National
-
మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి
లడఖ్: లడఖ్లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా విరిగిపడిన భారీ మంచు పెళ్లలు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలయ్యాయి. జోజిలా పాస్ సమీపంలోని ద్రాస్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంచు కింద 15 వాహనాలు పూర్తిగా కూరుకుపోగా, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.నిముషాల్లోనే మారిన దృశ్యంద్రాస్ పరిధిలోని ‘క్యాప్టెన్-టర్న్’ వద్ద మధ్యాహ్నం సమయంలో భారీ హిమపాతం కురిసింది. రహదారిపై వాహనాలు వెళ్తుండగానే ఒక్కసారిగా మంచు పెళ్లలు విరిగిపడటంతో, ప్రయాణికులు అప్రమత్తం అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతి చెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. మంచు కింద మరికొన్ని వాహనాలు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Heard the unfortunate news of an avalanche at Zoji La. I have directed the DC & SSP of Kargil to visit the spot immediately and mobilise relief and rescue operations. All government agencies including disaster relief forces and BRO have been put on high alert. I am personally…— LG Ladakh (@lg_ladakh) March 27, 2026యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలుప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, పోలీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ఆర్డీఎఫ్)బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)బృందాలు రంగంలోకి దిగాయి. మేఘా టన్నెల్ సిబ్బంది సహకారంతో సుమారు 100 మందికి పైగా రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. సోనామార్గ్- ద్రాస్.. ఇలా రెండు వైపుల నుండి మంచును తొలగించే పనులు కొనసాగుతున్నాయి. అయితే కశ్మీర్ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని సమాచారం.ఇది కూడా చదవండి: Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు! -
తొమ్మిది స్థానాలే కీలకం.. ఎన్డీయే హోరాహోరీ
కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో 9 అసెంబ్లీ స్థానాల్లో మూడు కూటముల నడుమ నెలకొన్న ముక్కోణపు పోరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ స్థానాల్లో గెలుపోటములు మొత్తంగా ఎన్నికల ఫలితాలనే నిర్దేశించవచ్చని పరిశీలకులు భావిస్తుండటం విశేషం.నీమమ్తిరువనంతపురం జిల్లాలో ఉంది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా బీజేపీ నెగ్గిన ఏకైక అసెంబ్లీ స్థానం కావడం విశేషం. 2016లో ఎల్డీఎఫ్కు చెందిన కె.శివన్కుట్టిపై బీజేపీ సీనియర్ నేత ఒ.రాజగోపాల్ విజయం సాధించారు. అనంతరం 2021 ఎన్నికల్లో శివన్కుట్టి కేవలం 3,949 ఓట్ల మెజారిటీతో బీజేపీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖరన్ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శివన్కుట్టి, యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.శబరీనందన్ పోటీలో ఉన్నారు.కళక్కొట్టం బీజేపీ బలంగా కనిపిస్తున్న మరో అసెంబ్లీ స్థానమిది. గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడకంపల్లి సురేంద్రన్ మరోసారి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యరి్థగా బీజేపీ సీనియర్ నేత వి.మురళీధరన్ నిలిచారు. 2016లో సురేంద్రన్ చేతిలో ఆయన కేవలం 7,347 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇటీవలి తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి దూకుడు మీదున్న బీజేపీ ఈసారి కళక్కొట్టం తమ ఖాతాలో చేరడం ఖాయమని ధీమాగా ఉంది. యూడీఎఫ్ నుంచి మాజీ ఎమ్మెల్యే టి.శరచ్ఛంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు.వట్టియుర్కవుఇది కూడా బీజేపీకి మంచి పట్టున్న స్థానమే. 2016, 2012 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. కానీ 2019 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఎల్డీఎఫ్ నుంచి ప్రశాంత్ హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా నెగ్గాలని భావిస్తున్న బీజేపీ మాజీ డీజీపీ ఆర్.శ్రీలేఖను బరిలో దించింది. 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించిన కె.మురళీధరన్నే యూడీఎఫ్ ఈసారీ పోటీకి పెట్టింది.మంజేశ్వరంబీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.పాల చారిత్రకంగా ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. ఈసారి మాత్రం కథ మారింది. ఎల్డీఎఫ్ నుంచి కేరళ కాంగ్రెస్ (మణి) చైర్మన్జోస్ కె.మణి బరిలో ఉన్నారు. యూడీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మణి సి.కప్పన్తో తలపడుతున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా బాగా ప్రజాదరణ ఉన్న మాజీ ఎమ్మెల్యే పి.సి.జార్జి కుమారుడు షోన్ జార్జిని బరిలో దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.నట్టికగత ఎన్నికల్లో సీపీఐ తరఫున నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే సి.సి.ముకుందన్ ఈసారి బీజేపీ టికెట్పై బరిలో దిగుతుండటం ఆసక్తికరం. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత ఆదరణ బాగా కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎల్డీఎఫ్ ఈసారి మాజీ ఎమ్మెల్యే గీతా గోపీకి టికెటిచ్చింది. యూడీఎఫ్ నుంచి కూడా సునీల్ లాలూర్ రూపంలో గట్టి అభ్యర్థి బరిలో ఉండటంతో పోరు హోరాహోరీగా మారింది. మంజేశ్వరం బీజేపీకి అందినట్టే అంది చేజారుతూ వస్తున్న స్థానమిది. ఆ పార్టీ సీనియర్ నేత కె.సురేంద్రన్ 2016లో ఇక్కడ కేవలం 89 ఓట్లతో ఓటమి చవిచూశారు. 2021లో కూడా 855 ఓట్ల తేడాతో మరోసారి పరాజయం మూటగట్టుకున్నారు. ఈసారి మాత్రం యూడీఎఫ్ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ.కె.ఎం.అష్రఫ్ను ఓడించి తీరతానని సురేంద్రన్ ధీమాగా ఉన్నారు. ఎల్డీఎఫ్ తరఫున కె.ఆర్.జయనంద బరిలో ఉన్నారు.అరన్ములపత్థనంతిట్ట జిల్లాలోని ఆలయ నగరమైన ఈ స్థానంపై కూడా బీజేపీ గట్టి ఆశలే పెట్టుకుంది. అరన్ముల విమానాశ్రయ ఆందోళనలతో మంచి జనాదరణ పొందిన రాజశేఖరన్ను బరిలో దించింది. ఎల్డీఎఫ్ నుంచి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ఆరోగ్య మంత్రి వీణా జార్జిని ఆయన ఢీకొడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ఈసారి వ్యూహాత్మకంగా అబిన్ వర్కుకి టికెట్ ఇచ్చింది. గత రెండు ఎన్నికల్లో వీణా జార్జికి దన్నుగా నిలిచిన పలు సామాజికవర్గాలకు చెందిన ఓటర్లను ఆయన కాంగ్రెస్వైపు తిప్పగలరని పార్టీ ఆశపడుతోంది.త్రిసూర్గత ఎన్నికల్లో ఇక్కడ అధికార, విపక్ష కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎల్డీఎఫ్ నుంచి సీపీఎం అభ్యర్థి పి.బాలచంద్రన్ కేవలం 946 ఓట్లతో గట్టెక్కారు. ఎన్డీఏ తరఫున సినీ నటుడు సురేశ్గోపి గట్టి పోటీ ఇచ్చినా మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం ఆయన 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిసూర్ స్థానం నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో బీజేపీకి దక్కిన తొలి లోక్సభ స్థానం అదే కావడం విశేషం. బీజేపీ ఈసారి సీనియర్ నాయ కుడు వేణుగోపాల్కు టికెట్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ నుంచి అలంకొడె లీలాకృష్ణన్, యూడీఎఫ్ నుంచి మాజీ మేయర్ రాజన్ పల్లన్ పోటీలో ఉన్నారు.పాలక్కాడ్ఇక్కడ ఎల్డీఎఫ్, బీజేపీ తెర వెనక కుమ్మక్కయ్యాయని విపక్ష నేత వి.డి.సతీశన్ విమర్శలతో వాతావరణం బాగా వేడెక్కింది. యూడీఎఫ్కు పడే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఎల్డీఎఫ్ కావాలనే హోటల్ వ్యాపారి ఎన్ఎంఆర్ రజాక్కు టికెటిచి్చందని సతీశన్ ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ‘మెట్రో మ్యాన్’ఇ.శ్రీధరన్కు టికెటిచి్చంది. ఆయన కేవలం 3,859 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఓటమి చవిచూశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచిన శోభా సురేంద్రన్కు బీజేపీ ఈసారి టికెటిచి్చంది. షఫీ లోక్సభకు వెళ్లడంతో 2021లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతటిల్ నెగ్గారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ ఈసారి ఆయన్ను పక్కన పెట్టి రమేశ్ పిశరోడికి టికెట్ ఇచ్చింది. -
బీజేపీకి ఝలక్.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అన్నామలై!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నాడీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇప్పటికే లేఖ కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే కినతుకడవు వంటి స్థానాలను అన్నాడీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతుకడవు నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు రెండు రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయేలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి. బీఎల్ సంతోష్కు ఝలక్..ఇదిలా ఉండగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. గురువారం బీఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం.ఢిల్లీకి అభ్యర్థుల జాబితా27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారం. ఇందులో అవినాశి– కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మైలాపూర్– మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నార్త్– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, నాగర్కోయిల్– మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తళి – అమరప్రసాద్ రెడ్డి, తిరుప్పూర్ సౌత్ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్ – విజయధరణి, మదురై సౌత్– రామ శ్రీనివాసన్, తిరువణ్ణామలై– అశ్వత్థామన్, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్, పుదుక్కోట్టై– రామచంద్రన్..రామనాథపురం– జి.పి.ఎస్. నాగేంద్రన్,రాశిపురం– డాక్టర్ ప్రేమ్ కుమార్,వాసుదేవనల్లూర్ – ఆనందన్ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్, ఊటి– భోజ రాజన్ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్, రాధాపురం– బాలకృష్ణన్, తిరువారూర్ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్– ఆర్.ఎం. రాధాకృష్ణన్, పద్మనాభపురం– ఎడ్విన్ జోస్,కులచల్– శివకుమార్ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. -
డ్రైవింగ్ లైసెన్స్కు 30 రోజుల గ్రేస్ పీరియడ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి పలు సవరణలను ప్రతిపాదించింది. డ్రైవింగ్ లైసెన్సును గడువు ముగిసిన తర్వాత 30 రోజుల వరకు అమల్లో ఉన్నట్లు పరిగణించడం వంటివి అందులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన జన్ విశ్వాస్(అమెండ్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్)బిల్లు–2026ను వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 23 శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాలకు సంబంధించిన 784 నిబంధనల సవరణ ప్రతిపాదనలున్నాయి. ఇందులో మోటారు వాహనాల చట్టంలోని పలు నిబంధనల సడలింపు, చట్టపరమైన సందిగ్ధతను తొలగించేందుకు ఉద్దేశించిన 20 సవరణలున్నాయని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లను రాష్ట్రంలో ఎక్కడైనా చేయించుకునేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే, పునరుద్ధరించిన తేదీ నుంచి అమలులోకి వచ్చేలా చేయడం వంటివి ఉన్నాయన్నారు. అదేవిధంగా, డ్రైవింగ్ లైసెన్సు గడువు ముగిసిన 30 రోజుల వరకు అమలయ్యేందుకు వీలు కల్పించామన్నారు. వాహన రిజిస్ట్రేషన్ రద్దు కోసం దరఖాస్తు చేసుకునే గడువును 30 రోజులకు పెంచాలని, బీమా సర్టిఫికెట్ బదిలీపై సంబంధిత బీమా సంస్థకు సమాచారం ఇచ్చే గడువును కూడా 30 రోజులకు పెంచాలని ప్రతిపాదించామన్నారు. హిట్–అండ్–రన్ కేసుల్లో పరిహారానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే, రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలుంటుందని తెలిపారు. -
‘టీమ్ ఇండియా’గా పనిచేద్దాం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిణామాలు, ప్రపంచ అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఆహార భద్రతను విఘాతం కలగకుండా చూడడానికి, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు, పరిశ్రమలు, సప్లై చైన్లను బలోపేతం చేయడానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఆయన శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను సమీక్షించారు.రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి మనమంతా ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సవాల్ను మనం కచ్చితంగా అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఆ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు.ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్న అనుభవం మనకు ఉందన్నారు. తాజా సంక్షోభం పట్ల మన ప్రతిస్పందన వేగంగా ఉండాలంటే సమాచారం పంచుకోవాలని, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రాలు సైతం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. సప్లై చైన్లు సజావుగా పనిచేసేలా చూడాలని, సరుకుల అక్రమ నిల్వలు, రవాణా, అక్రమార్జనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇంధనం, సరుకుల సరఫరాలో అంతరాయాలను నివారించడానికి పరిపాలనా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యావసరాల సరఫరా పట్ల ఆందోళన తలెత్తకుండా ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎరువులపై ముందస్తు ప్రణాళిక అవసరం పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని, అందుకే నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రధాని మోదీ వెల్లడించారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ప్రతిరోజూ పరిస్థితులను సమీక్షిస్తోందని పేర్కొన్నారు. రైతాంగానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కు ముందు ఎరువుల నిల్వ, పంపిణీని పర్యవేక్షించడానికి ముందస్తు ప్రణాళిక అవసరమని స్పష్టంచేశారు. ప్రజల్లో భయాందోళనకు తావులేకుండా వారికి ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని అందించాలన్నారు.తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తేల్చిచెప్పారు. అలాగే నౌక రవాణా, నిత్యావసర వస్తువుల సరఫరా, సముద్ర కార్యకలాపాలకు సంబంధించి తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు సరిహద్దు, తీరప్రాంత రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వివరించారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి ఉద్బోధించారు.సహకారం, సమన్వయమే మన బలమని ఉద్ఘాటించారు. ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జమ్మూకశీ్మర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సీఎంలు పాల్గొనలేదు. -
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. చాలాదేశాల్లో ఇంధన అత్యవసర పరిస్థితి విధించారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. దీనివల్ల చమురు కంపెనీలపై భారం తగ్గి, రిటైల్ ధరల పెరుగుదలను అరికట్టినట్లు అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో మనదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించడంతో వినియోగదారులపై అదనంగా ఎలాంటి భారం పడబోదని సమాచారం. ప్రస్తుతం పెట్రోల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్కు రూ.13 ఉండగా.. తాజాగా రూ.10 తగ్గించడంతో అది రూ.3కు చేరుకుంది. డీజిల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్కు రూ.10 ఉంది. తగ్గింపు తర్వాత సున్నాకు చేరింది. ఈ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.1.75 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. రిటైల్ ధరలు యథాతథం ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. పెట్రోల్పై లీటర్కు రూ.24, డీజిల్పై లీటర్కు రూ.30 చొప్పున నష్టం వస్తోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గడంతో ఆయిల్ కంపెనీలు కొంతవరకు కోలుకుంటాయని, నష్టాలు భర్తీ అవుతాయని అధికారులు అంటున్నారు. రిటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు బదిలీ అయ్యే అవకాశం లేదు.పరోక్షంగానే ప్రయోజనం ఉంటుంది. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత రిఫైనరీలకు వచ్చిన లాభాల నేపథ్యంలో 2022 జూలైలో తొలిసారిగా ప్రవేశపెట్టి, 2024 డిసెంబర్లో ఉపసంహరించుకున్న ఎక్స్పోర్టు పన్నును ప్రభుత్వం పునరుద్ధరించింది. డీజిల్పై లీటర్కు రూ 21.50, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)పై లీటర్కు రూ.29.50 చొప్పున ఎగుమతి సుంకాన్ని(విండ్ఫాల్ ట్యాక్స్) విధించింది. అయితే, ఈసారి ఓఎన్జీసీ వంటి సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై ఎలాంటి విండ్ఫాల్ పన్ను విధించలేదు. ఎన్నికల కోసమే ఈ స్టంట్: కాంగ్రెస్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు పట్ల విపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ స్టంట్కు తెరతీసిందని విమర్శించారు. గత 12 ఏళ్లలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలాసార్లు తగ్గాయని, అప్పుడు మన దేశంలో రిటైల్ చమురు ధరలు తగ్గించలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ఉండడంతో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఏప్రిల్ 30 దాకా వెయిట్ చేయండి’అంటూ జైరామ్ రమేశ్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆ తర్వాత రిటైల్ ధరలు పెరుగుతాయని పరోక్షంగా తేలి్చచెప్పారు. -
బాలరామునికి ‘సూర్యతిలకం’
అయోధ్య: శ్రీరామ నవమి సందర్భంగా దేశం నలుమూలల నుంచీ పోటెత్తిన భక్తులతో అయోధ్య జనసంద్రమైంది. శుక్రవారం ఏకంగా 10 లక్షల మంది బాలరామున్ని దర్శించుకున్నారు. సరిగ్గా మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్త వేళ బాలరాముడు తొమ్మిది నిమిషాల పాటు నుదుట ‘సూర్యతిలకం’తో దర్శనమివ్వడం విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా అమర్చిన లెన్సులు, అద్దాల ద్వారా సూర్యకిరణాలను సరిగ్గా బాలరాముని విగ్రహం నుదుటి భాగాన పడేలా చేశారు. 14 మంది అర్చకుల ఆధ్వర్యంలో వైదిక పద్ధతిలో క్రతువు పరిసమాప్తమైంది.అనంతరం 56 రకాల ప్రసాదాలతో స్వామికి నైవేద్యం సమర్పించారు. అయోధ్య ఆలయంలో బాలరామున్ని 2024 జనవరి 22న ప్రతిష్టించడం తెలిసిందే. అనంతరం మూలమూర్తికి సూర్యతిలక క్రతువు నిర్వహించడం ఇది వరుసగా రెండో ఏడాది. దీన్ని భక్తులంతా దర్శించుకునేందుకు వీలుగా నగరమంతటా భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అంతకుముందు తెల్లవారుజాము నుంచే బాలరామునికి ప్రత్యేక పూజలు జరిగాయి. గురువారం అర్ధరాత్రి నుంచీ భక్తులు భారీగా బారులు తీరారు. దాంతో ప్రధానాలయానికి దారితీసే రామ్పథ్, భక్తి పథ్, జన్మభూమి పథ్ తదితర మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా నగరమంతటా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వర్చువల్గా వీక్షించిన మోదీ అయోధ్య బాలరామునికి సూర్యతిలక ధారణ క్రతువును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా వీక్షించారు. ఇది అద్భుత అనుభూతినిచి్చందని ఎక్స్ పోస్టులో ఆయన పేర్కొన్నారు. ప్రజలందరికీ రాముని దీవెనలు అందాలని ఆకాంక్షించారు. -
సీఎంలతో ముగిసిన మోదీ సమావేశం
ఢిల్లీ: దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. సుమారు రెండున్నరగంటల పాటు చర్చలు కొనసాగాయి. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇంధన సంక్షోభం, తదితర అంశాలపై చర్చించారు., పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఫర్టిలైజర్స్ సప్లైకి ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. దీనిలో భాగంగా పీఎం మోదీ మాట్లాడుతూ.. కలిసికట్టుగా పని చేస్తేనే పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యమని, ప్రజాప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా అంతా పని చేయాలన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేశామని, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించాలని సీఎంలకు సూచించారు. ఎరువుల నిల్వ, పంపిణీపై ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఎంలకు మోదీ ఆదేశించారు. PM Narendra Modi is chairing the meeting with CMs through video conferencing on the West Asia conflict to review preparedness and plans of states. pic.twitter.com/pqJS3iCgro— ANI (@ANI) March 27, 2026 -
వివాహితుడి లివ్-ఇన్ రిలేషన్ నేరం కాదు : సంచలన తీర్పు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన ఒక జంట దాఖలు చేసిన క్రిమినల్ రిట్ పిటిషన్ను విచారించిన అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. వయోజనులైన స్త్రీ-పురుషులు పరస్పర అంగీకారంతో సహజీవనం (Live-in Relationship) చేయడం నేరం కాదని స్పష్టం చేసింది. వివాహితుడైన పురుషుడు మరొక వయోజన మహిళతో కలిసి ఉన్నా, అది చట్టపరంగా నేరం కిందకు రాదని కోర్టు పేర్కొంది.ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన అనమిక, నేత్రపాల్ అనే జంట తాము వయోజనుల మని, ఇష్టపూర్వకంగా సహజీవనం చేస్తున్నామని కోర్టును ఆశ్రయించింది. కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత (BNS) నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జేజే. మునిర్, జస్టిస్ తరుణ్ సక్సేనాల డివిజన్ బెంచ్, పిటిషనర్లకు అనుకూలంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు పిటిషనర్లను అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.అయితే జనవరి 8న అనామిక తల్లి కాంతి, షాజహాన్పూర్లోని జైతీపూర్ పోలీస్ స్టేషన్లో నేత్రపాల్పై కేసు పెట్టింది. నేత్రపాల్ తన కుమార్తె అనామిక (18)ను మాయమాటలతో లోబరుచుకుని తీసుకువెళ్లాడని ఆమె ఆరోపించింది.నైతికత vs చట్టంన్యాయమూర్తులు జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. "సామాజిక నైతికత వేరు, చట్టం వేరు. పౌరుల హక్కులను కాపాడే విషయంలో కోర్టులు సామాజిక అభిప్రాయాలకు లేదా నైతికతకు కట్టుబడి ఉండవు" అని కోర్టు స్పష్టం చేసింది. నేత్రపాల్ వివాహితుడు అయినప్పటికీ, ఇద్దరు వయోజనులు ఇష్ట పూర్వకంగా కలిసి ఉండటాన్ని చట్టం అడ్డుకోదు. ప్రాథమికంగా ఇక్కడ ఎటువంటి నేరం జరిగినట్లు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.మరోవైపు తాను మేజర్నని, తన స్వచ్ఛంద నిర్ణయంతోనే నేత్రపాల్తో సహజీవనం చేస్తున్నానని అనామిక పోలీసులకు స్పష్టం చేసింది. తమకు ప్రాణహాని ఉందని (Honour Killing) పిటిషనర్లు కోర్టుకు తెలపడంతో, వారి భద్రతకు స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ (SP) వ్యక్తిగత బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించడం విశేషం. అలాగే ఈ జంటను నేరుగా గానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా గానీ లేదా మూడవ వ్యక్తి ద్వారా గానీ సంప్రదించ కూడదని, వారి ఇంటికి వెళ్లకూడదని కోర్టు కఠినంగా కుటుంబ సభ్యులను హెచ్చరించింది.ఇదీ చదవండి: షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళఏప్రిల్ 8 కి వాయిదా 2018 నాటి శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని పోలీసులకు సూచించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ జంటకు పూర్తి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది.ఇదీ చదవండి : బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..! -
షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళ
జైపూర్ : జైపూర్లో జరిగి ఒక విభ్రాంతికర ఘటన నెట్టింట వైరల్గా మారింది. జైపూర్లోని ఒక కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఒక మహిళ బహిరంగంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను ధ్వంసం చేసే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మార్చి 22న జరిగింది.సౌరభ్ శర్మ అనే వ్యక్తి తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై ఆఫీసుకి వెళ్తుండగా, ముందున్న స్కూటర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న క్యాబ్ కూడా ఆగింది. అయితే నియంత్రణ కోల్పోయిన సౌరభ్ తన ముందున్న క్యాబ్ను బుల్లెట్తో స్వల్పంగా ఢీకొట్టాడు.అయితే మర్యాదగా సౌరభ్ వెళ్లి వెంటనే క్యాబ్ డ్రైవర్కు క్షమాపణలు చెప్పాడు. కానీ క్యాబ్లో ఉన్న మహిళ మాత్రం హైడ్రామా క్రియేట్ చేసింది. ఆగ్రహం ఊగిపోతూ ఆమె బుల్లెట్ రైడర్తో గొడవకు దిగడమే కాకుండా, ఊహించని విధంగా సౌరభ్ హెల్మెట్ తీసుకుని అతని బైక్ అద్దాలను పగలగొట్టింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని బైక్ బాడీని, వెనుక లైట్లను పదే పదే బాదుతూ విధ్వంసం సృష్టించింది. ఈ తంతంగా అంతా సీసీటీవీలో రికార్డైయింది.Jaipur Woman Badly Damages Man's Bullet After It Grazes Her Scooterhttps://t.co/VNGAn5Q54t pic.twitter.com/Gt52R463vS— NDTV (@ndtv) March 26, 2026 ఇప్పటికే రూ. 1,700 నష్టం జరిగింది, చాలు ఇక వదిలేయండి. బైక్ పాడైపోతోంది అంటూ సౌరభ్ వేడుకున్నా ఆమె వదల్లేదు సరిగదా, ఎందుకు వదలాలి?" అంటూ మరింత కసిగా బైక్ను రాయితో కొట్టింది. బైక్ పాడైపోతోంది, వదిలేయండి, కేసుపెడతాను బెదిరించాడు అతగాడు. దీంతో నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ విరుచుకుపడింది.పోలీసుల తీరుపై విమర్శలుసౌరభ్ ఆరోపణల ప్రకారం, ఈ గొడవ జరుగుతున్నప్పుడు కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నప్పటికీ, అతను పట్టించుకోలేదు. మహిళను ఆపమని పదే పదే కోరినప్పటికీ ఆ అధికారి పట్టించుకోలేదని బుల్లెట్ రైడర్ సౌరభ్ శర్మ ఆరోపించారు.ఈ విషయం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లగా ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితి సామరస్యంగా పరిష్కారమైందని, ఆ మహిళపై ఎలాంటి అధికారిక కేసు గానీ, చట్టపరమైన చర్యలు గానీ నమోదు చేయలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, బహిరంగంగా ఒక వ్యక్తి వాహనాన్ని ధ్వంసం చేయడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పోలీసుల నిర్లిప్తతపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!ఇదిలా ఉండగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజస్థాన్ పోలీస్ హెల్ప్డెస్క్ బహిరంగంగా స్పందిస్తూ, ఈ కేసును సమీక్షించి, ప్రస్తుత పరిస్థితిపై అప్డేట్ అందించాలని జైపూర్ పోలీసులను కోరింది.ఇదీ చదవండి : బాలేన్ షా సరికొత్త చరిత్ర..32 ప్రభుత్వాల్లో ఒక్కటీ..! -
అధికారిక నివాసంలో.. ట్రాన్స్జెండర్తో మంత్రి రాసలీలలు..
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, మహరాష్ట్ర ఆహార,ఔషధాల నియంత్రణ శాఖ మంత్రి నరహరి జిర్వాల్ తన అధికారిక నివాసంలో ఓ ట్రాన్స్జెండర్తో రాస లీలలు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆ వీడియోలపై నరహరి సోదరుడు ఎన్సీపీ నేత రవి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్జెండర్ వెనుక కీలక నేతలు ఉన్నారు. ఆ నేతలే సదరు ట్రాన్సెజెండర్తో వీడియోలు తీయించారు. ట్రాన్స్జెండర్ కోటాలో ఎమ్మెల్సీతో పాటు ఇతర కీలక పదవులు పొందేందుకు మా సోదరుడి వీడియోలు తీశారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నరహరినే కాదు గతంలో తనని కూడా ట్రాన్స్ జెండర్ బెదిరించారాని గుర్తు చేశారు.ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేత, సామాజిక కార్యకర్త అంజలి దమనియా తీవ్రంగా స్పందించారు. ‘ఇది సిగ్గుచేటు. ఇదే మంత్రి గతంలో లంచం కేసులో కూడా ఇరుక్కున్నాడు. ఇలాంటి వ్యక్తిని పదవిలో ఉంచడం పార్టీకి అవమానం’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సక్పాల్ కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ప్రపంచంలో ‘ఎప్స్టిన్ ఫైల్స్’ ఎలా చెడ్డపేరు తెచ్చుకున్నాయో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది,” అని ఎద్దేవా చేశారు. ఇక ఎన్సీపీ నేత అమోల్ మిత్కరి మాత్రం ఈ వీడియోను పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ‘ఈ వీడియో ఎనిమిది నెలల పాతది. అసెంబ్లీ సెషన్ ముగిసిన వెంటనే ఎందుకు బయటకు వచ్చింది?. జ్యోతిష్కుడు అశోక్ ఖరాట్ కేసులో దృష్టి మళ్లించడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. అలాగే, అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన భార్య సునేత్రా పవార్ ఎన్సీపీ అధ్యక్షురాలిగా రావాలని మొదటగా డిమాండ్ చేసింది జిర్వాల్. అప్పటి నుంచి ఆయనపై వరుసగా వివాదాలు ముసురుకుంటున్నాయని పేర్కొన్నారు.జిర్వాల్పై ఇదే మొదటి వివాదం కాదు. మహారాష్ట్రలోని దిండోరి గిరిజన ప్రాంతానికి చెందిన ఈ నాయకుడి కార్యాలయంలోని ఒక క్లర్క్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. లంచంలో మంత్రి ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో చర్చకు దారితీసింది. అప్పుడూ ప్రతిపక్షం ఆయన రాజీనామా కోరింది. ఈ రెండు వివాదాలు కూడా అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత వెలుగులోకి రావడం గమనార్హం.ఎన్సీపీ కొత్త అధ్యక్షురాలు సునేత్రా పవార్ పదవిలోకి వచ్చి ఒక నెల పూర్తయిన రోజే ఈ వీడియో బయటకు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నాసిక్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి కొంతమంది పార్టీ నేతలు మహిళా విభాగం అధ్యక్షురాలు రూపాలి చకంకర్ను తొలగించాలని, జిర్వాల్పై చర్యలు తీసుకోవాలని లేఖలు రాశారు. చకంకర్ పేరు కూడా జ్యోతిష్కుడు అశోక్ ఖరాట్ కేసులో వినిపించడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు.మొత్తం మీద, ఈ వీడియో వివాదం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతను తెచ్చింది. ఒకవైపు బ్లాక్మెయిల్ ఆరోపణలు, మరోవైపు రాజకీయ కుట్ర ఆరోపణలు, ఎన్సీపీ అంతర్గత విభేదాలు, ప్రతిపక్ష ఒత్తిడి ఇవన్నీ కలిపి జిర్వాల్ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చాయి. -
రూ.400 కోట్లకు పైగా నగదు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం వేళ అక్రమ నగదు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపుతోంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు తావులేకుండా ఈసీ కఠిన చర్యలు చేపట్టింది.ఫిబ్రవరి 26న ఎల్రక్టానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఎస్ఎంఎస్) పేరిట ఎన్నికల నిఘా వ్యవస్థను క్రియాశీలకం చేసింది. నాటి నుంచి మార్చి 25 వరకు కొద్దిరోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.408.82 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మొత్తంలో మాదకద్రవ్యాల విలువ రూ.167 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న అక్రమ సొత్తును ఈసీ గణాంకాలతో సహా వెల్లడించింది. 100 నిమిషాల్లోనే పరిష్కారం... ఎన్నికల అక్రమాలపై సామాన్య పౌరులు ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ‘సి–విజిల్’ (cVIGIL) యాప్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని ఈసీ తెలిపింది. మార్చి 15 నుంచి 25 మధ్య కేవలం పది రోజుల్లోనే 70,944 ఫిర్యాదులు అందాయి. ఇందులో 95.8 శాతం (67,899) ఫిర్యాదులను కేవలం 100 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించారు. 1950 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ పేర్కొంది. చదవండి: ఎన్నికర ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు నిర్మించిన కేరళ నేత -
దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో దేశవ్యాప్త లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు నెట్టింట బాగా సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ లాంటి సంక్షోభం మనముందుంది, అందరం సన్నద్ధంగా ఉండాలి, కలిసికట్టుగా దీన్ని అధిగమించాలన్న వ్యాఖ్యలు, ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ కొరత నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ మళ్లీ తప్పదనే పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం వివరణ ఇచ్చారు. ప్రభుత్వం పరిశీలనలో అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్త లాక్డౌన్ వదంతులు పూర్తిగా అవాస్తవమని ఎక్స్లో క్లారిటీ ఇచ్చారు.గ్లోబల్ పరిస్థితులు మారుతున్నప్పటికీ, ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రపంచ పరిస్థితి నిరంతరం మారుతూనే ఉంది. ఇంధనం, సరఫరా గొలుసులు, నిత్యావసర వస్తువుల రంగాలలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా LPG సరఫరాపై లాక్డౌన్ ఆందోళనలు వ్యక్తమవడంతో కేంద్రమంత్రి ఈ వివరణ ఇచ్చారు.The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత కారణంగా భారతదేశంలో లాక్డౌన్ విధించవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో పూరీ ఈ స్పష్టతనిచ్చారు. లాక్డౌన్ వార్తలను తీవ్రంగా ఖండించారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యమని ఆయన హితవు పలికారు. ప్రజల రాకపోకలపై గానీ, ఆర్థిక కార్యకలాపాలపై గానీ ఆంక్షలు విధించే ప్రణాళికలు లేవని , ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అన్వయించుకున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: శ్రీరామ నవమి : రామ నామాలతో నీతా అంబానీ చీరపశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు , వాటి వలన సంభవించే ఆర్థిక పరిణామాల నేపథ్యంలో, ప్రధాని ఇటీవల పార్లమెంటు ప్రసంగాలలో 'సన్నద్ధత' గురించి ప్రస్తావించడంతో ఈ గందరగోళానికి దారి తీసింది. ఇదీ చదవండి: క్లాస్రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్ఐపీఎల్ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు! -
ఇరాన్కి మద్దుతుగా జేకేఎన్సీ ఎమ్మెల్యేల ఆందోళన
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇరాన్కి మద్దుతుగా నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా జేఎన్ఎన్కే ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ లోపల, బయట కూడా నిరసనలు చేపట్టారు.జేకేఎన్సీ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇరాన్కు అండగా నిలుస్తుందని,.. ఈ దాడులను ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గతంలోనే అయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించారు. ఇరాన్కు మేమంతా అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ఖమేనీ హత్య అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన.. ఒక సార్వభౌమ దేశంపై మరో దేశం ఇలాంటి చర్యలకు పాల్పడకూడదంటూ సాదిక్ నొక్కి చెప్పారు.‘‘అంతకుముందు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణను ఖండించారు. సైనిక బలంతో పాలన మార్పును సాధించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి.. బాహ్య జోక్యం ఉండకూడదు. ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల హత్యను నేను ఖండిస్తున్నాను. ఇలా చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్లకు ఏ చట్టం అధికారం ఇచ్చింది’’ అంటూ ఆయన ప్రశ్నించారు.J-K: National Conference MLAs protest in assembly, express solidarity with Iran over killing of Ayatollah Ali KhameneiRead @ANI Story |https://t.co/RphI1lVvvm#JammuKashmirAssembly #Khamenei #protest #NationalConference #JKNC pic.twitter.com/FTZOaZy5ML— ANI Digital (@ani_digital) March 27, 2026 -
నువ్వు చాలా... ఉన్నావు, నీతో ఒక్కసారి...
కర్ణాటక: నువ్వు చాలా... ఉన్నావు, నీతో ఒక్కసారి... అంటూ ఓ పోలీసు అధికారి సిగ్గు విడిచి వాట్సాప్ చాటింగ్ చేశాడు. అది కూడా మహిళా రౌడీతో. ఆమె తిరగబడడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. బెంగళూరులో ఈ ఉదంతం వైరల్గా మారింది. వివరాలు.. బెంగళూరు కోననకుంటె పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ పాపణ్ణపై లేడీ రౌడీషీటర్ యశస్విని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.పాపణ్ణ తనకు వాట్సాప్లో అశ్లీల మెసేజ్లు పంపిస్తూ వేధించాడని బుధవారం నగర పోలీస్ కమిషనర్కి చాటింగ్, ఆడియో కాల్స్ ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తరువాత కూడా పాపణ్ణ తనకు కాల్ చేసి ఇంటికి వస్తానని, మాట్లాడాలని, కేసు వెనక్కు తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నట్టు బాధితురాలు ఆరోపించింది. కమిషనర్ ఆఫీసు ముందు మీడియాతో మాట్లాడుతూ పాపణ్ణపై తీవ్ర ఆరోపణలు చేసింది. సీఐ మీద విచారణకు ఆదేశించామని, రుజువైతే చర్యలు తీసుకుంటామని స్థానిక ఏసీపీ తెలిపారు. -
అత్తమామల ఆశలు… ఒక్కరాత్రిలో కూలిపోయాయి!
కర్ణాటక: ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇంటిలో అడుగుపెట్టిన కోడలు వంశోద్ధారకున్ని కానుకగా ఇస్తుందని అత్తమామాలు ఆశపడ్డారు. కానీ పెళ్లయిన 2 నెలలకే కోడలు ఇంటి నుంచి పరారు కావడంతో మామ గుండె ఆగిపోయింది. సమాజంలో పెరిగిపోతున్న పెడ ధోరణులకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. వివరాలు.. కొప్పళలో గౌరిఅంగల నివాసి నాగరాజ్కు, రాయచూరు జిల్లా సింధనూరువాసి సంజనతో ఫిబ్రవరి 8 న కొప్పళలో ఓ కళ్యాణ మండపంలో ఘనంగా పెళ్లి జరిపించారు. కొప్పళలో ఇంటి కింది అంతస్తులో అత్తమామలు, పై అంతస్తులో కొత్త జంట కాపురం ఉంటున్నారు. మార్చి 21న రాత్రి 8 గంటలకు సంజన తనకు సుస్తీగా ఉందని, మెడికల్ షాపుకెళ్లి మాత్రలు తెచ్చివ్వాలని భర్తను కోరింది. సరేనని అతడు వెళ్లి మాత్రలు తీసుకువచ్చాడు, కానీ భార్య కనిపించలేదు. అప్పటి నుంచి పలుచోట్ల గాలించినా జాడ లేదు. ఆరోజు నుంచి కొత్త కోడలు ఇంటి పరువు తీసిందని, కొడుకు జీవితం బజారుపాలైందని తీవ్రంగా బాధపడుతున్న మామ ఖండప్ప గురువారం గుండెపోటుతో కన్నుమూశాడు. -
సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల అస్థిరత, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, సామాన్య వినియోగదారుడికి మాత్రం బంకుల వద్ద ధరల్లో తక్షణ ఉపశమనం లభించలేదనే వాదనలున్నాయి. చమురు విక్రయ సంస్థల (ఓఎంసీ) నష్టాలను పూడ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.సుంకాల కోత.. మారని ధరలు!కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించింది. అలాగే, గతంలో లీటరుకు రూ.10గా ఉన్న డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారుడికి బదిలీ కావడం లేదు. హార్మూజ్ జలసంధి మూసివేత భయాలు, మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకోవడానికి, చమురు సంస్థల ఆర్థిక రికవరీకి సహాయపడటానికే ఈ సుంకాల కోత ఉపయోగపడనుంది.నయారా ఎనర్జీ ధరల పెంపుదేశంలో ప్రధాన ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులపై ధరల భారాన్ని మోపింది. అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన సేకరణ ఖర్చులను భర్తీ చేసేందుకు పెట్రోల్ లీటరుకు రూ.5 పెంచింది. డీజిల్ లీటరుకు రూ.3 పెంచింది. రోస్నెఫ్ట్ మద్దతు గల ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన 6,967 ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ పెంపును అమలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉండే వ్యాట్ వ్యత్యాసాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.5.30 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది.ప్రధాన నగరాల్లో తాజా ధరలు (మార్చి 27)ప్రభుత్వ రంగ సంస్థల (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) ఇంధన ధరల్లో మార్పులు లేనప్పటికీ నగరాల వారీగా ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.నగరంపెట్రోల్ (లీటరుకు)డీజిల్ (లీటరుకు)ఢిల్లీరూ. 94.72రూ. 87.62ముంబైరూ. 104.21రూ. 92.15బెంగళూరురూ. 102.84రూ. 88.95హైదరాబాద్రూ. 107.41రూ. 95.65చెన్నైరూ. 100.75రూ. 92.34 గమనిక: పైన పేర్కొన్నవి ప్రభుత్వ రంగ సంస్థల ధరలు. ప్రైవేట్ బంకుల్లో (నయారా వంటివి) ఈ ధరలు రూ.3 నుంచి రూ.5 వరకు ఎక్కువగా ఉండవచ్చు.ఎందుకీ అస్థిరత?ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల బ్యారెల్ ముడిచమురు ధర అమాంతం పెరిగింది. ప్రైవేట్ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి ధరలను పెంచగా ప్రభుత్వ సంస్థలు ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నాయి. వెరసి, సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు.ఇదీ చదవండి: విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది? -
విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది?
భారతీయ సమాజంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల ఆర్థిక ప్రయాణం కూడా. నేటి ఆధునిక కాలంలో చాలా వరకు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి ఆస్తులు కొంటున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ బంధం విడాకుల వరకు వెళ్తే.. మరి వారు ఇద్దరూ కలిసి కొనుగోలు చేసిన ఆస్తి ఎవరిది? అనే ప్రశ్న వివాదంగా మారుతోంది.ఇటీవల ‘1 ఫైనాన్స్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, విడాకులు తీసుకున్న వారిలో 67 శాతం మంది తాము విడిపోకముందే తీవ్రమైన ఆర్థిక విభేదాలు ఎదుర్కొన్నట్లు తేలింది. అంతేకాకుండా, 43 శాతం కేసుల్లో విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైవాహిక ఆస్తుల యాజమాన్యంపై చట్టం ఏం చెబుతోంది? ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ప్రాధాన్యత ఏమిటి? అనే అంశాలను చూద్దాం.టైటిల్ డీడ్ వర్సెస్ కంట్రిబ్యూషన్: చట్టం ఏం చెబుతోంది?1955 హిందూ వివాహ చట్టం ప్రకారం, ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వారే యజమాని అనేది ప్రాథమిక సూత్రం. కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రాన భర్త ఆస్తిలో భార్యకు లేదా భార్య ఆస్తిలో భర్తకు సగం వాటా దానంతట అదే రాదు. ఇటీవల అమిష్ అగర్వాలా కేసులో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. భర్త పేరు మీద ఉన్న నివాస ఆస్తిలో తనకూ వాటా కావాలని భార్య కోరగా కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ‘వివాహం జరిగినంత మాత్రాన స్థిరాస్తిపై ఉమ్మడి యాజమాన్యం ఏర్పడదు’ అని కోర్టు స్పష్టం చేసింది. ఆస్తి కొనుగోలులో తమ ఆర్థిక భాగస్వామ్యం ఉందనడానికి బ్యాంకు స్టేట్మెంట్లు వంటి పక్కా ఆధారాలు చూపాలని న్యాయస్థానం పేర్కొంది.వినీతా సక్సేనా కేసు మినహాయింపుసుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో దీనిపై విభిన్నంగా స్పందించింది. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (2006) కేసులో ఆస్తి భర్త పేరు మీద ఉన్నప్పటికీ భార్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. గృహిణిగా ఆమె అందించిన సేవలు, ఇంటి నిర్వహణలో ఆమె పడిన శ్రమను ‘పరోక్ష సహకారం’గా గుర్తించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 27 కింద ఆమెకు హక్కు కల్పించింది.నేటికీ చాలామందిలో ఆస్తి విషయంలో కొన్ని తప్పుడు అవగాహనలు ఉన్నాయి. 1 ఫైనాన్స్లో విల్, ఎస్టేట్ ప్లానింగ్ హెడ్ శ్రద్ధా నీలేశ్వర్ కొన్ని కీలక విషయాలను వివరించారు. తాను తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.పెళ్లయ్యాక కొన్న ఆస్తిలో భాగస్వామికి ఆటోమేటిక్గా 50% వాటా రాదు.‘షమీమా ఫరూకీ వర్సెస్ షాహిద్ ఖాన్ (2015)’ కేసు ప్రకారం, ఆస్తిలో నివసించే హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, పూర్తి యాజమాన్య హక్కులు ఉండవు.చాలామంది పన్ను ఆదా కోసం ఒకరి పేరు మీదనే ఆస్తులు కొంటారు, కానీ విడాకుల సమయంలో ఇది రెండో వ్యక్తికి చట్టపరమైన ఇబ్బందులు కలిగిస్తోంది.ప్రస్తుతం 42 శాతం మంది పురుషులు తమ సంపాదనలో సగటున 38 శాతాన్ని భరణం లేదా వివాహ సంబంధిత రుణాలకే వెచ్చిస్తున్నారు. ఇది ఆర్థిక ప్రణాళికలో రికార్డుల ప్రాధాన్యతను చెబుతోంది.నిపుణుల సూచనలుభవిష్యత్తులో ఆస్తి తగాదాలు తప్పించుకోవడానికి కొనుగోలు సమయంలోనే భార్యాభర్తలిద్దరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. దీనివల్ల సెక్షన్ 80సీ, సెక్షన్ 24(b) కింద ఇద్దరూ పన్ను మినహాయింపు పొందవచ్చు.డౌన్ పేమెంట్స్ లేదా ఈఎంఐలు చెల్లించినప్పుడు ఆ లావాదేవీల రికార్డులను, బ్యాంక్ స్టేట్మెంట్లను భద్రపరుచుకోవాలి.ఆస్తిలో ఎవరి వాటా ఎంతో దస్తావేజుల్లోనే పేర్కొనడం ఉత్తమం.వివాహం అనేది నమ్మకంతో కూడిన బంధం అయినప్పటికీ, ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండటం నేటి కాలంలో అత్యవసరం. చట్టపరమైన చిక్కులు రాకముందే మేల్కొని ఆస్తులకు సంబంధించిన సరైన పత్రాలను సిద్ధం చేసుకోవడం ఇరు పక్షాలకు శ్రేయస్కరం.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం
దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. భారత్లో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పూర్తిగా సురక్షితంగా, నియంత్రణలో ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని భరోసా ఇచ్చింది.వదంతులు నమ్మొద్దు..సోషల్ మీడియాలో ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల్లోని క్యూలైన్లు, పాత లాక్డౌన్ దృశ్యాలను వాడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్చరించింది. ఇటువంటి వార్తలను నమ్మి పౌరులు ఆందోళన చెందవద్దని, ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని పేర్కొంది.కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురును కంపెనీలు ఇప్పటికే సేకరించాయి. రిటైల్ అవుట్లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా పెట్రోల్ బంకులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి 8,00,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు సముద్ర మార్గంలో భారత్కు వస్తోంది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ ఇంధన భద్రతలో పటిష్టంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకప్పుడు కేవలం పశ్చిమాసియాపైనే ఆధారపడిన భారత్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 41కి పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల హార్మూజ్ జలసంధి వంటి ప్రాంతాల్లో అంతరాయాలు కలిగినా దేశీయ సరఫరాకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేసింది.తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలునిత్యావసర వస్తువుల లభ్యతపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, డీలర్లకు క్రెడిట్ పరిమితులను కూడా పెంచామని, కావున ప్రజలు సంయమనం పాటించాలని కోరింది.విశాఖ తీరానికి ‘ఎంటీ జంబో’ రాక!రష్యా నుంచి సుమారు 1,36,728 మెట్రిక్ టన్నుల ముడి చమురును మోసుకొస్తూ ‘ఎంటీ జంబో’ నౌక నేడు విశాఖ తీరానికి చేరుకుంది. ఈ భారీ కంటైనర్ రాకతో స్థానిక రిఫైనరీలకు ముడి సరుకు లభ్యత పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాలో స్థిరత్వం ఏర్పడనుంది. నిన్న బీడబ్ల్యూ బ్రిచ్ నౌక 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (వంట గ్యాస్)తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఎంటీ పెట్రాయిట్ నౌక కూడా భారీ స్థాయిలో ముడి చమురును తీసుకువచ్చింది. అయితే, ఎంటీ జంబో ద్వారా వచ్చిన లక్షన్నర టన్నుల ముడి చమురును పైప్లైన్ల ద్వారా రిఫైనరీలకు తరలించే అన్లోడింగ్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది. వంట గ్యాస్ నిల్వలను మరింత పెంచే దిశగా ఈ నెల 30వ తేదీన మరో రెండు ఎల్పీజీ నౌకలు విశాఖ తీరానికి చేరుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
ఓట్లలో ముందంజ సీట్లలో వెనకంజ
తిరువనంతపురం: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళాభ్యున్నతి కోసం ఊదరగొట్టే రాజకీయ పార్టీలు తీరా సీట్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నాయి. ఇందుకు కేరళ రాజకీయాలూ మినహాయింపు కాదని తేటతెల్లమైంది. గత నెల 21వ తేదీన కేరళ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. దీని ప్రకారం కేరళ ఓటర్లలో 1,32,20,811 మంది పురుషులు ఉంటే వాళ్లకంటే ఎక్కువగా 1,39,21,868 మంది మహిళలు ఉన్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టం ద్వారా శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఓపక్క ప్రకటించినా క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఆ మాటలన్నీ నీటిలో ఉప్పు మూటలేనని రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడిగా తేల్చిచెప్పాయి. త్వరలో జరగబోయే కేరళ శాసనసభ ఎన్నికల్లో 140 స్థానాలకుగాను అన్ని ప్రధానపార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ అత్యధికంగా 14 చోట్ల మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపింది. సీపీఐ(ఎం) 12 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల, సీపీఐ ఐదు చోట్ల మహిళలకు సీట్లు ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తేగానీ మహిళలకు కోటాపై ఆలోచించేదిలేదని రాజకీయపార్టీల ఆలోచనగా ఉందని తాజా కేటాయింపులతో తేలిపోయింది. అయితే విపక్ష యూడీఎఫ్ కూటమిలో భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలకు సీట్లు ఇవ్వడం విశేషం. 1957లో కేరళ శాసనసభ ఆవిర్భవించింది. అప్పట్నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఏ ఒక్క శాసనసభలోనూ మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కనీసం 10శాతానికి చేరుకోలేదు. పార్టీలు మహిళలకు సీట్లు ఇవ్వడానికి మొదట్నుంచీ విముఖత చూపుతున్నాయని ఏప్రిల్9న బరిలో దిగనున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పీసీ విష్ణునాథ్ అన్నారు. ‘‘శక్తిసామర్థ్యాలున్న మహిళా నేతలు ఎలాంటి చట్టం, కోటా లేకుండానే సీటు సాధించి విజయతీరాలకు చేరగలరు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ప్రతి పార్టీ.. గెలుపు గుర్రాలనే నమ్ముకుంటోంది. మహిళా అభ్యర్థి అని కాకుండా ఇతరత్రా అంశాలకు ప్రాధాన్యతనిచ్చి సీటు కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటున్నాయి’’అని అన్నారు.ప్రాధాన్యత పెరగాలి: ఐద్వా నాయకురాలు‘‘ఎల్డీఎఫ్ కూటమి మొత్తంగా 18 మంది మహిళలకు సీట్లు ఇచ్చింది. ఇది ఏమాత్రం సరిపోదు. మాకు సీట్లు పెరగాలని ప్రతిసారీ గట్టిగా చెబుతున్నాం. పార్టీలు హామీలు ఇస్తున్నాయి. తీరా అభ్యర్తుల తుది జాబితా బయటికొచ్చేసరికి పరిస్థితి తారుమారవుతోంది’’అని సీనియర్ సీపీఐ(ఎం) నాయకురాలు, ఆలిండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) జాతీయ కార్యదర్శి పీకే శ్రీమతి అసహనం వ్యక్తంచేశారు. ‘‘కేరళలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే మోదీ సర్కార్ హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ చట్టంపై మాట్లాడుతోంది. దమ్ముంటే తక్షణం ఆ చట్టం అమల్లోకి తేవాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు. కేరళలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
ముస్లింల ఓట్లే ‘కీ’లకం
(సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి) పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయ వాగ్భాణాలు, ప్రత్యేక వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు సహజం. కానీ వాటిని మించి కులాలు, మతాలు, ప్రాంతీయ సమీకరణాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. బెంగాల్ ఓటర్లలో దాదాపు 30 శాతం మంది ముస్లింలే. దాంతో అక్కడి పార్టీల తలరాతను మార్చగలిగే శక్తిగా ముస్లింలు ఎదిగారు. దీంతో ఈసారి వాళ్లు ఎవరికి పట్టంకడతారనే చర్చ మొదలైంది. ముఖ్యంగా తృణమూల్కు మొదటి నుంచీ ముస్లింలు అండగా ఉంటూ వస్తున్నారు. వీరి దన్నుతోనే మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి ముస్లిం ఓట్లలో చీలిక తెస్తూనే హిందూ ఓట్లను ఐక్యం చేసే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముస్లిం ఓటర్లు రాష్ట్రంలోని కనీసం 110 స్థానాల్లో జయాపజయాలను ప్రభావితం చేయగలరు. దీంతో మరోసారి ముస్లింల ఐక్యత మరోసారి తృణమూల్ను విజయతీరాలకు చేరుస్తుందా? లేదంటే వీరిలో ఐక్యత దీపం కొండెక్కి తృణమూల్ పడవను ఓటమి సముద్రంలో ముంచేస్తుందా? లేదంటే చీలిక తెచ్చి బీజేపీ ఘన విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. పథకాలతో లబ్ధిపొందిన ముస్లింలు ముస్లింల మద్దతు వెనుక కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేకాకుండా పక్కాగా అమలు చేసిన వ్యూహాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సమీకరణాలున్నాయి. ముఖ్యంగా...టీఎంసీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లిం వర్గాల్లో గట్టి మద్దతును ఏర్పరచాయి. మహిళల కోసం ‘లక్ష్మీ భండార్’, విద్యార్థుల కోసం ‘సబుజ్ సాథి’, బాలికల విద్యను ప్రోత్సహించే ‘కన్యాశ్రీ’వంటి పథకాలు సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రత్యక్ష లాభం చేకూర్చాయి. ఈ పథకాలు మతాలకు అతీతంగా అమలయ్యాయి. దీంతో ముస్లిం వర్గాలు ఈ పథకాల నుంచి ఎక్కువ మంది లబ్దిపొందాయి. మైనారిటీ వర్గాలపై టీఎంసీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మదర్సాల అభివృద్ధి, ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు, మతపరమైన నాయకులకు గౌరవ వేతనాలు వంటి చర్యలు ‘ప్రభుత్వం మన కోసం పని చేస్తుంది’అనే భావనను ముస్లింలలో బలంగా నాటాయి. ఈ భావన రాజకీయంగా టీఎంసీకి కీలక మద్దతుగా మారింది. గడిచిన పదేళ్లుగా ప్రధాన పోరు బీజేపీ, టీఎంసీల మధ్యే నెలకొంది. బీజేపీ హిందూ రాజకీయాలతో పోలిస్తే టీఎంసీ సర్వమత సహకార భావనే ముస్లింలను ఆ పార్టీకి దగ్గర చేసిందని తెలుస్తోంది. ముస్లింల ఈ రక్షణాత్మక భావనే తమ గెలుపునకు భరోసా అని టీఎంసీ నేతలు ఆశిస్తున్నారు. టీఎంసీ అయితేనే తమ ప్రయోజనాలకు పరిరక్షణగా నిలబడుతుందనే యోచన ముస్లింలలో బలంగా నాటుకుపోయింది. ఈ ఐక్యతే టీఎంసీకి గతంలో గంపగుత్తగా ఓట్లు పడేలా చేసింది. స్థానికంగా ముస్లిం నాయకత్వానికి టీఎంసీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, ప్రాంతీయ నాయకులను ప్రోత్సహించడంతో ప్రజల్లో ప్రాతినిధ్యం ఉన్న భావన పెరిగింది. ఇది ఓటర్లతో నేరుగా అనుబంధాన్ని ఏర్పరచింది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్పూర్, దక్షిణ 24 పరగణాలు వంటి ముస్లిం ప్రభావిత జిల్లాల్లో టీఎంసీకి బలమైన కేడర్ ఉంది. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఓటును సమీకరించడంలో ఇవన్నీ కీలకంగా మారాయి. ప్రతిపక్ష పార్టీల బలహీనత టీఎంసీకి అనుకూలంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఒకింత ముస్లిం ఓటు బ్యాంక్ ఉండేది. అయితే క్రమంగా ఈ రెండు పార్టీలు ప్రభావం కోల్పోవడంతో ప్రత్యామ్నాయం లేక ముస్లింలు టీఎంసీని ఆశ్రయించారు. హిందువులను ఐక్యం చేసే పనిలో కమలదళం బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదల వెనుక ఉన్న ప్రధాన వ్యూహాల్లో ఒకటి ముస్లిం ఓటును విభజించడం. రెండోది హిందూ ఓటును ఐక్యంగా మార్చడం. ఈ ద్వంద్వ వ్యూహమే 2019 నుంచి పార్టీని బెంగాల్లో ముందుకు నడిపిస్తోంది. ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేయకుండా వాళ్లను రెండు, మూడు పార్టీల వైపు చూసేలా చేయడమే బీజేపీ లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రత్యక్షంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కన్నా కాంగ్రెస్, లెఫ్ట్, చిన్న ప్రాంతీయ పార్టీల వైపు ముస్లిం ఓటర్లు చూసేలా బీజేపీ పరోక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని వార్తలొచ్చాయి. హిందువులను ఏకం చేసి ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం బీజేపీ మతపరమైన గుర్తింపును బలంగా ప్రస్తావిస్తోంది. సమూహ భావనను బీజేపీ ముందుకు తెస్తోంది. ముఖ్యంగా ‘సాంస్కృతిక పరిరక్షణ’, దేవాలయాలపై దాడులు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ హిందువుల్లో ఐక్యత పెంపొందేలా శతథా కృషిచేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నమశూద్రులు, రాజ్బంశీలు వంటి వర్గాల్లో బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ఈ వర్గాల మధ్య ప్రస్తావించడం ద్వారా తమ మద్దతును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జంగిల్మహల్ వంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రభావం పెంచుకుంది. బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో హిందువుల జనాభా ఎక్కువ. ఇక్కడ బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కబీర్ మరో ఒవైసీ అవుతారా..? తృణమూల్కు చెందిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ‘బాబ్రీ మసీదు నమూనాలో మసీదు కడతా’ అంటూ ఆయన మొదటుపెట్టిన రాజకీయాలు తీవ్ర అలజడిని రేపుతున్నాయి. కబీర్తో ముస్లిం ఓటు విభజనకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కబీర్తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసిపోవడంతో సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఓటు చీలిపోయే ఆస్కారముంది. ఈ చీలిక నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్కు గండికొడుతుంది. వీరిద్దరూ కలిసి 140 స్థానాల్లో పోటీలో ఉంటారన్న అంచనాలు తృణమూల్ను కంగారు పెడుతున్నాయి. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో హుమయున్ కబీర్ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామాలను బిహార్ రాజకీయాలతో పోల్చుతున్నారు. అక్కడ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటును విభజించి, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసింది. ఆర్జేడీ ఓటమికి పరోక్షంగా కారణమైంది. ఇప్పుడు అచ్చం అలాగే హుమాయున్ కబీర్ కారణంగా ముస్లిం ఓటు చీలితే టీఎంసీ విజయావకాశాలు తగ్గి బీజేపీ అధికారపీఠానికి చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
ల్యాండింగ్కు వీలులేక గంటపాటు గాల్లో చక్కర్లు
కోల్కతా: ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో మెరుపులా విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని గురువారం మధ్యాహ్నం ఉరు ములు, భారీవర్షం, భీకరగాలుల గంటలపాటు ఆందోళనకు గురిచేశాయి. ఎన్నికల ప్రచారర్యాలీల్లో పాల్గొని కోల్కతాకు ఛార్టెర్డ్ విమానంలో తిరుగుపయనమైన మమతకు కోల్కతా ఎయిర్పోర్ట్లో అననుకూల వాతావరణం స్వాగతం పలికింది. దీంతో తప్పనిపరిస్థితుల్లో విమానం గంటకుపైగా గాల్లోని చక్కర్లు కొట్టింది. తర్వాత ఎట్టకేలకు 5.19 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని అణ్డాల్ నగరంలో ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో మమత బయల్దేరారు. అరగంటలో కోల్కతాలోని నేతాజీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ అప్పటికే ఎయిర్పోర్ట్ ప్రాంతమంతా పెద్ద గాలివానలో చిక్కుకుంది. దీంతో విమానాల రాకపోకలను నిలిపేశారు. చేసేదిలేక విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టి గంట తర్వాత దిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం, ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. -
ఫుడ్ బిల్లులో గ్యాస్ చార్జీలు చట్టవిరుద్ధం
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరతను సాకుగా చూపించి హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులో ఎల్పీజీ రుసుము, గ్యాస్ సర్చార్జి, ఇతర చార్జీలు జోడిస్తున్నారు. అసలు బిల్లుపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. వినయోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం నిర్దేశిత రుసుములు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంచేసింది. అధిక చార్జీలపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందినట్లు సీసీపీఏ వెల్లడించింది. మీడియాలోనూ దీనిపై వార్తలు వచ్చినట్లు తెలిపింది. ఆహార పదార్థాలపై మెనూలో ప్రదర్శించిన రుసుములే ఫైనల్ అని పేర్కొంది. వాటిపై వర్తించే పన్నులు మినహా అదనంగా వసూలు చేయకూడదని హోటళ్లు, రెస్టారెంట్లను ఆదేశించింది. -
లండన్కు వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య
న్యూఢిల్లీ: బ్రిటన్లోని లండన్ హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ఇండియా ఏ350రకం విమానం సాంకేతిక సమస్యలతో తిరిగొచ్చి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాల్సి వచ్చింది. సౌదీ అరేబియా గగనతంలోకి ప్రవేశించాక సాంకేతిక సమస్య తలెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానం మళ్లీ ఢిల్లీకి వెనుతిరగాల్సి వచ్చిందని ఎయిర్ఇండియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. గతవారం రోజుల వ్యవధిలో ఎయిర్ఇండియా విమానం మార్గమధ్యంలో యూటర్న్ తీసుకోవడం ఇది రెండోసారి. ‘‘గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఏ350–900 రకం వీటీ–జేఆర్ఎఫ్ సిరీస్ ఎయిర్ఇండియా విమానం లండన్కు బయల్దేరింది. నాలుగు గంటల్లో 3,300 కిలోమీటర్లు ప్రయాణించి సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించింది. అప్పుడు విమానంలో కొన్ని శబ్దాలు పెద్దగా విని్పంచాయి. దీంతో ముందుజాగ్రత్తగా వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ముందుకు, వెనక్కి అలా మొత్తంగా ఏడు గంటలపాటు ప్రయాణించి ఢిల్లీలో మధ్యాహ్నం 12.30 గంటలకు ల్యాండ్ అయింది. విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారు. ఘటనపై సాంకేతిక బృందం సమగ్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు పూర్తవడానికి మరింత సమయం పడుతుంది’’అని అధికార ప్రతినిధి వివరించారు. విమానంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియరాలేదు. ఇదే విమానం సరిగ్గా 11 రోజుల క్రితం న్యూయార్క్లోని జాన్ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ మార్గమధ్యంలో సాంకేతికసమస్యల బారినపడింది. దీంతో గమ్యస్థానం ఢిల్లీకి బదులుగా మధ్యలోనే ఐర్లాండ్లోని షానన్ నగరంలో ల్యాండ్ అయింది. ఏ350–900 రకం విమానాలను గత ఏడాది జనవరి నుంచి ఎయిర్ఇండియా నడుపుతోంది. గత వారం ఢిల్లీ నుంచి బయల్దేరి కెనడాలోని వాంకోవర్కు చేరుకోవాల్సిన ఎయిర్ఇండియా విమానం చైనా గగనతలంలోకి చేరుకోగానే సాంకేతిక సమస్యల కారణంగా మళ్లీ ఢిల్లీకే తిరిగిరావడం తెల్సిందే. -
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఛింద్వారా: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్న ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరై తిరుగుపయనమైన పలువురు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బస్సు, పికప్ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో బస్సులోని ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు చనిపోయారు. బస్సు డ్రైవర్, పికప్ ట్రక్కు డ్రైవర్, క్లీనర్ సైతం చనిపోయారు. ఛింద్వారా జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని సిమారియా పట్టణ సమీపంలో నాగ్పూర్ జాతీయరహదారిపై గురువారం రాత్రి 7.15 గంటలకు ఈ ఘటనలో 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. వీరిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని నాగ్పూర్కు తరలించారు. మితిమీరిన వేగంతో వెళ్తూ ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు...ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ప్రమాదం వార్త తెల్సి సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రూ.506 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ఛింద్వారా నగరంలోని పోలీస్మైదానంలో ఏర్పాటుచేయగా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ఆరు గంటలకు దాదాపు 47 మందితో ఈ ప్రైవేట్ బస్సు తిరుగుపయనమై చివరకు ప్రమాదంలో చిక్కుకుంది. -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గింది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఇంధనం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మరింత పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా వదంతులు మాత్రం ఆగడం లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరో రెండు నెలల దాకా మనకు ఢోకా లేదని భరోసా ఇచ్చింది. అలాగే 8 లక్షల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, దీంతో దేశమంతటా ఒక నెల మొత్తం గ్యాస్ అవసరాలు తీరుతాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఎంతమాత్రం లేదని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనం ఆందోళనకు గురై ఇంధనం కోసం ఎగబడ్డారని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వం మన దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వల వివరాలను బయటపెట్టడం ఇదే మొదటిసారి. ‘క్యాష్ అండ్ క్యారీ’వల్ల అంతరాయం నిజమే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టంచేసింది. అవి సాధారణంగానే పని చేస్తున్నాయని, చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వివరణ ఇచ్చింది. కొన్నిచోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న ‘క్యాష్ అండ్ క్యారీ’విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యజమాన్యాలకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. 150కిపైగా దేశాల నుంచి దిగుమతి ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన నాలుగో దేశం భారత్. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, గ్యాస్ దిగుమతులు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా 150కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మనదేశంలో అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని, రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాల ఒప్పందాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఖరారు చేసుకున్నాయని స్పష్టంచేసింది. మన దగ్గర మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురును, ఇంధనాన్ని నిల్వ చేసకొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.ఇంధన ఎమర్జెన్సీకి ఆస్కారం లేదు ప్రపంచంలో ఎక్కడం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే మన దగ్గర ప్రతి పౌరుడికి రెండు నెలలపాటు స్థిరంగా ఇంధనం సరఫరా చేయగలమని కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని నెలలపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఎల్పీజీ విషయంలో దేశీయంగానే ఉత్పత్తిని పెంచుతున్నామని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నామని కేంద్రం స్పష్టంచేసింది. ఇంధనం, గ్యాస్పై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ విధించారని, సరఫరా తగ్గించారని, ధరలు పెంచారని.. మన దేశంలో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. -
నేడు సీఎంలతో మోదీ వర్చువల్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను ఆయన సమీక్షిస్తారు. ప్రస్తుత సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం, రాష్ట్రాలు ‘టీమ్ ఇండియా’గా కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంపై ముఖ్యమంత్రులతో మోదీ చర్చించనున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంతో ప్రధానమంత్రి భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి. అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ భేటీ నుంచి మినహాయించారు. అక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడమే ఇందుకు కారణం. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. -
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ‘మేం స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలను హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించాం. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లను అనుమతించాం’అని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘మనం యుద్ధంలో ఉన్నాం. ఈ ప్రాంతం కూడా ఒక యుద్ధ క్షేత్రం. మన శత్రువులు, వారి మిత్రుల నౌకలను దీని గుండా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకోసం ఇది తెరిచే ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన నౌకా మార్గం హార్మూజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు)లో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దేశ ఇంధన కొనుగోళ్లకు పశ్చిమ ఆసియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ నౌకాయాన మార్గంపై దిగ్బంధనం కొనసాగితే, దేశంతో సహా అనేక దేశాల ఇంధన, ఎరువుల భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించింది. దీంతో జలసంధి గుండా ఇంధన ప్రవాహం నిరాటంకంగా సాగేలా చూడటంపై దృష్టి సారించిన భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది. -
శ్రీరామ నవమి : రామ నామాలతో నీతా అంబానీ చీర
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కళలు, సంస్కృతిపై ప్రేమను చాటుకోవడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. భక్తిని, వారసత్వాన్ని అందంగా ప్రతిబింబించే అందమైన చీరలో స్పెషల్గా మెరిసారు. శ్రీరామ నవమి పవిత్ర సందర్భాన, భక్తిని, భారతీయ వారసత్వాన్ని అద్భుతంగా చాటిచెప్పే ఒక చీర గురించి అంటూ నీతా లుక్కుసంబంధించిన ఫోటోలను ఎన్ఎంఏసీసీ ఇన్స్టాలో షేర్ చేసింది.హస్తకళల ద్వారా ఒక సంస్కృతిని గౌరవించడం అనేది ఆ కళాకారుల శ్రమకు నిజమైన గుర్తింపు నివ్వడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు. ఇటీవల ఒడిశాలోని కేఐఐటీ (KIIT)లో నీతా గౌరవ డాక్టరేట్ అందుకున్నప్పుడు, ఆమె ఆ ప్రాంతపు కాలాతీత హస్తకళలను గౌరవించారు. ఈ ప్రత్యేక సందర్భం కోసం, ఆమె మట్టి రంగులలోని ఒక సుందరమైన ఇక్కత్ (Ikat) చీరను ఎంచుకున్నారు. స్వదేశ్ నేత కళాకారుడు హరిశంకర్ మెహర్ దీన్ని రూపొందించారు. ఈ ప్రత్యేకమైన చీరను రూపొందించడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. ఒడిశాలోని గొప్ప నేత వారసత్వానికి ప్రతిబింబమైన ఈ చీరను నీతాకు ఆయన బహూకరించారు.సహజమైన రంగులను ఉపయోగించి, సాంప్రదాయ బంధ (Bandha)పద్ధతిలో నేసిన ఈ చీర, భక్తిని,డిజైన్ మేళవింపుగా అందంగా రూపొందింది. దీని ప్రధాన భాగంలో రామ శిల స్ఫూర్తితో రూపొందించిన మొజాయిక్ ఉంది. దానిపై సార్వజనీన విశ్వాసానికి ప్రతీకగా "రామ్" అనే పదం అనేక భాషలలో లిఖించారు. కొంగుపై ఒడియా లిపిలో పవిత్ర మంత్రాలు, సాంప్రదాయ ఇక్కత్ నమూనాలలో నేయడం విశేషం.ఇదీ చదవండి: ఐపీఎల్ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు! View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)నీతా చీర ప్రత్యేకతలుసహజ సిద్ధమైన రంగులలతో సాంప్రదాయ 'బంధ' (Bandha) ప్రక్రియలో ఈ చీరను నేశారు. పవిత్రమైన పల్లు, రామనామాలు ఈ చీర ప్రత్యేకతలు.చీర మధ్య భాగంలో (Body) 'రామ శిల' స్ఫూర్తితో కూడిన డిజైన్ ఉంది. ఇందులో "రామ్" అనే పదం వివిధ భాషలలో లిఖించబడి, విశ్వవ్యాప్తమైన భక్తిని చాటిచెబుతోంది. చీర పల్లూ భాగంలో పవిత్రమైన మంత్రాలను ఒడియా లిపిలో, క్లాసిక్ ఇక్కత్ నమూనాలతో కలిపి అత్యంత నైపుణ్యంతో నేశారు.ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపుకేవలం ఇదొక వస్త్రంగానే కాకుండా, ఈ చీర సంప్రదాయం, ఆధ్యాత్మికత మరియు కథాకౌశలానికి ప్రతీకగా నిలుస్తుంది. మన వస్త్రాలు మన సంస్కృతిని, భక్తిని , కాలాతీత జ్ఞానాన్ని ఎలా మోసుకెళ్తాయో చెప్పడానికి ఇది ఒక చక్కని నిదర్శనం.ఇదీ చదవండి: క్లాస్రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్ -
ఐపీఎల్ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు!
2026 ఐపీఎల్ సీజన్ (BCCI-IPL 2026) శనివారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శాసనసభలో ఒక కీలక ప్రతిపాదన చేశారు. తమ లాంటి వీఐపీలు క్యూలో నిలబడలేరు కాబట్టి ప్రతీ మ్మెల్యేకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఐదు టిక్కెట్లను అందించాలని కోరారు. హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ కశపనవర్ ప్రతీ ఎమ్మెల్యేకు ఐదు టికెట్లతోపాటు, శాసనసభ్యులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కూడా క్రికెట్ సంఘాన్ని కోరడం విశేషం. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంవారు ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. వారికి అన్ని భద్రతలూ లభిస్తున్నాయి. ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నారు. కానీ వారు ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వారి కుటుంబాలకు ఐపీఎల్ టిక్కెట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు విఐపీలు కాబట్టి వారు క్యూలో నిలబడలేరు వారి 5 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోయినసారి ప్రజలతోపాటు క్యూలోనే నిలబడి ఇబ్బందులు పడ్డాం. ఈసారి మాత్రం అలా జరగనివ్వమని వ్యాఖ్యానించారు.ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకంలో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని కూడా కశపనవర్ ఆరోపించారు. అందుకే తాము ప్రభుత్వాన్ని అభ్యర్థించాము. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో లేవనెత్తిన ఈ విషయానికి తాము మద్దు తెలిపామనిఅవసరమైన చర్యలు తీసుకుని ఎమ్మెల్యేలకు కనీసం 5 టిక్కెట్లు జారీ చేయాలని స్పీకర్ను కోరామన్నారు. వాళ్లు ఎవరి మాట వినరు. అంత పెద్దవాళ్లైపోయారు. డబ్బులు వసూలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంటూ కశపనవర్ కేఎస్సీఏపై విమర్శలు గుప్పించారు.అంతకుముందు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీకి చెందిన ఆర్.అశోక, కేఎస్సీఏపై ధ్వజమెత్తారు. నెలకు కేవలం రూ. 1,600 నామమాత్రపు ధరకు వారికి 16.32 ఎకరాలిచ్చాము. వారి దగ్గర కోట్ల రూపాయలున్నాయి కానీ వారు మ్యాచ్ టిక్కెట్ల కోసం తమ నుండి వేల రూపాయలు వసూలు చేసి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం మరో స్టేడియం నిర్మించాలను కుంటోంది. వారికి గుణపాఠం నేర్పాలి అంటూ అసెంబ్లీలో మండిపడ్డారు.దీనిపై స్పందిస్తూ అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ సంస్థాగత జోక్యం చేసుకోవాలని సూచించారు. ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం తప్పక KSCAతో చర్చలు జరపాలన్నారు. కొన్నిసార్లు ఎమ్మెల్యేలకు కేవలం ఒక టికెట్ మాత్రమే ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు వారి కుటుంబ సభ్యులకు కనీసం నాలుగు టికెట్లైనా ఇవ్వాలని వారికి స్పష్టం చేయాలని ఖాదర్ అన్నారు. ఇదీ చదవండి: క్లాస్రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్ డీకే హామీఈ విషయాన్ని KSCA అధికారుల దృష్టికి తీసుకువెళతామని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సభకు హామీ ఇచ్చారు. అధ్యక్షుడితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తాను. అడిగే హక్కు ఎమ్మెల్యేలకు పూర్తిగా ఉంది, వారికి ఆ ప్రయోజనం దక్కాల్సిందనని డీకే అన్నారు. అంతేకాదు "ఇది 'సమ్రాట్' అశోక్ నుండి వచ్చిన అభ్యర్థన అని తాను వారికి కచ్చితంగా చెబుతానంటూ సరదాకా కామెంట చేయడంతో సభలోనవ్వులు పూసాయి. కాగా 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 28వ తేదీ శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ సీజన్ ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు -
గెలిచే తంబీ ఎవరో..?
కన్యాకుమారి.. భారతీయులకు సుపరిచిత ప్రాంతం..! తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా దక్షిణ భాగంలో ఉన్న విలవన్కోడ్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారుతోంది. ఇందుక్కారణం.. ఆ ప్రాంతం రబ్బరు పరిశ్రమలకు నెలవు. యాలకులు, లవంగాలు సుగంధ ద్రవ్యాల పంటలకు కేరాఫ్ అడ్రస్..! అంతేకాదు.. చారిత్రక చిత్తరల్ కొండ ఆలయం, తిక్కురిచి మహాదేవ ఆలయం, నట్టాలం శంకరనారాయణ దేవస్థానం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు టఫ్గా సాగుతున్నాయి. అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకుపోతున్నా.. గెలుపోటములను ఏమాత్రం అంచనా వేయని పరిస్థితులున్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?కన్యాకుమారి జిల్లాలో ప్రధాన వాణిజ్య పట్టణమైన మార్తాండంతోపాటు.. కుళితురై, కలియక్కవిలై, అరుమనై వంటి ప్రముఖ ప్రదేశాలు విలవన్కోడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. కొండప్రాంతమైన కొడియార్ కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతాల్లో రబ్బరు తోటలు సమృద్ధిగా ఉన్నాయి. రబ్బరు ప్రాసెసింగ్ పరిశ్రమలకు విలవన్కోడ్ అడ్డా అని చెప్పవచ్చు. జీడిమామిడి తోటలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. కేరళ, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో పండే జీడిమామిడి ప్రాసెసింగ్ మిల్లులు కూడా విలవన్కోడ్లో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో నాడర్ సామాజికవర్గం మెజారిటీగా ఉంది. వీరి తర్వాత నాయర్లు, ఈలవలు, వెల్లలార్లు, ఎస్సీలు, ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్తోపాటు.. సీపీఎం, బీజేపీలకు మంచి క్యాడర్ ఉందని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ 11 సార్లు, సీపీఎం ఐదు సార్లు విజయం సాధించగా.. బీజేపీ క్రమంగా తన ఓటుబ్యాంకును పెంచుకుంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ. పురుష ఓటర్ల సంఖ్య ఒక లక్షా 11 వేల 990 కాగా.. మహిళా ఓటర్లు ఒక లక్షా 13 వేల 226 మంది ఉన్నారు. ముగ్గురు థర్డ్ జెండర్లు కూడా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.ఈ నియోజకవర్గ ప్రజల చిరకాల డిమాండ్ అయిన.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు హామీపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతీ ఎన్నికల్లో ఈ హామీ పేరుతో ప్రధాన పార్టీలు తమను మోసగిస్తున్నాయనే భావన ఇక్కడి ఓటర్లలో ఉంది. దీంతోపాటు.. జీడిమామిడి మిల్లుల అప్గ్రేడేషన్, జీడిమామిడి కార్మికుల రోజుకూలీ పెంపు వంటి డిమాండ్లు పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడ అటవీ చట్టానికి సంబంధించిన సమస్యలతోపాటు.. నెయ్యర్ ఎడమగట్టు కాల్వలో నీటి విడుదల లేకపోవడం వంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు అంటేనే.. అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లు రాజకీయాలు కొనసాగుతాయి. ఈ నియోజకవర్గంలో మాత్రం.. ఆ రెండు పార్టీల ప్రాబల్యం కనిపించదు. అయితే.. రబ్బర్ ప్రాసెసింగ్ పార్క్ హామీని నెరవేరుస్తామంటూ బీజేపీ.. కాంగ్రెస్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. -
క్లాస్రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్
బెంగళూరు శివార్లలోని ఒక మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన దిగ్భ్రాంతి రేపుతోంది. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లవ్ ప్రపోజల్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నెలమంగళ సమీపంలోని టి. బేగూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అసలేం జరిగింది?క్లాస్ జరుగుతుండగా మొహమ్మద్ అనే ప్రొఫెసర్ ఉన్నట్టుండి మైక్ పట్టుకుని విద్యార్థులందరి ముందు ఒక విద్యార్థినికి తన ప్రేమ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆమె తనకు లవ్ ప్రపోజ్ చేసిందనీ, దీంతో తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని ఆయన క్లాసులో అందరి ముందు ప్రకటించారు. అందరికీ చాక్లెట్లు పంచాడు. దీన్ని సదరు విద్యార్థిని వ్యతిరేకించడంతో వాగ్వాదం జరిగింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, నువ్వు నాకు ప్రపోజ్ చేశావు కదా? ఐ లవ్ యూ అని చెప్పావు కదా అని ప్రొఫెసర్ అడిగాడు. ‘నేను ఎప్పుడు ప్రపోజ్ చేశాను? ఆధారాలు చూపించండి’ అంటూ ఆమె గట్టిగా వ్యతిరేకించింది. సీసీటీవీ ఫుటేజీ ఉంది, కావాలంటే చూసుకోండి అని ప్రొఫెసర్ కొంచెం గట్టిగా వాదించాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తంచేసిన ఆమె ‘ప్రిన్సిపాల్ దగ్గర తేల్చుకుందాం పద, క్లాస్ అంతా వస్తారు’ అనడంతో రేపు మాట్లాడుకుందాం అంటూ అక్కడినుంచి జారుకోవడానికి ప్రయత్నించాడు సదరు ప్రొఫెసర్ .అడ్డుకున్న విద్యార్థులు ప్రొఫెసర్ ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు ప్రొఫెసర్ను నిలదీశారు. ఇతర విద్యార్థులు కూడా ఆమెకు తోడుగా నిలిచారు. ఈ క్రమంలో గొడవ పెరిగి, ప్రొఫెసర్ను ఆమె చెప్పుతో కొట్టింది. దీంతో క్యాంపస్లో గందరగోళం నెలకొంది. Movie type proposal in #Bengaluru!A professor proposes to a student in the classroom of a medical college at T Begur in Nelamangala. The girl takes objection.A few moments later: The girl & fellow students thrash the professor. @timesofindia pic.twitter.com/ohsFTxUj5J— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 26, 2026ఇదీ చదవండి: హోర్మూజ్ తరువాత : ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ఇది పోలీసుల దాకా చేరింది. నెలమంగళ రూరల్ పోలీసులు కాలేజీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇరువర్గాల నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు.అటు ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంకా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ప్రకటించలేదు. మెడికల్ కాలేజీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రొఫెసర్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు -
మన బంగారాన్ని ప్రభుత్వం సీజ్ చేయొచ్చా?
భారతీయ కుటుంబాలకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. కానీ ఇప్పుడున్న ఉద్రిక్త యుద్ధ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మన ఇళ్లలో, బీరువాల్లో, లాకర్లలో భద్రంగా దాచుకున్న బంగారాన్ని బయటకు తీయాలని నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్న అంశం తెర మీదకొచ్చింది. అసలు ఎందుకు మన బంగారంపై ప్రభుత్వానికి లేదా ఆర్థిక నిపుణులకు అంత ఆసక్తి? సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం భారతీయుల ఇళ్లలో, దేవాలయాల్లో నిద్రాణంగా ఉందని అంచనా. ఈ భారీ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఎలా తీసుకురావాలి? అసలు వ్యక్తుల నుంచి బంగారం సేకరించడం సాధ్యమేనా? దీనికి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం.ఇటీవల మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరి వంటి ఆర్థిక నిపుణులు ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారతీయుల వద్ద ఉన్న బంగారాన్ని "డెడ్ అసెట్" (అంటే నిద్రాణమైన ఆస్తి) అన్నారు. అంటే అది బీరువాలో లేదా బ్యాంకులో ఉంటే కేవలం భద్రతను ఇస్తుంది తప్ప, దేశ అభివృద్ధికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఒకవేళ ఇదే బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి లేదా ఫైనాన్షియల్ అసెట్స్గా మార్చగలిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల బంగారం దిగుమతులు తగ్గి, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.ప్రతి ఏటా మీకు వడ్డీ చాలామందికి వచ్చే సందేహం.. "నా బంగారంపై నాకే కదా హక్కు ఉంటుంది, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది?" అని. నిజానికి, ప్రభుత్వం మీ దగ్గర ఉన్న బంగారాన్ని బలవంతంగా లాక్కోదు. దానికి బదులుగా "గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్స్" వంటి పథకాలను ప్రవేశపెడుతుంది. దీని ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని (బిస్కెట్లు లేదా పాత ఆభరణాలు) బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను బట్టి మీకు బాండ్లు లేదా డిపాజిట్ సర్టిఫికేట్లు ఇస్తారు. దీనిపై మీకు ప్రతి ఏటా మీకు వడ్డీ లభిస్తుంది. గడువు ముగిసిన తర్వాత, మీరు అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదును లేదా తిరిగి బంగారాన్ని పొందవచ్చు. అంటే, ఇక్కడ మీ బంగారం మీదే అయి ఉంటుంది, కానీ అది ఫిజికల్ రూపంలో కాకుండా డిజిటల్ లేదా పేపర్ రూపంలో మారుతుంది.భారతదేశంలో ఒక వ్యక్తి ఎంత బంగారం ఉంచుకోవచ్చనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, మీరు కొనుగోలు చేసిన బంగారానికి సరైన ఆధారాలు బిల్లులు రూపంలో ఉంటే, ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చు. కానీ అదే ఆదాయ ఆధారాలు చూపలేనప్పుడు కొన్ని పరిమితులు వర్తిస్తాయి అవి ఏంటంటే, ఒక వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు. అలాగే అవివాహిత మహిళ 250 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇదే విధంగా పురుషులు కేవలం 100 గ్రాముల వరకు మాత్రమే పరిమితి కలిగి ఉంటారు.ఐటీ దాడుల వేళ పరిస్థితి ఏంటి?ఐటీ దాడులు జరిగినప్పుడు ఈ పరిమితి లోపు ఉన్న బంగారాన్ని అధికారులు సీజ్ చేయరు. అంతకు మించి ఉండి, ఆదాయ వనరులు చూపకపోతే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ తన అవసరాల కోసం విదేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం (Forex) ఖర్చవుతోంది. ఒకవేళ మన ఇళ్లలో ఉన్న బంగారమే మార్కెట్లోకి వస్తే, దిగుమతులు తగ్గి దేశానికి ఎంతో లాభం చేకూరుతుంది.అందుకే నిపుణులు పదే పదే "పాలసీ షిఫ్ట్" కావాలని కోరుతున్నారు. బంగారాన్ని కేవలం బీరువాలో దాచుకోవడం కంటే, దానిని ఒక పెట్టుబడిగా మార్చుకోవడం వల్ల వ్యక్తిగతంగా మనకు వడ్డీ వస్తుంది, దేశానికి ఆర్థిక బలం చేకూరుతుంది. అయితే, మన దేశంలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా, పాత ఆభరణాలను కరిగించడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే, ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. -వెబ్డెస్క్ -
కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు
మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. అంతేకాదు పెట్రోలు, డీజిల్ సరఫరాలో అంతరాయాలు వస్తాయనే ఆందోళనతో, వినియోగదారుల ప్యానిక్ కొనుగోళ్లతో దేశంలో పెట్రోలుబంకుల వద్ద రద్దీ ఏర్పడింది. మరోవైపు దేశానికి సరిపడా ఇంధన నిల్వలున్నాయని, ఆందోళన అవసరం లేదని కేంద్రం పదే పదే స్పష్టతనిస్తోంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వినియోగదారులకు షాకిచ్చింది.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది, పెట్రోల్పై లీటరుకు రూ.5 పెంచింది. అలాగే డీజిల్పై లీటరుకు రూ.3 పెంచేసింది. భారతదేశంలోని 1,02,075 పెట్రోల్ పంపులలో 6,967 పంపులను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ, పెరిగిన ముడిసరుకు ఖర్చులలో కొంత భాగాన్ని వినియోగ దారులపై మోపాలని నిర్ణయించింది.ఈ పెంపు నయారా బంకుల్లో మాత్రమే. నేటి నుండి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.మరోవైపు పెట్రోల్, డీజిల్ అనేవి నియంత్రణ లేని వస్తువులని, వాటి ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్వతంత్రంగా నిర్ణయిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నయారా వంటి ప్రైవేట్ సంస్థలకు అటువంటి రాయితీలు ఉండవు గనుక పెరిగిన ఖర్చుల భారాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదని సంస్థ వర్గాలు తెలిపాయి.కాగా ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 50% పెరిగాయి. ఒక దశలో ముడిచమురు ధర బ్యారెల్కు 119 డాలర్లకు చేరుకుంది. దేశంలోని 90శాతం మార్కెట్ను నియంత్రించే ప్రభుత్వ రంగ సంస్థలు (IOC, BPCL, HPCL))ఇప్పటికీ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.అయితే, గత వారం ఇవి కూడా ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2, పారిశ్రామిక అవసరాల కోసం వాడే బల్క్ డీజిల్ ధరను లీటరుకు సుమారు రూ.22 పెంచాయి. -
‘ఇప్ప సారా’ తాగితే వందేళ్లు బతుకుతారా? అసలేంటీ దీని కథ
తెలంగాణా శాసనసభలో 'ఇప్ప సారా' తీవ్ర దుమారం రేపింది. బుధవారం నాటి సభలో ఇప్పపువ్వు సారా ఉత్పత్తి చేస్తే.. ఆ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని, మంచి పేరు పెట్టాలంటూ బీజేపీ సభ్యుడు రాకేశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో రాకేశ్రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానల్ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే.. ఇప్పసారాపై ఒక్కసారి ఆసక్తి పెరిగింది. గతంలో గిరిజన ప్రాంతాల్లో లభించే స్వచ్ఛమైన ఇప్ప సారాను తాగిన వారు 100 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించారనేది చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్ప సారా సంగతులేంటో ఒకసారి చూద్దాం.మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని ఆదివాసీ సమాజాలు తరతరాలుగా ఇప్పపువ్వుల సారాను వ్యక్తిగత , సామూహిక వినియోగం కోసం తయారు చేసుకుంటారు. ఇప్పపువ్వుతో తయారుచేసే సార (మహువా డ్రింక్) సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో దీనిని ఒక సంప్రదాయ పానీయంగా భావిస్తారు. గిరిజన సంస్కృతిలో ఇప్ప చెట్టు (Madhuca longifolia)కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎండబెట్టిన పువ్వులను నీటిలో నానబెట్టి, సహజంగా పులియబెడతారు. ఈ పువ్వులలోని సహజ చక్కెరలతో ఆల్కహాల్గా మారతాయి. ఇప్ప పువ్వుతో కేవలం మద్యం మాత్రమే కాకుండా లడ్డూలు, బిస్కెట్లు, కేకులు వంటి పోషక ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తారు.ఇప్ప పువ్వు లడ్డూగిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, పోషకమైన లడ్డూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఆదివాసీల సాంప్రదాయ, పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన లడ్డూ. చాలా రుచిగా ఉండటంతోపాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిల్వ కూడా ఉంటాయి. ఇది ఎండు ఇప్ప పూలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, నువ్వులు ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు., రక్తాన్ని శుద్ధి చేయడంలో, మోకాళ్ల నొప్పులు తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.ఇప్పపువ్వులో ఉండే పోషక విలువలు ఇప్పపువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలను కలిగి ఉంటాయిఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది.విటమిన్ సి, కాల్షియం ,ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.దీని లోని ఔషధ గుణాల నేపథ్యంలో ఆయుర్వేదంలో కూడా వాడతారు. ఇప్పపువ్వులను దగ్గు, బ్రోన్కైటిస్ మరియు కండరాల నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు.ఇక ఇప్పసారా లాభాలు : ఎలాంటి కల్తీలేకుండా, సహజంగా పద్దతుల్లో తయారుచేసిన ఇప్పసారాను నియంత్రిత పద్ధతిలో తీసుకుంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయని నమ్ముతారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం అలసటను తగ్గించడానికి . కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్నిస్తుంది.ఒంటి వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుందని కొందరు భావిస్తారు. అతిసర్వత్రా వర్జయేత్..నష్టాలు : లాభాలున్నాయి కదా అని అతిగా ఇప్పసారాని సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అన్ని మద్య పానీయాల మాదిరిగానే దీనికీ నియంత్రణ అవసరం. అంతేకాదు కల్తీ సారా తాగడం ప్రాణాలకే ప్రమాదం. బయట దొరికే ఇప్పసారాలో మత్తు కోసం యూరియా, అమ్మోనియం సల్ఫేట్ లేదా ఇతర రసాయనాలు కలుపుతారు. ఇది కాలేయం (Liver) , కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. చివరికి మరణానికి దారి తీస్తుంది.అతిగా సేవించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. ప్రవర్తనలో మార్పులతోపాటు జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.నోట్ : ఇప్పపువ్వులను ఆహారంగా (లడ్డూలు లేదా పొడి రూపంలో) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది, కానీ దానిని 'మద్యం' రూపంలో తీసుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఆరోగ్య సమస్యల కోసం దీనిని వాడాలనుకుంటే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. లైసెన్స్ లేకుండా ఇప్పసారా తయారు చేయడం లేదా విక్రయించడం నేరం. మనిషి వందేళ్లు బతకడం ఆర్థిక, భౌగోళిక పరిస్థితులతోపాటు జీవన శైలి, పోషకాహారంతో కూడిన ఆహార అలవాట్లు, జీన్స్ లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది గమనించాలంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు -
పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..
అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు విఘాతం కలుగుతుందనే ఆందోళనతో తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నిమిషాల్లోనే బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), డీలర్ అసోసియేషన్లు మాత్రం ‘కంగారు వద్దు.. సరిపడా నిల్వలు ఉన్నాయి’ అని భరోసా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం బైకులు, కార్లకే కాకుండా.. అసలు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ఏయే రంగాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారో తెలుసుకుందాం.డీజిల్: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంభారతదేశంలో చమురు వినియోగంలో సింహభాగం డీజిల్దే. ఇది కేవలం లారీలు, బస్సులకే పరిమితం కాదు. దేశీయంగా రవాణా రంగంలో (సుమారు 70 శాతం) దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులను చేరవేసే భారీ ట్రక్కులు, గూడ్స్ వాహనాలు పూర్తిగా డీజిల్పైనే ఆధారపడి ఉన్నాయి. రైల్వే ఇంజిన్లలో కూడా గణనీయమైన భాగం ఇంకా డీజిల్తోనే నడుస్తున్నాయి.వ్యవసాయ రంగం (సుమారు 13%): రైతులకు డీజిలే ఆధారం. పొలం దున్నే ట్రాక్టర్లు, నీటిని తోడే పంపు సెట్లు, హార్వెస్టర్లు (కోత యంత్రాలు) పెట్రోల్ కంటే డీజిల్నే ఎక్కువగా వాడుతాయి. ముఖ్యంగా సాగు సీజన్లో ఈ వినియోగం రెట్టింపు అవుతుంది.పరిశ్రమలు, విద్యుత్ (సుమారు 10%): భారీ ఫ్యాక్టరీల్లోని జనరేటర్లు, విద్యుత్ గ్రిడ్ ఫెయిల్ అయినప్పుడు వాడే బ్యాకప్ పవర్ ప్లాంట్లకు డీజిల్ కీలకం. ఐటీ కంపెనీలు, మల్టీప్లెక్స్లు, ఆసుపత్రుల్లోని పవర్ బ్యాకప్ వ్యవస్థలు దీనిపైనే నడుస్తాయి.పెట్రోల్: వ్యక్తిగత ప్రయాణాలకే పరిమితమా?ద్విచక్ర వాహనాలు (సుమారు 60%): భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో అత్యధిక వాటా టూ-వీలర్లదే. మధ్యతరగతి ప్రజల ప్రధాన రవాణా సాధనం కావడంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ప్రైవేట్ కార్లు (సుమారు 35%): వ్యక్తిగత వినియోగం కోసం వాడే కార్లు పెట్రోల్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్నాయి.ఇతర రంగాలు: చిన్నపాటి గార్డెనింగ్ పరికరాలు, కొన్ని రకాల పడవలు (ఫిషింగ్ బోట్లు), కొన్ని జనరేటర్లలో తక్కువ మొత్తంలో పెట్రోల్ వాడుతుంటారు.ప్రజలు ఏం చేయాలి?ప్రస్తుతానికి దేశంలో చమురు నిల్వలు పటిష్టంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తోంది. యుద్ధ భయంతో అవసరం లేకున్నా డబ్బాల్లో, బాటిళ్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంధనం పొదుపు చేయడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే. అనవసర భయాందోళనలకు లోనై బంకుల వద్ద రద్దీ పెంచకుండా సంయమనం పాటించడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరం.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు!
పుదుపల్లి: కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఆ అభ్యర్థి ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్భాటాలు లేవు, భారీ కటౌట్లు అసలే లేవు. కేవలం ఒక సైకిల్, ఒంటిపై తండ్రి బొమ్మ ఉన్న టీషర్ట్.. ప్రజల ఆశీస్సులు కోరుతూ పుదుపల్లి నియోజకవర్గంలో చాందీ ఊమెన్ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తనయుడు, ప్రస్తుత యూడీఎఫ్ అభ్యర్థి చాందీ ఊమెన్ తనదైన శైలిలో ‘గ్రీన్ క్యాంపెయిన్’కు శ్రీకారం చుట్టారు.హోరెత్తే ప్రచారానికి స్వస్తిసాధారణంగా ఎన్నికలంటే వీధివీధినా వెలిసే భారీ ఫ్లెక్సీలు, మైకులతో హోరెత్తే ప్రచార రథాలు గుర్తొస్తాయి. కానీ, పుదుపల్లిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల పోస్టర్లు గోడల నిండా కనిపిస్తున్నా, చాందీ ఊమెన్ మాత్రం ఎక్కడా ఒక్క బ్యానర్ కూడా కట్టకుండా ప్రచారం సాగిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమాసియాలో యుద్ధం, మానవీయ సంక్షోభం నెలకొన్న వేళ.. ప్రచారం కోసం అనవసరంగా లక్షల రూపాయలు ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. అది సరైన సమయం కాదు’ అని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రచారం కోసం ఖర్చు చేసే నిధులను నియోజకవర్గంలోని పేదల కోసం 100 ఇళ్లు నిర్మించడానికి ఉపయోగిస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే 50 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ప్రచార ఆర్భాటాల కంటే పేదలకు గూడు కల్పించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.రోజూ సైకిల్పై..ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకే తన హైబ్రిడ్ సైకిల్పై చాందీ ఊమెన్ ప్రయాణం మొదలవుతుంది. తన తండ్రి ఫోటో ఉన్న వైట్ టీషర్ట్ ధరించి, గ్రామీణ ప్రాంతాల్లోని ఇరుకు దారుల్లో సైకిల్ తొక్కుతూ ప్రతి ఇంటిలోని వారినీ ఆయన పలకరిస్తున్నారు. ‘గతంలో పాదయాత్ర చేశాను, కానీ సైకిల్ అయితే గంటకు 31 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలుసుకునే అవకాశం నాకు దక్కుతోంది’ అని ఆయన వివరించారు. దారి పొడవునా స్కూలు పిల్లలతో ముచ్చటిస్తూ, వృద్ధుల యోగక్షేమాలు అడుగుతూ, సెల్ఫీలు ఇస్తూ సాగుతున్న ఆయన యాత్రకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు.తండ్రి వారసత్వంపుదుపల్లి అంటే ఊమెన్ చాందీకి పెట్టని కోట. 2023 ఉప ఎన్నికల్లో తన తండ్రి సాధించిన మెజారిటీ (9,000) కంటే ఎక్కువగా, దాదాపు 37,000 ఓట్ల మెజారిటీతో చాందీ ఊమెన్ విజయం సాధించారు. తన తండ్రి తనకు ఇచ్చిన అతిపెద్ద సలహా ‘ఎప్పుడూ ప్రజలతోనే ఉండు, ఎవరినీ నొప్పించకు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. కేరళ ప్రభుత్వం తన నియోజకవర్గంపై వివక్ష చూపుతోందని, తన తండ్రిపై ఉన్న రాజకీయ కక్షతోనే నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు.తండ్రి అడుగుజాడల్లోనే..చాందీ ఊమెన్ ప్రచార శైలిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన ఏమాత్రం అలసట లేకుండా గంటల తరబడి సైకిల్ తొక్కుతూ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆయన తండ్రి లాగే నిరాడంబరంగా ఉండటం మాకు సంతోషంగా ఉంది’ అని ఓటర్లు అంటున్నారు. ఆయన వెనుక అనుచరులు, భద్రతా సిబ్బంది వాహనాలు ఉన్నప్పటికీ, చాందీ ఊమెన్ మాత్రం సామాన్యునిలా సైకిల్పైనే ప్రజల్లో మమేకమవుతున్నారు. ఎండ తీవ్రత పెరగకముందే ఉదయం 8:30 గంటల వరకు ప్రచారం ముగించి, కొద్దిసేపు టిఫిన్ విరామం తీసుకుని తిరిగి తన తదుపరి షెడ్యూల్లో బిజీ అయిపోతున్నారీ యువ నేత.ఇది కూడా చదవండి: West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్ -
రూ. 5 కోట్ల దోపిడీ : దొంగబాబా 21 ఫారిన్ ట్రిప్స్, బెంజ్కారు!
దొంగ బాబా, జ్యోతిష్యం పేరుతో బడా బాబులను కూడా మోసంచేసిన స్వయం ప్రకటిత బాబా అశోక్ ఖారత్కు సంబంధించిన మరో భయంకరమైన బండారం బయటపడింది. అనేకమంది మహిళలపై అత్యాచారం ఆరోపణలతో ఇప్పటికే అరెస్టయిన 67 ఏళ్ల అశోక్పై ఇప్పుడు దోపిడీ, నరబలి బెదిరింపులు, మూఢనమ్మకాల నిరోధక చట్టం ఉల్లంఘన వంటి తీవ్రమైన ఆరోపణలతో మరో కేసు నమోదైంది. జ్యోతిష్కుడిపై జరుగుతున్న దర్యాప్తులో, టర్కీలోని ఒక గుహ నుండి సేకరించిన ‘అరుదైన తేనె’ కీలకమైన ఆధారంగా వెలుగులోకి ఇది వచ్చింది.నాసిక్ కేంద్రంగా పనిచేసే జ్యోతిష్కుడు అశోక్ కోట్లలో దోచేశాడంటూ తాజాగా సంచలన ఆరోపణలు, ఫిర్యాదులు నమోదైనాయి. పూణేకు చెందిన ఒక బిల్డర్ నుండి అశోక్ సుమారు రూ. 5 కోట్లు వసూలు చేశాడు. ఇందుకోసం బాధితుడిని ఒక రేంజ్లో వేధించాడు. 21 దేశాల పర్యటన, లగ్జరీ కారుబాధితుడి ఫిర్యాదు మేరకు తన లాజిస్టిక్స్ వ్యాపారం సజావుగా సాగాలంటే "అవతార్ పూజ" చేయాలని బెదిరించాడు. ముఖ్యంగా 'నాగ దేవత' ఆగ్రహానికి గురవుతారని, చెప్పింది చేయకపోతే పాము కాటుకు బలి కాక తప్పదంటూ భయపెట్టాడు. ఇందుకోసం ఒక నకిలీ పాము, పిచ్చిరాళ్లు (మ్యాజిక్ స్టోన్) అంటూ నమ్మబలికాడు. అతీత శక్తుల కోసం 21 దేశాలు తిరగాలని నమ్మించి, బాధితుడి ఖర్చుతో విదేశీ పర్యటనలు చేశాడు. అంతేకాదు అతడికా చావు భయాన్ని పుట్టించి, ఒక మెర్సిడెస్ బెంజ్ కారును కొనిపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.మిర్గావ్లోని తన ఫామ్హౌస్ నిర్మాణ ఖర్చును, ఫర్నిచర్ ఖర్చును కూడా బాధితుడి నుంచే బలవంతంగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో వెల్లడించారు. . ఆ 'స్వామి'పై జరుగుతున్న దర్యాప్తును మార్చి 19న అధికారికంగా SITకి అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం మార్చి 17న ఒక మహిళ ఇచ్చిన అత్యాచారం ఫిర్యాదు మేరకు అశోక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఆఫీసుకి పిలిపించి, భర్తను చంపేస్తానని బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసుల విచారణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. నిందితుడిపై నమోదైన కేసులలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఏమైనా ఉందేమోనన్న అంశాన్ని కూడా SIT పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.ఇదీ చదివండి: ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీఅశోక్ ఖారత్కు చెందిన చెందిన "శివనిక సంస్థాన్" బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. భారీ ఎత్తున జరిగిన మనీ లాండరింగ్ మరియు నల్లధనం లావాదేవీలపై దర్యాప్తు జరుగుతోంది. అలాగే నిందితుడితోపాటు, అతని కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. సోదాల్లో భాగంగా పోలీసులు రెండు ల్యాప్టాప్లు, ఒక రివాల్వర్, 21 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలుఅశోక్ ఖారత్, అద్భుత తేనెఅశోక్ ఖారత్ గతంలో మర్చంట్ నేవీలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. తనను తాను 'కెప్టెన్' అని పిలుచుకునే ఆయనకు రాజకీయ నాయకులు, వివిఐపిలు (VVIPs) క్లయింట్లుగా ఉండేవారు. లైంగిక పటుత్వం, శారీరక బలహీనత లాంటి సమస్యలకు ఎక్కువగా అతణ్ని సంప్రదించేవారు. కిలో 'మాయా' టర్కీ తేనెను రూ. 15 లక్షలకు విక్రయించేవాడు. యవ్వనాన్ని ప్రసాదించే "అద్భుత ప్రయోజనాలు" ఉన్న "రహస్య తేనె"గా ప్రచారం చేస్తూ, ఖాతాదారులకు అమ్మేవాడు. ప్రస్తుతం నిందుతుడిపై నరబలికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు కూడా రావడంతో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. -
సంస్కృతం పేపర్లో 500 నోట్లు.. పాస్ చేయాలంటూ..
పలాము: పరీక్షల్లో పాస్ కావడానికి కొందరు విద్యార్థులు రకరకాల అడ్డదారులు తొక్కుతుంటారు. కొందరు కాపీ కొడితే, మరికొందరు ఇన్విజిలేటర్లను బతిమాలుకుంటారు. అయితే జార్ఖండ్లో ఒక విద్యార్థి ఏకంగా తన ఆన్సర్ షీట్లో నగదు పెట్టి టీచర్కు ‘ఆఫర్’ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.అసలేం జరిగిందంటే?జార్ఖండ్ బోర్డు పరీక్షలు ముగియడంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. పలాము జిల్లాలోని ఒక సెంటర్లో ఉపాధ్యాయులు సంస్కృతం పేపర్లను దిద్దుతుండగా ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. ఒక విద్యార్థి పేపర్ లోపల రెండు 500 రూపాయల నోట్లను (మొత్తం రూ. 1000) ఉంచాడు. తనను ఎలాగైనా పాస్ చేయాలని ఆ విద్యార్థి అందులో కోరినట్లు సమాచారం.టీచర్ రియాక్షన్ అదిరిపోయిందిడబ్బులు చూసి ఆ ఉపాధ్యాయుడు ఏమాత్రం ప్రలోభానికి లోనుకాకుండా, నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించారు. ఆన్సర్ షీట్లో సమాధానాలు లేకపోవడంతో ఆ ప్రశ్నకు సున్నా మార్కులు వేశారు. కేవలం రాసిన సమాధానాలకు మాత్రమే మార్కులు వేస్తామని, ఇలాంటి ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ నగదుతో కూడిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.విద్యానిపుణుల హెచ్చరికఇలాంటి అడ్డదారులు తొక్కడం వల్ల విద్యార్థుల విద్యా రికార్డులు పాడవడమే కాకుండా, వారి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పరీక్షల కోసం కష్టపడి చదవాలే తప్ప, ఇలాంటి పనుల వల్ల క్రెడిబిలిటీ దెబ్బతింటుందని వారు అభిప్రాయపడుతున్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షార్ట్కట్ పద్ధతులు కాకుండా, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ మాత్రమే విద్యార్థులకు మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.ఇది కూడా చదవండి: West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్ -
పెళ్లి మండపంలో బాంబు బెదిరింపు.. పారిపోయిన వధూవరులు!
అన్నానగర్: దిండుక్కల్–తిరుచ్చి బైపాస్ రోడ్డులో ఒక ప్రసిద్ధ వివాహ మండపం ఉంది. బుధవారం ఈ మండపంలో ఒక వివాహం జరగాల్సి ఉంది. బుధవారం ఉదయం, వరుడిని ఆహ్వానించడంతో పాటూ ఇతర కార్యక్రమాలు జరిగాయి, అనంతరం వధూవరులకు పూలమాలలు వేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో, పెళ్లి మండపంలో బాంబు పెట్టారనే వార్త అకస్మాత్తుగా వ్యాపించింది. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం దాడికొంబు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు బాంబు నిపుణులతో సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులందరూ ప్రాణాలతో బయటపడాలనే ఆశతో హాలులోంచి బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా, వధూవరులను వారి బంధువులు తాళీ కట్టకుండానే బయటకు తీసుకువచ్చారు. అనంతరం తనిఖీలు చేశారు. బాంబు బూచీ ఒత్తిటే అని తేల్చారు. -
West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శ్రీరామ నవమి వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధిస్తూ మమతా బెనర్జీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఊరేగింపుల్లో ఆయుధాలు చేతపట్టడంపై నిషేధం విధిస్తూ, భద్రతా వలయాన్ని కట్టుదిట్టం చేసింది.శోభాయాత్రకు పరిమితిగురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న రామ నవమి శోభాయాత్రల కోసం ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో మోహరించినట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రతి ఊరేగింపులో పాల్గొనే భక్తుల సంఖ్య 500 కు మించకూడదనే నిబంధన విధించారు. ఒకవేళ ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినా లేదా నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ మంది గుమిగూడినా, ఆ యాత్రను తక్షణమే నిలిపివేసి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘాహౌరా, చందన్నగర్, ఇస్లాంపూర్ వంటి సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేయడమే కాకుండా, అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర బలగాలను (సీఆర్పీఎఫ్)కూడా సిద్ధంగా ఉంచారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా తక్షణమే స్పందించేలా వ్యూహాలు రచించారు.నబన్నాలో ఉన్నత స్థాయి సమీక్షభద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డీజీపీ, ఏడీజీ (శాంతిభద్రతలు) తో పాటు అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, ఎస్పీలు ఈ భేటీలో పాల్గొన్నారు. మార్చి 26 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రామ నవమి ర్యాలీలు జరిగే అవకాశం ఉందని, గురువారం నాడు అత్యధిక సంఖ్యలో ర్యాలీలు వచ్చే సూచనలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. బెంగాల్ అంతటా శ్రీరామ నవమి వేళ పోలీసుల పహారా కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: అమెరికా-ఇరాన్ యుద్ధం.. థరూర్ సంచలన వ్యాఖ్యలు -
ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మెట్టూరు కూడా ఒకటి. ఇక్కడి నుండి నామ్ తమిళర్ కట్చి తరపున అడవి బిడ్డ, స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యా రాణి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ, ఆమె తన ఎన్నికల ఖర్చుల కోసం ప్రజల సహాయాన్ని అర్థించారు. వీడియో ద్వారా విజ్ఞప్తి విద్యారాణి సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేస్తూ, అందులో తన భావాలను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన వాహన డీజిల్, ఆహారం, ఇతర రోజువారీ ఖర్చుల కోసం తనకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సోదర సోదరీమణులు, పెద్దలు, తమిళ బంధువులందరూ ఏకమై తోచిన సహాయం చేస్తే, అది తన విజయాన్ని సులభతరం చేస్తుందని ఆమె ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. విద్యా రాణి కేవలం విజ్ఞప్తి చేయడమే కాకుండా, తన వీడియోలో ఆర్థిక సహాయం పంపడానికి వీలుగా జీ పే, పోన్ పే నెంబర్లతో పాటుగా బ్యాంక్ ఖాతా వివరాలను జత చేశారు. సామాన్యుల పక్షాన నిలబడి పోరాడటానికి తనకు ఈ సహాయం ఎంతో అవసరమని ఆమె విజ్ఞప్తి చేశారు.విద్యారాణి రాజకీయ నేపథ్యం గతంలో బీజేపీ , పీఎంకే పారీ్టల్లో పనిచేసిన విద్యా రాణి, ఇటీవల సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చిలో చేరారు. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది , సామాజిక కార్యకర్త. తన తండ్రి వీరప్పన్పై ఇప్పటికీ సానుభూతి ఉన్న ప్రాంతాల్లో ఆమెకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఓ వైపు ప్రధాన పారీ్టలు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంటే, విద్యా రాణి వీడియో సందేశంలో ఉద్వేగ పూరిత వ్యాఖ్యలతో ప్రజల నుండి చందాలు సేకరించే పనిలో పడ్డారు. చందనపు దుంగల, ఎనుగుల దంతాల స్మగ్లర్గా పశి్చమ పర్వత శ్రేణుల్లోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం కేంద్రంగా ఒకప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ముచ్చెమటలు పట్టించిన వీరప్పన్ తనయ తాజాగా నిధుల కోసం ఎదురు చూడటం గమనార్హం. -
అమెరికా-ఇరాన్ యుద్ధం.. థరూర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల వేళ భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం పాకిస్తాన్ నాయకత్వం వహించడం భారత్కు ‘అవమానకరం’ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.భారత్కు దక్కిందేమిటి?ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆపై సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో మధ్య ప్రాచ్యం అగ్నిగుండంగా మారింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన సంక్షోభం ముంచుకొస్తోంది. ఇలాంటి కీలక సమయంలో పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు దేశాలు శాంతి చర్చలకు చొరవ చూపుతుంటే, భారత్ వెనుకబడిపోవడంపై థరూర్ అసహనం వ్యక్తం చేశారు.‘ప్రధాని మోదీ ఎప్పుడూ చెప్పేవిధంగా.. భారత్ శాంతి దూతగా నిలుస్తుందని ఆశించి, ప్రభుత్వం వహిస్తున్న మౌనాన్ని సమర్థించాను. కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా పాకిస్తాన్కు వెళ్తుంటే చూడటం బాధాకరం. ఇది మనందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ తనకున్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు.‘దళారీ దేశం కాదు’: జైశంకర్ కౌంటర్విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విపక్షాల విమర్శలకు అత్యంత ఘాటుగా స్పందించారు. ‘భారత్ ఏమీ దళారీ దేశం కాదు" అంటూ విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. 1981 నుండి అమెరికా పాకిస్తాన్ను ఒక సాధనంగా వాడుకుంటూనే ఉందని, ఇందులో కొత్తేమీ లేదని ఎద్దేవా చేశారు. యుద్ధం వల్ల అన్ని పక్షాలు నష్టపోతున్నాయని, దీనిని త్వరగా ముగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్పష్టం చేశారని కేంద్రం వెల్లడించింది. ఇది కూడా చదవండి: పెట్రోల్కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం! -
పెట్రోల్కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో పలువురు వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. అయితే గంటల తరబడి వేచి చూసినా చుక్క పెట్రోల్ దొరకని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు.పెట్రోల్ కష్టాలు.. ఈవీ వైపు అడుగులుయుద్ధం ఎఫెక్ట్తో చమురు కొరత ఏర్పడవచ్చన్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల వద్ద తీవ్ర రద్దీ కనిపిస్తోంది. అయితే ఈ ఇబ్బందులను భరించలేక చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మళ్లుతున్నారు. తాజాగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ వద్ద వినియోగదారులు తమ గోడును వెళ్లగక్కారు.వినియోగదారుల ఆవేదనఒక కస్టమర్ మాట్లాడుతూ ‘పెట్రోల్ కోసం మూడు నాలుగు గంటల పాటు లైన్లో నిలబడినా ఫలితం ఉండటం లేదు. జేబులో డబ్బులు ఉన్నా.. ఇంధనం దొరకడం లేదు. ఈ టెన్షన్ కంటే ఒక ఎలక్ట్రిక్ బండి కొనుక్కోవడం ఎంతో ఉత్తమం అనిపించింది. అందుకే ఆలోచించకుండా ఈరోజే కొత్త ఈవీ స్కూటర్ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నాను’ అని పేర్కొన్నారు.పెట్రోల్ ధరల పెరుగుదల, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని నిర్ణయించుకున్నానని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు..పెట్రోల్ కోసం దాదాపు 30 నుండి 40 నిమిషాలు లైన్లో నిలబడాల్సి వచ్చిందని, భవిష్యత్తులో పెట్రోల్ కొరత ఏర్పడితే రోజువారీ అవసరాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా ఈవీని ఎంచుకున్నట్లు తెలిపారు. ఇంకొక వినియోగదారుడు మాట్లాడుతూ తన కుమార్తె కోసం గత 6 నెలల నుండి ప్లాన్ చేస్తున్నామని, ఆమెకు సరైన వయసు రావడంతో ఇప్పుడు ఈవీ కొనిచ్చామని చెప్పారు.. నాన్న స్కూటర్ కొనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, తాను, తన తమ్ముడు కలిసి ఈ కలర్ను ఎంచుకున్నామని కుమార్తె తెలిపింది.‘నిన్న రాత్రి పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీని చూసి, భవిష్యత్తులో పెట్రోల్ దొరకదేమో అనే భయంతో ఈ రోజే ఈవీ బండిని డెలివరీ తీసుకున్నట్లు ఒక వినియోగదారుడు చెప్పారు. బండి ముందు భాగంలో సరుకులు పెట్టుకోవడానికి చాలా ఖాళీ స్థలం ఉందని, వ్యాపార అవసరాలకు ఇది చాలా సౌకర్యంగా ఉందని అన్నారు. దీనికి జీరో మెయింటెనెన్స్ అని తెలిపారు. తన దగ్గర పాత యాక్టివా ఉన్నప్పటికీ, పెట్రోల్ కష్టాల వల్ల దీనికి మారానని పేర్కొన్నారు. ఈవీ షోరూమ్ల వద్ద సందడిగత రెండు రోజులుగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు అమాంతం పెరిగాయని షోరూమ్ యజమానులు చెబుతున్నారు. కేవలం పెట్రోల్ భయం మాత్రమే కాకుండా, ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేకపోవడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం (100-120 కి.మీ) ప్రయాణించే వీలుండటంతో సామాన్యులు వీటిని కొనేందుకు క్యూ కడుతున్నారు. పెట్రోల్ కష్టాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రోడ్లపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ .. భారత్లో వీటి ధరలు పెరగనున్నాయా?
ఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత ఔషధ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ (ఇండియా) వెల్ఫేర్ అసోసియేషన్ (DCOIWA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఔషధ ఉత్పత్తి, ఎగుమతి దేశాలలో ఒకటిగా ఉన్నందున అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో ముడిపడి ఉందని, గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా మెడిసిన్ అ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతం కీలక రవాణా కేంద్రంగా ఉండటంతో, నౌకాయాన మార్గాల అంతరాయం, మధ్యవర్తి రసాయనాల సరఫరాను దెబ్బతీస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, సరుకు రాకలో ఆలస్యం తయారీదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్ పాలిమర్స్, గ్లాస్ వైల్స్, రబ్బర్ స్టాపర్స్ వంటి ప్యాకేజింగ్ పదార్థాల కొరత, ధరల పెరుగుదల తయారీ ఖర్చులను పెంచుతున్నాయి.గల్ఫ్ దేశాలకు ఔషధ ఎగుమతులు రవాణా సమస్యలు, పోర్ట్ ట్రాఫిక్, బీమా సమస్యల కారణంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక ఔషధాల దిగుమతులు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఎగుమతిదారులు డిమాండ్ మార్పులు, చెల్లింపుల సమస్యలు, రవాణా ఆలస్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగుమతిదారులు అధిక ఖర్చులు, అస్థిర సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశీయ వ్యాపారులు స్టాక్ కొరత, ధరల మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది వినియోగదారులకు ఔషధాల లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యాంటీబయోటిక్స్, గుండె సంబంధిత ఔషధాలు, మధుమేహ ఔషధాలలో మెడిసిన్ పని చేసేందుకు వినియోగించే రసాయనాలు (APIs) కొరత ఏర్పడే అవకాశం ఉందని, ప్యాకేజింగ్ పదార్థాల కొరత వల్ల ఉత్పత్తి తగ్గుదల, ప్రాణ రక్షక ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఐ, కీలక ముడి పదార్థాల స్వదేశీ తయారీని ప్రోత్సహించాలి. అవసరమైన ఔషధాలు, ముడి పదార్థాల భద్రతా నిల్వలను ప్రభుత్వ స్థాయిలో నిర్వహించాలి. గల్ఫ్ ప్రాంతానికి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయాలి. పోర్ట్ క్లియరెన్స్ వేగవంతం చేయడం, రవాణా, బీమా ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఔషధ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు నియంత్రణ సంస్థలు పర్యవేక్షణ చేయాలి. నియంత్రణ సంస్థలు, తయారీదారులు, పంపిణీదారుల మధ్య సమన్వయం పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితి మారుతూ ఉన్నప్పటికీ, ప్రభుత్వం, ఔషధ రంగానికి చెందిన అన్ని భాగస్వాములు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు అవసరమైన ఔషధాల సరఫరాను నిరంతరంగా కొనసాగించగలమని జి. కోటేశ్వరరావు స్పష్టం చేశారు. -
‘నిద్రలేని రాత్రులు’.. భావోద్వేగంలో రాహుల్
కోళికోడ్: ‘లోకమంతా నిద్రపోతున్నా.. వారు మాత్రం రోగుల ప్రాణాలు కాపాడేందుకు మేల్కొనే ఉంటారు’ అంటూ కేరళ నర్సుల అంకితభావాన్ని కొనియాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తన తల్లి సోనియా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఒక కేరళ నర్సు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ రాహుల్ భావోద్వేగానికి లోనయ్యారు. కోజికోడ్ బీచ్లో బుధవారం జరిగిన బహిరంగ సభకు రాహుల్ గాంధీ నేరుగా హాజరు కావాల్సి ఉంది. అయితే, సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు.ఈ క్రమంలోనే రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేరళ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకున్నారు. ‘నిన్న మా అమ్మ ఆసుపత్రిలో చేరారు. ఒక కొడుకుగా నాకు చాలా ఆందోళనగా అనిపించింది. అందుకే ఆమె దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని కేరళ ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నిన్న రాత్రంతా ఆసుపత్రి గదిలో ఒక చిన్న సోఫాపై పడుకుని అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ గడిపాను. కానీ ఆ కష్ట సమయంలో నాకు ఒక కేరళ నర్సు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అని రాహుల్ తెలిపారు.ప్రతి గంటకూ వచ్చి.. చిరునవ్వుతో..ఆ నర్సు నిబద్ధతను రాహుల్ వివరిస్తూ.. ‘ఆమె ప్రతి గంటకూ గదిలోనికి వచ్చి అమ్మను పరీక్షించారు. చిరునవ్వుతో అమ్మ చేయి పట్టుకుని ఓదార్చారు. తెల్లవారుజామున నేను ఆమెను అడిగాను.. ‘మీరు అస్సలు నిద్రపోరా?’ అని.. దానికి ఆమె.. ‘లేదు, లోకమంతా నిద్రపోతున్నా మేము మేల్కొనే ఉంటాం, రోగులకు సేవ చేస్తాం’ అని సమాధానమిచ్చారు. కేవలం కేరళలోనే కాదు.. ఢిల్లీలో, దేశవ్యాప్తంగా, ప్రపంచం నలుమూలలా కేరళ మహిళలు ఇలాగే ప్రాణాలు కాపాడుతున్నారు’ అని రాహుల్ ప్రశంసల జల్లు కురిపించారు.రాజకీయ జవాబుదారీతనంపై వ్యాఖ్యలు2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలను కాపాడే ఆరోగ్య కార్యకర్తలు ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు, రాజకీయ నాయకత్వం కూడా ప్రజలకు అంతే జవాబుదారీగా ఉండాలని రాహుల్ గుర్తు చేశారు. ఫ్రంట్లైన్ యోధుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ‘నెట్ఫ్లిక్స్’లో ‘బీటీఎన్’ పచ్చి నిజాలు? -
మూడు నెలల్లో 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెబ్సైట్పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2025) ఏకంగా 6.1 కోట్లకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది. అయితే, అత్యాధునిక రక్షణ వ్యవస్థల కారణంగా ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఎటువంటి డేటా ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.మూడొంతులు పెరిగిన దాడుల తీవ్రతగత ఏడాది కాలంగా ఆర్బీఐ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే సైబర్ ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో అర్థమవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జూన్ మధ్య 1.9 కోట్లు, జులై - సెప్టెంబర్ మధ్య 3.1 కోట్లు, అక్టోబర్ - డిసెంబర్ మధ్య 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు జరిగాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దాడుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. దేశ కేంద్ర బ్యాంక్ కావడంతో దీని ప్రాముఖ్యత దృష్ట్యా హ్యాకర్లు నిరంతరం సాఫ్ట్వేర్లలో చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఫైర్వాల్లు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఈ ముప్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.రక్షణ వ్యవస్థలో ఏఐ విప్లవంపెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ తన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లో కృత్రిమ మేధస్సు సాంకేతికతను అనుసంధానించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం.. వెబ్సైట్లోకి వచ్చే ప్రతి విజిటర్ డేటాను ఏఐ విశ్లేషిస్తుంది. సాధారణ వినియోగదారులకు, హ్యాకర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే బ్లాక్ చేస్తుంది. దాడి తీవ్రరూపం దాల్చకముందే దాని మూలాలను గుర్తించి అడ్డుకుంటుంది.భవిష్యత్తు ప్రణాళికలురాబోయే రోజుల్లో వ్యవస్థలో ఏఐ పాత్రను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. కేవలం భద్రతకే పరిమితం కాకుండా.. మోసపూరిత లావాదేవీలను క్షణాల్లో గుర్తించడం. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్ల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఏఐ చాట్బాట్లను మరింత అభివృద్ధి చేయడం వంటి విధానలు తీసుకురానున్నారు.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
Bengal: బీజేపీ సంచలనం.. ‘ఆర్జీ కర్’ బాధితురాలి తల్లికి న్యాయం?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యావత్ దేశాన్ని కుదిపేసిన కోల్కతా ఆర్జీ కర్ (RG Kar) ఆస్పత్రి హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ట్రైనీ డాక్టర్ తల్లి రత్న దేబ్నాథ్ను ఎన్నికల బరిలోకి దింపింది. బుధవారం విడుదల చేసిన 19 మంది అభ్యర్థుల మూడో జాబితాలో ఆమె పేరును ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పాణిహతి నియోజకవర్గం నుండి ఖరారు చేసింది.న్యాయం కోసమే ఈ పోరాటం: రత్న దేబ్నాథ్తన అభ్యర్థిత్వంపై రత్న దేబ్నాథ్ ఉద్వేగంతో వ్యాఖ్యానిస్తూ.. ‘నా కూతురి విషయంలో న్యాయం కోసం ఎన్నో చోట్ల తిరిగాను. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, నా బిడ్డకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాను. నేను గెలిస్తే అది నా ఒక్కదాని విజయం కాదు, పాణిహతి ప్రజల విజయం’ అని ఆమె పేర్కొన్నారు. 2024 ఆగస్టులో జరిగిన ఈ దారుణ ఘటనపై సీబీఐ విచారణ జరగగా, ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.మూడవ జాబితాలోని ఇతర విశేషాలుబీజేపీ విడుదల చేసిన ఈ మూడో జాబితాలో పలువురు ప్రముఖులకు చోటు దక్కింది.దీపాంజన్ చక్రవర్తి: నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ)మాజీ కమాండో అయిన ఈయనను హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారా స్థానం నుండి బరిలోకి దింపారు.మొత్తం అభ్యర్థులు: బెంగాల్లోని మొత్తం 294 స్థానాలకు గాను, తాజా జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 274 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.రాజకీయ విమర్శలు - ఎన్నికల షెడ్యూల్రత్న దేబ్నాథ్ బీజేపీ తరపున పోటీ చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తప్పుబట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావిస్తూ టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. తుది ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.ఇది కూడా చదవండి: Bengal Election: ‘సునామీ’కి సెంటర్ పాయింట్! -
భారత్కు అండగా మరో దేశం.. పెద్ద కష్టం తీరినట్టే?
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అనేక దేశాలు ఇంధన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధి మూత పడటంతో పెను సంక్షోభం ఏర్పడింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధన రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. దీంతో, చమురు సరఫరా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం భారత్పై కూడా తీవ్రంగా పడింది.కాగా, భారత్ తన అవసరాల కోసం దాదాపు 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా భారత్కు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి మూత పడటంతో సమస్య తలెత్తింది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ మిత్రదేశమైన అర్జెంటీనా భారత్కు భారీ ఆఫర్ ఇచ్చింది. 2024 కంటే ముందు అర్జెంటీనా నుంచి భారత్కు గ్యాస్ సరఫరా అస్సలు ఉండేది కాదు. కానీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2025లో 22,000 టన్నుల దిగుమతులు జరగగా, 2026 తొలి మూడు నెలల్లోనే అది ఏకంగా 50,000 టన్నులకు చేరడం గమనార్హం. మార్చి 5న అదనంగా 11,000 టన్నులు గ్యాస్తో భారత్ చేరుకుంది.అయితే, అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండం చివరిలో ఉంది. భారత్, అర్జెంటీనా మధ్య దూరం సుమారు 20,000 కిలోమీటర్లు. అక్కడి నుంచి భారత్కు రవాణా చేయడం పెను సవాలుతో కూడుకుంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత పొడవైన నౌకా మార్గం ఇది. రవాణా ఖర్చులు భారమైనప్పటికీ, దేశంలో గ్యాస్ కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ దేశంలో అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్కు దీర్ఘకాలం పాటు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్తో పాటు సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా మనం అక్కడి నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. -
Bengal Election: ‘సునామీ’కి సెంటర్ పాయింట్!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ‘దక్షిణ బెంగాల్’ ప్రాంతం ఎప్పుడూ ఒక పవర్ హౌస్ లాంటిది. హుగ్లీ నదీ తీరం మొదలుకొని నబన్న (రాష్ట్ర సచివాలయం) వరకు సాగే ఈ రాజకీయ చదరంగం ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, ఆపై లెఫ్ట్ ఆధిపత్యం చూసిన ఈ ప్రాంతం, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి తిరుగులేని కంచుకోటగా ఉంది. అయితే ఈ కోటకు బీటలు వారేలా చేసి అక్కడ పాగా వేయాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అసలు దక్షిణ బెంగాల్ రాజకీయ సమీకరణలు ఏమిటి? ఏయే అంశాలు స్థానిక ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి? ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇదే చర్చనీయాంశంగా మారింది.తామ్రలిప్త సామ్రాజ్యం నుంచి..దక్షిణ బెంగాల్ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఇది కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, బెంగాలీ పునరుజ్జీవనోద్యమానికి కేంద్రం. ప్రాచీన తామ్రలిప్త సామ్రాజ్యం నుంచి బ్రిటీష్ పాలన వరకు ఈ ప్రాంతానిది ప్రత్యేక చరిత్ర. కోల్కతా, హౌరా లాంటి నగరాలు రాజకీయ చైతన్యానికి నిలయాలు. ఉత్తర బెంగాల్తో పోలిస్తే ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. 2011 గణాంకాల ప్రకారం దక్షిణ బెంగాల్ జనాభా 7.4 కోట్లకు పైమాటే. ఈ అధిక జనాభా, పట్టణీకరణ ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి.మౌలిక సదుపాయాల లేమికోల్కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణ మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే గత దశాబ్దాలుగా సాగుతున్న పట్టణీకరణకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, శాటిలైట్ నగరాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.దక్షిణ బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటర్ల శాతం అత్యంత కీలకమైన అంశం. ముర్షిదాబాద్లో అత్యధికంగా 66.27 శాతం ముస్లిం జనాభా ఉండగా, బీర్భూమ్, దక్షిణ 24 పరగణాలు, నాడియా, హౌరా జిల్లాల్లో కూడా వీరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంక్ మమతా బెనర్జీ వెంటే నిలిచింది. ముర్షిదాబాద్లోని 22 సీట్లకు గానూ గతంలో టీఎంసీ 20 గెలుచుకోవడం ముస్లింల మద్దతుకు నిదర్శనం.బీజేపీ ప్రచారాస్త్రాలుఈసారి ఐఎస్ఎఫ్ (ఐఎస్ఎఫ్), లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి వల్ల ఓట్లు చీలితే తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ముర్షిదాబాద్ లాంటి సరిహద్దు జిల్లాల్లో పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్ వంటి అంశాలను బీజేపీ ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. దీని వల్ల తమకు సీట్లు పెరుగుతాయని కమలనాథులు ఆశిస్తున్నారు. మరోవైపు, పశ్చిమ 'రార్' ప్రాంతంలోని పురూలియా, బాంకురా, ఝార్గ్రామ్ వంటి జిల్లాల్లో గిరిజన జనాభా అధికం. ఇక్కడ బీజేపీ తన పట్టును పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అర్జున్ ముండా వంటి జాతీయ స్థాయి గిరిజన నేతలను ఇక్కడ రంగంలోకి దించింది.మారుతున్న సమీకరణలుసంతాల్లు, ముండాలు సంప్రదాయబద్ధంగా టీఎంసీకి మద్దతు ఇస్తుండగా, మహతో సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. దీనికి తోడు రాజేష్ మహతో వంటి నేతలు పార్టీ మారడం స్థానిక సమీకరణలను మారుస్తోంది. అలాగే, వేసవిలో తలెత్తుతున్న తీవ్రమైన నీటి ఎద్దడి ఈసారి ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. కేంద్ర నిధుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య జరుగుతున్న పోరులో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండటం ఓటర్ల తీర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.బీజేపీ- టీఎంసీ ఎత్తుకు పైఎత్తు!2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, దక్షిణ బెంగాల్పై తృణమూల్ పట్టు ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఆనాడు దక్షిణ బెంగాల్లోని జిల్లాల్లో టీఎంసీ ఏకంగా 153 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 24 సీట్లకే పరిమితమైంది. కోల్కతా, హౌరా తదితర జిల్లాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని మమత ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని, మారుతున్న సామాజిక సమీకరణలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. మొత్తం మీద బెంగాల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఈ దక్షిణ బెంగాల్ ఓటర్ల తీర్పుపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: West Bengal: కబీర్కి ఒవైసీ ‘పెద్దన్న’.. పొత్తు ఖరారు! -
పరారీలో ఉన్న పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అరెస్టు
పటియాలా: అత్యాచారం కేసులో అరెస్టయి, పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని పరారీలో ఉన్న ఆప్ ఎమ్మెల్యే హరీ్మత్ సింగ్ పఠాన్మాజ్రా అరెస్టయ్యారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పంజాబ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అత్యాచారం, మోసం, బెదిరింపుల ఆరోపణలపై గతేడాది సెపె్టంబర్ 1న మాజ్రాపై కేసు నమోదైంది. విడాకులు తీసుకున్నానని చెప్పి, అప్పటికే వివాహమైన తనను పెళ్లి చేసుకున్నారని జిరక్పూర్కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. హర్యానాలోని కర్నాల్లో జిల్లాలో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లారు. పోలీసు బృందంపై ఎమ్మెల్యే మద్దతుదారులు కాల్పులు జరిపారు. దాంతో ఆయన పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నారు. చివరకు మంగళవారం రాత్రి అరెస్టయ్యారు -
బీజేపీ గుండెల్లో రెబెల్స్!
అస్సాంలో హ్యాట్రిక్పై కన్నేసిన అధికార బీజేపీకి రెబెల్స్ బెడద పెద్ద తలనొప్పిగా తయారైంది. పలు స్థానాల్లో ఎంత బుజ్జగించినా బరినుంచి తప్పుకోవడానికి తిరుగుబాటు అభ్యర్థులు ససేమిరా అంటుండటం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి చెందిన ఇతర పార్టీలకు కూడా రెబెల్స్ పోటు తప్పడం లేదు. ఇవి చాలవన్నట్టు పలుచోట్ల కూటమి పక్షాల నడుమ కూడా స్నేహపూర్వక పోటీలకు కూడా రంగం సిద్ధమైంది! రెబెల్స్, అసమ్మతులు, స్నేహపూర్వక పోటీల వంటి సమస్యలు కనీసం 20 పై చిలుకు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. ఇవన్నీ చివరికి అధికార కూటమి విజయావకాశాలనే దెబ్బ తీస్తాయేమోనన్న అభిప్రాయాలు బీజేపీ నేతల నుంచే వ్యక్తమవుతుండటం విశేషం! ఈశాన్యాన బీజేపీకి అత్యంత కీలకమైన అస్సాంలో పోలింగ్ గడువు శరవేగంగా సమీపిస్తోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ భవితవ్యం ఏప్రిల్ 9న జరిగే పోలింగ్లో తేలిపోనుంది. ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి సమరశంఖం పూరించిన బీజేపీ సరికొత్త తలనొప్పులతో సతమతమవుతోంది. ఈసారి ఏకంగా 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ నిరాకరించింది. దాంతో వారిలో పలువురు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. సీనియర్ నాయకులు పలుమార్లు పిలిపించుకుని బుజ్జగించినా తప్పుకునేందుకు ససేమిరా అంటూ పల్స్ రేటు పెంచేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోని అస్సాం గణ పరిషద్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. టికెట్లు దక్కని వారిలో పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బీజేపీ కూటమికి ప్రత్యర్థులుగా బరిలో దిగుతుండటం మరో విశేషం! మంత్రి నందితా గార్లోసా విషయంలో అదే జరిగింది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో మర్నాడే కాంగ్రెస్లో చేరారామె. ఆ పార్టీ తరఫున తన సిట్టింగ్ స్థానం హాఫ్లాంగ్ నుంచి పోటీ చేస్తున్నారు. అస్సాం బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు జయంతకుమార్ దాస్దీ ఇదే కథ. దిస్పూర్ టికెట్ను ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రద్యోత్ బోర్డోలోయ్కి బీజేపీ కేటాయించింది. ఆ స్థానాన్ని ఆశించిన దాస్ వెంటనే బీజేపీకి రాజీనామా చేసి స్వతంత్రునిగా బరిలో దిగారు! కటీగోరా బీజేపీ మాజీ ఎమ్మెల్యే అమర్చంద్ జైన్ కూడా టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మారారు. సీనియర్ల అసంతృప్తి ఈసారి పలువురు సీనియర్ బీజేపీ నేతలు కూడా తమకు టికెట్లు దక్కకపోవడంతో నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ జాబితాలో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సిద్ధార్థ భట్టాచార్య, ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన అతుల్ బోరా వంటి హేమాహమీలున్నారు. వారంతా పార్టీపై కినుక వహించడమే గాక ప్రచారానికి దూరంగా ఉండాల్సిందిగా తమ అనుయాయులకు, స్థానిక శ్రేణులకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. దాంతో పలు అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ ప్రచారం బోసిపోయి కన్పిస్తోంది. టికెట్లు దక్కని ఇతర సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులను కూడా ఈ సీనియర్లు పార్టీకి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారన్న వార్తలు బీజేపీ నాయకత్వానికి మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఏజీపీతోనూ తలనొప్పులు ఎన్డీఏ భాగస్వామి అస్సాం గణ పరిషద్తోనూ బీజేపీకి తలనొప్పులు తప్పడం లేదు. పలు స్థానాల్లో వాటి మధ్య స్నేహపూర్వక పోటీ తప్పని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇది అంతిమంగా కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చే పరిణామమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే దీన్ని బీజేపీ స్వయంకృతాపరాధంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఏజీపీకి కేటాయించిన పలు స్థానాల్లో ఆ పార్టీ కూడా బరిలో దిగుతుండటమే ఇందుకు కారణం. శివసాగర్లో ఏజీపీ ప్రదీప్ హజారికాకు టికెటివ్వగా చివరి క్షణాల్లో బీజేపీ కుషాద్ దొవారీని బరిలో దింపింది. ఏజీపీ బరిలో ఉన్న చామరియాలో కూడా బీజేపీ నామినేషన్ల చివరి రోజున తన అభ్యర్థిని బరిలో దించింది. తిరుగుబాట్లు, రెబెల్స్, అసమ్మతులు, అసంతృప్తులు చాలా స్థానాల్లో సమస్యగానే పరిణమించినట్టు రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒకరు అంగీకరించారు. ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తామో అర్థం కావడం లేదంటూ ఆయన వాపోయారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి దాస్రూపం గోస్వామి మాత్రం ఈ ఆందోళనలను కొట్టిపారేశారు. ‘‘బీజేపీ వంటి పెద్ద పార్టీలో ఆశావహులు చాలామంది ఉంటారు గనుక ఎంతో కొంత అసంతృప్తి సహజమే. వారంతా త్వరలోనే దారికొస్తారు’’ అని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పీఎన్జీకి మారకపోతే ఎల్పీజీ కట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిణామాల వల్ల మన దేశంలో వంట గ్యాస్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) అందుబాటులో ఉన్నచోట వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్ తీసుకోవాలని, లేకపోతే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ తొలగిస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుత పరిణామాలతోపాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ నెట్వర్క్ను విస్తరించడం, ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. గృహ, వాణిజ్య వినియోగదారులు పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువును విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది. పీఎన్జీ దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది. ఇది వైవిధ్యభరితమైన సరఫరా మార్గాల ద్వారా లభించే సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం. పైప్లైన్ ద్వారా వంటగదికి పీఎన్జీని నిరంతరాయంగా సరఫరా చేస్తారు. పీఎన్జీ అనుమతులను వేగవంతం చేయాలని తాజా ఉత్తర్వులో ప్రభుత్వం ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వకపోతే ఇచ్చినట్లుగానే భావిస్తారని స్పష్టం చేసింది. -
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు ప్రత్యేక సమావేశం!
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్టాన్ని త్వరగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు అఖిలపక్ష భేటీకి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారితో చర్చించాకే ప్రత్యేక సమావేశాల్లో ఈ చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తున్న ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నారీ శక్తి వందన్ అధినియమ్(మహిళా రిజర్వేషన్ చట్టం)–2023 ప్రకారం లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేయనున్నారు. జన గణన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియల తర్వాతే మహిళా కోటా అమలు చేయాలని ఆ చట్టంలో నిర్దేశించారు. అయితే నియోజకవర్గాల పునరి్వభజన ఇంకా పూర్తికాకపోవడంతో ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2027–28లో జరగాల్సిన పునర్విభజన ప్రక్రియ నుంచి ఈ చట్ట అమలును వేరుచేసి త్వరగా అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం రెండు సవరణలు చేయాలని భావిస్తోంది. ఈ సవరణల ఆమోదం కోసం ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహిళలకు రిజర్వేషన్ అమలు విధివిధానాలపై చర్చించేందుకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లేఖలో కోరిన సంగతి తెలిసిందే. ఈ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. దృష్టిమరల్చేందుకే ఇదంతా చేస్తోంది: కాంగ్రెస్ ఆరోపణ దేశంలో ఎల్పీజీ, ఇంధన సంక్షోభం తలెత్తడంతో ఈ అంశాల నుంచి ప్రజలను దృష్టిమరల్చేందుకే మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టం తక్షణ అమలు అంశాన్ని తెరమీదకు తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు పార్టీ ప్రధానకార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ మాట్లాడారు. ‘‘రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిన నాడే వెంటనే అమలుచేయాలని మేం కోరాం. కానీ అది అసాధ్యమని మోదీ తేల్చిచెప్పారు. తీరా ఇప్పుడు ఇంధన సంక్షోభం, విదేశాంగ విధానం విఫలమవడంతో యూటర్న్ ఉస్తాద్(మోదీ) మాటమార్చాడు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు 30 నెలల తర్వాత హఠాత్తుగా మహిళారిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు’’అని జైరాం అన్నారు. -
దృఢ సంకల్పంతో సంస్కరణలు
న్యూఢిల్లీ: 2016–17 కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజల సంక్షేమంతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) కోసం అనే ప్రోత్సాహకర చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సంస్కరణలను తప్పనిసరి పరిస్థితుల వల్ల కాకుండా.. దృఢ సంకల్పంతో, పూర్తి స్పష్టతతో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. సంస్కరణల విషయంలో ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. ఆర్థిక బిల్లు– 2026పై లోక్సభలో జరిగిన చర్చకు మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సమాధానమిచ్చారు. 2026–27 ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2021లో ఇది 9.3 శాతంగా ఉందన్నారు. దేశంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి కూడా తగ్గిపోతోందని, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తే మన దగ్గరే ఈ నిష్పత్తి తక్కువగా ఉందని వివరించారు. ఐదు కీలక సూత్రాలపై ఆర్థిక బిల్లు ఆధారపడి ఉన్నట్లు స్పష్టంచేశారు. విశ్వాసం ఆధారిత పన్నుల వ్యవస్థ, ప్రజల సులభతర జీవనం, రైతుల ఎంఎస్ఎంఈలు, సహకార సంఘాల సాధికారత, దేశాన్ని గ్లోబల్ బిజినెస్ హబ్గా తీర్చిదిద్దడం, నిరాటంకమైన వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సంస్కరణలే ఈ బిల్లు ఆధారమని వెల్లడించారు. బడ్జెట్లో మధ్యతరగతిని విస్మరించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. ఫైనాన్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం ఫైనాన్స్ బిల్లు–2026కు లోక్సభ బుధవారం ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 32 సవరణలు ఆమోదం పొందాయి. సభలో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. దీంతో లోక్సభలో బడ్జెట్కు సంబంధించి అనుమతుల ప్రక్రియ ముగిసింది. ఫైనాన్స్ బిల్లును శుక్రవారం రాజ్యసభలో ఆమోదించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు తెలిపారు. గురువారం సెలవు కాబట్టి శుక్రవారం ఫైనాన్స్ బిల్లుపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. -
సరికొత్తగా ‘ఉడాన్’
న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతీయంగా విమానయానాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్టుల అభివృద్ధి, నిర్వహణకు నిధుల సహకారం, హెలిప్యాడ్ల ఏర్పాటు, మేడ్ ఇన్ ఇండియా విమానాల కొనుగోలుకు మద్దతు కోసం ‘సవరించిన ఉడాన్’పథకానికి అమోదం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సవరించిన ఉడాన్ పథకాన్ని రాబోయే పదేళ్లలో రూ.28,840 కోట్లతో అమలు చేయబోతున్నారు. ‘ఉడాన్’మార్గాల్లో ప్రయాణించే విమానాల విషయంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీపీ) కింద 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి పదేళ్లలో రూ.10,043 కోట్లు ఖర్చు చేస్తారు. కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. సవరించిన ఉడాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 100 ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.12,159 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అలాగే 200 ఆధునిక హెలిప్యాడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఒక్కో హెలిప్యాడ్కు రూ.15 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో సేవల కోసం రెండు హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లు, రెండు హెచ్ఏఎల్ డార్నియర్ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. 2026–27 నుంచి 2035–36 దాకా పదేళ్లపాటు ఈ సరికొత్త ఉడాన్ పథకం అమలు కాబోతోంది. ఉడాన్ స్కీమ్ను తొలుత 2016 అక్టోబర్లో ప్రారంభించారు. 95 ఎయిర్పోర్టులు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్స్ నుంచి 633 మార్గాలను ఆపరేషన్లోకి తీసుకొచ్చారు. పాత ఉడాన్ పథకం కాలపరిమితి ఈ ఏడాది ఆఖర్లో ముగియనుంది. -
ఆ ఆదేశం తప్పనిసరేం కాదు
న్యూఢిల్లీ: జాతీయగేయం వందేమాతరం మొత్తం ఆరు చరణాలను పాఠశాలలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించాలంటూ జనవరి 28వ తేదీన కేంద్ర హోం శాఖ జారీచేసిన సర్క్యులర్ను సవాల్చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను బుధవారం పక్కనబెట్టింది. తమ విద్యాసంస్థలో పూర్తిగేయం పాడకపోతే ప్రభుత్వం నుంచి వివక్ష, శిక్ష, తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ముహమ్మద్ సయీద్ నూరీ అనే వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలీల ధర్మాసనం విచారించింది. ‘‘హోం శాఖ ఇచ్చిన ఆరు చరణాల ఆలాపన ఉత్తర్వులను తప్పకుండా పాటించాల్సిన అవసరం లేదు. అదేం ఆదేశం కాదు. అడ్వైజరీ మాత్రమే. పూర్తిగా పాడనంత మాత్రాన శిక్షలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో హోంశాఖ ప్రస్తావించలేదు. మీ అకాడమీ లేదా పాఠశాలలో 6 చరణాలు పాడాల్సిందే అని ఎవరూ మిమ్మల్ని ఆదేశించజాలరు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
పాక్లా మనం దళారి కాదు
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరినీ కష్టాలకడలిలో ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ఇకనైనా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ హితబోధ చేశారని అఖిలపక్ష సమావేశంలో విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. యుద్ధం మరింత విస్తరించకుండా భారత్ తన వంతుగా ఎలాంటి కృషిచేయట్లేదన్న విపక్షాల ఆరోపణలను ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. పాకిస్తాన్లా భారత్ దళారీగా వ్యవహరించబోదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టలు పెదవి విరిచాయి. ఈ అఖిలపక్ష భేటీకి బుధవారం పార్లమెంట్ కాంప్లెక్స్ వేదికగా నిలిచింది. బుధవారం సాయంత్రం కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలో మొదలైన ఈ అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం తరఫున హోం మంత్రి అమిత్షా, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు పాల్గొన్నారు. విపక్షాల నుంచి తారిఖ్ అన్వర్, ముకుల్ వాస్నిక్(కాంగ్రెస్), ధరేంద్ర యాదవ్(ఎస్పీ), సస్మిత్ పాత్రా(బీజేడీ), సంజయ్ ఝా(జేడీయూ), శ్రీకాంత్ షిండే(శివసేన), సంజయ్సింగ్(ఆప్), జాన్ బ్రిటాస్ (సీపీఎం), సుప్రియా సూలే(ఎన్సీపీ–ఎస్పీ), అరవింద్ సావంత్(శివసేన–యూబీటీ), అసదుద్దీన్ ఒవైసీ(ఏఐఎంఐఎం) తదితర నేతలు పాల్గొని దాదాపు రెండు గంటలపాటు పశ్చిమాసియా అంశంపై చర్చించారు.యుద్ధం ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మనకన్నా చిన్నదేశం పాకిస్తాన్ ముందుకొచ్చిందని, భారత్ కనీసం నోరుమెదపలేదని విపక్షాలు చేసిన ఆరోపణలపై మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ‘‘దళారిలాగా మధ్యవర్తిత్వం కోసం అర్రులుచాచడం పాకిస్తాన్కు అలవాటే. 1981 నుంచి అమెరికా పాకిస్తాన్ను ఇలాగే ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్లా భారత్ దళారీ దేశం కాదు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఎప్పుడూ జోక్యంచేసుకోదు. మధ్యవర్తిత్వం వహించబోదు. యుద్ధం ముగింపు కోసం భారత్ తన వంతు కృషిచేస్తోంది. మౌనంగా కూర్చోలేదు. సందర్భానుసారం మన వైఖరి తెలియజేస్తున్నాం. ఇరాన్ సుప్రీంనేత ఖమేనీ మరణవార్త తెలియగానే మోదీ సర్కార్ స్పందించలేదన్న విపక్షాల వాదనల్లో నిజం లేదు. ఇరాన్ ఎంబసీని తెరచిన వెంటనే విదేశాంగ కార్యదర్శి వెళ్లి సంతాపం తెలిపారు. అక్కడి సంతాపసూచిక పుస్తకంలో సంతకం కూడా చేసి వచ్చారు’’అని అన్నారు. మన వాళ్ల భద్రత, ఇంధన భద్రత ముఖ్యం ‘‘గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రతే మాకు ముఖ్యం. దీంతోపాటే దేశీయ ఇంధన అవసరాలను సంపూర్ణంగా తీర్చడం పైనా మేం దృష్టిసారించాం. ఈ విషయంలో దౌత్య విజయం సాధించాం. భారత్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ నిల్వలపై ఆందోళన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ముడిచమురు, ఇంధన నౌకలు విదేశాల నుంచి వస్తూనే ఉన్నాయి. మరిన్ని నౌకలు మార్గమధ్యంలో ఉన్నాయి. హార్మూజ్ గుండా రావాల్సిన 18 నౌకలు అక్కడే చిక్కుకుపోయిన మాట వాస్తవమే. హార్మూజ్ గుండా సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై దృష్టిసారించాం. ముడి చమురు, గ్యాస్లను వేరే దేశాల నుంచి తెప్పిస్తున్నాం. భారత్ కేవలం గల్ఫ్దేశాల నుంచేకాకుండా మొత్తంగా 41 దేశాల నుంచి ఆయిల్, గ్యాస్లను కొనుగోలుచేస్తోంది. మనకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇజ్రాయెల్ అతిపెద్ద సాంకేతిక భాగస్వామిగా ఉన్నాయి. మనకు ఇరాన్తోనూ సత్సంబంధాలున్నాయి’’అని ప్రభుత్వం విపక్షాలకు తెలియజేసింది. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పశ్చిమాసియా పరిణామాలపై తక్షణం 193వ నిబంధన కింద లోక్సభలో, 176వ నిబంధన కింద రాజ్యసభలో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్చేశాయి. మరోవైపు విపక్షనేత రాహుల్గాంధీ అఖిలపక్ష భేటీకి రాకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. -
అక్కడ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో, కేరళ రాజకీయ నాయకులు కూడా తమదైన యుద్ధం చేస్తున్నారు. అదే ఓట్ల కోసం చేసే యుద్ధం. క్షిపణులు, డ్రోన్లు వంటివి తమ వద్ద లేకపోయినా అభ్యర్థులు, కార్యకర్తలు తాము యుద్ధంలో ఉన్నట్లే భావిస్తున్నారు. కజక్కూట్టం నియోజకవర్గంలో ఈ యుద్ధం మరింత క్లిష్టంగా ఉంటుంది.రాజకీయ నేతలకు అక్కడి ఎత్తైన అపార్ట్మెంట్లు పెద్ద ఓటింగ్ యంత్రాల్లా కనిపిస్తాయి. కిటికీలు అభ్యర్థుల పార్టీ గుర్తుల్లా కనిపిస్తాయి. కానీ సమస్య ఏమిటంటే అభ్యర్థులు వస్తే కిటికీలు, తలుపులు రెండూ తెరుచుకోవు. ఆ ఫ్లాట్లలోని వారు తెరవరు. ఇళ్లలో ఇంటింటి ప్రచారం చేసే అలవాటు ఉన్న పార్టీలకు ఐటీ ఉద్యోగులు ఉండే ఫ్లాట్లలో ప్రచారం చేయడానికి మాత్రం ప్రత్యేక వ్యూహాలు అవసరం.ఎన్నికల్లో ఒక్కోసారి గెలుపు చాలా చిన్న మెజారిటీపై ఆధారపడుతుంది. సరిగ్గా ప్రచారం చేయకపోయినా, అభ్యర్థులు, కార్యకర్తలను ప్రచారంలో ప్రజలు ఆదరించకపోయినా తీవ్ర నిరాశకు గురవుతారు. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న ఎన్నికల్లో కజక్కూట్టం నియోజకవర్గంలో పార్టీలకు ఇటువంటి సమస్యే ఎదురవుతుంది. అక్కడ అన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి. అభ్యర్థులు వెళ్లినా ఆ ఫ్లాట్ల యజమానులు తలుపులు తెరవడం లేదు. రాజకీయ పార్టీల ప్రచారానికి వారు సహకారించడం లేదు. ఐటీ ఉద్యోగులు ఉండే ఈ ఫ్లాట్ల వద్దకు వెళ్లి ప్రచారాలు చేసుకోవాలంటే పార్టీల అభ్యర్థులకు ప్రత్యేక వ్యూహాలు అవసరం. అంతేగాక, ఈ ఫ్లాట్లలో బయటి వాళ్లు ఎక్కువగా ఉంటారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్న ఉద్యోగులు అధికం. ప్రతి ఓటు అభ్యర్థికి చాలా ముఖ్యం ఇక్కడ ఓటరు కార్డు ఉన్నవారిలో ఓటింగ్ ఆసక్తి తక్కువ. యువ ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రానికి రారు. ఆ ఫ్లాట్లలో అసోసియేషన్ పాత్ర కీలకంగా ఉంటుంది. వారి అనుమతి లేకపోతే రాజకీయ నాయకులు అక్కడ ప్రచారం చేసుకోవడం అసాధ్యం. ఇక్కడ ఇంటింటి ప్రచారం చాలా తక్కువ. అయితే, ఇక్కడి ప్రతి ఓటు అభ్యర్థికి చాలా ముఖ్యం. తక్కువ మెజార్టీతో ఇక్కడ అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. కజక్కూట్టం నియోజకవర్గంలో ఎత్తైన అపార్ట్మెంట్లు రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగా మారాయి. అతి తక్కువ మెజార్టీతో ఇక్కడి అభ్యర్థులు గెలుస్తుండడంతో ఆయా ఫ్లాట్ల ఓటర్లను వదులుకునే ప్రసక్తే లేదు. కజక్కూట్టం స్థానిక ఎన్నికల్లో గతంలో ఎల్డీఎఫ్ 1,909 ఓట్ల తేడాతో గెలిచింది. దీంతో ఈ ఎన్నికల్లోనూ ప్రతి ఓటు కీలకంగా మారింది.పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు వస్తే ఆయా ఫ్లాట్లలో నివసించే వారు తలుపులు తెరవకపోవడం, ప్రచారానికి సహకరించకపోవడం పార్టీలను ఇబ్బందికి గురి చేస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తే ఈ ఫ్లాట్లలోని చాలా మంది తమకు సహకరించరని పార్టీల కార్యకర్తలు చెబుతున్నారు.తక్కువ మెజార్టీతో గెలుపుకజక్కూట్టం టెక్నోపార్క్ కు నిలయం. ఇక్కడ 1990 దశకంలో వ్యవసాయ భూమిని ఐటీ కేంద్రంగా మార్చారు. ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు కనపడుతున్నాయి. మూసివేసిన గేట్లు, తలుపులు తీయాలని కోరుతూ వాటిల్లోకి వెళ్లడం రాజకీయ పార్టీల నేతలకు పెద్ద సవాలు.కజక్కూట్టంలో గతంలో పలు పార్టీల నేతలు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఎంఏ వాహిద్ 2001లో రెండు ప్రధాన కూటములను ఓడించి గెలిచారు. 2016 వరకు స్థానాన్ని నిలుపుకున్నారు. 2021లో సీపీఎంకు చెందిన కడకంపల్లి సురేంద్రన్ 7,374 ఓట్ల తేడాతో తిరిగి గెలిచారు.ఈ నియోజకవర్గంలో 28 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. బీజేపీ 14, ఎల్డీఎఫ్ 10, యూడీఎఫ్ 3, ఒకటి స్వతంత్ర అభ్యర్థి. ఈ సారి సీపీఎం తరఫున సురేంద్రన్ మళ్లీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున వి. మురళీధరన్, కాంగ్రెస్ తరఫున టి. శరత్చంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. -వెబ్డెస్క్ -
భయపడాల్సిన పనిలేదు: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలలోనూ తాము అండగా నిలుస్తామని ప్రతిపక్ష పార్టీలన్నీ తమకు హామీ ఇచ్చాయని తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన సమావేశం జరిగిందని కిరణ్ రిజిజు అన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించిదని తెలిపారు. ‘దేశీయంగా 60% ఎల్పీజీని ఉత్పత్తిని పెంచాం. ఇంధన సరఫరా పెంచేందుకు అన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నాం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్ని అఖిలపక్ష పార్టీలకు వివరించాము. సవాళ్లు ఎదురవుతున్న ఈ సమయంలో, అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించాము. దేశంలో ఇంధన భద్రతకు ఢోకా లేదు ఇంధన భద్రత విషయంలో భయపడాల్సిన పనిలేదు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతిస్తామని అన్ని పార్టీలు వెల్లడించాయి. హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా వస్తున్నాయి’ అని అన్నారు.కాగా, ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశం పార్లమెంటులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ తరఫున సమావేశానికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. -
ఎవరిదో గెలుపు? బలాలు.. బలహీనతలు ఇవే..!
తమిళనాడు ఎన్నికలంటేనే.. నీలగిరిలో రాజకీయాలు వేడెక్కిపోతాయి. శీతల విడిదికి కేంద్రాలుగా ఉన్న నీలగిరి కొండల్లో వేడి రాజుకుంటుంది. తూర్పు, పశ్చిమ కనుమల కలయికకు కేంద్రబిందువైన నీలగిరుల్లో.. ఊటీ, కున్నూరు, కూడలూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎన్నికలు ఏవైనా కానీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను అంచనా వేయడం తలలు పండిన విశ్లేషకులకు కూడా సాధ్యం కాదనే విషయం ఇక్కడి అభ్యర్థులను కల్లోలపరుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలపై విశ్లేషణను ఎక్కడా మిస్సవ్వకుండా చదివేయండి..అంత ఈజీ కాదు..ఊటీ, కున్నూరు, కూడలూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ కూటమి రెండు చోట్ల.. అన్నాడీఎంకే ఒకచోట బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఇక్కడ గెలుపోటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఊటీ నియోజకవర్గాన్ని ఇక్కడ అధికారికంగా ఉదగై అంటారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.గణేశ్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పర్యాటకమే ప్రధాన ఆర్థిక వ్యవస్థ. టీ-కాఫీ తోటలకు నెలవు. అయితే.. కీలకమైన పరిశ్రమలు మూతపడడంతో ఇక్కడ నిరుద్యోగిత పెరుగుతోంది. స్థానిక సమస్యలు తోడవ్వడం యాంటీ-ఇన్కంబెన్సీకి దారితీసే ప్రమాదాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే..! ఇక కున్నూరు నియోజకవర్గం డీఎంకేకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతం. టీ-కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులకు ఈ నియోజకవర్గం నిలయం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా డీఎంకేకు కలిసివచ్చే అంశమే..! అయితే.. తేయాకును సేకరణకు ఇచ్చే కూలీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఇక్కడి కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని అన్నాడీఎంకే అడ్వాంటేజ్గా తీసుకుంటే.. పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఆ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే..ఇక కూడలూరు నియోజకవర్గంలో గిరిజన ఓటర్లదే ఆధిపత్యం. అనూహ్య ఫలితాలకు ఈ నియోజకవర్గం వేదిక. ఇక్కడ ఇరులర్, కురుంబర్ వర్గాలు గెలుపోటములను శాసిస్తాయి. వీరితోపాటు.. పడుగర్ వర్గానికి పెద్దమొత్తంలోనే ఓటుబ్యాంకు ఉంది. ఈ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ అభ్యర్థి విజయం కరతలామలకమే..! గిరిజనుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చే అభ్యర్థికే ఇక్కడి ఓటర్లు పట్టంకడతారు.ఆ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే..మొత్తానికి నీలగిరిలోని మూడు నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే.. ఏ పార్టీ అయినా.. ఉపాధి, పరిశ్రమల కల్పన, తేయాకు సేకరణ కూలీ ధర, కార్మికుల సంక్షేమం వంటి అంశాలు కీలక భూమిక పోషిస్తాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పడుగర్ వర్గం ఓటు బ్యాంకు అత్యంత కీలకం. డీఎంకే, కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు వేర్వేరుగా ఓటు బ్యాంకులు ఉన్నప్పటికీ.. ఈసారి పెరిగిన యువ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.ఏది ఏమైనా.. ఊటీలో విజయానికి కాంగ్రెస్ ఈసారి చమటోడ్చాల్సిందే..! కున్నూరును తిరిగి నిలబెట్టుకోవాలంటే.. కార్మికుల కూలీ ధరలపై డీఎంకే స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇక కూడలూరులో అన్నాడీఎంకే బలంగా కనిపిస్తున్నా.. నెక్-టు-నెక్ పోటీ తప్పదని తెలుస్తోంది. -
88 శాతం : ఐఆర్సీటీసీలో ఆన్లైన్ బుకింగ్ జోరు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఐఆర్సీటీసీ (IRCTC)లో ఆన్లైన్ టికెట్ల బుకింగ్కు భారీ ఆదరణ లభిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు, ఆన్లైన్ రైలు టిక్కెట్ల బుకింగ్లు గణనీయంగా పెరిగాయని, మొత్తం రిజర్వ్డ్ బుకింగ్లలో 88 శాతం, అంటే 48.25 కోట్లకు పైగా టిక్కెట్లు డిజిటల్గా బుక్ అయ్యాయని ప్రభుత్వం బుధవారం తెలిపింది.లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార , ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ, ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ బుకింగ్ల వైపు మొగ్గు పెరుగుతోందన్నారు. తద్వారా రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడంతోపాటు, ప్రయాణ సమయం, ఖర్చులను ఆదా చేయడం ద్వారా ప్రయాణికులకు టిక్కెటింగ్ సులభతరం మైందన్నారు.ఐఆర్సీటీసీ అందిస్తున్న ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం భారతీయ రైల్వేల అత్యంత ప్రయాణీకుల స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటని మంత్రి పేర్కొన్నారు. ఆన్లైన్ టిక్కెటింగ్ కోసం ఐఆర్సీటీసీ గణనీయమైన ఖర్చు చేస్తోందనీ, టిక్కెటింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, ఉన్నతీకరణ విస్తరణకు అయ్యే ఖర్చులను భర్తీ చేయడానికి, ఐఆర్సిటిసి చాలా నామ మాత్రపు రుసుమును వసూలు చేస్తుందని మంత్రి తెలిపారు.ప్రస్తుతం అత్యధిక టిక్కెట్లు డిజిటల్గా బుక్ అవుతుండటంతో, ఆన్లైన్ వ్యవస్థ భారతీయ రైల్వే చేపట్టిన అత్యంత ప్రయాణీకుల-స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటిగా మారిందని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి,దుర్వినియోగాన్ని నివారించడానికి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 3 करोड़ से ज्यादा फेक अकाउंट IRCTC से हटाए गए हैं। आज जेनुइन पैसेंजर्स को कंफर्म टिकट मिलने लगा है: माननीय रेल मंत्री @AshwiniVaishnaw जी pic.twitter.com/FhaP5rAwGm— Ministry of Railways (@RailMinIndia) March 25, 2026 > ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు మంత్రి వివరణలోని మరికొన్ని విశేషాలుఆధార్ ధృవీకరించిన వినియోగదారులు మాత్రమే తత్కాల్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు.గత ఏడాదిల జూలై 1నుంచి అమల్లోకి వచ్చింది. ఇది నకిలీ ఖాతాల వాడకాన్ని పరిమితం చేయడానికి,నిజమైన ప్రయాణీకులకు టిక్కెట్లు లభించే అవకాశాలను మెరుగుపరచడానికి సహాయపడింది.2025 సంవత్సరంలో, 3.04 కోట్ల వినియోగదారుల ఖాతాలులను రద్దు చేయగా, 2.94 కోట్ల వినియోగదారుల ఖాతాలు పునఃధృవీకరణ ఎంపికతో తాత్కాలికంగా నిలిపివేశారు. (టెలిగ్రామ్లో ఎర, క్రిప్టోలో చెల్లింపులు, కట్ చేస్తే!)అయితే గత ఏడాది జనవరి నుంచి ఈ ఫిబ్రవరి 28 మధ్య కాలంలో, 1,80,474 వినియోగదారుల ఖాతాలు తిరిగి యాక్టివ్ చేశారు. సైబర్ ముప్పులను ఎదుర్కోవడానికి ఐఆర్సీటీసీ తన సాంకేతిక వ్యవస్థలను కూడా బలోపేతం చేసింది. దీని యాంటీ-బాట్ టెక్నాలజీ సుమారు 64 శాతం హానికరమైన ట్రాఫిక్ను నిరోధించగలదు, తద్వారా నిజమైన వినియోగదారులకు బుకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, ఫిబ్రవరి 28, 2026 నాటికి 13,023 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లు అరికట్టామని వైష్ణవ్ వివరించారు. సమగ్ర డేటా విశ్లేషణ ద్వారా బుకింగ్ సరళిని ,వినియోగదారుల రిజిస్ట్రేషన్లను పరిశీలించి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి నిరంతర పర్యవేక్షణ భవిష్యత్తుల కూడా కొనసాగుతుందన్నారు. -
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటన
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్, వంటగ్యాస సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయనీ, వదంతులను నమ్మవద్దు అని బుధవారం (మార్చి 25, 2026) పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ధరలు పెంచంఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉందనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అన్నారు. గత రెండు రోజులుగా, అనేక ప్రాంతాల్లోని రిటైల్ అవుట్లెట్లు మరియు పెట్రోల్ పంపుల బయట క్యూలు కనిపించాయి. భయాందోళనలతో కొనుగోళ్లు కూడా జరిగాయి. కానీ మన వద్ద తగినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయి. ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా కొరత లేదు. పెట్రోల్ పంపులకు సరఫరా టెర్మినళ్లలో కూడా తగినంత పరిమాణంలో ఇంధన నిల్వలున్నాయి. అందువల్ల, వదంతులను నమ్మవద్దు , భయాందోళనలతో కొనుగోళ్లు మానుకోండి అని ఆమె చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని కూడా ఆమె స్పష్టం చేశారు. LPG విషయానికి వస్తే, ఏ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఎలాంటి కొరత లేదని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల వాణిజ్య ఎల్పిజిని కేటాయించారని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్జి కనెక్షన్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. సుమారు 30,005 కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని ఆమె చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన కిరోసిన్ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అదనపు కేటాయింపులు చేసిందన్నారు. సుమారు 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వివిధ రాష్ట్రాల్లో సుమారు 2700 దాడులు నిర్వహించి, సుమారు 2000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు సుజాత శర్మ వెల్లడించారు.ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు #WATCH | Delhi: Sujata Sharma, Joint Secretary (Marketing & Oil Refinery), Ministry of Petroleum & Natural Gas, says, "In the last 25 days, 2.5 lakh new connections (PNG) have been given. Additionally, approximately 2.20 lakh consumers have shifted from LPG to PNG. Additionally,… pic.twitter.com/o3pDx5KbMs— ANI (@ANI) March 25, 2026 -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం, వెనుకబడిన ప్రాంతాలలో విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా మొత్తం రూ.28,840 కోట్ల వ్యయంతో సవరించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదంజాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుఐవీఎఫ్ఆర్టీ ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు క్యాబినెట్ అనుమతిఉడాన్ 2.0 పథకానికి క్యాబినెట్ ఆమోదంపదేళ్ల వ్యవధిలో 28,840 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ప్రభుత్వంఈ పథకం కింద కొత్తగా 100 విమానాశ్రయాల అభివృద్ధి200 హెలిపాడ్ ల ఆధునీకరణఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కోసం 2,577 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న ప్రభుత్వం ఎయిర్ లైన్స్ ఆపరేటర్స్ కు వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద 10,043 కోట్ల రూపాయల సహాయం ఈ పథకం కింద కొత్తగా 120 ప్రాంతాలకు పెరుగనున్న ఎయిర్ కనెక్టివిటీపర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్ విధానానికి క్యాబినెట్ ఆమోదం సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 52 శాతం విద్యుత్ ఉత్పత్తి -
కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలు
మధ్యప్రాచ్య (Middle East) యుద్దంతో నెలకొన్న చమురు సరఫరా సంక్షోభం పెట్రోల్, డీజిల్పై ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు భారీ ఊరటనిచ్చే అంశమిది. భారత రిఫైనరీలు వచ్చే నెల డెలివరీ కోసం సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా చమురు కొనుగోలులో అమెరికా ఇచ్చిన వెసులు బాటు భారత్ సమర్ధవంతంగా వినియోగించుకున్నట్టు అవుతోంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో సౌదీ అరేబియా, ఇరాక్ నుండి రావాల్సిన చమురు నిలిచి పోవడంతో, భారత్ తన ఇంధన అవసరాల కోసం మళ్ళీ రష్యా వైపు మొగ్గు చూపింది. మనీ కంట్రోల్ కథనం ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతీయ రిఫైనరీలు మే నెల డెలివరీ కోసం దాదాపు 6 కోట్ల (60 Million) బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ కంటే బ్యారెల్కు 5 డాలర్ల నుండి 15 డాలర్ల ప్రీమియం ధరలకు బుక్ అయ్యాయి. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ ప్రకారం, ఈ పరిమాణం ఈ నెల కొనుగోళ్లకు సమానంగా ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నెల కొనుగోళ్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ.(ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు)గత డిసెంబర్ నుండి రష్యా చమురుకు దూరంగా ఉన్న మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో ఏర్పడిన చమురు కొరతను అధిగమించేందుకు, మార్చి 12 లోపు సముద్రంలో లోడ్ అయిన రష్యన్ చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.2022 ప్రారంభంలో ఉక్రెయిన్పై దాడి జరిగిన తర్వాత, భారత్కు తక్కువ ధరకు లభించే రష్యన్ ముడి చమురుకు ఇది ఒక ప్రధాన కొనుగోలుదారుగా మారింది. అయితే, అమెరికా ఒత్తిడితో గత ఏడాది చివరి నుంచి భారత్ కొనుగోళ్లను తీవ్రంగా తగ్గించుకుంది. దానికి బదులుగా సౌదీ అరేబియా, ఇరాక్ల నుంచి బ్యారెళ్ల వైపు మళ్లింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, అందులో అధిక భాగం పర్షియన్ గల్ఫ్లోనే చిక్కుకుపోయింది. అమెరికా మినహాంపుతోపాటు, కేవలం రష్యా పైనే ఆధార పడకుండా, భారత్ తన చమురు వనరులను పెంచుకుంటోంది. అక్టోబర్ 2020 తర్వాత అత్యధికంగా వెనిజులా నుండి కూడా ఏప్రిల్ నెలలో 80 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోనుంది.ఇదీ చదవండి: కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలంరష్యాకు భారీ లాభాలుభారత్ , ఇతర దేశాలనుంచి వస్తున్న భారీ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల రష్యా భారీ లాభాలను ఆర్జిస్తోంది. మార్చి 2022 తర్వాత రష్యా చమురు ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న సమయం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి. -
ఏ ఎన్నికల్లో ఎవరు ఎలా గెలిచారు?
కొన్నేళ్ల క్రితం వరకు తమిళనాడు పేరు వినగానే మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత గుర్తుకువచ్చేవారు. ఇక ఎన్నికల సమయంలో వీరిని చూసే ప్రజలు ఓట్లు వేసేవారు. ఇప్పుడు వారిద్దరూ లేరు. ఈ ఇద్దరు ఉద్ధండులు లేకుండానే 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. ఇప్పుడు తమిళనాడులో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు సమీపించే దశ నుంచి ఫలితాలు వెలువడే వరకూ రాజకీయ పార్టీల నేతలు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా, ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఎన్నో వ్యూహాలు రూపొందించుకుంది. ఎన్నికల విషయంలో అనేక అంశాలు విజయం, ఓటమిలో పాత్ర పోషిస్తాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. 1952 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో పలు అంశాలు గెలుపు, ఓటములను నిర్ణయించాయి.1952 నుంచి 2021 వరకు తమిళనాడులో 1952 నుంచి 2021 వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలను పరిశీలిస్తే సాధారణంగా విజయం వేటిపై ఆధారపడి వరిస్తుందో తెలుసుకోవచ్చు. మామూలుగా ప్రజా వ్యతిరేకత, కూటమి బలం, చిన్న పార్టీల ప్రభావం, ఓటర్ల స్పందన వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి.తమిళనాడులో ఏ ఎన్నికల వేళ ఏం జరిగింది?1952–19621952 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆ పార్టీ పాత్ర పోషించడంతో తమిళనాడు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.1957, 1962 ఎన్నికల్లో డీఎంకే ముఖ్య ప్రత్యర్థిగా ఎదిగి రాజకీయంగా కాంగ్రెస్కు పోటీగా మారింది.1967 కాంగ్రెస్పై వ్యతిరేక భావన, బియ్యం ధరలు పెరగడం వంటి ఆర్థిక ఇబ్బందులు డీఎంకేను ఎన్నికల్లో గెలిచేలా చేశాయి. 1971లోనూ డీఎంకే గెలిచింది.1977 డీఎంకేలో విభజన, ఎంజీఆర్ ప్రజాకర్షణ వల్ల అన్నాడీఎంకే భారీ విజయం సాధించింది.1980–1990 దశకం ఎంజీఆర్ ప్రజాదరణ, కూటమి వ్యూహాలు ఫలితాల్లో కీలక భూమిక పోషించాయి. 1980, 1984లో అన్నాడీఎంకే విజయం సాధించింది. 1989లో మాత్రం డీఎంకేను విజయం వరించింది.1991లో రాజీవ్ గాంధీ హత్య ఓటర్ల భావోద్వేగాలను ప్రభావితం చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే విజయం సాధించింది.1996లో అన్నాడీఎంకేపై భారీగా ప్రజా వ్యతిరేకత, రాజకీయ కూటములు డీఎంకేకు స్పష్టమైన విజయం ఇచ్చాయి.2001–2011 మధ్యకూటమి రీతులు, అవినీతి ఆరోపణలు, నాయకత్వ సంక్షోభాలు ఎన్నికల తీర్పులను ప్రభావితం చేశాయి. 2016–2021 2016 ఎన్నికల్లో చిన్న పార్టీల ఓట్ల షేర్, తేడా తక్కువగా ఉండటం ఫలితంపై ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచింది.2021లో జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాజకీయ పరిస్థితి మారి డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది.ఎన్నికల ఫలితాలను నిర్ణయించిన ప్రధాన అంశాలు1. ప్రజా వ్యతిరేకత: అధికార పక్షంపై అసంతృప్తి ఫలితాలను మార్చేస్తుంది.2. నాయకుల ప్రజాకర్షణ: ప్రజాదరణ ఉన్న నాయకులు ఎన్నికలను ప్రభావితం చేస్తారు.3. కూటమి బలం: ఎవరు ఎవరితో కలుస్తారన్నది తుది ఫలితంపై ప్రభావం చూపుతుంది.4. చిన్న పార్టీలు: చిన్న పార్టీల ఓట్లు ప్రధాన పార్టీలకు నష్టం లేదా లాభం కలిగిస్తాయి.5. చారిత్రక సంఘటనలు: ఆర్థిక పరిస్థితులు, పెద్ద సంఘటనలు ఓటర్ల అభిప్రాయాన్ని మార్చుతాయి. -
భార్యకు యూజ్డ్ కార్ స్పెషల్ గిప్ట్ ఇచ్చిన దర్శకుడు, ధర?
ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్ తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారుకబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE) ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.ఫీచర్లుఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్తో ఇది లభ్యం. 8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్ప్లేలాంటి ఫీచర్లతో ఈ కారు ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్ హ్యాండ్లింగ్తో ఎలక్ట్రిక్ వెర్షన్లో మినీ కూపర్ కార్ మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.ధర ఎంత?భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా. కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు. డైరెక్టర్గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్జాన్' పాపులర్ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు. -
గ్యాస్ బుకింగ్ టైమ్లో మార్పు.. కేంద్రం క్లారిటీ
సోషల్ మీడియాలో ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయ పరిమితుల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ వినియోగదారుల ఆందోళనలను పటాపంచలు చేసింది.వైరల్ వార్తల్లో ఏముంది?గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, నాన్ పీఎంయూవై సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, అదే డబుల్ సిలిండర్ కనెక్షన్కు అయితే 35 రోజులు గ్యాప్ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది.కేంద్రం, ఐవోసీఎల్ వివరణఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. అటువంటి నిబంధనలేవీ తీసుకురాలేదని, పాత పద్ధతే కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. కనెక్షన్లతో సంబంధం లేకుండా ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వ్యవధి ఉండాలి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కూడా స్పందిస్తూ, దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. "తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో అనవసరంగా ముందస్తు బుకింగ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు." అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.Reports claiming changes in LPG refill booking timelines are incorrect. There is no change in the existing timelines (25 days in urban areas / 45 days in rural areas), and LPG supplies remain adequate across the country. Please rely only on official sources and avoid panic…— Indian Oil Corp Ltd (@IndianOilcl) March 25, 2026 -
30 రోజుల రీఛార్జ్ తప్పనిసరి!
మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.పార్లమెంటులో చర్చసాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ సదుపాయం ఉండాలి.మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).మంత్రి స్పందనటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.త్వరలో కీలక నిర్ణయం?పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్, ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలం
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో జరిగిన రూ. 590 కోట్ల భారీ కుంభకోణం మరువకముందేమరో బ్యాంకులో జరిగిన భారీ మోసం కలకలం రేపుతోంది. హర్యానాలో కొటక్ మహీంద్రా బ్యాంక్లో రూ. 160 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ (FD) కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయిహర్యానాలోని పంచకుల మునిసిపల్ కార్పొరేషన్, కొటక్ మహీంద్రా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ దాదాపు రూ. 160 కోట్లు. అయితే, ఎఫ్డీల్లో జమ చేసిన నధులు అసలు డిపాజిట్టే కాలేదు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ సొమ్మును ఇతర మోసపూరిత ఖాతాలకు మళ్లించారు. ఇందుకోసం హర్యానాకు చెందిన పంచకుల మున్సిపల్ కార్పొరేషన్కు నకిలీ పత్రాలను జారీ చేశారని అధికారులు గుర్తించారు. ఈ భారీ మోసంలో బ్యాంక్ ఉద్యోగులతో పాటు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రమేయం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.వెలుగులోకి ఎలా వచ్చింది?రూ. 58 కోట్ల విలువైన ఒక FD గడువు ముగిసిన తర్వాత, ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయాలని కార్పొరేషన్ బ్యాంకును కోరినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు స్టేట్మెంట్ ప్రకారం బదిలీ పూర్తయినట్లు చూపించినప్పటికీ, ఆ నిధులు కార్పొరేషన్ ఖాతాకు చేరలేదు. ఆరా తీస్తే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా నకిలీదేనని నిర్ధారణ అయ్యింది.డబ్బు మాయమైపోయిందని తేలింది. ఈ వ్యవహారంలో బ్యాంకు జారీ చేసిన FDలన్నీ నకిలీవని, ఖాతాలో అసలు నిధులే లేవని గుర్తించారు. నకిలీ పత్రాలను ఉపయోగించి బ్యాంకు ఉద్యోగులు చాలాకాలం పాటు ఈ నిధుల దుర్వినియోగాన్ని దాచిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.తమ ఎఫ్డీ నిధులను బదిలీ చేయమని బ్యాంకును కోరినప్పుడే ఈ వ్యవహారం బైటపడిందని, పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఇదే విషయాన్ని స్టేట్ విజిలెన్స్కు నివేదించారు. బ్యాంక్పై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయడంతో పాటు, ఆ బ్యాంక్ను ప్రభుత్వ పనుల నుండి తొలగించాలని (de-empanel) హర్యానా ప్రభుత్వాన్ని కోరారు. అటు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.కాగా గత నెలలోనే చండీగఢ్లోని ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) శాఖలో హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 590 కోట్ల నిధులు ఇలాగే మాయమయ్యాయి. ఆ కేసులో బ్యాంక్ ఇప్పటికే పూర్తి సొమ్మును ప్రభుత్వానికి తిరిగి చెల్లించింది. ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంక్లో కూడా ఇలాంటిదే జరగడం కలకలం రేపుతోంది -
West Bengal: కబీర్కి ఒవైసీ ‘పెద్దన్న’.. పొత్తు ఖరారు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు- 2026 సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో కలిసి నడవాలని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒవైసీని తన ‘పెద్దన్న’ (బడా భాయ్)గా అభివర్ణించిన హుమాయున్ కబీర్.. రాబోయే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.ఒవైసీ అడుగుజాడల్లోనే..తమ కూటమి వివరాలను వెల్లడిస్తూ 182 నుండి 192 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు కబీర్ తెలిపారు. ‘నా పెద్దన్న అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ గడ్డపైకి వచ్చారు. ఏజేయూపీ, ఏఐఎంఐఎం కలిసి ఈ ఎన్నికల యుద్ధంలో తలపడతాయి. ఆయనను నా సొంత అన్నలా భావిస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కనీసం 20 భారీ ర్యాలీల్లో నాతో కలిసి పాల్గొంటారు’ అని అన్నారు. ఏప్రిల్ 1న బెహ్రంపూర్లో లక్షలాది మందితో నిర్వహించే తొలి సభకు ఒవైసీ స్వయంగా హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. Kolkata | Founder of Janata Unnayan Party, Humayun Kabir and AIMIM President Asaduddin Owaisi hold a joint press conference after they announced an alliance between their parties for the West Bengal electionsHumayun Kabir says," We will hold 20 rallies all over the state. The… pic.twitter.com/GOrROLs1cZ— ANI (@ANI) March 25, 2026ఎప్పటికీ విడిపోని బంధంఈ పొత్తు కేవలం 2026 ఎన్నికల కోసమే కాదని, రాజకీయాల్లో తాను ఉన్నంత కాలం ఒవైసీతోనే తన ప్రయాణం కొనసాగుతుందని కబీర్ ఉద్ఘాటించారు. ‘నా అన్న ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దిశగా నడిపించినా తూచా తప్పకుండా పాటిస్తాను. ఈ కూటమి ఎప్పటికీ విడిపోదు’ అంటూ తన నిబద్ధతను చాటుకున్నారు. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర బెంగాల్, కోల్కతా తదితర ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ కూటమి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.ప్రతిపక్షాల ఫైర్మరోవైపు ఈ పొత్తుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒవైసీ, హుమాయున్ కబీర్ కలవడం వల్ల సెక్యులర్ ఓట్లు చీలిపోయి, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుతుందని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. ఈ కూటమి వల్ల ముస్లిం ఓటర్లు ఏకాకి అవుతారని, అయితే జనం వీరిని నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. కాగా రాష్ట్రంలో ముస్లిం ఉప ముఖ్యమంత్రి వస్తారని కబీర్ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. -
Assam: ఎగసిపడిన కెరటం.. అస్సాం గణ పరిషత్!
అస్సాం రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం అస్సాం గణ పరిషత్ (ఏజీపీ). ఒకప్పుడు అస్సాం అంటే ఏజీపీ అనే స్థాయి నుండి ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితికి చేరుకుంది. ఆ పార్టీ ప్రస్థానం ఎన్నో ప్రాంతీయ పార్టీలకు పాఠాలు నేర్పుతుంది. అస్సాం గణ పరిషత్ సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఇది ఒక సుదీర్ఘ పోరాటం నుంచి పుట్టిన పార్టీ. 1979 నుంచి 1985 వరకు అస్సాంలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ఉద్యమం దీనికి పునాది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటం ఫలితంగా అస్సాం ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే విద్యార్థి నేతలు ప్రఫుల్ల కుమార్ మహంత నాయకత్వంలో ఏజీపీని స్థాపించారు. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. కేవలం 32 ఏళ్ల వయసులోనే ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రి కావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఉద్యమ ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ఏజీపీ ప్రజల ఆశలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా ఏ అక్రమ వలసల అంశంపై అయితే పార్టీ పుట్టిందో ఆ సమస్యను పరిష్కరించడంలో పాలకులు చొరవ చూపలేకపోయారు. దీనికి తోడు పార్టీ అంతర్గత కుమ్ములాటలు అవినీతి ఆరోపణలు పాలనా వైఫల్యాలు పార్టీని బలహీనపరిచాయి. నేతల మధ్య పెరిగిన ఆధిపత్య పోరు కారణంగా కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన నేతలు క్రమంగా పదవుల కోసం పాకులాడటం ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది.దెబ్బతీసిన స్నేహం..ఏజీపీ పతనానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలతో అది చేసిన స్నేహమనే చెప్పొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ ప్రాంతీయ పార్టీ కాలక్రమేణా తన ప్రత్యేకతను కోల్పోయింది. అస్సాంలో బీజేపీ బలోపేతం కావడం ఏజీపీకి శాపంగా మారింది. బీజేపీ జాతీయవాదం ముందు ఏజీపీ ప్రాంతీయ వాదం వెలవెలబోయింది. చివరకు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి రావడం ఆ పార్టీకి మరింత నష్టాన్ని మిగిల్చింది. పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక అంశాల్లో ఏజీపీ ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్ల తన సంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది.ఏజీపీలో మొదటి నుండి సామూహిక నాయకత్వం కొరవడింది. ప్రఫుల్ల కుమార్ మహంత వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టడం పార్టీలో చీలికలకు దారితీసింది. సరైన రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడింది. సమర్థులైన నాయకులు చాలా మంది బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. పార్టీ కేడర్ సైతం తమ భవిష్యత్తు కోసం జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపారు. నేడు ఏజీపీ కేవలం ఒక జూనియర్ భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయింది. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే శక్తిని ఆ పార్టీ కోల్పోయింది. ఏజీపీ పతనం ఒక హెచ్చరిక..ఏజీపీ పతనం దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక హెచ్చరిక. కేవలం భావోద్వేగపూరిత ఉద్యమాలతో అధికారంలోకి రావడం సులభమే కానీ ఆ భావజాలాన్ని పాలనలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టమని ఈ పార్టీ నిరూపించింది. సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యం అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని ఏజీపీ చరిత్ర చెబుతోంది. అస్సాం ప్రజలు ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వం కోసం సరికొత్త వేదికలను వెతుక్కుంటున్నారు. ఏజీపీ మాత్రం తన గత వైభవం వైపు దీనంగా చూస్తోంది. ప్రస్తుతం అస్సాం అసెంబ్లీలో ఏజీపీ సంఖ్య నామమాత్రంగా మారింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్థాయిని కూడా ఆ పార్టీ కోల్పోయింది. బీజేపీ వేవ్ లో తనను తాను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు ఆ పార్టీ దయనీయ స్థితిని సూచిస్తున్నాయి. మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ మూలాల్లోకి వెళ్లి ఉద్యమ స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంగానే కనిపిస్తోంది. -
Tamil Nadu: ఏఐఏడీఎంకే తొలి జాబితా.. ‘ఎడ్పాడి’ పళనిస్వామిదే!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా, ఎన్డీఏ కూటమి సారథిగా ఉన్న ఏఐఏడీఎంకే తమ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. బుధవారం 23 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసి, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో పైచేయి సాధించే వ్యూహాన్ని పళనిస్వామి అమలు చేస్తున్నారు.సొంత గడ్డపైనే పోటీపార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి (ఈపీఎస్) తన సొంత నియోజకవర్గమైన సేలం జిల్లాలోని ‘ఎడ్పాడి’ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. తన కంచుకోటను కాపాడుకుంటూనే, రాష్ట్రవ్యాప్తంగా కూటమిని విజయపథంలో నడిపించే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు.సీనియర్లకే పెద్దపీటతొలి జాబితాలో పార్టీలోని హేమాహేమీలకు ఏఐఏడీఎంకే పెద్దపీట వేసింది. సీనియర్ నాయకులు కేపీ మునుసామి, దిండిగల్ సి. శ్రీనివాసన్, నథమ్ ఆర్. విశ్వనాథన్ వంటి కీలక నేతలు తమ పాత స్థానాల నుంచే పోటీ చేయనున్నారు. ముఖ్యంగా పశ్చిమ తమిళనాడుపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో బలమైన నేతలుగా పేరున్న ఎస్పీ వేలుమణి (తోండముత్తూరు), పి. తంగమణి (కుమారపాళయం) నియోజకవర్గాల నుంచి బరిలో నిలవనున్నారు.రేసులో ముందంజరాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాల్లో అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించిన తొలి పార్టీగా ఏఐఏడీఎంకే నిలిచింది. ఇప్పటికే సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిళర్ కట్చి' (ఎన్టీకే) అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, ప్రధాన కూటముల్లో మాత్రం ఏఐఏడీఎంకేనే అందరికంటే ముందుగా అడుగు వేసింది. కేవలం 23 స్థానాలకే ప్రస్తుతం జాబితా పరిమితమైనా, కీలక నేతలందరినీ ముందే రంగంలోకి దించడం ద్వారా కేడర్లో ఉత్సాహం నింపాలని పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏఐఏడీఎంకే, ఈ తొలి జాబితా ద్వారా తన ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்றக் கழக முதற்கட்ட வேட்பாளர்கள் பட்டியல்.- மாண்புமிகு கழகப் பொதுச்செயலாளர் புரட்சித் தமிழர் @EPSTamilNadu அவர்கள் அறிவிப்பு. #EPSfor2026#Vote4AIADMK pic.twitter.com/HVvrcUtDpt— AIADMK - SayYesToWomenSafety&AIADMK (@AIADMKOfficial) March 25, 2026 -
లాటరీ కింగ్ కొడుకు.. పుదుచ్చేరిలో కోట్లకు పడగలెత్తాడు
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న లక్ష్య జన నాయగ కట్చి పార్టీ అధ్యక్షుడు జోస్ చార్లెస్ మార్టిన్ తన ఆస్తి రూ.537 కోట్లుగా ప్రకటించారు. కామరాజర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల సంఘానికి అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. జోస్ చార్లెస్ మార్టిన్ వద్ద రూ.25.67 కోట్ల విలువైన 17.5 కిలోల బంగారం, రూ.44 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. ఆయన పేరిట రూ.328 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రూ.1.29 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయి. రూ.1.77 కోట్ల విలువైన వాచ్, రూ.38.53 కోట్ల విలువైన ముత్యాల హారాలు కూడా ఉన్నాయి. లండన్లో రూ. 5.64 కోట్లు, దుబాయ్లో రూ.1.50 కోట్లు విలువైన నివాసాలున్నాయని పేర్కొన్నారు. అరుణాచల్ప్రదేశ్, గోవా, నాగాలాండ్, పంజాబ్లో లాటరీ అమ్మకాలలో 4.53 శాతం వాటా, బెంగాల్లో 3 లాటరీ కేసులు, ఎర్నాకుళంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో 3 కేసులున్నాయని తన అఫిడవిట్లో వివరించారు. షేర్లలో రూ.14.28 కోట్లు, వివిధ బ్యాంకుల్లో రూ.200 కోట్లు డిపాజిట్లు ఉన్నట్టు వివరించారు. అలాగే, రూ. 210 కోట్లు అప్పులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం తన ఆస్తి రూ.537 కోట్లుగా లెక్క చూపించారు. చార్లెస్ లాటరీ అధినేత మార్టిన్ కుమారుడు కావడం గమనార్హం. -
కొండచరియల బీభత్సం.. వందల మంది పర్యాటకులు విలవిల
గ్యాంగ్టక్: సిక్కింలో కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను బెంబేలెత్తిస్తున్నాయి. ఉత్తర సిక్కింలోని చుంగ్థాంగ్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో సుమారు 200 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.మంగన్ జిల్లా కలెక్టర్ అనంత్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. కీలక చుంగ్థాంగ్-లాచెన్ మార్గంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో లాచెన్కు వెళుతున్న పర్యాటకులు మార్గం మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. చిక్కుకుపోయిన పర్యాటకులకు చుంగ్థాంగ్లోని ఐటిబిపి (ఐటీబీపీ) క్యాంప్, స్థానిక గురుద్వారాలో ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ)రంగంలోకి దిగి, రహదారిని క్లియర్ చేసే పనులను వేగవంతం చేసింది. అయితే వాతావరణం ఇంకా అనుకూలించకపోవడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రహదారులు ప్రయాణానికి సురక్షితమని నిర్ధారించిన తర్వాతే పర్యాటకులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.ఈ పరిస్థితుల్లో కొంతమంది పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకుని వెనుదిరుగుతున్నారు. మరోవైపు మంగళవారం రాత్రి మూసుకుపోయిన లాచుంగ్ మార్గాన్ని అధికారులు బుధవారం ఉదయం పునరుద్ధరించారు. అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా గాంగ్టక్కు తరలించారు. గత ఏడాది సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లాచెన్ మార్గం, మరమ్మతుల తర్వాత ఈ ఏడాది మార్చి 9నే తిరిగి ప్రారంభమైంది. ఇంతలోనే మళ్లీ ప్రకృతి విపత్తు సంభవించడం పర్యాటక రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.అటు తూర్పు సిక్కింలో కూడా భారీగా మంచు కురుస్తుండటంతో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలైన చోమ్గో సరస్సు, నాథులా పాస్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. సమీపంలోని డార్జిలింగ్లో కూడా వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి 10 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పర్యాటకులు వాతావరణ హెచ్చరికలను గమనించి, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: బర్డ్ ఫ్లూ కలకలం.. 4,400 కోళ్లు మృతి.. హై అలర్ట్ -
‘మామిడి’ వివాదం
సాక్షి, చైన్నె: పార్టీ పేరు, జెండా, మామిడి పండు గుర్తుపై హక్కుల కోసం పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుచైన్నె సివిల్ కోర్టును మంగళవారం ఆశ్రయించారు. ఈ వివాదంపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీలో చీలిక వచ్చినప్పుడు గుర్తును కేటాయించే విష యంలో ఎన్నికల సంఘం తీరును కోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై తక్షణమే చైన్నె సివిల్ కోర్టును ఆశ్రయించాలని రాందాసును ఆదేశించింది. సివిల్ కోర్టు పిటిషన్ను స్వీకరించిన మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.నేడు విచారణ..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాందాసు తరపు న్యాయవాదులు చైన్నె సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎం. ధర్మప్రభు ముందు అప్పీల్ చేశారు. రాందాసు తరపున దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం విచారించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అలాగే ఈ పిటిషన్ కాపిని అన్బుమణి వర్గానికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. కాగా తమ విషయంలో ఎన్నికల సంఘం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదని రాందాసు మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.వివాద నేపథ్యంపీఎంకే పార్టీపై ఆధిపత్యం కోసం తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ’మామిడి పండు’ గుర్తును అన్బుమణి వర్గానికి కేటాయించింది. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు గుర్తును స్తంభింపజేయాలి లేదా లాటరీ పద్ధతిలో కేటాయించాలే గానీ, ఏక పక్షంగా అన్బుమణికి ఇవ్వడం సరైన పద్ధతి కాదంటూ రాందాసు కోర్టు తలుపు తట్టారు. -
బర్డ్ ఫ్లూ కలకలం.. 4,400 కోళ్లు మృతి.. హై అలర్ట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) కలకలం సృష్టిస్తోంది. స్థానిక ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో కేవలం ఐదు రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.బిలాస్పూర్లోని కోని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పౌల్ట్రీ ఫారంలో మార్చి 19 నుండి 24 మధ్య సుమారు 4,400 కోళ్లు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాయి. మొత్తం 5,037 కోళ్లు ఉన్న ఈ కేంద్రంలో ఒక్కసారిగా అధిక సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను భోపాల్, పూణేలోని ప్రయోగశాలలకు పంపగా, భోపాల్ ల్యాబ్ నివేదికలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఉన్నట్లు ధృవీకరించారు.రెడ్ జోన్గా ఒక కిలోమీటర్ పరిధివైరస్ నిర్ధారణ కావడంతో జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తక్షణమే నివారణ చర్యలకు అధికారులను ఆదేశించారు. ఫారం చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిని 'ఇన్ఫెక్టెడ్ జోన్' (వ్యాధి ప్రభావిత ప్రాంతం)గా, పది కిలోమీటర్ల పరిధిని 'సర్వైలెన్స్ జోన్' (పర్యవేక్షణ ప్రాంతం)గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం, ఇన్ఫెక్టెడ్ జోన్లోని కోళ్లు, గుడ్లు, మేతను పూర్తిగా నాశనం చేయనున్నారు. ఈ ప్రాంతంలో పక్షుల రవాణాను పూర్తిగా నిషేధించారు. నష్టపోయిన పౌల్ట్రీ యజమానులకు పశుసంవర్థక శాఖ ద్వారా పరిహారం అందజేస్తామని వెల్లడించారు.మనుషులకు ముప్పు పొంచి ఉందా?పరిస్థితిని పర్యవేక్షించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను రంగంలోకి దించారు. పౌల్ట్రీ ఫారంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే పరీక్షలు నిర్వహించి, యాంటీ వైరల్ మందులు అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఇప్పటివరకు మనుషులకు ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ విక్రయ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారులకు సహకరించాలని జిల్లా మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: కమల్ మరో సంచలనం.. స్టాలిన్కు మద్దతుగా.. -
కమల్ మరో సంచలనం.. స్టాలిన్కు మద్దతుగా..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అభ్యర్థులకు బేషరతు మద్దతు ప్రకటించాలని కమల్ నిర్ణయించుకున్నారు.అందుకే ఈ నిర్ణయండీఎంకేతో జరిగిన సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాకపోవడమే కమల్ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డీఎంకేకు చెందిన ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై పోటీ చేయాలన్న ప్రతిపాదనను కమల్ హాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ అస్తిత్వమైన ‘టార్చ్ లైట్’ గుర్తును కాపాడుకోవడం, కార్యకర్తల మనోభావాలను గౌరవించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘రాజకీయాలనేవి ఒక నిరంతర ప్రయాణం. ఎన్నికల ఫలితాలు ఒక భాగం మాత్రమే, అవే అంతిమ లక్ష్యం కాదు’ అని కమల్ వ్యాఖ్యానించారు.స్టాలిన్ కృతజ్ఞతలు.. ప్రచారానికి ఆహ్వానంకమల్ హాసన్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మనస్ఫూర్తిగా స్వాగతించారు. రాష్ట్ర సంక్షేమం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, కమల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. ‘ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు రావడం లేదు. ఈ నిర్ణయం నన్ను ఎంతగానో కదిలించింది’ అని స్టాలిన్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఆయన కమల్ను కోరారు.ద్రవిడ మోడల్ 2.0 లక్ష్యంగా..తమ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడాన్ని త్యాగంగా భావించడం లేదని, అదొక బాధ్యతని కమల్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రగతికి ‘ద్రవిడ మోడల్ 2.0’ ప్రభుత్వం అవసరమని, అందుకే డీఎంకే కూటమికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి, రాజ్యసభలో తమ గళాన్ని వినిపించామని ఆయన గుర్తు చేశారు. కాగా ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నా, డీఎంకే కూటమి విజయానికి కీలకంగా మారడం ద్వారా కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో సరికొత్త వ్యూహానికి తెరలేపారు. ఈ నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదో వేచి చూడాల్సిందే! இது தியாகம் அல்ல; கடமை. சுய நலம் அல்ல; பொறுமை.@mkstalin @Udhaystalin @maiamofficial pic.twitter.com/V19889YYlg— Kamal Haasan (@ikamalhaasan) March 24, 2026 -
మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
దశాబ్దాల కాలం నాటి ‘ఆదాయపు పన్ను చట్టం 1961’ మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. దీని స్థానంలో ఆధునికమైన, పారదర్శకమైన ‘ఆదాయపు పన్ను చట్టం 2025’, ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ మార్పులు అమలు కానున్న నేపథ్యంలో వేతన జీవులు తమ పన్ను ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.కొత్త చట్టం వస్తోంది కదా అని ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పాత, కొత్త చట్టాల మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసింది.2025-26 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు మీరు సంపాదించిన ఆదాయంపై పాత చట్టం (1961) ప్రకారమే పన్ను విధిస్తారు. దీనికి సంబంధించిన రిటర్నులను 2026 జూలైలో సమర్పించాల్సి ఉంటుంది.2026-27 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2026 తర్వాత సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వర్తిస్తుంది.ఆటోమేటెడ్ రిటర్న్స్: తప్పులకు తావులేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం, భవిష్యత్తులో పన్ను చెల్లింపు ప్రక్రియ పూర్తిగా డిజిటల్, ఆటోమేటెడ్ కానుంది.ఇకపై మీ జీతం, బ్యాంక్ వడ్డీలు, షేర్ల లావాదేవీల వివరాలను మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. కంపెనీలు, బ్యాంకుల నుంచి డేటా నేరుగా సిస్టమ్లోకి వస్తుంది.సిస్టమ్ ఆటోమేటిక్గా వివరాలను సేకరించినప్పటికీ ఆ సమాచారం సరైనదేనని ధ్రువీకరించే బాధ్యత పన్ను చెల్లింపుదారుడిదే.ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫారం-16, ఫారం-26AS స్థానంలో మరింత పారదర్శకమైన కొత్త డాక్యుమెంట్ ఫార్మాట్లు రానున్నాయి.హెచ్ఆర్ఏ, అలవెన్సులపై నిఘాపన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే విషయంలో కొత్త నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) విషయంలో యజమాని వివరాలు, పాన్ కార్డు, సంబంధిత పత్రాలను సమర్పించడం తప్పనిసరి కానుంది.సీటీసీలో మార్పులుకొత్త చట్టం ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక వేతనం(బేసిక్ పే) అతని మొత్తం సీటీసీలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఫలితంగా చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ దీర్ఘకాలిక పొదుపు, పదవీ విరమణ ప్రయోజనాలు మెరుగుపడతాయి.కొత్త వ్యవస్థ పన్ను ఎగవేతను అరికట్టడమే కాకుండా నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే, ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్ వల్ల చిన్న తప్పు జరిగినా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, 2026 ఏప్రిల్ నుంచి ప్రతి పైసా ఖర్చుకు, ప్రతి మినహాయింపునకు సరైన రికార్డులు కలిగి ఉండటం ముఖ్యం.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
సీఎం హిమంత పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
గువాహటి: బీజేపీ పాలిత అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బరిలో నిలిచిన జలూక్బారీలో కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియాంగ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. అయితే తిరస్కరణకు కారణాలను ఈసీ తన వెబ్సైట్లో ప్రస్తావించలేదు. మరోవైపు హాఫ్లాంగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ లాంగ్థాసా నామినేషన్ తిరస్కరణకు గురైంది.అయితే అదే స్థానంలో పోటీకి నిలిచిన మరో కాంగ్రెస్ నాయకురాలు నందితా గార్లోసా నామినేషన్ను ఈసీ ఆమోదించింది. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆదివారమే ఆమె కాంగ్రెస్లో చేరి వెంటనే నామినేషన్ వేశారు. ధకౌఖానాలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద నరాహ్ నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. 126 స్థానాలున్న శాసనసభ ఎన్నికల కోసం 815 మంది అభ్యర్థుల నుంచి 1,389 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. పలువురు ఒకటి కంటే ఎక్కువ సెట్ల పేపర్లను సమర్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటిదాకా గడువు ఉంది. -
సోనియా గాంధీకి అస్వస్థత.. రాహుల్ పర్యటన రద్దు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని, వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.మరోసారి శ్వాసకోశ సమస్యలు?సోనియా గాంధీ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత జనవరిలో కూడా ఆమె ఇదే ఆస్పత్రిలో చేరారు. అప్పట్లో ఢిల్లీలో పెరిగిన కాలుష్యం, తీవ్రమైన చలి కారణంగా ఆమెకు ‘బ్రోన్చియల్ ఆస్తమా’ సమస్య తీవ్రమైందని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో ఆమెకు యాంటీబయోటిక్స్తో కూడిన చికిత్స అందించగా, పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు.తాజాగా మరోసారి ఆమె ఆస్పత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇది కేవలం రెగ్యులర్ చెకప్ లేదా ముందుజాగ్రత్త చర్యగా భాగంగానే జరిగిందా? లేక సమస్య మళ్లీ తీవ్రమైందా? అనే విషయంపై ఆస్పత్రి వర్గాల నుండి పూర్తిస్థాయి మెడికల్ బులెటిన్ వెలువడాల్సి ఉంది.వైద్యుల పర్యవేక్షణలో..సర్ గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు సమాచారం. 79 ఏళ్ల సోనియా గాంధీ గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, వయసు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆమె ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు.రాహుల్ కేరళ పర్యటన రద్దుకాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. తన తల్లి, కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మేరకు పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రాహుల్ తన కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.రాహుల్ స్థానంలో మల్లికార్జున ఖర్గే..కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కోజికోడ్లో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుల్ తన ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఏప్రిల్ 9న కేరళలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సభ అత్యంత కీలకంగా భావించారు. రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతో, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోజికోడ్ పర్యటనకు బయలుదేరారు. రాహుల్కు బదులుగా ఖర్గే ఈ ఎన్నికల ర్యాలీలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
తెల్లారుతూనే భీతావహం.. ‘డబుల్ డెక్కర్’ బోల్తా పడి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లారుతూనే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్లోని జైపూర్ నుండి 25 మంది ప్రయాణికులతో వస్తున్న ఒక ప్రైవేట్ డబుల్ డెక్కర్ బస్సు.. ఢిల్లీలోని జెండే వాలన్ ఆలయానికి సమీపంలో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జయింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రెస్క్యూ బృందాలు అతికష్టం మీద బయటకు తీసుకువచ్చాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సర్ గంగా రామ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్)ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్ని వారాల క్రితమే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ వద్ద యమునా ఎక్స్ప్రెస్వేపై డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.ఇది కూడా చదవండి: తమిళ పీఠం: ‘2021’ సీన్ రిపీట్ ? షాకిస్తున్న సీక్రెట్ సర్వే? -
సిద్ధంగా ఉండాల్సింది ప్రజలా? ప్రభుత్వమా?
సాక్షి, చెన్నై: పశ్చిమ ఆసియాలో (ఇరాన్–ఇజ్రాయిల్ –అమెరికా మధ్య) నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పేముందు.. వారిని రక్షించడానికి ముందుగా తమరు సిద్ధంగా ఉన్నారా? ’అని పీఎంను ప్రశ్నించారు. సిద్ధమవ్వడం అంటే బాధ్యతను విస్మరించడమేనా? తన ఎక్స్పేజీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు: “సన్నద్ధతను ప్రజలకు వదిలివేయలేమని, మనం దేనికి సిద్ధపడాలి? నాయకత్వం వహించడానికా లేక నాయకత్వం లేని లోటును భరించడానికా? అని ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా ప్రజలనే సిద్ధంగా ఉండమన్నారని, ఇప్పుడు యుద్ధ ప్రభావాల విషయంలో కూడా అదే మాట అనడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయాల కోసం వేచి చూడకుండా, తమిళనాడు ప్రభుత్వం మార్చి 14నే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని స్టాలిన్ గుర్తు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్లను వాడితే, అదనపు విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ప్రకటించామని గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు ఎలక్ట్రిక్ హీటర్లు, స్టవ్లు కొనుగోలు చేయడానికి వడ్డీతో కూడిన సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడే ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి కొత్తగా అనుమతులు అవసరం లేదని మినహాయింపు ఇచ్చామన్నారు. కూరగాయలు, పండ్లు పండించే రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 19 లక్షల మంది తమిళులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ ప్లాంట్లకు ఇంధన సరఫరాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
తమిళ పీఠం: ‘2021’ సీన్ రిపీట్? షాకిస్తున్న సీక్రెట్ సర్వే?
ద్రవిడ గడ్డపై సంచలన రాజకీయాలకు తెరలేచింది. 2026 ఏప్రిల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల, నేతల వ్యూహ ప్రతివ్యూహాలు మరింత పదునెక్కాయి. కుల సమీకరణలు, సంక్షేమ పథకాల హామీలు, పొత్తుల లెక్కలతో చెన్నైలోని వార్ రూమ్లు హోరెత్తిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి తమిళనాట గతంలో ఎన్నడూ లేని విధంగా ‘చతుర్ముఖ పోటీ’ నెలకొంది. అధికార డీఎంకే (డీఎంకే) కూటమి, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (ఏఐడీఎంకే) కూటమిలతో పాటు, స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే), సీమాన్ సారథ్యంలోని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్టీకే)లు ఎన్నికల బరిలోకి దిగాయి. 2026 తమిళనాడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనేది అంచనా వేయాలంటే, 2021 నాటి ఓటర్ల నాడిని విశ్లేషించడం అవసరం. ఈ నేపధ్యంలోనే ‘లోకనీతి-సిఎస్డీఎస్’ నిర్వహించిన సర్వే గణాంకాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.2021 తీర్పు: గణాంకాలు ఏం చెబుతున్నాయి?పదేళ్ల ఏఐఏడీఎంకే పాలనకు స్వస్తి పలికి.. ఎంకే స్టాలిన్ను ముఖ్యమంత్రిని చేసిన 2021 ఎన్నికల్లో ప్రధానంగా ద్విముఖ పోరు సాగింది. ఆ ఎన్నికల్లో డీఎంకే 39.1 శాతం ఓట్లను సాధించగా, ఏఐఏడీఎంకే 34.1 శాతంతో సరిపెట్టుకుంది. కూటముల పరంగా చూస్తే డీఎంకే కూటమికి 45.4 శాతం, ఏఐఏడీఎంకే కూటమికి 39.7 శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచిన సంఖ్య 6.6 శాతం. ఇది సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే (ఎన్టీకే) సాధించిన ఓట్ల శాతం. ఇక కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్ఎం)2.6 శాతం, టీటీవీ దినకరన్ ‘ఏఎంఎంకే’ 2.5 శాతంతో తమ ఉనికి చాటుకున్నాయి.వారసత్వ పోరులో ‘స్టాలిన్’ టాప్నాడు జయలలిత, కరుణానిధి లేని తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో వారసత్వంపై ఓటర్లు స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 78.2 శాతం మంది ఓటర్లు కరుణానిధి అసలైన వారసుడు స్టాలినే అని తేల్చిచెప్పారు. అటు ఏఐఏడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి 47.4 శాతం మంది మద్దతు లభించగా, ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) కేవలం 8.9 శాతానికే పరిమితమయ్యారు. ఇటీవలే ఓపీఎస్ తన కుమారుడితో పాటు డీఎంకేలో చేరడం ఆసక్తికరంగా మారింది.డబుల్ ఇంజిన్ సర్కార్పై వ్యతిరేకత?హిందీ బెల్ట్ రాజకీయాలకు భిన్నంగా తమిళనాడు తన ప్రత్యేకతను చాటుకుంటూవస్తోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై తమిళ ఓటర్లు 2021లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 51.9 శాతం మంది కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయగా, 47.5 శాతం మంది కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉండాలి అనే (డబుల్ ఇంజిన్) వాదనను తిరస్కరించారు. బీజేపీ ఎదుగుదల రాష్ట్ర సామాజిక ఐక్యతకు కీడు అని 40.3 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం.సంక్షేమం వెర్సస్ అవినీతిగత ఏఐఏడీఎంకే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, విద్యుత్, తాగునీరు తదితర రంగాల్లో మంచి మార్కులే సాధించినప్పటికీ (53.5 శాతం సంతృప్తి), అవినీతి ఆ పార్టీ కొంపముంచింది. 67.3 శాతం మంది ప్రజలు ఏఐఏడీఎంకే పాలనలో అవినీతి పెరిగిందని భావించారు. మరోవైపు తమిళనాడు సంక్షేమ పథకాలు (ఉచిత పాలు, సైకిళ్లు, అమ్మ క్యాంటీన్లు) ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వీటిలో 70 నుంచి 85 శాతం మంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ ఇచ్చారు.2026 పొత్తుల చదరంగంప్రస్తుతం డీఎంకే తన మిత్రపక్షాలైన కాంగ్రెస్ (28 సీట్లు), సీపీఐ (5), ఎండీఎంకే (4) వంటి పార్టీలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న ఏఐఏడీఎంకే, బీజేపీలు తిరిగి ఒక్కటయ్యాయి. కానీ పార్టీల చీలికలు ఈ కూటమిని వేధిస్తున్నాయి. ఈ గ్యాప్లో నటుడు విజయ్ తన ‘టీవీకే’ పార్టీతో చక్రం తిప్పాలని చూస్తున్నారు. డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా ఆయన ఒంటరిగా 234 స్థానాల్లో పోటీకి దిగారు.నిర్ణయాత్మక శక్తి ఎవరు?తమిళ ఓటరు చాలా తెలివైనవాడు. 23 శాతం మంది ఓటర్లు పోలింగ్ రోజే ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకుంటారనే మాట వినిపిస్తుంది. కులం, మతం కంటే పార్టీ గుర్తుకే (53.3%) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సారి ఎన్నికల్లో ‘జెన్ జెడ్’ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఈ నేపధ్యంలో స్టాలిన్ తన కోటను కాపాడుకుంటారా? ఎడప్పాడి తిరిగి పుంజుకుంటారా? లేక విజయ్ ‘తమిళగ వెట్రి’ గెలుపు సాధిస్తారా? అనే ప్రశ్నలకు మే నెలలో వెలువడే ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి. ఇది కూడా చదవండి: పండుగలకు వంటగ్యాస్ సిలిండర్ ఉచితం -
ఉత్తరాన గట్టిపోరు.. 54 స్థానాలు కీలకం
పశ్చిమబెంగాల్లో ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నడుమ సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు అచ్చం దంగల్ కుస్తీ పోటీలను తలదన్నుతోంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పారీ్టలు కావడంతో ఈ ఎన్నికలను రెండు పక్షాలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ బరిలో ఇప్పటికే విజయాల హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది.రాష్ట్రంలో కొన్నేళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వస్తున్న కాషాయ దళం ఈసారి టీఎంసీని ఎలాగైనా ఓడించి తొలిసారి అధికారాన్ని ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. ఆ క్రమంలో కీలకమైన ఉత్తర బెంగాల్ ప్రాంతంపై 2 పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. తనకిప్పటికే పట్టున్న ఈ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ తలమునకలుగా ఉంది. పలు ప్రాంతీయ హామీలతో ఉత్తర బెంగాల్వాసులను ఆకట్టుకునేందుకు, ఆదరణ పెంచుకునేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోంది.నువ్వా, నేనా! బీజేపీ, టీఎంసీ ఎన్నికల పోరుకు ఉత్తర బెంగాల్ ప్రాంతం కీలకంగా మారింది. ఇక్కడ 54 అసెంబ్లీ సీట్లపై రెండు పార్టీలూ గట్టిగా దృష్టి పెట్టాయి. ఒకప్పుడు కొరకరాని కొయ్యగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీలో కొన్నేళ్లుగా బలపడుతూ వస్తోంది. ఆ పట్టును ఈసారి మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా ఉత్తర బెంగాల్పై బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా దృష్టి పెట్టింది. ఈసారి ఇక్కడ కనీసం 40 అసెంబ్లీ స్థానాలకు పైగా గెలిపించే బాధ్యతలను పార్టీ బెంగాల్ ఇన్చార్జి సునీల్ బన్సర్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు అప్పగించింది. వారు ఇటీవలే ముఖ్య స్థానిక నేతలతో కీలక సమావేశం నిర్వహించి సమగ్ర ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. అందులో భాగంగా మూడంచెల ప్రచార పర్వానికి బీజేపీ తెర తీసింది. ఉత్తర బెంగాల్కు తృణమూల్కు అన్నివిధాలా ద్రోహం చేస్తోందంటూ హోరెత్తిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. ‘సరికొత్త ఉత్తర బెంగాల్’ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటింటి ప్రచారంతో దూకుడు పెంచుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఉత్తర బెంగాల్కు దీదీ కేవలం 0.002 శాతం నిధులు విదిలించారన్న బీజేపీ ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. బాగ్డోగ్రా విమానాశ్రయ విస్తరణలో భూమి కోల్పోనున్న రైతులు, కార్మిక సంస్కరణల పేరిట తేయాకు పనివారికి అన్యాయం తదితరాలను కూడా బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కూడా అప్రమత్తమైంది. ఉత్తర బెంగాల్లో అధిక సంఖ్యలో ఉండే తేయాకు కార్మికుల సంక్షేమానికి ఇప్పటికే పలు హామీలిచ్చింది. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తామని పేర్కొంది. రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూసుకునే బాధ్యత మమతదేనంటూ టీఎంసీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాలీ అస్తిత్వ నినాదాన్ని ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. ఎందుకు కీలకం.. ఉత్తర బెంగాల్ గిరిజనులు, మైనారిటీ ప్రాబల్య ప్రాంతం. ఇది చారిత్రకంగా తృణమూల్కు పెద్దగా పట్టు లేని ప్రాంతమనే చెప్పాలి. తొలినుంచీ ఇక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. అవి బలహీనపడ్డాక కొన్నేళ్లుగా వాటి స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది. ఇక్కడి డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయ్గురి, దినాజ్పూర్ ప్రాంతాల్లో బీజేపీ హవా క్రమంగా పెరుగుతూ వస్తోంది. డార్జిలింగ్ లోక్సభ స్థానాన్ని 2009 నుంచీ బీజేపీయే నెగ్గుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఇక్కడ 25 స్థానాలు నెగ్గితే బీజేపీ కేవలం మూడింటితోనే సరిపెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఉత్తర బెంగాల్లోని 8 సీట్లకుగాను బీజేపీ ఏడింటిని చేజిక్కించుకుంది. అదే ఊపులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకంగా 30 సీట్లు ఒడిసిపట్టింది. తృణమూల్ 24 సీట్లతో సరిపెట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 6 స్థానాలు నెగ్గింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్పై బీజేపీ ‘యూపీ’ వ్యూహం.. పోటీలో ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఫలించిన ఎన్నికల వ్యూహాన్ని పశ్చిమబెంగాల్లో అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సన్యాసులు, పూజారులు, ఆధ్యాత్మికవాదులను ఎన్నికల బరిలో దించుతోంది. యూపీలో గోరఖ్నాథ్ మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ పలుమార్లు ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.సన్యాసి వర్గం నుంచి వచ్చిన సాక్షి మహరాజ్, స్వామి అవైధ్యనాధ్, స్వామి చిన్మయానంద్ తదితరులు ఎన్నికల్లో గెలిచారు. బెంగాల్లో ఆధ్యాతి్మక రంగానికి చెందిన పలువురికి బీజేపీ టికెట్లిచి్చంది. భారత్ సేవాశ్రమంలో పని చేసిన ఉత్పల్ మహారాజ్ను కాలియాగంజ్ నుంచి బరిలో దించింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి 94 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి తృణమూల్ కాంగ్రెస్లో చేరిన సౌమన్ రాయ్తో ఉత్పల్ పోటీ పడే అవకాశముంది.ఉల్బేరియా సౌత్ నుంచి స్వామి మంగళానంద పూరికి బీజేపీ టికెట్ దక్కింది. తృణమూల్కు చెందిన పులోక్ రాయ్తో ఆయన తలపడనున్నారు. మఠాలు, ఆశ్రమాలకు ఆదరణ బాగా ఉండే నవద్వీప్ నుంచి శ్రీ శృతి శేఖర్ గోస్వామిని బీజేపీ బరిలోకి దించింది. బెహలా పూర్బ నుంచి సునీల్ మహారాజ్ పోటీలో ఉన్నారు. హన్సన్ నుంచి చారిత్రక తారాపీఠ ఆలయ పూజారి నిఖిల్ బెనర్జీ పోలీకి టికెటిచి్చంది. వీటిలో చాలావరకు తృణమూల్ సిట్టింగ్ స్థానాలే ఉండటం విశేషం! -
ప్రమాదం కాదు.. వ్యవస్థీకృత కుట్ర
సాక్షి బెంగళూరు: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి సంబంధించిన కేసు కొత్త మలుపు తీసుకుంది. విమాన ప్రమాదం వెనుక పెద్దకుట్ర ఉందని బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అజిత్ పవార్ అల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో ఏముంది? ఇది కేవలం ప్రమాదం కాదని, దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉండొచ్చని రోహిత్ పవార్ అనుమానించారు. ప్రమాదానికి కారణమైన విమానం ప్రయాణానికి అనుకూలంగా లేదని డీజీసీఏ నివేదిక వెల్లడించినట్టు గుర్తు చేశారు. విమాన ఇంజన్ కాలపరిమితి ముగింపు దశకు చేరుకున్నప్పటికీ వాణిజ్య వినియోగానికి ఉపయోగించారని ఆరోపించారు. అమెరికాలో సేవలకు స్వస్తి పలికిన విమానాన్ని భారతదేశానికి తీసుకొచ్చి ఉపయోగించారని విమర్శించారు. విమాన సమయాన్ని కూడా తక్కువగా చూపించారని, వాస్తవానికి విమానం 8 వేల గంటలకంటే ఎక్కువ సేపు ప్రయాణం సాగించినట్టు తెలుస్తోందన్నారు. చీఫ్ పైలట్ సుమిత్ కపూర్కు మద్యం అలవాటు ఉందని, గతంలో ఆయనను సస్పెండ్ చేశారని కూడా రోహిత్ ఆరోపించారు.చివరి క్షణంలో సురక్షిత రన్వే కాదని ప్రమాదకర టేబుల్ టాప్ రన్వేను ఉపయోగించారన్నారు. విమానం కూలడానికి ముందు కోపైలట్ ‘ఓహ్ షిట్’ అని అరిచినప్పటికీ ముఖ్య పైలట్ ఎలాంటి అత్యవసర సందేశం పంపించకుండా మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. ప్రధాన పైలట్ సుమిత్ మద్యం మత్తులో ఉండటమో లేక ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉన్నారో తమకు అనుమానంగా ఉందన్నారు. ఇదొక వ్యవస్థీకృత కుట్రలో భాగంగా జరిగినట్టు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. అజిత్ పవార్ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సి ఉందని, కానీ చివరి క్షణంలో విమాన ప్రయాణంగా మారిందని, దీని వెనుక ఎవరున్నారో తనిఖీ చేపట్టాలన్నారు. ప్రమాదం జరిగిన బారామతిలో దట్టమైన పొగమంచు అలుముకుందని, కనిష్టంగా 5 కిలోమీటర్ల విజిబిలిటీ లేకపోయినప్పకీ ల్యాండింగ్కు అవకాశం కల్పించినది ఎవరని ప్రశ్నించారు. -
23 ‘ప్రభుత్వ’పదవులకు మమత రాజీనామా
కోల్కతా: త్వరలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడనున్న నేపథ్యంలో ఇన్నాళ్లూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలో, ఇతర ప్రభుత్వరంగ బోర్డ్లు, అకాడమీలకు మొత్తంగా 23 పదవులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు హోం శాఖ, ఇతరత్రాల శాఖల నుంచి ఉత్తర్వులు జారీచేశారు.రాష్ట్ర ఆరోగ్య మిషన్, రాష్ట్ర వన్యప్రాణి బోర్డ్, ఎకోటూరిజం అడ్వైజరీ బోర్డ్, 125వ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల కమిటీ, ఉర్దూ అకాడమీ పాలకమండలి, బంగ్లా సంగీత్మండలి ఆర్గనైజింగ్ కమిటీ, ఎస్సీ, ఎస్టీల సలహా మండలి, పారిశ్రామికాభివృద్ధి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, విపత్తుల నిర్వహణ సంస్థ సహా పలు సంస్థలకు చీఫ్ పదవి నుంచి మమత రాజీనామాచేశారు. లేఖలో ప్రస్తావించకపోయినా, తాను ప్రాతినిధ్యంవహించే ప్రతి ఒక్క సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు సంబంధిత ఉత్తర్వులో ప్రస్తావించారు. -
హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు త్వరగా సమసిపోవాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మోదీతో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రధానంగా హార్మూజ్ జలసంధి విషయంలో తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు. స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుగా హార్మూజ్ను తక్షణమే తెరవాలని మోదీ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.ట్రంప్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, పశ్చిమాసియా పరిస్థితులపై ఉపయోగకరమైన అభిప్రాయాలు పంచుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హార్మూజ్ జలసంధిని తెరిచి, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగించాలని తాము నిర్ణయించామని స్పష్టంచేశారు. కీలకమైన షిప్పింగ్ మార్గాన్ని తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతపై నేతలు చర్చించారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. -
సమర్థంగా ఎదుర్కొందాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యుద్ధ ప్రభావం మనపైనా ఉందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి గ్యాస్, ముడి చమురు సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో ఎరువుల సరఫరాకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంచేశారు.ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇంధన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు కాచుకొని ఉంటాయని చెప్పారు. అందుకే నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇంధనం, వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎగుమతి, దిగుమతి కార్యకలాపాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయడానికి, అవసరమైన పరిష్కార మార్గాలు రూపొందించడానికి ఇప్పటికే మంత్రులతో ఒకబృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతోందని అన్నారు. ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలి కోవిడ్–19 మహమ్మారి సమయంలో వేర్వేరు రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి నిపుణులు, అధికారులతో కూడిన సాధికార బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే.. సోమవారం కొత్తగా ఏడు బృందాలను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సప్లై చైన్స్, పెట్రోలియం, డీజిల్, ఎరువులు, సహజ వాయువు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాల ఆధారంగా చర్యలు తీసుకునే బాధ్యతను ఈ బృందాలకు అప్పగించినట్లు చెప్పారు. సమిష్టి కృషి ద్వారా ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించగలమన్న విశ్వాసం పూర్తిగా ఉందని వ్యాఖ్యానించారు.దక్షిణాసియా యుద్ధం వల్ల మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి, యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన వ్యూహాలపై సాధికార బృందాలు కసరత్తు చేస్తాయన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఒక ప్రత్యేకమైన స్వభావం కలదని, దానికి తగినట్టుగానే విభిన్నమైన రీతిలో పరిష్కారాలను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రతి సవాలును మనం ఓర్పు, సంయమనం, ప్రశాంతమైన మనసుతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు నిరంతరం మారుతున్నాయని, అందుకే ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు. పశ్చిమాసియా ప్రతికూల పరిణామాల ప్రభావం ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.శాంతి యత్నాలకు భారత్ మద్దతు ఎరువుల సరఫరా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. రాబోయే పంటల సీజన్లో సరిపడా ఎరువులు అందజేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. సంక్షోభంతో సంబంధం లేకుండా అధిక ఆర్థిక వృద్ధిని సాధించడం మన బాధ్యత అని వివరించారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను కోరుకుంటున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. దక్షిణాసియా లో శాంతి యత్నాలకు భారత్ మద్దతు కచి్చతంగా ఉంటుందన్నారు. అక్కడ ఉద్రిక్తతలు తగ్గిపోయి, హర్మూజ్ జలసంధి తేరుకోవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఒకవేళ సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగితే మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. -
నెట్టింట లాక్డౌన్ చర్చ
సాక్షి, స్పెషల్ డెస్క్ : సరిగ్గా ఆరేళ్ల క్రితం.. అంటే 2020 మార్చి 24న ప్రకటించిన దేశవ్యాప్త కోవిడ్–19 లాక్డౌన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో లాక్డౌన్ అనే అంశంపై గూగుల్ వేదికగా మంగళవారం రోజంతా చర్చ సాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై సోమవారం పార్లమెంటులో ప్రసంగించే క్రమంలో ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితులను కోవిడ్ మహమ్మారితో పోల్చారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఏర్పడిన అంతరాయాన్ని ఎదుర్కోవడానికి కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో చూపినటువంటి సామూహిక సహనం, ఐక్యత, సంసిద్ధతను ప్రజలు ప్రదర్శించాలని ఆయన కోరారు. అదే సమయంలో పౌరులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ నిర్ణయాలను నమ్మాలని ప్రధాని ఉద్ఘాటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కొత్త లాక్డౌన్కు సంకేతమని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారమైంది. నాటి దేశవ్యాప్త దిగ్బంధం, నిర్జన రోడ్లు, లక్షలాది మంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు పయనం కావడం, కార్యాలయాలు అకస్మాత్తుగా వర్క్ ఫ్రమ్ హోం విధానంలోకి మారడం వంటి ఆనాటి దుర్భర పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని నెటిజన్లు కంగారుపడ్డారు.దీనికితోడు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ఇంధన పొదుపు కోసం 10 సూచనలు చేస్తూ వాటిని ‘కోవిడ్ తరహా చర్యలు’గా అభివర్ణించింది. అయితే ఇది కూడా సోషల్ మీడియాలో తప్పుగా వ్యాప్తి చెందింది. ఐఈఏ పేర్కొన్న ‘స్వచ్ఛంద’ అనే పదాన్ని తీసేసి ఇది ప్రభుత్వం విధించబోయే ‘తప్పనిసరి’ ఆదేశమంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు తప్పుగా చక్కర్లు కొట్టాయి. దీంతో ఇవన్నీ ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు మరింత అగ్గిరాజేశాయి. నెట్టింట లాక్డౌన్ చర్చకు కారణమయ్యాయి. -
50 శాతం సీట్ల పెంపు ముమ్మాటికీ కుట్రే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అతి పెద్ద కుట్రగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే సీట్లను పెంచాలనే అభిప్రాయం స్వార్థ రాజకీయ ఎత్తుగడలో భాగమే అని విమర్శించారు. ‘ఎంపీ స్థానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంతుందో అదేస్థాయిలో సీట్ల పెంపు జరగాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోంది. ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఈ విషయమై అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపుపై ముందుకెళ్లాలి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దక్షిణాది నుంచి చోటు ఉండదు... తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి 40, ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలున్నాయి. 40–80లో 40 తేడా ఉంది. ఉత్తర్ప్రదేశ్లో 80 స్థానాలు 120కి పెరుగుతాయి. ప్రతి చోటా 50 శాతం ఇస్తున్నారని అనుకుంటున్నారు. కానీ.. ఏ లెక్కతో ఇస్తున్నారు. మన దగ్గర వ్యత్యాసం పెంచుతున్నారు. యూపీ, తమిళనాడు మధ్య తేడా 40 ఉంది. ముందు ముందు ఇది 60కి పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్ ఇలా నాలుగైదు రాష్ట్రాల సీట్లు పెరిగిన తర్వాత అక్కడి నుంచే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ, ఏపీ కలుపుకొని దక్షిణాది రాష్ట్రాల సీట్లు మొత్తం 130 అవుతాయి. 50 శాతం సీట్లు పెరిగితే అవి 195 అవుతాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 50 శాతం పెరిగితే దక్షిణాది సీటు ఒక్కటి కూడా అవసరం లేదు. మొత్తం స్థానాలను 815కు పెంచితే అందులో నుంచి 195 తీసివేస్తే.. మమ్మల్ని అడిగేవారే ఉండరు. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీట్లు అవసరం. భవిష్యత్తులో ఆ అవసరమే ఉండదు. మోదీ త్రీడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రధాని మోదీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతాన్ని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్, డివల్యూషన్, డి్రస్కిమినేషన్ ఈ త్రీడీ విధానంలో ప్రభుత్వాన్ని మోదీ నడపాలనుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడాలనుకుంటున్నాం. గతంలో దక్షిణాదికి రాజకీయాల్లో ప్రాముఖ్యత ఉండేది. దక్షిణాదికి చెందిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, కర్ణాటకల నుంచి ఒక్క నిర్మలా సీతారామన్ మినహా మంత్రివర్గంలో చోటు లేదు. ప్రధాని, రక్షణ, హోంశాఖ, పరిశ్రమలు, కామర్స్ వంటి టాప్ టెన్ పోర్ట్ఫోలియోల్లో మనకు ఏమీ దక్కలేదు. రాజకీయ ప్రాధాన్యంలో దక్షిణాదికి చాలా నష్టం జరుగుతోంది. వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అయ్యేందుకు అవకాశం ఉన్నవేళ ఆయనను ఇల్లు ఖాళీ చేయించి హైదరాబాద్కు పంపించేశారు. దక్షిణాదికి ఢిల్లీలో గుర్తింపేలేదు. మోదీ వచ్చిన తర్వాత రాజకీయ వివక్ష ఎక్కువైంది. కేసీఆర్ది కుటుంబ సమస్య కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగత వైరం లేదు, ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు. కేసీఆర్ సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడే. గృహ నిర్బంధం చేసి ఏదో రకంగా సీఎం కావాలని చూస్తున్నది అల్లుడు, మీరిద్దరు కాదు నేను సీఎం అవుతా అని కవిత చూస్తున్నది. వారసత్వ రాజకీయాలు నమ్ముకున్న కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకు కాలేదు అల్లుడు అయ్యాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అవుతా అని హరీశ్రావు అనుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నాయి. కేసీఆర్ను ఫామ్హౌస్లో వాళ్లే నిర్బంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోవడం ఖాయం. వాళ్లది ఫెవికాల్ బంధం. వాళ్లిద్దరినీ వేర్వేరుగా చూడాలనుకోవడంలేదు. రెండింటినీ మడతేసి కొట్టాలన్నదే నా లెక్క. నాకు ఇప్పటికైతే జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. ఇంకా 8 ఏళ్లు 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం చాలా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. -
మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: హిందూ, బౌద్ధం, సిక్కు మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను తక్షణమే కోల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించి, ఆచరిస్తున్న వ్యక్తులు దళిత హోదాను క్లెయిమ్ చేయలేరని, అలాగే తమకు రక్షణ కల్పించాలంటూ ‘ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని’ (అట్రాసిటీ చట్టం) ఏమాత్రం ఆశ్రయించలేరని తేల్చిచెప్పింది. ఏపీలోని పిట్టలవానిపాలెం గ్రామంలో హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారి పాస్టర్గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పలువురిపై పెట్టిన అట్రాసిటీ కేసును కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేవలం ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు రద్దు చేయనంత మాత్రాన.. మతం మారిన వాస్తవాన్ని విస్మరించలేమని, అతనికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత రాదని తేల్చిచెప్పింది. 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఉదహరించింది. ‘ఈ కేసులో పిటిషనర్ తిరిగి తన మాతృ మతంలోకి (హిందూ) మారినట్లు గానీ, మాదిగ సామాజికవర్గం అతన్ని తిరిగి తమలోకి చేర్చుకున్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. పైగా అతను దశాబ్దానికిపైగా క్రైస్తవాన్ని ఆచరిస్తున్నాడు. పాస్టర్గా సేవలందిస్తూ గ్రామాల్లో ప్రతి ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. దాడి జరిగినట్లు చెబుతున్న రోజున కూడా అతను ఇంట్లో ప్రార్థనలు నిర్వహించాడు. ఈ వాస్తవాలన్నీ ఘటన జరిగిన నాటికి అతను క్రైస్తవుడేనని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ఆశల పల్లకీలో!
(శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి– సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు తొలి అడుగు పడింది. పునర్విభజన జరిగితే లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రాజకీయంగా కూడా అవకాశాలు పెరుగుతాయి. 2027 జనాభా లెక్కలు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో 2011 లెక్కలతోనే ప్రక్రియ మొదలుకానుంది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కు పెరగనుండగా, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగనున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే.. 60 స్థానాలు పెరిగితే 179 కావాలి.. కానీ ప్రతి లోక్సభ స్థానానికి 7 శాసనసభ స్థానాలు ఉండాలన్న నియమంతో 26 లోక్సభ స్థానాల పరిధిలో 182 శాసనసభ స్థానాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనలతో వారికి శాసనసభలో 60, లోక్సభలో 9 స్థానాలు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నుంచే పెంపు అమల్లోకి వస్తుంది. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఒక శాసనసభ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలో ఉండాలన్న ప్రాథమిక నిబంధన మేరకు జిల్లా యూనిట్గా తీసుకుంటారు. ప్రస్తుతం పలు శాసనసభ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కానీ కొత్తగా చేపట్టే పునర్విభజనలో కొత్త నియోజకవర్గాల హద్దులు ఒకే జిల్లాకు పరిమితమవుతాయి. ఈ మేరకు పలు ప్రస్తుత నియోజకవర్గాల పరిధుల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధుల్లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటయ్యే 63 శాసనసభ స్థానాల్లో అత్యధికం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. పునర్విభజన ఇలా..! రాష్ట్రంలోని మొత్తం జనాభాను అన్ని నియోజకవర్గాలకు దాదాపు సమానంగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గానికి సగటుగా నిర్ణయించే జనాభా సంఖ్యలో 10 శాతం తక్కువ లేదా ఎక్కువ ఉండే వెసులుబాటు ఉంటుంది. 2011 లెక్కల మేరకు రాష్ట్ర జనాభా 3,51,90,260 మంది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గ సగటు 1,93,353గా ఉంటుంది. ఈ మొత్తానికి పది శాతం తక్కువ లేదా ఎక్కువ జనాభా సగటుతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పునర్విభజన కోసం ఏర్పాటు చేసే కమిషన్కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్గా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. మహిళలకు ఎలా..? మహిళలకు కేటాయించే స్థానాలు లాటరీ ద్వారా కేటాయిస్తారా..లేక అత్యధిక జనాభా ఉన్న మొదటి 60 నియోజకవర్గాలను ఎంచుకుంటారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుంటే పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అత్యధిక స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా కొత్తవి ఎన్ని.. ఆదిలాబాద్లో 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10 నియోజకవర్గాలుండగా కొత్తగా మరో ఐదు స్థానాలు పెరగనున్నాయి. కొత్తగా ఆదిలాబాద్ అర్బన్, ఉట్నూరు, మంచిర్యాల రూరల్ లేదా లక్సెట్టిపేట, నర్సాపూర్ (నిర్మల్) నియోజకవర్గాలతో పాటు మరొకటి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్న నార్నూరు, గాదిగూడ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడే కొత్త నియోజకవర్గంలోకి వెళతాయి. నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాంతాలతోనే ఖానాపూర్ నియోజకవర్గం హద్దులు మార్చుకుంటుంది. నిజామాబాద్లో 3 నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలకు కొత్తగా మరో మూడు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయి. కొత్తగా నిజామాబాద్ సౌత్ లేదా నార్త్, బోధన్ నియోజకవర్గం నుండి కొన్ని ప్రాంతాలను విడదీసి ఎడపల్లి లేదా బోధన్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటవుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలో కొత్తగా కామారెడ్డి రూరల్ æస్థానం ఏర్పాటుకు అవకాశం ఉంది. కరీంనగర్లో 5 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా, కొత్తగా ఐదు స్థానాలు ఏర్పడతాయి. కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, సుల్తాన్బాద్, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల జిల్లా) నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ నుండి సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోకి సుమారు 10 మండలాలు వెళ్లటంతో తక్కువ నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి. మెదక్లో 7 ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 11 స్థానాలుండగా, కొత్తగా 7 స్థానాలు ఏర్పాటవుతాయి. అందులో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రామచంద్రాపురం, అమీన్పూర్, సదాశివపేట, మెదక్ జిల్లాలో రామాయంపేట నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్లతో పాటు కొత్తగా సిద్దిపేట రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రెండు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్లోని తూప్రాన్, మనోహరాబాద్, దుబ్బాకలోని చేగుంట రామాయంపేటలో చేరతాయి. నల్లగొండలో 6 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా కొత్తగా 6 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. కొత్తగా మిర్యాలగూడ రూరల్, నల్లగొండ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి భువనగిరిలో రామన్నపేట లేదా చౌటుప్పల్ లేదా మోత్కూరు నియోజకవర్గం, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు 4 స్థానాలుండగా కొత్తగా సూర్యాపేట రూరల్, మునగాల నియోజకవర్గాలతో ఇంకో నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది. ఖమ్మంలో 2 ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలుండగా, పునర్విభజన అనంతరం కొత్తగా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలంలోని పలు ప్రాంతాలతో ఖమ్మం రూరల్ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. మిగిలిన స్థానాలు యథాతథంగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలుండగా కొత్తగా ఒక స్థానం పెరుగుతుంది. వరంగల్లో 9 ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా కొత్తగా 9 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లాలో కాజీపేట, హసన్పర్తి, శాయంపేట, మడికొండ, వరంగల్ జిల్లాలో వరంగల్ సెంట్రల్, గీసుకొండ, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ రూరల్, తొర్రూరు,, భూపాలపల్లిలో కాటారం, జనగామలో ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలు కొనసాగే అవకాశం ఉంది. మహబూబ్నగర్లో 6 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా 6.. మహబూబ్నగర్ రూరల్, గండీడ్, కోస్గి, అమరచింత, పెబ్బేరు, ఐజ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా విడిపోనుంది. అందులో కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గంలో కోస్గి, మద్దూర్ ఇతర మండలాలు చేరితే,, వికారాబాద్ జిల్లాలో ఉన్న కొడంగల్, బొమ్మరాశిపేట, దుద్యాల, దౌల్తాబాద్ మరో రెండు మండలాలతో కొడంగల్ రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ చుట్టూ మొత్తం 51 హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం 51కి పెరగనుంది. హైదరాబాద్లో 5 స్థానాలు పెరిగి మొత్తం 20 నియోజకవర్గాలు ఏర్పాటు కానునున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 31 స్థానాలు అవుతాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్లోని మండలాలతోనే ఏర్పాటవుతుంది. ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు రెండేసిగా ఏర్పడి మొత్తం 13 నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 స్థానాలకు తోడు కొత్తగా కాప్రా, అల్వాల్, బోడుప్పల్, కొంపల్లి, మూసాపేట తదితర స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. -
ఈ నియోజకవర్గంలో గెలిచే పార్టీనే అధికారంలోకి..!
తమిళనాడులో స్టార్ నియోజకవర్గంగా పేరున్న ఈరోడ్ పశ్చిమంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. తెలుగు ఓటర్లు కూడా ఓ మోస్తరుగా ఉండే ఈ నియోజకవర్గంలో విజయం సాధించేవారు క్యాబినెట్ మంత్రి అవుతారనే ఓ నమ్మకం కొనసాగుతోంది. అంటే.. ఈ నియోజకవర్గంలో విజయం సాధించే పార్టీనే అధికారాన్ని చేపడుతుందని ఓటర్లు విశ్వసిస్తుంటారు. అందుకే.. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ని స్టార్ నియోజకవర్గం అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నెక్-టు-నెక్ ఫైట్ జరుగుతోంది.ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలో నగర ప్రాంతాలతోపాటు.. గ్రామాలు కూడా ఉన్నాయి. ఈరోడ్ మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన 40కి పైగా డివిజన్లు, సింతోడు, నస్యనూర్ పట్టణ పంచాయతీలు, పెరుందురై తాలూకాలోని వడముఖం వెల్లోడు, పుంగంబాడి, కౌండాచ్చిపాళ్యం, తెన్ముఖం వెల్లోడు, ముగాసి పులవంపాళ్యం, ఈరోడ్ తాలూకాలోని కరైఎల్లపాళ్యం, ఎలవమలై, మెట్టునాసువంపాళ్యం, పేరోడు, నొచ్చిపాళ్యం, గంగాపురం, ఎల్లాపాళ్యం, విల్లరసంపట్టి, మేల్తిండల్, కీళ్తిండల్, కతిరంబట్టి, రాయపాళ్యం, మెట్టుకడై, కూరపాళ్యం, తొట్టాణి, పుత్తూర్ పుదుప్పాళ్యం, నంజనాపురం, పవళత్తాంపాళ్యం, వెప్పంపాళ్యం, ముత్తంపాళ్యం గ్రామాలు ఉన్నాయి. ఈరోడ్ జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఈరోడ్ పశ్చిమానికి పేరుంది.స్వాతంత్య్రానంతరం వేగంగా అభివృద్ధి రైల్వే స్టేషన్ ఉండడం కారణంగా.. స్వాతంత్య్రానంతర కాలం నుంచే ఈరోడ్ పశ్చిమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. ఈ నియోజకవర్గంలో 50% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడగా.. మిగతా 50% పరిశ్రమలను నమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతం డైయింగ్, తోలు, వస్త్ర పరిశ్రమలకు నిలయం. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈరోడ్ పశ్చిమం ఏర్పడింది. ఈరోడ్ జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో.. ఈరోడ్ పశ్చిమంలోనే అత్యధిక ఓటర్లున్నారు. భారత ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 1,18,206 మంది పురుష ఓటర్లు, 1,27,246 మంది మహిళా ఓటర్లు, 41 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. మొత్తం 2 లక్షల 46 వేల మంది ఓటర్లలో కొంగు వేళాల కౌండర్లు బలమైన సామాజికవర్గంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి వాటా 40%. అంటే.. ఈ సామాజికవర్గం అండదండలున్నవారే ఇక్కడ విజయం సాధిస్తారు. ఆ తర్వాతి స్థానాల్లో పట్టిక, ముదలియార్, నాదార్ వర్గాలున్నాయి.ఈరోడ్ పశ్చిమంలో వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి ఎన్నెన్నో అపరిష్కృత సమస్యలున్నాయి. ప్రధానంగా పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడం తరచూ ఇక్కడి రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. పసుపు నిల్వకు కోల్డ్ స్టోరేజీలు లేవు. తోలు పరిశ్రమలకు సంబంధించి, శుద్ధి కేంద్రాలు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. డైయింగ్ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. ప్రతికూల అంశాలు ఇవే.. పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించి దారాల ధరలు పెరగడం ప్రతికూలంగా ఉంది. ప్రభుత్వ లా కాలేజీ, యూనివర్సిటీ ఏర్పాటు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయాల కల్పన వంటివి ప్రజలకు తీరని కలలుగా మిగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో డీఎంకే ఈ అంశాలపై ప్రత్యేకంగా హామీలు ఇచ్చినా.. ఇక్కడి ఎమ్మెల్యే ముత్తుస్వామి క్యాబినెట్ మంత్రి అయినా.. వాగ్దానాలను నెరవేర్చలేదనే అపవాదు ఉంది.ఈ నియోజకవర్గంలో ముత్తుస్వామి ఎక్కువసార్లు గెలిచారు. 1980, 1984 ఎన్నికల్లో ఆయన ఎంజీఆర్, వీఎన్ జానకి ప్రభుత్వాల్లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో భవానీ నియోజకవర్గానికి మారి.. అక్కడి నుంచి విజయం సాధించి, జయలలిత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 1996లో మళ్లీ ఈరోడ్కు వచ్చినా.. విజయం సాధించలేదు. 2001, 2006 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2010లో డీఎంకేలో చేరారు. అయినా.. 2011, 2016లో ఓటమిని మూటగట్టుకున్నారు. పాతికేళ్ల తర్వాత.. 2021లో విజయం సాధించి, మరోసారి మంత్రిపదవిని దక్కించుకున్నారు. ఇక్కడ గెలిచిన మిగతావారి విషయానికి వస్తే.. 2011లో అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం ఈరోడ్లో విజయం సాధించి, జయలలిత క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2016లో కూడా ఆయనే గెలిచారు. అందుకే.. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఓ విశ్వాసం ఈరోడ్ ప్రజల్లో ఉంది. -వెబ్డెస్క్ -
చుక్కలు చూపిస్తున్న చిన్న నియోజకవర్గం
తమిళనాట ఎన్నికల సందడి మొదలైంది. అయితే.. కరూర్ - ఈరోడ్ జిల్లాల సరిహద్దులను పంచుకుంటున్న ఓ చిన్న నియోజకవర్గం మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ గెలవాలంటే.. సమస్యల పరిష్కారంపై అభ్యర్థులు నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే..! ఎందుకంటే.. ఇక్కడి ఓటర్లు ఏకతాటిపై ఉంటూ.. అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తారు. శబరిమలకు వెళ్లే తెలుగు భక్తులు పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.. పళనికి సమీపంలో ఉండే ఆ చిన్న నియోజకవర్గం పేరే ‘అరవకురుచ్చి’. తెలుగు భక్తులు ఎంతో ఇష్టంగా ధరించే కరుగంళి మాలలకు నిలయమైన పాతాళ శంభు మురుగన్ ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ నియోజకవర్గ విశేషాలేంటో తెలుసుకుందామా?అరవకురుచ్చి పరిసర ప్రాంతాలు మునగకు ప్రసిద్ధి. ఇక్కడి ఈసనత్తం మార్కెట్ మునక్కాయల విక్రయాలకు అడ్డాగా ఉంది. ఈ ప్రాంతం తీవ్రమైన ఎండలకు నిలయం. అంతేకాదు.. పశ్చిమ కనుమలు అడ్డుగా ఉండడంతో ఏర్పడ్డ వర్షాచ్ఛాయ ప్రాంతాల్లో ఉన్న అరవకురుచ్చిలో తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయి. కేవలం లక్షా ఎనభై తొమ్మిది వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గం పరిధిలో పళ్లపట్టి, అండిపెట్టికొట్టాయ్, వెట్టమంగళం, కొంబుపాళయం, తిరుక్కాడుతురై, నంజై పుగళూర్, పుంజై పుగళూర్, పుంజై తోటక్కురిచ్చి వంటి ప్రాంతాలుంటాయి. ఈ ప్రాంతాల్లోని నేషనల్ హైవేకు ఇరువైపులా ఉండే పల్లెల్లో తెలుగువారు కూడా ఉంటారు. అయితే.. వారు ఇక్కడ గెలుపోటములను శాసించే స్థాయిలో లేరు. ఇక్కడ 10% ముస్లిం ఓటర్లుండగా.. మిగతా వారిలో కొంగు వెల్లాళ కౌండర్లు, వెట్టువ కౌండర్లు, నాయగర్ వంటి అనేక సామాజిక వర్గాలున్నాయి.అరవకురుచ్చిలో నీటి సమస్య అత్యంత ప్రధానమైనది. ప్రైవేటు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు తాగేనీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ.. సాగు నీటికోసం రైతులు దీర్ఘకాలికంగా పోరాటాలు చేస్తున్నారు. నగాంజీ ఆనకట్ట నీటి పంపిణీలో సరైన హక్కులను పేర్కొనకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటారు. తాదంపాళయం చెరువును అటవీశాఖ నుంచి ప్రజా పనుల శాఖ స్వాధీనం చేసుకున్నాక కొంత వరకు సాగునీటి అవసరాలు తీరుతున్నా.. ఆనకట్టలను నింపడం ఓ మహా క్రతువుగా మారుతోంది. రైతులకు సాగునీటిపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే ఇక్కడ విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.1952 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి రామస్వామి కౌండర్, 1967లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.కందస్వామి కౌండర్ విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో స్వతంత్రులకు ఇక్కడ విజయం అందని ద్రాక్షగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. 1957, 1962, 1977 ఎన్నికల్లో మాత్రమే విజయాన్ని మూటగట్టుకుంది. 1980 నుంచి ఇక్కడ అయితే డీఎంకేకు.. లేకుంటే అన్నాడీఎంకేకు మాత్రమే పట్టం కడతామంటూ ఓటర్లు తీర్పునిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు లేకపోవడమే. 2019, 2021 ఎన్నికల్లో ఇక్కడ డీఎంకే పాగా వేసింది. ఈసారి హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే.. అతి చిన్న నియోజకవర్గం కావడం.. ఈసారి దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇక్కడ బాగా పుంజుకుంటుండంతో ఓట్లు చీలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం డీఎంకే కొంప ముంచుతుందా? లేక అన్నాడీఎంకేను ఓడించి, డీఎంకేకు హ్యాట్రిక్ ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారుతోంది.అరవకురుచ్చి నియోజకవర్గంలో మొత్తం 90,490 మంది పురుష ఓటర్లు, 99,203 మంది మహిళా ఓటర్లున్నారు. ఏ ఎన్నికల్లో అయినా.. మహిళల మద్దతున్న అభ్యర్థే గెలుస్తాడనేది ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగే ఈ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున సతీశ్, నామ్ తమిళర్ పార్టీ నుంచి డాక్టర్ నరేన్ పోటీ చేస్తున్నారు. -వెబ్డెస్క్ -
పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మంగళవారం 297 హామీలతో ఈ మానిఫెస్టోను విడుదల చేశారు. కుటుంబంలోని యజమానురాలికి ప్రతినెల రూ.2000, మహిళలతో పాటు పురుషులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ఫ్రీగా ఫ్రిడ్జి ఇస్తామని అన్నాడీఎంకే చెప్పింది. పన్నుల భారం, వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తామని పేర్కొంది."పాలన సామర్థ్యం లేని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గత 5 సంవత్సరాల్లో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆస్తి పన్ను, ఇల్లు పన్ను, విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలు పెరిగాయి. దాంతో కుటుంబాల రోజువారీ ఆర్థిక భారం ఎక్కువైంది. ఈ భారం తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10,000 ప్రత్యేక సాయం ఇస్తాం" అని మేనిఫెస్టోలో ఉంది. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలుఈపీఎస్ మహిళల కోసం "కుల విలక్కు పథకం" రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు పప్పుధాన్యాలుఉచితంగా ఫ్రిడ్జి కూడా ఇస్తామని ప్రకటనమహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు -
ఒవైసీ మూడో ఫ్రంట్.. పశ్చిమ బెంగాల్లో ముక్కోణపు పోరు!
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్.. క్లుప్తంగా మజ్లిస్ పార్టీ..! హైదరాబాద్లో పత్తర్గట్టీ మునిసిపల్ డివిజన్ నుంచి ప్రస్తానం ప్రారంభించిన మజ్లిస్ పార్టీ.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా భారత్ వ్యాప్తంగా విస్తరిస్తోంది. జాతీయ పార్టీగా ఎదిగిన మజ్లిస్ ఇప్పుడు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంగొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది. తాజాగా మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మూడో ఫ్రంట్ను ప్రకటించడంతో.. ఇప్పుడు బెంగాల్లో ముక్కోణపు పోరు మొదలైంది.ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు అంటే.. అయితే టీఎంసీ—లేదంటే బీజేపీ అన్నట్లుగా సాగింది. అయితే.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన హుమయూన్ వేరు కుంపటి పెట్టారు. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పుడు మజ్లిస్ చీఫ్ అసదుద్దీ ఒవైసీ అతనితో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల బీజేపీకి.. కాషాయపార్టీ సాంప్రదాయ ఓటుబ్యాంకుకు ఎలాంటి నష్టం లేకపోయినా.. టీఎంసీ ఓట్లలో మాత్రం చీలికకు కారణమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ చీఫ్ మమతాబెనర్జీ ఈసారి కూడా తన విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ, మజ్లిస్ కారణంగా తెరపైకి వచ్చిన మూడో కూటమి కారణంగా చమటోడ్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు జరగడం కూడా తృణమూల్కు ప్రతికూలాంశంగా మారుతోంది.ఈ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకును మజ్లిస్ కచ్చితంగా చీలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మమతకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే హుమయూన్ ప్రకటించగా.. తమ కూటమి 294 స్థానాల్లో కలిసి పోటీ చేస్తుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ కూటమి అహరహం పనిచేస్తోంది. మూడో కూటమి అధికారంలోకి వస్తుందా? బెంగాల్లో పాగా వేయాలనే కాషాయం కల నెరవేరుతుందా? మమత ఎత్తుల ముందు విపక్షాల వ్యూహాలన్నీ చిత్తవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. మే 4న వచ్చే ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..! -
రూ.181 కోట్లు నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం
కోల్కతా: 294 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు రెండు దశల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి డబ్బు, మద్యం, డ్రగ్స్, ఉచిత సామగ్రి సహా రూ.181 కోట్లకు పైగా విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మొత్తం 294 నియోజకవర్గాల పరిధిలో ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడం తెల్సిందే. అప్పట్నుంచి, విస్తృతంగా సోదాలు చేపట్టినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) కార్యాలయం తెలిపింది. జిల్లాలవారీగా 3,58,986 కేసులు నమోదు చేయగా, మొత్తం 3,11,829 ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాలను, 19,901 ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులకు స్పందించడానికి, నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి 1,800కు పైగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ (FSTలు), 2,200కు పైగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SSTలు)ను మోహరించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీఇక శాంతిభద్రతల విషయానికి వస్తే, ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి కోల్కతా పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి బరనగర్, కాళీఘాట్లలో జరిగిన సంఘటనలలో జోక్యం చేసుకున్నారని వారు తెలిపారు. -
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్ చర్చించారు. హార్మూజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మంగళవారం ఎక్స్లో చేసిన పోస్ట్లో ఈ వివరాలు తెలిపారు.కాగా, అలీ లారిజానీ మృతితో కొత్త సెక్యూరిటీ చీఫ్ను నియమించింది ఇరాన్. మొహమ్మద్ బాఘర్ జోల్ఘద్ర్ ను సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త కార్యదర్శిగా నియమించింది. దేశ భద్రతా విధానాలను నిర్ణయించే అత్యున్నత సంస్థే ఈ ‘కౌన్సిల్’. డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజులపాటు యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేసినప్పటికీ ఇరాన్ దాడులు ఆపడం లేదు. ఇరాన్ నుంచి వచ్చిన 5 బాలిస్టిక్ క్షిపణులను, 17 డ్రోన్లను అడ్డుకున్నామని యూఏఈ ఇవాళ ప్రకటించింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఫిలిప్పీన్స్ ‘జాతీయ శక్తి అత్యవసర పరిస్థితి’ని ప్రకటించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ ప్రకటన చేశారు. దేశీయ ఇంధన సరఫరాలు, ఎనర్జీ స్టెబిలిటీపై ఇరాన్ యుద్ధం వల్ల పడ్డ ప్రభావాన్ని ఆయన గుర్తు చేశారు.“పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో, దేశ ఎనర్జీ సరఫరా లభ్యత, స్థిరత్వానికి ప్రమాదం ఉండడంతో జాతీయ శక్తి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాం,” అని ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులో తెలిపారు. President Donald Trump just spoke with Prime Minister Modi. They discussed the ongoing situation in the Middle East, including the importance of keeping the Strait of Hormuz open.— Ambassador Sergio Gor (@USAmbIndia) March 24, 2026 -
13 ఏళ్ల పోరాటం : తనువు చాలించిన హరీష్ రాణా
న్యూఢిల్లీ: నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి (passive euthanasia) చట్టపరమైన ఆమోదం పొందిన భారతదేశంలోని తొలి వ్యక్తి హరీష్ రాణా కన్నుమూశారు. మంగళవారం (మార్చి 24) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కన్నుమూశారు. దీంతో హరీష్ మరణం దేశ వైద్య-చట్టపరమైన రంగంలో ఒక కీలక ఘట్టంగా మిగిలింది. మార్చి 11న సుప్రీంకోర్టు రాణా కారుణ్య మరణానికి అనుమతినిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. గౌరవప్రదమైన రీతిలో ప్రాణాలు విడిచేలా వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ ర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయనకు అందిస్తున్న లైఫ్ సపోర్టును క్రమంగా తొలగించారు. దీంతో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిగా ఉన్నప్పుడు, నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలైన 31 ఏళ్ల హరీష్ రాణా, 2013 నుంచి కోమాలో ఉన్నారు. గత దశాబ్దానికి పైగా కృత్రిమ పోషణ, అడపాదడపా ఆక్సిజన్ సహాయంతో రాణా జీవించారు. నిపుణుల పర్యవేక్షణలోమార్చి 14న రానాను ఘాజియాబాద్లోని తన నివాసం నుండి ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ హాస్పిటల్లోని పాలియేటివ్ కేర్ యూనిట్కు తరలించారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, వైద్యుల పర్యవేక్షణలో రానాకు అందుతున్న కృత్రిమ పోషకాహార మద్దతును (Artificial Nutritional Support) క్రమంగా ఉపసంహరించారు. న్యూరో సర్జరీ, ఆంకో-అనస్థీషియా, పాలియేటివ్ మెడిసిన్, సైకియాట్రీ నిపుణులు సహా, డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ బృందం ఈ ప్రక్రియను పర్యవేక్షించింది.ప్యాసివ్ యుథనేషియా అంటే ఏమిటి?కోలుకునే అవకాశం లేని రోగికి అందిస్తున్న కృత్రిమ జీవన మద్దతును (వెంటీలేటర్, ఫీడింగ్ ట్యూబ్స్ వంటివి) నిలిపివేయడం ద్వారా మరణం సంభవించేలా చేయడం. దీనిని సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక నిబంధనల మేరకు అనుమతించింది. -
బెంగళూరులో ఆయనకు రూ.200 కోట్ల బంగ్లా..
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తి వివరాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పింది. బెంగళూరులోని కోర్మంగల ప్రాంతంలో ఉన్న సుమారు రూ.200 కోట్ల విలువైన బంగ్లాను అఫిడవిట్లో ఆయన పేర్కొనలేదని కాంగ్రెస్ ఆరోపించింది.ఆ 49,000 చదరపు అడుగుల బంగ్లా సుమారు 1.07 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రీమియం ప్రాంతంలో ఉందని కాంగ్రెస్ పేర్కొంది. అఫిడవిట్లో రాజీవ్ చంద్రశేఖర్ ఇల్లు, కారు లేవని పేర్కొన్నారని కాంగ్రెస్ అంటోంది. ఇదే చిరునామాలో తన నివాసంగా ఉందని గతంలో రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్లో పేర్కొన్నట్లు కాంగ్రెస్ తెలిపింది.ఆస్తికి సంబంధించిన పన్నును మార్చి 17న చెల్లించారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నేమోం నియోజకవర్గం నుంచి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్న సమయంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన మొత్తం ఆస్తి విలువ రూ.93 కోట్లకు పైగా ఉంది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ఆయన లేదా బీజేపీ నుంచి స్పందన లేదు. ఇప్పుడు ఈ విషయంపై ఎన్నికల సంఘం తీసుకునే చర్యపై అందరి దృష్టి ఉంది. రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ను రద్దు చేయాలని కాంగ్రెస్ కోరింది. కాగా, కేరళ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. Dear @Ceokerala,BJP candidate from Nemom constituency, Rajeev Chandrasekhar, has not disclosed his residence, a 49,000 sq.ft mansion in Koramangala 3rd Block, Bengaluru, in his affidavit.This is a 1.07 acre property in one of the most expensive locations in the country, where… pic.twitter.com/pyyzD5Sft7— Congress Kerala (@INCKerala) March 23, 2026 -
అక్కడ నుంచే విజయ్ ఎన్నికల ప్రచారం?
చెన్నై: ఎన్నికల పనులను పర్యవేక్షించడం కోసం చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నామ్ తమిళర్ కట్చి, తమిళగ వెట్రి కళగం మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, తమిళనాడు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. అయితే, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ స్వయంగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే, పెరంబూర్ పరిధిలోని కొడుంగయ్యూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్లో విజయ్ ఓ బంగ్లాను సొంతంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ బంగ్లాలోనే ఉండి పనులు పర్యవేక్షించాలని విజయ్ భావిస్తున్నారని.. రేపు ఉదయం(బుధవారం) ఈ బంగ్లాలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీ
ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘాజియాబాద్లోని ఒక హై-రైజ్ సొసైటీలో 42 ఏళ్ల జ్యోతిష్కుడు రాజ్వీర్ ఆత్మహత్య మిస్టరీ వీడింది. జ్యోతిష్కుడిగా ఉంటూ ఇతరుల జాతకాలు చెప్పే వ్యక్తి, అప్పుల భారం, కుటుంబ సమస్యలతో ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజ్వీర్ 13వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్వీర్ ఆత్మహత్య తర్వాత, పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేయగా గ్రౌండ్ ఫ్లోర్లోని ఫ్లాట్లో దుప్పటిలో చుట్టి ఉన్న అతని 70 ఏళ్ల తల్లి సత్నాం మృతదేహం కనిపించింది. బాడీమీద ఎలాంటి గాయాలు లేకపోవడంతో హత్య అనేకోణాన్ని పోలీసులు కొట్టిపారేశారు. కనీసం రెండు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక తర్వాతే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.అమ్మతో పాటే నేనుతల్లి చనిపోతే తాను కూడా చనిపోతానని రాజ్వీర్ గతంలో సన్నిహితులతో చెప్పేవాడని సమాచారం. తల్లి మృతదేహంతో రెండు రోజులు గడిపిన తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. లక్షల అప్పు, భార్యతో విభేదాలురాజ్వీర్కు సుమారు 15 - 16 లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే భార్య, కుమారుడికి దూరంగా ఉంటున్నాడు. గత నాలుగు నెలలుగా అతను ఇంటి ఖర్చులకు ఎటువంటి ఆర్థిక సాయం చేయడం లేదని అతని భార్య తెలిపింది.ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు రాజ్వీర్ తన మొబైల్ ఫోన్ లాక్ కోడ్ను భార్యకు మెసేజ్ చేశాడు. పోలీసులు ఆ ఫోన్ను తనిఖీ చేయగా, హర్యానాకు చెందిన ఒక మహిళతో అతను ప్రేమలో ఉన్నాడని, తనకు విడాకులు అయ్యాయని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిసింది. రాజ్వీర్ తండ్రిని, సోదరుడిని కోల్పోయాడు. పొరుగువారితో పెద్దగా మాట్లాడేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే తీవ్ర నిరాశకు లోనైన అతను కఠిన నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. -
టెలికాం కంపెనీల నయా దోపిడీ.. రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు
సాధారణంగా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే.. ప్లాన్ను బట్టి డేటా, టాక్టైమ్ వేరుగా ఉంటాయి. టాక్టైమ్ విషయం పక్కన పెడితే.. డేటా మాత్రం ఉపయోగించినా?, ఉపయోగించకపోయినా? రోజు పూర్తవగానే (అర్ధరాత్రి 12 తరువాత) డేటా ఎక్స్పైరీ అవుతుంది. ఆ తరువాత మరుసటి రోజు డేటా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.రాఘవ్ చద్దా రాజ్యసభలో మొబైల్ డేటా వినియోగంపై ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. తన అభిప్రాయం ప్రకారం.. టెలికాం కంపెనీలు వినియోగదారులకు న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. వినియోగదారులు తమ డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకునే హక్కు కలిగి ఉండాలి వాదించారు.భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అవసరం చాలా అవసరం. కాబట్టి మొబైల్ డేటా వినియోగం ప్రతి ఒక్కరికి ముఖ్యమే. అయితే, టెలికాం సంస్థలు అందిస్తున్న డేటా ప్లాన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని రాఘవ్ చద్దా సూచించారు.ప్రస్తుతం చాలా కంపెనీలు రోజువారీ డేటా పరిమితులతో (1.0 జీబీ, 1.5 జీబీ, 2 జీబీ వంటి) ప్లాన్లు అందిస్తున్నాయి. కానీ వినియోగదారు ఆ రోజు మొత్తం డేటాను ఉపయోగించకపోతే.. మిగిలిన డేటా రాత్రి 12 గంటలకు పూర్తిగా రద్దవుతుంది. అంటే.. వినియోగదారు తన డబ్బుతో కొనుగోలు చేసిన డేటాను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడు. ఇది వినియోగదారుల పట్ల అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.ఇతర సేవలతో పోలిస్తే ఈ పరిస్థితి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఉదాహరణకు.. మనం ఒక లీటర్ పెట్రోల్ కొట్టించామంటే అది పూర్తయ్యే వరకు ఉపయోగిస్తాం. విద్యుత్ ఎంత వినియోగిస్తారో.. దానికి మాత్రమే డబ్బు చెల్లిస్తాము. కానీ కానీ మొబైల్ డేటా విషయంలో మాత్రం వినియోగించని డేటా కూడా కోల్పోతున్నాం. డబ్బు మాత్రం చెల్లించాలి. ఇది సరైన విధానం కాదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.డేటా రోల్ఓవర్పై రాఘవ్ చద్దా డిమాండ్మిగిలిపోయిన రోజువారీ డేటాను వృధా చేయకుండా తర్వాతి రోజుకు బదిలీ (Rollover) చేయాలిఉపయోగించని డేటా విలువను తర్వాతి రీఛార్జ్ ప్లాన్లలో తగ్గించి వినియోగదారులకు ఊరటనివ్వాలిమిగులు డేటాను ఇతరులకు బదిలీ చేసుకునే వెసులుబాటును టెలికం కంపెనీలు… pic.twitter.com/mjCA509IK5— greatandhra (@greatandhranews) March 23, 2026పరిష్కార మార్గాలుడేటా పూర్తిగా వినియోగించకపోతే.. మిగిలిన డేటాను కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దీనికి మూడు పరిష్కార మార్గాలున్నాయని రాఘవ్ చద్దా వెల్లడించారు.డేటా రోల్ఓవర్: ఒక రోజు వినియోగించని డేటా తరువాతి రోజు ఉపయోగించడానికి అవకాశం ఇవ్వాలి. ఇది వినియోగదారులకు న్యాయం చేస్తుంది.డిస్కౌంట్ లేదా సర్దుబాటు: వినియోగదారులు తరచుగా తక్కువ డేటా వినియోగిస్తే, వారికి వచ్చే నెల రీచార్జ్లో తగ్గింపు ఇవ్వాలి.డేటా బదిలీ: వినియోగించని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు పంపే అవకాశం కల్పించాలి. డేటాను వినియోగదారుల డిజిటల్ ఆస్తిగా పరిగణించాలి.ఇదీ చదవండి: 26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్! -
నో క్యాస్ట్, నో జెండర్, లక్షల్లో సైన్యం : అవిముక్తేశ్వరానంద ప్లాన్
ఉత్తరాఖండ్లో, జోషిమఠంలోని జ్యోతిష్ పీఠాధిపతి, శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద (Avimukteshwaranand) సంచలన ప్రకటన చేశారు. రెండు లక్షల మందితో కూడిన ఒక 'సైన్యాన్ని' ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించారు. వీరిలో పురుషులు, స్త్రీలు,తృతీయ లింగ (Third gender) తో అన్ని కులాల వారు ఉంటారని ప్రకటించారు.సంప్రదాయ , ఆధునిక ఆయుధాలతో సన్నద్ధమయ్యే ఈ 'సైన్యం', గో సంతతిని, హిందూ ధర్మాన్ని రక్షిస్తుందని ప్రస్తుతం యూపీలోని వారణాసిలో ఉంటున్న ఈ మత గురువు, తెలిపారు. ' ధర్మాన్ని, సంస్కృతిని , సమాజాన్ని రక్షించే ఈ 'సైన్యంలో' అన్ని హిందూ కులాలకు చెందిన 2,18,000 మంది సైనికులుగా చేర్చుకుంటామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వచ్చే మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లో ఈ 'సైన్యం' ప్రారంభిస్తామని అవిముక్తేశ్వరానంద తెలిపారు. దీనికి 'చతురంగిణి సేన' అని పేరుకూడా పెట్టారు.'చతురంగిణి సేన'2.8 లక్షల మందితో కూడిన ఈ సైన్యం హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, గోవంశాన్ని రక్షిస్తుంది.మహాభారత కాలంలోలాగా కాలబలం, అశ్వబలం, గజబలం, రథబలం అనే నాలుగు విభాగాలతో ఇది ఉంటుంది. అన్ని హిందూ కులాల నుండి పురుషులు, మహిళలు , థర్డ్ జెండర్కి చెందిన వారు ఈ సైన్యంలో ఉంటారు.వివాదాలు, చట్టపరమైన చిక్కులు'సైన్యం’ ఏర్పాటు ప్రకటన వివాదాన్ని రేపింది. ముఖ్యంగా అవిముక్తేశ్వరానంద, ఆయన మద్దతు దారులు గొడ్డలి నమూనాలను ప్రదర్శించడంపై అధికార యంత్రాంగం నిశితంగా గమనిస్తున్నట్టు సమాచారం. లైసెన్సు లేని ఆయుధాలను కలిగి ఉండటం చవాటిని బహిరంగంగా ప్రదర్శించడం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.యోగితో వైరం: మరోవైపు గత నెలలో, ప్రయాగ్రాజ్లో మాఘ మేళా సందర్భంగా, పల్లకీలో 'సంగమం' వైపు వెళ్లడానికి అనుమతి లభించకపోవడంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను విమర్శించి అవిముక్తేశ్వరానంద వార్తల్లో నిలిచారు.ఇదీ చదవండి: జస్ట్ నిమిషాల్లో, దోసకాయ పచ్చడి : నటి వీడియో వైరల్'పోక్సో'కేసు: ఆశుతోష్ బ్రహ్మచారి అనే మరో మత పెద్ద ఫిర్యాదు మేరకు గతంలో అవిముక్తే శ్వరానంద్పై ఉత్తరప్రదేశ్ పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుండి 'బటుక్లు' అని పిలిచే యువ శిష్యులను ప్రయాగ్రాజ్లోని శంకరాచార్యుల ఆశ్రమానికి తీసుకువచ్చి,వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బ్రహ్మచారి ఆరోపించారు. అయితే, సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శంకరాచార్య కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. (45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్) -
వామ్మో.. బంగాళా దుంపలను ఇలాక్కూడా కడుగుతారా?
ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారులు ఆటలాడుకుంటున్నారు. అపరిశుభ్రత ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు స్ట్రీట్ ఫుడ్ను ఇష్టపడేవారికి షాకయ్యేలా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో వైరల్గా మారింది. దుకాణదారుడు బంగాళా దుంపలను చేతులతో కాకుండా.. ఏకంగా కాళ్లతో.. అది కూడా చెప్పులు వేసుకుని కడుగుతున్న దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.ఘాజీబాద్లోని డిఎల్ఎఫ్ అంకుర్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో తీసిన మహిళ మాట్లాడుతూ.. ఓ ఆలూ టిక్కీ షాపులో ఈ దారుణం జరుగుతోందని.. తన తల్లి కూడా అక్కడ చాట్ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులు వేసుకుని మరీ బంగాళాదుంపలను కాళ్లతో కడగడం అత్యంత సిగ్గుచేటు అంటూ ఆమె మండిపడ్డారు.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘాజీబాద్ ప్రాంతం.. బంగాళాదుంపతో పరిశుభ్రతకు కొత్త అర్థాన్ని ఇస్తోందంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. "వావ్, అద్భుతమైన పరిశుభ్రత!" అంటూ మరొకరు వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టారు. "మీకు ఇది చూసి అసహ్యం వేస్తోందా? అయితే ఒకసారి ఆవకాయ తయారీ ఫ్యాక్టరీకి వెళ్లి చూడండి.. ఆ తర్వాత మీరు ఎప్పటికీ పచ్చళ్లు తినరంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. "బయట తిండిపై నమ్మకం పోయింది.. ఇంట్లో వండిన ఆహారమే మిన్న అంటూ పలువురు అభిప్రాయపడ్డారు.What kinda people are they?😭this man is cleaning potatoes with his feet.The video is from Loni, Ghaziabad.pic.twitter.com/4JaYKJzDjU— Ghar Ke Kalesh (@gharkekalesh) March 23, 2026ఇలాంటి ఘటనలు బయటపడటం ఇదే మొదటిసారి కాదు.. ఇదే నెలలో థానేలోని ఒక వీధి వ్యాపారి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసి.. చేతులు కడుక్కోకుండానే తిరిగి వచ్చి పాప్కార్న్ అమ్మడం కనిపించింది. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి ఆన్లైన్లో షేర్ చేయడంతో వైరల్గా మారిన సంగతి తెలిసిందే.. -
యుద్ధం వల్ల భారత్కు ఈ సవాళ్లు ఎదురయ్యాయి: మోదీ
ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ చోటుచేసుకున్న పరిస్థితులపై ఇవాళ రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఇరాన్ యుద్దానికి పరిష్కారమని, ఉద్రిక్తత తగ్గించేందుకు భారత్ ప్రయత్నాలు చేసిందని అన్నారు. దేశం ఐక్యంగా ఉంటే ఏ సవాలునైనా ఎదుర్కోగలమని తెలిపారు.‘యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. భారత్కు ఆర్థిక, భద్రత, మానవతా సవాళ్లు ఎదురయ్యాయి. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు ఉన్నారు. వారి భద్రతకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు 3.75 లక్షల భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇరాన్ నుంచి సుమారు 1,000 మంది భారతీయులను తరలించాం. అందులో 700 మందికి పైగా మెడికల్ విద్యార్థులు ఉన్నారు.విదేశాల్లోని భారత మిషన్లు 24/7 సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. హెల్ప్లైన్లు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశాం. హార్మూజ్ జలసంధిలో నౌకాయానం కష్టతరం. అయినప్పటికీ ఇంధన సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నాం. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు ఉన్నాయి.ప్రస్తుతం 41 దేశాల నుంచి ఇంధన దిగుమతులు జరుగుతున్నాయి. ఎల్పీజీలో దేశీయ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశీయ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాం. ఎథనాల్ బ్లెండింగ్ వల్ల చమురు దిగుమతులు తగ్గిస్తున్నాం. రైల్వే విద్యుతీకరణతో డీజిల్ వినియోగం తగ్గిస్తున్నాం.ఎరువుల సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ డిమాండ్కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయి. రిన్యూవబుల్ ఎనర్జీలో భారత్ పురోగతి సాధించింది. తప్పుడు ప్రచారం, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. విదేశాల్లో ఉన్న భారతీయులందరి రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారు’ అని మోదీ చెప్పారు. -
టీ ఎక్కడ? టిఫిన్ లేకపోతే ఎలా?
ఎన్నికలంటేనే కొందరికి ఎక్కడాలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఏదో ఒక పార్టీని ఎంచుకుని, ప్రచారపర్వంలో వెన్నంటి ఉంటూ.. జై కొడితే చాలు.. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సమయానికి చాయ్, స్నాక్స్, రాత్రవ్వగానే బీరు, బిర్యానీకి ఢోకా ఉండదు. కానీ, ఇప్పుడు భారత్లో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారపర్వం పేలవంగా సాగుతోందని చెప్పవచ్చు. అందుకు కారణం.. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొనడం.. చమురు సరఫరా తగ్గడమే..! దానికీ.. ఎన్నికల ప్రచారానికి సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా?ఇరాన్ యుద్ధం కారణంగా ఈ సారి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం భిన్నంగా సాగుతోంది. కొన్ని చోట్ల నామినేషన్ల ఘట్టం ముగిసింది. అయినా.. ప్రచారం హడావుడి కనిపించడం లేదు. అక్కడక్కడా ప్రచారాలు జరుగుతున్నా.. అభ్యర్థులు తమ మద్దతుదారులకు టిఫిన్ పెట్టించడం మాట పక్కనపెడితే.. టీ తాగించే అవకాశం లేకుండా పోతోంది. గ్యాస్ కొరత కారణంగా చిన్నాచితకా హోటళ్లు దాదాపుగా మూతపడ్డాయి. ఛాయ్ కోసం నిరంతరం స్టౌని వెలిగించాల్సి ఉంటుంది. లేదంటే.. ఫ్లాస్క్లను వాడాలి. దీంతో.. రోడ్డుపక్కన హోటళ్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఒక్కో అభ్యర్థి వెంట కనీసం 200 మంది కార్యకర్తలు, మద్దతుదారులు ఉంటారు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లలో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. గ్యాస్ సంక్షోభం కారణంగా ఇప్పుడు వీరికి టీ ఇవ్వలేకపోతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.బ్లాకులో గ్యాస్ను కొనే స్తోమతలేదుటీ మాటను అటుంచితే.. మధ్యాహ్న భోజనం, బిర్యానీల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నాచితకా హోటళ్లు, బడ్జెట్ టిఫిన్ సెంటర్లు బ్లాకులో గ్యాస్ను కొనే స్తోమతలేక.. పరిమితంగా ఆహారపదార్థాలను తయారు చేస్తున్నాయి. బడా హోటళ్లలో ధరాఘాతం తప్పదు. పైగా.. కొన్ని హోటళ్లు ఏకంగా గ్యాస్ సెస్ని విధిస్తున్నాయి. తమిళనాడులో ఈ నయా సంస్కృతి తీవ్రంగా ఉంది. దీంతో.. కొందరు అభ్యర్థులు వంట మనుషులను నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆహార పదార్థాల ముడిసరుకును అందజేస్తే.. వీరు వంటచెరుకుతో భోజనాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.మెనూలోంచి దోశ, బోండా ఔట్మరికొన్ని చోట్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాలుగైదు వందల మంది కార్యకర్తలు అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నా.. వారికి భోజనం కాదు కదా.. కనీసం టీ దొరకడం లేదు. ఎక్కువ మంట అవసరం ఉండే పరోటాలు, దోశలు, బోండాలు అస్సలు లభించడం లేదు. కేరళలోని కోళికోడ్ పరిధిలో ఉన్న మావూర్ రోడ్లోని ఇండియన్ కాఫీ హౌస్ ఏకంగా తన మెనూలోంచి వీటిని తీసివేయడం గమనార్హం..! ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అక్కడ పరోటా, నాన్ వెజ్ కర్రీ దొరుకుతున్నా.. ధరలను విపరీతంగా పెంచారు. ఈస్టర్ సమీపిస్తుండడంతో.. బ్రాయిలర్ కోళ్లు, గుడ్ల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ సంక్షోభం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేస్తామని కేరళ, తమిళనాడు హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్ యుద్ధం మరో రెండుమూడు వారాలు కొనసాగితే.. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. - వెబ్డెస్క్ -
జస్ట్ నిమిషాల్లో, దోసకాయ పచ్చడి : నటి వీడియో వైరల్
ప్రముఖ బాలీవుడ్ నటిఅశ్విని కల్సేకర్ దోసకాయపచ్చడి తయారు చేసి చూపించారు. అదీ జస్ట్ నిమిషాల్లోనే అంటూ ఆమె చేసిన పోస్ట్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అశ్విని కల్సేకర్ మరెవ్వరో కాదు ప్రముఖ నటుడు మురళి శర్మ భార్య. పదండి మరి కమ్మని దోసకాయ పచ్చడి మేకింగ్ కథ ఏంటో తెలుసుకుందాం.గోల్మాల్ అంధాధున్, జోధా అక్బర్ లాంటి పాపులర్ మూవీలు, టీవీ షోలతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్ నటి అశ్విని కల్సేకర్. తరచుగా సోషల్ మీడియాలో పలు వంటల గురించి ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా నిమిషాల్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిన వీడియో వైరల్గా మారింది.దోసకాయ పచ్చడి రెసిపీ ఈ సాంప్రదాయ ఆంధ్ర-శైలి చట్నీ పుల్ల పుల్లగా, పంటి కింద పచ్చదోసకాయ ముక్కలు తగులుతూ ఉండే రుచిని అందరూ ఇష్టపడతారు. దీనిని సాంప్రదాయకంగా పసుపు దోసకాయ (దోసకాయ), కొత్తిమరీ, చింతపండు , వేయించిన దినుసులతో తయారు చేస్తారు.ఇదీ చదవండి: 45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్అశ్విని షేర్ చేసినరెసిపీ : ముందుగా దోసకాయ తొక్క తీసి, గింజలు తొలగించి (కొంతమంది గింజలు వేసుకుంటారు), చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత, ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి, 2 టేబుల్ స్పూన్ల మినప పప్పు వేసి, ఎర్రగా వేగాక, కొద్దిగా మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఎండు, పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని ఇంగువ వేసి వేయించాలి. ఆ తరువాత స్టఫ్ ఆఫ్ చేసి, ఈ పోపులోనే కొద్దిగా చింతపండు గుజ్జు , ఒక చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. View this post on Instagram A post shared by Ashwini kalsekar (@ashwinikalsekar)తరువాత కొత్తి మీర, దోసకాయ ముక్కల్ని పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఉండేలా మిక్సీ పట్టాలి. అంతే ఈ మిశ్రమాన్ని పోపులో వేసి కలుపుకోవడమే. ఈ చట్నీని అన్నం, రోటీతో గానీ ఆస్వాదించవచ్చు అంతకు ముందు కూడా అశ్విని అన్నం లేదా పూరీతో కలిపి తినే,, కొంకణి శైలి బంగాళదుంప కూర అంబట్ బటాటా రెసిపీని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.థఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు -
వీడియో వైరల్: భోజనంలో బల్లి.. ఆ విషయం తెలిసి కూడా తినేశాడు?!
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యూఐటీ–ఆర్జీపీవీ) హాస్టల్ మెస్లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భోజనం చేస్తున్న ఓ విద్యార్థి ప్లేట్లో బల్లి కళేబరం (లిజార్డ్) కనిపించింది.దీంతో ఆ విద్యార్థి మెస్ సిబ్బందిని నిలదీశాడు. ‘అన్నా, ఇది ఏమిటో చూడండి. నాకు అనుమానం వస్తోంది’ అని ప్రశ్నించాడు. సిబ్బంది మాత్రం ‘ఇది బల్లి కాదు, సిమ్లా మిర్చి (క్యాప్సికమ్)’ అని సమాధానం ఇచ్చారు. విద్యార్థి మాత్రం ‘ఇది బల్లే.. గుడ్లు తేలేసింది’ అని వాదించాడు. ఈ మాటలతో అసహనానికి గురైన ఓ సిబ్బంది, ప్లేట్లో ఉన్న ఆ ముక్కను తీసుకుని తిన్నాడు. ‘ఇది బల్లి కాదు.. క్యాప్సికమే’ అని నిరూపించడానికి ప్రయత్నించాడు.ఈ ఘటనను తోటి విద్యార్థులు వీడియోగా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో మెస్ పరిశుభ్రతపై విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. నెటిజన్లు సిబ్బంది ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్లేట్లో నిజంగా బల్లి కళేబరమేనా? లేక క్యాప్సికమ్ ముక్కనా? అన్నది స్పష్టంగా నిర్ధారణ కాలేదు. UIT RGPV Bhopal: A student allegedly claimed a lizard in his mess food.When he complained, the staff denied it and said it was capsicum, and later ate the lizard to prove their pointhttps://t.co/Wa6uBFIf5Y— Ghar Ke Kalesh (@gharkekalesh) March 22, 2026 -
పండుగలకు వంటగ్యాస్ సిలిండర్ ఉచితం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రజలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీపి కబురు అందించారు. మంగళవారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ₹1,03,700 కోట్లతో భారీ బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రసంగం చేసిన సీఎం, సామాన్యులపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా హోలీ, దీపావళి పండుగల సందర్భంగా ప్రతి ఇంటికి ఒక ఉచిత ఎల్పీజీ సిలిండర్ను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ. 260 కోట్లను కేటాయించారు.మౌలిక సదుపాయాలకు పెద్దపీటఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కోసం రూ.11,666 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, నగర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. గతంలో (2018-2020 మధ్య) ఉచిత పథకాల సంస్కృతి వల్ల ఆదాయం తగ్గిందని, అయితే ఇప్పుడు ఢిల్లీ తలసరి ఆదాయం దేశంలోనే మూడవ స్థానంలో ఉందని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. ఈ ఏడాది పన్నుల ద్వారా రూ.74,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.బడ్జెట్లోని కీలక అంశాలురవాణా - రోడ్లు: పీడబ్ల్యూడీ (పీడబ్ల్యూడీ)రూ. ₹5,921 కోట్లు, రోడ్ల కోసం రూ.1,352 కోట్లు కేటాయించారు. సుమారు 750 కిలోమీటర్ల మేర రోడ్ల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. విద్యుత్ రంగానికి రూ.3,942 కోట్లు, ఓవర్ హెడ్ వైర్ల తొలగింపుకు రూ. 200 కోట్లు కేటాయించారు. ఢిల్లీ జల బోర్డుకు రూ. 9,000 కోట్లు కేటాయిస్తూ, ట్యాంకర్ల అవసరం లేకుండా ఇంటింటికీ నీరు అందించడమే లక్ష్యమని సీఎం చెప్పారు.అగ్నిమాపక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.674 కోట్లు కేటాయించారు. యమునా ప్రాంతానికి ₹300 కోట్లు, గ్రామీణ వికాస బోర్డుకు ₹787 కోట్లు కేటాయించారు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ట్రాన్స్జెండర్లు, గిగ్ వర్కర్లు, కార్మికులతో ముందస్తుగా చర్చించి, వారి సూచనల మేరకు ఈ బడ్జెట్ను రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఒక రోడ్మ్యాప్ అని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?.. వివాదంలో హీరో మోహన్లాల్? -
త్వరలో బీటీ పత్తి విత్తనాల గరిష్ట ధరల ప్రకటన!
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పత్తి రైతులకు కీలకమైన బీటీ పత్తి విత్తనాల గరిష్ట విక్రయ ధరను (ఎంఆర్పీ) కేంద్ర వ్యవసాయ శాఖ త్వరలోనే ఖరారు చేయనుంది. 2026-27 సీజన్కు సంబంధించి బోల్గార్డ్-1 (బీజీ-1), బోల్గార్డ్-2 (బీజీ-2) రకాల ధరలపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. అయితే, ప్రభుత్వం పత్తి విత్తనాలపై ప్రకటించేది గరిష్ట ధర మాత్రమే. కంపెనీలు లేదా డీలర్లు అంతకంటే తక్కువ ధరకే విక్రయించవచ్చు కానీ, ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు.ధరల్లో మార్పు ఉంటుందా?గత కొన్నేళ్ల ధోరణిని పరిశీలిస్తే ఈ ఏడాది విత్తన ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, తుది నిర్ణయం ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సి ఉంది. గత ఏడాది (2025-26) బీజీ-2 450 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.900గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు 2024-25లో ఇది రూ.864గా ఉండేది. 2016లో ధరల నియంత్రణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీజీ 1 ధర రూ.635 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.2019-20లో కూడా ప్రభుత్వం ధరలను పెంచకుండా యథాతథంగా ఉంచిన దాఖలాలు ఉన్నాయి. గత ఏడాది సుమారు 4 శాతం మేర ధరలు పెరిగినందున ఈసారి పెంచకపోయినా విత్తన పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.ధరల నియంత్రణపై భిన్నాభిప్రాయాలుకాటన్ సీడ్స్ ప్రైస్ ఆర్డర్-2015 ప్రకారం, ధర పెంచినా పెంచకపోయినా ఏటా ప్రభుత్వం ఎంఆర్పీని నోటిఫై చేయడం చట్టపరమైన బాధ్యత. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2016కు ముందు విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విత్తనాలను విక్రయించి రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. అందుకే ప్రభుత్వం గరిష్ట ధరను (క్యాప్) నిర్ణయిస్తోంది. ఇది రైతులకు రక్షణ కవచం లాంటిదని అధికారులు పేర్కొంటున్నారు.బీటీ పత్తి విత్తనాల ధరల నిర్ణయాన్ని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) వ్యతిరేకిస్తోంది. బీటీ విత్తనాలకు ధర నిర్ణయించడం వల్ల నాన్-జీఎం (సాధారణ) పత్తి విత్తనాలు కేవలం రూ.300-400కే లభిస్తున్నాయని, అలాగే గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి బీటీ విత్తనాలకు తగ్గిపోతోందని వారు వాదిస్తున్నారు.సాగులో బీటీ పత్తిదే హవా..కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ గత నెల లోక్సభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశంలోని మొత్తం పత్తి సాగు విస్తీర్ణంలో 95 శాతం బీటీ పత్తిదే. అయితే, బీటీ పత్తిలోని ప్రొటీన్ను తట్టుకునే సామర్థ్యాన్ని గులాబీ రంగు పురుగు పెంచుకోవడం ఇప్పుడు శాస్త్రవేత్తలను, రైతులకు ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి పండించే అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పురుగు ఉధృతి పెరగడం సాగు ఖర్చును పెంచుతోంది.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?.. వివాదంలో హీరో మోహన్లాల్?
తిరువనంతపురం: మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ల మధ్య సాగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో రచ్చ చేస్తోంది. ‘కందుం మిండియుం ఇరువర్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ. 11.21 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించడం తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ చర్చ అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టింది.ఆర్టీఐ ద్వారా వెలుగులోకి..తిరువల్లకు చెందిన రిజో వల్లంకుళం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వేసిన దరఖాస్తుతో ఈ ఖర్చుల వివరాలు బయటపడ్డాయి. ఈ ఇంటర్వ్యూ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 11,21,000 ఖర్చు చేసినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ వెల్లడించింది.రెండు రోజుల షూటింగ్ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘క్లిఫ్ హౌస్’లో రెండు రోజుల పాటు ఈ ఇంటర్వ్యూ చిత్రీకరణ జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం దీనిని తెరకెక్కించింది. పినరయి విజయన్ రాజకీయ ప్రస్థానం, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలతో రూపొందిన ఈ ఇంటర్వ్యూ టీజర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో తిరువనంతపురంలో జరిగిన ఒక భేటీలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రతిపాదన చేయగా, మోహన్లాల్ వెంటనే అంగీకరించినట్లు సమాచారం.విపక్షాల ధ్వజంప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పినరయి విజయన్ తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా మోహన్లాల్ 2011 ఎన్నికల సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేశారు. అయితేఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ వివాదాస్పద ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్.. పెరిగిన ఉత్పత్తి!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా సామాన్యుడిపై భారం పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పెరిగిన స్వదేశీ ఉత్పత్తిఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాకముందు వరకు భారతదేశ అవసరాల్లో స్వదేశీ ఎల్పీజీ ఉత్పత్తి వాటా 40% మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో దీన్ని 50-60%కి పెంచినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.గత కొద్ది రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు అవసరం ఉన్నా, లేకపోయినా బుకింగ్స్ చేశారు. అయితే, ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ నిలకడగా ఉందని, ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బుకింగ్స్ కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ‘మేము నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తున్నాం. దేశవ్యాప్తంగా సిలిండర్ల డెలివరీ సాధారణంగానే సాగుతోంది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సుజాత శర్మ చెప్పారు.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
సుప్రీం కోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ: మత మార్పిడిలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మతం మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు కోల్పోతాడని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మతం మార్చుకున్న వెంటనే ఎస్సీ హోదా రద్దు అవుతుందని స్పష్టం చేసింది. -
‘సుప్రీం’ తీర్పు: మహిళా సైనికాధికారులకు బిగ్ రిలీఫ్
న్యూఢిల్లీ: భారత సైన్యంలో లింగ సమానత్వం దిశగా అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మహిళా సైనిక అధికారులకు శాశ్వత కమిషన్ (Permanent Commission) కల్పించే విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగిస్తూ, మహిళా అధికారుల హక్కులను కాపాడుతూ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.పెన్షన్ కష్టాలకు చెక్..ఈ తీర్పుతో ముఖ్యంగా షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్లకు (SSCOs), ఈ న్యాయపోరాటంలో భాగస్వాములైన అధికారులకు భారీ ఊరట లభించింది. కేసు విచారణ దశలో ఉండగా, వివిధ కారణాలతో సర్వీస్ నుండి తప్పుకున్న లేదా విడుదలైన మహిళా అధికారులు కూడా ఇకపై పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు అర్హులని కోర్టు స్పష్టం చేసింది. వారు 20 ఏళ్ల సర్వీసును పూర్తి చేసినట్లుగానే పరిగణించాలని కేంద్రానికి దిశానిర్దేశం చేసింది.ముఖ్యమైన అంశాలుశాశ్వత కమిషన్: మహిళా అధికారులకు ఇప్పటికే మంజూరు చేసిన శాశ్వత కమిషన్లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్వర్క్లో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది.పెన్షన్ అర్హత: సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న పెన్షన్ సమస్యకు ఈ తీర్పుతో పరిష్కారం లభించింది.బకాయిలు ఉండవు: పెన్షన్ ప్రయోజనాలు కల్పించినప్పటికీ, గత కాలానికి సంబంధించిన జీతభత్యాల బకాయిలను మాత్రం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.లింగ సమానత్వానికి మరో విజయంసాయుధ దళాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని, వారి సేవలను గుర్తిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలవనుంది. కేవలం ఉద్యోగ భద్రత మాత్రమే కాకుండా, పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా పెన్షన్ హక్కును కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత సైన్యంలో మహిళా అధికారుల సేవా నిబంధనలను బలోపేతం చేయడంలో ఈ తీర్పు కీలకం కానుంది.ఇది కూడా చదవండి: ‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్! -
Delhi : ‘అసెంబ్లీ,మెట్రో స్టేషన్ను బాంబులతో పేల్చేస్తాం’
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ను బాంబులతో పేల్చేస్తామంటూ స్పీకర్ విజేందర్ గుప్తకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విజేందర్ గుప్తా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. డాగ్ స్క్వాడ్తో అణువణువూ గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులు తొలిసారి మంగళవారం ఉదయం 7.28గంటల సమయంలో అసెంబ్లీ అధికారిక మెయిల్స్కు వచ్చింది. 21 నిమిషాల వ్యవధిలో సరిగ్గా ఉదయం 7.49 గంటలకు అసెంబ్లీ స్పీకర్కు మరో మెయిల్ వచ్చింది. ఖలిస్తానీ వేర్పాటు వాదుల పేరిట వచ్చినట్లు అనుమానిస్తున్న ఆ ఈమెయిల్స్లో మధ్యాహ్నం 1.11గంటలకు ఢిల్లీ అసెంబ్లీ, సాయంత్రం 9.11గంటలకు ఢిల్లీ మెట్రో స్టేషన్ను బాంబులతో పేల్చివేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ,మెట్రో స్టేషన్తో పాటు అగంతకులు ప్రస్తావించిన ఇతర ప్రాంతాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు -
మోకాలిని చితక్కొట్టిన ఖాకీలు
కర్ణాటక: ఉగాది పండుగ రోజున ఇస్పేటు ఆడుతున్న వందలాది మందిపై పోలీసులు దాడి చేసి ఓ వ్యక్తి మోకాలు ముక్కలయ్యేలా కొట్టారు, దీంతో బాధితుని కుటుంబం, గ్రామస్తులు పోలీసులపై ఫిర్యాదు చేశారు. వివరాలు.. మండ్య తాలూకాలోని కాలెనహళ్లి గ్రామానికి చెందిన కేసీ గిరీష్ బాధితుడు, 19వ తేదీ సాయంత్రం మండ్య రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రసూల్సాబ్ గౌండి, సిబ్బంది ధనంజ, ప్రకాష్" కుమార్ దాడి చేసి లాఠీతో అతని మోకాలి చిప్పను పగలగొట్టారు. ఇస్పేటు ఆడుతున్న జనాలపైకి యూనిఫామ్లు ధరించకుండా ప్రైవేట్ వాహనంలో వచ్చిన పోలీసులు దాడిచేసి ఇష్టానుసారం చితకబాదారు. గిరీష్ మోకాలి చిప్ప పగిలిపోయిందని, మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి్పంచామని అతని కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపారు. ఎస్ఐ రసూల్, ఇతర పోలీసులను సస్పెండ్ చేసి కేసు పెట్టాలి, తమకు వైద్యఖర్చులను అందజేయాలని మండ్య రూరల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
కాషాయ పార్టీదే హవా.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా అధికారపక్షం కొనసాగింపు కోసం జరగనున్నాయని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అస్సాంలో తాజాగా నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు వెల్లడైంది.2026 మార్చి 9 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి రెండో ట్రాకర్ పోల్ సర్వే అస్సాం ఓటర్ల మూడ్ను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ఈ ఎన్నికలు అధికార మార్పు కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు. ఇది అస్సాంలో గత ఐదేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతగా కనిపించడం లేదు. స్థిరత్వం, నాయకత్వం, అభివృద్ధి అనే మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వేలో తేలింది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే 69 నుంచి 73 సీట్లు గెలుచుకునే అవకాశముందని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడైంది. అంటే, బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటే స్థాయిలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 26 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఈ తేడా కేవలం సీట్ల సంఖ్యలోనే కాకుండా రాజకీయంగా స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపుతోంది.ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరింత బలపడే అవకాశం ఉంది. అస్సాంలో బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ 8 నుంచి 11 సీట్లు, బీపీఎఫ్ 8 నుంచి 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఎన్డీయే కూటమి 90 సీట్లు కైవసం చేసుకునే అవకాశముంది. ఇది సాధారణ విజయం కాదు. ఇది స్పష్టమైన ప్రజా తీర్పు, స్థిరమైన ప్రభుత్వానికి సంకేతంగా చూడాలి. మరోవైపు ఏఐయూడీఎఫ్, రైజోర్ దల్, యూపీపీఎల్, ఏజీపీ, సీపీఐ(ఎం) వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో పరిమిత స్థాయిలోనే ప్రభావం చూపే పరిస్థితి ఉంది.అయితే, ఈ ఎన్నికల్లో ఓటు షేర్ ఫలితాలను విశ్లేషిస్తే పరిస్థితి కాస్త వేరేలా కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో బీజేపీకి 39% ఓటు షేర్, కాంగ్రెస్కు 36.5% ఓటు షేర్ వస్తుందని అంచనా వేసింది. ఈ తేడా పెద్దది కాకపోయినా, అస్సాం రాజకీయాల్లో ఇది భారీ మెజారిటీకి దారి తీస్తుంది. ఎందుకంటే, ఇక్కడ బీజేపీ మిత్రపక్షాలతో కలిసి కట్టుగా ఓట్లను సీట్లుగా మార్చుకునే సామర్థ్యం కలిగి ఉండగా, ప్రతిపక్షం ఇప్పటికీ అంతర్గత కలహాలతో కాలం గడుపుతోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వం కూడా కీలక అంశంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మకు ఉన్న ప్రజాదరణ బీజేపీకి ప్రధాన బలంగా మారింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 40% మంది అస్సాం ప్రజలు మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా కోరుకుంటుండగా, కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గోగోయ్ 33% మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజన వర్గాల్లో ముఖ్యమంత్రి హిమంతకు ఉన్న మద్దతు బీజేపీకి, ఎన్డీయే కూటమి పక్షాలకు అదనపు బలాన్ని ఇస్తోంది.అస్సాం రాష్ట్రాన్ని ప్రధానంగా 5 పరిపాలనా విభాగాలుగా విభజించారు. ఈ ఐదింటిని ప్రాంతాల వారీగా చూసినప్పుడు, అస్సాం రాజకీయాలు ఏకరీతిగా కనిపించడం లేదు. ఎగువ అస్సాంలో ఎన్డీయే బలంగా ఉండి, అధికశాతం నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్, రైజోర్ దల్ కాస్త పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయి. సిబ్సాగర్లో రైజోర్ దల్ పోటీగా ఉండగా, నజీరా, టియోక్, టిటాబర్, జోర్హాట్ లాంటి చోట్ల కాంగ్రెస్ బలపడింది. డూమ్ డూమా, డెర్గావ్, సోనారి లాంటి చోట్ల క్లోజ్ ఫైట్ కనిపిస్తోంది. మధ్య అస్సాంలో రాజకీయ సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. నాగావ్, హోజై, కార్బి ఆంగ్లాంగ్ వంటి జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. ధింగ్, దల్గావ్ వంటి బలమైన సీట్లు రైజోర్ దల్కు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఈ ప్రాంతంలో బలహీనపడింది. ఇదే సమయంలో కొన్ని చోట్ల ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏఐయూడీఎఫ్కి అవకాశాలు కల్పిస్తోంది.దిగువ అస్సాంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏఐయూడీఎఫ్ మెరుగైన స్థానంలో ఉంది. గౌరిపూర్, శ్రీజంగ్రామ్ లాంటి చోట్ల పార్టీ ముందంజలో ఉండగా, చెంగా, ధుబ్రి లాంటి చోట్ల గట్టి పోటీ ఇస్తోంది. అయినప్పటికీ మొత్తం ప్రాంతంగా అంచనాలను విశ్లేషిస్తే ఎన్డీయే ఆధిపత్యమే కొనసాగుతోంది. బరాక్ వ్యాలీలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కొన్ని చోట్ల బలంగా ఉంది. సోనై, బార్కోలా, అల్గాపూర్, కరీంఘంజ్ సౌత్ వంటి చోట్ల కాంగ్రెస్ గెలిచే అవకాశముంది. కరీంఘంజ్ నార్త్లో మాత్రం హోరాహోరీ పోటీ నెలకొంది.ఈ ఎన్నికల్లో కొన్ని కీలక ట్రెండ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏఐయూడీఎఫ్ గతంతో పోలిస్తే కొంత మెరుగైంది. కానీ ఇది ఆ పార్టీవైపు వీస్తున్న గాలివల్ల కాకుండా, ఆ పార్టీ నిలబెడుతున్న అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం వల్లే అని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్-2 సర్వేలో వెల్లడయింది. గెలిచే అవకాశమున్న సీట్లు వదిలేయడం వల్ల కాంగ్రెస్–రైజోర్ దల్ కూటమిలో కాంగ్రెస్కే నష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీలో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. టికెట్ కేటాయింపుల్లో చేసిన కొన్ని తప్పులు, పాత నాయకులను పక్కన పెట్టడం వల్ల కొంత అసంతృప్తి ఉంది. అయితే ఇవి పెద్ద స్థాయిలో ప్రభావం చూపేలా కనిపించడం లేదు.అస్సాంలో చిన్న పార్టీల పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. జై భారత్ పార్టీ వంటి సంస్థలు టీ ట్రైబ్ ప్రాంతాల్లో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇది కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. టీ తోటలు అధికంగా ప్రాంతాల్లో జై భారత్ పార్టీ కొంత కనిపిస్తోంది. వీరికి జేఎంఎం పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తోంది. రంగాపర, సొనారి, మజ్బత్ నియోజకవర్గాల్లో జై భారత్ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయేలోని ఏజీపీకి కేటాయించినవాటిలో అధికంగా ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏజీపీ తన పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించింది. బీజేపీ మాత్రం రాష్ట్రం వ్యాప్తంగా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం.ఓటర్ల అభిప్రాయాలు కూడా స్పష్టంగా ఒక దిశలోనే ఉన్నాయి. 52% మంది రాష్ట్ర అభివృద్ధికి బీజేపీనే మంచిదని భావిస్తుండగా, 60% మంది మళ్లీ అదే ప్రభుత్వం వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే 60% మంది మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ల వీస్తున్న సానుకూల పవనాలకు నిదర్శనం. సామాజికంగా కూడా బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. గిరిజనులు, ఓబీసీ వర్గాల్లో మద్దతు పెంచుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన విజయాలు పార్టీకి మరింత బలాన్నిచ్చాయి.మరోవైపు అక్రమ వలసలు, అక్రమంగా వచ్చినవారు భూముల ఆక్రమించారనే ఆరోపణలు కూడా రాజకీయ చర్చలో కీలకంగా మారడంతో... అవి ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం అస్సాంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లో 5000 మందితో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించింది. కులం, మతం, వయస్సు, లింగం వంటి అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను విశ్లేషకులు, జర్నలిస్టులతో చర్చించి డేటాను క్రాస్ చెక్ చేశారు.మొత్తానికి చూస్తే, మరికొన్ని రోజుల్లో జరగబోయే 2026 అస్సాం ఎన్నికల్లో ప్రతిపక్షం ఇంకా ఐక్యత లోపంతో పోరాడుతుండగా, బీజేపీ మాత్రం తన నాయకత్వం, సంస్థాగత బలం, ప్రభుత్వంపై ఉన్న సానుకూల అభిప్రాయంతో స్పష్టమైన ఆధిక్యాన్ని నిర్మించుకుంది. ఇదే ధోరణి కొనసాగితే, అస్సాం మరోసారి స్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తుంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుంది!- ఆర్. దిలీప్ రెడ్డి,డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. -
‘ఏఐ’లో చైనా ఫస్ట్.. ప్రమాదంలో భావి భారతం
ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రం జపిస్తోంది. రేపటి ఉద్యోగాలన్నీ ఏఐ నైపుణ్యం మీదనే ఆధారపడి ఉండబోతున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తించిన చైనా, దేశంలోని క్లాస్రూమ్ల రూపురేఖలను మార్చేస్తోంది. కానీ భారత్ మాత్రం ఇంకా మార్కులు, ర్యాంకులు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే పాత చింతకాయ పచ్చడి నుండి బయటపడలేకపోతోంది. ఏఐ వినియోగంలో ఈ రెండు దేశాల మధ్య నున్న అంతరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.చైనా: ‘డబుల్ రిడక్షన్’ విప్లవం2021లో చైనా 'డబుల్ రిడక్షన్' అనే కీలక విధానాన్ని తీసుకొచ్చింది. పైకి ఇది కేవలం ప్రైవేట్ ట్యూషన్లపై ఆంక్షలు అనిపించినా, దీని వెనుక ఒక వ్యూహం ఉంది. విద్యార్థులపై హోంవర్క్ ఒత్తిడిని తగ్గించి, బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికారు. కేవలం టాపర్లను వెతకడం కంటే, ప్రతి విద్యార్థిలో నైపుణ్యాన్ని (Capabilities) పెంచడమే లక్ష్యంగా చైనా స్కూళ్లు ముందడుగు వేస్తున్నాయి. టెక్నాలజీని కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా, సమస్యలను పరిష్కరించే ఒక సాధనంగా చైనాలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు.భారత్: డిగ్రీలు సరే.. ఉద్యోగాలేవి?భారత్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఏటా మన దేశంలో దాదాపు 9 లక్షల మంది ఇంజనీర్లు డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, వారిలో ఎంతమంది ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక ప్రకారం ప్రతి 10 మంది యువకులలో నలుగురు సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ‘మన విద్యార్థులు పరీక్షలు పాస్ అయ్యేందుకే చదువుతున్నారు తప్ప, సమస్యలను పరిష్కరించడానికి కాదు’ అని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోచింగ్ సెంటర్ల మాయాజాలంహైదరాబాద్ నుండి రాజస్థాన్లోని కోట వరకు.. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కోచింగ్ సెంటర్లే నడిపిస్తున్నాయి. ర్యాంకులు, కటాఫ్ మార్కులే విద్యార్థి తెలివితేటలకు కొలమానాలుగా మారిపోయాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారడం లేదు. ప్రభుత్వం మార్పు కోసం ప్రయత్నిస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం నత్తనడకన సాగుతోంది.తేడా ఎక్కడ వస్తోంది?చైనా తన విద్యార్థులను ‘రేపటి’ కోసం సిద్ధం చేస్తోంది. అక్కడి విద్య.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. కానీ భారత్ ఇంకా 'నిన్నటి' పద్ధతులలోనే పరీక్షలు పెడుతోంది. చైనా మోడల్లో నియంత్రణ ఎక్కువ ఉన్నా, వారు భవిష్యత్తు సాంకేతికతపై పట్టు సాధిస్తున్నారు. మన దగ్గర పోటీ ఎక్కువ ఉన్నా, అది కేవలం ర్యాంకులకే పరిమితమవుతోంది. ఏదిఏమైనప్పటికీ మన దేశంలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చాల్సిన సమయం వచ్చేసిందని నిపుణులు అంటున్నారు. కేవలం మార్కులే విజయానికి కొలమానం అనుకుంటే, భవిష్యత్తులో మన యువత గ్లోబల్ మార్కెట్లో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇది కూడా చదవండి: బ్లూటూత్ ఇయర్ఫోన్స్తో భయంకర వ్యాధి? -
టికెట్ అడిగితే తిట్లు… చివరికి సస్పెన్షన్!
తమిళనాడు: ప్రయాణికులకు టిక్కెట్ ఇవ్వకుండా నిద్రపోయిన ఓ ఉద్యోగి సస్పెండ్కు గురయ్యాడు. విద్యుత్ రైళ్ల సర్వసు ఉదయం 3.30కు మొదలైన అర్ధరాత్రి 12 గంటల వరకు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3.36 గంటలకు పార్కు స్టేషన్లో బయల్దేరాల్సిన ఎలక్ట్రిక్ రైలులో వెళ్లేందుకు ప్రయాణికులు టికెట్ కౌంటర్కు రాగా అక్కడ ఉద్యోగి గాఢ నిద్రలో ఉండటం గమనించి, అద్దం తట్టిలేపారు. తర్వాత అతను ప్లాట్ఫాం 2కి వెళ్లాలని, రైలు బయలుదేరబోతోందని చెప్పాడు. తన నిద్రకు భంగం కలిగించారని చిర్రెత్తుకొచ్చిన ఆ ఉద్యోగి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. దిక్కున్న చోట చెప్పుకోండని దూషించాడు. ఈ ఘటనను సెల్ఫోన్లో రికార్డు చేసి ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయి రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు సీసీటీవీ కెమెరాల వీడియో రికార్డింగ్ను పరిశీలించారు. విధి నిర్వహణలో నిద్రపోవడంతోపాటు ప్రయాణికుడితో అనుచితంగా వ్యవహరించాడని గుర్తించారు. రైల్వే ఉద్యోగిని సస్పెండ్ చేశారు. -
భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్
సరిగ్గా పాతికేళ్ల క్రితం, అంటే 2000వ సంవత్సరంలో కాందహార్ విమాన హైజాక్ ఉదంతం తర్వాత.. వాషింగ్టన్-న్యూఢిల్లీ-టెల్ అవీవ్ (అమెరికా-భారత్-ఇజ్రాయెల్) మధ్య సెక్యూరిటీ ట్రైయాంగిల్ ఏర్పడాలని అంతర్జాతీయ నిపుణులు సూచించారు. పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లెబనాన్ మీదుగా గాజా వరకు విస్తరించి ఉన్న ఉగ్రవాద కారిడార్ను అడ్డుకోవడానికి భారత్, ఇజ్రాయెల్ రెండు వైపులా రక్షణ కవచాలుగా నిలుస్తాయన్నది ఆనాటి ఆలోచన. కానీ, 2026 నాటికి అంతర్జాతీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. అప్పటి సెక్యూరిటీ ట్రైయాంగిల్కు సపోర్ట్గా ఉన్న అమెరికా ఇప్పుడు తన పట్టు కోల్పోతుంటే భారత్ అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన శక్తిగా ఆవిర్భవించింది.అమెరికా వ్యూహాత్మక వైఫల్యం - ఇరాన్ సంక్షోభంప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఒక అస్థిరమైన సూపర్ పవర్గా కనిపిస్తోంది. సరైన నిష్క్రమణ వ్యూహం లేకుండా ఇరాన్పై యుద్ధం ప్రకటించడం, ప్రపంచ ఇంధన సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగలదని అంచనా వేయకపోవడం వాషింగ్టన్ చేసిన అతిపెద్ద పొరపాట్లు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటిపోయింది. అటు రష్యాపై ఆంక్షల విషయంలోనూ అమెరికా ద్వంద్వ ప్రమాణాలు ఇప్పుడు మిత్రదేశాలకే మింగుడుపడటం లేదు.భారత్-ఇజ్రాయెల్ బంధంభారత్, ఇజ్రాయెల్ సంబంధాలు నిన్న మొన్నటివి కావు. 1962 చైనా యుద్ధం సమయంలోనే ఇజ్రాయెల్ రహస్యంగా భారత్కు సైనిక సాయం అందించింది. ఇందిరా గాంధీ హయాంలో 1968 నుంచే ‘రా’, ‘మొసాద్’(ఇజ్రాయెల్) మధ్య నిఘా సంబంధాలు ఉన్నాయి. నేడు ఇజ్రాయెల్ సాంకేతికత భారత రక్షణ వ్యవస్థలో అంతర్భాగమైపోయింది. నెతన్యాహు అన్నట్లు ఇది స్వర్గంలో కుదిరిన బంధం అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది.వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిభారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఇప్పుడు ప్రపంచానికే ఒక పాఠం. ఇరాన్ తన జలాల్లో పాశ్చాత్య దేశాల నౌకలను అడ్డుకుంటున్నా భారత నౌకలకు మాత్రం ‘ప్రివిలేజ్డ్ న్యూట్రల్’(విశిష్ట తటస్థ దేశం) హోదా ఇచ్చి అనుమతిస్తోంది. దీని వెనుక దశాబ్దాల నాటి దౌత్య నీతి ఉంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇరాన్లోని చాబహార్ ఓడరేవును కాపాడుకుంటూ వచ్చింది. ముంబై నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వరకు ఇరాన్ మీదుగా సాగే అంతర్జాతీయ రవాణా కారిడార్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.మెరుగైన సంబంధాలుప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ, ఎస్.జైశంకర్ నాయకత్వంలో భారత్ ‘యాక్టివ్ మల్టీ-వెక్టర్ ఎంగేజ్మెంట్’ను అనుసరిస్తోంది. అంటే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, గల్ఫ్ దేశాలతో ఏకకాలంలో మెరుగైన సంబంధాలను కొనసాగించగల ఏకైక దేశంగా భారత్ నిలిచింది. నేటి భౌగోళిక రాజకీయాల్లో అమెరికా కేవలం పెట్టుబడి, సాంకేతికతకు మాత్రమే పరిమితమవుతోంది. ఇజ్రాయెల్కు లేని ఇరాన్ ఛానల్, రష్యా ఛానల్ భారత్ వద్ద ఉన్నాయి. 50 ఏళ్లుగా నిశ్శబ్దంగా సిద్ధమైన భారత్ ఇప్పుడు ప్రపంచ యుద్ధ మేఘాల మధ్య ఒక శాంతి వారధిగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
1 నుంచి టోల్ గేట్ చార్జీల పెంపు!
బెంగళూరు: ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో టోల్ గేట్ చార్జీలు పెరగనుండటంతో వాహన యజమానులు, డ్రైవర్ల జేబుకు రంధ్రం పడనుంది. ప్రతి ఏడాది తరహాలో ఈసారి 3 నుంచి 5 శాతం మేర టోల్ రుసుము పెరగనుంది. రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల్లో టోల్ గేట్లలో ఇది వర్తిస్తుంది. మైసూరు–బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ప్రయాణం మరింత వ్యయం కానుంది. జాతీయ హైవే అథారిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత రెండేళ్లుగా ఏటా టోల్ పెంచుతూ ఉన్నారు. ఇప్పటికే ఎన్హెచ్ఐఏ ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా ఫాస్ట్ట్యాగ్ పాస్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో హైవేలలో సొంత వాహనాలలో ప్రయాణ ఖర్చు పెరగనుంది. -
‘అది వివక్ష కాదు.. ఆచారం’
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న సుదీర్ఘ వివాదంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) తన వైఖరిని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టులో కీలక వివరణ ఇచ్చింది. 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలపై ఉన్న నియంత్రణ అనేది లింగ వివక్ష కిందకు రాదని, అది ఆలయ సంప్రదాయంలో భాగమని బోర్డు కోర్టుకు విన్నవించింది.నైష్ఠిక బ్రహ్మచర్యమే ప్రాతిపదికగా..శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని ‘నైష్ఠిక బ్రహ్మచారి’గా భక్తులు ఆరాధిస్తారని దేవస్వం బోర్డు తన వాదనలో పేర్కొంది. స్వామివారికి ఆధ్యాత్మిక శక్తి అనేది ఆయన ఆచరించిన తపస్సు, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం ద్వారానే లభిస్తుందని.. ఈ క్రమశిక్షణను భక్తులు కూడా పాటిస్తారని వివరించింది. దేశవ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా అయ్యప్ప ఆలయాలు ఉన్నప్పటికీ, శబరిమల ప్రత్యేకత ఈ ‘నైష్ఠిక బ్రహ్మచర్యమే’నని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నియంత్రణలు ఉన్నాయని, అయితే 10 ఏళ్లలోపు బాలికలు, 50 ఏళ్లు దాటిన మహిళల ప్రవేశానికి ఎలాంటి అభ్యంతరం లేదని గుర్తు చేసింది.అంతర్జాతీయ పరిశోధనల ప్రస్తావనతన వాదనను బలపరుచుకునేందుకు దేవస్వం బోర్డు అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 1987లో ఒట్టావాలోని కార్లెటన్ యూనివర్శిటీకి చెందిన రాధికా శేఖర్ సమర్పించిన థీసిస్తో పాటు, 2003లో ‘రాయల్ ఆంత్రోపాలజికల్ ఇనిస్టిట్యూట్’ ప్రచురించిన అధ్యయనాలను బోర్డు గుర్తు చేసింది. ఈ పరిశోధనల ప్రకారం.. శబరిమలలో వయోపరిమితి అనేది పురాతన మతపరమైన ఆచారమే తప్ప, సమానత్వ హక్కులను కాలరాయడం కాదని బోర్డు ‘సుప్రీం’లో వాదించింది. ఒక సమూహాన్ని లేదా వర్గాన్ని ‘మతపరమైన శాఖ’గా గుర్తించాలా వద్దా అనేది కేవలం చట్టపరమైన అంశమే కాదని, అది వాస్తవాలతో కూడిన విషయమని బోర్డు అభిప్రాయపడింది. డాక్యుమెంటరీ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది.ఇది కూడా చదవండి: ‘వెయిటింగ్ లిస్ట్’లో వందే భారత్ స్లీపర్ -
మళ్లీ డీఎంకేదే అధికారం
చెన్నై: త్వరలో తమిళనాడు అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారంలోకి రానుందని ఓ సర్వే అంచనా వేసింది. అసెంబ్లీలోని 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 180 వరకు సీట్లు గెల్చుకుంటుందని సర్వే చేపట్టిన అగ్ని న్యూస్ సరీ్వస్(ఏఎన్ఎస్) సీఈవో ఆర్.సురేశ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమికి 44.9 శాతం వరకు ఓట్లు పోలవుతాయి. ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమి 38.5 శాతం ఓట్లతో 54 సీట్లు వస్తాయి’అని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నై ప్రాంతంలో ప్రతిపక్ష కూటమి ఘోర పరాజయం చవిచూడనుందని, ఒక్క సీటూ గెల్చుకునే అవకాశాలు లేవని చెప్పారు. నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగా వెట్రి కళగం(టీవీకే)కు 9.7 శాతం ఓట్లు, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి 4.8 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. -
ఉద్యోగాల పేరిట రూ.25 కోట్లకు కుచ్చుటోపీ
యశవంతపుర: కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసగించే కిలాడీ దంపతులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన జైసన్ డిసోజా, లవీనా దంపతులు నిరుద్యోగులు. వీరు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న యువకులను గుర్తించి, కోర్టుల్లో గ్రూప్–డి ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించేవారు. నిరుద్యోగులను గుర్తించేందుకు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డబ్బు వసూలు చేశారు.ఖరీదైన హోటల్స్లో ధ్రువపత్రాల తనిఖీ, ఇంటర్వ్యూలు అని నాటకాలు ఆడేవారు. నకిలీ నియామక పత్రాలను చేతిలో పెట్టేవారు. నకిలీ పత్రాలు తీసుకుని కోర్టులకు వెళ్లినవారికి తాము మోసపోయామని అర్థమయ్యేసరికి, ఈ జంట ఫోన్లను స్విచాఫ్ చేసేది. చేసేది లేక బాధితులంతా బసవేశ్వరనగరతో పాటు నగరంలోని వివిధ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. 500 మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. 2024లో ఇదే ఫిర్యాదుపై అరెస్టయి కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చిన ఈ దంపతులు, మళ్లీ అదే దందా కొనసాగిస్తున్నారని, కేసు విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
తమిళనాట ఎన్డీఏ డీల్ ఖరారు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23వ తేదీన జరిగే ఎన్నికలకు ఏఐఏడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నడుమ సీట్ల పంపిణీ దాదాపు ఖరారైంది. బీజేపీ సహా భాగస్వామ్య పార్టీలకు 56 సీట్లను కేటాయించేందుకు ఇచ్చేందుకు పళని స్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకే అంగీకరించింది. దీని ప్రకారం..బీజేపీ 27, పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) 18, ఏఎంఎంకే 11 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపనున్నాయి. ఏఐఏడీఎంకే ఎన్ని స్థానాల్లో పోటీ చేసేదీ త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి తెలిపారు. మరికొన్ని భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సోమవారం ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేత పీయూష్ గోయల్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్లతో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ ఏఐఏడీఎంకే పోటీ చేసే సీట్ల సంఖ్యపైనా త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్(మూపనార్), ఇందియ జననాయగ కట్చి(ఐజేకే)లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్న పళనిస్వామి..ఆయా పార్టీలతో త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందని స్పష్టం చేశారు. 234 సీట్లకు గాను తమ కూటమి కనీసం 210 చోట్ల గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
గౌరవ్ గొగొయ్ నామినేషన్
జోర్హాత్: లోక్సభ సభ్యుడు, అస్సాం కాంగెస్ర్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ సోమవారం జోర్హాట్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. జోర్హాట్ స్టేడియం నుంచి భారీ ర్యాలీతో అట్టహాసంగా జిల్లా కమిషనర్ కార్యాలయానికి ఆయన బయలుదేరారు. దాదాపు మూడు గంటలపాటు ర్యాలీ కొనసాగింది. గొగొయ్ మద్దతుదారులతోపాటు కాంగ్రెస్ కూటమిలోని ఆరుపార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోర్హాట్ ఎంపీగా ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష ఉపనేతగా గొగోయ్ కొనసాగుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే మొదటిసారి. నామినేషన్కు ముందు మీడియాతో మాట్లాడుతూ అస్సాం రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు దీనినో అవకాశంగా భావిస్తున్నానన్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమాజాన్ని, రాజకీయాలను శుద్ధి చేసేందుకు తనతో చేతులు కలపాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే పార్టీలతో నిమిత్తం లేకుండా అందరినీ సమానంగా ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములుగా చేస్తామని చెప్పారు. పార్టీ ర్యాలీలు, కార్యక్రమాల్లో పాల్గొన్న వారికే పథకాలను అమలు చేస్తామంటూ అధికార బీజేపీ మహిళలను అవమానిస్తోందని గొగొయ్ విమర్శించారు. జోర్హాట్ స్థానం నుంచి బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్రనాథ్ గోస్వామితో గొగొయ్ తలపడనున్నారు. గోస్వామి 1991 నుంచి ఏజీపీ తరఫున, అనంతరం 2016 నుంచి బీజేపీ తరఫున వరుసగా ఐదు పర్యాయాలు జోర్హాట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
పుదుచ్చేరిలో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరోసారి ప్రజాతీర్పు కోరడానికి సిద్ధమైంది. ఆయన సారథ్యంలోని ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమాగా ఉంది. విపక్ష డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా అదృష్టం పరీక్షించుకుంటోంది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరు మరోసారి కలిసొస్తుందని ఎన్డీఏ ఆశిస్తోంది. కూటమి భాగస్వామి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం, పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులివ్వడాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తోంది. డీఎంకే, కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. హామీలు నెరవేర్చలేదని, శాంతి భద్రతలు దిగజారాయని ఆరోపిస్తున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ బలపడటంపై బీజేపీ కన్నేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు పుదుచ్చేరిలో ఇప్పటికే పలుమార్లు విస్తృతంగా పర్యటించారు. విజయ్ పార్టీతో చేటెవరికి? అంతర్గత కలహాలు, సీట్లపై సిగపట్లు డీఎంకే కూటమిని కలవరపెడుతున్నాయి. పుదుచ్చేరిలో ఒకప్పుడు ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం డీఎంకేకు జూనియర్ భాగస్వామిగా మారిపోయింది. అలాగని డీఎంకే 20 సీట్లకు పట్టుబడుతుండటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసినా సీట్ల పంపకంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దాంతో పలు అసెంబ్లీ స్థానాలకు డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులిద్దరూ నామినేషన్లు వేశారు. ఇది వాటి మధ్య స్నేహపూర్వక పోటీలకు దారి తీస్తే కూటమి విజయావకాశాలపై ప్రభావం పడుతుంది. విజయ్ పార్టీ టీవీకే పోటీలో ఉండటం తమకే లాభమని అధికార, విపక్ష కూటములు రెండూ లెక్కలేసుకుంటున్నాయి. తమిళ జాతీయవాది సీమాన్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ మూడో స్థానం దక్కించుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏ కూటమి సానుకూలతలు → సీఎం రంగస్వామి ప్రజాదరణ → ప్రధాని మోదీ కరిష్మా → కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధి పనులు → డీఎంకే కూటమి అనైక్యత ప్రతికూలతలు → ప్రభుత్వ వ్యతిరేకత → మంత్రులపై అవినీతి ఆరోపణలు → విజయ్ పార్టీతో ఓటుబ్యాంకుకు గండి పడే ఆస్కారండీఎంకే కూటమి సానుకూలతలు → రంగస్వామి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత→ డీఎంకే ద్రవిడ జాతీయవాద నినాదం → పలు జనాకర్షక పథకాల హామీలుప్రతికూలతలు → సీట్ల సర్దుబాటుపై ఎడతెగని సిగపట్లు → పలు అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులను బరిలో దింపడం– సాక్షి, నేషనల్ డెస్క్ -
పంజాబ్ మాజీ మంత్రి భుల్లర్ అరెస్ట్
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లర్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఫతేగఢ్ సాహిబ్ జిల్లా మండి గోబింద్గఢ్లో ఉండగా అదుపులోకి తీసుకున్నామని, అ మృత్సర్ కోర్టులో మంగళవారం హాజరు పరు స్తామని పోలీసులు తెలిపారు. అమృత్సర్ జిల్లా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ అయిన గగన్ దీప్ సింగ్ రణ్ధావా శనివారం ఉదయం విషం తీసుకుని, బలవన్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. తన మరణానికి మంత్రి భుల్లర్ కారణమని ఆయన ఆరోపించారు. ఓ టెండర్ను తండ్రి సుఖ్దేవ్ సింగ్ భుల్ల్లర్కు వచ్చేలా చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారని తెలిపారు. అలా చేయకపోవడంతో రూ.10 లక్షలు లంచం తీసుకుని వేరే వ్యక్తికి ఇచ్చినట్లు ఒప్పుకోవాలంటూ తుపాకీతో బెదిరించారని ఆ వీడియోలో తెలిపారు. ఈ ఘటనతో సీఎం మాన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, సీఎం మాన్ మంత్రి భుల్లర్ను తప్పుకోవాలని ఆదేశించడం, ఆయన రాజీనామా చేయడం జరిగిపోయాయి. భుల్లర్ను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. పార్లమెంట్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ పోలీసులు భుల్లర్ను అరెస్ట్ చేశారు. -
యూపీలో కుప్పకూలిన శీతల గిడ్డంగి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లో శీతల గిడ్డంగి కుప్పకూలిన ఘటనలో నలుగురు కార్మికులు చనిపోగా, 12 మంది వరకు గాయాలపాలయ్యారు. ప్రయాగ్రాజ్ జిల్లా ఫాఫామౌలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శీతల గిడ్డంగి భవనం అకస్మాత్తుగా కుప్పకూలగా శిథిలాలు మీద పడి తీవ్ర గాయాలతో నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులైన 12 మంది కార్మికులు ఎస్ఆర్ఎన్ ఆస్పల్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అక్కడికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. విపత్తు నిర్వహణ దళం, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల తొలగింపు చేపట్టాయని తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కోల్డ్ స్టోరేజీ ప్రమాదంతో అమోనియం గ్యాస్ లీకైందంటూ వార్తలు ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. -
అడవిపై హక్కులు కాలరాసేందుకే వనవాసి అంటున్నారు: రాహుల్
వడోదర: అడవిపై ఆదివాసీలకు హక్కులు దక్కకుండా చూసేందుకే వాళ్లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు వనవాసులు అని సంబోధిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం గుజరాత్లోని వడోదరలో జరిగిన ‘ఆదివాసీ అధికార్ సంవిధాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఆదివాసీలే భారత్కు అసలైన యజమానులు. వేయి, రెండు వేలు, ఐదు వేల ఏళ్ల క్రితంనాటి పరిస్థితులను చూస్తే భారత్లోని ఈ భూభాగంలో ప్రతి అంగుళం ఆదివాసీలకే చెందుతుంది. ఇప్పుడు 21వ శతాబ్దం వచ్చేసరికి ఆర్ఎస్ఎస్, బీజేపీ కొత్తగా వనవాసి అనే పదం మాత్రమే ఉపయోగిస్తున్నాయి. వనవాసి అంటే వనంలో ఉండే వాళ్లు అనే అర్థంవస్తుందిగానీ భూమికి యజమానులు అనే భావన రాదు. అందుకే ఆదివాసీలకే ఈ నేల, నీరు, అడవిపై హక్కులు దక్కకూడదనే దురుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ నేతలు ఆదివాసీలను కేవలం వనవాసులు అని పిలుస్తున్నారు. ఆదివాసీలను వనవాసులు అనడం అంటే రాజ్యాంగంపై దాడి చేయడమే. గిరిజనయోధుడు బిర్సా ముండాను అవమానించడమే’’ అని రాహుల్ అన్నారు. ‘‘ బిర్సాముండా, అంబేడ్కర్, ఫులే, గాంధీజీల విగ్రహాలకు మోదీసహా బీజేపీ సభ్యులు ప్రణమిల్లుతారుగానీ ఆ మహనీయుల సిద్ధాంతాలను పరిరక్షించాలన్న స్పృహే వీళ్లకు లేదు. అభివృద్ధి అన్న ప్రతిసారీ అటవీభూములను ఆదివాసీల నుంచి లాక్కొంటారు.’’ అని రాహుల్ ఆరోపించారు. -
హార్మూజ్ తరంగాలపై భారత నావికుడి సాహసం..!
ఇది భారత నావికుడి సాహసం.. ఒకవైపు భీకర యుద్ధం. మరొకవైపు ఓ నౌక హార్మూజ్ జలసంధిని దాటిన వైనం. అయితే భారత నావికుడు అత్యంత ధైర్య సాహసాలతో దాన్ని హార్మూజ్ జలసంధి దాటించడమే కాదు.. భారత్కు తీసుకొచ్చాడు. లైబీరియా జెండాతో నమోదైన చమురు ట్యాంకర్ 'Shenlong ముంబై పోర్టు సమీపంలోని భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ నౌకకు భారతీయ కెప్టెన్ నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టు నుంచి ముడి చమురుతో బయలుదేరిన ఈ ట్యాంకర్ సురక్షితంగా భారత జలాలకు చేరుకుంది. సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసి ముంబై పోర్టు వైపు చేరుకోవడం ముఖ్యంగా భావించారు.అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ నౌకాదళం ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఒక భారతీయ నావికుడు ఛేదించుకుని మరీ అక్కడ నుంచి దాటి యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అర్థరాత్రి చీకట్లో, తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కనపెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి ముంబై తీరానికి చేరిన ఆ రహస్య నౌకకు సంబంధించి కొన్ని వివరాలు చూద్దాం. ఇరాన్ - ఒమన్ మధ్య ఉన్న హెూర్ముజ్ జలసంధి చాలా ముఖ్యమైన సముద్ర మార్గం, ఇది ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20% వాటాను కలిగి ఉంది. కేవలం 33 మైళ్ల వెడల్పు గల ఈ ఇరుకైన జలమార్గం పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ లను కలుపుతుంది. సౌదీ అరేబియా , ఇరాక్ వంటి దేశాల నుండి ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురు ప్రపంచానికి రవాణా చేయబడుతుంది. ముంబైలో ఓడ నిలిచిపోయిందిఅయితే, ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్షుడు ఘోమెద్ హత్య జరిగిన తర్వాత, నిరసనగా మార్చి 2 నుండి హెూర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఆకస్మికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఎరువులు, ఆహార ఉత్పత్తుల కొరతకు దారితీసింది. ఎందుకింత? మందుల కొరత కూడా ఏర్పడింది. అప్పుడు చైనా నౌకలను మాత్రమే అనుమతించింది. అంతా డార్క్ మోడ్..అటువంటి క్లిష్ట పరిస్థితిలో షెన్లాంగ్ ఓడ ఇరాన్ దిగ్బంధనాలను ఛేదించుకుని ముంబై ఓడరేవుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక భారతీయ నావికుడు ఈ లైబీరియన్ నౌకను చాకచక్యంగా నడుపుతున్నాడు. ఇరాన్ నావికాదళం యొక్క నిఘా నుండి తప్పించుకోవడానికి, అతను నౌక యొక్క ఏఐఎస్ (ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్)ను నిలిపివేశాడు. అంతేకాకుండా, వారు అర్థరాత్రి నౌకలోని లైట్లన్నింటినీ ఆపివేసి, పూర్తి చీకటిలో ఈ ప్రమాదకరమైన కాలువను దాటారు. “డార్క్ మోడ్” (సిగ్నల్ ఆఫ్ చేసి) నడిపి ముంబై పోర్టుకు సురక్షితంగా చేర్చాడు.శభాష్ భారత నావికుడా.. ఈ భారీ ఓడ నుండి చమురు బ్యారెళ్లను ముంబైలో దించడానికి దాదాపు 38 గంటల సమయం పట్టింది. భారత నావికుడి ఈ ధైర్యసాహసాలు ఇరాన్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. కానీ, ఈ అర్థరాత్రి సంఘటనను మనం తిరిగి చూసుకున్నప్పుడు, ఇది అంతర్జాతీయ సముద్ర భద్రతలో భారతీయ నావికుల ధైర్యాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా ఉంది. -
డబ్బులు పట్టుకుని వచ్చారో..
ప్రజాస్వామ్యంలో ఓటు అంటే ఓ ఆయుధం. దాన్ని డబ్బుకు అమ్ముకుంటుంటారు చాలా మంది. ‘ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తాం’ అని చెబుతుంటారు కొందరు. ఓట్లు వేసే వేళ తమకు డబ్బులు ఇవ్వలేదని నిరసనకు దిగుతున్న వారు కూడా కనపడుతుంటారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా అనేక ప్రాంతాల్లో అభ్యర్థులు డబ్బులు పంచుతూనే ఉంటారు. ఓటుకు ఇంతగా అమ్ముడుపోతున్న ఓటర్లు ఉన్న ఈ కాలంలో.. తాము ఓటు వేసేందుకు డబ్బు వద్దని చెబుతున్నారు. రెండు గ్రామాల ప్రజలు. ‘అభ్యర్థులు డబ్బు ఇవ్వకూడదు, ఓటర్లు డబ్బు తీసుకోకూడదు’ అని బోర్డు పెట్టి మరీ, ఆచరణాత్మకంగా సందేశం ఇస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైకాల్ ప్రాంత ప్రజలు. ఆ ప్రాంతంలోని తీర గ్రామ ప్రజలు ఓటుకు డబ్బు ఇచ్చే అభ్యర్థులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హెచ్చరిస్తూ గ్రామంలో బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ, స్థానిక ప్రజల తరఫున తీసుకున్నారు. డబ్బు లేదా బహుమతులు ఇచ్చే అభ్యర్థులను గ్రామం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘిస్తే గ్రామం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.“మా ఓటుకు ధర నిర్ణయించవద్దు, మా జీవనోపాధికి మార్గం చూపండి” అని బ్యానర్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ సాధారణంగా జరుగుతుండటంపై గ్రామస్తులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ బ్యానర్ అభ్యర్థుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి.డబ్బులు తీసుకోంగానీ 100% ఓటేస్తాంమరోవైపు, ‘మా ఓటు అమ్మకానికి లేదు’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడి సమీపంలోని ఆలంపట్టు పెరియర్ నగర్ గ్రామ యువకులు. అంతేగాక, తమ గ్రామంలో 100 శాతం ఓటింగ్ నమోదవుతుందని హామీ ఇస్తున్నారు. పెరియర్ మరుమలర్చి డాక్టర్ అంబేద్కర్ యువ నర్పణి మండలి సభ్యులు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు. పలు పోస్టర్లను బస్ స్టాండ్ ప్రయాణికుల షెల్టర్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో అతికించారు.దీనిపై ఆలంపట్టు పెరియర్ నగర్ యువకులు మాట్లాడుతూ.. ‘మా గ్రామంలో అందరం ఓటుకు డబ్బు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి రావద్దని గ్రామ సరిహద్దులోనే ప్రకటన బ్యానర్ ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయి. -
‘ఇది ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడమే’
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించడాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ప్రశ్నించారు. లోక్సభలో పైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించొద్దన్నారు. ‘ కేంద్ర బడ్జెట్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించారు. కానీ వాస్తవానికి పోలవరం ఒరిజినల్ ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. నిర్మాణానికి 55,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఏపీ విభజన చట్టం ప్రకారం ఒరిజినల్ ప్రణాళిక ప్రకారం పోలవరం నిర్మించాలి. పోలవరం నిల్వ సామర్థ్యాన్ని 190 టీఎంసీల నుంచి 120 కి తగ్గించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడమే. ఆంధ్రప్రదేశ్ అప్పు రెండేళ్లలో 3 లక్షల 36,000 కోట్ల రూపాయలు దాటింది. ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ఏపీలో అప్పులు పెరుగుతున్నాయి...జీఎస్టీ రాబడి తగ్గుతోంది. ఏపీ తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దెందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఏపీలో అత్యధిక 8.2 శాతం నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ సగటు 5.2 ఉంటే ఏపీ ది అత్యధికంగా 8 శాతం ఉంది. మహిళల్లో నిరుద్యోగ రేటు 10% గా ఉంది. వైఎస్ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 32 లక్షల పట్టాలు ఇచ్చి .. ఇల్లు మంజూరు చేశారు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో 14 లక్షల 20 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 2024 నుంచి 26 మధ్య టిడిపి ప్రభుత్వం రూ. 1165 కోట్ల రూపాయలను ఇల్ల నిర్మాణానికి వినియోగించకుండా వదిలేసింది. ఏపీలో ఇళ్ల నిర్మాణానికి నిధులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందిచాలామంది ప్రజలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నప్పటకీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. రాజకీయాలు పక్కన పెట్టి పోలవరం కోసం పనిచేసేందుకు ముందుకు వస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. కొత్త స్టీల్ ప్లాంట్ కు సంబరాలు చేస్తున్న ప్రభుత్వం.... ఉన్న స్టీల్ ప్లాంట్ను ఎందుకు చంపుతుంది?, విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలి. కడప బెంగళూరు రైల్వే లైన్కు రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయించాలి. చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ బకాయిలకు చిన్న వ్యాపారులను శిక్షించొద్దు. ఎంఎస్ఎమ్ఈలకు జీఎస్టీ ఇన్కమ్ టాక్స్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
'చివరి ఎత్తుగడ.. కేరళలో సీపీఎం–బీజేపీ పొత్తు'
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, బీజేపీ పార్టీలు పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాష్ట్రంలో సీపీఎం, బీజేపీల స్నేహం కొత్తేమీ కాదని, కానీ ఈసారి ఆ పొత్తు విజయం సాధించదని స్పష్టం చేశారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని, సీపీఎం, ఎల్డీఎఫ్లకు అర్థమైందని, అందుకే వారు తమ చివరి ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు.ఆదివారం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిపై ఉన్న లావ్లిన్ కేసు వాయిదా పడటం, కేరళలో కేంద్ర దర్యాప్తు సంస్థల వేగం, పీఎం–శ్రీ వంటి అంశాలు.. కేంద్ర ప్రభుత్వం, వామపక్ష పార్టీ సంబంధాలేంటో స్పష్టమవుతున్నాయని కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాల్లోనూ ఇదే సంబంధం ప్రతిబింబించిందని, ఎన్నికల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని వేణుగోపాల్ ఆరోపించారు. కానీ ఈ ఒప్పందాన్ని పార్టీ కార్యకర్తలు తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో మేనిఫెస్టో... రాష్ట్రం కోసం నిర్దిష్ట ప్రాజెక్టులు, ప్రణాళికలతో మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని పునరుద్ఘాటించారు. కొబ్బరి పీచు, జీడిపప్పు, మత్స్య, చేనేత రంగాల్లో, అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తూ, పూటగడవడమే ఇబ్బందిగా ఉన్న మహిళల జీవితాల్లో ఇది విప్లవాత్మక మార్పు తెస్తుందన్నారు.చదవండి: కేరళ సీఎం విజయన్ ఆస్తులు ఇవే..ఈ పథకం కేఎస్ఆర్టీసీపై ఆర్థిక భారం మోపుతుందనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేశామని వేణుగోపాల్ పేర్కొన్నారు. రవాణా సంస్థలోని సమస్యలను పరిష్కరించడానికి యూడీఎఫ్ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ వంద స్థానాలను గెలుచుకుంటుందననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
ప్రకటనల హోరు.. స్పాన్సర్షిప్ జోరు
భారత క్రీడా రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి దేశీయ క్రీడా ఆర్థిక వ్యవస్థ మొదటిసారిగా 2 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెటింగ్ సంస్థ డబ్ల్యూపీపీ మీడియా విడుదల చేసిన ‘స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ’ నివేదిక ప్రకారం, భారత క్రీడా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.18,864 కోట్లకు (2.13 బిలియన్ డాలర్లు) చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం నాలుగేళ్ల కాలంలోనే (2021లో రూ.9,530 కోట్లు) ఈ రంగం రెట్టింపు వృద్ధిని సాధించడం గమనార్హం.నివేదికలోని ముఖ్యాంశాలుక్రీడా రంగం మొత్తం ఆదాయంలో 51 శాతం వాటా ప్రకటనలదే. గత ఏడాదితో పోలిస్తే ఇవి 19.8 శాతం పెరిగి రూ.9,571 కోట్లకు చేరాయి.టీమ్, లీగ్ స్పాన్సర్షిప్ల ద్వారా రూ.7,943 కోట్లు (42% వాటా) సమకూరాయి.క్రీడాకారుల బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాల విలువ 10.3 శాతం పెరిగి రూ.1,350 కోట్లకు చేరింది.‘భారత క్రీడా రంగం సుస్థిరత, విస్తరణ దశకు చేరుకుంది. 2021 నుంచి చూస్తే 19 శాతం చక్రవడ్డీ రేటుతో (సీఏజీఆర్) ఈ వృద్ధి కొనసాగుతోంది’ అని డబ్ల్యూపీపీ మీడియా ఎండీ (కంటెంట్, స్పోర్ట్స్) వినీత్ కర్ణిక్ తెలిపారు.ఎదురులేని రారాజు క్రికెట్భారత మార్కెట్లో క్రికెట్ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం క్రీడా ఆదాయంలో 89 శాతం వాటా (రూ.16,704.2 కోట్లు) ఒక్క క్రికెట్ ద్వారానే లభిస్తోంది. లీనియర్ టీవీ (సాధారణ ఛానెళ్లు) కంటే డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనల వ్యయం వేగంగా పెరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం స్పాన్సర్షిప్ ఆదాయం మొదటిసారిగా రూ.1,000 కోట్ల మార్కును దాటింది. రియల్ మనీ గేమింగ్ యాప్లపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ లోటును సంప్రదాయ బ్రాండ్లు భర్తీ చేశాయని నివేదిక పేర్కొంది.ఇతర క్రీడల పరిస్థితి ఏమిటి?క్రికెట్ దూసుకుపోతున్నా ఇతర క్రీడల ఆదాయం 2025లో 12.2 శాతం క్షీణించి రూ.2,159.9 కోట్లకు పరిమితమైంది. ఇండియన్ సూపర్ లీగ్ వాయిదా పడటం, ఇతర భారీ అంతర్జాతీయ టోర్నీలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్, మెస్సీ ఇండియా టూర్ వంటి ఈవెంట్లతో పాటు పికిల్ బాల్ వంటి కొత్త క్రీడలకు ఆదరణ పెరుగుతుండటం సానుకూలాంశం.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
సంక్షోభాన్ని అధిగమిస్తాం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం తాలూకు ప్రతికూల ప్రభావాలు భారత్తో పాటు అన్ని దేశాలపైనా దీర్ఘకాలం పాటు కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం తరహాలోనే వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సిద్ధంగా, సమైక్యంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘సవాళ్లనే సవాలు చేయగల సత్తా భారతీయుల సొంతమని ఎన్నోసార్లు రుజువు చేశాం. అదే మన గుర్తింపు. అదే మన బలం. ఇప్పుడు కూడా ఓపిక, సంయమనం, జాగరూకతతో వ్యవహరిద్దాం’’అంటూ పిలుపునిచ్చారు. పశ్చిమాసియా యుద్ధం, తద్వారా తలెత్తిన పరిస్థితులపై ప్రధాని సోమవారం లోక్సభలో ప్రకటన చేశారు. యుద్ధం కారణంగా చమురు, వంట గ్యాస్, ఎరువులు మొదలుకుని జాతీయ భద్రత దాకా తలెత్తిన ఆందోళనలను సవివరంగా ప్రస్తావించారు. వాటితో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు వివరించారు. హార్మూజ్ జలసంధి వద్ద చిక్కుబడ్డ భారత్కు చెందిన పలు ఇంధన నౌకలను సురక్షితంగా రప్పిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమాసియా కల్లోలానికి చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుందన్న భారత్ వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఈ సంక్షోభంపై పార్లమెంటు వేదికగా ఉమ్మడి గళం విని్పంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హార్మూజ్ మూత అంగీకారం కాదు ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఇంధనమే వెన్నెముక అని ప్రధాని గుర్తు చేశారు. ‘‘ప్రపంచ ఇంధన అవసరాలు తీర్చేందుకు పశ్చిమాసియా ప్రధాన వనరు. అక్కడ మూడు వారాలకు పైగా కొనసాగుతున్న సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అంటూ ఆందోళన వెలిబుచ్చారు. 20 శాతానికి పైగా అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రమైన హార్మూ జ్ వంటి జల రవాణా వనరుల మూసివేత, నౌకల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలు ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పదేళ్లకు పైగా అనుసరిస్తూ వచి్చన ఇంధన వైవిధ్య వ్యూహం ఈ సంక్షోభ సమయంలో ఎంతగానో ఆదుకుంటోందన్నారు. ‘‘ఇంధనం దిగు మతి చేసుకునే దేశాల సంఖ్యను గత 11 ఏళ్లలో 27 నుంచి 41కి పెంచుకున్నాం. తద్వారా ఏదో ఒక్క దేశంపైనే మితిమీరి ఆధారపడే అగత్యం లేకుండా జాగ్రత్త పడ్డాం. ఫలితంగా భారత్ వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలున్నాయి. వాటిని మరో 65 లక్షల టన్నులకు పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. యుద్ధ సమస్యల పరిష్కారానికి సమగ్రమైన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలను కేంద్రం రూపొందించింది. రోజువారీ ప్రాతిపదికన పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రుల గ్రూపును ఏర్పాటు చేశాం’’అని మోదీ వివరించారు.మనోళ్ల భద్రతకు చర్యలు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయు భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు మోదీ తెలిపారు. ‘‘యుద్ధం మొదలైన నాటినుంచీ 3.75 లక్షల మందికి పైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చాం. ఇరాన్ నుంచి 700 మంది వైద్య విద్యార్థులతో పాటు 1,000 మందికి పైగా తిరిగొచ్చారు’’అని వెల్లడించారు.అక్రమ నిల్వలపై ఉక్కుపాదం కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయతి్నంచే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. సరిహద్దు, తీర, సైబర్ భద్రతా దళాలను ఇప్పటికే పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్టు వెల్లడించారు. నిత్యావసరాలు, ముఖ్యంగా ఎల్పీజీ తదితరాలను అక్రమంగా నిల్వ చేసే, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు వివరించారు. కోవిడ్ లాంటి సంక్షోభం : మోదీ ప్రధాని ప్రసంగంలో మరికొన్ని కీలక అంశాలుప్రపంచ సంక్షోభాల భారం రైతులపై పడకుండా, ఎరువుల కోసం ఏర్పాట్లు.కీలకమైన ముడిసరుకుల విషయంలో నిల్వలను పెంచుకుంది.యుద్ధం, భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతల కారణంగా దేశంలో విద్యుత్ అవసరం పెరుగుతుంది ప్రస్తుతం, దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి నుంచి సరఫరా వరకు అన్ని వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.మన పునరుత్పాదక బొగ్గు శక్తి 140 గిగావాట్లుగా ఉంది. గోవర్ధన్ యోజన కింద 40 లక్షలకు పైగా ఇళ్లలో రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలికంగాఉంటుందని మోదీ హెచ్చరికకోవిడ్ లాంటి సంక్షోభం, దీన్నిఅధిగమించడానికి దేశం మరోసారి ఏకం కావాలిగతంలో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎప్పటిలాగానే ఐక్యంగా ఉండాలి. కాగా అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరా, ఇంధన భద్రతను నిర్ధారించడానికి తీసుకోవాల్సిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక చర్యలపై చర్చించేందుకు ప్రధాని మోదీ క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (CCS) సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత మోదీ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
LPG సిలిండర్పై వినియోగదారులకు కేంద్రం గుడ్న్యూస్?!
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు 10 కిలోల గ్యాస్ చిన్న సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులకు అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే ఎల్పీజీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం ద్వారా వస్తుంది. సరఫరా తగ్గిపోవడంతో గృహ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న 10 కిలోల గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల సరఫరా ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. సరఫరా సమస్యలు తలెత్తితే గృహ వినియోగదారులు గ్యాస్ అందుబాటులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఉపశమనం కలిగించవచ్చు.ప్రభుత్వం ఇప్పటికే ఈ పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్ వంటి కీలక అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్ చర్యలలో చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను అన్వేషించడం, నిల్వలను పెంచడం, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే విధానాలు అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది. -
భర్తను బయట నుంచి.. భార్యపై బాబా అఘాయిత్యం
నాసిక్: అతనొక రిటైర్డ్ మర్చంట్ నేవీ ఆఫీసర్.. ఇప్పుడు నకిలీ బాబాగా అవతారమెత్తాడు. ఆధ్యాత్మికత పేరుతో మహిళలను వంచించి, భక్తుల బలహీనతలతో డబ్బులు దండుకుని, కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అశోక్ ఖారత్ అనే ఈ దొంగ బాబా గుట్టు ఎట్టకేలకు బయటపడింది. చేతబడులు, వశీకరణ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ, లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఈ మాయగాడి లీలలు ఇప్పుడు మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తున్నాయి.టెక్నాలజీతో మాయాజాలంఅశోక్ ఖారత్ తన ఆఫీసును ఒక క్షుద్ర పూజల కేంద్రంలా తీర్చిదిద్దాడు. భక్తులను భయపెట్టడానికి రిమోట్ కంట్రోల్తో నడిచే నకిలీ పాములను, పులి చర్మాలను, ఇతర వన్యప్రాణి అవశేషాలను ఉపయోగించేవాడు. తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మించి, ఐదు రూపాయలకు కూడా విలువ చేయని చింత పిక్కలను, నకిలీ రత్నాలను ‘మంత్రించినవి’ అని చెప్పి, రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు విక్రయించేవాడు. ఎవరైనా ఎదురుతిరిగితే ‘వశీకరణం’ చేస్తానని, కీడు జరుగుతుందని భయపెట్టేవాడు.గర్భిణీ అని చూడకుండా..ఈ కేసులో ఇప్పటికే పలువురు మహిళలు ఖారత్పై ఫిర్యాదు చేశారు. ఒక బాధితురాలిని మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్న ఈ నిందితుడు, ఇటీవల మరో గర్భిణిపై కూడా అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం. పూజల పేరుతో ఆమె భర్తను బయట కూర్చోబెట్టి, లోపల ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాధితులకు మత్తు పానీయాలు ఇచ్చి, తన కోరికలు తీర్చుకునేవాడని పోలీసుల విచారణలో తేలింది.రాజకీయ ప్రకంపనలుఖారత్ ఆధ్యాత్మిక ముసుగులో నేరాలు చేయడమే కాకుండా, విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇప్పటివరకు 150 సార్లు విదేశీ పర్యటనలు చేసిన ఈయనకు సుమారు 52 విలువైన ఆస్తులు ఉన్నట్లు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. నాసిక్ సమీపంలోని ఒక దేవాలయ ట్రస్ట్కు చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టించింది. ఖారత్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును లోతుగా విచారిస్తోంది. -
ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన?
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధాన మోదీ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం పార్లమెంట్లో ఇరాన్పై యుద్ధంపై మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభంపై లోక్సభలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రసంగించనున్నారు. నిన్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆహారం, ఇంధనం, ఇంధన భద్రతతో పాటు సామాన్య ప్రజల కీలక అవసరాల లభ్యతపై అంచనా వేసింది.ఈ రోజు పార్లమెంట్లో సీసీఎస్ సమీక్షలో చర్చించిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించనున్నారు. ప్రధానంగా ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల ప్రభావాలు చూపుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రభావం దేశంపై ఎలా పడుతుందో, దానిని ఎదుర్కొనే చర్యలు ఏమిటో పార్లమెంట్ వేదికగా ప్రధాని వివరించనున్నారు.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ సెక్రటరీ సమగ్ర సమీక్ష నిర్వహించింది. వ్యవసాయం, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్, ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, షిప్పింగ్, వాణిజ్యం, ఆర్థిక రంగం, సరఫరా గొలుసులు వంటి విభాగాలపై సమీక్ష జరిగింది. -
ఒకే సీటు కోసం తండ్రి, కుమార్తెల ఫైట్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం తాజాగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏమిటంటే, అటు డీఎంకే లోనూ, ఇటు కాంగ్రెస్లోనూ ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన తండ్రీకూతుళ్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. డీఎంకేలో స్టాలిన్ సమక్షంలో ఇంటర్వ్యూ: చెన్నైలోని అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. సోమవారం ఈ ప్రక్రియ ముగియనుంది. ఆదివారం కోయంబత్తూరు జిల్లా డీఎంకే అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో ఆర్.ఎస్.పురం ప్రాంత డీఎంకే కార్యదర్శి, 72వ వార్డు కౌన్సిలర్ కార్తీక్ సెల్వరాజ్ కోయంబత్తూరు దక్షిణం స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె కృపా శబరినాథన్ కూడా అదే సీటు కోరుతూ దరఖాస్తు సమరి్పంచారు. దీంతో పరిణామం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసిన స్టాలిన్, మీలో ఎవరికి సీటు ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారా? అని ప్రశ్నించడం గమనార్హం. ఇందుకు వారు స్పందిస్తూ, పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామని, కొంగు మండలంలో వంద శాతం విజయం సాధించడమే తమ లక్ష్యమని తెలపడంతో స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ అదే సీన్ డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోయంబత్తూరు కార్పొరేషన్ మాజీ మేయర్ కలాలి వెంకటాచలం, ఆయన కుమార్తె గాయత్రి (ప్రస్తుత 44వ వార్డు కౌన్సిలర్) ఇద్దరూ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే కుటుంబానికి చెందిన తండ్రీ, కుమార్తె ఓ వైపు, కాంగ్రెస్ కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె మరో వైపు పోటీ పడుతుండటంతో ఇంతకీ ఈ సీటు కమల్ పార్టీ ఖాతాలోకి చేరేనా అన్న చర్చ ఊపందుకుంది. కమల్ ఖాతాలో పడేనా.. గత ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ పోటీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కోయబత్తూరు దక్షిణం నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఆయన సుమారు రెండు వేల లోపు ఓట్లతో బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసన్ చేతుల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా మక్కల్ నీది మయ్యం డీఎంకే కూటమిలో చేరింది. ఈ దృష్ట్యా, ఈసారి ఈసీటు ఆ పార్టీ ఖాతాలో పడేనా అన్నది వేచిచూడాల్సిందే. కమల్ తాజాగా ఎంపీ కావడంతో ఈ స్థానంలో ఆయన తరపున పార్టీ ప్రతినిధి పోటీ చేస్తారా..? లేదా, డీఎంకేకు వదలి పెడుతారా? అన్న చర్చ ఊపందుకుంది. ఒక వేళ కమల్ వదులకుంటే, ఈ సీటు కోసం ఓ వైపు డీఎంకే, మరో వైపు కాంగ్రెస్ మధ్య సమరం తప్పదేమో అన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
మూగజీవులను ప్రేమించి.. వాటి మధ్యనే తనువు చాలించి..
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలోని ఆనేకల్కు చెందిన పశు వైద్యురాలు డా.సమీక్షా రెడ్డి (27)కి కన్నీటితో వీడ్కోలు పలికారు. శుక్రవారం శివమొగ్గలోని త్యావరెకొప్ప పులి–సింహాల జూ పార్క్లో జంతువులకు చికిత్స చేస్తుండగా నీటి ఏనుగు (హిప్పో) దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలతో కన్నుమూయడం తెలిసిందే. ఆనేకల్ తాలూకాలోని బన్నేర్ఘట్ట సమీపంలోని సకలవారలో శనివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు జరిగాయి. సమీక్షారెడ్డి మృతదేహం గ్రామానికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం ఆవరించింది. గ్రామస్తులు, అటవీ సిబ్బంది ఆమె భౌతికాకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమ ఏకైక కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు ధృవకుమార్, శైలజను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మూగజీవులంటే అమిత ప్రేమ సమీక్షారెడ్డికి చిన్నప్పటి నుంచే జంతువులు, పక్షులంటే అమితాసక్తి. ఆమె పట్టుదలతో చదివి పశు వైద్యురాలు అయ్యింది. ఆమె ఎంతో ఉత్సాహంతో పశువైద్య కోర్సును పూర్తి చేసి, పశుపక్ష్యాదుల సేవకు అంకితమైందని బంధువులు తెలిపారు. కానీ వాటి సేవలోనే అకాల మరణం చెందడం బాధాకరంగా ఉందని వాపోయారు. -
‘వెయిటింగ్ లిస్ట్’లో వందే భారత్ స్లీపర్
చెన్నై: రైలు ప్రయాణికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘వందే భారత్ స్లీపర్’ రైళ్ల రాక మరింత ఆలస్యం కానుంది. అత్యాధునిక సౌకర్యాలతో, విమాన ప్రయాణ అనుభూతిని అందించే ఈ ప్రతిష్టాత్మక రైళ్ల తయారీలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. ఈ రైళ్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటున్నవారి నిరీక్షణ ఇప్పట్లో ముగిసేలా లేదు.ముగిసిన గడువు.. అందని రైళ్లుమూడేళ్ల క్రితం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)సంస్థకు 10 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్టును ప్రభుత్వం అప్పగించింది. ఒక్కో రైలులో 16 కోచ్లు ఉండేలా ఒప్పందం కుదిరింది. ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నా, ఇప్పటివరకు కేవలం రెండు రైళ్లు మాత్రమే పట్టాలెక్కాయి. మిగిలిన ఎనిమిది రైళ్లను ఈ ఏడాది మార్చి నాటికి అందిస్తామని బీఈఎంఎల్ గతంలో హామీ ఇచ్చింది. కానీ, ఆ లక్ష్యాన్ని తర్వాత రెండు రైళ్లకు కుదించినప్పటికీ, నేటికీ ఆ రెండు రైళ్లు కూడా ఐసీఎఫ్ (ఐసీఎఫ్)కు చేరుకోలేదు. అసలు మిగిలిన రైళ్ల పరిస్థితి ఏమిటన్నదానిపై తయారీ సంస్థ నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం. రైల్వే శాఖ ఈ జాప్యంపై త్వరగా స్పందించి, స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.ఇది కూడా చదవండి: Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి మహిళా మంత్రి -
ఉగాండా ఏజెంట్తో రన్యారావు డీల్
బెంగళూరు: కన్నడ నటి రన్యారావు, ఆమె అనుచరులు నిర్వహిస్తున్న బంగారం స్మగ్లింగ్ దందాలో ఈడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.102 కోట్ల విలువచేసే బంగారాన్ని అక్రమంగా భారత్కు తరలించారని ఈడీ కోర్టులో చార్జిïÙట్ వేసింది. ఇందులో ఉగాండా దేశానికి చెందిన ఏజెంటుతో నటి రన్యకు లింకులు ఉన్నట్లు తెలిపింది. ఈడీ చార్జిషిటులో పేర్కొన్న ప్రకారం ఆమె దుబాయ్ నుంచే కాకుండా ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా బంగారాన్ని అక్రమంగా తరలించేది. దీనికోసం ఉగాండా ఏజెంట్తో సంప్రదించింది. దీనికోసం దుబైలో వీరా డైమండ్ ట్రేడింగ్ అనే పేరుతో కంపెనీని కూడా తెరిచింది. రన్యారావు స్నేహితుడు రాజు, సదరు ఏజెంట్కు అడ్వాన్స్గా రూ.33 లక్షలు చెల్లించారు. 2024, జనవరిలో రాజు బంగారం తేవడానికి ఉగాండాకు వెళ్లగా ఆ ఏజెంట్ తనకు మరింత ఎక్కువ డబ్బు.. అంటే రూ.1.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు తెలిసింది. రాజు వట్టిచేతులతో వచ్చాడు. స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టయిన రన్య బెంగళూరు పరప్పన జైల్లో గడుపుతోంది. -
రూ. 25 కోట్లు : జంట ఘరానా మోసం.. చివరికి
బెంగళూరులోకోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన దంపతులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీ బాధితుడి నుంచి దగ్గరినుంచి లక్షల్లో వసూలు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులో కిచ్చింది. ఇలా కోట్ల రూపాయలు దండుకున్న వైనం దిగ్భ్రాంతి రేపింది.ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన జేసన్ డిసౌజా, లవీనా దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసి సుమారు రూ.25 కోట్ల మేర దండుకున్నారు.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిరుద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులే లక్ష్యంగా వీరు వల విసిరారు. వివిధ కోర్టుల్లో 'డి-గ్రూప్' ఉద్యోగాలు ఇప్పిస్తామని వందలాదిమందిని నమ్మించారు. ఒక్కో బాధితుడి నుంచి రూ.10 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.అంతేకాదు బాధితులను నమ్మించేందుకు జడ్జీల సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, నకిలీ నియామక పత్రాలను (Appointment Orders) కూడా తయారు చేశారు. తమ నెట్ వర్క్ను విస్తరించుకునేందుకు పలువురు ఏజెంట్లను నియమించుకున్నారు. వీరి దందా కోసం నియమించుకున్న ఏజెంట్లు బాధితులను వెతికి పట్టుకుని, వారిని ఒప్పించి డబ్బులు వసూలు చేసేవారు. ఇందులో ఏజెంట్లు తమ కమిషన్ ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని దంపతులకు ఇచ్చేవారు.డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరుతో బాధితులను ప్రైవేట్ హోటళ్లకు పిలిపించేవారు. అక్కడ నకిలీ ఆఫర్ లెటర్లను చూపించి ఇది అసలైన రిక్రూట్మెంట్ అని నమ్మించి డబ్బులు వసూలు మొత్తం గుంజేవారు. డబ్బులు తీసుకున్న తర్వాత బాధితులు ఉద్యోగం ఎప్పుడు వస్తుందని అడిగితే, రకరకాల సాకులు చెప్పి చివరకు ఫోన్ నంబర్లు మార్చేసేవారు. తాము నిండా మునిగిపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. అదేంటి అంటే ఈ దంపతులు ఇదే తరహా ఉద్యోగ మోసాల కేసులో 2024లో కూడా అరెస్ట్ అయ్యారు. జైలు నుండి విడుదలైన తర్వాత మళ్లీ అదే దందాను మొదలుపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన CCB పోలీసులు వీరిని అరెస్ట్ చేసి. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే విషయంపై విచారణ జరుపుతున్నారు. -
Assam: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి మహిళా మంత్రి
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం (మార్చి 22) ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.టికెట్ దక్కకపోవడమే కారణమా?2022 నుంచి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో విద్యుత్, గనులు, గిరిజన సంస్కృతి వంటి కీలక శాఖల మంత్రిగా నందితా సేవలందించారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న హాఫ్లాంగ్ సీటును బీజేపీ నిరాకరించింది. ఆమె స్థానంలో కొత్త అభ్యర్థి రూపాలి లాంగ్థాసాకు టికెట్ కేటాయించడంతో నందిత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన ఆత్మాభిమానం కోసం, నియోజకవర్గ ప్రజల కోసం పార్టీ మారుతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు.త్యాగం చేసిన నిర్మల్.. కాంగ్రెస్ వ్యూహంనందితా చేరికతో కాంగ్రెస్ తన సమీకరణలను వేగంగా మార్చేసింది. నిజానికి హాఫ్లాంగ్ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మల్ లాంగ్థాసా పేరును కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది. అయితే నందిత.. పార్టీలోకి రావడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మల్ తన సీటును త్యాగం చేశారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. ‘గత ఐదేళ్లుగా డిమా హసావో గొంతుకగా ఉన్న నందిత, తన సిద్ధాంతాల కోసం నిలబడ్డారు’ అని కాంగ్రెస్ కొనియాడింది.సీఎం చర్చలు విఫలం?నందిత పార్టీ మారడానికి కొద్ది గంటల ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఆ భేటీలో ఏం జరిగిందనేది ఇరు పక్షాలూ బయటపెట్టలేదు. కానీ, సీఎం పర్యటన తర్వాతే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చూస్తుంటే, బుజ్జగింపులు ఫలించలేదని స్పష్టమవుతోంది. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9, 2026న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. మంత్రి నందిత కాంగ్రెస్లో చేరడంతో పోరు రసవత్తరంగా మారింది. -
భగత్ సింగ్కు ప్రధాని మోదీ ఘన నివాళి
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చిరస్మరణీయ ముద్ర వేసిన విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల త్యాగాలను స్మరించుకుంటూ దేశం నేడు ‘షహీద్ దివస్’ (అమరవీరుల దినోత్సవం) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ ముగ్గురు వీరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి ధైర్యసాహసాలు, దేశభక్తి నేటికీ కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.వారి త్యాగం వెలకట్టలేనిది: ప్రధాని మోదీప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. ‘భారతమాత ముద్దుబిడ్డలైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు నేడు దేశం సాష్టాంగ నమస్కారం చేస్తోంది. మాతృభూమి విముక్తి కోసం వారు చేసిన బలిదానం మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అతి చిన్న వయస్సులోనే వారు ప్రదర్శించిన అసాధారణ ధైర్యం ప్రశంసనీయం. బ్రిటిష్ వలస పాలనను ఎదిరించి, తమ ప్రాణాల కంటే దేశమే మిన్న అని చాటిచెప్పిన ఆ వీరుల ఆశయాలు ఇప్పటికీ మనలో స్ఫూర్తిని రగిలిస్తుంటాయి’ అని పేర్కొన్నారు. Today, we bow in reverence to the brave sons of Bharat Mata, Bhagat Singh, Rajguru and Sukhdev. Their martyrdom for the nation remains etched in our collective memory.At a young age, they displayed extraordinary courage and an unshakable commitment to the cause of India’s… pic.twitter.com/ZrTxC8PoTI— Narendra Modi (@narendramodi) March 23, 2026షహీద్ దివస్ ప్రాముఖ్యత ఏమిటి?ప్రతి ఏటా మార్చి 23ను భారతీయులు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. 1931లో ఇదే రోజున బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను లాహోర్ జైలులో ఉరితీసింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ ముగ్గురి పాత్ర అసాధారణమైనది.చరిత్రలో నిలిచిన ఆ వీరగాథ..ఈ విప్లవకారుల పోరాటం వెనుక బలమైన కారణాలున్నాయి. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో బ్రిటిష్ పోలీసుల లాఠీఛార్జ్ వల్ల ప్రముఖ నాయకుడు లాలా లజపతిరాయ్ మరణించారు. ఈ ఘటన భగత్ సింగ్ బృందాన్ని తీవ్రంగా కలిచివేసింది. దీనికి ప్రతీకారంగా వారు బ్రిటిష్ అధికారి జాన్ సాండర్స్ను హతమార్చారు. అనంతరం 1929లో బ్రిటిష్ వారి నిరంకుశ చట్టాలకు నిరసనగా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. ఎవరినీ చంపడం తమ ఉద్దేశ్యం కాదని, బ్రిటిష్ పాలకులకు భారతీయుల గళం వినిపించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఈ పోరాట ఫలితంగానే 1931 మార్చి 23న వారు వీరమరణం పొందారు. వారి త్యాగాలను స్మరిస్తూ నేడు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇది కూడా చదవండి: విమాన ప్రయాణికులకు ప్రభుత్వం షాక్ -
విమాన ప్రయాణికులకు ప్రభుత్వం షాక్
ముంబై: దేశీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటివరకు విమాన టికెట్ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని (Airfare Cap) ఎత్తివేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి (మార్చి 23, 2026) ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అంటే ఇకపై విమాన సంస్థలు డిమాండ్ను బట్టి తమకు నచ్చినట్లుగా టికెట్ ధరలను నిర్ణయించుకోవచ్చు.ఎందుకీ నిర్ణయం?గతేడాది డిసెంబర్లో ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాల నేపథ్యంలో ప్రయాణికులపై భారం పడకుండా ప్రభుత్వం ధరలపై తాత్కాలిక పరిమితులు విధించింది. అయితే ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణ భారంగా మారింది. ఈ క్రమంలో విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వాటికి ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఈ పరిమితులను తొలగించింది.ప్రయాణికులపై ప్రభావం?ధరల నియంత్రణ ఎత్తివేతతో ఇకపై విమాన ప్రయాణం ఖరీదు కానుంది. ముఖ్యంగా పండగలు, సెలవు రోజుల్లో.. విపరీతమైన రద్దీ ఉండే సమయంలో టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. చివరి నిమిషం బుకింగ్స్.. అర్జంటుగా ప్రయాణించాలనుకునే వారు గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయితే రద్దీ లేని సమయాల్లో (Off-peak periods) ప్రయాణికులను ఆకర్షించేందుకు సంస్థలు ధరలను తగ్గించే అవకాశం కూడా ఉంది.విమానయాన సంస్థలకు ‘డైనమిక్’ వెసులుబాటుఈ నిర్ణయంతో విమాన సంస్థలకు 'డైనమిక్ ప్రైసింగ్' చేసుకునే స్వేచ్ఛ లభించింది. దీనివల్ల వారు నష్టాల నుంచి కోలుకోవడమే కాకుండా, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ధరల పరిమితిని ఎత్తివేసినప్పటికీ, విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ధరలు పారదర్శకంగా, సహేతుకంగా ఉండాలని హెచ్చరించింది. విమాన ధరల పోకడలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, రద్దీ సమయాల్లో అకారణంగా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.


