హాయినిచ్చింది’’ అని ఇంకొకరు పోస్ట్చేశారు. ‘‘ఎన్నో బాధ్యతలున్న సగటు జీవి కారు ఇది’’, ‘‘కార్లపై చూసిన అతిగొప్ప నినాదం ఇదే’’, ‘‘మోదం, ఖేదం కలబోత ఈ క్యాప్షన్’’ అంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు పోస్ట్లుపెట్టారు. View this post on Instagram A post shared by @bearys_in_dubai -
మొఘల్ దర్బార్లో క్రిస్మస్ సందడి.. మామిడాకులతో అలంకరణలు
దేశంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే పాత ఢిల్లీలోని ఆ ప్రాంతంలో జరిగే క్రిస్మస్ వేడుకులకు ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ క్రిస్మస్ అంటే అది కేవలం క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు... మొఘల్ సంప్రదాయం, క్రైస్తవ విశ్వాసాల అద్భుత కలయిక. చక్రవర్తి అక్బర్ కాలంలో జెస్యూట్ మిషనరీల రాకతో మొదలైన ఈ వేడుకలు నేటికీ ‘ఈద్ ఎ తవల్లుద్’ పేరుతో వేడుకలు కొనసాగుతున్నాయి. మొఘల్ చక్రవర్తులు దసరాను ఏవిధంగా గౌరవించారో, జహంగీర్ తదితర పాలకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, ఆనాడే మత సామరస్యానికి పునాది వేశారు.ఢిల్లీలోని తుర్క్మెన్ గేట్ -కశ్మీరీ గేట్ ప్రాంతాలు ఈ చారిత్రక వేడుకలకు ప్రధాన వేదికలు. ఇక్కడి 1836 నాటి సెయింట్ జేమ్స్ చర్చి , ఉర్దూలో ప్రార్థనలు జరిగే సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి పాత ఢిల్లీలో బహుళ సంస్కృతికి నిదర్శనాలు. కాలక్రమేణా అనేక ఆంగ్లో-ఇండియన్ కుటుంబాలు ఇక్కడి నుండి వలస వెళ్లినా క్రిస్మస్ వచ్చిందంటే చాలు ‘తుర్క్మెన్ గేట్’కు తమ మూలాలను వెతుక్కుంటూ రావడం ఒక ఆనవాయితీగా మారింది. ఇక్కడి క్రిస్మస్ అలంకరణలు, ఆచారాల్లో అచ్చమైన భారతీయత కనిపిస్తుంది.చర్చిలను కేవలం స్టార్లతోనే కాకుండా, అరటి, మామిడి ఆకులతో తోరణాలు కట్టి అలంకరిస్తారు. పాశ్చాత్య కరోల్స్ (కీర్తనలు) ఇక్కడ ఉర్దూ, పంజాబీ బాణీల్లో వినిపిస్తూ ప్రత్యేక అనుభూతినిస్తాయి. క్రిస్మస్ వేళ ఇక్కడ భోజన ప్రియులకు పసందైన విందు దొరుకుతుంది. ఇక్కడి ఇళ్లలో మొఘలాయి రుచులైన బిర్యానీ, కబాబ్లను వండి వడ్డిస్తారు. వీటితో పాటు పలు రకాల సంప్రదాయ స్వీట్లు తయారుచేస్తారు. ఇక్కడి బేకరీలు క్రిస్మస్ కేకులతో కళకళలాడుతుంటాయి. కులమతాలకు అతీతంగా ఇక్కడివారంతా పొరుగువారితో ఖీర్ పంచుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ క్రిస్మస్ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘విజయ్తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత -
‘విజయ్తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత
చెన్నై: తమిళనాడు రాజకీయ రంగస్థలంపై సరికొత్త సమీకరణలు మొదలయ్యాయి. దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీతో ప్రజల్లోకి దూసుకుపోతుంటే, జాతీయ నేత రాహుల్ గాంధీ ఆయనకు సంఘీభావం తెలపడం సంచలనంగా మారింది. ఆమధ్య కరూర్లో జరిగిన విషాదకర ఘటన తర్వాత విజయ్ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో, రాహుల్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి, మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.ఆ ఫోన్ కాల్ వెనుక అసలు కథ.. తాజాగా కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో టీవీకే నేత ఆధవ్ అర్జున ఒక ఫోన్ కాల్ రహస్యాన్ని బయటపెట్టారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ మానసిక వేదనలో ఉన్నప్పుడు, ఆయనకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆయన తెలిపారు. ‘బ్రదర్.. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, దేనికీ చింతించకు’ అంటూ ఫోన్లో రాహుల్ అన్నారని ఆధవ్ అర్జున తెలిపారు. ఈ భరోసా వెనుక ఉన్నది కేవలం వారి వ్యక్తిగత స్నేహం మాత్రమే కాదని, లోతైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సర్వత్రా మొదలైంది. అయితే ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఇలా నేరుగా విజయ్కు మద్దతు పలకడం అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.డీఎంకేకు ఇది ‘ప్లాన్ బి’ హెచ్చరికా? తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే నీడలో జూనియర్ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోందా? అన్న అనుమానాలు ఇప్పుడు విశ్లేషకుల్లో మొదలయ్యాయి. అయితే రాహుల్ గాంధీ, విజయ్ మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. 2009లోనే విజయ్కు యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావించారు. ఇప్పుడు విజయ్ సొంత పార్టీ పెట్టడంతో, రాహుల్ ఆయనకు అండగా నిలవడం ద్వారా డీఎంకేపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో డీఎంకేకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.బహిర్గతమైన అసహనం విజయ్ పార్టీ కార్యక్రమాలకు పెరుగుతున్న ఆదరణ చూసి డీఎంకే ఇప్పటికే అప్రమత్తమైంది. అరుమనైలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వెనుక డీఎంకే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ రాజకీయ నేతలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సెంగుట్టయ్యన్ వంటి వారు విజయ్కు మద్దతుగా నిలవడం చూస్తుంటే భవిష్యత్తులో టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదగబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.2026 సమరానికి నాంది 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్-విజయ్ దోస్తీ తమిళనాడులో కొత్త కూటములకు బాటలు వేసేలా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తన మద్దతును విజయ్ వైపు మళ్లిస్తే, రాష్ట్రంలో దశాబ్దాల రాజకీయ చరిత్ర మారిపోతుంది. 1967లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించాలనే కాంగ్రెస్ ఆశలకు విజయ్ ఒక వేదికగా మారతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి -
నింగిలోకి ఎల్వీఎం3- ఎం6
శ్రీహరికోట: ఇస్రోకు చెందిన భారీ ఉపగ్రహ వాహక నౌక లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM3-M6) బుధవారం ఉదయం 90 సెకన్ల స్వల్ప జాప్యంతో నింగిలోకి ఎగసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఎస్డిఎస్సి) నుండి ఉదయం 8.54 గంటలకు జరగాల్సిన ఈ ప్రయోగం 8.55.30 గంటలకు జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), తన వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ద్వారా ఈ మిషన్ను చేపట్టింది. లిఫ్ట్ ఆఫ్ నుండి దాదాపు 15 నిమిషాల విమానం తర్వాత, బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం లాంచ్ వెహికల్ నుండి విడిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక మిషన్.. హై-స్పీడ్ సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ను అందించడానికి రూపొందించిన తదుపరి తరం కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మోహరిస్తుందని ఇస్రో తెలిపింది.శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి LVM3-M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 'బ్లూబర్డ్ బ్లాక్-2' కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ అభివృద్ధి చేసిన ఈ 'బ్లూబర్డ్ బ్లాక్-2' ఉపగ్రహం సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. దీనిని సాధారణ స్మార్ట్ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుండి 4G, 5G బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేలా రూపొందించారు. ఎటువంటి అదనపు పరికరాలు లేకుండానే మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ అందేలా చేయడమే ఈ ఉపగ్రహ ప్రధాన లక్ష్యం. Launch Day for #LVM3M6.LVM3-M6 lifts off today at 08:55:30 IST with BlueBird Block-2 from SDSC SHAR.Youtube Livestreaming link:https://t.co/FMYCs31L3j🕗 08:25 IST onwardsFor More information Visit:https://t.co/PBYwLU4Ogy#LVM3M6 #BlueBirdBlock2 #ISRO #NSIL pic.twitter.com/5q3RfttHZh— ISRO (@isro) December 24, 2025ఈ మిషన్ ద్వారా ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీలో కీలక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా మొబైల్ టవర్లు లేని అటవీ, కొండ ప్రాంతాలు, అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది బలోపేతం చేయనుంది. అంతరిక్ష ఆధారిత సాంకేతికత ద్వారా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ యాక్సెస్ను విస్తరించడంలో ఇది సహాయం అందించనుంది. ఫలితంగా సామాన్యులకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.ప్రధాని మోదీ ప్రశంసలుప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రయోగాన్ని ప్రశంసించారు. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా మనం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందన్నారు. ‘ఎక్స్’లో పోస్ట్లో మోదీ ఇలా రాశారు ‘భారత అంతరిక్ష రంగంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 అంతరిక్ష నౌకను.. దాని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన.. ఎల్వీఎం3-ఎం6 ప్రయోగం భారత అంతరిక్ష ప్రస్థానంలో ఒక గర్వించదగిన మైలురాయిని సూచిస్తుంది’ అని అన్నారు. A significant stride in India’s space sector…The successful LVM3-M6 launch, placing the heaviest satellite ever launched from Indian soil, the spacecraft of USA, BlueBird Block-2, into its intended orbit, marks a proud milestone in India’s space journey. It strengthens… pic.twitter.com/AH6aJAyOhi— Narendra Modi (@narendramodi) December 24, 2025 -
ఢిల్లీ మెట్రో @ 23.. ఈ ఎనిమిది విశేషాలు తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే మనకు ఎర్రకోట, ఇండియా గేట్ ఏ విధంగా గుర్తుకు వస్తాయో.. ఢిల్లీ మెట్రో కూడా కళ్లముందు మెదులుతుంది. 2002 డిసెంబర్ 24న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పచ్చజెండా ఊపి, ప్రారంభించిన ఈ మెట్రో రైలు.. నేడు ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థగా ఎదిగింది. దేశంలోని ఇతర నగరాల్లో మెట్రో విప్లవానికి నాంది పలికిన ఢిల్లీ మెట్రో ప్రస్థానం వెనుక ఎన్నో ఆసక్తికరమైన అంశాలు దాగున్నాయి.8 కిలోమీటర్ల నుండి 300+ కిలోమీటర్ల వరకు..ఢిల్లీ మెట్రో ప్రయాణం షాదరా నుండి టిస్ హజారీ వరకు కేవలం 8.2 కిలోమీటర్ల ‘రెడ్ లైన్’తో మొదలైంది. ఆ రోజున కశ్మీర్ గేట్ వద్ద ప్రధాని వాజ్పేయి, నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, మెట్రో మ్యాన్ శ్రీధరన్లు ఒక కొత్త చరిత్రను లిఖించారు. నేడు అదే నెట్వర్క్ 390 కిలోమీటర్లకు పైగా విస్తరించి, దాదాపు 286 స్టేషన్లతో ఢిల్లీ మహానగరం నలుమూలలనూ కలుపుతోంది. లండన్, న్యూయార్క్ తదితర మెట్రో దిగ్గజాల సరసన ఢిల్లీ మెట్రో చేరడం మన దేశానికే గర్వకారణంగా నిలిచింది.కోల్కతా స్ఫూర్తి.. ఢిల్లీ విజయంభారతదేశంలో మెట్రో అంటే కోల్కతా గుర్తుకు వస్తుంది. 1984లోనే అక్కడ సేవలు ప్రారంభమైనప్పటికీ, ఆధునిక సాంకేతికతతో పూర్తిస్థాయి మెట్రో నెట్వర్క్ను దేశానికి పరిచయం చేసింది ఢిల్లీ మెట్రోనే అని చెబుతారు. కోల్కతా విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ), అంతర్జాతీయ ప్రమాణాలతో అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. కేవలం రవాణా మాత్రమే కాదు, సమయపాలనలోనూ ఢిల్లీ మెట్రో 99 శాతానికిపైగా ఖచ్చితత్వాన్ని పాటిస్తోంది.ఆశ్చర్యపరిచే స్టేషన్ల నిర్మాణంఢిల్లీ మెట్రో నిర్మాణంలో ఇంజనీరింగ్ అద్భుతాలు ఎన్నో కనిపిస్తాయి. హౌజ్ ఖాస్ స్టేషన్ భూమికి సుమారు 95 అడుగుల (29 మీటర్లు) లోతులో ఉండి, అత్యంత లోతైన స్టేషన్గా రికార్డు సృష్టించింది. ఒక సాధారణ 10 అంతస్తుల భవనం లోతుకు సమానమైన ఈ స్టేషన్ దాటాలంటే ఎస్కలేటర్లపై ప్రయాణం ఒక అడ్వెంచర్ను తలపిస్తుంది. మరోవైపు ‘ఆశ్రమ్’ మెట్రో స్టేషన్ ప్రపంచంలోనే అతి చిన్న మెట్రో స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్థలాభావం వల్ల దీనిని కేవలం ఒకే ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్తో అద్భుతంగా రూపొందించారు.కశ్మీర్ గేట్.. మెట్రో నెట్వర్క్ గుండెకాయఢిల్లీ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కశ్మీర్ గేట్. ఇది కేవలం స్టేషన్ మాత్రమే కాదు, ఒక మహా సముద్రం. రెడ్, ఎల్లో, వైలెట్ లైన్లు కలిసే ఈ ‘ట్రిపుల్ ఇంటర్చేంజ్’ స్టేషన్ దేశంలోనే అతిపెద్దది. సుమారు ఎనిమిది ఎంట్రీ గేట్లు కలిగిన ఈ స్టేషన్ గుండా రోజుకు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీని నిర్మాణం ఢిల్లీ రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచిందిమెట్రో కోచ్ల వెనుక ‘ఈవెన్’ సీక్రెట్ఢిల్లీ మెట్రో రైళ్లకు ఎప్పుడూ 4, 6 లేదా 8 కోచ్లే ఉంటాయి. బేసి సంఖ్యలో (5 లేదా 7) కోచ్లు ఎందుకు ఉండవు? దీని వెనుక సాంకేతిక కారణం ఉంది. మెట్రో కోచ్లు ఎప్పుడూ జంటగా (Pair) పనిచేస్తాయి. ఒక కోచ్లో డ్రైవర్ క్యాబిన్/కంట్రోల్ సిస్టమ్ ఉంటే, దానికి అనుసంధానంగా ఉండే మరో కోచ్ ఇంజిన్ లేదా మోటార్ను కలిగి ఉంటుంది. ఇవి రెండు కలిస్తేనే ఒక ‘యూనిట్’ పూర్తవుతుంది. అందుకే ఢిల్లీ మెట్రోలో ఎప్పుడూ సరి సంఖ్యలో కోచ్లు కనిపిస్తాయి.పర్యావరణ హితం.. ప్రపంచంలోనే మొదటిదిపర్యావరణ పరిరక్షణలో ఢిల్లీ మెట్రో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించినందుకు ఐక్యరాజ్యసమితి (యూఎన్) నుండి కార్బన్ క్రెడిట్స్ పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి మెట్రో వ్యవస్థగా ఢిల్లీ మెట్రో నిలిచింది. సోలార్ ఎనర్జీ వినియోగం, వర్షపు నీటి సంరక్షణలో డీఎంఆర్సీ అమలు చేస్తున్న విధానాలు అద్భుతమని పలువురు కొనియాడుతుంటారు. రోజుకు దాదాపు 28 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తూ, రోడ్లపై వేల సంఖ్యలో వాహనాలు తగ్గుదలకు కారణంగా నిలిచింది.మెట్రో మ్యూజియం: అరుదైన విజ్ఞాన భాండాగారంమెట్రో ఎలా పనిచేస్తుంది? ఈ రైళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే పటేల్ చౌక్ మెట్రో మ్యూజియం సందర్శించాల్సిందే. దక్షిణాసియాలోనే మెట్రో రైల్వేకు గల ఏకైక మ్యూజియం ఇది. ఢిల్లీ మెట్రో అభివృద్ధి చెందిన తీరు, దీనికి సంబంధించిన ఫోటోలు, మోడల్ రైళ్లు, సాంకేతిక విశేషాలు ఇక్కడ కొలువుదీరాయి. భావి తరాలకు ఇది ఒక విజ్ఞాన భాండాగారంగా ఉపయోగపడుతోంది.రాజధానికి జీవనాధారంనేడు ఢిల్లీ మెట్రో కేవలం ఒక రవాణా మార్గం కాదు, అది ఢిల్లీ ప్రజల జీవనశైలిలో భాగమైంది. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్ ద్వారా విమానాశ్రయానికి వేగంగా చేరడం నుండి, మెరుగైన భద్రత, మహిళల కోసం ప్రత్యేక కోచ్ల వరకు.. ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు ఒక భరోసాను అందిస్తోంది. ఢిల్లీ నుండి ప్రారంభమైన ఈ మెట్రో విప్లవం నేడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వ్యాపించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇది కూడా చదవండి: పాక్ నేత తిరుగుబాటు.. భారత్కు మద్దతు -
పారిశ్రామిక భూముల లభ్యతలో రాష్ట్రం నంబర్ వన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో సారి సత్తా చాటింది. పరిశ్రమల స్థాపనకు కీలకమైన భూములను సమకూర్చడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 157 పారిశ్రామిక పార్కుల్లో అందుబాటులో ఉన్న మొత్తం 32,033 హెక్టార్ల భూమిలో.. పరిశ్రమల ఏర్పాటు కోసం ఏకంగా 30,749 హెక్టార్ల భూమి సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వెల్లడించింది. అలాగే మహారాష్ట్రలో 19,658 హెక్టార్లు, తమిళనాడులో 16,291 హెక్టార్లు, గుజరాత్లో 12,605 హెక్టార్లు భూమి అందుబాటులో ఉంది. ఈ మేరకు ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదికలో ఆయా గణాంకాలను విడుదల చేసింది.మరోవైపు ఏపీలో ఉన్న 638 పారిశ్రామిక పార్కుల పరిధిలో 1,10,595 హెక్టార్ల భూమి ఉండగా అందులో 10,747 హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 4,523 పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. వాటి మొత్తం విస్తీర్ణం 7.70 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం 1.35 లక్షల హెక్టార్ల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉంది. మొత్తం 6.45 లక్షల ప్లాట్లు ఉండగా 1.25 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. పరిశ్రమల స్థాపనలో జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం ‘ప్లగ్ అండ్ ప్లే’విధానాన్ని ప్రోత్సహిస్తోంది. 2025–26 బడ్జెట్లో దీనికోసం రూ. 2,500 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 306 ప్లగ్ అండ్ ప్లే పార్కులు ఉన్నాయి. మరో 20 పార్కులను నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోంది. గ్రీన్ పార్కులకు గ్రీన్సిగ్నల్పారిశ్రామిక పార్కుల పనితీరును మెరుగుపరిచేందుకు ఈ ఏడాది సెపె్టంబర్లో ఇండ్రస్టియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 3.0ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటలైజేషన్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచి్చంది. 41 పార్కులు ‘లీడర్స్’గా, 90 పార్కులు ‘చాలెంజర్స్’గా నిలిచాయి. భారత్లో సులభతర వాణిజ్యం మెరుగుపడటంతో విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. 2025 ఏప్రిల్–ఆగస్టు మధ్య ఏకంగా 43.76 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏకగవాక్ష అనుమతులు, జీఎస్టీ వంటి సంస్కరణలు దీనికి దోహదపడ్డాయని కేంద్రం పేర్కొంది. -
ఐఫోన్, నిమ్మ సోడా!
దుకాణానికి వెళ్లి నేరుగా సరుకులు కొనుక్కోవడం లేదా ఈ–కామర్స్ సైట్లలో ఆర్డర్ పెట్టే పద్ధతి పెద్ద నగరాల్లో క్రమంగా గతంగా మారుతోంది! కాలంతో పోటీపడుతూ క్విక్ కామర్స్ సంస్థలు చిటికెలో ఆర్డర్లు డెలివరీ చేస్తున్న ఇన్స్టంట్ విధానానికే ఇప్పుడందరూ జై కొడుతున్నారు. అది ఎంతగా అంటే రూ. 1.7 లక్షల విలువైన ఐఫోన్ను కూడా ఇన్స్టంట్గా పొందే అంత! అదొక్కటే ఆర్డర్ పెడితే మజా ఏం ఉంటుందనుకున్నాడో ఏమో కానీ.. బెంగళూరుకు చెందిన ఓ వినియోగదారుడు ఐఫోన్తోపాటు ఒక నిమ్మ సోడా కూడా జోడించారని క్విక్ కామర్స్ కంపెనీ ఇన్స్టామార్ట్ వార్షిక నివేదిక చెబుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్10 నిమిషాల్లో డెలివరీ హామీతో.. బెంగళూరు వినియోగదారుడు రూ. 10 ఖరీదు చేసే ప్రింట్ అవుట్ మొదలు.. మూడు ఐఫోన్ల కోసం ఓ హైదరాబాదీ పెట్టిన రూ. 4.3 లక్షల విలువైన సింగిల్ ఆర్డర్ వరకు దేశంలో క్విక్ కామర్స్ పోకడలపై హౌ ఇండియా ఇన్స్టామార్టెడ్ 2025 పేరుతో స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ‘10 నిమిషాల’డెలివరీ హామీతో క్విక్ కామర్స్ కంపెనీలు భారత రిటైల్రంగ రూపురేఖలను మారుస్తున్న తీరుకు ఈ నివేదికే నిదర్శనంగా నిలుస్తోంది. కరివేపాకూ ఉండాల్సిందే.. ఇన్స్టామార్ట్ వేదికగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా కస్టమర్లు సెకనుకు 4 ప్యాకెట్ల పాలు కొనుగోలు చేశారు. దేశంలోని 10కిగాను 9 ప్రధాన నగరాల్లో రాత్రివేళ ఆర్డర్స్లో మసాలా ఆలు చిప్స్ టాప్లో నిలిచాయి. కొచి్చకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో ఏకంగా 368 సార్లు కరివేపాకును ఆర్డర్ పెట్టాడు. మరోవైపు లక్నోకు చెందిన ఓ కస్టమర్కు కేవలం 2 నిమిషాల్లోనే మ్యాగీ మేజిక్ మసాలా నూడుల్స్ను డెలివరీ ఎగ్జిక్యూటివ్ చేర్చాడు. ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యే ఎక్కువగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఖరీదైనా సరే..ఏడాది మొత్తంలో ఓ కస్టమర్ ఏకంగా రూ. 22 లక్షలు వెచ్చించారంటే క్విక్ కామర్స్ ఏ స్థాయిలో ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఐఫోన్–17 మోడల్లో 22 ఫోన్లు, 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్, ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్.. ఇలా ఒకటేమిటి పాలు, గుడ్లు, ఐస్క్రీమ్, పండ్లను సైతం ఆ వినియోగదారుడు చేసిన ఆర్డర్లలో ఉన్నాయి. అలాగే నోయిడావాసి సింగిల్ ఆర్డర్లో ఏకంగా రూ. 2.69 లక్షలతో బ్లూటూత్ స్పీకర్స్, ఎస్ఎస్డీలు ఆర్డర్ పెట్టాడు. దీపావళి రోజున ఓ బెంగళూరు కస్టమర్ రూ. 1.97 లక్షలు వెచ్చించి ఒక కిలో వెండి కొన్నాడు. ఇక చెన్నైకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో కాండోమ్స్ కోసం 228 ఆర్డర్లు పెట్టి రూ. 1,06,398 ఖర్చు చేశారు. స్విగ్గీ వేదికగా ఇలా... ⇒ ఈ ఏడాది కస్టమర్లు 9.3 కోట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు. అంటే నిమిషానికి 194 అన్నమాట. వాటిలో 5.77 కోట్ల చికెన్ బిర్యానీలు ఉన్నాయి. ⇒ వినియోగదారులు మొత్తం 4.42 కోట్ల బర్గర్స్, 4 కోట్ల పిజ్జాలు, 2.62 కోట్ల దోశలు ఆరగించారు. ⇒ మధ్యాహ్నం 3–7 గంటల మధ్య 34.2 లక్షల సమోసాలు, 29 లక్షల అల్లం చాయ్లను ఆస్వాదించారు. ⇒ 69 లక్షల వైట్ చాక్లెట్ కేక్స్, 54 లక్షల చాక్లెట్ కేక్స్, 45 లక్షల గులాబ్ జామూన్స్ ఆర్డర్లున్నాయి. ⇒ కస్టమర్లు ఏకంగా 1.1 కోట్ల ఇడ్లీలు, 1.6 కోట్ల మెక్సికన్, 1.2 కోట్ల టిబెటన్, 47 లక్షల ఆర్డర్లతో కొరియన్ ఫుడ్ రుచి చూశారు. ⇒ రూ. 47,106తో 65 బాక్సుల డ్రై ఫ్రూట్ కుకీస్ గిఫ్ట్ ప్యాక్లను ఓ హైదరాబాదీ స్వీకరించాడు. ⇒ ఓ ముంబైకర్ ఏడాది పొడవునా 3,196 ఆర్డర్లతో టాప్లో నిలిచాడు. ⇒ ఆర్డర్ల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై టాప్–3లో ఉన్నాయి. ⇒స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ 2,400 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి కస్టమర్లకు ఉత్పత్తులను చేరవేశారు. ⇒ బెంగళూరుకు చెందిన మొహమ్మద్ రాజిక్ అనే డెలివరీ పార్ట్నర్ 11,718 డెలివరీలతో టాప్లో నిలిచాడు. ఇన్స్టామార్ట్ కస్టమర్ల రేంజ్ ఇదీ..⇒ రెడ్బుల్ షుగర్ ఫ్రీ డ్రింక్స్ కోసం ముంబై కస్టమర్ ఏకంగా రూ. 16.3 లక్షలు ధారపోశాడు. ⇒ ముంబైకి చెందిన ఓ వ్యక్తి రూ. 15.16 లక్షల విలువ చేసే పుత్తడి కొన్నాడు. ⇒ బెంగళూరు వినియోగదారుడు ఏడాదిలో రూ. 4.36 లక్షల విలువైన నూడుల్స్ కొనుగోలు చేశాడు. ⇒ నోయిడా కస్టమర్ రూ. 2.8 లక్షలతో 1,343 ప్రొటీన్ ఉత్పత్తులు ఆర్డర్ చేశాడు. ⇒ చెన్నై కస్టమర్ పెట్ ఫుడ్ కోసం రూ. 2.41 లక్షలు ఖర్చుపెట్టాడు. ⇒ గులాబీలకు రూ. 31,240 వెచ్చించి హైదరాబాదీ తన ప్రేమను చాటుకున్నాడు. ⇒ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కు టిప్స్ రూపంలో బెంగళూరు కస్టమర్ రూ. 68,600, చెన్నైవాసి రూ. 59,505 అందించారు. ⇒ వాలెంటైన్స్ డే రోజున గులాబీల కోసం సగటున నిమిషానికి 666 ఆర్డర్లు వెల్లువెత్తాయి. -
విషపు రాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్లెం!
ఇకపై తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. – ఢిల్లీ హైకోర్టు హెచ్చరికసాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇకపై వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ, తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలు రాసిన ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలతో పాటు గూగుల్పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ను మంగళవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్.. సదరు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. » గత ఏడాది నవంబర్లో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను పట్టుకుని, వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలు తన ప్రతిష్ఠ దెబ్బతినేలా కుట్రపూరిత కథనాలు రాశాయని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా, జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ విషపు రాతలను అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ (ఈనాడు), తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది.» వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దయాన కృష్ణన్... విచారణ సందర్భంగా ఆయనపై జరిగిన అసత్య ప్రచారాలు, కుట్రలను ఎండగట్టారు. ‘తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు సంస్థల విచారణ తేలనే లేదు. చార్జిషీట్లో నా క్లయింట్ పేరు కూడా లేదు. కానీ, ఈ మీడియా సంస్థలు మాత్రం కక్షగట్టి, ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కథనాలు వండివార్చాయి. విచారణ జరగకముందే దోషిగా నిలబెట్టి ఉరితీశాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు సాగుతుండగానే, మీడియా సమాంతర విచారణలు జరుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా, వాదనల తదుపరి విచారణను న్యాయమూర్తి జనవరి 29కి వాయిదా వేశారు. -
యూపీలో పొగమంచు బీభత్సం
అమేథీ(యూపీ): రహదారులపై పొగమంచు సంబంధ వాహన ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రిదాటాకా 2.30 గంటలప్పుడు ఉత్తరప్రదేశ్లోని అమేథి జిల్లాలో రహదారిపై భారీగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు సరిగా కనబడక ట్రక్కు రోడ్డుపక్క రెయిలింగ్ను ఢీకొట్టగా దాని వెనుకొచ్చే వాహనాలు ఒకదానివెంట మరోటి ఢీకొని ధ్వంసమై శిథిలాల కుప్పగా మారాయి.మొత్తం నాలుగు ట్రక్కులు, ఒక కారు, ఒక బస్సు ఢీకొన్న ఈ దుర్ఘటనలో వాహనాల్లో ఇరుక్కుపోయి ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ముసాఫిర్ఖాన్ పోలీస్స్టేషన్ పరిధిలో రహదారిపై అమేథీ–సుల్తాన్పూర్ మలుపు వద్ద జరిగింది. -
తేజస్.. మరింత సేఫ్
దేశీయతయారీ తేలికపాటి యుద్ధవిమానం తేజస్ భద్రతను మరింత పెంచే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ను తేజస్ వెనుకభాగంతో అనుసంధానించింది. అత్యవసర సందర్భాల్లో అత్యంత వేగంగా యుద్ధవిమానవాహక నౌక లేదా రన్వేపై దిగాల్సిన సందర్భాల్లో ఎలాంటి ప్రమాదం జరక్కుండా పైలట్కు, విమానానికి సాయపడేలా హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ను డిజైన్చేశారు. పూర్తి దేశీయంగా గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ అధునాతన పారాచూట్కు తుదిరూపునిచ్చింది.తేజస్ వంటి యుద్ధవిమానాల రక్షణను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని దీనిని తయారుచేశారు. ఈ పారాచూట్ బరువు సైతం చాలా తక్కువ. దీంతో పేలోడ్(మందుగుండు)ను మోసుకెళ్లే తేజస్కు కొత్తగా అదనపు బరువు లాంటి సమస్యలేవీ ఉండబోవు. దీంతో అత్యంత వేగంగా గాల్లో దూసుకెళ్లేటప్పుడు భార సంబంధ ఇబ్బందులు తలెత్తబోవు. దీంతో అత్యవసర సందర్భాల్లో అత్యల్ప పొడవైన రన్వేలపై ల్యాండ్ అయ్యాక తక్కువ దూరంలో ఆగిపోయేలా ఈ పారాచూట్ ఎంతగానో సాయపడుతుంది. ఎలా ఉపయోగకరం? సాధారణ పౌరవిమానాలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ల్యాండ్ అయినప్పుడు రన్వేకు ఆ కొన వద్ద ల్యాండ్ అయి రెండు, మూడు కిలోమీటర్ల దూరం దాకా రన్వేపై పరుగులు తీస్తాయి. అత్యవసర సందర్భాల్లో తేజస్ వంటి యుద్ధవిమానాలకు అంత పొడవాటి రన్వే ఉండే విమానాశ్రయాలు అందుబాటులో ఉండవు. తక్కువ పొడవున్న రన్వేలపై ల్యాండ్ అయ్యాక వేగంతో అలాగే ముందుకు దూసుకెళ్లకుండా ఈ హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ నిలువరిస్తుంది. దీంతో బ్రేకింగ్ వ్యవస్థలపై పనిభారం భారీగా తగ్గుతుంది. వెడల్పాటి ప్లస్ గుర్తు ఆకృతిలో ఉండే భారీ వస్త్రపు చివరలను కలుపుతూ గొడుగు ఆకృతిలో దీనిని తయారుచేస్తారు.ల్యాండింగ్ పూర్తయ్యాక రన్వే మీద విమానం అటూఇటూ ఊగకుండా స్థిరంగా ముందుకు కదిలేలా ఈ పారాచూట్ సాయపడుతుంది. రన్వే మీద విమానం ముందుకు దూసుకెళ్లేటప్పుడు ఎదురుగా వచ్చే అత్యధిక గాలి, ఒత్తిడిని తట్టుకుని ఇది విమానాన్ని వేగంగా ఆపేయగలదు. పారాచూట్ వెడల్పు కేవలం 5.75 మీటర్లు. విస్తీర్ణం 17 చదరపు మీటర్లు. దీని బరువు కేవలం 10 కేజీలు. యుద్ధవిమానం గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ హఠాత్తుగా రన్వేపై ల్యాండ్ అయినా కూడా సమయానుగుణంగా విచ్చుకుని త్వరగా విమానం రన్వే మీద ఆగేలా చేస్తుంది. హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్ అంటే?సాధారణ సందర్భాలతోపాటు అత్యవసర సమయాల్లోనూ విమానాన్ని నిర్దేశిత దూరం తర్వాత రన్వే మీద ఆపగలిగే సామర్థ్యమున్న పారాచూట్ను హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్గా పిలుస్తారు. తెగిపోని, అత్యంత కఠినమైన నైలాన్, కెవ్లార్ వంటి కృత్రిమ రసాయన దారాలతో ఈ పారాచూట్ను తయారుచేస్తారు. విమానం రకం, బరువు, ల్యాండింగ్ గరిష్ట వేగాలకు తగ్గ బరువు, సైజు, డిజైన్తో పారాచూట్ను తయారుచేస్తారు. -
శ్రీవారి సన్నిధిలో అపచారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఏపీ భవన్లో కొలువైన శ్రీవారి సన్నిధిలో మద్యం సీసాలు లభించడం కలకలం రేపింది. రాత్రివేళ మందుబాబులు బీర్లు తాగి సీసాలను శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాలకు పది అడుగుల దూరంలోనే పడేశారు. విషయం మీడియా దృష్టికి రావడంతో ఆగమేఘాల మీద ఏపీ భవన్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మూడు ఖాళీ బీర్ బాటిళ్లు, ఒక కూల్డ్రింక్ బాటిల్, తిని పడేసిన ఆహార పదార్థాల ప్లేట్లు అక్కడి నుంచి తొలగించారు. దీనిపై సిబ్బందిని ఆరా తీయగా.. రాత్రి వేళలో ఇక్కడి పరిసరాల్లో నిద్రిస్తున్న క్యాంటీన్ సిబ్బంది తాగి పడేసి ఉంటారని ఏపీ భవన్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటన స్వామివారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ భవన్లో వేంకటేశ్వ స్వామి వారితోపాటు దుర్గా మల్లేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఆలయ నిర్వహణ టీటీడీతోపాటు ఏపీ భవన్ అధికారులు చూస్తారు. కానీ.. ఏపీ భవన్ అధికారులకు చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలున్నాయి. బీరు సీసాలు పడేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
ఆగ్రహ జ్వాలలు
న్యూఢిల్లీ/కోల్కతా: బంగ్లాదేశ్లో హిందూ కార్మికుడు దీపూచంద్ర దాస్ను అల్లరిమూకలు కొట్టి చంపడం పట్ల విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ), బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ మారణకాండను ఖండించడం పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. వందలాది మంది కార్యకర్తలు కాషాయం జెండాలు చేతబూని బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లను దాటుకొని ముందుకు దూసుకొచి్చన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంస్థలు ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ హైకమిషన్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏడు అంచెల బారికేడ్లు సిద్ధంచేశారు. పారా మిలటరీ బలగాలను మోహరించారు. ప్రజా రవాణా సంస్థ బస్సులను సైతం వలయంగా నిలిపి ఉంచారు. హైకమిషన్కు 800 మీటర్ల దూరంలోనే నిరసనకారులను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిందువులకు రక్షణ కల్పించాలి యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య పట్ల బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ సిటీలో వ్రస్తాల పరిశ్రమలో పనిచేసే దీపూచంద్ర దాస్(25)ను ఈ నెల 18న దుండగులు కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. దైవ దూషణకు పాల్పడినందుకే దీపూచంద్ర దాస్ను శిక్షించినట్లు దుండగులు ప్రకటించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. హిందూ కార్మికుడి హత్యను పలు దేశాలు ఖండించాయి. భారత్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.బంగ్లాదేశ్లో మైనార్టీలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ సర్కార్ తీరును ఖండించారు. దీపూచంద్ర దాస్ను పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బంగ్లాదేశ్లోని హిందువులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలని చెప్పారు. పొరుగు దేశంలోని హిందూ కుటుంబాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిరసనకారులు హనుమాన్ చాలీసా పఠించారు. మతపరమైన నినాదాలతో హోరెత్తించారు. భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం పట్ల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్లోని తమ కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు ఇరుదేశాల దౌత్య సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేయడం పది రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. హిందూ కుటుంబం ఇల్లు దహనం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చట్టోగ్రామ్లో హిందూ కుటుంబం ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఇంట్లో జయంతి సంఘా, బాబు షుకుశీల్ కుటుంబాలు నివసిస్తున్నాయి. దుండగుల దుశ్చర్యకు ఇల్లు చాలావరకు దహనమైపోయింది. ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు శునకాలు మరణించాయి. హిందువులను హెచ్చరిస్తూ దుండగులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అందులో హెచ్చరించారు. కోల్కతాలో నిరసనలు బంగ్లాదేశ్లో మైనారీ్టలైన హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ పశి్చమ బెంగాల్ రాజధాని కోల్కతాలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది హిందూ సంఘాల సభ్యులు ‘బోంగియో జాగరణ్ మంచ్’ఆధ్వర్యంలో నగరంలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
కృత్రిమ గర్భాశయం!
నెలలు నిండకుండానే జననం. నవజాత శిశు మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఈ సమస్యకు సైంటిస్టులు తాజా వినూత్న పరిష్కారం కనిపెట్టారు. అదే... కృత్రిమ గర్భాశయం! 37 వారాలు నిండకముందే పుడితే నెల తక్కువ శిశువు అంటారు. అదే 23 నుంచి 27వ వారం మధ్యలోనే, అంటే ఆరు లేదా ఏడు నెలలకే కాన్పు జరిగితే అలాంటి శిశువు బతకడం చాలాసార్లు కష్టమవుతుంది. అంత లేత ఊపిరితిత్తులు బయటి ప్రపంచపు పరిస్థితులను తట్టుకునేందుకు అనువుగా ఉండవు. మిగతా కీలక శరీరాంగాలదీ అదే పరిస్థితి. ఆస్పత్రుల్లో ఇంక్యూబేటర్లలో ఉంచినా, ఎంత వైద్య చికిత్స అందించినా చాలాసార్లు లాభముండదు. అలాంటి శిశువుల్లో ఎక్కువమంది మృత్యువాత పడుతుంటారు. సైంటిస్టులు రూపొందించిన కృత్రిమ గర్భాశయం ఇందుకు పరిష్కారంగా కనిపిస్తోంది. ఇందులో ఉమ్మ నీటితో సహా అన్నీ అచ్చం అమ్మ గర్భంలో లాంటి పరిస్థితులే ఉండటం విశేషం! సంక్లిష్టమే కృత్రిమ గర్భాశయం ఆలోచన వినేందుకు సింపుల్ గానే ఉన్నా దాని రూపకల్పన మాత్రం చాలా సంక్లిష్టం. అది పరిమాణంలో దాదాపు ఇళ్లలో పెట్టుకునే సాధారణ అక్వేరియాల మాదిరిగా ఉంటుంది. సిజేరియన్ ద్వారా పుట్టిన నెలలు నిండని శిశువును వెంటనే ఉమ్మనీటితో నిండిన సంచీలో పెడతారు. అక్కడ శిశువుకు వెచ్చదనంతో పాటు తల్లి గర్భంలోని అన్ని పరిస్థితులూ అమరుతాయి. మరి పుట్టిన క్షణం నుంచీ అతి కీలకంగా మారే శ్వాసక్రియ పరిస్థితి ఏమిటంటారా? దానికీ మార్గం కనిపెట్టారు. బొడ్డుతాడుకు అనుసంధానించి సింథటిక్ ఉమ్మసంచీ ద్వారా శిశువుకు నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉంటుంది.ఈ కృత్రిమ గర్భాశయంలో అవసరాన్ని బట్టి కొద్ది రోజులు, వారాల నుంచి నెల, ఆపైన కూడా ఉంచే వెసులుబాటు ఉందంటున్నారు దీన్ని రూపొందించిన సైంటిస్టులు. అయితే ఈ కృత్రిమ గర్భాశయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఒకటి రెండేళ్ల కన్నా ఎక్కువే పట్టవచ్చట. కానీ ఈ పద్ధతిపై ఇప్పటికే నైతిక తదితర సందేహాలు తలెత్తుతుండటం విశేషం! అవన్నీ తీరి, నెలలు నిండకుండా పుట్టే ప్రతి పాపాయీ బతికి బట్ట కట్టే రోజు వస్తే బాగుంటుంది కదా అన్నది సైంటిస్టుల మాట. –సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కొట్టి చంపిన తర్వాతే అతని నిజాయితీ బయటపడింది’
తిరువనంతపురం: కేరళలోని పళక్కాడ్ జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అనుమానం ఓ వలస కార్మికుడి ప్రాణం తీసింది. పనికోసం వచ్చిన రామనారాయణ్ భగేల్ దొంగతనం చేశాడని భావించి స్థానికులు కొట్టి చంపారు. కానీ ఆ తర్వాతే అతని నిజాయతి బయటపడింది. రామనారాయణ్ దొంగతనం చేయలేదని అమాయకుడని పోలీసులు నిర్ధారించారు.ఛత్తీస్గఢ్కు చెందిన రామనారాయణ్ భగేల్ (31) అనే వలస కార్మికుడు. ఇటీవలే కేరళలోని వాలయార్ ప్రాంతానికి పని కోసం వచ్చాడు. ఒక దుకాణం నుంచి ఆహార ప్యాకెట్ దొంగిలించాడని అనుమానంతో స్థానికులు అతనిపై దాడి చేశారు.దాడిలో తీవ్రంగా గాయపడిన రామనారాయణ్ను ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వాలయార్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో రామనారాయణ్ దొంగతనం చేయలేదని, అతని వద్ద ఏమీ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.రామనారాయణ్ ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లాకు చెందినవాడు. నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, తల్లి అతని మీద ఆధారపడి జీవిస్తున్నారు. మృతదేహాన్ని ఛత్తీస్గఢ్కు తరలించారు. -
పీఎం అభ్యర్థిగా ప్రియాంక..?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై చర్చ జరుగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికలలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చుపకపోవడంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సూచిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతల అంశంపై రాహుల్, ప్రియాంకలో మధ్య వారసత్వ పోరు నడుస్తోందని బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని, ప్రియాంకలో చూస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వారసత్వ పోరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రియాంక గాంధీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అయితే తనను ప్రధాని చేస్తే పాకిస్థాన్ భరతం పడుతుందని ఆమె ఇందిరా గాంధీ మనవరాలని తనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో అధికార బీజేపీ ఈవ్యాఖ్యలపై కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై నమ్మకం కోల్పోయారని వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన గురించి మాట్లాడారు.రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ "ప్రియాంకా చాలా కష్టపడుతుంది. ఆమె తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. ప్రజల సమస్యలపై ఆమె నిరంతరం పోరాడుతుంది. ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. ప్రజలంతా తనలో ఇందిరా గాంధీని చూస్తున్నారు.కాంగ్రెస్ ఎంపీలు సైతం ఆమెను ప్రధానమంత్రిగా ఆమెదిస్తున్నారు". అని రాబర్ట్ వాద్రా అన్నారు.అదే సమయంలో "రాహుల్ గాంధీ కూడా చాలా కష్టపడుతున్నారు. వారి రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయి. దేశం కోసం వారి ప్రియమైన వ్యక్తులను కోల్పోయారు" అని రాబర్డ్ వాద్రా తెలిపారు. అయితే తనను కూడా ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అయితే బీజేపీ నెపోటిజమ్ పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ సమయంలో తనపై ఈడీ రైడ్ జరుగుతుందన్నారు.అయితే తన పొలిటికల్ ఎంట్రీ అంశం భవిష్యత్తులో ఆలోచిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. -
ముగ్గురు ఏఎస్జీల నియామకం
సుప్రీంకోర్టుకు ముగ్గురు అడిషనల్ సొలిసిటర్ జనరల్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది దవీందర్ పాల్ సింగ్, అనిల్ కౌశిక్, రవీంద్ర కనకమేడలలను ఏఎస్జీలుగా నియమిస్తూ కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ముగ్గురు మూడేళ్ల పాటు ఈ బాధ్యతలో కొనసాగనున్నారు.దవీందర్ పాల్ సింగ్ గతంలో పంజాబ్, హర్యాణాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. అనిల్ కౌశిక్, కనకమేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు. అడిషనల్ సొలిసటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు, హైకోర్టులలో సివిల్, క్రిమినల్ కేసులు వాదిస్తారు. రాజ్యాంగం అంశాలతో పాటు ఇతర న్యాయ అంశాలలో ప్రభుత్వానికి వీరు సలహా ఇస్తారు. వీరు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్కు సహాయకారిగా ఉంటారు. -
ఆ.. మరీ అంత ఎక్కువా?
అసలు కంటే కొసరు మక్కువ అనేది నానుడి. ఒడిశా అటవీశాఖ అధికారులు చేసిన ఓ పని ఇలాగే ఉంది. అసలు కంటే కొసరు కోసం ఎక్కువ ఖర్చు చేసి వివాదంలో చిక్కుకున్నారు. డిపార్ట్మెంట్ అవసరాల కోసం 51 కార్లు కొన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే కార్లు కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కార్లకు అదనపు హంగుల కోసం వెచ్చించిన ధర దాదాపు వాహనాల రేటుకు దగ్గర ఉండడంతో వివాదం రాజుకుంది. అటవీశాఖ అధికారుల కొను గోల్మాల్ బయటపడడంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.అటవీ శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా కంపెనీకి చెందిన 51 థార్ (Thar) ఎస్యూవీలను కొనుగోలు చేసింది. ఒక్కో కారుకు రూ.14 లక్షలు చొప్పున 7 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసింది. తమ విభాగం అవసరాలకు అనుగుణంగా ఈ కార్లలో మార్పులు చేయడానికి అదనంగా రూ. 5 కోట్లు ఖర్చు చేయడంతో సమస్య మొదలైంది. మొత్తం 51 వాహనాలకు అదనపు హంగులతో కలిపి రూ. 12.35 కోట్లు వ్యయం అయినట్టు అధికార పత్రాలు ధ్రువీకరించాయి. దీంతో తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.నిగ్గు తేల్చాల్సిందే..బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సాహూ (Arun Kumar Sahoo) గత మార్చి నెలలో ఈ అంశాన్ని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు. అటవీశాఖ కొనుగోలు చేసిన వాహనాలకు అయిన ఖర్చు వివరాలు ఇవ్వాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కార్లు కొనడానికి 7 కోట్ల రూపాయలు ఖర్చయితే, అదనపు హంగులకు ఏకంగా రూ. 5 కోట్లు వెచ్చించినట్టు తాజాగా వెల్లడైంది. దీంతో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఖుంటియా స్పందించారు. ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, నిగ్గు తేల్చాలని అకౌంటెంట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించారు. వాహనాల కొనుగోలు ప్రక్రియతో పాటు మార్పుల కోసం అయిన ఖర్చులను కూడా పరిశీలించాలని సూచించారు. అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని ఆయన హెచ్చరించారు.అనవసరంగా ఖర్చు చేస్తే సహించంవాహనాలకు అదనపు హంగుల కోసం పెట్టిన ఖర్చు సహేతుకమా, కాదా అనేది తేల్చేందుకే ప్రత్యేక ఆడిట్ చేయాలని ఆదేశించినట్టు మంత్రి గణేష్ రామ్ సింగ్ (Ganesh Ram Singh Khuntia) తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. అటవీశాఖ అవసరాలకు అనుగుణంగా వాహనాల్లో కొన్ని మార్పులు చేస్తుంటారని చెప్పారు. అడవుల్లో విధులు నిర్వహించేందుకు అనువుగా ఉండేలా వాహనాల్లో అదనపు లైట్లు, కెమెరాలు, సైరన్లు, ప్రత్యేక టైర్లు, ఇతర పరికరాలను అమర్చుతారని తెలిపారు. అయితే అధికంగా లేదా అనవసరంగా చేసే ఎలాంటి ఖర్చునైనా తాము సహించబోమని ఆయన స్పష్టం చేశారు.చదవండి: త్వరలో మోదీ 3.ఓ కేబినెట్ విస్తరణ!మార్పులు అవసరంతాము కొనుగోలు చేసిన వాహనాలకు అవసరానికి మించి ఖర్చు చేశామా, లేదా అనేది ఆడిటింగ్ తేలుతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. తమ శాఖ విధులకు అనుగుణంగా వాహనాలకు మార్పులు చేయడం అవసరమని వారు చెబుతున్నారు. ఫ్రంట్లైన్ సిబ్బంది పెట్రోలింగ్, దావానలం నియంత్రణ, వన్యప్రాణుల రక్షణ, కలప అక్రమ రవాణా నివారణ, పర్యాటకుల జంగిల్ సఫారీల కోసం ఈ వాహనాలను వినియోగిస్తామని చెప్పారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్, సత్కోసియా టైగర్ రిజర్వ్, డెబ్రిఘర్ వన్యప్రాణుల అభయారణ్యం సహా ఇతర ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో విధులకు ఈ కస్టమైజ్డ్ ఎస్యూవీలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. -
సంచలన అత్యాచార కేసులో నేరస్తుడికి శిక్ష రద్దు, బెయిల్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార కేసులో సంచలనం పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, జీవితఖైదు అనుభవిస్తున్న బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు మంగళవారం రద్దు చేయడం సంచలనంగా మారింది.జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం సెంగర్కు బెయిల్ను మంజూరు చేసింది. 15 లక్షల వ్యక్తిగత బాండ్తోపాటు, ముగ్గురు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. బాధితురాలి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించవద్దని కూడా హైకోర్టు సెంగర్ను ఆదేశించింది. వీటిల్లో ఏ షరతును ఉల్లంఘించినా అతని బెయిల్ రద్దు అవుతుందని కోర్టు తెలిపింది.అత్యాచారం కేసులో సెంగర్ తన దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్లో ఉండే వరకు ఆయన శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. అత్యాచారం కేసులో డిసెంబర్ 2019 ట్రయల్ కోర్టు తీర్పును సెంగర్ సవాలు చేశాడు. 2019, ఆగస్టులో ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుండి ఢిల్లీకి బదిలీ చేశారు.అసలు కేసు ఏంటి?2017లో బీజేపీ నేతగా ఉన్న కుల్దీప్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆ తరువాత బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ మరింత ఆందోళన రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ అతణ్ని పార్టీనుంచి తొలగించింది. బాధితురాలి తండ్రి మరణం కేసులో తన దోషిగా నిర్ధారించబడ్డాడు. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే ఇప్పటికే గణనీయమైన సమయం జైలులోగడిపినందున శిక్షను నిలిపివేయాలని కూడా కుల్దీప్ అప్పీలు చేశాడు. ఇది పెండింగ్లో ఉంది. -
యువతికి వేధింపులు : హౌసింగ్ సొసైటీపై రూ.62లక్షల దావా, చివరికి
బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యుల వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..బాధిత యువతి రెడ్డిట్లో షేర్ చేసిన వివరాల ప్రకారం అపార్ట్మెంట్లో తన స్నేహితులతో ఏర్పాటు చేస్తున్న మీట్ ఘర్షణ దారితీసింది. అది చివరికి రూ.62 లక్షల సివిల్ దావా, నిందితులైన బోర్డు సభ్యులకు 20వేల జరిమానా, తొలగింపుతో ముగిసింది. తన ఐదుగురు స్నేహితులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు వివాదం మొదలైంది. వారు తన ఫ్లాట్కి వచ్చినపుడు, ఎలాంటి సంగీత ధ్వనులు లేకుండా, గోల, గందరగోళం లేకుండా, చాలా కామ్గా తమ ఇంట్లో ఆమె వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇంతలో ఆ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యుడు ఆమె ఫ్లాట్కి వచ్చి "బ్యాచిలర్లకు అనుమతి లేదు" అని చెప్పి, ఫ్లాట్ యజమానికి ఫోన్ చేయమని కోరడంతో సమస్య మొదలైంది. తాను తన ఓనర్తో మాట్లాడానని, మీ సమస్య ఏంటి అని ప్రశ్నించింది. ఆ తరువాత కొద్దిసేపటికే, నలుగురైదుగురు పురుషులు ఆమె గదిలోకి బలవంతంగా ఎంట్రీ ఇచ్చారు. మద్యం, గంజాయి తాగుతున్నారని ఆరోపిస్తూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగిపోలేదు. మరుసటి రోజు ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఆమె ఫ్రెండ్స్లోని జెంట్స్ వారిని బైటికి నెట్టారు. రెచ్చిపోతున్న ఒక సభ్యుడిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో సొసైటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసు అధికారులు వచ్చి ఆమెను యాజమాన్యాన్ని నిరూపించమని అడిగారు. అయితే తాను ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలిగించలేదంటూ అందుకు నిరాకరించింది. అలాగే లివింగ్-రూమ్ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ను చూపించింది.అలాగే ఆమె CCTV ఆధారాలను బిల్డర్చ సొసైటీ ఛైర్మన్కు సమర్పించినప్పుడు, నిందితులైన సభ్యులను వెంటనే తొలగించారు ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానా విధించారని మరో పోస్ట్లో వెల్లడించింది.మరోవైపు వేధింపులు, అతిక్రమణ, దాడి ఆరోపణలతో హౌసింగ్ సొసైటీ, బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రూ. 62 లక్షల పరిహారం చెల్లించాలంటే దావా వేసింది. అలాగే పురుషులు మళ్ళీ తన ఫ్లాట్లోకి రాకుండా ఉండేలా శాశ్వత నిషేధాన్ని కూడా ఆమె కోరింది.సోషల్ మీడియా ప్రశంసలుఆమె పోస్ట్లు వైరల్ గామారాయి. ఆమె ధైర్యాన్ని , సంకల్పాన్ని నెటిజన్లు కొనియాడారు. ఆ కేసుతో ముందుకు సాగండి—ఎవరూ ఒకరి ఇంట్లోకి చొరబడలేరు” అని ఒకరు ధైర్యం చెప్పారు. -
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..22 మంది లొంగుబాటు
వరుస దెబ్బలతో అట్టుడుకుతున్న మావోయిస్టు పార్టీకి ఏవోబీలో మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 22మంది నక్సల్స్ లొంగిపోయారు. ఒడిశా మల్కాన్ గిరి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మావోయిస్టుల వద్ద ఉన్న 14 ల్యాండ్మైన్లను పోలీసులకు అప్పగించారు. వీరందరిపై రూ.2.18కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.మార్చి 2026 నాటికి దేశంలో నక్సలైట్లను లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాయుధబలగాలు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో నక్సల్స్పై విరుచుకపడుతున్నాయి. దీంతో పెద్దఎత్తున మావోయుస్టులు ఎన్కౌంటర్లలో మరణిస్తున్నారు. అంతే స్థాయిలో పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు.ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ భవితత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
ఆశ్చర్యపరిచే నిర్ణయాలు!
కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.ఓ ప్రభుత్వం మరోసారి ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకోబోతోంది. యువతను ప్రోత్సహించేలా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. యువ నాయకత్వంపై మోదీ సర్కారు ఫోకస్ పెంచింది. ప్రభుత్వంలో వారికి పెద్దపీట వేయడానికి సిద్ధమవుతోంది. కేంద్ర కేబినెట్లో యువ నేతలకు మరిన్ని కొలువులు కట్టబెట్టడానికి కసరత్తు చేస్తోంది. మోదీ 3.ఓ కేబినెట్లో యువతరానికి త్వరలో తగిన ప్రాధాన్యం దక్కబోతోంది. దీనికి కొంత సమయం పడుతుందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడంతో కమలనాథులు ఫుల్ జోష్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నిల్లోనూ ఇదే జోరు చూపించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కార్యాచరణలోకి దిగిపోయారు. వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్ మధ్యలో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీదీని నాలుగోసారి సీఎం కాకుండా అడ్డుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు బెంగాల్ పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బెంగాల్లో సభలు నిర్వహిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఆశ్చర్యపరిచే నిర్ణయాలుపశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ సర్కారు ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోబోతోందని సమాచారం. కేంద్ర కేబినెట్ విస్తరణతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్టు 'ది సండే గార్డియన్స్ నివేదించింది. బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత 45 ఏళ్ల నితిన్ నబీన్ను (Nitin Nabin) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి అందరినీ బీజేపీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే విధంగా బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎవరూ ఊహించని నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.యువతకు పెద్దపీటపార్టీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికి కేంద్ర కేబినెట్లో పెద్దపీట వేయనున్నారని సమాచారం. ఒకవేళ బెంగాల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే ఆ రాష్ట్రం నుంచి మరికొంత మందికి కేబినెట్ బెర్త్లు దక్కే చాన్స్ ఉంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన పనితీరు కనబరిస్తే.. ఇద్దరు పూర్తిస్థాయి కేంద్ర మంత్రులను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమచారం.పనితీరే గీటురాయిజాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ను ఎంపిక చేయడానికి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో దాదాపు వాటినే కొత్త మంత్రుల ఎంపికలో పాటిస్తారని తెలుస్తోంది. ఎటువంటి వివాదాలు లేకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడంతో పాటు ఎక్కువ కాలం బాధ్యతలు చేపట్టగల యువ నాయకులకు అవకాశం ఇస్తారని సమాచారం. పార్టీకి ఎక్కువ కాలం పాటు బాధ్యతలు చేపట్టగల సామర్థ్యంతో పాటు, స్థిరమైన సంస్థాగత పనితీరుతో మంచి ఫలితాలు రాబట్టగలిగే యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూనే.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా ఎంపికలు ఉంటాయని సమాచారం.చదవండి: కలిసి వస్తున్నాం.. కాస్కోండి!కేబినెట్లో 10 ఖాళీలు!ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 72 మంది మంత్రులు ఉన్నారు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం గరిష్టంగా 81 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుత కేబినెట్లో 9 ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) బీజేపీ ఇటీవల ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. దీంతో కేబినెట్లో ఖాళీల సంఖ్య 10కి చేరుతుంది. ప్రధానిగా తన రెండవ హయాంలో 78 మంత్రులకు కేబినెట్లో చోటు కల్పించారు. దీని ప్రకారం చూసుకున్నా ప్రస్తుత మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. చూడాలి బెంగాల్ ఎన్నికలు ఎవరిని అందలం ఎక్కిస్తాయో! -
భారత్ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్కు చుక్కలే..
న్యూఢిల్లీ: తరచూ దుందుడుకు చర్యలకు పాల్పడే చైనాకు భారత్ అడ్డుకట్ట వేస్తోంది. చైనా సరిహద్దు వెంబడి భారత్ మరో భారీ వ్యూహాత్మక అడుగు వేసింది. ఉత్తరాఖండ్లోని నీలపాణి నుండి ములింగ్ లా వరకు 16,134 అడుగుల అత్యంత ఎత్తైన ప్రాంతంలో 32 కిలోమీటర్ల మేర నిర్మితమవుతున్న‘మెగా రోడ్డు’ పనులను భారత్ ముమ్మరం చేసింది. అన్ని వాతావరణాలను తట్టుకునేలాంటి రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. రూ. 104 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చేపడుతున్న ఈ ప్రాజెక్టు, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)వద్ద భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచనున్నది.ప్రస్తుతం ములింగ్ లా బేస్ క్యాంపు చేరుకోవాలంటే సైనికులు ఐదు రోజుల పాటు కఠినమైన కొండ మార్గాల్లో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తున్నది. శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా ఈ మార్గం పూర్తిగా మూసుకుపోతుంటుంది. దీంతో కేవలం హెలికాప్టర్ల ద్వారానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఈ నూతన రహదారి పూర్తయితే, ఐదు రోజుల ప్రయాణం కేవలం కొద్ది గంటల్లోనే ముగియనుంది. తద్వారా దళాల మోహరింపు, రేషన్, ఇంధనం, యుద్ధ సామగ్రిని ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా సరిహద్దుకు చేరవేసే అవకాశం కలుగుతుంది.ఒకప్పుడు సరిహద్దుల్లో రహదారులు నిర్మిస్తే చైనా చొరబడుతుందని భారత్ భావించింది. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి,‘కనెక్టివిటీయే బలం’ అనే దిశగా అడుగులు వేస్తోంది. టిబెట్ ప్రాంతంలో చైనా ఇప్పటికే భారీగా రోడ్డు, రైలు నెట్వర్క్ను నిర్మించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. 2020 తూర్పు లడఖ్ ప్రతిష్టంభన తర్వాత, సరిహద్దుల్లోని చివరి మైలు వరకు సైనిక కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా మెగా రోడ్డు పనులు జరుగుతున్నాయి.హిమాలయాల్లోని అత్యంత కఠినమైన భూభాగంలో సాగుతున్న ఈ రోడ్డు నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా పెద్ద సవాలుతో కూడుకున్నది. ఈ రహదారి పూర్తయితే వాయు సేనపై ఆధారపడే అవసరం తగ్గి, రక్షణ వ్యయం గణనీయంగా ఆదా కానుంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఉంటేనే, వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యమని భారత్ భావిస్తోంది. తద్వారా సరిహద్దు ప్రాంతాలు మరింత సుస్థిరంగా ఉంటాయని రక్షణ నిపుణులు అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో చైనా చొరబాట్లకు భారత్ సమర్థవంతంగా అడ్డుకట్ట వేయగలదని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: liquor Scam: మాజీ సీఎం కుమారునికి రూ. 250 కోట్లు? -
మరిది.. నీ భార్యకు వేరొకరితో సంబంధం ఉంది!
తమిళనాడు: తన భార్యతో తరచూ ఘర్షణ పడుతుందనే కారణంతో వదిననూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన మరిదిని మప్పేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఇరుళంజేరి గ్రామానికి చెందిన ఇళయరాజ. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన శాంతిమేరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు.కాగా ఇళయరాజ సోదరుడు ఇసైమేగం(29). ఇతడికి పేరంబాక్కం గ్రామానికి చెందిన లావణ్య(24)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం లావణ్య మూడు నెలల గర్బవతి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉంటున్నారు. కాగా శాంతిమేరికి వివాహమై రెండు సంవత్సరాల తరువాత పిల్లలు పుట్టగా, లావణ్యకు వివాహమైన నాలుగు నెలలకే గర్బం దాల్చింది. ఈ విషయమై శాంతిమేరి తరచూ లావణ్యకు వివాహానికి ముందే వేరొకరితో సంబంధం ఉందంటూ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఆదివారం రాత్రి శాంతిమేరికి, లావణ్యకు చిన్నపాటి ఘర్షణ జరగడంతో ఆగ్రహించిన ఇసైమేగం తన భార్యకు అక్రమ సంబందాన్ని అంటగట్టుతున్నారనే ఆగ్రహంతో వదినపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డన శాంతిమేరిని స్థానికులు చికిత్స కోసం తిరువళ్లూరుకు తరలించగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటన ఇరుళంజేరిలో తీవ్ర సంచనలం కలిగింది. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
liquor Scam: మాజీ సీఎం కుమారునికి రూ. 250 కోట్లు?
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్పై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో జరిగిన రూ. మూడువేల కోట్ల మద్యం కుంభకోణంలో చైతన్యకు వాటా మొత్తంగా రూ. 200 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకూ అందినట్లు ఏసీబీ తన ఏడవ అనుబంధ చార్జిషీట్లో పేర్కొంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చైతన్య ఎక్సైజ్ శాఖలో వసూళ్ల రాకెట్ను (సిండికేట్) ఏర్పాటు చేయడంలో చైతన్య కీలక పాత్ర పోషించాడని దర్యాప్తు సంస్థ వెల్లడించింది.సుమారు 3,800 పేజీల ఈ సమగ్ర చార్జిషీట్లోని వివరాల ప్రకారం నిందితుడు అన్వర్ ధేబర్ బృందం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని తరలించడానికి చైతన్య తన వ్యక్తిగత నెట్వర్క్ను ఉపయోగించినట్లు సమాచారం. ఈ క్రమంలో మద్యం వ్యాపారి త్రిలోక్ సింగ్ ధిల్లాన్కు చెందిన వివిధ సంస్థల ద్వారా నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భారీ మొత్తాన్ని బ్యాంకింగ్ మార్గాల ద్వారా తన కుటుంబ వ్యాపారాలకు తరలించడంతో పాటు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడి పెట్టినట్లు చార్జిషీట్లో వివరించారు.ఈ కుంభకోణం కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లగా, మద్యం సిండికేట్ సభ్యులు మాత్రం అక్రమంగా సంపన్నులయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)స్పష్టం చేసింది. చైతన్య తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో ఈ నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు ప్రయత్నించారని ఏజెన్సీ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూలై 18న జరిగిన సోదాల అనంతరం.. చైతన్యను ఈడీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు.ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన డిజిటల్ ఆధారాలు, విచారణలో వెల్లడైన కీలక అంశాలను తాజా చార్జిషీట్లో పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఈ తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయంపై మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.ఇది కూడా చదవండి: కాలువలో మొండెం.. వెలుగులోకి భార్య కిరాతకం -
బిడ్డను చూపాలంటే రూ.30 లక్షలు ఇవ్వు
మైసూరు: భార్య వేధింపులతో జీవితం మీద విరక్తి చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మైసూరు ఆలనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. జిల్లా టి. నరసిపుర తాలూకా నివాసి, ప్రైవేటు కంపెనీ ఇంజనీర్ ఉమేష్ (34), మైసూరులోని సిద్ధార్థ బరంగే నివాసి చన్నబసవేగౌడ కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. ప్రారంభంలో బాగానే ఉన్న భార్యాభర్తలు తరువాత తరచుగా గొడవ పడుతుండేవారని ఉమేష్ తండ్రి గురుమల్లెగౌడ తన ఫిర్యాదులో తెలిపాడు. గత 2 సంవత్సరాలుగా, ఉమేష్ తన చిన్నారి కూతురిని చూడలేక పోయాడు. భార్య బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బిడ్డను చూడాలనుకుంటే డబ్బులు ఇవ్వాలని ఆమె వేధించేది. ఇది తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేవాడు. డిసెంబర్ 19న, భార్యకు వీడియో కాల్ చేసి, తన కూతురిని చూపించమని అడిగాడు. అయితే, రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్చేసింది. దీంతో ఆవేదన చెందిన ఉమేష్ తన బాడుగ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. భార్య రమ్య, అతని తల్లిదండ్రులపై చన్నబసవేగౌడపై అలనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
కాలువలో మొండెం.. వెలుగులోకి భార్య కిరాతకం
సంభల్: ఉత్తరప్రదేశ్లోని సంభల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక దారుణ హత్యోదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఒక ఇల్లాలు తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్యచేసింది. అంతటితో ఆగకుండా మృతదేహం ఆనవాళ్లు దొరకకూడదని దానిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రాంతాల్లో పారేసిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది.నవంబర్ 18న తన భర్త రాహుల్ అదృశ్యమయ్యాడంటూ భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హైడ్రామా మొదలైంది. డిసెంబర్ 15న ఇక్కడి ఒక కాలువలో తల, కాళ్లు, చేతులు లేని మొండెం పోలీసులకు లభించింది. ఆ మొండెంపై ఉన్న ‘రాహుల్’ అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులకు రూబీపై అనుమానం కలగడంతో అసలు నిజం బయటపడింది.పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ కలిసి రాహుల్ను ఇనుప రాడ్డు, రోకలితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ఒక చెక్కలు కోసే గ్రైండర్ను తీసుకువచ్చి, మృతదేహాన్ని ముక్కలుగా కోశారు. ఒక భాగాన్ని కాలువలో పడేయగా, మిగిలిన శరీర భాగాలను రాజ్ఘాట్కు తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలిపేసి ఏమీ తెలియనట్టు నాటకమాడారు.నిందితులు హత్యకు ఉపయోగించిన గ్రైండర్, ఇనుప సుత్తి మరియు ఇతర పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రూబీ, గౌరవ్లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మృతదేహం రాహుల్దేనని నిరూపించేందుకు అతని పిల్లల డీఎన్ఏ నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ -
ఢిల్లీలో ఉద్రిక్తత.. బంగ్లా హైకమిషన్ వద్ద హిందూ సంఘాల నిరసనలు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరససగా వీహెచ్పీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దారుణాలు, దీపూ చంద్ర దాస్ను హత్య చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద బారికేడ్లు తోసుకుంటూ వీహెచ్పీ నేతలు లోపలికి వెళ్లే యత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో హిందూ సంఘాలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. #WATCH | Delhi | Members of Vishva Hindu Parishad and other Hindu organisations protest near the Bangladesh High Commission over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh pic.twitter.com/0nrtZ3XWYG— ANI (@ANI) December 23, 2025దీపు చంద్రదాస్ హత్య చేసిన వారిని శిక్షించాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యూనస్ ప్రభుత్వం రాడికల్స్ మద్దతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, హిందువులపై అత్యాచారాలు నిరోధించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని హిందువులను రక్షించాలని కోరారు. 1971 తరహాలో తప్పు చేయవద్దని ఇండియాలో బంగ్లాదేశ్ను కలపాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. అనంతరం.. ఆందోళకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలిసింది. మరోవైపు.. బంగ్లాదేశ్పై ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 జరగాలంటూ వీహెచ్పీ డిమాండ్ చేసింది. #WATCH | Delhi | Vishva Hindu Parishad and other hindu organisations protest near the Bangladesh High Commission against the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das pic.twitter.com/aKo0T3BUs2— ANI (@ANI) December 23, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్లో సైతం హిందు సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భోపాల్లో బజరంగ్ దళ్ నేతలు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. #WATCH | Bajrang Dal and other Hindu organisations protest over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh, in BhopalA Bajrang Dal member says,"Bajrang Dal has protested against the Bangladesh government today. We demand that… https://t.co/O134zU9B9p pic.twitter.com/1xVG722dxQ— ANI (@ANI) December 23, 2025 -
రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ
బెర్లిన్: జర్మనీలోని బెర్లిన్లో గల హెర్టీ స్కూల్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ సమాన హక్కులు కల్పించే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల మధ్య, భాషల మధ్య, మతాల మధ్య ఉన్న సమానత్వ భావనను దెబ్బతీస్తూ, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను బీజేపీ కాలరాస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఒక గంట నిడివి గల వీడియోను విడుదల చేసింది.ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇది కేవలం భారతీయుల ఆస్తి మాత్రమే కాదని, ప్రపంచ సంపద అని రాహుల్ అభివర్ణించారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న ఏ దాడి అయినా, దానిని అంతర్జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగే దాడిగానే పరిగణించాలని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకుని, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, వాటిని ఆయుధాలుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. This battle is no longer just about elections. It’s about protecting the foundation of our Constitution and Democracy - One Person, One Vote. pic.twitter.com/QjecwCtjxr— Congress (@INCIndia) December 22, 2025దేశంలోని దర్యాప్తు సంస్థలైన ఈడీ (ఈడీ), సీబీఐ (సీబీఐ)ల పనితీరును రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ ఈ సంస్థలను నిర్మించడంలో సహకరించినప్పటికీ, బీజేపీ మాత్రం వాటిని తమ సొంత ఆస్తులుగా వాడుకుంటూ, ప్రతిపక్షాలపై రాజకీయ కేసులు పెడుతోందని విమర్శించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని తాము నిరూపించామని, అలాగే మహారాష్ట్ర ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని తాము భావించడం లేదని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక నమూనాపై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్ కాలం నాటి ఆర్థిక విధానాలనే బీజేపీ ముందుకు తీసుకెళ్తోందని, ప్రస్తుత మోదీ ఆర్థిక విధానం పూర్తిగా నిలిచిపోయిందని రాహుల్ అన్నారు. దేశంలోని సంస్థాగత వ్యవస్థపై జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఒక బలమైన ప్రతిఘటన వ్యవస్థను రూపొందిస్తున్నాయన్నాయన్నారు. కేవలం ఎన్నికల లోపాలను ఎత్తిచూపడమే కాకుండా గెలుపు వైపు నడిచే పద్ధతిని సిద్ధం చేస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు.ఇండియా కూటమి పార్టీల మధ్య వ్యూహాత్మక విభేదాలు ఉన్నప్పటికీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఎదుర్కోవడంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తామంతా చాలా ఐక్యంగా ఉన్నామని రాహుల్ గాంధీ తెలిపారు. పార్లమెంటులో ప్రతిరోజూ ప్రతిపక్షాల ఐక్యత కనిపిస్తున్నదని, తమకు సమ్మతం లేని చట్టాలపై బీజేపీని గట్టిగా నిలదీస్తామని రాహుల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఎఫెక్ట్.. ‘గన్ బైబ్యాక్’ సంచలనం! -
ఈ నెల 27న ఘనంగా మండల పూజ,హరివరాసనం..ఆలయం మూసివేత
శబరిమల (Shabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు ప్రకటించారు. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.మండల పూజ సమయాలు, జరిగే ఆచారాలు..మండల పూజ 27న ఉదయం 10:10AM నుండి 11:30AM వరకు జరిగే అవకాశముంది. 26న రాత్రి 6:30PM సమయంలో, పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకి చేరుకుంటాయి. ఈ వస్త్రాలు స్వామి అలంకరణకు ఉపయోగిస్తారుఈ వస్త్రాలతో దీపారాధన నిర్వహిస్తారు. దీపారాధన తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఘనంగా హరివరాసనం, ఆలయ మూసివేతపూజ అనంతరం, 27న రాత్రి 11:00PMకి హరివరాసనం పూర్తి అవుతుంది. హరివరాసనం శబరిమలలో(Shabarimala) జరిగే మహత్తరమైన ఉత్సవాలలో ఒకటిగా పేర్కొంటారు. దీని అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.ఆలయ కార్యక్రమాల సమగ్ర వివరాలు:పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరవేత: 26న రాత్రి 6:30PM.దీపారాధన: 26న పూజ అనంతరం.మండల పూజ: 27న ఉదయం 10:10AM నుంచి 11:30AM.హరివరాసనం: 27న రాత్రి 11:00PM.ఆలయ మూసివేత: హరివరాసనం తర్వాత, 27న రాత్రి.మకరవిళక్కు ఉత్సవం: 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుస్తారుమండల పూజకు నెయ్యభిషేకం సమయాలుశబరిమల య్యప్ప సన్నిధానంలో మండల పూజా ఏర్పాట్లలో భాగంగా శబరిమల వద్ద నెయ్యభిషేకం సమయాలు పరిమితం చేశారు. పవిత్ర నైవేద్యం డిసెంబర్ 26న ఉదయం 10:30 గంటల వరకు ఉండగా, డిసెంబర్ 27న ఉదయం 9:30 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు.అందువల్ల నెయ్యభిషేకం ప్లాన్ చేసుకునే భక్తులు ముందుగానే చేరుకుని, తదనుగుణంగా దర్శనం చేసుకోవాలని సూచించారు. మండల పూజ సమయంలో ఆచారాలు సజావుగా జరిగేలా ఆలయ అధికారులతో సహకరించాలని కోరారు.(చదవండి: ఇవాళే ధంక అంగి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..) -
ఇవాళే థంక అంకి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..
శబరిమలలో మండల కాలంలో అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటైన థంక అంకి (స్వర్ణ వస్త్రం)తో కూడిన దీపారాధన డిసెంబర్ 26 సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు. అయితే అంతకంటే ముందు జరిగే ఈ థంక అంకి ప్రదక్షిణ లేదా ఊరేగింపు ఈ రోజు నుంచే మొదలవ్వుతుంది. ఇంతకీ అసలేంటి థంక అంకి ఊరేగింపు, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!థంక అంకి ప్రదక్షిణ అంటే ..శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజకు ముందు జరిగే పవిత్ర బంగారు వస్త్రాల ఊరేగింపు. ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.ఎప్పుడు జరుగుతుందంటే..శబరిమలలో అయ్యప్ప మండల పూజకు నాలుగు రోజుల ముందు ఈ ఊరేగింపు ప్రారంభమవుతుంది.ముందుగా పతనంతిట్టలోని అరన్ముల పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరుతుంది. నిలక్కల్ పంప మీదుగా శబరిమల సన్నిధానానికి చేరుతుంది. ఇక "థంక అంకి" అనేది అయ్యప్ప విగ్రహానికి అలంకరించే బంగారు వస్త్రం. ఇందులో కిరీటం, పాదుకలు, చేతి తొడుగులు, ముఖం, పీఠం వంటి ఆభరణాలు ఉంటాయి.ప్రాముఖ్యతఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతుంది అక్కడి వాతావరణం. వృశ్చికరాశి కాలంలో జరిగే మండల పూజలో అయ్యప్ప స్వామిని థంక అంకితో అలంకరించడం ఒక అనాదికాలపు సంప్రదాయం. థంక అంకిని దర్శించడం, ప్రదక్షిణలో పాల్గొనడం భక్తులకు మహా పుణ్యప్రదం అని నమ్మకం.చరిత్ర:ఈ థంక అంకిని 1973లో అప్పటి ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి చెందిన దివంగత చిత్తిర తిరునాళ్ బాలరామ వర్మ మహారాజు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సమర్పించారు. అరణ్ముల పార్థసారథి ఆలయం నుంచి భవ్యమైన ఊరేగింపుగా తీసుకురాబడే థంక అంకి డిసెంబర్ 26 సాయంత్రం సుమారు 5 గంటలకు శరన్ గుత్తికి చేరుతుంది.ఆ రోజు సాయంత్రం దేవాలయం తెరచిన తరువాత తంత్రిగారు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర మాలలను అలంకరించిన అనంతరం థంక అంకిని స్వాగతించేందుకు బృందాన్ని పంపుతారు. సాంప్రదాయ వాద్యబృందాలు , కఠినమైన పోలీసు భద్రత మధ్య ఈ ఊరేగింపు సన్నిధానానికి చేరుతుంది.18 పవిత్ర మెట్లు ప్రారంభంలో దేవస్వం బోర్డు అధ్యక్షులు, సభ్యులు థంక అంకిని స్వీకరించి సోపానం వరకు తీసుకువెళ్తారు. అక్కడ తంత్రి, మెల్సాంతి థంక అంకిని ఆచారపూర్వకంగా స్వీకరించి అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరిస్తారు. తదనంతరం దీపారాధన నిర్వహిస్తారు. ఈ ఘడియలోనే మండల కాలంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సన్నిధానంలో చేరుతారు.థంక అంకి ఊరేగింపు మార్గం, సమయాలుడిసెంబర్ 23–24 (మొదటి రోజు మార్గం)మూర్తిత్త గణపతి ఆలయం – 7:15 AMపున్నంథొట్టం దేవి ఆలయం – 7:30 AMచవిట్టుక మహాదేవ ఆలయం – 7:45 AMతిరువంచంకావు ఆలయం – 8:00 AMనెడుంప్రయార్ తేవరశేరి దేవి ఆలయం – 8:30 AMనెడుంప్రయార్ జంక్షన్ – 9:30 AMకోజెంచెరి పట్టణం – 10:00 AMఅయ్యప్ప మండపం (కాలేజ్ జంక్షన్) – 10:15 AMపంపడిమోన్ అయ్యప్ప ఆలయం – 10:30 AMకరిమ్వేలి – 11:00 AMఎలంతూర్ ఎడతావళం – 11:15 AMఎలంతూర్ భగవతీకున్ను ఆలయం – 11:20 AMఎలంతూర్ గణపతి ఆలయం – 11:30 AMఎలంతూర్ నారాయణమంగళం – 12:30 PMఆయతిల్ మలానాడ జంక్షన్ – 2:00 PMఆయతిల్ గురుమండిరం జంక్షన్ – 2:40 PMమెఝువేలి ఆనందభూతేశ్వర ఆలయం – 2:50 PMఎలవుంథిట్ట దేవి ఆలయం – 3:15 PMఎలవుంథిట్ట మలానాడ – 3:45 PMముట్టత్తుకోణం SNDP మందిరం – 4:30 PMకైథవాన దేవి ఆలయం – 5:30 PMప్రకణం ఎడనాడ దేవి ఆలయం – 6:00 PMచీకనల్ – 6:30 PMఉప్పమోన్ జంక్షన్ – 7:00 PMఒమల్లూర్ శ్రీరక్తకంఠ స్వామి ఆలయం – 8:00 PMడిసెంబర్ 24 – రెండో రోజు (ఉదయం 8 గంటలకు ఒమల్లూర్ నుండి ప్రారంభం)కొడుంతర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం – 9:00 AMఅఝూర్ జంక్షన్ – 10:00 AMపథనంతిట్ట ఉర్మన్ కోవిల్ – 10:45 AMపథనంతిట్ట ఆలయం – 11:00 AMకరింపనక్కల్ దేవి ఆలయం – 11:30 AMశారదామఠం ముండుకొట్టక్కల్ SNDP హాల్ – 12:00 PMకడమణిట్ట భగవతి ఆలయం – 1:00 PMకొట్టపారా కల్లెలిముక్కు – 2:30 PMపెరుంకాడ SNDP హాల్ – 2:45 PMమైకోజూర్ ఆలయం – 3:15 PMమైలాప్ర భగవతి ఆలయం – 3:45 PMకుంబఝా జంక్షన్ – 4:15 PMపలమత్తూర్ అంబలముక్కు – 4:30 PMవెట్టూర్ మహావిష్ణు ఆలయం (గోపురప్పడి) – 5:30 PMఎలకొల్లూర్ మహాదేవ ఆలయం – 6:15 PMచిత్తూర్ముక్కు – 7:15 PMకొన్నీ పట్టణం – 7:45 PMకొన్నీ చిరైక్కల్ ఆలయం – 8:00 PMకొన్నీ మురింగమంగళం ఆలయం – 8:30 PMడిసెంబర్ 25 – మూడో రోజు (ఉదయం 7:30 – మురింగమంగళం నుండి)చిత్తూర్ మహాదేవ ఆలయం – 8:00 AMవెట్టూర్ ఆలయం – 9:00 AMమైలాడుంపారా – 10:30 AMకొట్టముక్కు – 11:00 AMమలయాలపుఝ ఆలయం – 12:00 PMమలయాలపుఝ తాళం – 1:00 PMమన్నరకులంజి ఆలయం – 1:15 PMరన్నీ రామపురం ఆలయం – 3:30 PMఇదక్కులం ఆలయం – 5:30 PMవడశేరిక్కర చేరుకావు – 6:30 PMప్రయార్ మహావిష్ణు ఆలయం – 7:00 PMమడమోన్ ఆలయం – 7:45 PMపెరునాడ్ ఆలయం – 8:30 PMడిసెంబర్ 26 – తుది రోజు (ఉదయం 8:00 – పెరునాడ్ నుండి)లాహా – 9:00 AMప్లప్పల్లి – 10:00 AMనిలక్కల్ మహాదేవ ఆలయం – 11:00 AMపంప – 1:30 PMశరణ్కుట్టి – 5:00 PMఅనంతరం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి థంక అంకి చేరుకుంటుంది. ఇక మండల పూజ అనంతరం థంక అంకి వస్త్రాన్ని అరన్ముల పార్థసారథి ఆలయానికి తీసుకెళ్లి దేవస్వామ్లోని స్ట్రాంగ్రూమ్లో ఉంచుతారు. తొలినాళ్లలో కొట్టాయం నుంచి హంస రథంలో ఈ థంక అంకి వస్త్రాన్ని సన్నిధానానికి తీసుకెళ్లేవారు. అయితే గత కొన్నేళ్లుగా లక్షలాది మంది భక్తులు థంక అంగీ, దీపారాధన ఊరేగింపును చూసేందుకు భారీగా తరలివస్తుండటం విశేషం. ఇక ఈ ఏడాది కూడా మండలపూజకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. (చదవండి: శబరిమల యాత్రికులకు సాంప్రదాయ కేరళ సాద్య..! ఈ విందలో ఏం ఉంటాయంటే..) -
‘అర్థరాత్రి రోడ్లపై..’ శశి థరూర్ వ్యాఖ్యల కలకలం
పట్నా: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన బిహార్ మౌలిక సదుపాయాలపై చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. నలంద సాహిత్య ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రశంసించడం విశేషంగా మారింది.బిహార్లో గతంతో పోలిస్తే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా మొదలైన సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రజలు నిర్భయంగా రోడ్లపై తిరగగలుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. బిహార్లో ప్రత్యర్థి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, ఇక్కడ జరిగిన అభివృద్ధిని గుర్తిస్తూ, థరూర్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో విలేకరులు థరూర్ను రాజకీయ అంశాలపై స్పందించమని కోరగా, ఆయన ‘నన్ను రాజకీయాల్లోకి లాగకండి, ఇక్కడి పురోగతిని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈ ప్రశంసలు బిహార్ ప్రజలకు, వారి ప్రతినిధులకు దక్కుతాయి’ అని పేర్కొన్నారు. కాగా రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీలోని మంచిని గుర్తించాలనే తన ధోరణిని మరోసారి బయటపెట్టారు. అయితే ఇటీవల సీఎం నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలి హిజాబ్ విషయంలో ప్రవర్తించిన తీరును థరూర్ తప్పుబట్టారు.బిజెపి-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని థరూర్ ప్రశంసించడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను సమర్థించడం, పాకిస్తాన్పై సైనిక దాడుల నిర్వహణను మెచ్చుకోవడం తదితర అంశాల కారణంగా థరూర్కు, పార్టీ నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతున్నదనే వార్తలు వినిపించాయి. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకుంటూనే, తమ పార్టీ సిద్ధాంతాలకు భంగం కలిగినప్పుడు విమర్శించడంలో థరూర్ తన శైలిని బయటపెట్టారు. తాజాగా బిహార్ పర్యటనలో థరూర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.ఇది కూడా చదవండి: నేటికీ శతాబ్దాల నాటి యుద్ధ వ్యూహాలు.. వీడియో వైరల్ -
డాక్టరా?.. దండపాణా?
సిమ్లా: ప్రాణం పోయాల్సిన చోట.. ప్రాణభ యం నీడలా వెంటాడింది. రోగికి అండగా ఉండాల్సిన వైద్యుడే.. యమధర్మరాజులా విరుచుకుపడ్డాడు. సిమ్లా (హిమాచల్ ప్రదేశ్)లోని అ త్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ వైద్య కళాశాల (ఐజీఎంసీ) ఆసుపత్రి ఒక అమాన వీయ ఘటనకు వేదికైంది. ఊపిరి అందక విలవిల్లాడుతున్న రోగికి వైద్యం అందించాల్సింది పోయి, రౌడీలా మారి ముష్టిఘాతా లు కురిపించాడొక వైద్యుడు. ప్రస్తుతం సోష ల్ మీడియాను కుదిపేస్తున్న ఆ వీడియోను చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది! అసలేం జరిగిందంటే.. అర్జున్ పవార్ అనే వ్యక్తి ఎండోస్కోపీ పరీక్ష కోసం ఐజీఎంసీకి వచ్చాడు. పరీక్ష పూర్తయ్యాక అతనికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆయాసంతో ఊపిరాడక, కాస్త ఉపశమనం కోసం పక్కనున్న వార్డులోని ఒక ఖాళీ బెడ్పై పడుకున్నాడు. అదే అతను చేసిన ’నేరం’. విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యుడు అక్కడికి వచ్చి, ’నా బెడ్ మీద ఎందుకు పడుకున్నావు?’ అంటూ రోగితో వాగ్వాదానికి దిగాడు. వైద్యానికి బదులు.. దెబ్బల వర్షం రోగి పరిస్థితిని అర్థం చేసుకోవలసింది పోయి, ఆ వైద్యుడు దురుసుగా వ్యవహరించాడు. మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన సదరు వైద్యుడు, రోగిపై భౌతిక దాడికి దిగాడు. అస్వస్థుడైన ఆ రోగిని కనికరం లేకుండా కొట్టడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. ఈ దృశ్యాలన్నీ ఎవరో వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఈ దాడి వార్త తెలియగానే బాధితుడి బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. సదరు వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం మరింత తీవ్రరూపం దాలి్చంది. విచారణకు సీఎం ఆదేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సంఘటనను.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖి్వందర్ సింగ్ సుఖు తీవ్రంగా పరిగణించారు. వెంటనే నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు స్పందిస్తూ.. దీనిపై అంతర్గత విచారణ కమిటీని వేశామని, తప్పు తేలితే కఠిన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు. ఆ విచారణ నివేదికలో ఏం తేలుతుందో.. ఆ ’ముతక’ వైద్యుడికి ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి. -
మోదీ ప్రభుత్వమే నన్ను కాపాడాలి
మోర్బి: రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని ఉక్రెయిన్ బలగాలకు చిక్కిన గుజరాత్ వాసి తనను కాపాడాలంటూ భారత పభ్రుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఈ మేరకు అతడు తన కుటుంబసభ్యులకు ఒక వీడియో పంపించాడు. గుజరాత్లోని మోర్బి పట్టణానికి చెందిన సాహిల్ మహ్మద్ హుస్సేన్ మజోతి(22) రష్యాలో చదువుకునేందుకు వెళ్లాడు. అక్కడ అతడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లాడు. అక్కడ ఉక్రెయిన్ సేనలకు లొంగిపోయాడు. ప్రస్తుతం ఉక్రెయిన్లో నిర్బంధంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం మోర్బిలో ఉంటున్న తన తల్లి హసీనా బెన్ సెల్ఫోన్కు ఒక వీడియో పంపాడు. అందులో తను పడుతున్న కష్టాలను వివరించాడు. తనే తప్పూ చేయకున్నా రష్యా అధికారులు తనను అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో ఇరికించారని వాపోయాడు. జైలు పాలు చేసి, ఆపై మాయమాటలు చెప్పి, సైన్యంలో చేరేలా కాంటాక్ట్రు ఒప్పందంపై సంతకం చేయించారని చెప్పాడు. యుద్ధానికి వెళ్లి ఉక్రెయిన్ బలగాలకు లొంగిపోయినట్లు ఆ వీడియోలో వివరించాడు. చదువుకునేందుకు రష్యా వచ్చే భారతీయ యువకులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. తనను ఈ చెర నుంచి విడిపించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కుటుంబంతో తిరిగి కలుసుకునే అవకాశం కల్పించాలని వేడుకున్నాడు. తన కుమారుడి నిర్బంధంపై స్థానిక రాజ్యసభ ఎంపీ కేసరీదేవసిన్హ్ ఝలాకు తెలిపామని హసీనాబెన్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తన కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సాహిల్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్తో మాట్లాడినట్లు ఎంపీ చెప్పారు. దేశాల మధ్య వ్యవహారం అయినందున కొంత సమయం పడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి సాధించామని చెప్పారు. -
గెలిచినా గంప దింపలేదు!
పుణె జిల్లాలోని అందమైన హిల్ స్టేషన్ లోనావాలా.. పర్యాటకులకు స్వర్గధామం. కానీ ఇప్పుడా ప్రాంతం ఒక సామాన్య మహిళ పోరాటానికి, నిరాడంబరతకు చిరునామాగా మారింది. ముంబైకి కూతవేటు దూరంలోని ఈ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగ్యశ్రీ జగ్తాప్ అనే మహిళ సాధించిన విజయం.. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విజయం వరించినా.. వేరు మరువలేదు సాధారణంగా ఎన్నికల్లో గెలవగానే నాయకులు పూలమాలలు, ఊరేగింపులు, బాణసంచా హడావిడిలో మునిగిపోతారు. కానీ భాగ్యశ్రీ స్టైలే వేరు.. ఆదివారం ఫలితాలు వచ్చాయి.. భారీ మెజారిటీతో ఆమె గెలిచారు. సోమవారం ఉదయాన్నే అందరూ ఆమె ఇంటికి అభినందనలు తెలపడానికి వద్దామనుకుంటే.. ఆమె మాత్రం ఎప్పటిలాగే రోడ్డు పక్కన తన పండ్ల దుకాణం దగ్గర ప్రత్యక్షమైంది. కౌన్సిలర్ హోదాను ప్రదర్శించడం కంటే, తన కుటుంబాన్ని పోషిస్తున్న పండ్ల గంపే ఆమెకు దైవంగా కనిపించింది. ‘గెలిచాం కదా అని వ్యాపారాన్ని వదిలేస్తామా?.. మా కుటుంబానికి జీవనాధారం ఇదే’.. అంటూ ఆమె పండ్లను సర్దుతున్న తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. హేమాహేమీలను ఓడించి.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన భాగ్యశ్రీ, తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యరి్థని ఏకంగా 608 ఓట్ల తేడాతో ఓడించింది. పౌర సమస్యలపై ఆమెకున్న అవగాహన, సామాన్యులతో అనుబంధమే.. ఈ భారీ విజయానికి కారణమని లోనావాలా వాసులు స్పష్టం చేస్తున్నారు. దేని పని దానిదే.. పదవి గురించి భాగ్యశ్రీ మాటల్లో ఎక్కడా గర్వం కనిపించదు. ‘పండ్లమ్మడం మా వంశపారంపర్య వ్యాపారం. కౌన్సిలర్గా ప్రజల సమస్యలపై పోరాడతాను, వారి బాధలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాను. అదే సమయంలో నా పండ్ల దుకాణాన్ని కూడా నడుపుతాను. ఈ వ్యాపారమే నాకు గుర్తింపునిచి్చంది’.. అని ఆమె స్పష్టం చేసింది. భర్త మహదేవ్ జగ్తాప్ కూడా ఆమె నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఆమె ప్రజా సేవలో నిమగ్నమైతే, తాను వ్యాపార బాధ్యతలు చూసుకుంటానని సగర్వంగా చెబుతోంది. శభాష్ భాగ్యశ్రీ రాజకీయాల్లో విజయం సాధించాక నేలమీద నడవని నేతలున్న కాలంలో.. నిరాడంబరతే ఆభరణంగా భాగ్యశ్రీ సాగిపోతోంది. తన కష్టాన్ని, వృత్తిని నమ్ముకున్న ఈ ’పండ్లమ్మే కౌన్సిలర్’ ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ హీరోగా నిలిచింది. గెలిచాక వాగ్దానాల ‘గంప’దించేసే నాయకుల మధ్య.. గెలిచినా గంపను నమ్ముకున్న ఈ ’భాగ్యశ్రీ’ నిజంగా అభినందనీయురాలు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
26న చీఫ్ సెక్రటరీల సదస్సు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ వారంలో జరిగే చీఫ్ సెక్రటరీల 5వ జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు కొనసాగుతుందని అధికారులు సోమవారం తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సదస్సుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేసే యువ జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు అధికారులు సైతం ఇందులో పాల్గొనే అవకాశముందని చెప్పారు. -
న్యూజిలాండ్ భారత్ వాణిజ్య ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు స్థాయికి చేర్చే లక్ష్యంతో భారత్, న్యూజిలాండ్ చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారుచేసుకున్నాయి. సంబంధిత చర్చలు విజయవంతంగా ముగిశాయని ఇరుదేశాలు సోమవారం ప్రకటించాయి. భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్లు ఫోన్లో సంభాషించి ఒప్పందాన్ని ఖరారుచేశారని భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముంది. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే లక్ష్యంతో ఇరుదేశాలు ఉమ్మడిగా ముందుకుసాగనున్నాయి. న్యూజిలాండ్ నుంచి ఉన్ని, బొగ్గు, కలప మొదలు వైన్, అవకాడో, బ్లూబెర్రీల దాకా పలు రకాల ఉత్పత్తులపై 95 శాతం టారిఫ్ను భారత్ తొలగించనుంది. దీంతో ఇవన్నీ సరసమైన ధరలకు భారతీయులకు అందుబాటులోకి వచ్చే వీలుంది. భారతీయ ఎగుమతిదారుల నుంచి పాల ఉత్పత్తులు, ఉల్లి, చక్కెర, మసాలా దినుసులు, వంటనూనెలు, రబ్బర్దాకా పలు రకాల ఉత్పత్తులను న్యూజిలాండ్ మార్కెట్లోకి ఎగుమతిచేసి లాభాలను కళ్లజూడనున్నారు. తయారీ, మౌలికరంగం, సేవలు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనా రంగాల్లో వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఆపిల్ ఎగుమతులపై టారిఫ్ ప్రయోజనాలు పొందనుంది. ఇరుదేశాల మధ్య పటిష్టమైన ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలతోపాటు రెండు దేశాల మార్కెట్లలోకి సరు కుల అనుమతి, నూతన పెట్టుబడుల ప్రోత్సాహం, వ్యూహాత్మక భాగస్వామాన్ని బలపర్చుకోవడం, ఆవిష్కర్తలు, నూతన పరిశ్రమల స్థాపన సహా రైతులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, విద్యార్థులు, యువత ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ పాడిరైతుల ప్రయోజనాలను కాపాడుతూ న్యూజిలాండ్ పాలు, పెరుగు, వెన్న, చీజ్ తదితర ఉత్పత్తులపై టారిఫ్లను యథాతథంగా కొనసాగించనున్నారు. కృత్రిమ తేనె, ఆయుధాలు, మొక్కజొన్న, బాదం, వజ్రా భరణాలు, కాపర్, అల్యూమినియం ఉత్పత్తులపై గతంలో మాదిరే భారత్ టారిఫ్ విధించనుంది.వేల మంది భారతీయులకు ప్రయోజనంన్యూజిలాండ్లోని నైపుణ్య ఉద్యోగాల్లోకి ఏటా 5,000 మంది భారతీయ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాలను ఇచ్చేందుకు న్యూజిలాండ్ అంగీకారం తెలిపింది. దీంతో ఆయుష్ వైద్యులు, యోగా నిపుణులు, పాకశాస్త్ర ప్రవీణులు, సంగీతం, ఐటీ, ఇంజనీరింగ్, ఆరోగ్యసంరక్షణ, విద్య, నిర్మాణ రంగాల్లో భారతీయులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. భారతీయ విద్యార్థులు న్యూజిలాండ్లో చదువుకునేకాలంలో గరిష్టంగా వారానికి 20 గంటలపాటు పనిచేసుకునేందుకు అనుమతిస్తారు. డిగ్రీ కోర్సు అయితే రెండేళ్ల వర్క్ వీసా, బ్యాచిలర్స్ డిగ్రీ(ఆనర్స్) లేదా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మెడిసిన్(స్టెమ్) గ్రాడ్యుయేట్ అయితే మూడేళ్ల వర్క్ వీసా, పోస్ట్గ్రాడ్యుయేషన్ అయితే నాలుగేళ్ల వర్క్ వీసా ఇస్తారు. ఈ ఏడాది మార్చినెలలో భారత్లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ పర్యటించిన కాలంలోనే ఈ ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయని భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. భారత్లో కివీపండు, ఆపిల్, తేనె దిగుబడి పెంపే లక్ష్యంగా ఈ మూడింటి కోసం ప్రత్యేకంగా సాగు–సాంకేతికత చర్యా ప్రణాళికను రూపొందించనుంది. భారతీయ వైన్స్, స్పిరిట్లను న్యూజిలాండ్లోనూ రిజిస్ట్రేషన్ చేసే అక్కడి భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ సంబంధ చట్టాలకు సవరణలు చేయనుంది. ఆయుష్, సంస్కృతి, మత్స్య, శ్రవణ దృశ్య పర్యాటకం, అటవీ, ఉద్యానవనాలతోపాటు వైద్యం, వ్యవసాయం వంటి సంప్రదాయ జ్ఞానపరంపరలోనూ సహకార దృక్పథంతో ముందుకుసాగుతాం’’ అని మంత్రి గోయల్ చెప్పారు. ‘‘చర్చలు కేవలం 9 నెలల్లోనే ఒప్పందం ఖరారు స్థాయికి చేరుకోవడం విశేషం. ఇది ఇరుదేశాల ప్రభుత్వాల పరిపాలనా సంకల్పానికి ప్రతీక’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
కొండలపై కత్తి!
ఒకసారి కాలంలో ఓ 300 కోట్ల ఏళ్లు వెనక్కి వెళ్లి, అంతరిక్షం నుంచి ప్రస్తుత భారతదేశాన్ని ఒక్కసారి చూస్తే? ఉత్తర ప్రాంతంలో కన్పించే ఏకైక భౌగోళిక స్వరూపం ఏమిటో తెలుసా? ఆరావళీ పర్వత శ్రేణులు! భూమిపై అత్యంత పురాతన పర్వతాల్లో ఒకటిగా అది గుర్తింపు పొందింది. కానీ, వందలాది కోట్ల ఏళ్లుగా అతి కఠినమైన కాలపరీక్షకు తట్టుకుని మరీ ఉనికిని కాపాడుకుని నిలిచిన ఆరావళీ శ్రేణులు మనిషి పేరాశ పాలిట పడి త్వరలోనే ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. వాటి పరిరక్షణకు తాము చిరకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు గొడ్డలిపెట్టుగా మారిందని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. ‘‘ఫలితంగా పంజాబ్, హరియాణా మొదలుకుని దేశ రాజధాని ఢిల్లీ దాకా ఆరావళి శ్రేణులు చూస్తుండగానే గనులుగా, రియల్ వెంచర్లుగా మారిపోవడం ఖాయం. అదే జరిగితే థార్ ఎడారి అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తుంది. దాంతో ఉత్తరాదిలో చాలా భాగం అతి త్వరలోనే ఎడారిగా మారిపోతుంది’’అని హెచ్చరిస్తున్నారు! ఆరావళి. గుజరాత్ మొదలుకుని ఢిల్లీ దాకా 650 కిలోమీటర్ల పై చిలుకు విస్తరించిన పర్వత శ్రేణులు. ఉత్తరాదిని అన్నివిధాలా పెట్టని కోటలా కాపాడుకుంటూ వస్తున్నాయి. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అడ్డుకుంటున్నాయి. ఉత్తరాదిన అంతంత మాత్రమే ఉండే భూగర్భ జలాలను గుజరాత్ నుంచి ఢిల్లీ దాకా 4 రాష్ట్రాల పరిధిలో ఎప్పటికప్పుడు రీచార్జి చేయడమే గాక రాజధాని ప్రాంతంలోని అపార కాలుష్యాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తున్నాయి.కోర్టు తీర్పుతో...ఆరావళి రగడ ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. సుప్రీంకోర్టు ఇటీలి తీర్పుతో తాజాగా అది మరోసారి రగులుకుంది. అసలు ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనం పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏమిటన్న దానిపై కోర్టు చిరకాలంగా విచారణ జరుపుతూ వస్తోంది. ఈ విషయంలో కేంద్రం వాదనతో ఏకీభవిస్తూ గత నవంబర్ 20న కోర్టు తీర్పు వెలువరించింది. దానిప్రకారం పరిసర ప్రాంతాలతో పోలిస్తే కనీసం 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న వాటిని మాత్రమే గుట్టలుగా, అంటే ఆరావళీ ప్రాంతంగా గుర్తిస్తా రు! ఇది చాలా ప్రమాదకరమైన తీర్పు అని విపక్షాలు మొత్తుకుంటున్నాయి. హరియాణా, దేశ రాజధాని ప్రాంతంలో అస్మదీయులైన రియల్టీ, ఇన్ఫ్రా వ్యాపార దిగ్గజాలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ వాదన లేవనెత్తింది. దానితో సుప్రీంకోర్టు ఏకీభవించడం తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. దోపిడీదారులు ఇప్పుడిక చట్టబద్ధంగానే పేట్రే గుతారు’’అని పేర్కొంటున్నాయి. పర్యావరణవేత్తలు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. ఆరావళి శ్రేణుల్లో దాదాపు 90 శాతం ప్రాంతం 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తే ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘కనుక నయా నిర్వచనం ప్రకారం అది గుట్టల లెక్కలోకి రాదు. కనుక అక్కడ గనులు తవ్వుకోవడం మొదలుకుని రియల్టీ వెంచర్ల దాకా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇది పర్యావరణానికే గాక మొత్తం ఉత్తరాదికే తీరని నష్టం చేస్తుంది. చూస్తుండగానే ఢిల్లీ నుంచి పంజాబ్ దాకా ఏమాత్రమూ నివాసయోగ్యం కాకుండా పోవ డం ఖాయం’’అని వారు హెచ్చరిస్తున్నారు.కొట్టిపారేస్తున్న కేంద్రంపాలక బీజేపీ మాత్రం ఆరావళి విషయమై విపక్షాలు, పర్యావరణవేత్తల ఆందోళనలను అసంబద్ధమైనవిగా కొట్టిపారేస్తోంది. ఆరావళి శ్రేణుల నిర్వచనం విషయంలో సుప్రీంకోర్టు నిజానికి ఎలాంటి సడలింపులూ ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆరావళి శ్రేణులు నిత్యం పచ్చగా ఉండాలన్నదే కేంద్రం ఆకాంక్ష అన్నా రు. అయితే, ‘100 మీటర్ల ఎత్తు’నిర్వచనం ప్రపంచవ్యాప్తంగా అంగీకరించినదేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన! ఆరావళి శ్రేణుల్లో కేవలం 0.19 శాతం ప్రాంతంలో మాత్రమే మైనింగ్కు అనుమతిస్తున్నట్టు వివరించారు. మొత్తమ్మీద 90 శాతం పర్వతాలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తున్నామన్నారు.సేవ్ ఆరావళిఅతి పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులను విధ్వంసం బారినుంచి కాపాడుకుందామంటూ ఆన్లైన్లో ఉద్యమం ఊపందుకుంటోంది. ‘సేవ్ ఆరావళి’హాష్ట్యాగ్కు సోషల్ సైట్లలో మద్దతు వెల్లువెత్తుతోంది. ఇది క్రమంగా ఉత్తరాదిని దాటుకుని జాతీయ ఆందోళనగా రూపుదిద్దుకునే సూచనలు కన్పిస్తున్నాయి.–సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. భారతీయుల పరిస్థితి విషమం
ఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా సైన్యంలో చేరిన భారతీయుల పరిస్థితి మరింత విషమంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 50 మంది భారతీయులు రష్యా సైన్యంలో చిక్కుకుని ఉన్నారు.వారిలో ఇప్పటి వరకు 26 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు అదృశ్యమైనట్లు సమాచారం. వారి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. మొత్తం మీద, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 200 మందికి పైగా భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.ప్రభుత్వ చర్యలుభారత ప్రభుత్వం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రష్యా సైన్యంలో చేరిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని రప్పించగలిగామని, కానీ ఇంకా 50 మంది చిక్కుకుని ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.కుటుంబాల ఆందోళనయుద్ధంలో చిక్కుకున్న యువకుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ప్రాణాలు రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులు తమ పిల్లలు మోసపూరిత వాగ్దానాలతో రష్యా సైన్యంలో చేరారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దక్షిణాసియా దేశాల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడం వల్ల చిక్కుకున్న భారతీయుల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి భారత విదేశాంగానికి పెద్ద సవాలుగా మారింది.ముగింపురష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నంత కాలం, రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రాణాలు రక్షించేందుకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబాలు కోరుతున్నాయి. -
ఏఐ గ్లాసులతో అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి.. తరువాత ఏమైందంటే
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోకి సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సాంకేతికత కలిగిన గ్లాసులు ధరించి వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతికత కలిగిన కలిగిన వస్తువులతో ఆలయంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకున్నరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అధికారులు ఐదెంచెల భద్రత కల్పిస్తారు. డ్రోన్, స్మార్ట్ సెన్సార్లు వంటి ఆధునాతన పరికారలతో నిరంతంరం నిఘా నేత్రాలలో ఉంచుతారు. అయితే ఆలయంలోకి మెుబైల్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.ఈ నేపథ్యంలోనే ఏఐ మెటా సాంకేతికత కలిగిన గ్లాసులను ధరించి వచ్చిన విదేశీ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయ నిబంధనలు తెలియక తాను గ్లాసులు ధరించానని ఆ భక్తుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పి వదిలి వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరస్టైన వ్యక్తి పేరు తిరుపనీన్ అని ప్రస్తుతం ఆయన శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం సింగపూర్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. -
శబరిమలలో ఫుడ్ సేఫ్టీ డ్రైవ్
కేరళ శబరిమల సన్నిధానం పర్యవేక్షణకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. సన్నిధానం పరిసరాల్లోని షాపింగ్ కాంప్లెక్స్లు, ఫుడ్ కాంప్లెక్స్లు ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేఫ్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకపోవడంతో పాటు సరైన నిబంధనలు పాటించిన వ్యాపార సముదాయాలకు జరిమానా విధించారు. అయ్యప్ప సన్నిధాన పవిత్రతను కాపాడడానికి దేవస్థానం బోర్టు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇది వరకే శబరిమలలో ప్లాస్టిక్ వాడకంపై పూర్తిగా నిషేదం విధించారు. ఈ నేపథ్యంలో శబరిమలలోని హోటళ్లు, ఫుడ్కోర్టులు, ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేప్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకుండా నిబంధనలకు అనుగుణంగా లేని వాటిపై దాదాపు రూ. 98 వేల జరిమానా విధించారు.భక్తులు రద్దీని దృష్టిని ఉంచుకొని అధిక ధరలకు వస్తువుల అమ్మడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం తదితర అంశాలను ఆరా తీశారు. ఆహార పదార్థల ధరలను పట్టికలో పొందుపర్చాలని వాటిని ఎట్టి పరిస్థితుల్లో అధిక ధరలకు అమ్మకూడదని తెలిపారు. చలి తీవ్రత దృష్ట్యా భక్తులకు కచ్చితంగా వేడినీటినే సరఫరా చేయాలని కూల్ వాటర్ ఇవ్వకూడదని తెలిపారు. అదే విధంగా దేవస్థానం ఉద్యోగస్థుల పేరుతో మోసం చేసే వారిపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. -
రూ. 8.10 కోట్ల మోసం.. తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐజీ
పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అమర్ సింగ్ చాహల్ సోమవారం సెక్యూరిటీ గార్డు రివాల్వర్ ఉపయోగించి తనను తాను కడుపులో కాల్చుకున్నారు. సంఘటనా స్థలం నుండి 12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరుణ్ శర్మ తెలియజేశారు. పంజాబ్లోని పాటియాలాలో చాహల్ ఆత్మహత్యాయత్నం విషయం తమ దృష్టికి రాగానే పోలీసు బృందాలు అతని నివాసానికి చేరుకుని, ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ప్రకటించారు. ప్రస్తుతం చాహెల్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.Breaking : Punjab ex-IPS officer Amar Singh Chahal, accused in 2015 Faridkot firing case, critical after alleged 'suicide' attempt pic.twitter.com/7NRdu1hEuh— Gurpreet Garry Walia (@garrywalia_) December 22, 2025సూసైడ్ నోట్ లో ఏముంది?పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటనా స్థలం నుండి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు, అందులో చాహల్ ఆర్థిక మోసానికి గురయ్యాడని రాసి ఉంది. ఈ మేరకు చాహల్ పంజాబ్ పోలీస్ డీజీపీ గౌరవ్ యాదవ్ను ఉద్దేశించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆ నోట్లో రూ.8.10 కోట్ల విలువైన ఆన్లైన్ మోసం కేసు గురించి ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ మోసం, తీవ్రమైన ఆర్థిక నష్టాలతో ఒత్తిడికి గురైనట్టు సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చాహల్ ఐజీ పదవి నుండి పదవీ విరమణ చేసినప్పటి నుండి పాటియాలాలో నివసిస్తున్నారు.కోట్కాపుర కాల్పుల కేసులో నిందితుడుకాగా 2015లో ఫరీద్కోట్లో జరిగిన బెహ్బాల్ కలాన్ ,కోట్కాపుర కాల్పుల కేసు నిందితుల్లో అమర్ సింగ్ చాహల్ కూడా ఒకరు. 2023, ఫిబ్రవరిలో, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్.కె. యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అమర్ సింగ్ చాహల్తో సహా పలువురు సీనియర్ పంజాబ్ అధికారులపై ఫరీద్కోట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.కాగా గతంలో కూడా సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని సీనియర్ పోలీసు అధికారి వై. పురాన్ కుమార్ చండీగఢ్లోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు డీజీపీ, ఏడీజీసీ ఎస్పీతో సహా 10 మంది అధికారులను నిందిస్తూ ఆయన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాసిన సంగతి తెలిసిందే. -
కలిసి వస్తున్నాం.. కాస్కోండి!
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మరాఠా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దశాబ్దాలుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఠాక్రే సోదరులు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కలిసికట్టుగా ముంబై ఎన్నికల బరిలోనే నిలిచేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముందడుగు పడిందని, ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మున్ముందు ముంబై రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉంటాయి.ముంబై రాజకీయాలు అనగానే ముందుగానే ఠాక్రే కుటుంబం గుర్తుకు వస్తుంది. మరాఠా పులిగా పేరొందిన బాల్ ఠాక్రే (Bal Thackeray) మహారాష్ట్రలో రాజకీయాలను శాసించారు. ఆయన తర్వాత శివసేన పార్టీ చాలా అటుపోట్లు ఎదుర్కొంది. ప్రస్తుతం రెండు పార్టీలుగా కొనసాగుతోంది. శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే దక్కించుకోవడంతో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) పేరుతో పార్టీని నడుపుతున్నారు. శివసేను చీల్చి బీజేపీతో ఏక్నాథ్ షిండే చేతులు కలపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపు తిరిగాయి. ఈ క్రమంతో ఉద్ధవ్ ఠాక్రేపై సానుభూతి పెరిగింది. రెండు దశాబ్దాల వైరాన్ని వీడి రాజ్ఠాక్రే తన సోదరుడి చెంతకు వచ్చారు. కష్టకాలంలో సోదరుడికి అండగా నిలిచారు.ముంబై సహా 29 కార్పొరేషన్లకు జనవరి 15న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగాలని ఠాక్రే సోదరులు నిర్ణయించారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి. చర్చలు ఫలించాయని, సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో.. శరద్పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్తో సంబంధం లేకుండా తమ రెండు పార్టీల అభ్యర్థులనే పోటీకి దించాలని ఉద్ధవ్, రాజ్ ఠాక్రే నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తియిందని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.బీఎంసీలో మొత్తం 227 వార్డులుండగా.. శివసేన (యూబీటీ) 157, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 70 స్థానాల్లో పోటీకి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ శరద్ పవార్ (Sharad Pawar) పార్టీకి ఇవ్వాల్సివస్తే ఉద్ధవ్ పార్టీ నుంచి 15 సీట్లు కేటాయిస్తారని చెబుతున్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎమ్మెన్నెస్ కలిసి పోటీ చేస్తే.. రెండు దశాబ్దాలలో ఠాక్రే వారసులు ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది.కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?మహా వికాస్ అఘాడీలో శివసేన(యూబీటీ), శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు చేతులు కలపడంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనట్టుగా శివసేన నాయకులు మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఓడిపోతూనే ఉందని, అలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తమకు, ఇతర పార్టీలకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నందున ఈమేరకు ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ వెల్లడించారు.చదవండి: కాంగ్రెస్లో చీలికలేంటి?కలిసి సాధిస్తారా?గత కొంత కాలంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 288 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి (Mahayuti) ప్రభుత్వం విజయదుందుభి మోగించింది. 207 చోట్ల గెలుపు సాధించి సత్తా చాటింది. విపక్ష మహా వికాస్ అఘాడీ 44 స్థానాలకే పరిమితమైంది. శివసేన(యూబీటీ)కి కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే బీఎంసీ ఎన్నికల్లో నిరూపించుకోవడం చాలా అవసరం. తమ కుటుంబానికి కంచుకోట అయిన మహారాష్ట్ర రాజధానిలో కలిసికట్టుగా బరిలోకి దిగుతున్న ఠాక్రే సోదరులు ఈసారి ఎలాంటి ఫలితాలు రాబడతారో చూడాలి. -
‘సిక్కిం సుందరి’పై ఆనంద్ మహీంద్ర ప్రేమ, వైరల్ వీడియో
ప్రముఖ వ్యాపారవేత్త,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ‘సిక్కిం సుందరి’ పై మనసు పారేసుకున్నారు. ప్రకృతి అసాధారణ సృష్టి, అద్భుతం అంటూ దీని గురించి ట్వీట్ చేశారు. ఇంతకీ ఏవరీ సిక్కిం సుందరి తెలుసుకుందాం.అరుదైన హిమాలయ పుష్పం అసాధారణ జీవిత చక్రాన్ని హైలైట్ చేస్తూ, ఆశ్చర్యాన్ని ప్రకటించారు. సహజ అద్భుతం అంటూ ప్రశంసించారు. దానిపేరే సిక్కిం సుందరి. ఇది హిమాలయ పర్వతశ్రేణుల్లో కనిపించే అరుదైన మొక్క. దీన్ని రూమ్ నొబైల్ (Rheum nobile) అని పిలుస్తారు. దీని ప్రత్యేక రూపం కారణంగా "గ్లాస్హౌస్ ప్లాంట్" అని. ఇది చాలా ఎత్తులో పెరుగుతుంది ఒకేసారి పెద్దగా పూసి చనిపోతుంది. 30 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న ఈ మొక్కను సిక్కిం సుందరి అంటారు. ఆనంద్ మహీంద్రా ఆదివారం అరుదైన మొక్కపై తన అభిమానాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ప్రకృతి లోని అపూర్వ అసాధారణ సృష్టిలలో ఒకటిగా ఉన్న దీని గరించి తన పాఠశాల జీవశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో దీని ప్రస్తావన లేదన్నారు. కఠినమైన పరిస్థితులలో ఓర్పుతో వికసించే ఈ మొక్క సహనానికి ఒక మాస్టర్ క్లాస్ అని అభివర్ణించారు. ఇది దాదాపు 3 నుండి 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఎత్తైన, కోన్ ఆకారంల వికసిస్తుంది ఇది ఒకేసారి పుష్పిస్తుంది, దాని విత్తనాలను వెదజల్లడంతో దాని జీవిత చక్రాన్ని పూర్తి అవుతుందని మహీంద్రా చెప్పారు. ఇలాంటి వాటికి ఎందుకు గుర్తింపు లభించడం లేదని ప్రశ్నించారు. సిక్కిం వంటి ప్రాంతాలను అన్వేషించడానికి స్థానిక జీవవైవిధ్యంతో తిరిగి కనెక్ట్ అవాలని మహీంద్రా కోరారు. I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains. Its life is a masterclass in patience. It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025చదవండి: కెనడా కీలక నిర్ణయం : ఆ వీసాల నిలిపివేత, ప్రభావం ఎంత? సిక్కిం, తూర్పు నేపాల్ ,ఆగ్నేయ టిబెట్లో సముద్ర మట్టానికి 4,000 నుండి 4,800 మీటర్ల ఎత్తులో ఈ మొక్క కనిపిస్తుంది. ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం అపారదర్శక, గడ్డి-రంగు బ్రాక్ట్లలతో కోన్-ఆకారపు టవర్లా ఎదుగుతాయి. ఈ బ్రాక్ట్లు సహజ గ్రీన్హౌస్ లాగా పనిచేస్తాయి. సూర్యరశ్మి గుండా వెళ్ళడానికి వీలు కల్పిస్తూ, ఎండ, చల్లగాలులనుంచి సున్నితమైన పువ్వులను కాపాడుతుంది. ఇది లోపల వెచ్చని మైక్రోక్లైమేట్ను సృష్టిస్తుంది. అధిక ఎత్తులో మొక్క మనుగడకు సహాయపడుతుంది. అలాగే దాని ఎత్తు, లేత రంగు కారణంగా, మొక్క పర్వత లోయల మీదుగా అందంగా స్పష్టంగా కనిపిస్తుంది.సాంస్కృతిక, ఔషధ ప్రాముఖ్యతఅయితే దీని రూపం, ఆకర్షణతో పాటు సిక్కిం సుందరికి సాంస్కృతిక, ఔషధ పరంగా చాలా ప్రాధాన్యత ఉంది. స్థానికంగా చుకా అని పిలుచుకునే దీని కాండాన్ని సాంప్రదాయ వంటలలో వండుకుని తింటారు. దీని ప్రకాశవంతమైన పసుపు వేర్లు సాంప్రదాయ టిబెటన్ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా జూన్ , జూలై మధ్య పుష్పిస్తుంది, ఇది ఎత్తైన హిమాలయాలలో సీజనల్ హైలైట్గా నిలుస్తుంది.సింగిల్ బ్లూమ్ మొక్క చనిపోయి, దశాబ్దాల వరకు ఆ విత్తనం అలాగే పదిలంగా ఉంటూ, మళ్లీ మొలకెత్తడమే దీని ప్రత్యేకత. ఇదీ చదవండి: కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి -
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్కు నోటీసులు
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఈడీ అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అప్పీలుపై స్పందన కోరుతూ సోనియా, రాహుల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజెఎల్కు కాంగ్రెస్ పార్టీ రూ. 90కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈవ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, అస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దుబే తదితరులు మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది.ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులు. ఈ సంస్థ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజేఎల్కు చెందిన సూమారు. రూ. రెండువేల కోట్ల విలువైన ఆస్తులు పొందారని ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది.నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఇతర స్వాతంత్ర సమర యోధులు ప్రారంభించారు. దీని నిర్వహణ బాధ్యతలు AJL అనే సంస్థ చూసుకునేది. ఈ పత్రికకు ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. కాగా ఆస్తుల బదిలీ విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది. -
చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!
ప్రపంచవ్యాప్తంగా భారత్తోపాటు వివిధ దేశాల్లో ఉద్యోగులు పనిచేసే చేసే పని గంటలకు, అందుకు వారికి లభించే వేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయులు వారానికి ఎక్కువ గంటలు శ్రమిస్తున్నప్పటికీ వారి సంపాదన మాత్రం ఆయా దేశాల ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉంటోంది. 2024-25 నాటి గణంకాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదికల ఆధారంగా వివిధ దేశాల పనిగంటలు, వేతనాల విశ్లేషణ కింద చూద్దాం.వివిధ దేశాల పనిగంటలు.. వేతనాల పరిశీలనదేశంసగటు వారపు పనిగంటలుసగటు నెలవారీ వేతనంగంటకు ఆదాయంఅమెరికా34 - 36 గంటలురూ.5,60,000రూ.4,100జర్మనీ34 - 35 గంటలురూ.4,50,000రూ.3,100జపాన్38 - 40 గంటలురూ.3,10,000రూ.1,900చైనా46 - 48 గంటలురూ.1,40,000రూ.750భారతదేశం46 - 48 గంటలురూ.32,000రూ.170 గమనిక: ఈ వేతనాలు ఆయా దేశాల కరెన్సీ విలువను ప్రస్తుత మారకపు రేటు ప్రకారం రూపాయిల్లోకి మార్చగా వచ్చిన సగటు విలువలు. రూపాయి విలువను అనుసరించి వీటిలో మార్పులుంటాయని గమనించాలి.అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితిఅమెరికా, జర్మనీ దేశాల్లో వారానికి కేవలం 35 గంటల లోపు పనిచేస్తూనే భారీ వేతనాలను అందుకుంటున్నారు. ఇక్కడ స్మార్ట్ వర్క్, హై-టెక్నాలజీ వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత లభిస్తుంది.ఒకప్పుడు అధిక పనిగంటలకు పేరుగాంచిన జపాన్, ప్రస్తుతం వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వైపు మొగ్గు చూపుతోంది. 40 గంటల పని పరిమితిని కచ్చితంగా అమలు చేస్తోంది.చైనాలో కూడా పనిగంటలు భారత్తో సమానంగా ఉన్నప్పటికీ అక్కడి ఉత్పాదకత, తయారీ రంగం బలంగా ఉండటం వల్ల వేతనాలు భారత్ కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.భారత్లో ఎందుకీ పరిస్థితి?భారతదేశంలో కార్మికులు లేదా ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్నా తక్కువ ఆదాయాన్ని పొందడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 90% పైగా శ్రామిక శక్తి అసంఘటిత రంగంలోనే ఉంది. ఇక్కడ కచ్చితమైన వేతన చట్టాలు లేదా పనిగంటల నియంత్రణ తక్కువగా ఉంటుంది.అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక గంటలో తయారయ్యే వస్తువు/సర్వీసు విలువ, భారత్లో తయారయ్యే దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అధునాతన సాంకేతికత, మెరుగైన మౌలిక సదుపాయాలు లేకపోవడం.శ్రమ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగులను నియమించుకోగలుగుతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల బేరమాడే శక్తి ఉద్యోగులకు తక్కువగా ఉంటోంది.భారత్లో జీవన వ్యయం (Rent, Food, Medical) అమెరికా, జర్మనీలతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి రూపాయి విలువ పరంగా తక్కువగా కనిపించినా స్థానిక అవసరాలకు అది సరిపోతుందని కంపెనీల వాదన. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినప్పుడు ఇది భారీ వ్యత్యాసంగానే కనిపిస్తుంది.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్నప్పటికీ సామాన్య ఉద్యోగికి దక్కే ఫలితం ఇంకా ఆశాజనకంగా లేదు. పనిగంటలను తగ్గించి, వేతనాలను పెంచాలంటే ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆటోమేషన్, సంఘటిత రంగం విస్తరణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్! -
ఏపీ, తెలంగాణలోనే ఎస్సీలపై అధిక దాడులు
సాక్షి, ఢిల్లీ: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఏపీ, తెలంగాణలో ఎస్సీలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ఉదంతాలను ప్రస్తావిస్తూ సోమవారం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై అధిక దాడులు జరుగుతున్నాయి. దళితులను పోలీసు వ్యవస్థ చిన్న చూపు చూస్తూ అమానుషంగా వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఓ దళితుడిని పోలీసుల రౌడీల్లాగా పాశవికంగా కొట్టారు. ఈ ఘటనపై డీజీపీ ఇప్పటికైనా విచారణ జరిపి పూర్తి నివేదిక పంపాలి. అమరావతిలో దళితుల డీకే పట్టా భూముల విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. భూముల రేట్లు పెరిగిన తర్వాత.. వ్యవసాయం చేయడం లేదనే సాకుతో భూమి లాక్కుంటున్నారు. దీనిపై 85 ఫిర్యాదులు వచ్చాయి వాటిపై విచారణ చేస్తున్నాం. ఇప్పటిదాకా 35 ఎకరాలు భూమి బలవంతంగా తీసుకున్నారు. దానికి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి.. తెలంగాణ కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేయాలి. ఈ ఘటనలో రీపోస్ట్మార్టం జరిగింది. సీఐ సస్పెన్షన్ తో సరిపోదు. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే అని అన్నారాయన. -
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’(పీయూసీ) లేని ఏ వాహనానికీ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించకూడదని రాష్ట్ర రవాణా యంత్రాంగం (ఎస్టీఏ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.చమురు సంస్థలకు కీలక ఆదేశాలుఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, షెల్ వంటి ప్రైవేట్ చమురు సంస్థలకు కూడా రవాణా శాఖ లేఖలు రాసింది. ప్రతి ఫ్యుయల్ స్టేషన్ వద్ద వాహనదారుడి పీయూసీ సర్టిఫికేట్ను సిబ్బంది భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తనిఖీ చేసిన తర్వాతే ఇంధనం పోయాల్సి ఉంటుంది.అవగాహన కార్యక్రమాలుఈ కొత్త నిబంధనపై వాహనదారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి తగినంత అవగాహన కల్పించాలని చమురు సంస్థలను కోరింది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తే సంబంధిత డీలర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్టీఏ హెచ్చరించింది.చట్టపరమైన నిబంధనలు ఇవే..మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2), సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 ప్రకారం.. ప్రతి వాహనం నిర్దేశిత ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉండాలి. పీయూసీ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ బాటలోనే ఒడిశాదేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో అక్కడ ఇప్పటికే ‘నో పీయూసీ - నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ-4) అమల్లో ఉంది. అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా -
కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. వేరేకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న దురహంకారంతో కన్నకూతుర్ని హతమార్చాడో తండ్రి. ఆరు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కన్నబిడ్డను అత్యంత పాశవికంగా చేసిన హత్య ఆధునిక సమాజంలో కూడా వేళ్లూనుకొనిపోయిన కుల అహంకారానికి అద్దం పట్టింది.హుబ్బళ్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల మాన్య పాటిల్ కులాంతర వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ ఏడాది మేలో ప్రేమికుడిని పెళ్లాడింది. చంపేస్తారేమోననే భయంతో స్వగ్రామానికి దూరంగా 100 కి.మీ దూరంలో ఉన్న హవేరి జిల్లాలో భర్తతోకలిసి నివసిస్తోంది. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. ఊర్లో ఉంటున్న అత్తమామల వద్దకు ఆదివారం నాడు వచ్చింది. ఇది పసిగట్టిన ఆ యువతి తండ్రి మరో ముగ్గురితో కలిసి ఆమెపై దాడికి దిగారు. ముందు ఆమె భర్త, మామ వ్యవసాయ పొలంలో ఉన్నప్పుడు వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకోవడంతో, సాయంత్రం 6 - 6:30 గంటల మధ్య, ఇనుప పైపులతో సాయుధులైన దుండగులతో కలిసి బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు తండ్రి. ఆరు నెలల గర్భవతి మాన్యపై దారుణంగా ఎటాక్ చేశారు. దీంతో ఆమె ప్రాణాలొదిలింది. సంఘటనా స్థలంలోనే ఉన్న అత్తమామలు రేణుకమ్మ, సుభాష్ ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు.వారిపై కూడా దారుణంగా దాడి చేశాడు. వారు తీవ్ర గాయాలతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సంఘటనలో పోలీసులుమాన్య తండ్రి ప్రకాష్ ఫక్కిర్గోడా, మరో ఇద్దరు దగ్గరి బంధువులను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ వివాదంలోగతంలఘీ రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదర్చడానికి , ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారించడానికి గతంలో ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా చివరికి కన్నబిడ్డనే హతమార్చిన ఘటన తీవ్ర ఆందోళన రేపింది. -
కాంగ్రెస్లో చీలికలేంటి?..
కర్ణాటకలో పవర్ పాలిటిక్స్కు బ్రేక్ఫాస్ట్, లంచ్ భేటీలతో హైకమాండ్ పుల్స్టాప్ పెట్టిందని భావిస్తున్న వేళ.. ఈసారి కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. సీఎం సిద్ధరామయ్య సన్నిహితులతో డిప్యూటీ సీఎం శివకుమార్ వరస భేటీలు జరపుతుండడం.. వాటిపై అధిష్టానం సీరియస్గా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఆ ప్రచారంపై డీకే శివకుమార్ ఓపెన్ అయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయలపై జరుగుతున్న తాజా ప్రచారాలను సోమవారం మీడియా సాక్షిగా డీకే శివకుమార్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్య, తాను అన్నదమ్ముల్లా పని చేస్తుంటే ఇంక కాంగ్రెస్లో చీలిక ఎందుకు ఉంటుందని అన్నారాయన. ‘‘సిద్ధరామయ్యతో నాకు 16 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆ బంధం ఇక మీదట కూడా కొనసాగుతుంది. అన్నదమ్ముల్లా మేం మా పని చేసుకుంటూ పోతున్నాం. అలాంటప్పుడు పార్టీలో అంతర్గత విబేధాలు.. చీలికలు ఎందుకు వస్తాయి?. అధిష్టానం ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తుంది??.. ఇది కేవలం.. మీడియా, బీజేపీ సృష్టిస్తున్న ఊహాగానాలే’’ అని అన్నారాయన. సీఎం సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడిగా పేరున్న మాజీ మంత్రి కేఎన్ రాజన్నతో ప్రత్యేకంగా భేటీ కావడంపై డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. ‘‘ఇందులో రాజకీయ కోణం ఏం లేదు. రాజన్న నాకు కూడా ఆప్తుడే. గతంలో ఎస్ఎం కృష్ణ హయాంలో ఆయనకు ఓ కీలక పదవి ఇప్పించా. నేను ఆయన్ని కలిసింది మర్యాదపూర్వకంగానే‘‘‘ అని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్లో ఏ నేతతోనూ తనకు విబేధాల్లేవని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.పవర్ షేరింగ్.. సీఎం సీటు కోసం ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు.. ఈ ప్రయత్నాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కథనాలపైనా డీకే రియాక్ట్ అయ్యారు. ‘‘నా ఢిల్లీ పర్యటనలేవీ రాజకీయ పరమైనవి కావు. ఉన్నత స్థాయి సమావేశాల్లో భాగంగానే జరిగాయి. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు నిధుల కోసం, ఇతర అభివృద్ధి కోసమే నేను హస్తినకు వెళ్లా’’ అని అన్నారు. అయితే.. కర్ణాటక అధికార కాంగ్రెస్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని పార్టీ సీనియర్ నేత వీఆర్ సుదర్శన్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఓ లేఖ రాశారు. ఈ విషయాన్నే డీకే వద్ద స్పందించగా.. ఆ లేఖ సారాంశం వేరని.. కాంగ్రెస్లో లుకలుకలు నెలకొన్నాయని బీజేపీ సృష్టించిన ప్రయత్నమే ఆ ప్రచారమని కొట్టిపారేశారాయన.


