breaking news
Karnataka
-
సమాధి తవ్వి మృతదేహం బయటకు.. చివరికి పోలీసుల ఎంట్రీ!
పావగడ( కర్ణాటక): మహిళ మృతదేహానికి అంత్యక్రియల విషయంలో తాలూకాలోని భూపూరు తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాలూకాలోని భూపూరు తండా గ్రామానికి చెందిన రాజునాయక సరోజబాయి దంపతుల కుమార్తె శృతి (20)కి ఏడాది క్రితం తన సమీప బంధువు పవన్ కళ్యాణ్తో వివాహం జరిగింది. పవన్ కళ్యాణ్ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తుండటంతో యలహంకలో కాపురం పెట్టారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని గత శనివారం మధ్యాహ్నం శృతి తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు భర్త కారణమని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈక్రమంలో మంగళవారం శృతి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఆమె మృతదేహాన్ని భర్త నూతనంగా నిర్మించిన ఇంటి ఎదుట ఖననం చేశారు. విషయం తెలుసుకున్న తిరుమణి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి మరో చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను తిరుమణి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. -
5 ఏళ్లగా అక్రమ సంబంధం చివరికి..!
బనశంకరి( బెంగళూరు): నిశ్చితార్థం అయి, త్వరలో పెళ్లాడబోయే యువతిని యువకుడు దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన బెంగళూరు డీజే హళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. స్థానికులు యువతి జోయా (19), షబీల్ (20)కు నిశ్చితార్థమైంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో చక్కెరమండీ ఏరియాలోని తన కుటుంబానికి చెందిన పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ షబీల్ చాకుతో జోయా గొంతుకోసి హత్యచేసి ఉడాయించాడు. కొన్ని గంటలకు షబీల్ కుటుంబసభ్యులు అక్కడికి రాగా యువతి శవం కనబడింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా చేరుకుని పరిశీలించి, శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తూర్పు డీసీపీ విక్రమ్ అమటి మాట్లాడుతూ మాకు 11 గంటలకు 112 కు ఫోన్కాల్ వచ్చిందని తెలిపారు. పరారీలో ఉన్న యువకుడు అరెస్టయితే హత్యకు కారణం తెలుస్తుందన్నారు. ఆస్తి కోసం ప్రియురాలి హత్య దొడ్డబళ్లాపురం: ప్రియురాలిని హత్య చేసి పరారైన ప్రియున్ని బెళగావి జిల్లా అథణి పోలీసులు ఏపీలో శ్రీశైలంలో అరెస్టు చేశారు. వివరాలు.. అథణి నివాసి కుమార్ కల్లప్ప (34), సుజాత (34) అనే మహిళను చెరుకు తోటలో గొంతు పిసికి చంపి శ్రీశైలానికి పారిపోయాడని జిల్లా ఎస్పీ రామరాజన్ తెలిపారు. 12వ తేదీన కుళ్లిన స్థితిలో మహిళ శవం బయటపడింది. సుజాత భర్తకు దూరంగా ఉంటోంది. కొన్నాళ్లకు కుమార్తో సంబంధం ఏర్పడింది. ఇద్దరూ 5 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. సుజాతకు ఉన్న ఆస్తిని తన పేరుమీద రాయాలని నిందితుడు ఒత్తిడి చేయగా ఆమె తిరస్కరించింది. కక్ష పెంచుకుని ఈ నెల 7న ఆమెను తన చెరుకు తోటకు తీసికెళ్లి హతమార్చాడు. -
లోకాయుక్త దాడి.. కత్తితో పీడీఓ హైడ్రామా
మైసూరు: నీరుగంటి ఉద్యోగికి బకాయి వేతనం చెల్లించేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటున్న పీడీఓ లోకాయుక్తకు చిక్కారు, జిల్లాలోని హుణసూరు తాలూకాలో జరిగింది. వివరాలు.. హుణసూరు తాలూకాలోని ముళ్లూరు గ్రామ పీడీఓ మంజుల కాగా, నీరుగంటిగా పని చేస్తున్న స్వామి ఇటీవల మరణించారు. సానుభూతి ఆధారంగా స్వామి కుమారుడు మహదేవకు ఆ ఉద్యోగం లభించింది. తండ్రికి బకాయి ఉన్న రెండేళ్ల జీతం సుమారు రూ.4 లక్షలను మంజూరు చేయాలని పీడీఓ మంజులను కోరాడు. ఆమె రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కార్యాలయంలో మంజుల రూ.25 వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మంజుల చేతిని కత్తితో కోసుకుని గాయపడింది. ఆమెను మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. లంచంతో పాటు కత్తితో దాడి కేసులను నమోదు చేశారు. గ్యాస్ ఓడ రాక యశవంతపుర: పశ్చియాసియా యుద్ధంతో గ్యాస్కు కటకట ఏర్పడింది. ఈ సమయంలో హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ గ్యాస్ ఓడలు క్రమంగా దేశానికి చేరుకుంటున్నాయి. 26వేల టన్నుల ఎల్పీజీతో కూడిన ఓడ శివాలిక్ మంగళవారం మంగళూరు తీరానికి చేరింది. దానిని అధికారులు అన్లోడ్ చేశారు. దీంతో కొంచెం ఇబ్బంది తీరనుంది. మూడబిదిరె సీఐ సందేశ్పై వేటు ● మహిళను వేధించాడని కేసు నమోదు బొమ్మనహళ్ళి, యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణా సీఐ సందేశ్ లైంగిక వేధింపులపై ఓ మహిళ ఆరోపణలు చేశాక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. న్యాయం కోసం ఠాణాకు వెళ్లిన అనేక మంది మహిళలను ఇతడు అధికార బలంతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. నీ భర్తను విడిచిపెట్టాలంటూ పడక గదికై నా రావాలి, లేదా రూ.25 లక్షలు ఇవ్వు అని బెదిరించాడని ఓ మహిళ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. ఈ సీఐ మీద విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఉమానాథ కోట్యాన్ హోంమంత్రి పరమేశ్వర్కు లేఖ రాశారు. మహిళలను వేధించడం, లంచాలు డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించారు. కాగా, బాధిత మహిళ సోదరి సీఐని వెనకేసుకు రావడం గమనార్హం. సీఐ సందేశ్ నిరాపరాధి అని, కుటుంబ కలహాల నేపథ్యంలో సీఐపై మా అక్క ఆరోపణలు చేసినట్లు చెప్పింది. సీఐ సస్పెండ్ సీఐ సందేశ్ని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుధీర్కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు. పలు ఆడియోలు, వీడియోలు విడుదల కావడంతో చర్య తీసుకున్నారు. అతనిపై కేసును దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని ఏసీపీ శ్రీకాంత్ను ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలతో మూడబిద్రిలో సందేశ్పై సుమోటోగా కేసు నమోదైంది. బాధితురాలి కుమారునిపై కూడా దాడి చేశాడని ఫిర్యాదు నమోదైంది. నిన్ను రేప్ చేస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని బెదిరించాడని బాధిత మహిళ తాజాగా ఆరోపించింది. -
వృద్ధురాలి డిజిటల్ అరెస్టు
బనశంకరి: వృద్ధురాలిని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.38 లక్షలు దోచుకున్నారు. వివరాలు.. బెంగళూరు తూర్పు సైబర్ ఠాణా పరిధిలో ఇది జరిగింది. ఈ నెల 11వ తేదీన వృద్ధురాలు గీతకు ఓ ఫోన్ వచ్చింది, ముంబై బ్యాంకులో మీ పేరుతో అకౌంట్ తెరిచి ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశారని వృద్ధురాలిని బెదిరించారు. రిజర్వు బ్యాంకు మీ ఖాతాలను పరిశీలిస్తుంది, వెంటనే రూ.38 లక్షల నగదు జమచేయాలి, గంట తరువాత మీ డబ్బులు మళ్లీ అకౌంట్కు జమ చేస్తాం అని నేరగాళ్లు నమ్మించారు. గీతా నిజమేననుకుని తన వద్ద ఉన్న రూ.38 లక్షలను వంచకులు తెలిపిన అకౌంట్కు జమచేసింది. 3 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడరాదని బెదిరించారు. డబ్బు పంపిన 2 రోజుల తరువాత కూడా ఖాతాకు జమ కాకపోవడంతో సైబర్ నేరగాళ్ల మోసమని ఆమె తెలుసుకుంది. సైబర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. దంత విద్యార్థికి రూ.4.44 లక్షలు.. మైసూరు: ప్రముఖ కంపెనీల డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీని ఇప్పిస్తామని ఓ విద్యార్థిని నమ్మించిన దుండగుడు రూ.4.44 లక్షలను టోపీ వేశాడు, మైసూరులోని నిమిషాంబ బడావణె నివాసి, దంత వైద్య విద్యార్థి రోహిత్ బాధితుడు. అతనికి ఓ ఈ–మెయిల్ వచ్చింది, లాభాలు పంచే వ్యాపారం ప్రారంభించేందుకు పేరు మోసిన కంపెనీ ఉత్పత్తుల డిస్ట్రిబ్యూటరీ ఏజెన్సీని ఇప్పిస్తామని తెలిపారు. అందులో ఉన్న మొబైల్ నంబరుకు రోహిత్ సంప్రదించాడు. నీకు ఏజెన్సీ ఇప్పిస్తామని, ముందు కొంత రుసుము కట్టాలని పలు విడతల్లో రూ.4.44 లక్షలను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. మళ్లీ మళ్లీ డబ్బులు కట్టాలని మోసగాడు ఒత్తిడి చేయడంతో వంచనకు గురైనట్లు గ్రహించిన రోహిత్ కువెంపునగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉగ్రవాదులకు సహకరించావని... రూ.38 లక్షల వసూలు బెంగళూరులో ఘటన -
మంచు తుపాను?
బనశంకరి: వేసవి ఎండల మధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హఠాత్తుగా వడగండ్ల వర్షం విరుచుకుపడింది. కలఘటగి పట్టణం, పరిసరాల్లో నిమ్మకాయ సైజంత మంచుగడ్డలు ఆకాశం నుంచి పడడంతో జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. దెబ్బలు తగలకుండా సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. ఎక్కడ చూసినా నాలుగైదు ఇంచుల ఎత్తున మంచుముక్కలు పరచుకున్నాయి. తామెప్పుడూ ఇలాంటిది చూడలేదని స్థానిక ప్రజలు సంభ్రమానికి లోనయ్యారు. యువత సెల్ఫీలు, వీడియోలలో బంధించారు. వడగండ్ల ధాటికి పంటపొలాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల గుడిసెలు, పెంకుటిళ్లు సైతం ధ్వంసమయ్యాయి. బెంగళూరులో జోరువాన మరోవైపు బెంగళూరు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎండాకాలంలో వర్షం పడటంతో చల్లదనం ఏర్పడింది. బెంగళూరులో మరో రెండు మూడు రోజులు వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉగాది కి మొదటి వర్షం రావడం శుభ సూచికగా భావిస్తారు. యలహంకలో అర్ధగంటకు పైగా వర్షం కురిసింది. చిక్కమగళూరు, బెళగావి, హుబ్లీ– ధార్వాడ, బళ్లారి, విజయనగర తదితర ప్రాంతాల్లోనూ వడగండ్లు, పిడుగులతో కూడిన వానలు పడ్డాయి.ఎటుచూసినా మంచు ముక్కలు. రోడ్లు, ఇళ్ల ముందు, పొలాలు, మైదానాలు తెల్లని మంచు దుప్పటిని కప్పుకున్నాయి.. కశ్మీరు గురించి ఎవరైనా ఇలా చెబుతారు. కానీ వాతావరణం చేసిన మాయకు ధార్వాడ జిల్లాలోని కలఘటగి పట్టణం వడగండ్లతో నిండిపోయింది. అలాగే చిక్కమగళూరు జిల్లాలోనూ వడగండ్ల వాన ముంచెత్తింది. ధార్వాడ జిల్లా కలఘటగిని ముంచెత్తిన వడగండ్లు పలు జిల్లాల్లో ఆకస్మిక వానలు -
ఎస్ఎస్ఎల్సీ పరీక్షలకు వేళాయె
శివాజీనగర: విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ముఖద్వారం వంటి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. ఈసారి 9,02,889 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. రాష్ట్రంలో 15,941 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పకడ్బందీ భద్రత అక్రమాలు జరగకుండా కర్ణాటక పాఠశాల పరీక్ష, మూల్యాంక నియంత్రణ మండలి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, లోపలకు ఎవరూ మొబైల్ ఫోన్లను తీసుకురాకుండా నిషేధం, కేంద్రాల పరిసరాలలో నెట్, జిరాక్స్ సెంటర్ల మూసివేత వంటి చర్యలను చేపట్టింది. పోలీసు బందోబస్తుతో పాటు పరీక్షా కేంద్రం చుట్టుపక్కల 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయి. పరీక్షార్థులు ఆర్టీసీ, సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐ సందేశ్ సస్పెండ్
బొమ్మనహళ్ళి, యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణా సీఐ సందేశ్ లైంగిక వేధింపులపై ఓ మహిళ ఆరోపణలు చేశాక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. న్యాయం కోసం ఠాణాకు వెళ్లిన అనేక మంది మహిళలను ఇతడు అధికార బలంతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. నీ భర్తను విడిచిపెట్టాలంటూ పడక గదికైనా రావాలి, లేదా రూ.25 లక్షలు ఇవ్వు అని బెదిరించాడని ఓ మహిళ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. ఈ సీఐ మీద విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఉమానాథ కోట్యాన్ హోంమంత్రి పరమేశ్వర్కు లేఖ రాశారు. మహిళలను వేధించడం, లంచాలు డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించారు. కాగా, బాధిత మహిళ సోదరి సీఐని వెనకేసుకు రావడం గమనార్హం. సీఐ సందేశ్ నిరాపరాధి అని, కుటుంబ కలహాల నేపథ్యంలో సీఐపై మా అక్క ఆరోపణలు చేసినట్లు చెప్పింది.సీఐ సస్పెండ్ సీఐ సందేశ్ని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుదీర్కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు. పలు ఆడియోలు, వీడియోలు విడుదల కావడంతో చర్య తీసుకున్నారు. అతనిపై కేసును దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని ఏసీపీ శ్రీకాంత్ను ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలతో మూడబిద్రిలో సందేశ్పై సుమోటోగా కేసు నమోదైంది. బాధితురాలి కుమారునిపై కూడా దాడి చేశాడని ఫిర్యాదు నమోదైంది. నిన్ను రేప్ చేస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని బెదిరించాడని బాధిత మహిళ తాజాగా ఆరోపించింది. రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా -
రీల్స్ పిచ్చి.. ఇంటి యజమానిని పార్శిల్ చేసిన కుటుంబం?!
బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్కు గురి చేసింది. ఒక మహిళ, ఆమె భర్త, అత్త, మరిది కలిసి పెద్ద ప్యాకేజీని కొరియర్ సర్వీస్ ఆఫీసుకు తీసుకెళ్లారు.పార్శిల్ తరలించే ముందు దాని బరువు ఎంత ఉంది? అందులో ఏమున్నాయి? అని అడగడం సర్వసాధారణం. ఈ ఘటనలో కూడా పార్శిల్ సర్వీస్ కార్యాలయం ప్రతినిధులు ఇదే విధంగా ఆరా తీశారు. సిబ్బంది పార్శిల్ లోపల ఏముందో చెప్పాలని అడగ్గా కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. ‘మేము కష్టపడి ఇంత దూరం వచ్చాం. ఈ పార్శిల్ను తాము చెప్పిన అడ్రస్కు పంపాలి’ అని పట్టుబడుతూ వాగ్వాదానికి దిగారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది ప్యాకేజీని తెరిచి చూడగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంటి యజమాని బయటకు వచ్చాడు.కంగుతిన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.విచారణలో కుటుంబం చెప్పిన వివరణ మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఉగాది, రంజాన్ మాసంలో బస్సు, ట్రైన్ టికెట్లు దొరకకపోతే గమ్యస్థానానికి ఎలా వెళ్లాలో చూపించేందుకు ఇంటి యజమానిని తెల్లబస్తాలో పెట్టి పార్శిల్ కేంద్రానికి తీసుకువచ్చామని, ఇదంతా సోషల్ మీడియా రీల్స్ కోసం చేశామని తెలిపారు. తరువాత పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి వారు క్షమాపణలు చెబుతూ, తాము చేసిన పని బాధ్యతారహితమని అంగీకరిస్తూ వీడియోను రికార్డు చేశారు.పోలీసులు కుటుంబానికి కఠిన హెచ్చరిక జారీ చేసి, ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు మళ్లీ చేయవద్దని సూచించారు. చివరికి వారిని విడిచిపెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. వినోదం కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. Daughter & family stuff father in gunny bag, take him to courier office to "send parcel" out of Bengaluru all for a reel showing it's easier to courier a man than book bus/train tickets this festive season. Now in police station. Weird world. 😭pic.twitter.com/gGEpKeeYjM— Ghar Ke Kalesh (@gharkekalesh) March 17, 2026 -
మరో మహిళతో భర్త సంబంధాన్ని పెళ్లి అనలేం: హైకోర్టు
శివాజీనగర(బెంగళూరు): ఓ మహిళ (66) తన భర్త (77) అక్రమంగా రెండవ పెళ్లి చేసుకున్నాడని దాఖలు చేసిన కేసును హెకోర్టు కొట్టివేసింది. భర్త పర స్త్రీతో సంబంధం కలిగి ఉండడం వివాహానికి సమానం కాదు, కాబట్టి కేసు చెల్లదని స్పష్టంచేసింది. న్యాయమూర్తి నటరాజ్ కేసును విచారించారు. వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే కేసు వర్తిస్తుందన్నారు. తన భర్త మరో మహిళ (51)ను వివాహం చేసుకొన్నారు, ఆయన కుమారులు మద్దతుగా నిలిచారు అని మహిళ ఆరోపించారు. ఆ తరువాత మహిళ భర్త, కుమారులు, ఆ మహిళ కేసును రద్దు చేయాలని పిటిషన్ వేశారు. చివరకు కేసు వీగిపోయింది. -
రూ.25 లక్షలైనా ఇవ్వు, ఇంటికై నా రా
యశవంతపుర: నీ భర్తను వదిలిపెట్టాలంటే నువ్వు నా ఇంటికి రావాలి, లేదా రూ.25 లక్షలను ఇచ్చుకో అని ఓ సీఐ మహిళను వేధించిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణాలో జరిగింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడికి పోస్టింగ్ తీసుకున్నట్లు సీఐ సందేశ్ చెప్పాడని ఆ మహిళ పేర్కొన్నారు. నాపై ఫిర్యాదు చేసిన నీ భర్తను అరెస్ట్ చేశా, విడిపించుకోవాలంటే రూ.25 లక్షలు డబ్బులివ్వాలంటూ సీఐ సందేశ్ తనను ఒత్తిడి చేశారని సదరు మహిళ మంగళూరు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గత ఆగస్ట్లో తన భర్తను అరెస్ట్ చేశారని, విడుదల చేయాలని సీఐ వద్దకు వెళ్లగా అతడు చెప్పిన మాటలు విని షాక్కు గురైనట్లు మహిళ వాపోయింది. ఈ రాత్రికి పడక గదికి రావాలని అసభ్యకరంగా డిమాండ్ చేశాడని మహిళ ఆరోపించింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడి వచ్చా, నేను అడిగినంత డబ్బులిస్తేనే విడుదల చేస్తా, లేదంటే నీ భర్తపై రౌడీషీట్ను తెరుస్తానంటూ బెదిరించాడని మహిళ ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. మహిళకు సీఐ వేధింపులు -
ఉద్యోగాల భర్తీకి నేడు ఆందోళన
హుబ్లీ: రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగులు, యువత వివిధ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర ఉత్తర ప్రాంత కార్యదర్శి దర్శన్ హెగ్డే తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 43 శాఖల్లో సుమారు 2,84,881 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిలో విద్యాశాఖలో సుమారు 93 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తదితర సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నామని, సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. దంపతుల గొడవ.. ఆపబోయి వ్యక్తి మృతి● నిందితుని అరెస్టు సాక్షి బళ్లారి: ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందన్న సామెత చందంగా దంపతుల మధ్య గొడవను ఆపపోయిన వ్యక్తి మరణించిన ఘటన చిత్రదుర్గలోని బుద్ధసర్కిల్ ప్రాంతంలో జరిగింది. సాదిక్ఉల్లా అనే వ్యక్తి తన భార్యతో రోడ్డుపై గొడవకు దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న తాజ్పీర్(42) అనే వ్యక్తి భార్యాభర్తల మధ్య గొడవను ఆపబోయాడు. అయితే ఆగ్రహానికి లోనైన సాదిక్ఉల్లా మచ్చుకత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తాజ్పీర్ను వెంటనే చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్యాభర్తల గొడవ చక్కదిద్దేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలను కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు జప్తు హుబ్లీ: అక్రమంగా నిల్వ చేసిన వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్లను ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన సిద్దేశ్వర పార్కు శివసాగర్ హోటల్లో జరిగింది. సదరు అధికారులు పోలీసుల సహకారంతో ఆదివారం రాత్రి దాడి చేసి గ్యాస్తో నిండిన 25 ఫుల్ సిలిండర్లను కనుగొని స్వాధీనం చేసుకున్నారు. సదరు హోటల్ యజమాని సతీష్ బండిపై విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గోగ్యాస్ కంపెనీ ద్వారా సరఫరా అయ్యే ఆ సిలిండర్లను హోటల్లో అక్రమంగా నిల్వ చేశారు. ఇవి ఎక్కడ నుంచి సరఫరా అయ్యాయో ఆరా తీస్తున్నామని ఆహార పౌర సరఫరాల శాఖ అధికారి విజయ్కుమార్ తెలిపారు. వినియోగదారుల రక్షణకు పిలుపు రాయచూరు రూరల్: జిల్లాలో వినియోగదారుల రక్షణకు నడుం బిగించాలని జిల్లా కోర్టు అదనపు ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. అధికారులు ప్రస్తుతం వినియోగదారులకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సిలిండర్ల కొరత లేకుండా చూడాలన్నారు. కక్షిదారులు ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. రూ.1603 కోట్ల బడ్జెట్హుబ్లీ: జంట నగరాల పాలికె 2026–27వ సంవత్సరానికి గాను బడ్జెట్ను పన్నుల నిర్వహణ, అప్పీల్ స్థాయి సమితి చైర్ పర్సన్ మీనాక్షి వంటమూరి సోమవారం ప్రతిపాదించారు. ఈ మేరకు పాలికె సమావేశంలో ఆమె బడ్జెట్ వివరాలు వెల్లడించారు. మొత్తం రూ.1603.26 కోట్ల మేర ఈ బడ్జెట్లో జంట నగరాల సర్వతోముఖాభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. పాలికె వార్డుల అభివృద్ధి కోసం సభ్యుల నిధి ద్వారా రూ.120 కోట్లు, నగర నడిబొడ్డులోని చెన్నమ్మ సర్కిల్, ప్రతిమ ఆధునీకరణకు రూ.5 కోట్లను కేటాయించామన్నారు. పాలికె సభా భవనంలో జరిగిన ఈ బడ్జెట్ సమావేశంలో మేయర్ జ్యోతి పాటిల్, డిప్యూటీ మేయర్ సంతోష్ చవాన్, సభా నాయకుడు వీరేష్ అంచటగేరి, విపక్ష నేత ఇమ్రాన్ ఎలెగార, కమిషనర్ రుద్రేశ్ గాలి, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నదిలో స్నానానికెళ్లి యువకుడు గల్లంతు రాయచూరు రూరల్ : నదిలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతైన ఘటన విజయపుర జిల్లాలోని ఇండి తాలూకా పడనూరులో జరిగింది. ఉదయం స్నానం కోసం నది వద్దకు వెళ్లిన అనిల్ పూజారి(23) నీటిలోకి దిగాడు. అయితే అక్కడ లోతుగా ఉండటంతో నీటిలో మునిగి ఈత రాక మరణించాడు. మృతుని ఆచూకీ కోసం నదిలో గాలించామని, ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇండి పోలీసులు తెలిపారు. -
రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి
సాక్షి బళ్లారి: రైతుల పంపుసెట్లకు ప్రతి రోజు నిరంతరాయంగా 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. సోమవారం జిల్లాలోని కురుగోడు పట్టణంలో ఏఐకేకేఎంఎస్, రైతు సంఘం ఆధ్వర్యంలో కర్ణాటక విద్యుత్ ప్రసార మండలి కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి గురళ్లి రాజు మాట్లాడుతూ రైతులకు విద్యుత్ కోతను విధించకూడదన్నారు. వేసవి ఎండలతో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో విద్యుత్ కోతను విధించడం వల్ల రైతులు పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాత్రి పూట కాకుండా పగటి పూటే నిరంతరాయంగా 7 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఈఏడాది తుంగభద్ర జలాశయం గేట్ల మరమ్మతు పనులు చేస్తున్నందున రెండో పంటకు నీటి సరఫరా నిలిపేశారన్నారు. రైతుల జీవితాలు దుర్భరం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా ఉందన్నారు. పంపుసెట్ల ద్వారా లభించే నీటితో రెండో పంటకు నీరు సక్రమంగా అందించేందుకు 7 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ముష్టిగట్టి, గెణికెహాళు తదితర గ్రామాల రైతులు పంపుసెట్ల ద్వారా పంటలకు నీటిని అందించడానికి విద్యుత్ కోత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోవడం, తక్కువ ఓల్టేజ్ ఉండటం వల్ల రైతులు రాత్రంతా బోరుబావుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిరంతరాయంగా 7 గంటలు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు మరో 2 గంటలు అదనంగా సరఫరా చేస్తే రైతులకు మేలు చేకూరుతుందన్నారు. రైతు సంఘం నాయకులు బసవనగౌడ, గాదిలింగ, దేవణ్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కదం తొక్కిన రైతు సంఘం నేతలు కేపీటీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా -
పునీత్ ప్రతిమకు అభిషేకం
బళ్లారిఅర్బన్: నగరంలోని జిల్లా స్టేడియం సమీపంలో ఉన్న దివంగత కన్నడ సినీ నటుడు, కర్ణాటక రత్న డాక్టర్ పునీత్ రాజ్కుమార్ ప్రతిమను సోమవారం మహానగర పాలికె సిబ్బంది నీటితో అభిషేకించి శుభ్రపరిచారు. నిర్మితి కేంద్ర సమీపంలో రూ.కోట్లాది వ్యయంతో భారీ చెరువు నిర్మించి అదే ప్రాంగణంలో సుమారు 20 అడుగుల ఎత్తైన డాక్టర్ పునీత్ రాజ్కుమార్ ప్రతిమను ఏర్పాటు చేశారు. అయితే క్రమంగా నిర్వహణ కరువవడంతో ప్రతిమపై దుమ్ము, ధూళి పేరుకోవడంపై స్థానికుల ఫిర్యాదు మేరకు మేయర్ గాదెప్ప అక్కడికి చేరుకొని పరిశీలించారు. వెంటనే ప్రతిమను నీటితో అభిషేకించి శుభ్రం చేయించారు. అదే విధంగా చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రం చేయాలని ఆదేశించారు. -
చింత.. రైతుకు నిశ్చింత
హొసపేటె: చింత పండు సాగులో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుతం చింతపండు రైతులకు బంపర్ లాభాలను తెచ్చిపెడుతోంది. భారతీయ వంటల్లో చింతపండుకు ప్రత్యేక స్థానం ఉంది. ఉప్పు తర్వాత ప్రత్యేక స్థానం ఉన్న పదార్థం చింతపండు అని చెప్పవచ్చు. ఇప్పుడు గత రెండేళ్లుగా చింతపండు ధర బాగా పెరిగింది. గత సంవత్సరం కిలో చింతపండు ధర రూ.100–రూ.120 మధ్య ఉండేది. అదే ధర ఇప్పుడు ఏపీఎంసీ మార్కెట్లో కిలోకు రూ.200 నుంచి రూ.220కి పెరిగింది. దేశంలో చింతపండు చెట్ల సంఖ్య తగ్గడం, ఉత్పత్తి క్షీణించడం, కూలీల కొరత, అధిక డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల చింతపండు ధర ఆకాశాన్నంటింది. చింతపండు పంటను ప్రధానంగా కర్ణాటకలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో పండిస్తారు. చింతపండు ధర పెరుగుదల, సాగులో రెండు ప్రధాన సవాళ్లు పెంపకందారులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ప్రధానంగా పండించే జిల్లాలు ఇవే.. చింతపండును ప్రధానంగా కోలారు, తుమకూరు, బళ్లారి, విజయపుర, బెళగావి, రాయచూరు, విజయనగర, ధార్వాడ జిల్లాల్లో పండిస్తారు. చింతపండు సాగు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. చింతపండు చెట్లు ఎక్కి కోసే వారి సంఖ్య తగ్గింది. అలాగే చింతపండు ప్రాసెసింగ్ కోసం కొత్త సాంకేతికత, యంత్రాలను అభివృద్ధి చేయలేదు. చింతపండు సేకరణ పరంగా చాలా సవాళ్లు ఉన్నాయి. ఈ కారణాలన్నింటి వల్ల చింతపండు పెంపకం ఇబ్బందుల్లో ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ చింతపండుకు డిమాండ్ ఏటేటా పెరుగుతోంది. చింతపండు ధర కూడా పెరిగింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం చింతపండుకు అసాధారణ డిమాండ్ ఉంది. తక్కువ సరఫరా కూడా ధర పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. కర్ణాటకలో చింతపండు ప్రధాన పంటకోత కాలం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఎండాకాలం పండ్లను కోయడానికి, ప్రాసెస్ చేయడానికి, ఎండబెట్టడానికి ఉత్తమ సమయం. సరఫరా పెరిగితే ఏప్రిల్ వరకు పంట కొనసాగే అవకాశం ఉన్నందున ధరలు తగ్గవచ్చని అంచనా. కోల్డ్ స్టోరేజీలు అవసరం చింతపండు సేకరణలో ప్రధాన సమస్య కోల్డ్ స్టోరేజీలు, వర్షం పడినప్పుడు ఈ పంట రంగుపోతుంది. చింతపండు పండించే రైతులకు సురక్షితమైన నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు అవసరమని రైతులు డిమాండ్ చేశారు. తుమకూరు హోల్సేల్ మార్కెట్లో మంచి నాణ్యత గల చింతపండు క్వింటాలుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల ధర వరకు అమ్ముడవుతోంది. కానీ నాణ్యత లేని ఉత్పత్తులతో ధర తగ్గుముఖం పట్టింది. మార్కెట్లో చింతపండు ధరకు రెక్కలు ధరల పెరుగుదలతో రైతులకు లాభాలుచింతపండు సాగుకు ప్రాధాన్యత మెండు కరువు కాలంలో కూడా పేదలకు ఉగాది పండుగను అందించే పంట చింతపండు అని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నానుడి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చింతపండు సాగుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చింతపండు సాగు వేలాది మంది రైతుల జీవితాలను తీర్చిదిద్దింది. మారుతున్న కాలంలో, చింతపండు పండించే రైతులకు సహాయ సహకారాలు, మార్గదర్శనం అవసరం. వర్షధార పంటల్లో చింతపండు ఒక ముఖ్యమైన వాణిజ్య పంటగా కూడా ఉద్భవించింది. వ్యవసాయ కూలీలు, యంత్రాల కొరత చింతపండు పంట సాగులో ప్రధాన సమస్యగా ఉంది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. -
కాన్పు తర్వాత కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలి
సాక్షి బళ్లారి: మాతృత్వ సెలవుల తర్వాత మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ విధుల్లో చేరడానికి, వారి పిల్లల సంరక్షణకు అనుకూలంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విధాన పరిషత్ సభ్యుడు వైఎం. సతీష్ పేర్కొన్నారు. సోమవారం విధాన పరిషత్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గర్భధారణ సమయంలో ముందుగా 6 నెలలు పుట్టిన శిశువును చూసుకోవాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుందన్నారు. మానవతా దృక్పథంతో ఆరు నెలలకే పరిమితం చేయకుండా, ఆమె కోరుకున్న స్థలంలో ఐదేళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రశ్నపై స్పందించిన మంత్రి ఎస్.మధు బంగారప్ప మాట్లాడుతూ శిశు సంరక్షణ సెలవులు మంజూరుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. జీవో ప్రకారం చర్యలు ప్రభుత్వ జీవో ప్రకారం శిశు సంరక్షణ సెలవుల కోసం వచ్చిన దరఖాస్తులు 15 రోజుల్లోపు ఆమోదించేందుకు సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ఆమె సెలవు రోజుల్లో ఆ స్థానంలో పని చేసేందుకు అతిథి ఉపాధ్యాయులను కూడా నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించామన్నారు. విధాన పరిషత్లో ఎమ్మెల్సీ సతీష్ విజ్ఞప్తి -
మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్ : నగరంలో 20 చోట్ల కొత్తగా రూ.2.50 కోట్లతో మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు సిటీ కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహాపాత్రో వెల్లడించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో 2026–27వ బడ్జెట్ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహాత్మాగాంధీ మిషన్ కింద రూ.200 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. కార్పొరేటర్లు మహావీర్, వెంకటేష్, భాస్కర్, కార్పొరేషన్ అధికారులు శరణప్ప, సంతోష్, భరత్, సంతోష్రాణి, కృష్ణ శావంతగేరలున్నారు. పాత్రికేయులకు నిధులు కేటాయించాలి నగర పరిధిలో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు సిటీ కార్పొరేషన్ నుంచి 2026–27వ బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ అధ్యక్షుడు విజయ్ జాగటగల్ డిమాండ్ చేశారు. సోమవారం సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రేపు వాక్థాన్బళ్లారిఅర్బన్: మానవ అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 18న వాక్థాన్ నిర్వహిస్తున్నట్లు తారనాథ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశేఖర్ గాణిగేర్ తెలిపారు. సోమవారం పత్రికా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోజు ఉదయం 7.30 గంటలకు బళ్లారి మెడికల్ కళాశాల మైదానంలో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ వాక్థాన్ను జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వైద్య కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటారన్నారు. గ్రంథాలయం ప్రారంభించరూ రాయచూరు రూరల్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో తిరిగి గ్రంథాలయం ప్రారంభించాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నాగరాజ్ మాట్లాడారు. అనంతరంఏడీసీ శివానందకు వినతిపత్రం సమర్పించారు. -
కార్యవర్గం నియామకం
బళ్లారిఅర్బన్: కౌల్బజార్ ఫిర్కాలో బీజేపీ బలోపేతానికి మండల కమిటీతో పాటు 7 మోర్చాలకు కొత్త కార్యవర్గాలను నియమించారు. మండల అధ్యక్షుడు ఏ.నాగరాజరెడ్డి సంతకంతో సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. మహిళా మోర్ఛా అధ్యక్షురాలిగా లత, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా సుంకన్న, ఎస్టీ మోర్ఛా అధ్యక్షుడిగా రాజశేఖర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఆర్.శేఖన్న, రైతు మోర్చా అధ్యక్షుడిగా వెంకటేష్, యువమోర్ఛా అధ్యక్షుడిగా బట్టి గాదిలింగ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా మహమ్మద్ గౌస్ నియమితులయ్యారు. ఇదే సమయంలో మండల కమిటీకి కూడా కార్యవర్గాన్ని నియమించారు. మండల అధ్యక్షుడిగా ఏ.నాగరాజరెడ్డి కొనసాగుతుండగా, కొండి మల్లికార్జున, వెంకటేష్ గురురాజ్, రామచంద్ర, హనుమంతరావు, మహమ్మద్ ఖదీర్లను ఉపాధ్యక్షులుగా నియమించారు. ఎంపీ రాజేష్, జీ.అవినాష్ నాయుడు ప్రధాన కార్యదర్శులుగా, ఈ.మూర్తి, వి.శ్రీధర్, యేసు, నీలకంఠ ఆచార్య, మల్లేష్, అన్నక్లర్ కార్యదర్శులుగా నియమితులయ్యారు. అలాగే జీ.అభిలాష్ నాయుడు కోశాధికారిగా, వీజే జోసెఫ్ కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగాలను భర్తీ చేయండి రాయచూరు రూరల్: జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని కన్నడ సేనె డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు బసవరాజ్ మాట్లాడారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరక్ష్యం వహించకుండా వెంటనే భర్తీలకు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. జిల్లాలో 1,454 ప్రాథమిక, 239 హైస్కూళ్లున్నాయని, వాటిని త్వరితగతిన భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కన్నడ నామఫలకాలు, నేమ్ బోర్డులు అలవరించేలా చూడాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో గోవిందప్ప, నాగప్ప, అమరేష్, మంజునాథ్, శివరాజ్, వీరనగౌడ, రామప్ప, పరశురామ్లున్నారు. నాయకత్వ లక్షణాలు పెంచాలి చెళ్లకెరె రూరల్: వ్యాయామ ఉపాధ్యాయులు కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని తాలూకా విద్యా శాఖ అధికారి కేఎస్.సురేష్ తెలిపారు. ఆయన మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులదేనన్నారు. -
సామాజిక బహిష్కారానికి మహిళ బలి
రాయచూరు రూరల్ : సామాజిక బహిష్కారం మనస్తాపానికి గురైన ఓ మహిళ నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా జోళదడిగిలో చోటు చేసుకుంది. ఓ మహిళతో తన కుమారుడు ఎర్రిస్వామి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ సమాజం నుంచి బహిష్కార నిర్ణయం ప్రకటించడంతో మనస్తాపం చెందిన యాదగిరి నివాసి కమలమ్మ(42) తన కుమార్తె ఉన్న జోళదడిగికి వెళ్లింది. అక్కడ భీమా నది బ్రిడ్జి కం బ్యారేజీ వద్ద మంగళ సూత్రాన్ని పెట్టి పైనుంచి దూకడంతో మరణించింది. ఘటనపై వడగేర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీసిన అక్రమ సంబంధం
● యువకుడు దారుణ హత్య రాయచూరు రూరల్ : మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్న ఓ యువకుడు హత్యకు గురైన ఘటన రాయచూరు తాలూకాలోని బుళ్లాపురలో జరిగింది. గ్రామానికి చెందిన ప్రాణేష్(23) అనే యువకుడిని దిన్ని గ్రామానికి చెందిన ప్రసాద్, మల్లికార్జున, మల్లేష్ హత్య చేశారని ఇడపనూరు పోలీసులు తెలిపారు. గత మూడు నెలలుగా ప్రసాద్ భార్యతో ప్రాణేష్ అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. ఈ విషయం గ్రహించిన ప్రసాద్ తన సహచరులతో కలిసి ప్రాణేష్ హత్యకు ప్రణాళిక రచించాడు. ఆదివారం ప్రాణేష్ బుళ్లాపురలో ఉన్నట్లు తెలుసుకున్న నిందితులు అక్కడికి వెళ్లి ప్రాణేష్ను గొడ్డళ్లతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కల్తీ కల్లు విక్రేత అరెస్ట్ రాయచూరు రూరల్ : నగరంలో కల్తీ కల్లు, సీహెచ్ పౌడర్ విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పడమటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మంజునాథ్ వెల్లడించారు. సోమవారం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉద్యానవనంలో వంశీ, మహ్మద్ హాజీలను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 63 లీటర్ల కల్తీ కల్లు, సీహెచ్ పౌడర్ను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పక్షులకు నీటి తొట్టెల ఏర్పాటు హొసపేటె: ఎండ తీవ్రత నుంచి పక్షులు, ప్రాణుల దాహార్తి తీర్చేందుకు నగరంలోని జంబునాథ్ నగర నివాసులు నడుం బిగించారు. వేసవిలో ఎండల తీవ్రతకు దాహంతో అలమటించే పక్షులు, ప్రాణుల కోసం నీటిని, ఆహారాన్ని అందించడం మానవత్వానికి, పర్యావరణ పరిరక్షణకు నిదర్శనంగా చెప్పవచ్చు. సోమవారం జంబునాథ్ నగర నివాసులు తమ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో, ఇళ్ల మేడ మీద, చెట్ల పొదల్లో ప్లాస్టిక్, మట్టి పాత్రలలో నీరు నింపి పెట్టి, వాటిని ప్రతి రోజూ శుభ్రం చేసి మారుస్తూ పక్షులకు, జంతువులకు దాహార్తిని తీర్చుతున్నారు. పక్షి ప్రేమికులు తమ చిన్నపాటి సహాయంతో వందలాది పక్షుల దాహాన్ని, ఆకలిని కూడా తీరుస్తూ మానవత్వాన్ని చాటారు. పంచాంగం పంపిణీ చెళ్లకెరె రూరల్: మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల సూచన ప్రకారం ఉగాది సందర్భంగా నగరంలోని పేద బ్రాహ్మణులకు పరాభవ నామ సంవత్సర సూర్య సిద్ధాంత పంచాంగాన్ని ఉచితంగా అందజేశారు. దివాన్ డాక్టర్ మాధవాచార్, బాలాజీ రావు, రమాదేవి, సుజాత, రక్షిత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార మేళాతో వ్యవహార జ్ఞానం వృద్ధి హొసపేటె: తాలూకాలోని కడ్డిరాంపుర గ్రామంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో యాంకర్– మెట్రిక్యులేషన్, బిజినెస్ ఫెయిర్ అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పాఠశాల ఎస్డీఎంసీ సభ్యులు ప్రశాంత్ మాట్లాడుతూ పిల్లలకు వ్యాపారం, వాణిజ్య వ్యవహారాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లలకు వ్యాపార జ్ఞానం పెరుగుతుందన్నారు. పిల్లలు వివిధ రకాల వాణిజ్యం, వ్యాపారాల గురించి జ్ఞానాన్ని పొందారు. జీపీ సభ్యుడు షణ్ముఖప్ప, శివనాయక్, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ వదంతులను నమ్మొద్దు
హొసపేటె: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వదంతులు, తప్పుడు వార్తల వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. వీటిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ ఉత్పత్తి, బాట్లింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతోంది. అలాగే తగినంత నిల్వ కూడా అందుబాటులో ఉంది. అయితే చాలా మంది వినియోగదారులు ఒకేసారి గ్యాస్ బుక్ చేసుకోవడం వల్ల సర్వర్పై ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి సిలిండర్ బుకింగ్కు గడువు ప్రతి సిలిండర్ అందిన తర్వాత పట్టణ, నగర ప్రాంత వినియోగదారులు తదుపరి సిలిండర్ను బుక్ చేసుకోడానికి 25 రోజుల గడువు, గ్రామీణ ప్రాంతాల వారికి ఈ గడువు 45 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. ఐవీఆర్ఎస్ మిస్డ్ కాల్ పద్ధతే కాకుండా వాట్సాప్ మొబైల్ యాప్, పేమెంట్ అప్లికేషన్ల(ఫోన్ పే/పేటీఎం) ద్వారా కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఏదైనా ఫిర్యాదు లేదా సాంకేతిక సమస్య ఉంటే ప్రజలు ఆహార తనిఖీ అధికారులను సంప్రదించాలని కోరారు. గృహావసరాల కోసం ఉద్దేశించిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం లేదా వాటిని అక్రమంగా నిల్వ చేయడం శిక్షార్హమైన నేరం. ఇలాంటి కేసులు ఏవైనా తమ దృష్టికి వస్తే సమాచారం అందించాలని సూచించారు. తగినంత సిలిండర్ల నిల్వ ఉంది జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి -
దుబాయ్ ఫ్లైట్ వెనక్కి
యశవంతపుర: బెంగళూరు కెంపేగౌడ విమానశ్రయం నుంచి దుబాయ్కి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం అక్కడ ల్యాండింగ్కు అనుమతించని కారణంగా మళ్లీ బెంగళూరుకు వచ్చేసింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు బెంగళూరు నుంచి దుబాయ్కి బయల్దేరింది. కానీ అక్కడ యుద్ధ పరిణామాల వల్ల విమానం దిగడానికి దుబాయ్ అధికారులు అనుమతించలేదు, దీంతో విమానం మళ్లీ బెంగళూరుకు వాపస్ వచ్చింది. వందలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కట్టెలతో బడి భోజనం యశవంతపుర: గ్యాస్ సమస్య కుటుంబాలకే కాకుండా ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలకు కూడా కష్టాలు తెచ్చింది. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా కొట్టిగేహర సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్యాస్ సిలిండర్లను లేనందున కట్టెలపై మధ్యాహ్న భోజనాన్ని వండారు. గ్యాస్ను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అదేశించినా గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది పట్టించుకోలేదని వంట సిబ్బంది ఆరోపించారు. చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా వంట గ్యాస్తో పాటు వాహనాలకు గ్యాస్ దొరకడం లేదు. వందలాది మంది డ్రైవర్లు ఆటోలతో బంకుల ముందు క్యూ కట్టారు. చిక్కమగళూరు– మూడిగెరె మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పాత బంగ్లాలో బాలుడు దుర్మరణం● ఫొటో షూట్లో ప్రమాదం బనశంకరి: ఫొటో షూట్ మోజు ప్రాణాల మీదకు వస్తోంది. ప్రమాదకర ప్రాంతాల్లో ఛాయాచిత్రాలు తీసుకుంటూ ప్రమాదంలోకి పడిపోతున్నారు. ఇదే మాదిరిగా బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పరిధిలో పాత కట్టడం మీద నుంచి పడి నిశాంత్ (15) అనే బాలుడు చనిపోయాడు. వివరాలు.. శనివారం సాయంత్రం ఉళ్లాలవాసి నిశాంత్, అతని ఇద్దరు స్నేహితులు పాత బంగ్లా ఉందని తెలిసి ఫొటో షూట్కు వెళ్లారు. ఇటీవలే వీరు సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు రాశారు. సరదాగా ఫొటోలు తీసుకుంటూ రెండో అంతస్తు వరకు వెళ్లారు. ఈ సమయంలో గోపురం వంటి కట్టడం మీదకు ఎక్కిన నిశాంత్ ఫొటోలు తీయాలని స్నేహితులకు చెప్పాడు. కొంతసేపటికి పట్టుతప్పి 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. స్నేహితులు అతనిని ఓ అంబులెన్సును పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి మరణించాడని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. విమానాశ్రయంలో గంజాయి సీజ్ యశవంతపుర: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.39.37 లక్షల విలువగల 1.12 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. థాయ్లాండ్ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీలు చేయగా, ఫోటో ప్రేమ్లో గంజాయిని పెట్టుకొని వచ్చినట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్లు శివాజీనగర: అందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త టోర్నీ ఆరంభానికి క్షణగణన ఆరంభమైంది. బెంగళూరు ఎం.చిన్నస్వామి మైదానంలో మ్యాచ్లకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ (కేఎస్సీఏ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 28వ తేదీన ఆర్సీబీ– హైదరాబాద్ సన్రైజర్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ చిన్నస్వామి మైదానంలో జరగనుందని తెలిసింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక్కడే మరికొన్ని మ్యాచ్లు కూడా జరిగే అవకాశముంది. గ్యాస్ ట్యాంకర్ పల్టీ యశవంతపుర: హైవేలో ఎల్పిజీ గ్యాస్ ట్యాంకర్ రోడ్డుపై పల్టీ పడింది. అతి వేగంగా వస్తూ అదుపుతప్పి పల్టీ పడడంతో గ్యాస్ లీక్ మొదలై స్థానికుల్లో అందోళన నెలకొంది. పైర్ సిబ్బంది పరిశీలించి అపాయం లేదని తేల్చారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో వేడెక్కకుండా ట్యాంకర్పై నీళ్లు చల్లారు. ఉడుపి సమీపంలోని కటపాడి వద్ద మంగళూరు–ఉడుపి మార్గంలో ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం మంగళూరులో గ్యాస్ను నింపుకొని ఉడుపి వైపు వెళుతుండగా పల్టీ పడింది. రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
దుర్గమ్మ, ఉడాలమ్మ రథోత్సవం
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర తాలూకా హాళేకోటె హోబలి హరిహరపురలో వెలిసిన శ్రీ దుర్గా పరమేశ్వరి, ఉడాలమ్మ జాతర సోమవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉదయం నుంచే అమ్మవార్లకు విశేష పూజలు, నైవేద్యాలు సమర్పించారు. శ్రీదేవి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి తేరును లాగారు. చుట్టూ ఏడు గ్రామాల నుంచి భక్తులు రథం, పూల బండ్లను అలంకరించి జాతరకు తీసుకువచ్చారు. ఆలయం ముందు తవ్విన గుంతలో నుంచి నడిచారు. మైసూరు సిటీ బస్సుల్లో దొంగల గోల మైసూరు: రాచనగరి సిటీ బస్సుల్లో మహిళలు ప్రశాంతంగా ప్రయాణించలేకపోతున్నారు. దీనికి కారణం దొంగలే. రెండు వేర్వేరు సంఘటనల్లో, బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల వ్యానిటీ బ్యాగుల నుంచి దొంగలు బంగారు ఆభరణాలను దొంగిలించారు. కె.ఎన్.పుర నివాసి మానస, సిటీ బస్టాండ్కు వెళ్లడానికి మైసూరులో అక్షయ భండార్ బస్టాండ్ నుండి సిటీ బస్సు ఎక్కారు. ఆ సమయంలో బస్సులో రద్దీగా ఉంది. ఆమె వ్యానిటీ బ్యాగ్ నుంచి దాదాపు రూ.1.32 లక్షల విలువైన బంగారు నగలను దొంగలు కాజేశారు. మరో ఘటనలో హెబ్బాళ నివాసి మహాదేవమ్మ సిటీ బస్టాండు నుంచి తమ ప్రాంతానికి వెళ్లే బస్సు ఎక్కారు. ఆమె బ్యాగులో నుంచి రూ. 2 లక్షల విలువైన నగలను ఎవరో దొంగిలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అడుగుకో టెంకాయ ఫట్ గౌరిబిదనూరు: సుమారు 48 సంవత్సరాల తరువాత మంచేనహళ్ళి తాలూకా మావినకాయిహళ్ళిలో ఆదివారం రాత్రి దాకా కొబ్బరికాయ శాంతి ఉత్సవం జరిగింది. సుమారు 12 గంటల పాటు నిరవధికంగా బాలరెడ్డిపల్లి నరసింహ స్వామి పూజారి మావినకాయిహళ్ళి నుంచి అరసాలబండ వరకు నడిచి వెళ్లారు. ప్రతి అడుగుకు మావినకాయిహళ్ళిలోని ప్రతి కుటుంబం టెంకాయలు కొట్టారు. ఇలా వేలాది టెంకాయలు బద్ధలయ్యాయి. గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బాగా వర్షాలు పడి పంటలు పండాలని ఈ శాంతి ఉత్సవం జరుపుతారు. ఇంటింటికీ బంధువులు రావడంతో సందడి నెలకొంది. కన్నడ రచయితకు సాహిత్య అకాడమీ అవార్డుశివాజీనగర: కన్నడ ప్రముఖ సాహితీవేత్త అమరేశ నుగడోణికి 2025వ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించింది. ఆయన రచించిన ‘దడ సేరిసు తందె’ అనే కన్నడ కావ్యానికి ఈ గౌరవం లభించింది. అవార్డు కింద రూ.1 లక్ష నగదు, అవార్డు పత్రం, జ్ఞాపిక అందజేస్తారు. కన్నడ గ్రామీణ జీవితాలను తన కథల ద్వారా తెలియజేసే నుగడోణికి ఈ అవార్డు లభించడం పట్ల సాహితీవేత్తలు సంతోషం వ్యక్తంచేశారు.ఉద్యోగినులకు ఆటల పోటీలు చిక్కబళ్లాపురం: మహిళా దినోత్సవాల సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని సర్ ఎం.విశ్వేశ్వరయ్య క్రీడా మైదానంలో మహిళా ఉద్యోగుల ఆటల పోటీలను కలెక్టర్ జి.ప్రభు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు కుటుంబంలో అనేక ముఖ్య పాత్రలను పోషిస్తున్నారని, మానవ జాతికి గొప్ప సేవలందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జడ్పీ సీఈఓ నవీన్భట్, మహిళా శిశు అభివృద్ధి శాఖ డీడీ ఆర్.వెంకటేశ్రెడ్డి, జయలక్ష్మి బాయి, నౌతాజ్ తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లకు గ్యాస్ గండం
శివాజీనగర: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల ఏర్పడిన వంట గ్యాస్ సిలిండర్ల కొరత బెంగళూరుతో పాటు పలు జిల్లాల్లో 7వ రోజుకు చేరింది. కమర్షియల్, గృహ అవసరాల సిలిండర్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో రాష్ట్రంలోని హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే హోటళ్ల యజమానులు గ్యాస్ కరువై వారే ఆకలితో ఖాళీ కడుపుతో ఉంటున్నారు. గత ఐదు రోజుల్లో రూ.100 కోట్లకు పైగా నష్టం జరిగిందని హోటల్ యజమానుల సంఘం సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 40 వేలకు పైగా హోటల్లు పనిచేస్తున్నాయి. గ్యాస్ లభించక వ్యాపారం తగ్గి ఆదాయం పడిపోయంది. కాబట్టి హోటల్ పరిశ్రమకు ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరారు. 20 శాతం గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా హోటళ్లు పూర్తిగా దారిలో పడడానికి చాలా సమయం పడుతుందన్నారు. అనేక హోటళ్లు, క్యాంటీన్లలో కట్టెల పొయ్యిలు వెలిశాయి. శీతల పానీయంపై గ్యాస్ పన్ను గ్యాస్ కొరత వల్ల బెంగళూరులో అనేక హోటళ్లు మూతపడగా, ఉన్న హోటళ్లలో గ్యాస్ ఫీజును కస్టమర్లపై బాదుతున్నారని ఆరోపణలున్నాయి. శీతల పానీయంపై కూడా గ్యాస్ పన్ను వేయడం వివాదాస్పదమైంది. పుదీన– నిమ్మరసం పానీయంపై 5 శాతం గ్యాస్ క్రైసిస్ చార్జ్ అని డబ్బులు వసూలు చేశారు. ఆ కస్టమర్ ఈ బిల్లును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒక్కొక్కరికి రూ.179 ధరతో రెండు పుదీన నిమ్మ పానీయాలను ఇచ్చారు. ఇందులో గ్యాస్ చార్జీ కూడా ఉండడంతో ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఆ పానీయం తయారీకి గ్యాస్ మంటతో పని లేదని, చార్జీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఇప్పటికీ సరఫరా అంతంతే రూ.100 కోట్లు నష్టమంటున్న యజమానులు గృహ సిలిండర్లకూ రద్దీ -
స్పీకర్ గుస్సా.. వాకౌట్
శివాజీనగర: విధానసభలో ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పడం లేదని సాధారణంగా ప్రతిపక్షాలు ఆరోపించి వాకౌట్ చేస్తాయి. కానీ స్పీకర్ యూటీ ఖాదర్ సోమవారం ఇలా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విసుగుతో సభను వాయిదా వేసి వెళ్లిపోయిన అరుదైన సంఘటన జరిగింది. రెండురోజుల విరామం తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమయ్యాయి. మధ్యాహ్నం విధానసభలో చర్చ జరుగుతుండగా, స్పీకర్ ఖాదర్ స్పందిస్తూ ‘సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. నేను ప్రభుత్వానికి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మంత్రులు జవాబు ఇవ్వడం లేదు. నా హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. ఇలాగైతే సభను ఎలా నిర్వహించాలి’ అని ఆవేదన చెందారు. సభ్యుల ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదనేది మంత్రులు వచ్చి చెప్పేవరకు నేను సభ జరపను అని సభను వాయిదా వేసి ఆయన నిష్క్రమించారు. ఈ పరిణామంతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవరపాటుకు లోనయ్యారు. స్పీకర్ హెచ్చరికతో అందరూ విస్మయానికి గురయ్యారు. ఇలా మొదలైంది.. ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత రాతపూర్వకంగా సమాధానం చెప్పే ప్రశ్నోత్తరాలను చేపట్టాలని స్పీకర్ ఖాదర్ ఆదేశించారు. హోం మంత్రి జీ.పరమేశ్వర్ మాట్లాడుతూ 283 ప్రశ్నల్లో 84 ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు. బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ లేచి నిలబడి, ప్రతి రోజూ ఇదే తంతు సాగుతోంది, మా ప్రశ్నలకు సమాధానమే ఇవ్వడం లేదు, మీరు నాలుగుసార్లు హెచ్చరించారు. ప్రభుత్వం ఉన్నా లేనట్లే ఉంది. ప్రభుత్వానికి తిథి ఖర్మలు చేయాలి అని మండిపడ్డారు. మంత్రులు దేవుళ్ల మాదిరిగా వచ్చి వెళ్తుంటారని విమర్శించారు. ఈ మాటల తరువాత సభాపతి మంత్రుల మీద సీరియస్ అయ్యారు. సభ జరుగుతున్నది మంత్రుల కోసం కాదు, ఎమ్మెల్యేల కోసం. వారు నియోజకవర్గాల సమస్యల మీద చర్చించేందుకు సమావేశాలు జరుపుతాం. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే అసెంబ్లీకి ఎందుకు వస్తారు? అని ఆగ్రహంగా అన్నారు. సభకు మంత్రులు రావడమే లేదని వాపోయారు. ఎన్నిసార్లు మంత్రులకు హెచ్చరించాను, అయినా కూడా సరిదిద్దుకోరు అని అన్నారు. సీఎం సిద్దరామయ్య, మంత్రులు స్పీకర్తో మాట్లాడి నచ్చజెప్పారు. దీంతో సభ మళ్లీ ఆరంభమైంది. ప్రశ్నలకు మంత్రులు జవాబు చెప్పడం లేదని ఖాదర్ ఆగ్రహం విధానసభలో అరుదైన సన్నివేశం తుపాకీతో బెదిరించి దోపిడీ మండ్య: ఫాంహౌస్లో పనిచేస్తున్న భార్యాభర్తలను దొంగలు తుపాకీతో బెదిరించి బంగారు నగలు దోచుకున్నారు. ఈ సంఘటన మండ్య జిల్లాలోని మలవళ్లి తాలూకాలోని జుగనహళ్లి పరిధిలోని తోట ఇంటిలో జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళ ఫాంహౌస్లో చంద్రు, కవిత దంపతులు పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇద్దరు దుండగులు చొరబడి తుపాకులతో బెదిరించారు. దంపతుల వద్ద ఏమీ లేకపోవడంతో చివరికి 3 గ్రాముల బంగారు నగను లాక్కొని పారిపోయారు. పోలీసులు పరిశీలించి విచారించారు. -
రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా
యశవంతపుర(బెంగళూరు): నీ భర్తను వదిలిపెట్టాలంటే నువ్వు నా ఇంటికి రావాలి, లేదా రూ.25 లక్షలను ఇచ్చుకో అని ఓ సీఐ మహిళను వేధించిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణాలో జరిగింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడికి పోస్టింగ్ తీసుకున్నట్లు సీఐ సందేశ్ చెప్పాడని ఆ మహిళ పేర్కొన్నారు. నాపై ఫిర్యాదు చేసిన నీ భర్తను అరెస్ట్ చేశా, విడిపించుకోవాలంటే రూ.25 లక్షలు డబ్బులివ్వాలంటూ సీఐ సందేశ్ తనను ఒత్తిడి చేశారని సదరు మహిళ మంగళూరు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గత ఆగస్ట్లో తన భర్తను అరెస్ట్ చేశారని, విడుదల చేయాలని సీఐ వద్దకు వెళ్లగా అతడు చెప్పిన మాటలు విని షాక్కు గురైనట్లు మహిళ వాపోయింది. ఈ రాత్రికి పడక గదికి రావాలని అసభ్యకరంగా డిమాండ్ చేశాడని మహిళ ఆరోపించింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడి వచ్చా, నేను అడిగినంత డబ్బులిస్తేనే విడుదల చేస్తా, లేదంటే నీ భర్తపై రౌడీషిట్ను తెరుస్తానంటూ బెదిరించాడని మహిళ ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. -
యువ ఖాకీలను కాటేసిన యాక్సిడెంటు
సాక్షి, బళ్లారి: చిత్రదుర్గం జిల్లాలో యాక్సిడెంటు పోలీసు శాఖకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువ ఎస్ఐలు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బెంగళూరు సాయుధ పోలీసు (సీఏఆర్) విభాగంలో ఎస్ఐలు పనిచేసే మంజునాథ్ దారిమని (31), అమరేష్ (25), సచిన్ (30), ఎల్.ఈశ్వర్ (28), మహదేశ్వర బొమ్మన్నవర్ (26) స్నేహితులు. కొంతకాలం కిందటే ఉద్యోగాలలో చేరి బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు అక్కడికక్కడే తమ బ్యాచ్మేట్ పెళ్లి బళ్లారిలో జరుగుతోంది. దీంతో మారుతి సియాజ్ కారులో బెంగళూరు నుంచి 5 మంది బయల్దేరారు. వారిలో ఒకరు కారు నడుపుతున్నారు. ఉదయం 10:30 సమయంలో ఘటనాస్థలి వద్దకు వచ్చేటప్పటికి అతివేగంగా కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొని దానిలోకి చొచ్చుకుపోయింది. కారులోని వారిలో మంజునాథ్, అమరీష్, సచిన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈశ్వర్, మహదేశ్వర తీవ్ర గాయాల పాలయ్యారు. కారు ముందు భాగం మొత్తం నుజ్జయింది. ఇతర వాహనదారులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును బయటకు తీసి మృతదేహాలను చెళ్లకెరె ప్రభుత్వాస్పత్రికి, గాయపడినవారిని దావణగెరె ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ అవివాహితులే అని పోలీసు అధికారులు పేర్కొన్నారు. లారీ డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లిదండ్రుల రోదనలు తమ కుమారులు మరణించారని తెలియగాని తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన చెళ్లకెరెకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రంజిత్కుమార్ బండారు, అడిషనల్ ఎస్పీ శివకుమార్, పోలీసులు వచ్చారు. చెళ్లకెరె ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గది వద్ద మృతులు తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అందరూ స్నేహితులు. కష్టపడి చదువుకుని, ఎస్ఐ పరీక్షల్లో పాసై ఉద్యోగం చేస్తున్నారు. సహచర ఎస్ఐ పెళ్లి జరుగుతుంటే కారులో ఉత్సాహంగా బయల్దేరారు. కానీ విధి కర్కశంగా కాటేసింది, లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు దర్మరణం చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర విషాదం చిత్రదుర్గం జిల్లా చెళ్లెకెరె తాలూకాలో హెగ్గెరె గ్రామం వద్ద బెంగళూరు– హైవేలో సంభవించింది. ఉజ్వలమైన జీవితం రక్తసిక్తమైంది. చిత్రదుర్గం జిల్లాలో ముందు వెళ్తున్న లారీని కారు ఢీ నుజ్జునుజ్జయిన కారు ముగ్గురు రిజర్వు ఎస్ఐలు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు బెంగళూరు నుంచి బళ్లారికి వస్తుండగా ఘోరం -
రథంలో గోపాలుని విహారం
మైసూరు: రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట తాలూకాలోని శ్రీ హిమవద్ గోపాలస్వామి పర్వతంపై ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో గోపాలస్వామి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరిగింది. స్వామి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించిన తేరులో ఉంచి పూజలు చేశారు. ఏటా మాదిరిగానే, వేలాది మంది భక్తులు అడవి నుంచి తీసుకువచ్చిన హంబిని రథాన్ని జై గోపాలస్వామి అంటూ నినాదాలు చేస్తూ లాగారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఎండల మాటున చల్లని వర్షం ● పలు జిల్లాల్లో జల్లువానలు బనశంకరి: రాష్ట్రంలో ఎండల మధ్య వర్షాలు చల్లగా ఉపశమనం కలిగించాయి. ఆదివారం కొడగు, చిక్కమగళూరు, బెళగావి జిల్లాలో వర్షం కురిసింది. బెళగావిలో అర్ధ గంటకు పైగా వర్షం కురిసింది. కొడగులో వర్షాలకు కాఫీ తోటల రైతులు హర్షం వ్యక్తం చేశారు. చిక్కమగళూరు జిల్లాలో పలుచోట్ల గాలీవానతో పాటు వడగండ్లు పడ్డాయి. చిక్కమగళూరు తాలూకా కణతి గ్రామం వద్ద వర్షానికి చెట్టు విరిగిపోవడంతో శృంగేరి రాష్ట్ర రహదారిలో వందలాది వాహనాలు చిక్కుకుపోయాయి. రాష్ట్రంలో బళ్లారి, ఉడుపి, దక్షిణకన్నడ, కొడగు, మైసూరు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముంది. ఇక యాదగిరి, రాయచూరు, కలబురిగితో పాటు చాలా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలను దాటింది. కబ్జాల తొలగింపు పేరుతో వక్క తోట నేలమట్టం శివమొగ్గ: శివమొగ్గ తాలూకాలోని మండెనకొప్పలో రెవెన్యూ శాఖ అధికారులు ఆక్రమణల తొలగింపును చేపట్టి వక్క తోటను నేలమట్టం చేశారు. పంట ఇస్తున్న చెట్లను ఆకస్మాత్తుగా కూల్చివేస్తారా? అని తోటల పెంపకందారులు ఆగ్రహించారు. మంత్రి మధు బంగారప్ప ఆదేశాలతో మండెన కొప్పలోని సర్వే నంబర్ 241–1లో చెరువును ఆక్రమించి తోటలు వేశారని అధికారులు జేసీబీలతో తొలగింపు చేపట్టారు. ఆ తోట యజమాని రుద్రేష్ 2000లో వక్క మొక్కలు నాటి సాగు చేస్తున్నాడు. ఇది వివాదం కావడంతో అధికారులు సర్వే నిర్వహించారు. 300కు పైగా వక్క చెట్లను జేసీబీతో పెకలించి తోటను రూపుమాపారు. బలమైన రాజకీయ నాయకుల వల్లనే రైతు రుద్రేష్కు అన్యాయం చేశారని స్థానిక రైతు నేతలు ఆరోపించారు. వివాహిత అనుమానాస్పద మృతి యశవంతపుర: వివాహిత యువతి అనుమానాస్పదంగా ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన యలహంకలో జరిగింది. శృతి (22) మృతురాలు కాగా, భర్త పవన్ కళ్యాణ్పై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అదనపు కట్నం గురించి భర్త వేధిస్తుండడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో రాజీ ప్రయత్నాలు జరిగాయి. అయితే అత్తింటిలో వేధింపులు తట్టుకోలేక శృతి చనిపోయిందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆమెను హత్య చేసి ఆమె ఉరి నాటకం ఆడుతున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. యలహంక న్యూటౌన్ పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
అయ్యో శిశువా అమ్మకు బరువా?
● రోడ్డు పాలైన పసికందు కోలారు: సంతానం లేదని అంగలార్చేవారు కొందరైతే, పుట్టిన పిల్లలను నిర్దయగా పడేసేవారు మరికొందరు. తల్లిదండ్రులు ఎవరో గానీ, అప్పుడే పుట్టిన మగ శిశువును రోడ్డుపై పడేసిపోయారు. ఈ హృదయ విదారక సంఘటన బంగారుపేట తాలూకా లక్కేనహళ్లి గ్రామం వద్ద జరిగింది. శిశువు గుక్కపెట్టి ఏడుస్తుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే దగ్గరకు తీసుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తరువాత కామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెళ్లి చేర్పించారు. అక్కడి నుంచి శిశు పాలనా కేంద్రంలో అప్పజెప్పారు. పసికందు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
కోర్టులో మళ్లీ పెళ్లి
తుమకూరు: విడాకులు కావాలంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్న జంటకు లోక్ అదాలత్లో మళ్లీ పెళ్లి చేశారు. చిక్కనాయకనహళ్లి కోర్టు కాంప్లెక్స్లో శనివారం తాలూక్ లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్లో సీనియర్ సివిల్ జడ్జి సతీష్ ఎస్.టి. సమక్షంలో ఏకం చేశారు. దంపతులు శైల, శ్రీరాఘవేంద్ర గొడవలు పడి విడాకుల కేసు వేసుకున్నారు. అయితే జడ్జి సతీష్, న్యాయవాదులు వారికి నచ్చజెప్పి పూలదండలు తెప్పించి రాజీ చేశారు. న్యాయవాదులు టి.రవీంద్రకుమార్ ఎం.బి. నాగరాజు, రమేష్ బాబుపాల్గొన్నారు. -
క్రీడా సముదాయం షురూ
తుమకూరు: తుమకూరు నగరంలో కొత్తగా నిర్మించిన షూటింగ్ రేంజ్, టెన్నిస్, బాస్కెట్బాల్ మైదానాలు, బోటింగ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లను ఆదివారం హోం మంత్రి జి.పరమేశ్వర్ ప్రారంభించారు. తుమకూరు యువత, క్రీడా ఔత్సాహికులకు మంచి సౌకర్యాలతో కూడిన స్టేడియంల అవసరం ఉందని అన్నారు. ఇందుకోసమే ఈ క్రీడా వసతులను నిర్మించామని చెప్పారు. జిల్లా కేంద్రం మధ్యలో ఇంత విశాలమైన చెరువు ఎక్కడా లేదన్నారు. చెరువులో కయాకింగ్ పడవ విహారం, అలాగే క్రీడా మైదానాలను నగరవాసులు, పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టరు శుభ కళ్యాణ్, ఎమ్మెల్యే జి.బి.జ్యోతిగణేష్, ఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ఇవ్వరేమి?
శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో సవతి తల్లి ప్రేమను చూపుతోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి దేశంలో సిలిండర్ల సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అదే ప్రకారంగా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యపై అసెంబ్లీలో కూడా చర్చించామని, తాము సమాధానం చెప్పామన్నారు. దేశంలో ఎక్కడా లేనట్లు కర్ణాటకలోనే సిలిండర్ల సమస్య ఎందుకుందని బీజేపీ నాయకులు బీ.వై.విజయేంద్ర, ఆర్.అశోక్ ప్రశ్నించడంపై మండిపడ్డారు. కేంద్రం సవతి తల్లి ధోరణి వల్లేనన్నారు. కేంద్ర ప్రభుత్వం సక్రమంగా సిలిండర్లను సరఫరా చేయాలన్నారు. ఇతర దేశాల నుంచి సహజవాయువును దిగుమతి చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్ల రంగానికి సమస్య అయ్యింది, ఈ రంగంలో వేల మంది పనిచేస్తున్నారు, వారి గతేమిటని అన్నారు. ఆగని కష్టాలు యశవంతపుర: బెంగళూరులో గ్యాస్ సిలిండర్ల కొరత ఉండగా, కొందరు ఎక్కువ రేట్లకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. అక్రమంగా నిల్వ చేసిన గోదాములపై పోలీసులు దాడులు చేశారు. పీణ్యా, ఆర్ఎంసి యార్డ్, కెంగేరి, చిక్కజాల పరిధిలో జరిగాయి. సిలిండర్లను సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. గ్యాస్ లేక బెంగళూరులో అనేక హోటళ్లు ఆదివారం కూడా మూతపడ్డాయి. కొన్ని హోటల్స్లో మెను ను పూర్తిగా మార్చివేశారు. ఎక్కువ గ్యాస్ ఖర్చయ్యే వంటలను తీసేశారు. ప్రజలు సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. కేంద్రంపై సీఎం సిద్దరామయ్య గుర్రు పరిష్కారానికి చర్చిస్తున్నాం శివాజీనగర: బెంగళూరులో వాణిజ్య సిలిండర్లు, వాహనాలకు ఎల్పీజీ కొరత కొనసాగుతుండగా, కొంతమేరకు హోటళ్లకు గ్యాస్ ఇవ్వడంపై చర్చిస్తున్నామని ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప తెలిపారు. సోమవారం సాయంత్రం గ్యాస్ కంపెనీల అధికారులతో భేటీ ఉంది, సమస్య పరిష్కారం ఆలస్యమవుతోంది, ఇప్పటి వరకు యుద్ధం ఆగలేదు. ప్రజలు గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలి, బెంగళూరులో అనేక హోటల్లు మూతబడ్డాయి. మరికొన్ని హోటల్లు వంటకాలను మార్చాయి. ఇండక్షన్, కట్టెలపొయ్యిను ఉపయోగిస్తున్నారు అని మంత్రి తెలిపారు. హోటళ్లకు గ్యాస్ కొరత వారంలోగా తీరిపోతుందనుకుంటే మరింత అధికమైందన్నారు. -
కేబినెట్ మార్పుల కోసం ఢిల్లీ యాత్ర!
శివాజీనగర: శాసనసభ సమావేశాల తరువాత సీఎం సిద్దరామయ్య ఢిల్లీకి వెళ్లి, మంత్రిమండలి పునర్విభజన కోసం హైకమాండ్ నాయకులతో చర్చించే అవకాశముంది. సాధారణంగా బడ్జెట్ను సమర్పించాక ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రిని, పార్టీ అగ్రనేతలను కలిసి సమాచారమివ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఆ దిశగా ఈ అసెంబ్లీ సమావేశాల తరువాత సిద్దరామయ్య ఢిల్లీకి వెళ్తారని తెలిసింది. 12 మందిని తప్పిస్తారా? సుమారు 12 మందికి పైగా మంత్రులను తప్పించి, కొత్త వారికి చాన్సు ఇవ్వాలనుకుంటున్నారు, ఇందుకు డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ఒప్పుకోలేదని తెలిసింది. సీఎం మార్పిడిని తేల్చేవరకు మంత్రివర్గ పునర్విభజన చేయరాదని డీకే పట్టుబట్టారు. దీంతో సీఎం సన్నిహిత వర్గం ఎమ్మెల్యేలు ప్రత్యేక భేటీ జరిపి మంత్రిమండలి మార్పులకు గొంతెత్తారు. 3 సార్ల కంటే ఎక్కువగా గెలుపొందిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటివ్వాలని కోరుతున్నారు. మంగళవారం డీకే టూర్ కానీ ఈసారి సారి మంత్రిమండలి మార్పులు జరిగితే ఇకముందు సీఎం మార్పిడి మరుగున పడుతుందని డీకే భావిస్తున్నారు. అలా జరగకుండా డీకే ప్రయత్నాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. హైకమాండ్పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంది. ఇటు డీ.కే.శివకుమార్ తరపున జూనియర్ ఎమ్మెల్యేలు బ్యాటింగ్ చేస్తుండగా, సీఎం సిద్దుకు అండగా సీనియర్ ఎమ్మెల్యేలు వచ్చారు. సిద్దరామయ్య ఢిల్లీ యాత్ర ఏ ఫలితమిస్తాయనేది ఉత్కంఠ కలిగిస్తోంది. త్వరలో హస్తినకు సీఎం సిద్దు -
మాదన్న దర్శనమే మహాభాగ్యం
మైసూరు: రాష్ట్రంలోని ప్రసిద్ధ ఫుణ్యక్షేత్రం చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని శ్రీ క్షేత్ర మలే మహాదేశ్వర బెట్టపై పరమేశ్వరుని దేవస్థానంలో జరిగే ఉగాది జాతర మహోత్సవానికి వేలాది మంది భక్తులు మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా కాలినడకన వస్తున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు నుంచి కూడా విశేషంగా యాత్రికులు మాదప్ప దర్శనం చేసుకోవడానికి శ్రమను లెక్కచేయకుండా బయలుదేరారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పరిధిలోని 200కి పైగా గ్రామాల నుంచి భక్తులు పాదయాత్ర చేపట్టారు. అలుపు రాకుండా స్వామి నామాన్ని, భక్తి గీతాలను పాడుతూ గుంపులు గుంపులుగా వస్తారు. మొక్కు తీరినవారు, లేదా మొక్కుకున్నవారు వందల కిలోమీటర్ల దూరం నుంచి చెప్పులు లేకుండా నడవడం వారి అచంచల భక్తికి నిదర్శనం. ఈసారి విశేష ఉగాది బెట్టపై ఉగాది జాతర మహోత్సవం 16 నుంచి ప్రారంభమవుతుంది. 17న సాయంత్రం ఎన్నేమజ్జన సేవ జరుగుతుంది. 18, 19 తేదీలలో ఫాల్గుణ మాసం చివరి రోజు, అమావాస్య రోజున ప్రత్యేక పూజలు , ఉత్సవాలు జరుగుతాయి. ఉగాది అయిన 19వ రోజున తెల్లవారుజాము నుంచి పూజలు, ఉదయం 9:45 నుంచి 11 గంటల మధ్య మహారోత్సవం జాతర తదితరులు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఉగాది పండుగకు మరో ప్రత్యేకత ఏమిటంటే, ఫాల్గుణ అమావాస్య, చైత్ర పాడ్యమి దగ్గరగా ఉంటాయి. మరింత శుభప్రదమైనదని పండితులు తెలిపారు. చిరుతల బెడద ఉగాది వేడుకలకు కొండపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగస్వామి ఒడ్డు, శని మహాత్మ ఆలయం దగ్గర తరచుగా చిరుతపులి తిరగడం వల్ల భక్తులు భయపడుతున్నారు. ఉగాది జాతరకు భక్తజనం కాలినడకన రాక -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు: వ్యక్తి మృతి
శ్రీనివాసపురం: విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మరణించిన ఘటన తాలూకాలోని బద్దిపల్లి క్రాస్ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. శ్రీనివాసపురం తాలూకా గుడిపల్లి గ్రామానికి చెందిన లోకేష్ (45) ప్రమాదంలో మరణించిన వ్యక్తి. వృత్తిరీత్యా పురోహితుడు అయిన లోకేష్ పూజా కార్యక్రమాలను ముగించుకుని తిరిగి స్వగ్రామం గుడిపల్లికి బయలుదేరాడు. బద్దిపల్లి క్రాస్ వద్ద కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఘటనలో లోకేష్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న గౌనిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును బస్సు ఢీ
● 11 మందికి గాయాలు హుబ్లీ: అడ్డు వచ్చిన కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన బెళగావి జిల్లా కానపుర తాలూకా నందగడలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బెళగావి డిపో నుంచి నందగడకు బయలుదేరింది. బస్సు నందగడకు చేరుకోగానే ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మొత్తం 11 మంది ప్రయాణిస్తుండగా అందరికీ గాయాలయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నందగడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పుస్తక పఠనంతో విజ్ఞానం
బళ్లారి అర్బన్: బళ్లారి నగరంలోని రాక్ గార్డెన్లో మాతృ మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని హాస్య కళాకారుడు ప్రాణేష్ ప్రారంభించి, మాట్లాడారు. నేటి కాలంలో మొబైల్ ఫోన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా పుస్తక పఠనానికి ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. మాతృ మహిళ మండలి అధ్యక్షురాలు పుష్పలతా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ సమాజంలో వారికి పోత్రాహం కల్పించడమే మండలి లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కోమలిక, కీర్తి అధ్యక్షతగా వహించగా.. చంద్రికా చంద్రకాంత్ స్వాగతం పలికారు. గురు డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసీద, హిందు, ద్రాక్షాయిణి నృత్య ప్రదర్శలు చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా సామాజిక సేవకులు రత్నమ్మ, నీలమ్మను సన్మానించారు. అనంతరం నృత్యాలు, గేమ్స్, ఫ్యాషన్ షో నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్అనురాధ, హాస్య కళాకారుడు బసవరాజ్ మహామణి, పోలా పద్మవతి, ఎల్లనగౌడ, సునీత, కుసుమ, హేమ, దేవి, లక్ష్మీ, మేముదా తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు
హొసపేటె: మద్యానికి బాసినిసైన ఓ యువకుడు ఆస్తి కోసం సొంత అన్ననే చంపేశాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అన్నను హతమార్చి పరారయ్యాడు. విజయనగర జిల్లా హగరిశిరిహళ్లి గ్రామంలో ఆదివారం ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హగరిశిరహళ్లి గ్రామంలో అన్నతమ్ముళ్లు మరుళసిద్దేశ్, పత్రెగౌడ జీవనం సాగిస్తున్నారు. భూమిలో తనకు వాటా ఇవ్వలేదని తమ్ముడు పత్రిగౌడ రోజూ అమ్మతో గొడవ పడేవాడు. మద్యానికి బానిస కావడంతో డబ్బు కోసం తల్లిని వేధించేవాడు. దీంతో విసిగిపోయిన తల్లి మల్లమ్మ ఆస్తి మొత్తాన్ని పెద్ద కొడుకు అప్పగించింది. దీంతో తన వాటా ఇవ్వాలని పత్రెగౌడ.. అన్న మరుళసిద్దేశ్తో గొడవ పడేవాడు. మద్యానికి బానిస అయిన నీకు ఆస్తి ఇచ్చేది లేదని అన్న తేల్చి చెప్పాడు. అన్న ఉన్నంత వరకు తనకు ఆస్తి రాదని పత్రిగౌడ నిర్ణయించుకున్నాడు. తాను బెంగళూరుకు పనికి వెళ్తున్నా అని తల్లితో చెప్పిన పత్రెగౌడ.. ఆదివారం ఆస్తి విషయమై అన్న మరుళసిద్దేశ్తో గొడవ పడ్డాడు. బంధువు నారప్పతో కలసి మరుళసిద్దేశ్ ముఖానికి టవల్ చుట్టి కొట్టాడు. అనంతరం తలపై బండరాయితో మోది హతమర్చారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న తల్లి మల్లమ్మ అరసికెరె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలింపు చేపట్టిన పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు వెల్లడించారు. -
పిచ్చికుక్క దాడి: 14 మందికి గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు పట్టణ కేంద్రంలో ఆదివారం ఉదయం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. మటన్ మార్కెట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులు, స్థానిక మహిళలపై అకస్మాత్తుగా దాడి చేయడంతో 14 మంది గాయపడ్డారు. భవ్య శ్రీ , ద్రాక్షాయణి అనే ఇద్దరు చిన్నారుల ముఖం, గొంతు, కాళ్లు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు పలు మహిళలు కూడా గాయపడ్డారు. భయంతో వీరు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి చేరుకుని కుక్కను తరిమికొట్టారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, ఇద్దరు చిన్నారులకు ముఖంపై తీవ్రమైన గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామాల్లో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాలు, సంతల వద్ద పిచ్చి కుక్కలు గుంపులుగా తిరుగుతూ అకస్మాత్తుగా దాడి చేస్తున్నాయని చెబుతున్నారు. అధికారులు స్పందించి కుక్కలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. గాయపడిన బాధితులు -
కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలి
కోలారు: కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బేధాభిప్రాయాలను పక్కన బెట్టి ముళబాగిలు నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేయాలని ఆవణి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వి.ఆదినారాయణ తెలిపారు. ఆదివారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో దీర్ఘసుమంగళీభవ కార్యక్రమం నిర్వహణపై పూర్వ సిద్ధతా సమావేశం నిర్వహించారు. ముళబాగిలు తాలూకాలో ప్రతి గ్రామం నుంచి 20 వేల మందికి వడిబాలు పెట్టే కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తామన్నారు. మహిళలను తీసుకొచ్చే బాధ్యత పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ ఎం.ఎల్.అనిల్ కుమార్, తదితరుల మార్గదర్శనం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ మండలి మాజీ ఉపాధ్యక్షుడు జి.రామలింగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలంగూరు శివణ్ణ, టౌన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమానుల్లా, పీఎల్డీ బ్యాంక్ డైరెక్టర్ రాజేంద్ర గౌడ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల హోసూరు: కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీ శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు నామినేషన్లను మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఏప్రిల్ 23న ఎన్నికలు, మే 4వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. -
టీఏపీఏసీఎంఎస్ నూతన అధ్యక్షుడిగా మంజునాథ్
కోలారు: ముళబాగిలు తాలూకా టీఏపీఏసీఎంఎస్ నూతన అధ్యక్షుడిగా రెండవ సారి ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఉపాధ్యక్షురాలిగా సుధా తిమ్మరాజు ఎన్నికయ్యారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు వీరిద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి అమిద్ హుసేన్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తూరు మంజునాథ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా తాను అధ్యక్ష స్థానానికి రెండవ సారి పోటీ చేశానని తెలిపారు. తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి ముళబాగిలు ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ సంపూర్ణ సహకారం అందించారని కొనియాడారు. ఏడాదిలోగా సొసైటీకి నూతన హైటెక్ కట్టడాన్ని నిర్మించడం జరుగుతుందని తెలిపారు. నూతన కట్టడానికి కేంద్ర మాజీ మంత్రి ఎం.వి.కృష్ణప్ప పేరు పెడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆవణి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వి.ఆదినారాయణ, కేపీసీసీ సభ్యుడు జి.రామలింగారెడ్డి, ఉత్తనూరు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
చీటి నిర్వాహకుడి అరెస్ట్
బళ్లారి అర్బన్: చీటి వ్యాపారంలో మోసం చేసి పరారీలో ఉన్న నిందితుడిని బళ్లారి పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఎస్.నవీన్ కుమార్, బళ్లారి నగర ఉపవిభాగ డీఎస్పీ గోవిందరాజు నేతృత్వంలో బ్రూస్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని పట్టున్నారు. చీటి మోసం కేసు (బీఎన్ఎస్–2023 సెక్షన్లు 316 (2), 318 (4), బీయూడీఎస్ చట్టం–2019 సెక్షన్ 21 (3)లో పరారీలో ఉన్న వెంకటేష్ అనే వ్యక్తిని మార్చి 13 ఉదయం 7:30 గంటలకు చిత్రదుర్గలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే రోజు ఉదయం 11:30 గంటలకు బ్రూస్పేట పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారణ జరిపారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు బళ్లారి నగరంలోని ముత్తూట్ ఫైనాన్స్లో సుమారు 310 గ్రాముల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది. అలాగే అతడి ఇంట్లో ఉన్న సుమారు 1.5 కిలోల వెండి వస్తువులు, చీటి వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా చీటి వ్యవహారాల్లో ఉపయోగించిన కేఏ–34/పీ–3307 నంబర్ గల జీ–ఎల్70 కారు, అలాగే కేఏ34/ఈఎస్–2152, కేఏ34/ఈఎస్–0427 నంబర్ల టీవీఎస్ ద్విచక్ర వాహనాలు పోలీసులు జప్తు చేశారు. నిందితుడిని మార్చి 14న సంబంధిత న్యాయస్థానంలో హాజరు పరచగా.. కోర్టు కస్టడీకి ఆదేశించింది. -
పెళ్లిలో రగడ
● గాయపడిన పెళ్లి కుమార్తె తండ్రి మృతి సాక్షి, బళ్లారి: సాధాణంగా సోదరుల కుమార్తె పెళ్లి జరిగితే అన్నదమ్ములు కలిసికట్టుగా జరిపించడం చూస్తుంటాం. అయితే గదగ్ జిల్లాలో కుమార్తె పెళ్లి విషయంలో అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ ఘటన పెళ్లి కుమార్తె తండ్రి మరణానికి దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల గదగ్ జిల్లాకు చెందిన గిరీషప్ప (47) తన కుమార్తె పవిత్ర పెళ్లి ఘనంగా జరిపించాడు. పవిత్ర పెళ్లిని గిరీషప్ప సోదరులు ఈరన్న, శివకుమార్ వ్యతిరేకించారు. బంధువులతో పెళ్లితో జరిపించడం సరికాదని వాదించారు. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిని కుమార్తె పవిత్ర చేసుకుంది. అయితే తమ మాటను పట్టించుకోలేదనో లేదా మంచి సంబంధం చూడలేదనో గిరీషప్పతో ఫిబ్రవరి 27వ తేదీన సోదరులు ఈరన్న, శివకుమార్ గొడవపడ్డారు. మాటల యుద్దం చినికి చినికి గాలివానగా మారి కర్రలతో దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఈ ఘర్షణలో గిరీషప్పకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గదగ్ ఆస్పత్రికి చేర్పించారు. 15 రోజులుగా చావుబతుకులు మధ్య పోరాడిన గిరీషప్ప ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై నలుగురిపై కేసు నమోదైంది. భక్తిశ్రద్ధలతో అడ్డ పల్లకీ ఉత్సవాలురాయచూరు రూరల్: భారతదేశంలో హిందూ ధర్మ సందేశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని రంబాపురి వీర సింహసనాదీశ్వర ప్రసన్న రేణుక వీర సోమేశ్వర రాజీదేశీ కేంద్ర శివాచార్య మహభ గవత్పాకుడు పేర్కొన్నారు. ఆదివారం దేవదుర్గ తాలుకా జాగటకల్ బసవేశ్వర స్వామి దేవాలయంలో రంబాపురి జగద్గురువుల అడ్డ పల్లకీ ఉత్సవాలు, సాముహిక వివాహాలు నిర్వహించారు. కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్య, సిద్ధ రామేశ్వర, రాచయ్యప్ప తాతా, బెట్టదయ్యప్ప, విరుపాక్షప్ప, సాంబయ్యప్ప, శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, మాజీ శాసన సభ్యుడు శివన గౌడ నాయక్, బుడ్డన గౌడ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సహకారం అవసరం రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సహకారం ఉండాలని అదనపు ఎస్పీ కుమార స్వామి సూచించారు. శనివారం రాత్రి నగరంలోని జిల్లా జైళ్ల సుదారణ సేవా శాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేరాలు చేసి వచ్చిన ఖైదీలను చిన్నచూపు చూడకూడదన్నారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా వారికి సూచనలు ఇవ్వాలన్నారు. జైలు విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకోకుండా అందరూ సంతోషంగ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్రిష్ణ, మానసిక వైద్య నిపుణుడు మనోహర్ పత్తార్, జైళ్ల అధికారిణి అనితా హిరేమని ఉప జైలర్లు రాజ కుమార, వెంకటేష్ నాయక్, మారుతి, వీరన గౌడ, విరుపాక్షి పాల్గొన్నారు. సమాజ సేవకు సహకరించాలి రాయచూరు రూరల్: సమాజ సేవకు అందరూ సహకరించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజ్, సమాచార హక్కు చట్టం కమిషనర్ వెంకటసింగ్ సూచించారు. ఆదివారం పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగ మందిరంలో శరణప్పగోనాళు ప్రతిష్టాన ఆధ్వర్యంలో మహంత శ్రీ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో పేదవారిని మానవతా దృష్టితో చూడాలన్నారు. వీలైతే చేతనైన సహాయం చేయాలని కోరారు. సహాయం చేయడం మానవ ధర్మమనే విషయాన్ని ప్రస్తావించారు. సమాజంలో తనదైన రీతిలో సేవలందించిన శరణప్ప సేవలు అనన్యమని కొనియాడారు. కార్యక్రమంలో సిద్రామణ్ణ, బాలాజీ, అమరేస్, నరసింహులు, తిమ్మరాజ, సదాశివప్ప, నరసింహులు, నరస రెడ్డి, బసవంత రాయకురి, బసవరాజ్, శరణప్ప, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. -
నైతిక విలువలపై అవగాహన అవసరం
కోలారు: సమాజంలో ప్రజలకు నైతిక విలువల పట్ల అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని నివృత్త హైకోర్టు న్యాయమూర్తి హెచ్ ఎన్ నాగమోహనదాస్ తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రైవేటు కళ్యాణ మంటపంలో ఆల్ బ్యాంక్ వెల్ఫేర్ సొసైటీ 10 వార్షికోత్సవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నైతికత గురించి అవగాహన కలిగించే ప్రయత్నాలు జరగాలన్నారు. ప్రపంచంలోఏఏ దేశాల మధ్య యుద జరిగినా అది అన్ని దేశాలల్లోని సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో కెనెరా బ్యాంకు నివృత్త అధికారి వి శివశంకర శాస్త్రి, గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ నాయకుడు రాజరెడ్డి, సంఘం అధ్యక్షుడు హెచ్ బసవరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపై కేసు నమోదు
హుబ్లీ: మైనర్ బాలికను గర్భిణి చేసిన ఆరోపణలపై పాత హుబ్లీ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. సదరు బాలికకు జన్మించిన శిశువును ఆమెకు ఇవ్వకుండా అలాగే తల్లి పేరు నమోదు చేసే కాలంలో నిందితుడు తన పెద్దమ్మ పేరు రాయించి జనన ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. అనంతరం సదరు బాలికతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తల్లి పాలు అందక సదరు శిశువు మృతి చెందింది. శిశువు మృతికి కారకుడైన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విడాకులకు వచ్చి ఒక్కటయ్యారు.. హుబ్లీ: దావణగెరెలో జరిగిన లోక్ అదాలత్లో విడాకుల కోసం వచ్చిన 37 జంటలు పూలదండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ఈ కీలక ప్రక్రియ దావణగెరె ప్రధాన జిల్లా సెక్షన్ కోర్టు న్యాయమూర్తి డీకే.వేళ ఆ జంటలను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న న్యాయాంగ అధికారి ఈ జిల్లాలో జరిగిన వివిధ జాతీయ లోక్ అదాలత్ బాధ్యతలను చక్కగా నిర్వహించి ఆ మేరకు 500 వ్యాజ్య పూర్వ కేసులను పరిష్కరించడంపై హర్షం వ్యక్తం అవుతోంది. శరవేగంగా అభివృద్ధి పనులు కెజీఎఫ్: నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తాను ఎమ్మెల్యే అయిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు శరవేంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. ఆదివారం నగరంలోని గాంధీ నగర వార్డులో రూ.4 కోట్ల వ్యయంతో విద్యుత్ చితాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎవరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృధ్ది కార్యక్రమాలను నిర్వహించలేదన్నారు, 12 నెలల్లో శాంతి ధామాన్ని పూర్తి చేయనున్నామని తెలిపారు. అన్ని వార్డుల్లో మౌళిక సౌలభ్యాలను కల్పించాలని నగరసభ అధికారులకు సూచించానని తెలిపారు.. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంజునాథ్, ప్రసన్న, మురళి , నగరసభ మాజీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, నగరాభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉచితంగా చీరల పంపిణీ కోలారు: ఉగాది పండుగను పురస్కరించుకుని నగర సభ మాజీ సభ్యుడు ముక్కడ్ వెంకటేష్, ఆయన కుమారుడు నగరంలోని పలు ప్రాంతాల్లోని పేదలకు చీరలు, పండుగ సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. వీరు గత 15 సంవత్సరాల నుంచి దీపావళి, ఉగాది పండుగ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అడవి పందిని ఢీకొన్న ద్విచక్ర వాహనం
● ఇద్దరికి గాయాలు రాయచూరు రూరల్: ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక నుంచి శ్రీశైలానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు శనివారం తెల్లవారుజామున గాయపడ్డారు. వివరాలు.. రాయచూరు తాలుకా ఉండ్రాల దోడ్డికి చెందిన దూల్లయ్య, శంకర్ ద్విచక్ర వాహనంలో శ్రీశైలం బయలుదేరారు. శనివారం తెల్లవారు జామున వెంకటాపూర్ నుంచి నల్లమల ప్రాంతంలో వెళ్తుండగా.. అకస్మాత్తుగా అడవి పంది అడ్డుగా రావడంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అడవి పంది మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన దూల్లయ్య, శంకర్ను చికిత్స నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలి రాయచూరు రూరల్: రాయచూరు రైల్వే స్టేషన్లో కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని లోకసభ సభ్యుడు కుమార నాయక్ అధికారులకు సూచించారు. ఆదివారం హుబ్లీ రైల్వే స్టేషన్ అదనపు జనరల్ మేనేజర్ అనంత, ఇతర అధికారులతో చర్చించారు. రాయచూరు గిణిగెర రైల్వే పనులపై ఆరా తీశారు. కుర్డిని రైల్వే క్రాసింగ్ స్టేషన్గా గుర్తిస్తే రైతులు పండిస్తున్న పత్తి, మిరప వాణిజ్య పంటలను రవాణా చేసేందుకు వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. యువ కవులకు మార్గదర్శి రాధాదేవిరాయచూరు రూరల్: యువ కవులకు మార్గదర్శి హెచ్.జి.రాధాదేవి అని సీనియర్ కవి సిద్ధరామప్ప అన్నారు. ఆదివారం కన్నడ భవనంలో జిల్లా, తాలుకా కన్నడ సాహిత్య, శరణ పరిషత్, కదళి మహిళా సంఘం ఆధ్వర్యంలో వివిధ సాహితీవేత్తలు రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కవితలు సమాజానికి పనికొచ్చేలా యువకుల మనస్సులను దోచేలా రాయాలని సూచించారు. అందరూ పుస్తకాలను చదివేలా ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది నాగరాజ్, సువర్ణ, విజయ రాజేంద్ర, రాజశ్రీ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. నూతన రైలు నడపాలి రాయచూరు రూరల్: కొప్పళ జిల్లా కుష్టిగి నుంచి బెంగళూరుకు నూతన రైలు నడపాలని రైతు సంఘం అధ్యక్షుడు అందానప్ప కోరారు. ఆదివారం హుబ్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషిని మర్యాదపూర్వకంగా కలసి సమస్యలు విన్నవించారు. వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులతో కలసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. కళ్యాణ కర్ణాటక భాగంలోని గదగ్ వాడి కుష్టగి నుంచి హబ్లీకి రైలు ప్రారంభించారని తెలిపారు. కుష్టిగి నుంచి బెంగళూరుకు నూతన రైలును నడపాలని సూచించారు. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్లేందుకు వీలుగా హళాల్పూర్లో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలి
రాయచూరు రూరల్: అంగన్వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. శనివారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ ఏళ్ల తరబడి సీ్త్ర శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 నిష్పత్తిలో వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రాయచూరు రూరల్: నగరంలో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ వసంత్ కుమార్ భూమిపూజ చేశారు. శనివారం నగరంలోని రెండో వార్డులో రూ.3 కోట్లతో వివిధ కాలనీల్లో సీసీ రోడ్లను నిర్మిస్తారన్నారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలను కల్పిస్తామన్నారు. మాజీ కౌన్సిలర్ జయన్న, మంచాల భీమన్న, నాగేంద్ర, రామకృష్ణ, నిర్మల బెణ్ణి, మురళిఽ యాదవ్, దరూరు బసవరాజ్, రజాక్ ఉస్తాద్, అబ్దుల్ కరీంలున్నారు. హీమోఫీలియా రోగులకు ఉచిత చికిత్స బళ్లారిఅర్బన్: సాధారణంగా రక్తం సరిగ్గా గడ్డకట్టక పోవడం, కీళ్లు, కండరాలలో రక్తస్రావం వంటి లక్షణాలతో కనిపించే వారికి హీమోఫీలియా వ్యాధికి రూ.లక్ష ఖర్చయ్యే చికిత్సను బళ్లారిలోని ఆస్పత్రిలో ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీశ్ సుమేరా, రాజేష్, జడ్జి హొసమని హీమోఫీలియో బారిన పడిన ఓ చిన్నారికి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆరు నెలల ప్రత్యేక చికిత్స కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్ యల్లా రమేష్బాబు, జిల్లా శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్.ఎన్. బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాభాల్లో హట్టి బంగారు గనుల కంపెనీరాయచూరు రూరల్: బంగారు గనుల ఉత్పత్తిలో రాయచూరు జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టి బంగారు గనుల కంపెనీకి రూ.436 కోట్ల లాభం చేకూరింది. దీంతో ప్రభుత్వానికి రూ.97.25 కోట్ల చెక్ను అందజేసింది. శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హట్టి బంగారు గనుల కంపెనీ అధ్యక్షుడు జేసీ పాటిల్ భూ గర్భ గనుల శాఖ మంత్రి ఎస్ ఎస్ మల్లికార్జునతో కలిసి చెక్ను అందించారు. రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య హొసపేటె: రైలు పట్టాలపై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్న సంఘటన శనివారం తాలూకాలోని మరియమ్మనహళ్లి గుండా రహదారి వద్ద ఉన్న రైల్వే ట్రాక్పై జరిగింది. మృతుడిని కొప్పళ జిల్లా టణకనకల్ గ్రామానికి చెందిన సురేష్(42)గా గుర్తించారు. అతని తల మొండెం నుంచి వేరుగా పడి పోయింది. రైల్వే ట్రాక్ వద్ద మొండెం మాత్రమే ఉండి పోయింది. హొసపేటె రైల్వే ఉప పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
రాగి పంట దగ్ధం
మైసూరు: నిప్పంటుకొని రాగి పంట కాలిపోయిన ఘటన జిల్లాలోని సరగూరు తాలూకాలోని హుల్లెమల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మంజునాథ్, బసవరాజులు 15 రోజుల క్రితం రాగి పంటను కోసి ఇంటి వెనుక నిల్వ చేశారు. శుక్రవారం రాత్రి వాములకు నిప్పంటుకోవడంతో స్థానికులు వెళ్లి ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఐదు ఎకరాల్లోని రాగి పంట మొత్తం దగ్ధమైంది. రైతు మంజునాథ్ మాట్లాడుతూ మూడు రోజుల్లో రాగులను నూర్పిడి చేయాల్సి ఉండగా ఇంతలో అగ్నికి ఆహుతైందని వాపోయాడు. దాదాపు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని, అధికారులు తగిన పరిహారం అందించాలని కోరారు. రెవెన్యూ శాఖ అధికారి నాగప్ప సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. -
వృద్ధుడు దారుణ హత్య
● అక్రమ సంబంధం వల్లే హత్యగా అనుమానం ● యాదగిరి జిల్లా వడగేరా తాలూకాలో ఘటన సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్ : అక్రమ సంబంధం కారణంగా ఓ వృద్ధుడు దారుణహత్యకు గురైన ఘటన యాదగిరి జిల్లా వడగేరా తాలూకా గోనాళ్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన హంపన్న సజ్జన్(76) అనే వృద్ధుడు తన పొలంలో ఉండగా, గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్ కథనం ప్రకారం హతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. 12 ఏళ్ల క్రితం భార్య చనిపోగా, తన పొలంలో ఇల్లు నిర్మించుకుని ఒంటరిగా జీవిస్తుండేవాడు. ముగ్గురు కుమారులకు కూడా భూములు తదితర ఆస్తులను పంచి పెట్టాడు. ఒంటరిగా జీవిస్తున్న తరుణంలో రాత్రి తోటలో పడుకుని ఉదయమే గ్రామంలోకి పాలు పోయించుకునేందుకు వచ్చేవాడని, శుక్రవారం రాకపోవడంతో అనుమానం వచ్చి తోటలో పరిశీలించగా, రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారన్నారు. వృద్ధుడు ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతోనే హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వడగేరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మడివాళలను ఎస్సీల్లో చేర్చాలి రాయచూరు రూరల్: మడివాళ(రజక) సమాజాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని మడివాళ మాచిదేవ సమాజం జిల్లాధ్యక్షుడు జంబన్న డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1922ల్లో మైసూరు రాజులు ఎస్సీల్లో చేర్చిన 18 రాష్ట్రాల్లో అమలులో ఉందన్నారు. 15 ఏళ్ల క్రితం కుల శాస్త్ర అధ్యయనం ప్రకారం నివేదిక అందించిన అన్నపూర్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వద్దకు వెళుతున్నట్లు తెలిపారు. నరసప్ప, ఉసేనప్ప, మల్లేష్, శాంతప్ప, ఆంజనేయ, నాగేష్, నందలున్నారు. పాఠశాలలో పాము కాటు ● అస్వస్థతకు గురైన విద్యార్థిని, ఉపాధ్యాయుడు చెళ్లకెరె రూరల్: చిత్రదుర్గ తాలూకా హుణసెకట్టె గ్రామ పాఠశాల ప్రాంగణంలో 6 సంవత్సరాల వయస్సుగల 1వ తరగతి విద్యార్థిని సృష్టిని నాగుపాము కాటు వేసింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాఠశాల ఉపాధ్యాయుడు రవిశంకర్ నోటి ద్వారా విషం బయటకు తీయడానికి ప్రయత్నించగా అతను కూడా అనారోగ్యానికి గురయ్యాడు. విద్యార్థిని సృష్టిని ప్రైవేట్ ఆస్పత్రికి, ఉపాధ్యాయుడు రవిశంకర్ను చికిత్స కోసం చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దేశానికి వెన్నెముక రైతన్న రాయచూరు రూరల్: రైతన్న దేశానికి వెన్నెముక లాంటివారని కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య అన్నారు. శనివారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులు పొలంలో కష్టపడి పని చేసే సమయంలో వారు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ముందు జాగ్రత్తల్లో భాగంగా ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. గుండెపోటు, మూత్ర పిండాలు, కీళ్ల వ్యాధులు, క్యాన్సర్, మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలను బెంగళూరు నుంచి వైద్యులను తీసుకొచ్చి సేవలు చేయడం ప్రశంసనీయమన్నారు. లక్ష్మీకాంత్ పాటిల్, ఇంద్రజిత్, మల్లికార్జున, మహదేవ్, ముజాహిద్లున్నారు. చెరువులో యువకుడి శవంరాయచూరు రూరల్: చెరువులో అనుమానాస్పద రీతిలో యువకుడి శవం లభించిన ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకా అలబనూరులో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి దేవి జాతరకు వచ్చిన 18 ఏళ్ల యువకుడు శనివారం స్నానానికి వెళ్లగా ఒండు మట్టిలో కూరుకు పోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. సింధనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ కల్పనలో మంత్రి విఫలంరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించడంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహాదేవప్ప విఫలమయ్యారని, ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి సంచాలకుడు మారెప్ప సర్కార్ను డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదిక అధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్కార్ ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయాలన్నారు. శ్రీనివాస్, హేమరాజ్, ఆంజనేయ, నరసింహులు, తాయప్ప ఉన్నారు. -
హౌసింగ్ బోర్డులో సమస్యలు తీర్చండి
బళ్లారిఅర్బన్: నగరంలోని ఆంధ్రాళ్ కర్ణాటక గృహ మండలి కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యజమానుల క్షేమాభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. శనివారం నగరంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎం.నబీసాహెబ్ మాట్లాడారు. కాలనీలో అంతర్గత కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బ తిన్నాయన్నారు. తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతోందన్నారు. ట్రాన్స్ఫార్మర్ కొరత కూడా తీవ్రంగా ఉందని చెప్పారు. కాలనీలో వీధి దీపాల ఏర్పాటు విషయంలో సంబంధిత శాఖలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, పార్క్ కోసం కేటాయించిన స్థలాలను అభివృద్ధి చేయకుండా వదిలేయడంతో అడవిలా మారాయని తెలిపారు. రోడ్ల పక్కన పెరిగిన మొక్కలు, పొదలు దారిన వెళ్లేవారికి ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు. కాలనీలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ను సక్రమంగా వినియోగించక పోవడంతో తాగునీటి సమస్య ఎదురవుతోందన్నారు. కాలనీకి అనుసంధానంగా ఉండే ప్రధాన ప్రవేశ ద్వారం సమస్యను కూడా ఇంకా పరిష్కరించలేదన్నారు. సీఏ సైట్లను సరైన విధంగా నిర్వహించక పోవడంతో అవి మద్యం సేవించే వారి అడ్డాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో భద్రత దృష్ట్యా పోలీస్ బీట్ పెంచాలని, కాలనీ నివాసితులు అన్ని రకాల పన్నులు, బిల్లులు చెల్లిస్తున్నా సంబంధిత శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. సరైన డ్రైనేజీ కనెక్షన్లు లేకపోవడంతో ఇళ్లలోకి శౌచాలయాల నుంచి దుర్వాసన వస్తోందని, దీని వల్ల ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. -
వేళకు ముందే పాఠశాలకు తాళం
హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి తాలూకా హిరేహొన్నళ్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను శుక్రవారం వేళ కంటే ముందే ఇంటికి పంపించి సదరు పాఠశాలకు తాళం వేసిన ఘటన వెలుగు చూసింది. విద్యాశాఖ అదనపు కమిషనర్ ఈశ్వర్ ఉళ్లాగడ్డి సదరు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇతర ఉపాధ్యాయ బృందానికి కారణాలు కోరుతూ నోటీసులు జారీ చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల మెరుగుదల, వార్షిక పరీక్షల సన్నద్ధత పరిశీలనకు కమిషనర్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల సందర్శనకు వెళ్లగా తాళం వేసిన దృశ్యం కనిపించింది. వాస్తవంగా పాఠశాల సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. అలానే ఈనెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని కూడా సూచించారు. అయితే విద్యార్థులను ఇంటికి పంపించి విధుల్లో లోపానికి పాల్పడినట్లుగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 17 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, లేకుంటే నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన ఆ నోటీసుల్లో హెచ్చరించారు. విద్యాశాఖ ఉన్నతాధికారి పరిశీలనలో వెలుగులోకి హెచ్ఎంతో సహా ఉపాధ్యాయులకు విద్యా శాఖ నోటీసులు -
వైకల్యాన్ని జయించిన సంకల్పం
సాక్షి,బళ్లారి: అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఈత నేర్చుకునేందుకు నేటికీ భయపడేవారు ఎందరో ఉన్న నేటి రోజుల్లో 2014లో జరిగిన బస్సు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న గోపిచంద్ అనే 19 ఏళ్ల యువకుడు అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో రాణించి తన ప్రతిభను చాటాడు. శారీరక వైకల్యం ఉన్నా, ధైర్యం, కృషి, పట్టుదల, సాధించాలనే సంకల్పం, లక్ష్యం ముందు వైకల్యం తలవంచింది. దీంతో గోపిచంద్ అనే దివ్యాంగుడు తనదైన శైలిలో దివ్యాంగుల ఈత పోటీల్లో రాణించి బళ్లారి జిల్లాకు ఖ్యాతిని తెచ్చాడు. బళ్లారి జిల్లా సండూరు తాలూకా దరోజీ గ్రామానికి చెందిన రాజశేఖర్, వసంత దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా గోపిచంద్ ప్రమాదవశాత్తు బస్సు కింద పడిపోవడంతో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ఫలించిన కోచ్ రజనీలక్కా శిక్షణ అయితే జీవితంపై నిరుత్సాహం చెందకుండా, తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఈతలో రాణించేందుకు అడుగులు వేశాడు. ఈ క్రమంలో బళ్లారికి చెందిన ప్రముఖ స్మిమింగ్ కోచ్ రజనీ లక్కాను సంప్రదించిన గోపిచంద్ 2016 నుంచి ఈతలో తనదైన శైలిలో రాణించేందుకు కృషి చేశాడు. ఏటేటా ఈత పోటీల్లో తన ప్రతిభను చాటుతూ దేశ, విదేశాల్లో వివిధ ప్యారా స్విమ్మింగ్ పోటీల్లో రాణించాడు. అస్ట్రేలియాలో 2026 ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు జరిగిన అంతర్జాతీయ స్మిమ్మింగ్ పోటీల్లో రాణించి సిల్వర్ మెడల్ను సాధించాడు. ఇప్పటి వరకు 60 గోల్డ్మెడల్స్, 13 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. శ్రీలంక, బహ్రైన్, కై రో, కొరియా, చైనా, స్పెయిన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్యారా స్మిమ్మింగ్ పోటీల్లో రాణించి బళ్లారికి ఖ్యాతి తెచ్చారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలి స్విమ్మింగ్ కోచ్ రజనీ లక్కా మాట్లాడుతూ తన వద్ద స్విమ్మింగ్ నేర్చుకున్న గోపిచంద్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇంకా భవిష్యత్తులో ఏషియన్ గేమ్స్, ఒలంపిక్స్లో జరిగే ప్యారా స్మిమింగ్ పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. స్విమ్మింగ్లో రాణించిన గోపిచంద్ మాట్లాడుతూ తల్లిదండ్రుల సహకారం, ముఖ్యంగా స్విమ్మింగ్ కోచ్ రజనీ లక్కా ఈతలో రాణించేందుకు ఎంతో తోడ్పాటునందించారన్నాడు. ఈత ఎలా కొట్టాలి, ఎలా విజేతగా నిలవాలి తదితర మెలకువలు నేర్పించారన్నారు. ప్రస్తుతం ఏషియల్ గేమ్స్, ఒలంపిక్స్లో జరిగే ప్యారా స్మిమింగ్ పోటీల్లో రాణించేందుకు బెంగళూరుకు చెందిన శరత్ గైక్వాడ్ వద్ద కూడా శిక్షణ పొందుతున్నానన్నారు. కాగా ఈతలో అసాధారణ ప్రతిభ చూపుతున్న గోపిచంద్ను జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందించారు. ఈత కొట్టడంలో దిట్ట గోపిచంద్ అంతర్జాతీయ పోటీల్లో రాణించిన వైనం -
కాలువలో విద్యార్థి కోసం గాలింపు
హుబ్లీ: ఉప కాలువలో నీటి పాలైన విద్యార్థి శవం ఇంకా లభించ లేదు. శహాపుర తాలూకా భీమరాయనగుడి బోరుకా ప్లాంట్ వద్ద శహాపుర శాఖ కాలువ ఎస్బీసీలో స్నానానికి వెళ్లి నీటి పాలైన వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థి హరీష్ రెడ్డి శవం శుక్రవారం కూడా లభించలేదు. అగ్నిమాపక దళ 17 మంది సిబ్బంది, ఇతర నిపుణులు కాలువలో తీవ్రంగా గాలింపు చేపట్టారు. సుమారు 2 కిలో మీటర్ల వరకు గాలించినా శవం దొరకలేదని కళాశాల ఇన్చార్జి డీన్ ప్రకాశ్ కుచనూర మీడియాకు తెలిపారు. తల్వార్ పట్టుకున్న వీడియో వైరల్ మరో ఘటనలో తల్వార్ పట్టుకొని ప్రాణాలు తీస్తామని బెదిరించే తరహాలో వీడియోను సోషియల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన వ్యక్తిపై హుబ్లీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన సంపత్ చౌహాన్ కత్తి పట్టుకొని డైలాగ్ చెబుతూ ప్రపంచంలో రక్తపిపాసులు ఎవరైనా కానీ బతికేందుకు హక్కు లేదని వీడియో చేసి ఇన్స్ట్రాగాంలో వైరల్ చేశారు. దీంతో నిందితునిపై ప్రజల్లో అనవసరంగా భయభ్రాంతులు సృష్టిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని కేసును నమోదు చేసుకున్నారు. -
మహిళాభివృద్ధికి పెద్దపీట
సాక్షి,బళ్లారి: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మహిళాభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్క మహిళ వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని మోకా రోడ్డులోని పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. బేటీ బచావో, బేటీ పడావో, ప్రధానమంత్రి మాతృ వందన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి, ప్రధానమంత్రి ముద్రా, మహిళా శక్తి కేంద్ర పథకం, ఉద్యోగం చేసే మహిళలకు సురక్షిత హాస్టల్ వసతి, స్వయం సహాయ సంఘాల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వంటివి ఎన్నో సంక్షేమ పథకాలను మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని తెలిపారు. వివిధ రంగాల్లో రాణించిన రజినీ లక్కా, కవిత, నళిని తదితరులను ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డిని కూడా మహిళలు ఘనంగా సన్మానించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్కుమార్ మోకా, మాజీ మేయర్, నగర బీజేపీ అధ్యక్షుడు గుర్రం వెంకటరమణ, హంపీ రమణ, డాక్టర్ అరుణ, భారతీ, పుష్పలత, కార్పొరేటర్లు ఈరమ్మ, చేతన, కల్పనా వెంకటరామిరెడ్డి, డాక్టర్ రేణుకా మంజునాథ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి -
ప్రజలకు గ్యాస్ తిప్పలు.. సిలిండర్ల కోసం పాట్లు
హొసపేటె: వంటగ్యాస్ సమస్య కారణంగా అనేక హోటళ్లలో ఆహార తయారీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీని వల్ల వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. తక్షణమే సిద్ధమయ్యే అల్పాహారాలను తయారు చేసి వినియోగదారులను ఆకర్షించే కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. మరి కొన్ని చోట్ల కేవలం అన్నం, సాంబారు, చిత్రాన్నం మాత్రమే లభిస్తున్నాయి. కొన్ని హోటళ్లకు వాణిజ్య సిలిండర్లు మాత్రం యథావిధిగా సరఫరా అవుతున్నాయి. అయితే ఆమ్లెట్లకు గిరాకీ పెరుగుతోందని, గ్యాస్ కొరత కారణంగానే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఇండక్షన్ కుక్కర్లను వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కిరోసిన్ స్టౌలు కూడా మళ్లీ వాడకంలోకి వస్తున్నాయి. పెరిగిన సౌరశక్తి వాడకం అనేక చోట్ల సౌరశక్తిని ఉపయోగించి భారీ ఎత్తున ఆహారాన్ని తయారు చేసే కేంద్రాలు కూడా పని చేస్తున్నాయి. అక్కడి నుంచి అనేక హోటళ్లకు నిర్ణీత సమయాల్లో ఆహారం సరఫరా అవుతోంది. గ్యాస్ సమస్య కారణంగా ఆన్లైన్ ఆహార డెలివరీ వ్యవస్థపై కూడా ప్రభావం పడింది. దీంతో కొందరు ప్రజలు ఇప్పుడు ఇంటి భోజనానికే మొగ్గు చూపుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల ఫోన్లకు ఎవరూ స్పందించక పోవడంతో ప్రజలు స్వయంగా ఏజెన్సీ కేంద్రాలకు వెళ్లి సిలిండర్లను తెచ్చుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. హోటళ్లలో విందులు, పార్టీల నిర్వహణ తగ్గిపోయింది. ఆహార సరఫరా రంగంలో కూడా అనేక సమస్యలు తలెత్తాయి. వివాహాలు, ఇతర శుభ కార్యాల కోసం ఆహారాన్ని వండటానికి అవసరమైన గ్యాస్ కొరత కూడా తీవ్రంగా ఉంది. నగరంలో కొన్ని హోటళ్లు మూత మళ్లీ వాడకంలోకి కిరోసిన్ స్టౌలు -
23 నుంచి వైరముడి వేడుకలు
మండ్య: మండ్య జిల్లాలోని ప్రసిద్ధ దేవస్థానమైన మేలుకోటే ఆలయంలో వైరముడి ఉత్సవం మార్చి 28న జరగనుందని, రాబోయే భక్తులకు అన్ని వసతులూ కల్పిస్తామని జిల్లా మంత్రి ఎన్. చలువరాయస్వామి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో వైరముడి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ, మార్చి 23 నుంచి ఏప్రిల్ 4 వరకు వైరముడి ఉత్సవం జరుగుతుందని, 28న ముఖ్యమైన వైరముడి వేడుక ఉంటుందని తెలిపారు. భక్తులకు సదుపాయాలు, గట్టి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. లక్షలాది మంది భక్తులు వైరముడి ఉత్సవాలకు తరలివస్తారన్నారు. వైరముడి పట్టాభిషేక ఊరేగింపు సమయంలో ప్రజలు శాంతియుతంగా దేవుని దర్శనం చేసుకునేందుకు పోలీసులు, అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. మేలుకోటే ఎమ్మెల్యే దర్శన్ పుట్టన్నయ్య మాట్లాడుతూ, భక్తులకు తాగునీటి సమస్య ఉండకూడదని అన్నారు. కలెక్టర్ డా.కుమార్ మాట్లాడుతూ, ఏర్పాట్లపై అధికారులకు అన్ని సూచనలు ఇచ్చామని చెప్పారు. ఆరోగ్య సేవలు, ఆర్టీసీ బస్సు సేవలు పకడ్బందీగా ఉండాలన్నారు. ఎస్పీ వి.జె. శోభారాణి, జడ్పీ సీఈఓ నందిని తదితరులు పాల్గొన్నారు. భక్త సాగరం కానున్న మేలుకోటె -
ఒకటో క్లాసుపై 6 ఏళ్ల కత్తి
శివాజీనగర: పిల్లలను ఒకటో తరగతిలోకి చేర్పించాలంటే 6 ఏళ్లు దాటి ఉండాలనే నిబంధన తల్లిదండ్రులకు దిగులు పుట్టిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్ తీసుకోవాలంటే జూన్ 1కి తప్పకుండా 6 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 2020 జాతీయ విద్యా విధానం ప్రకారం ఎల్కేజీకి 4 సంవత్సరాలు, యూకేజీకి 5 సంవత్సరాలు, ఒకటో తరగతికి 6 ఏళ్లుగా వయో పరిమితి నిర్ధారణ అయింది. అయితే సుమారు 2.30 లక్షల మంది పిల్లలు కొన్ని రోజుల తేడాతో 6 సంవత్సరాలకు దూరంగా ఉన్నారు. ఈ నిబంధనను తీసేయాలని, లేదా సడలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అడకత్తెరలో వేలాదిమంది బెంగళూరు కస్తూరి నగరకు చెందిన అమోఘవర్ష అనే బాలుడు 6 ఏళ్లకు 15 రోజుల తక్కువ వయసు ఉండడంతో ఒకటో తరగతిలో చేర్చుకోరని తల్లిదండ్రుల బాధపడుతున్నారు. ఇప్పటికే యూకేజీ పూర్తిచేసిన అతడు మిత్రులతో కలిసి ఒకటో తరగతిలో చేరతానని చెబుతున్నాడు. అయితే నియమాల ప్రకారం అతనికి అడ్మిషన్ దొరకదని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రులకు దిక్కుతోచడం లేదు. మళ్లీ యూకేజీ చదివించాలి, లేదా ఏడాదిపాటు ఇంట్లో కూర్చోవాలి, ఇది జరిగే పనేనా? అని వేలాది మంది పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వయోపరిమితి సడలించాలని విన్నవించుకొన్నారు. సీఎం, డీసీఎంలకు వినతి రాష్ట్రంలో వేలాది మంది పిల్లలు నిబంధనల సుడిలో చిక్కుకున్నారు. తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, విద్యామంత్రి మధు బంగారప్ప, విద్యాశాఖ అధికారులను కలిసి విన్నవించారు. గతేడాది కూడా ఇదే సమస్య వస్తే మంత్రి మధు బంగారప్ప ఐదున్నర ఏళ్లకు తగ్గించారు. వచ్చే ఏడాది సడలింపు ఉండదని అప్పట్లో మంత్రి ప్రకటించారు. కానీ ఈసారీ అదే సమస్య పునరావృతమైనది. తల్లిదండ్రుల బృందం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను భేటీచేసి, కనీసం మూడు నెలల తగ్గింపు ఇవ్వాలని విన్నవించారు. పిల్లలకు జూన్ 1కి ఆరేళ్లు దాటి ఉంటేనే అడ్మిషన్లు తల్లిదండ్రులకు తీవ్ర గుబులు సడలించాలని సర్కారుకు మొర తగ్గిస్తే.. ఇబ్బందులు వస్తాయా? జాతీయ విద్యా విధానం ప్రకారం వయో పరిమితి పాలన తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. నియమాన్ని ఉల్లంఘిస్తే విద్యార్థులు భవిష్యత్లో ఇబ్బందులు పడతారని చెబుతోంది. అందుకే వయోపరిమితి సడలించరాదని భావిస్తోంది. కానీ ఒక్క ఏడాది చదువు దూరమయ్యే పిల్లలను చూసి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో వేచి చూడాల్సి ఉంది. -
హోటల్ బిల్లుల మోత
● సోషల్ మీడియాలో గగ్గోలు శివాజీనగర: గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల బెంగళూరులో అనేక చిన్నా, మధ్యస్థాయి హోటళ్లు మూతపడుతుండగా, కొన్ని హోటళ్లలో మాత్రం అదనంగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. టిఫిన్లు, భోజనాల మీద అదనంగా వసూలు చేయడమే దీనికి నిదర్శనం. రూ.30 నుంచి 50 దాకా గ్యాస్ బిల్లును విధిస్తున్నట్లు నగరవాసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ దీని మీద రభస సాగుతోంది. పీజీ హాస్టల్లో వంట వండకపోవడంతో హోటల్కు వెళ్లగా, అక్కడ విచిత్రమైన ఫీజు విధించారని కొందరు తెలిపారు. ఎల్పీజీ కొరత చాటున జరుగుతున్న దోపిడీ అని ఆరోపించారు. కొన్ని హోటళ్లు, వీధి బండ్ల ఆహారశాలల్లోనూ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. గత్యంతరం లేని యువకులు, ఉద్యోగులు ఎక్కువ ధరలను చెల్లించి ఆకలి తీర్చుకుంటున్నారు. దీనిపై పోలీసులు, ఆహార భద్రతా శాఖలు స్పందించాలని, దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్లు ఉన్నాయి. ఈ వివాదంపై బెంగళూరు హోటల్ యజమానుల సంఘం నాయకులు స్పందిస్తూ, ఇలాంటి పద్ధతులను విడనాడాలన్నారు. ఆ హోటల్ యజమానితో మాట్లాడుతామని తెలిపారు. -
కూతురే కొడుకుగా మారి..
యశవంతపుర: ఇంటి పెద్ద మరణిస్తే కుమారులు, లేదా పెద్దవారు ముందుండి అంత్య సంస్కారాలను పూర్తి చేస్తారు. చిక్కమగళూరు జిల్లా బీరూరులో కూతురే కొడుకుగా మారి తండ్రి అంత్యక్రియలను నిర్వహించింది. గ్రామవాసి బిఎస్ విశ్వనాథ్ మరణించగా, ఆయనకు మగ సంతానం లేకపోవడంతో పెద్ద కూతురు ఐశ్వర్య అంత్యక్రియల బాధ్యతలను స్వీకరించింది. తండ్రి భౌతికకాయాన్ని రుద్రభూమికి భుజాలపై మోసుకెళ్లింది. బంధువులు, గ్రామస్తులు సహకారం అందించారు. అక్కడ మిగతా కార్యక్రమాలను కన్నీటి మధ్య నిర్వర్తించింది.ఫోన్ హ్యాక్ చేసి రూ.2.3 లక్షలు మాయం శివాజీనగర: బీఎంటీసీ డ్రైవర్ మొబైల్కి మోసపూరిత లింక్ను పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.3 లక్షలు దొంగిలించారు. బెంగళూరులో పనిచేసే దిలీప్ హువప్ప పోల్ (47) బాధితుడు. 10 టన్నుల బియ్యం కొనాలని ఏపీలోని నెల్లూరుకు వెళ్లాలనుకున్నాడు, ఇందుకోసం మార్చి 10న బస్సు టికెట్ బుకింగ్ కోసం ఆన్లైన్లో గాలించాడు. ఇంతలో ఓ వ్యక్తి కాల్ చేసి హిందీలో మాట్లాడాడు, తాను ఓ ప్రముఖ ట్రావెల్ సంస్థ ఉద్యోగినని, మీకు బస్ టికెట్ వివరాలను పంపుతానని వాట్సాప్కు ఓ లింక్ను పంపాడు. బాధితుడు ఏమాత్రం ఆలోచించకుండా క్లిక్ చేయగా వెంటనే ఫోన్ స్విచాఫ్ అయ్యింది. మళ్లీ ఆన్ చేసినా తరువాత వాట్సాప్ పనిచేయలేదు. ఫోన్ అతని ఆధీనం లేదు. కొంతసేపటికే బ్యాంకు ఖాతాలో నుంచి రూ.2.3 లక్షలు దుండగులు విత్డ్రా చేసుకున్నారు. బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైసూరు టూర్కు ఒడిశా ఎమ్మెల్యేలుశివాజీనగర: బిడది రిసార్ట్లో ఉన్న ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైసూరు పర్యటన చేపట్టారు. డీసీఎం డీ.కే.శివకుమార్ సూచనతో 8 మంది ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు, ప్రధానకార్యదర్శితో పాటుగా 15 మందికి పైగా వెళ్లారు. ఒడిశాలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కర్ణాటకకు తరలించారు. అక్కడ 4వ స్థానానికి ఏ పార్టీకి కూడా స్పష్టమైన బలం లేదు, క్రాస్ ఓటింగ్ భయం నెలకొంది, అధికార బీజేపీ ఆపరేషన్ ద్వారా తమ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందనే భయంతో కాంగ్రెస్ ఇలా కట్టడి చేస్తోంది. ఎమ్మెల్యేలను ఎన్నికల రోజును మళ్లీ ఒడిశాకు తరలిస్తారు. రూ.25 కోట్ల రుణం ఇస్తామని రూ.25 లక్షల టోపీ మైసూరు: మీకు రూ.25 కోట్ల అప్పు ఇస్తామని నమ్మించి స్టాంప్ డ్యూటీ అంటూ రూ.25 లక్షలను కొట్టేసిన ఘటన మైసూరులో జరిగింది. హుబ్లీకి చెందిన హర్ష మోసపోయిన వ్యక్తి. మైసూరు తాలూకా కొప్పలూరు సమీపంలోని లేక్ వ్యూ బడావణె నివాసి నారాయణ శెట్టి, కార్తీక్, యశవంతశెట్టి, ప్రవీణ్, దీపక్ అనేవారిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధార్వాడకు వెళ్లిన నిందితులు.. అక్కడ హర్షను కలిశారు. వారి సూచన మేరకు హర్ష మైసూరుకు వచ్చాడు, పలు దఫాలుగా చర్చలు జరిపి, రూ.25 కోట్లను రుణం మంజూరైందని నమ్మించారు. డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని చెప్పి రూ.25 లక్షలను వసూలు చేశారు. కొన్ని రోజుల్లో మీ ఇంటికే డబ్బును చేరుస్తామని చెప్పి హర్షను వాపసు పంపించారు. నెల రోజులు గడిచినా డబ్బు అందలేదు. దీంతో మైసూరుకు వచ్చి నారాయణశెట్టి ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు ఖాళీగా ఉంది. దీంతో మైసూరు దక్షిణ గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
కారు– బస్సు ఢీ, ముగ్గురి మృతి
యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా తాలూకా శిరాఢీ ఘాట్లో జరిగింది. ధర్మస్థల పరిసర ప్రాంతాలకు చెందిన శ్రీధర్గౌడ మరకడ (61) , జనార్థన కెరిమార్ (58), చంద్రేశేఖర్గౌడ (57) మృతులు. మరో వ్యక్తి సురేశ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు కారులో సకలేశపురలో పెళ్లి చూసుకుని ఊళ్లకు తిరిగి వెళ్తున్నారు. అయితే మంగళూరు వైపు నుంచి తిరుపతికి వెళ్తున్న రాజహంస ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. ఘటనాస్థలిలోనే ముగ్గురు చనిపోయారు. ఉప్పినంగడి పోలీసులు పరిశీలించారు. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పరీక్ష రాయడానికి వెళ్తూ.. మైసూరు: పరీక్ష రాయడానికి వెళ్తూ రెండు బైకులు ఢీకొనడంతో ఓ విద్యార్థి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మంచదేవనహళ్లి సమీపంలోని బీఎం రోడ్డులో జరిగింది. నవిలూరు గ్రామానికి చెందిన సుమంత్(18) మృతుడు, గుళ్లెదహళ్ల టిబెటన్ క్యాంప్కు చెందిన తెషి తెరింగ్ (70) గాయపడ్డాడు. నవిలూరు నుంచి సుమంత్ బైక్లో కుశాలనగర ప్రభుత్వ పీయూ కాలేజీకి పరీక్ష రాసేందుకు వెళుతున్నాడు. ఎదురుగా కుశాలనగర వైపు వెళుతున్న టిబెటన్ తెషి తెరింగ్ స్కూటీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన సుమంత్ అక్కడే మరణించగా, తెరింగ్ను మైసూరు ఆస్పత్రిలో చేర్పించారు. మృతుని తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా విలపించారు. బైలకుప్పె పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరు టు బీదర్..● బైక్ ప్రమాదంలో బావ, బావమరిది మృతి చిలమత్తూరు: సొంతూరు బీదర్కు వెళుతూ ఏపీలో సత్యసాయి జిల్లా హిందూపురం వద్ద కొడికొండ చెక్పోస్ట్లో ఇద్దరు బీదర్ యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. బీదర్కు చెందిన ఓ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. అభిషేక్, బావమరిది సుమిత్లు శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి బీదర్కు బైక్లో బయల్దేరారు. అర్ధరాత్రి దాటాక 1:30 గంటల సమయంలో కొడికొండ చెక్పోస్ట్లో చెక్ పాయింట్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ను గుర్తించలేక వేగంగా వెళ్లారు. ముందు నెమ్మదిగా వెళ్తున్న ఐచర్ వ్యాన్ని బలంగా ఢీకొన్నారు. దీంతో కింద పడటం, తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే మరణించారు. పోలీసులు పరిశీలించి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంబంధీకులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో రూ.4,824 కోట్ల పెట్టుబడులుశివాజీనగర: విజయపుర, బాగలకోట, చిత్రదుర్గ, కోలారు, రామనగరతో పాటుగా 13 జిల్లాలలో 37 కొత్త పరిశ్రమలు, 2 ప్రాజెక్టుల్లో అదనపు పెట్టుబడుల రూపంలో రూ.4,824 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఐటీ, మౌలిక సదుపాయాలు, చక్కెర కర్మాగారం, టెక్స్టైల్, కంప్రెస్డ్ గ్యాస్, వైమానిక, అంతరిక్ష, బంగారు ఆభరణాల తయారీ, ఎలక్ట్రానిక్స్, స్టార్ హోటల్ నిర్మాణ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయని, తద్వారా రాష్ట్రంలో కొత్తగా 14,525 ఉద్యోగ అవకాశాలు సృష్టి అవుతాయని భారీ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి ఎం.బీ.పాటిల్ తెలిపారు. మురిపించే హస్తకళా మేళా మైసూరు: నగరంలోని హెబ్బాళ రింగ్ రోడ్డులోని జేఎస్ఎస్ మైసూరు అర్బన్ హాత్లో గాంధీ శిల్ప బజార్ కుటీర మేళా నగరవాసులను ఆకట్టుకుంటోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారులు 70 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. హస్తకళా నైపుణ్యానికి అద్దం పట్టే ఉత్పత్తులు, వస్త్రాలు ఇక్కడ విక్రయిస్తున్నారు. లోహ, మట్టి, చెక్క కళాకృతులు ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రమీల స్టాల్లో కలంకారీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో పేరుపొందిన బొమ్మలు, చిత్రకళలు, పట్టు, నూలు చీరలు లభిస్తున్నాయి.అభిషేక్, సుమిత్ల మృతదేహాలు -
అప్పర్ కృష్ణా గెజిట్ ఏదీ?
బనశంకరి: అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (యూకేపీ) మూడో దశ భూ స్వాధీనానికి బడ్జెట్లో రూ.5 వేల కోట్లు అందిస్తామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శనివారం బాగల్కోటే నవనగరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి భూమిపూజ, యుకేపీ–3 కింద భూమి కోల్పోయిన రైతులకు పరిహార చెక్కులు అందజేసే సభ జరిగింది. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ యుకేపీ విషయంలో 13 ఏళ్లు గడిచినా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. గుజరాత్లో మాత్రం నది నీటి కేటాయింపులపై కేసు ఉన్నప్పటికీ గెజిట్ను ఇచ్చారు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా స్వంత రాష్ట్రానికి చేసినట్లు కర్ణాటకకు ఎందుకు అనుకూలం చేయలేదని ప్రశ్నించారు. అనేకసార్లు లేఖ రాశానని, ప్రధానిని కలిసి కోరినా స్పందించ లేదన్నారు. మహదాయి ప్రాజెక్టుకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ, సూపర్స్పెషాలిటి ఆసుపత్రి, ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ నిరుపేదల పిల్లలు కూడా డాక్టర్లు కావాలన్నారు. డీసీఎం డీకే.శివకుమార్ మాట్లాడుతూ... యుకేపీ 3వ దశ ప్రాజెక్టుకు భూస్వాధీనం చేయరాదు, పరిహారం ఇవ్వరాదని ఆంధ్రప్రదేశ్ సర్కారు అడ్డుపుల్లలు వేస్తోందన్నారు. దీనిపై మంగళవారం ఢిల్లీకి వెళ్లి ఎంపీలను కలుస్తానని తెలిపారు. కేంద్ర సర్కారుపై సీఎం ధ్వజం -
అబ్కారీ శాఖలో అవినీతి మత్తు
బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో ఉడుపి జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ టీఎం శ్రీనివాస్పై శనివారం లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. లోకాయుక్త మంగళూరు ఎస్పీ దినేశ్కుమార్ నేతృత్వంలో మంగళూరు, ఉడుపితో పాటు రాష్ట్రంలోని 15 చోట్ల సోదాలు చేపట్టారు. అబ్కారీ శాఖ అధికారిగా రెండుచేతులా అక్రమార్జనకు పాల్పడుతున్నారని లోకాయుక్తకు ఫిర్యాదులు రావడంతో ఆకస్మికంగా తనిఖీలు ప్రారంభించారు. ఆస్తుల వివరాలు ఈ సోదాల్లో రూ.8.69 కోట్ల విలువచేసే అక్రమాస్తులను కనిపెట్టారు. రూ.6,90,64,716 విలువచేసే స్థిరాస్తులు ఉండగా ఇందులో 11 స్థలాలు ఉన్నాయి. అత్యాధునిక వసతులతో కూడిన 6 ఇళ్లు, 31 ఎకరాల పొలం ఉన్నాయి. చరాస్తులు రూ.2,66,90,001 ఉండగా ఇందులో రూ.3,95,941 నగదు, రూ.1.47 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు, రూ.17 లక్షల విలువచేసే కార్లు, రూ.25.75 లక్షల నగదు డిపాజిట్, రూ.72.68 లక్షల గృహ సామగ్రి లభించాయి. ప్రభుత్వానికి లోకాయుక్త నివేదిక చేరగానే ఆయనను సస్పెండ్ చేస్తారని తెలుస్తోంది. ఉడుపి జిల్లా డిప్యూటీ కమిషనర్పై లోకాయుక్త దాడులు రూ.8 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు -
LPG cylinder అదను చూసి చార్జీలు బాదుడు
చెన్నై/బెంగళూరు: దేశవ్యాప్తంగా నానాటికీ తీవ్రతరమవుతున్న వాణిజ్య సిలిండర్ల (Commercial LPG cylinder) కొరత పలు గమ్మత్తైన పరిణామాలకు కూడా దారి తీస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉన్న బెంగళూరు, చెన్నై వంటి పలు నగరాల్లో బ్లాక్ మార్కెటింగ్ జోరుగా సాగుతోంది. దాంతో పలు హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే ప్రయత్నం చేస్తున్నాయి. ‘గ్యాస్ చార్జీ’ పేరిట కస్టమర్ల నుంచి బిల్లులో అదనంగా వసూలు చేసేస్తున్నాయి! అలా చెన్నైలోని ఒక హోటల్ ఇచ్చిన బిల్లు ఇప్పుడు వైరల్గా మారింది. ఇదీ చదవండి: మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!బెంగళూరులో కూడా ఒక హోటల్ తన కస్టమర్ నుంచి గ్యాస్ బిల్లు రూపంలో ఏకంగా 30 రూపాయలు వసూలు చేసింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్ ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నగర పోలీస్ కమిషనర్ను కూడా ట్యాగ్ చేస్తూ, ఈ వసూళ్ల దందాను కట్టడి చేయాల్సిందిగా కోరాడు. బెంగళూరు హోటళ్ల సంఘం అధ్యక్షుడు పి.సి.రావు దీనిపై వెంటనే స్పందించారు. సదరు హోటల్ యాజమాన్యంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బెంగళూరు తదితర నగరాల్లో సిలిండర్ల చోరీలు కూడా పెరిగి పోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్ -
సమాజ సేవే ఎన్ఎస్ఎస్ లక్ష్యం
రాయచూరు రూరల్: సమాజ సేవే ఎన్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అధ్యక్షుడు సంతోష్ కుమార్ రాజ్గురు తెలిపారు. శుక్రవారం రాయచూరు తాలుకా దిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాయచూరు మహర్శి వాల్మీకి విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శిబిరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల సమస్యలు అర్థం అవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ నిస్వార్థంతో సేవలు అందిస్తుందని వివరించారు. గ్రామాల్లో స్వచ్ఛత, రక్తాదాన శిబిరాలు, ఆరోగ్యం, పరిసరాల సంరక్షణపై విద్యార్థులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిడు సుభాష్ చంద్ర, వీరేష్, చిదానందప్ప, హన్మంతు నాయక్, శరణప్ప, అనిత, అమరేష్, సతీష్, రంగస్వామి, రంగనాథ్, మహేష్ సునంద పాల్గొన్నారు. -
బళ్లారిలో భానుడి భగభగలు
సాక్షి, బళ్లారి: నగరంలో రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. బిసలు బళ్లారి (ఎండల బళ్లారి)గా ఖ్యాతి పొందిన బళ్లారిలో ఎండాకాలం వచ్చిందంటే ఎండలు విపరీతంగా పెరిగిపోవడం పరిపాటి. నగరంలో ఉదయం 10 గంటల నుంచి ఉక్కపోత అధికం అవుతోంది. ఎండ వేడిమికి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరగడంతో ఈసారి బళ్లారి నగరంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లే వారికి ట్రాఫిక్ కూడళ్లలో నీడ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రముఖ కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న ప్రధాన రహదారుల్లో గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. ఎండతాపం నుంచి బయటపడేందుకు ఈ గ్రీన్నెట్స్ దోహదం చేస్తాయని పాలికె అధికారులు తెలిపారు. -
గ్యాస్ ధరల పెంపు దుర్మార్గం
సాక్షి, బళ్లారి: గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మండపడ్డారు. శుక్రవారం జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ కొరత, ధరల పెంపుపై ఆందోళన చేపట్టారు. నగరంలో రాయల్ సర్కిల్ వద్ద కట్టెల పొయ్యిపై వంట చేశారు. గ్యాస్ ధరల పెంపుతో మహిళలు కట్టెల పొయ్యితో వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వగురు అంటే మోదీ కాదని.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అని తెలిపారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.450లకే సిలిండర్ వచ్చేదని.. ప్రస్తుతం సిలిండర్ రూ.1200లకు చేరిందన్నారు. ఇంకా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుకుంటూనే పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ దొరకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు, హోటళ్ల నిర్వహకులు, ఆటోలు నడిపే నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్యాస్ కొరతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలి రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని ఏఐసీసీటీయూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకుడు నాగరాజ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. గృహ వినియోగ సిలిండర్ రూ.60, వాణిజ్య సిలిండర్ను రూ.115 చొప్పున పెంచడం సరికాదన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం సమస్యలపై తహసీల్దార్ సురేష్ వర్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జగదీష్, భీమణ్ణ, యల్లప్ప, గురుస్వామి, ఈరణ్ణ, వీరేష్, మారణ్ణ, అజీజ్, నిషార్ తదితరులు పాల్గొన్నారు. -
రేడియేషన్ థెరపీకి బ్రేక్..
బళ్లారి రూరల్: కొంతకాలంగా బీఎంసీఆర్సీ (బళ్లారి మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్) క్యాన్సర్ విభాగంలో వైద్యుడు లేకపోవడంతో రోగులకు రేడియేషన్ థెరపీ వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో కల్యాణ కర్ణాటక వాసులు వ్యయప్రయాసలకు ఓర్చి కర్నూలు, హుబ్లీ, బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు నెలల క్రితం బీఎంసీఆర్సీ క్యాన్సర్ విభాగానికి రూ.9.53 కోట్ల విలువైన అధునాతన రేడియేషన్ యంత్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే యంత్రాన్ని రేడియేషన్ విభాగంలో అమర్చారు. అయితే అధునాతన రేడియేషన్ యంత్రం అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యుడు లేకపోవడం రోగులకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం కూడా రేడియేషన్ యంత్రం వినియోగానికి లైసెన్స్ ఇవ్వలేదు. బళ్లారి, విజయనగర, రాయచూరు, చిత్రదుర్గం, కొప్పళ, అనంతపురం ప్రాంతాలకు చెందిన క్యాన్సర్ రోగులు వైద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. త్వరితగతిన క్యాన్సర్ వైద్యుడిని నియమించి వైద్య సేవలు ప్రారంభించాలని వేడుకుంటున్నారు. ఈ విషయంపై బీఎంసీఆర్సీ డీన్, డైరెక్టర్ డాక్టర్ గంగాధర్ గౌడను సాక్షి సంప్రదించగా.. క్యాన్సర్ విభాగానికి త్వరలో వైద్యులు వస్తారని తెలిపారు. మరో రెండు నెలల్లో తిరిగి క్యాన్సర్కు వైద్య సేవలు ప్రారంభం అవుతాయన్నారు. పెరుగుతున్న కొత్త కేసులు ఆహార అలవాట్లు, దూమపానం, జీవనశైలి, ప్లాస్టిక్ వాడకం, కల్తీలు, తదితర కారణాలతో మన దేశంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు నానాటికీ పెరుగుతున్నారు. ఓ సర్వే ప్రకారం 2022 నుంచి 2025 వరకు 14.6 శాతం నుంచి 15.69 కొత్త కేసులు పెరిగినట్లు సమాచారం. క్యాన్సర్ వ్యాధికి గురై సగటున ఏడాదికి 5.5 లక్షల నుంచి 8 లక్షల మంది చనిపోతున్నట్లు వెల్లడైంది. క్యాన్సర్ రోగులను కాపాడటంతో రేడియేషన్ థెరపీ కీలకం. రేడియేషన్ థెరపీ లేదా రేడియోథెరపీ అనేది క్యాన్సర్ కణాలను చంపడానికి అధిక శక్తితో కూడిన ఎక్స్ కిరణాలను ఉపయోగించి చేసే చికిత్స. రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ సోకిన భాగాన్ని గుర్తించి ఆటోమేటిక్గా ఆ భాగానికి రేడియేషన్ ఇస్తుంది. ఇందువల్ల రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీఎంసీఆర్సీ క్యాన్సర్ విభాగంలో రూ.9.53 కోట్ల వ్యయంతో అధునాతన యంత్రం ఏర్పాటు వైద్యుడు లేకపోవడంతో రోగుల ఇబ్బందులు పట్టించుకోని ఉన్నతాధికారులు -
వంట గ్యాస్పై ఆందోళన వద్దు
హొసపేటె: ‘ఇటీవల జిల్లాలో గృహోపయోగ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తప్పుడు పుకార్లు వ్యాపించాయి. జిల్లాలో గ్యాస్ కొరత ఉండదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని జిల్లా మెజిస్ట్రేట్ కవితా ఎస్ మన్నికేరి స్పష్టం చేశారు. వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పాశ్చాత్య దేశాల్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ పంపిణీ సంస్థల ద్వారా యథావిధిగా సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లాలో ఎవరైన అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాకు సంబంధిత గ్యాస్ పంపిణి సంస్థలను వెంటనే సంప్రదించాలి. ఎట్టి పరిస్థితుల్లోను మధ్యవర్తులను ఆశ్రయించకూడదన్నారు. కార్యక్రమంలో ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్, వివిధ శాఖల అధికారులు, గ్యాస్ కంపెనీల నిర్వాహకులు పాల్గొన్నారు. -
హత్యకు కారకులను శిక్షించాలి
సాక్షి, బళ్లారి: ఇటీవల నగరంలోని తాళూరు రోడ్డులోని గురుకుల ఇంటర్నేషల్ స్కూల్లో జరిగిన హేమంత్ హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం అఖండ కర్ణాటక వాల్మీకి సంఘం, బళ్లారి జిల్లా వాల్మీకి విద్యాభివృద్ధి సంఘం, వాల్మీకి యువగర్జన నేతృత్వంలో జిల్లా అధికారి, ఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పాఠశాల యజమాన్యం, ప్రిన్సిపాల్, డీడీపీఐ, బీఈఓలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. హేమంత్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వకపోతే దశల వారిగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి మృతికి కారకులు, పలువురి విద్యార్థులు గాయపడటానికి కారణమైన వారందరిపై ఎస్సీ, ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ సుమన్ పన్నేకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంంలో హేమంత్ తండ్రి, కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గానికి చెందిన సీనియర్ న్యాయవాది లక్ష్మీకాంత్, బళ్లారి జిల్లా వాల్మీకి సంఘం నాయకులు ముదిమల్లయ్య, టి.సురేష్, న్యాయవాది జయరాం, గోవిందప్ప, మల్లికార్జున పాల్గొన్నారు -
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలి
హొసపేటె: కూడ్లిగి తాలూకా హుడెం గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్కు బళ్లారి లోక్సభ నియోజకవర్గ ఎంపీ ఇ.తుకారాం విన్నవించారు. శుక్రవారం మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. కూడ్లిగి తాలూకా సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన ప్రాంతం అని తెలిపారు. ఈ ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభిచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల స్థాపన భవిష్యత్ తరం తగినంత విద్యా పురోగతిని సాధించడానికి దోహదపడుతుందని వివరించారు. ఇందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్ సానుకూలంగా స్పందించారు. పాఠశాలను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
తక్షణమే గ్రాంట్లు అందించాలి
హొసపేటె: స్వయం పోషక విద్యా సంస్థలకు తక్షణమే గ్రాంట్లు అందించాలని అఖిల కర్ణాటక స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. అఖిల కర్ణాటక స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం, ప్రైవేట్ విద్యా సంస్థలకు గ్రాంట్లు సహా వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం జిల్లాలోని అన్ని స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థలను బంద్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం విజయనగర జిల్లా విభాగం అధ్యక్షుడు జావేద్ హలగి మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలను ప్రారంభించేందుకు, వాటిని పరిరక్షించడానికి, అభివృద్ధి చేయడానికి స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. 1995 తర్వాత ప్రారంభించబడిన కన్నడ మాతృభాష పాఠశాలలకు తక్షణమే గ్రాంట్లు అందించాలన్నారు. పేదలకు అండగా నిలిచే విద్యా హక్కు చట్టం ( ఆర్టీఈ) తిరిగి అమలు చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు, శ్రీనివాస్, శరణప్ప సర్వమంగళమ్మ చంద్రశేఖరయ్య హిరేమట్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం
సాక్షి, బళ్లారి: గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో దోమల బెడద అధికమైంది. ప్రజలు అనార్యోగానికి గురవుతున్నారని ఏఐకేకేఎంఎస్ రైతు సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని కురుగోడు తాలూకా ముష్టిగట్టి గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి గురళ్లి నాగరాజు మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్తా, చెదారం పేరుకుపోతోందని తెలిపారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. పంచాయతీల స్వచ్ఛతకు నడుం బిగించాల్సిన అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో స్వచ్ఛత గురించి ఆలోచించే వారు లేరని తెలిపారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
సంపద శాశ్వతం కాదు
హుబ్లీ: సంపద శాశ్వతం కాదు.. మానసిక ప్రశాంతత పెద్ద సంపద అని అమ్మినబావి పంచగృహ హిరేమఠం చిన్న అభినవ శాంతి లింగ శివాచార్య స్వామి అన్నారు. సదరు మఠం జాతర సందర్భంగా కలబుర్గి శరణ బసవేశ్వర పురాణ ప్రవచనాలు కార్యక్రమం నిర్వహించారు. వేదాలు, ఉపనిషత్తులు పేర్కొన్నట్లు తాగేందుకు నీరు, కడుపు నింపుకునేందుకు అన్నంతో పాటు విలువైన మాటలు అవసరం అన్నారు. ఎంత పెద్ద అగర్భ శ్రీమంతుడైన కూడా కరెన్సీ నోట్లు, బంగారు, వజ్ర వైడ్యుర్యాలను తిని బతకడానికి సాధ్యం కాదన్నారు. సంతోష్ గుడగుంటి మఠ మాట్లాడుతూ.. అన్ని ధర్మాల సిద్ధాంతాలు మోక్షమే లక్ష్యంగా తమ తత్వాలను బలంగా బోధించాయన్నారు. శాంత లింగశివాచార్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సవదత్తి మూలిమఠం మల్లికార్జున శివాచార్య స్వామి సాహిత్య వేత్త గురుమూర్తి, గదగ్ వీరేశ్వర పుణ్యాశ్రమం హిందూస్తానీ గాయకుడు వీరేష్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. చలివేంద్రాల ఏర్పాటు హొసపేటె: నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక కర్ణాటక పౌర రక్షణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు (మంచి నీటి కేంద్రాలు) ఏర్పాటు చేశారు. హరిహర రోడ్డు, భగత్సింగ్ నగర్లో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ మంచినీటి కేంద్రాలను కర్ణాటక పౌర రక్షణ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కాసట్టి ఉమాపతి ప్రారంభించారు. కార్యక్రమంలో గౌళి రుద్రప్ప, గుజ్జల్ ఉమేష్ కుమార్, డాక్టర్ మల్లప్ప, గౌళి బసవరాజ్, వెంకోబప్ప, చంద్రు దేవలాపుర, హొన్నూరప్ప, దొడ్డ మంజునాథ్, మంజుళ, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు. క్షయ నియంత్రణకు చర్యలు రాయచూరు రూరల్: సమాజంలో క్షయ వ్యాధికి గురైన వారిపై వివిక్ష చూపకూడదని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు సూచించారు. శుక్రవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2035 నాటికి దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నియంత్రించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాలను నెరవేర్చాలన్నారు. ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక్కరు క్షయ వ్యాధితో మరణిస్తున్నారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆరు నెలల పాటు చికిత్స తీసుకోవాలని రోగులకు సూచించారు. జిల్లాలో క్షయ వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు గణేష్, శాఖిర్, నందిత, చంద్రశేఖర్, ఉద్యోగులు పాలాక్షి, సంధ్య, లక్ష్మి, సరోజ తదితరులు పాల్గొన్నారు. -
గడ్డివాములకు నిప్పు
రాయచూరు రూరల్: లింగసూగురులో గురువారం ప్రమాదవశాత్తూ 15 గడ్డివాములకు నిప్పంటుకుంది. పెద్ద ఎత్తున మంటల చెలరేగి, పొగ వ్యాపించింది. భయాందోళనకు గురైన స్థానికులు నీటితో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. పశువులకు మేత కోసం నిల్వ చేసిన గడ్డివాములు దగ్ధం కావడంతో దాదాపు రూ.2 లక్షల నష్టం సంభవించినట్లు సమాచారం. సీనియర్ కళాకారుడు రమేష్గౌడ పాటిల్ మృతి సాక్షి, బళ్లారి: బళ్లారిలో కళారంగం మూగబోయింది. సీనియర్ కళాకారుడు, సామాజిక కార్యకర్త రమేష్ గౌడ పాటిల్ (78) శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారు. తెలుగు, కన్నడ భాషల్లో రమేష్ గౌడ పాటిల్ ఎన్నో నాటకాలు వేసి ప్రేక్షకులను అలరించారు. రాఘవ కళా మందిరంలో పలు సేవా కార్యక్రమాలు, పలు బాధ్యతలు చేపట్టి నాటక రంగానికి ఎనలేని సేవలు అందించారు. రమేష్ గౌడ పాటిల్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, కళాకారులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. స్కూటీకి నిప్పుహొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా అలమరసికేరి గ్రామంలో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనానికి (స్కూటీ) గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముదేనూర్ హొన్నప్పకు చెందిన ద్విచక్ర వాహనం (స్కూటీ) పాక్షికంగా కాలిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు హరపనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు దాఖలైంది. హక్కులు అందరికీ సమానంరాయచూరు రూరల్: రాజ్యాంగం ప్రకారం పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా హక్కులు అందరికీ సమానంగా ఉంటాయని జిల్లా అదనపు జడ్జి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు హెచ్.స్వాతిక్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పంచాయతీ సభా భవనంలో న్యాయ సేవా ప్రాధికార, జిల్లా పంచాయతీ, జిల్లా అధికారి పాలన యంత్రాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సభలో జ్యోతి వెలిగించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. హక్కులు, విధులపై అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, వీరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలిరాయచూరు రూరల్: జిల్లాలో రైతులు పండించిన జొన్నల కొనుగోలుకు వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు చామర సమాలి పాటిల్ డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎకరాకు 23 క్వింటాళ్ల చొప్పన జొన్నలు కోనుగోలు చేయాలని సూచించారు. అలాగే వరి, పత్తి, మిరప తదితర పంటలకు మద్దతు ధరలు కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. -
సేవాభావం అలవర్చుకోండి
సాక్షి, బళ్లారి: మన సంస్కృతి, వారసత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సిరుగుప్ప రోడ్డులో ఉన్న బీబీసీ కళాశాలలో గాలి రుక్మిణమ్మ, చెంగారెడ్డి స్మారకార్థంగా దత్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సేవాభావం అలవరుచుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. తల్లిదంద్రులకు సేవ చేయడంలో ముందుండాలని పేర్కొన్నారు. సన్మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. సమయాన్ని వృథా చేయకుండా చక్కగా చదువుకోవాలన్నారు. మొబైల్ మాయలో పడొద్దన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకునేందుకు సాధ్యం అవుతుందన్నారు. కన్నడ భాషాభివృద్ధికి కన్నడ సాహిత్య పరిషత్ చేస్తున్న కృషి మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో బీబీసీ కళాశాల డైరెక్టర్ అమర్ భూపాల్, కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప, కార్పొరేటర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
తుది శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటా
మైసూరు: నా 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి, విజయం రెండింటినీ చూశాను. నేను ఓడిపోయినా, నా సామర్థ్యం మేరకు ప్రజలకు నిజాయితీగా సేవ చేశాను. నా తుది శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మైసూరు తాలూకాలో ఆయన శుక్రవారం మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో ఏడు విజయాలు, నాలుగు ఓటములు చూశానన్నారు. అయితే తాను ఎప్పుడూ ప్రజాసేవను మర్చిపోలేదన్నారు. నా చివరి శ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. నాకు వీలైనంత వరకు ప్రజా సేవ చేస్తున్నాను. నేను ఇలానే చేస్తూనే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల ప్రజలు తనకు నిరంతరం అండగా నిలిచారన్నారు. నియోజకవర్గ ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోను. రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయడమే కాకుండా, 17 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టానని ఆయన అన్నారు. మైసూరు తాలూకా వరుణ నియోజకవర్గ ప్రజలే తనకు ఇలాంటి అవకాశం రావడానికి కారణం అన్నారు. 1980లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 46 ఏళ్లు మంత్రిగా పని చేశానని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలను ఎదుర్కొన్నానని, నాలుగు సార్లు ఓడిపోయానని అన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గ ప్రజలను వీడలేదని అన్నారు. రాజకీయాల్లో తన ఎదుగుదలకు, సీఎం అయ్యేందుకు మీరందరూ కారణమని అక్కడ గుమిగూడిన ప్రజల వైపు చేయి చూపారు. బడగలహుండి, హొసహుడి, మొదలహుడి, వరకోడు గ్రామాల నాయకులు, యజమానులు, భక్తులు నిర్మించిన ఆలయానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు. కాగినెలె శాఖ శివానందపురి స్వామీజీ, మాజీ ఎమ్మెల్యే ఎం.కె.సోమశేఖర్, మైసూరు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ బి.జె. విజయకుమార్ పాల్గొన్నారు. నా కుమారుడు యతీంద్రను ఆదరించండి వరుణ నియోజకవర్గ ప్రజలకు సీఎం విజ్ఞప్తి -
అటు అసెంబ్లీ.. ఇటు విందు
శుక్రవారం బెంగళూరు విధానసౌధలో అసెంబ్లీ సమావేశాల దృశ్యంబెంగళూరులో గురువారం రాత్రి సమావేశమైన సీనియర్ ఎమ్మెల్యేలుశివాజీనగర: కర్ణాటక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్లో డిన్నర్ రాజకీయాలు జోరందుకున్నాయి. అంతర్గత సంఘర్షణలు, వర్గ రాజకీయం అధికమైంది. బడ్జెట్ సమావేశాల సందర్భంలోనే గురువారం రాత్రి కాంగ్రెస్కు చెందిన 25 మందికి పైగా ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రివర్గ పునర్విభజన జరిపి సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ నెల 16న తన సన్నిహిత మంత్రులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్లో అధికార మార్పిడి విషయం ఎటూ పరిష్కారం కావటం లేదని అంటుండగానే జరిగిన ఈ డిన్నర్ పాలిటిక్స్ ముందు రాజకీయంగా పలు పరిణామాలు చోటు చేసుకొంటాయని సంకేతాలున్నాయి. అంతర్గత రిజర్వేషన్ వివాదాన్ని నివారించి దానికొక పరిష్కారం కనిపెట్టాలనే దిశలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ నెల 16న సోమవారం తన అధికార నివాసం కావేరిలో తమ సన్నిహిత మంత్రులకు రాత్రి విందు భోజనం ఏర్పాటు చేశారు. అంతర్గత రిజర్వేషన్ పరిష్కారం నెపంతో ఏర్పాటు చేసిన ఈ విందు భోజనంలో అధికార మార్పిడి విషయం ముఖ్యంగా చర్చకు రానున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల తర్వాత తీర్మానం బడ్జెట్ సమావేశాల తరువాత అధికార మార్పిడికి సంబంధించి హైకమాండ్ ఒక తీర్మానానికి వచ్చే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్లో డిన్నర్ మీటింగ్లో జోరందుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ డిన్నర్ పాలిటిక్స్లో బిజీ కాగా మున్ముందు రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తమ బలం పెంచుకోవటానికి విందు భోజనాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గత మంగళవారం కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంలో ఎమ్మెల్యేలకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సైతం పాల్గొన్నారు. గురువారం 25 మందికి పైగా ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రి మండలి పునర్విభజనకు డిమాండ్ చేశారు. ఈ అన్ని పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈనెల 16వ తేదీ సోమవారం తమ సన్నిహిత మంత్రులను విందు భోజనానికి ఆహ్వానించారు. అంతర్గత రిజర్వేషన్లతో పాటు పలు విషయాలు ఈ విందు భోజనంలో చర్చకు రానున్నట్లు తెలిసింది. ఆ సమావేశానికి ప్రత్యేకత లేదు–మంత్రి ముఖ్యమంత్రి సిద్దరామయ్య విందు భోజనం గురించి స్పందించిన మంత్రి రామలింగారెడ్డి, సోమవారం సాయంత్రం 7.30 గంటలకు సిద్దరామయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం గురించి, పార్టీ గురించి మాట్లాడతారు. ఇందులో ప్రత్యేకత అంటూ ఏమి లేదన్నారు. సోమవారం సమావేశానికి 16 మంది మంత్రులను మాత్రమే ఆహ్వానించారు. ఇంకెంత మందిని పిలుస్తారో తనకు తెలియదు. సాధారణంగా అప్పడప్పుడు ముఖ్యమంత్రి ఈ విధంగా పిలిచి మాట్లాడతారు. పార్టీ, ప్రభుత్వ విషయాలు చర్చకు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాల నిమిత్తం, అంతర్గత రిజర్వేషన్ గురించి మాట్లాడేందుకు పిలిచి ఉండవచ్చు. సీఎల్పీ సమావేశంలో ప్రస్తావించిన విషయమైతే అందరు మంత్రులను పిలిచేవారు. ప్రస్తుతం కొందరు మంత్రులను మాత్రమే ఆహ్వానించారు. అంతర్గత రిజర్వేషన్ తదితర విషయాల గురించి చర్చించేందుకు ఉండవచ్చని తెలిపారు. రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ బడ్జెట్ గురించి అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయంపై స్పందించిన ఆయన, అన్నింటికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ముఖ్యమంత్రి నిధుల లభ్యత గమనించి తీర్మానం చేస్తారు. తాము అడిగిన వాటినన్నింటినీ ఇవ్వడానికి సాధ్యం కాదు. మీడియా ముందు ఈ విధంగా మాట్లాడితే పార్టీ గౌరవానికి భంగం కలుగుతుందన్నారు. సమావేశం కావడం తప్పేం కాదు కాంగ్రెస్కు చెందిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశం కావటంలో తప్పేమీ లేదు. వారికి కూడా ఆశ ఉండనే ఉంటుంది. రెండున్నరేళ్ల తరువాత అయినా మంత్రి పదవి లభించవచ్చని అనుకొంటారు. 3–4 నెలలు ఆలస్యమైంది. అందువల్ల సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారన్నారు. గురువారం సమావేశంలో పాల్గొన్న వారిలో 3–4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు ఉన్నారు అని మంత్రి రామలింగారెడ్డి అన్నారు. కాంగ్రెస్లో జోరుగా డిన్నర్ రాజకీయం 16న మంత్రులకు సీఎం విందు భోజనం -
సిద్దగంగామఠంలో మొదటి నుంచి కట్టెల పొయ్యిపై ఆహారం తయారీ.!
తుమకూరు: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో, దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతలో తుమకూరులోని సిద్ధగంగ మఠంలో రోజుకు ముప్పై వేల మంది ఆహరం తినే ప్రదేశంలో కట్టెల పొయ్యిపై మాత్రమే ఆహారం తయారు చేయడం ఆశ్చర్యకరం. ప్రస్తుత పరిస్థితిలో ఇది ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడకపోవడం కూడా ఒక నమూనా. అవును, తుమకూరులోని సిద్ధగంగ మఠంలో తొమ్మిది వేల మంది పిల్లలు రోజుకు మూడు పూటలు తింటారు, వారందరికీ అన్నం, సాంబారు మరియు ముద్ద ఇస్తారు. కలపను ఉపయోగించి ఆహారం తయారు చేస్తారు. చాలా సంవత్సరాలుగా ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడకపోవడం ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం. వంటను కలప మరియు అరెకా గింజలను ఉపయోగించి తయారు చేస్తారు. ప్రస్తుత పరిస్థితి గురించి, సిద్ధగంగ మఠానికి చెందిన శివకుమార సిద్ధలింగ స్వామీజీ, యుద్ధం వీలైనంత త్వరగా ముగిసి, తద్వారా వివిధ దేశాలలో ఏర్పడిన ఆందోళన వాతావరణాన్ని తొలగించాలని కోరుకుంటున్నాను. ప్రజలు కట్టెల కోసం అటవీ ప్రాంతాలకు వెళ్లి చెట్లను నరకడం ప్రారంభిస్తారని, ఇది అనివార్యమైన పరిస్థితిని సృష్టిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధగంగ మఠంలో అంగన్వాడీ కార్యకర్తలు ఉండవచ్చు, వివిధ సంస్థల కార్మికులు బెంగళూరుకు వెళ్లే మార్గంలో తినడానికి వస్తారు, కాబట్టి ప్రతిరోజూ మఠంలోని పిల్లలు కాకుండా, వేలాది మంది ప్రజలు తింటారు. కట్టెల పొయ్యిని ఆవిరిగా మార్చి, ప్రతిరోజూ అన్నం, సాంబారు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆశ్రమంలో సౌరశక్తిని కూడా ఉపయోగిస్తున్నారని, సాయంత్రం కాసేపు వంట చేయడానికి దీనిని ఉపయోగిస్తారని ఆయన అన్నారు. సాంబార్, చపాతీల తయారీకి కూడా మేము కట్టెలను ఉపయోగిస్తామని ఆయన అన్నారు. మేము బియ్యం పొట్టును ఉపయోగించాము, కానీ ప్రస్తుతం బియ్యం మిల్లులు తక్కువగా ఉన్నందున మేము బియ్యం పొట్టును ఉపయోగించడం లేదు. ప్రస్తుతం, అరెకా గింజ పొట్టును రోడ్డుపై పడేస్తున్నారు, కాబట్టి మా ఆశ్రమంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు అటువంటి అరెకా గింజ పొట్టును సేకరించి, వాటిని తీసుకువచ్చి ఎండబెట్టారు. తరువాత దీనిని ఇంధనంగా ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. -
కమనీయం.. పుష్పయాగోత్సవం
కదిరి: ఖాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పుష్పయాగోత్సవం కమనీయంగా సాగింది. పుష్పయాగోత్సవంతో పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని..సాగనంపడమే పుష్పయాగోత్సవ ఉద్దేశమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు వివరించారు. మధ్యాహ్నం తర్వాత దర్శనం తీర్థవాది ఉత్సవం ముగియగానే అర్చకులు గురువారం సాయంత్రం ఆలయం తలుపులు మూసివేశారు. శుక్రవారం ఆలయ ద్వారాలు తెరిచి మహా సంప్రోక్షణ చేశారు. స్వామివారికి నిత్య పూజాది కై ంకర్యాలను నిర్వహించారు. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. శుక్రవారం రాత్రి రంగమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఉత్సవానికి ఉభయ దారులుగా విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముగిసిన ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు -
వాటర్ ట్యాంకర్కు మెడికో బలి
శివమొగ్గ: బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో మెడికో మృతి చెందిన ఘటన జరిగిన మరుసటి రోజే మరో ఘోరం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని వైద్యా విద్యార్థిని మృతి చెందిన ఘటన శివమొగ్గలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆసుపత్రి ఆవరణలో చోటుచేసుకుంది. కార్కలకు చెందిన లావణ్య (25) ఇక్కడి వైద్యకళాశాలలో మెడిసన్ చదువుతోంది. మరో విద్యార్థినితో కలిసి మెగ్గాన్ ఆస్పత్రి నుంచి స్కూటీలో వెళ్తుండగా ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనులకు నీటిని సరఫరా చేయడానికి వచ్చిన ట్యాంకర్ ఢీకొంది. కిందపడిన లావణ్యపై ట్యాంకర్ చక్రం వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మతి చెందింది, మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 16 నుంచి పొగాకు కొనుగోలు దొడ్డబళ్లాపురం: దేశ వ్యాప్తంగా ఈనెల 16 నుంచి పొగాకు కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి పీయూస్ గోయల్ తెలిపారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామిలు ఢిల్లీలో పీయూస్ గోయల్ని కలిసి పొగాకు రైతుల సమస్యలను వివరించారు. పీయూస్ గోయల్ మాట్లాడుతూ కర్ణాటకతోపాటు దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి పొగాకు కొనుగోలు చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి సారా మహేశ్, మైసూరు–కొడగు ఎంపీ యదువీర్ చామరాజేంద్ర కృష్ణదత్త ఒడెయర్, ఎమ్మెల్యే మంజులు పాల్గొన్నారు. మంత్రిగిరి కోసం ఢిల్లీకి వెళతాం శివాజీనగర: సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి డిమాండ్తో గురువారం సమావేశం జరిపామని, వచ్చే సోమవారం ఢిల్లీకి వెళతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ తెలిపారు. గురువారం ఓ ప్రైవేట్ హోటల్లో సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశమైన విషయంపై ఆయన స్పందించారు. సమాన మనస్సు కలిగిన 25 మందికి పైగా సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యాం. మంత్రి పదవి ఇవ్వాలనే హక్కును ప్రవేశపెట్టాం. తమది డిమాండ్ కాదు, అవకాశం ఇవ్వాలని విన్నవించామన్నారు. 2028 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది తమందరి ఆశయం. అందువల్ల గురువారం సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కావాలనే డిమాండ్ను హైకమాండ్ ముందుంచాలని నిర్ణయించాం. సోమవారం ఢిల్లీకి వెళతామన్నారు. తమది అసమ్మతి కాదు. తమ హక్కును ముక్తకంఠంతో లేవనెత్తాం అంతే. ప్రభుత్వం బలంగా ఉంది. మంత్రివర్గ విస్తరణ చేసి 4–5 సార్లు గెలుపొందిన ఎమ్మెల్యేలను మంత్రిని చేయాలనే డిమాండ్ పెట్టుకొని గురువారం సభ జరిపామన్నారు. పెరుగుతున్న సిలిండర్ల చోరీలు దొడ్డబళ్లాపురం: ఎల్పీజీ కొరత నేపథ్యంలో రాష్ట్రంలో సిలిండర్ల చొరీలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం బిడదిలోని బన్నికుప్పె గ్రామంలో ఇంటి ముందు సిలిండర్ డెలివరీ చేయడానికి నిలిపి ఉన్న వాహనం నుంచి ఇద్దరు దుండగులు 8 సిలిండర్లు చోరీ చేశారు. తాజాగా గురువారం రాత్రి చెన్నపట్టనలో ఇంటి కాంపౌండ్లో ఉంచిన నిండు సిలిండర్ను గుర్తు తెలియని యువకుడు చోరీ చేశాడు. బెంగళూరు కల్యాణ్ నగర్లో కూడా ఇంటి కాంపౌండ్లో ఉంచిన గ్యాస సిలిండర్ అపహరించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.హత్య కేసులో నిందితులకు ‘డిఫాల్ట్ బెయిల్’ మంజూరు శివాజీనగర: రాజధానిలో సంచలనం సృష్టించిన బిక్లు శివ హత్య కేసులో ప్రధాన నిందితులకు హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు నిర్ణీత సమయంలో చార్జ్షీట్ సమర్పించడంలో విఫలమైన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. న్యాయమూర్తి సునీల్ దత్ యాదవ్తో కూడిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నలుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. జగ్గ(జగదీశ్), కే.కిరణ్, బీ.విమల్రాజ్, మదన్ అనే నిందితులు బెయిల్ కోసం సమర్పించిన పిటిషన్ను మెజిస్ట్రేట్ కోర్టు గతంలో నిరాకరించింది. దీనిని ప్రశ్నిస్తూ హైకోర్టు మెట్లెక్కిన నిందితుల వాదనను స్వీకరించిన న్యాయస్థానం, పోలీసుల అలసత్వ ధోరణిని గమనించి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు పలు బెయిల్ షరతులను విధించింది. -
ప్రేమోన్మాది వేధింపులకు రాలిన పసిమొగ్గ
రాయచూరు రూరల్/ దొడ్డబళ్లాపురం: ప్రేమోన్మాది వేధింపుల వల్ల పసిమొగ్గ జీవితం ఛిద్రమైంది. పాఠశాల భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బీదర్ జిల్లాలో జరిగింది. వివరాలు.. చెటగుప్ప తాలూకా భేమల్ ఖేడ్లో మదియా (16) 10వ తరగతి విద్యార్థిని. త్వరలో పరీక్షలు కావడంతో శ్రద్ధగా చదువుకుంటోంది. కానీ ఓ సహ విద్యార్థి ప్రేమ పేరుతో ఆమెను సతాయిస్తున్నాడు. ఇంట్లో చెబితే గొడవ జరిగి చదువు మాన్పిస్తారని కుమిలిపోయింది. రోజు రోజుకూ వేధింపులు అధికం కావడంతో గురువారం తమ ప్రభుత్వ పాఠశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకడంతో ప్రాణాలు పోయాయి. ఆత్మహత్య దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. బాలిక మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దివాలాకోరు.. అప్పుల బడ్జెట్
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజలను నిరాశపరిచింది. బడ్జెట్లో ముఖ్యమంత్రి సిద్ధరాయ్య దివాలాతనాన్ని ప్రదర్శించారు అని గురువారం విధానసభలో బీజేపీ ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. బడ్జెట్ చర్చలో పాల్గొని మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రం మీద ఆరోపణలు చేస్తోందన్నారు. ఆదాయ సేకరణలో ప్రభుత్వం విఫలమైంది, విచ్చలవిడిగా అప్పులు చేసిన ఘనతను తెచ్చుకుంది, కేంద్రం వల్ల రాష్ట్రానికి అన్యాయమవుతోందని పదే పదే చెబుతూ, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి 100 రూపాయలు పన్నులు వెళ్తే తిరిగి 15 రూపాయలే ఇస్తోందనడం సరికాదన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా అదే మాదిని కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. విధానసభలో బీజేపీ ఎమ్మెల్యే విజయేంద్ర ధ్వజం -
ఓ తల్లి మౌన వేదన
సాక్షి, బళ్లారి: పెంచి పెద్ద చేసిన చేతులతోనే ఇద్దరు కూతుళ్లను చెరువులోకి తోసి, ఆపై తానూ దూకి ఆత్మహత్య చేసుకుందో తల్లి. గురువారం కొప్పళ జిల్లా యలబుర్గి తాలూకా మరనాళ గ్రామంలో ఈ విషాదం సంభవించింది. బాళవ్వ (35), కుమార్తెలు హులిగమ్మ (9), విజయ (2)ను తీసుకుని ఊరిబయట ఉన్న చెరువులోకి దూకింది. గ్రామస్తులకు తెలిసి గాలించి మృతదేహాలను బయటకు తీశారు. ఆమె భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదని తెలిసింది. దీంతో మనసు రాయి చేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బాళవ్వ పెద్ద కూతురు వసతి పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమె ఇంటి వద్ద లేకపోవడంతో ప్రాణాలతో మిగిలింది. యలబుర్గి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిప్పంటించుకుని గర్భిణి.. దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాలను తట్టుకోలేక 5 నెలల గర్భిణి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర తాలూకా వడ్డరదొడ్డి గ్రామంలో జరిగింది. వివరాలు.. నయన (19)కు సునీల్తో 9 నెలల క్రితమే వివాహం జరిగింది. గర్భవతి అయిన ఆమె గురువారం డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త, అతని తల్లిదండ్రుల వేధింపులే కారణమని నయన కన్నవారు రామనగర రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య -
గ్యాస్ ట్రబుల్ తీవ్రం
బనశంకరి: రాష్ట్రంలో జిల్లాలతో పాటు రాజధాని బెంగళూరులో కమర్షియల్ గ్యాస్, ఇళ్లకు సిలిండర్ల సరఫరా రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రజలు పనులు మానుకుని సిలిండర్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఇక హోటళ్లు, కేటరింగ్, విద్యాలయాల హాస్టళ్లు, బేకరీలు, వివాహాది శుభకార్యాలతో పాటు నిత్యం ఆహారం అవసరమైన అన్నిచోట్లా తీవ్ర కటకట ఏర్పడింది. బుక్ చేసినా లేవు కమర్షియల్ గ్యాస్ బండలు దొరకడం లేదు. ఆర్డర్ బుక్ చేసినా లేవని చెబుతున్నారని హోటళ్ల యజమానులు ఆరోపించారు. ఫలితంగా నగరంలో పెద్దసంఖ్యలో హోటళ్లను మూసేశారు. చిన్నా చితకా క్యాంటీన్లు, వీధి హోటళ్లదీ అదే పరిస్థితి కావడంతో బ్రహ్మచారులు ఆహారం కోసం రోడ్ల వెంబడి అన్వేషించాల్సి వస్తోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల నెల కావడంతో ముందుగా కళ్యాణ మండపం బుక్ చేసినప్పటికీ సిలిండర్లు లభించని కారణంగా వంట చేయడం ఎలా అనే సమస్య ఏర్పడింది. కేటరింగ్ చేసేవారు అవస్థలు పడుతున్నారు. పండుగల నెలలో కష్టాలు బెంగళూరులో కొన్ని చోట్ల హోటల్స్, బేకరీలలో కట్టెల పొయ్యితో వండుతున్నారు. చిన్నపాటి హోటళ్లు, కళ్యాణ మండపాలలో కట్టెల పొయ్యిలు వెలిశాయి. రంజాన్ ఉపవాసాల నెల కావడంతో తెల్లవారుజామునే హోటళ్లలో పొయ్యి మీదే వంటకాలు వండారు. నగర ప్రదేశాల్లో కట్టెలు పొయ్యిలు చాలా తక్కువ. కానీ గత్యంతరం లేక వాటినే ఆశ్రయించారు. పెద్ద హోటల్స్లో కట్టెలు పొయ్యి వాడితే పొగ ఆవరిస్తుందని వెనుకంజ వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. గ్యాస్ కొరత లేదు, అంతా బాగానే ఉంది అని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా అలా లేదని తెలుస్తోంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీనే దానికి నిదర్శనం. గురువారం నగరంలో అనేకచోట్ల విపరీతమైన రద్దీ ఏర్పడింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కానీ, సిలిండర్ల సమస్య లేకుండా చూడాలని, వంట చేయలేక పోతున్నామని పలువురు మహిళలు వాపోయారు. సిలిండర్ల కోసం హోటళ్లు, జనం హాహాకారాలు ఏజెన్సీల ముందు మహిళల క్యూ బెంగళూరులో భారీగా హోటళ్ల మూసివేత గత్యంతరం లేక కట్టెలపొయ్యిపై వంటకాలు ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులతో యుద్ధం రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గే సూచనలు లేకపోగా, ఉద్యాననగరిలో ఆ ఎఫెక్టు బాగా కనిపిస్తోంది. సామాన్య ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం కష్టాలు పడుతున్నారు. గ్యాస్ వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. హోటళ్లలో టిఫిన్లు, భోజనాలు దొరకడం కనాకష్టంగా మారింది. ఇంట్లో పొయ్యి వెలగక, హోటళ్లో తిండి దొరకక చాలామంది అన్నమో రామచంద్రా అనాల్సి వస్తోంది. కేంద్రం పట్టించుకోవాలి: డీసీఎం శివాజీనగర: వేరే విషయాల గురించి మాట్లాడే రాష్ట్ర ఎంపీలు వంటగ్యాస్ సిలిండర్ల కొరతపై పార్లమెంటులో చర్చించాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ సూచించారు. ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ ‘వంటగ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. కానీ బీజేపీకి చెందిన ఏ ఎంపీ నోరు మెదపలేదు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. కేంద్ర ప్రభుత్వం విదేశాంగ విధానంపై స్పష్టంగా మాట్లాడటం లేదు, ఈ ధోరణి ఖండనీయం. ప్రజలకు ప్రయోజనం కలిగేలా కేంద్రం వ్యవహరించాలి, గ్యాస్ సమస్య అధికమవుతోంది, మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో, ఇప్పటికే గ్యాస్ ఆటోలు బంద్ అయ్యాయి’ అని అన్నారు. గ్యాస్ గోదాములు తనిఖీ చేయండి పోలీసులకు డీజీపీ ఆదేశం బనశంకరి: గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా జరగకుండా చూడాలని డీజీపీ ఎంఏ.సలీం పోలీసులను ఆదేశించారు. బెంగళూరు సిటీలోని ప్రతి గ్యాస్ గోదామును పోలీసులు తనిఖీ చేయాలని, ఉన్న సిలిండర్లు, వచ్చిన ఆర్డర్లు, వితరణ చేసినవి ఎన్ని అనేది తనిఖీ చేయాలని తెలిపారు. నల్లబజారులో అమ్మినా, ఎక్కువ ధర వసూలు వంటి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే, కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లు లేవని చెప్పినా, ఎక్కువ ధరలు కోరినా ఆయా ఏజెన్సీల మీద ప్రజలు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. సీఎస్ సమీక్ష గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటల్ యజమానులు సంఘం నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్ విధానసౌధలో సమావేశం నిర్వహించారు. అధికారులు, గ్యాస్ కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసుపత్రులు, పీజీలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని శాలినీ సూచించారు. హోటల్స్లో అదనంగా సిలిండర్లను ఉంచుకోరాదని తెలిపారు. ఇంకా 2 నుంచి 5 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రజల ఫిర్యాదులకు ఓ హెల్ప్లైన్ ప్రారంభించాలని చెప్పారు. -
టిప్పర్ దూసుకెళ్లి.. మెడికో దుర్మరణం
యశవంతపుర: టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మెడిసిన్ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు కెంగేరి పరిధిలో జరిగింది. మైసూరు రోడ్డులోని ఆర్ఆర్ మెడికల్ కాలేజీ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మెడిసిన్ ఫైనలియర్ చదివే కృతిక (21), మరో మెడికో హంస సాయంత్రం 4.15 గంటల సమయంలో కాలేజీ ముగించుకొని స్కూటర్లో బయటకు వచ్చారు, మైసూరు రోడ్డు వైపు వెళుతుండగా వారిని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొని దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన కృతికా అక్కడే చనిపోగా, హంస ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటనతో సహచర మెడికోలు పరుగున అక్కడికి వచ్చి ఆవేదనకు లోనయ్యారు. కెంగేరి పోలీసులు ఘటన స్థలిని పరిశీలించి టిప్పర్ డ్రైవర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కరెంటు షాక్తో లైన్మెన్ మృతి మైసూరు: ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ లైన్మెన్ మరణించిన ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా చిక్కనేరళె గ్రామ పంచాయతీ పరిధిలోని వడేర హొసహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బాలకృష్ణ (38) మృతుడు. ఇతను విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనులు చేస్తుండగా ఆకస్మికంగా విద్యుత్ ప్రసారం కావడంతో షాక్ కొట్టి కిందపడిపోయాడు. ఇతర సిబ్బంది, స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లే పనిలో ఉండగానే మరణించాడు. మృతుని తండ్రి సణ్ణస్వామిగౌడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టదపుర స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేఆర్నగర సెస్క్ ఉప విభాగం ఈఈ ప్రదీప్, అధికారులు మృతునికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. మే ఆఖరులోగా టీబీ డ్యాం 6 గేట్ల మార్పు శివాజీనగర: తుంగభద్ర డ్యాం 6 గేట్లను మే ఆఖరిలోగా మార్చుతామని డీసీఎం డీకే శివకుమార్ విధాన పరిషత్లో తెలిపారు. పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డ్యాం నిర్వహణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందినదని అన్నారు. గేట్ల పనులు అహ్మదాబాద్ కంపెనీకి ఇచ్చామని, సామాగ్రి వచ్చిందని, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గేట్లను త్వరగా అమర్చి రైతులకు నీటిని విడుదల చేయాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని సభ్యులు డిమాండ్ చేశారు. 30 మంది జీవిత ఖైదీలకు విముక్తి బనశంకరి: రాష్ట్రంలో వివిధ జైళ్లలో సత్ప్రవర్తనతో ఉన్న 30 మంది జీవిత ఖైదీలను ముందే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం 54 మంది ఖైదీల ప్రవర్తనను పరిశీలించిన సదరు కమిటీ 31 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని సిఫార్సు చేసింది. వీరిలో ఒక మహిళా ఖైదీ పెరోల్ సెలవులో ఉండగా చనిపోయింది. బెంగళూరు సెంట్రల్ జైలులో 14 మంది, విజయపుర కేంద్ర జైలులో 5 మంది, బళ్లారి జైలులో ముగ్గురు, మిగతా జైళ్లలో ఒకరిద్దరు ఖైదీలు విడుదలవుతారు. వృద్ధాప్యం, మంచి ప్రవర్తన, ఇప్పటివరకు అనుభవించిన శిక్షాకాలం తదితరాలను పరిగణించి విడుదలకు ఆదేశించారు. పిరియా పట్టణమ్మ రథోత్సవం మైసూరు: మైసూరు జిల్లాలోని పిరియాపట్టణలో గురువారం వేలాది మంది భక్తుల మధ్య శక్తిదేవత శ్రీ పిరియాపట్టణ (మస ణికమ్మ) దేవి బ్రహ్మ రథోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారి ఉద్భవ విగ్రహానికి వివిధ అభిషేకాలు, పూజలు జరిగాయి. తరువాత విగ్రహాన్ని మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. ఆపై తేరులో ప్రతిష్టించి 12:10 గంటల తరువాత మంగళహారతి ఇచ్చి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు. తేరు కదలగానే భక్తజనం అమ్మవారిని స్మరిస్తూ పండ్లు, ధాన్యాలను తేరుమీదకు విసిరారు. భక్తుల ఆకలిని తీర్చడానికి అనేక సంఘాలవారు పండ్లు, మజ్జిగ, సాంబార్ అన్నం, కేసరిబాత్, శీతల పానీయాలను పంపిణీ చేశారు. అమ్మఫ్రెండ్స్ యూనియన్ మధుగౌడ, హరీష్గౌడ ఉచితంగా ఐస్క్రీంలను అందజేశారు. -
సిటీలో ఆటో గ్యాస్ బంద్
శివాజీనగర( కర్ణాటక): ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ధం, గల్ఫ్ దేశాలపై దాడులు వల్ల బెంగళూరులో వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ, ఎల్పీజీ కొరత ఏర్పడింది. స్టాక్ లేక బుధవారం నగరంలోని పలు ఆటో గ్యాస్ బంక్లు బంద్ అయ్యాయి. బంక్లకు మంగళవారం నుంచి సక్రమంగా గ్యాస్ సరఫరా కాలేదంటూ యజమానులు మూసివేశారు. శేషాద్రిపురం–గుట్టహళ్లి వద్ద ఉన్న ఆటో గ్యాస్ బంక్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. పలుచోట్ల బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం కేజీ గ్యాస్ రూ.65 ఉండగా ఇప్పుడు రూ. 80 అయ్యింది. ఓ బంక్ మేనేజర్ బాబు మాట్లాడుతూ, ఆటో గ్యాస్ సక్రమంగా సరఫరా కావడం లేదు. ఎక్కువ ధర పెట్టి కొని విక్రయించే స్తోమత లేదు. కొత్త స్టాక్ వచ్చిన తరువాత బంక్ను తెరుస్తామని తెలిపారు. ఉపాధికి గండిపడుతోందని డ్రైవర్లు ఆవేదన చెందారు. బెంగళూరులో ప్రముఖ ఆలయాల కూడా ఇబ్బంది వచ్చింది. ప్రసాదాలు, నైవేద్యాలు వండడానికి రోజుకు కనీసం 1 నుంచి 4 సిలిండర్లు కావాలి. మంగళవారం, శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ. గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. -
దొరికినవి.. దేవతల నగలు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఈ ఏడాది జనవరి 10వ తేదీన కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్కుండిలో లభించిన నిధి గురించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆ చారిత్రక గ్రామంలో ఓ మహిళ ఇంటి పునాది తవ్వతుండగా పురాతనమైన రాగి చెంబు, అందులో అపురూపమైన బంగారు నగలు లభించడం తెలిసిందే. వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. పురావస్తుశాఖ అధికారులు ఆ బంగారు ఆభరణాలు సుమారు 600 సంవత్సరాల క్రితం నాటివని, కళ్యాణ చాళుక్య రాజులు, విజయనగర అరస రాజుల కాలం నాటివని నిర్ధారించారు. ఇవి మనుషులు ధరించేవి కావని, ఆలయాలలో దేవతలకు లేదా ఉత్సవ మూర్తులకు అలంకరించే ఆభరణాలని తెలిపారు. వీటి విలువ రూ.8 కోట్లని ప్రకటించారు. చదవండి: అరుదైన ఈ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? -
ఉరికి వేలాడిన తల్లీ బిడ్డ
తుమకూరు: తల్లి, చిన్నారి కూతురితో కలిసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయవిదారక ఘటన గుబ్బి తాలూకాలో హాగలవాడిలో జరిగింది. యతీశ్, భార్య గంగామణి (29), పిల్లలతో నివసిస్తున్నారు. గంగామణిది తిపటూరు తాలూకా జక్కనహళ్లి. 9 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 8 ఏళ్ల కుమారుడు వినయ్, 5 ఏళ్ల కుమార్తె రక్షితా, రెండేళ్ల ప్రేక్ష అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కడుపునొప్పి, రుతుస్రావ అనారోగ్యంతో ఆమె బాధపడుతోందని అత్తింటివారు చెబుతున్నారు. వైద్యులతో చికిత్స తీసుకున్నా నయం కాలేదని చెప్పారు. దీంతో విరక్తి చెంది ఒకే చీరతో కూతురు ప్రేక్షకి ఉరిబిగించి ఆమె ఉరివేసుకున్నట్లు తెలిపారు. ఆమె తల్లి దాక్షాయణమ్మ చేళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎమ్మెల్యేకు బెయిలు బనశంకరి: కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకున్నారనే కేసులో లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేసిన గదగ్ జిల్లా శిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాణికి బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొన్ని రోజులుగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఎమ్మెల్యే చంద్రుకు ఊరట దక్కింది. -
ప్రియుని మోజు.. పెళ్లయిన 2 నెలలకే హత్య
తుమకూరు: తిపటూరు తాలూకా రంగాపుర సమీపంలోని చిక్కకొట్టేగెహళ్లి వద్ద తిపటూరు గాంధీనగర నివాసి, గుజరీ వ్యాపారి మన్సూర్ పాషా (31) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అజ్జంపూరు తాలూకాకు చెందిన ధనరాజ్ హెచ్టీ (24), వెంకటేశ్ (24), దర్శన్ (24), మృతుని భార్య ఫర్జానా అరెస్టయిన నిందితులు. బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కేసు వివరాలను వెల్లడించారు. 2 నెలల కిందటే మన్సూర్ పాషా, ఫర్జానా పెళ్లయింది. కానీ ఫర్జానాతో ధనరాజ్కు గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి తర్వాత కూడా తరచూ కలిసేవారు. తమకు అడ్డుగా ఉన్న మన్సూర్ పాషాను వ్యాపారం గురించి మాట్లాడాలని పిలుచుకెళ్లి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, బొలేరో వాహనం, పల్సర్ బైక్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కుడితినిలో రైతుల ఆందోళన
సాక్షి, బళ్లారి: బళ్లారి జిల్లా సండూరు తాలూకా కుడితినిలో రైతులు భారీ ఆందోళన చేశారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, లక్ష్మీ మిట్టల్ కంపెనీ కోసం స్వాధీనం చేసుకున్న భూమిని జిందాల్ సంస్థకు బదిలీ చేయరాదని పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కుడితిని పారిశ్రామిక ప్రాంతంలో భూముల విషయంలో రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. సీఐటీయూ, భూ సంరక్షణ పోరాట సమితి, కర్ణాటక ప్రాంత రైతు సంఘం, వివిధ కన్నడ పర సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మట్టి పరీక్షలతో రగడ సదరు భూముల్లో జిందాల్ సంస్థ ప్రతినిధులు మట్టి పరీక్షలు కోసం పోలీసు బందోబస్తుతో రావడం నిరసనకు కారణమైంది. వందలాది మంది రైతులు చేరి జిందాల్ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్ష్మీ మిట్టల్ కోసం స్వాధీనం చేసుకున్న తమ భూములను జిందాల్ సంస్థకు ఎందుకు అప్పగిస్తున్నారని, ఇందులో ఎవరి స్వార్థం ఉందని రైతులు ప్రశ్నించారు. ఒక కంపెనీ పేరు చెప్పి మరో కంపెనీకి బదిలీ చేయడం రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. పోలీసులు, అధికారులతో వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జిందాల్ సంస్థకు భూమిని ఇచ్చేది లేదన్నారు. రైతు నేతలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. ఓ కంపెనీ పేరుతో భూముల్ని తీసుకుని, మరో సంస్థకు అప్పగించారని ఆగ్రహం -
సిటీలో ఆటో గ్యాస్ బంద్
శివాజీనగర: ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ధం, గల్ఫ్ దేశాలపై దాడులు వల్ల బెంగళూరులో వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ, ఎల్పీజీ కొరత ఏర్పడింది. స్టాక్ లేక బుధవారం నగరంలోని పలు ఆటో గ్యాస్ బంక్లు బంద్ అయ్యాయి. బంక్లకు మంగళవారం నుంచి సక్రమంగా గ్యాస్ సరఫరా కాలేదంటూ యజమానులు మూసివేశారు. శేషాద్రిపురం–గుట్టహళ్లి వద్ద ఉన్న ఆటో గ్యాస్ బంక్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. పలుచోట్ల బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం కేజీ గ్యాస్ రూ.65 ఉండగా ఇప్పుడు రూ. 80 అయ్యింది. ఓ బంక్ మేనేజర్ బాబు మాట్లాడుతూ, ఆటో గ్యాస్ సక్రమంగా సరఫరా కావడం లేదు. ఎక్కువ ధర పెట్టి కొని విక్రయించే స్తోమత లేదు. కొత్త స్టాక్ వచ్చిన తరువాత బంక్ను తెరుస్తామని తెలిపారు. ఉపాధికి గండిపడుతోందని డ్రైవర్లు ఆవేదన చెందారు. బెంగళూరులో ప్రముఖ ఆలయాలకు ఇబ్బంది వచ్చింది. ప్రసాదాలు, నైవేద్యాలు వండడానికి రోజుకు కనీసం 1 నుంచి 4 సిలిండర్లు కావాలి. మంగళవారం, శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ. గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. -
వాల్మీకుల నిరసన
తుమకూరు: రాష్ట్రంలో ఎస్టీ వర్గాలకు 7 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ప్రభుత్వం 56,437 ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఎస్టీ, ఎస్టీ సముదాయాల వివిధ డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ వాల్మీకి నాయక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రిజర్వేషన్ తమ హక్కు, భిక్ష కాదు, రిజర్వేషన్ కావాలి అని నినాదాలు చేశారు. యువతీ యువకులతో పాటు ఆ వర్గానికి చెందిన రిటైర్డు అధికారులు పాల్గొన్నారు. వీసా పేరిట మహిళకు రూ.5 లక్షల వంచనమైసూరు: సింగపూర్కు వెళ్లేందుకు వీసా చేయించి ఇస్తామని మహిళను వంచకులు నమ్మించి రూ.5 లక్షలు స్వాహా చేసిన ఘటన మైసూరులో జరిగింది. గోకులం నివాసి, ఇంజనీర్ అయిన మహిళకు మెరిలియన్ వీసా సొల్యూషన్ అనే సంస్థ వాట్సాప్ ద్వారా వీసా చేయించి ఇస్తామని సందేశం వచ్చింది. దీనిని నమ్మిన ఆమె ఆ సంస్థను మొబైల్ నంబరు ద్వారా సంప్రదించింది. వారు చెప్పినట్లు ఖాతాకు దశల వారీగా రూ.5,34,272లను బదిలీ చేసింది. ఎన్నిరోజులైనా వీసా పని జరగలేదు. చాలాసార్లు ఫోన్ చేసినా స్పందన కరువవడంతో మోసపోయిన మహిళ సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎయిర్పోర్టులో రూ.1.57 కోట్ల గంజాయి సీజ్ దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు రూ.1.57 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాడు బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని లగేజీ చెక్ చేస్తుండగా బ్యాగులో రహస్యంగా దాచి ఉంచిన 4.5 కేజీల హైడ్రో గంజాయి పట్టుబడింది. సరుకు విలువ రూ.1.57 కోట్లుగా అధికారులు తెలిపారు. ప్రయాణికున్ని అరెస్టు చేశారు. డ్రైవరు దుర్బుద్ధి.. యజమాని ఇంట్లో చోరీ దొడ్డబళ్లాపురం: ఒక కారు డ్రైవర్ తన యజమాని ఇంట్లోనే దొంగతనం చేసిన ఘటన బెంగళూరు అమృతహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. జక్కూరు నివాసి అభిలాష్ గౌడ (30) డ్రైవరు కాగా, రియల్టర్ ప్రతీక్ వద్ద గత 10 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ప్రతీక్ కుటుంబం అతన్ని సొంత కుటుంబీకునిగా చూసుకునేది. ఇంట్లో వారి వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బు గురించి అభిలాష్ తెలుసుకున్నాడు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూ.14.65 లక్షల విలువైన బంగారు నగలను కొట్టేశాడు. అతని స్నేహితుడు మదన్ కూడా పాల్గొన్నాడు. కొన్ని రోజులకు ప్రతీక్ కుటుంబీకులు బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తు చేసి అభిలాష్గౌడ ఎత్తుకెళ్లాడని, ఇప్పటికే అమ్మేశాడని గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి, బంగారాన్ని రికవరీ చేశారు. జయహో కోలారమ్మకోలారు: నగర దేవత కోలారమ్మ బ్రహ్మ రథోత్సవం బుధవారం నగరంలో ఘనంగా జరిగాయి. తహసీల్దార్ నయన, నగరసభ కమిషనర్ నవీన్చంద్ర, అర్చకులు పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. నగరంలోని ప్రముఖ వీధుల గుండా తేరును లాగారు. భక్తులు తేరు మీదకు దవనం, అరటిపండ్లు విసిరారు. -
30 వేల లీటర్ల బీరు నేలపాలు
మైసూరు: కేఎస్బీసీఎల్ మైసూరు డిపో–1, కేఎస్బీసీఎల్ మైసూరు డిపో–2లో అమ్ముడు పోకుండా గడువు మీరిపోయిన వివిధ రకాల మొత్తం 30,366 లీటర్ల బీరు పానీయాన్ని కూర్గళ్లి డిపోలో ధ్వంసం చేశారు. మైసూరు ఉప విభాగ ఎకై ్సజ్ డీఎస్పీ హెచ్కే రమేష్ నేతృత్వంలో అధికారులు, ఉద్యోగులు బీరు బాటిళ్లలోని బీరును డ్రైనేజీలో పారబోశారు. దీనిపై మందుబాబులు సోషల్ మీడియాలో సరదాగా ఆవేదనను వ్యక్తంచేశారు. ఆ బీర్లను తమకు ఇచ్చి ఉంటే ఖాళీ చేసేవారమని, అధికారులకు శ్రమ తప్పేదని తెలిపారు. ఎక్కువ ధరల వల్లే ఇంత వృథా కాగా, ధరలు ఎక్కువగా ఉండడం వల్ల బీర్ల విక్రయాల తగ్గినట్లు అధికారులు తెలిపారు. మద్యం కంపెనీల నుంచి సరుకును డిపోలకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి వైన్స్ వ్యాపారులకు విక్రయిస్తారు. అయితే షాపుల్లో బీర్లకు గిరాకీ తగ్గిపోవడంతో డిపోలలో స్టాకు నిలిచిపోయి ఎక్స్పైరీ అవుతోందని వివరించారు. ప్రభుత్వం ధరలను తగ్గిస్తే గిరాకీ పెరిగి ఇలా వృథా కావడం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే మంచిదేమో. అధిక ధరల ఎఫెక్టు -
విద్యార్థి ఆత్మహత్యతో ఉద్రిక్తత
సాక్షి,బళ్లారి: మూడు రోజుల క్రితం తాళూరు రోడ్డులో నగర శివార్లలోని గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్లో ఓ విద్యార్థి ఉన్మాదిగా మారి తన సహచర విద్యార్థులపై చాకు, రాడ్తో దాడి చేసి గాయపరిచి ఒకరిని చంపడంతో పాటు 8 మందిని తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చదువుతున్న గుగ్గరహట్టికి చెందిన అరవింద్(17) అనే విద్యార్థి కళాశాలలో జరిగిన రగడపై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల కళాశాలలో కొంత మంది విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి యాజమాన్యం మందలించింది. ఈ రగడలో అరవింద్ కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులను కూడా పిలిపించి, మందలించడంతో పాటు ఇలాంటి వారిని తాము తమ కళాశాలలో చదివించలేమని, ఇంటికి పంపిస్తామని ఘాటుగా హెచ్చరించడంతో మనస్తాపంతో అరవింద్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న స్థానిక బ్రూస్పేట పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక బిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తమ స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని కళాశాల వద్ద స్నేహితులు, బంధువులు ఆందోళన చేశారు. పెద్ద సంఖ్యలో గుమిగూడి కళాశాలలోకి చొరబడి అద్దాలు పగులగొట్టి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి సోదరుడు గణేష్ మాట్లాడుతూ కళాశాలలో గొడవ జరిగిన తర్వాత తమ తల్లిదండ్రులను పిలిపించి తాము వచ్చే ఏడాది అడ్మిషన్ ఇవ్వమని, ఇంటికి పంపిస్తామని హెచ్చరించారన్నారు. ప్రిన్సిపాల్ కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదని, ప్రిన్సిపాల్ మానవతా విలువలు మరిచి నడుచుకున్నారని, దీంతో ఆవేదన చెందిన తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై బ్రూస్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి బలవన్మరణం కళాశాలలో జరిగిన ఘర్షణపై మందలింపు మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకున్న అరవింద్ బళ్లారిలో కలకలం రేపిన మరో విషాదం -
ఆస్పత్రిలో వృద్ధురాలు మృతి
రాయచూరు రూరల్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన జిల్లాలోని సింధనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం చికిత్స కోసం గంగమ్మ(80) అనే వృద్ధురాలు ఆస్పత్రిలో చేరారు. అయితే సాయంత్రానికి ఆమె మరణించింది. దీంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు వృద్ధురాలికి సక్రమంగా చికిత్స అందించనందునే మరణించిందని ఆరోపిస్తూ, వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అర గంట సేపు రాయచూరు– సింధనూరు ప్రధాన రహదారిలో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆకస్మికంగా ఆందోళనకు దిగారు. విషయం తెలియగానే ఆస్పత్రి వద్దకు చేరుకున్న మాజీ జెడ్పీ అధ్యక్షుడు పంపనగౌడ బాదర్లి, పోలీసులు జోక్యం చేసుకుని రాజీ సంధానంతో సమస్యను పరిష్కరించారు. ఈ విషయంలో తాలూకా ఆరోగ్య అధికారి సురేష్గౌడ మాట్లాడుతూ వయో సహజ వృద్ధాప్య కారణంగా గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించినట్లుగా అనుమానం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన -
రిజర్వేషన్ ఇచ్చేవరకు ఉద్యోగాల భర్తీ వద్దు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణలు, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశం కల్పించడం తగదని కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ సంచాలకుడు విరుపాక్షి పేర్కొన్నారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియామకాలు జరిగితే మాదిగ విద్యార్థులకు మరణ శాసనంగా మారుతుందన్నారు. సర్కార్ ఈ విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కు వినతిపత్రం అందించారు. ఆందోళనలో రవీంద్ర, భీమన్న, ఆంజనేయ, కిరిలింగప్ప, నరసప్ప, మౌనేష్లున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం రాయచూరు రూరల్: నేటి సమాజంలో విద్యార్థుల్లో క్రమశిక్షణకు ఆద్యులు ఉపాధ్యాయులు అని రిమ్స్ రిటైర్డ్ నేత్ర చికిత్స అధికారి ప్రభనగౌడ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దేవదుర్గలో జ్ఞానగంగ పాఠశాల వార్షికోత్సవంలో జ్యోతి వెలిగించి మాట్లాడారు. విద్యార్థుల్లో సంస్కృతి, సంస్కారం, ఆచార, విచారాలు, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించాలన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో కళలను పోషించాలన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల సంస్థాపకులు శరణబసవ, భీమనగౌడ, చంద్రశేఖర్, శంకరలింగయ్య, సుభాష్చంద్రలున్నారు. మాదిగలకు రిజర్వేషన్ 50 శాతం మాత్రమే రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు కల్పించే రిజర్వేషన్ 50 శాతం మాత్రమే అని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర, చలువాది మహాసభ సంచాలకుడు భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరుగుతాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 56 శాతం రిజర్వేషన్లు దాటితే ఉద్యోగాల్లో నియామకం చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం 50 శాతంతోనే ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. మాదిగ విద్యార్థులకు కుల ధ్రువీకరణ ప్రమాణ పత్రాలను అందించాలని ఒత్తిడి చేశారు. వలకు చిక్కిన భారీ చేపహొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని గండబొమ్మనహళ్లి చెరువులో ఒక మత్స్యకారుడు ఎప్పటిలానే వల వేశాడు. చిన్న చేపలు పడతాయని ఎప్పుడూ అనుకుంటూనే అతను నీటిలో నుంచి వలను పైకెత్తుతున్నాడు. ఆ సమయంలో వలలో చిక్కుకున్న ఒక పెద్ద చేపను చూసి అతను ఎంతో సంబర పడ్డాడు. చెరువులో నుంచి చేపలను ఒడ్డుకు తేవడం మత్స్యకారుడికి పెద్దగా ఇబ్బంది కలిగించింది. వావ్, ఎంత పెద్ద చేపో ! అని అతను ఆశ్చర్యపోయాడు. ఈ చేప ప్రస్తుతం 22 కిలోల బరువు ఉంది. కట్ల చేపగా గుర్తింపు పొందింది. మంచి వర్షాల కారణంగానే.. ఈ సారి మంచి వర్షాల కారణంగా చెరువులో భారీగా నీరు చేరింది. అందువల్ల చెరువులో ఒకే పరిమాణంలో చేపలు ఉండటం మత్స్యకారులకు శుభవార్తగా ఉంది. 22 కిలో బరువున్న జెయింట్ క్యాట్ఫిష్ ఇప్పటి వరకు మత్స్యకారులు పట్టిన అతిపెద్ద చేపగా మారింది. గతంలో వలలో పడిన రౌ, అరటి, జిలేబీ చేపలు ఒక్కొక్కటి కనీసం 5 నుంచి 7 కిలోల బరువు ఉండేవి. కానీ ఈసారి పట్టుకున్న 22 కిలోల క్యాట్ ఫిష్ చేపల ప్రియులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వలలో పడిన ఈ పెద్ద చేప ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చేపను ఔత్సాహికులు రూ.3,300 ధరకు కొనుగోలు చేశారు. -
మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్పను మాజీ మంత్రి శివనగౌడ నాయక్ అవమానించడం తగదని కేపీసీసీ మాజీ కార్యదర్శి అమరేష్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దావణగెరెలో ఎస్సీ, ఎస్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారన్నారు. అలాంటి నాయకులను పట్టుకొని చెంప పగల గొట్టాలని వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. మంత్రిని కొట్టే ధైర్యముంటే శివనగౌడ సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రేషన్ బియ్యం పట్టివేతహొసపేటె: నగరంలోని కూడ్లిగి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) రేషన్ బియ్యాన్ని పోలీసులు గుర్తించి బుధవారం స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా కూడ్లిగి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది బృందం ఈ దాడి నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా రవాణా చేస్తున్న మినీ లారీని పట్టుకుని తనిఖీ చేయగా, రేషన్ బియ్యం అని తేలింది. మొత్తం 360 బస్తాల్లో నింపిన 18,240 కిలోల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారు రూ.4,10,400 ఉంటుందని అంచనా వేశారు. ఘటనపై కూడ్లిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ సరికాదురాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. బుధవారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. నూతన విద్యుత్ చట్టం–2025ను ఉప సంహరించుకోవాలన్నారు. ఉద్యోగుల, కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు. విద్యుత్ వినియోగదారుల, రైతుల, చిన్న వ్యాపారుల సమస్యలను సరిదిద్దాలని కోరుతూ జెస్కాం ఇంజనీర్ దేశాయికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో జ్యోతి బసవ, హులిగప్ప, శివ కుమార్, రామణ్ణ, అణ్ణప్ప, వీరేష్ బాబు, వీరభద్రయ్య, మహేంద్ర సింగ్లున్నారు. సామాజిక బాధ్యత అందరి బాధ్యతహొసపేటె: సామాజిక బాధ్యత అనేది పరిశోధన బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ఏ రంగంలో నైనా, ఏ వృత్తిలోనైనా పాల్గొన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ విమర్శకుడు, హంపీ కవివి కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు డాక్టర్ బంజగెరె జయప్రకాష్ అన్నారు. బుధవారం హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలోని భువన విజయ ఆడిటోరియంలో విద్యా సంస్థ తరపున పరిశోధన, సామాజిక బాధ్యత అనే అంశంపై ఆయన మాట్లాడారు. పరిశోధన చేపట్టకూడదు. ఒక పరిశోధకుడికి తన రంగంలో నైపుణ్యం ఉండాలి. ఈ రోజుల్లో పరిశోధన ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటంటే, ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఏ దృక్కోణం నుంచి, ఏ ఆసక్తితో అర్థం చేసుకోవాలి, ఏ అంశాన్ని అధ్యయనం చేసినా దానిని సరైన దృక్కోణం నుంచి ప్రదర్శించాలని ఆయన అన్నారు. సెక్యూరిటీగార్డు ఇంటిలో చోరీశివమొగ్గ: సెక్యూరిటీ గార్డు ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన శివమొగ్గ తుంగా నగర పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీరాంపురలో జరిగింది. శ్రీరామపురలో నివాసం ఉంటున్న సెక్యూరిటీ గార్డు విధి నిర్వహణకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి లోపలకి చొరబడి రూ.4 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలు, బీరువాలోని రూ. 20 వేల నగదు దోచుకుని పారిపోయారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగా నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
దక్కని పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్
హుబ్లీ: కర్ణాటక పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వని కారణంగా బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడు లింగరాజ పాటిల్ రాజీనామా సమర్పించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 37 ఏళ్ల నుంచి పార్టీకి చిత్తశుద్ధితో కార్యకర్తగా పని చేశాను. పార్టీ అప్పగించిన ఎన్నో పనులను సమర్థవంతంగా నిర్వర్తించాను. అయినా తనకు టికెట్ ఇవ్వక పోవడంతో చాలా బాధ కలిగిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఎస్వీ సంకనూరుకు ఆ పార్టీ టికెట్ కేటాయించింది. ఆయన్ను మార్చి ఆ టికెట్ తనకు ఇవ్వడానికి ఇంకా సమయం ఉందన్నారు. 8 రోజుల్లో పార్టీ పెద్దలు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని లేఉకంటే తన తదుపరి నిర్ణయాలను వెల్లడిస్తానన్నారు. పార్టీలో నిష్టావంతులైన కార్యకర్తలకు విలువ లేదన్నారు. అందుకే రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెందడం లేదన్నారు. హుబ్లీ– ధార్వాడల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగరాదన్న ఉద్దేశంతోనే తనకు రావాల్సిన టికెట్ను చాడీలు చెప్పి తప్పించారని ఆరోపించారు. గత ఎన్నికల వేళ సంకనూరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించినా కూడా ఈ సారి పార్టీ ఆయనకే టికెట్ కేటాయించడంతో కార్యకర్తలకు ఎంతో ఆవేదనను కలిగించిందన్నారు. పార్టీ తనకు చేసిన ద్రోహం సమస్త కార్యకర్తలకు చేసిన అన్యాయం అన్నారు. పార్టీ నాకు తల్లిలాంటిది, పార్టీని వీడను అయితే తన వైఖరి మాత్రం మారుతుందని తెగేసి చెప్పారు. బీజేపీకి లింగరాజ పాటిల్ రాజీనామా -
రిజర్వేషన్ కోసం రాయచూరు బంద్ ప్రశాంతం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు అవకాశం కల్పించడం తగదని కోరుతూ కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ ఆధ్వర్యంలో రాయచూరు బంద్ పూర్తిగా విజయవంతమైంది. ఉదయం నుంచే ఐక్య వేదిక మహాసభ కార్యకర్తలు నగరంలో కలియ తిరుగుతూ బంద్ చేయించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ముగ్గురు కార్యకర్తలు శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలో దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బాబూ జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ సర్కిల్, బసవేశ్వర సర్కిల్, గంజ్ సర్కిళ్ల వద్ద ఆందోళన చేపట్టి వాహనాల రాకపోకలను స్తంభింప చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెలవెల ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేకపోవడంతో బోసిపోయింది. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అంగళ్లు, హోటళ్లు బంద్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిథిగా పని చేశాయి. రాయచూరు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు రవాణా సౌకర్యాలు స్తంభించి పోయాయి. తెలంగాణలోని గడినాడు టైర్ రహదారి వద్ద ఆరు కి.మీ.ల దూరం వాహనాలు నిలిచి పోయాయి. తీన్ కందిల్, సూపర్ మార్కెట్, షరాఫ్ బజార్, పటేల్ రోడ్డు, బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, గంజ్ రహదారులు వాహన సంచారం లేక ప్రజల సందడి లేక బోసిపోయాయి. రాయచూరు నుంచి మంత్రాలయం, బళ్లారి, కర్నూలు, శ్రీశైలం, దావణగెరె, హైదరాబాద్, కలబుర్గి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. బంద్తో మూతపడిన అంగళ్లు, హోటళ్లు ముగ్గురు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం తెలంగాణ, ఏపీలకు నిలిచిన రాకపోకలు -
కుట్టుతో మహిళలకు జీవనోపాధి
బళ్లారిఅర్బన్: మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడగల శక్తికలిగిన వారని, ఇలాంటి మహిళలకు కుట్టు(టైలరింగ్) వృత్తి జీవనోపాధి కల్పిస్తుందని బీజేపీ మహిళా మోర్ఛా జిల్లా అధ్యక్షురాలు హంపీ రమణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సింధిగి కాంపౌండ్లో ప్రతిభా మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడారు. కుట్టు శిక్షణ ద్వారా నైపుణ్యం పెంపొందించుకున్న మహిళలు తమ ప్రతిభతో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవగలరన్నారు. ఉన్నత విద్య లేక పోయినా కృషి నైపుణ్యంతో మహిళలు తమ జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకొని స్వతంత్రులుగా ఎదగగలరన్నారు. ప్రతిభా మహిళ మండలి అధ్యక్షురాలు సుజాత రవిచంద్ర మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత కోసం సంస్థ తరచు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తు వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు తమ ప్రతిభతో స్వయం ఉపాధి పొందుతూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. బీజేపీ మహిళా మోర్ఛా రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి, శిక్షణ పొందిన అనేక మంది మహిళలు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన ఈత సరదా
హుబ్లీ: ఇద్దరు చిన్నారులు ఈత సరదాతో జలసమాధి అయిన ఘటన హుబ్లీలోని నవనగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. ఇద్దరు కళాశాల విద్యార్థులు తీవ్రమైన ఎండల నేపథ్యంలో స్నానానికి ఇంటి దగ్గరలోని నీటి గుంత దగ్గరకు వెళ్లారు. అయితే వారిద్దరికీ సరిగ్గా ఈత రాని కారణంగా ఇద్దరు స్నేహితులు జలసమాధి అయ్యారు. పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఆవేదనతో రగిలి పోయారు. నగరంలోని బైరిదేవరకొప్ప రేణుకా నగర్ నివాసులైన సమర్థ్(17), హరీష్(17) అనే ఇద్దరు కాలేజీ విద్యార్థులు శవాలుగా లభ్యమయ్యారు. వీరిద్దరూ స్థానిక గోపనకొప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామర్స్ విభాగంలో ప్రథమ పీయూసీ చదివేవారు. ఇటీవల పరీక్షలు ముగియడంతో ఇంట్లోనే ఉండేవారు. బయట ఎండలు మండిపోతుండడంతో ఇంటి దగ్గరలోని నిర్మాణ దశలోని ఆర్ఎన్ఎస్ గాల్ఫ్ మైదానంలోని గుంత దగ్గరకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా ఆచూకీ లేదు మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన వారు సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆ మైదానంలోని కార్మికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈత రాకపోయినా ఈ ఇద్దరు వారి కుటుంబాల్లో ఏకై క సంతానాలైన తమ బిడ్డల శవాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువుల శోకం కట్టలు తెంచుకుంది. ఘటనపై ఏపీఎంసీ నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తమ పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని, వేసవిలో తమ పిల్లలపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు పోలీసు అధికారులు సూచించారు. నీటి కొలనులో ఇద్దరు బాలుర జల సమాధి -
మిరప ధర ఘనం.. దిగుబడి పతనం
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదన్న సామెత చందంగా మార్కెట్లో మిరప ధరలు పెరిగినా పొలాల్లో దిగుబడి మాత్రం క్షీణించింది. దీనికి తోడు ఇరాన్– ఇజ్రాయెల్–అమెరియా దేశాల మధ్య యుద్ధంతో రైతన్న పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని కొప్పళ, రాయచూరు, యాదగిరి, కలబుర్గి, బీదర్ జిల్లాల్లో తుంగభద్ర, కృష్ణా నదులున్నా నీరు అందక రైతుల పొలాల్లో వేసుకున్న మిరప పంట ఆశించిన మేర దిగుబడి రాలేదు. బోరుబావుల కింద పంటలు పండించాలంటే విద్యుత్ కోతలు అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులున్నా వ్యవసాయ పనులు లభించక కూలికార్మికులకు ఉపాధి కోసం దేశాటన తప్పడం లేదు. రైతులు రాయచూరు జిల్లాలో 50 వేల ఎకరాల్లో మిరప, 86 వేల ఎకరాల్లో కందులు సాగు చేశారు. కాలువకు నీరందక భూములు బీళ్లుగా మారాయి. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక మిరప పంట చేతికి అందదనే ఆందోళనతో అక్కడక్కడా నీటిని కడవలు, బిందెలతో మోసిపోశారు. బ్యాడగి రకం మిరపకాయలు క్వింటాల్ ధర రూ.14 వేలు, గుంటూరు రకం మిరప కాయలు క్వింటాల్ ధర రూ.12,675, ఇతర రకాలకు క్వింటాల్ ధర రూ.8 వేల చొప్పున మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. యుద్ధం కారణంగా ఇతర దేశాలకు మిరప కాయల ఎగుమతులు నిలిచిపోయి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్లో ఆశాజనకంగా మిర్చి ధరలు రైతులకు శాపంగా పశ్చిమాసియా యుద్ధం దిక్కుతోచని స్థితిలో కళ్యాణ కర్ణాటక రైతులు -
తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా
హొసపేటె: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో దేశీయంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై దుష్ప్రభావం పడింది. దీంతో నగరంలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. యుద్ధంతో సిలిండర్ల కొరత ఏర్పడటంతో గృహ వినియోగదారులు, హోటల్ పరిశ్రమలో ఆందోళనకు కారణమైంది. సాధారణంగా ప్రతి రోజూ రెండు నుంచి మూడు లోడ్ల గ్యాస్ సిలిండర్లు నగరానికి వస్తాయి. కానీ బుధవారం ఒక లోడ్ మాత్రమే రావడం గమనార్హం. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిపి వేయడం హోటల్, వ్యాపార రంగానికి ఇబ్బందులను కలిగించింది. దీనిపై నగరంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ విజయ్కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సరఫరా సమస్య నెలకొందన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయన్నారు. బుధవారం 360 సిలిండర్లు మాత్రమే రాగా నగరంలో 720కి పైగా సిలిండర్లను వినియోగదారులు ముందే బుక్ చేసుకున్నారన్నారు. ఈ కారణంగా సరఫరాపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. -
టిప్పర్ డ్రైవర్తో వివాహేతర సంబంధం..!
కర్ణాటక: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిందో భార్య. ఆమెతో పాటు నలుగురు నిందితులను శ్రీరంగపట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తాలూకాలోని మారళగాల గ్రామ అర్చకుడు సిద్ధలింగప్ప తన అక్క కుమార్తె షాలినిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలినికి అదే ఊరికి చెందిన టిప్పర్ డ్రైవర్ హరీశ్తో వివాహేతర సంబంధం ఉంది. ఒకరోజు షాలిని, హరీశ్ ఏకాంతంగా ఉన్నప్పుడు భర్తకు దొరికిపోయారు. ఇలాంటి పనులు చేయరాదని భార్యను మందలించడంతో ఆమె కక్ష పెంచుకుంది. తన భర్తను చంపేయమని హరీశ్కు సిఫార్సు చేసింది. మార్చి 6న రాత్రి అర్చకుడు సిద్ధలింగప్ప.. కె.శెట్టిహళ్లి గణపతి దేవస్థానంలో పూజ ముగించుకుని ఇంటికి పయనమయ్యాడు. హరీశ్, మరో టిప్పర్ డ్రైవర్ సంతోష్ కుమార్తో కలసి గ్రామం వద్ద ఉన్న కాలువ ఏరియా నిర్మానుష్య ప్రాంతంలో అర్చకుడిని అడ్డగించారు. కట్టెలతో బాది చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అక్కడక్కడ అతని వస్తువులు వేసి, బైక్ను కాలువలోకి పడేశారు. 7న సీడీఎస్ కాలువలో సిద్ధలింగప్ప మృతదేహం లభించింది. ముఖానికి, తలకు గాయాలున్నాయి. ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపి ఉంటారని భావించి అతడి అన్న బాలసుందర్ శ్రీరంగపట్టణ గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి మార్చి 9న హరీశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. సిద్ధలింగప్ప భార్య షాలిని, సంతోష్ కుమార్, గణేశ్తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్లు అంగీకరించాడు. షాలిని , హరీశ్, సంతోష్ కుమార్, గణేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సోషల్ మీడియాలో పరిచయం… లాడ్జికి పిలిచి..!
కర్ణాటక : శ్రీమంతులను గురి పెట్టి పరిచయం చేసుకొని తీయని మాటలతో వల వేసి దోచేస్తున్న కిలాడీ బాగోతమిది. బాగలకోట జిల్లా మహాలింగపురకు చెందిన దీప అవటగి (35)ని బెళగావి పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె స్నేహితుడు శివానంద మఠపతి పరారీలో ఉన్నాడు. శివానంద బెళగావి జిల్లా హుక్కేరివాసి, దీపకు శ్రీమంతుల వివరాలను అందించేవాడు. ఆమె ఫేస్బుక్, ఇన్స్టాలో అలాంటివారిని పరిచయం చేసుకొని బుట్టలో వేసుకొనేది. అశ్లీల చాటింగ్ చేసి, బెళగావిలో లాడ్జికి పిలిచేది. ఇలా ఓ బాధితుడు లాడ్జికి రాగానే స్నానాల గదిలోకి పంపించి, తాళం వేసుకొని బట్టలు, నగదు, మొబైల్, కారు తాళం తీసుకుని పరారైంది. పైగా డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేదని పోలీసుల విచారణలో బయట పడింది. కాల్ రికార్డింగులు, సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితురాలిని బెళగావిలోని తిళకవాడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
రాజస్థానీ గజదొంగ పట్టివేత
బనశంకరి: తాళం వేసిన ఇళ్లలో బంగారం, డబ్బును ఎత్తుకెళ్లే రాజస్థానీ దొంగను బెంగళూరు యలహంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.3 కోట్ల విలువచేసే వజ్రాలు, నగలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. రాజస్థాన్కు చెందిన వల్లరాం మీనా అలియాస్ సునీల్ (19) ఈ దొంగ. గత నెల15వ తేదీన ఆర్టీ నగరలో ఓ టెక్కీ ఇల్లు తాళం వేసి ఉండగా, టెర్రస్ మీద తలుపు బద్దలుకొట్టి ఇంట్లోకి చొరబడి వజ్రాలు, బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. రాజస్థాన్లోని గింగలా ఠాణా పరిధిలోని మణగిరిపాల గ్రామంలో సునీల్ను అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడిన 1.8 కేజీల బంగారు నగలు, వజ్రాల ఆభరణాలను అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.3 కోట్ల బంగారం సీజ్ -
బస్సులో మహిళపై చిల్లర పడేసి, గొలుసు చోరీ
మైసూరు: మైసూరులో రెండుచోట్ల మహిళల బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. వివరాలు.. వృద్ధురాలి మెడలోని 40 గ్రాముల గొలుసు చోరీ చేసిన ఘటన ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నీలమ్మ (60) అనే మహిళ బెళ్లూరు క్రాస్ నుంచి మైసూరుకు వచ్చే బస్సులో ప్రయాణిస్తుండగా ఇద్దరు అపరిచిత మహిళలు శిశువుతో సహా శ్రీరంగపట్టణలో బస్సు ఎక్కారు. శిశువు వాంతులు చేసుకుంటోంది, కిటికీ పక్కన స్థలం ఇవ్వాలని నీలమ్మను అడిగితే తిరస్కరించింది. కొలంబియా ఆస్పత్రి వద్దకు బస్సు చేరుకోగానే మహిళలు బస్సు దిగబోతూ తమ లగేజీని తీస్తూ నీలమ్మపైకి చిల్లరను పడేశారు. చిల్లరను తీసిచ్చేందుకు నీలమ్మ వంగినప్పుడు ఆమె మెడలోని బంగారు గొలుసును కట్ చేసుకున్నారు. ఎల్ఐసీ స్టాప్ రాగానే మహిళలు బస్సు దిగి వెళ్లిపోయారు. నీలమ్మ ఇంటికి వెళ్లిన తరువాత చూసుకుంటే గొలుసు లేదు. చిల్లర డబ్బులు వంటిపై పడినప్పుడు ఏదో మైకం కమ్మినట్లయిందని నీలమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. టీవీ చూస్తుండగా చొరబడి... మైసూరు చామరాజ మొహల్లా నివాసి ఇంద్రాణి సోమవారం రాత్రి 9.45 గంటల సమయంలో గాలి రావడం లేదని ఇంటి తలుపును తెరిచి ఉంచి టీవీ చూస్తోంది. ఆ సమయంలో దుండగుడు చొరబడి ఇంద్రాణి ముఖం, కళ్లపై స్ప్రే చేసి ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఆమె లక్ష్మీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
ఇది ఖాళీ ట్రంకు.. మీది ఖాళీ డ్రమ్ము
అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తున్న విద్యార్థులుమాట్లాడుతున్న డీసీఎం శివ, చిత్రంలో సీఎం శివాజీనగర: డీసీఎం డీకే శివకుమార్ సీఎం సిద్దరామయ్యకు మద్దతు ఇస్తున్నారంటే ఏదో శుభ సమాచారం ఉంటుందని అర్థమని విధానసభలో బీజేపీ పక్ష ఉప నేత అరవింద బెల్లద్ అన్నారు. మంగళవారం బడ్జెట్పై చర్చల్లో బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ, ఇది క్రెడిట్ కార్డు బడ్జెట్ మాదిరిగా ఉంది, ఆర్థిక క్రమశిక్షణ లేదు, అప్పులు అనే ఆక్సిజన్తో బతుకుతోంది అని ఎద్దేవా చేశారు. ఇది ఖాళీ ట్రంక్, ఖాళీ చెంబు అన్నారు. ఇంతలో డీసీఎం డీ.కే.శివకుమార్ నిలబడి, అలాగైతే మీ కేంద్ర బడ్జెట్ ఖాళీ డ్రమ్ము అని అనవచ్చా? మీరు బడ్జెట్కు ముందే ఖాళీ చెంబులతో వచ్చారంటే మీ భావం ఏమై ఉంటుంది? అని అన్నారు. బెల్లద్ స్పందిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ రోజున కనిపించని డీకే హఠాత్తుగా బడ్జెట్ చర్చలో తలదూర్చరాదని బీజేపీ ఎమ్మెల్యేలు కేకలు వేశారు. ఆర్థిక శాఖను వద్దన్నా: సీఎం అశోక్ మాట్లాడుతూ గొర్రెలను లెక్కించడం రాని సిద్దరామయ్యను హెచ్.డీ.దేవేగౌడ ఆర్థికమంత్రిని చేశారన్నారు. అప్పుడు సీఎం సిద్దరామయ్య జోక్యం చేసుకుంటూ.. తాను రెవిన్యూ శాఖను కోరితే, దేవేగౌడ ఆర్థిక శాఖ ఇచ్చారని, వద్దన్నా వినలేదని చెప్పారు. స్పీకర్ ఖాదర్ ఇక చాలని చెబుతుండగా, తమరు రంజాన్ నెల ఉపవాసంలో ఉన్నారు. కోపం అధికంగా ఉంటుంది. శాంతియుతంగా నా మాటలు వినాలని అశోక్ కోరారు. స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్టే యశవంతపుర: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్తో జరపాలని కర్ణాటక గ్రామ స్వరాజ్ – పంచాయతి రాజ్ సవరణల బిల్లుపై అసెంబ్లీలో చర్చించారు. ఈవీఎంలపై కాంగ్రెస్ సభ్యులు అనుమానాలున్నాయన్నారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని బిల్లులో తీర్మానించారు. పంచాయతిరాజ్శాఖ తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి హెచ్కె పాటిల్ కర్ణాటక స్వరాజ్, పంచాయతి రాజ్ సవరణలు–2026 బిల్లును విధానసభలో ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లపై జరిగే దాడులు, బెదిరింపులు వంటివి అడ్డుకోవడానికి బిల్లులో చర్యలు ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లపై విధానసభలో కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు -
శిబిరంలో ఏనుగు కన్నుమూత
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగరహొళె పరిధిలోని మత్తిగోడు ఏనుగుల పోషణ శిబిరంలో ఉన్న జూనియర్ అభి (23) అనే ఏనుగు అనారోగ్యంతో మరణించింది. ఈ ఏనుగును అడవి ఏనుగుల పట్టివేతకు ఉపయోగించేవారు. ఎనిమిదేళ్ల క్రితం ఇది మేత మేస్తూ గుంతలోకి పడడంతో ముందు ఎడమ కాలు విరిగి తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి పశువైద్యుడు డాక్టర్ రమేష్ చికిత్స అందిస్తున్నారు. కొంతమేరకు కోలుకుని కుంటుతూనే శిబిరంలో తిరుగాడేది. అయితే కొన్ని రోజులుగా నడవలేక ఒకేచోట కూర్చుండిపోయింది. చివరకు మంగళవారం కన్నుమూసింది. డీసీఎఫ్ సీమా, ఏసీఎఫ్ లక్ష్మీకాంత్, ఆర్ఎఫ్ఓ దేవరాజ్ పరిశీలించి అంత్యక్రియలు చేయించారు. మరిన్ని విమానాల రద్దు దొడ్డబళ్లాపురం: ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతుండగా, బెంగళూరు కెంపేగౌడ విమనాశ్రయం నుంచి అరబ్ దేశాలకు వెళ్లే విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. మంగళవారంనాడు కూడా ఇక్కడకు రావాల్సిన 8 విమానాలు, వెళ్లాల్సిన 9 విమానాలు రద్దయ్యాయి. సరుకు రవాణా విమానాలు కూడా రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇక్కడ విమానాలచే సరుకు రవాణా 30 శాతం తగ్గింది. క్షుద్రపూజల పార్శిల్ విమానాశ్రయంలో ఉన్న పోస్టాఫీసుకు వచ్చిన ఒక పార్శిల్ కలకలం రేపింది. పార్శిల్లో ఒక మహిళ, ఒక పురుషుని నగ్న ఫోటోలు, ఫోటోల చుట్టూ కుళ్లిన టమాటాలు, పూలహారాలు, మేకులు, టూత్పేస్ట్ తదితర వస్తువులు ఉంచారు. పార్శిల్ విప్పిచూసిన సిబ్బంది భయపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 22న ఓ అపరిచితుడు ఎయిర్పోర్టులో సంచరించాడు, ఆపై పాలక మండలి కార్యాలయానికి పోస్టు ద్వారా పార్శిల్ పంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేటి నుంచి ప్రభుత్వ వైద్యుల సమ్మె? శివాజీనగర: నేడు బుధవారం నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సమ్మె చేయనుండగా, ఓపీ సేవలు స్తంభించే అవకాశం ఉంది. బెంగళూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన ఉంది. సాధారణ జబ్బులతో చికిత్స కోసం వెళ్లే రోగులకు సేవలు అందవని వైద్యులు చెబుతున్నారు. 15 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెకు దిగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవీంద్రనాథ్ మేటి చెప్పారు. ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు విధానసభలో మాట్లాడుతూ వైద్యుల సమ్మె నిజమేనని తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే వైద్యుల సంఘం నేతలతో చర్చలు జరుపుతామని తెలిపారు. రోగులకు ఇబ్బంది లేకుండా సమ్మెను వెంటనే పరిష్కరించాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రా.. రమ్మంటూ తీయని వల ● బెళగావిలో ఘరానా కిలేడీ అరెస్టు యశవంతపుర: శ్రీమంతులను గురి పెట్టి పరిచయం చేసుకొని తీయని మాటలతో వల వేసి దోచేస్తున్న కిలాడీ బాగోతమిది. బాగలకోట జిల్లా మహాలింగపురకు చెందిన దీప అవటగి (35)ని బెళగావి పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె స్నేహితుడు శివానంద మఠపతి పరారీలో ఉన్నాడు. శివానంద బెళగావి జిల్లా హుక్కేరివాసి, దీపకు శ్రీమంతుల వివరాలను అందించేవాడు. ఆమె ఫేస్బుక్, ఇన్స్టాలో అలాంటివారిని పరిచయం చేసుకొని బుట్టలో వేసుకొనేది. అశ్లీల చాటింగ్ చేసి, బెళగావిలో లాడ్జికి పిలిచేది. ఇలా ఓ బాధితుడు లాడ్జికి రాగానే స్నానాల గదిలోకి పంపించి, తాళం వేసుకొని బట్టలు, నగదు, మొబైల్, కారు తాళం తీసుకుని పరారైంది. పైగా డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేదని పోలీసుల విచారణలో బయట పడింది. కాల్ రికార్డింగులు, సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితురాలిని బెళగావిలోని తిళకవాడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ఆర్భాటంగా డీకేశి విందు
శివాజీనగర: కేపీసీసీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ మంగళవారం రాత్రి పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బెంగళూరులోని ఓ విలాసవంత హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. సీఎం పదవి కోసం డీకే తీవ్రంగా పోరాడుతున్న తరుణంలో ఈ విందు భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం సిద్దరామయ్యతో సహా మంత్రులందరినీ డీకే ఆహ్వానించారు. డీకే మీడియాతో మాట్లాడుతూ.. తన కేపీసీసీ పదవీ కాలం గురించి బుధవారం విలేకరుల సమావేశంలో వివరంగా మాట్లాడతానని తెలిపారు. వృద్ధున్ని చంపి.. వృద్ధురాలిపై అత్యాచారం● సైకో కిల్లర్ దాష్టీకం క్రిష్ణగిరి: క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలో పొలంలో నివసిస్తున్న వృద్ధ జంటపై గుర్తుతెలియని దుండగుడు కిరాతకంగా దాడి చేశాడు. వృద్ధున్ని హత్య చేసి వృద్ధురాలిపై అత్యాచారం చేసి పరారయ్యాడు. ఊత్తంగేరి సమీపంలోని ఓ గ్రామశివార్లలో 70 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల వృద్ధురాలు పొలం వద్ద ఉన్న ఇంట్లో కాపురం ఉంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ దుండుగుడు వెళ్లి ఇంటి బయట నిద్రిస్తున్న వృద్ధుని తలపై బండరాయితో బాదాడు. అతడు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న అతని భార్య బయటకు వచ్చింది, ఆమెను లోపలికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతుల ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొనేలోపు కిరాతకుడు పరారయ్యాడు. కొంతసేపటికే వృద్ధుడు చనిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న వృద్దురాలిని చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సేలం డివిజన్ డిఐజి సంతోష్ హదిమణి, జిల్లా ఎస్పీ తంగదురై, పోలీసులు చేరుకుని హంతకుని వేలిముద్రలను సేకరించారు. గాలింపు చేపట్టారు. దుండగుడు సైకో కిల్లర్ అయి ఉంటాడని ప్రచారం సాగడంతో స్థానిక గ్రామాల్లో తీవ్ర అలజడి నెలకొంది. ముని మనవని హత్య కేసులో అవ్వ అరెస్టు బాగేపల్లి: తన మనవరాలు మతాంతర ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె చిన్నారి కుమారున్ని హత్య చేసిన కేసులో కిరాతక అవ్వ మహబూబ్ బీని చేళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డిసెంబర్ 24న చేళూరు పట్టణంలో తన మనవరాలు 40 రోజుల కొడుకును మహబూబ్బీకి ఇచ్చి హోటల్లో పనికి వెళ్లింది. తన మనవరాలు వేరే మతం యువకున్ని పెళ్లి చేసుకుందనే అక్కసుతో ఉన్న వృద్ధురాలు.. ఆ పసిగుడ్డును గొంతు పిసికి చంపి, సమీపంలో పూడ్చి పెట్టేసింది. అనారోగ్యం కారణంగా ఊపిరి ఆడకుండా చనిపోయాడని కథలు చెప్పింది. అనుమానంతో శిశువు తల్లి చేళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆ శిశువు ఊపిరి ఆడకుండా చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అవ్వను గట్టిగా ప్రశ్నించడంతో నిజం అంగీకరించింది. అవ్వని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రియుని కోసం కట్టుకున్నోడిని కాటికి పంపి.. ●భార్యతో పాటు నలుగురు అరెస్ట్ మండ్య: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిందో భార్య. ఆమెతో పాటు నలుగురు నిందితులను శ్రీరంగపట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తాలూకాలోని మారళగాల గ్రామ అర్చకుడు సిద్ధలింగప్ప తన అక్క కుమార్తె షాలినిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలినికి అదే ఊరికి చెందిన టిప్పర్ డ్రైవర్ హరీశ్తో వివాహేతర సంబంధం ఉంది. ఒకరోజు షాలిని, హరీశ్ ఏకాంతంగా ఉన్నప్పుడు భర్తకు దొరికిపోయారు. ఇలాంటి పనులు చేయరాదని భార్యను మందలించడంతో ఆమె కక్ష పెంచుకుంది. తన భర్తను చంపేయమని హరీశ్కు సిఫార్సు చేసింది. మార్చి 6న రాత్రి అర్చకుడు సిద్ధలింగప్ప.. కె.శెట్టిహళ్లి గణపతి దేవస్థానంలో పూజ ముగించుకుని ఇంటికి పయనమయ్యాడు. హరీశ్, మరో టిప్పర్ డ్రైవర్ సంతోష్ కుమార్తో కలసి గ్రామం వద్ద ఉన్న కాలువ ఏరియా నిర్మానుష్య ప్రాంతంలో అర్చకుడిని అడ్డగించారు. కట్టెలతో బాది చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అక్కడక్కడ అతని వస్తువులు వేసి, బైక్ను కాలువలోకి పడేశారు. 7న సీడీఎస్ కాలువలో సిద్ధలింగప్ప మృతదేహం లభించింది. ముఖానికి, తలకు గాయాలున్నాయి. ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపి ఉంటారని భావించి అతడి అన్న బాలసుందర్ శ్రీరంగపట్టణ గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి మార్చి 9న హరీశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. సిద్ధలింగప్ప భార్య షాలిని, సంతోష్ కుమార్, గణేశ్తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్లు అంగీకరించాడు. షాలిని , హరీశ్, సంతోష్ కుమార్, గణేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఇద్దరు రౌడీల అరెస్టు, పిస్టళ్ల స్వాధీనం
కృష్ణరాజపురం: అక్రమంగా పిస్టళ్లు కలిగిన బెంగళూరు, మైసూరు రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. నాగేంద్ర, సొహైల్ లాక్ పట్టుబడిన నిందితులు. ఓ రౌడీ సహచరుడైన నాగేంద్రపై నాలుగు హత్య కేసులున్నాయి. వీటిలో రెండింట్లో అరెస్టు వారంట్ జారీ అయింది. గత ఏడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నాగేంద్ర ఇటీవల బన్నేరుఘట్ట మెయిన్ రోడ్డులో బాడుగ ఇంట్లో మకాం వేశాడు, పోలీసులు పసిగట్టి అతన్ని బంధించారు. అతని వద్ద ఓ పిస్టల్ లభించింది, విచారించగా మైసూరుకు చెందిన ప్రముఖ రౌడీషీటర్ సొహైల్ లాక్ దానికి విక్రయించాడని, అతనిపై 7 కేసులున్నాయని తేలింది. ఇందులో 5 హత్యాయత్నం కేసులు. వారి నుంచి 2 పిస్తోళ్లు, కొన్ని తూటాలను సీజ్ చేసిశారు. -
కమనీయం.. కన్నంబాడి రథోత్సవం
మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ శక్తిదేవతల్లో ఒకరైన కన్నంబాడి అమ్మవారి బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. ఉదయమే ఆలయంలో అమ్మవారికి కలశారోహణం, బలిపూజ తదితర పూజలను నెరవేర్చారు. అమ్మవారిని పల్లకీలో కూర్చొబెట్టి దేవస్థానం చుట్టుపక్కల ప్రదక్షిణ చేశారు. మేళతాళాలతో అలంకరించిన తేరులో అమ్మవారిని కూర్చొబెట్టి భక్తుల జయజయధ్వానాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు వృషభ లగ్నంలో రథోత్సవం నిర్వహించారు. దేవస్థానం వద్ద నుంచి బీఎం రోడ్డు వరకు రథాన్ని లాగారు. రథంపైకి ధవనం, పండ్లు విసిరి భక్తిని చాటారు. వందలాది మంది కొత్త దంపతులు పాల్గొన్నారు. మైసూరు, కొడగు తదితర చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. -
ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కల సేకరణ
హొసపేటె: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు మొదటి దశ జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని, అధికారులు ఖచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలని ఏడీసీ ఈ.బాలకృష్ణ ఆదేశించారు. భారత జనాభా లెక్కల సేకరణ–2027లో భాగంగా జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బందికి సోమవారం జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో 3 రోజుల శిక్షణ సదస్సును ప్రారంభించి ఆయన మాట్లాడారు. జనాభా గణన మొదట 1872లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొత్తం 15 జనాభా గణనలు జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం తర్వాత 8 జనాభా గణనలు జరిగాయి. మునుపటి జనాభా గణన 2011లో జరిగింది. ఆ ప్రకారం 2021లో జరగాల్సిన జనాభా గణన కరోనా తదితర కారణాలతో వాయిదా పడింది. మొదటి సారిగా జనాభా లెక్కలను దేశ వ్యాప్తంగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ మోడ్లో నిర్వహించనున్నారు. అందువల్ల అధికారులు జిల్లాలోని పట్టణ, తాలూకా, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితమైన, సృష్టమైన డేటాను సేకరించాలని ఆయన సూచించారు. జనాభా లెక్కల సేకరణ కోసం గణకదారులు, పర్యవేక్షకులను నియమించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 6 మంది, పట్టణ ప్రాంతాల్లో 8 మంది జనాభా లెక్కల సేకరణలో పాల్గొంటారన్నారు. లెక్కింపు సమయంలో ఏదైనా గందరగోళం ఉంటే వారు పర్యవేక్షకులు లేదా ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆయన అన్నారు. తహసీల్దార్ శృతి, సీడీపీఓ అన్నదానయ్య, మున్సిపల్ కౌన్సిలర్ శివకుమార్ ఎర్రగుడి, వర్క్షాప్ ప్రజెంటర్లు మాథ్యూ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ద్రాక్ష సాగు.. లాభాలు బాగు
రాయచూరు రూరల్ : రూ.లక్షలాది ఖర్చు పెట్టి చదివిన చదువుకు తగిన వేతనంతో కూడిన ఉద్యోగం లభించక చివరికి డిప్లొమా చదివిన ఓ విద్యార్థి ద్రాక్ష పంటను సాగు చేసి అధిక దిగుబడిని సాధించి లాభాలను గడిస్తూ రైతే రాజు అని నిరూపించారు. జిల్లాలోని లింగసూగూరు తాలూకాకు చెందిన కెసరట్టి రవికుమార్ ద్రాక్ష సాగులో దిట్టగా నిలిచారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన రవికుమార్ రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యానవన శాఖ అధికారుల సలహా సూచనలతో విజయపుర జిల్లా జమఖండి తాలూకా బిదరి నుంచి నాలుగేళ్ల క్రితం 3 వేల ద్రాక్ష మొక్కలను తెచ్చి ఐదు ఎకరాల తోటలో వాటిని నాటారు. పంట మంచి దిగుబడి రావడంతో ఏడాదికి రూ.22 లక్షల మేర ఆదాయం గడించారు. ఎండిన ద్రాక్షను మహారాష్ట్రలోని సాంగ్లీ వద్ద గోదాములో నిల్వ ఉంచి మంచి ధర లభించగానే విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో దానిమ్మ, మోసంబి, జామ, ఇతర వాణిజ్య పంటలను సాగు చేశానని తెలిపారు.ద్రాక్ష గుత్తులను బుట్టల్లో నింపుతున్న దృశ్యం చెట్టుకు ఏపుగా పెరిగిన ద్రాక్ష గుత్తులు పంట సాగులో దిట్ట రవికుమార్ ఏడాదికి రూ.22 లక్షల ఆదాయం రైతే రాజు అని నిరూపించిన వైనం -
11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
● బైక్ల చోరుని అరెస్ట్ హొసపేటె: బైక్లను దొంగలించిన దొంగను చిత్తవాడిగి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ హొసపేటె, బళ్లారి, కొప్పళ జిల్లాల్లో వివిధ చోట్ల దొంగలించిన రూ.5 లక్షల విలువైన 11 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళాలను ఉపయోగించి హ్యాండ్లాక్లను తెరిచి బైక్లను దొంగిలించేవాడు. ఇతనిపై హొసపేటెలోని చిత్తవాడిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అర్హత మేరకు రుణాలు కల్పించండి బళ్లారిటౌన్: లబ్ధిదారులకు అర్హత నియమాల ప్రకారం బ్యాంక్ వారు రుణ సదుపాయాలను కల్పించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ సభాంగణంలో బ్యాంక్ వ్యవస్థాపకులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద రుణ సదుపాయాలు కల్పించే దిశలో రుణాలను మంజూరు చేస్తున్నాయన్నారు. అయితే బ్యాంక్ వ్యవస్థాపకులు వారి అర్హత నియమాలకు అనుగుణంగా పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. దీనిపై ఆలస్యం జరిగితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కన్నా బళ్లారి జిల్లా ప్రగతిలో తగ్గుముఖంలో ఉందన్నారు. జిల్లా ప్రగతి సాధించాలంటే బ్యాంకుల సహకారం అవసరం అన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రదేశాల్లో అమలవుతున్న రుణాలను వ్యవసాయ గుంపులకు కల్పించాలన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం కోటగిరి శ్రీనివాసరావు, జెడ్పీ ఉపకార్యదర్శి శశికాంత్ శివపురె, యువరాజు, గిరీష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మార్చాలి రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో ఉష్ణోగ్రతలు అధికం కావడం వల్ల ఏప్రిల్, మే రెండు నెలల పాటు ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లాధ్యక్షుడు కృష్ణ డిమాండ్ చేశారు. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రతి ఏడాది సర్కార్ కళ్యాణ కర్ణాటక భాగంలోని రాయచూరు, కలబుర్గి, బళ్లారి, బీదర్, యాదగిరి, కొప్పళ, విజయనగర జిల్లాల్లో రెండు నెలల పాటు ఎండాకాలంలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని వేళలు కల్పించేలా చూడాలని కోరుతూ ఏడీసీ శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో యంకప్ప, సంతోష్, మల్లేష్, భీమేష్ నాయక్, గురురాజ్లున్నారు. వైభవంగా కనకాచలపతి రథోత్సవం రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలోని కనకగిరిలో వెలసిన కనకాచలపతి వేంకటేశ్వరుని జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం సాయంత్రం దేవాలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు సతీస్ సూర్యబాబు ఉత్సవానికి పూజలు చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. రెండవ తిరుపతిగా పేరొందిన కనకగిరి వెంకటా చలపతిని గోవిందా, గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ ఘనంగా రథోత్సవం నిర్వహించారు. రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, కలబుర్గి, యాదగిరి, కొప్పళ, గంగావతిల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ తంగడిగి, లోక్సభ సభ్యుడు రాజశేఖర్ హిట్నాళ్, మాజీ శాసన సభ్యులు దడేసూగూరు బసవరాజ్, సుజాత, అధికారులు విశ్వనాథ్, విరుపాక్షయ్య, రాజశేఖర్, నారాయణ, లక్ష్మణలున్నారు. టూరిస్ట్ గైడ్లు వారసత్వ రాయబారులు ● జిల్లాధికారిణి కవిత మన్నికేరి హొసపేటె: టూరిస్ట్ గైడ్లు కేవలం సమాచార ప్రదాతలు మాత్రమే కాదు, మన జిల్లా గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే రాయబారులు అని జిల్లాధికారిణి కవిత ఎస్ మన్నికేరి అన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన పర్యాటక శాఖ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 87 మంది టూరిస్ట్ గైడ్లకు బూట్లు, జాకెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ రోజు పంపిణీ చేసిన యూనిఫాం కేవలం సౌకర్యం మాత్రమే కాదు, గైడ్ల వృత్తి నైపుణ్యానికి సంకేతం అన్నారు. యూనిఫాం ధరించడం వల్ల పర్యాటకులలో ఆత్మవిశ్వాసం పెంపొందడమే కాకుండా, భద్రతా భావం కూడా ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాలి. పర్యాటక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. గైడ్లు కూడా పాత చరిత్రకే పరిమితం కాకుండా జిల్లాలోని కొత్త పర్యాటక ప్రదేశాల గురించి ఖచ్చితమైన, ఆసక్తికరమైన సమాచారాన్ని కలిగి ఉండాలన్నారు. పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభులింగ తళకేరి, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
శాంతలింగ శివాచార్యతో ‘గాలి’ భేటీ
సాక్షి,బళ్లారి: పంచపీఠాలలో ఒకటైన, మహిమాన్విత పుణ్యక్షేత్రంగా భాసిల్లుతూ, సాక్షాత్తు శివుడు లింగరూపంలో అవతరించిన కేదారనాథుడు కొలువు దీరిన కేదార పీఠానికి శ్రీశ్రీశ్రీ నాల్వడి శాంతలింగ శివాచార్య పీఠాధికారిగా ఎంపికవడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకాలోని శాఖ మఠంలో స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శాంతలింగ శివాచార్య కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కావడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు సుపరిచుతులన్నారు. ఎంతో ఆధ్యాత్మికతతో భక్తి మార్గంలో నడుస్తూ లక్షలాది మంది భక్తులను కూడగట్టుకున్నారన్నారు. మహిమాన్వితుడు శాంతలింగ సన్మార్గంలో నడుస్తూ, సమాజాన్ని ఉత్తమ మార్గంలో తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, జీవితాన్ని అంకితం చేసిన మహిమాన్వితుడని కొనియాడారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాన్ని పోగొట్టుకునేందుకు హిమాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకోవాలని శ్రీకృష్ణుడు సూచించిన నేపథ్యంలో పంచ పాండవులు హిమాలయాలకు వెళ్లారన్నారు. అక్కడ శివుడి కోసం పాండవులు గాలిస్తున్న సమయంలో ఒక ఎద్దు(నంది) అక్కడ వెళుతున్న సమయంలో ఇంత నిర్జన ప్రాంతంలో ఎద్దు వెళుతుండటం ఏమిటని భావించిన పాండవులు వెంటనే నంది దగ్గరకు వెళ్లగా నంది భూమిలోకి వెళ్లగా భీముడు గోపురాన్ని పట్టుకోవడంతో అదే లింగరూపంలో అవతరించిందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంగా కేదారనాథ్ ఈ క్షేత్రం ఉత్తరాఖండ్లోని కేదారనాథ్ ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యదైవంగా కేదారలింగేశ్వరుడు దర్శనం ఇస్తున్నారని, సాక్షాత్తు లింగరూపంలో గోపురం తరహాలో కొలువుదీరిన కేదారనాథ్కు మన ప్రాంతానికి చెందిన నాల్వడి శాంతలింగ శివాచార్య పీఠాధికారిగా ఎంపిక కావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భారత దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంప వ్యాప్తంగా కేదారనాథ దర్శనానికి వెళుతున్నారంటే ఎంత మహిమాన్విత పుణ్యక్షేత్రమో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈసందర్భంగా పలువురు బళ్లారి వాసులు కూడా స్వామీజీని దర్శించుకున్నారు. కేదారనాథ పీఠాధికారిగా నాల్వడి శాంతలింగ శివాచార్య స్వామీజీ ఎంపిక -
తుంగభద్ర నదిలోకి దూకిన ప్రేమ జంట
సాక్షి,బళ్లారి: ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువజంట తుంగభద్ర నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. దావణగెరె జిల్లా హొన్నాళి పట్టణ సమీపంలో తుంగభద్ర నదిలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించగా వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రక్షణా చర్యలు చేపట్టారు. సాహసోపేతంగా పడవ సాయంతో నదిలోకి వెళ్లి ప్రేమ జంటను సురక్షితంగా బయటకు తీశారు. బయటకు తీసిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువజంట ఇంట్లో ప్రేమను నిరాకరించడంతో పాటు పెళ్లి చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. సకాలంలో సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై హొన్నాళి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి తల్లిదండ్రుల నిరాకరణతోనే ఆత్మహత్యాయత్నం సాహసోపేతంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది -
శ్రీశైలానికి భక్తుల యాత్ర షురూ
రాయచూరు రూరల్: ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక శ్రీశైల భక్తుల కాలినడకన పాదయాత్ర ప్రారంభమైంది. బుధవారం నుంచి కర్ణాటకలోని బాగల్కోటె, విజయపుర, జమఖండి, గదగ్, ధార్వాడ, హునగుంద, ఇలకల్ భక్త సమూహం వివిధ మార్గాల్లో ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు తమ మొక్కులు తీర్చాలంటూ పాదయాత్రలకు అంకురార్పణ గావించారు. ఏ రహదారిలో చూసినా భక్తులు మల్లయ్య విగ్రహాన్ని మోసుకొని కాలినడకన, కొంత మంది యువకులు కాళ్లకు కర్రలు కట్టుకుని నడక రూపంలో యాత్రలు చేపట్టారు. బాగల్కోటె నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర దూరం 650 కి.మీ. అవుతుంది. ప్రతి రోజు తెల్లవారు జామున 3 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. -
గుడి తొలగింపుపై తీవ్ర నిరసన
హుబ్లీ: స్థానిక కేశ్వాపుర రైల్వే గాల్ఫ్ మైదానం ఆవరణలోని స్వామి వివేకానంద విగ్రహం, బన్ని మహంకాళి గుడి తొలగింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ మంగళవారం మార్నింగ్ వాకర్స్ ఆకస్మిక నిరసన చేపట్టారు. ఈనెల 14 లోగా రైల్వే శాఖ విగ్రహం పునః ప్రతిష్టాపనతో పాటు గుడిని నిర్మించి ఇవ్వాలని గడువును ఇచ్చారు. ఆలయం తొలగించిన అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గడువులోగా ఆలయ నిర్మాణం జరగక పోతే తీవ్ర పోరాటం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. సదరు గాల్ఫ్ మైదానం రైల్వే అధికారుల వసతి గృహం వద్ద బన్ని వృక్షం కింద ఉన్న మహంకాళి గుడి, అక్కడికి కొంత దూరంలో ప్రతిష్టించిన 5 అడుగుల ఎత్తు ఉన్న వివేకానంద విగ్రహాన్ని సోమవారం తొలగించారు. మంగళవారం ఉదయం షికారుకు వచ్చిన స్థానికులు దాన్ని గమనించి రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రైల్వే అధికారులు తక్షణమే ఘటన స్థలానికి రావాలి. బన్ని మహంకాళి గుడి, స్వామి వివేకానంద విగ్రహాన్ని మూలస్థలంలోనే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేకుంటే తామే కాంపౌండ్ కూల్చి గుడిని నిర్మిస్తామని గాల్ఫ్ లేక్ ఆఫీసర్స్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ హబీబా నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. ప్రభు చిదానంద, శేఖర్, శివకుమార్ తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. -
చెట్టుకు బస్సు ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి వద్ద వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో డ్రైవర్, కండక్టర్తో సహా అనేక మంది ప్రయాణికులు తీవ్ర గాయపడిన ఘటన మంగళవారం జరిగింది. కూడ్లిగి డిపోకు చెందిన బస్సు ఉదయం తాలూకాలోని కాసాపుర నుంచి తిరిగి వస్తుండగా పట్టణంలోని గుడేకోటె రోడ్డులోని సాగర్ డబ్బా సమీపంలో బైక్ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ అదుపు తప్పిన బస్సు రోడ్డుకు కుడి వైపున ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం కుడి వైపు పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా డ్రైవర్ శశిధర్కు కుడి కాలు విరిగింది. కండక్టర్ పాటిల్కు ముఖంపై, ప్రయాణికులకు శరీరంపై గాయాలయ్యాయి. బస్సులో విద్యార్థులతో సహా 62 మంది ఉన్నారు. వారిలో కొంత మందికి తీవ్ర గాయాలు కాగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కూడ్లిగి పోలీస్ స్టేషన్ సీఐ ప్రహ్లాద్ చెన్నగిరి, ఎస్ఐ ప్రకాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఎస్పీ జాహ్నవి ఆస్పత్రిలో చికిత్స పొందిన క్షతగాత్రులను పరామర్శించారు. -
విమానాశ్రయాన్ని నిర్మించండి
సాక్షి,బళ్లారి: రైతుల నుంచి బలవంతంగా విమానాశ్రయ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకున్న 900 ఎకరాల భూమిలో ఎందుకు విమానాశ్రయం నిర్మించడం లేదని, ఒకవేళ విమానాశ్రయం నిర్మించకపోతే రైతులకు తిరిగి భూమి వాపసు ఇవ్వాలని విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం విధాన పరిషత్లో ఈ సమస్యపై గళం విప్పి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బళ్లారి సమీపంలోని సిరివార గ్రామ శివార్లలో 2009లో 900 ఎకరాల భూములను విమానాశ్రయం కోసం స్వాధీనం చేసుకున్నారన్నారు. అప్పటి నుంచి నిర్మాణం చేపట్టడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. భూములు తిరిగివ్వడం అసాధ్యం–మంత్రి దీనిపై మంత్రి ఎం.బీ.పాటిల్ స్పందిస్తూ బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లాల్లో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. త్వరలో మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. బళ్లారిలో విమానాశ్రయం కచ్చితంగా నిర్మిస్తామన్నారు. రైతులకు భూమి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. కుడితిని సమీపంలో ఆర్సెలర్ మిత్తల్ పరిశ్రమ కోసం స్వాధీనం చేసుకున్న భూమిని ప్రాజెక్టు నిర్మాణం చేయని పక్షంలో రైతులకు ఆ భూములను తిరిగి ఇవ్వాలని కూడా ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. లేకుంటే రైతులకు భూమి వాపసు ఇవ్వండి పరిషత్లో ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్ డిమాండ్ -
స్నేహితుల చేతిలో బాలుడు హత్య
చెరువులో నుంచి కార్తీక్ మృతదేహాన్ని వెలికి తీస్తున్న దృశ్యం రాయచూరు రూరల్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా కొత్త బట్టలు ధరించాలనుకున్న స్నేహితులు చిన్న కారణానికి ఉన్మాదులుగా మారి తోటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా కరడకల్ చెరువులో జరిగింది. ఆదివారం గుండసాగర గ్రామం నుంచి లింగసూగూరు పట్టణానికి కొత్త బట్టల కొనుగోలుకు తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్(15), వినోద్(15), సోహైల్(15), ముత్తప్ప(15) అనే నలుగురు పిల్లలు వచ్చారు. అయితే వీరిలో కార్తీక్ మినహా ముగ్గురు మాత్రమే సాయంత్రానికి గ్రామానికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో కార్తీక్ తల్లిదండ్రులు తమ కొడుకు ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మార్గమధ్యంలో కార్తీక్ను తామే చంపి గోనెసంచిలో రాయి కట్టి చెరువులోకి తోసి వేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించారు. సోమవారం చెరువులో గాలించి కార్తీక్ శవాన్ని వెలికితీసి పంచనామా కోసం లింగసూగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ అరుణాంగ్శు గిరి పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. లింగసూగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. లింగసూగూరు తాలూకాలో దుర్ఘటన -
శ్రీశైలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు
బళ్లారిఅర్బన్: ఉగాది పండుగ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేకేఆర్టీసీ) బళ్లారి విభాగం నుంచి శ్రీశైలానికి వివిధ చోట్ల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ బళ్లారి డివిజనల్ కంట్రోలర్ ఇనాయత్ బాగ్బాన్ ఓ ప్రకటనలో తెలిపారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ప్రత్యేక దర్శనం కోసం బళ్లారి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలి వెళ్తారు. భక్తుల సౌకర్యార్థం తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విషాహారం తిని 10 గేదెల మృతి హుబ్లీ: విష పూరిత ఆహారం తిని 10కి పైగా గేదెలు ఆకస్మికంగా మృతి చెందిన ఘటన హావేరి జిల్లా రట్టిహళ్లి తాలూకా మేదూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గేదెలన్ని ఆ గ్రామ రైతు సిద్దప్పకు చెందినవి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంతో పాటు రోడ్డు పక్కన దొరికిన వాటిని గేదెలు తిన్నాయి. సాయంత్రం తిరిగి ఇంటికి వెళుతుండగా అస్వస్థతకు గురై మార్గమధ్యంలోనే మరణించాయి. దీంతో జీవనోపాధికి ఆధారమైన 10 గేదెలు ఒక్కసారిగా మృతి చెందడంతో పాడి పరిశ్రమనే నమ్ముకున్న రైతు సిద్దప్ప కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా ఆ తాలూకా పశు వైద్యాధికారి గేదెల కళేబరాలను పరిశీలించారు. గేదెల కళేబరాల నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగ శాలకు తరలించారు. శతాధిక ఆయుర్వేద వైద్యురాలు కన్నుమూత హుబ్లీ: దేహదానం, అవయవదాన ప్రక్రియలో విశేషంగా కృషి చేసిన బెళగావి జిల్లా బైలహొంగలకు చెందిన డాక్టర్ సుశీలాదేవి రామన్నవర(101) కన్నుమూశారు. ఆమె కుమారుడు డాక్టర్ మహంతేష్ రామన్నవర సారథ్యంలో ఆమె అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నెరవేర్చిన తర్వాత దేహదాన ప్రక్రియను పూర్తి చేశారు. సదరు డాక్టర్ రామన్నవర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలుగా పని చేసిన డాక్టర్ సుశీలాదేవి మరణానంతరం తన భర్తలానే బెళగావిలోని కేఎల్ఈ బీఎం కంకనవాడి ఆయుర్వేద కళాశాలకు దేహాన్ని దానం చేశారు. ఈమె భర్త కూడా 18 ఏళ్ల క్రితం దేహదానం చేశారు. సుశీలా దేవి మృతికి డాక్టర్ ప్రభాకర్ కోరే తదితర ప్రముఖులు ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెళ్లకెరె రూరల్: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ ప్రసవం అనంతరం మరణించిన ఘటన చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ ఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాలు.. చెళ్లకెరె తాలూకా పరశురాంపురకు చెందిన శిల్ప(28) మరణించిన బాలింత. నవజాత శిశువుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రసవం తరువాత వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శిల్ప మరణించిందని కుటుంబ సభ్యులు, శిల్ప తల్లి దుర్గమ్మ ఆరోపిస్తున్నారు. విషయం తెలిసి బంధువులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని జిల్లా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ రవీంద్రపై తీవ్రంగా మండిపడ్డారు. సకాలంలో సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్తి కోసం దివ్యాంగురాలి ఒంటరి పోరాటం రాయచూరు రూరల్: తాళి కట్టిన భర్తే తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ దివ్యాంగురాలైన మహిళకు, కన్న కూతురికి నరకం చూపుతున్న వైనం యాదగిరి జిల్లాలో సంభవించింది. రెండో భార్య, కొడుకులు కలిసి మొదటి భార్య, కూతురిపై దాడి చేశారు. దివ్యాంగురాలైన భార్య భీమాబాయి హన్మంతు బిళ్లార్ను పెళ్లి చేసుకొని జీవిస్తుండేవారు. అనుకోకుండా హన్మంతు బిళ్లార్ రెండో వివాహం చేసుకోవడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆస్తి విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో రెండో భార్య, కొడుకులు ప్రతి రోజు చిత్రహింస పెడుతున్నట్లు తెలిపింది. భర్త హన్మంతు, రెండో భార్య కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ వడగేర పోలీస్ స్టేషన్ వద్ద నిరవధిక ఆందోళనకు పూనుకుంది. -
ఖాద్రీ బ్రహ్మ రథోత్సవం.. చూసి తరిద్దాం
కదిరి: అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న కదిరి నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం నేడు మంగళవారం ఉదయం 8:25 నుంచి 8:45 గంటల మధ్య శుభ మేష లగ్నంలో జరగనుందని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధులలోని భవనాలు భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు చోటు లేకుండా భక్తజనం రద్దీ నెలకొంది. రథోత్సవంలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం పట్టణంలో దాతలు అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేశాయి. రథోత్సవం ప్రశాంతంగా జరిగేలా వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటైంది. ఐరావతంపై నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి తెల్లని ఐరావతంపై నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్యకశిపుని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మొర మేరకు ఆయన తెల్లని ఐరావతంపై దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లారు. పూజల అనంతరం తెల్లవారుజామున రథంపైకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తజనం నేడు కదిరిలో మహా వేడుక -
మెట్లు, గోడ కూలి దంపతుల దుర్మరణం
రాయచూరు రూరల్: నిర్మాణంలో ఉన్న ఇంటి మెట్ల వరుస, గోడ కూలి దంపతులు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకాలో చోటు చేసుకుంది. సోమవారం యలగట్టిలో ఇంటి నిర్మాణ సమయంలో దంపతులిద్దరూ గార పనుల్లో తలమునకలుగా ఉన్నారు. అయితే నాసిరకంగా, పిల్లర్లు లేకుండా ఇంటిపైకి వెళ్లడానికి గోడకు ఆనుకుని నిర్మించిన మెట్ల వరుసతో పాటు గోడ ఆకస్మికంగా కూలిపోవడంతో ద్యావప్ప సూగూరు(38)శివమ్మ(32) అనే దంపతులు మరణించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం లింగసూగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు హట్టి పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. క్షుణ్ణంగా వాహన తనిఖీలు ● 586 వాహనాల యజమానులకు జరిమానా హొసపేటె: జిల్లా పోలీసు శాఖ, ఆర్టీఓ సంయుక్తంగా లోపభూయిష్ట నంబర్ ప్లేట్లు ఉన్న వాహన యజమానులపై చర్యలు ప్రారంభించాయి. 586 వాహన డ్రైవర్లకు జరిమానా విధించారు. హొసపేటె సబ్డివిజన్లో 345, కూడ్లిగి సబ్ డివిజన్లో 154, హరపనహళ్లి సబ్డివిజన్లో 87తో సహా మొత్తం 586 కేసులు నమోదు కాగా జరిమానా వసూలు చేశారని ఎస్పీ జాహ్నవి తెలిపారు. ప్రజలు తమ వాహనాలు నడుపుతున్నప్పుడు డీఎల్ఆర్సీ, బీమా, కాలుష్య తనిఖీ సర్టిఫికెట్ వెంట పెట్టుకోవాలి. మోటార్ వాహన చట్టం ప్రకారం నెంబర్ ప్లేట్ క్రమం తప్పకుండా ఉండాలని తెలిపారు. నగరం అంతటా నెంబర్ ప్లేట్లపై ప్రచారం చేయడంతో పాటు హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించారు. మహిళలు ముందడుగు వేయాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో దుష్ట సంస్కృతి సంహారానికి మహిళలు ముందడుగు వేయాలని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపు ఇచ్చారు. ఆదివారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మహిళలు గగన యాత్రలు, సాంకేతిక, విజ్ఞాన సమాచార రంగాల్లో రాణిస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలున్నాయన్నారు. భ్రూణ హత్యలు, వరకట్న మరణాలు వంటి విషయాల్లో న్యాయం, చట్టం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో శారద, సురేఖ, సుమ, రాధ, రాబియా బేగం, రంజిత్లున్నారు. ధైర్యంగా పరీక్షలు రాయండి బళ్లారిఅర్బన్: పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్ఎస్ఎల్సీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ప్రత్యేక లేఖ రాశారు. నగర నియోజక వర్గంలో 45కు పైగా పాఠశాలల్లో చదువుతున్న సుమారు 3 వేల మంది విద్యార్థులకు ఆయన వ్యక్తిగతంగా ఈ లేఖను పాఠశాలల్లో విద్యార్థులకు అందేలా పంపించారు. ఈనెల 18న ప్రారంభమయ్యే ఎస్ఎస్ఎల్సీ పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారిలో విశ్వాసం నింపి, ప్రోత్సాహం అందించాలని సూచించారు. -
ఆ అధికారులు.. అక్రమాల కోటీశ్వరులు
బనశంకరి: ఉద్యోగం అండతో జనం నుంచి లంచాలు, కానుకల రూపంలో వెనకేసుకున్న కోట్లాది రూపాయల ఆస్తుల గుట్టురట్టయింది. గత గురువారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 10 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలు, ఆఫీసుల్లో లోకాయుక్త అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.35.65 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. వారితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేయగా పెద్దమొత్తంలో డబ్బులు, బంగారం, స్థలాలు, పొలాలు, విలువైన సొత్తు దొరికింది. ఆ వివరాలను లోకాయుక్త విడుదల చేసింది. కనీసం రూ.4, 5 కోట్లు... ● అసిఫ్ ఇక్బాల్ ఖలీల్–అసిస్టెంట్ ఇంజనీర్, కర్ణాటక నగర నీటి సరఫరా భూగర్బడ్రైనేజీ మైసూరు: రూ.5.80 కోట్ల విలువ చేసే 5 స్థలాలు,7 ఇళ్లు, 38 గుంటల భూమి, రూ.2.78 కోట్ల విలువచేసే స్థిరాస్థులు, రూ.22.50 లక్షల విలువచేసే బంగారం సహా రూ.8.81 కోట్ల ఆస్తులు కనిపెట్టారు. ● వసంత వాలప్ప నాయక్– చీఫ్ ఇంజనీర్ ప్రజాపనుల శాఖ బెంగళూరు: 10 చోట్ల రూ.5.65 కోట్ల విలువచేసే 4 ప్లాట్లు, 7 నివాస ఇళ్లు, 22.20 ఎకరాల పొలం, రూ.75 లక్షల నగదు, రూ.12.25 లక్షల నగలు, రూ.34.25 లక్షల విలువ చేసే కార్లు, రూ.27.49 లక్షల డిపాజిట్లు లభించాయి. ● డాక్టర్ హెచ్సీ.ఇంద్రేశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెబ్బాల మెడికల్ కాలేజీ, బెంగళూరు: 6 చోట్ల రూ.2.20 కోట్ల విలువచేసే 10 స్థలాలు, 2 ఇళ్లు, రూ.11.95 లక్షల బంగారం, రూ.18.90 లక్షల వాహనం, మొత్తం రూ.2.53 కోట్ల ఆస్తులు కనిపెట్టారు. ● ఆర్.శశిధర్, సీఈఓ సింగనాయకనహళ్లి రైతు సేవా సహకార సంఘం యలహంక, బెంగళూరు: 5 చోట్ల రూ.4.25 కోట్ల భూములు,, 4 స్థలాలు, 2 ఇళ్లు, 2 ఎకరాల భూమి, రూ.29.74 లక్షల బంగారం, రూ.42.25 లక్షల విలాసవంతమైన కార్లు, .17.25 లక్షల బ్యాంకు డిపాజిట్లతో కలిపి రూ.5.15 కోట్ల ఆస్తులు దొరికాయి. ఇలా మిగతా ఆరుమంది వద్ద రూ.4 కోట్ల నుంచి 6 కోట్ల అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. లోకాయుక్త దాడుల్లో వెలుగుచూసిన ఆస్తిపాస్తులు -
యువ జంట ఆత్మహత్య
● మండ్య జిల్లాలో విషాదంమండ్య: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది. చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది.చెరువులపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు బనశంకరి: చెరువులపై తేలియాడే సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు మీద దృష్టి సారించాలని చిన్ననీటిపారుదల శాఖమంత్రి ఎన్ఎస్.బోసురాజు అధికారులకు సూచించారు. సోమవారం వికాససౌధలో నీటిపారుదల, విద్యుత్ అధికారులతో భేటీ జరిపారు. ఎత్తిపోతల పథకాలకు అయ్యే భారీ ఖర్చు, విద్యుత్ వ్యయాన్ని తగ్గించాలని, అందుకు గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో చెరువులలో తేలియాడే సౌరవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు గురించి బీహెచ్ఈఎల్ ను అధ్యయన నివేదిక ఇచ్చిందన్నారు. కోలారు జిల్లా సోమాంబుధి అగ్రహార చెరువులో ప్రయోగాత్మకంగా తేలియాడే సౌరవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన గురించి బీహెచ్ఈఎల్ నివేదిక సిద్ధం చేసిందని తెలిపారు. ఆ నివేదికను పరిశీలించి పథకం అమలుపై కసరత్తు చేయాలని ఆదేశించారు. గజ దాడిలో మహిళ మృతి యశవంతపుర: ఓ మహిళను అడవి ఏనుగు దాడి చేసి చంపిన ఘటన కొడగు జిల్లాలో జరిగింది. వివరాలు.. కుశాలనగర తాలూకా నంజరాయపట్టణ గ్రామం బాళెగుండి గిరిజన వాడలో గ్రామ పంచాయతి మాజీ సభ్యురాలు జలజాక్షి (51) నివసించేది. ఆమె సోమవారం ఉదయం 10 గంటల సమయంలో దగ్గరిలోని అడవిలోకి వెళ్లి అటవీ ఉత్పత్తుల కోసం వెతుకుతుండగా, ఓ ఏనుగు దాడి చేసింది. కాళ్లతో తొక్కి అక్కడే ఆమె ప్రాణాలు తీసింది. విషయం తెలుసుకుని గ్రామస్తులు, కుశాలనగర అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని కుశాలనగర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఊరు చుట్టుపక్కల సంచరిస్తున్న ఏనుగులను తరిమివేయాలని కోరారు. కాగా, రాష్ట్రంలో గజదాడులు పెరిగిపోయాయి. తరచూ కూలీలు, రైతులు బలవుతున్నారు. -
జనాభా లెక్కింపు పక్కాగా చేపట్టాలి
బళ్లారిటౌన్: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న జనాభా లెక్కింపు ప్రక్రియను అధికారులంతా బాధ్యతతో నిర్వహించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ సభాంగణంలో అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కోవిడ్ వల్ల 2021లో జరగవలసిన దేశంలోని ప్రధాన జనాభా లెక్కింపు వాయిదా పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్తగా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి జనాభా లెక్కింపులో మొదటి సారిగా నూతన పరిజ్ఞానంతో ఆన్లైన్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారన్నారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ప్రజలే స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారన్నారు. ఏప్రిల్ 16 నుంచి మే 16 వరకు ఇంటింటా సమీక్ష చేపడతారన్నారు. జెడ్పీ సీఈఓ మహ్మద్ హ్యారీష్ సుమేర, డీడీసీఓ జ్ఞాన ప్రకాశం, పాలికె కమిషనర్ మంజునాథ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హాస్టళ్లపై పర్యవేక్షణ ఏదీ?
సాక్షి,బళ్లారి: నగరంలోని పలు విద్యా సంస్థలు పేరుకు మాత్రమే గొప్పగా బోర్డులు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మాయలో పడేస్తున్నాయి. వారి పిల్లలను తమ స్కూళ్లు, కాలేజీల్లో చేర్పించుకుని రూ.లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ కనీస నిర్వహణ చేపట్టకపోవడంతో విద్యార్థులు ఆడిందే ఆట..పాడిందే పాటగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలో పలు స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారన్న బహిరంగ విమర్శలు వస్తున్నాయి. దీనిపై పలు విద్యార్థి సంఘాలు గతంలో ఆందోళనలు కూడా చేశాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఉన్న బళ్లారి నగరం ప్రధానంగా వ్యాపార, విద్యా కేంద్రాలకు నిలయంగా ఉంది. దీంతో ఇక్కడకు పొరుగున ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు తమ పిల్లలను బళ్లారిలో చదివించడం పరిపాటిగా మారింది. ఫీజుల విషయం పరిశీలిస్తే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు, ఇక్కడికి రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నా విద్యార్థులు ఎలా చదువుతున్నారు? వారి బాగోగుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గంజాయి ఆరోపణలు గుప్పు రెండు రోజుల క్రితం నగర శివార్లలోని గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కలకలం రేపింది. 9వ తరగతి విద్యార్థి ఉన్మాదిగా మారి, తోటి విద్యార్థి హేమంత్(14)ను దారుణంగా హత్య చేయడంతో పాటు అడ్డొచ్చిన 7 మంది విద్యార్థులను తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. హాస్టల్లో ఏ విద్యార్థి ఎలా ఉన్నాడన్న కనీస పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. స్కూల్ హాస్టల్లో కేవలం 9 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారి కదలికలను కూడా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడి చేసిన బాలుని ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. హత్య దురంతంతో నగరంలో ఇతర హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. విద్యా శాఖ అధిఽకారుల తనిఖీలు కూడా కరువై హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా మారినట్లు తెలుస్తోంది. హాస్టల్లో దాడి ఘటనపై చర్యలకు డిమాండ్ బళ్లారిఅర్బన్: తాళూరు రోడ్డులోని గురుకుల ఇంటర్నేషనల్ పాఠశాల హాస్టల్లో జరిగిన దాడి నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది. సోమవారం సరళా దేవి కళాశాల నుంచి రాయల్ సర్కిల్ మీదుగా జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని నెలలుగా జిల్లాలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. యువత డ్రగ్స్, గంజాయి వినియోగానికి పాల్పడుతుండటం ఆందోళనకరమని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. హాస్టల్లో వార్డెన్, తగిన భద్రత సిబ్బంది లేకపోవడం పెద్ద నిర్లక్ష్యం అని, విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా హాస్టల్ నిర్వహించిన పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం కలకలం రేపిన గురుకుల పాఠశాలలో దాడి ఘటన దాడి కేసులో నిందితుడు అరెస్టు సాక్షి,బళ్లారి: నగరంలోని గురుకుల పాఠశాల హాస్టల్లో పలువురు విద్యార్థులపై దాడి చేసి గాయపరిచి పరారైన నిందితుడిని పోలీసులు సోమవారం నగరంలోని రూపనగుడి రోడ్డులో గంగప్ప జిన్ సర్కిల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. తన కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ సుమన్ డి.పన్నేకర్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఈనెల 7న నగరంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థ హాస్టల్లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న బాలుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఘటన జరిగిన పాఠశాల యాజమాన్యానికి స్కూల్, హాస్టల్ నిర్వహణ సంబంధిత చట్టబద్ధ అనుమతి పత్రాలను సమర్పించాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓకు కూడా ఆ పాఠశాల చట్టబద్ధ అనుమతులతో నడుస్తోందా? లేదా? పరిశీలించాలని అధికారికంగా లేఖ రాసినట్లు ఆమె పేర్కొన్నారు. -
గ్రేటర్ బెంగళూరులో 88.92 లక్షల ఓటర్లు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని 5 నగర పాలికెలలో మొత్తం 88,92,528 మంది ఓటర్లు ఉన్నారని జీబీఏ కమిషనర్ మహేశ్వరరావ్ తెలిపారు. సోమవారం జీబీఏ కేంద్ర ఆఫీసులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరు కేంద్ర, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నగర పాలికెలలో మొత్తం 369 వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో 45,69,752 మంది పురుషులు, 43,31,143 మంది మహిళా ఓటర్లు, ఇతర ఓటర్లు 1,635 మంది ఉన్నారని చెప్పారు. 51వ వార్డులో అత్యధికం గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 8,024 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు దక్షిణ నగర పాలికెలో 51వ వార్డు (సుబ్రమణ్య నగర)లో అత్యధికంగా 54,026 ఓటర్లు ఉన్నారు. తూర్పు పాలికేలో 16 వార్డు (కొత్తూరు)లో అతి తక్కువగా 10,940 మంది ఓటర్లే ఉన్నారని తెలిపారు. ఏప్రిల్లో తుది జాబితా జాబితాలలో పేరు లేనివారు, వేరే వార్డులో ఓటు నమోదైనవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. దరఖాస్తుల పరిష్కారం తరువాత ఏప్రిల్ 6వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. ప్రజలు చూసుకోవడానికి వార్డుల వారీగా ఓటర్ల జాబితాను జీబీఏ వెబ్సైట్లో పీడీఎఫ్ రూపంలో ప్రకటిస్తామన్నారు. అలాగే ఒక్కో పాలికెలో హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పురుష ఓటర్లే అధికం జాబితా విడుదల -
కార్మికులను పర్మినెంట్ చేయాలి
రాయచూరు రూరల్: రాయచూరు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్)లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించకుండా అధికారులు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆర్టీపీఎస్ కార్మికుల సంఘం అధ్యక్షుడు మహామని అయ్యన్న ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 నుంచి 25 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహించిన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. వారికి రావాల్సిన పీఎఫ్, జీపీఎఫ్, గ్రాచ్యుటీలను ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుబట్టారు. కూలీ కార్మికులకు చెల్లించాల్సిన రూ.10 కోట్లను సొంతానికి వాడుకున్న విషయంపై సమగ్ర విచారణ జరపాలన్నారు. రిజర్వేషన్ కల్పించాలని ధర్నా రాయచూరు రూరల్: ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశాలు కల్పించొద్దని కర్ణాటక చలవాది జిల్లా మహాసభ సంచాలకుడు విశ్వనాథ్ పట్టి డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎంకు పంపదలచిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సురేష్వర్మకు సమర్పించారు. అగ్నిప్రమాదంలో వెదురు బొంగులు దగ్ధం సాక్షి,బళ్లారి: నగరంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కోట ప్రాంతంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా మేదర సమాజం వారు వ్యాపారం కోసం తెచ్చి పెట్టిన వెదురు బొంగులు, కట్టెల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పేందుకు శ్రమించారు. ఈ ఘటనలో వెదురు కట్టెలు పూర్తిగా కాలిపోయాయి. రూ.లక్షలాది మేర నష్టం వాటిల్లింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సమాజానికి మహిళే ఆలంబన
బనశంకరి: అలనాటి మేటి నటీమణులకు ఘనంగా సన్మానించారు. సోమవారం గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఆఫీసులోని గ్లాజ్హౌస్లో జీబీఏ–పాలికె అధికారులు , ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని కమిషనర్ మహేశ్వర్రావ్ ప్రారంచారు. ప్రముఖ నటీమణి జయప్రద మాట్లాడుతూ... మహిళ తల్లి, చెల్లి, అక్కగా కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి శ్రమిస్తున్నారని తెలిపారు. నటి మహాలక్ష్మీ మాట్లాడుతూ మహిళలు స్వాభిమానిగా , స్వావలంబనతో జీవించాలని తెలిపారు. జయప్రద, ఉర్వశి, మహాలక్ష్మీ, ప్రమీళా జోషాయ్, మంజుళా గురురాజ్ సహా నటీమణులు, పలురంగాల మహిళలైన డాక్టర్ ఇందిరా కబాడే, రేణుకా, శుభ, చైత్ర అంచన్, వీణాపూజారి, డాక్టర్ ప్రియదర్శిని, శైలజా, లక్ష్మీదేవి, వాణిశ్రీ, సంధ్యా ప్రభు, చైత్ర పూర్ణిమా, ఆరతి ప్రసాద్, పూనం బెళ్లప్ప, లక్ష్మీ దివ్య, వరలక్ష్మీ, విజయలక్ష్మీ, తనూజా తదితరులను సన్మానించారు. ప్రముఖ నటి జయప్రద బెంగళూరులో మహిళా దినోత్సవం -
ఎవరిని కలిశానో చెప్పను: డీసీఎం
శివాజీనగర: ముఖ్యమంత్రి మార్పిడిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన తనకు కూడా ఒక అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలిసింది. ఇదే డిమాండ్తో గత కొన్ని వారాలుగా హైకమాండ్పై ఒత్తిడి తీసుకొస్తున్న ఆయన ఆదివారం హఠాత్తుగా హస్తినకు వెళ్లారు. అయితే వెంటనే పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు దొరకకపోవడంతో రాత్రికి అక్కడే మకాం వేశారు. సోమవారం ఉదయం నుంచి రాహుల్గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా పలువురు నాయకులతో సమావేశం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. తనకు సీఎం పదవి కావాలనే ఏకవాక్య అజెండాతో పర్యటన సాగించారు. కొలిక్కిరాని పోరాటం రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య గత 4, 5 నెలలుగా పోరాటం సాగుతోంది. ఇది శీతల యుద్ధం నుంచి వీధి పోరాటాల వరకూ వ్యాపించింది. కొందరు మంత్రులు, ఇరువర్గాల ఎమ్మెల్యేలు జంతువులతో పోల్చుతూ ఆరోపణలు చేసుకుంటున్నారు. హైకమాండ్ మాత్రం గట్టి నిర్ణయం తీసుకోవడం లేదు. సీఎం సీటు గురించి ఎవరూ బయట మాట్లాడరాదని ఢిల్లీ పెద్దలు ఆదేశించినా, అనుకూల–వ్యతిరేక వ్యాఖ్యలు అడపాదడపా వెలువడుతున్నాయి. పైగా ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని హైకమాండ్కే సలహాలు ఇవ్వడం గమనార్హం. విందుకు వేళాయె డీకే మంగళవారం బెంగళూరుకు తిరిగి వస్తున్నారు. అదే రోజు బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన భారీ విందు ఇవ్వబోతున్నారు. దీంతో అందరి చర్చ విందు మీదే సాగుతోంది. సీఎం సిద్దరామయ్యను, మంత్రులను కూడా ఆహ్వానించారు. ఎంతమంది వస్తారు, ఎంతమంది ముఖం చాటేస్తారు, ఏం జరుగుతుందీ అన్నది కుతూహలం రేపుతోంది. సీఎం పదవినిప్పించాలని హైకమాండ్కు వినతి అగ్రనేతలతో భేటీలు? నేడు బెంగళూరులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీ విందు డిన్నర్ మీటింగ్పై కుతూహలంబనశంకరి: నేను ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాను అనేది బహిరంగంగా చెప్పడం కుదరదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. సోమవారం ఢిల్లీలో కర్ణాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీకి వచ్చిన తరువాత నేను అందరినీ కలుస్తాను. కానీ హైకమాండ్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వక పోవడంతో నేను వేచి చూస్తున్నాను అని మీడియాలో ప్రసారం చేస్తారు. అందుకే వేచిచూస్తున్నాను. పూణేలో నా స్నేహితుని ఇంట్లో పెళ్లి ఉంటే ఆదివారం బయల్దేరాను. సోమవారం అసోం పీసీసీ అధ్యక్షునితో భేటీతో పాటు అనేక సమావేశాల్లో పాల్గొన్నాను’ అని తెలిపారు. మంగళవారంతో కేపీసీసీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పూర్తి అవుతుంది, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బెంగళూరులో విందు ఏర్పాటు చేశానని చెప్పారు. ఓడిన అభ్యర్థులు, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరోసారి డిన్నర్ ఇస్తానని చెప్పారు. ఢిల్లీ భేటీపై ఎలాంటి ప్రత్యేక చర్చ వద్దన్నారు. ఇక బుధవారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఉందని తెలిపారు. -
కారు దగ్ధం, పెళ్లి సామగ్రి బూడిద
శివమొగ్గ: ఓమ్ని కారు కదులుతుండగా మంటలు చెలరేగి దగ్ధమైంది. శివమొగ్గ జిల్లా హోసనగర తాలూకాలోని రిప్పన్పేట దగ్గర బెల్లూర్ గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుడు శ్రీకాంత్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన సోదరి పెళ్లి పత్రికలను పంచడానికి బంధువుతో కలిసి కారులో శివమొగ్గకు వెళ్లాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కారు ఇంజిన్లో నుంచి పొగ మంటలు రావడంతో అందులో ఉన్నవారు దిగిపోయారు. కారులోని కూరగాయలు, కొత్త బట్టలు, ఇతర పెళ్లి వస్తువులు కూడా కాలిపోయాయి. ఇంజన్ హీటెక్కడం, లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగి ఉంటుందని అనుమానాలున్నాయి. ఘనంగా కుంభాభిషేకం మైసూరు: జిల్లాలోని నంజన్గూడు తాలూకాలోని కసువినహళ్లి గ్రామంలో పురాతన నారాయణస్వామి ఆలయ పునరుద్ధరణ ఉత్సవం ఘనంగా జరిగింది. కొత్త విమాన గోపురానికి కుంభాభిషేకం, కలశారోహణం, యజ్ఞ యాగాదులను వేదపండితుల ఆధ్వర్యంలో పూర్తి చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాలిన కారులో వ్యక్తి మృతి బాగేపల్లి: బాగేపల్లి తాలూకాలోని బాలారెడ్డిపల్లి సమీపంలో మారుతి–800 కారు, అందులో ఓ వ్యక్తి కాలిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కారు కాలిపోతున్నట్లు గ్రామస్తులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి నీళ్లు చల్లి మంటలను ఆర్పివేసి లోపల పరిశీలించగా ఒక వ్యక్తి కాలిపోయి ఉన్నాడు. మృతుడు ఉదయ్కుమార్ (65) బాగేపల్లి తాలూకాలోని పెనుమాల్ గ్రామవాసిగా గుర్తించారు. ఈయన చాలాఏళ్ల నుంచీ కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన తల్లిని చూడటానికి సొంతూరికి వచ్చి బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాన్ని బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదమా.. లేక మరేదైనా అనేది ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఈ సంఘటన స్థానికుల్లో భయాందోళన కలిగించింది. 21 విమానాల రద్దు యశవంతపుర: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి రావలసిన అనేక విమానాల సర్వీసులు రద్దయ్యాయి. అరబ్ దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే 21 విమానాలు బందయ్యాయి. దీంతో బెంగళూరు ఎయిర్పోర్టులో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం బెంగళూరు మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మార్చి 1 నుంచి 9 వరకు అనేక దేశాలకు విమానాల రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. 200లకు పైగా విమాన సేవలు రద్దయ్యాయి. కారుపై పడిన కంటైనర్ లారీ ● బాలిక దుర్మరణం యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ అదుపుతప్పి కారుపై పడటంతో ఐదేళ్ల బాలిక మృతి చెందింది. వివరాలు.. సోమవారం కార్వార నుంచి అంకోలా వైపు కారు, కంటైనర్ లారీ వెళ్తున్నాయి. కంటైనర్ డ్రైవరు నిర్లక్ష్యంగా నడుపుతూ కొండ అంచును తాకడంతో అది పక్కనే వెళ్తున్న కారు మీద బోల్తా పడింది. దీంతో కారు నుజ్జయింది, ఐదేళ్ల బాలిక చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు, మరో చిన్నారి చిన్న చిన్న గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్నారు. ఈ దంపతులు వైద్యులని తెలిసింది. కంటైనర్ డ్రైవర్ బాగా తాగి ఉన్నాడు, లారీ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కేకలు వేయసాగాడు. ఈ రభసతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. కార్వార పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. -
రిజర్వేషన్ ప్రకటించే వరకు నియామకాలు వద్దు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలలు తగదని కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ సంచాలకుడు విరుపాక్షి పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదికల ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలా జరిగితే మాదిగ విద్యార్థులకు మరణ శాసనంగా మారుతుందన్నారు. రవీంద్ర, భీమన్న, ఆంజనేయ, నరసప్ప, మౌనేష్లున్నారు. చిచ్చు రేపిన కులాంతర వివాహం ● రెండు వర్గాల మధ్య ఘర్షణ ● బాలగేరిలో ఉద్రిక్త వాతావరణం హొసపేటె: కొప్పళ జిల్లా కుకనూరు తాలూకాలోని బాలగేరి గ్రామంలో కులాంతర వివాహం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒక గ్రామస్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గ్రామానికి చెందిన యువతీ యువకుడు పరస్పరం ప్రేమించుకుని ఇటీవల వివాహం చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే గదగ్ జిల్లా రోణ తాలూకాలోని శాంతగేరి ఇటగి గ్రామానికి చెందిన యువతి బంధువులు బాలగేర గ్రామానికి వచ్చి గొడవ సృష్టించారు. దీంతో గ్రామస్తుడు బసప్ప తళవార్ (69) తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స కోసం కుకనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతను సృష్టించింది. విషయం తెలిసిన వెంటనే కుకనూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయక పోవడంతో సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
సదృఢ సమాజాన్ని నిర్మిద్దాం
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణానికి మహిళలు నడుం బిగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీదేవి నాయక్ పేర్కొన్నారు. ఆదిఽవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో కళాసంకుల సంస్థ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. వివేకతుల్యమైన చింతనలు, మౌల్యాలతో కూడిన సమాజం అభివృద్ధికి అనుగుణంగా ఉంటుందన్నారు. సమావేశంలో మారుతి, రేఖ, ఆశాలత, అనిత, పంపాపతి, బసవరాజ్, శ్రీనివాస్, రాజశేఖర్, రమేష్, ప్రేమలతలున్నారు. -
త్వరలో కేన్సర్ ఆసుపత్రి ప్రారంభిస్తాం
బళ్లారి రూరల్ : బళ్లారి నగరంలో కేన్సర్ రోగుల కోసం త్వరలో ఆసుపత్రి ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ ఒమేగా ఆసుపత్రి కేన్సర్ వైద్యుడు డాక్టర్ ఎస్.ఎస్.నిరాణి తెలిపారు. సోమవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బళ్లారిలో ప్రైవేటు కేన్సర్ ఆసుపత్రి లేనందున బెంగళూరు, హుబ్లీ, కర్నూలు, హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బళ్లారిలో ఒమేగా ఆసుపత్రి సౌజన్యంతో మరో ఆరు మాసాల వ్యవధిలో కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. చికిత్సలో భాగంగా నోరు, గర్భసంచి, స్తన తదితర అనేక కేన్సర్ వ్యాధులకు వైద్యం, శస్త్రచికిత్సలు అందిస్తారన్నారు. కేన్సర్ను గుర్తించడానికి బయాప్సీ, మెమో తదితర పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కేన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారతి తదితర ప్రయోజనాలు వర్తింపచేయనున్నట్లు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా.. బాలుడు మృతి
సాక్షి,బళ్లారి: ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బీదర్ జిల్లా భాల్కి తాలూకా పరిధిలోని మడకట్టి క్రాస్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడగా, అందులో వెళుతున్న శోహమ్(13) అనే బాలుడు కింద పడి మరణించాడు. బాలుడి మృతితో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం తెలియగానే చించోళి పోలీసులు హుటాహుటిన చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ ధరల పెంపుపై నిరసన రాయచూరు రూరల్: కేంద్రం ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జాతీయ కార్యదర్శి శ్రీదేవి నాయక్ మాట్లాడారు. గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య సిలిండర్ ధరను రూ.115 చొప్పున పెంచడాన్ని ఖండించారు. గతంలో గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన ప్రభుత్వం మరోసారి పెంచి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నడ్డివిరిచారని ఆరోపించారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ ప్రధానికి పంపదలచిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సురేష్వర్మకు అందించారు. ఆందోళనలో మంజుల, ప్రతిభారెడ్డి, సురేఖ తదితరులున్నారు. నరేగ పనులు ప్రారంభించండి రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో నరేగ పథకం పనులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని గ్రామీణ కూలి కార్మికుల సంఘం సంచాలకుడు అభయ్ డిమాండ్ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రస్తుతం వేసవిలో పొలం పనులు లభించవని, వ్యవసాయ కూలీ కార్మికులకు ఏడు రోజుల పనులు కల్పించాలని, కూలీ డబ్బుల బకాయిలను చెల్లించి నరేగ పథకం కింద పనులను సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. వేతన బకాయిలు చెల్లించరూ రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అతిథి ఉపాధ్యాయులకు వేతన బకాయిలు చెల్లించాలని ఏఐడీవైఓ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. జిల్లాలో ఆవిష్కార పథకం కింద నియమించుకున్న ఉపాధ్యాయులకు గత ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వేతన బకాయిల ను వెంటనే చెల్లించాలని కోరుతూ డీడీపీఐ జగదీష్కు వినతిపత్రం సమర్పించారు. పోక్సో కేసులో ముత్యాకు నో బెయిల్ హుబ్లీ: ఇటీవల సోషల్ మీడియాలో వైరలైన బాలికతో అనుచితంగా ప్రవర్తించిన కేసులో మల్లికార్జున ముత్యా దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ రిట్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఆ మేరకు యాదగిరి జిల్లా ప్రధాన, ప్రత్యేక సెషన్స్ కోర్టు ఆదేశాలు వెల్లడించింది. కాగా ముత్యాపై పోక్సో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో సదరు కోర్టు న్యాయమూర్తి మరుళ సిద్దారాధ్య ఈ మేరకు ముత్యా ముందస్తు బెయిల్ రిట్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలిచ్చారు. జానపద గాయని మృతి హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకాలోని సోగి గ్రామానికి చెందిన జానపద గాయని డి.హొన్నమ్మ(78) వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో సోమవారం మరణించారు. అనేక జానపద పాటలు పాడటం ద్వారా జిల్లాలో తనదైన ముద్ర వేసిన గాయని గ్రామ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. -
ఢిల్లీలో డీకే మంత్రాంగం
బెంగళూరు: ముఖ్యమంత్రి మార్పిడిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన తనకు కూడా ఒక అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలిసింది. ఇదే డిమాండ్తో గత కొన్ని వారాలుగా హైకమాండ్పై ఒత్తిడి తీసుకొస్తున్న ఆయన ఆదివారం హఠాత్తుగా హస్తినకు వెళ్లారు. అయితే వెంటనే పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు దొరకకపోవడంతో రాత్రికి అక్కడే మకాం వేశారు. సోమవారం ఉదయం నుంచి రాహుల్గాందీ, సోనియాగాంధీ, ప్రియాంక గాందీతో పాటుగా పలువురు నాయకులతో సమావేశం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. తనకు సీఎం పదవి కావాలనే ఏకవాక్య అజెండాతో పర్యటన సాగించారు.కొలిక్కిరాని పోరాటం రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య గత 4, 5 నెలలుగా పోరాటం సాగుతోంది. ఇది శీతల యుద్ధం నుంచి వీధి పోరాటాల వరకూ వ్యాపించింది. కొందరు మంత్రులు, ఇరువర్గాల ఎమ్మెల్యేలు జంతువులతో పోల్చుతూ ఆరోపణలు చేసుకుంటున్నారు. హైకమాండ్ మాత్రం గట్టి నిర్ణయం తీసుకోవడం లేదు. సీఎం సీటు గురించి ఎవరూ బయట మాట్లాడరాదని ఢిల్లీ పెద్దలు ఆదేశించినా, అనుకూల–వ్యతిరేక వ్యాఖ్యలు అడపాదడపా వెలువడుతున్నాయి. పైగా ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని హైకమాండ్కే సలహాలు ఇవ్వడం గమనార్హం. విందుకు వేళాయె డీకే మంగళవారం బెంగళూరుకు తిరిగి వస్తున్నారు. అదే రోజు బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన భారీ విందు ఇవ్వబోతున్నారు. దీంతో అందరి చర్చ విందు మీదే సాగుతోంది. సీఎం సిద్దరామయ్యను, మంత్రులను కూడా ఆహ్వానించారు. ఎంతమంది వస్తారు, ఎంతమంది ముఖం చాటేస్తారు, ఏం జరుగుతుందీ అన్నది కుతూహలం రేపుతోంది.ఎవరిని కలిశానో చెప్పను: డీసీఎంబనశంకరి: నేను ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాను అనేది బహిరంగంగా చెప్పడం కుదరదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. సోమవారం ఢిల్లీలో కర్ణాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీకి వచ్చిన తరువాత నేను అందరినీ కలుస్తాను. కానీ హైకమాండ్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వక పోవడంతో నేను వేచి చూస్తున్నాను అని మీడియాలో ప్రసారం చేస్తారు. అందుకే వేచిచూస్తున్నాను. పూణేలో నా స్నేహితుని ఇంట్లో పెళ్లి ఉంటే ఆదివారం బయల్దేరాను. సోమవారం అసోం పీసీసీ అధ్యక్షునితో భేటీతో పాటు అనేక సమావేశాల్లో పాల్గొన్నాను’ అని తెలిపారు. మంగళవారంతో కేపీసీసీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పూర్తి అవుతుంది, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బెంగళూరులో విందు ఏర్పాటు చేశానని చెప్పారు. ఓడిన అభ్యర్థులు, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరోసారి డిన్నర్ ఇస్తానని చెప్పారు. ఢిల్లీ భేటీపై ఎలాంటి ప్రత్యేక చర్చ వద్దన్నారు. ఇక బుధవారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఉందని తెలిపారు. -
యువ జంట ఆత్మహత్య
కర్ణాటక: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది. చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది. -
ఎల్పీజీ ఎఫెక్ట్... బెంగళూరులో హోటళ్లు బంద్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లకు ఎల్పీజీ షాక్ తగిలింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరమంతటా హోటళ్లు మూతబడనున్నాయి. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. ‘‘ఎల్పీజీ లేకుండా హోటళ్లను నడపడం అసాధ్యమని అందరికీ తెలుసు.అందుకే మాకిష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’’అని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.సి.రావు విలేకరులకు తెలిపారు. కేంద్రం తక్షణం ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరుకు చెందిన పలువురు ఎంపీల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. హోటళ్లకు పరిమిత స్థాయిలోనైనా ఎల్పీజీ సరఫరాలు కొనసాగేలా చూడాలని కోరారు. ఎల్పీజీ కొరతపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు చెన్నైలో కూడా బెంగళూరు తరహా పరిస్థితే నెలకొన్నట్టు వార్తలొస్తున్నాయి. -
బెంగళూరులో హోటళ్లు బంద్!?
వంటగ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ సోమవారం కీలక ప్రకటన చేసింది. నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు, వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనుంది.గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని, సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతల ప్రభావంఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా గొలుసును దెబ్బతీసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.Bengaluru Hotels to Shut Down From Tomorrow Amid Sudden Commercial Gas Supply CrisisBengaluruIn a major blow to the city’s food industry and daily commuters, the Bangalore #Hotels Association has announced a city-wide shutdown of hotels starting tomorrow. The decision comes… pic.twitter.com/h48xEbBHjh— Yasir Mushtaq (@path2shah) March 9, 2026పెరిగిన ధరల భారంమరోవైపు, సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగింది. శనివారం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. సౌదీ అరేబియా ముడి చమురు ధరల కారణంగా వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా అధికమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు! -
ట్రంప్కు బానిసలా మోదీ.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
కలబురిగి (కర్నాటక): పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.కర్నాటకలోని కలబురిగి జిల్లా చిత్తాపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ‘ఇరాన్ సుప్రీం నేతను అమెరికా చంపేసింది. ఏకంగా దేశ నేతనే చంపేస్తే ఆ దేశం, ఇక ప్రపంచం సురక్షితంగా ఉంటుందా? ఇరాన్ నేత ఖమేనీ లేదా వెనెజువెలా నేత మదురో..ఇలా ఎవరైనా కావచ్చు. దేశాల నేతలను ఇలా బెదిరింపులకు గురిచేస్తే ప్రపంచంలో శాంతి అనేదే ఉండదు. అమెరికా తన అహంకారంతో అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని ఖర్గే మండిపడ్డారు. భారత్ను టారిఫ్ల పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయించిందన్నారు. మోదీ, ట్రంప్లు మన దేశాన్ని నాశనం చేస్తూ, అమెరికాకు దాసోహమనేలా చేస్తున్నారని ఆరోపించారు. -
అర్ధరాత్రి.. చెరువులోకి కారు పల్టీ
● రైతు సంఘం నేత మృతి ● కోలారు వద్ద దుర్ఘటన కోలారు: కారు చెరువులోకి పడిన ప్రమాదంలో కర్ణాటక ప్రాంత రైతు సంఘం (కెపిఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు టిఎం వెంకటేష్ మరణించారు. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తాలూకాలోని ముదువాడి చెరువులో చోటు చేసుకుంది. కమ్యూనిస్టు, రైతు సంఘాల నేత అయిన టిఎం వెంకటేష్ (45), ఆదివారం నుంచి కోలారులో జరిగే 3 రోజుల కెపిఆర్ఎస్ రాష్ట్ర సమ్మేళనం ఏర్పాట్లను చూసి, కారులో ఒక్కరే బయల్దేరారు. కారు ముదువాడి చెరువు రోడ్డులో వెళ్తుండగా వెంకటేష్ నిద్రమత్తులో అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోయినట్లు అనుమానాలున్నాయి. ఆదివారం ఉదయం చెరువులో కారు తేలుతుండడం చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా రైతు సంఘాల నాయకులు, పోలీసులు చేరుకుని కారును బయటకు తీయగా లోపల మృతదేహం కనిపించింది. కోలారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నేతలు, కార్యకర్తలు తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఇద్దరు దొంగల అరెస్టు మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని కవలందె గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. తగడూర్ గ్రామానికి చెందిన టి.బి.రాజు, టి.డి. అభిషేక్ నిందితులు, వారి నుంచి రూ.2.28 లక్షల నగదు, 22 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఫిబ్రవరి 16న తగడూరులో ఓ మహిళ ఇంట్లోకి చొరబడిన నిందితులు ఆమెను బెదిరించి 22 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.28 లక్షల నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్నారు. డీకే శ్రీనివాస్కు హైకోర్టులో బెయిలు యశవంతపుర: వ్యాపారవేత్త కె.రఘునాథ్ అనుమానాస్పద మృతి, అతని ఆస్తులను బలవంతంగా బదిలీ చేసుకున్న కేసుల్లో జైలుపాలైన డీకే ఆది కేశవులనాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్కు కర్ణాటక హైకోర్టు షరతులతో బెయిల్ను మంజూరు చేసింది. ఈ కేసుల్లో అతనిని సీబీఐ ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. రెండు నెలల నుంచి కారాగారంలో ఉంటున్నాడు. బెయిలుకు మంజూరు చేసుకోగా, న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ అమరణ్ణవర్ ధర్మాసనం విచారించి, వాదనల తరువాత బెయిలును మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని, వారం రోజుల లోపు పాస్పోర్టును కోర్టుకు అప్పగించాలని, విచారణ నివేదిక వచ్చే వరకు కర్ణాటకను వదలి వెళ్లరాదని షరతులను విధించింది. -
గ్రేటర్ బెంగళూరులో సగం వార్డులు మహిళలకే
మొత్తం 369 వార్డుల సమాచారం శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలో 5 నగర పాలికెల ఎన్నికలకు సంబంధించి వార్డుల ఫైనల్ రిజర్వేషన్ జాబితాను ప్రకటించారు. మొత్తం 369 వార్డుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించగా, 185 స్థానాలు వారికే దక్కాయి. గతంలో ప్రకటించిన రిజర్వేషన్ జాబితాపై వివిధ సంఘాలు, పార్టీలు, ప్రజల నుంచి వందలాది అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు లోపాలను సరిచేసి తుది రిజర్వేషన్ జాబితాను సిద్ధం చేశారు. రికార్డుస్థాయిలో మహిళలకు 50 శాతం సీట్లు ఇవ్వడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గత రిజర్వేషన్లలో మార్పులు చేశారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్ల మేరకు కొన్ని వార్డుల్లో పార్టీకి అనుకూలంగా సవరణలు చేశారని తెలిసింది. బెంగళూరులో 5 పాలికెలు రిజర్వేషన్ల జాబితా విడుదల 369 వార్డుల్లో అతివలకు 185 కేటాయింపు రిజర్వేషన్ జాబితాలో మహిళలకు 185 వార్డులు రిజర్వుడు. 43 వార్డులు ఎస్సీలకు, 7 ఎస్టీలకు, బీసీఏ వర్గానికి 97, బీసీ బీకి 24, జనరల్ వర్గానికి 192 వార్డులు రిజర్వుడు. 1. బెంగళూరు దక్షిణ నగర పాలికెలో మొత్తం వార్డులు –72 ఎస్సీ –7, ఎస్టీ–1, బీసీఏ–19, బీసీబీ–5, జనరల్ – 40 వార్డులు 2. బెంగళూరు ఉత్తర నగర పాలికె మొత్తం వార్డులు–72, ఎస్సీ–9, ఎస్టీ–2, బీసీఏ–19, బీసీబీ–5, జనరల్–37 వార్డులు 3.బెంగళూరు పశ్చిమ నగర పాలికె మొత్తం వార్డులు–112 ఎస్సీ –9, ఎస్టీ–2, బీసీఏ–30, బీసీబీ–7, జనరల్– 64 వార్డులు 4. బెంగళూరు తూర్పు నగర పాలికె మొత్తం వార్డులు –50 ఎస్సీ–7, ఎస్టీ–1 వార్డు, బీసీఏ–14, బీసీబీ–3, జనరల్ –25 వార్డులు. 5. బెంగళూరు కేంద్ర నగర పాలిక మొత్తం వార్డులు–63 ఎస్సీ–11, ఎస్టీ–1, బీసీ ఏ–15, బీసీ బీ–4, జనరల్ –32 వార్డులు. -
జాలీరైడ్లో విషాదం.. ముగ్గురు యువకుల మృతి
దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడే దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. బెంగళూరు సమీపంలో కనకపుర మెయిన్ రోడ్డులోని కగ్గలీపుర అగర క్రాస్ వద్ద జరిగింది. సయ్యద్ బాషా (22), యూనస్ బాన్ (23), అజహర్ బాషా (22) మృతులు కాగా, ఫరాజ్ క్షతగాత్రుడు. నలుగురూ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కారులో జాలీ రైడ్కు బయలుదేరారు. అతి వేగం వల్ల అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు బెంగళూరువాసులని సమాచారం. కగ్గలీపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్ఫూర్తిదాయకం.. మహిళా దినోత్సవంశివాజీనగర: అంతర్జాతీయ మహిళా దినాచరణ సందర్భంగా బెంగళూరులో వివిధ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. హెబ్బాళ ఫ్లై ఓవర్ కింద నారీ శక్తి రైడ్ పేరిట మహిళా బైకర్ల ర్యాలీ జరిగింది. వివిధ ప్రాంతాల గుండా ర్యాలీ జరిపారు. ఇందులో మహిళా క్యాబ్ డ్రైవర్లు, వైద్యులు, టెక్కీలు పాల్గొన్నారు. ధైర్యం, ఐక్యత, ఆత్మవిశ్వాసానికి మహిళలు ప్రతీక అని వక్తలు కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచి, సమాజానికి ఉత్తమ సందేశాన్ని ఇస్తాయని తెలిపారు. నగరవ్యాప్తంగా మహిళలచే సమావేశాలు, చైతన్య ర్యాలీలు జరిగాయి. మైసూరులో స్వచ్ఛతా నినాదం మైసూరు: మైసూరు మహానగర పాలక సంస్థ ఆదివారం స్వచ్ఛతా రోడ్ షో నిర్వహించింది. నగరంలోని అంబా విలాస్ ప్యాలెస్ ముందు మంత్రి డాక్టర్ హెచ్.సి.మహదేవప్ప జెండా ఊపి రోడ్ షోను ప్రారంభించారు. మైసూరులో పరిశుభ్రత, మాదకద్రవ్యాల నివారణ, ఆరోగ్య సమస్యల గురించి పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైసూరు నగరం ప్రపంచ ప్రసిద్ధి చెందడానికి కారణం నాల్వడి కృష్ణరాజ ఒడయార్ అని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి, దానిని తరువాతి తరానికి అప్పగించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని ఆయన అన్నారు. రోడ్లపై చెత్త వేయడం, పెంపుడు జంతువులచే మలవిసర్జన చేయడం వంటిని నిలిపివేయాలని కోరారు. మహిళా దినోత్సవాన్ని స్మరిస్తూ కుటుంబ నిర్మాణం, మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర ముఖ్యమైనదన్నారు. ఈ సందర్భంగా అలనాటి వింటేజ్ కార్లు, మహిళా బైకర్లు, కళా బృందాలు, పౌర కార్మికులు, విద్యార్థుల ప్రదర్శనలు రంజింపజేశాయి. ఎమ్మెల్యేలు తన్వీర్ సేట్, జీటీ దేవెగౌడ, కె.హరీష్ గౌడ, కలెక్టర్ లక్ష్మికాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇనుప రాడ్డుతో సహచర విద్యార్థి దాడి.. ఏపీ విద్యార్థి మృతి
సాక్షి,బెంగళూరు: సాక్షి,బెంగళూరు: తొమ్మిదో తరగతి విద్యార్థి విచక్షణ కోల్పోయాడు. హాస్టల్ గదిలో గాఢ నిద్రలో ఉన్న సహచర విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ని సైతం ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైంది. ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి తండ్రి.. దాడికి పాల్పడ్డ విద్యార్థి మతి స్థిమితం కోల్పోవడం, లేదంటే డ్రగ్స్ మత్తులో దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ‘గురుకులం’హాస్టల్లో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి బళ్లారి ‘గురుకులం’ ఓ విద్యార్థి కలకలం సృష్టించాడు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. విద్యార్థుల పక్కనే నిద్రిస్తున్న హాస్టల్ వార్డెన్పై దాడికి దిగడం ఆయన తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనపై అప్రమత్తమైన స్థానికులు, ఇతర హాస్టల్ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం బళ్లారి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(బీఎంఐఎస్)తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న బ్రూస్పేట పోలీసులు ఘటన జరిగిన హాస్టల్తో పాటు విద్యార్థులు చికిత్స పొందుతన్న బీఎంఐఎస్ ఆస్పత్రికి చేరుకున్నారు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో ఎందుకు దాడి చేశాడు? దాడికి ముందు ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురుకులంలో విద్యార్థులపై దాడి ఘటనతో తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు స్థానికుల్ని కంటితడి పెట్టిస్తున్నాయి.ఈ సందర్భంగా విద్యార్థి దాడిలో మృతి చెందిన ఏపీ విద్యార్థి హేమంత్ తండ్రి లక్ష్మీకాంత్ అనుమానం వ్యక్తం చేశాడు. శనివారం రాత్రి 11గంటల సమయంలో హాస్టల్ ఘటనపై సమాచారం అందింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా తన కొడుకు హత్యకు గురైనట్లు తెలిసింది.విద్యార్థుల్ని రక్షించడంలో, పర్య వేక్షించడంలో యాజమాన్యం విఫలమైంది. విద్యార్థి.. తోటి విద్యార్థులపై జరిపిన దాడి తీరును చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడ్డ మానసిక సమస్యతో బాధపడటం లేదంటే డ్రగ్స్ మత్తులో ఘోరానికి పాల్పడ్డాడేమోనన్న అనుమానం ఉందని చెప్పారు. -
ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా మరబ్బిహాల్ గ్రామ పంచాయతీ పరిధిలో వరదాపూర్, నారాయణ దేవరకెరె మధ్య ఉన్న జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి విషపూరిత నీలం రంగు వ్యర్థాలు రైతుల ఆరోగ్యం, పశువులపై ప్రభావం చూపుతున్నాయి. పంటలు కూడా దెబ్బతింటున్నాయని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు జే.ఎం.వీరంసంగయ్య తెలిపారు. ఫ్యాక్టరీపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారికి వినతిపత్రం సమర్పించారు. వరదాపూర్, నారాయణ దేవరకెరె, కెంచటనహళ్లి, కెంచటనహళ్లి తాండా, మరబ్బిహాల్, మరబ్బిహాల్ తండాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. కర్మాగారం నుంచి వెలువడే దుమ్ము, విషపూరిత నీలం వ్యర్థాలతో ప్రజలు, పశువులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. భారీగా శబ్ధాలతో పిల్లలు చదువుకోలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.గోనిబసప్ప, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తంబ్రల్లి తదితరులు పాల్గొన్నారు. -
హనీట్రాప్ రాకెట్ గుట్టురట్టు
● ప్రైవేట్ వీడియోలు, ఫొటోలతో రూ.25 లక్షలు డిమాండ్ ● ప్రైవేట్ నర్స్తో సహా నలుగురు అరెస్ట్ సాక్షి, బళ్లారి: దావణగెరె నగరంలో ఓ వ్యాపారిని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలతో బెదిరించిన హనీట్రాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారిని వలలో వేసుకున్న ప్రైవేట్ నర్సు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రైవేట్ నర్స్తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. వివరాలు.. దావణగెరె నగరంలో నివసిస్తున్న సుష్మిత అనే నర్స్.. ఓ వ్యాపారికి మాయమాటలు చెప్పి వలలో వేసుకుంది. వ్యాపారితో సన్నిహితంగా ఉంటూ తన బుట్టలో వేసుకుంది. వ్యాపారితో కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు చూపించి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. భయపడిన వ్యాపారి అప్పుడప్పుడు కొంత నగదును నర్స్ సుష్మితకు ఇచ్చాడు. మళ్లీ మళ్లీ డబ్బు ఇవ్వాలంటూ వ్యాపారిని ఇబ్బందులు పెట్టారు. విసిగిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వల పన్ని నర్స్తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. కాగా.. సదరు నర్స్ చాలామంది హనీట్రాప్ చేసి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు సమాచారం. దావణగెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయం నిర్మించడం హర్షణీయం
హొసపేటె: ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాలని గరగ నాగలపురలోని శ్రీగురు ఒప్పటేశ్వర స్వామి మఠం అధిపతి నిరంజన ప్రభు మహాస్వామి సూచించారు. శనివారం హొసపేటె తాలూకా హరువనహళ్లిలో గ్రామ దేవత ఊరమ్మ దేవి ఆలయ కొత్త భవనం, గోపుర కలశస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నిరంజన ప్రభు మహాస్వామి మాట్లాడుతూ.. గ్రామస్తులు కుల, పార్టీ బేధాలు మరచిపోయి ఐక్యమత్యంతో ఊరమ్మ దేవి ఆలయాన్ని నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. మీ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మరియమ్మనహళ్లి గురుపాద దేవర మఠం మల్లికార్జున శివాచార్య స్వామిజీ ద్వి సన్నిధి నిర్వహించారు. గణపతి వాస్తు, రక్తోపన, నవగ్రహ దుర్గా, కలశ ప్రతిష్ఠాప నేగాలు, శాంతి వాస, జలధి వాస, ధ్యానదివాస, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రతిష్ఠాపన హోమం, దుర్గా హోమం, దిగ్గలి గోపుర సంరక్షణ, శుద్ధ బలి పూర్ణహుతి, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో పి.ఓబప్ప, తమ్మజ్జ, బోసప్ప, శరణప్ప, వీరేశ్వర స్వామి, కృష్ణమూర్తి, హోసూరు వెంకటేష్, రామప్ప, మరగడప్ప, బొమ్మప్ప, శరణప్ప, గొల్లర చంద్రప్ప, నాగరాజ్, సోమన్న, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పూజలు చేయించేందుకు వస్తూ పరలోకాలకు
సాక్షి బళ్లారి: కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా హంపీ–అంజనాద్రి దేవాలయాల్లో పూజలు చేయించేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. ప్రమాదవశాత్తూ కారు అదుపు తప్పి బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందారు. శనివారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగి తాలూకా హైవేలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరులోని సుబ్బణ్ణపాల్యకు చెందిన శ్రీనివాస రావు, రత్నాబాయి దంపతుల కుమారుడు రూపేష్ పుట్టిన రోజు సందర్భంగా హంపీ–అంజనాద్రి దేవాలయాల్లో పూజలు చేయించాలని బయలుదేరారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగి తాలూకా హైవేలో వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస రావు (70), రత్నాబాయి (65) ఇద్దరు మృతి చెందగా వీరితో పాటు ప్రయాణిస్తున్న కుమారుడు రూపేష్ (37), కవిత బాయి (33) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడు రూపేష్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఘటనా స్థలంలో కారు దూరంగా ఎగిరి పడిపోవడంతో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కూడ్లిగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కూడ్లిగి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు బోల్తా: ఇద్దరు మృతి


