breaking news
Karnataka
-
ఆకట్టుకున్న విజ్ఞాన ప్రదర్శన
రాయచూరు రూరల్: విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై అవగాహన పెంచుకోవాలని కలబుర్గి డివిజన్ విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం డివిజన్ స్థాయి విజ్ఞాన ప్రదర్శన పోటీలను ప్రారంభించారు. రామాయణం, మహభారత్లో దాగి ఉన్న అంశాలను క్షుణ్ణంగా అవలోకనం చేయాలన్నారు. కార్యక్రమంలో సిరాజ్, చంద్రశేఖర్ భండారి, గోవింద రెడ్డి, వీరేంద్ర పాటిల్, సంగమేష్, సుజాత, బసప్ప తదితరులు పాల్గొన్నారు. కాడసిద్దేశ్వర స్వామికి నో ఎంట్రీ హుబ్లీ: లింగాయత మఠాధిపతుల గురించి ఓ బహిరంగ కార్యక్రమంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కనేరి మఠం కాడుసిద్దేశ్వర స్వామికి విజయపుర జిల్లా ప్రవేశాన్ని నిర్బంధిస్తూ జిల్లాధికారి డాక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 16 నుంచి డిసెంబర్ 16 వరకు విజయపుర జిల్లాలో ప్రవేశించకుండా నిర్భంధం విధించారు. బసవ సంస్కృతి అభియాన్ను విమర్శించే దిశలో మాట్లాడిన కనేరి మఠం కాడుసిద్దేశ్వర స్వామి.. లింగాయత మఠాధీశుల ఒక్యూటను ముఖ్యమంత్రి కృపాపోషిత నాటక బృందం అనడమే కాకుండా, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై విధాన సభ విపక్ష నేత అశోక్, ఎంపీ జగదీశ్ శెట్టర్, ప్రతాప్ సింహ తదితరుల ఫిర్యాదు మేరకు జిల్లాధికారి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
నీటి కుంటలో పడి చిన్నారులు మృతి
రాయచూరు రూరల్: వ్యవసాయ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలైన ఘటన విజయపురలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం విజయపుర తాలుకా మించినాళ తాండాకు చెందిన స్వప్న రాజు రాథోడ్ (10), శివం రాజు రాథోడ్ (8), కార్తిక్ విశ్వ రాథోడ్ (8) నీటి కుంట వద్దకు వెళ్లారు. ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తూ కుంటలో పడటంతో ముగ్గురూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రశాంత్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బొలెరోను ఢీకొన్న కారు
● ముగ్గురు మృతి సాక్షి బళ్లారి: హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా కాకోలా సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న బొలెరోను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. దావణగెరె జిల్లా మలెరాణి బెన్నూరు గ్రామానికి చెందిన చమన్ సాబ్, మహబూబ్ సాబ్, లింగమ్మ కారులో వివాహానికి వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా రాణిబెన్నూరు సమీపంలో బొలెరో వాహనాన్ని కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రాణిబెన్నూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రూ.39 లక్షలతో పైప్లైన్ పనులురాయచూరు రూరల్: నగరంలో రూ.39 లక్షలతో పైప్లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ వెల్లడించారు. శుక్రవారం గంగా నివాస్ వద్ద పైప్లైన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాకర్లు, శాఖ అధికారులను ఆదేశించారు. పాత కాలం నాటి పైపులు కావడంతో తరచుగా పగిలిపోతున్నాయన్నారు. ప్రజలకు నీటి సరఫరా చేయడం కష్ట సాధ్యం కావడంతో నూతన పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సభ్యులు జయన్న, అబ్దుల్ వాహిద్, అల్లా ఉద్దీన్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్య కార్యాలయం ప్రారంభం హుబ్లీ: ఉత్తర కన్నడ జిల్లా మానసిక ఆరోగ్య పరిశీలన మండలి కార్యాలయాన్ని క్రిమ్స్ బోధన ఆస్పత్రి మనోవైద్య విభాగం గది సంఖ్య 111లో అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా సెక్షన్ న్యాయమూర్తి కిరణ్ కిన్ని, దివ్య శ్రీ, సీఎం జిల్లా న్యాయసేవ ప్రాధికార డాక్టర్లు విజయరాజ మనోవైద్య విభాగం డాక్టర్ అక్షయ పాఠక అసోసియేషన్ ప్రొఫెసర్ బసవరాజ్, మనోసామాజిక నిపుణులు మనోవైద్య విభాగం కార్వార క్రిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైభవంగా సుమీతీంద్ర తీర్థుల ఉత్సవాలు రాయచూరు రూరల్: మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో సుమీతీంద్ర తీర్థుల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి 300వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా త్రిష్ట మనోత్సవాలు, రాఘవేంద్ర స్వామి మూల విరాట్కు ఊంజల సేవలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. మహ పంచామృతాభిషేకం, గజ, రజత, స్వర్ణ రథోత్సవాలు జరిపారు. -
ట్రాక్టర్ బోల్తా
● 18 మందికి గాయాలు హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా ఆలూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారి–50పై ట్రాక్టర్ అదపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని బోగలేరహట్టి నుంచి తాలూకాలోని హుడెం గ్రామంలో జరగనున్న నామకరణ కార్యక్రమానికి ట్రాక్టర్లో బయలుదేరారు. కూడ్లిగి తాలూకా ఆలూర్ క్రాస్ సమీపంలో జాతీయ రహదారి–50పైకి రాగానే ట్రాక్టర్ అదపుతప్పి బోల్తా పడింది. కనహోసహళ్లి పోలీస్స్టేషన్ పీఎస్ఐ సిద్రామ్ బిదరాణి, పోలీసులు, హైవే అసిస్టెంట్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని జగలూర్ తాలూకా ఆస్పత్రికి తరలించారు. తదుపరి చికిత్స కోసం దావణగెరె ఆస్పత్రిలో చేరారు. సంఘటన తర్వాత పారిపోయిన ట్రాక్టర్ డ్రైవర్ తిప్పేస్వామిని హోస్పేట్ సమీపంలో అరెస్టు చేశారు. కానహోసహళ్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీపావళికి సామగ్రి సిద్ధం హుబ్లీ: నగరంలో దీపావళి కోసం పూజా సామగ్రి విక్రయాలు జోరందుకున్నాయి. ధార్వాడ జిల్లా, అలాగే జంట నగరాలైన హుబ్లీ, ధార్వాడ, గదగ, హావేరి, బళ్లారి, హోస్పేట, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ పూలు, ఇతర సామగ్రి విక్రయిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వ్యాపారులు వందల సంఖ్యలో ప్లాస్టిక్ పూలను వివిధ రకాల డిజైన్లలో రూపొందించారు. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో స్థానికులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. -
నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవాలు
బళ్లారి టౌన్: నవంబర్ 1న జిల్లా పాలన విభాగం ఆధ్వర్యంలో కర్ణాటక రాజ్యోత్సవాలను వైభవంగా జరుపుకోవాలని ఏడీసీ మహమ్మద్ ఝుబేర అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో జరిగిన ముందస్తు సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు రాజ్కుమార్ రోడ్డులోని మున్సిపల్ కళాశాల మైదానంలో పౌర పాలన మంత్రి రహిమ్ఖాన్ ధ్వజారోహణ చేస్తారన్నారు. ఇందుకోసం వేదికల సిద్ధత, పూర్తి పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై ఆయా అధికారులతో చర్చించారు. తొలుత కన్నడ మాత భువనేశ్వరి దేవి చిత్రపటానికి పూజలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ విభాగాల శద్ధ చిత్రాల వాహనాలను ఊరేగింపు చేపట్టాలని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని సన్మానించాలని పేర్కొన్నారు. నగరంలోని పరిశుభ్రత ప్రముఖ సర్కిల్లో దీపాలంకరణ ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సమావేశంలో కన్నడ సంస్కృతిక శాఖ ఏడీ బీ.నాగరాజు, వివిధ శాఖల అధికారులు చిదానందప్ప, షషుమొదీన్ పాల్గొన్నారు. -
తేలిపోయిన తెల్ల బంగారం
రాయచూరు పత్తి మార్కెట్ పత్తి బేళ్లతో మార్కెట్కు వచ్చిన వాహనాలు రాయచూరు రూరల్: పత్తి రైతులకు కాలం కలసి రావడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలపాలవుతున్నారు. తెల్ల బంగారానికి మార్కెట్లో ధరలు లభించడం లేదు. గత ఏడాది క్వింటాల్ రూ.8,500 నుంచి రూ.9,000 వరకూ పత్తి ధరలు పలికాయి. అయితే నేడు క్వింటా రూ.6,800 నుంచి రూ.7,100 వరకూ ధరలు పరిమితం అయ్యాయి. నూతన పత్తి మర్కెట్లో ధరలు ప్రకటించిన మిల్లు యజమానులు క్వింటాకు రూ.300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలోని క్రిష్ణ, మక్తల్, నారాయణ పేట, మద్దూరు, ఊట్కూరు, గద్వాల దరూరు, నందిని, బలిగేర, అయిజ, మాదవరం, ఇతర ప్రాంతాల నుంచి అధికంగా పత్తి బేళ్లు రాయచూరు మార్కెట్కు వస్తున్నాయి. నిత్యం హైదరాబాద్–రాయచూరు రహదారిలో పత్తి లారీలు, ట్రాక్టర్లు, మినీ లారీలు, జీపులు, క్యాబ్లతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు ప్రాంతాలుగా మారాయి. రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాలో కృష్ణా నది ఉన్నా నీరందడం లేదు. రైతులు భూముల్లో సాగు చేసిన పంటల దిగుడులు అంతంత మాత్రమే. జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. భారతీయ పత్తి మండలి అధికారులు ఎక్కడా పత్తి కోనుగోలు చేస్తున్నట్లు సమాచారం రైతులకు అందడం లేదు. రాజకీయ నేతలు బూటకపు ప్రకటనలతో ప్రచారం చేయడాన్ని రైతులు ఖండిస్తున్నారు. మార్కెట్లో పడిపోయిన పత్తి ధరలు క్వింటా రూ.6,800 నుంచి రూ.7,100 వరకూ పలుకుతున్న వైనం నష్టాలపాలవుతున్న అన్నదాతలు -
నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తాం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా నరసింహగిరిలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం చిరతాగుండా గ్రామంలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మా నాన్న గారి కలను నెరవేర్చబోతున్నానని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు శ్రమిస్తానని పేర్కొన్నారు. రేషన్ కార్డు, ఇళ్ల మంజూరు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చిరాతుగుండు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రత్నమ్మ బసన్న, ఈఓ నరసప్ప, తహసీల్దార్ వీకే.నేత్రావతి, డాక్టర్ ఎస్పీ ప్రదీప్, బీఈఓ మిలేష్ బేవూర్, శాన్ తమన్న, సీపీఐ ప్రహ్లాద్ ఎస్.చన్నగిరి పీఐ జి.సుబ్రమణ్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకటేష్, మాజీ ఈఓ బసన్న, తళ్వార్ శరణప్ప, ఫుడ్ సర్వీస్ డైరెక్టర్ జే.ఆంజనేయ, గూడెకోటె గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎన్.కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మురళీ కృష్ణ, ఓబన్న, సావిత్రిమ్మ, కమలమ్మ, జయమ్మ, సూరమ్మ, గౌడు బొమ్మయ్య, కేపీ పాలయ్య, ఏకై గొండి నాగరాజ్, ఎస్టీ ఎంసీ అధ్యక్షురాలు మల్లమ్మ పాల్గొన్నారు. -
తుంగభద్రలో పూడికతీత పనులు చేపట్టాలి
సాక్షి బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందించే తుంగభద్ర జలాశయంలో పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తమ్ గౌడ కోరారు. పలువురు రైతు సంఘం నాయకులతో కలసి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో నగర మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డితో కలిసి తుంగభద్ర డ్యామ్ ఆయకట్టు రైతుల సమస్యలను వివరించారు. 1953లో తుంగభద్ర డ్యామ్ నిర్మాణాలు పూర్తి చేసి బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, తెలంగాణ పరిధిలోని గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగు, సాగు నీటిని అందిస్తున్నారన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో వేలాది మంది రైతులకు సాగు నీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతోందని తెలిపారు. తుంగభద్ర డ్యామ్లో ప్రారంభంలో 133 టీఎంసీలు నీటి నిల్వ ఉండేదని.. ప్రస్తుతం పూడిక చేరడంతో 33 టీఎంసీలు నీరు తగ్గిపోయి 100 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ఆయకట్టు పరిధిలోని రైతులకు దామాషా ప్రకారం నీటిని తగ్గించారని తెలిపారు. తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందిగా మారిందన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలమండలి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి తుంగభద్ర డ్యామ్లో పూడిక చేపట్టాలని కోరారు. అలాగే బళ్లారి నగరంలో చిరు వ్యాపారులకు సోలార్ వాహనాలు అందజేయాలని సూచించారు. అంజూర, దానిమ్మ రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సాధ్యసాధ్యాలను పరిశీలించి తుంగభద్ర డ్యాంలో పూడికతీతపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ కేపీసీసీ అధ్యక్షుడు అల్లం వీరభద్రప్ప, మాజీ ఎమ్మెల్యే గాలిసోమశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ జి.వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్.దివాకర్ తదితరులు ప్రాంత సమస్యలను వివరించారు. జాతీయ బ్యాంకుల్లో రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న నేపథ్యంలో కర్నాటక గ్రామీణ బ్యాంక్లో కూడా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా రైతు మోర్చా అధ్యక్షుడు ఐనాథ్ రెడ్డి విన్నవించారు. డిమాండ్ల జాబితా సమర్పణ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం (కేఏజీబీఓఓ), కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం (కేఏజీబీడబ్ల్యూఓ) తరఫున కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అఽధికారులు, ఉద్యోగుల డిమాండ్ల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేశారు. కార్యక్రమంలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.సతీష్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విన్నవించిన రైతు సంఘం నేతలు వివిధ సమస్యలపై చర్చించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు -
తెగిపడిన చేతివేళ్లు
హుబ్లీ: హవేరి నగరంలో మంజునాథ్ అనే బాలుడు కొడవలితో జొన్న సొప్పదంటును చిన్న ముక్కలుగా కట్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఎడమ బొటన వేలు, పక్కన ఉన్న చూపుడు వేలు కొంత భాగం తెగిపడింది. వెంటనే తెగి పడిన వేళ్లను ప్లాస్టిక్ కవర్లో చుట్టుకుని తన తండ్రి, అన్నతో కలిసి కేఎంసీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వెళ్లాడు. అయితే తెగిపడిన వేళ్లను అమర్చడానికి కుదరదని సర్జన్ డాక్టర్లు స్పష్టం చేశారు. అలా అమరిస్తే ఇన్ఫెక్షన్ అవుతుందని తెలిపారు. బాలుడికి సర్జన్ డాక్టర్లు చికిత్స చేసి డిశార్జ్ చేశారు. -
తాగుబోతుల అడ్డాగా పాఠశాల ఆవరణ
హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణ నడిబొడ్డున ఉన్న పాఠశాల మైదానం తాగుబోతులకు అడ్డాగా మారింది. సాయంత్రం కావడంతో మందుబాబులు పాఠశాల ఆవరణలోకి వచ్చేస్తున్నారు. మద్యం తాగి, సీసాలు, ప్లాస్టిక్ చెత్తను అక్కడే పారేస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ ప్రీ–డిగ్రీ కళాశాలల ప్రాంగణంలో కొంత మంది దుర్మార్గులు రోజూ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీని వలన ఉదయం వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రి కాగానే గుంపులుగా.. పాఠశాల, ప్రభుత్వ ప్రీ–డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా మద్యం తాగి, ఖాళీ సీసాలు, మద్యం సీసాలు, గుట్కా స్లిప్లను విసిరేస్తున్నారు. మరి కొందరు సీసాలు పగలగొడుతున్నారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, పాఠశాలకు వచ్చే పిల్లలు నిరంతరం ఖాళీ సీసా పెంకులతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు పగలిన గాజు ముక్కలు పిల్లల పాదాలకు గుచ్చుకున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి పూట పాఠశాలలో గస్తీ నిర్వహించాలని కోరుతున్నారు. లైటింగ్ వ్యవస్థ కరువు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో లైటింగ్ వ్యవస్థ లేదు. దీనిని దుండగులు దుర్వినియోగం చేస్తున్నారు. పాఠశాల ఆవరణ దేవాలయంతో సమానం అనే సాధారణ జ్ఞానం లేకుండా దుర్మార్గులు పాఠశాల ఆవరణలో ఎటువంటి నిర్వహణ లేకుండా మద్యం సేవిస్తున్నారు. పాఠశాల ఆవరణలో మరమ్మతులు చేయని వీధి దీపాలను (హైమాస్) మరమ్మతు చేయడానికి పట్టణ పంచాయతీ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. విద్యా సంస్థల సమీపంలోని చిన్న దుకాణాల నుంచి విద్యార్థులకు గుట్కా లాంటి వస్తువులు పుష్కలంగా విక్రయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. తాగిన మందు సీసాలను అక్కడే పారేస్తున్న వైనం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు -
బెదిరింపు ఫోన్ కాల్ చేశారు
దొడ్డబళ్లాపురం: మంత్రి ప్రియాంక్ ఖర్గే అనుచరుడు తనకు బెదిరింపు ఫోన్ కాల్ చేశాడని బీజేపీ నేత, మాజీ మంత్రి, ఎంపీ రేణుకాచార్య ఆరోపించారు. శుక్రవారం ఆయన దావణగెరెలో మీడియాతో మాట్లాడారు. బెళగావి నుంచి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి ప్రియాంక్ ఖర్గే గురించి మాట్లాడితే హుషార్..అంటూ బెదిరించాడన్నారు. ఆ మొబైల్ నంబర్ తనవద్ద ఉందని, అయితే తాను పోలీసులకు ఫిర్యాదు చేయనన్నారు. తేనెటీగల దాడిలో విద్యార్థులకు అస్వస్థతశివమొగ్గ : తేనెటీగల దాడి చేయడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈఘటన శివమొగ్గ జిళ్లాలోని శికారిపుర తాలూకాలోని బగనకట్టె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. శుక్రవారం ఉదయం విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టుపై నుంచి తేనెటీగలు దాడి చేశాయి. విద్యార్థులు వాటిబారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసినా వెంటాడి కుట్టాయి. ఘటనలో 13 మంది విద్యార్థులు, ఒక మహిళ అస్వస్థతకు గురవ్వగా ఆస్పత్రికి శికారిపురలోని తరలించారు. జీతం అందక వాటర్మెన్ ఆత్మహత్య మైసూరు : సంవత్సరాల తరబడి జీతం అందక ఆర్థిక ఇబ్బందులతో వాటర్మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన చామరాజ నగర తాలూకా హోంగనూరు గ్రామంలో జరిగింది. చిక్క సునాయక(65) అనే వ్యక్తి అరకొర జీతంతో వాటర్మెన్గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు సంతానం ఉన్నారు. 27 నెలలుగా వేతనం అందక కుటుంబ పోషణ కష్టమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వేతనం మంజూరు చేయాలని గ్రామ పంచాయతీ అధ్యక్షురాలలు రూపా, పీడీఓ రామేగౌడను కోరగా తిట్టి పంపించారు. దీంతో మనో వేదనకు గురై శుక్రవారం సూసైడ్ నోట్ రాసి పంచాయతీ కార్యాలయం తలుపు వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. నటి సంగీతభట్కు అస్వస్థత ● చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిక యశవంతపుర: శాండిల్వుడ్ నటి సంగీతభట్ అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. హైస్టరోస్కోపిక్ పోలిఫెక్టమికి వైద్యులు శస్త్రచికిత్సలు చేశారు. గర్భాశయంలో 1.75 సెంటిమీటర్ల మేర పెరిగిన పాలిప్(గడ్డ)ను గుర్తించిన్నట్లు సంగీతభట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వ్యాధితో రక్తస్రావంతో పాటు ప్రమాదకరమైన నొప్పులు రావటంతో తూకం తగ్గుతుంది. గడ్డ ఉన్న విషయాన్ని గుర్తించిన తరువాత నెల రోజుల తరువాత ఆమెకు అపరేషన్ చేశారు. అనియమిత రక్తస్రావంతో బహిష్టు సమయంలో హార్మోన్లలో వ్యత్యాసం అవుతుంది. మహిళలు ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని సంగీతభట్ వివరించారు. -
వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత
హొసపేటె: స్వయం సహాయక బృందాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కసాపుర గ్రామంలో నాబార్డ్, ఎంపీ నిధులతో నిర్మించిన వ్యవసాయ ప్రొసెసింగ్, వేరుశనగ, చింతపండు, ప్రొసెసింగ్ యూనిట్, రైతు శిక్షణ, జనరల్ ఫెసిలిటీ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. వివిధ బ్యాంక్ పథకాల కింద రుణాలు పొందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కిసాన్ క్రెడిట్ కార్డుల జారీతో రైతులు, మత్య్సకారులు, చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ లీడ్ బ్యాంక్ ద్వారా అన్ని బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన వారికి కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేయాలని అధికారులు సూచించారు. విజయనగర జిల్లాలో 1,80,234 కేసీసీ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేసీసీ కార్డులు అందని లబ్ధిదారులందరూ డిసెంబర్ చివరి నాటికి మిషన్ మోడ్లో నమోదు చేసుకోవాలన్నారు. కార్డులను అందుకోలేని వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమాన్ యోజన కింద సంవత్సరానికి రూ.6 వేలు అందజేస్తోందన్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని 7 జిల్లాల్లో ఎఫ్పీఓలు, స్వయం సహాయక బృందాల ద్వారా రైతు ఉత్పత్తుల ఆధారంగా ప్రొసెసింగ్ యూనిట్లను స్థాపించామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే, డాక్టర్ శ్రీనివాస్, లతా మలికార్జున, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కమిషనర్ ఉమా మహదేవన్, నాబార్డ్ అధ్యక్షుడు కాగి, జిల్లాధికారి ఎస్ కవితా ఎస్ మన్నికేరి, జిల్లా పంచాయతీ సీఈఓ నోంగ్జామ్ మహమ్మద్ అలీ అక్రమ్షా, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనురుద్దన్ షావాన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ -
భారీ శబ్దపు టపాసులు నిషేధం
బనశంకరి: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చి శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడి పరిసరాలకు హాని కలుగుతుంది. అంతేగాక ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తుంది. ప్రాణులు, పక్షులకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పరిసర స్నేహిగా, నిరాడంబరంగా, కాలుష్యరహితంగా, భక్తిపూర్వకంగా ఆచరించాలని ప్రభుత్వం మనవి చేసింది. టపాసుల విక్రయాలు, ప్రజలు హసిరు టపాసులు గుర్తించడానికి చర్యలు టపాసుల బాక్సులపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్ఎల్), నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోగో, రిజిస్ట్రేషన్ నెంబరు ముద్రించాలి. అధికారికంగా టపాసుల విక్రయాలకు సంబంధించిన శాఖ ప్రాధికార నుంచి అందించిన లైసెన్సులో నిర్ణయించిన తేదీ, స్థలాల్లో మాత్రమే తాత్కాలికంగా టపాసుల దుకాణాలు తెరవాలి. నిషేధించిన టపాసులు కనబడితే అలాంటి టపాసులను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీపావళి పండుగను అపార్టుమెంట్ మైదానంలో పరిసర స్నేహిగా ఆచరించాలని అపార్టుమెంట్ వాసులకు సూచించింది. చెట్లు, ప్రాణులు, పక్షులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త వహించాలి. 125 డెసిబల్స్ శబ్దం కంటే అధిక ప్రమాణపు శబ్దం కలిగిన టపాసులను నిషేధించారు. విద్యాసంస్థలు, ఆసుపత్రి, వృద్ధాశ్రమాలు లాంటి సున్నిత ప్రదేశాల వద్ద టపాసులు కాల్చడం నిషేధం. టపాసులు కాల్చిన అనంతరం ఉత్పత్తి అయ్యే పొడిచెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయరాదు. స్థానిక సంస్థలు నిర్ణయించిన చెత్త తరలించే వాహనాల్లో అందించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హసిరు టపాసులు మినహా ఎలాంటి టపాసులను రాత్రి 8నుంచి 10 గంటల వరకు కాల్చాలి. 125 డెసిబల్స్ కంటే ఎక్కువ ప్రమాణంలో శబ్దం ఉండరాదు దీపావళిని పరిసర స్నేహిగా ఆచరించాలని సర్కారు మనవి -
డ్రగ్స్ దందా ఎలా జరుగుతుందంటే...
బనశంకరి: ఐటీ బీటీ సిలికాన్సిటీగా ఖ్యాతి గడించిన బెంగళూరు నగరంలో డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకుంది. పలు అక్రమ మార్గాల్లో డ్రగ్స్పెడ్లర్లు పోలీసుల కళ్లుగప్పి విదేశీ తపాలా, కొరియర్ ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకుని డ్రగ్స్ దందాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. పోలీసుల దాడుల్లో కోట్లాది రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టుబడటంతో బెంగళూరు నగరంలో డ్రగ్స్మాఫియా ఎంతమేర విస్తరించింది అనేందుకు నిదర్శనం. ఉడ్తా పంజాబ్ తరహాలో కర్ణాటకలో డ్రగ్స్ మాఫియా వేళ్లూనింది. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ప్రస్తుతం శునకాలు, పిల్లులు, చేపలతో పాటు ఇతర పెంపుడు జంతువుల ఆహారం ముసుగులో విదేశాల నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసే డ్రగ్స్ను బెంగళూరుకు దిగుమతి చేసుకుంటుండడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. థాయ్లాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియాతో పాటు వివిధ దేశాల ద్వారా బెంగళూరు నగరానికి డ్రగ్స్ దిగుమతి అవుతుంది. నలుగురు ఉద్యోగుల అరెస్టు 2019లో డ్రగ్స్ పెడ్లర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపణలతో తపాలా శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు విదేశాల నుంచి తపాలా ద్వారా వచ్చే డ్రగ్స్ను పెడ్లర్లకు అందించేవారు. విదేశాల నుంచి బెంగళూరుకు పార్శిల్ ద్వారా గత కొన్నేళ్లుగా సరఫరా కొనసాగుతోంది. నెదర్లాండ్స్ నుంచి 2020లో బెంగళూరు చామరాజపేటెకు పార్శిల్ ద్వారా వచ్చిన ఎంఎండీఏ, బ్రౌన్షుగర్ లాంటి సైకోట్రోఫిక్ డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్ అధికారులు డార్క్వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిన బెంగళూరు యువకులను అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ విదేశీ తపాలా ద్వారా బెంగళూరుకు సరఫరా చేసుకుంటున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. చామరాజపేటె పార్శిల్స్లో 200 డ్రగ్స్ మాత్రలు, ఎండీఎంఏ, బ్రౌన్షుగర్ స్వాధీనం చేసుకున్నారు. 2024 అక్టోబరులో విదేశీ తపాలా కార్యాలయానికి రూ.21 కోట్ల విలువ చేసే 600కు పైగా డ్రగ్స్ పార్శిల్స్ సరఫరా కావడంతో సీసీబీ పోలీసులు దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అడ్రసులతో పార్శిల్స్ విదేశాల నుంచి పంపిన పార్శిల్స్కు నకిలీ అడ్రస్లు ఇచ్చారు. కొరియర్, తపాలా కార్యాలయాల్లో డ్రగ్స్ సరఫరా నియంత్రణకు నగర వ్యాప్తంగా దాడులు నిర్వహించి కొరియర్, తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 2024 డిసెంబరులో న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు కొరియర్ ఏజెన్సీ, తపాలా కార్యాలయాలపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. సంపంగి రామనగర కొరియర్ ఏజెన్సీలో సీసీబీ, డాగ్స్క్వాడ్ పార్శిల్స్ పరిశీలించి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. 2025 జూలై నెలలో సీసీబీ పోలీసులు చామరాజపేటెలోని విదేశీ తపాలా కార్యాలయంపై దాడి చేసి కొకై న్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ, గంజాయితో పాటు సుమారు రూ.6 లక్షల విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని కొందరు విదేశీయులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ దందాలో విదేశీయులు అధికంగా ఉండటం విశేషం. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 35 మందిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక కేరళ, తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన 1,013 మంది డ్రగ్స్పెడ్లర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గత మూడు నెలల్లో బెంగళూరు నగరంలో డ్రగ్స్ దందాకు అధిక కేసులు నమోదయ్యాయి. జూలైలో 158 కేసులు నమోదు కాగా 196 మంది భారతీయులతో కలిపి 5 మంది విదేశీయులను అరెస్ట్ చేశారు. ఆగస్టులో 132 కేసులు నమోదు కాగా వీరిలో 2024 మంది భారతీయులు, 5 మంది విదేశీయులు, సెప్టెంబరు నెలలో 160 కేసులు నమోదు చేసిన పోలీసులు 237 మంది భారతీయులు, 6 మంది విదేశీ డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. తపాలా, కొరియర్ ద్వారా విదేశాల నుంచి దిగుమతి డగ్స్ దందాలో విదేశీయుల భాగస్వామ్యం అధికం బిజినెస్, మెడికల్ వీసాతో బెంగళూరు నగరానికి వచ్చే విదేశీయులు అంతర్జాతీయ తపాలా కార్యాలయాల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని విక్రయాలు డార్క్నెట్, డార్క్వెబ్ ద్వారా కొరియర్, ఆన్లైన్ సేల్ అద్దె ఇళ్ల యజమాని అడ్రస్ అందించి పోస్ట్ ద్వారా డ్రగ్స్ వస్తువుల రవాణా కొందరు స్థానిక డ్రగ్స్ పెడ్లర్లకు ఆధార్ అడ్రస్ అందించి వారి పేరుతో పార్శిల్స్ పెంపుడు జంతువులు ఆహారం బాక్సుల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా హైడ్రోగంజాయి, అపీము, కొకై న్ అధికంగా విక్రయాలు ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డ్రగ్స్పెడ్లర్లపై పోలీసుల నిఘా సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్పెడ్లర్లపై ప్రత్యేక నిఘా సర్పేల్వెబ్, డార్క్నెట్, డార్క్వెబ్స్పై ప్రత్యేక పర్యవేక్షణ ఎఫ్ఆర్ఆర్ఓ, డీఆర్ఐ, ఎన్సీబీ సంస్థలతో కలిసి సమాచారం వినిమయం విదేశీ పౌరులు నివసించే అడ్రస్లు, ఉద్యోగ సమాచారం సేకరణ -
నేత్రపర్వం తీర్థోద్భవం
యశవంతపుర: కొడగు జిల్లా భాగమండల సమీపంలోని తలకావేరిలో శుక్రవారం కావేరి తీర్థోద్భవమైంది. కావేరి అమ్మవారు రోహిణిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి అశీర్వాదం తీసుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడ్డారు. కొడగుకు చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులను ధరించి గీతాలకు నృత్యాలు చేస్తూ అమ్మవారికి హారతినిచ్చి స్వాగతం పలికారు. కొడగు ప్రజల సంప్రదాయ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం 1.44 గంటలకు మకర లగ్నంలో కావేరి తీర్థరూపిణిం అమ్మవారు దర్శనం ఇచ్చారు. సూర్యుడు కన్యారాశి నుంచి తులా రాశికి మారుతున్న కారణంగా మకర లగ్నంలో కావేరి అమ్మ తీర్థరూపిణిగా ఉద్భవించారు. కావేరి ఉద్భవి స్థానం నుంచి నీరు ఉత్పత్తి కావటం ఇక్కడ విస్మయంగా మారింది. కొడగుతో పాటు వేల మంది భక్తులు భక్తితో జీవ నదికి పూజలు చేశారు. తలకావేరిలో ప్రతి ఏటా కావేరి తీర్థ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వటం పురాతన కాలం నుంచి ఆనవాయితీ. తమిళనాడు నుంచి భక్తులు వచ్చి ఇక్కడి తీర్థాన్ని తీసుకెళ్లారు. మైసూరు మహారాజు, ఎంపీ యదువీర్ కృష్ణరాజ దత్త ఒడెయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో రూ.కోటి వసూలు
● కొప్పళ నగరసభ మాజీ సభ్యురాలి అరెస్ట్ రాయచూరు రూరల్: నిరుద్యోగులకు ఉద్యోగాలిపిస్తామని చెప్పి రూ.కోటి వసూలు చేసినట్లు ఆరోపణలపై కొప్పళ నగరసభ మాజీ సభ్యురాలు విజయ హిరేమఠ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి12 మందితో రూ.కోటి వసూలు చేసింది. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు వెనక్కు ఇవ్వాలని బాధితులు కోరారు. దీంతో ఆమె బెదిరింపులకు పాల్పడింది. గత్యంతరం లేక బాధితులు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామదుర్గ పోలీసులు విచారణ చేపట్టి విజయ హిరేమఠ్ను అరెస్ట్ చేశారు. బహిరంగ స్థలాల్లో నమాజును నిషేధించాలి ● సీఎంకు ఎమ్మెల్యే బసనగౌడ పాటీల్ యత్నాళ్ లేఖ శివాజీనగర: బహిరంగ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో నమాజు చేసేందుకు అవకాశం కల్పించరాదని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటీల్ యత్నాళ్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. ఆంగ్లంలో రాసిన లేఖను సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. ‘సర్వజన శాంతి తోట’ అనే ప్రభుత్వ ఆశయం అందరికీ అన్వయించాలి. బహిరంగ స్థలాల్లో, ప్రభుత్వ స్థలాల్లో నమోజు చేసేందుకు అవకాశం కల్పించరాదు. ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ సంఘ సంస్థల కార్యకలాపాలను నిషేధించినట్లుగానే నమాజు చేయటాన్ని కూడా నిషేధించాలి. అప్పుడే మీరు నిజమైన లౌకికవాది అనిపించుకుంటారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై మళ్లీ కాంట్రాక్టర్ల వార్ ● నెలలోగా బకాయిలు విడుదల చేయకుంటే తీవ్ర పోరాటం శివాజీనగర: కాంట్రాక్టర్ల సంఘం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. కాంట్రాక్టర్ల పెండింగ్ సొమ్ము చెల్లించాలని, వివిధ డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి చేస్తూ పోరాటం చేపడతామని హెచ్చరించింది. శుక్రవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఆర్.మంజునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ వసూలు అధికమైందన్నారు. 60 నుంచి 80 శాతం పర్సెంటేజీ కమీషన్ అని తాము చెప్పలేదు. అయితే కాంట్రాక్టర్లకు పెండింగ్ సొమ్ము చెల్లించకుండానే కమీషన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. రూ.52 వేల కోట్ల పెండింగ్ సొమ్ము విడుదల చేయాల్సి ఉంది. కొన్ని శాఖలు సొమ్ము విడుదల చేశాయి. రూ.33 వేల కోట్లు పెండింగ్లో ఉంది. మరో నెల రోజుల పాటు వేచి చూస్తాం. అంతలోగా సొమ్ము విడుదల చేయకుంటే తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సిట్ తనిఖీలుదొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా ఆళంద నియోజకవర్గంలో ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి సీఐడీ, సిట్ అధికారులు శుక్రవారం రెండుచోట్ల దాడులు చేశారు. గుబ్బి కాలనీలో ఉన్న ఆళంద నియోజకవర్గం బీజేపీ మాజీ ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్ ఇల్లు, వివేకానంద నగర్లో ఉన్న సీఏ మల్లికార్జున్ అనే వ్యక్తి ఇంట్లో ఈ దాడులు జరిగాయి. 50 మంది పోలీసులు 80 మందికి పైగా అధికారులు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా పట్టణంలో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆళంద నియోజకవర్గంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 వేలకుపైగా ఓటర్ల పేర్లను తొలగించడానికి ప్రయత్నించినట్టు ఆళంద ఎమ్మెల్యే బీఆర్ పాటీల్ ఆరోపించారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. -
లోకేశ్ పోస్టులపై భగ్గుమంటున్న కర్ణాటక వాసులు
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి పునర్విభజితమైన కొత్త రాష్ట్రాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మంత్రి లోకేశ్ చేస్తున్న వరుస ట్వీట్లపై కర్ణాటకవాసులు భగ్గుమంటున్నారు. లోకేశ్ ట్వీట్లతో జాతీయస్థాయిలో ఏపీ పరువు పోతుండటంతో పాటు కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారిపై స్థానికుల ఆగ్రహావేశాలకు దారితీస్తున్నాయి. ఇదే విషయాన్ని చాలామంది ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చాలామంది ఏపీ ప్రజలు పని చేసుకుంటున్నారని, పోస్టు చేసేముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎక్స్లో ట్వీట్ చేస్తున్నారు. తాజాగా లోకేశ్ పెట్టిన పోస్టుతో కూటమి సర్కారు ఆర్థిక నిర్వహణ తీరును కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా నిలదీశారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడాన్ని కర్ణాటక వాసులు తట్టుకోలేకపోతున్నారంటూ పరోక్షంగా లోకేశ్ ఎక్స్లో పెట్టిన పోస్టు ఇప్పుడు జాతీయస్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఏపీ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని, ఇప్పుడు ఇది పెట్టుబడులకు కూడా వ్యాప్తి చెందడంతో పొరుగువారి కడుపులో మంట మొదలైందంటూ లోకేశ్ గురువారం ఎక్స్లో చేసిన ఈ వ్యాఖ్యపై కర్ణాటక మంత్రి అంతే ఘాటుగా స్పందించారు.గతంలోనూ ఇదే తీరు బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అనో.. లేక ఏదైనా కంపెనీ కర్ణాటకలో పెట్టుబడులపై ఆలోచిస్తున్నట్లు ఒక చిన్న వార్త వస్తే చాలు వెంటనే లోకేశ్ ఎక్స్లో పోస్టులు పెడుతుండటం కర్ణాటక వాసుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది. గతంలో ఇదేవిధంగా ఒకసారి లోకేశ్ పోస్టు చేస్తే ప్రియాంక్ ఖర్గే ఇదేవిధంగా ఘాటుగా స్పందించారు. బలహీనమైన ఎకో సిస్టమ్ ఉన్నవాళ్లు బలమైన వాళ్లపై ఆధారపడి జీవించడం సహజమంటూ పరాన్నజీవిగా అభివర్ణించారు. మీ ఘనత.. ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్ల అప్పులు చేయడం ప్రియాంక్ ఖర్గే ఏం ట్వీట్ చేశారంటే.. ప్రతి ఒక్కరు ఆహారంలో కాస్తాకూస్తో స్పైసీని ఆస్వాదిస్తారని, కానీ ఇది పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన మేరకే పరిమితం చేస్తామన్నారు. ఆర్థికవేత్తలు కూడా బడ్జెట్ నిర్వహణలో సమతుల్యతను పాటిస్తారు. ఏపీ ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్లు అప్పులు తీసుకుందని, రాష్ట్ర జీఎసీడీపీలో అప్పుల వాటా 2.61 శాతం నుంచి 3.61 శాతానికి పెరగడం ద్వారా ఏపీ ఆర్థికవ్యవస్థ దిగజారిపోయిందంటూ పోస్టు చేశారు. -
ఇన్ఫోసిస్ అంటే బృహస్పతినా?
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య సర్వేపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ఈ సర్వే వెనుకబడిన తరగతులకు సంబంధించినది కాదని పదేపదే చెప్పినా నారాయణమూర్తి దంపతులకు అర్థంకాలేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది (సర్వే) వెను కబడిన కులాలకు సంబంధించినదనే అపోహ కొందరిలో ఉంది. ఇది వెనుకబడిన కులాల సర్వే కాదు. దీని గురించి రాసేవాళ్లు ఏమై నా రాసుకోనీయండి. ఈ సర్వే ఎందుకోసమనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. వాళ్లకు (నారాయణమూర్తి దంపతులకు) దీనిగురించి అర్థంకాకపోతే నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు.వాళ్లు సర్వజ్ఞులా?ప్రభుత్వ సర్వేపై నారాయణమూర్తి దంపతులు గురువారం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వారి ఇంటికి సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు వారు సహకరించలేదని తెలిసింది. తాము వెనుకబడిన వర్గానికి చెందినవారము కాదని, అందువల్ల సర్వేలో పాల్గొనబోమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నారాయణమూర్తి దంపతుల తీరుపై సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ‘ఇన్ఫోసిస్ అంటే ఏమైనా బృహస్పతినా (మేధావి)? ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదని, అందరి సర్వే అని మేం 20 సార్లు చెప్పాం. మా ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి శక్తి పథకాన్ని ప్రారంభించింది. గృహలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2,000 ఇస్తున్నాం. శక్తిపథకాన్ని వినియోగించుకుంటున్నవారిలో అగ్రకుల మహిళలు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు లేరా? గృహలక్ష్మి పథకంలో అగ్రకుల మహిళలు లేరా? కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేపడుతోంది. మూర్తి దంపతులు ఆ సర్వేలో ఏం చెప్తారు? బహుషా తప్పుడు సమాచారం ఇస్తారేమో! నేను మళ్లీమళ్లీ చెప్తున్న ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదు. ఏడు కోట్లమంది కన్నడిగులకు సంబంధించిన సర్వే’అని స్పష్టంచేశారు.మార్పు అనేది విప్లవం కాదురాష్ట్రంలో సీఎం మార్పుపై కూడా ఆయన స్పందించారు. ‘కొందరు నవంబర్ క్రాంతి అంటున్నారు. అది క్రాంతి కాదు. క్రాంతి అంటే విప్లవం. మార్పు అనేది విప్లవం కాదు’అని పేర్కొన్నారు. నాయకత్వ మార్పు అంశం సమయం సందర్భం లేకుండా చర్చకు వస్తోందని, దీనిని పెద్దగా పట్టించుకోవా ల్సిన అవసరం లేద ని అన్నారు. ప్రభుత్వ భూములు, స్కూళ్లు, కాలేజీల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ‘ఇది ఒక్క ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నిర్ణ యం కాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా కార్యకలాపాలు నిర్వహించటం కుదరదు. నిజా నికి ఈ నిర్ణయం గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగదీశ్ షెట్టర్ సర్కారు తీసుకుంది’అని పేర్కొన్నారు. -
‘వారిది ఇన్ఫోసిన్.. అలా అంటే మనం ఏం చేస్తాం?’
బెంగళూరు: కర్ణాటకలో చేపట్టిన సామాజిక, విద్యా సర్వేను వ్యతిరేకించిన కారణంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తిపై కర్ణాటక ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీరికి(నారాయణమూర్తి దంపతులకు) వెనుకబడిన వర్గాలన్నా, కుల గణన అన్నా చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు. ఇదే వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం తన నోటికి పని చెప్పారు. వారికి అన్ని తెలుసంటూనే. వారికి మనం ఏం చెబుతామంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.‘ ఇది కేవలం సామాజిక మరియు విద్యా సర్వే. అంతే కానీ వెనుకబడిన వర్గాల సర్వే కానే కాదు.. ఇది జనాభా గణాంకాల కోసం నిర్వహించే సర్వే మాత్రమే. ఈ విఫయాన్ని చాలాసార్లు చెప్పాం కూడా. ఇప్పటి వరకూ కనీసం 20 సార్లు అయినా ఇది జనాభా లెక్కల సర్వే అని చెప్పాం. అయినా వారు వెనుకబడిన వర్గాల గణాంకాల సర్వే అనుకుని అందులో పాల్గొనమని చెప్పారు. అది వారికే వదిలేద్దాం. ఈ విసయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతే మనం చేస్తాం. వారిది ఇన్ఫోసిన్.. వారికంతా తెలుసు’ అంటూ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేపట్టిన సామాజిక సర్వే, కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. రూ. 420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి:మూర్తిగారూ.. ఇదేంటండీ? -
మూర్తిగారూ.. ఇదేంటండీ?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి తాజా నిర్ణయంపై కర్ణాటక మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనేందుకు మూర్తి దంపతులు నిరాకరించడంతో కన్నడ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కాగా ప్రతిపక్ష బీజేపీ.. సుధామూర్తి దంపతులకు మద్దతుగా నిలిచింది. అసలేం జరిగింది?ప్రభుత్వ సామాజిక సర్వే, కులగణనలో తాము పాల్గొనబోమని అంటూ తమ ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లతో మూర్తి దంపతులు చెప్పారు. తాము అగ్రకులానికి చెందిన వారమని, వెనుకబడిన కులాలకు కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే తమకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో (DK Shivakumar) పాటు పలువురు మంత్రులు స్పందించారు. ''సర్వేలో పాల్గొనమని మేము ఎవరినీ బలవంతం చేయడం లేదు. అది స్వచ్ఛందంగా జరగాల''ని డీకే కామెంట్ చేశారు. వెనుకబడిన కులాల సంక్షేమంపై మూర్తి దంపతులకు ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ ఎస్. తంగడగి వ్యాఖ్యానించారు.మాటకు కట్టుబడతారా?సర్వేలో పాల్గొనాలని తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ (Santosh Lad) అన్నారు. "ఒక ప్రభుత్వంగా, మేము ఎవరినీ సర్వేలో పాల్గొనమని బలవంతం చేయడం లేదని" అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేయనుందని, అప్పుడు కూడా మూర్తి దంపతులు ఇదే వైఖరికి కట్టుబడతారా'' అని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనకూడదన్న వారి నిర్ణయం మిగతా వాళ్లపై ఎటువంటి ప్రభావం చూపబోదని మంత్రి సంతోష్ అభిప్రాయపడ్డారు.అలా చెప్పడం కరెక్ట్ కాదుప్రభుత్వం చేపట్టిన సర్వేలో పాల్గొనబోమని నారాయణ మూర్తి లాంటి వారు చెప్పడం సమంజసంగా లేదని ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే (priyank kharge) అన్నారు. మూర్తి దంపతుల నిర్ణయం చూస్తుంటే ఇతర బీజేపీ నాయకుల నుంచి ప్రేరణ పొందినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన నారాయణమూర్తి లాంటి వారి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వ సర్వేలో పాల్గొనబోమని వారు చెప్పడం కరెక్ట్ కాదని ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించారు. గోప్యంగా ఉంచుతామని.. మూర్తి దంపతుల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలిని బీజేపీ నాయకుడు సురేశ్ కుమార్ (Suresh Kumar) తప్పుబట్టారు. సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కానీ మూర్తి దంపతులు తమ అభిప్రాయాలతో రాసిన నోట్ను బహిర్గం చేయడం ద్వారా కాంగ్రెస్ సర్కారు మాట తప్పి ఉల్లంఘనకు పాల్పడిందని ఆయన విమర్శించారు. కాగా, రచయిత్రి, పరోపకారి అయిన సుధామూర్తిని గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 19 వరకు సర్వేకాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేపట్టిన సెప్టెంబర్ 22న సామాజిక సర్వే, కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. ₹420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేయడానికి.. బలహీన వర్గాలకు మరింత సమర్థవంతంగా సాధికారత కల్పించడంలో ఈ డేటా సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. చదవండి: నన్ను కలవొద్దని ఆ కుటుంబాన్ని బెదిరించారు -
ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్లాగ్స్తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి! -
భార్య నరికివేత
కర్ణాటక: కుటుంబ కలహాలతో భార్యను భర్త నరికి చంపిన ఘటన చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. అజ్జంపుర తాలూకా చిక్కనావంగళ గ్రామానికి చెందిన తను (25) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. తనుతో రమేశ్కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే భర్తతో తరచూ గొడవలు రావడంతో ఆమె రెండేళ్ల నుంచి వేరేగా ఓ వక్కతోటలోని ఇంటిలో నివసిస్తోంది. బుధవారం రాత్రి మద్యం మత్తులో రమేశ్ తను ఇంటికి వెళ్లాడు. ఆమెను కొడవలితో నరికి చంపాడు. తరువాతన తన చేతిని కోసుకొని.. భార్యే నన్ను చంపడానికి యత్నించినట్లు గ్రామస్థులకు చెప్పాడు. ఏమి జరిగిందో చూద్దామని ఆమె ఇంటికి గ్రామస్థులు వెళ్లగా రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. రమేశ్ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త, అతని అక్క, చెల్లెలు, అత్తమామలతో పాటు 9 మందిపై తను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 9 మందినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
కనకదుర్గమ్మకే నమ్మకద్రోహం.!
సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే కనక దుర్గమ్మ ఆలయంలో పని చేసే పూజారుల తీరు భక్తుల హృదయాలను కలిచివేస్తోంది. బళ్లారి కనకదుర్గమ్మ అంటే ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజించి తమ కోర్కెలను తీర్చుకుని పునీతులవుతున్నారు. బళ్లారి కనకదుర్గమ్మ ఆలయానికి చారిత్రాత్మక, మహిమాన్విత ఆలయంగా గుర్తింపు ఉంది. ఇక్కడ అమ్మవారిని ఏ పూజారో లేదో భక్తులో ప్రతిష్టించిన విగ్రహం కాదు. సాక్షాత్తు అమ్మవారు స్వయంభువుగా వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ తరిస్తున్నారు. ఇలాంటి గొప్ప, మహిమాన్విత, చారిత్రాత్మకమైన కనక దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించే పూజారుల తీరు, అమ్మవారి ఆలయంలో కానుకలను అక్రమంగా తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం యావత్ భక్త కోటిని తీవ్రంగా కలిచివేస్తోంది. నెల నెలా రూ.10 లక్షల విలువైన కానుకల తరలింపు ఎంతో పవిత్రంగా, నమ్మకంగా అమ్మవారిపై ఉన్న భక్తితో ఆలయానికి వచ్చి కానుకలు సమర్పిస్తే వాటిలో కనీసం నెలకు దాదాపు రూ.10 లక్షలకు పైగా విలువ చేసే వివిధ రకాల కానుకలను తరలిస్తున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొనడం గమనార్హం. పూజారుల తీరు, అక్రమంగా తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కనక దుర్గమ్మ ఆలయ ఉన్నతాధికారులు ప్రమోద్, హనుమంతప్ప పూజారులకు నోటీసులు కూడా జారీ చేయడం గమనార్హం. కనక దుర్గమ్మ ఆలయంలో పని చేసే, పూజలు అందించే పూజారులకు అధికారికంగానే హారతిలో వేసే నగదు పూర్తిగా పూజారులకే చెందుతుంది. ఇది కాకుండా ఆకు పూజ చేసేందుకు రూ.2500లు భక్తులకు రసీదు చెల్లిస్తే ఇందులో పూజారులకు రూ.1250లు, అమ్మవారికి అభిషేకం రూ.1000లు, కుంభం రూ.1000లు, గండ దీప పూజ రూ.1000లు, కుంకుమార్చనకు రూ.100లు, వాహనాల పూజకు రూ.100ల నుంచి రూ.200లు ఇలా ఆలయంలో ప్రభుత్వం నియమించిన దేవదాయ శాఖ అధికారుల నుంచి భక్తులు రసీదు తీసుకొని పూజలు చేయిస్తారు. అధికారిక ఆదాయంతో పాటు భారీగా అక్రమ స్వాహా ఈ పూజల ద్వారా ప్రతి నెల కనీసం రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఆలయానికి ఆదాయం వస్తుంది. ఇందులో పూజారులకు సగం చెల్లించాలి. అంటే కనీసం అక్కడ పని చేసే పూజారులకు ప్రతి నెల రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు అధికారికంగానే దేవదాయ శాఖ అధికారులు చెల్లిస్తారు. ఇక హారతిలో వేసే నగదును లెక్కించరు. ఆరోజు ఏ పూజారి పూజ చేస్తారో వారికే ఆ నగదు చేరుతుంది. ఇలా అధికారికంగా నెలకు అమ్మవారి ఆలయం నుంచి లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా అనధికారికంగా కూడా పెద్ద ఎత్తున పూజలు, కానుకలను స్వాహా చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అనధికారికంగా, అక్రమంగా పూజారులు తీసుకెళ్లే మచ్చుకు కొన్ని ఉదాహరణలుగా అధికారులు వెల్లడిస్తున్న ప్రకారం అమ్మవారికి చీరలు, ఒడి బియ్యం, బంగారు వెండి ఆభరణాల ద్వారా నెలకు రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని వెల్లడించారు. ప్రతి నెల దాదాపు 8 క్వింటాళ్ల బియ్యం, ఒక క్వింటాల్ బెల్లం, ఒక క్వింటాల్ కొబ్బరి, వీటితో పాటు అమ్మవారికి సమర్పించే విలువైన చీరలు 1000 నుంచి 2000 దాకా వస్తాయని, ఒక్కొక్క చీర ఖరీదు రూ.500 నుంచి రూ.30 వేల దాకా ఉంటుందని అంచనా. ఇలా అమ్మవారికి సమర్పించిన బంగారు, వెండి, ధాన్యాలు, చీరలను ఆలయ అభివృద్ధికి అందించకుండా పూజారులే తరలిస్తున్నారని ఆలయ కమిటీ అధికారులు నోటీసులు జారీ చేయడం నగరంతో పాటు భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు భక్తుల కొంగుబంగారం కనక దుర్గమ్మ ఆలయం ఆలయంలో భక్తులిచ్చిన కానుకలను కాజేస్తున్న పూజారులు? గుడి నుంచి కానుకల తరలింపు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అమ్మవారి భక్తుల హృదయాలను కలిచివేస్తున్న పూజారుల వైఖరి -
నేడు కూడ్లిగిలో దిశ సమావేశం
హొసపేటె: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బళ్లారి లోక్సభ సభ్యుడు ఈ.తుకారాం అధ్యక్షతన పట్టణంలోని ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల కొత్త సభాంగణంలో జరుగుతుంది. ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల హాలును జెడ్పీ సీఈఓ నోంగ్జాయ్ మహమ్మద్ అక్రమ్ అలీషా, ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు. తహసీల్దార్ నేత్రావతి, తాలూకా పంచాయతీ అధికారి నరసప్ప, హామీ పథకం అమలు కమిటీ తాలూకా అధ్యక్షుడు మహమ్మద్ జిలాన్, పీఏీసీ అధ్యక్షుడు కావళ్లి శివప్ప నాయక, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టండి
హొసపేటె: అన్నభాగ్య పథకం కింద పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ పంపిణీ చేయాలని గ్యారెంటీ పథకాల అమలు కమిటీ జిల్లా చైర్మన్ కే.శివమూర్తి అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం నగరంలోని జెడ్పీ కార్యాలయ సభాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఐదు హామీ పథకాల అమలుపై జరిగిన జిల్లా స్థాయి ప్రగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. అన్నభాగ్య పథకం కింద పంపిణీ చేసే రేషన్ ధాన్యాలను విక్రయించరాదన్నారు. పంపిణీ చేసే ముందు ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేయాలన్నారు. రేషన్ పంపిణీ కేంద్రాల్లో అన్నభాగ్య పథకం నామ ఫలకాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్లో కొంతమంది అక్రమంగా రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్నారని, అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. హొసపేటెలోని చిత్తవాడిగి ప్రాంతంలో రాత్రి పూట రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. అలాంటి వారిపైఅధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అక్రమ రవాణాపై 31 కేసుల నమోదు ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్ అహ్మద్ స్పందిస్తూ జిల్లాలో అక్రమ స్మగ్లర్లపై ఇప్పటికే 31 కేసులు నమోదు చేశామన్నారు. చిత్తవాడిగిలో జరుగుతున్న అక్రమాలపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. గృహజ్యోతి పథకం కింద నమోదు కాని దరఖాస్తులను తనిఖీ చేసి, సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. పథకాల అమలులో జిల్లా మంచి పురోగతి సాధించింది. భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమాలను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఐదు హామీ పథకాల లబ్దిదారులతో తాలూకాల వారీగా సమావేశాలు నిర్వహించాలి. అధికారులు చౌకడిపో దుకాణ యజమానులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ పంపిణీ చేయాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ మహ్మద్ నోంగ్జాయ్ అక్రమ్ షా, అధికారులు పాల్గొన్నారు. -
ఏడు జిల్లాల్లో కళ్యాణ సంపద మార్కెట్లు
బళ్లారిటౌన్: కళ్యాణ కర్ణాటక పరిధిలోని ఏడు జిల్లాల్లో రైతులకు ఉపయోగపడేలా కళ్యాణ సంపద మార్కెట్లను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని బళ్లారి తాలూకా కొంచిగేరిలో మిర్చి రైతుల కోసం ఏర్పాటు చేసిన మిర్చి పౌడర్ విత్తనాల తయారీ యూనిట్ను ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి యూనిట్ల స్థాపనకు నాబార్డ్, ఐటీసీ లాంటి సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వీటితో పాటు బళ్లారి జిల్లాలో సిద్దగంగాశ్రీ ఫుడ్ ఎఫ్డీఏ కూడా సహకారం అందించిందన్నారు. విజయనగరలో చింతపండు, కొప్పళలో చెరుకు, బీదర్లో పత్తి, కలబుర్గిలో జొన్నలు, యాదగిరిలో సోయాబీన్కు, రాయచూరులో వరి పంటకు అనుకూలంగా రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించేలా రైతులే వాటిని తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకొనేలా మార్కెట్లను ప్రారంభిస్తామన్నారు. ఇటీవల ప్రధానమంత్రి రైతుల కోసం 100 జిల్లాల్లో ప్రధానమంత్రి కృషి ధన్ ధాన్య పథకం ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకం ద్వారా వారే ధాన్యాన్ని పండించి దానికి తగ్గట్టు మిల్లులు ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకొనేలా ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. సిరుగుప్ప ఎమ్మెల్యే నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు వైఎం సతీష్, రవికుమార్, నాబార్డ్ అధికారి షాదీ, ఏబీసీ చెర్మన్ సందీష్ పూరి, రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉమామహాదేవ, బ్యాంకింగ్ సర్వీసు అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ గ్రంథాలయం సందర్శన సిరుగుప్ప: నగరంలో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సిరుగుప్ప తాలూకా బాగేవాడి గ్రామంలో రూ.24 లక్షలతో నిర్మించిన డిజిటల్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, జిల్లా అధ్యక్షుడు అనిల్ నాయుడు, మండల అధ్యక్షులు మల్లికార్జునస్వామి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే బీ.ఎం.నాగరాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాగును లాభదాయకంగా మార్చాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సాంకేతిక రంగంలో వ్యవసాయ రంగాన్ని లాభదాయక పరిశ్రమగా మార్చుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గురువారం సింధనూరు తాలూకా జవళగేరలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్కరణలు, ఉద్యమ శీలత ప్రధానమంత్రి ధన్ ధాన్య వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాంకేతిక సహాయం అందించిందన్నారు. గ్రామాల్లో ఉద్యోగాలను కల్పించడానికి పీఎండీవైఓ పథకంలో 2025–26లో రూ.24 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో అధికారులు నాగరాజ్, కె.వి.శాజి, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, నేతలు విరుపాక్షప్ప, వెంకట్రావ్ నాడ గౌడ, నాగలింగ తదితరులున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
పాత పద్ధతిలోనే డ్రైనేజీ మ్యాన్హోల్ శుద్ధి
హుబ్లీ: కేఎంసీ ఆస్పత్రి ఆవరణలో అప్పుడప్పుడు రోగుల అశ్రద్ధ తదితర కారణాల వల్ల కూడా డ్రైనేజీ మ్యాన్హోల్లు నిండి కింది ఫ్లోర్లలోని వార్డుల్లో రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇటీవల మానసిక వార్డు నెంబర్– 15 జనరల్ పురుషుల విభాగంలో మరుగుదొడ్లు బ్లాక్ కావడంతో ఎంతో ఇబ్బంది ఏర్పడింది. ఫలితంగా రోగులు, వారి సహాయకులు రెండు రోజుల పాటు మరుగుదొడ్ల వినియోగం ఆగిపోవడంతో ఉన్న పైఅంతస్తులోని వమరుగుదొడ్లను వాడుకున్నారు. ఆ తర్వాత వాటి మరమ్మతులు చేపట్టారు. తాజాగా పేద రోగుల పాలిట సాక్షాత్తు ఆశ్రయ ఆరోగ్య పునర్ జీవ ప్రసాదిత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేత్రి సుధామూర్తి నిధులతో నిర్మించిన ధర్మశాలలో బయట ఉన్న డ్రైనేజీ చాంబర్ బ్లాక్ కావడంతో సమస్య ఏర్పడింది. దీంతో సంబంధిత కార్మికులు మానవ పారిశుధ్య పద్ధతులకు ఏనాడో స్వస్తి చెప్పిన కారణంగా నాలుగు రోజులు ఉద్యోగులు దాదాపు గురువారం 4, 5 గంటల పాటు శ్రమించి పేరుకున్న చెత్తాచెదారం తొలగించి మరుగుదొడ్లలో నీరు సజావుగా పారేలా కృషి చేశారు. ఈ ఆవరణలో సుధామూర్తి కొత్త ధర్మశాలతో పాటు గత నాలుగు దశాబ్దాల నుంచి కూడా ఉన్న ధర్మశాల పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా క్యాన్సర్ తదితర చివరి దశ లేదా వారం, నెల రోజుల పాటు కిమోథెరపీ, రేడియేషన్ తదితర చికిత్స తీసుకొనే పేద రోగులకు ఈ పాత కట్టడం ధర్మశాలగానే ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నారు. అభద్రతలో పారిశుధ్య కార్మికులు చాంబర్ బ్లాక్ కావడంతో సమస్య -
పాత్రికేయులు సమాజానికి వారథులు
రాయచూరు రూరల్: సమాజానికి పాత్రికేయులు వారథుల్లాంటి వారని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సుల్తాన్పుర శంబు సోమనాథ శివాచార్య పేర్కొన్నారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాయల వాణి కన్నడ దినపత్రిక పంచమ వార్షికోత్సవం, అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సమాజానికి సేవలందించిన వారికి జీవమాన సాధక అవార్డులు అందించి మాట్లాడారు. నేడు యువత పత్రికా రంగంలో సేవలందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. సమాజంలో పేరుకు పోయిన సమస్యలపై స్పందించాలన్నారు. సోషల్ మీడియా ప్రభావం అధికమైందన్నారు. సమావేశంలో జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఉపాధ్యక్షుడు బషీర్, సిండేకేట్ సభ్యుడు చెన్నబసవ నాయక్, శివప్ప నాయక్, రంజిత సిద్దలింగ స్వామి, అమరేష్లున్నారు. పొగాకు ఉత్పత్తులను నిషేధించండిరాయచూరు రూరల్: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు భీమేష్ మాట్లాడారు. గంజాయి, హుక్కా, పొగాకు వంటి అంశాలతో కూడిన మత్తు పదార్థాల సేవనంతో యువకులు, విద్యార్థులు దారి తప్పుతున్నారని, అలాంటి వాటిని పూర్తిగా నిషేధించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా పాండు, ప్రమీత్, భాగ్యలక్ష్మి, రంగనాథ్లున్నారు. సమస్యలు పరిష్కరించరూ రాయచూరు రూరల్: రాష్ట్రంలో కార్మిక, రైతు, దళిత, పేద, బడుగు బలహీన వర్గాల వారి, వ్యవసాయ కూలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత వ్యవసాయ కూలీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు హనుమంతు మాట్లాడారు. ఏపీఎంసీ, విద్యుత్, రైల్వే ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల జారీకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. నరేగపై జాగృతి జాతా రాయచూరు రూరల్: జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ)పై రైతుల్లో ప్రచారం చేపట్టాలని జిల్లా సంయోజకుడు విశ్వనాథ్ పిలుపునిచ్చారు. గురువారం తాలూకాలోని బాపుర పంచాయతీ కార్యాలయం వద్ద ఖాత్రి పథకం కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. జిల్లాలో నరేగ పనులు చురుకుగా కొనసాగేలా చూడాలని పంచాయతీ అధికారులకు వివరించారు. వ్యవసాయ నీటి కుంటలు, గొర్రెల షెడ్, చెక్డ్యాం, తోటల పెంపకం, అటవీ శాఖ, వ్యవసాయం, పట్టు పంటలు వంటి వాటిపై ప్రజలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యవసాయ కూలీలకు రోజు రూ.349 కూలీ, వంద రోజుల పనులు కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో ధనరాజ్, రెడ్డి, ఈరప్పలున్నారు. జేడీయూ అభ్యర్థి ప్రచారం చిక్కబళ్లాపురం : ఆగ్నేయ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో జేడీయూ తరఫున బరిలో ఉన్న డాక్టర్ నాగరాజ్ గురువారం నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థుల మద్దతు కోరారు. తనను గెలిపిస్తే పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ప్రిన్సిపాల్ వసుంధర, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య, డాక్టర్ నరసింహమూర్తి, రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటా స్వదేశీ వస్తువులనే వాడాలి
సాక్షి బళ్లారి: ప్రతి ఇంట్లో స్వదేశీ వస్తువులనే ఉపయోగించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం నేపథ్యంలో స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న అభియాన్ను సెప్టెంబర్ 25న పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ జయంతి రోజున ప్రారంభించామని, డిసెంబర్ 25న భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి రోజున అభియాన్ను ముగిస్తామని ఎమ్మెల్సీ వైఎం సతీష్ అన్నారు. ఈ అభియాన్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలన్న చైతన్యాన్ని ప్రతి ఒక్కరిలో నింపాలన్నారు. హర్ఘర్ స్వదేశీ, ఘర్ ఘర్ స్వదేశీ అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా వినిపించాలని, ఆ దిశగా కార్యక్రమాన్ని చేపడతామన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యకర్తలు, మహిళా, యువ సమ్మేళనాలు, వ్యాస, రథయాత్ర, పాదయాత్ర, స్వదేశీ మేళా, వీధి నాటకాలు తదితర జనజాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. దీపావళి రోజున స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు. ప్రతి ఒక్క భారతీయుడు చైతన్యం పొంది స్వదేశీ వస్తువుల కొనుగోలుపై దృష్టి సారించాలన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, బీజేపీ ప్రముఖులు డాక్టర్ బీకే సుందర్, కేఎస్ దివాకర్, గురులింగనగౌడ, హనుమంతప్ప, రామచంద్రయ్య, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశాభివృద్ధికి తోడ్పడాలి ఎమ్మెల్సీ వైఎం సతీష్ -
అక్రమాలపై విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభలో విధులు నిర్వహించడానికి కాంట్రాక్ట్ పద్ధతిపై చేసుకున్న 344 ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని కర్ణాటక సమాచార హక్కుల వేదిక అధ్యక్షుడు రాజు పట్టి ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు నెలల నుంచి కార్పొరేషన్గా ఏర్పాటైనప్పటి నుంచి ఇంత వరకు ఉద్యోగాల భర్తీ విషయంలో నల్ల జాబితాలో ఉన్న మైసూరు సంస్థకు అప్పగించారన్నారు. 344 ఉద్యోగాల్లో 136 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసుకోవడాన్ని తప్పుబట్టారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. అధికారుల, అధ్యక్షుల, ఇతర పార్టీల నిర్ణయాలతో నిధులు వాడుకున్న అంశంపై చర్చించినట్లు తెలిపారు. యువకుడి ఆత్మహత్యహుబ్లీ: ధార్వాడ జిల్లాలోని కుందగోళ తాలూకా చిక్కనేర్తి గ్రామ నివాసి ఫక్కీరేశ హనుమంతప్ప తడసద(23) అనే యువకుడు ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిరటగేరి శివనగౌడ(50), అన్నప్ప(46), బ్యాహట్టి బసప్ప(60), కల్లప్ప (80), హుల్లూర ముదకప్ప(50), శరణప్ప(40), మంటూరు రాయమ్మ (50) తదితరులపై కేసు దాఖలు చేశారు. తన కుమారుడి చావుకు ఆస్తి వివాదాలే కారణం అని మృతుడి తండ్రి ఆరోపించారు. ఆక్రమణల చెరలో చెరువులు రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి రాష్ట్ర సర్కార్ నుంచి విడుదలైన కోట్లాది నిధులు రికార్డులకు పరిమితమై, చెరువులు ఆక్రమణలకు నిలయమైనట్లు జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో చెరువులుగా ఉన్న కృష్ణగిరి కాలనీని లేఅవుట్గా చేశారన్నారు. 20 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడాన్ని ఖండించారు. చిన్న నీటిపారుదల శాఖాధికారులు మౌనం వహించడం తగదన్నారు. ఆ శాఖ మంత్రి బోసురాజు, పుత్రుడు రవి ఆధ్వర్యంలో చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయన్నారు. 180 ఎకరాల్లో విస్తరించి ఉన్న మావినకెరె చెరువు భూమిని ఆక్రమించిన వారిపై, ప్రోత్సాహం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలిరాయచూరు రూరల్: నగరంలో ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని మురికి వాడల నివాసుల సంఘం అధ్యక్షుడు జనార్దన్ పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్న పేదలను గుర్తించి సర్వే నంబర్–1403, 1365, 1408, 1257, 2930, 772, 928, 802, 809లో స్థలాలు ఖాళీగా ఉన్నాయని, అలాంటి వాటిని కేటాయించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ప్రజల నుంచి డబ్బు వసూలు తగదురాయచూరు రూరల్: రెవెన్యూ శాఖలో ప్రజల నుంచి అధికారులు డబ్బు వసూలు చేయడం తగదని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో తాలూకా అధ్యక్షుడు తిమ్మప్ప మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ప్రజల నుంచి వివిధ పథకాల కింద ఫించన్ల పంపిణీ కోసం రూ.200, రూ.500, రూ.1000 వసూలు చేస్తున్నారన్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. -
అయ్యో.. యామిని!
కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.ప్రియా యామిని ఆ నిందితుడి బైక్ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.A 20 year old college student, Yamini Priya,was murdered by a known individual who slit her throat near the railway tracks in Srirampura,#Bengaluru.The victim was returning from college when she was attacked.Police have launched a manhunt to apprehend the accused..@DCPNorthBCP pic.twitter.com/3zMrcVEx1s— Yasir Mushtaq (@path2shah) October 16, 2025ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్తో తల్లీబిడ్డా సేఫ్! -
త్వరలో తుమకూరులో క్యాన్సర్ ఆస్పత్రి
తుమకూరు: తుమకూరు నగరంలోని జిల్లా ఆస్పత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి (ఫెరిఫెరల్ క్యాన్సర్ సెంటర్) భవనాన్ని వైద్య విద్యామంత్రి శరణ ప్రకాష్ ఆర్.పాటిల్ గురువారం పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ సుమారు రూ.67 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 100 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిని సీఎం సిద్దరామయ్య నవంబర్ 7న ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే తల్లీబిడ్డల ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ భవనాలను ప్రారంభిస్తారన్నారు. రోగులకు చికిత్స కోసం మొదటి దశలో రూ.41 కోట్ల వ్యయంతో వైద్య పరికరాలను సమకూరుస్తామన్నారు. కిద్వాయిపై తీవ్ర ఒత్తిడి ప్రతి రోజూ సుమారు 20–30 మంది క్యాన్సర్ రోగులు జిల్లాస్పత్రికి చికిత్స కోసం వస్తుండగా, వారిని బెంగళూరులోని కిద్వాయి ఆస్పత్రికి పంపుతున్నారన్నారు. కిద్వాయికి అన్ని జిల్లాలు, వేరే రాష్ట్రాల నుంచి క్యాన్సర్ రోగులు వస్తుండడంతో ఒత్తిడి పెరిగిపోయిందన్నారు. అందుకే క్యాన్సర్ బాధితుల కోసం అన్ని జిల్లాల్లో క్యాన్సర్ ఆస్పత్రులను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 24 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రజలకు సత్వర సేవల కోసం ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు జీబీ జ్యోతిగణేష్, సురేష్గౌడ, వైద్యవిద్యా శాఖ డైరెక్టర్ సుజాతా రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నాగేంద్ర పీఏపై ఈడీ దాడులు
సాక్షి బళ్లారి: మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర ఆప్త సహాయకుడు (పీఏ), వ్యాపారి కురుబ నాగరాజు ఇంటిపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం ఉదయమే ఈడీ అధికారులు మాజీ మంత్రి నాగేంద్రకు సన్నిహితునిగా గుర్తింపు పొందిన తాలూరు రోడ్డులోని నాగరాజు ఇల్లు, ఆఫీసు వచ్చారు. గది గదిలో క్షుణ్ణంగా గాలింపు జరిపారు. ఈ సమయంలో నాగరాజు బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంట్లో ఉన్న రికార్డులు, ఇతరత్రా ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కార్వార బెళికెరె పోర్టులో ఇనుప ఖనిజం మాయమైన ఘటనలోనూ నాగరాజు ఇంటిలో ఈడీ సోదాలు చేసింది. కొంతకాలం పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. హొసపేటెలో.. అలాగే హొసపేటెలో ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్రావు అలియాస్ శ్రీను బాబు ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హొసపేటెలోని వివేకానంద నగర్, బసవేశ్వరనగర్లో ఉన్న ఇళ్లు, ఆఫీసుల్లో ముమ్మరంగా గాలించారు. అతనికి ప్రముఖ హోటల్తో పాటు రియల్ఎస్టేట్, గనులు వ్యాపారాలున్నాయి. బళ్లారి, విజయనగర రెండు జిల్లాల్లో ఈడీ సోదాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. బళ్లారి, హొసపేటెలో తనిఖీలు -
రూ.200 కోట్ల భూమి కబ్జా
బనశంకరి: బెంగళూరులో కొందరు అవినీతి అధికారులు రూ.200 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ ఆరోపించారు. లోకాయుక్తకు, అలాగే బెంగళూరు నగరజిల్లా కలెక్టర్ జగదీశ్ కు ఆధారాలతో సహా ఫిర్యాదుచేసి మాట్లాడారు.బెంగళూరు దక్షిణ తాలూకా ఉత్తరహళ్లి హొబళి మానవర్త కావల్ గ్రామ సర్వే నంబరు 18లో మొత్తం 353 ఎకరాలు 27 గుంటలు భూమిని వాజరహళ్లి, తలఘట్టపుర గ్రామస్తులు అనేక ఏళ్ల క్రితం పంచుకున్నారు. ఇందులో 35 ఎకరాల 11 గుంటలు భూమి పూర్తిగా ఏ, బీ ఖరాబు భూమి. అక్కడ మైనింగ్ జరిగేది, రూ.200 కోట్లకు పైగా మార్కెట్ విలువ చేస్తుంది. ఈ స్థలాన్ని తాలూకాఫీసు, కలెక్టరేటులోని కొందరు ఉద్యోగులు, ఉన్నతాధికారుల అండతో బడాబాబులు కబ్జా చేసుకున్నారని తెలిపారు. కబ్జాదారులు, అధికారుల పేర్లతో సహా లోకాయుక్తకు, కలెక్టరుకు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. ఆ భూమిని కాపాడాలని కోరారు. -
విషాదంలోనూ దాతృత్వం
బనశంకరి: బెంగళూరు మారతహళ్లిలో వైద్యురాలైన భార్యకు అధికంగా మత్తు మందు ఇచ్చి హత్య చేసిన భర్త, జనరల్ సర్జన్ మహేంద్రరెడ్డి ఉదంతం నగరవాసులను కలవరపరుస్తోంది. అంత బాధలోనూ కూతురి సంస్మరణార్థం రూ.4 కోట్లకు పైగా విలువచేసే భవంతిని ఆమె తండ్రి మునిరెడ్డి ఇస్కాన్ కు దానం చేశారు. సంపన్నుడైన మునిరెడ్డి కూతురి కోసం మున్నకోళలు లో రూ.4 కోట్లతో భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. కుమార్తె లేనప్పుడు ఆ ఇల్లు ఎందుకని సేవా కార్యక్రమాల కోసం ఇస్కాన్కు రాసిచ్చామని కృతిక సహోదరి డాక్టర్ నిఖితా తెలిపారు. బంధువుల ఆరోపణ మహేంద్రరెడ్డికి వేరే యువతితో అక్రమ సంబంధం ఉందని, ఆమె కోసం భార్యను హత్య చేసినట్లు కృతికారెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు. అల్లుడు మహేంద్రరెడ్డి ఆస్పత్రి నిర్మిస్తామంటే మునిరెడ్డి సాయం చేశారు. కానీ పెళ్లయిన ఏడాదిన్నరలోపే ఘోరం జరిగిందని మీడియా ముందు ఏకధాటిగా విలపించారు. వైద్యురాలు కృతికారెడ్డి నివాస భవనం ఇస్కాన్కు వితరణ విలువ రూ. 4 కోట్ల పైనే ఆమె తండ్రి మునిరెడ్డి వెల్లడిభర్తకు 9 రోజుల కస్టడీ రెండురోజుల పాటు మత్తుమందును ఇచ్చి భార్యను హత్య చేసిన కేసులో మహేంద్రరెడ్డి ఉడుపిలో తలదాచుకొని ఉండగా మారతహళ్లి పోలీసులు బుధవారం అరెస్ట్చేసి నగరానికి తీసుకువచ్చారు. కోర్టులో హజరుపరిచి కస్టడీని కోరగా, 9 రోజుల పాటు విచారణకు జడ్జి అనుమతించినట్లు వైట్ఫీల్డ్ డీసీపీ పరశురామ్ తెలిపారు. విచారణలో పూర్తి నిజాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నారు. -
ఆర్ఎస్ఎస్ కట్టడికి సర్కారు అడుగు
సాక్షి, బెంగళూరు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఊరేగింపులు, కార్యక్రమాలను కట్టడి చేసేలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రైవేటు సంస్థలు, సంఘాలు పబ్లిక్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించేందుకు ముందస్తుగా అనుమతి తీసుకునేందుకు మార్గదర్శకాలను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాలు, వాటి మైదానాలు, పార్కులు, పురాతత్వ శాఖ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ తదితర ప్రైవేటు సంస్థలు కార్యకలాపాలు సాగించకుండా నిషేధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో గురువారం విధానసౌధలో కేబినెట్ భేటీ జరిగింది. వివరాలను న్యాయ శాఖ మంత్రి హెచ్కే పాటిల్ మీడియాకు వివరించారు. పబ్లిక్ ప్రాంతాల్లో పలు ప్రైవేటు సంస్థలు, సంఘాలు ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, కార్యకలాపాలను సాగిస్తున్నట్లు ఈ నెల 15న డీజీపీ లేఖ ద్వారా సర్కారుకు తెలిపారన్నారు. ఇలాంటి చర్యలు కచ్చితంగా చొరబాటు కిందికి వస్తాయని, ఈ కారణంతో ఇకపై ముందస్తు అనుమతి ఉండాలని కేబినెట్ భేటీలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. అలాంటి కార్యక్రమాలకు నిర్ణీత పబ్లిక్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలను గుర్తించి కేటాయించాల్సి ఉందని, త్వరలో కొన్ని మార్గదర్శకాలు, ఆదేశాలను విడుదల చేస్తామన్నారు. పంట నష్ట పరిహారం ● వర్షాల కారణంగా 12.82 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లడంతో ఇన్పుట్ సబ్సిడీ మంజూరుకు ఆమోదం. నష్ట పరిహారం కింద ప్రతి హెక్టార్కు సబ్సిడీ రూ. 8500 కలిపి మొత్తం రూ. 25,500 ఇచ్చేందుకు తీర్మానం. బహుళ వార్షిక పంటలకు రూ. 22 వేల పరిహారం. అంగన్వాడీలకు వస్త్రాలు ● మళవళ్లి వర్కింగ్ జర్నలిస్టు సంఘానికి స్థలం ఇచ్చేందుకు తీర్మానం. ● అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ. సహాయకులకు చీరల పంపిణీకి ఆమోదం. ఇందుకోసం రూ. 13.98 కోట్ల మంజూరు ● అంగన్వాడీ కేంద్రాలకు ఔషధ కిట్ల కొనుగోలు కోసం రూ. 10 కోట్ల కేటాయింపులకు అనుమతి కులగణనను పూర్తిచేశా: సీఎం సాక్షి, బెంగళూరు: బెంగళూరుతో సహా రాష్ట్రంలో కులగణన జరుగుతుండడం తెలిసిందే. సీఎం సిద్దరామయ్య కావేరి నివాసానికి కులగణన సిబ్బంది రాగా, సీఎం వివరాలను అందజేశారు. 45 నిమిషాల పాటు కూర్చొని కోరిన సమాచారం అంతా అందించారు. ఈ విషయాన్ని ఎక్స్లో సీఎం పోస్టు చేశారు. అసమానతలు, పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం ఈ సమీక్షను చేపట్టిందని, ప్రతి ఒక్కరూ ఈ సమీక్షలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సంస్థల కార్యక్రమాలకు... సర్కారు అనుమతి తప్పనిసరి త్వరలోనే మార్గదర్శకాల జారీ కేబినెట్ భేటీలో తీర్మానం ఆర్ఎస్ఎస్తో జతకలిసే ఉద్యోగులపై వేటు: మంత్రి ఖర్గే బనశంకరి: ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని ఐటీ బీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, సీఎం సిద్దరామయ్య కు మరో లేఖరాశారు. వారు ఎలాంటి రాజకీయ పార్టీలు లేదా, సంఘ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనరాదు, ఎలాంటి సహాయం అందించరాదని నియమాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇటీవల సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు , ఉద్యోగులు పాల్గొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేయాలన్నారు. సంఘ్తో పాటు ఎలాంటి సంస్థల్లో ఉద్యోగులు పాల్గొనరాదన్నారు. తన శాఖలో కొందరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారిపై నివేదిక అందించాలని కోరానని, నివేదిక అందిన వెంటనే వారిని సస్పెండ్ చేస్తానని తెలిపారు. బహిరంగ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను నిషేధించాలని ఖర్గే ఇదివరకే లేఖ రాయడం తెలిసిందే. కేబినెట్ భేటీలో చేసిన ప్రధాన తీర్మానాలు.. విజయపురలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం మైసూరులో నిమ్హాన్స్ తరహాలో ఆస్పత్రి నిర్మాణం బెంగళూరు సంజయ్ గాంధీ ఆస్పత్రిలో రరూ. 26.9 కోట్ల ఖర్చుతో ఉపకరణాల కొనుగోలుకు గ్రీన్సిగ్నల్ వృషభావతి నది నీటి శుద్ధీకరణ పనులకు ఆమోదం బెంగళూరు గ్రామీణ జిల్లా, చిక్కబళ్లాపు రం జిల్లాల చెరువులకు రూ. 650 కోట్లతో నీటి సరఫరాకు అనుమతి. -
హెచ్డీ కోటెలో దొంగల లూటీ
మైసూరు: జిల్లాలోని హెచ్డీకోటె పట్టణంలో మూడు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. స్టేడియం బడావణె నివాసి, ఏఎస్ఐ కేకే మహదేవ, మొదటి రోడ్డు నివాసి పేపర్ శేషాద్రిల ఇళ్లలో బుధవారం రాత్రి జరిగింది. ఏఎస్ఐ మహదేవ ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి సుమారు రూ.30 లక్షల విలువ చేసే 250 గ్రాముల బంగారు నగలు, రూ.25 వేల నగదు, పేపర్ శేషాద్రి ఇంటిలో రూ.2.5 లక్షల విలువ చేసే 20 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. ఏఎస్ఐ మహదేవ హాసన్కు హాసనాంబ దేవస్థానం వద్ద బందోబస్తుకు వెళ్లారు. ఆయనతో పాటు భార్య, ఉపాధ్యాయిని లోలమ్మ కూడా హాసన్కు వెళ్లారు. ఈ సమయంలో దొంగలు పడి సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, తలుపులు, బీరువాలను బద్దలు కొట్టి చోరీ చేశారు. ఇళ్లకు గొళ్లెం వేసి.. అలాగే పట్టణంలోని విశ్వనాథ కాలనీకి చెందిన కృష్ణ అనే వ్యక్తి ఇంటిలో రూ.1.20 లక్షల విలువ చేసే 10 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి, రూ.20 వేల నగదును దోచుకెళ్లారు. చోరీ చేసే సమయంలో దొంగలు చుట్టుపక్కల ఇళ్ల తలుపులకు గొళ్లాలు వేసి ఎవరూ బయటకు రాకుండా ఉండేలా చేయడం గమనార్హం. పోలీసులు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించి విచారణ చేపట్టారు. ఇవి స్థానిక దొంగల పనా, లేక ఉత్తరాది చెడ్డీ ముఠాలు చేశాయా? అనేది సస్పెన్స్గా మారింది. ఇటీవల శివమొగ్గ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు చోరీకి యత్నించడం సీసీ కెమెరాలలో రికార్డయింది. నామకరణానికి వెళ్తే.. ఇల్లు ఖాళీ ● దొడ్డ రూరల్లో దోపిడీ దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా హొసహుడ్య గ్రామంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సోమణ్ణ అనే వ్యక్తి ఇంటి తలుపుల తాళం పగలగొట్టి చొరబడిన దొంగలు బంగారు, వెండి నగలతోపాటు నగదును దోచుకున్నారు. సోమణ్ణ మనవని నామకరణం వేడుక కోసం కుటుంబంతో కలిసి ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. దీంతో దొంగలు చొరబడి 250 గ్రాముల బంగారు నగలు, 2 కేజీల వెండి సొత్తు, రూ.50 వేల నగదు, ఏటీఎం కార్డుల్ని దోచుకున్నారు. నగలు ఉన్న బాక్సులు, బ్యాగులను ఊరిచివరకు తీసుకెళ్లి సొత్తును తీసుకుని బ్యాగులను అక్కడే పారవేశారు. గురువారం ఉదయం సోమణ్ణ ఇంటికి వచ్చి చూసి లబోదిబోమన్నాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసు సహా ముగ్గురి ఇళ్లలో చోరీ రూ.లక్షలాది బంగారం, నగదు అపహరణ -
గ్రామంలోకి పిల్ల చిరుత.. కాసేపటికి కన్నుమూత
మండ్య: జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని బోళెనహళ్ళి గ్రామంలోకి గురువారం ఉదయం సుమారు 7 నెలల వయసు ఉన్న ఆడ చిరుత పిల్ల వచ్చింది. అది అరుస్తూ ఉండడంతో జనం చుట్టూ పోగయ్యారు. అటవీ అధికారులు వచ్చి చిరుతను స్వాధీనం చేసుకుని తరలించారు. తల్లి చిరుత నుంచి విడిపోయిన పిల్ల నీరసంగా ఉందని తెలిపారు. అయితే కొంతసేపటికే అది చనిపోయింది. కాలువలోకి దూకిన దంపతులు యశవంతపుర: దంపతులు కాలువలోకి దూకిన ఘటన చిక్కమగళూరు సమీపంలోని లక్కవళ్లి భద్రా జలాశయం వద్ద జరిగింది. మృతులు శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా శంకరపుర గ్రామానికి చెందిన విఠల్ (48), భార్య గంగమ్మ (40). గురువారం దంపతులిద్దరూ లక్కవళ్లి సమీపంలోని జగదాంబ ఆలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని పక్కనే పారుతున్న భద్రా కాలువలోకి దూకడంతో గల్లంతయ్యారు. స్థానికులు చూసి సమాచారం ఇవ్వగా పోలీసులు, ఫైర్ సిబ్బంది కొన్ని గంటలపాటు గాలించారు, గంగమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. విఠల్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని అనుమానాలున్నాయి. కలబుర్గిలో ఓట్ చోరీ దర్యాప్తు దొడ్డబళ్లాపురం: కలబుర్గిలో ఓట్ల చోరీ కేసులో సిట్ పోలీసులు 5 ఇళ్లలో సోదాలు చేసి వేల సంఖ్యలో ఓటర్ ఐడీలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఆళంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల చోరీ జరిగిందని కేసు నమోదు చేసి దాడులు నిర్వహించారు. రోజా కాలనీలో అష్పాక్, జుంజుం కాలనీలో నదీం, అక్రం, రామనగర కాలనీలో మహమ్మద్ జునైద్ల ఇళ్లలో తనిఖీలు సాగాయి. అక్రం అనే వ్యక్తి ఇంట్లో వేల సంఖ్యలో నకిలీ ఓటర్ ఐడీ కార్డులు లభించాయి. 15 మొబైళ్లు, 7 ల్యాప్టాప్లను కూడా పట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీనే ఓట్ చోరీ ఆరోపణలు చేయడంతో సిద్దరామయ్య ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుంది. గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న ఎస్ఐటీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 50 గ్రాముల తాళి తస్కరణ మైసూరు: బస్సు ఎక్కుతుండగా మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగలు చోరీ చేసిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల పట్టణంలోని బస్టాండ్లో జరిగింది. మండ్య జిల్లా మద్దూరువాసి ఇందిర అనే మహిళ మలెమహదేశ్వర బెట్టకు వెళ్లింది, తిరిగి వస్తూ కొళ్లెగాల బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా 50 గ్రాముల బరువైన బంగారు మంగళ సూత్రాన్ని ఎవరో దొంగలు తస్కరించారు. కొంతసేపటికి గమనించి వెంటనే స్థానిక పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్టాండ్లో పోలీసు ఔట్పోస్టు ఉన్నప్పటికీ సిబ్బందిని నియమించలేదు. అందువల్లే దొంగలు చెలరేగిపోతున్నారని, పోలీసులను నియమించి దొంగతనాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. రాజధానిలో ఘోరం.. యువతి హత్య దొడ్డబళ్లాపురం: బెంగళూరులో రోజురోజుకీ హత్యా నేరాలు అధికమవుతున్నాయి. అందులోనూ యువత క్షణికావేశంలో చిన్న విషయానికి ఆవేశానికి లోనై దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా యువతిని గొంతుకోసి హతమార్చిన సంఘటన శ్రీరాంపురలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రైల్వే ట్రాక్ వద్ద ఒక యువతిని బైక్పై తీసకువచ్చిన దుండగులు ఆమె గొంతుకోసి హత్య చేశారు. అయితే హతురాలి వివరాలు తెలిసిరాలేదు. శ్రీరాంపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు ఆధారాలను సేకరించి గాలింపు చేపట్టారు. -
దూసుకొచ్చిన మత్స్యం.. జాలరి మృత్యువాత
యశవంతపుర: సముద్రంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఊహించడం కష్టం. చేపల్ని పట్టడంలో నిపుణుడైన జాలరి... చేప గుద్ది చనిపోయాడు. ఈ ఘటన కారవార వద్ద అరేబియా సముద్రంలో జరిగింది. కార్వార తాలూకా మాజాళికి చెందిన యువ జాలరి అక్షయ (24) మంగళవారం చేపలు పట్టడానికి పడవలో సముద్రంలోకి వెళ్లాడు. ఈ సమయంలో ఓ అడుగు పొడవైన చేప నీటిలో ఎగిరి అక్షయ కడుపు మీద తగిలింది. అతనికి తీవ్ర రక్తగాయం కావడంతో నొప్పితో విలవిలలాడడంతో మిగతా జాలర్లు వెంటనే కార్వారలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గాయానికి కుట్లు వేసి ఇంటికి పంపారు. బుధవారం ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యాడు, గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. జాలర్ల నిరసన పేగులకు బలమైన గాయాలు కావడమే కారణమని వైద్యులు పేర్కొన్నారు. కాగా, వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మత్యృకారులు ఆరోపిస్తున్నారు. ౖపైపెన కుట్లు వేసి ఇంటికి పంపారు. కనీసం ఎక్స్రే, స్కాన్ చేసి ఉంటే కడుపులో ఏమైందో తెలిసేది, చేప ముళ్లు గుచ్చుకొని తీవ్ర గాయమైనా సరిగా వైద్యం చేయలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కార్వార వద్ద విషాద ఘటన -
కుల గణనలో పాల్గొనబోం
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లతో వారు.. ‘మా ఇంట్లో సర్వే చేపట్టవద్దు’అని తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా, ఎన్యుమరేటర్లకిచ్చిన ప్రొఫార్మాలో సుధామూర్తి..‘మేం వెనుకబడిన కులాలకు చెందిన వారము కాదు. అందుకే, ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తంగదాడి స్పందిస్తూ.. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. ఈ పరిణామంపై సుధామూర్తి దంపతులు, ఇన్ఫోసిస్ అధికారులు స్పందించలేదు. -
షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
బెంగళూరు: ఆ దంపతులు ఇద్దరూ వైద్యులు. అనారోగ్యం పాలైన భార్యకు వైద్యం చేయించడానికి బదులు ఏకంగా ఆమె ప్రాణమే తీశాడు ఆ భర్త. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హతమార్చి.. సహజ మరణంగా కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ చివరకు నిజం బయట పడింది. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, కృతికారెడ్డి గ్యాస్ట్రిక్, షుగర్ వంటి సమస్యలతో బాధ పడుతోంది. పెళ్లి సమయంలో ఈ సమస్యలు ఉన్నట్లు భార్య కుటుంబం తనకు చెప్పలేదని మహేంద్రరెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రోజూ వాంతులు, ఇతరత్రా రుగ్మతలతో ఇబ్బందులు పడే భార్యను హత్య చేసి, అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆరోగ్యం (Health) సరిగా లేదని కృతికారెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, మహేంద్రరెడ్డి ఆమెకు ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులు వరుసగా ఇవ్వడంతో ఆమె ఏప్రిల్ 23వ తేదీన మరణించింది. ఆపై తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో మారతహళ్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. వారి ఇంట్లో నుంచి ఇంజెక్షన్, ఐవీ సెట్ వంటి ఉప కరణాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులుఈ నెల 13వ తేదీన అందిన రిపోర్టులో కృతికారెడ్డి దేహంలో ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఆనవాళ్లు కనిపించాయని ఉంది. దీంతో అల్లుడే కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు డాక్టర్ మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తప్పుడు ఉద్దేశంతో కావాలనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. -
భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి..పార్టీ ఇచ్చాడు!
కర్ణాటక: భార్యను హత్య చేసి బోరు బావిలో పాతిపెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అలఘట్ట గ్రామంలో నెలన్నర క్రితం విజయ్ తన భార్య భారతిని హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా తోటలోని బోరు బావిలో శవాన్ని పాతి పెట్టాడు. భార్య పీడ తప్పిందని మూడు జంతువులను బలిచ్చి బంధువులకు విందు భోజనం పెట్టాడు. రేకుపై భార్య పేరు రాసి దెయ్యం, పీడ, పిశాచి పట్టకూడదని రాసి పూజలు చేయించాడు. అనంతరం తన భార్య మానసిక అస్వస్థతతో ఇల్లు వదలి వెళ్లినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించాడు. అదృశ్యమైన తన భార్య ఆచూకీ కనిపెట్టాలంటూ కడూరు పోలీసులకు విజయ్ ఫిర్యాదు చేశాడు. భారతి తల్లిదండ్రులు కూడా కుమార్తె అదృశ్యంపై పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. భర్త విజయ్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనకు సంబంధించి భర్త విజయ్తో పాటు అత్తమామలు తాయమ్మ, గోవిందప్పను అరెస్ట్ చేశారు. మృతురాలు భారతి తన అవ్వను చూడటానికి శివమొగ్గకు వెళ్లారు. తిరిగి వాపస్ రాలేదని సెపె్టంబర్ 5న భర్త విజయ్.. కడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెలన్నర తరువాత భారతి తల్లి, ఎమ్మెదొడ్డి పరదేశీహాళ్కు చెందిన లలితమ్మ కడూరు పోలీసులకు మళ్లీ అక్టోబర్ 13న ఫిర్యాదు చేశారు. ‘6 ఏళ్ల క్రితం భారతిని విజయ్కి ఇచ్చి వివాహం చేశాం. అనేక సార్లు కట్నం కావాలని విజయ్ వేధించేవాడని భారతి తల్లిదండ్రులు ఫిర్యాదులో వివరించారు. దీంతో పోలీసులు విజయ్ను విచారించగా అసలు విషయం బయట పడింది. లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్లుడు విజయ్, అతడి తలి తాయమ్మ, తండ్రి గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. 35 మార్కులు రాకున్నా పాస్..
పదో తరగతి.. లేదా ఎస్ఎస్ఎల్సీ.. విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ఇది మొదటి మెట్టు. టెన్త్ పాసైతే పీయూసీ, ఆపై చదువులకు తలుపులు తెరుచుకుంటాయి. లేదా చిన్నా చితకా ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఇందుకోసం ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులను తెచ్చుకోవాలి. కానీ చాలామంది విద్యార్థులు, పేదరికం, చదువు అర్థం కాక తదితర సమస్యలతో ఒకటీ అరా మార్కులతో పరీక్షలు తప్పి శాశ్వతంగా చదువుల తల్లికి దూరం కావడం అన్నిచోట్లా జరుగుతోంది. టెన్త్ ఫెయిల్ అనేది ఒక శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణతకు 33 శాతం మార్కులు చాలని కుదించింది. శివాజీనగర: రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 33 శాతం మార్కులు వస్తే చాలు పాసైపోయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. 35 శాతం మార్కులు పొందేందుకు అవస్థలుపడే అనేకమంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలం కానుంది. ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తామని, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. 206 మార్కులు చాలు బుధవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మధు.. ఈ విద్యా సంవత్సరం నుంచి 33 శాతం మార్కులు పొందితే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయినట్లేనని తెలిపారు. మొత్తం మార్కులు 625 కాగా, 206 మార్కులు వస్తే చాలు విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పారు. అంతర్గత మార్కులు, బాహ్య మార్కులు రెండు కలిపి 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఒక మార్కు, రెండు మార్కుల్లో పరీక్షలు తప్పిపోయే వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్షలు రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీలో పరీక్షల వ్యవస్థ మెరుగుపరిచేందుకు మూడంచెల విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఉత్తమ రీతిలో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. ఉత్తీర్ణత వృద్ధి కోసం 33 శాతం పాసింగ్ మార్కులను నిర్ధారించామన్నారు. ఆయా సబ్జెక్టుల మార్కుల్లో 30 మార్కులు పొంది, అంతర్గత, బాహ్య మార్కులు కలిపి మొత్తం 33 శాతం మార్కులు వచ్చినా ఉత్తీర్ణులవుతారని తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు, రిపీటర్స్కు ఇది వర్తిస్తుందని చెప్పారు. -
సిస్టోబాల్ క్రీడా ప్రతిభకు పేదరికం అడ్డు
రాయచూరు రూరల్: గుమ్మట నగరి విజయపుర జిల్లాలో ప్రతిభావంతులకు కొదవ లేదు. క్రీడలు, సాహిత్యం, టెక్నాలజీ, వ్యవసాయం, రాజకీయం వంటి క్షేత్రాలకు పేరొందిన జిల్లా విజయపుర. అలాంటి కోవకు చెందిన వారిలో ఒక్కరు క్రీడాకారిణి అక్షతా తారాపుర. సిస్టోబాల్ క్రీడా పోటీల్లో మహిళ క్రీడా ప్రతిభ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. థాయిలాండ్లో జరిగే పోటీల్లో పాల్గొనడానికి అర్థిక స్థోమత లేక భారతదేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పేరును నిలబెట్టడానికి చేస్తున్న పోరాటం చెప్పనలవి కాదు. క్రీడాకారిణి అక్షతా తారాపుర విజయపుర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. తల్లి యశోద ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఆయాగా విధులు నిర్వహిస్తోంది. తండ్రి వినాయక్కు చెవి వినబడదు, కళ్లు కనబడవు. ఆర్ధిక స్థోమత లేక ఎదగలేక పోతున్న క్రీడాకారిణి అక్షతా తారాపుర దాతలు ఆదుకుంటే అంతర్జాతీయ స్థాయి పోటీలకు సంసిద్ధం భారంగా కుటుంబ పోషణ తల్లి యశోద జీతంతో తండ్రి ఆరోగ్యం, కుటుంబ పోషణ భారంగా మారిన తరుణంలో రెండేళ్ల క్రితం జాతీయ స్థాయి సిస్టోబాల్ క్రీడా పోటీల్లో విజయం సాధించానన్నారు. థాయిలాండ్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడటానికి రూ.లక్ష మేర ఖర్చవుతుందని, ఆ ఖర్చు భరించే శక్తి లేక దేశం తరపున క్రీడల్లో పాల్గొనలేక పోతున్నానని విచారం వ్యక్తం చేశారు. తనకు థాయిలాండ్ వెళ్లడానికి ఆర్ధిక సహాయం చేయాలని అర్థిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి థాయిలాండ్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆడటానికి వెళ్లలేక పోతున్నానన్నారు. తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పొదుపు ఖాతా సంఖ్య– 89079374049కు దాతలు ఆర్థిక సహాయం చేయాలని అక్షతా అభ్యర్థించారు. -
డిసెంబర్లో సూపర్ స్పెషాలిటీ ప్రారంభం
బళ్లారిటౌన్: రానున్న డిసెంబర్ నెలలో బళ్లారిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని వైద్యవిద్య, కౌశల్య అభివృద్ధి మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ ఆర్.పాటిల్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని టీబీ శానిటోరియం వద్ద గల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. 450 బెడ్లు కలిగిన ఈ ఆస్పత్రి 2008లో మంజూరు అయిందన్నారు. వివిధ కారణాల వల్ల ఆలస్యం జరిగి 2018లో తిరిగి టెండర్ పిలిచారన్నారు. ప్రస్తుతం నిర్మాణం దాదాపు పూర్తి అయిందని, డిసెంబర్ నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కార్డియాలజిస్టు, ప్లాస్టిక్ సర్జరీ, డయాలజిస్ట్ యంత్రాలు, ఆర్ఓ ప్లాంట్, బెడ్ల సదుపాయాలు వంటివి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. న్యూరాలజీతో పాటు ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల వైద్యులు గ్రూప్ డీ, సీ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ను ఆదేశించారు. 26 ఎకరాల్లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో గుర్తించిన 26 ఎకరాల్లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం లభించిందని, త్వరలోనే టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య విద్యా శాఖ కార్యదర్శి మహమ్మద్ హుసేన్, బెంగళూరు వైద్య విద్యా శాఖ డైరెక్టర్ సుజాత రాథోడ్, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సండూరులో రూ.300 కోట్ల వ్యయంతో సిల్క్ పార్క్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యతో పాటు నైపుణ్యత అవసరం విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యత కూడా అవసరమని వైద్య విద్యా, కౌశల్య శిక్షణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ ఆర్.పాటీల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ నూతనంగా ప్రారంభించిన ఇంకుబేషన్ జాబ్ పోర్టల్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటి పోటీ యుగంలో విద్యార్థులకు డిగ్రీ పుచ్చుకుంటే చాలదన్నారు. చదువుతో పాటు నైపుణ్యత(స్కిల్), పరిజ్ఞానం అత్యవసరమన్నారు. కార్యక్రమంలో ఎఫ్కేసీసీఐ అధ్యక్షుడు ఉమారెడ్డి మాట్లాడుతూ బీడీసీసీఐ విద్యార్థుల కోసం కొత్త కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు. వాటిని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అధ్యక్షుడు యశ్వంత్రాజ్ నాగిరెడ్డి, మేయర్ ముల్లంగి నందీష్, నేతలు మహారుద్ర గౌడ, శ్రీనివాసరావు, అవ్వారు మంజునాథ్, పాలన్న తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది ఖాళీల భర్తీకి అధికారులకు ఆదేశం వైద్యవిద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ పాటీల్ -
అభివృద్ధికి అందరూ పట్టం
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రోలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, సభ్యుల నిర్ణయంతో పనులు చేపట్టామని ఆర్డీఏ సభ్యుడు నరసింహులు తెలిపారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడు నెలల నుంచి కార్పొరేషన్గా ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకు సామాన్య సమావేశాలు నిర్వహించి అభివృద్ధి పనులకు అధికారుల సలహా, సూచనలు పాటించాలన్నారు. కార్పొరేషన్గా ఏర్పాటైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.200 కోట్ల నిధులను అన్ని 35 వార్డులకు సమానంగా కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అధికారులు, అధ్యక్షులు, ఇతర పార్టీల నిర్ణయాలతో నిధులు వాడుకున్న అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ–ఖాతాలు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నామన్నారు. సమావేశంలో నగరసభ సభ్యులు బసవరాజ్, శ్రీనివాసరెడ్డి, జిందప్ప తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు ధర కోసం రక్త లేఖ
హొసపేటె: ఉల్లిపాయలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చెరుకు పెంపకందారుల సంఘం అధ్యక్షుడు ఎన్ఎం.సిద్దేష్ ఉత్తంగి బుధవారం ప్రధానమంత్రికి రక్తంతో రాసిన లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి పంటకు వెంటనే క్వింటాల్కు రూ.2000–2500ల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతుల సమస్యలపై స్పందించక పోతే కూడ్లిగిలో జరగనున్న ముఖ్యమంత్రి కార్యక్రమంలో రైతులు నల్ల బ్యాడ్జీలను కట్టుకుని నిరసన ప్రదర్శిస్తామని హెచ్చరించారు. ఉల్లి పెంపకందారుల సంఘం నాయకులు సోమన్న, మైనళ్లి కొట్రేష్ పాల్గొన్నారు. కార్మికుడు మృతిక్రిష్ణగిరి: మూడంతస్తుల భవనంపై పని చేస్తున్న కార్మికుడు అకస్మాత్తుగా కింద పడటంతో మృతి చెందిన ఘటన సూళగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేరళలోని కొచ్చిన్కు చెందిన జోసెఫ్(56) సూళగిరిలో నివాసముంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం సూళగిరి సమీపంలో భవన నిర్మాణ పని చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో మూడంతస్తుల భవనం పైనుంచి అకస్మాత్తుగా జారి కింద పడటంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
నిధుల మంజూరులో తారతమ్యం తగదు
సాక్షి,బళ్లారి: ఎమ్మెల్యేలకు నిధుల మంజూరు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తారతమ్యం చేస్తున్నారని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మెటగల్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కొత్త సంప్రదాయానికి తెర తీశారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తే, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలకు కేవలం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రకటించడం ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయడంలో సీఎం పక్షపాతం వహించడంతో జేడీఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. కొప్పళలో ఇటీవల జరిగిన సీఎం పర్యటన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం తరహాలో లేకపోవడంతో తాను కాని బీజేపీ ప్రజాప్రతినిధులు కాని హాజరు కాలేదన్నారు. కుకనూరు పీఎస్ఐని సస్పెండ్ చేయడంతో రాష్ట్రంలో ప్రజలకే కాదు, పోలీసులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. సామాన్యులకు జీవించడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రైతుల పంటనష్టంపై కూడా ప్రభుత్వం సరైన విధంగా రైతులకు న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తన కుర్చీని కాపాడుకునేందుకే సమయం వెచ్చిస్తున్నారన్నారు. పాలన వైపు దృష్టి పెట్టటం లేదని మండిపడ్డారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు విపక్షాల ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లేనా? గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి -
విరుపాక్షుని సన్నిధిలో నిర్మలమ్మ
సాక్షి,బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన హంపీలోని శ్రీ విరుపాక్షేశ్వర స్వామిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. ఆమె బుధవారం ఉదయం హంపీకి విచ్చేయడంతో ఆలయ గజరాజు ఘనస్వాగతం పలికింది. ఏనుగుతో స్థానిక అధికారులు పూలమాల వేయించి స్వాగతం పలికిన అనంతరం శ్రీవిరుపాక్షేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్సభ సభ్యుడు తుకారాం, హంపీ విద్యారణ్య భారతీ తీర్థ స్వామి కూడా ఆమెను కలిసి మాట్లాడారు. హంపీ శిల్ప కళా అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇక్కడ ఉన్న కట్టడాలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయన్నారు. హంపీ అందాలను ఎంత చూసినా తనివి తీరదన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాలనను స్మరించారు. నిర్మలా సీతారామన్ ఆప్త కార్యదర్శి అనిరుధ్ శ్రవణ్, జిల్లాధికారిణి కవిత, ఆనెగుంది సంస్థానం రాజవంశస్థులు తదితరులు పాల్గొన్నారు. హంపీలో స్వామివారిని దర్శించుకున్న వైనం శిల్పకళ అందాలు అదుర్స్ అన్న కేంద్ర మంత్రి -
హుణసిగి ఎస్ఐ సస్పెండ్
రాయచూరు రూరల్: క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాదగిరి జిల్లా హుణసిగి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాథోడ్ సస్పెండ్ అయ్యారు. ఈమేరకు యాదగిరి జిల్లా ఎస్పీ పృథ్విశంకర్ ఆదేశాలు జారీ చేసినట్లు మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కోన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆరోపణలపై హుణసిగి తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ రాథోడ్ను సస్పెండ్ చేశారు. ఇటీవల రౌడీషీటర్ నాగరాజుతో కలిసి ఎస్ఐ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రోడ్డు పనులకు భూమి పూజ బళ్లారిటౌన్: నగరంలోని వశిష్ట కళాశాల సమీపంలోని శ్రీశృంగేరి శారదాంబ కాలనీ వాసులు చాలా కాలంగా రోడ్డు సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో బుధవారం రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర అభివృద్ధి నిధులతో స్థానిక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు దేవానంద చేతుల మీదుగా రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ ప్రాంతంలో దాదాపు 500 దాకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా సుమారు 2500 మంది జనాభా నివాసం ఉంటున్నారు. అయితే గత 6 ఏళ్లుగా రోడ్డు కోసం పోరాడి చివరికి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర చొరవతో ఆయన నిధులు మంజూరు చేయగా భూమి పూజ జరిపారు. కాగా ఈ ప్రాంతంలో మరి కొన్ని లింక్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. వాటిపై కూడా ఎమ్మెల్యే చొరవ చూపాలని స్థానికులు ఆశిస్తున్నారు. స్థానిక ప్రముఖులు మల్లప్ప, అశోక్, మోహన్రెడ్డి, సత్యనారాయణ, లక్ష్మిరెడ్డి, వెంకటేష్, లక్కప్ప, మంజుల తదితరులు పాల్గొన్నారు. వ్యాపార మహిళకు సత్కార దండ రాయచూరు రూరల్: మద్యపానం, ధూమపానం, గుట్కా నియంత్రణకు తోడు గత 20 ఏళ్ల నుంచి దుకాణంలో విక్రయించకుండా వ్యాపారం చేసిన మహిళకు ధర్మస్థల క్షేత్ర సంస్థ, కర్ణాటక మద్యపాన నియంత్రణ మండలిని అభినందించారు. బుధవారం విజయలక్ష్మిని రాయచూరు తాలూకా సుల్తాన్పుర గ్రామానికి వెళ్లిన కర్ణాటక మద్యపాన నియంత్రణ మండలి అధ్యక్షుడు శరణప్ప ఘనంగా సత్కరించారు. దుకాణంలో ఎలాంటి మత్తు పదార్థాలు, మద్యం, ధూమ పానం, గుట్కా వంటి వాటిని విక్రయించకుండా గట్టి నిర్ణయంతో గ్రామంలో కొంత మేర మద్యపానానికి యువతను దూరంగా ఉంచడంతో ఆమెను అభినందించారు. ఆయకట్టుకు సక్రమంగా నీరందించండి రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, తుంగభద్ర ఆయకట్టుకు సక్రమంగా నీరు వదలాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రైతులు మాట్లాడారు. ఆయకట్టు చివరి భూములకు సక్రమంగా నీరందించాలన్నారు. వర్షాలు లేక పంటలు వాడుముఖం పట్టాయని, పశువులకు తా గునీరు లేదని, తాగునీటి కోసం చెరువుల్లోకి నీటిని నింపాలన్నారు. కాలువ కింద రైతులు వరి, పత్తి పంటలు వేశారని సరైన సమయంలో నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. పచ్చని చెట్టు.. ఆరోగ్యానికి ఆయువు పట్టు రాయచూరు రూరల్: చెట్లు మానవుడి ఆరోగ్యానికి ప్రాణవాయువులాంటివని ప్ర భుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుగుణ పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ మనవరాలి నామకరణం సందర్భంగా శివిక పేరుతో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అధిక శాతం చెట్ల కింద కూర్చొని సేద తీరుతారన్నారు. అంటే చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చుతుంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శివాని, సిద్దన గౌడ తదితరులు పాల్గొన్నారు. -
అభాగ్యుల పెన్నిధి.. ఆ దంపతులు
హుబ్లీ: వీధుల్లో అందరికీ దూరమై వివిధ అనారోగ్య సమస్యలతో అలమటించే వారి పాలిట కరియప్ప, సునందమ్మ దంపతులు ఆత్మీయులుగా ఆదరణ చూపి ఆ అభాగ్యులకు పట్టెడన్నం పెట్టి గత 15 ఏళ్లుగా నగరంలో సేవలు అందిస్తున్నారు. గదగ్ జిల్లా లక్ష్మేశ్వరకు చెందిన ఈ దంపతులు తమ సంపాదనలోనే హుబ్లీ ఆనంద్నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ ఆహారం తయారు చేసి నిరాశ్రయులకు తమ సొంత డబ్బులతో భోజనం, రొట్టెలు, చపాతీలు సమకూరుస్తారు. అంతమాత్రానికే వీరేమీ ఆర్థికంగా సంపన్నులు కాదు. అయినా దిక్కులేని వారికి పట్టెడన్నం పెట్టి మానవత్వం చాటుకోవాలన్నదే ఈ దంపతుల తాపత్రయం. ఇంట్లోనే రొట్టెల తయారీ కరియప్ప గతంలో కారు డ్రైవర్గా పని చేసేవాడు. అనంతరం టెంకాయల వ్యాపారంతో పాటు చిన్న సైజ్ కిరాణ అంగడి పెట్టుకున్నారు. ఆయన భార్య సునందమ్మ ఇంట్లోనే రొట్టెలు తయారు చేసి నిరాశ్రయులకు పంచుతారు. ఈ మేరకు వీరు తమ తండ్రి కరియప్ప శిరహట్టి పేరిట సేవా సంస్థ ద్వారా ఈ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తమకు ఓ వాహనాన్ని దాతలు అందించాలని ఆయన కోరారు. మాకు సంతానం లేదు. నిరాశ్రయులే మా పిల్లలని భావించి రోజూ తమ నీలప్ప గుడ్డప్ప శిరహట్టి సేవా సంస్థ ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని ఆ దంపతులు తమ సేవా వివరాలను వెల్లడించారు. సొంత డబ్బుతో భోజనం పంపిణీ గత 15 ఏళ్లుగా నగరంలో సేవలు -
బీజేపీకే నవంబర్ విప్లవం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విప్లవం లేదని, అది కేవలం బీజేపీ నేతల భ్రమ అని, బీజేపీలో నవంబర్లో విప్లవం రానుందని, దేశానికి నూతన ప్రధానమంత్రి పీఠం ఎక్కుతారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ జోస్యం చెప్పారు. బుధవారం కలబుర్గి, యాదగిరి, రాయచూరులో కార్మికులకు స్మార్ట్కార్డులు పంపిణీ చేసి విలేకరులతో మాట్లాడారు. నితిన్ గడ్కరీ దేశ ప్రధానమంత్రి అవుతారని వెల్లడించారు. భారతీయులకు దేశభక్తి ఉందన్నారు. ఆర్ఎస్ఎస్కు ఏమీ లేదన్నారు. తనకు బీజేపీలో ఆప్త మిత్రులున్నారన్నారు. వారి నుంచి సమాచారం అందిందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేబినెట్లో మార్పులు చేర్పులు జరుగుతాయన్నారు. కేంద్ర సర్కార్ వద్ద నిధులున్నాయని, ఎన్నికల్లో విజయం సాధిస్తారని, ప్రామాణిక ఓట్లతో గెలవడం బీజేపీకి కష్ట సాధ్యమని అన్నారు. యాదగిరి జిల్లాధికారిపై మండిపాటు బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ యాదగిరి జిల్లాధికారిపై మండిపడిన ఘటన చోటు చేసుకుంది. మంత్రి ప్రభుత్వ అతిథి భవనంలో 9 గంటలకు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లాధికారి హర్షల్ బోయర్ 40 నిమిషాల పాటు ఆలస్యంగా రావడంతో అధికారిపై చిందులు తొక్కారు. మంత్రి వెంట మరో మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, శాసన సభ్యులు శరణే గౌడ కందకూరు, చెన్నారెడ్డి పాటిల్ తన్నూరులున్నారు. దేశానికి కొత్త ప్రధానమంత్రి మంత్రి సంతోష్ లాడ్ జోస్యం -
డీడీపీఐ కార్యాలయంలో మందు పార్టీ.!
సాక్షి,బళ్లారి: భావి తరాలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకే ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న జిల్లా విద్యా శాఖాధికారి(డీడీపీఐ) కార్యాలయంలో మందు పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడ 20 లీటర్ల క్యానులోకి మందును పోసుకుని తరలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల చిత్రదుర్గలోని డీడీపీఐ కార్యాలయంలో అక్కడ పని చేసే సిబ్బంది కొందరు 20 కొన్న మందు బాటిళ్లను తీసుకుని 20 లీటర్ల క్యానులోకి మందును పోశారు. అక్కడే నీళ్లు కలిపి, డీడీపీఐ కార్యాలయంలోనే మందు రుచి చూశారు. వీడియో వైరల్తో సిబ్బంది సస్పెండ్ కొందరు అక్కడ సేవించడంతో పాటు ఇతర ప్రాంతాలకు కారులో మందు క్యాను తరలించిన వీడియో వైరల్ కావడంతో చిత్రదుర్గం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలోకి యథేచ్ఛగా మందు బాటిళ్లు తీసుకుని రావడంతో పాటు అక్కడే ఓ క్యానులోకి మందు పోసి, నీళ్లు పోసి మందు, నీళ్లు మిక్స్ చేసుకుని ఒకకొకరు తాగి భలే బాగుందని మాట్లాడుకున్నారు. ఎంతో దర్జాగా కారులో తరలించడంతో అక్కడ పని చేసే సిబ్బంది అవాక్కయ్యారు. ఉపాధ్యాయుల మండిపాటు ఉపాధ్యాయులకే ప్రధాన కార్యాలయమైన డీడీపీఐ కార్యాలయంలో ఇలాంటి కృత్యానికి ఒడిగట్టడంపై యావత్ ఉపాధ్యాయులతో పాటు ప్రతి ఒక్కరూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో చిత్రదుర్గ డీడీపీఐ వెంటనే మేల్కొని అక్కడ మందు క్యానులోకి పోసి, తాగిన సిబ్బంది అయిన రవికుమార్, గణేష్, తిప్పేస్వామి, సునీల్కుమార్ అనే నలుగురిని సస్పెండ్ చేశారు. అయితే డీడీపీఐ కార్యాలయంలో మందు పార్టీ చేసుకున్న సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదని, వారిని డిస్మిస్ చేసి కేసులు నమోదు చేస్తే, మళ్లీ ఇతరులకు భయం పుడుతుందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 20 లీటర్ల క్యానులోకి మందు పోసి పార్టీ చేసుకున్న సిబ్బంది ప్రభుత్వ ఆఫీసులను మందు పార్టీకి వేదిక చేసుకుంటున్న వైనం కార్యాలయంలోకి 20 లీటర్ల మందును సిద్ధం చేసుకుని తరలింపు -
మార్కులు వస్తే పాస్
ఎస్ఎస్ఎల్సీ విద్యార్థులకు శుభవార్తశివాజీనగర: రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 33 శాతం మార్కులు వస్తే చాలు పాసైపోయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. 35 శాతం మార్కులు పొందేందుకు అవస్థలుపడే అనేకమంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలం కానుంది. ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తామని, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. 206 మార్కులు చాలు బుధవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మధు.. ఈ విద్యా సంవత్సరం నుంచి 33 శాతం మార్కులు పొందితే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయినట్లేనని తెలిపారు. మొత్తం మార్కులు 625 కాగా, 206 మార్కులు వస్తే చాలు విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పారు. అంతర్గత మార్కులు, బాహ్య మార్కులు రెండు కలిపి 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఒక మార్కు, రెండు మార్కుల్లో పరీక్షలు తప్పిపోయే వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్షలు రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీలో పరీక్షల వ్యవస్థ మెరుగుపరిచేందుకు మూడంచెల విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఉత్తమ రీతిలో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. ఉత్తీర్ణత వృద్ధి కోసం 33 శాతం పాసింగ్ మార్కులను నిర్ధారించామన్నారు. ఆయా సబ్జెక్టుల మార్కుల్లో 30 మార్కులు పొంది, అంతర్గత, బాహ్య మార్కులు కలిపి మొత్తం 33 శాతం మార్కులు వచ్చినా ఉత్తీర్ణులవుతారని తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు, రిపీటర్స్కు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ ఏడాది నుంచే అమలులోకి ప్రభుత్వ నిర్ణయంపదో తరగతి.. లేదా ఎస్ఎస్ఎల్సీ.. విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ఇది మొదటి మెట్టు. టెన్త్ పాసైతే పీయూసీ, ఆపై చదువులకు తలుపులు తెరుచుకుంటాయి. లేదా చిన్నా చితకా ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఇందుకోసం ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులను తెచ్చుకోవాలి. కానీ చాలామంది విద్యార్థులు, పేదరికం, చదువు అర్థం కాక తదితర సమస్యలతో ఒకటీ అరా మార్కులతో పరీక్షలు తప్పి శాశ్వతంగా చదువుల తల్లికి దూరం కావడం అన్నిచోట్లా జరుగుతోంది. టెన్త్ ఫెయిల్ అనేది ఒక శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణతకు 33 శాతం మార్కులు చాలని కుదించింది. -
540 ఎకరాల అటవీ భూమి స్వాధీనం
శ్రీనివాసపురం: తాలూకాలోని కొట్లవారిపల్లి అటవీ ప్రాంతంలో ఆక్రమణలకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సర్వే న బర్ 90లో సుమారు 500 నుంచి 540 ఎకరాల అటవీ భూమిని డిఎఫ్ఓ సరీనా సిక్కలిగర్ నేతృత్వంలో 20 జేసీబీలతో తొలగింపు పనులను చేపట్టారు. ఈ భూమిలో కొందరు రైతులు 20 సంవత్సరాల నుంచి పాగా వేశారు. మామిడి, టమాటా తోటలు, పూలు, ఇతరత్రా పంటలను పండిస్తున్నారు. బోర్లు కూడా వేశారు. కబ్జాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి రైతులకు నోటీసులు జారీచేసినట్లు సరీనా తెలిపారు. ఈ నేపథ్యంలో పంటలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది అటవీకరణ కోసం మొక్కలను నాటుతున్నారు. ఇక్కడికి రైతులు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సిఎఫ్, కె మహేష్, ఆర్ఎఫ్ ఓ రవికీర్తి, సీఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ భూముల్లో తోటల తొలగింపు -
దీపావళి పండుగ.. కొనుగోళ్లు తోడుగా
సాక్షి, బెంగళూరు: దీపావళి అంటేనే అందరికీ ఉత్సాహం. పండుగకు ఇక నాలుగైదు రోజులే మిగిలి ఉండగా ఐటీ సిటీలో షాపింగ్ సందడి జోరందుకుంది. పలు రకాల దుకాణాలు, మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దుస్తులు, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు తదితర షాపింగ్ ఊపందుకుంది. ఇప్పటికే చిక్పేట, కేఆర్ మార్కెట్, ఎస్పీ రోడ్డు, జేసీ రోడ్డు , కమర్షియల్ మార్కెట్, శివాజీనగర, జయనగర ఫోర్త్ బ్లాక్, మల్లేశ్వరం వంటి షాపింగ్ కేంద్రాలు, మార్కెట్లు వ్యాపారాలతో, కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వస్త్ర దుకాణాల్లో రద్దీ ముఖ్యంగా దుస్తుల కొనుగోలు కోసం నగరంలోని ప్రధాన చిక్పేటకు జనాలు తరలివస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాల సంప్రదాయ, ట్రెండీ దుస్తులకు గిరాకీ ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. పసిడి కొనుగోళ్లు మహిళలు ఎంతో మెచ్చే బంగారు, వజ్రాభరణాలకు గిరాకీ ఉంటోంది. బంగారం ధరలు భగ్గుమంటున్నా కూడా కొనుగోలుకు వెనుకాడడం లేదు. జ్యువెలరీ షోరూమ్లు కళగా మారాయి. దంతెరాస్ కూడా రావడంతో నగల షాపులకు మరింత రద్దీ నెలకొంది. నగల షోరూంలు ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. ఇంటి సింగారానికి దీపావళికి ఇంటిని సుందరంగా ముస్తాబుకు నగరవాసులు ఆసక్తి కనపరుస్తున్నారు. మాల్స్, షాపుల్లో వివిధ రకాల బ్రాండ్ల హోమ్ డెకరేషన్ ఐటంలకు గిరాకీ ఏర్పడింది. వాల్ హ్యాంగింగ్, కర్టెన్లు, కృత్రిమ పూలు, అలంకార సామగ్రి మార్కెట్లను ముంచెత్తింది. మిఠాయి దుకాణాలు, గిఫ్ట్ ప్యాక్లకు డిమాండు నెలకొంది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తు అమ్మకాలపై వ్యాపారులు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఇక టపాసుల విక్రయాలు సరేసరి. నియమ నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ పటాకులను పేలిస్తేనే దీపావళి అనే భావన ఉంది. మధ్యతరగతి కుటుంబాలు కూడా టపాసుల కోసం వేలాది రూపాయలు వెచ్చిస్తాయి. బాలిక అనుశ్రీ (ఫైల్) ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ బెంగళూరు మార్కెట్లు కిటకిట దుస్తులు, నగలు, గృహోపకరణాల షాపుల్లో రద్దీ -
రాష్ట్రానికి గజ బలం
యశవంతపుర: దేశంలో ఏనుగులపై నిర్వహించిన సర్వేలో కర్ణాటకలో అగ్రస్థానంలో నిలిచింది. కన్నడనాట రికార్డుస్థాయిలో 6,013 ఏనుగులున్నట్లు గుర్తించారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కలిపి 22,446 గజరాజులు ఉన్నట్లు గుర్తించారు. అయితే దేశంలో 2017తో పోల్చితే ఇప్పుడు 18 శాతం అంటే 5 వేల ఏనుగుల సంఖ్య క్షీణించినట్లు బయటపడింది. దేశంలో కర్ణాటకతో కలిపి పశ్చిమ ఘాట్లలో 11,934 ఏనుగులు నివసిస్తున్నాయి. రెండవ అసోం– 4159, తమిళనాడు–3136, కేరళ–2785, ఉత్తరాఖండ్–1792, ఒడిశా–912, చత్తీస్ఘడ్, జార్ఖండ్–650, మధ్యప్రదేశ్–97, మహారాష్ట్ర– 63 ఏనుగులు ఉన్నాయి. ఏయే జిల్లాల్లో.. ఇప్పటికే కర్ణాటక పులుల సంఖ్యలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో బెంగళూరుతో కలిపి దక్షిణాది జిల్లాల్లోని అడవులు ఏనుగులకు ఆవాసంగా ఉంటున్నాయి. చామరాజనగర జిల్లా అడవుల్లో అత్యధికంగా ఉంటున్నాయి. తరువాత ఉత్తర కన్నడ, కొడగు, మైసూరు, మండ్య, హాసన్, బెంగళూరు రూరల్, తుమకూరు, కోలారు జిల్లాల్లో జీవిస్తున్నాయి, అప్పుడప్పుడూ ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లోనూ గజరాజులు కనిపిస్తాయి. దేశంలో అత్యధిక ఏనుగులు ఇక్కడే -
కులగణనకు వెళ్లి చెరువులో శవమై...
కోలారు: సామాజిక విద్యా సమీక్ష (కుల గణన) కోసం వెళ్లిన ఉపాధ్యాయురాలు చెరువులో శవమై తేలింది. వివరాలు.. కోలారు నగరానికి చెందిన అక్తర్ బేగం (50) మంగళవారం సమీక్ష కోసం నరసాపురానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం కేజీఎఫ్ తాలూకా అయ్యప్పల్లి చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. అక్తర్ బేగం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేతమంగల పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీసి ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఆమె బస్సులో వెళ్లినట్లు టికెట్ లభ్యమైంది. -
‘చెత్త రోడ్లు..మేమెందుకు కట్టాలి ట్యాక్స్’.. భీష్మిస్తున్న నగర వాసులు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం మరోసారి మౌలిక సదుపాయాల సమస్యలతో చర్చకు దారితీసింది. నగరంలోని అధ్వాన్న రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే పలు మార్లు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా, మౌలిక సదుపాయాలు లేకపోతే తాము ఆస్తిపన్ను ఎందుకు చెల్లించాలి అంటూ పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.నగరంలో గుంతలు పడిన రోడ్ల విషయంలో ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసింది. రోడ్లను గుర్తించి మరమత్తులు కూడా చేపట్టింది. అయినా నగర వాసులు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోతే ఆస్తిపన్ను కట్టబోమని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. అలా ఇప్పటి వరకు 13వేల గుంతలు పూడ్చినట్లు తెలిపారు. అలాగే, 550 కిలోమీటర్ల ప్రధాన రహదారుల అభివృద్ధికి వెయ్యి కోట్ల యాక్షన్ ప్లాన్ను రూపొందించమని అధికారులను ఆదేశించారు.బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై వ్యక్తిగత పన్ను చెల్లింపు దారుల ఫోరం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది. లేఖలో, గ్రేటర్ బెంగళూరు మునిసిపల్ సంస్థలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే, ఆస్తిపన్ను వసూలు చేయకుండా ఉండాలని సూచించారు.వర్తూర్-బలగేరె-పనతూర్ ప్రాంతాల్లో అసంపూర్ణ, శాస్త్రీయతలేని రోడ్ల పనులు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షాకాలంలో వరదలు, డ్రైనేజ్ పూర్తికాకముందే రోడ్ల పనులు ప్రారంభించడం, కొత్త రోడ్లు త్వరగా దెబ్బతినే ప్రమాదం, వైట్ టాపింగ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ పనులు ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం వంటి అంశాలను హైలెట్ చేశారు. మౌలిక సదుపాయాలు లేకుండా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడం అన్యాయం. బెంగళూరు ఐటీ హబ్గా గుర్తింపు పొందినప్పటికీ ‘గుంతలరోడ్లు, ట్రాఫిక్ జామ్, గార్బేజ్ సిటీ’ వంటి పేర్లు నగర గౌరవాన్ని తగ్గిస్తున్నాయని వాపోయారు. -
బెంగళూరు ఇలా ఉందేమిటి?
శివాజీనగర: సిలికాన్ రాజధాని బెంగళూరులో రోడ్లు ఏమాత్రం బాగా లేవు, ట్రాఫిక్ నరకం చూపిస్తోంది అని ఐటీ, బీటీ ప్రముఖులు సిద్దరామయ్య సర్కారును తూర్పారబడుతున్నారు. టెక్ ముఖ్యుడు మోహన్దాస్ పాయ్ ఆరోపణలు గుప్పించిన తరువాత, బీటీ దిగ్గజం కిరణ్ మజుందార్ షా అసంతృప్తిని వెళ్లగక్కారు. చైనా నుంచి వచ్చిన పారిశ్రామికవేత్త ఒకరు బెంగళూరు గురించి విస్మయం వ్యక్తంచేసినట్లు ఆమె ఎక్స్లో పోస్టు చేశారు. ఎందుకు బెంగళూరు నగరంలో రోడ్లు నాశనమయ్యాయి? ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు ఎందుకు ఉన్నాయి? ఇక్కడి ప్రభుత్వం పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వటం లేదా అని తనను ప్రశ్నించారని పోస్ట్లో రాసుకొన్నారు. ఈ పోస్ట్ను సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్, మంత్రి ప్రియాంక్ ఖర్గేకు ట్యాగ్ చేశారు. మంత్రుల స్పందన మంత్రి ఖర్గే స్పందిస్తూ, అందరూ కూడా వారి వారి పాత్ర వహిస్తేనే రాష్ట్రానికి మంచిదన్నారు. పరిశ్రమల మంత్రి ఎం.బీ.పాటిల్ స్పందిస్తూ వర్షాల వల్ల అన్నిచోట్లా సమస్య ఏర్పడింది, వర్షాలలో గుంతలరోడ్ల మరమ్మతులు సాధ్యం కాదు, అయినా పనులు చేస్తున్నామని తెలిపారు. కిరణ్ మజుందార్ అసహనం -
బాంబు బెదిరింపులు ఎవరి పని?
దొడ్డబళ్లాపురం: సీఎం, డీసీఎం ఇళ్లల్లో బాంబు పెట్టి పేల్చేస్తామని వచ్చిన బెదిరింపుల వెనుక ఎవరున్నారో తేల్చడానికి పోలీసుశాఖ సిట్ను ఏర్పాటుచేసింది. అలాగే కాలేజీలు, బడులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎయిర్పోర్టులు తదిరత చోట్ల బాంబులు పెట్టినట్టు వస్తున్న ఈమెయిల్స్, ఫోన్ కాల్స్పైనా ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది. ఒకటిన్నర ఏడాదిగా ఒక్క బెంగళూరులోనే 34 ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సీఎం, డీసీఎం ఇళ్లను పేల్చేస్తామని తాజాగా గత శనివారం తెల్లవారుజామున సీఎం,డీసీఎం ఇళ్లను పేల్చేస్తామని, 4 కేజీల ఆర్డీఎక్స్, ఐఈడీలను అమర్చినట్లు ఈమెయిల్ వచ్చింది. సీఎం సిద్ధరామయ్య,డీసీఎం డీకే శివకుమార్ ల అధికారిక ఈ మెయిల్ ఐడీకి కూడా ఇదే మెయిల్ వచ్చింది. వెంటనే పోలీసులు బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేసి ఎటువంటి బాంబులు లేవని నిర్ధారించారు. గత ఏడాది అక్టోబర్లో బసవనగుడిలోకి కాలేజీకి ఇదేవిధంగా బాంబు బెదిరింపు కాల్ రాగా, వీవీ పురం పోలీసులు గాలింపు జరిపి ప శ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో నిందితున్ని అరెస్టు చేసారు. అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతడు 10 కేసుల్లో వాంటెడ్గా గుర్తించారు. తరచూ నకిలీ ఫోన్ కాల్స్ వల్ల ప్రజల్లో భయాందోళనతో పాటు పోలీసులకు ఎంతో సమయం వృథా అవుతోంది. విచారణకు సిట్ ఏర్పాటు -
1,180 తుపాకీ లైసెన్సుల రద్దు
బనశంకరి/ శివాజీనగర: సమాజంలో పౌరులు కూడా ఆత్మరక్షణకు తుపాకులను కలిగి ఉండవచ్చు. ఇందుకు ప్రభుత్వ అనుమతి ఉండాలి. సిలికాన్ సిటీలో ఏడాదిలో 1,180 గన్ లైసెన్స్లను నగర పోలీసులు రద్దు చేశారు. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు జరిపిన తనిఖీలలో మృతుల పేరిట ఉన్నవి, రెన్యువల్ చేయనివి, ఇతరత్రా లోపాలు బయటపడిన లైసెన్సులకు మంగళం పాడారు. లైసెన్స్ల్లో 946 మృతుల పేరులో ఉన్నట్లు వెలుగుచూసింది. 219 లైసెన్స్లను పునరుద్ధరించుకోలేదని గుర్తించారు. యజమానులు చనిపోతే, సంబంధీకులు వెంటనే తుపాకీని లైసెన్సుతో పాటు సమీప పోలీసుస్టేషన్లో అందజేయాలి. ఆ తరువాత కొత్తగా లైసెన్స్కు దరఖాస్తు చేసుకోవాలనే నియమం ఉంది. లైసెన్స్ పొందినా తుపాకులను కొనుగోలు చేయనివారు 15 మంది ఉండగా వారి లైసెన్స్లను తొలగించారు. ప్రతి నెలా సుమారు 100 కొత్త దరఖాస్తులు వస్తున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు. బెంగళూరు పరిధిలో 8,500 కు పైగా తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. ఎక్కెడెక్కడ ఎన్ని రద్దు ● ఉత్తర విభాగం–193 ● దక్షిణ విభాగం–162 ● పశ్చిమ విభాగం–121 ● ఆగ్నేయ విభాగం–93 ● సెంట్రల్ విభాగ–88 ● ఈశాన్య విభాగం–87 ● వైట్ఫీల్డ్ విభాగం–69 బెంగళూరులో ఏడాది కాలంలో చర్యలు ప్రతి నెలా 110 కొత్త దరఖాస్తులు రాజధానిలో 8,567 మందికి అనుమతి లైసెన్సు పొందడం ఎలా? ప్రాణ బెదిరింపులు, తీవ్రమైన గొడవలు కలిగిఉండడం, ఆస్తుల రక్షణ కోసం తుపాకుల లైసెన్సును పొందవచ్చు. ప్రజలు నగర పోలీస్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత పోలీసులు తనిఖీలు జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా లైసెన్స్కు ఆమోదం తెలుపుతారు. ఆ తరువాత లైసెన్సుదారు తుపాకీని కొనుగోలు చేసుకోవచ్చు. లైసెన్సుదారు నిబంధనల మేరకు ఏటేటా రెన్యువల్కు దరఖాస్తు చేసుకోవాలి. 2 నెలల్లో నిర్ణయం ప్రతి దరఖాస్తును పరిష్కరిస్తాం, భారీ లావాదేవీలు జరిపే వ్యాపారులు కూడా లైసెన్స్ తీసుకోవచ్చు. ప్రాణహాని ఉన్నవారు, ప్రముఖులు క్రీడాకారులు, వ్యాపారులు పొందవచ్చు. దరఖాస్తు చేసిన 2 నెలల్లో లైసెన్స్ ఇవ్వాలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటాం. అనేకమంది దరఖాస్తులు పరిశీలనలోనే తిరస్కరణకు గురైనట్లు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ (పరిపాలన) కులదీప కుమార్ జైన్ తెలిపారు. -
రూ.2.15 కోట్ల డ్రగ్స్ పట్టివేత
బనశంకరి: బెంగళూరు లో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల 15 లక్షల విలువచేసే ఎండీఎంఏ క్రిస్టల్, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారని పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ మంగళవారం తెలిపారు. ఒకేచిన్యాడు సామ్యూల్, క్యూకిరిజా టోపిస్టా అనే ఇద్దరు పట్టుబడగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్సిటీ మహాలక్ష్మీ లేఔట్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసి అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిద్దరూ 2011 లో నైజీరియా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. నకిలీ పాస్పోర్ట్, వీసాతో నగరంలో మకాం వేసి, ఐటీ ఉద్యోగులకు మత్తు పదార్థాలను విక్రయించేవారు. ఐపీఎస్ అలోక్కు ఊరట శివాజీనగర: సీనియర్ ఐపీఎస్, అదనపు డీజీపీ అలోక్కుమార్ మీద ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ విచారణను కేంద్ర పరిపాలనాత్మక న్యాయమండలి (సీఏటీ) రద్దు చేసింది. అంతేకాకుండగా నిలిపివేసిన ఆయన పదోన్నతి, ఇతర సదుపాయాలను ఇవ్వాలని ఆదేశించింది. కొన్నేళ్లుగా ఈ కేసు నలుగుతోంది. గతంలో ఇద్దరు క్యాట్ జడ్జిలు అనుకూల, వ్యతిరేక తీర్పులను ఇచ్చారు. దీంతో కేసు క్యాట్ ప్రధాన న్యాయమూర్తి రణ్జీత్కు చేరింది. ఇరువైపుల వాదనలను ఆలకించి మంగళవారం అలోక్కుమార్కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖభంగమైంది. 2019లో కాంగ్రెస్– జేడీఎస్ సర్కారు హయాంలో అలోక్కుమార్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని కేసు నమోదైంది. కన్నుపడితే కార్లలో సొత్తు మాయం యశవంతపుర: విలాసవంతమైన కార్ల అద్దాలను ధ్వంసం చేసి అందులోని వస్తువులను చోరీచేసే ప్రముఖ రామ్జీ ముఠాలోని ముఖ్యమైన దొంగని బెంగళూరు విజయనగర పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన జైశీలన్, 19 ఏళ్లు కొడుకు దీన్దయాళ్తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో కారు అద్దాలను పగులగొట్టి డబ్బు, నగలు, ల్యాప్టాప్లు వంటి సొత్తును ఎత్తుకెళ్లాడు. పోలీసులకు ఈ తండ్రీ కొడుకులు తలనొప్పిగా మారారు. తమిళనాడులో దాగి ఉన్న జైశీలన్ను పోలీసులు అరెస్ట్ చేయగా కొడుకు దీన్ దయాళ్ తప్పించుకున్నాడు. మూడు నెలలకోక్కసారి తమిళనాడు నుంచి బెంగళూరుకు వచ్చి కార్లలో చోరీలకు పాల్పడేవారు. బెంగళూరు నుంచి బెళగావి వరకు వీరిపై కేసులున్నాయి. కాలేజీ పై నుంచి దూకి ఆత్మహత్య యశవంతపుర: కాలేజీ భవనం మీద నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు రిచర్డ్ టౌన్లో జరిగింది. పియూసీ రెండో ఏడాది అబ్బాయిగా తెలిసింది. సోమవారం ఉదయం 8:20 గంటలకు విద్యార్థులు ప్రార్థనకు సిద్ధం అవుతుండగా పై అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా కొన్నిగంటల తరువాత చనిపోయాడు. అతడు చదువు, ఆటల్లో చురుగ్గా ఉండేవాడని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని అధ్యాపకులు చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బైక్ను టెంపో ఢీ, బాలుడు మృతి దొడ్డబళ్లాపురం: బైక్ను టెంపో ఢీకొని కుమారుడు చనిపోగా, తండ్రి తీవ్ర గాయాలపాలైన సంఘటన మాగడి–హులియూరుదుర్గ రోడ్డులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బైక్ కుణిగల్ తాలూకా నాగనహళ్లికి చెందిన తండ్రి, కుమారుడు నాగేశ్ (51), హర్ష (14) వస్తున్నారు. సిమెంటు లోడుతో మాగడి వైపు నుంచి వస్తున్న టెంపో బైక్ను ఎదురుగా ఢీకొంది. ఈ రభసకు టెంపో, బైక్ రెండూ రోడ్డుపక్కన పొలాల్లోకి బోల్తా పడ్డాయి. బాలుడు హర్ష గాయాలతో మరణించగా, నాగేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. మాగడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
చిత్రదుర్గ, బాగలకోటెల్లోనూ ఇదే పరిస్థితి
రాష్ట్రంలో అత్యధికంగా ఉల్లి సాగు చేసే చిత్రదుర్గ, బాగల్కోటె జిల్లా రైతుల పరిస్థితి కూడా ఇలానే కనిపిస్తోంది. ఏ రైతు పొలంలో చూసినా ఉల్లి పంట కనిపిస్తుందే కానీ పంట తీయడానికి కూడా రైతులకు ఉత్సాహం కనిపించడం లేదు. ఈనేపథ్యంలో ప్రభుత్వం కదిలివచ్చి ఉల్లిసాగు చేసిన రైతులను ఆదుకోవాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవరెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో లక్షలాది ఎకరాల్లో ఉల్లి పంటను రైతులు సాగు చేశారన్నారు. ఒక్క ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే 80 వేలకు పైగా ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షలకు పైగా ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారన్నారు. ప్రతి రైతు లక్షలాది రూపాయలను నష్టపోయారన్నారు. ఎకరానికి ప్రభుత్వం కనీసం రూ.50 వేలను పంట నష్టపరిహారంగా అందించాలని కోరారు. రైతుల నుంచి ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించాలన్నారు. వ్యాపారులు రైతుల నుంచి కిలో రూ.5ల లోపు ధరకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అలరించిన నాటక ప్రదర్శన
బళ్లారిఅర్బన్: కన్నడ సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో అనురాగ పల్లవి సాంస్కృతిక కళా ట్రస్ట్, దేవలాపుర కందగల్ హనుమంతరాయ ఆధ్వర్యంలో రక్తరాత్రి అనే కన్నడ పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ప్రముఖులు ప్రభుదేవ కప్పగల్ మాట్లాడుతూ బళ్లారిలో రాఘవ, జోళదరాశి దొడ్డనగౌడ, సుభద్రమ్మ, బెళగల్ వీరన్న తదితరులు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించి బళ్లారి జిల్లాకు ఎనలేని ఖ్యాతిని సాధించారన్నారు. తిప్పేస్వామి, యోగేష్, మురళి చెళ్లకెరె, వీరేష్ బెళగావి తదితరులు నాటకంలో వివిధ పాత్రలు పోషించారు. రైతు కుటుంబానికి పరిహారం పంపిణీ హుబ్లీ: చెట్టు కూలిపడి మరణించిన హానగల్ రైతు ఫకీరప్ప పాండప్ప కుటుంబానికి సర్కారు ద్వారా విడుదలైన రూ.5 లక్షల పరిహారధనం సొమ్మును ఆ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ మానె అందజేశారు. ఆ మేరకు మృత రైతు ఫకీరప్ప భార్య పార్వతవ్వకు అక్కడి తహసీల్దార్ కార్యాలయం ద్వారా ఈ పరిహారం అందించారు. ప్రకృతి వైపరీత్యాల పరిహార నిధి ద్వారా ఎటువంటి కేసులను పెండింగ్లో ఉంచకుండా పరిహారం విడుదలకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు సంబంధిత రైతు బాంధవులకు అండదండగా నిలబడటమే ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. తహసీల్దార్ రేణుక, పురసభ మాజీ అధ్యక్షుడు యల్లప్ప, సిద్దనగౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యంహొసపేటె: హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్వతి నగర్ నివాసి కిచడి రామప్ప అనే 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తి అదృశ్యమైనట్లు హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తప్పిపోయిన వ్యక్తి 5.9 అడుగుల ఎత్తు, పలుచని శరీరాకృతి, నలుపు రంగు శరీరఛాయ కలిగి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఎరుపు రంగు ఫుల్ స్లీవ్స్ షర్ట్, నీలం చారల లుంగీ ధరించాడు. కన్నడలో మాట్లాడగల ఈ వ్యక్తి ఆచూకీ గురించి తెలిస్తే టౌన్ పోలీస్ స్టేషన్ పీఐకు సమాచారం అందించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ హాస్టల్లో వంట గ్యాస్ లీకేజీ●త్రుటిలో తప్పిన పెను ప్రమాదం హొసపేటె: నగరంలోని ఎల్ఎఫ్ఎస్ స్కూల్ హాస్టల్లో మంగళవారం పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ సంభవించింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ లీక్ జరిగిన వెంటనే తల్లిదండ్రులు, పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది పాఠశాలలో నుంచి పిల్లలను బయటకు పంపించారు. గ్యాస్ లీక్ జరిగినప్పుడు హాస్టల్లో దాదాపు 50–60 మంది పిల్లలు ఉన్నారు. విషయం తెలియగానే పట్టణ పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది, తల్లిదండ్రులు, నాథలియన్ సాంగ్లీ అనే హోం గార్డు ఘటన స్థలానికి చేరుకుని లీకేజీని ఆపారు. హెచ్పీ గ్యాస్ కంపెనీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆర్ఎస్ఎస్ నిషేధానికి లేఖ రాయడం తగదు రాయచూరు రూరల్: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కళ్యాణ కర్ణాటక భాగంలో వరదలతో నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం అందించాలని సీఎం సిద్దరామయ్యకు లేఖ రాయాలే తప్ప ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని లేఖ రాయడం సమంజసం కాదని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నవంబర్, డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ధ్రువీకరణ కాబోతున్న తరుణంలో అధిష్టానం మెప్పు పొందడానికి తోడు ముఖ్యమంత్రి పదవి కావాలనే ఆశతో ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని లేఖ రాయడం అవివేకమన్నారు. రైతుల పంటలు వరదలకు కొట్టుకుపోవడంతో నష్టాల బాటలో ఉన్న వారిని ఆదుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈసందర్భంగా యల్లప్ప, మల్లికార్జున, తిమ్మప్ప, భీమన్న, మౌనేష్, సంతోష్ తదితరులున్నారు. -
కల్యాణ కర్ణాటకకు నిర్మలా సీతారామన్ రాక
సాక్షి, బళ్లారి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు కల్యాణ కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆమె మంగళవారం ఎక్స్లో కల్యాణ కర్ణాటక పరిధిలోని బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, కలబుర్గి, బీదర్ జిలాల్లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాల పరిధిలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన యూనిట్లను ప్రారంభిస్తుండటంతో పాటు రైతులతో చర్చిస్తామన్నారు. ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రైతు కుటుంబాలతో సమస్యలను అడిగి తెలుసుకుంటానన్నారు. ఆయా జిల్లాల్లో రైతులు పండించే పంటలు, సమస్యలు తదితరాలపై రైతులతో నేరుగా మాట్లాడతానన్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తాను ఈ ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుంటానన్నారు. నిర్మల పర్యటనపై ఖర్గే ఎద్దేవా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కల్యాణ కర్ణాటక పర్యటనకు విచ్చేస్తుండటం సంతోషంగా ఉందని, మొత్తం మీద ఆమె ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు వస్తున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర తరహాలో కర్ణాటకకు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలని, ఉత్తుత్తి పర్యటనలతో లాభం లేదన్నారు. నేడు కేంద్ర మంత్రి హంపీ సందర్శన హొసపేటె: కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి 9 గంటలకు హంపీకి చేరుకుని జంగిల్ లాడ్జ్ రిసార్ట్లో బస చేస్తారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు హంపీలోని విరుపాక్ష ఆలయాన్ని సందర్శించి, దైవదర్శనం చేసుకుంటారు. హంపీ నుంచి ఆమె ఉదయం 9.15 గంటలకు కొప్పళ జిల్లాలోని మెటగల్లి గ్రామాన్ని సందర్శిస్తారు. ఆమె మధ్యాహ్నం 3 గంటలకు హొసపేటెలోని హోటల్ మల్లిగెలో నిర్వహించే పీఎంఎస్ఐ ఇంటర్న్లతో సంభాషిస్తారు. ఈనెల 17న ఉదయం 10.30 గంటలకు ఆమె బళ్లారి నుంచి కూడ్లిగి తాలూకాలోని కాసాపుర గ్రామానికి చేరుకుని అక్కడ రైతు శిక్షణ కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభిస్తారు. అనంతరం 11.30 గంటలకు ఆమె కాసాపుర గ్రామం నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయలుదేరి వెళతారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో పర్యటన -
వైభవంగా గణ హోమ పూజలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ తాలూకా ప్రణాళికా కార్యాలయంలో ఆయుధ, గణ హోమ పూజ మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి కార్యాలయాన్ని సిబ్బంది పూలమాలలు, రంగోలీలతో అలంకరించారు. లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి వివిధ రకాల పూలతో అమ్మవారికి ప్రత్యేక మహా మంగళారతి నిర్వహించారు. తరువాత ప్రసాద వితరణ చేశారు. తాలూకా ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ మాట్లాడుతూ నవరాత్రి సమయంలో తొమ్మిది రోజుల పాటు శక్తి దేవతలను పూజిస్తారు. కోరికలు నెరవేరాలని ప్రార్థనలు చేస్తారు. దీపావళి పండుగలో భాగంగా దేవిని పూజించడానికి కార్యాలయంలో గణహోమ పూజ నిర్వహించామన్నారు. పట్టణ పంచాయతీ అధ్యక్షుడు కావలి శివప్ప నాయక, డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, సీఐ ప్రహ్లాద్ ఎస్ చెన్నగిరి పాల్గొన్నారు. జన జాగృతి వేదిక సభ్యులు కక్కుప్పి గుండప్ప, హడగలి వీరభద్రప్ప, జీఆర్ సిద్దేశ్వర్, పవిత్ర, వ్యవసాయ పర్యవేక్షకుడు మహాలింగయ్య, జ్ఞాన వికాస్ కేంద్ర సమన్వయకర్త సరస్వతి, మండలాల పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరసన
హొసపేటె: ఖాళీగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగార్ధుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సర్కిల్ నుంచి నిరసన ప్రదర్శనగా వచ్చిన ఆందోళనకారులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. నిరసనను ఉద్దేశించి పోరాట కమిటి నేత, కవి పీర్ బాషా మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల హక్కులను కాపాడాలని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను సత్వరం భర్తీ చేయాలని, నియామకాల్లో పారదర్శకత పాటించాలన్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నియామకాలు జరగనందున వయో పరిమితిలో సడలింపు ఇవ్వాలని తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. -
అగ్నిప్రమాదంలో పాత రికార్డులు దగ్ధం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకాలో విద్యా శాఖ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. మంగళవారం నగరంలోని పాత విద్యా శాఖ కార్యాలయంలో ఆకస్మికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో 50 ఏళ్ల క్రితం నుంచి ఉన్న పాత రికార్డులు దగ్ధమయ్యాయి. అగ్ని మాపక కేంద్రం అధికారులు వచ్చి మంటలను ఆర్పివేశారు. జిల్లా విద్యా శాఖాధికారి బడిగేర్ ఘటన స్థలానికొచ్చి పరిశీలించారు. తాలూకాలోని మర్చేడ్ హైస్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. కొంత మంది దుర్మార్గులు కువెంపు మోడల్ హైస్కూలుకు నిప్పంటించడంతో పరికరాలు కాలి పోయాయి. గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టి టీవీ, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాబయ్య తెలిపారు. -
పదిలో మెరుగైన ఫలితాలు సాధించండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఈసారి పదవ తరగతిలో మెరుగైన ఫలితాల సాధనపై దృష్టి పెట్టాలని, విద్యా శాఖలో అధికారులు ఇచ్చిన నివేదికలు వేరని, సమావేశంలో చెబుతున్న నివేదికలకు పొంతన లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రితీష్ కుమార్ సింగ్ ధ్వజమెత్తారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన ప్రగతి పరిశీలన సమావేశంలో మాట్లాడారు. పదవ తరగతి, ఇంటర్లో ఫలితాలు తగ్గిపోవడానికి కారణాలు అన్వేషించాలని ఉన్నతాధికారులకు సూచనలిచ్చారు. దేవదుర్గ తాలూకాలో 17 పాఠశాలల్లో 40 శాతం, నగరంలో 60 పాఠశాలల్లో 40 శాతం కంటే తక్కువ శాతం ఫలితాలు రావడంపై నివేదికలు అందివ్వాలన్నారు. గృహలక్ష్మి నిధులు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. హాస్టల్లో విద్యార్థులకు మంచి ఆహారం అందించాలన్నారు. బయోమెట్రిక్ను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో వరి, పత్తి, కంది, జొన్న, ఇతర పంటలు వర్షాల వల్ల నష్టపోయిన అంశాలపై రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారుల సంయుక్త సర్వేలు చేసి నివేదికలను అందించాలన్నారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఏసీ గజానన, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఉప కార్యదర్శి సిద్దప్ప, అధికారి రోణ, చంద్రశేఖర్ పవార్, శరణబసవలున్నారు. -
ఆ అధికారిని సస్పెండ్ చేయండి
రాయచూరు రూరల్: ఆర్ఎస్ఎస్ కవాతులో పాల్గొన్న అధికారిని విధుల నుంచి తొలగించాలని భీమ్ ఆర్మీ జిల్లాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగసూగూరు శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప ఆప్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఉంటూ ఇటీవల లింగసూగూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ కవాతులో గణ వేషధారిగా ర్యాలీలో పాల్గొన్న అధికారిని సస్పెండ్ చేయాలన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండాలి రాయచూరు రూరల్: యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య పేర్కొన్నారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ధర్మ స్థల క్షేత్ర సంస్థ, కర్ణాటక మద్యపాన నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో మద్యపానం, ధూమపానం సేవించడం వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. మద్యపాన నియంత్రణకు మానవతా విలువలను పెంచుకోవాలన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, శరణమ్మ, శ్రీకాంత్లున్నారు. కులమతాల మధ్య ఆర్ఎస్ఎస్ చిచ్చురాయచూరు రూరల్: దేశానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలు శూన్యమని, కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న సంస్థను నిషేధించాలని ముఖ్యమంత్రికి మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాయడం తప్పా? అని ఎమ్మెల్సీ వసంత కుమార్ ప్రశ్నించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్థలాల్లో సభలు, సమావేశాలకు నిర్వహించడానికి అవకాశం కల్పించరాదని లేఖ రాయడం తప్పా? అని నిలదీశారు. ఏనాడూ దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన లేదన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థను 1962, 1971, 1977, 1982, 1992లలో నిషేధించారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారని, దీనిపై పరిశీలిస్తున్న తరుణంలో నేతలు వాగ్దానాలు చేయడం మంచిది కాదన్నారు. జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, నగరసభ సభ్యుడు బసవరాజ్ దరూరు, మారెప్ప, అబ్దుల్ ఖరీం, శ్రీనివాస్, బాబర్, సుధామ, రజాక్ ఉస్తాద్లున్నారు. డిజిటల్ కంటెంట్ క్రియేషన్ తరగతులు ప్రారంభంరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో డిజిటల్ కంటెంట్ క్రియేషన్ శిక్షణ తరగతులను మంగళవారం కలబుర్గిలో హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థ, వీరమ్మ గంగ సిరి కళాశాలలో గణిత శాస్త్ర అసిస్టెంట్ అధ్యాపకురాలు డాక్టర్ సునీత ప్రారంభించారు. నేటి ఆధునిక విద్యా రంగంలో డిజిటల్ కంటెంట్ క్రియేషన్ శిక్షణ తప్పనిసరి అన్నారు. దీని వల్ల విద్యార్థులు నూతన సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల ఆధారంగా విద్యనభ్యసించేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేంద్ర, నాగరత్న, స్వాతి, శివలీల, ప్రమీల, మహేష్ గంగ్వార్లున్నారు. పంట నష్టపరిహారం చెల్లించాలి రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పొలంలో వేసుకున్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు లక్ష్మణ గౌడ మాట్లాడారు. అతివృష్టి వల్ల రాయచూరు జిల్లాలో నష్టం సంభవించిందన్నారు. వానలకు నష్టపోయిన పత్తి పంటలకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసి జిల్లాధికారి నితీష్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయండి
రాయచూరు రూరల్: యాదగరి జిల్లా గురుమట్కల్ తాలూకా కడేచూరు–బాడియాళ వద్ద రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని శాసన సభ్యుడు శరణేగౌడ కందకూరు విజ్ఞప్తి చేశారు. సోమవారం బెంగళూరులో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణను కలిసి చర్చించారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించినట్లు అవుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు కలబుర్గి–రాయచూరు ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైలును తిరిగి పునరుద్ధరించాలన్నారు. రైతుల పంటలకు హత్తికుణి, సౌదాగర్ డ్యాంల నుంచి ఆయకట్టు చివరి భూములకు నీరందించడానికి, కాలువల మరమ్మతులకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించాలని విన్నవించారు. -
దిగుబడి ఉన్నా.. ఉల్లి ధర సున్నా
సాక్షి బళ్లారి: గత కొన్ని నెలలుగా ఉల్లిగడ్డల ధర పడిపోవడంతో పాటు రోజు రోజుకు ధరలు మరింత తగ్గిపోవడంతో ఉల్లి సాగు చేసిన రైతులకు కన్నీరు మిగుల్చుతోంది. ఆరుగాలం కష్టపడి పని చేసి పంట చేతికి అందిన తర్వాత రైతులకు పెట్టుబడి కాదు కదా కనీసం పంటను పీకడానికి కూడా అయ్యే ఖర్చు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉల్లి రైతులు పొలాల్లోనే పంటను వదిలివేసి ఆందోళనల బాటపట్టారు. కిలో రూ.1 నుంచి రూ.5ల లోపు రైతు వద్ద కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వస్తుండటంతో చేసేది ఏమీ లేక రైతులు పొలాల్లోనే ఉల్లిపంటను వదిలేశారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో గతంలో ఎన్నడూ సాగు చేయని విధంగా దాదాపు 80 వేలకు పైగా ఎకరాల్లో ఉల్లిపంటను సాగు చేశారు. జిల్లాలోని సిరుగుప్ప తాలూకా దాసాపుర గ్రామంలో పోసేరావు, అంజినప్ప, హులెప్ప, నాగప్ప, దొడ్డమల్లనగౌడ, నాగప్ప, శేఖరప్ప, రుద్రప్ప ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రామంలో 80 శాతానికి పైగా రైతులు ఉల్లిసాగు చేశారు. మిర్చి కంటే ఉల్లి నిండా ముంచింది ప్రతి రైతు నాలుగు ఎకరాల నుంచి 15 ఎకరాల దాకా ఉల్లి పంటను సాగు చేశారు. అలాగే కొంచిగేరి గ్రామంలో మల్లికార్జున, గంగన్న, ఎర్రిస్వామి తదితర రైతులు పెద్ద సంఖ్యలో ఉల్లిసాగు చేయగా సిరిగేరి, ఉమ్మడి బళ్లారి జిల్లాలోని విజయనగర జిల్లాలో కూడ్లిగి, కొట్టూరు, హగరిబొమ్మనహళ్లి తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశారు. గత మూడేళ్లుగా మిర్చి ధర పెరగక పోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా మిర్చి రైతులకు చేతికి అందకపోవడంతో ఉల్లి పంటను సాగు చేస్తే గట్టెక్కుతామని ఆశించిన రైతులకు మిర్చి కంటే ఉల్లి మరింత నిండా ముంచిందని దాసాపుర గ్రామానికి చెందిన పోసేరావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి తాను 15 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేయగా ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టామన్నారు. ప్రస్తుతం పెట్టుబడి కాదు కదా కనీసం పంటను పీకడానికి కూడా రాకపోవడంతో పొలాల్లోనే వదిలేస్తున్నామన్నారు. రైతులకు ఆత్యహత్యలే శరణ్యం ఇది నా ఒక్క రైతు బాధ కాదని, సిరుగుప్ప తాలూకా, ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా ఉల్లి సాగు చేసిన ప్రతి రైతుకు ఈసారి పెట్టుబడి రాక అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఉల్లి గడ్డల ధర పెరిగితే ప్రభుత్వాలు కదిలి వచ్చి పేద వినియోగదారులకు నష్టం జరుగుతుందని ఏపీఎంసీల్లో సబ్సిడీతో ఉల్లిగడ్డలు విక్రయిస్తారని, అదే రైతుకు ధర తగ్గిపోతే ఎందుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని మండిపడ్డారు. ఇలా ఉల్లి సాగు చేసిన ప్రతి రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టారు. పొలాల్లోనే ఉల్లి పంటను వదిలేసిన రైతులు కోకొల్లలు. ఉల్లి పంటను చేతపట్టుకొని ఆందోళన చేపట్టే రైతులు కొందరు, ఉల్లి గడ్డలతో శవయాత్ర చేపడుతూ ఆందోళనలు చేసే రైతులు మరికొందరు, ఉల్లి పంటను కుప్పపోసి మంట పెట్టే రైతులు ఇంకొందరు ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా ఉత్తర కర్ణాటక పరిధిలోని బాగల్కోటె, విజయపుర, గదగ్, కొప్పళ తదితర జిల్లాల్లో ఉల్లి సాగు చేసిన రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోవడంతో గత్యంతరం లేక రైతులు పోరుబాట పట్టారు. విస్తారంగా పండిన ఉల్లి పంట ఉల్లిగడ్డలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఉల్లి రైతులు రైతుకు కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి పంట పంట తొలగింపు ఖర్చులు కూడా రాని వైనం ఎకరానికి రూ.లక్షకు పైగా నష్టపోయిన రైతు ఉమ్మడి జిల్లాలో 80 వేలకు పైగా ఎకరాల్లో సాగు ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు గిట్టుబాట ధర కల్పించాలని రైతుల నిరసనలు ఉత్తర కర్ణాటకలో కూడా లక్షలాది ఎకరాల్లో సాగు ధర పతనంతో ఉల్లిగడ్డలతో రైతుల శవయాత్ర -
యువతిపై సామూహిక అత్యాచారం
కర్ణాటక: డ్రాప్ చేస్తామని యువతిని బైక్ ఎక్కించుకున్న యువకులు ఆమెను నిర్జనప్రదేశానికి తీసికెళ్లి అత్యాచారం జరిపిన దారుణ సంఘటన చిక్కబళ్లాపురం పట్టణంలో జరిగింది. స్థానికంగా మెకానిక్ పని చేస్తున్న సికిందర్ బాబా (30), గుజరీ వ్యాపారి జనార్ధనాచారి(31)లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సమీప గ్రామానికి చెందిన యువతి పని మీద ఆదివారం చిక్కబళ్లాపురానికి వచ్చింది. సాయంత్రం తిరిగి ఊరికి నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో బైక్పై వచ్చిన సికిందర్ డ్రాప్ చేస్తానని ఆమెను బైక్పై ఎక్కించుకున్నాడు. దారిలో నిర్జన ప్రదేశంలో ఆమైపె అత్యాచారం చేసి వెళ్లిపోయాడు. మళ్లీ స్నేహితుడు జనార్ధనాచారిని తీసుకుని వచ్చి యువతిపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను బైక్పై కూర్చోబెట్టుకుని సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద వదిలి వెళ్లిపోయారు. రోడ్డు మీదే యువతి ఏడుస్తూ కూర్చుని ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న మహిళా ఠాణా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు యువతిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.మహిళా వైద్యురాలితో అసభ్య ప్రవర్తనఇటీవల బస్సుల్లో కామాంధులు ఎక్కువయ్యారు. తాజాగా దొడ్డబళ్లాపురం నుంచి బెంగళూరుకు బస్సులో వస్తున్న మహిళా వైద్యురాలిని ఓ దుండగుడు వేధించాడు. ఆమె పక్కన కూర్చుని అసభ్యంగా తాకసాగాడు. దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్కు విషయం చెప్పగా, పోలీసులకు ఫోన్ చేసి నిందితుడు ఫిరోజ్ఖాన్ని పట్టించారు. సంజయ్ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.బస్సులో మరో దురాగతంబెంగళూరులో ఆర్టీసీ బస్సులో మరో దుస్సంఘటన జరిగింది. తుమకూరు నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సులో ఓ వ్యక్తి ఎక్కి మహిళ పక్కనే కూర్చున్నాడు. ప్యాంట్ జిప్ తీసి యువతి దుస్తులపై వీర్యం చిమ్మాడు. ఈ చర్యతో భయంతో యువతి గట్టిగా కేకలు వేసింది. తోటి ప్రయాణికులు ఆ కామాంధున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు, మార్గమధ్యలో క్యాత్సంద్ర వద్ద బస్సు ఆపి స్థానిక పోలీసులకు అప్పగించారు. -
ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!
సాధారణంగా కనీస ఆదాయం కోసం, లేదా ఉన్న ఉద్యోగానికి తోడుగా, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు డెలివరీ బాయ్గానో, క్యాబ్ డ్రైవర్లగానో పార్ట్ టైం పనిచేసే వాళ్లను చూసి ఉంటాం. కానీ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఉబెర్ డ్రైవర్గా పని చేస్తూ సక్సెస్ సాధించిన వైనం నెట్టింట స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అసలు కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడు, అతని ఆదాయం ప్రస్తుతం ఎంత? పదండి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త వరుణ్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని ప్రకారం దీపేష్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేశాడు. కార్పొరేట్ జీవితం, జీతం కంటే తన ఫ్యామిలీ లైఫే ముఖ్యమని భావించిన ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతంలో రిలయన్స్ రిటైల్ లో పని చేసిన దీపేష్ అతను తన పని-జీవిత సమతుల్యతను మెరుగు పరుచు కోవడానికి ఉబెర్ డ్రైవర్ అయ్యాడు. రిలయన్స్ రిటైల్లో తన కెరీర్ను ప్రారంభించి ఎనిమిదేళ్లు పనిచేశాడు. నెలకు రూ. 40వేల జీతం. కానీ స్థిరమైన ఉద్యోగం , మంచి జీతం, కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, వర్క్ లైఫ్ బాలెన్స్ లేకపోవడం ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా తన భార్యా పిల్లలతో సమయం గడపలేకపోతున్నానని గ్రహించాడు. అంతేకాదు ఉద్యోగాన్ని వదిలి వేసి ఫుల్ టైం డ్రైవర్గా మారాలన్ని సాహసం చేశాడు.కట్ చేస్తే అతని నెల ఆదాయం ఇపుడు రూ. 50 వేలు. పైగా నెలకు 21 రోజులు మాత్రమే పని. మొత్తానికి ధైర్యం చేసి తాను కోరుకున్న జీవితాన్ని సాధించాడు అంటూ వరుణ్ అగర్వాల్ ఈ స్టోరీని షేర్ చేశారు..అంతేకాకుండా, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా, దీపేష్ మరో కారు కొన్నాడు. మరో డ్రైవర్ను నియమించుకున్నాడు. అంటే తన కాళ్ల మీద తానే నిలబడటమే కాదు మరొకరికి ఉపాధిని కల్పించడం విశేషం. జీవితంలో ముందుగా సాగాలంటే కొన్నిసార్లు రిస్క్ తీసుకోక తప్పదు అంటూ దీపేష్ సక్సెస్ సాధించిన తీరును ప్రశంసించారు వరుణ్. చదవండి: Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!నెటిజన్ల రియాక్షన్స్దీపేష్ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ప్రాధాన్యతలను గుర్తించడం,, రిస్క్ తీసుకోవడం చాలా అవసరం. ఒక్క మెట్టు దిగినా పరవాలేదు.. దిల్ ఉంటే..కష్టపడితే అదే పెద్ద ప్రమోషన్ అని వ్యాఖ్యానించారు. మరిన్ని విజయాలు సాధించాలి అంటూ దీపేష్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: Down's syndrome పుట్టకముందే నిర్ధారణఎలా...? -
ఎయిర్పోర్టులో మత్తు గుట్టలు
బనశంకరి: శ్రీలంకలోని కొలంబో నుంచి బెంగళూరుకు తీసుకొచ్చిన రూ.50 కోట్ల విలువచేసే డ్రగ్స్ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక పౌరునితో పాటు ముగ్గురిని అరెస్ట్చేశారు. వివరాలు.. ఈ నెల 9వ తేదీన కొలంబో నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 31 కేజీల హైడ్రో గంజా, 4 కేజీల అరుదైన సిలోసిబిన్ పుట్టగొడుగులను స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో శ్రీలంక పౌరున్ని అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 14 కిలోలు హైడ్రో గంజాయి, 2 కేజీల సిలోసిబిన్ పుట్టగొడుగులను పట్టుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ను, ఇతర నిషేధిత వస్తువులను ఆహార పదార్థాల టిన్నుల్లో నింపి తనిఖీల నుంచి తప్పించుకుంటున్నారని చెప్పారు. వీటన్నింటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని తెలిపారు. రూ. 100 కోట్ల హైడ్రో గంజాయి.. నగరానికి హైడ్రో గంజాయి రవాణా అధికమైందని బెంగళూరు ఎన్సీబీ అధికారులు తెలిపారు. 2025లో ఇలాంటి 18 కేసుల్లో రూ.100 కోట్ల కు పైగా విలువచేసే 220 కిలోల హైడ్రో గంజాయి పట్టుబడిందని, కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర కు చెందిన 45 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ దీని వెనుక ఉన్నట్లు తెలిపారు. మార్కెట్లో కేజీ రూ.80 లక్షలు మామూలు గంజాయి కంటే హైడ్రో గంజాయి ఎక్కువ ప్రభావవంతమైనదని పెడ్లర్లు ప్రచారం చేస్తుంటారు. చిల్లర మార్కెట్లో ఒక కేజీ సుమారు రూ.80 లక్షల ధర పలుకుతోందని, ఐటీ బీటీ ఉద్యోగులు, బడా బాబులు పార్టీల్లో మత్తుకోసం అధికంగా వినియోగిస్తారని సమాచారం. అనేకమంది యువకులు థాయ్లాండ్ నుంచి హైడ్రోఫోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. టెట్రాప్యాక్లు, చాక్లెట్లు, ఆహార పొట్లాలు, దుస్తులు మొదలైన వస్తువుల్లో దాచిపెట్టి స్మగుల్ చేస్తుంటారు. దుబాయ్, కొలంబో, నేపాల్ల మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారని ఎన్సీబీ అధికారులు తెలిపారు. రూ.50 కోట్ల హైడ్రో గంజాయి, పుట్టగొడుగుల సీజ్ శ్రీలంకవాసితో పాటు ముగ్గురు అరెస్ట్ -
హాసనాంబ దర్శనానికి భక్త దండు
బనశంకరి: హాసన్ నగరంలో కొలువైన హాసనాంబ దేవి ఆలయంలో అమ్మవారి దర్శనానికి నాలుగోరోజు భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సంతపేటే సర్కిల్ రోడ్డు పొడవునా భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం 8 గంటలకు భక్తులు రద్దీ తగ్గింది. రూ.1000 టికెట్ , రూ.300 టికెట్లు కొని ఎక్కువమంది దర్శనం చేసుకొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి పాస్, లడ్డూల విక్రయంతో రికార్డు స్థాయిలో రూ.2.24 కోట్లు వసూలైందని అధికారులు తెలిపారు. రెవెన్యూశాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 3.50 లక్షల మంది భక్తులు హాసనాంబ ను దర్శించుకున్నారు. సంవత్సరంలో కొన్నిరోజులు మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు. మరోవైపు భక్తిగాన కచేరీ అలరించింది. వేలాది మందితో క్యూలు -
సోషల్ మీడియాలో కంపు
బనశంకరి: సోషల్ మీడియాలో మహిళలను దూషించడం, అశ్లీల చిత్రాలు, ద్వేషపూరిత మెసేజ్లు, బెదిరింపు ఘటనలు హెచ్చుమీరాయి. ఈ ఏడాది గత 9 నెలల్లో 953 కేసులు నమోదు కావడం చూస్తే సోషల్ మీడియా క్రైమ్ ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇటీవల అసభ్య పదజాలంతో మహిళలను దూషించడం, ద్వేషంతో కూడిన మెసేజ్ పంపడం, బెదిరింపులకు పాల్పడటం, మత సామరస్యానికి భంగం కలిగించే కేసులు అధికమయ్యాయి. 51 శాతం పెరుగుదల గత కొద్దిసంవత్సరాలతో పోలిస్తే ఇటువంటి నేరాల రేటు 51 శాతం పెరగడం గమనార్హం. బెంగళూరు నగర పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యంగా ఉన్న 300 కి పైగా పోస్టులను తొలగించి 50 కి పైగా పోకిరీల అకౌంట్లను బ్లాక్ చేశారు. మహిళలు, యువతులు ఫోటోల పోస్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆకతాయిలు, సైబర్ నేరగాళ్లు వారి ఫోటోలను సేకరించి దుర్వినియోగం చేసే ప్రమాదముందని హెచ్చరించారు. యువకుల పెడపోకడ సోషల్ మీడియాలో బెదిరింపులు, ప్రాణహానిని తలపెట్టే మెసేజ్లు. అసభ్య పదజాలంతో దూషించిన ఉదంతాల్లో ఎక్కువమంది యువకులే ఉంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కువ లైక్లు, అధిక ఫాలోయర్స్ను పొందడానికి తప్పుడు మార్గాల్లో ప్రయత్నిస్తారు. యువత్ సోషిల్ మీడియాలో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. అనేకమంది యువతులు, మహిళలు తమ ఫోటోలను ఎడాపెడా పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుండగులు డబ్బు కోసం మహిళలను బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నట్లు తెలిపారు. మహిళల పట్ల కించపరిచే పోస్టులు బెంగళూరులో ఏటేటా నేరాల వృద్ధిసోషల్ మీడియా అనేది నేరస్తుల చేతిలో ఆయుధమైంది. యువతులు, మహిళల పట్ల సులభంగా నేరాలకు పాల్పడుతున్నారు. మహిళల ఫోటోలను సేకరించి మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, ఇతరత్రా అవాంఛనీయాలకు ఒడిగట్టడం సిలికాన్సిటీలో అధికమైంది. పోలీసులు నిఘా పెట్టినప్పటికీ నేరాలకు బ్రేకులు పడడం లేదు, సరికదా పెరుగుతున్నాయి. మార్ఫింగ్ బెడద వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ఆన్లైన్ మీడియాను యువత, జనం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఉపయోగిస్తుంటారు. చెడును ప్రేరేపించేలా పోస్టులు పెట్టడం, కించపరిచేలా కామెంట్లు, ఫార్వర్డ్– షేరింగ్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వ్యాప్తి చేయడం ఎక్కువగా జరుగుతోంది. దీని వల్ల సమాజంలో వారి పరువు పోవడంతో పాటు కుటుంబాల్లో చిచ్చు రేగి నేరాలూ సంభవిస్తుంటాయి. -
పెళ్లయి 5 నెలలు.. భర్త చేతిలో హత్య
యశవంతపుర: కత్తితో పొడిచి నవ వివాహితను భర్త హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఆల్దూరు సమీపంలోని హొసహళ్లి గ్రామంలో జరిగింది. ఆమె పుట్టింటిలోనే ఈ ఘోరం జరిగింది. వివరాలు.. ఐదు నెలల క్రితం నేత్ర (32) అనే మహిళతో నవీన్ వివాహం చేశారు. కొన్నిరోజుల నుంచే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో మూడు నెలల కిందట ఆమె హొసహళ్లిలోని పుట్టింటికి చేరుకుంది. ఆదివారం వచ్చిన భర్త.. తనతో వచ్చేయాలని కోరగా ఆమె తిరస్కరించింది. దీంతో పోట్లాటకు దిగాడు. కోపంలో నవీన్ భార్యను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన నేత్రాను కుటుంబీకులు చిక్కమగళూరు ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలను తాళలేక నేత్ర సోమవారం మరణించింది. నేత్ర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితున్ని అరెస్టు చేశారు. ఈవీ స్కూటర్ విస్ఫోటం యశవంతపుర: చార్జింగ్ చేస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్ బ్యాటరీ పేలి కాలిపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. బసవేశ్వరనగర శివనహళ్లి ఫస్ట్ క్రాస్ వద్ద భవనం బేస్మెంట్లో ముకేష్ అనే వ్యక్తి ఈవీ స్కూటర్కు చార్జింగ్ పెట్టాడు. ఈ సమయంలో బ్యాటరీ పేలిపోయి వాహనం మండిపోయింది. దట్టమైన పొగ కమ్ముకుపోయింది. స్థానికులు అందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎక్కువ సేపు చార్జింగ్, అధిక వేడి వల్ల ఇలా జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్వారీలో అనుమానాస్పద మృతి దొడ్డబళ్లాపురం: స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లిన యువకుడు నీట మునిగి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. బెంగళూరు మాదనాయకనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. కామాక్షిపాళ్యం నివాసి పృథ్విక్ (17), రాజాజీనగరలోని ప్రైవేటు కాలేజీలో ఫస్ట్ పీయూసీ చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి మాదనాయకనహళ్లి పరిధిలోని బోళారె క్వారీకి వెళ్లాడు, అక్కడ క్వారీ నీటిగుంతలో ఈత కొట్టాలని దిగాడు. కానీ ఆ నీటికుంటలో శవమై తేలాడు. స్నేహితులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే స్నేహితులే అతడ్ని హత్య చేశారని బాలుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బీఎంటీసీలో ఖాకీలకు ఉచితంబనశంకరి: బెంగళూరు సిటీ పోలీసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. యూనిఫాంలో ఉన్నా, లేకున్నా.. ఐడీ కార్డును చూపించి బీఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం పోలీసుశాఖ, బీఎంటీసీ ఎండీకి లేఖ రాసింది. దీంతో బీఎంటీసీ అధికారులు కండక్టర్లు, డ్రైవర్లను ఈ మేరకు సమాచారం తెలిపారు. ఇప్పటివరకు యూనిఫాంలో లేని పోలీసులకు ఉచిత ప్రయాణం ఉండేది కాదు. లంచగొండి పీడీఓ మండ్య: ఫౌతి ఖాతాను చేయడానికి లంచం డిమాండు చేసి తీసుకుంటున్న పీడీఓ లోకాయుక్త అధికారులకు పట్టుబట్టాడు. జిల్లాలోని మద్దూరు తాలూకాలోని తగ్గహళ్లి గ్రామపంచాయతీలో పీడీఓ సచిన్, బాధితుడు శివలింగయ్యకు ఖాతా చేయడానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. సోమవారం ఆఫీసులో అతని నుంచి రూ. 5 వేలు తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు సచిన్ను అరెస్టు చేశారు. -
పంట నష్టపరిహారం కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పొలంలో వేసుకున్న పంటలకు నష్టం వాటిల్లడంతో పరిహారంతో పాటు మద్దతు ధరలు ప్రకటించాలని ఒత్తిడి చేస్తూ కలబుర్గి జిల్లా బంద్ చేపట్టారు. సోమవారం అఖిల భారత రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లనగౌడ మాట్లాడారు. అతివృష్టితో కలబుర్గి, బీదర్, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో భారీ నష్టం సంభవించిందన్నారు. బస్సుల రాకపోకలు కూడా స్తంభించాయన్నారు. కేంద్ర బస్టాండ్ వద్ద బస్సులను నిలిపి ఆందోళన చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ను పాటించారు. రామ మందిర్, ఖర్గే సర్కిల్, ఆళంద చెక్పోస్టుల వద్ద రైతులు గుమిగూడి బంద్ నిర్వహించారు. పత్తికి క్వింటాల్కు రూ.10 వేలు మద్దతు ధర కేటాయించాలన్నారు. వర్షాలకు నష్టపోయిన పత్తి పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసి జిల్లాధికారిణి ఫౌజియా తరన్నం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాయచూరు జిల్లాధికారి కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు బసవలింగప్ప ఆందోళన చేపట్టారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో కలబుర్గి బంద్ శాంతిభద్రతల రక్షణకు గట్టి పోలీస్ బందోబస్తు -
మరుగుదొడ్ల నిర్మాణం తగదు
రాయచూరు రూరల్: నగరంలోని బాపనయ్యదొడ్డిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం తగదని అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ పేర్కొంది. సోమవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రమేష్ కులకర్ణి మాట్లాడారు. నగరసభ నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ పథకం నుంచి నిర్మాణం చేపట్టిన పనులను విరమించుకోవాలన్నారు. బాపనయ్యదొడ్డి చుట్టు పక్కల చాలా ఆలయాలున్నాయని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాటి నిర్మాణ పనులను నిలిపి వేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఓట్ల చోరీపై విచారణ చేపట్టాలి రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓట్ల చౌర్యంపై జుడీషియల్ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేిసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఏఐసీసీ కార్యదర్శి గోపీనాథ్ పళనియార్ మాట్లాడారు. బెంగళూరు లోక్సభ పరిధిలో 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అందులో 11 వేలు నకిలీ ఓట్లు, 40 వేల ఓట్లు అనుమానంతో కూడిన చిరునామాలు ఉన్నట్లు తేలడంతో 4 వేల ఓట్లు సస్పెండ్లో ఉంచారని, దానిపై జుడీషియల్ విచారణ చేపట్టాలని కోరుతూ ఆందోళన జరిపారు. ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, ఆర్టీఏ అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ శరణప్ప, పామయ్య, అమరేగౌడ, శ్రీనివాస్, శశికళ, వందన, జ్యోతి, శాంతప్ప, అస్లాం పాషా, రజాక్ ఉస్తాద్లున్నారు. యథేచ్ఛగా సర్కారు భూముల కబ్జా రాయచూరు రూరల్: రాయచూరు అటవీ శాఖలో విధులు నిర్వహించే అధికారులే అటవీ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి కుటుంబ సభ్యులకు కేటాయించారని సార్వజనిక హితరక్షణ పోరాట సమితి ఆరోపించింది. సోమవారం అటవీ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. సర్వే నంబర్–1257లో విచారణ జరిపి నిందితులపై చర్యలు చేపట్టాలన్నారు. అక్రమంగా నివాసం ఉన్న అధికారులను ఖాళీ చేయించాలని కోరుతూ అటవీ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. రోడ్డు నిర్మాణ నిధుల స్వాహా రాయచూరు రూరల్: దేవదుర్గ తాలూకా మలదకల్లో రోడ్డు నిర్మాణానికి కేటాయించిన రూ.కోటి నిధులను అధికారులు, ఇంజినీర్లు స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలను నాసిరకమైన సిమెంట్తో చేశారన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు ఏకమై నిధులు దిగమింగారని, వారిపై చర్యలు చేపట్టాలన్నారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయడానికి వచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని, జెడ్పీ సీఈఓ ఈ విషయంలో విచారణ జరిపి నిధులు స్వాహా చేసిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు. సామాజిక బాధ్యత అవసరం హుబ్లీ: విద్యార్థులు సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని రామదుర్గలోని కాయక సంజీవని ఫౌండేషన్ నాగమ్మ కులగోడ ప్యారా మెడికల్ కళాశాల, కాయక సంజీవిని నర్సింగ్ కళాశాల, బసవ ఫార్మసీ కళాశాల తొలి ఏడాది విద్యార్థులకు స్వాగత కార్యక్రమం, ఫైనలియర్ విద్యార్థులకు వీడ్కోలు వేడుక అప్యాయతల మధ్య నెరవేర్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ బరోడా స్థానిక శాఖ మేనేజర్ హనుమంతరాయ బిరాదార్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర అభ్యాసంతో పాటు సామాజిక బాధ్యత రాయబారులుగా పర్యావరణ సంరక్షణ, స్వచ్ఛత, సేవ గురించిన ఆశక్తిని పెంపొందించుకుంటే సమాజం, దేశం ఆస్తులవుతారన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గల పౌరులుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ సుధీర్ వై.కులగోడ, పాలక మండలి డైరెక్టర్లు బీఎల్ దొడ్డమని, పీఎం కణవి, ప్రొఫెసర్ సిద్దణ్ణ పాల్గొన్నారు. -
సంఘ్ మీద సర్కారు కయ్యం
సాక్షి, బెంగళూరు/ శివాజీనగర: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, తదితర ప్రభుత్వ స్థలాల్లో స్వయంసేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖ మీద బీజేపీ భగ్గుమంటోంది. ఈ లేఖను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సిద్ధరామయ్య ఆదేశించడంతో వివాదం మరింత రాజుకుంది. నిషేధానికి అవకాశం ఉందా దేశ వ్యతిరేక, ఇతర ప్రమాదకర కార్యకలాపాలకు ఏ సంఘం అయినా పాల్పడితే దానిని నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిషేధం కోసం ఆధారాలతో కేంద్రానికి సిఫార్సు చేయవచ్చు. బీజేపీ కోర్ కమిటీ భేటీ మంత్రి ప్రియాంక ఖర్గే లేఖ, పరిణామాల గురించి బీజేపీ కోర్ కమిటీ నాయకులు భేటీ అయ్యారు. ముగ్గురు సభ్యులతో ఓ పరిశీలన కమిటీని నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకునే చర్యలను ఈ కమిటీ గమనిస్తూ ఉంటుందని నేతలు తెలిపారు. బ్యాన్ చేయాలనలేదు: ఖర్గే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని నేను చెప్పలేదు. బహిరంగ స్థలాల్లో ఆయుధాలు పట్టుకుని కార్యకలాపాలు చేయరాదని మాత్రమే సూచించానని మంత్రి ప్రియాంక ఖర్గే సోమవారం బెంగళూరులో చెప్పారు. తన లేఖ మీద వివాదం రేగడంపై స్పందించారు. బీజేపీ నాయకులు ఎందుకు వారి పిల్లలు, మనవళ్లకు గణేశ వేషం వేయించి చేతిలో కట్టె పట్టించడం లేదు? పేదల పిల్లలనే ఆర్ఎస్ఎస్ ప్రదర్శనల్లో వేషాలు వేయిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పాఠశాలలో కవాతు కలబుర్గి జిల్లాలో అఫజలపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.వై.పాటిల్కు చెందిన ఎయిడెడ్ పాఠశాలలో ఆదివారం ఆర్ఎస్ఎస్ పథ సంచలనం జరిగింది. వందలాదిమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత జిల్లాలో ఇలా జరగడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. మంత్రి ఖర్గే లేఖపై సీఎం పరిశీలన! -
ఉద్యోగ ఖాళీల భర్తీకి డిమాండ్
● రాయచూరులో కదం తొక్కిన విద్యార్థులు, ఉద్యోగార్థులు రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని ఒత్తిడి చేస్తూ ఉద్యోగార్థులల పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు కదం తొక్కారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో రాష్ట్ర కార్యదర్శి చెన్న బసవ మాట్లాడారు. నిరుద్యోగులకు వయస్సు మీరుతున్న తరుణంలో రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పక్కన బెట్టడం తగదన్నారు. ఏడాదికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగులను నియమించుకొని ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని తప్పుబట్టారు. కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు రాయచూరు రూరల్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా జరుగుతున్న కుల గణన సర్వేలో కురుబలు ఎస్టీలుగా నమోదు చేసుకోవడం తగదని కల్యాణ కర్ణాటక అఖిలాండ శ్రీమహర్షి వాల్మీకి నాయక్ సమితి అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల నాయక్ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ పథకాలు లభించవన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇతర కులాల వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం తగదన్నారు. కొంత మంది కురుబలను కాడు కురుబ, గొండ అంటూ ఎస్టీలుగా నమోదు చేసుకున్న వారి పేర్లను తొలగించాలన్నారు. నిరసన ర్యాలీ బళ్లారి అర్బన్: సుప్రీం చీఫ్ జస్టిస్ జస్టిస్ బీఆర్ గవాయిపై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటు విసిరి అవమానించాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్ కోరారు. స్థానిక డీసీ కార్యాలయం ఎదుట ప్రగతిపర దళితపర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన ర్యాలీలో నిర్వహించారు. గోవర్ధన్, బీకే.బసప్ప, కల్లుకంబ పంపాపతి, జగన్, కొళగల్ ఎర్రిస్వామి, సన్న నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. టమాటాల పారబోత హొసపేటె: తాము పండించిన టమాటాలకు సరైన ధర లభించక పోవడంతో కలత చెందిన రైతులు కూడ్లిగి తాలూకాలోని డ్రెయిన్లో టమాటాలను పారబోశారు. ఆదివారం కూడ్లిగి తాలూకాలో సహా వివిధ ప్రాంతాల్లో టమాటాల ధరలు పడిపోవడం చూసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని ట్రాక్టర్లలో రోడ్డు పైకి తీసుకువచ్చి, డ్రెయిన్లో వేస్తున్నారు. తాలూకాలోని హుడెం సహా వివిధ గ్రామాల్లో పండించిన టమాటాలు సరైన ధర లభించకపోవడంతో ఎవరూ రూ.100 నుంచి రూ.200కి టమాటా బాక్స్ అడగడం లేదు. విజయనగర జిల్లాలో మొత్తం 2,248 హెక్టార్ల విస్తీర్ణంలో టమాటా పండిస్తున్నారు. కనీసం ఇప్పటికై నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రైతులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఇద్దరు యువకుల దారుణ హత్య
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్ : విజయపుర జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం విజయపుర జిల్లా కన్నూరు గ్రామంలో సాగర్ బెళుండగి(25), ఇషాక్ ఖురేషి(24) అనే ఇద్దరు యువకులను బండరాళ్లతో తలపై బాది దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ప్రస్తుతం హత్యకు గురైన ఇద్దరు యువకులు రెండేళ్ల క్రితం ఈరనగౌడ అనే వ్యక్తిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఈరనగౌడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో పాతకక్షలతో సాగర్, ఖురేషి అనే యువకులు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే విజయపుర గ్రామీణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించారు. విజయపుర జిల్లాలో వెలుగు చూసిన ఘటన పాత కక్షలతోనే హత్యలుగా పోలీసుల అనుమానం -
ధైర్యశాలి వీర మదకరి నాయక
సాక్షి,బళ్లారి: చిత్రదుర్గకు చెందిన వీర మదకరి నాయక మహా ధైర్యశాలి అని, పోరాటం, యుద్ధంతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడని వాల్మీకి రాష్ట్ర ఐక్య కూటమి అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు. సోమవారం వీరమదకరి నాయక జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మదకరి నాయక చిత్రపటానికి పూజలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్మీకి సోదరులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక వ్యక్తి కాదు, ఆయన మహా శక్తి రాజవీర మదకరి నాయక ఒక వ్యక్తి కాదు, ఆయన మహా శక్తి అని, పులితో సైతం తలపడి పోరాడ గలిగిన ధైర్యవంతుడని కొనియాడారు. చిత్రదుర్గ కోట వాల్మీకి నాయకుల స్వాధీనంలోకి వచ్చిన తర్వాత వీరమదకరి నాయక ఎంతో ధైర్యంతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడన్నారు. కోటలో తన సైనికులకు పరివారానికి 12 సంవత్సరాల వరకు ఆహారం అందించేందుకు అప్పట్లోనే ఏర్పాట్లు చేసుకున్నారని గుర్తు చేశారు. యుద్ధంలో వీరమదకరి నాయకను ఓడించలేమని తెలుసుకున్న శత్రువులు విషం పెట్టి చంపినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయన్నారు. వాల్మీకులకు గర్వకారణం అలాంటి వాల్మీకి కులంలో పుట్టినందుకు వాల్మీకులు గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన అడుగు జాడల్లో మనమందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్న నేపఽథ్యంలో పార్టీలకు అతీతంగా వాల్మీకులు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వాల్మీకి సంఘం నాయకులు మెడికల్ షాపు మల్లికార్జున, జయరాం, రూపనగుడి గోవిందు, హొన్నూరప్ప, తుకారాం, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. అఖండ కర్ణాటక వాల్మీకి ఐక్యకూటమి రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మప్ప -
వ్యసనముక్త సమాజాన్ని నిర్మిద్దాం
చెళ్లకెరె రూరల్ : వ్యసనముక్త సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని డీఎస్పీ సత్యనారాయణరావ్ తెలిపారు. నగరంలోని డి.సుధాకర్ క్రీడా మైదానంలో నిర్వహించిన సధృడ కర్ణాటక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. నేడు పిల్లలు చిన్న వయస్సులోనే దురలవాట్లకు బానిస అవుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి దురలవాట్లకు పిల్లలు బానిసలు కాకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యువకులు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లను అలవాటు చేసుకోరాదన్నారు. యువకులు ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్య, క్రీడలు, యోగా వంటి ఉత్తమ అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. చిన్న వయస్సులోనే ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ కె.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నగరాభివృద్ధికి ఐక్యంగా శ్రమిద్దాం
బళ్లారిటౌన్: నగర సర్వతోముఖ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమించాలని ఎంపీ తుకారాం పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా పంచాయతీ సభాంగణంలో ఏర్పాటు చేసిన దిశ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అందుబాటులో ఉన్నందున అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలన్నారు. అధికారులు రాజ్యాంగ ఆశయాలతో పాటు మానవతా దృష్టితో పని చేయాలన్నారు. దొంగ ఏజెన్సీలకు త్వరలో బ్రేక్ వరి పంటను అనధికారికంగా ఖరీదు చేసి మోసాలు చేస్తున్న దొంగ ఏజెన్సీలకు త్వరలో చెక్ పెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులను నమ్మించి మొబైల్ యాప్ ద్వారా వరిని ఖరీదు చేస్తున్నట్లు నటించి మోసాలు చేస్తున్నట్లు వెలుగు చూస్తున్నందున అధికారులు కూడా అప్రమత్తం కావాలన్నారు. సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ మాట్లాడుతూ సండూరు భాగంలో ఓ రైతు ఏ పంట వేశారంటే అందరూ కూడా అదే పంటను వేస్తున్నారన్నారు. దీని వల్ల అసమతుల్యత చెంది పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా యూరియా ఎక్కువగా వాడటం వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరించాలన్నారు. సేంద్రీయ ఎరువులు, మందులు వాడేలా సూచించాలన్నారు. అఖండ జిల్లాకు 24 పోస్టల్ కార్యాలయాలు అఖండ జిల్లాలో తన అవధిలో బళ్లారి, విజయనగర జిల్లాల్లో 24 నూతన తపాల కార్యాలయాలు మంజూరు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. దీని వల్ల పోస్టల్ సదుపాయాలు మరింత వేగవంతం అవుతాయన్నారు. అదే విధంగా బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత చురుగ్గా చేపట్టేలా నూతన కేబుల్ లైన్ల పనులు చేపడుతున్నట్లు వివరించారు. అంతకు ముందు నగరంలోని రైల్వే స్టేషన్లో ఎన్ఆర్ఎల్ఎం సంజీవిని స్వసహాయ సంఘాల ఉత్పత్తి మార్కెట్ను ప్రారంభించారు. అనంతరం జిల్లా పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజల నుంచి విన్నపాలను స్వీకరించారు. ఎమ్మెల్సీ వైఎం సతీష్, పాలికె మేయర్ ముల్లంగి నందీష్, జిల్లా గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు చిదానందప్ప, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్ హ్యారీష్ సుమేర, ఎస్పీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. బళ్లారి లోక్సభ సభ్యుడు తుకారాం అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపు -
వంతెనల పనులకు మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదనే సామెత చందంగా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో రూ.38 కోట్లతో చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రాయచూరు తాలూకా ఆత్కూరు–కురువపుర మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మాణాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. నది మధ్యలో 24 సిమెంట్ స్తంభాలతో దిమ్మెలను నిర్మించారు. కురువపుర నారద గడ్డ దత్తాత్రేయ స్వామి దర్శనార్థం వెళ్లడానికి సుగమమైన మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2011లో 675 మీటర్ల పొడవు వంతెన నిర్మాణానికి రూ.14.25 కోట్లతో శ్రీకారం చుట్టింది. 2022 నాటికి దాని వ్యయం రూ.22 కోట్లకు చేరుకుంది. కురువపుర నారదగడ్డ దత్తాత్రేయుడి దర్శనార్థం నేడు ట్రాక్టర్ల ద్వారా వెళుతున్నారు. వర్షాకాలంలో నాటు పడవల్లో ప్రయాణం చేయాల్సి ఉంది. నదిలో నీరు లేకపోతే నడుచుకుంటూ కూడా వెళుతుంటారు. ఎమ్మెల్యే సోదరులకే కాంట్రాక్ట్.! అర్ధంతరంగా ఆగిన వంతెన నిర్మాణ పనుల కాంట్రాక్ట్ను శాసన సభ్యుడి సోదరులు పొందారు. శాసన సభ్యుడికి భయపడి అధికారులు ఆగిన వంతెన నిర్మాణ పనులపై మూడేళ్ల నుంచి నోరు మెదపక పోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. రాయచూరు తాలూకా దొంగరాంపుర వద్ద కృష్ణానదికి అడ్డంగా 2008లో రూ.7 కోట్లతో దొంగ రాంపుర– కుర్వకుర్ద మధ్య 285 మీటర్ల పొడవు వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టినా ఫలితం లేకపోయింది. టెండర్ ప్రకటనలో నిర్లక్ష్యంతో దాని వ్యయం నేడు రూ.14 కోట్ల మేర పెరిగింది. మొత్తం రూ. రూ.21 కోట్లతో పనులు చేయడానికి కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయక పోవడంతో రెండు వంతెనల పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. రూ.38 కోట్ల వ్యయంతో చేపట్టిన వైనం 14 సంవత్సరాలుగా పూర్తి కాని నిర్మాణం -
సమస్యలు గాలికొదిలి ఓట్ల చోరీ డ్రామా
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రజలు పలు సమస్యలతో నలిగి పోతోంటే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా దొంగ ఓట్ల చోరీ డ్రామా నడిపారని ఆందోళ సిద్దలింగ స్వామి ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అధికార పార్టీ నాయకులపై మండిపడ్డారు. గత నెలలో కురిసిన వానలకు పంటలు, రహదారులు, వంతెనలు భారీ నష్టం సంభవించిందన్నారు. వారికి పరిహారం అందించకుండా ముఖ్యమంత్రి ఆకాశ పర్యటన చేసి రూ.25 వేల కోట్లు పరిహారం ప్రకటించినా కనీసం రూ.25 వేలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో నాయకులకు వ్యతిరేకంగా ప్రియాంక్ ఖర్గే హైడ్రామా నాయకుడన్నారు. ఆర్ఎస్ఎస్ నిషేధం కోసం సీఎంకు లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ఉగ్రవాదుల గురించి మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఇండియన్ ముజాహిద్దీన్, లష్కర్ ఏ తోయిబాలను నిషేధించాలని ఖర్గేకు సవాల్ విసిరారు. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ కూడా పోటీ చేస్తుందన్నారు. మంజునాథ్ బోవి, రాజా రామచంద్రగౌడ, చెన్నప్పగౌడ, రామనగౌడ, వినయ్ సింగ్, హన్మంతు, వినోద్ కుమార్లున్నారు. -
మొబైల్ యాప్లలో ట్రాఫిక్
బనశంకరి: సిలికాన్ సిటీలో ట్రాఫిక్ సిగ్నల్ గురించి వాహనదారులకు కచ్చితమైన సమయం లైవ్ అందించడానికి పలు యాప్లు సమాచారం అందిస్తున్నాయి. రాబోయే జంక్షన్లో ఎంత వాహన రద్దీ ఉందనేది యాప్లో చూసి తెలుసుకోవచ్చు. రియల్ టైమ్లో నగర ట్రాఫిక్ సమాచారం లభ్యమవుతుందని వినియోగదారులు తెలిపారు. ఎలా పనిచేస్తుందంటే... బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీస్, ఇతరత్రా విభాగాల ద్వారా అనుసంధానమైన ప్రధాన రహదారులు, కూడళ్లలోని ట్రాఫిక్ రద్దీని అనుక్షణం ఈ యాప్లు సేకరిస్తూ ఉండేలా సాఫ్ట్వేర్ ను రూపొందించారు. వాహనదారులు తమ ముందు ఉన్న సిగ్నల్ మారడానికి ఎంత సమయం ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. బెంగళూరులో 169 జంక్షన్లలో రద్దీని అనుక్షణం గమనించే సాంకేతికతను అమర్చారు. తద్వారా వాహనదారులు మొబైల్ఫోన్లో వీక్షించవచ్చునని ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారి తెలిపారు. బెంగళూరులో అందుబాటులోకి -
నాన్నా.. నువ్వు లేని లోకం వద్దు
గౌరిబిదనూరు: తండ్రి లేని లోకంలో ఉండలేనంటూ ఓ కూతురు తనువు చాలించింది. వివరాలు.. నగరానికి సమీపంలో ఉన్న నాగయ్యరెడ్డి కాలనీలో నివాసముంటున్న స్వర్ణ (22) బెంగళూరులోని మహారాణి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. పలు సమస్యల వల్ల ఆమె తండ్రి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వర్ణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనను తలచుకుంటూ బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం బెంగళూరులోని హాస్టల్లో పురుగుల మందును తాగి, ఇంటికి వచ్చింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికాగా తల్లి ఈమెను చిక్కబళ్ళాపురం ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ మరణించింది. కొన్నినెలల్లోనే భర్త, కుమార్తె దూరం కావడంతో తల్లి హృదయ విదారకంగా విలపించింది. బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కేసు దాఖలు చేసుకొని దర్యాప్తు చేబట్టారు. మరో యువతి... మైసూరు: జీవితంపైన విరక్తి కలిగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల పట్టణం మంజునాథ్ నగరలో జరిగింది. యువతి రక్షిత (19) మృతురాలు. ఆమె తండ్రి బెంగళూరులో పని చేస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న యువతి అవ్వ తాత వద్ద ఉంటోంది. బీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. కులగణనలో టీచర్కు గుండెపోటు బనశంకరి: బెంగళూరులో కులగణనలో ఉపాధ్యాయురాలు గుండెపోటుకు గురైంది. ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో ఆదివారం యశోద అనే టీచర్ కులగణన సర్వేలో ఉండగా గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే కొందరు సమీప హెల్త్సిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి స్టంట్ను అమర్చారు. యశోద బొమ్మసంద్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తోంది. -
కాబోయే వరుని గొంతెమ్మ కోర్కెలు
మైసూరు: కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం అనేది అందరికీ తెలిసిందే. కానీ సమాజంలో కట్నవ్యవస్థ పాతుకుపోయింది. కూలీల నుంచి కుబేరుల వరకు వధువుల తల్లిదండ్రులు కట్నకానుకలను ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే పెళ్లి క్యాన్సిల్ అనే మాట వినిపిస్తుంది. అలాంటి సంఘటనే కళా సాంస్కృతిక నగరం మైసూరులో చోటుచేసుకుంది. మరో రూ.25 లక్షలు, కారు కోసం పట్టు.. అడిగినంత కట్నం ఇవ్వలేదని కాబోయే వరుడు, అతని కుటుంబసభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో వ్యవహారం పోలీసు స్టేషన్కు చేరింది. వివరాలు... నగరంలోని గంగోత్రి లేఔట్లో మమతాదేవి కుమార్తె డాక్టర్.నీతు కు కుర్గళ్ళికి చెందిన తేజస్తో ఆగస్టు ఆఖరిలో ఘనంగా నిశ్చితార్థం చేసింది. వరునికి 150 గ్రాముల బంగారం, ఒక వజ్రాల ఉంగరం, రూ. 10 లక్షల నగదును అందజేశారు. వారు కోరినట్లుగానే కోటె హుండి గ్రామంలోని ఓ విలాసవంత హోం స్టేలో నిశ్చితార్థాన్ని జరిపించారు. అలాగే సా.రా కన్వెన్షన్ హాల్ళో పెళ్ళి జరిపించాలని షరతు పెట్టగా వధువు కుటుంబీకుల అంగీకరించారు. రూ. 1.50 లక్షల అడ్వాన్స్ కట్టి హాల్ని బుక్ చేసుకుని, పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో తేజస్, తల్లిదండ్రులకు మరింత దురాశ పుట్టింది. మరో రూ.25 లక్షల నగదు ఇవ్వాలని, రూ. 20 లక్షల కారును కొనివ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరారు. దీంతో వధువు తల్లి, కుటుంబీకులు విసిగిపోయారు. ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇంక ఇవ్వలేదని తెలిపారు. వరుడు, తల్లిదండ్రులు భగ్గుమన్నారు, కారు కొనివ్వలేనివారు ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు, ఈ పెళ్లి మాకు వద్దని చెప్పేశారు. వధువు కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వారు అంగీకరించలేదు. దీంతో న్యాయం చేయాలని సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు తేజస్, అతని తల్లిదండ్రులు నాగరత్న, మహాదేవ, కుటుంబీకులు శశికుమార్, సుమపై కేసు పెట్టారు. తీర్చలేదని.. పెళ్లి రద్దు పోలీసులకు వధువు కుటుంబం ఫిర్యాదు -
ఆర్ఎస్ఎస్ను నిషేధించరూ..!
కలబురిగి నగరంలో సంఘ్ సేవకుల పథసంచలనం ఆదివారం రాష్ట్రమంతటా ఆర్ఎస్ఎస్ సంబరాలు, బెంగళూరులో బాలల వేషధారణ శివాజీనగర: ప్రభుత్వ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ సభలు, సమావేశాలను నిషేధించాలంటూ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, ఐటీ బీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే, తమ ప్రభుత్వానికి లేఖ రాశారు. తన డిమాండును తక్షణమే పరిశీలించాలని సీఎం సిద్దరామయ్యను కోరారు. ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ మైదానాలలో కార్యక్రమాలు చేస్తూ పిల్లలు, యువత మనస్సులో విద్వేషాన్ని నింపుతోందని ఆరోపించారు. ఆయుధాల ప్రదర్శన జరుపుతోంది, కాబట్టి ప్రభుత్వ స్థలాల్లో ఆ శాఖ కార్యక్రమాలను నిషేధం విధించాలి అని కోరారు. సంఘ్ వందేళ్ల ఉత్సవాలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న సమయంలో ఈ లేఖ రాయడం విశేషం. కాంగ్రెస్ చేత కాదు: విజయేంద్ర బాధ్యతాయుత స్థానంలో ఉన్న ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ను నిషేధించాలనడం మూర్ఖత్వమని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర మండిపడ్డారు. ఆదివారం నగరంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం జగన్నాథ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అంటే తెలియనివారు, సొంత ప్రచారం కోరేవారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ని నిషేధించింది. మళ్లీ నిషేధాన్ని ఉపసంహరించుకొందని ఆయన చెప్పారు. మరోసారి ఆర్ఎస్ఎస్ ను నిషేధించే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసినట్లు కనిపిస్తోంది. సోనియాగాంధీ కుటుంబాన్ని మెప్పించే దిశలో ఈ లేఖ రాసినట్లు ఉందని హేళన చేశారు. ఖర్గే సొంత జిల్లా కల్బుర్గి అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, హత్యలు, ఇసుక మాఫియా అధికమైంది, ఆ సంగతి చూడాలన్నారు. ఆర్ఎస్ఎస్ శ తమానోత్సవం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతమానోత్సవాల సందర్భంగా బెంగళూరులోని వివిధ చోట్ల ఆదివారం కార్యకర్తలు పథసంచలనం జరిపారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. సదా వత్సలే గీతాన్ని ఆలపిస్తూ బ్యాండు వాయిద్యాలతో కవాతు సాగింది. ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి వీక్షించారు. రాష్ట్ర సర్కారుకు మంత్రి ఖర్గే లేఖ మూర్ఖత్వమన్న బీజేపీ నేతలు -
నన్ను పిలవరా.. అతన్ని పంపించేయండి
బనశంకరి: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు నడిగే పేరుతో ఉద్యానవనాల్లో ప్రజలతో సమావేశాలను నిర్వహిస్తుండడం తెలిసిందే. ఆదివారం మత్తికెరె జేపీ పార్కులో భేటీలో రభస జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మునిరత్న తనను పిలవలేదని బైఠాయించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త దుస్తుల్లో ఎమ్మెల్యే నిరసనకు దిగారు. ఆయనను చూసి డీకే.శివకుమార్ , ఏ నల్ల టోపీ ఎమ్మెల్యే రండి అంటూ హాస్యధోరణిలో వేదికపైకి ఆహ్వానించారు. మునిరత్న వేదికపైకి వెళ్లి బలవంతంగా మైక్ తీసుకుని ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఆక్రోశించారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్తలు మునిరత్నను చుట్టుముట్టి ఇక్కడ గూండాగిరి చేయడానికి వచ్చారా, వేదిక దిగి వెళ్లిపోండి అని గద్దించారు. రేపిస్ట్, రేపిస్ట్ అని నినాదాలు చేశారు. గొడవ ముదరకుండా పోలీసులు మునిరత్న చుట్టూ నిలిచారు. కొంతసేపు గందరగోళం నెలకొంది. అతడిని ఇక్కడి నుంచి పంపించండి అని డీకే శివకుమార్ ఆదేశించారు. దీంతో పోలీసులు మునిరత్నను వేదిక పై నుంచి కొద్దిదూరం తీసుకెళ్లారు. తనపై వెనుక నుంచి ఎవరో దాడి చేశారని, టోపీని లాగేశారని మునిరత్న ఆరోపించారు. తనను కొట్టడానికి చెన్నపట్టణ, రామనగర, కనకపుర నుంచి అల్లరిమూకలను పిలిపించారని ఆరోపించారు. ఎమ్మెల్యేను పంపించాక చర్చాగోష్టి కొనసాగింది. పార్కు భేటీలో డీసీఎం వర్సెస్ ఎమ్మెల్యే -
ఛాయాచిత్ర సంబరం
బనశంకరి: సిలికాన్ సిటీలో చిత్రకళా పరిషత్లో వైపీఎస్ ఇంటర్నేషనల్ సలాన్– 2025 ఛాయాచిత్ర ప్రదర్శనకు కళాప్రియులను ఆకట్టుకుంటోంది. నగరవాసులు పెద్దఎత్తున విచ్చేసి అపురూపమైన ఛాయాచిత్రాలను వీక్షించారు. ఆదివారం కావడంతో నగరవాసులు పెద్దసంఖ్యలో వచ్చారు. మురిపించే చిత్రాలను మొబైల్, కెమెరాలో బంధిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా ఉత్తమ ఛాయాచిత్రాలు తీసిన ఫోటోగ్రాఫర్లకు సలాన్ నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైపీఎస్ ముఖ్యులు మంజువికాస్శాస్త్రి, గిరీశ్ అనంతమూర్తి, ప్రేమకాకడే, అనితా మైసూరు పాల్గొన్నారు. మురిపిస్తున్న సలాన్ -
ఇళ్ల మీద పడిన క్రేన్.. 5మందికి గాయాలు
కృష్ణరాజపురం: బెంగళూరులోని ఆవులహళ్లి ఠాణా పరిధిలోని మేడహళ్ళిలో పెద్ద క్రేన్ విరిగిపడిన ప్రమాదంలో ఐదుమంది గాయపడ్డారు. వివరాలు.. ఓ ప్రైవేటు స్కూలు పక్కన ఉన్న టవర్ను మరమ్మతు చేయాలని పెద్ద క్రేన్తో పనులు చేస్తున్నారు. ఆదివారం ఉదయం పని చేస్తుండగా క్రేన్ విరిగి పక్కనే ఉన్న అద్దె ఇళ్ల మీద పడింది. వాటిలో ఉంటున్న లాలు (30), ఖురతాబాను (19), ఇలియాజ్ (38), షమీమ్ (28) శమ్దేవ్ (52) అనేవారు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులు భట్టరహళ్ళి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలిని ఏసీపీ రీనా సువర్ణ పరిశీలించి కేసు నమోదు చేశారు. మైసూరులో రాత్రివేళ పోలీసుల సోదాలు మైసూరు: సాంస్కృతిక నగరం మైసూరులో హత్యలు, బాలిక పై అత్యాచారం, హత్య తదితర ఘోరాలతో ప్రజల్లో కలవరం నెలకొంది. పోలీసుల అలసత్వంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో ఈ రీతిలో నేరాలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం రాత్రి నగరంలో తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్లు, కేసుల్లో నిందితులకు హెచ్చరించారు. ప్రజల మీద దాడులకు దిగితే కఠినమైన చట్టాల కింద కేసులు తప్పవన్నారు. 405 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపి 204 మంది కోప్టా చట్టం కింద కేసులు నమోదు చేశారు. దొడ్డకెరె మైదానం, దసరా వస్తు ప్రదర్శన మైదానం, పార్కింగ్ స్థలాలు, జ్వాలాముఖి పార్కింగ్ స్థలం, బాలల ఉద్యానవనం, ఆర్ఎంసీ బస్టాండు తదితర ప్రాంతాల్లో నాకాబందీని జరిపారు. రాత్రివేళ బైకుల్లో త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారిని పట్టుకుని 54 కేసులు పెట్టారు. 33 మందిపై నో హెల్మెట్ కేసు నమోదు చేశారు. 59 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అడవిదున్న ముప్పుతిప్పలుయశవంతపుర: మలెనాడు ప్రాంతానికే పరిమితమైన అడవి దున్నల దాడులు హాసన్ జిల్లాకు కూడా వ్యాపించాయి. శనివారం చన్నరాయపట్టణంలో ఓ మహిళపై దాడి చేసిన అడవి దున్నను ఆదివారం అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇది మడికెరి నుంచి ఇటువైపు వచ్చినట్లు అనుమానాలున్నాయి. మార్గమధ్యలో చన్నరాయపట్టణ చుట్టుక్కల పంట పొలాలను నాశనం చేసింది. పలు కాలనీలలో తిరుగుతూ జనతాహౌస్లో చెట్ల పొదల్లోకి వెళ్లింది. అటవీ అధికారులు మత్తుమందు తూటాతో కొట్టాలని ప్రయత్నించారు. మూడుసార్లు తప్పించుకొంది. చివరకు ఎలాగో మత్తు మందును ఇచ్చి దానిని బంధించి వాహనంలో తరలించారు. ఆఫ్ఘనిస్థాన్తో స్నేహమెందుకో? కోలారు: తాలిబాన్ ఉగ్రవాదులు పరిపాలిస్తున్న ఆఫ్ఘనిస్థాన్తో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్నేహం చేస్తోందో తెలియదని శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. ఆదివారం కోలారులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటివి ఉగ్రవాద దేశాలని, ఇలాంటి దేశాలతో సాన్నిహిత్యం భారతదేశానికి మంచిది కాదన్నారు. పహల్గాం దుర్ఘటనను హిందువులు, భారతీయులు ఎన్నటికీ మరువరాదన్నారు. -
కిడ్నాప్ చేసి చిత్రహింసలు
కర్ణాటక: డబ్బుతిరిగి ఇవ్వాలన్నందుకు చిత్రహింసలకు గురిచేశారు, ఈ ఘటన బెంగళూరు కోరమంగల ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. తండ్రికి కిడ్నీలు దెబ్బతిన్నాయి, వైద్యంచేయించాలని సగాయ్రాజ్ నుంచి అనందకుమార్, అతని కూతురు ఐశ్వర్య రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇంటిని విక్రయించి డబ్బు ఇస్తానని ఆనంద్కుమార్ చెప్పగా, తనకే అమ్మాలని సగాయ్రాజ్ కోరాడు. అగ్రిమెంట్ కు ముందు కోటి రూపాయలు ఇవ్వగా మిగిలిన డబ్బు తరువాత ఇస్తానని మాట్లాడుకున్నారు. డబ్బు తీసుకున్న ఆనందకుమార్ ఇంటిని రాసివ్వలేదు, డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదు. దీంతో డబ్బు ఇవ్వాలని సగాయ్రాజ్ ఒత్తిడి చేయసాగాడు. ఈ నేపథ్యంలో సగాయ్రాజ్ని తండ్రీ కూతురు, మరో వ్యక్తి ఆశీష్లు కలిసి కిడ్నాప్ చేశారు, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చేతులు కాళ్లుకట్టి వేసి మర్మాంగానికి సిగరేట్తో కాల్చి, ఇంజెక్షన్ వేసి చిత్రహింసలకు గురిచేశారు. అంతేగాక వీడియో తీసి బెదిరించారు. కారులో రాత్రంతా నగరంలో తిప్పి వేధించారు. ఉదయం సమయంలో సగాయ్రాజ్ కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేసి స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు. ఈ మేరకు కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కాబోయే వరుని గొంతెమ్మ కోర్కెలు
కర్ణాటక: కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం అనేది అందరికీ తెలిసిందే. కానీ సమాజంలో కట్నవ్యవస్థ పాతుకుపోయింది. కూలీల నుంచి కుబేరుల వరకు వధువుల తల్లిదండ్రులు కట్నకానుకలను ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే పెళ్లి క్యాన్సిల్ అనే మాట వినిపిస్తుంది. అలాంటి సంఘటనే కళా సాంస్కృతిక నగరం మైసూరులో చోటుచేసుకుంది. మరో రూ.25 లక్షలు, కారు కోసం పట్టు.. అడిగినంత కట్నం ఇవ్వలేదని కాబోయే వరుడు, అతని కుటుంబసభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో వ్యవహారం పోలీసు స్టేషన్కు చేరింది. వివరాలు... నగరంలోని గంగోత్రి లేఔట్లో మమతాదేవి కుమార్తె డాక్టర్.నీతు కు కుర్గళ్ళికి చెందిన తేజస్తో ఆగస్టు ఆఖరిలో ఘనంగా నిశ్చితార్థం చేసింది. వరునికి 150 గ్రాముల బంగారం, ఒక వజ్రాల ఉంగరం, రూ. 10 లక్షల నగదును అందజేశారు. వారు కోరినట్లుగానే కోటె హుండి గ్రామంలోని ఓ విలాసవంత హోం స్టేలో నిశి్చతార్థాన్ని జరిపించారు. అలాగే సా.రా కన్వెన్షన్ హాల్ళో పెళ్ళి జరిపించాలని షరతు పెట్టగా వధువు కుటుంబీకుల అంగీకరించారు. రూ. 1.50 లక్షల అడ్వాన్స్ కట్టి హాల్ని బుక్ చేసుకుని, పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో తేజస్, తల్లిదండ్రులకు మరింత దురాశ పుట్టింది. మరో రూ.25 లక్షల నగదు ఇవ్వాలని, రూ. 20 లక్షల కారును కొనివ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరారు. దీంతో వధువు తల్లి, కుటుంబీకులు విసిగిపోయారు. ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇంక ఇవ్వలేదని తెలిపారు. వరుడు, తల్లిదండ్రులు భగ్గుమన్నారు, కారు కొనివ్వలేనివారు ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు, ఈ పెళ్లి మాకు వద్దని చెప్పేశారు. వధువు కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వారు అంగీకరించలేదు. దీంతో న్యాయం చేయాలని సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు తేజస్, అతని తల్లిదండ్రులు నాగరత్న, మహాదేవ, కుటుంబీకులు శశికుమార్, సుమపై కేసు పెట్టారు. -
నాన్నా.. నువ్వు లేని లోకం వద్దు
కర్ణాటక: తండ్రి లేని లోకంలో ఉండలేనంటూ ఓ కూతురు తనువు చాలించింది. వివరాలు.. నగరానికి సమీపంలో ఉన్న నాగయ్యరెడ్డి కాలనీలో నివాసముంటున్న స్వర్ణ (22) బెంగళూరులోని మహారాణి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. పలు సమస్యల వల్ల ఆమె తండ్రి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వర్ణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనను తలచుకుంటూ బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం బెంగళూరులోని హాస్టల్లో పురుగుల మందును తాగి, ఇంటికి వచ్చింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికాగా తల్లి ఈమెను చిక్కబళ్ళాపురం ఆస్పత్రిలో చేరి్పంచగా అక్కడ మరణించింది. కొన్నినెలల్లోనే భర్త, కుమార్తె దూరం కావడంతో తల్లి హృదయ విదారకంగా విలపించింది. బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కేసు దాఖలు చేసుకొని దర్యాప్తు చేబట్టారు.మరో యువతి... మైసూరు: జీవితంపైన విరక్తి కలిగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల పట్టణం మంజునాథ్ నగరలో జరిగింది. యువతి రక్షిత (19) మృతురాలు. ఆమె తండ్రి బెంగళూరులో పని చేస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న యువతి అవ్వ తాత వద్ద ఉంటోంది. బీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.కులగణనలో టీచర్కు గుండెపోటు బనశంకరి: బెంగళూరులో కులగణనలో ఉపాధ్యాయురాలు గుండెపోటుకు గురైంది. ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో ఆదివారం యశోద అనే టీచర్ కులగణన సర్వేలో ఉండగా గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే కొందరు సమీప హెల్త్సిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి స్టంట్ను అమర్చారు. యశోద బొమ్మసంద్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తోంది. -
రాత్రంతా.. వణికించిన వాన
● రాజధానిలో కుండపోత శివాజీనగర: సిలికాన్ సిటీలో అర్ధరాత్రి వరకూ కురిసిన ఉరుములు, మెరుపుల వర్షంతో పలు ప్రాంతాలు జలావృతమై వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆరంభమైన కుండపోత వల్ల అనేకచోట్ల నీరు నిలిచింది. మాన్యతా టెక్ పార్కు, ఎలక్ట్రానిక్ సిటీ, మహాదేవపుర వద్ద రోడ్లలో నీరు నిలిచి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఎలక్ట్రానిక్ సిటీలో నీలాద్రి లేఔట్లో డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహించింది. ప్రజలు పాలికెకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ మార్కెట్లో నీరు నిలబడి పూల వ్యాపారులు అవస్థలు పడ్డారు. వర్షంలో తడిసి సరుకు పాడైంది. మరో మూడు రోజులు రాష్ట్రంలో 15 వరకు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒళనాడులో వానలు పడుతున్నాయి. బెంగళూరుతో సహా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించారు. -
నవంబరు.. జాతకం తారుమారు?
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పట్లో అనూహ్యంగా గెలిచి నాటకీయ పరిణామాల మధ్య సిద్దరామయ్య సీఎం అయ్యారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు అయిపోతున్నాయి. ఈ క్రమంలో కుర్చీ మార్పు ఉంటుందా, ఉండదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 2.5 ఫార్ములా ఫలించేనా? రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని, ఆ తర్వాత రెండున్నరేళ్లు డీకే శివకుమార్ కుర్చీ ఎక్కుతారని అప్పట్లో జోరుగా ఊహాగానాలు సాగాయి. నవంబర్ 19 నాటికి 2.5 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో సీఎం మార్పు ఉండబోతుందని మళ్లీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో పలువురు మంత్రులను సాగనంపి, కొత్తవారికి చాన్సిస్తారనే ప్రచారం మొదలైంది. మంత్రిమండలిలో మార్పులు ఉంటాయని సిద్దరామయ్య కూడా చెప్పారు. దీంతో నవంబర్ లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించనుందని చర్చ సాగుతోంది. సీఎం పదవి కోసం డిప్యూటీ సీఎం శివకుమార్, ఆయన మద్దతుదారులు ఆశాభావంతో ఉన్నారు. హైకమాండ్ నోరువిప్పడం లేదు. మంత్రివర్గ మార్పుల సందడి వచ్చే నెల మంత్రివర్గ మార్పు జరిగితే కొందరు కొత్త వారికి అవకాశం దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రిపదవి ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. కొందరు మంత్రులు పదవిని కాపాడుకోవడం కోసం కార్యాచరణకు దిగారు. నవంబర్ 20 లేదా 21న మంత్రివర్గ మార్పులకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. ఇలా ఒకవైపు మంత్రివర్గ పునర్వస్థీకరణ, సీఎం మార్పు వంటి అంశాలతో రాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్గా మారాయి. ముఖ్యమంత్రి మార్పు కోసం డీకే శివకుమార్ వర్గం గట్టిగా వాదిస్తుంటే, వారి వ్యూహాలను అడ్డుకునేందుకు సీఎం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అస్త్రాన్ని తీశారని సమాచారం. బిహార్ ఎన్నికలతో బిజీగా ఉన్న హస్తం హైకమాండ్ ఆ తర్వాత కన్నడనాడుపై దృష్టి సారించే అవకాశం ఉంది. పూర్తి కానున్న 2.5 ఏళ్ల పదవీకాలం పెను మార్పులపై డిప్యూటీ సీఎం వర్గం ఆశలు ధీమాగానే సీఎం సిద్దరామయ్య శిబిరం గుంభనంగా హైకమాండ్ -
ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీ డ్రైవర్ పనే
బెంగళూరు (బనశంకరి): ఎంతో నమ్మకంగా ఉన్న కారు డ్రైవరే దోపిడీదారుగా మారాడు, తన స్నేహితులతో కలిసి ఓ ప్రైవేటు కాలేజీ ప్రొఫెసర్ ఇంట్లో రూ.1.50 కోట్ల నగదు, 50 గ్రాముల బంగారు ఆభరణాలు దోచేసిన 7 మందిని యలహంక పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.27 కోట్ల నగదు, రెండు కార్లు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. తనిఖీల పేరుతో బెదిరించి నిందితులు ఆర్ఎంవీ రెండోస్టేజ్ రాజేంద్ర మునోట్ అలియాస్ రాజేంద్ర జైన్, విజయనగర చోళరపాళ్య శ్రీనివాస్, శ్రీనగర కిరణ్కుమార్ జైన్, శ్రీరాంపుర హేమంత్కుమార్ జైన్, దుమ్మలూరు బీడీఏ లేఔట్వాసి శంకరప్ప, రామమూర్తినగరవాసి శంకరప్ప, హైదరాబాద్ రామనగర్వాసి మోహన్గౌడ అలియాస్ జనార్దన్. నిందితులు గత నెల 19న యలహంక వినాయకనగర సింధీ కాలేజీ ప్రొఫెసర్ గిరిరాజ్కుమార్ ఇంట్లోకి చొరబడ్డారు. తాము ప్రభుత్వ అధికారులమని, మీ ఇంటిని తనిఖీ చేయాలని అతని భార్య, తల్లిని బెదిరించారు. పైన పేర్కొన్న మేరకు నగదు, బంగారాన్ని తీసుకుని కారులో ఉడాయించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి గత నెల 23 తేదీన సంజయ్నగరలో ఓ వ్యక్తిని అరెస్ట్చేశారు. రెండో వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వద్ద రేణుమాకలపల్లి గ్రామంలో, బెంగళూరు విజయనగర చోళరపాళ్యలో మిగతా ఐదుమందిని పట్టుకున్నారు. శంకరప్పే సూత్రధారి కారు డ్రైవరే దుమ్మలూరు శంకరప్ప సూత్రధారిగా గుర్తించారు. ఇతడు ప్రొఫెసర్ కు డ్రైవర్గా పనిచేసేవాడు. ఇంట్లో భారీగా డబ్బు, బంగారం ఉన్నట్లు గమనించి, మిగతావారితో కలిసి దోపిడీ చేశాడు. ఇతని మిత్రుడు జనార్దన్ రూ.55 లక్షలు హైదరాబాద్లో, రేణుమాకలపల్లి లోని ఓ ఇంట్లో 25.80 లక్షలను దాచి ఉంచాడు. నిందితుల ఇళ్లలో గాలించి రూ.1.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య విభాగ డీసీపీ వీజే.సజీత్, యలహంక సీఐ ఎంఎల్.కృష్ణమూర్తి సిబ్బంది ఈ కేసును ఛేదించారు. 7 మంది ముఠా అరెస్టు రూ.1.27 కోట్లు, కొంత బంగారం స్వాధీనం -
ఏకపక్ష నిర్ణయాలు తగదు
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో ఏకపక్ష నిర్ణయాలతో సభ్యులకు గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ నగరసభ సభ్యులు ఆరోపించారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కౌన్సిలర్లు శశిరాజ్, నాగరాజ్ తదితరులు మాట్లాడారు. ఏడు నెలల నుంచి కార్పొరేషన్గా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు సామాన్య సమావేశాలు నిర్వహించకుండా కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కార్పొరేషన్గా ఏర్పాటైనప్పడు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.200 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. 35 వార్డులకు రూ.కోటి చొప్పున కేటాయించి అభివృద్ధి పనులు చేపడతారని కన్న కలలు సాకారం కాకుండా పోయాయన్నారు. అధికారులు, అధ్యక్షుల ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టానుసారంగా నిధులు వాడుకున్న అంశంపై విచారణ చేయాలన్నారు. రాజకీయ నాయకుల మాటలకు వత్తాసు పలుకుతూ నగరసభ సభ్యులను అవమానించడం తగదన్నారు. ఇ–ఖాతాలు, జనన మరణ పత్రాలు ఇవ్వడంలో పూర్తిగా ఆలస్యం చేస్తున్నట్లు తెలిపారు. -
ఎలుగుబంట్ల ఖిల్లా.. బళ్లారి జిల్లా
సాక్షి,బళ్లారి: చారిత్రాత్మకంగా పేరుగాంచిన ఉమ్మడి బళ్లారి జిల్లా ఆసియాలోనే అత్యధికంగా ఎలుగుబంట్ల నిలయంగా ఉండటంతో పర్యాటకులతో పాటు జంతు ప్రేమికులను ఈ ప్రాంతాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎలుగుబంట్ల దాడుల్లో గత కొన్నేళ్లుగా పలువురు మృతి చెందడంతో పాటు, పలువురు గాయపడిన వారూ ఉన్నారు. రైతుల పంటలను విపరీతంగా ఎలుగుబంట్లు నాశనం కూడా చేసిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఎలుగుబంట్లపై ఎలాంటి దాడులు చేయకపోవడంతో పాటు వాటిని ప్రాణాలతో సురక్షితంగా పట్టుకుని సుదూరంలోని అటవీ ప్రాంతాలకు తరలిస్తూ, అటవీ ప్రాంతాల్లో ఉన్న ఎలుగుబంట్లు ఊరు చేరినప్పుడు అధికారులకు అప్పగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కరిడిధామ, గుడేకోటె ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లకు నిలయంగా మారింది. వందలాది ఎలుగుబంట్లు(కరడిలు) ఉండటంతో అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్నారు. ఆసియాలోనే కరడిధామ, గుడేకోటెల్లో ఎక్కువ వేలాది ఎకరాల్లో విస్తరించిన అటవీ ప్రాంత కొండల్లో ప్రధానంగా ఎలుగుబంట్లు నివసిస్తుండటంతో ఈ ప్రాంతాలకు కరడిధామ అని కూడా పేరుపెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలోనే కాకుండా యావత్ భారతదేశమే కాదు, ఆసియాలోనే ఉమ్మడి బళ్లారి జిల్లాలో అత్యధికంగా ఎలుగుబంట్లు నివసిస్తున్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీంతో అటవీ ప్రాంతాల నుంచి ఎన్నోసార్లు ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడంతో పాటు పంటలు కూడా నాశనం చేస్తున్న సందర్భాలు అధికంగా ఉండటంతో ఎలుగుబంట్లు నివసించే అటవీ ప్రాంతాల్లోనే కాకుండా ఎన్నోసార్లు బళ్లారి నగరంలోకి కూడా ఎలుగుబంట్లు వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. కరడిధామ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో ఎంతో నష్టం చేస్తున్నప్పటికీ వాటి బారి నుంచి ఎలా బయటపడాలన్న అవగాహనతో ఇటీవల జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ పొందుతున్నారు. అటవీ ప్రాంతాల నుంచి బయటకు వచ్చినప్పుడు వాటిపై జనం దాడి చేయకపోవడంతో పాటు సురక్షితంగా ప్రాణాలతో పట్టుకుని అటవీ ప్రాంతాలకు అప్పగిస్తుండటంతో ఈ ప్రాంత ప్రజల్లో ఎలుగుబంట్ల రక్షణపై ఉన్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. ఎలుగుబంట్లు కనబడితే సురక్షితంగా పట్టివేత కరడిధామ, గుడేకోటె చుట్టుపక్కల గ్రామాల్లో అప్పుడప్పుడు ఎలుగుబంట్లు గ్రామాల్లోను, పొలాల్లోనూ కనిపించడం పరిపాటిగా మారింది. దీంతో గ్రామస్తులంతా కలిసికట్టుగా వెళ్లి ఎలుగుబంట్లను పట్టుకోవడంలో నైపుణ్యత సంపాదించుకున్నారు. స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి సురక్షితంగా పట్టుకోవడం విశేషం. రైతులకు పంట నష్టం చేసినా, రైతులను గాయపరిచిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ వాటిపై దాడులు చేయకపోగా వాటి ప్రాణాలను కాపాడటంలో శ్రద్ధ వహిస్తున్నారు. అటవీ ప్రాంతాల నుంచి ఎలుగుబంట్లు బయటకు రాకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అటవీ ప్రాంతాల్లో దొరికిన పండ్లు, ఫలాలు, ఆకులు, అలుములు తదితర ఆహారం నచ్చక ఎలుగుబంట్లు రైతుల పొలాల్లో పంటలను తినడానికి, మేకలు, గొర్రెలు తదితర వాటిని తినేందుకు బయటకు వస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఆహారం అందించే చర్యలు చేపట్టాలి అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సరైన ఆహారం దొరకని సందర్భాల్లో అధికారులు వాటికి ఆహారం అందించే చర్యలు తీసుకుంటే జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎలుగుబంట్ల భయంతో పొలాల్లో మంటలు వేసుకుంటామని, టపాసులు పేల్చుతామని అన్నారు. ఒకరిద్దరు వెళ్లబోమని, గుంపుగా వెళ్లడంతో ఎలుగుబంట్లు భయపడతాయని, నిత్యం పొలాల్లోకి వెళ్లాలంటే రక్షణ కవచాలను ధరించి వెళతామని, అయితే ఎలుగుబంట్లు కనబడిన వెంటనే వాటిని ఎలాగైనా చాకచక్యంగా పట్టుకుని అధికారులకు అప్పగిస్తామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. అయితే అటవీ ప్రాంతాల నుంచి అవి బయటకు రాకుండా సంబంధిత అటవీశాఖ అధికారులు మరింత గట్టిచర్యలు తీసుకోవాలని, తమ పంట పొలాలకు నష్టం చేయడంతో పాటు ఎలుగుబంట్ల దాడుల్లో గురై ఎన్నోసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నామని, అటవీప్రాంతాల చుట్టు పటిష్టమైన కంచె తదితర రక్షణ కల్పించి వాటిని బయటకు రాకుండా చూడాలని కోరుతున్నారు. రైతులకు అపార పరిమాణంలో తప్పని పంట నష్టాలు ఎలుగుబంట్ల దాడుల్లో ఎంతో మంది మరణించిన వైనం ఇటీవల అవగాహనతో ఎలుగుబంట్లపై తగ్గిన దాడులు దరోజీ కరడిధామతో పర్యాటకులు, సందర్శకులకు కనువిందు -
అయోధ్య రాముడికి 15 కేజీల వెండి ఇటుకల సమర్పణ
హుబ్లీ: రామ మందిరం కోసం దావణగెరెలో జరిగిన ఘర్షణలో బలి అయిన వారి పేరున వెండి ఇటుకలను అయోధ్య రాముడికి సమర్పించారు. 1930లో దావణగెరెలో శ్రీరామ జ్యోతి రథయాత్ర జరిగినప్పుడు మత కలహాలు చెలరేగిన ఫలితంగా పోలీసులు జరిపిన గోలీబార్లో 8 మంది రామ భక్తులు మృతి చెందారు. సుమారు 70 మందికి పైగా తూటాలతో పాటు మారణాయుధాలు, యాసిడ్ దాడులతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ మేరకు బలిదానం అయిన చంద్ర షిండే, శ్రీనివాసరావు, శివాజీరావు, రామకృష్ణ, దుర్గప్ప, చిన్నప్ప, అమరేష్, నాగరాజ్ల బలిదాన జ్ఞాపకంగా 15 కేజీల వెండి ఇటుకలను శ్రీరామ మందిరానికి అర్పించారు. ఆ సదరు ఇటుకల్లో శ్రీరాముడి, అయోధ్య రామ మందిరం చిత్రలేఖనం లిఖించారు. వాటిని రాముడి పాదాల ముందు పెట్టి పూజించాలని అయోధ్య రామ మందిర కమిటీకి విజ్ఞప్తి చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య కోశాధికారి ప్రముఖ సాధకులు ఆచార్య పరమపూజ్య గోవింద దేవగిరి మహారాజ్కు ఈ ఇటుకలను అందజేశారు. వీహెచ్పీ కర్ణాటక ప్రముఖులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్టీ అయిన గోపాల్ ఈ అప్పగింత బాధ్యతలను పూర్తి చేశారు. విరక్తమఠం బసవప్రభుస్వామి సాన్నిధ్యంలో ఈ కార్యాన్ని నెరవేర్చారు. ప్రముఖులు యశ్వంత్రాజ్ జాధవ్, శివకుమార్, లోహిత్, భద్రావతి ఎన్టీసీ నాగేశన్న, కిరోసిన్ హాలేష్ తదితరులు పాల్గొన్నారు. -
కెమెరా ప్రతిభకు దర్పణం
బనశంకరి: కెమెరా ప్రతిభకు దర్పణం పట్టేలా బెంగళూరు చిత్రకళాపరిషత్లో వైపీఎస్ ఇంటర్నేషనల్ సలాన్– 2025 ఛాయాచిత్ర ప్రదర్శన సందడి మొదలైంది. దేవరాజ అరస్ గ్యాలరీలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన విభిన్న రకాల ఛాయాచిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఆర్కిటెక్చర్, కలర్, మోనోక్రోమ్, నేచర్ తదితర విభాగాల చాయాచిత్రాలు నేత్రానందం కలిగిస్తాయి. ప్రతి విభాగంలోనూ ఎంతో నైపుణ్యంతో తీసిన ఫోటోలు చూపరులను అబ్బురపరచకుండా ఉండలేవు. ప్రపంచం నలుమూలల నుంచి ఫోటోగ్రాఫర్లు పంపిన చిత్రాల్లో ఎంపికై న 92 ఛాయాచిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. వీకెండ్ రెండోశనివారం సెలవురోజు కావడంతో పెద్దసంఖ్యలో సందర్శకులు వచ్చారు. ఈ కార్యక్రమంలో వైపీఎస్ ముఖ్యులు మంజువికాస్శాస్త్రి, గిరీశ్ అనంత మూర్తి, ప్రేమకాకడే, హార్దిక్ షా పాల్గొన్నారు. చిత్రకళా పరిషత్లో సలాన్ ఛాయాచిత్ర ప్రదర్శన అబ్బురపరిచే కళాత్మక దృశ్యాలు -
వాహన సంచారం.. నరకప్రాయం
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో పార్కింగ్ సమస్యలు అధికమవుతున్నా నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఎస్పీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ఆక్రమణలకు గురైన ఫుట్పాత్లు పాదచారులకు అనానుకూలంగా మారినా నగరసభ అధికారులు మౌనంగా ఉన్నారు. పోలీసులు, నగరసభ అధికారులు తూతూమంత్రంగా కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా పాలన యంత్రాంగం పుట్ పాత్లను తొలగించినా వాటిని మళ్లీ దుకాణాలు, హోటళ్ల వంటివి ఆక్రమించాయి. నగరంలోని రైల్వే స్టేషన్, రంగ మందిరం, అంబేడ్కర్ సర్కిల్, బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం, తాలూకా పంచాయతీ, హెడ్ పోస్టాఫీసు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, ఏక్ మినార్, తీన్ కందిల్, షరాఫ్ బజార్ ప్రాంతాల్లో సంచరించడానికి వీలు లేకుండా ట్రాఫిక్ సమస్య జటిలమైంది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి ద్విచక్రవాహనాలను నిలుపుతున్నారు. రైల్వే స్టేషన్, రంగ మందిరం, అంబేడ్కర్ సర్కిల్, బస్టాండ్, తహసీల్దార్, తాలూకా పంచాయతీ, హెడ్ పోస్టాఫీసుల వద్ద ఆటో డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు ఆటోలను నడుపుతూ రహదారికి అడ్డంగా నిలబెడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో లోపలకు బస్సులు వెళ్లాలంటే ఆటోలను అడ్డు తొలగించుకొని పోవడానికి ఆటంకంగా మారి వెనుక వైపు వాహనాలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఏక్ మీనార్, తీన్ కందిల్, షరాఫ్ బజారుల్లో రహదారి కిరువైపుల అంగళ్లు, హోటళ్లు, పండ్ల తోపుడు బండ్లు అడ్డంగా నిలబడుతాయి. పుట్పాత్ల మీద దుఖాణాలు పోలీస్లకు బంగారు బాతు గుడ్డులా మాకాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో ప్రతి నిత్యం ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు ఆటోరిక్షాల వల్ల తిప్పలు తప్పడం లేదు. నగరంలో అధికమవుతున్న పార్కింగ్ సమస్య పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు -
అనాథగా హంపీ ఉగ్ర నరసింహ విగ్రహం
హొసపేటె: హంపీ ఉగ్ర నరసింహ విగ్రహ స్మారక చిహ్నం ముఖంపై ఉన్న పొలుసులు రాలి పోతున్నాయి. ఈ స్మారక చిహ్నాన్ని సంరక్షించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేశారు. ఈ స్మారక చిహ్నం గతంలో లక్ష్మీ నరసింహ స్మారక చిహ్నంగా ఉండేది. బహుమని సామ్రాజ్య సైనికుల దాడి తర్వాత ఈ స్మారక చిహ్నం దెబ్బతిన్నట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మిగిలి ఉన్న ఉగ్రనరసింహ స్మారక చిహ్నం కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నా పురావస్తు శాఖ మాత్రం మౌనంగా ఉంది. ఈ స్మారక చిహ్నాన్ని సంరక్షించడానికి పురావస్తు శాఖ చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, చరిత్రకారులు డిమాండ్ చేశారు. టెలిస్కోప్ శిక్షణలో జిల్లా విద్యార్థులకు ర్యాంక్లుబళ్లారి అర్బన్: రాష్ట్ర విజ్ఞాన పరిశోధన పరిషత్ ద్వారా దొడ్డబళ్లాపురలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రథమ టెలిస్కోప్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న 150 మంది విద్యార్థుల్లో బళ్లారి జిల్లాకు చెందిన 7 మంది విద్యార్థులు పాల్గొనడమే కాకుండా ఈ సారి ప్రథమ శ్రేణి సాధించారు. వీవీ సంఘం దేశనూరు సదాశివరెడ్డి సీనియర్ ప్రాథమిక, హైస్కూల్, దేశనూరు దేవరాజ్, సిరుగుప్ప వివేకానంద హైస్కూల్ విద్యార్థి శివకుమార్ రాష్ట్రంలోనే ప్రథముడిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్ుడ్స, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాడే ఏసియా బుక్ రికార్డ్స్ ప్రశస్తిని దక్కించుకున్నారని ఆ పరిషత్ జిల్లాధ్యక్షుడు ఆర్హెచ్ఎం చెన్నబసవస్వామి తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ శివకుమార్, దేవరాజ్, విద్యాసాగర్, సంజీవ్ శెట్టి, జాహ్నవి, మహమ్మద్ సోహిల్, గవిసిద్ద అనే విద్యార్థులకు సదరు పరిషత్ జిల్లా శాఖ అభినందనలు తెలిపింది. విద్యార్థులు చేసిన కృషికి వైజ్ఞానిక స్పూర్తి ప్రశంసనీయం అని వారు అభినందించారు. రైతులను సర్కారు ఆదుకోవాలి సాక్షి బళ్లారి: రాష్ట్రంలో అప్పుల బాధలను తాళలేక, పంటలు చేతికి అందకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని కొళగల్లు గ్రామానికి చెందిన రైతు గాదిలింగ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా బాధించిందన్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో పాటు అప్పులు పెరిగిపోవడంతో క్రిమిసంహారక మందును తాగి ఆత్మహత్య చేసుకొన్నాడన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడకు వినతిపత్రం అందజేశామన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో చాలా మంది రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ప్రభుత్వం గట్టి భరోసా ఇవ్వాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా పరిహారం ఇవ్వకుండా పంట ఎంత నష్టపోతే అంత మేరకు పరిహారం అందించాలని కోరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జాతా రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం జాతాకు శ్రీకారం చుట్టినట్లు కర్ణాటక రాష్ట్ర సమితి అధ్యక్షుడు రఘుపతి భట్ పేర్కొన్నారు. శనివారం బస్టాండ్ వద్ద ర్యాలీనుద్దేశించి మాట్లాడారు. విద్య, వైద్య, ఆర్థిక, సాంఘీక రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వం పంచ గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. రూ.కోట్లాది నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పడం తప్ప మరేమీ లేదన్నారు. పరిశ్రమలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గోవా వంటి ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళుతున్నారన్నారు. రాష్ట్ర సర్కార్ మొండి వైఖరిని ఖండిస్తూ ర్యాలీ చేశామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన సర్కార్ను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఇకనైనా కుటుంబ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలని ఆయన అన్నారు. -
బంధాలను తెంచేసిన ప్రేమపెళ్లి
బెళగావి (దొడ్డబళ్లాపురం): కన్నకూతురు తమను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధతో తల్లిదండ్రులు ఆమెకు బ్రతికుండగానే శ్రాద్ధకర్మలు నిర్వహించిన బాధాకర సంఘటన బెళగావి జిల్లా రాయభాగ తాలూకా నాగరాళ గ్రామంలో చోటుచేసుకుంది. తమ కూతురు ఇక చచ్చిపోయిందని కన్నవారు ప్రకటించారు. ఊరొదిలిన ప్రేమపక్షులు.. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన యువతి (19), స్థానిక యువకుడు విఠల్ బెస్తవాడి ప్రేమించుకున్నారు. ఇది తగదని తల్లిదండ్రులు ఆమెను మందలించినా పట్టించుకోలేదు. ఇటీవల ప్రేమ జంట ఊరు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. రెండుమూడు రోజులు వేచి చూసిన తండ్రి.. స్థానిక ఠాణాలో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చాడు. తన కుమార్తె 9వ తేదీన చనిపోయిందని శనివారం ఇంటిలో భారీఎత్తున తిథిని నిర్వహించాడు. ఆమె ఫోటో, వివరాలతో ఫ్లెక్సీలను గ్రామంలో కట్టించాడు. పెద్దఎత్తున వంటకాలను వండి తిథి భోజనాలను జరిపించాడు. ఇది చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నంత మాత్రాన కూతురు కాకుండా పోతుందా? అని కొందరు నిట్టూర్చారు. వీధిన పడేసింది: తండ్రి యువతి తండ్రి మాట్లాడుతూ తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని, ఈమె చివరి కుమార్తె అని చెప్పాడు. ఎంతో గౌరవంగా బతుకుతున్న తమ జీవితాలను ఆమె వీధినపడేసిందని, సంప్రదాయాన్ని మంటగలిపిందని వాపోయాడు. హిందూ చట్టం ప్రకారం ఆమెకు తమతో ఎటువంటి సంబంధం లేదని దస్తావేజు కూడా రాసుకున్నట్లు చెప్పాడు. బతికి ఉండగానే కూతురికి శ్రాద్ధకర్మలు బెళగావి జిల్లాలో ఓ తండ్రి ఆక్రోశం -
ప్రసన్న వేంకటేశ్వర స్వామికి పూజలు
కేజీఎఫ్ : ఐతిహాసిక ప్రసిద్ధ యాత్రాస్థలమైన చిక్కతిరుపతి ప్రసన్న వేంకటేశ్వర స్వామికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ భరద్వాజ్, ఎన్.శ్రీధర్ నేతృత్వంలో స్వామి వారికి అభిషేకం నిర్వహించి పూలతో అలంకరణచేసి పూజలు నిర్వహించారు. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో శ్రావణ మాసం ముగిసిన అనంతరం తమిళనాడులో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. దీంతో ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. -
ఒత్తిళ్లతో ప్రశాంతత దూరం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో కుటుంబాల్లో అనుబంధాలు, సంబంధాలు క్షీణించడం వల్లే ఒత్తిళ్లు అధికమై మానసిక ప్రశాంతతను కోల్పోతున్నట్లు నవోదయ వైద్య కళాశాల మానసిక వైద్య నిపుణుడు కె.పవన్ విచారం వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దైనందిన కార్యక్రమాలు, పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో సతమతమైన మానవుడు మానసికంగా కుంగిపోతాడన్నారు. రూపకళ, విజయలక్ష్మి, డాక్టర్ సుగుణ, హర్ష, సయ్యదా, రశీదా, స్వరూప రాణిలున్నారు. -
బాలికను బలిగొన్న సిటీ బస్
యశవంతపుర: బీఎంటీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల తరచూ ఘోరాలు జరుగుతున్నాయి. బస్సు ఢీకొన్న ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన బెంగళూరు మహలక్ష్మీ లేఔట్ 1వ స్టేజ్ సిగ్నల్ వద్ద జరిగింది. వివరాలు.. భావన (9) పాంచజన్య పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు పాఠశాల వదలగా ఇంటికి నడిచి వెళ్తోంది. సదరు సిగ్నల్ వద్ద బాలికను బీఎంటీసీ బస్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కాగా, చికిత్స పొందుతూ చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఘటన జరగ్గానే డ్రైవర్ బస్సును వదిలేసి పారిపోయాడు. మల్లేశ్వరం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. బీఎంటీసీ డ్రైవర్కు మూర్ఛ ● తొమ్మిది వాహనాలను ఢీకొన్న బస్సు బనశంకరి: సిటీ బస్సు వెళ్తుండగా డ్రైవర్కు మూర్ఛ వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢీకొంది. ఈఘటన శనివారం చిన్నస్వామిస్టేడియం 9వ గేట్ వద్ద చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో చిన్నస్వామిస్టేడియం సమీపంలో సిగ్నల్ వద్ద వాహనాలు నిలబడి ఉన్నాయి. ఆ సమయంలో అక్కడకు బీఎంటీసీ బస్సు చేరుకోగానే డ్రైవర్ మూర్ఛపోయాడు. దీంతో బస్సు ముందున్న కార్లు, నాలుగు ఆటోలు, బైక్ను ఢీకొని నిలిచిపోయింది. ఘటనలో తొమ్మిది వాహనాలు దెబ్బతినగా ఆటో డ్రైవరుకు తీవ్రగాయాలయ్యాయి. ఆటో, బస్సు డ్రైవర్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కబ్బన్పార్కు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విజయపురలో భూప్రకంపనలు సాక్షి బళ్లారి: విజయపుర జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం రాత్రి 11 గంటల పైనా జనం నిద్రలో ఉన్న సమయంలో జిల్లాలోని తికోట, విజయపుర గ్రామీణ ప్రాంతాల్లో 12 కిలోమీటర్ల భూమి స్వల్పంగా కంపించింది కవళిగి, మధుబావి, ద్యాబేరి, కగ్గోడ తదితర గ్రామాల్లో రిక్టర్ స్కేల్పై 2.8 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొందరు నిద్ర నుంచి మేల్కొని ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు వస్తుండడం సాధారణమైంది. చిరుత దాడిలో రైతు మృతి దొడ్డబళ్లాపురం: చిరుతపులి దాడిలో రైతు మృతిచెందిన సంఘటన హావేరి జిల్లా రట్టీహళ్లి తాలూకా కణవిసిద్ధగేరిలో జరిగింది. బీరేశ్ (28) అనే రైతు, తమ్ముడు బీరేశ్తో కలిసి పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఇంతలో ఓ చిరుత హఠాత్తుగా ఇద్దరిమీద కెగిరి దాడి చేసింది. గొంతు, తల మీద కొరకడంతో బీరేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ స్థానికులు జిల్లాస్పత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బీరేశ్ చనిపోగా, తమ్ముడు కోలుకుంటున్నాడు. ఇద్దరు అధికారుల సస్పెండ్ యశవంతపుర: హాసన్లో జరుగుతున్న హాసనాంబ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి వీఐపీ పాస్ల విధానాన్ని రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. అయితే ఇద్దరు అధికారులు గుర్తింపు కార్డులు చూపించి దర్శనానికి వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేసి దర్శనానికి వెళ్లడం సరికాదని, నిబంధనలు ఉల్లంఘించినందుకే ఆ ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడిందని రెవెన్యూశాఖ మంత్రి కృష్ణబైరేగౌడ మీడియాకు తెలిపారు. -
అంబేడ్కర్ హాస్టల్లో తనిఖీ
రాయచూరు రూరల్: నగరంలోని మంత్రాలయం రోడ్డులోని అంబేడ్కర్ హాస్టల్ను అసిస్టెంట్ కమిషనర్ గజానన బాళె పరిశీలించారు. శుక్రవారం ఉన్నఫళంగా హాస్టల్ను తనిఖీ చేసి వంట గదిని, ఇతర మౌలిక సౌకర్యాలను గురించి క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం రుచి చూశారు. గ్రంథాలయం ఏర్పాటుతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలని సాంఘీక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కసాప జిల్లాధ్యక్షుడు రాజీనామా చేయాలి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్ రాజీనామా చేయాలని బెళకు సంస్థ అధ్యక్షుడు అణ్ణప్ప మేటిగౌడ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్ల నుంచి జిల్లాలో సాహిత్య పరిషత్ కార్యక్రమాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. అనారోగ్యంతో సాహిత్య పరిషత్ సేవలు చేయడానికి చేతకానప్పుడు రాజీనామా చేసి ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్ర కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుల అనుమతి లేకుండా ఏడు తాలూకాల అధ్యక్షులను మార్పు చేసి నూతన అధ్యక్షులను నియమించారన్నారు. గతంలో ఉన్న అధ్యక్షులను కొనసాగించాలన్నారు. వారం రోజుల్లోపు పాటిల్ రాజీనామా చేయకపోతే అధ్యక్షుడి నివాసం ముందు ఆందోళన చేస్తామన్నారు. నేరాల కట్టడికి సహకరించాలి రాయచూరు రూరల్: నేరాల నియంత్రణకు విద్యార్థులు పోలీసులతో సహకరించాలని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరసమ్మ పేర్కొన్నారు. శనివారం నగరంలోని అల్ కరీం కళాశాల ప్రాంతంలో ఇంటింటికి పోలీస్ అనే కార్యక్రమంలో ప్రజలకు జనజాగృతి చేపట్టి మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలని కోరారు. టీబీ డ్యాం గేట్ల తయారీ పనులపై ఆరాహొసపేటె: టీబీ డ్యాం ఎస్టేట్ ఆవరణలో చేపడుతున్న డ్యాం గేట్ల నిర్మాణ పనులను శనివారం తుంగభద్ర మండలి చైర్మన్ ఎస్ఎన్ పాండే పరిశీలించారు. ఇప్పటికే గేట్ల నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని, పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టరుకు సూచించారు. అదే విధంగా గదగ్లో కూడా చేపడుతున్న డ్యాం గేట్ల నిర్మాణ పనుల ప్రగతిని మండలి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం రెండు చోట్ల డ్యాంకు సంబంధించిన 32 గేట్ల నిర్మాణ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకొన్నాయని మండలి అధికారులు తెలిపారు. మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్, డ్యాం సెక్షన్ అధికారి జ్ఞానేశ్వర్, ఇంజినీర్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికహొసపేటె: హొసపేటెలోని నేషనల్ పీయూసీ కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సంజన కొట్టూరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికై ంది. సంజన గత నెలలో బెంగళూరులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో తన చురుకుదనం, ధైర్యం, ఓర్పుతో న్యాయనిర్ణేతలు, ప్రేక్షకుల ప్రశంసలను గెలుచుకుంది. ఆమె అదే ఉత్సాహం, నైపుణ్యంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా గౌరవాన్ని పెంచాలని నేషనల్ పీయూసీ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు, స్నేహితులు అభినందిస్తూ భవిష్యత్తుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
రబీ పంటలకు నీరందించండి
సాక్షి బళ్లారి: తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని ఎల్ఎల్సీ, ఎల్బీఎంసీ కాలువల పరిధిలోని రైతుల ఆయకట్టు భూములకు రబీ సీజన్లో కూడా నీరు అందించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ ఆధ్వర్యంలో పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. శనివారం ఈమేరకు రైతు సంఘం నేతల ఆధ్వర్యంలో జిల్లాలోని సిరుగుప్ప ఎమ్మెల్యే నాగరాజును కలిసి వినతిపత్రాన్ని సమర్పిస్తూ రబీలో నీటి విడుదలకు సంబంధించి వివరాలు తెలియజేశారు. జూన్ 27న బెంగళూరులో జరిగిన తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి సమావేశంలో ఉపముఖ్యమంత్రి, పలువురు నిపుణులు ఈ విషయంపై చర్చించారని గుర్తు చేశారు. ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు జనవరి వరకు నీటిని వదలాలని మనవి చేశారు. 40 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని గేట్లు మార్చాలని సూచించారు. తుంగభద్ర డ్యాం గేట్లు 33 అధ్వానంగా ఉన్నాయని, దీంతో గేట్లను మార్చే పనులు ఫిబ్రవరి నుంచి జూలై వరకు చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. -
‘నేనెప్పుడూ అలా అనలేదు..’ మీడియాపై డీకే శివకుమార్ సీరియస్
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ ఏడాది చివరినాటికి ఆ మార్పు తథ్యమంటూ అక్కడి మీడియా చానెల్స్ వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరిట కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో కన్నడ మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నేను ముఖ్యమంత్రిని అయ్యే సమయం దగ్గరపడుతోంది అని నేను ఎక్కడా అనలేదు. కొంత మంది నేను సీఎం కావాలి అంటూ నినాదాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. కానీ, నా తలరాత ఏంటో నాకు తెలుసు. నాకేం తొందరలేదు అని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో.. కొన్ని మీడియా సంస్థలు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని, అలా అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తానేం సీఎం పదవికి ఆశపడడం లేదని మరోసారి స్పష్టం చేసిన డీకే.. తాను రాజకీయాల కోసం కాదని, ప్రజల సేవ కోసం పని చేస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపై మరోసారి తనను సంప్రదిస్తే మీడియాకు సహకరించబోనని స్పష్టం చేశారు. బెంగళూరులో లాల్బాగ్ వద్ద శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: తెలుగు ఐపీఎస్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ -
లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ సస్పెండ్
రాయచూరు రూరల్: కేసులో నమోదు చేసిన పేర్లను తొలగించేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన రాయచూరు తాలుకా ఇడపనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సౌమ్య హిరేమట్ను సస్పెండ్ చేస్తూ బళ్లారి ఐజీపీ వర్తిక కటియార్ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. రాయచూరు తాలుకా ఇడపనూరు పోలీస్స్టేషన్ ఎస్ఐ సౌమ్య హిరేమట్ భూమి తగాదా విషయంలో కేసు నమోదు చేశారు. విరున గౌడ, అనసూయమ్మ పాటిల్ మధ్య ఉన్న కేసు పరిష్కారం కోసం అనసూయమ్మ నుంచి రూ.3 లక్షల డబ్బు డిమాండ్ చేశారు. ఎవరికీ తెలియకుండా నగదును పోలీస్ కానిస్టేబుల్కు ఇచ్చి పంపాలని మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. అలాగే అనసూయమ్మ భర్త మహేష్ అక్రమంగా ఇసుక రవాణా చేయాలని సదరు ఎస్ఐ ఆదేశించారు. ఈ ఆడియోపై అదనపు ఎస్పీ కుమార స్వామి విచారణ చేపట్టారు. గురువారం రాత్రి ఇడపనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సౌమ్య హిరేమట్ను సస్పెండ్ చేస్తూ బళ్లారి ఐజీపీ వర్తిక కటియార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన బళ్లారి ఐజీపీ వర్తిక కటియార్ -
బడికి స్థలం ఇవ్వరూ..
హుబ్లీ: హావేరి జిల్లా హిరెకేరూరు తాలూకా స్కోడా గ్రామ పంచాయతీ పీడీఓ బాలికల పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని బహుగ్రామ తాగునీటి పథకానికి ఇచ్చారు. దీంతో స్థానికులు ఆ స్థలాన్ని వదిలి వేరే చోట ఎక్కడైనా స్థలాన్ని తాగునీటి పథకం కోసం వాడుకోవచ్చని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వారు మాట్లాడుతూ ఓ దాత మా ఊరు బాలికల పాఠశాల కోసం 10 గుంట్ల స్థలాన్ని ఇచ్చారు. ప్రస్తుతం దాని విలువ కోటి రూపాయల పైనే. బాలికలు చదువుకునేందుకు పాఠశాల కట్టాల్సి ఉంది. పీడీఓ ఆ స్థలాన్ని సదరు నీటి పథకానికి ఇచ్చారని, దీన్ని తాము అంగీకరించబోమని గ్రామస్తులు తెగేసి చెప్పారు. స్కోడా గ్రామం లోపల ఉండే బాలికల పాఠశాలకు సరైన స్థలం లేదు. ఇరుకై న స్థలంలో పాఠశాల నడుపుతున్నారు. పాఠశాలకు మైదానం లేదు. అవసరమైన భవనం లేదు. 130 మందికి పైగా విద్యాభ్యాసం అయినా ఈ పాఠశాలలో 130 మందికి పైగా బాలికలు చదువుతున్నారు. ఇక్కడ కాంపౌండ్ కూడా లేదు. సరైన గదుల వసతి కూడా లేదు. ఈ నేపథ్యంలో గ్రామస్తుడు నాగేశ్వర్ బిజాపుర అనే వ్యక్తి తనకు చెందిన 10 గుంట్ల స్థలాన్ని ఆ గ్రామ బాలికల పాఠశాల నిర్మించడానికి 2012లోనే ఆ మేరకు దాన పత్రాన్ని కూడా ఆ పంచాయతీ అధికారులకు అందజేశారు. ఈ నిర్ణయంపై గ్రామ పంచాయతీలో అనుమతి తీసుకొని గవర్నర్ తరపున హిరేకెరూరు బీఈఓ పేరున నమోదు అయింది. అయితే ఇటీవల ఆ గ్రామ పీడీఓ కేఎం బన్నికోడ, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులు ఆ స్థలాన్ని స్కోడా వద్ద సర్వజ్ఞ బహుగ్రామ తాగునీటి పథకం భవన నిర్మాణం కోసం వినియోగించుకోవాలని పంచాయతీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ స్థలంలో రూ.కోట్ల వ్యయంతో బహుగ్రామ తాగునీటి పథకం భవన నిర్మాణం జరిగింది. పనుల నిలిపివేతకు ఆదేశం ఘటనపై హిరేకెరూరు బీఈఓకు పాఠశాల ఎస్డీఎంసీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ కట్టడ నిర్మాణ స్థలానికి వెళ్లి పరిశీంచిన బీఈఓ ఆ పనులను నిలిపి వేయాలని పాఠశాల కట్టడం కోసం దానం ఇచ్చిన ఈ స్థలంలో తాగునీటి భవనం నిర్మించారని గ్రామస్తులు ఒత్తిడి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోను ఈ స్కూల్ నిర్మాణ అవకాశాన్ని తాము వదలబోమని కనీసం ఇప్పటికై న పాఠశాల నిర్మాణానికి మరో స్థలాన్ని తక్షణమే కేటాయించాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హిరెకేరూరు ఎమ్మెల్యే ఏబీ బణకార్ మాట్లాడుతూ.. పాఠశాల నిర్మాణం కోసం ప్రభుత్వ లేదా బంజరు స్థలాన్ని కొనుగోలు చేయడానికి మేం రెడీగా ఉన్నాం. ప్రత్యామ్నాయంగా ఓ స్థలాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.స్కూల్కు స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న స్థానికులుఅర్ధంతరంగా ఆగిపోయిన తాగునీటి పథకం భవన నిర్మాణ పనులు దాత పాఠశాలకు ఇచ్చిన స్థలాన్ని తాగునీటి పథకానికి కేటాయించిన పీడీఓ పాఠశాలకు మైదానం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు వేరే స్థలం ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్ -
‘అక్రమ లేఔట్లకు విద్యుత్ సౌకర్యం ఇవ్వొద్దు’
రాయచూరు రూరల్: అక్రమంగా ఏర్పాటు చేసుకున్న లేఔట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడం తగదని సీపీఎంఎల్ లిబరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం యరగేర జెస్కాం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ హనీఫ్ మాట్లాడారు. రాయచూరు తాలుకా యరగేర సర్వే నంబర్ 149లో అక్రమంగా లేఔట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ లేఔట్లలో నిర్మించుకున్న ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించొద్దని కోరారు. స్థానిక అధికారి ద్వారా జెస్కాం ఎండీకి వినతిపత్రం పంపించారు. క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ఐదు జిల్లాలో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యకీయ శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ వెల్లడించారు. గురువారం సాయంత్రం బెంగళూరు కిద్వాయ్ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిధిలో రాయచూరు, బళ్లారి, శివమెగ్గ, బీదర్, బెళగావిలో క్యాన్సర్ చికిత్సల కోసం క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భవిష్యత్తులో తుమకూరు, మండ్య, మైసూరు, కారవారల్లో బాహ్య క్యాన్సర్ (పీసీసీ) కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. కలబుర్గిలో 80 పడకల క్యాన్సర్ ఆస్పత్రిని 210 పడకల ఆస్పత్రిగా మార్చడం జరుగుతుందన్నారు. కిద్వాయ్ ఆస్పత్రిలో 720 పడకలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం బళ్లారి రూరల్: వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బీఎంసీఆర్సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధర గౌడ తెలిపారు. శుక్రవారం సైకాట్రీ విభాగంలో వరల్డ్ మెంటల్ హెల్త్డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సానుకూలంగా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. సైకాట్రీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కొట్రేశ్ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా మహాభాగ్యమే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్, చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ గడ్డిదివాకర్, సైకాట్రిస్ట్ డాక్టర్ ఖాజామొయినుద్దీన్, తదితర వైద్యులు పాల్గొన్నారు. యోగా, ధ్యానంతో ఒత్తిడి దూరంబళ్లారి టౌన్: మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలని జిల్లా న్యాయసేవా ప్రాధికారం సభ్యుడు, న్యాయమూర్తి రాజేష్ హొసమని సూచించారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, న్యాయ సేవ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడి అనేది దౌర్భల్యం కాదన్నారు. ఊహ, ఎక్కువగా ఆలోచనలు చేయడం వల్ల అవే మానసిక రుగ్మతలు వస్తాయని పేర్కొన్నారు. జిల్లా వైద్యుడు బసారెడ్డి మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడికి గురైన వారు దైహిక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆత్మహత్య ఆలోచనల నుంచి మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. అనవసర విషయాలపై చర్చించుకోకపోవడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు డాక్టర్ కిశోర్, వీరేంద్ర కుమార్, స్థానిక ప్రిన్సిపాల్ సతీష్ పాల్గొన్నారు. కాంట్రాక్టర్ కిడ్నాప్ కేసులో 10 మంది అరెస్ట్ హుబ్లీ: నగరానికి చెందిన కాంట్రాక్టర్ మోహన్ చౌహాన్ కిడ్నాప్ కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని నగర పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హుబ్లీ, గోకుల రోడ్డు పోలీసు స్టేషన్ పరిధిలో కాంట్రాక్టర్ మోహన్ చౌహాన్ను బసప్ప దళవాయితో పాటు 15 మంది కలిసి మారణాయుదాలతో దాడి చేసి హత్య చేశారని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి పూర్వాపరాలు సేకరించడం జరిగిందన్నారు. ఈ హత్యతో సంబంధం ఉన్న 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. పంట నష్టంపై జాబితా సిద్ధం హుబ్లీ: ఈ ఏడాది ఆగస్టులో జిల్లాలో అతివృష్టితో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు సర్వే చేపట్టారు. రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 7వ తేదీన పంట నష్టంపై తుది జాబితా రూపొందించారు. తాలూకాల వారీగా రైతులకు ఎంతెంత పరిహారం అందుతుందన్న దానిపై కూడా వివరాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. -
ముందుచూపుతో రింగ్రోడ్డు నిర్మించండి
కోలారు: రాబోయే 25 సంవత్సరాల్లో రవాణా సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో రింగ్ రోడ్డు నిర్మించేలా డీపీఆర్ తయారు చేయాలని ఎమ్మెల్యే కొత్తూరుమంజునాథ్ అధికారులకు సూచించారు. శుక్రవారం పీడబ్ల్యూడీ శాఖ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. రింగ్రోడ్డు వ్యాప్తి, భూస్వాధీనం, ఇందుకు కలుగుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. రింగ్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ కోసం రూ. 2.8 కోట్లతో టెండర్ పిలవడానికి సిద్దం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య లేకుండా చతుష్పథ రహదారిని నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు. తొలుత శాటిలైట్ మ్యాప్ చూసి అనంతరం స్థల పరిశీలన చేద్దామని తెలిపారు. ఎంపీ మల్లేష్బాబు, ఎమ్మెల్సీ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సేవాభావం
రాయచూరు రూరల్: సరిహద్దు ప్రాంతంలోని సర్కారీ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంతో బడుల మూసివేతకు సర్కార్ నిర్ణయం తీసుకుంటోంది. బెళగావి జిల్లా చిక్కోడి డివిజన్ హుక్కెరి తాలుకా గోటూర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆంగ్లంలో విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు. తాలుకా విద్యాశాఖ అధికారి అనుమతితో పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించారు. ఇందుకోసం తమ వేతనాల్లో కోత పెట్టించుకుని నిధులు సమకూర్చుకున్నారు. అలాగే ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. 40 మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చేరదీశారు. విద్యార్థులను ఆకర్షించేందుకు హాజరు శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు తీసుకుంటున్న చొరవను స్థానికులు అభినందించారు. ప్రభుత్వం నుంచి నిధులు ఆశించకుండా సొంత డబ్బు వెచ్చించి పాఠశాల నిర్వహణ చేస్తున్నారు. సొంత ఖర్చులతో ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం గోటూర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్లంలో విద్యాబోధన -
నంజేగౌడ శాసన సభ్యత్వం రద్దు కాదు
మాలూరు: హైకోర్టు మాలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రీకౌంటింగ్ చేయాలని ఆదేశించినంత మాత్రాన ఎమ్మెల్యే నంజేగౌడ శాసన సభ్యత్వం రద్దు కాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని కుప్పశెట్టి బావి సమీపంలో ప్రతిష్టించిన గణేశోత్సవ కార్యక్రమంలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరుగుతున్న 47వ గణేష ఉత్సవాల్లో పాల్గొనడం తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. వినాయకుడు అన్ని రకాల విఘ్నాలను తొలగించాలన్నారు. ఎమ్మెల్యే నంజేగౌడ నియోజకవర్గ అభివృద్ధి గురించి తన దృష్టికి తెచ్చారన్నారు. అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాలను ప్రజలకు సక్రమంగా అందిస్తోందన్నారు. 10 కిలోలు ఇస్తున్న బియ్యాన్ని కొంతమంది బయట విక్రయించుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో బియ్యం బదులుగా కంది పప్పు, నూనె, చక్కెర, ఉప్పు అందించడానికి పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే కేవై నంజేగౌడ, మాజీ ఎమ్మెల్యే ఏ.నాగరాజ్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సీ.లక్ష్మీనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాపుర కిట్టణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు నియంత్రించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో మహిళ, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖలో అధికారులు ఇచ్చిన నివేదికలు వేరు. సభలో వినిపిస్తున్న నివేదికలకు పొంతన లేదని కర్ణాటక విధాన సభ మహిళ, శిశు అభివృద్ధి కళ్యాణ సమితి అధ్యక్షుడు కోన రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన ప్రగతి పరిశీలన సభలో ఆయన మాట్లాడారు. పిల్లల సంరక్షణ విషయంలో 84 కేసులకు గాను కేవలం 64 కేసులను పరిష్కరించి చేతులు దులుపుకోవడం తగదన్నారు. 85 శాతం అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుపుతున్న అంశాలను శాసన సభ్యులు వివరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్ల నియామకాల్లో అలసత్వంపై సభ్యులు శరణే గౌడ, కరెమ్మ నాయక్ అధికారులపై మండిపడ్డారు. బాల కార్మికులను నియంత్రించడంలో పోలీస్ యంత్రాంగం మౌనం వహించడం తగదన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని సూచించారు. పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు ఇక్బాల్, శాంతారాం, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, అదనపు కార్యదర్శి మంజుళ, ఐజీపీలు సతీష్ కుమార్, వర్తిక్ కటియార్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్ట మాదయ్య, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులను స్వాధీనం చేసుకుంటాం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఆక్రమణకు గురైన 41,849 చెరువులను డిసెంబర్ నాటికి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. గురువారం సాయంత్రం బెంగళూరు వికాస సౌదలో నీరిద్దరే నాళె కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర పరిధిలో ఏచ్.ఏన్,వ్యాలి, కేసీ వ్యాలీ చెరువులను నీటితో నింపడంతో భూగర్బ జలమట్టం పెరిగినట్లు తెలిపారు. చెరువులకు సంఘాల ద్వార పునరుజ్జీవం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పంచ గ్యారెంటీలకు తోడు నీరు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టడం జరిగిందని పర్యటక శాఖ మంత్రి హెచ్.కే.పాటిల్ వివరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్, మంత్రులు ఈశ్వర్ ఖండ్రే, మహదేవప్ప, బీఆర్ పాటిల్, నసీర్ అహ్మద్, అజయ్ సింగ్, రిజ్వాన్ హర్షద్, ఎంవై పాటిల్, క్రిష్ణమూర్తి, హంపయ్య నాయక్, బాగీరథి, బసనగౌడ తదితరులు పాల్గొన్నారు. నీరిద్దరే నాళె కార్యక్రమానికి శ్రీకారం -
సీజేఐపై బూటు విసరడం హేయం
న్యాయవాదిని శిక్షించాలని వినతిపత్రం అందజేస్తున్న దృశ్యంపాత డీసీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజాపరివర్తన వేదిక కార్యకర్తలుసాక్షి, బళ్లారి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయిపై న్యాయవాది బూటు (షూ) విసరడం అత్యంత హేయమైన చర్య. సీజేఐకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని పలు ప్రజా సంఘాలు, న్యాయవాదులు తీవ్ర స్థాయిలో ఖండించారు. శుక్రవారం జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధికారి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సీజేఐపై దాడి చేసిన న్యాయవాది రాకేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రధాన న్యాయమూర్తితో ఇంత అనుచితంగా వ్యవహరించడం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు. ఆయనకే రక్షణ లేకుంటే ఇక ఎవరికి భద్రత కల్పిస్తారని మండిపడ్డారు. అనంతరం జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంఘం కార్యదర్శి అన్సర్ భాషా, ప్రముఖ న్యాయవాదులు కోటేశ్వరరావు, మల్లికార్జున, గురు బసవరాజు, దుర్గప్ప, జయకుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. దళిత పర సంఘటనల ఐక్య కూటమి ఆధ్వర్యంలో వెంకటేశ్, బండిహట్టి కిశోర్, వినోద్ కుమార్ తదితరులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై బూటు విసిరిన న్యాయవాదిని దేశం నుంచి బహిష్కరించాలని ప్రజాపరివర్తన వేదిక (పీపీవీ) నేతలు డిమాండ్ చేశారు. ఆ సంఘం నేతలు ఆనంద్ కుమార్, శివ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో జి.దివాకర్ బాబు, హనుమంతు, సిద్దబసప్ప తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదిని శిక్షించాలి బళ్లారి రూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసిరిన న్యాయవాదిని శిక్షించాలని జిల్లా ప్రజాపరివర్తన వేదిక (పి.పి.వి) జిల్లాధ్యక్షుడు సి.ఆనంద కుమార్ కోరారు. శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. పాత డీసీ కార్యాలయం ముందు విలేకరులతో మాట్లాడారు. దళితుడైన న్యాయమూర్తి బి.ఆర్.గవాయిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రముఖుడు లాయర్ రాకేశ్ కిశోర్ బూటు విసరడం దుర్మార్గమన్నారు. అనంతరం జిల్లా యంత్రాంగానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వై.శివకుమార్, కోశాధికారి జి.దివాకర బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంత తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: రాయచూరు తాలుకా గిల్లె సూగురు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్త అంబాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్–75లో ఉన్న ప్రభుత్వ భూమిలో గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు మహదేవమ్మ ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. ఇళ్ల ద్వారా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు బాడుగ వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న పంచాయతీ అధ్యక్షురాలు మహదేవమ్మ, ఆమె భర్త మల్లేష్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడిగా కేశవమూర్తి రాయచూరు రూరల్: రాయచూరు నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కేశవమూర్తిని నియమిస్తూ కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు ఖాళీగా ఉన్న నగర ఉపాధ్యక్షుడి పదవిని గురువారం భర్తీ చేశారు. 25 ఏళ్ల పాటు కార్యకర్తగా విధులు నిర్వర్తించిన కేశవమూర్తి సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు పదవిని కట్టబెట్టింది. అదనపు న్యాయమూర్తి ఇంట్లో చోరీ ● ముగ్గురు నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్: అదనపు న్యాయమూర్తి నివాసంలో దొంగలు చొరబడి బంగారం, నగదు దొంగిలించిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. ముద్దే బిహళ తాలుకా దండాదికారి అద్దె నివాసంలో అదనపు న్యాయమూర్తి ఉంటున్నారు. ఇంటి తాళం పగుల గొట్టిన దొంగలు.. రూ.30,15,500 విలువ చేసే బంగారం, నగలు ఎత్తుకెళ్లారు. విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బెళగావి జిల్లా రామదుర్గ తాలుకా రాంపుర తాండా సునీల్ రజపూత్, నాగనూరు తాండా చేతన్ లమాణి, సవదత్తి తాలుకా కార్ల్కట్టి రాహుల్ లమాణిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కళ్యాణ కర్ణాటక సమగ్రాభివృద్ధికి జాతా రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగం సమగ్ర అభివృద్ధి కోసం జాతాకు శ్రీకారం చుట్టినట్లు వేల్ఫేర్ పార్టీ ఆప్ ఇండియా అధ్యక్షుడు తాహిర్ హుసేన్ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అరున బళ్లారి నుంచి ప్రారంభమైన జాతా అక్టోబర్ 13న కలబుర్గికి చేరుకుంటుందన్నారు. ఈ ప్రాంతం విద్య, వైద్య, ఆర్థిక, సాంఘిక రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వం నుంచి రూ.15 వేల కోట్ల నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. క.క.భాగంలో పరిశ్రమలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు బెంగళూరు, ముంబాయి, హైద్రాబాద్, గోవా వంటి ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలస వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర సర్కార్ మొండి వైఖరని ఖండిస్తూ క.క భాగం అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై పూర్తి నివేదికలను మండలి అధ్యక్షుడికి వినతిపత్రం ద్వారా సమర్పిస్తామన్నారు. వర్షాలకు నేలకూలిన ఇళ్లు హుబ్లీ: దార్వాడ, దావణగెరె జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో 70 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దార్వాడ–దావణగెరె రెండు జిల్లాల్లో అపార నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో రైతులు, వ్యాపారులు, జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే కోనారెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు సాంత్వన పలికారు. పిడుగుపాటుకు మేకలు మృతి చెందడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మేకలు మంద ను పొలంలో ఉండగా పిడుగు పడటంతో 10 మేకలు మృతి చెందాయి. త్రుటిలో గొర్రెల కాపరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. -
ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’
సాక్షి బెంగళూరు: దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరం ఏంటి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘బెంగళూరు’.. ఐటీ సిటీ బెంగళూరులో చాలా వరకు రోడ్లు వాహనాలు, ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. పీక్ అవర్స్లో బెంగళూరులో ప్రయాణం అంటే అందరూ బెంబేలెత్తిపోవాల్సిందే. ఇదే సమయంలో అక్టోబర్ నెలలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు గుడ్బై చెప్పేసి తమ ఉద్యోగులకు కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సిందే అని తేల్చి చెప్పాయి. ఈనేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీ సమస్య ఒకవైపు అయితే ఇంకో వైపు ట్రాఫిక్ ఉల్లంఘనులు రోజురోజుకి బెంగళూరులో పెరిగిపోతున్నారు. ఎంతలా అంటే పదే పదే ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతున్న ఉల్లంఘనుల విషయంలో కూడా బెంగళూరు నగరం దేశంలోనే టాప్లో ఉండడం విశేషం. దేశ సురక్షత, భద్రత రంగ కంపెనీల్లో ఒకటైన ఏసీకేవో ఇటీవల నిర్వహించిన సమీక్షలో దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరులో వాహనదారులు పదేపదే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు సదరు కంపెనీ సర్వే నివేదికలో వెల్లడించింది. 2024 డిసెంబర్ నుంచి 2025 జూన్ వరకు దేశంలోని పలు మహానగరాల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై సదరు సంస్థ సమీక్ష చేపట్టింది. బెంగళూరులోని వాహనదారుల్లో 10.8 శాతం కంటే ఎక్కువ మంది 10 సార్లకు పైగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు చెల్లించిన వారుగా ఉన్నట్లు సమీక్షలో తేలింది. ఇది దేశంలోనే మహానగరాలన్నింటి కంటే అత్యధికం కావడం గమనార్హం. సమీక్షలో 14.50 లక్షలకు పైగా ట్రాఫిక్ పరీక్షలను నిర్వహించినట్లు, సుమారు 61 శాతం మంది అంటే ప్రతి పది మందిలో ఆరు మంది కనిష్టంగా ఒక్కటన్నా ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించినట్లు గుర్తించారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. బెంగళూరులో పదేపదే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల ప్రమాణం 11 శాతంగా ఉంది. బెంగళూరు తర్వాతి స్థానాల్లో చైన్నె (8 శాతం), ఢిల్లీ (6 శాతం), ముంబై (5 శాతం), పుణే (3 శాతం) ఉన్నాయి. సంచార నిబంధనల ఉల్లంఘనలో దేశంలోనే బెంగళూరు టాప్ వాహన రద్దీకే కాకుండా జరిమానాల్లోనూ ఐటీ వాసుల అగ్రస్థానం 11 శాతం వాహనదారులు పది సార్లకు పైగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ ఏసీకేవో కంపెనీ తాజా సర్వే నివేదికలో తేలిన కఠోర వాస్తవం ‘భారతదేశ టెక్ నగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో అనేక మంది ఇంకా ఇష్టానుసారం వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్క జరిమానా కేవలం ఫైన్గా చూడకుండా నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేసేందుకు ఒక అవకాశంగా చూడాలి. ఈ సమీక్ష ద్వారా పదేపదే ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కేవారు తమ ప్రవర్తన మార్చుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేసి బెంగళూరును ట్రాఫిక్ నియమాల్లో ఒక ఆదర్శవంతమైన నగరంగా నిలబెట్టాలని ఆశిస్తున్నాము.’ –మయాంక్ గుప్తా, ఏసీకేవో ఉపాధ్యక్షుడు -
సమీక్షలోని పలు అంశాలు..
● బెంగళూరులో మొత్తం 1.56 లక్షల మంది వాహనదారులు సుమారు 10కి పైగా సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానా చెల్లించారు. ● నెలకు సగటున 4.12 సార్లు తమ చలాన్లను బెంగళూరు నగరవాసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో చైన్నె అగ్రస్థానంలో ఉంది. అక్కడి వాహనదారులు సగటున ఐదు సార్లు తమ చలాన్లను చెక్ చేసుకుంటున్నారు. ● బెంగళూరులో 23 శాతం జరిమానాలు కేవలం కెమెరాలు, మొబైల్స్ ద్వారా విధించినవే ● దేశంలో 10.5 మిలియన్ కంటే అధికమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు కేవలం హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినవే. -
దేవీరమ్మ కొండ మార్గంలో అస్థిపంజరం
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవీరమ్మకొండ మార్గంలో మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. కొండ మార్గంలో స్వచ్ఛతా పనులు చేస్తుండగా అస్థిపంజరం బయట పడింది. చిక్కమగళూరు పోలీసులు వెళ్లి పరిశీలించి అస్థిపంజరం మహిళదిగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కాగా ఏటా ఒక్కసారి మాత్రమే దేవీరమ్మ కొండపైకి భక్తులను అనుమతిస్తుంటారు. దీపావళి సందర్భంగా కొండపై దేవీరమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తారు. మైసూరులో ప్రజలకు రక్షణ లేదు మైసూరు : విశ్వవిఖ్యాత సాంస్కృతిక నగరి మైసూరులో ప్రజలకు, పర్యాటకులకు భద్రత కొరవడిందని, అభద్రతాభావంతో జీవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మైసూరు– కొడుగు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. మైసూరుకు ప్రగతిపర, సాంస్కృతిక, చరిత్ర నగరంగా ప్రపంచవ్యాప్తంగా పేరుందన్నారు. కొంతకాలంగా నగరంలో దాడులు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఉదాసీనతతో ఉందన్నారు. ఉదయగిరి పోలీస్స్టేషన్పై ఇటీవల దుండగులు రాళ్ల దాడి చేశారన్నారు. మహారాష్ట్ర పోలీసులు మైసూరులో జరుగుతున్న డ్రగ్స్ దందాను ఛేదించి రూ. 340 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారన్నారు. వస్తు ప్రదర్శన శాల సమీపంలో పట్టపగలే వ్యక్తిని దుండగులు హత్య చేశారన్నారు. గురువారం ఓ చిన్నారిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎన్నికల సమయంలోమాత్రమే మైసూరు నా ఊరు అంటారని, ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్నారు. స్వాధీనంలో ఉన్నవారికి అటవీ భూ హక్కు ● సీఎం సిద్దరామయ్య శివాజీనగర: 2005వ సంవత్సరానికి ముందు అటవీ భూమిని సాగు చేస్తున్న వారికి భూమిపై హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఉత్తర కన్నడ జిల్లా అటవీ భూమి సాగుదారుల పోరాట కమిటీ అధ్యక్షుడు కే.చంద్రకాంత్, జీ.ఎం.శెట్టి, పీ.టీ.నాయక్, గణేశ్ నాయక్ నేతృత్వంలో పోరాట సమితి బృందం గురువారం జిల్లా ఇన్చార్జి మంత్రి సమక్షంలో ముఖ్యమంత్రిని కలిసి అటవీ హక్కు వినతిపత్రాలను తిరస్కరించిన కారణంగా ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో సీఎం సిద్దరామయ్య అటవీ హక్కు చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. అర్హులు భూ హక్కు నుంచి వంచితులు కాకుండా జిల్లా యంత్రాంగానికి సూచిస్తామని భరోసానిచ్చారు. అటవీ భూమిలోని బగర్ హుకుం సాగుబడికి సంబంఽధించి అటవీ భూ సంరక్షణా చట్టం–1980 కింద పునర్ సమీక్ష జరపటంతో పాటు అటవీ హక్కు చట్టం తప్పనిసరిగా అమలు పరచటం ద్వారా జిల్లాలో ప్రజలకు భూ హక్కు ఇప్పించాలని బృందం ముఖ్యమంత్రిని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం తప్పకుండా అమలు పరిచేందుకు ప్రభుత్వం వద్ద వివిధ రకాల సలహాలను తమ పోరాట కమిటీ ప్రభుత్వం ముందు ఉంచిందని చంద్రకాంత్ తెలిపారు. బృందంతో మాట్లాడిన సిద్దరామయ్య అటవీ భూమి సాగుదారుల హితరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వసతి జీవనోపాధికి అటవీ భూమిని అవలంభించిన పేద ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి మంకాళ వైద్య పాల్గొని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కుటుంబ కలహాలకు ముగ్గురు బలి
యశవంతపుర: కుటుంబ కలహాలు ముగ్గురిని బలితీసుకున్నాయి. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బాగలకుంటె సమీపంలోని భువనేశ్వరినగరలో విజయలక్ష్మి, రమేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె బృందా(4), ఏడాదిన్నర వయసున్న భువన్ అనే కుమారుడు ఉన్నాడు. రమేశ్ నగరంలోని ఒక మాల్లో పనిచేస్తున్నాడు. కాగా రమేష్ ఒక మహిళను ప్రేమించి రెండోపెళ్లి చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈక్రమంలో విడాకులు ఇవ్వాలని రమేష్ తరచూ భార్య విజయలక్ష్మితో గొడవ పడుతున్నాడని, దీంతో దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతోందని స్థానికులు అంటున్నారు. పలు పర్యాయాలు విజయలక్ష్మి తన గోడును తల్లిదండ్రుల వద్ద చెప్పి విలపించేది. అయితే తల్లిదండ్రులు సర్దిచెప్పి పంపేవారు. మరో వైపు రమేష్ వేధింపులు అధికం కావడంతో గురువారం తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు సాయంత్రం విజయలక్ష్మి చెల్లలు తన అక్క ఇంటికి వెళ్లగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాగులకుంటె పోలీసులు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకొని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి భర్త విడాకులు కోరడంతోనే అఘాయిత్యం -
లాడ్జిలో మంటలు–ఇద్దరి మృతి
దొడ్డబళ్లాపురం: లాడ్జిలో అగ్నిప్రమాదం చోటుచేసుకొని పురుషుడు, మహిళ మృతిచెందారు. ఈ సంఘటన యలహంక న్యూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కిచన్–6 ఫ్యామిలీ రెస్టారెంట్ భవనం మూడవ అంతస్తులో ఒక లాడ్జి నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఒక గదిలో హఠాత్తుగా మంటలు చెలరేగి మిగతా గదులకు వ్యాపించాయి. లాడ్జి మొత్తం భారీగా పొగ కమ్ముకుంది. దీంతో ఓ గదిలో ఉన్న గదగ్ నివాసి రమేశ్ మంటలకు ఆహుతి కాగా హునగుంద నివాసి కావేరి ఊపిరి ఆడక మృతిచెందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. పోలీసులు వచ్చి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. మట్టణ్ణవర్పై మళ్లీ దర్యాప్తు? ● కొత్తగా ఫిర్యాదు చేసిన ప్రశాంత్ సంబరగి శివాజీనగర: ఎమ్మెల్యేల భవన్లో బాంబు పెట్టిన కేసుకు సంబంధించి గిరీశ్ మట్టణ్ణవర్పై మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగర పోలీస్ కమిషనర్కు, హోం శాఖ కార్యదర్శికి సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఫిర్యాదు చేశారు. మట్టణ్ణవర్ పలు వీడియోల్లో తానే బాంబు తయారు చేసి పెట్టినట్లు అంగీకరించినట్లుగా వ్యాఖ్యలు చేశారు. కేసును రీ ఓపెన్ చేసి ఎన్ఐఏ తనిఖీకి అప్పగించాలి. కేసు ఇప్పటికే న్యాయస్థానంలో మూసివేతకు గురైంది. అయితే కొత్త సాక్ష్యాధారాలను పరిగణించి మళ్లీ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని సంబరగి డిమాండ్ చేశారు. 2003లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మట్టణ్ణవర్ ఎమ్మెల్యేల భవన్లో బాంబులను పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 13 ఏళ్ల తరువాత సిటీ సివిల్, సెషన్స్ కోర్టు ప్రధాన నిందితుడు మట్టణ్ణవర్తో పాటు ముగ్గురు నిందితులను తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది. కల్బుర్గిలో సబ్ ఇన్స్పెక్టర్ అయిన 26 ఏళ్ల వయస్సు కలిగిన మట్టణ్ణవర్పై రైఫిల్ షూటింగ్ శిక్షణ కోసం బెంగళూరుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేల భవన్ ఐదో అంతస్తు మరుగుదొడ్డిలో నాలుగు బాంబులను ఉంచినట్లు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. గాజుల అలంకరణలో బనశంకరీదేవిబనశంకరి: బెంగళూరు నగరవాసుల ఆరాధ్య దైవం బనశంకరీదేవి గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం వేకువజామున ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిరాట్కు అభిషేకం నిర్వహించారు. అనంతరం గాజులతో అలంకరణచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. ఎస్డీపీఐ నాయకుడి అరెస్ట్ యశవంతపుర: ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) నాయకుడు రియాజ్ కడంబుకు ఉడుపి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు హిరియడ్య సబ్ జైలుకు తరలించారు. సంఘ్ పరివార్పై ద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. గత జూలైలో ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా కుంజాలు వద్ద గోవు తలను గుర్తించారు. ఇది ఒక కుట్ర అంటూ సంఘ్ పరివార్పై ద్వేషపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా, జూలై 15న ఉడుపి నగర పోలీసులు కేసు నమోదు చేశారు. గత కేసులో బెయిల్ మంజూరు చేసినా కోర్టు నియమాలను ఉల్లంఘించారంటూ మళ్లీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఉడుపి జిల్లా ఎస్పీ హరిరామ్ శంకర్ తెలిపారు. -
బీమా సొమ్ము కోసం అల్లుడి హత్య
దొడ్డబళ్లాపురం: బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి వరుసకు అల్లుడు అయ్యే వ్యక్తిని హత్య చేయించిన సంఘటన హావేరిలో చోటు చేసుకుంది. హావేరి జిల్లా రట్టిహళ్లి పట్టణ నివాసి బసవరాజు(38) హత్యకు గురైన వ్యక్తి. ఇతడి మేనమామ సిద్ధనగౌడ హత్యకు కుట్ర పన్నాడు. హత్యకు పాల్పడ్డ రాఘవేంద్ర, ప్రవీణ్, లోకేశ్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హతుడు బసవరాజుకు తల్లి, తండ్రి, తోడబుట్టినవారు అందరూ మరణించారు. ఒంటరిగా జీవిస్తున్న బసవరాజు మద్యానికి బానిసయ్యాడు. అతడి పేరున కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఆస్తులపై సిద్ధనగౌడ కన్ను పడింది. ఆస్తులను విక్రయించకుండా బంధువులు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. దీంతో సిద్దనగౌడ తానే డబ్బు చెల్లించి బసవరాజు పేరున యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. కొంతకాలం తర్వాత సెప్టెంబర్ 27న బసవరాజుకు పీకలదాకా మద్యం తాగించి బైక్ ఇచ్చి ఇంటికి వెళ్లమని చెప్పాడు. తరువాత వెనుకనే కారులో వెళ్లిన సిద్ధనగౌడ, ముగ్గురు నిందితులు బైక్ను ఢీకొట్టారు. ప్రమాదంలో బసవరాజు మృతి చెందాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించి బీమా సొమ్ము కాజేయాలని సిద్ధనగౌడ ప్రణాళిక రచించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో కుట్ర కోణం వెలుగు చూడడంతో నిందితులను అరెస్టు చేశారు. -
రేపిస్టుపై పోలీసు కాల్పులు
మైసురు : బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మైసూరు తాలూకా సిద్దలింగాపురగ్రామానికి చెందిన నిందితుడు కార్తీక్పై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన చామరాజనగర జిల్లాలో శుక్రవారం జరిగింది. కల్బుర్గి జిల్లా సుళ్తానపుర గ్రామానికి చెందిన ఆలెమారి సదామయానికి చెందిన దంపతులు తమ పిల్లలతో కలిసి మైసూరు దసరా వేడుకల్లో బెలూన్లు, ఆటల వస్తువులు విక్రయించేందుకు వచ్చారు. వస్తు ప్రదర్శన ప్రాధికార వద్ద ఇటుకులతో చిన్న గూడు ఏర్పాటు చేసుకొని రాత్రి అక్కడే నిద్రించేవారు. గురువారం ఉదయం దంపతులు నిద్రలేచిచూసేసరికి వారి పదేళ్ల కుమార్తె కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించారు. అక్కడకు సమీపంలో బాలిక అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. శరీరంపై ఉన్న గాయాలను చూసి లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు. సీసీకెమెరాను పరిశీలించి నిందితుడు సిద్దలింగాపురగ్రామానికి చెందిన కార్తీక్ అని గుర్తించారు. నిందితుడు చామరాజనగర జిల్లా కొళ్లెగాలలో కారు పార్కింగ్ వద్ద నిద్రిస్తుండగా అదుపులోకి తీసుకొని మైసూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మూత్రవిసర్జనకు అని చెప్పి ఉడాయించేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు సర్వీస్ పిస్టల్తో కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ కార్తీక్ కాలిలోకి దూసుకెళ్లగా కుప్పకూలాడు. అనంతరం అతన్ని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. కాగా హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. అరెస్ట్ అయిన నిందితుడు కోలుకున్న అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని మైసూరు నగర పోలీస్ కమిషనర్ సీమాలట్కర్ తెలిపారు. -
సుపరిపాలన, అభివృద్ధి కోసమే జీబీఏ
బనశంకరి: వేగంగా విస్తరిస్తున్న బెంగళూరు నగర సమస్త ప్రజలకు సుపరిపాలన, అభివృద్ధి కోసమే గ్రేటర్ బెంగళూరు ప్రాధికార(జీబీఏ)ను అమల్లోకి తెచ్చి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం గ్రేటర్ బెంగళూరు ప్రాధికార మొదటి సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఏర్పాటు వెనుక ఉద్దేశాలను ప్రస్తావించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకటి కంటే ఎక్కువ కార్పొరేషన్లు ఉంటే అభివృద్ధి సాధ్యమన్న కారణంతో దీనిపై నివేదిక అందించాలని మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించలేదన్నారు. దీంతో తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన అనంతరం కమిటీని పునః నియమించింది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన గ్రేటర్బెంగళూరు ప్రాధికారను అమల్లోకి తీసుకువచ్చి 5 నగరపాలికేలు ఏర్పాటు చేశామన్నారు. నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలి. రోడ్లు, డ్రైనేజీలు, పుట్పాత్, పార్కులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి ఆదర్శపాలికేలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రేటర్బెంగళూరు ప్రాధికార పనిచేయాలని అదికారులకు సిద్దరామయ్య సూచించారు. జేబీఏ సమావేశంలో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మంత్రులు రామలింగారెడ్డి, కేజే.జార్జ్, జమీర్ అహ్మద్ఖాన్, బెంగళూరు నగర ఎమ్మెల్యేలు, డీజీపీ ఎంఏ.సలీం, కమిషనర్ సీమంత్కుమార్ సింగ్, కలెక్టర్ జగదీశ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య -
హాసనాంబ దర్శనం.. పులకించిన భక్తజనం
బనశంకరి: హాసన్లో కొలువైన హాసనాంబదేవి అమ్మవారు శుక్రవారం భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ఆలయ గర్భగుడి తలుపులు తెరిచి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించారు. అంతకుముందు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున కృష్ణబైరేగౌడ ఆలయానికి విచ్చేసి భక్తులకు కల్పించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. షామియానాలు తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాలు పార్కింగ్ వ్యవస్థను పరిశీలించారు. ఎంపీ శ్రేయస్పటేల్, కలెక్టర్ లతాకుమారి, ఎస్పీ మహమ్మద్సుచేతలు ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో వేదికలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నామని మంతి తెలిపారు. బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాల్లో తొక్కిసలాట చోటుచేసుకుందని, ఇక్కడ అలాంటి ఘటనలు సంభవించకుండా ముందుజాగ్రత్తచర్యలు తీసుకున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం 10వేలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 12వేల మంది క్యూలైన్లలో ఉండగా రాత్రి 7 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు, రాత్రి 2 నుంచి 5 గంటల వరకు అమ్మవారి అలంకరణ, నైవేద్యం కారణంగా దర్శనం నిలిపివేసి మిగిలిన సమయంలో భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. -
అందుకే బిగ్బాస్ ఇంటికి తాళం.. రెండురోజుల్లో మళ్లీ షురూ
కన్నడ బిగ్బాస్ సీజన్– 12 (Kannada Bigg Boss 12) ఊపిరి పీల్చుకుంది. గురువారం నుంచి పునఃప్రారంభమైంది. బిడది వద్ద ఓ స్టూడియోలో నిర్వహిస్తున్న బిగ్బాస్కు కాలుష్య నియంత్రణ మండలితో సహా వివిధ శాఖల అనుమతులు లేవంటూ మంగళవారం నాడు జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు ఆగమేఘాలపై షోను బంద్ చేసి హౌస్కు తాళం వేయడం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేకెత్తించింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమారే మూసివేయించారని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఇది కక్ష సాధింపు చర్యగా అభిప్రాయపడ్డారు. అయితే చివరకు హౌస్ మళ్లీ తెరుచుకుంది. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిసార్టులో ఉంచిన పోటీదారులను గురువారం తెల్లవారుజామున బిగ్బాస్ స్టూడియోకు తరలించారు. హౌస్కు వెళ్లగానే కార్యక్రమం తిరిగి మొదలైంది.డిప్యూటీ సీఎం చెప్పారు: కలెక్టరుఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనల మేరకే బిగ్బాస్కు అనుమతించినట్లు జిల్లా కలెక్టర్ యశవంత్ గురకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇద్దరు కలిసి మూతపడిన గేటును తెరిచారు. ఆ తరువాత పోటీదారులు లోపలకు వెళ్లారు. దీంతో శివకుమార్కు యాంకర్, హీరో కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు.బెస్కాం నోటీసులుబిగ్బాస్ స్టూడియోలో అన్ని సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించుకోవాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని బిడది బెస్కాం ఎఈఈ మోహిత నోటీసులిచ్చి వెళ్లారు. అనుమతులు లేనందువల్ల స్టూడియోకు ఎందుకు కరెంట్ను కట్ చేయాకూడదో చెప్పాలని నోటీసులో కోరారు. పర్యావరణ అనుమతులు లేవన్న కారణంతోనే.. బిగ్బాస్ ఇంటికి ఒకరోజు తాళం వేశారు. కాగా, బిగ్బాస్కు వ్యతిరేకంగా స్టూడియో ముందు కన్నడ సంఘాలు ధర్నా చేశాయి. ఇకపోతే కన్నడ బిగ్బాస్ 12వ సీజన్.. సెప్టెంబర్ 28న ప్రారంభమైంది.చదవండి: సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్ -
బీజేపీ పక్షనేత అశోక్ డ్రైవర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బీజేపీ శాసనసభా పక్ష నేత ఆర్.అశోక్ కారు డ్రైవర్, పోలీసు ఉద్యోగి అయిన శరణగౌడ రామగోళ్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. శరణగౌడ బెంగళూరు బ్యాటరాయనపుర బాపూజీ నగరలో కుటుంబంతో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య శైలశ్రీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య నగర సమీపంలో మాగడి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తోంది. శరణగౌడ వీఐపీ సెక్యూరిటీ వింగ్లో హెడ్ కానిస్టేబుల్, అలాగే డ్రైవర్గా ఉన్నాడు. ఏం జరిగిందో కానీ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ ఆస్పత్రికి వెళ్లి శరణగౌడ మృతదేహాన్ని చూసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. శరణగౌడ చాలా మెతక మనిషి, మంచివాడని, బాధగా ఉందని చెప్పారు. తాను రెండు రోజులుగా బెంగళూరులో లేనని, ఇంతలో విషయం తెలిసి వచ్చానని అశోక్ మీడియాతో చెప్పారు. -
విద్యాభివృద్ధికి పంచవర్ష ప్రణాళిక
రాయచూరు రూరల్: విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాల్లో ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ అసమానతలతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం హైదరాబాద్ కర్ణాటక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. కళ్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయ నగర జిల్లాల అభివృద్ధిని రాష్ట్రంలో అధికారం చేపట్టిన సర్కార్లు ఈ ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రతి ఏడాది రూ.1000 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో శాసన సభ్యులు రహదారులు, పాఠశాలలు, తాగునీటి పథకాలకు నిధులను వినియోగించుకోవాల్సి ఉంది. మండలికి అధ్యక్షుడిగా శాసన సభ్యుడు అజయ్ సింగ్ నియమితులయ్యారు. కళ్యాణ కర్ణాటకలో విద్యా రంగాభివృద్ధికి కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్ సింగ్ ప్రణాళికను రూపొందించారు. ప్రతి అసెంబ్లీ పరిధిలో 50 పాఠశాలలు, 10 కళాశాల అభివృద్ధికి అక్షర ఆవిష్కార పథకం అమలుకు శ్రీకారం చుట్టి, దాని అమలుకు రూ.652 కోట్లు కేటాయించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల మెరుగునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తారు. ఈ విషయంలో విద్యా శాఖ కలబుర్గి కమిషనర్ డిగ్రీ కళాశాల విద్యా శాఖ కమిషనర్కు నివేదిక పంపారు. ప్రయోగశాల, భవనాల నిర్మాణాలు, మరుగుదొడ్లు, అభ్యాస సామర్థ్యం కల్పించడానికి చర్యలు చేపట్టారు. ప్రతి అసెంబ్లీలో 50 స్కూళ్లు, 10 కళాశాలల అభివృద్ధి పదవ తరగతి ఫలితాల మెరుగునకు ప్రత్యేక కమిటీ అక్షర ఆవిష్కార పథకం శ్రీకారానికి రూ.652 కోట్లు -
పత్తికి మద్దతు ధర ప్రకటించరూ
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పొలంలో వేసుకున్న పత్తి పంటకు నష్ట పరిహారం అందించడంతో పాటు మద్దతు ధర ప్రకటించాలని అఖిల భారత రైతు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లనగౌడ మాట్లాడారు. క్వింటాల్కు రూ.10 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించాలన్నారు. వర్షాలకు నష్టపోయిన పత్తి పంటకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు రద్దు చేయాలని కోరుతూ జిల్లాధికారి నితీష్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఏఈ ఆత్మహత్యాయత్నం హుబ్లీ: ఉన్నతాధికారుల వేధింపులతో విసిగి వేసారి జీవితంపై విరక్తి పెంచుకున్న అసిస్టెంట్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొప్పళ జిల్లాలోని కిర్లోస్కర్ కర్మాగారంలో జరిగింది. కొప్పళ తాలూకా గిణిగెరా వద్ద ఉన్న కిర్లోస్కర్ ఫ్యాక్టరీలో బసవరాజ్ అడిగ అనే సహాయక ఇంజనీర్ ఈ ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. పేదలకు ఇందిరా ఆహార కిట్లు హుబ్లీ: రాష్ట్రంలో ఇకపై అన్న భాగ్య పథకంలో భాగంగా అదనంగా 5 కేజీల బియ్యానికి బదులుగా ఇందిరా ఆహార కిట్లను పంపిణీ చేయాలని సిద్దరామయ్య మంత్రివర్గం నిర్ణయించడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. సిద్దరామయ్య మంత్రివర్గం తీసుకున్న సదరు నిర్ణయంపై పేద ప్రజలు స్వాగతిస్తున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సంబంధిత మంత్రి హెచ్కే పాటిల్ విలేకరులకు వివరించారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు వారి కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మూడు కేటగిరీలుగా విభజిస్తామన్నారు. ఒకరిద్దరు సభ్యులు ఉన్న కుటుంబంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు అర్ధకేజీ పద్ధతిన, ముగ్గురు, నలుగురు సభ్యులు ఉన్న రేషన్ కార్డు దారులకు ఒక కేజీ చొప్పున, 5 మంది కన్నా ఎక్కువ సభ్యులు ఉన్న రేషన్ కార్డుదారులకు 1.50 కేజీల చొప్పున ఆహార కిట్లు అందిస్తారన్నారు. పాఠశాల బస్సు ఢీకొని విద్యార్థి మృతి హోసూరు: ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్న ప్రమాదంలో ప్లస్వన్ విద్యార్థి మృతి చెందిన ఘటన నల్లూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. హోసూరు సమీపంలోని నల్లూరు గ్రామానికి చెందిన సురేష్ కుమారుడు ఇంద్రేష్ (18). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్వన్ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం నల్లూరు–హోసూరు రోడ్డుపై ఇంద్రేష్ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. ఆ మార్గంలో వెళ్తున్న ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంద్రేష్ను స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై నల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ● ఇంజినీర్ మృతి క్రిష్ణగిరి: మత్తూరు సమీపంలో ద్విచక్ర వాహనంపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఇంజినీర్ మృతి చెందాడు. మిత్రుడికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల మేరకు.. క్రిష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలోని జోగిపట్టి గ్రామానికి చెందిన మోహన్ (31). కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రైవేట్ పరిశ్రమలో ఇంజినీర్గా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతడి మిత్రుడు ఎళిల్తో కలిసి ద్విచక్ర వాహనంలో మత్తూరు నుంచి జోగిపట్టి గ్రామం వైపు బయలుదేరారు. ఎదురుగా వచ్చిన కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోహన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి స్నేహితుడు ఎళిల్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు ఎళిల్ను చికిత్స కోసం మత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వేశ్యావాటికపై దాడి హోసూరు: హోసూరు ప్రాంతంలో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ధర్మపురి జిల్లా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని బాగలూరు రోడ్డు ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. ఆ మేరకు పోలీసులు ఇందిరానగర్ ప్రాంతంలో గస్తీ చేపట్టారు. ఆ సమయంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కనుక్కున్న పోలీసులు.. ఆ ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు మహిళలకు విముక్తి కల్పించారు. ధర్మపురి జిల్లా పాలకోడు ప్రాంతానికి చెందిన ధనలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మేలుకోటెలో వానరాల బెడద
మండ్య: జిల్లాలోని ప్రసిద్ధ మేలుకోటె పుణ్యక్షేత్రంలో ఇటీవల కోతుల బెడద అధికమైంది. ఆలయానికి వచ్చే భక్తుల మీద దాడులకు పాల్పడుతున్నాయి. కోతులను పట్టుకుని అడవిలో వదిలేందుకు సహకరించాలని అటవీ శాఖ అధికారులకు పీడీఓ రాజేశ్వర్, జీపీ ఇన్చార్జి అధ్యక్షుడు జీకే కుమార్ లేఖ రాశారు. కోతుల దాడుల్లో పలువురు భక్తులకు రక్త గాయాలయ్యాయి. దీంతో గ్రామ ప్రజలు మేలుకోటె బంద్ చేపడతామని హెచ్చరించడంతో అధికారులు కోతుల కట్టడికి సరేనన్నారు. జీపీ అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ కోతుల బెడదతో గ్రామస్తుల ఆస్తిపాస్తులకు నష్టం వాటిల్లుతోందన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు కూడా భద్రత కరువైందన్నారు. ఈ నేపథ్యంలో కోతుల పట్టివేతకు నడుం బిగించినట్లు తెలిపారు. -
కోర్టు 5వ అంతస్తు నుంచి దూకి నిందితుడు ఆత్మహత్య
బనశంకరి: బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆవరణలో బాలికపై లైంగిక వేధింపుల (పోక్సో) కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. గౌతమ్ (35) అనే వ్యక్తిపైన ఏప్రిల్లో ఆడుగోడి పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అరెస్టు చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. చా ర్జిషీటు కూడా దాఖలు చేశారు. గురువారం కేసు విచారణ కోసం జైలు నుంచి గౌతమ్ ను సిటీ సివిల్ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు రాగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంతలో నిందితుడు హఠాత్తుగా 5వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. ఈ సంఘటన కోర్టు ఆవరణలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. కేసు వల్ల విరక్తి చెంది ఇలా చేసి ఉంటాడని అనుమానాలున్నాయి. ఈ కేసులో అతనికి భద్రతగా ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కురుబలకు ఎస్టీ హోదాకు సీఎం సిఫార్సు: బొమ్మై శివాజీనగర: కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీలోకి చేర్చేందుకు సీఎం సిద్దరామయ్య కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని బీజేపీ ఎంపీ బసవరాజ బొమ్మై చెప్పారు. తమ హయాంలోనే కుల గణన అధ్యయన నివేదిక వచ్చింది. దానిని మా ప్రభుత్వం ఆమోదించింది, కానీ అంతలోనే ఎన్నికలు వచ్చాయి, ఆ నివేదికను బట్టి సీఎం సిద్దరామయ్య కురుబలను గిరిజనుల్లోకి చేర్చాలని 2023 జులై 20న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారన్నారు. వాల్మీకులు, కురుబల మధ్య ఎలాంటి సమస్య రాదని, కానీ రిజర్వేషన్ను పెంచడం అంత సులభతరమైనది కాదన్నారు. బిగ్బాస్ స్టూడియోను బంద్ చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఉందా? అని బొమ్మై ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నీ దారి తప్పిపోతున్నాయని ఆరోపించారు. లోకాయుక్త వలలో ఆర్టీసీ అధికారి మైసూరు: ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ఫైల్ను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.10 వేల లంచం తీసుకుంటుండగా కేఎస్ఆర్టీసీ సహాయక పాలనాధికారిని లోకాయుక్త పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. మండ్యకు చెందిన సంతోష్కుమార్ తండ్రి కేఎస్ఆర్టీసీలో పని చేసేవారు. ఆయన అకాల మృతితో ఆ ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని కోరుతూ సంతోష్కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. అతని ఫైల్ను ఉన్నతాధికారులకు పంపేందుకు మైసూరు నగరంలోని బన్నిమంటప వద్ద ఉన్న కేఎస్ఆర్టీసీ కార్యాలయ గ్రామీణ విభాగపు ఏఏఓ మంజునాథ్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. మంజునాథ్ ఆఫీసులోనే సంతోష్ కుమార్ నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యమైన ఆర్ఐ బెళగావిలో! శివాజీనగర: ఉన్నతాధికారుల వేధింపులకు విసుగెత్తి అదృశ్యమైన ఉత్తర కన్నడ జిల్లా కుమటా పురసభ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేష్ బెళగావిలో ఉన్నట్లు తెలిసింది. భ ట్కళలోని ఇంటి నుంచి మంగళవారం రాత్రి లేఖ రాసి పెట్టి అదృశ్యం కావడం తెలిసిందే. పురసభ ప్రధానాధికారి ఎం.ఆర్.స్వామి వేధిస్తున్నాడని లేఖలో ఆరోపించారు. ఆర్ఐ తల్లి భట్కళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఇంటికి ఫోన్ చేసి తాను బెళగావిలో ఉన్నట్లు తెలిపారు. దీంతో భట్కళ పోలీసులు బెళగావి నగరంలోని మార్కెట్ ఠాణా పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంకటేష్ను స్టేషన్లో ఉంచారు. మహిళ ఇంటిలో చోరీ మైసూరు: మరణించిన భర్తను చూసేందుకు వేరే ఊరికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు. మైసూరు నగరంలోని శ్రీరాంపురలో జరిగింది. వివరాలు.. శ్వేతారాణి అనే మహిళ భర్త కేరళలో పనిచేస్తూ అక్కడే చనిపోయాడు. దీంతో ఆమె కర్మకాండల నిర్వహణకు అక్కడకు వెళ్లారు. ఈ నెల 6న తిరిగి ఇంటికి తిరిగి రాగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలు, అల్మరాలలో విలువైన వస్తువులు కనిపించలేదు. దొంగలు పడి బంగారు ఆభరణాలు, ప్లాటినం ఉంగరం, రూ.15 వేల విలువ చేసే విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. ఆమె కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నగరాభివృద్ధిపై మంత్రుల నిర్లక్ష్యం
రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.40 కోట్ల నిధులు రికార్డులకే పరిమితమైనట్లు జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని వివిధ సర్కిళ్లలో ఉన్న అంబేడ్కర్, బసవణ్ణ, బాబూ జగ్జీవన్ రామ్ ఉద్యానవనాల అభివృద్ధికి రాయచూరు డెవలప్మెంట్ అథారిటీ(ఆర్డీఏ) నుంచి ఫిబ్రవరిలో రూ.40 కోట్ల ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నిధులను మే నెలలో విడుదల చేసిందన్నారు. గత 5 నెలల నుంచి పనులు చేపట్టడానికి టెండర్లు పిలవాల్సిన ఇంజినీర్, మంత్రుల మాటలకు వత్తాసు పలుకుతూ మౌనం వహించారని ఆరోపించారు. జిల్లాధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రోలు కలిసి రాయచూరును సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీలిచ్చి మాట తప్పారన్నారు. మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజుల మధ్య అధికారులు ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. నగర శాసన సభ్యుడు తనకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఆయన ఖండించారు. టెండర్ ప్రక్రియపై అధికారుల మౌనం మాట తప్పిన జిల్లా స్థాయి అధికారులు రూ.40 కోట్ల నిధులు రికార్డులకే పరిమితం అయ్యాయి జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి ఆరోపణ -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
బళ్లారిటౌన్: నగరంలో గత రెండు మూడేళ్లుగా వివిధ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని బళ్లారి నాగరిక పోరాట సమితి డిమాండ్ చేసింది. బుధవారం కార్పొరేషన్ ముందు నిరసన వ్యక్తం చేసి అనంతరం కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ సోమశేఖర్గౌడ తదితరులు మాట్లాడుతూ బళ్లారి నగరంలో ఎటు చూసినా రోడ్లు గోతులమయంగా మారాయన్నారు. ఇక చాలా రోడ్ల అభివృద్ధి పనులు రెండు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నందున వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇతర రోడ్లలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందన్నారు. నగరంలో వీధి కుక్కలు, పశువుల బెడద వల్ల తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తాగునీటి కొళాయిల్లో డ్రైనేజీ నీరు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఏ వార్డులో చూసినా చెత్తకుప్పలు వెలుస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు నాగరత్న, మంజునాథ్, శ్యాంసుందర్, గురురాజ్, వీరేష్, ఆంథోని, గురళ్లి రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిరసన ర్యాలీ
సిరుగుప్ప: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయిపై బూటు విసిరిన న్యాయవాది రాకేశ్ కుమార్ను తక్షణమే దేశద్రోహ చట్టం కింద బంధించాలని దళిత సంఘర్ష సమితి నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాలు గురువారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తరువాత అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాలుష్యాన్ని నివారించాలి హొసపేటె: దేశచరిత్రలో ఇందిరాగాంధీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన మహిళ అని హామీ పథకం సభ్యురాలు జ్యోతి ఎం.గొండబాళ తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి స్వర్ణోత్సవంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కర్మాగారాలు చాలా కాలుష్యానికి కారణమవుతున్నాయని, ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు వాహనాలను తక్కువగా ఉపయోగించాలని, చెత్త విషయంలో మున్సిపాల్టీతో సహకరించాలని కోరారు. మంజునాథ్ జి.గొండబాళ, సలీం అళవండి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు బసయ్యస్వామి హిరేమట్, అక్బర్ పాషా పల్టాన్ తదితరులు పాల్గొన్నారు. 12న ఆరోగ్య పరీక్ష శిబిరం రాయచూరు రూరల్: నగరంలో ఈ నెల 12న ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యురాలు బీ.అనిత వెల్లడించారు. గురువారం పాత్రికేయులతో ఆమె మాట్లాడారు. నగరంలోని మంత్రాలయం రోడ్డులో ఉన్న ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన వ్యాధులపై పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశామని, అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రసవ పూర్వానికి గర్భ చికిత్సలు, బాలికలకు పీరియడ్స్ వంటి అంశాలపై సలహా సూచనలిస్తారన్నారు. అక్రమ సిలిండర్ల స్వాధీనం రాయచూరు రూరల్: నగరంలోని ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచుకున్న సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మక్తల్ పేటలో నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బసవరాజ్ దాడి జరిపి వంటకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను ఆటోలకు ఇంధనం(గ్యాస్)గా వినియోగిస్తున్నట్లు సమాచారం సేకరించి దాడులు చేసి 4 సిలిండర్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం త్వరగా జెడ్పీ, టీపీ, జీపీ ఎన్నికలను నిర్వహించాలని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రవిగౌడ ఒత్తిడి చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2.962 కోట్ల నిధులు తిరిగి వాపస్ వెళుతున్నట్లు తెలిపారు. వచ్చే డిసెంబర్ నెలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం ముగిసి పోతుందన్నారు. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీల్లో గత నాలుగేళ్ల నుంచి అధికారుల పాలన కొనసాగుతుండడంతో నిధులు ఏ రంగానికి వ్యయం చేయాలో విదితం కావడం లేదన్నారు. విషద్రావకం సేవించి కార్మికుడు ఆత్మహత్యకెలమంగలం: కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నొప్పులను భరించలేక జీవితంపై విరక్తి చెంది విషద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయకోట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. రాయకోట సమీపంలోని ఏరిచిన్నగానంపట్టి గ్రామానికి చెందిన మల్లప్ప (57) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో నొప్పులు తట్టుకోలేక విషద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై రాయకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
ఉద్యాననగరి.. కాలుష్య విహారి
యశవంతపుర: బెంగళూరులో స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని ప్రజలు ఆశపడడం దురాశగానే ఉంటోంది. ఉద్యాననగరిగా పేరున్నప్పటికీ కనీసం ఓ మోస్తరుగానైనా మంచి గాలి లభించడం లేదు. విపరీతంగా కట్టడ నిర్మాణాల పనులు, పరిశ్రమలు, వాహనాల పొగ తదితరాల వల్ల కాలుష్యం చెలరేగుతోంది. సెప్టెంబర్లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2025ను విడుదల చేసింది. ఇందులో సిలికాన్ సిటీ స్థానం మరింత అథోగతికి చేరింది. బెంగళూరు నగరం 28 స్థానం నుంచి 36వ స్థానానికి పడిపోయింది. రోజురోజుకూ ప్రమాద ఘంటికలు ● ఆ శాఖలకు చెందిన ఎన్క్యాప్ విభాగం నిపుణులు దేశంలోని వివిధ నగరాలలో గాలి నాణ్యత మీద సమీక్ష చేశారు. బెంగళూరు గాలిలోని నాణ్యత రోజురోజుకు పడిపోతున్నట్లు ఆందోళన వెలిబుచ్చారు. ● 10 లక్షల కంటే అధికంగా జనసంఖ్య ఉన్న నగరాలు పలు చర్యల ద్వారా గాలి నాణ్యతలను పెంచుకున్నాయి. అయితే బెంగళూరులో ఈ చర్యలు ఫలించడం లేదు. ఇక్కడ ఒక ఘనపు మీటరు గాలిలో సాధారణం కంటే ఎక్కువగా దుమ్ము ధూళి కణాలు ఉంటున్నాయి. దాని వల్ల బెంగళూరు ర్యాంకు క్షీణించింది. ● గత నివేదికలతో పోలిస్తే 2026 నాటికి వాయు స్వచ్ఛత, ర్యాంకింగ్ మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాహనాలదే పాపం సిలికాన్ సిటీలో రోజుకు సుమారు 1.5 కోట్లకు పైగా వాహనాలు తిరుగుతూ పొగ వదులుతూ, దుమ్ము రేపుతూ ఉంటాయి. దీనివల్ల గాలిలోకి ప్రమాదకరమైన కార్బన్ మోనాకై ్సడ్, కార్బన్ డయాకై ్సడ్, నైట్రస్ ఆకై ్సడ్ వంటి వాయువులతో పాటు దుమ్ము, మసిని వెదజల్లుతూ ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు. వాయు కాలుష్యానికి ప్రాథమికంగా వాహనాలు, రోడ్డుపై నుంచి వచ్చే దుమ్ము ధూళి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. అందుకే బెంగళూరులో శ్వాసకోశ జబ్బులు, కాలుష్య సంబంధ అనారోగ్యాలు అధికమయ్యాయి. స్వచ్ఛ గాలి ర్యాంకింగుల్లో మరింత క్షీణత గతేడాది 28వ స్థానం, ఈసారి 36 జనాభా, వాహనాల ఒత్తిడే కారణం సౌకర్యాలను పెంచాల్సిందే 2025 ప్రారంభంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నిర్వహించిన ప్రగతి నివేదికలోని వాహనాల నుంచి వచ్చే పొగ, రోడ్ల దుమ్ముధూళి 40 శాతం కాలుష్యానికి కారణమవుతోందని తెలిపారు. ట్రాఫిక్ను నియంత్రించటంతో పాటుగా, ఉత్తమమైన రోడ్లు, సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2024లో బెంగళూరు 170 పాయింట్లు సాధించి 28వ స్థానంలో ఉండగా, ఈసారి ర్యాంకు పడిపోవడం గమనార్హం. ఈదఫా 145 పాయింట్లే వచ్చాయి. పాలికె అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి మధ్య సహకారం లేకపోవడంతో పాటు కేంద్రం ఇచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించటం లేదని నివేదికలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ముప్పే విపరీతమైన జనాభా ఒత్తిడి, అలాగే వాహనాలు కాలుష్యంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సర్వేలో తెలిపారు. ఈ సమస్యల మధ్య బెంగళూరు పాలన యంత్రాంగానికి నగరాన్ని మాలిన్య రహితంగా ఎలా తీర్చిదిద్దాలో దిక్కుతోచడం లేదనే చెప్పాలి. పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ సృష్టికే బెంగళూరు పరిమితమైంది. స్వచ్ఛ గాలి దొరకడం లేదు, భవిష్యత్తులో బెంగళూరు ప్రజలకు ముప్పు తప్పదని పరిసరవాది విజయ్ నిశాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. -
జొన్నదంటుతో బెల్లం తయారీ
సాక్షి,బళ్లారి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు అన్నది ఒక సినిమా పాట కాదు, నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో వినూత్న తరహాలో ఆలోచనలతో పాటు అందుకు తగ్గట్టు కృషి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించడంతో పాటు ఇతరులకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలుస్తారని చెప్పవచ్చని మహాలింగప్ప అనే రైతు నిరూపించారు. ఈ ఏడాది భారీ వర్షాలతో ఉత్తర కర్ణాటక పరిధిలో 25 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోవడంతో వేలాది మంది రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఎదురు చూస్తున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అదే ఉత్తర కర్ణాటక పరిధిలోని బాగల్కోటె జిల్లా రబకవి బనహట్టి తాలూకా సంగనహట్టి గ్రామానికి చెందిన మహాలింగప్ప అనే రైతు తనకు ఉన్న వ్యవసాయ పొలంలో 10 ఎకరాల్లో మెగా జొన్నలు విత్తారు. వినూత్నంగా ఆలోచించడం వల్లే.. మూడు నెలల క్రితం విత్తిన జొన్న పంటకు అదృష్టవశాత్తు భారీ వర్షాల దెబ్బ కూడా ఈ ప్రాంతానికి అంతగా పడలేదు. అంతేకాకుండా రైతు కూడా వినూత్న తరహాలో ఆలోచించారు. జొన్నదంటు చెరుకు దంటు కంటే బలంగా ఉండటంతో పాటు ప్రారంభం నుంచి జొన్న దంటు తియ్యగా ఉండటంతో సదరు రైతు జొన్న దంటుతో బెల్లం తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా జొన్నదంటును సంబంధిత వ్యవసాయ శాఖ అఽధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రయోగశాలకు కూడా పంపారు. జొన్నదంటులో అన్ని ఆరోగ్యకరమైన పదార్ధాలు ఉన్నాయని, చెరుకు దంటులో ఏవిధమైన బెల్లం తయారీకి పాకం వస్తుందో అదే తరహాలో జొన్నదంటులో కూడా ఉందని, బెల్లం తయారు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, చెరుకు దంటు కన్నా జొన్న దంటుతో తయారు చేసిన బెల్లం తియ్యగా, రుచిగా ఉందని ల్యాబ్లో తేలడంలో సదరు రైతు తన పొలంలోని జొన్న దంటుతో బెల్లం తయారు చేశారు. దేశంలోనే సరికొత్త ప్రయోగం చేపట్టిన బాగలకోటె జిల్లా రైతన్న బెల్లం కంటే తియ్యగా ఉంటున్న జొన్నదంటుఒక ఎకరంలో దాదాపు 700 కేజీల బెల్లం తయారు చేశారు. దీంతో జొన్న విత్తనాలతో జొన్నలు పండించడంతో పాటు బెల్లం కూడా తయారు చేయడం ద్వారా సరికొత్త ప్రయోగాన్ని చేసి విజయవంతం అయ్యారు. ఈ సందర్భంగా రైతు మహాలింగప్ప సాక్షితో మాట్లాడుతూ తన పొలంలో మెగా జొన్నలు విత్తామన్నారు. పంట ఏపుగా పెరగడంతో పాటు దంటు కూడా బలంగా రావడంతో జొన్న దంటుతో బెల్లం తయారు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఆ తర్వాత అన్ని విధాలుగా ల్యాబ్ పరీక్షలు కూడా చేసిన తర్వాత జొన్నలు పండించడంతో పాటు బెల్లం తయారు చేశామన్నారు. ఒక ఎకరా జొన్నదంటుతో 700 కేజీల బెల్లం తయారు చేయగలిగామన్నారు. దేశంలో ఇలాంటి తరహా ప్రయోగం తాను చేయడం గర్వకారణంగా ఉందన్నారు. రైతులు జొన్న పంటతో చెరుకు తరహాలో బెల్లం తయారు చేస్తే, రెండు విధాలుగా లాభాలు ఉంటాయని, ఇటు జొన్నలు పండటంతో పాటు అటు బెల్లం తయారు చేయవచ్చన్నారు. -
పచ్చని నగరంగా మార్చడమే లక్ష్యం
రాయచూరు రూరల్: రాయచూరు నగరాన్ని పచ్చని నగరంగా తీర్చిదిద్దాలనే సదాశయమే ప్రధాన లక్ష్యమని నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. గురువారం మహాత్మ గాంధీ క్రీడామైదానంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, యువజన సేవా క్రీడా శాఖ, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో జరిగిన మారథాన్ను ప్రారంభించి మాట్లాడారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మారథాన్ ద్వారా యువకులు ప్రజలను చైతన్యపరుస్తారన్నారు. రహదారికిరువైపుల మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణకు ముందుండాలన్నారు. యువత దురలవాట్లుకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి సురేంద్రబాబు, వీరేష్ నాయక్, ప్రవీణ్ కుమార్, శాకీర్లున్నారు. మారథాన్లో గెలుపొందిన లింగణ్ణ, భూమిక, తిమ్మప్పలకు బహుమతులిచ్చి సన్మానించారు. -
అవినీతి పీడీఓలపై చర్యలు తీసుకోండి
బళ్లారిఅర్బన్: అవినీతి పీడీఓలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమంత జీ.యలసంగి డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని సండూరు, కంప్లి, సిరుగుప్ప, కురుగోడు, బళ్లారి తాలూకాలోని సంబంధిత గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓలు) ప్రభుత్వ నిధులను సర్కారు పేరున చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనుల సాకుతో రూ.కోట్ల చొప్పున దోపిడీ చేస్తున్నారన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు ఆ పీడీఓల అవినీతిపై తగిన చర్యలు తీసుకొని 5 గ్యారెంటీ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో తేల్చాలని అన్నారు. అంతేగాక వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి రూపాయి సంబంధిత పేద లబ్ధిదారులకు చేరాలని అన్నారు. ఈ విషయంలో జెడ్పీ సీఈఓ తదితర అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. పీడీఓల నుంచి ప్రభుత్వ నిధులను తక్షణమే రికవరీ చేసుకోవాలని ఆయన ఒత్తిడి చేశారు. ప్రముఖులు, జిల్లా అధ్యక్షుడు కట్టెస్వామి, ఎంఏ సింధికర్, డాక్టర్ జావీద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మైసూరులో మరో ఘోరం
మైసూరు: మైసూరులో అందరూ చూస్తుండగానే కారులో నుంచి లాగి ఓ వ్యక్తిని నరికివేసిన దుర్ఘటన మరువకముందే మరో ఘోరం బయటపడింది. ఆ హత్య జరిగిన వస్తుప్రదర్శన మైదానం సమీపంలో ఓ బాలిక శవం గురువారం ఉదయం లభించింది. బెలూన్లను విక్రయిస్తున్న సుమారు 13 ఏళ్ల వయస్సుగల వలస కుటుంబం బాలిక శవం దుస్తులు లేని స్థితిలో కనిపించింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. ఇటీవల దసరా ఉత్సవాల సమయంలో కలబురిగి వైపు నుంచి బెలూన్లు, ఆట బొమ్మల్ని విక్రయించే ఎన్నో కుటుంబాలు మైసూరుకు వచ్చాయి. వస్తు ప్రదర్శన మైదానం సమీపంలో టెంట్లు వేసుకుని పగలంతా వ్యాపారం చేసి రాత్రికి బస చేసేవారు. అదే ప్రకారం బుధవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి బాలిక నిద్రించింది. గురువారం ఉదయం నిద్ర లేచి చూడగా ఆమె కనిపించలేదు. టెంట్కు వెనుక భాగంలో బాలిక మృతదేహం పడి ఉంది. ఎవరైనా దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసు ఉన్నతాధికారులు, జాగిలం, ఫోరెన్సిక్ సిబ్బంది చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు పిలుచుకెళ్లి విచారణ చేస్తున్నారు. డీసీపీ బిందురాణి మాట్లాడుతూ దర్యాప్తు చేపట్టామని అన్నారు. బొమ్మలు అమ్మే బాలికపై అత్యాచారం, హత్య? -
హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలి
హొసపేటె: ధర్మస్థలలో సౌజన్యపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో 13 ఏళ్లు గడిచినా ప్రభుత్వం నిందితులను అరెస్టు చేయడంలో విఫలమైందని ధర్మస్థల దౌర్జన్య వ్యతిరేక వేదిక నేత యల్లాలింగ ఆరోపించారు. గురువారం నగరంలో సౌజన్య హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సౌజన్య హత్య కేసును పూర్తిగా తిరిగి దర్యాప్తు చేయాలన్నారు. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు వైద్య, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా ధర్మస్థల, చుట్టు పక్కల జరిగిన అసహజ మరణాలు, అత్యాచార, అదృశ్య, భూ కుంభకోణ, ఆర్థిక నేరాల కేసులను నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడానికి సిట్కు అధికారం ఇవ్వాలని తెలిపారు. దళితులు, మహిళలు, దోపిడీకి గురైన వర్గాల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. వేదిక నేతలు భాస్కర్రెడ్డి, కరుణానిధి, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. హత్యాచారంపై విచారణకు డిమాండ్ రాయచూరు రూరల్: 13 ఏళ్ల క్రితం ధర్మస్థలలో సౌజన్యపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసును సమగ్రంగా విచారించాలని ధర్మస్థల దౌర్జన్య వేదిక డిమాండ్ చేసింది. గురువారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. సౌజన్యపై అత్యాచారం, హత్య కేసుపై ప్రత్యేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్రంగా విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. -
దేశాభివృద్ధికి పెద్దల సలహాలు అవసరం
బళ్లారిటౌన్: దేశాభివృద్ధికి సీనియర్ సిటిజన్ల(పెద్దల) మార్గదర్శకాలు అత్యవసరమని జిల్లా న్యాయ సేవా ప్రాధికార కార్యదర్శి, సివిల్ న్యాయమూర్తి రాజేష్ ఎస్.హొసమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ తదితర శాఖల ఆధ్వర్యంలో గురువారం విశ్వ సీనియర్ సిటిజన్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల రోజుల్లో సీనియర్ సిటిజన్లను పక్కన పెడుతుండటం విచారకరం అన్నారు. పెద్దలను గౌరవించాలన్నారు. మౌలిక సౌకర్యాలను కల్పించాలన్నారు. సీనియర్ సిటిజన్లకు చట్టపరమైన సమస్యలు ఉంటే జాతీయ న్యాయ సేవా ప్రాధికారకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు కేఈ చిదానందప్ప మాట్లాడుతూ మన ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ సిటిజన్ల కోసం వివిధ పథకాలను చేపట్టారని గుర్తు చేశారు. ఏఎఫ్సీ నవీన్కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డీడీ రామకృష్ణ, అధికారులు గోవిందప్ప, సవిత, ఎంటీ మల్లేష్, బీ.వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన సీనియర్ సిటిజన్లను సన్మానించారు.