breaking news
Chittoor
-
పొరుగుజ్జు
జిల్లాలోని మామిడి రైతుల పొట్టగొడుతూ పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న తక్కువ ధర కాయలతో పళ్లగుజ్జు ఫ్యాక్టరీల యజమానులు కాసుల వేట సాగిస్తున్నారు. స్థానిక రైతన్న ఆవేదనను గాలికొదిలేసి, తమిళనాడు నుంచి తక్కువ ధరకు లభిస్తున్న మామిడి కాయలను ఇక్కడి ఫ్యాక్టరీలకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ స్థానిక మార్కెట్ను కుప్పకూలుస్తున్నారు. గుడిపాల మండలంలోని పలు పల్ప్ ఫ్యాక్టరీలే ఇందుకు ప్రధాన కేంద్రాలుగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు రూరల్ (కాణిపాకం): తమిళనాడుకు చెందిన కొందరు మధ్యవర్తులు, వ్యాపారులు అక్కడి తోటల్లో తోతాపురి కాయలను కేవలం రూ.3 నుంచి రూ.4లకే కొనుగోలు చేస్తున్నారు. వాటిని లారీల ద్వారా సరిహద్దులు దాటించి చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీలకు రూ.4 నుంచి రూ.5లకు విక్రయిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. ఇటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కూడా స్థానిక రైతుల నుంచి ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందనే నెపంతో, తమిళనాడు కాయల వైపే మొగ్గు చూపుతున్నాయి. మన రైతుకు ఆంక్షలు.. పొరుగు లారీలకు పర్మిషన్లు స్థానిక రైతుల పట్ల ఫ్యాక్టరీల యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జిల్లా రైతులు తమ కాయలను కేవలం ట్రాక్టర్లలో తీసుకొస్తేనే కొంటామని, లారీల్లో తీసుకురావద్దంటూ వింత నిబంధనలు విధిస్తున్నారు. కా యల లోడింగ్ ఎక్కువైతే రేటు పడిపోతుందనే సాకు చూపుతున్నారు. కానీ, తమిళనాడు నుంచి మాత్రం యథేచ్ఛగా లారీల కొద్దీ వస్తున్న మామిడి లోడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా ఫ్యాక్టరీల లోపలికి అనుమతిస్తుండడం గమనార్హం. దీనివల్ల స్థానిక జిల్లా కాయలను ఫ్యాక్టరీలు పూర్తిగా తోసిపుచ్చుతున్నాయి. లెక్కల్లో మాయాజాలం! జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 59 వేల హెక్టార్లలో మామిడి సాగు కాగా, అందులో సింహభాగం అంటే 41 వేల హెక్టార్లలో కేవలం తోతాపురి రకమే సాగైంది. ఈ ఏడాది ఉద్యానశాఖ అధికారులు జిల్లాలో 4.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలోని 35 పల్ప్ ఫ్యాక్టరీల ద్వారా కనీసం 3.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు కేవలం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ 2.50 లక్షల మెట్రిక్ టన్నుల లెక్కల్లో తమిళనాడు నుంచి వచ్చిన కాయలను కూడా కలిపేశారు. పొరుగు రాష్ట్రం నుంచి ఎంత మేర కొనుగోలు చేశారనే వివరాలను ఫ్యాక్టరీల యాజమాన్యాలు అధికారిక లెక్కల్లో ఎక్కడా చూపించడం లేదు. రైతు సంఘాల నాయకుల అంచనా ప్రకారం.. ఈ సీజన్లో ఇప్పటికే సుమారు 70 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల తమిళనాడు కాయలు జిల్లాలోని ఫ్యాక్టరీలకు చేరిపోయాయి. దీనివల్ల స్థానిక రైతుల కాయలు తోటల్లోనే మగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికారులు స్పందించి స్థానిక రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఆయప్ప వస్తే.. మాకు పడిగాపులే
పలమనేరు: ‘‘ఏం చంద్రబాబోనమ్మా ఆయప్ప మిసికిమంటే కుప్పానికి ఏమికిటి వస్తాడో గానీ ఆయప్ప వచ్చినప్పుడంతా బస్సుల్లేక ఇదేం ఖర్మ. పిల్ల పాపలు, ముసలి ముతలకు బస్సుల్లేకుండా రోడ్లపై పడిగాపులు పడుతుంటే ఆ బాధ పడేవాళ్ళకు తెలుస్తుంది’’ అంటూ రోడ్లపై బస్సుల కోసం పాట్లు పడుతున్న మహిళ శాపనార్థాలు. పలమనేరు డిపోలో గతంలో 80 దాకా బస్సులు ఉండేవి. వీటిల్లో కొన్నింటిని పుంగనూరు డిపోకు, మరికొన్నింటిని కుప్పానికి పంపేశారు. ప్రస్తుతం ఇక్కడ కాలం చెల్లిన ఆర్డినరీ బస్సులు తప్ప ఇంకేమీ లేవు. కుప్పానికి సీఎం చంద్రబాబు వచ్చినప్పుడల్లా ఇక్కడి డిపోలోని బస్సులను జనాన్ని తరలించేందుకు కుప్పానికి పంపుతుంటారు. ఇదే మాదిరి ఇప్పుడు పంపారు. అయితే శనివారం వారాంతం కావడంతో అసలే రద్దీ ఎక్కువా ఉంటుంది. దానికితోడు పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో బస్సులు లేకుంటే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆటోలు, పాల టెంపోలకు పండగ చంద్రబాబు ఎప్పుడు కుప్పానికి వస్తారా అని కాపుగాచుకుని ఉండే ప్రైవేటు వాహనాల వారు దొరికిందే దోచుకునేందుకు సిద్ధంగా ఉంటారు. బస్సులు లేని సమయంలో రెట్టింపు ధరలు షరా మామూలే. ఇక పాల టెంపోల వారికీ కొమ్ములొస్తాయి. వారు చెప్పినంత ఇవ్వాల్సిందే. పలమనేరు నుంచి బైరెడ్డిపల్లికి బస్సులో టికెట్ చార్జి రూ.40 అయితే బస్సులేనప్పుడు రూ.500 ఇవ్వాల్సిందే. ఇదే పరిస్థితి అన్ని మార్గాల్లో ఉంటుంది. ఏదేమైనా సీఎం కుప్పానికి వచ్చిన ప్రతిసారీ మహిళలు, వృద్ధులు, వికలాంగులు పడే కష్టాలు ఆ భగవంతునికే తెలియాలి. ఓటరూ.. మేలుకో! ఓటరు మహాశయా మేలుకో! నీ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు సమయం ఆసన్నమైంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిచేసి ఇవ్వడానికి కేవలం 10 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. -
● డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తయినా నిర్వహించని పరీక్షలు ● సెకండ్ సెమిస్టర్ పరీక్షల కోసం విద్యార్థుల ఎదురుచూపులు
పరీక్షల కోసం నిరీక్షణతిరుపతి సిటీ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం వారు రెండో సంవత్సరంలో అడుగుపెట్టారు. 2025–26లో పలు యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఒక సెమిస్టర్ పరీక్షలు మాత్రమే నిర్వహించారు. తర్వాత రెండో సెమిష్టర్ పరీక్షలు చేపట్టలేదు. ఇందుకు గత ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబర్, నవంబర్ వరకు కొనసాగడమేనని అధికారులు చెబుతున్నారు. 2026–2027 విద్యా సంవత్సరం ప్రారంభమై సెకండ్ ఇయర్లోకి అడుగుపెట్టినా సెకండ్ సెమిస్టర్ పరీక్ష నిర్వహణపై వర్సిటీ అధికారులు దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు సెకండ్ ఇయర్ సిలబస్ చదువుతూ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షల కోసం ఎలా సన్నద్ధమవ్వాలని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల ఆలస్యంపై అధికారులను వివరణ కోరగా ఈ నెల చివరి వారంలో నిర్వహిస్తామని సమాధానమిచ్చారు. మే నెలలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వేసవి సెలవుల కారణంగా వాయిదా వేసినట్టు తెలిపారు. ఇప్పుడు పరీక్షల నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్నామని, ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఎస్జీఎస్లో 8 నుంచి పరీక్షలు అటానమస్ హోదా పొందిన టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలల్లో యూజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు గత నెల 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 8వ తేదీతో ముగియనున్నాయి. కానీ అటానమస్ హోదా పొందిన ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో పలు పోటీ పరీక్షలకు కేంద్రంగా కేటాయించిన నేపథ్యంలో కాస్త ఆలస్యమైందని, ప్రాక్టికల్స్ ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్నాయని, ఈ నెల 8 నుంచి థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అధికార పార్టీలో ఆధిపత్య పోరు
సాక్షి టాస్క్ఫోర్స్: మండల కేంద్రమైన వడమాలపేటలో తెలుగుదేశం పార్టీలోని విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు ధనంజయులు నాయుడు టిప్పర్లను శనివారం అదే పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్రెడ్డి వర్గం ఆపడంతో వడమాలపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మండల పరిధిలోని తిరుమణ్యం చెరువు నుంచి గత రెండు రోజులుగా వందలాది టిప్పర్ల మట్టిని పాదిరేడు గ్రామంలోని ప్రైవేటు పనులకు తోలుతున్నారు. ఈపనికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ధనంజయులునాయుడు నాయకత్వం వహిస్తుండగా, దీనిని వైఎస్సార్సీపీ నుంచి వలస వెళ్లిన వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్రెడ్డి అడ్డుకుంటున్నారు. శనివారం పోలీసుల సాయంతో టిప్పర్లను ఆపించారు. దీనిపై ఆగ్రహించిన ధనంజయులునాయుడు వర్గం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల అనుమతితోనే మట్టిని తరలిస్తున్నట్లు వీరి వాదన. చెరువును నాశనం చేస్తున్నారన్నది మరొకరి వాదన. దీనిపై ఎటూ తేల్చుకోలేని పోలీసులు టిప్పర్లను స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిలబెట్టారు. ఇంత జరుగుతు న్నా స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. పార్టీలో చేరిన రోజు నుంచే.. మాజీ మంత్రి ఆర్కే రోజా చలవతో వడమాలపేట జెడ్పీటీసీగా గెలుపొందిన మురళీధర్రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పంచన చేరారు. నాటి నుంచి స్థానిక టీడీపీ మండల అధ్యక్షుడు ధనంజయులునాయుడుపై పైచేయి సాధించాలని మురళీధర్రెడ్డి తనదైన శైలిలో ఎమ్మెల్యే భానుప్రకాష్ వద్ద రాజకీయం నెరుపుతూ వచ్చారు. దీనిపై ధనంజయులునాయుడు ఎమ్మెల్యే వద్ద ఎప్పటికప్పుడు తన అభ్యంతరాలను తెలుపుతూ వచ్చారు. అయినా పాత ఒక రోత, కొత్త ఒక వింత అన్న చందాన ఎమ్మెల్యే మురళీధర్రెడ్డీకే తన మద్దతు ఇస్తున్నారన్నని పార్టీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. ఈ భావనకు తాజాగా జరిగిన సంఘటన బలాన్ని చేకూరుస్తోంది. ధనంజయులునాయుడు టిప్పర్లను ఆపించగలిగే స్థాయికి మురళీధర్రెడ్డి పార్టీలో పెరిగిపోయాడన్న చర్చ మండలంలో చక్కర్లు కొడుతోంది. -
తమిళనాడు సరిహద్దు వరకు బారులు తీరిన మామిడి ట్రాక్టర్లు
తమిళనాడు సరిహద్దు వరకు బారులు తీరిన మామిడికాయల ట్రాక్టర్లు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి పెద్దపంజాణి: మండలంలోని బసవరాజుకండ్రిగ గ్రామంలో అనుమానాస్పదంగా సీతారామయ్య(40) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బసవరాజుకండ్రిగ గ్రామానికి చెందిన శ్రీరాములు కుమారుడు సీతారామయ్య అదే గ్రామానికి చెందిన భాగ్యమ్మను 15ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ సీతారామయ్య కుటుంబాన్ని పోషించేవాడు. 10 రోజులుగా భార్య మామ నాగరాజు ఇంట్లో సీతారాయమ్మ కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సీతారామయ్య కుటుంబంతో కలసి భోజనం చేసి పెద్దపంజాణి వెళ్లి వస్తానని వెళ్లాడు. అయితే శనివారం ఉదయం ఇంటి ముందు శవమై కనిపించాడు. అప్పటికే మృతి చెందిన సీతారామయ్య గొంతుకు చీర చుట్టుకుని ఉండడాన్ని గుర్తించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతారామయ్య ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా హత్య చేశారా.. అనే విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
హెల్ప్ డెస్క్ పరిశీలించిన భూమన
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని జానకారపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి శనివారం పరిశీలించారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపీణీ, నమోదు, అందజేత, డిజిటలైజేషన్ వివరాలను చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి భూమనకు తెలియజేశారు. బీఎల్ఎల పనితీరు, ఫారాలు రాయడానికి వారు అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు. అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల సర్వే పనితీరును తెలియజేశారు. పలువురు ఓటర్లు హెల్ప్ డెస్క్ వద్ద ఫారాలపై సందేహాలను తెలుసుకున్నారు. బీఎల్ఎలు ఫారాలు రాసి ఇచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు మధురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సరళామేరీ, మాజీ కార్పొరేటర్ లక్ష్మణస్వామి నాయకులు అన్బు, అంజలిరెడ్డి, ఆను, మురళీరెడ్డి, నౌషద్, హరీషారెడ్డి, రాజశేఖర్, మనోజ్రెడ్డి, సీతాపతి, ఇమ్రాన్, కౌసర్, ప్రేమ్, అల్తాఫ్, సద్దాం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి ఖాతా తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా తమ పేరుతో బ్యాంకులో గానీ లేదా తపాలా బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆదేశించారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకా న్ని ఈ నెలలోఅమలు చేయనున్నట్లు పేర్కొ న్నారు. విద్యార్థి పేరుతో తెరిచిన ఖాతాను తప్పనిసరిగా ఎన్పీసీఐతో అనుసంధానం చేయాలన్నారు. అలా చేసిన వారికి మాత్రమే తల్లికి వందనం పథకం ఆర్థిక ప్రయోజనాలు అందుతాయన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 10 వ తేదేలోపు పూర్తి చేయాలని సూచించారు. ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు, సచివాల య సిబ్బంది చొరవ తీసుకుని అర్హులైన విద్యార్థులతో వారి పేరు మీద కొత్త ఖాతాలు తెరిపించి, ఎన్పీసీఐ అనుసంధానం పూర్తయ్యేలా అవసరమైన మార్గదర్శకాలు అందించాలని కోరారు. -
క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి టాస్క్ఫోర్స్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో బీఎల్వోలు స్థానిక పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండాలని స్పష్టమై న ఆదేశాలు జారీచేశారు. అయితే జిల్లాలో శని వారం ప్రత్యేక డ్రైవ్ కాగితాలకే పరిమితమైంది. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోల జాడ కనిపించలేదు. చాలావరకు పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. తికమకలో ఓటర్లు ఉన్నతాధికారుల ఆదేశాలను నమ్మి శనివారం పనులు మానుకుని వచ్చిన ఓటర్లు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఏ కేంద్రంలో ఎవరు ఉంటారు? ఎవరిని సంప్రదించాలి? అనే కనీస సమాచారం కూడా ఎక్కడా ప్రదర్శించని దుస్థితి. దీంతో జిల్లాలోని అధికారుల బాధ్యతరాహిత్యానికి అద్దం పడుతోంది. ఏసీ రూమ్లకే పరిమితం బీఎల్వోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్నారా, లేదా? క్షేత్ర స్థాయిలో ఏం చేస్తున్నారు? అని పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక తహసీల్దార్, డివిజన్ స్థాయి లో ఆర్డీవోలదే. కానీ, శనివారం ఆ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో బీఎల్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పై అధికారులు అడగరు.. మనల్ని చూసేవారెవెరు ? అనే ధీమాతోనే విధులకు డుమ్మా కొట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలువు పెట్టి వెళ్లా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేద్దామని శనివారం కార్యాలయానికి సెలవు పెట్టి మా పోలింగ్ కేంద్రానికి వెళ్లాను. అక్కడ చూస్తే పాఠశాల నిర్వహిస్తున్నారు. పాఠశాలలో వెళ్లి మొత్తం తిరిగి చూశాను. బీఎల్వోలు ఎవరూ లేరు. అక్కడున్న బీఎల్వో సెల్ నెంబర్కు ఫోన్చేశాను. ఇప్పుడు బీఎల్వో నేను కాదు. వేరే వాళ్లు అని సమాధానమిచ్చారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడం ఎందుకు? ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? – సతీష్ కుమార్, స్థానికుడు, చిత్తూరు నగరం. కేవలం ప్రకటనలకే పరిమితం పరిశీలించిన అంశం క్షేతస్థాయి పరిశీలన ప్రభావం బీఎల్వోల హాజరు శనివారం 70 శాతం కేంద్రాల్లో ఫారాలు సమర్పించకుం అందుబాటులో లేరు డానే ఓటర్లు వెనుదిరి గారు. ఆర్డీవో, తహసీల్దార్ల పర్యటన క్షేత్రస్థాయిలో కేంద్రాలను బీఎల్వోలలో భయం సందర్శించలేదు లేకపోవడానికి ఇదే ప్రధాన కారణం కేంద్రాల నిర్వహణ పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. నిరీక్షించి ఇబ్బందులు ఎదుర్కున్నారు -
నీలం రకం.. కిలో రూ.6 లకేనా?
తోతాపురి కొనుగోళ్లను నిలిపివేసిన ఫ్యాక్టరీల యజమానులు, ఇప్పుడు వ్యూహాత్మకంగా ‘నీలం రకం మామిడి కాయలు కొంటాం’ అంటూ బోర్డులు తగిలించారు. అది కూడా కేవలం కేజీ రూ.6 లకే కొంటామని తెగేసి చెబుతున్నారు. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాని ఈ ధరతో రైతులను మరింత శ్రమ దోపిడీ చేసేందుకు యాజమాన్యాలు సిద్ధపడ్డాయి. మరోవైపు గుడిపాల పరిసరాల్లోని ఫ్యాక్టరీలు అరకొరగా కొనుగోళ్లు జరుపుతూ.. పక్కనే ఉన్న తమిళనాడు కాయలపై మోజు చూపిస్తూ స్థానిక రైతులను నట్టేట ముంచుతున్నాయి. -
పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీ కౌన్సెలింగ్ గందరగోళం నడుమ సాగింది. శుక్రవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్కు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి టీచర్లు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. అయితే సీనియారిటీ జాబితాల్లో గందరగోళం, అభ్యంతరాలు, పలు కారణాల వల్ల కౌన్సెలింగ్ను సాయంత్రం వరకు నిర్వహించలేని పరిస్థితి. పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ అన్న చందంగా మారిన ఈ ప్రక్రియలో సీనియార్టీ స్థానాల కోసం ఉపాధ్యాయులు పోటాపోటీగా నిలిచారు. ఈ కౌన్సెలింగ్ కేటాయింపుల్లో తీవ్ర ఆలస్యం జరగడంతో, ఉపాధ్యాయులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న హైస్కూల్ ప్లస్ విద్యాలయాల్లో మొత్తం 118 పీజీటీ పోస్టుల డిప్లాయ్మెంట్ కోసం ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గంటల తరబడి నిరీక్షణ.. సాయంత్రానికి మోక్షం! ఉమ్మడి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే డీఈఓ కార్యాలయానికి చేరుకున్న ఉపా ధ్యాయులు కూర్చోవడానికి సరైన వసతులు లేక, ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాడిపోయారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. పారదర్శకంగా నిర్వహించాం: ఇన్చార్జి డీఈవో కౌన్సెలింగ్ ఆలస్యమవడంపై ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు వివరణ ఇస్తూ.. ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగకుండా, సీనియార్టీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా స్థానాలను కేటాయించాలనే ఉద్దేశంతోనే జాబితాల పరిశీలనకు కొంత సమయం పట్టిందని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రాధాన్యత క్రమంలో, మెరిట్ ఆధారంగానే పోస్టింగ్లు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. హైస్కూల్ ప్లస్ విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకే ఈ త్వరితగతిన భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. సబ్జెక్టుల వారీగా పోటాపోటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అప్గ్రేడ్ చేసిన హైస్కూల్ ప్లస్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ తరగతులకు బోధించేందుకు ఈ 118 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 270 మంది దరఖాస్తు చేసుకుని కౌన్సెలింగ్కు హాజరయ్యారు. అయితే అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య భారీగా ఉండడం, ఖాళీలు పరిమితంగా ఉండడంతో ప్రతి పోస్టుకూ తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా కొన్ని ప్రధాన సబ్జెక్టుల స్థానాల కోసం ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాను పట్టుకుని అధికారుల వద్దకు క్యూ కట్టారు. ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు ఉపాధ్యాయుల సందేహాలను నివృత్తి చేస్తూ కౌన్సెలింగ్ను పర్యవేక్షించారు. -
సర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
– డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి బంగారుపాళెం: ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను బీఎల్వోలు వేగవంతంగా నిర్వహించాలని డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని జంబువారిపల్లె, తగ్గువారిపల్లె, బంగారుపాళెం, వేపనపల్లె పంచాయతీలలో నిర్వహిస్తున్న సర్ కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు. సర్ కార్యక్రమం గురించి బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. ఏన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు, డిజిటలేషన్ తీరుపై ఆరా తీశారు. డిజిటలేషన్లో వెనుకబడి ఉండడంపై బీఎల్వోలపై ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలన్నదే ‘ససర్’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అనర్హులు, మృతులు శాశ్వత వలసదారులు, ఒకటికి మించి ఎక్కువ ఓట్లు ఉన్నవారిని గుర్తించి తొలగించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలన్నారు. ఓటర్ల నుంచి తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాల వివరాలను డిజిటలేజేషన్ను ఎప్పటి కప్పుడు పూర్తిచేయాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందని గుర్తించుకోవాలన్నారు. సర్ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే బీఎల్వోలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్వేయర్ లావణ్య పాల్గొన్నారు. -
వైభవంగా సంకటహర గణపతి వ్రతం
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ఆస్థాన మండపంలో శుక్రవారం సంకటహర గణపతి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తుల రద్దీని దృష్టిలోఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో మొత్తం నాలుగు బ్యాచ్లుగా ఈ వ్రతాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారికి ప్రత్యే క పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే రాత్రి స్వామి వారిని స్వర్ణ రథంలో ఊరేగించారు. ఊరేగింపుగా వస్తున్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అడుగడుగునా కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. -
కాయ పండై.. రైతు పుండై..!
ఏడాదిలో ఎప్పుడో ఓసారి టమాటా బాక్సు రూ.1000 ఫలికి కోటీశ్వురులైనన రైతులు పదో పరకో ఉంటారు. వారిలాగే మనం కూడా టమాటాలో లక్షలు గడించాలని అప్పులు చేసి మరీ టమాటాను సాగుచేసి చేతులు కాల్చుకుంటున్న రైతులు వేలాది మంది ఉన్నారు. ఇక్కడ టమాటా సేద్యం జూదంగా మారింది. పలమనేరు: ఈసారి టమాటా రైతుకు సైతం మామిడి రైతు పరిస్థితే ఎదురైంది. మార్కెట్లో ధరలు పతనమయ్యాయి. కాయలమ్మితే కనీసం కూలీలు కూడా రావడం లేదు. పలమనేరు మార్కె ట్లో శుక్రవారం బాక్సు ధర గరిష్టంగా రూ.150, కనిష్టంగా రూ.70, సగటు ధర రూ.90గా పలికింది. ఈ ధరల్లో టమాటా కోసినా కనీసం కూలీలకు, రవాణా ఖర్చులకు డబ్బులు రావని రైతులు కాయలను కోయకుండా తోటల్లోనే వదిలేశారు. తోటల్లో ఎర్రటి సీరియల్ బుల్బుల్లా కనిపిస్తున్న టమాటాలను చూసిన జనం అయ్యో టమాటా రైతులకు ఎంత కష్టమొచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి లక్ష నష్టం ఎకరా పొలంలో టమాటా సాగు చేసేందుకు సుమారుగా రూ.2లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. ఎకరానికి వెయ్యి బాక్సుల దిగుబడి వస్తే ఇప్పుడున్న ధర రూ.100తో రూ.లక్ష వస్తుంది. దీంతో రైతుకు లక్ష నష్టంతోపాటు కుటుంబమంతా కష్టపడిన కూలి కూడా రానట్టే. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రెండువేల హెక్టార్లలో టమాటా సాగులో ఉంది. రైతు ఉత్పత్తులుకు ఎమ్మార్పీ ఉండదా? మార్కెట్లో దొరికే ప్రతి వస్తువుకు కంపెనీ నిర్ణయించే ఎమ్మార్పీ ధర ఉంటుంది. చివరకు గుండుసూదికి సైతఽం ధర ఉంటుంది. కానీ రైతుల పండించే ఉత్పత్తులకు మాత్రం ధర ఉండదు. రైతు చేసే వ్యవసాయం ద్వారా పరోక్షంగా పదిమంది బాగుపడుతున్నారు. కానీ రైతు మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నాడు. కోతకూలి కూడా దక్కదు టమాటా కాయలు కోసేందుకు వచ్చే కూలీలకు రూ.500 కూలి, వారి గ్రామం నుంచి తోట వద్దకు ఆటోలో తీసుకురావాలి. వారికి భోజనం పెట్టి తాంబూళం కూడా రైతులివ్వాల్సిందే. ఎకరా తోటలో పదిమంది కూలీలు కాయలు కోస్తే 50 బాక్సులు అవుతాయి. ఇప్పుడున్న బాక్సు ధర రూ.వందతో రూ.5వేలు దక్కుతుంది. ఇందులో మండీ నిర్వాహకులు పదిశాతం కమీషన్తో రూ.500 పట్టుకుని రూ.4,500 చేతికిస్తాడు. పదిమంది కూలీలకు రూ.500తో రూ.5వేలు, భోజనానికి రూ.500, మా ర్కెట్కు తీసుకొచ్చే లగేజి ఆటోకు రూ.500 మొత్తం కలిపి కోత ఖర్చు మాత్రమే రూ.6వేలు. రైతుకు అందిన బిల్లు రూ.4,500 దీంతో రూ.1500 నష్టం. దీని కి తోడు రైతు కష్టం పోయినట్టే. దీంతో తోటల్లోని కాయలను కోయకుండా రైతులు వదిలేస్తున్నారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
చిత్తూరు కలెక్టరేట్ : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం చిత్తూరులో డీఆర్వో మోహన్కుమార్కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్త, ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి మానుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్లే విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం సంభవించిదని మండిపడ్డారు. ఈ ప్రమాదంలో పదిమంది కార్మికుల ప్రాణాలు కోల్పోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంతో కార్మికులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ దాసరి చంద్ర, జిల్లా నాయకులు నాగరాజులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ప్లాంట్ను కాపాడుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంవత్సరాలుగా కార్మికులు పోరాడుతున్నా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్త నిర్ణయం ప్రకారం దశలవారీ పోరాటంలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆంజనేయులు, రాజా, ఏఐటీయూసీ నాయకులు విజయ్ కుమార్, రఘు, మణి తదితరులు పాల్గొన్నారు. -
‘అక్షర గోవిందం–అన్నప్రాసనం’ ప్రారంభం
తిరుపతి రూరల్: చిన్నారుల విద్యారంభాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో మంగళప్రదంగా ప్రారంభించే లక్ష్యంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘అక్షర గోవిందం–అన్నప్రాసనం’ కార్యక్రమం శుక్రవారం తిరుపతి శివారులోని శ్రీ వకుళామాత ఆలయంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర పాల్గొని చిన్నారులు ఆశీర్వదించారు. అనంతరం చిన్నారులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ‘అక్షర గోవిందం కిట్’లను ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మవారి సన్నిధిలో తయారైన ప్రసాదాలతో పలువురు చిన్నారులకు అన్న ప్రాసనం నిర్వహించారు. తిరుపతిలో సంస్కృత అకాడమీ తిరుపతి సిటీ: తిరుపతిలో సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, స్థలం కోసం టీటీడీకి లేఖ రాశామని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఎస్వీ గోశాల వద్దగల తెలుగు, సంస్కృత అకాడమీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకాడమీ ద్వారానే విద్యార్థులకు టెక్ట్స్ పుస్తకాలు సరఫరా ఉంటుందని, ప్రైవేటు సంస్థలు సైతం అకాడమీ పుస్తకాలనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తమిళనాడు తరహాలో వర్చువల్ అకాడమీ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి ఆదేశాల మేరకు డీపీఆర్ తయారు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ చైర్మన్గా ఉన్న లక్ష్మీపార్వతి చేసింది ఏమీ లేదన్నారు. పాలిసెట్ ఆప్షన్ ఎంట్రీకి నేడే ఆఖరు తిరుపతి సిటీ: పాలిసెట్లో అర్హత సాధించి పలు పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులు ఆన్లైన్లో ఆప్షన్ ఎంట్రీ చేసుకునే ప్రక్రియ శనివారంతో ముగియనుంది. 5వ తేదీ ఆదివారం ఆప్షన్స్ మార్పునకు అవకాశం ఇస్తూ 7వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో 8వ తేదీన రిపోర్టు చేసి తరగతులకు హాజరుకావాల్సి ఉంటుందని పాలిసెట్ అధికారులు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత తిరుపతి అర్బన్: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణరాజు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం బాలల హక్కుల పరిరక్షణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అన్ని విభాగాలకు చెందిన అధికారులతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని కోరారు. కమిషన్ సభ్యులు గాంధీబాబు, శ్రీనివాసమూర్తి, పద్మలత, డీఆర్వో నరసింహులు, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి, డీఎంఅండ్హెచ్వో బాలకృష్ణ నాయక్, బీసీ వెల్పేర్ అధికారి భరత్కుమార్ పాల్గొన్నారు. -
అవ్వాతాతల పేర్లు అడుగుతున్నారు
ఇతని పేరు సి.వాసు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీ, మారుతీనగర్, డోర్ నం.6–11–211లోని అద్దె గృహంలో నివాసం ఉంటున్నారు. భార్య లేదు. తల్లి, మైనర్ బాలుడుతో కలసి ఉంటున్నారు. వృత్తి రీత్యా అలిపిరి మెట్ల వద్ద చిన్న పాటి వ్యాపారం చేసుకుంటున్నారు. కాగా సర్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటి వద్దకు జూన్ మూడో వారంలో ఓటరు ప్రత్యేక సవరణలో భాగంగా ఆ ప్రాంత బీఎల్వో, స్వర్ణ వార్డు సిబ్బంది ఎన్యూమరేషన్ ఫారాలను ఇచ్చారు. వాటిని కొన్ని షరుతులకు అనుగుణంగా పూరించాలి. 2002లో ఓటరు జాబితాలో పేరు లేదని నాన్న లేదా తాత, అవ్వల పేర్లు, వారు లేని పక్షంలో మరణ ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని చెప్పారు. నాన్న పేరు గుర్తుందని, తాత, అవ్వల పేర్లు తెలివని చెప్పారు. ఇచ్చిన రెండు రెన్యూమరేషన్ ఫారాలను పూరించి రెండు ఫొటోలను అందించారు. ఇప్పటికి పదిహేను రోజులు దాటినా తాత, అవ్వల పేర్లు చెప్పాలని బీఎల్వో అడుగుతూనే ఉన్నారని చెబుతున్నారు. ఇంతకీ ఈ సవరణలో తమ ఓట్లు ఉంటాయా లేదా అనే అనుమానం వస్తోందని వాసు ఆవేదన చెందుతున్నారు. -
ఈఏపీసెట్ ర్యాంకర్లకు మిట్స్ సువర్ణ అవకాశం
కురబలకోట : ఈఏపీసెట్ ర్యాంకర్లకు అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక ఫీజు రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చాన్సలర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి బీటెక్లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. ఈఏపీసెట్ ర్యాంకర్లకు అనుగుణంగా వారి ప్రతిభ అధారంగా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అభ్యసించే సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అరుదైన సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఈసీఈ, సీఎస్ఈ, బయోఇన్ఫాటిక్స్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రోచాన్సలర్ నాదేళ్ల ద్వారకనాఽథ్, వీసీ యువరాజ్, రిజిస్ట్రార్ డి. ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. -
ట్రాన్స్కో అధికారుల పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో జిల్లా నోడల్ ఆఫీసర్, సీజీఎం శోభావాలంటీనా నగరంలో శుక్రవారం పర్యటించారు. కొంగారెడ్డిపల్లె సెక్షన్లోని సాయిబాబా ఫీడర్ను పరిశీలించారు. ఎనర్జీ ఆడిట్లో భాగంగా స్మార్ట్ మీటర్ల సరఫరాను అడిగి తెలుసుకున్నారు. ఎంత సరఫరా చేస్తున్నారు. అందుకు తగిన బిల్లులు వస్తోందని అని పరిశీలించారు. విద్యుత్ లాస్ వివరాలను తదితర విషయాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు, సర్వీసుల పనితీరును గమనించారు. అనంతరం సెక్షన్లో సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్, ఏఈ రాము, సిబ్బంది పాల్గొన్నారు. టీటీడీకి రూ.50.2 లక్షల విరాళం తిరుమల: తమిళనాడుకు చెందిన కేకేఎస్ కన్స్ట్రక్షన్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.50.2 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం చిత్తూరుకు చెందిన సురేష్కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. అలాగే చిలకలూరిపేటకు చెందిన చుండి రంగ నాయకులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 66,304 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,811 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. టీబీ నిర్మూలనపై సమీక్ష చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా క్షయవ్యాధి నియంత్రణ కార్యాలయంలో జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం అమలుపై శుక్రవారం జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్ఓ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ అరుత్ సెల్వన్ ముఖ్య అతిథిగా హాజరై టీబీ కేసుల గుర్తింపు, సేవల నాణ్యత, చికిత్స ఫలితాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎల్ఏటీఓ జి.వెంకట ప్రసాద్ జిల్లాలో కార్యక్రమ ప్రగతిని వివరించా రు. అనంతరం డాక్టర్ అరుత్ సెల్వన్ మాట్లాడుతూ.. 2030 నాటికి క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. బాధితులను త్వరితగతిన గుర్తించి నిరంతర చికిత్స అందించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీసీ, డీపీఎస్, పీపీఎం కోఆర్డినేటర్లు, ఎన్టీఈపీ సిబ్బంది పాల్గొన్నారు. మిస్భా తండ్రి ఆత్మహత్య పలమనేరు: గతంలో పలమనేరులో కాపురముంటూ పుంగనూరుకు వెళ్ళిన మిస్భా తండ్రి వజీర్ అహ్మద్(50) రెండ్రోజుల క్రితం అక్కడి కొత్తపేటలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 2022లో పలమనేరులో మిస్భా అనే బాలిక ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగాక మిస్భా కుటుంబం పుంగనూరుకు వెళ్ళిపోయింది. ఏం జరిగిందోగాని మిస్భా తండ్రి సైతం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పలమనేరులో చర్చనీయాంశమైంది. విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి గంగవరం: కూలి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మిద్దైపె నుంచి కింద పడ్డ వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలో శుక్రువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గంగవరం మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో నివాసం ఉంటున్న మహదేవ(65)కు కూలి పనులే జీవనాధారం. గురువారం డ్రైవర్స్ కాలనీ వద్ద కూలి పనులకు వెళ్ళాడు. ఇంటి మిద్దైపె పనిచేస్తుండగా ప్రమా దవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై మిద్దైపె నుంచి కిందికి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వృద్ధుడిని హుటాహుటిన పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చైన్నెకి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రువారం మృతిచెందాడు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టోల్ ప్లాజా సిబ్బందిపై అధికార పార్టీ నేతల దౌర్జన్యం
వి.కోట : టోల్ ప్లాజా సిబ్బందిపై అధికార పార్టీ నేతల అనుచరులు దాడిచేసిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని దానమయ్యగారిపల్లి టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. మండలంలోని మద్దిరాళ్ళ గ్రామానికి చెందిన దళిత యువకుడు మంజునాథ్ టోల్ప్లాజాలో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి అధికార పార్టీ నేతలు, అనుచరుల వాహనాలు పలమనేరు నుంచి వి.కోట వైపునకు వచ్చాయి. నేతల వాహనాలు ఎటువంటి రుసుం తీసుకోకుండా టోల్ ప్లాజాలో వదిలేశారు. అనుచరుల వాహనాలను మంజునాథ్ ఆపాడు. దీంతో రెచ్పిపొయిన అనుచరులు వాహనం ఆపి ‘మా వాహనాలనే ఆపుతావా.. నీకు ఎంత ధైర్యం’ అంటూ మూకమ్మడిగా పిడిగుద్దులు గుద్ది అతనిపై దాడిచేశారు. టోల్ సిబ్బంది నిరసన ఘటనతో అగ్రహించిన టోల్ సిబ్బంది విధులను బహిష్కరించి టోల్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. గతంలో కూడా నాయకులు ఇలాగే తమపై దాడిచేశారని, పోలిసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంట పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపొకలకు అంతరాయం ఏర్పడి వాహనాలు కీలోమీటరు మేర బారులు తీరాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ షేక్వలి సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బందితో చర్చించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సిబ్బంది నిరసన విరమించారు. -
60 కొబ్బరి మొక్కల నరికివేత
ఐరాల: మండలంలోని కోళ్లపల్లె సమీపంలోని వ్యవసాయ పొలంలో తమ 60 కొబ్బరి మొక్కలను నరికివేశారని బాధిత దంపతులు సుబ్రమణ్యంరెడ్డి, చంద్రమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ కోళ్లపల్లె రెవెన్యూ పరిధిలో మూడెకరాల వ్యవసాయ భూమిలో తన పేరిట కొంత భూమిని పెట్టుకుని, మిగిలిన భూమిని తన ఇద్దరు కుమారులకు పంచిపెట్టామని తెలిపారు. కాగా తన మొదటి భార్య చనిపోవడంతో చంద్రమ్మను రెండో వివాహం చేసుకున్నాని చెప్పారు. చంద్రమ్మకు కుమారుడు నిరంజన్రెడ్డి, కుమార్తె మౌనిక సంతానం కలిగారని తెలిపారు. రెండేళ్ల క్రితం తన పెద్ద కుమారుడు నరేష్రెడ్డి ఇంటిలో నుంచి గెంటేశాడని వాపోయారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తన రెండో భార్య కుమారుడు నిరంజన్రెడ్డి చిత్తూరు నగరంలోని సంతపేటలో అద్దె ఇంటిలో ఉంచి తమ సంరక్షణ చూసుకుంటున్నాడని తెలిపారు. సంవత్సరం క్రితం నిరంజన్రెడ్డికి సంక్రమించిన ఆస్తిలో మామిడి, కొబ్బరి చెట్లను నరేష్రెడ్డి దౌర్జన్యంగా నరికివేసిన ఘటనపై తన రెండో కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. కాగా గ్రామ పెద్దలు మధ్యస్తం ద్వారా రాజీ చేసినట్లు చెప్పారు. శుక్రవారం మరోసారి పొలంలో ఉన్న సుమారు 60 కొబ్బరి మొక్కలను నరేష్రెడ్డి దౌర్జన్యంగా నరుకుతుండగా, తాను, తన భార్య అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కత్తితో నరికి చంపుతానని బెదిరించాడని వాపోయారు. ప్రాణ భయంతో డయల్ 112కు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. -
విఫల రాజు
మామిడి రైతులకు కష్టాలొచ్చాయి. చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామంటే ఫ్యాక్టరీల యజమానులు దగా చేస్తున్నారు. సాకులు చెప్తూ కొనుగోళ్లకు బ్రేకులు వేస్తూ రైతుల పొట్టగొడుతున్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని పల్ప్ ఫ్యాక్టరీల యజమానులు ఆడుతున్న నాటకాలకు సామాన్య రైతు నిలువునా మునుగుతున్నాడు. యంత్రాలు ‘రిపేర్’ అంటూ తోతాపురి కాయల కొనుగోళ్లను అర్ధంతరంగా నిలిపివేయడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది. మరోవైపు ఫ్యాక్టరీలు తోతాపురిని పక్కన పెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాణిపాకం: తోతాపురి మామిడి రైతు కోలుకునే పరిస్థితి కనబడడం లేదు. కాయలను గుజ్జు ఫ్యాక్టరీలు కొంటాయనే ఆశతో వారం రోజులుగా వందలాది ట్రాక్టర్లతో రైతులు ఫ్యాక్టరీల ముందే పడిగాపులు కాస్తున్నారు. ఓ వైపు ఎండలో రోజుల తరబడీ ట్రాక్టర్లోనే ఉండడంతో కాయలు ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. ఒక్కో ట్రాక్టర్లో 4 నుంచి 5 టన్నుల లోడ్ ఉంటే.. తీరా అన్లోడింగ్ చేసే సమయానికి దాదాపు 2 టన్నుల కాయలు కుళ్లిపోయి వృథాగా మారుతున్నాయి. కళ్ల ముందే పంట కుళ్లిపోతుంటే ఏం చేయాలో పాలుపోక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే తీరా నీలం కొంటామని ఫ్యాక్టరీలు బోర్డు పెట్టడంతో రైతులు మండిపడుతున్నారు. టార్గెట్ పూర్తి కాకుండానే చేతులెత్తేశారు జిల్లా వ్యాప్తంగా 59 వేల హెక్టార్లలో మామిడి సాగవగా, అందులో సింహభాగం అంటే 41 వేల హెక్టార్లలో తోతాపురి రకమే ఉంది. ఈ ఏడాది ఉద్యానశాఖ అధికారులు 4.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లాలోని 35 పల్ప్ ఫ్యాక్టరీల ద్వారా కనీసం 3.60 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. ఇంకా లక్ష్యానికి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మిగిలి ఉండగానే.. అప్పుడే గంగాధర నెల్లూరులోని ఫ్యాక్టరీలు తోతాపురిని పక్కన పెట్టేసి చేతులెత్తేయడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకుల సిఫార్సులు.. అధికారుల ఉత్తుత్తి తనిఖీలు సామాన్య రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఉద్యానశాఖ అధికారులు మాత్రం ఉత్తుత్తి తనిఖీలతో కాలక్షేపం చేస్తూ రైతుల బాధలను గాలికొదిలేశారు. దీనికి తోడు ఫ్యాక్టరీల్లో అధికార పార్టీ నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులున్న పెద్దల కాయలను మాత్రమే ఫ్యాక్టరీల యాజమాన్యాలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేశాయని, వెనుక ఎవరూ లేని సామాన్య చిన్న, సన్నకారు రైతుల కాయలను మాత్రం రోడ్డు పాలు చేశారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతలను నట్టేట ముంచుతున్న ఫ్యాక్టరీలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, తోతాపురి కొనుగోళ్లను పునఃప్రారంభించాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. -
ప్రాణదాన పథకానికి 261 మంది ఎంపిక
తిరుపతి తుడా: టీటీడీ ప్రాణదాన పథకం కింద స్విమ్స్లో పేదరోగులకు ఉచిత శస్త్ర చికిత్సల కోసం 261 మంది రోగులను ఎంపిక చేసినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. గురువారం స్విమ్స్లో డైరెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎంపిక ప్రక్రియలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, బర్డ్ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రామూర్తి, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, రుయా హాస్పిటల్ డాక్టర్ సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ఇందులో ఎనిమిది మంది కార్డియాలజీ, 25 మంది కార్డియో థోరాసిక్, 14 మంది జనరల్ సర్జరీ, 16 మంది, మెడిసన్, 76 మంది నెఫ్రాలజీ, 9 మంది న్యూరాలజీ, 45 మంది న్యూరో సర్జరీ, నలుగురు గైనకాలజీ, ఒకరు రేడియాలజీ, నలుగురు రేడియేషన్ అంకాలజీ, 48 మంది గ్యాస్ట్రో ఎంట్రాలజీ, 10 మంది సర్జికల్ అంకాలజీ, ఒకరు యురాలజీ రోగులు ఉన్నట్టు వెల్లడించారు. -
మామిడి రైతు నోట్లో మట్టి!
కాణిపాకం: కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన కుదరడం లేదు. తోతాపురి మామిడి కిలోకు రూ.4 సబ్సిడీ ఇస్తామని కోతలు కోసిన పెద్దలు అందులో సగం భారాన్ని కేంద్రంపైకి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా తమ ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా, రైతులకు చేకూరుస్తున్న అదనపు ప్రయోజనం ఏమీ లేదనే పచ్చి నిజం బయటపడింది. 8.65 లక్షల టన్నుల దిగుబడి ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలో 8.65 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో స్పందించిన కేంద్రం 25 శాతం లోపు అంటే 2.16 లక్షల టన్నులకే సబ్సిడీ ఇస్తామని మెలిక పెట్టింది. మిగిలిన 6 లక్షల టన్నులకు పైగా ఉన్న పంట పరిస్థితి ఏమిటని అన్నదాతలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం అండగా నిలిచింది గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఆనాడు మొత్తం రూ.176 కోట్ల సబ్సిడీ అందితే, అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 94.16 కోట్లు భరించి రైతులను ఆదుకుంది. నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రం కిలోకు ఇచ్చే రూ.2.18ల లబ్ధిని కూడా తామే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. చేతులెత్తేసిన కూటమి సర్కార్ రాయలసీమ వ్యాప్తంగా మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, గురుమూర్తి చొరవ తీసుకుని కేంద్రానికి లేఖలు రాశారు. ఇక్కడి రైతుల దయనీయ స్థితిని వివరించారు. దీంతో కేంద్రం స్పందించింది. మార్కెట్ ఇంట్రవెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) కింద కిలోకు రూ.17.47 మద్దతు ధర ప్రకటించింది. అందులో 25 శాతం రూ.4.36 సబ్సిడీగా ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఇందులో సగం వాటా రూ.2.18లను భరిస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.4 సబ్సిడీ ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది. కేంద్రం ఇస్తున్న వాటాను దాచి పెట్టింది. గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కంటే ఈ ప్రభుత్వం అదనంగా ఇస్తున్నదేమీ లేదని అధికారులు స్పష్టం చేస్తుండడం గమనార్హం. -
అయోమయం.. గందరగోళం!
తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో అధికారులు చేపట్టిన అడ్మిషన్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా అధికారులు అడ్మిషన్ల ప్రక్రియను సాగదీస్తూ నరకం చూపిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ సాధారణంగా రెండు విడతలు పూర్తి చేసి మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లతో భర్తీ చేసే సంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగేది. అలాంటిది ఈ ఏడాది విచిత్రమైన రీతిలో ఇటు విద్యార్థులకు, అటు తల్లిదండ్రులకు చుక్కలు చూపుతూ నాలుగు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియను గురువారానికి పూర్తి చేశారు. అయినా ఇప్పటికీ ఎస్వీ జూనియర్ కళాశాలలో 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. పద్మావతి జూనియర్ కళాశాలలో 70 శాతం సీట్లు భర్తీ అయినట్లు తెలుసుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు పెట్డం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదో విడత ఉంటుందా? టీటీడీ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. నాలుగు విడతల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి విమర్శలు ఎదుర్కొంటున్న అధికారులు మిగిలిన సీట్ల భర్తీ కోసం ఐదో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగిస్తారా..? లేక స్పాట్ అడ్మిషన్లకు వెళతారా అనే సందేహం వ్యక్తమవుతోంది. సీట్ల కోసం వ్యవ ప్రయాసల కోర్చి కళాశాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న తల్లిదండ్రుల ఆవేదనను అధికారులు దృష్టిలో ఉంచుకుని స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని కోరుతున్నారు. ప్రవేశాల ఎస్వీ పద్మావతి ప్రక్రియ జూనియర్ జూనియర్ కళాశాల కళాశాల తొలివిడతలో 172 252 రెండో విడతలో 103 191 మూడో విడతలో 81 128 నాల్గో విడతలో 140 45 మొత్తం సీట్ల సంఖ్య 968 792 ఇప్పటివరకు భర్తీఅయిన సీట్లు 401 711 మిగిలిన సీట్ల సంఖ్య 391 257 -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
కుప్పం రూరల్ : పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులు ఐకమత్యంగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం పరిశ్రమలకు భూములు ఇచ్చిన పొగురుపల్లి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి వచ్చిన 33 సమస్యలపై అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలన్నారు. కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని పేర్కొన్నారు. పెద్ద ఇండస్ట్రియల్ పార్కు వస్తుండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, మౌలిక వసతులు వస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఈ గ్రామానికి వస్తున్నారని, ఆయన రైతులతో మాట్లాడతారని చెప్పారు. ఆయనతో సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడా ఏపీడీ శ్రీనివాసరాజు, ఆర్డీవో షేక్ మహ్మద్ హుస్సేన్, తహసీల్దారు సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీలో ఖాళీల భర్తీకి సన్నాహాలు
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్రంలో ఉద్యోగుల నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమల్లోకి వచ్చాయి. జిల్లాలో ఉద్యోగుల స్థానికతను నిర్ణయించే ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్కు శాఖకు చెంది జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ లోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశిస్తూ ఫ్రీజింగ్ను ప్రభుత్వం సడలించింది. దీంతో జిల్లాలోని సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లకు పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాలు రూపొందిస్తున్నారు. జూన్ 30వ తేదీన పలువురు ఉద్యోగ విరమణ చేశారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా ఆ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులు జెడ్పీ పరిధిలోని 65 మంది మండల పరిషత్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారిని కొత్త జిల్లాలైన తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఏర్పాటు కానున్న జెడ్పీ కార్యాలయాలకు కేటాయించనున్నారు. జెడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం సెప్టెంబరులో ముగియనుంది. అనంతరం కొత్తగా తిరుపతి, అన్నమయ్య జెడ్పీలను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. చిత్తూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏ జిల్లాకు వెళ్లాల్సి వస్తుందోనని కంగారుపడుతున్నారు. ఉద్యోగ విరమణతో ఖాళీలు జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల పరిపాలన అధికారులు (ఏవోలు) 15 మంది జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి ఆ స్థానాలను భర్తీ చేయనున్నారు. అలాగే సీనియర్ అసిస్టెంట్లు 12 మంది, జూనియర్ అసిస్టెంట్లు 10 మంది ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ స్థానాల్లో ఆఫీసు సబార్డినేట్లు, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి నియమించనున్నారు. ఈ మేరకు జాబితాలు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో జూలై 5 తర్వాత ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై నిషేధం అమల్లోకి వస్తోంది. -
గుడుపల్లెలో ఫుట్వేర్ కంపెనీ
చిత్తూరు కలెక్టరేట్ : కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో దక్షిణ కొరియాకు చెందిన హ్వాసెంగ్ ఫుట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.898 కోట్ల పెట్టుబడితో నాన్ లెదర్ ఫుట్వేర్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానుందని, మూడు దశల్లో అమలు చేస్తారని వివరించారు. ఈ ప్రాజెక్ట్ను సీఎం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 11న లోక్ అదాలత్ చిత్తూరు అర్బన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాల త్ నిర్వహించనున్న ట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. రాజీ చేసుకోదగ్గ కేసులను లోక్ పదాల తో పరిష్కరించుకోవాలని సూచించారు. కక్షిదారులు, న్యాయవాదులు పోలీసు శాఖ, బీమా ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగాల అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 కోర్టుల్లో ప్రత్యేక అదాలత్ బెంచులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ సూపరింటెండెంట్ల బదిలీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లను బదిలీ చేశా రు. ఈ మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాల సూపరింటెండెంట్గా పనిచేస్తున్న కృపావతిని అన్నమయ్య జిల్లా మదనపల్లి డీఈవో కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమె స్థానంలో వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్ఎస్ఏ సూపరింటెండెంట్ ప్రేమకుమారిని నియమించారు. నేడు పీజీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : హైస్కూల్ ప్లస్లలో ఖాళీ గా ఉన్న పీజీటీ పోస్టుల భర్తీకి అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ కోసం స్కూ ల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితా సిద్ధమైందని పేర్కొన్నారు. అందులో అభ్యంతరాలుంటే ఉదయం 11 గంటలలోగా తగిన ఆధారాల తో తెలపాలని పేర్కొన్నారు. పీజీటీ పోస్టుల కోసం 250కి పైగా దరఖాస్తులను అధికారులు గురువారం పరిశీలించినట్టు తెలిపారు. 13 లోపు ఫీజు చెల్లించాలి తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సులకు సంబంధించి సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల చివరిలో నిర్వహించడం జరు గుతుందని, విద్యార్థులు పరీక్ష ఫీజును ఈ నెల 13వ తేదీ లోపు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేన్స్ డాక్టర్ రాజామాణిక్యం తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు. -
ఇదెక్కడి న్యాయం
అనర్హులంటున్నారు.. చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హైస్కూల్ ప్లస్ పాఠశాలలు 50 ఉన్నాయి. వీటిలో పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీకి విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పోస్టుల నియామకాల్లో అన్ని రకాల విద్యార్హతలు, సుదీర్ఘ సర్వీస్ ఉన్నప్పటికీ మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెచ్ఎంలను అనర్హులుగా అధికారులు ప్రకటిస్తున్నారు. సీనియర్ స్కూల్ అసిస్టెంట్ కేడర్లో ఉన్న తమపై వివక్ష చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతపు బదిలీలే శాపం 2025లో బదిలీల్లో స్కూల్ అసిస్టెంట్ కేడర్లో ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు పూర్తయిన వారిని, రేషనలైజేషన్లో పోస్టులు కోల్పోయిన వారు మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను ఎంపిక చేసుకునేలా అధికారులు ఒత్తిడి తెచ్చారు. జిల్లా స్థాయిలో సీనియారిటీ జాబితాను పరిశీలిస్తే మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను వారి పాత సబ్జెక్టుల సీనియారిటీ జాబితాలోనే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రాథమిక పాఠశాలల బాధ్యతలను మోయాల్సి వస్తోంది. -
వైభవం.. ప్రసన్నుడి రథోత్సవం
పుత్తూరు: అప్పలాయగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు గురువారం శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు పట్టుపీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలతో ముగ్దమనోహర రూపంలో స్వామి, అమ్మవార్లు రథారోహణం చేశారు. అనంతరం 9.25 నుంచి మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాలు, అశేష భక్తజన గోవిందనామ స్మరణలతో ఆలయ మాడవీధుల్లో రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కిలిపి విశ్వరూప దర్శనం, తోమాలసేవ, కొలువు, అర్చన, మొదటి గంట తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతించారు. 8 గంటలకు పుణ్యాహవచనము, నవగ్రహపూజ నిర్వహించారు. 11.30 గంటల నుంచి మద్యాహ్నం 12.30 వరకు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు భక్తి కీర్తనల ఆలాపనల మధ్య స్వామివారి ఊంజల్ సేవ కనుల పండుగగా సాగింది. అనంతరం శ్రీవారు వాహన మండపంలోకి వేంచేపు చేశారు. అశ్వంపై నుంచి అభయమిచ్చిన ప్రసన్నుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు శ్రీవారు అశ్వవాహనంపై పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళభరిత పుష్పమాలికలతో విహరిస్తుండగా అశేష భక్తజనం గోవిందనామ స్మరణలతో మాడవీధులు మార్మోగాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, యువతుల ఆనందడోలికల కోలాటం నడుమ స్వామివారు అశేష భక్తజనానికి అభయమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు నారికేళ, కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారిని కనులారా దర్శించుకొన్నారు. వాహన సేవ అనంతరం స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు వాహన సేవల ముందు హిందూ ధర్మప్రచార ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన వివిధ భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వాహన సేవలను కంకణ భట్టర్ సూర్యకుమారాచార్యుల బృందం నిర్వహించగా, కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు: బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పల్లకీ ఉత్సవం. 1.30 నుంచి 10.45 గంటల వరకు తీర్థవారి చక్రస్నానం. రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు నిర్వహించే ధ్వజావరోహణంతో ప్రసన్న వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం అవుతాయి. ‘‘మానవుని శరీరమే రథం, ఆత్మ రథికుడు, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. శ్రీవారు అధిరోహించిన రథోత్సవాన్ని తిలకించే వారికి కలిగే తత్వజ్ఞానమిదే.’’ -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 78,067 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,158 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. అక్షర గోవిందానికి సర్వం సిద్ధం తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ పంచాయతీలో ఉన్న టీటీడీ ఆధీనంలో ఉన్న శ్రీ వకుళామాత సన్నిధిలో శుక్రవారం అక్షర గోవిందం – అన్నప్రాసన కార్యక్రమం నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు టీటీడీ జేఈవో ఎ.శరత్ గురువారం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు వేదోక్తంగా అక్షరాభ్యాసం, అన్నప్రాశన నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి రోజు నమోదు చేసుకున్న 25 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో నిర్ణీత సమయానికి హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్ర మం నిరంతరం కొనసాగుతుందని, పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అక్షర గోవిందంలో పా ల్గొనే ప్రతి చిన్నారికీ ఉచితంగా ‘అక్షర గోవిందం’ కిట్ అందజేయనున్నట్లు తెలిపారు. 4 నుంచి ఆలయ అర్చకుల పర్యవేక్షణలో.. జూలై 4వ తేదీ నుంచి ఒక్క మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు ఒక్కో బ్యాచ్కు 25 మంది చొప్పున రెండు బ్యాచ్లకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్టు జేఈవో వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. చంద్రగిరి ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు రామచంద్రాపురం: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన అసభ్య పదజాలాన్ని ఖండిస్తూ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ ఢిల్లీరాణి భానుకుమార్ తదితరులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు వినతిపత్రం అందజేశారు. పులివర్తి నాని చేసిన వ్యాఖ్యలు, ఫోన్ సంభాషణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజా ప్రతినిధిగా ఉండి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఫోన్ కాల్ రికార్డులు, ఆడియోల ఆధారాలను పరిశీలించి ఎమ్మెల్యే పులివర్తి నానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పంచవటి జ్యోతి, యశ్వంత్రెడ్డి, పవన్కుమార్రెడ్డి, ఓబుల్రెడ్డి, సెంథిల్కుమార్, భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డి, బాబురెడ్డి, సతీష్రెడ్డి, ఇరగమరెడ్డి, చిరంజీవినాయుడు, మధు, భాస్కరయ్య పాల్గొన్నారు. దేశ భవిష్యత్తును నిర్దేశించేవి పరిశోధనలే తిరుపతి సిటీ: భారత భవిష్యత్తును పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలే నిర్దేశిస్తాయని జాతీయ భద్రతా మండలి సభ్యులు, మాజీ డీఆర్డీఏ చైర్మన్, ఏరోస్పెస్ శాస్త్రవేత్త డాక్టర్ జీ.సతీష్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఎస్వీయూను సందర్శించి ఆయన సెనెట్ హాల్లో దేశంలో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశోధనాభివృద్ధి అకాడెమియా పాత్ర అనే అంశంపై జరిగిన ఉపన్యాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయాలు కేవలం బోధనకే పరిమితం కాకుండా సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలు, పారిశ్రామికాభివృద్ధి, జాతీయ అభివృద్ధికి కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. వీసీ నర్సింగరావు నాయకత్వంలో విశ్వవిద్యాలయం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పరిశోధన ప్రయోగశాలలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, అంతరశాఖ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ప్రశ్నోత్తర కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఏరోస్పేస్, రక్షణ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్లు, పరిశోధనా అవకాశాలు, భవిష్యత్ సాంకేతిక రంగాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమగ్ర సమాధానాలు ఇచ్చారు. వీసీ ప్రొఫెసర్ నర్సింగరావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, డీన్ చెండ్రాయుడు పాల్గొన్నారు. -
యూపీఎస్సీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి సత్తా
పలమనేరు: ఇటీవల యూపీఎస్సీ చేపట్టిన నియామకాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సోమల మండలం రాశెట్టివారిపల్లికి చెందిన రాశెట్టి సదాశివయ్య, పార్వతమ్మ దంపతుల కుమారుడు రాశెట్టి మంజునాథ్ సత్తా చాటాడు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలో సహాయ సంచాలకుడిగా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయనకు గురువారం నియామపక పత్రం అందింది. మంజునాథ్ యూపీఎస్సీ మెయిన్స్లో విజయం సాధించి పలుమార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి కొన్ని మార్కుల్లో ఉద్యోగాలను పొందలేకపోయారు. గతేదాడి కూడా ఇంటర్వ్యూలో ఒక మార్కుతో అవకాశాన్ని కోల్పోయాడు. వెయిటింగ్ లిస్ట్లో ఇతనికి కేంద్ర ప్రభుత్వ గ్రూప్–ఏ గెజిటెడ్ హోదా కలిగిన పోస్టు దక్కింది. దీంతో కుటుంభ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కుంగిపోకుండా ప్రయత్నించాలి యూపీఎస్సీ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూలో ఓడాను. మొక్కవోని దీక్షతో మళ్లీ ప్రయత్నించాను. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేటి యువత పరాజయాలకు కుంగిపోకుండా ప్రయత్నిస్తే విజయం దక్కుతుంది. – రాంశెట్టి మంజునాథ్ -
మామిడి అలా... టమాట ఇలా!
జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. మామిడి కాయలకు సరైన ధర అందలేదు. రైతులు కాయలను చెట్లలోనే వదిలేశారు. అలాగే టమాట పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎప్పుడు ధర ఉంటుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియని అయోమయ స్థితి. ఈ రెండు పంటలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వేలాది మంది రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకకు, ఇక్కడికీ ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుచేస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. పలమనేరు: జిల్లాలో 58 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. వాటిలో 40 వేల హెక్టార్లలో తోతాపురి రకం సాగులో ఉంది. రైతులు 40 వేల మంది వరకు ఉన్నారు. గతేడాది ధరల్లేక మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా ధరలు నేలచూపులు చూస్తున్నాయి. పల్ప్ ఫ్యాక్టరీల వద్ద మామిడి బండ్లు అన్లోడింగ్ కావడంలేదు. ర్యాంపుల వద్ద పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వం ధర పెంచకుండా ప్రోత్సాహకం ఇస్తున్నామంటూ చేతులుదులుపుకుంది. దీంతో ఎక్కువ మంది రైతులు కాయలను తోటల్లోనే వదిలేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మామిడి కిలో రూ.17 ఉంటే గాని రైతులకు గిట్టుబాటు కాదు. కాయలను కోసి ఫ్యాక్టరీలకు వద్దకు తీసుకువచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా మారింది. సకాలంలో అన్లోడింగ్ కాకపోవడంతో సకానికి పైగా కాయలు కుళ్లిపోతున్నాయి. ట్రాక్టర్ల అద్దె, కూలీల ఖర్చు, పెట్టుబడి ఏదీ వచ్చే పరిస్థితి లేదని రైతులు కుమిలిపోతున్నారు. కర్ణాటకలో ధరలు బాగున్నాయి కర్ణాటకలో తోతాపురి మామిడి ధర కిలో రూ.17.50 ఉంది. ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన ధర కిలో రూ.7.50లు. కిలోకు రూ.10 వ్యత్యాసం. ఇక్కడ టమాటా బాక్సు రూ.200 ఉండగా పక్కనే ఉన్న కోలారు టమాట మార్కెట్లో బాక్సు రూ.400 పలుకుతోంది. ఇక్కడికి.. అక్కడికి రూ.200 వ్యత్యాసం. ఇలా పక్కపక్కనే ఉన్న రాష్ట్రాల్లో ధరల్లో ఇంత భారీ తేడా ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. హార్టికల్చర్ హబ్ ఏమైందో.. గత ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాను హార్టికల్చర్ హబ్గా చేస్తామని ప్రకటించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తామని, వ్యవసాయాన్ని పండగలా మార్చేస్తామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఇజ్రాయేల్కంటే మిన్నగా హార్టికల్చర్ హబ్గా మార్చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా వాటి ఊసేలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ధరల్లేక పడేసిన మామిడి కాయలు పలమనేరు సమీపంలోని హైవేలో పడేసిన టమాటాలు(ఫైల్) భారీగా ధరలు పతనం లాటరీగా మారిన టమాట జిల్లాలోని పడమటి ప్రాంతాలైన పలమనేరు, కుప్పంలో టమాట సాధారణ సాగు 20 వేల హెక్టార్లలో ఉంది. సుమారు 30 వేల నుంచి 40 వేల మంది రైతులు సీజన్తో సంబంధం లేకుండా టమాటాను సాగు చేస్తుంటారు. ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఎకరా పొలంలో టమాట సాగుకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. ఆ లెక్కన బాక్సు ధర రూ.400 ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. రెండు నెలల్లో పది రోజుల పాటు బాక్సు ధర రూ.500 వరకు పలికింది. మళ్లీ ధరలు పడిపోయి రూ.150 నుంచి రూ.200 లకు చేరింది. ధరలు ఎప్పుడు ఉంటాయో తెలియని అయోమయం నెలకొంది. ఇప్పుడున్న ధరలతో రైతు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రానట్టే. -
డెంగీ దడ!
డెంగీ వివరాలు సంవత్సరం డెంగ్యూ 2022 179 2023 235 2024 307 2025 2026(జూన్ 26 వరకు) 116 వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్ల మధ్యలో పల్లపు ప్రాంతాల్లో నీరు నిలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా యాంటీ డెంగీ నివారణ మాసోత్సవం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో నివారణ చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించినా గ్రామాలు, పట్టణాల్లో చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా పేరుకుపోయిన మురుగు, నీటి తొలగింపు చేపట్టకపోవడం, ఫాగింగ్ లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికున్గునియా జ్వరాలు ప్రబలుతాయన్న భయం వెంటాడుతోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువలు, గుంతలు, ఖాళీ స్థలాలు, ఇంటి పరిసరాల్లోని పాత్రల్లో నీరు నిల్వ ఉంటోంది. ఇవి డెంగీ వ్యాప్తికి కారణమయ్యే దోమల పెంపక కేంద్రాలుగా మారుతున్నాయి. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, పట్టణాల్లో మురుగు నీరు నిల్వ ఉండడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. జిల్లాలో అనేక గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. సకాలంలో చెత్తను తొలగించకపోవడం, మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిర్యాదు చేస్తున్నా స్థానిక సంస్థల అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోమల నివారణలో కీలకమైన ఫాగింగ్ చేయడం లేదు. ఫలితంగా దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికే పరిమితమైన మలేరియా శాఖ డెంగీ, మలేరియా నియంత్రణకు మలేరియా శాఖ తీసుకుంటున్న చర్యలు క్షేత్ర స్థాయిలో పెద్దగా కనిపించడం లేదని పలువురు అంటున్నారు. అడపాదడపా అవగాహన కార్యక్రమాలు, తనిఖీలతోనే సరిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించాల్సిన ’ఫ్రైడే–డ్రైడే’ కూడా చాలా చోట్ల ఫొటోలకు పరిమితమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయడం, నిల్వ నీటిని తొలగించడం, ఫాగింగ్ను ముమ్మరం చేయడం, గ్రామాలు–పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడం అత్యవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలతో దండెత్తిన దోమలు -
దోపిడీకి స్కెచ్!
తోతాపురి రకం మామిడి కిలోకు ప్రభుత్వం ఇచ్చే రూ.4 ప్రోత్సాహక నిధిని స్వాహా చేయడానికి ముఠాలు కన్నేశాయి. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రాకముందే జిల్లాలోని కొన్ని ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద బోగస్ బిల్లుల కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు ర్యాంపుల నిర్వాహకులు కాయలు విక్రయించకుండానే బిల్లులు సిద్ధం చేస్తామని, ఆధార్, పట్టాదారు పాస్పుస్తకం, బ్యాంకు పాస్బుక్ ఉంటే చాలని రైతులను ప్రలోభపెడుతున్నట్లు సమాచారం. దీంతో ఈ సారి కూడా ప్రోత్సాహక నిధిలో భారీ గోల్మాల్ జరిగే అవకాశాలపై ఉద్యానశాఖలో ఆందోళన నెలకొంది. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో గత ఏడాది 25 మామి డి కొనుగోలు ర్యాంపులు ఉండగా ఈ సారి 42 పుట్టుకొచ్చాయి. వీటిలో కొన్నింటి కార్యకలాపాల పైనే అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల నుంచి కాయలు కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లు బిల్లులు సృష్టించే అవకాశం ఎక్కువగా ర్యాంపుల ద్వారానే ఉంటుందని భావిస్తున్నారు. ఫ్యాక్టరీల కంటే ర్యాంపుల్లో పర్యవేక్షణ లేకపోవడం కూడా అక్రమాలకు అవకాశంగా మారుతోంది. ఈసారి అధికారులకు ముందే సమాచారం ఈ ఏడాది అక్రమాలకు సంబంధించిన సంకేతాలు ముందుగానే ఉద్యానశాఖ అధికారులకు చేరుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ర్యాంపులు, ఫ్యాక్టరీలు రైతుల నుంచి ముందుగానే పత్రాలు సేకరిస్తున్నారన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతమున్న ర్యాంపులు, ఫ్యాక్టరీలన్నింటినీ పర్యవేక్షించేందుకు ఉద్యానశాఖ వద్ద తగిన సిబ్బంది లేరు. ఉన్న వారితోనే అన్ని కేంద్రాలను పరిశీలించడం అసాధ్యంగా మారింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో అక్రమాలను ఎలా అరికట్టాలనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కట్టుదిట్టమైన చర్యలే పరిష్కారం గతేడాది వెలుగులోకి వచ్చిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యక్ష పర్యవేక్షణ, రైతుల భూముల ధృవీకరణ, జియో ట్యాగింగ్, డిజిటల్ తూకం నమోదు, ఒకే రైతు పేరుతో బహుళ బిల్లులను నిరోధించే సాఫ్ట్వేర్ వ్యవస్థ తీసుకువస్తేనే అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు, రైతు సంఘాల నేతలు సూచిస్తున్నారు. మామిడి ప్రోత్సాహక నిధిపై మళ్లీ ముఠాల కన్ను -
గతేడాది బట్టబయలైన గోల్మాల్
గతేడాది జిల్లాలోని 31 ఫ్యాక్టరీలకు 49,350 మంది రైతులు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కాయలు సరఫరా చేసినట్లు అధికారిక లెక్కలు నమోదయ్యాయి. అలాగే 25 ర్యాంపుల ద్వారా 30,600 మంది రైతులు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు విక్రయించినట్లు బిల్లులు సమర్పించారు. అనంతరం జరిగిన పరిశీలనలో సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల కాయల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకే రైతు పేరుతో రెండు వేర్వేరు ర్యాంపుల్లో బిల్లులు సమర్పించడం, మామిడి తోటలే లేని వారి పేర్లతో కొనుగోళ్లు చూపించడం, నీలం రకం మామిడిని తోతాపురి రకంగా చూపించి ప్రోత్సాహక నిధి పొందడం, కాయలు తరలించకుండానే కొనుగోలు జరిగినట్లు రికార్డులు సృష్టించడం వంటి అక్రమాలు బయటపడినట్లు సమాచారం. కొందరు మధ్యవర్తులు రైతుల వివరాలను సేకరించి వారి పేర్లతోనే బిల్లులు రూపొందించినట్లు ఆరోపణలు వినిపించాయి. -
ఫోన్లు చేసి మరీ ఒప్పించారు.. నేడు రోడ్డున పడేశారు!
2025 బదిలీల్లో అధికారులు స్వయంగా ఫోన్లు చేశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పీజీ టీ పోస్టుల భర్తీలో మీరు ప్రైమరీ స్కూల్లో ఉన్నారు.. మీకు అర్హత లేదని అంటున్నారు. విద్యాశాఖ మంత్రి మా పనితీరును మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు. అధికారులు నిబంధనల సాకుతో అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం చేసి తీరాల్సిందే. – శ్రీనివాసులు, పీఆర్టీయూ స్టేట్ అడిషనల్ సెక్రెటరీ అర్హతలున్నా వివక్ష చూపడం ఎంతవరకు న్యాయం? పీజీటీగా అన్ని రకాల అర్హతులున్నా మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంల సాకుతో వివక్ష చూపడం ఎంతవరకు న్యాయం. నిబంధనల ప్రకారం సాధారణ హైస్కూళ్లలో ఉండే స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించారు. మేము కూడా స్కూల్ అసిస్టెంట్ కేడర్కు చెందిన వారమే. మాకు అన్యాయం చేయడం తగదు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు న్యాయం చేయాలి. – లత, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ప్రైమరీ స్కూల్లో ఉన్నామనే ఆపేస్తారా? ఉన్నత పాఠశాలల్లో ప్లస్ టూ స్థాయి విద్యను బలోపేతం చేసేందుకు హైస్కూల్ ప్లస్ విధానాన్ని తీసుకువచ్చారు. నేను పీజీ పూర్తి చేసి పీజీటీ పోస్టుకు అన్ని అర్హతలు సాధించాను. నా సీనియారిటీ కూడా జిల్లా స్థాయి సబ్జెక్ట్ లిస్టులోనే ఉంది. అధికారుల బలవంతం వల్ల సర్దుబాటు నిమిత్తం మోడల్ ప్రైమరీ స్కూల్స్కు హెచ్ఎంగా వచ్చాను. ఇప్పుడు సాంకేతిక కారణాన్ని చూపి అర్హత లేదని చెబుతున్నారు. ఇది ఎంత వరకు న్యాయం. – బత్తిన నాయుడు, మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం -
టీడీపీ నాయకుల బరితెగింపు
జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అధికారిక బూత్ లెవల్ ఏజెంట్లను పక్కన పెట్టి, ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దించారని ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు నియోజకవర్గం ప్రజాప్రతినిధి పీఏ కనుసన్నల్లో యాప్లో ఓటర్ల వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. అనుకూల ఓటర్లను ఒకలా, వ్యతిరేక ఓటర్లను మరోలా వర్గీకరిస్తూ క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్ : ఓటు పవిత్రతను కాపాడాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీ నేతలు పెడచెవిన పెట్టారు. మై టీడీపీ యాప్ పేరుతో ఓటర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ అక్రమాలపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆధారాలతో సహా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాల పర్వం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఓటర్ల గోపత్యను కాలరాస్తూ, మై టీడీపీ యాప్లో అనైతిక ఓటర్ల ప్రొఫైలింగ్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్న ఈ కుట్రపై అధికారులకు అందిన ఫిర్యాదులు సంచలనంగా మారాయి. రహస్య ఓటు హక్కుకు భంగం రాజ్యాంగం కల్పించిన రహస్య ఓటు హక్కు సూత్రానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఓటరు పేరు, ఐడీ కార్డ్ నంబర్తో పాటు వారి కులం, ఏ పార్టీ వైపు ఉన్నారనే అత్యంత సున్నితమైన సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఆధారాలతో సహా ఫిర్యాదు జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలపై వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మై టీడీపీ యాప్లో ఓటర్ల నమోదు చిత్రాలు, ప్రైవేట్ వ్యక్తులు డేటా సేకరిస్తున్న వీడియోలు, క్షేత్రస్థాయి ఆధారాలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి నిబంధనలు ఉల్లంఘించి పొలిటికల్ ప్రొఫైలింగ్ చేస్తున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్) ల గుర్తింపు కార్డులను కచ్చితంగా ప్రభుత్వ అధికారుల ద్వారా వెరిఫికేషన్ చేయించాలన్నారు. సర్ ప్రక్రియ పురోగతిని ప్రతి రోజూ ఆన్లైన్లో పబ్లిష్ చేసి పారదర్శకతను కాపాడాలని కోరారు. -
మద్దతు ధర పేరిట మోసం
పలమనేరు : మామిడికి మద్దతు ధర ప్రకటించామని ప్రభుత్వం చెబుతూ మోసం చేసిందని జిల్లా మామిడి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు ఉమాపతి నాయుడు ఆరోపించారు. స్థానిక మామిడి రైతులు బుధవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యాలయ అధికారిణి తహసీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమాపతినాయుడు మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి మామిడికి రిజిస్టర్ అయిన ర్యాంపుల్లో గత వారం కేజీకి రూ.4 ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు రూ.3 మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ ఆదేశాలను ర్యాంపు నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ప్రభుత్వం కిలో మామిడి ధర రూ.7.50 లుగా ప్రకటించిందని, జిల్లాలోని గుజ్జు ఫ్యాక్టరీలు ఈ ధర ఇవ్వకుండా రూ.3లు ఇస్తున్నాయని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ సైతం కరువైందన్నారు. మనిషికి హానిచేసే పొగాకుకు బోర్డు ఉన్నప్పుడు, మామిడికి మాత్రం ఎందుకు మ్యాంగో బోర్డు లేదని ప్రశ్నించారు. కనీసం ప్రకృతి వైపరీత్యాలకు నష్టం జరిగినా ఈ ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. ర్యాంపుల వద్ద ఇష్టానుసారంగా తక్కువ ధరలతో రైతులను మోసం చేస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జిల్లాలో 40 వేల మంది మామిడి రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోయారన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో మాత్రం ధరలు బాగుంటే ఇక్కడ మాత్రం ఎందుకు లేవని ప్రశ్నించారు. ఈ నిరసనలో నేతలు సుబ్రమణ్యం నాయుడు, మధుసూధన్రావు, నరసింహారెడ్డి, దొరస్వామి నాయుడు, వాసు, విజయ్,యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైవేకు అనుసంధానించాలి
నగరి: విజయపురం మండలం ఇష్టకామేశ్వరపురం (గొల్లకండ్రిగ)–పన్నూరు సబ్స్టేషన్ క్రాస్ రోడ్డు సమీపంలోని చిత్తూరు–తచ్చూరు ఆరులేన్ల జాతీ య రహదారిపై ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపు, అనుసంధానంగా రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆమె ఈ విషయాలను తిరుపతి ఎంపీ గురుమూర్తి ద్వారా కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎన్హెచ్ఏఐ చైర్మన్, ప్రాజెక్టు డైరెక్టర్, ప్రాంతీయ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఇష్టకామేశ్వరపురం వద్ద ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపు, అనుసంధాన రహదారి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. దీనిపై అధ్యయనం చేసి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. భారతమాల పర్యోజన కింద నిర్మాణంలో ఉన్న చిత్తూరు–తచ్చూరు ఆరులేన్ల జాతీయ రహదారి ప్రాంతీయ అభివృద్ధికి కీలకమ ని తెలిపారు. ఇష్టకామేశ్వరపురం వద్ద ప్రవేశం–నిష్క్రమణ మార్గం లేకపోవడం, ఈ రోడ్డుకు తిరుత్తణి–నాగలాపురం రాష్ట్ర రహదారితో అనుసంధానం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు అనుసంధానంతో రాకపోకలు సులువు ఇష్టకామేశ్వరపురం ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగినదని, విజయపురం, నిండ్ర మండలాలతో పాటు అనేక గ్రామాల ప్రజలకు ఇది ప్రధాన రవాణా కేంద్రంగా ఉపయోగపడుతుందని ఆర్కే రోజా వివరించారు. ఈ ప్రాంతంలో ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపుతో పాటు అనుసంధాన రహదారి ఏర్పాటు చేస్తే ఎన్హెచ్–716, ఎన్హెచ్–716ఏ, తిరుత్తణి–నాగలాపురం రాష్ట్ర రహదారులతో సులభ అనుసంధానం ఏర్పడి చిత్తూరు, శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతం, తిరుత్తణి, నాగలాపురం తదితర ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్–తమిళనాడు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర రవాణా మరింత మెరుగుపడుతుందని వెల్లడించారు.ర్యాంపు ఏర్పాటుతో అనేక ప్రయోజనాలు ఇష్టకామేశ్వరపురం వద్ద ఎంట్రీ–ఎగ్జిట్ ర్యాంపు, అనుసంధాన రహదారి ఏర్పాటైతే ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విజయపురం, నిండ్ర మండలాల ప్రజలు చిత్తూరు తదితర పట్టణాలకు వేగంగా, సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు. అలాగే ఎన్హెచ్–716ఏతో రవాణా అనుసంధానం బలపడడంతో పరిశ్రమలు, సెజ్ల అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుందని వెల్లడించారు. దక్షిణకాశి ఆలయం, ఆరే జలపాతం, సింగిరికోన, కై లాసకోన జలపాతం, శ్రీకాళహస్తి, కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ ఆలయం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సందించాలని కోరారు. -
● స్వార్థ రాజకీయాలకు, వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉండండి ● కూటమి ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
దళిత గ్రామాల్లో అలజడులు సృష్టించొద్దు శ్రీరంగరాజుపురం: కూటమి ప్రభుత్వం దళిత గ్రామాల్లో అలజడులు సృష్టించాలని చూస్తోందని, వారి స్వార్థ రాజకీయాలకు దళితులు బలి కావొద్దని, హక్కుల సాధన కోసం కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా పోరాడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. ఆయన బుధవారం పుత్తూరులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు పెరిగాయన్నా రు. ప్రశాంతంగా ఉన్న దళిత గ్రామాల్లో అధికార పక్ష నేతలు అలజడులు సృష్టిస్తూ, దళితుల మధ్య వైషమ్యాలు రేపుతున్నారని మండిపడ్డారు. జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నారాయణస్వామి కొనియాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, రాజకీయం తారతమ్యం లేకుండా ప్రతి పేదవాడి అభివృద్ధి కోసం జగనన్న కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం పేదలను పూర్తిగా విస్మరించి ఉన్నత వర్గాలు, బినామీల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న దళిత యువత.. కూటమి రాజకీయ నేతల ఉచ్చులో పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం బాధాకరమన్నారు. కేసులు పెట్టుకుని ఆర్థికంగా, జీవితపరంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్, మదర్ థెరిసా, సావిత్రీబాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. వ్యక్తిగత ద్వేషాలను పక్కనపెట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. -
మూడున్నర దశాబ్దాల సేవకు గుర్తింపు
పూతలపట్టు(యాదమరి): సాంఘిక సంక్షేమ శాఖలో 35 సంవత్సరాల పాటు సేవలందించిన ఒక ఆదర్శ అధికారికి ఉన్నత గుర్తింపు లభించింది. మండల పరిధిలోని పి.కొత్తకోట సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న జయచంద్రారెడ్డికి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారిగా పదోన్నతి దక్కింది. తిరుపతి కేంద్రంగా బుధవారం ఆయన ఈ నూతన భాద్యతలు స్వీకరించనున్నారు. పదోన్న తి రావడం పట్ల వసతి గృహ సిబ్బంది, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసా రు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డిని వసతి గృహ సిబ్బంది జ్ఞానశేఖర్, ప్రసాద్, చిరంజీవి తదితరులు ఘనంగా సత్కరించారు. జిల్లాలో 97 శాతం పల్స్ పోలియో నమోదు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లావ్యాప్తంగా మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీ య పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రభు త్వం నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటివరకు 1,72,523 మందికి పోలియో చుక్కలు వేసిన ట్లు ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా జిల్లాలో 97.05 శాతం ప్రగతి సాధించామనివివరించారు. దివ్యాంగ బాలికల వసతి గృహంలో అడ్మిషన్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఉన్న దివ్యాంగ బాలికల వసతి గృహంలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విభి న్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపా రు. మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. 3 వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న శారీరక విభిన్న ప్రతిభావంతులు, బధిరులు, అంధులైన బాలికలకు బాలికల వసతి గృహంలో అడ్మిషన్లు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థినులందరికీ ఉచితంగా రుచికరమైన, పోషకాలతో భోజనం అందిస్తారని తెలిపారు. వసతిగృహం నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఉచిత వ్యాన్ సౌకర్యం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థినికి సంవత్సరానికి 4 జతల దుస్తులు, దుప్పట్లు, మంచం, బెడ్ సదుపాయంతో పాటు, కాస్మొటిక్స్ ఖర్చుల నిమిత్తం నెలకు రూ.250/– నగదు చెల్లిస్తారని తెలి పారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం నర్స్తో వైద్య సదుపాయం, సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు 9440990698, 08572–296506 నెంబర్లలో సంప్రదించాలని ఏడీ కోరారు. హెల్పర్లపై పోలీసుల డేగ కన్ను – ఎంసీ రవి కిడ్నాప్ కేసులో స్థానికులపై విచారణ పలమనేరు: జిల్లాలో సంచలనం సృష్టించిన ఆన్లైన్ ట్రేడర్ ఎంసీ రవి కిడ్నాప్ కేసులో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠాకు స్థానికంగా సహకరించదెవరనే కీలక సమాచారంపై పలమనేరు పోలీసులు డేగకన్ను పెట్టినట్టు తెలిసింది. గతనెల ఏడున రవిని కేరళ పోలీసుల వేషంలో అరెస్ట్చేసి బేడిలేసి అతని నుంచి కోటి నగదు, కోటి విలువైన బంగారాన్ని దోచుకెళ్ళిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేయగా 15మందిని పట్టుకోవాల్సి ఉంది. అయితే ఈ కేసులో కీలక నిందితులైన మహేష్ నాయుడు, భానుప్రకాష్లకు గతంలో రవితో పాత కక్షలున్న కొందరు కలిసి ఈ కిడ్నాప్ స్కెచ్ వేసినట్టు తెలి సింది. దీంతో పోలీసులు ఓ వ్యక్తిని తాజాగా విచారించినట్టు సమాచారం. మొత్తం మీద అంతర్రాష్ట్ర కిడ్నాపర్ల కేసులో కొందరు గంగవరం ప్రాంతవాసుల మెడకు చుట్టుకునేలా ఉందనే మాట వినిపిస్తోంది. ఆమేరకు ఇందులో పోలీసులకు అవసరమైన కీలక విషయాలను బాధితుడు రవి సైతం సేకరించినట్టు తెలిసింది. వీటని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చినట్టు సమాచారం. -
వింతపురుగు కాటుతో విద్యార్థులకు అస్వస్థత
కార్వేటినగరం: వింతపురుగు కాటుతో విద్యార్థులకు శరీరంపై మంటలు ఏర్పడిన సంఘటన మండల పరిధిలోని డీఎం పురం ఉన్నత పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేర కు వివరాలిలా.. డీఎంపురం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల ఆవరణంలో ఉదయం విద్యార్థులు కొంతమంది పాఠశాల ఆవరణలో చెట్లకింద ఆడుకుంటూ ఉన్న సమయంలో ఓ విద్యార్థిని వింత పురుగు కాటువేసింది. దీంతో విద్యార్థి మంటలు తట్టుకోలేక కేకలు వేయడంతో అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు అక్కడికి చేరుకుని పరిశీలించే లోపు వారు కూడా పురుగు కాటుకు గురై మంటలకు తట్టుకోలేక తల్లడిల్లిపోయారు. సమయానికి పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు 108 వాహనానికి సమాచా రం అందించి పురుగు కాటుకు గురైన 19 మంది విద్యార్థులను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద చేరుకుని మంటలకు తల్లడిల్లిపోతున్న తమ పిల్లలను చూసి బోరున విలపించారు. ఇదే క్రమంలో 5 మంది విద్యార్థులకు వాంతులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం కలుగుతుందని మరింత భయానికి గురయ్యారు. దీంతో పుత్తూ రు ప్రభుత్వ ఆస్పత్రికి చెంది వైద్య సిబ్బంది హుటాహుటిన విద్యార్థులకు చికిత్స అందించడంతో విద్యార్థులకు శరీరంపై నవ్వలు తగ్గడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు ఊపి రి పీల్చుకున్నారు. విద్యార్థులను పరామర్శించిన డీవైఈవో డీఎం పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు వింత పురుగు కాటుకు గురై పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుకున్న పుత్తూరు డీవైఈవో మహేశ్వరరావు, కార్వేటినగరం ఎంఈవోలు విజయకుమార్, మనోజ్కుమార్ ఆస్ప త్రికి చేరుకుని వైద్య సిబ్బందితో మాట్లాడి విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ధైర్యం చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని భరోసా కల్పించారు. విద్యార్థులను హేళన చేసిన ఆరోగ్య సిబ్బంది వింత పురుగు కాటుకు గురై విద్యార్థులు మంటలు తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఓ ఆరోగ్య సిబ్బంది పిల్లలు పాఠశాలను ఎగరగొట్టడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నట్లు హేళన చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది వారిపై కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్యాధికారులు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
నోళ్లు, కళ్లు మూసుకుపోయాయి
గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో రైతు కాలర్ ఎగరేసుకుని రాజులా బతికే పరిస్థితి ఉండేది. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా మామిడి టన్ను ధర కనిష్టంగా రూ. 17 పలుకగా, గరిష్టంగా రూ. 28 నుండి రూ. 30 వరకు ధర లభించింది. నాడు ఒక ఏడాది ధర రూ. 18 కి వస్తేనే... పీఎల్ఆర్ ఫ్యాక్టరీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మకై ్క ధరలు తగ్గించారంటూ నానా నిందలు వేసిన నాటి ప్రతిపక్ష (ప్రస్తుత కూటమి) నాయకులు, ఈరోజు నోళ్లు, కళ్లు ఎందుకు మూసుకున్నాయి. – ఎంసీ విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త -
గణనాథుని సేవలో సంగీత దర్శకుడు కోటి
కాణిపాకం: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి మంగళవారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేటి నుంచి నాల్గో విడత ప్రవేశాలు తిరుపతి సిటీ: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ, పద్మావతి జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలలో భాగంగా అధికారులు నాల్గొవ విడత కౌన్సెలింగ్ కోసం మెరిట్లిస్ట్ను విడుదల చేశారు. సీట్లు పొందిన విద్యార్థులకు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఏ ఒక్క కళాశాలలోనూ కనీసం 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. ఇలా ఎన్ని విడతలు ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తారని, అధికారులు విద్యార్థులతో చలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 7న ప్లాస్టిక్ బకెట్ల ఈ–వేలం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిపప్పు ప్యాకింగ్కు వినియోగించే ఖాళీ ప్లాస్టిక్ బకెట్లను జూలై 7న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ– వేలం వేయనున్నారు. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల బిడ్డర్లు ఈఎండీ రూ.25 వేలు చెల్లించి ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877–2264429 నంబర్లో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్సైట్, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ను సంప్రదించాలని సూచించింది. పంచాయతీ కార్మికుల ప్రాణాలతో చెలగాటం చంద్రగిరి: పంచాయతీ కార్మికుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారు. వైఎస్సార్సీపీ బ్యానర్లను తొలగించేందుకు కార్మికులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఫలితంగా కార్మికులు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా నేతలు బ్యానర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం టీడీపీ నేతల ఆదేశాలతో వాటిని తొలగించేందుకు పంచాయతీ ఈఓ చంద్రశేఖర్రెడ్డి పూనుకున్నారు. వెంటనే పంచాయతీ కార్మికులందరూ వెంకంపేట వద్దకు రావాలంటూ హుకుం జారీచేశారు. పంచాయతీ కార్మికులు గుణశేఖర్, సతీష్ ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. వెంకటంపేటకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో గుణశేఖర్కు తీవ్రగాయం కావడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. సతీష్ కుడి కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదాన్ని పట్టించుకోని వైనం రోడ్డు ప్రమాదానికి గురైనట్లు అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంపై సిబ్బంది మండిపడ్డారు. రాజకీయ నేతల ఆదేశాలతో పంచాయతీ ఈఓ అవలంబించిని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హామీలు గుర్తున్నాయా బాబు?
హామీల వరద ఇలా వరదయ్యపాళెం: ‘హామీలు ఇస్తాం.. అమలు చేయం’ అన్నట్టుంది సీఎం చంద్రబాబునాయుడు తీరు. ఎన్నికల సందర్భంగా సత్యవేడు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం ఆయన మడమ తప్పేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక్క హామీనీ నెరవేర్చలేదు. నేడు హీరో పరిశ్రమ రెండో విడత గ్లోబల్ పార్ట్స్ యూనిట్ భూమి పూజ పేరుతో సత్యవేడు గడ్డపై అడుగుపెడుతున్న సీఎంకు పాత హామీలు గుర్తున్నాయా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2024 ఏప్రిల్ 20న సత్యవేడు గడియారం కూడలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేసిన వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి. పాత పరిశ్రమలు నూతన పెట్టుబడుల పేరిట భూమిపూజకు వస్తున్న సీఎం, పాత హామీలకు సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రూ.20 కోట్ల చెరకు బకాయిలు ఎటుపోయాయి? బీఎన్ కండ్రిగ మయూర షుగర్స్ కంపెనీ రైతులకు ఇవ్వాల్సిన రూ.20 కోట్ల బకాయిలు ఇప్పిస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రెండేళ్లుగా రైతులు కన్నీళ్లు పెడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లు లేవు పరిశ్రమలకు తగ్గట్టు రోడ్లు వేస్తామన్నారు. తడ–శ్రీకాళహస్తి రోడ్డు, ఊత్తుకోట నుంచి సత్యవేడు మీదుగా కడూరు కూడలి వరకు నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ఆ హామీ ప్రకటనలకే పరిమితమైంది. అటు శ్రీసిటీ, ఇటు ఏపీఐఐసీ సెజ్ పరిధిలో ఉన్న పరిశ్రమలకు రోజువారీ వేలాదిగా వెళ్లే కార్మికులు, ఉద్యోగులు ఇరుకు రోడ్లు, గుంతలమయంగా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయలేక నరకం అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన దాసుకుప్పం బైపాస్ రోడ్డు పనులు సైతం అటకెక్కించారు. ఎన్నికల్లో సత్యవేడు అభివృద్ధికి సవాలక్ష హామీలు -
రైతులంటే చంద్రబాబుకి ఇష్టం లేదు!
● పక్క రాష్ట్రంలో కిలో మామిడి రూ.17 ● ఇక్కడి ధరలు చూస్తే బాధేస్తోంది ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు నాయుడుకి రైతులంటే ఇష్టం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక్క కేంద్ర మంత్రి ఉన్నా అక్కడి మామిడికి కిలో రూ.17లు మద్దతు ధర ఉందని గుర్తుచేశారు. ఇక్కడేమో కేవలం రూ.4 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్లోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మామిడి రైతులు అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ము ఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువ శాతం మామిడి రైతులే ఉన్నారన్నారు. ప్రస్తు తం ఉన్న ధరలకు కూలీలకు కూడా రావని తేల్చిచెప్పారు. కనీస ధర అయినా ఇస్తే రైతులు నష్టాల నుంచి బయటపడుతారని తెలియజేశారు. రాష్ట్రంలో పాలన లేదు, కేవలం కేసులు పెట్టడం, టార్చర్ చేయడం, గోర్లు పీకేయడం, చంపేయడం, బూడిద కూడా దొరక్కుండా చేయడం జరుగుతోందని ఆరోపించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో జూలై 3 నుంచి 5 వ తేదీ వరకు కుప్పం పర్యటనకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో పలు అభి వృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రజాసభలు, రైతులతో ముఖా ముఖి, పారిశ్రామికవేత్తలతో చర్చలు, కీలక ఎంఓయూలు ఉండనున్నాయని తెలిపారు. ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను అత్యంత బాధ్యతాయుతంగా, సమయపాలనతో పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సభా ప్రాంగణాల వద్ద తాగునీరు, అల్పాహారం, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీటితో పాటు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత, వేదికల నిర్మాణం, మైక్, విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఏకరీతిలో రూపొందించాలని, పారిశ్రామిక ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. సీఎం పర్యటనకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపా రు. ఈ కాన్ఫరెన్స్లో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్వో మోహన్ కుమార్ పాల్గొన్నారు. -
కాణిపాకం టెండర్ల ద్వారా రూ.1.75 కోట్ల ఆదాయం
కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో వివిధ విభాగాలకు సంబంధించిన లైసెన్స్ హక్కుల వేలం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. ఆలయ ఆస్థాన మండపంలో మంగళవారం ఆన్లైన్ టెండర్లు, సీల్డ్ టెండ ర్లు, బహిరంగ వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.1,75,58,998 (కోటి 75 లక్షల 58 వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు) ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆదాయం వివరాలు తలనీలాల సేకరణకు ఏడాది కాలపరిమితికి గాను తలనీలాలు పోగుచేసుకునే లైసెన్స్ హక్కు అత్యధికంగా రూ.91,89,999 పలికింది. బస్టాండ్ వద్ద క్యాంటీన్ నిర్వహణ లైసెన్స్ హక్కు ఏడాది కాలానికి రూ.37,08,999 ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఆల యం వెలుపల దూప్ స్టిక్స్, అగరబత్తీలు విక్రయించుకునే లైసెన్స్ హక్కు రూ.30,00,000లకు ఖరారైంది. శివాలయం గార్డెన్లో భక్తులకు ఫొటోలు తీసి ఇచ్చే లైసెన్స్ హక్కు ద్వారా రూ.15,00,000 వచ్చాయి. దేవస్థానానికి చెందిన పాత బొలెరో వాహనాన్ని బహిరంగ వేలం వేయగా రూ.1,60,000 ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈవో పెంచలకిషోర్ సమక్షంలో నిర్వహించి ఈ వేలం పాటల కార్యక్రమంలో ఏఈవో ధనుంజయ, ఆలయ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
ఏం చేశారని పాలాభిషేకం
జిల్లాలో మామిడి రైతులు గత నెల రోజులుగా రోడ్లపై అల్లాడిపోతున్నారు. టోకన్లు, వరుస నంబర్లతో విసిగిపోతున్నారు. ఫ్యాక్టరీ వద్దే కునుకు తీస్తూ పంటను అమ్ముకోవడానికి నానాతిప్పలు పడుతున్నారు. కూటమి నేతల సిఫార్సులతో సామాన్య రైతు కాయలు కుళ్లి పోతున్నాయి. రైతులు గుండె నిండా కన్నీళ్లు దాచుకుని...తమ గోడును బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. అయితే కూటమినేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం మామిడి రైతుల కష్టాలపై నోరెత్తకపోగా.. రూ.4కే పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉంది. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే మేము మళ్లీ ఉద్యమం చేపడుతాం. – కృపాలక్ష్మి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త -
విస్త‘రణం’ తప్పదా?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని హై రోడ్డు విస్తరణ పనుల్లో మళ్లీ సందిగ్దత నెలకొంది. గత రెండేళ్లకు పైగా హై రోడ్డు విస్తరణ పనుల్లో నెలకొన్న నిర్లిప్తతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం రూ.37 కోట్ల నిధులు కేటాయించింది. జాతీయ రహదారుల (ఎన్హెచ్) శాఖ నుంచి విడుదలైన ఈ నిధుల ద్వారా త్వరలోనే టెండర్లు పిలిచి, ఆపై పనులు మొదలుపెడాతమని ఇటీవల కలెక్టర్ ప్రకటించారు. కానీ ఇక్కడున్న భవన యజమానులకు దీనిపై స్పష్టతలేదు. అధికారుల వద్ద సమాధానాల్లేవు. పరిహారం మాటేంటి..? ఇందులో మరో అంశం పరిహారం. విస్తరణలో భవనాలు కోల్పోయే యజమానులకు పరిహారం ఇవ్వా లని ఇప్పటికే అందరూ గట్టిగా ఉన్నారు. అయితే పరిహారం ఇవ్వాలంటే రూ.వందల కోట్లతో ముడిపడ్డ అంశమని, దీనికి తాము అనుకూలంగా లేమని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. పరిహారానికి ప్రత్యామ్నాయంగా టీడీఆర్ బాండ్లను ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. టీడీఆర్ బాండ్లపై తమకు ఆసక్తి లేదని, ఏదైనా నగదు రూపంలో పరిహారం ఇవ్వాల్సిందేనంటూ కొందరు కోర్టు తలుపులు సైతం తట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిహారం ఇవ్వకుండా, టీడీఆర్ బాండ్లను ఇచ్చి భవన యజమానులకు విస్తరణకు ఒప్పించడం అధికారులకు కత్తిమీదసామే. అనేకమార్లు ఈ విషయమై హైరోడ్డు భవన యజమానులతో చర్చలు జరిపాల్సి ఉంది. వాళ్లు దేనికి అంగీకరిస్తారో తుదిగా తేలితేనే విస్తరణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంతకూ ఎన్ని అడుగులు? దాదాపు రూ.37 కోట్లతో చిత్తూరు నగరంలోని ఎంఎస్ఆర్ కూడలి నుంచి మురకంబట్టు బైపాస్ రోడ్డు వరకు హై రోడ్డును విస్తరించడానికి ఎన్హెచ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే రోడ్డును విస్తరించి, కాలువలు – డివైడర్లు నిర్మించే పనులు, ఇతర మౌలిక వసతులను మాత్రమే ఎన్హెచ్ శాఖ పూర్తి చేస్తుంది. ఇక్కడ భవన యజమానులకు పరిహారం ఇవ్వడానికి ఈ నిధులు కేటాయించలేదన్నది సుస్పష్టం. ఎన్హెచ్ పనులు మొదలుపెట్టాలంటే తొలుత మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై బరువు–బాధ్యత ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎంత వరకు..? అంటే ఉన్న రోడ్డుతో పాటు ఎన్ని అడుగుల వెడల్పుతో విస్తరణ పనులు మొదలు పెట్టాలి..? అనే విషయం మార్కింగ్ చేసి, ఆపై ఎన్హెచ్కు అప్పగిస్తే వాళ్లు పనులు చేస్తారు. ఇక్కడే ఓ తిరకాసు ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం హైరోడ్డును వంద అడుగుల వెడల్పుకు విస్తరించాలి. కానీ కొందరు భవన యజమానులు 80 అడుగుల విస్తరణకు సహకరిస్తామని చెబుతుంటే, మరికొందరు పనిలో పనిగా ఒకేసారి వంద అడుగులకు విస్తరించాలని కోరుతున్నారు. భవన యజమానుల సంఘంలో కూటమి పార్టీకి చెందిన ఓ వ్యక్తి పరిహారం విషయంలో గతంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం, ఆపై క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తారా..? సొంత ప్రణాళిక తెరపైకి తీసుకొస్తారా..? అనేది తెలియడంలేదు. మార్కింగ్ పూర్తి హైరోడ్డు విస్తరణ పనులకు సంబంధించి మార్కింగ్ పనులు పూర్తయ్యాయి. ఎంఎస్ఆర్ కూడలి నుంచి మురకంబట్టు వరకు తొలి దశలో 4.31 కి.మీ విస్తరించాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. ఓసారి భవన యజమానులతో సమావేశం నిర్వహించి కలెక్టర్కు నివేదిస్తాం. పనులు ప్రారంభమైతే త్వరలోనే పూర్తవుతాయి. – నరసింహ ప్రసాద్, కమిషనర్, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ -
ఏం టమాటానో ఏమో!
పలమనేరు: ‘ఏమన్నా టమాటా కోస్తాండవా..’ ‘అవు నప్పా.. ఈపొద్దూ 120 బాక్సులేసిండా మార్కెట్లో ఏట్టా ఉంది రేటు?’ ‘దాని మాట ఎందుకు చెబుతావాలే సామీ.. ఈ పొద్దు ఉండే ధర రేపుండదు, మొన్న 500 ఉండె. నిన్న బాక్సు వందకు పడిపాయ.. ఈ పొద్దు బాక్సు 200గా ఉంది. ఏం టమాటానో ఏమో.. ఎందుకు నాటినామా అనిపిస్తోంది.టమాటాలో ఏమో వచ్చేస్తుందనే ఆశతో అప్పో సప్పో చేసి పంట సాగు చేస్తే లాస్ట్కి మిగిలేదమీ లేదబ్బా, నర్సరీ వోళ్లు, దుక్కిదున్నే ట్రాక్టరోళ్లు, కూలీలు, ఎరువులు, మందుల వ్యాపారులు, పుర్రి, కట్టి, ఆటోవాళ్లు, బాక్సులో ళ్లు, మండీవోళ్లు,వ్యాపారులు.ఆకరుకి మనసరుకుని కొని బజార్లో బండ్లపై అమ్ముకునే చిరు వ్యాపారులు కూ డా బాగుండారు.నిండా మునిగిపోయిడేది రైతులు మాత్ర మే’ అంటూ పలమనేరులోని ఓ టీకొట్టులో ప్రస్తుత టమాటా సాగుపై ఇద్దరు రైతుల సంభాషణ ఇది. ధరలు లాటరీగా మారాయి టమాటా ధర ఏ రోజు ఎలా ఉంటాయో అర్థ కాని పరిస్థితి ఏర్పడింది. తోటల్లో మాగుతున్న కాయలను వదల్లేక కోసి వచ్చినంత రానీ అని రైతులు మార్కెట్కు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ధరలతో పంట సాగుకోసం పెట్టిన ఖర్చు సైతం రైతులకు దక్కేలా లేదు. పలమనేరు టమాటా మార్కెట్లో శుక్రవారం 14కిలోల బాక్సు అత్యధికంగా రూ.200గా పలికింది. సాధారణ ధర రూ.120గానే ఉంది. టమాటా పండించే రాష్ట్రాల్లో సీజన్ మొదలై భారీగా టమాటాలు వస్తున్నాయి. పొరుగునే ఉన్న అనంతపురం సరకు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తుతోంది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏదేమైనా టమాటా ధరలు ఎప్పుడెలా ఉంటాయో తెలియక టమాటా సేద్యం రైతులకు లాటరీగా మారింది. టమాటా సాధరణ సాగు 5వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట 3వేల హెక్టార్లు ఇప్పుడు కోతదశలో ఉన్న తోటలు 520 హెక్టార్లు పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో సాగువివరాలు -
మామిడి రైతుల గోస తగులుతుంది
రైతుల ఆవేదన చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుంది. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతులు తీవ్ర అవస్థలు పడుతుంటే ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదు. చంద్రబాబు హయంలోనే మామిడి రైతులు పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. 2018 తర్వాత మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోనే మామిడికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత జిల్లాలో మామిడి రైతుల కష్టాలు తెలిసి కూడా పట్టించుకోకపోవడం మన దారుణం. – చెవిరెడ్డిమోహిత్రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆదుకోకపోతే ఉద్యమం తప్పదు మామిడి రైతుల ఆవేదన రోజురోజుకీ పెరిగిపోతోంది. రైతుల కన్నీటి సుడిలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం తథ్యం. వెంటనే ఆదుకోకపోతే ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. రైతుల ఆర్తనాదాలను పట్టించుకోవాలి. – వల్లివేడు పృథ్వీరెడ్డి, జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిశీలకులు జైన్ గుజ్జు ఫ్యాక్టరీ ఎదుట నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు -
రిటైర్ట్ పోలీసు అధికారులకు సన్మానం
చిత్తూరు అర్బన్ : జిల్లాలో జూన్ నెలలో పదవీ విరమణ పొందిన తొమ్మిది మంది పోలీసు అధికారులకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ అతిథి గృహంలో మంగళవారం ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు నాన్ కేడెర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర రాజు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్, అడిషనల్ ఎస్పీ ఎస్.షాను తదితరులు పదవ విరమణ పొందిన అధికారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ఉమామహేశ్వర రావు, ఆర్ఐలు సుధాకర్, వీరేశ్, ఏఓ నాగభూషనమ్మ, పోలీస్ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
విలేకరి జగన్ హత్య కేసులో మరో విలేకరి అరెస్ట్
వి.కోట: స్థానిక విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో కేసులో హత్య చేసిన తమీమ్, సుభాన్, అందుకు ప్రేరేపించి, సహకరించిన బీఎస్పీ నేత శ్రీనివాస్ ముగ్గురు ముద్దాయిలుగా నేరం రుజువు కావడంతో ప్రసుత్తం మదనపల్లె జైల్లో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. కాగా ఈ కేసులో మరో విలేకరిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ సోమశేఖర్రెడ్డి తో కలసి డీఎస్పీ మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య కేసు విచారణలో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న వారితో పాటు విలేకరిగా విధులు నిర్వహిస్తున్న దొరస్వామి కూడా జగన్ హత్యకు పరోక్షంగా సహకరించిన్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. మంగళవారం దొరస్వామిని సైతం అరెస్ట్ చేసినట్టు చెప్పారు. దొరస్వామి సెటిల్మెంట్లకు జగన్ అడ్డువస్తున్నాడని భావించి హత్యకు సహకారం అందించినట్టు వివరించారు. -
మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడీ నెల్లూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మామిడి రైతులకు మద్దతుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలను బలవంతంగా తరలించారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతల పట్టు నుంచి భారీగా రైతులు తరలివచ్చారు. మామిడి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? అంటూ ప్రశ్నించారు. మామిడి రైతులకు కిలో మద్దతు ధర 17 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.‘‘పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్రం లక్ష 30 వేల టన్నులు తోతపూరి మామిడి కిలో 17.50 రూపాయలు చొప్పున కొనుగోలుకు అంగీకరించింది. చంద్రబాబుకు రైతులు పట్ల చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ పాలనలో తోతపురి మామిడి పంట 25 రూపాయలు ఏ రోజు తగ్గింది లేదు. గత ఏడాది మామిడి రైతులు పక్షాన వైఎస్ జగన్ పోరాటం చేశారు. చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి రైతులకు కిలో 17.50 రూపాయలు తీసుకురావాలి. మామిడి రైతులకు మేలు జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ భూమన పేర్కొన్నారు. -
అతీగతీలేని ప్రోత్సాహక నిధి..!
మామిడి రైతులకు ఇస్తామన్న ప్రోత్సాహక నిధి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. మార్గదర్శకాలు విడుదల చేయలేదు.దాచాలంటే దాగవులే !సాక్షి ప్రతినిధి, తిరుపతి: మామిడికి గిట్టుబాటు ధరతోపాటు.. అన్లోడింగ్.. రైతు సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్సీపీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. ఊహించని ఈ పరిణామంతో చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది. కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు సోమవారం ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని హడావుడి చేశారు. ట్రాక్టర్లు రోడ్లపై క్యూలో ఉండడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ధర్నా చేపట్టే సమయానికి గుజ్జు పరిశ్రమల వద్ద ఒక్క ట్రాక్టర్ కూడా ఉండకూడదని ఆదేశించారు. అందులో భాగంగా గంగాధరనెల్లూరు పరిధిలోని జైన్ ఫ్యాక్టరీ వద్ద బారులు తీరిన మామిడి ట్రాక్టర్లను చెట్లు, పొదలు, నివాసాల మాటుకు తరలించే పనిలో పడ్డారు. నానాతంటాలు గత కొద్ది రోజులుగా గుజ్జు పరిశ్రమల వద్ద మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నోరెత్తకుండా ఉండేందుకు కూటమి నేతలు నానా తంటాలు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ధర్నాలో పాల్గొనకుండా ఉంటే.. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రోడ్డుపై ట్రాక్టర్లు ఉన్నా.. రైతులు ఎవ్వరూ కనిపించకూడదని చెప్పి వారిని మరోచోటుకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. -
ప్రజల ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం
పుత్తూరు: పౌరుల ఓటు హక్కును పరిరక్షించడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఆమె సోమవారం జిల్లా అధ్యక్షుడు భరత్రెడ్డి, నియోజకవర్గ సర్ మానిటరింగ్ టీమ్ సభ్యుడు రవీంద్రతో కలిసి పుత్తూరు మండలం ఉత్తరపుకండ్రిగ పంచాయతీ కనకంపాళెం పోలింగ్ బూత్లో జరుగుతున్న స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని తెలిపారు. ఆ హక్కుకు భంగం కలిగించే ఏ చర్యనైనా వైఎస్సార్ సీపీ ప్రతిఘటిస్తుందన్నారు. సర్ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అర్హులైన ఓటర్లకు అన్యాయం జరిగినా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ప్రజల నుంచి అందుతున్న అభ్యంతరాలు, ఓటరు జాబితాలో జరుగుతున్న మార్పులు, బీఎల్ఏలు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. భరత్రెడ్డి మాట్లాడుతూ ప్రతి బూత్లో పార్టీ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి తగిన చర్యలు చేపడతామని చెప్పారు. రవీంద్ర మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు జరుగుతున్నాయా అన్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మునివేలు, జయప్రకాష్, ఏకాంబరం, సురేష్రాజు, సర్ మానిటరింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆలకించి దయచూపండయ్యా!
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి సోమవారమూ వస్తున్నా సమస్య లు పరిష్కారం కావడం లేదు. మీరైనా దయచూపండయ్యా అని అర్జీదారులు వేడుకున్నారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలు అందజేశారు. జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూమి, సర్వే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వినతులను చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం అర్జీలు 231 నమోదు కా గా అందులో అత్యధికంగా రెవెన్యూ శాఖ అర్జీలే 188 ఉండడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ వెంకటేశ్, డీఆర్వో మోహన్కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3 లక్షల మోసం తవణంపల్లె మండలం ముట్టుకూరుకు చెందిన వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి జేసీని ఆశ్రయించారు. మండలంలోని ఎగువమత్యం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా డబ్బులు ఇవ్వక, ఉద్యోగం రాక తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని జేసీ పోలీసు శాఖను ఆదేశించారు. జేసీకి సమస్యలు మొరపెట్టుకుంటున్న అర్జీదారులు న్యాయం చేయాలని కోరుతున్న బాధిత దివ్యాంగ అర్జీదారుడు వెంకటేష్ ప్రభుత్వ భూమిగా నమోదు జీడీనెల్లూరు మండలం అగరమంగళం గ్రామానికి చెందిన సిద్ధయ్యమూర్తి జేసీకి తన అన్యాయాన్ని వివరిస్తూ వినతి పత్రం ఇచ్చారు. తన తల్లి నాగమ్మ పేరిట ఉన్న వ్యవసా య పట్టా భూమి ఉందన్నారు. గ్రా మంలో జరిగిన రీసర్వే అనంతరం ఇచ్చిన పాసు పుస్తకంలో ప్రభుత్వ భూమిగా నమోదైందని తెలిపారు. దీంతో తమకు అందాల్సిన అన్నదాత సుఖీభవ పథకం అందడం లేదన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట
బంగారుపాళెం : మండలంలోని బిఎల్ కండ్రిగ వద్ద సోమవారం సాయంత్రం పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసిట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బిఎల్ కండ్రిగ అటవీ సరిహద్దు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారని తెలిపారు. డ్రోన్తో పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని గుర్తించి దాడి చేసినట్ట పేర్కొన్నారు. పేకాట ఆడుతున్న పది మందిలో ముగ్గురు పరారయ్యారని, ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వారి నుంచి రూ.32 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు మొగిలి వెంకటగిరికి చెందిన పయని, రాగిమానుపెంటకు చెందిన నాగరాజు, డిల్లీప్రసాద్, ఎర్రయ్య, పట్టాభి, బంగారుపాళెం దళితవాడకు చెందిన రాజ శేఖర్, పుంగనూరు మండలం శాంతినగర్కు చెందిన ఆనంద్గా గుర్తించామన్నారు. రాగిమానుపెంటకు చెందిన దాము, కోలావూరుకు చెందిన జీవ, బెంగళూరుకు చెందిన భాగ్యరాజ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. బైక్ బోల్తాపడి యువకుడి మృతి గుడిపాల : మండలంలో ని నంగమంగళం వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద సోమ వారం బైక్ బోల్తాపడి యువకుడు మృతిచెందా డు. ఎస్ఐ రామ్మోహ న్ కథనం మేరకు.. మందిక్రిష్ణాపురం దళితవాడకు చెందిన పాల్జాన్సన్(23) ఇంటికి కూరగాయలు తీసుకురావడాని కి బొమ్మసముద్రం వెళ్లి తిరిగి ప్రయాణమ య్యాడు. ఈ క్రమంలో నంగమంగళం వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొనడంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానకులు వెంటనే 108 అంబులెన్స్కి సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరివేసుకుని బాలిక ఆత్మహత్య గంగవరం: మండలంలోని బండమీద జరావారిపల్లిలో ఆదివారం ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. బండమీద జరావారిపల్లికి చెందిన పద్మమ్మ కుమార్తె శిరీష(14) కీలపట్ల జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఉదయం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా బాలిక ఇంటి వద్దనే ఉంది. ఏమి జరిగిందో కాని సాయంత్రం తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంటి పక్కన ఉంటున్న మరో కుటుంబం వేధింపుల వల్లే తమ బిడ్డ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లి బోరున విలపించింది. వారిపై చర్యలు తీసుకోవాలని పోలిసులను వేడుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,793 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,221 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.38 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారు సకాలంలో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉండగాటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూ లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. గరుడ వాహనంపై దివ్యదర్శనం చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. సాయంత్రం పద్మావతి అమ్మవారు తెప్పపై కొలువుదీరి పుష్కరిణిలో ఏడు పర్యాయాలు విహరించి భక్తులను ఆశీర్వదించారు. రాత్రి అమ్మవారికి గరుడ వాహన సేవను కనుల పండువగా చేపట్టారు. తెప్పోత్సవం అనంతరం అమ్మవారిని గంగుండ్ర మండపానికి తీసుకొచ్చి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారు గరు డ వాహనంపై ఆశీనులై తిరువీధుల్లో ఊరేగు తూ భక్తులను ఆశీర్వదించారు. జేఈవో శరత్, ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, ముని చెంగల్రాయులు, సురేష్ పాల్గొన్నారు. ఆర్జిత సేవలు పునఃప్రారంభం అమ్మవారి తెప్పోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. మంగళవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభిస్తున్నట్టు ఆలయ డెప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ తెలిపారు. -
జంట హత్యల కేసులో జీవిత ఖైదు
చిత్తూరు అర్బన్ : తన కుమార్తెను లైంగిక వేధింపులకు గురిచేశారనే కోపంతో ఇద్దరిని హత్య చేసిన కేశవులు (54)కు జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవా రం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరవణకుమార్ కథనం మేరకు.. చిత్తూరు రూరల్ మండలం నాయినిచెరువు పంచా యతీ చెన్నసముద్రం గ్రామంలో 2018 అక్టోబర్ 20వ తేదీన ఆర్టీసీ డ్రైవర్ పల్లెబోయిన శేఖర్, అతని చిన్నాన్న పి.లక్ష్మీపతి యాదవ్ హత్యకు గురయ్యారు. మృతుడు శేఖర్ తల్లి మాణిక్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి చిత్తూరు తాలూకా ఎస్ఐ భాస్కర్ కేసు నమోదుచేశారు. సీఐ శ్రీనివాసరావు దర్యా ప్తు చేపట్టారు. తన కుమార్తెను శేఖర్ లైంగిక వేధింపులకు గురిచేయడంతో మట్టుబెట్టాలని కేశవులు నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని 2018 అక్టోబర్ 20న చెరుకుతోటకు రమ్మని కబురు పంపాడు. శేఖర్తో పాటు అతని బంధువు లక్ష్మీపతి కూడా వచ్చాడు. అప్పటికే కొడవలితో కాపుకాచిన కేశవులు తొలుత శేఖర్ను నరికి చంపాడు. విషయం బయటపడకుండా ఉండేందుకు లక్ష్మీపతిని సైతం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సాక్ష్యాధారాల తో సహా నేరం రుజువుకావడంతో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. పరాయి మోహం.. ప్రాణం తీసింది – యువకుడిని చంపి,ఆత్మహత్యగా చిత్రీకరణ చిత్తూరు రూరల్(కాణిపాకం): వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియురాలి భర్త చేతిలో 19 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు మండలం కుర్చివేడులోని ఓ మామిడితోటలో ఆదివా రం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. గుడిపాల రామాపురానికి చెందిన వడివేలు, అతని భార్య మూడు నెలలుగా కుర్చివేడులోని గోవర్ధన్ మామిడి తోపులో కాపలా ఉంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు మండలం పాలంతోపు ఎస్టీ కాలనీకి చెందిన వెంకటేష్ (19) తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వడివేలు అనుమానించాడు. ఆదివారం రాత్రి వెంకటేష్, వడివేలు దంపతులు కలిసి చికెన్ వండుకుని, పూట్గా మందు సేవించారు. అనంతరం వెంకటేష్ను ఇంటికి పంపించేసిన వడివేలు భార్యతో ఘర్షణకు దిగాడు. భార్యను కొట్టబోయాడు. అప్పటికే అక్కడి నుంచి వెళ్లినట్లు నటించిన వెంకటేష్ ఉన్నట్టుండి వచ్చి వడివేలును అడ్డుకున్నా డు. నా భార్యను నేను కొడుతుంటే.. నీకెందుకు అంత నొప్పి అంటూ వడివేలు ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంకటేష్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగక చీరతో మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వెంకటేష్ శవాన్ని ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. సోమవారం ఉదయం ఏమీ తెలియనట్టు ఊర్లో నాటకమాడాడు. సమాచారం అందుకుని ఘట నా స్థలానికి చేరుకున్న బీఎన్ఆర్పేట పోలీసులకు వడివేలు ప్రవర్తనపై అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటూ పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండను ఢీకొన్న ఆర్టీసీ బస్సు భాకరాపేట: భాకరాపేట కనుమలో సోమ వారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కొండని ఢీకొట్టింది. స్థానికుల కథనం.. మదనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరింది. భాకరాపేట ఘాట్రోడ్డులో అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. దీంతో ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. -
సహకార వారోత్సవాలు ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రాంగణంలో సోమవారం సహకార వారోత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. జూలై 6 వరకు నిర్వహించనున్న వారోత్సవాలను జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ సహకార పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం సహకార శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి సహకార ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా రైతులకు మరింత విస్తృతంగా రుణాలు అందించి బ్యాంకుల అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఆర్జించిన లాభాల నుంచి రూ.3,50,95,151 డివిడెండ్ను వివిధ సహకార సంఘాలకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ నానన్ అఫిషియల్ పీఐసీ సభ్యుడు అమాస రాజశేఖర్రెడ్డి, నాబార్డు జిల్లా మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా సహకార శాఖాధికారిణి ఎస్.లక్ష్మీ, జిల్లా సహకార ఆడిట్ అధికారిణి ఎస్.ఎం.ఎం.నారాయణమ్మ, డీసీసీబీ సీఈవో శంకరబాబు, డీజీఎంలు, ఏజీఎంలు, బ్యాంకు ఉద్యోగులు, సహకార సంఘాల ప్రతినిధులు, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
తడబడుతున్న సర్!
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పరిధిలోని 32 మండలాల్లో ‘సర్’ జాబితా ప్రకారం 13,40,126 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో చిత్తూరు కార్పొరేషన్తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అధికారులు 13,01,080 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందచేశారు. వాటిని తీసుకున్న ఓటర్లు సంబంధిత వివరాలను నమోదుచేసి.. మళ్లీ బీఎల్వోలకు అందజేయాలి. అనంతరం తొలి ప్రచురణ, ఆపై అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఉంటుంది. ఇదంతా జరగాలంటే ముందుగా ఓటర్లు తీసుకున్న ఫారాలను పూరించి ఇవ్వాలి. జిల్లాలో ఇప్పటి వరకు 40 వేల మంది మాత్రమే ఫారాలను పూరించి ఇచ్చారు. అంటే 29.80 శాతం మంది నుంచి ఫారాలను తీసుకున్న అధికారులు, వాటిని డిజిటలైజేషన్ చేశారు. మిగిలిన 13 లక్షల మంది ఇంకా ఇవ్వలేదు. జిల్లాలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ తడబడుతోంది. వచ్చేనెల 14వ తేదీలోపు తొలి దశగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్) ఇచ్చి, వాటిని తిరిగి తీసుకోవాల్సి ఉంది. బీఎల్వోలు వాటిని ఓటర్లు అందజేస్తున్నారు. తిరిగి తీసుకోవడంలో తిప్పలు తప్పడంలేదు. కొన్నిచోట్ల ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఫారాలను రోజుల తరబడి ఇంట్లోనే ఉంచేసుకుంటున్నారు. వాటిని నింపడం ఎలాగో తెలియక కొందరు అలాగే పెట్టుకుంటున్నారు. సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీఎల్వోలపై ఒత్తిడి పెరుగుతోంది. అధికారుల నుంచి చీవాట్లు తింటున్నారు. ఒత్తిళ్లతో సతమతం ఓటర్లు ఎంతకూ ఫారాలు తిరిగి ఇవ్వకపోవడంతో, వాటిని పూరించి తీసుకునే బాధ్యత కూడా ఇప్పుడు బీఎల్వోలపైనే పడింది. ప్రతి రోజూ కనీసం వంద వరకు ఫారాలను పూరించి తీసుకోవాలని అధికారులు లక్ష్యం విధించారు. పైగా ప్రతి రోజూ అధికారులు ‘సర్’పై టెలీ కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. ఈఎఫ్లను తిరిగి తీసుకునే క్రమంలో కుప్పం రూరల్ అత్యల్పంగా 20 శాతం, శాంతిపురంలో 21, చిత్తూరు అర్బన్లో 23, రామకుప్పంలో 24, బంగారుపాళ్యంలో 24.26, గంగాధరనెల్లూరులో 26, పుత్తూరు అర్బన్లో 26.91, వెదురుకుప్పంలో 27.5, ఐరాలలో 27.38, పాలసముద్రంలో 28.69 శాతంతో టాప్–10లో ఉన్నాయి. దీంతో ప్రతిరోజూ ఉన్నతాధికారులు టెలీకాన్ఫరెన్సులో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నా కొందరు క్షేత్రస్థాయి సిబ్బందిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. చిత్తూరు కార్పొరేషన్, కుప్పం, బంగారుపాళ్యంలో పనిచేస్తున్న ముగ్గురు బీఎల్వోలకు షోకాజు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. చేస్తున్న ఉద్యోగం ఓవైపు, ‘సర్’తో మరోవైపు ఒత్తిడి పెరుగుతుండడంతో సిబ్బంది సతమతం అవుతున్నారు. -
పోలీసులపై దాడి హేయమైన చర్య
శ్రీరంగరాజపురం : అమరావతిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం కానిస్టేబుల్ చిన్నతంబిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ అమరావతిలో రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ రౌడీ మూకలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశాయని తెలిపారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న మండలంలోని రాఘవరాజపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్నతంబికి గాయాలయ్యాయని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులకే రక్షణ లేకపోతే సామన్యుడి ప్రజల పరిస్థితి ఏమిటని పేర్కొన్నారు. పోలీసులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేకుంటే పోలీసులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం చిన్నతంబికి పండ్లు అందించి, ఆరోగ్య వివరాలను అడిగితెలుసుకున్నారు. వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్, ఎంపీపీ సరిత, మాజీ సర్పంచ్ మల్లికమ్మ, నాయకులు అమృతరాజ్, ఆనంద్, యుగంధర్, భూపతిరెడ్డి, జనార్ధన్, మహేష్, జయ, రామకృష్ణ, బాబు తదితరులు పాల్గొన్నారు. ఎకరాకు రూ.22 లక్షలు ఇవ్వాలని వినతి పూతలపట్టు(యాదమరి): పరిశ్రమల స్థాపన కోసం సేకరిస్తున్న భూములు ఎకరాకు రూ.22 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని పి.కొత్తకోట, పోటుకనుమ రైతులు కోరారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు సోమవారం తహసీల్దార్ ఉదయ్ సంతోష్తో కలసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణపై రైతులతో సమావేశమయ్యారు. ఆర్డీవో మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు దాదాపు 95 ఎకరాలు భూమి అవసరమన్నారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. వీటికోసం గత కొన్ని నెలలుగా రైతులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. భూములు కోల్పోయే రైతులకు ఎలాంటి నష్టం లేకుండా, పరిహారం వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు తమకు ఆమోదయోగ్యమైన పరిహారం ఇస్తేనే భూములను ఇస్తామని అధికారులకు స్పష్టం చేశారు. -
మామిడి రైతులను ఆదుకోండి
డిమాండ్లు ఇవే చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను ఆదుకోవాలని మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం సంఘం నాయకులతో కలిసి పీజీఆర్ఎస్లో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుజ్జు ఫ్యాక్టరీలు, కొనుగోలు ర్యాంపులు సిండికేట్గా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ధరలు పతనం కావడంతో 40 వేల మందికి పైగా రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 సంవత్సరానికి గాను తోతాపురి మామిడి ధరను ప్రభుత్వం కేజీకి రూ.7.50 లుగా ప్రకటించినప్పటికీ, జిల్లాలోని ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ ఆ ధరను అమలు చేయడం లేదన్నారు. జూన్ 25వ తేదీ వరకు గుజ్జు ఫ్యాక్టరీల్లో కేజీ తోతాపురి ధరను రూ.6 చూపిస్తూ ధరల పట్టికలు పెట్టారని తెలిపారు. మూడు రోజులుగా రూ.5 ఇస్తామంటూ కొత్త బోర్డులు పెట్టారని తెలిపారు. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన ర్యాంపుల్లో గత వారం కేజీ రూ.4 ఇవ్వగా, మూడు రోజులుగా జిల్లాలోని అన్ని ర్యాంపుల వద్ద కేజీ రూ.3 ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మద్దతు ధర అమలు చేయని ర్యాంపులు, గుజ్జు ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మామిడి రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉమాపతి నాయుడు, మునిరత్నం నాయుడు, హేమలత, చెంగల్రాయరెడ్డి, జయ దేవయ్య తో పాటు పలువురు మామిడి రైతులు పాల్గొన్నారు. జేసీకి మామిడి రైతు సంఘం నాయకుల అర్జీ -
పోలీసు గ్రీవెన్స్కు 56 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 56 వినతులు అందాయి. ఏఎస్పీ షాను ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదునూ ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదుల పై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు.అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. హైస్కూల్ ప్లస్లలో సర్దుబాట్లు వద్దు చిత్తూరు కలెక్టరేట్ : హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో సర్దుబాట్లు వద్దని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో పని సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను నియమించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక సర్దుబాట్లతో నియామకాలు చేపట్ట డం వల్ల విద్యాప్రమాణాలు దెబ్బతింటాయని తెలిపారు. ఉపాధ్యాయుల సేవా ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైస్కూల్ ప్లస్లలో అవలంబించిన ‘డిప్లాయ్మెంట్’ విధానాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను సీనియారిటీ ప్రకారం, అదనపు ఇంక్రిమెంట్తో ఈ పాఠశాలల్లో నియమించేవారని తెలిపారు. ప్రస్తుతం ఆ విధానాన్ని పక్కన పెట్టడం తగదన్నా రు. హైస్కూల్ ప్లస్లలో ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని, అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు సీనియారిటీ ప్రకారం పదోన్నతి కల్పించాలన్నారు. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందన్నారు. సీఎం పర్యటనపై సమీక్షకుప్పం రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూలై 3, 4, 5 తేదీల్లో కుప్పంలో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ సోమవారం కుప్పం ఆర్డీవో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీఎం మూడు రోజుల పర్యటనలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, బహిరంగ సభల్లో పాల్గొంటారని చెప్పారు. ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, ప్రజలకు సౌకర్యాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టం చేయాలన్నారు. అనంతరం వారు కడా పీడీ వికాస్ మర్మత్తో కలిసి సీఎం పర్యటించే పొగురుపల్లి ఇండస్ట్రియల్ పార్కు, బహిరంగ సభ నిర్వహించే ప్రాంతం, ఏబీఐఎస్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, ద్రావిడ విశ్వవిద్యాలయంలో హెలిప్యాడ్, కోటపల్లి వద్ద అధికారుల అతిథి గృహం, ఏరియా ఆస్పత్రి, ఆర్టీసీ బస్టాండ్ శంకుస్థాపన చేసే ప్రదేశం, శ్మశానవాటికను పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. జూలై 2న ట్రాఫిక్ ఆంక్షలు తిరుపతి క్రైం : సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో జూలై 2న ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తిరుపతి జిల్లా పోలీసులు తెలిపారు. అదే రోజు రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం, మంగంపేటలో నిర్వహించే బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు వెల్లడించారు. -
కన్నీళ్లు పెట్టిస్తున్న మామిడి అగచాట్లు
ఆన్లోడ్గాక గుజ్జు పరిశ్రమల ఎదుట బారులు తీరిన ట్రాక్టర్లు టోకెన్లు అమ్ముకుంటున్నారు చిత్తూరు జిల్లా పరిధిలోని గుజ్జు పరిశ్రమలను పరిశీలించిన ‘సాక్షి’ బృందం వద్ద రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారులు పంపిణీ చేసే టోకెన్లు కొందరు రూ.500 నుంచి రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారని ఆరోపించారు. మరో వైపు అధికారులే.. టీడీపీ నాయకుల నివాసాలకు వెళ్లి వారు అడిగినన్ని టోకెన్లు ఇచ్చి వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంగాధరనెల్లూరు గుజ్జు పరిశ్రమల పరిధిలో రహ దారి పొడవునా మామిడి ట్రాక్టర్లు బారులు తీరా యి. కుళ్లిపోయిన మామిడి కాయలను రోడ్డుపక్కన పడేసి ఉండడం కనిపించింది. బాబు తీరుపై రైతులు శాపనార్థాలు పెడుతున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా 90 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. ఈ సారి సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు గుజ్జు పరిశ్రమలు రూ.4 నుంచి రూ.6 చొప్పున తరలించారు. కొన్ని పరిశ్రమలు ఉన్నట్టుండి ధరలు తగ్గించేశారు. గిట్టుబాటు ధర కోసం రైతులు పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి సానుభూతిపరులైన రైతులు పండించిన పంటను ఫ్యాక్టరీల వద్ద వేచి ఉండకుండా ఉండేలా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నాయకులు సిఫారసులు చేస్తున్నారు. మరో వైపు ఉన్నతాధికారుల నుంచి గ్రామస్థాయి అధికారులు, పోలీసులు సైతం వారి బంధువులు, స్నేహితుల పంటను పైరవీలు చేసి అప్పటికప్పుడు అన్లోడింగ్ చేస్తున్నారు. కొందరు అధికారులు అన్లోడింగ్ కోసం ఇచ్చే టోకెన్లను రూ.500 నుంచి రూ.వెయ్యికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కుళ్లిపోతున్నాయి! జిల్లాలో సుమారు 44 గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో 32 మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మరి కొన్ని వారంలో రెండు మూడు రోజులు క్లీనింగ్ పేరుతో అన్లోడింగ్ చేసుకోవడం లేదు. రోజుల తరబడి టోకెన్ల కోసం క్యూలో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తాము వారం, పది రోజులు వేచి ఉన్నా అన్లోడింగ్ చేసుకోవడం లేదని చిత్తూరు రూరల్ మండల పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి వేచి ఉండడం కారణంగా మామిడి పంట ట్రాక్టర్లలోనే కుళ్లిపోతోంది. -
ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మృతి
కాణిపాకం: తలకోన వెళ్లేందుకు భర్త నిరాకరించాడని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మృతిచెందింది. పోలీసులు కథనం మేరకు.. తవణంపల్లె మండలంలోని గల్లవల్లవూరు ఎస్టీ కాలనీకి చెందిన డి.పూర్ణిమ (24) తన మరదలితో కలిసి తలకోన వెళ్తానని భర్త లాలు ప్రసాద్ను అనుమతి కోరింది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని, మామిడి కోత పనులు ఉన్నాయని అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన పూర్ణిమ శనివారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఎం.రాజయ్య ఫిర్యాదు మేరకు తవణంపల్లె పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖాళీ బిందెలతో మహిళల నిరసన పాలసముద్రం : తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నా పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని క్రిష్ణజమ్మాపురం పంచాయతీ బలిజకండ్రిగ, కొత్తపల్లి వాసులు వాపోయారు. వారు సోమవారం గ్రామ సచివాలయం సమీపంలోని బలిజకండ్రిగ– చిత్తూరు జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. వారు మాట్లాడుతూ పది రోజులకుపైగా మా గ్రామంలో తాగునీటికి అవస్థలు పడుతున్నామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి శంకర్కు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామ సమీపంలో గతంలో బోరు వేసి బోరు అమర్చలేదన్నారు. బోరు ఏర్పాటుచేయాలని పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు విన్నవించినాపట్టించుకోవడం లేదు. దీంతో తాము ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నుంచి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో సతీష్కుమార్, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. సాయంత్రంలోగా బోరు మోటారు అమర్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
ఎన్నికల సంఘం నిబంధనలకు తూట్లు
చిత్తూరు కలెక్టరేట్ : టీడీపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఎన్నికల సంఘం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి ఆరోపించారు. ఆయన సోమ వారం వైఎస్సార్సీపీ నేతలతో కలిసి డీఆర్వో మోహన్ కుమార్కు ఫిర్యాదుచేశారు. టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాల ఆధారాల ను వీడియోల రూపంలో డీఆర్వోకు అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని టీడీపీకి చెందిన యాప్లో అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారిక ప్రక్రియలో మాత్రమే సేకరించాల్సిన ఓటరు డేటాను, టీడీపీ తన సొంత ప్రయోజనాల కోసం యాప్లలో భద్రపరచడం తీవ్రమైన నేరమన్నారు. దీనివల్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారానికి తీవ్ర భంగం వాటిల్లుతుందన్నారు. ఎన్నికల నియమావళి, డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సమాచారాన్ని నిల్వ చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు జిల్లా ఎన్నికల అధికారి తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు యాప్ లోకి ఎన్యూమరేషన్ ఫారాలను అక్రమంగా అప్లోడ్ చేయడంపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఓటర్ల సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే అత్యంత గోప్యంగా నిర్వహించేలా బీఎల్వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఓటర్ల ప్రైవసీని ఉల్లంఘిస్తూ, ఎన్నికల నిబంధలను కాలరాస్తున్న వ్యక్తులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్ల సమాచారం దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటూ, జిల్లాలో పారదర్శక, నిష్పాక్షిక ఎన్నికల వాతావరణం కల్పించాలన్నారు. డీఆర్వో స్పందిస్తూ ఈ వ్యవహారంపై ఇప్పటికే కలెక్టర్కు సమాచారం అందినట్లు తెలిపారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఫిర్యాదును క్షేత్రస్థాయిలో విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు దినేష్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ఉదయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
తోతాపురిని బేనీషాగా మార్చేద్దాం!
జిల్లాలో ఎక్కువగా తోతాపురి మామిడి రకం తోటలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తున్నా గిట్టుబాటు ధర దక్కడం లేదు. కాయలను అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదు. దీంతో ప్రతి ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే తోతాపురి మామిడి తోటలను అంటు కట్టుతో (గ్రాఫ్టింగ్) ఎక్కువ ధర ఫలికే టేబుల్ రకాలైన బేనీషా, ఖాదర్, ఆల్ఫాన్సాలుగా మార్చుకోవచ్చు. నష్టాలు రాకుండా గిట్టుబాటు ధర పొందవచ్చు. ఎకరా తోటల్లోని చెట్లను అంటు కట్టడానికి రూ.5 వేలు ఖర్చు అవుతుంది. రెండేళ్ల తర్వాత కోరిన మామిడి రకాలను పొందవచ్చు. ఇప్పటికే జిల్లాలోని కొందరు రైతులు తోతాపురి చెట్లలో టేబుల్ రకాలను పండించి లాభాలు గడిస్తున్నారు. పలమనేరు: చిత్తూరు జిల్లాలో 55 లక్షల హెక్టార్లలో మామిడి తోటల సాగు ఉంది. వాటిలో 60 శాతానికి పైగా తోతాపురి రకం మామిడి చెట్లు ఉన్నాయి. ఈ కాయలను జ్యూస్ ఫ్యాక్టరీలు పల్ప్ కోసం కొంటాయి. దీనికి గ్యారెంటీ మార్కెటింగ్ ఉంటుంది. తర్వాతి స్థానంలో టేబుల్ రకాలైన బేనీషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక రకాలు ఉన్నాయి. తోతాపురం రకం ప్రతి ఏటా సరాసరి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. మిగిలిన రకాలు రెండు లక్షల టన్నుల వరకు వస్తుంది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి తోతాపురి రైతులకు తిప్పలు తప్పడం లేదు. పల్ప్ ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు కోసం పలు నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాయలను అన్లోడింగ్ చేయడానికి వారం రోజులు పడుతుండడంతో సగం కాయలు ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. దీంతో రైతులకు నష్టాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు అంటుకట్టు ద్వారా పాత చెట్లలోనే కొత్త రకాలు పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు 4 వేల హెక్టార్లలోని తోటల్లో బేనీషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక తదితర రకాలను టాప్ వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్ వర్కింగ్ జూన్, జూలై నెలల్లో జరుగుతూ ఉంటుంది. పాత తోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. కొమ్మ అంటుకట్టుతో కోరిన రకం జిల్లాలో మామిడి సాగు 55 లక్షల హెక్టార్లు మామిడి రైతులు 26 వేల మంది అత్యధికంగా సాగులో ఉన్నది తోతాపురి సరాసరి పంట దిగుబడి 5 లక్షల టన్నులు టాప్ వర్కింగ్ చేపట్టిన తోటలు 4 వేల హెక్టార్లు అంటు ఎలా కడతారంటే..? వైరెటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనీషా చెట్టును(మదర్ ప్లాంట్) ఎంపిక చేసుకోవాలి. తోటలోని అనవరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో ధృడంగా ఉన్న చిగుర్లను ఎంపిక చేసుకొని మిగిలిన వాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి చిగుర్లను కట్ చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలైన రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్ ట్యాగ్ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలు అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుకట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాది నుంచి కోతకొస్తాయి. ఎకరాకు సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆలెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.8 లెక్కన రూ.8 వేలు అవుతుంది. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఐదేళ్లలోపు చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అవసరమని, అవి జీవన రక్షణ కవచంగా పనిచేస్తాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆయన ఆదివారం చిత్తూరు నగరంలోని టెలిఫోన్ కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన దిశగా విశేష పురోగతి సాధించినప్పటికీ, కొన్ని దేశాల్లో ఇంకా ఈ వ్యాధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పోలియో మళ్లీ ప్రబలకుండా ఉండేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రానికి తీసుకువచ్చి చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి నాగశశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,077 పోలియో బూత్లు, 119 రూట్లు, 106 హైరిస్క్ ప్రాంతాల్లో 63 మొబైల్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. 4,434 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వలంటీర్లు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మొద టి రోజు పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేస్తామన్నారు. జిల్లాలో 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి 100 శాతం పోలి యో చుక్కలు వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్ల డించారు. కార్యక్రమంలో డీఐవో హనుమంతరావు, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, చుడా చైర్మన్ కఠారి హేమలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర ఏదీ?
● భూమన కరుణాకరరెడ్డి ఫైర్ తిరుపతి మంగళం : సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాన్ అసమర్థత వల్లే మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో ఉందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు, వపన్కళ్యాన్ మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. మామిడి కిలోకి రూ.15 గిట్టుబాటు ధర కల్పిస్తే కానీ పెట్టిన కూలీలు రావని రైతులు గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లేక సుమారు 2 లక్షల టన్నుల మామిడి కాయలు చెట్ల కింద రాలి కుళ్లిపోతున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కిలోకి రూ.4 ధర ప్రకటించి చేతులు దులు పేసుకుందని మండిపడ్డారు. ఫల్ఫ్ ఫ్యాక్టరీల వద్ద మామిడి లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, రైతులకు రూ.250 కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో కిలోకి రూ.20 నుంచి రూ.25 ధర కల్పించిన ఘనత జగనన్నదేనన్నారు. రైతులకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. పోలియో చుక్కలకు యాప్ తిప్పలు..! చిత్తూరు రూరల్ (కాణిపాకం): పల్స్ పోలియోలో పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే యాప్ సాంకేతిక సమస్యలతో గంటన్నరకు పైగా పనిచేయలేదు. దీంతో నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. పోలియో చుక్కలు వేసుకున్న ప్రతి చిన్నారి వివరాలతో పాటు అభా నంబర్ను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించడంతో సిబ్బంది విస్తుపోయారు. యాప్ పనిచేయకపోవడంతో ముందుగా కాగితాలపై వివరాలు నమోదు చేసి, అనంతరం యాప్లో నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అదనపు పనిభారం పడిందని సిబ్బంది వాపోయారు. కొన్ని కేంద్రాల్లో సిబ్బంది అభా, ఆధార్ వివరాలు అడగడం తల్లిదండ్రుల్లో అయోమయానికి దారితీసింది. ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన డీఎంఅండ్హెచ్వో, పోలియో చుక్కల కోసం ఆధార్ అడగరాదని స్పష్టం చేస్తూ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. -
రోగులకు మెరుగైన వైద్యం
యాదమరి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే పేద రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవ లు అందించడంలో అలసత్వం వహించరాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగ శశిభూషన్రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం మాదిరెడ్డిపల్లి పీహెచ్సీ పరిధిలోని 184 గొల్లపల్లి, 12కమ్మపల్లి, దళవాయిపల్లిలో పల్స్ పోలి యో కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాదిరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, సిబ్బంది హాజరు పట్టిక, సంజీవిని అమలు తీరును పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సేవలను మెరుగుపరచాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యాధికారి వరప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం.. బీఎల్ఓ సస్పెన్షన్ చంద్రగిరి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) విధుల్లో నిర్లక్ష్యం వహించిన బీఎల్ఓను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తిరుచానూ రులోని 294 పోలింగ్ కేంద్రం వద్ద ఆయన క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో బీఎల్ ఓ మునిరాజ రెడ్డి నిర్లక్ష్యాన్ని గుర్తించారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఓటరు ఇంటికి వెళ్లి పంపిణీ చేయకుండా ఎస్ఐఆర్ విధులతో సంబంధం లేని వ్యక్తుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు గమనించారు. దీంతో బీఎల్ఓ మునిరాజరెడ్డిని సస్పెండ్ చేశారు. -
టాప్వర్కింగ్తో అనేక లాభాలు
టాప్వర్కింగ్లో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. తోతాపురి చెట్ల నుంచి నాణ్యమైన టేబుల్ వైరెటీలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో ఏజ్ గ్యాప్ లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేసి చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కలిగిన రకాలను పండించుకోవచ్చు. దీనిపై ఏవైనా సలహాల కోసం సంబందిత హార్టికల్చర్ అధికారులను సంప్రదించాలి. – కోటేశ్వరావు, సైంటిస్ట్, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, కుప్పం గ్రాఫ్టింగ్ ద్వారా మంచి రకాలను పండిస్తున్నాను నాకు 30 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఇందులో తోతాపురి చెట్లలో గ్రాఫ్టింగ్ ద్వారా ఖాదర్, బేనీషా మొక్కలను అంటుకట్టించాను. గత ఐదేళ్ల నుంచి తోతాపురి చెట్లలో మేలైన రకాలను పండిస్తున్నా. వీటికి మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. గతంలో తోతాపురి రకం మామిడి దిగుబడి వచ్చినా ధర వచ్చేది కాదు. కాయలను అమ్ముకునేందుకు తిప్పలు పడేవాడిని. ఇప్పుడు ఆ శ్రమ లేదు. – గాలి సుబ్రమణ్యం నాయుడు, రామాపురం -
నేడు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని వివరించారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యా దులు స్వీకరిస్తామని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు బట్వాడా చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారు లు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయకస్వామి సన్నిథిలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ కాణిపాకం: రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ రమాదేవి కుటుంబ సమేతంగా ఆదివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఈవో పెంచల కిషోర్ స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటా న్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, సూపరింటెండెంట్ కోదండపాణి, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, చిత్తూరు పోలీస్ ఇంటెలిజెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. నేడు పోలీసు గ్రీవెన్స్డే చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. -
దోపిడీ ఫారం
●నాకు ఫారం నింపడం రాదు మాకు ఫారం నింపడం రాదు. సారోళ్లను అడిగితే మీ సేవ సెంటర్కు పొమ్మన్నారు. అక్కడ రూ.50లు అడుగుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్లం. వచ్చేది అరకొర ఆదాయం. ఓటు కోసం యాభై రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి? అధికారులేమో కచ్చితంగా రాసి తీసుకురమ్మని చెబుతున్నారు. – రాములమ్మ, వృద్ధురాలు, కుప్పం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనది ఓటు హక్కు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు ప్రత్యేక సవరణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులకు శాపంగా మారుతోంది. ఇందులో ఎన్యూమరేషన్ (ఓటర్ల జాబితా పరిశీలన, నమోదు) ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాసీనత కనబరుస్తుండడంతో నిరక్షరాస్యులైన ఓటర్లు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. దీన్ని సిబ్బంది చేయాల్సి ఉండగా మీసేవా, ఆన్లైన్ కేంద్రాల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. వారు ఒక్కొక్క ఫారం పూరించడానికి రూ.50 వసూలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని సామాన్య, మధ్యతరగతి ఓటర్లు లబోదిబోమంటున్నారు. సర్ ఎన్యూమరేషన్ ఫారాల నమోదు దోపిడీ పర్వంపై సాక్షి ఫోకస్. చిత్తూరు టాస్క్ఫోర్స్ : జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఫారా లు పూర్తి చేయడం నిరక్షరాస్యులైన ఓటర్లకు పెద్ద సమస్యగా మారింది. ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు ఎలా నింపాలో తెలియక, ఎవరిని అడగాలో అర్థం కాక ఓటర్లు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు, చదువుకోని వారు ఈ ప్రక్రియను పూర్తి చేయలేక గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బీఎల్వోల నిర్లక్ష్యం – మీ సేవకు దారి నిబంధనల ప్రకారం ఓటరు నమోదు, ఎన్యూమరేషన్ ప్రక్రియలో బీఎల్వోలు ఓటర్లకు మార్గదర్శకత్వం వహించాలి. అవసరమైతే ఫారాలు పూరించడంలో సహాయం చేయాలి. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ అయ్యింది. ‘మాకు టైం లేదు.. మా వల్ల కాదు.. మీ సేవ, ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి ఫారం పూరించుకుని రండి’ అంటూ బీఎల్వోలు ఓటర్లను వెనక్కి పంపుతున్నారు. ఆన్లైన్ కేంద్రాల కాసుల కక్కుర్తి బీఎల్వోల ఉచిత సలహాతో ఓటర్లు మీ సేవా, ఆన్లైన్ కేంద్రాల బాట పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు కేంద్రాల నిర్వాహకులు నిరక్షరాస్యులైన ఓటర్లను నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా జరగాల్సిన ఈ పనికి, ఒక్కో ఫారం పూరించడానికి ఏకంగా రూ.50 వసూలు చేస్తున్నారు. కూలి పనులకు వెళ్లే పేదలు, వృద్ధులు ఒక్క ఫారానికి ఇంత మొత్తంలో ఇచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాకు తెలియదు ఎన్యూమరేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా సాగాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువైంది. మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ కేంద్రాల దోపిడీపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇష్టానుసారంగా నిరక్షరాస్యులైన ఓటర్ల నుంచి ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులు దోచేసుకుంటున్నారు. ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రైవేట్ కేంద్రాల దోపిడీకి వదిలేయకుండా, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉండి ఉచితంగా ఫారాలు పూరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, తక్షణమే నిఘా పెట్టి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
భర్త పనికి వెళ్లగానే ప్రియుడితో భార్య రాసలీలలు..!
మదనపల్లె టౌన్: భర్త కష్టపడి పనికి వెళ్తే.. భార్య మాత్రం ప్రియుడితో ఇంట్లో రాసలీలలు సాగించింది. చివరికి అనుమానం వచ్చిన భర్త పక్కా స్కెచ్తో ఇద్దరినీ మంచంపైనే రెడ్హ్యాండెడ్గా పట్టుకుని, ఇంటికి తాళం వేసి పోలీసులకు పట్టించిన సంచలన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటున్న ఒక భవన నిర్మాణ కార్మికుడికి, అతడి భార్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఒక డిష్ ఆఫీస్లో బిల్ కలెక్టర్గా పనిచేసే యువకుడితో వివాహేతర బంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయం చూసి ప్రియుడిని నిత్యం ఇంటికి రప్పించుకునేది. ఆదివారం కూడా భర్త పనికి వెళ్లాడనుకుని భార్య తన ప్రియుడిని ఇంట్లోకి పిలిపించుకుని గుట్టుగా గదిలోకి దూరింది. అయితే, భార్య ప్రవర్తనపై మొదటి నుంచీ నిఘా పెట్టిన భర్త.. ఈసారి కాపు కాసి అకస్మాత్తుగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బెడ్రూమ్లో భార్య, ప్రియుడు ఏకాంతంగా ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యాడు. వెంటనే చాకచక్యంగా వ్యవహరించి, గది బయట నుంచి గడియ పెట్టి, ఇంటికి తాళం వేశాడు. ఆ తర్వాత మీడియాకు, తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో ఈ కిలాడీ భార్య లీలలు రచ్చకెక్కాయి. పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకున్నాక విచారించగా.. ఆ భార్య ఏమాత్రం సిగ్గుపడకుండా, ‘కావాలంటే నా మొగుణ్ణి వదిలేస్తాను కానీ, నా ప్రియుడిని మాత్రం వదలను‘ అంటూ అందరి ముందూ తెగేసి చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. దాంతో ఆగ్రహం తట్టుకోలేకపోయిన భర్త, స్థానికులు కలిసి భార్య కళ్ల ముందే ప్రియుడికి తల పగిలేలా దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరినీ తాలూకా పోలీసులకు అప్పగించారు. ఈ వింత వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
రోజుకో పాఠశాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది
క్లస్టర్ టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చి పర్మినెంట్ పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఎంఈవో చెప్పిన చోటుకు వెళ్లి పాఠాలు చెప్పాల్సి వస్తోంది. మహిళలు మారుమూల గ్రామాలకు ఎలా వెళ్తారనే విషయాన్ని కూడా చూడడం లేదు. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడి తప్పడం లేదు. – హిమబిందు, తెలుగు సీనియర్ అసిస్టెంట్, యాదమరి ఇదెక్కడి న్యాయం మేము ఇన్నాళ్లు కష్టపడి పదోన్నతులు పొందితే పర్మినెంట్గా ఒక స్కూల్ కేటాయించలేదు. ఎక్కడ టీచర్ సెలవుంటే అక్కడికి వెళ్లాలని చెబుతున్నారు. ఇది కరెక్ట్ అవుతుందా. ఇలా రోజుకో స్కూల్లో పాఠాలు ఎలా బోధించాలి. పిల్ల లకు అర్థమవుతుందా. దీనిపై అధికారులు ఆలోచించాలి. – కవిత, ఎస్ఏ తెలుగు, సదుం -
టీడీపీవి శవరాజకీయాలు
కాణిపాకం/వి.కోట: వి.కోటలో దారుణ హత్యకు గురైన జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రకటించిన రూ.3.5 లక్షల ఆర్థిక సహాయాన్ని పూర్తిగా అందించామని, ‘చెక్కు బౌన్స్ అయింది.. డబ్బులు ఇవ్వలేదు’ అంటూ టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ద మని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఎన్.నాగరాజ్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి సాక్షిగా సత్య ప్రమాణం చేశారు. టీడీపీ దుష్ప్రచారానికి పుల్స్టాప్ పెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శవ రాజకీయాలు చేయడం ఒక్క టీడీపీకే సాధ్యమన్నారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే దాన్నీ వక్రీకరించి దుష్ప్రచారం చేయడం టీడీపీ నైజమని ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులు చెక్కు కాకుండా నగదు ఇవ్వాలని కోరడంతో రూ.3.5 లక్షలు అందజేశామన్నారు. చెక్కు హామీ కోసం మాత్రమే ఇచ్చామని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి కుటుంబం రాజకీయంగా తమ పార్టీకి చెందకపోయినా, మిత్రుడిగా భావించి ఆదుకున్నామని చెప్పారు. తాము చేసిన సాయాన్నే వక్రీకరించి మాజీ ఎమ్మెల్యే ఎన్.వెంకటే గౌడ, వైఎస్సా ర్ సీపీపై విషప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి హత్య తర్వాత ప్రభుత్వం, ఇతరులు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం, సీఎం రిలీఫ్ ఫండ్, పిల్లల చదువులు, ఇతర ఆర్థిక సహా యం వంటి హామీలు ఇప్పటికీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మాపై బురద జల్లే యూట్యూబ్ ఛానళ్లు, టీడీపీ సోషల్ మీడియా..ఆ హామీలు ఎందుకు అమలు కాలేదో ప్రభుత్వాన్ని నిలదీయాలి‘ అని డిమాండ్ చేశారు. ‘మేము చేసిన సహాయానికి దేవుడి సాక్షిగా ప్రమాణం చేశాం. నిజం మా వైపు ఉంది. ఇక ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం లేదు. మిగతా తీర్పు కాణిపాకం వినాయకుడిదేనని స్పష్టం చేశారు. -
తెలుగు టీచర్లకు చుక్కలు
పలమనేరు: జిల్లాలోని తెలుగు ఉపాధ్యాయులకు విద్యాశాఖ చుక్కలు చూపిస్తోంది. వీరికి ప్రమోషన్లు ఇచ్చి పర్మినెంట్ ప్లేస్లను తీసేసింది. ముఖ్యంగా సర్ప్లస్ టీచర్లకు రోజుకో స్కూల్ లెక్కన డిప్యుటేషన్లు వేస్తున్నారు. ఎక్కడ టీచర్ సెలవు పెడితే అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో మహిళా టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల్లో తమను నియమించకుండా కొత్తగా డీఎస్సీలో ఎంపికై న వారికి పర్మినెంట్ పోస్టులు ఇస్తున్నారని క్లస్టర్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ సెలవుంటే అక్కడికెళ్లాల్సిందే.. క్లస్టర్ టీచర్లుగా కేటాయించిన వారికి పర్మినెంట్ స్థానం కేటాయించలేదు. వారిని ఆయా ఎంఈవోలకు అటాచ్ చేయడంతో వారు డిప్యుటేషన్పై ప్రైమరీ స్కూళ్లలో సెలవు పెట్టిన టీచర్ స్థానంలో విధులకు వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ప్రధానంగా క్లస్టర్ టీచర్లుగా కేటాయించిన వారిలో ఎక్కువగా భాషాపోధ్యాయులకు ఉన్నత పాఠశాలల్లో విధులు కేటాయించలేదు. దీంతో వీరు ఆ హైస్కూల్ పరిధిలోని ఏ స్కూల్కై నా వెళ్లాల్సి వస్తోంది. గత ఆరేళ్లుగా డీఈవో పూల్ మగ్గి ఇటీవలే పదోన్నతలు పొందిన వీరికి ఇప్పుడు నరకంగా మారింది. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకు తీవ్రమైన ఇబ్బందిగా మారింది. దీనిపై ఏ ఉపాధ్యాయ సంఘం కూడా నోరుమెదపడం లేదు. తమకు ఉపశమనం కల్పించాలని బాధిత టీచర్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. -
ఉపాధి హామీకి ముగింపు!
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధిని కల్పిస్తూ కొండంత అండగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త సంస్కరణలతో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్, అజీవిక మిషన్–గ్రామీణ్ (వీబీ జీ రామ్జీ) పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. రెండు దశాబ్దాల ఉపాధి హామీకి ముగింపు గ్రామాల్లోని పేద ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలసలు వెళ్లకుండా సొంత ఊర్లలోనే జీవనోపాధి కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2006లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా కోట్లాది మంది సామాన్యులకు ఆర్థిక భరోసానిచ్చింది. ఎంతో మంది సొంత ఊర్లలోనే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తద్వారా వలసలు దాదాపు ఆగిపోయాయి. అలాంటి పథకం మరో రెండు రోజుల్లో ముగియనుంది. దాని స్థానంలో జూలై 2వ తేదీ నుంచి ‘వీబీ జీ రామ్జీ’ పథకం అధికారికంగా క్షేత్రస్థాయిలో అందుబాటులోకి రానుంది. అదనపు ఆర్థిక భారం ఈ నూతన పథకం వల్ల ప్రభుత్వంపై గణనీయమైన ఆర్థిక భారం పడనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పాత, కొత్త పథకాల నిధుల వాటాల వ్యత్యాసాన్ని గమనిస్తే పాత ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రం వాటా 90 శాతం ఉండగా రాష్ట్రం వాటా 10 శాతం ఉండేది. నూతన పథకం (వీబీరామ్జీ) అమలైతే కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం తన నిధుల వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 30 శాతం నిధులను సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఉపాధి కల్పన నిమిత్తం భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాపై భారీగా అదనపు భారం పడనుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. నూతన సంస్కరణలు కొత్తగా అమలు కానున్న ‘వీబీ జీ రామ్జీ’ పథకంలో ప్రభుత్వం పలు మార్పులు, సామాజిక తనిఖీ నిబంధనలను తీసుకువచ్చింది. అర్హులైన ప్రతి కుటుంబానికీ ఏడాదికి 125 రోజుల పని కల్పించనున్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి కూలీల ఖాతాల్లో వేతనాలు నేరుగా జమవుతాయి. ఒకవేళ ఈ ప్రక్రియలో ఏదైనా కారణంతో ఆలస్యమైతే అందుకు తగ్గట్టుగా కూలీలకు ప్రత్యేక పరిహారం చెల్లించేలా చట్టంలో మార్పులు చేశారు. ఈ పథకం వల్ల వ్యవసాయ రంగానికి, స్థానిక రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ పథకం అమలును పకడ్బందీగా పర్యవేక్షించేందుకు వీలుగా గ్రామాలను ఏ, బీ, సీ విభాగాలుగా వర్గీకరించనున్నారు. పనుల్లో పారద ర్శకతను పెంచేందుకు ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ఫిర్యాదుల స్వీకరణ, త్వరితగతిన పరిష్కారం కోసం సరికొత్త వ్యవస్థను కూడా రూపొందిస్తున్నారు. జిల్లా సమాచారం ఉపాధిలో నమోదైన కుటుంబాలు 5,21,021 నమోదైన ఉపాధి కూలీలు 9,21,839 ఉపాధి పొందుతున్న కుటుంబాలు 2,99,253 ఉపాధి పొందుతున్న కూలీలు 4,68,030 -
స్టేట్ షూటింగ్ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు
కార్వేటినగరం: ఆంధ్రప్రదేశ్ షూటింగ్ చాంపియన్ షిప్ స్మాల్బోర్ పిస్టల్, స్మార్ట్గన్ విభా గాల్లో కార్వేటినగరం ఆర్కేఎస్సార్ జూనియ ర్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థి హితే ష్ రెండు స్వర్ణ పతకాలను కై వసం చేసుకున్న ట్టు ప్రిన్సిపాల్ స్వరూప తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 26వ తేదీ వర కు హైదరాబాద్లో స్టేట్ షూటింగ్ చాంపియన్ పోటీలు జరిగినట్టు తెలిపారు. ఇందులో తమ కళాశాల విద్యార్థి హితేష్ స్మాల్బోర్ పిస్టల్, స్మార్ట్ గన్ విభాగాల్లో ప్రతిభ చూపి రెండు స్వర్ణ పతకాలు సాధించాడన్నారు. విద్యార్థి హితేష్ను కళాశాల అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు. మామిడి కేజీకి రూ.6లు గుడిపాల: మామిడి కేజీకి రూ.6 ధర ఇవ్వాల్సిందేనని తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ రామ్మోహన్ స్పష్టం చేశారు. వారు ఆదివారం టాసా ఫ్యాక్టరీ యజమానులతో మాట్లాడి బోర్డు పెట్టించారు. రెండు రోజులుగా టాసా జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద కేజీ రూ.5, రూ.4 అని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం కావడంతో ఫ్యాక్టరీని తహసీల్దార్, ఎస్ఐ తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు సూచించారు. టాసా ఫ్యాక్టరీ యాజమాన్యం మాట్లాడుతూ తాము కిలోకు రూ.6 ఇస్తామని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. లారీ ఢీకొని అన్నాచెల్లెలు మృతి వి.కోట: మండలంలోని పేర్నంబుట్టు – వి.కోట జాతీయ రహదారిలోని మొదటి ఘాట్ లో ఆదివారం బైక్ను లారీ ఢీకొనడంతో అన్నాచెల్లెలు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. కార్ణాటక రాష్ట్రం కెజీఎఫ్ పట్టణంలోని పారాండ్లపల్లికి చెందిన శ్రీధర్ కుమారుడు బాలాజీ(22), అతని చెల్లెలు మహాశ్రీ(11) బైక్పై కేజీఎఫ్ నుంచి పెర్నంబట్టుకు బయలుదేరారు. పేర్నంబుట్టు – వి.కోట జాతీయ రహదారిలోని మొదటి ఘాట్లో పేర్నంబట్టు వైపు వెళుతున్న తమిళనాడుకు చెందిన లారీ వేగంగా వస్తూ ఢీకొంది. అన్నాచెల్లెలు లారీ చక్రాల కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నుజ్జునుజ్జు అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్పై కేసు నమోదు చేసినట్టు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. మామిడి రైతులకు కర్ణాటక తరహా సాయం అందాలి తిరుపతి అన్నమయ్య సర్కిల్: కర్ణాటకలో మామి డి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీడీపీఎస్ పథకాన్ని అమలుచేస్తూ కిలోకు రూ.17 చెల్లించడానికి ముందుకు వచ్చిందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి తెలిపారు. ఇక్కడ కూడా అలాగే చేయాలని పేర్కొన్నారు. ఇక్కడి ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత ఏడాది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటన ఖరారు కావడంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.4 గుజ్జు ఫ్యాక్టరీల ద్వారా, మరో రూ.4లు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ దఫా రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొ ని రాష్ట్రంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం (పీడీపీఎస్) అమలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారని పేర్కొన్నారు. లేఖతో సరిపెట్టుకోకుండా కేంద్రాన్ని ఒప్పించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
టమాట ధరలు పతనం
బైరెడ్డిపల్లె : నిన్నమొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న టమాట ధరలు భారీగా పతనమయ్యాయి. 15 కిలోల బాక్సు రూ.50 నుంచి అత్యధికంగా రూ.170 పలికింది. దీంతో కాయలు కోసేందుకు కూలీలు, మార్కెట్కు తరలించే ఆటో బడుగలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కాయలు ఎక్కువగా దిగుబడి ఉండడం, ఇతర మార్కెట్లకు అధికంగా సరుకు రావడంతోనే ధరలు పతనమైన ట్టు కమిషన్ మండీ వ్యాపారులు చెబుతున్నారు. పలమనేరు నియోజకవర్గంలో సుమా రు 10 వేల ఎకరాల్లో టమాట పంట సాగు చేస్తున్నారు. కొన్నిచోట్ల సాధారణ టమాట సాగు చేస్తుండగా, మరి కొన్ని చోట్ల తీగజాతి టమాటతో పాటు పందిళ్లతో ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందు లు, పందిరి ఖర్చు కలిసి భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అన్నీ సాఫీగా సాగి మంచి ధర పలికితే రైతుకు కొంతమేర ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా తెగుళ్లు, ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. నియోజకవర్గంలోని పలమనేరు, వికోట ప్రాంతాల్లో ప్రత్యేక మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి చైన్నె, బెంగళూరు, కడలూరు, పాండిచ్చేరి, విజయవాడ, మదురై, విజయనగరం, హైదరాబాదుకు టమాటాల ను ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం అక్కడ సరుకు ఎక్కువగా ఉండడంతోనే ధరలు పతనమైనట్టు వ్యాపారులు చెబుతున్నారు. తోటలోనే మాగుతున్న టమాటాలు టమాట ధరలు పతనమై పెట్టుబడి, కోత, రవాణా ఖర్చులు కూడా అందకపోవడంతో రైతులు కాయలను తోటల్లోనే వదిలేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం కాయలు కాపునకు రావడంతో డిమాండ్ తగ్గడం, దిగుబడి అధికం కావడంతో ధరలు అమాంతంగా పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరలు ఇలాగే కొనసాగితే అప్పుల పాలై ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయం దండగ అనిపిస్తోంది అప్పు చేసి పెట్టుబడి పెట్టి కష్టపడి పంట సాగు చేస్తే కాయలను కొనుగోలు చేసేనాథుడే లేడు. కాయలను మార్కెట్కు తరలించాలన్నా వాహనాల అద్దె, ఇతర ఖర్చులు రావడం లేదు. పంట సాగు కోసం చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పరిస్థితి గమనిస్తే వ్యవసాయమే దండగ అనిపిస్తోంది. – ఖాదర్భాష, పాతపేట భారీగా నష్టపోయాను ఎన్నో ఆశలతో టమాట పంట సాగు చేశాను. ప్రస్తుతం కాయలను కోస్తున్నాం. మార్కెట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. పంట దిగుబడి ఎక్కువగా వచ్చినా సంతోషం లేదు. 15 కిలోల బాక్స్ రూ.150 ధర పలికితే ఏమి గిట్టుబాటు అవుతుంది. ప్రభుత్వం స్పందించి టమాట రైతులకు ఆదుకోవాలి. – వెంకటరమణ, రామనపల్లె -
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల నిలువుదోపిడీని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. చిత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం ఆ సంఘం జిల్లా కన్వీనర్ మసూ ద్ అధ్యక్షతన జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తూ భవిష్యత్తు తరాలకు చదువును దూరం చేస్తోందని ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తూ వేధిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వారి ఒత్తిడి తాళలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా విద్య, వైద్యం అందించాల్సిన పాలకులు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు భగత్ రవి మాట్లాడు తూ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సైకిల్ యాత్ర నిర్వహించి విజయం సాధించామని గుర్తుచేశారు. జిల్లాలో ఎస్ఎఫ్ఐని మరింత బలోపేతం చేయడం ద్వారానే విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, నాయకుడు బాలసుబ్రమణ్యం, పలువురు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాయనూరు అడవిలో ఏనుగుల సంచారం కుప్పం రూరల్ : తమిళనాడు నుంచి వచ్చి రామకుప్పంలో తిష్టవేసిన రెండు ఏనుగులు శనివారం రాత్రి కుప్పం మండలం నాయనూరు అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు కుప్పం రేంజర్ జయశంకర్ తెలిపారు. వాటిని తమిళనాడులోకి తరలించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటికి రాకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితులైతేనే బయటికి రావాలని సూచించారు. అదేవిధంగా ఏనుగులు మేత కోసం అటవీ గ్రామాల వైపునకు వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ సిబ్బంది నాయనూరు ప్రాంతంలో ఉండి ఏనుగులు జనావాసాల వైపు రాకుండా చూస్తున్నట్లు చెప్పారు. -
వ్యక్తిత్వ వికాసానికి ‘బాల వికాస్’ దోహదం
చిత్తూరు కలెక్టరేట్ : పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడంతోపాటు, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి బాల వికాస్ ఎంతో దోహదం చేస్తుందని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు మధుసూద తెలిపారు. నగరంలోని పలు పాఠశాలల్లో ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో బాల వికాస్ పుస్తకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ 5 నుంచి 15 ఏళ్లలోపున్న బాలబాలికలకు వారానికి రెండు గంటల పాటు పలు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో మానవతా విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సర్వమత సమన్వయం, కుటుంబ భద్రత, వ్యక్తిగత ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తామని వివరించారు. నగరంలోని పలు పాఠశాలల్లో బాల వికాస్ కేంద్రాలను ప్రారంభించి పుస్తకాలను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. జిల్లా బాలవికాస్ సమన్వయకర్త జి.శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు బాల వికాస్ బోధనా అంశాల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ ప్రభాకర్ నాయుడు, జిల్లా పదాధికారులు జి.శంకర్, సాయిప్రకాష్, శ్రీనివాసన్, శేష నారాయణ, బాలవికాస్ గురువులు అనురాధ, సావిత్రి, యామిని సాయిలక్ష్మి, లావణ్య, కమలప్రభ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ కెమెరాలతో మామిడి ట్రాక్టర్లపై నిఘా గుడిపాల: మామిడి కాయలను తీసుకువచ్చిన ట్రాక్టర్లు సిఫార్సులతో కాకుండా సీరియల్ నంబర్ ప్రకారం ఫ్యాక్టరీలోకి వెళ్లేలా డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టినట్టు తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. వారు ఆదివారం మండలంలోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద డ్రోన్ కెమెరాలతో ట్రాక్టర్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ ఇకపై సిఫార్సులకు చెక్పెట్టి రెవెన్యూ సిబ్బందితో ప్రతిరోజూ వాహనాలకు టోకెన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎక్కడా సిఫార్సులకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రైతుల ట్రాక్టర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్లోడింగ్ చేసే బాధ్యత తాము చూసుకుంటామన్నారు. రైలు కిందపడి ఇద్దరు యువకుల ఆత్మహత్య కుప్పం రూరల్ : కుప్పం రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం వేర్వేరు చోట్ల రైలు కింద పడి ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. కుప్పం రైల్వే పోలీసుల కథనం మేరకు.. కుప్పం పట్టణం మునస్వామిపురం కాలనీకి చెందిన నిచ్చల్ (32) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో గుర్తు తెలియని యువకుడు కుప్పం – మల్లానూరు రైల్వే మార్గంలో వానగుట్టపల్లి వద్ద ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువకుడు నల్లటి షర్టు ధరించాడని, 25 నుంచి 30 ఏళ్లు ఉంటాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు 9000716436 నంబరులో కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. మృతదేహాలను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నిచ్చల్ రైలు కింద పడి మృతి చెందిన గుర్తు తెలియని యువకుడి మృతదేహం -
బాబు అసమర్థత వల్లే అవస్థలు
తిరుపతి మంగళం : రాష్ట్రంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ అసమర్థత వల్లే మామిడి రైతులు గిట్టుబాబు ధర లేక అల్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మామిడి కిలోకి రూ.15 గిట్టుబాటు ధర కల్పించాల్సింది పోయి ప్రభుత్వం రూ.4 ప్రకటించి చేతులు దులుపేసుకుంటోందని మండిపడ్డారు. దాంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యా యని వాపోయారు. పంట సాగుకు నాణ్యమైన విత్తనాలు లేక, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర మంత్రిని చూసి బుద్ధి తెచ్చుకోండి కర్ణాటకలో ఒకే ఒక ఎంపీగా ఉండి కేంద్ర మంత్రి అయిన కుమార్స్వామి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాసి, ఒత్తిడి తెచ్చి కిలో మామిడికి రూ.17.5 ధర కల్పించారని గుర్తుచేశారు. కేంద్రంలో మేం గొప్ప, మేం చెప్పిందే వేదం అని చంద్రబాబు, పవన్కళ్యాణ్ గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చేతగాని దద్దమ్మల్లా మారారని విమర్శించారు. కేంద్ర మంత్రి కుమార్స్వామిని చూసి సిగ్గుపడాలన్నారు. కేంద్రం మెడలు వంచి రైతులకు న్యాయం చేయాల్సింది పోయి కీలుబొమ్మల్లా ఆడుతున్నారని విమర్శించారు. గతంలో జగనన్న పోరాటంతో రూ.6 గత ఏడాది మామిడికి గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోస్తుంటే చలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా నిలబడి చంద్రబాబు ప్రభుత్వంతో పోరాటం చేశారని భూమన గుర్తు చేశారు. అందువల్లే మామిడి రైతులకు రూ.6 గిట్టుబా టు ధర లభించిందన్నారు. జగనన్న పాలనలో మామి డి రైతులకు ఏనాడూ రూ.20 నుంచి రూ. 25 ధర తగ్గలేన్నారు. ఇప్పుడు గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు వారి తోటలను నరికేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో 60వేల మంది రైతులు మామిడి సాగు చేస్తున్నారని, వారికి కనీస ధర లేక తోటలను నరికేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్ప్ ఫ్యాక్టరీల్లో కూడా పది టన్నుల్లో ఐదు టన్నులను మాత్రమే తీసుకుని మిగిలిన ఐదు టన్నులను వద్దని తిరిగి పంపేస్తున్నారన్నారు. వాటిని రోడ్డుపై పారబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, అనేక మంది రైతులు చెట్లల్లోనే కాయలను వదిలేస్తున్నారన్నారు. -
హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు
చిత్తూరు అర్బన్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుఫోలియో జడ్జి ఎన్.జయసూర్యను శనివారం చిత్తూరు జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరు నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.గోపీనాథ్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి అరుణసారికతో పాటు హైకోర్టు న్యాయమూర్తిని కలిశారు. ఉద్యోగ సంఘం నాయకులు రవిరెడ్డి, లక్ష్మీపతి, రాజేష్, రెడ్డెప్ప తదితరులు ఉన్నారు. వరసిద్ధుడికి వెండి కానుకలు కాణిపాకం: కాణిపాకంలో వెలసిన స్వయంభు వరసిద్ధి వినాయకస్వామికి శనివారం రాజస్థాన్కు చెందిన భక్తుడు పీయూష్ అగర్వాల్ సుమారు కిలో బరువున్న వెండి టెంకాయ, వెండి లడ్డు, ఇతర వెండి ఆకారాలను కానుకగా సమర్పించారు. వీటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థప్రసాదా లు అందజేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం హుబ్లీ కి చెందిన బోండా జాహ్నవి గోసంరక్షణ ట్రస్ట్ కు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. అధికారులు వారికి కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రకృతి వ్యవసాయంతో ప్రజలకు ఆరోగ్యం గుడిపాల: ప్రకృతి వ్యవసాయ సాగు ప్రజలకు ఆరోగ్యం అందించడమే కాకుండా రైతులకు ఆదాయాన్ని ఇస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ తెలిపారు. ఆయన శని వారం పల్లూరులో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్న పీఎండీఎస్ క్షేత్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎల్నినో పరిస్ధితుల్లో రైతులు గ్రూపుగా ఏర్పడి పీఎండీఎస్తో పాటు అంతర పంటలను సాగుచేయడం అభినందనీయమన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్పుడు ఇటువంటి పంటల సాగు ద్వారా స్థిరమైన దిగుబడి సాధించవచ్చన్నారు. 365 రోజు లు భూమి పంటలతో కళకళలాడేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అనంతరం రైతు లకు సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళి, డీపీఎం శివశంకర్, డీపీఓ మురళి, ఏడీఏ ఉమ, మండల వ్యవసాయాధికారి సంగీత, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీష పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండి క్యూలైన్ గోగర్భం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 81,340 మంది స్వామిని దర్శించుకున్నారు. 44,875 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. హుండీలో రూ.3.76 కోట్లు లభించాయి. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. -
మామిడి రైతుల ధర్నా
గుడిపాల: సిఫార్సులకు సంబంధించిన వాహనాలను పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీలోకి పంపడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుపై బైఠాయించారు. తాము వచ్చి రెండు రోజులు గడిచినా ఒక ట్రాక్టర్ కూడా అన్లోడింగ్ కావడం లేదని, ఎమ్మెల్యే సిఫార్సు అంటూ వాహనాలను తరలించడం దారుణమని మండిపడ్డారు. రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు చిత్తూరు–వేలూరు రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ రామ్మోహన్, తహసీల్దార్ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. రైతులు మాట్లాడుతూ తాము రెండు, మూడురోజుల నుంచి ఇక్కడ పడిగాపులు పడుతున్నామని వాపోయారు. కొంతమంది తాము ఎమ్మెల్యే మనుషులమని చెప్పి ట్రాక్టర్లను నేరుగా ఫ్యాక్టరీలోపలికి తీసుకెళ్లిపోతున్నారని మండిపడ్డారు. ఎస్ఐ, తహసీల్దార్ మాట్లాడుతూ సిఫార్సులకు సంబంధించిన ట్రాక్టర్లను సీరియల్లో ఉంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. -
కాకినాడ ఎమ్మెల్యేపై ఫిర్యాదు
మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం తోతాపురి ధరను కిలోకు రూ.5కు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఫ్యాక్టరీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కిలోకు రూ.6 చెల్లిస్తున్నట్లు ఫ్యాక్టరీల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ నిర్ణయం ఎక్కువ రోజులు నిలవలేదు. శనివారం మళ్లీ బోర్డులు మార్చి కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తామని ప్రకటించాయి. అలాగే గుడిపాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, ఐరాల, పూతలపట్టులోని మామిడి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు కూడా అదే ధరను అమలు చేస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. ఇక ఫ్యాక్టరీల వద్ద ధర తగ్గిపోవడంతో ర్యాంపుల వద్ద వ్యాపారులు కిలోకు రూ.3కే కొనుగోలు చేస్తున్నారు. కూలీల ఖర్చు, రవాణా వ్యయం కూడా రావడం లేదని, కాయలు కోసి అమ్మినా నష్టమే, కోయకుండా వదిలినా నష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో రూ.5 -
ఇంటింటికీ వెళ్లడం లేదు సర్..!
సాక్షి, టాస్క్ఫోర్స్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ జిల్లాలో క్షేత్రస్థాయిలో పక్కదారి పడుతోంది. ప్రతి ఓటరునూ వ్యక్తిగతంగా కలవాలి.. ప్రతి ఇంటి గడప తొక్కాలి అన్నది ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశం. క్షేత్రస్థాయిలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. బీఎల్వోలు ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లడం లేదు. ఓటర్లను స్థానిక సచివాలయాలకో, తమకు అనుకూలమైన ఏ ఇతర కార్యాలయం వద్దకో పిలిపించుకుంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి నమోదు చేసుకుని తిరిగి ఇవ్వాలని సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎలా చేయాలంటే.. ● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా చేర్చడం, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం కోసం బీఎల్వోలు కచ్చితంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. జిల్లాలో చాలా చోట్ల బీఎల్వోలు ఓటర్ల ఇళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎన్యూమరేషన్ ఫారాలను సచివాలయాల్లో కుప్పలుగా పెట్టుకుని కూర్చుంటున్నారు. ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తూ ఓటర్లనే అక్కడికి రావాలని హుకుం జారీ చేస్తున్నారు. జాబితా లీకేజీలు.. దొంగ ఓట్ల భయం ఇంటింటి సర్వే జరగకపోవడం వల్ల ఈ ప్రక్రియ ఆశించిన లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే ఇంట్లో లేని వ్యక్తులను ఉన్నట్లుగా చూపించడం, ఫోన్ సమాచారంతోనే ఫారాలు పూర్తి చేయడం వల్ల అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. అలాగే చనిపోయిన వారు, ఊర్లో లేని వారి పేర్లు కూడా జాబితాలో కొనసాగే ప్రమాదం ఉంది. ఎన్నికల నిబంధనలను క్షేత్రస్థాయిలో ఉల్లంఘిస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కార్యాలయాల్లో ఉంటున్నారు కూలి పనులు మానుకోవాల్సి వస్తోంది మా బీఎల్వో ఫోన్ చేసి సచివాలయానికి రమ్మన్నారు. నేను రానయ్యా.. ఇంటికి వచ్చి చూసుకోమంటే, సమయం లేదు బాబూ.. ఇక్కడికే వచ్చేయ్ అంటున్నారు. రోజు కూలికి వెళ్తేనే ఇల్లు గడిచే పరిస్థితి మాది. ఓటు పోతుందేమోనని భయంతో ఒకరోజు కూలి నష్టపోయి ఇక్కడికి వచ్చాను. – కె.రామయ్య, కూలీఇంటికి రావడం లేదు ఎన్నికల రూల్స్ ప్రకారం వాళ్లే మా ఇంటికి రావాలి. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇళ్లలో ఎవరు ఉంటున్నారు, ఎవరు చనిపోయారు అనేది ఆఫీసుల్లో కూర్చుంటే ఎలా తెలుస్తుంది? ఇలాగైతే దొంగ ఓట్లు ఎలా తగ్గుతాయి? ఉన్నతాధికారులు వెంటనే విచారించి యాక్షన్ తీసుకోవాలి. – సరిత, గృహిణి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2500 మంది బీఎల్వోలను నియమించారు. వారు సచివాలయాలు, వీఆర్వో ఆఫీసులు వేదికగా నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఓటర్లు పనులు మానుకుని గంటల తరబడి సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రోజువారీ కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు బీఎల్వోల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అర్హుల ఓట్లు పోకుండా చూడాలి
నిండ్ర (నగరి) : అర్హుల ఓట్లు తొలగించకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. ఆమె శనివారం నిండ్ర మండలంలోని ఇరుగువాయి, జీఎన్ కండ్రిగ పంచాయతీల్లోని 194, 195 పోలింగ్ బూత్ల్లో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు, మండల పరిశీలకులు, స్థానిక నాయకులతో సమావేశమై క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. బూత్ల వారీగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, అనర్హులైన ఓటర్ల తొలగింపు, ఫారాల దాఖలు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి బూత్ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఓటర్లకు ఎదురయ్యే ప్రతి సమస్యనూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించేలా చూడాలన్నారు. నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు సురేష్ రాజు మాట్లాడుతూ ప్రతి బూత్లోనూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన వారి ఓటును పరిరక్షించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ దీప, పార్టీ మండల అధ్యక్షుడు వేణురాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్లాల్, మునికృష్ణారెడ్డి, అనీల్కుమార్, దాము, మాజీ వైస్ ఎంపీపీ రాము, రమేష్, రాము, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడ ఎమ్మెల్యేపై ఫిర్యాదు
పలమనేరు/బంగారుపాళెం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వర్రావు అలియాస్ నానాజీపై చర్యలు తీసుకోవాలని పలమనేరు, బంగారుపాళెంకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు కోరారు. వారు శనివారం పలమనేరు పట్టణ ఎస్ఐ స్వర్ణతేజ, బంగారుపాళెం సీఐ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పాలఏకరి విభాగం అధ్యక్షులు, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు(నానాజీ) ఈ నెల 21వ తేదీన ప్రెస్మీట్లో మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా వీడియోలను షేర్ చేస్తూ రాజకీయ విధ్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పంతం వెంకటేశ్వరరావు, ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పలమనేరు పట్టణ, గంగవరం మండల కన్వీనర్లు హేమంత్కుమార్రెడ్డి, భాస్కర్రెడ్డి, నాయకులు జాఫర్, శ్యామ్సుందర్రాజ్, నరేష్, ముజ్దు, జరావారిపల్లి సర్పంచ్, బంగారుపాళెం మండల విప్, తగ్గువారిపల్లె ఎంపీటీసీ హేమచంద్ర, సోషల్ మీడియా రాష్ట్ర సంయక్త కార్యదర్శి కిషోర్కుమార్రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శులు సుబ్రమణ్యం, మునీంద్ర, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి రఘుపతిరాజు, జిల్లా మాజీ యూత్ ఉపాధ్యక్షుడు మహీంద్ర, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగరాజ, మండల యూత్ అధ్యక్షుడు గజేంద్ర, మాజీ యూత్ అధ్యక్షుడు జగదీష్, బూత్ కమిటీ కోఆర్డినేటర్ జగదీష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు శైలేష్, పార్టీ మండల కార్యదర్శి ముబారక్, కుమారస్వామి, ప్రదీప్, మణి, కార్తీక్, బద్రి, వినోద్ పాల్గొన్నారు. కాకినాడ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టండి చిత్తూరు అర్బన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. వారు శనివారం చిత్తూరు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ న్యాయ విభాగం చిత్తూరు అధ్యక్షుడు జి.సూర్యప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత ధూషణలు ఉండకూదన్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత, నీఛమైన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించుకోరని పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో పదే పదే ప్రచారం చేస్తూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నానాజీపై వెంటనే క్రిమినల్ కేసు నమోదుచేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ న్యాయ విభాగం అధ్యక్షుడు చక్రవర్తిరెడ్డి, ఆ విభాగం నేతలు సివి.రెడ్డి, మాలతి, సయ్యద్, షేక్ అమ్జాద్ పాల్గొన్నారు. -
మామిడి టన్నుకు రూ.4 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని ఫ్యాక్టరీలకు ఈ నెల 20వ తేదీకి ముందు మామిడి సరఫరా రైతులకు టన్నుకు రూ.4 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మునిరత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరత్నం నాయుడు కోరారు. వారు శనివారం జేసీ ఆదర్శ్ రాజేంద్రన్కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం జూన్ 20వ తేదీన తోతాపురి మామిడి రైతులకు టన్నుకు రూ.4 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించిందన్నారు. జూన్ 20వ తేదీకి ముందే పల్ప్ పరిశ్రమలు, ర్యాంపుల ద్వారా లక్ష టన్నుల తోతాపురి మామిడిని రైతులు సరఫరా చేశారని పేర్కొన్నారు. వారికి కూడా రూ.4 ప్రోత్సాహకాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మునిరత్నంనాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా నాయకులు ఉమాపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
స్థానికంపై ఆశలు
చిత్తూరు కార్పొరేషన్: గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్లో ముగిసింది. తదుపరి ఎన్నికలు నిర్వహించి మళ్లీ సర్పంచులను ఎన్నుకోవాల్సి ఉండగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో గ్రామ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎన్నికలకు సిద్ధమైనట్టు సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అసెంబ్లీ ఓటర్ల జాబితాను నమూనాగా తీసుకుని గ్రామాల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. దీంతో పంచాయతీ సిబ్బంది ఓటర్ల జాబితాలను సిద్ధం చేశా రు. ఆశావాహులు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 9 నెలల ముందే షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది సెప్టెంబర్లో ప్రీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గత ఏడాది అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 లోగా వార్డుల వారీ ఓటర్ల జాబితాల ప్రచురణ, నవంబర్ 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం, డిసెంబర్ 16 నుంచి 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, డిసెంబరు 15వ తేదీలోగా రిజర్వేషన్ల ఖరారు, జనవరిలో ఎన్నికల నిర్వహణ పూర్తి కావాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. విమర్శలు రావడంతో ఏప్రిల్లో ఓటర్ల జాబితాను పూర్తి చేసింది. కొత్త ఓటర్ల జాబితాలను ఇటీవల ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ జాబితాల ప్రకారం జిల్లాలో పురుషుల కంటే 11,388 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితాలు సిద్ధమవడంతో పల్లె సంగ్రామంలో పాల్గొనాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. పలువురు ఆశావహులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాలన పై ప్రజల అసంతృప్తి ఏప్రిల్ 3 నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. త్రీవ పనిభారంతో ఉన్న అధికారులు తమకు అదనంగా అప్పగించిన పంచాయతీల పాలనపై దృష్టి సారించలేని పరిస్థితి. ప్రత్యేకాధికారుల పాలన సక్రమంగా లేక గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు పల్లె ప్రజలను వేధిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పన కలగా మారింది. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణను పట్టించుకునే నాథుడే లేడని గ్రామీణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో..? జెడ్పీ పాలకవర్గం గడువు సెప్టెంబర్లో ముగియనుంది. దీంతో జెడ్పీతో కలిపి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా అనే చర్చలు మొదలయ్యాయి. సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. అన్ని సవ్యంగా జరిగితే డిసెంబర్లోపు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం యోచిస్తోందని పంచాయతీ అధికారులు అంటున్నారు. జిల్లా పంచాయతీ ఓటర్ల సమాచారం గ్రామ పంచాయతీలు 621 వార్డులు 5,914 ఓటర్లు 10,26,821 మంది పురుషులు 5,07,703 మంది మహిళలు 5,19,091 మంది ఇతరులు 27 మంది రిజర్వేషన్ల ఖరారు ఎప్పుడు? గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డులు, సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. గత రిజర్వేషన్ల ఆధారంగా ఈసారి తమకే చాన్స్ వస్తుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఆశాావహులు.. ముఖ్యంగా అధికార కూటమికి చెందిన వారు రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చేలా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టులో పెండింగ్లో ఉంది. అది తేలిన తరువాత కానీ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కాదని అంటున్నారు. ఆ తతంగం త్వరలో పూర్తయ్యేలా ఉందని అధికారులు అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బరిలో నిలిచేందుకు పలువురు సర్వ శక్తులతో రెడీ అవుతున్నారు. వీరిలో అనేక మంది ఇప్పటికే స్థానికుల అవసరాలపై దృష్టి సారిస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రూపుల వారిగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్యులకు తాయిలాలు ఎరచూపుతున్నారు. కొన్ని గ్రామాల్లో గట్టి పోటీ నెలకొని ఉండడంతో రూ.లక్షల్లో సైతం ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఒకే పంటను నమ్ముకుంటే నష్టాలు
చిత్తూరు కార్పొరేషన్: దేశంలోనే మామిడి పంట, పాల ఉత్పత్తిలో చిత్తూరు జిల్లా ముందంజలో ఉందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఆయన శనివారం చిత్తూరులోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. గిట్టుబాటు ధరలు లేక మామి డి రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. ఒకే రకమైన పంటను నమ్ముకుంటే నష్టాలు తప్పవన్నారు. ఇతర పంటలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. చిత్తూరు నుంచే గెలుపు ప్రారంభం కావాలి ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. చిత్తూరు నుంచే గెలుపు ప్రారంభం కావాలి’ అని మాధవ్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన పెట్టుబడి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. జాలి, దయతో పార్టీలో పదవులు ఇస్తారేమో కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఫారం ఇవ్వరని, పెట్టుబడిని సమ కూర్చుకోవాలన్నారు. లేదా ఇచ్చేవారిని చూసుకోవా లని తెలిపారు. కేంద్రం నిధులతో పంచాయతీల వారీగా జరిగిన అభివృద్ది పనులపై ప్రచారానికి క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి తెస్తామన్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలో రోడ్డు మార్గం ఉహించని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. త్వరలో రైల్వే డబ్లింగ్ పనులు ప్రారంభమవుతాయన్నారు. బీజేపీ చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం మాట్లాడుతూ తనకు చిత్తూరు నగరంలో 37వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోరుతూ మాధవ్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరనాయుడు, నిషిధరాజు, శ్రీనివాసులు, చిట్టిబాబు రామభద్ర, సత్య, రెడ్డిమస్తాన్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
చిత్తూరు కలెక్టరేట్: గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి సంఘం సభ్యురాలికీ ప్రభుత్వ పథకాలు చేరువ కావాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అముద అధ్యక్షతన శనివారం సమాఖ్య సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ సంఘం సభ్యులను ఆర్థికంగా. సామాజికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. రుణాల విషయంగా ముందస్తు ప్రణాళికలు అవసరమన్నారు. అర్హతలు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని సంఘాలకు రుణాలను అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోని సంఘం సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా సమాఖ్య రోవర్ ఎన్జీఓతో ఎంవోయూ చేసుకున్నారు. సమావేశంలో రోవర్ సంస్థ సీఈవో శివకుమార్, ఏపీఎంలు సుబ్బారెడ్డి, మధు, పలువురు డీఆర్డీఎ అధికారులు పాల్గొన్నారు. -
కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి
వి.కోట : మండలంలోని వి.కోట–పెర్నంబట్టు జాతీయ రహ దారి సుద్దులకుప్పం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి కారు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి(70) శుక్రవారం రాత్రి సుద్దుల కుప్పం గ్రామ సమీపంలో రోడ్డు దాటుతుండగా వి.కోట నుంచి పెర్నంబట్టు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అతని వివరాలు ఎవరికై నా తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ తెలియజేయాలని సూచించారు. చిత్తూరు అర్బన్: బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి బంగారు ఆభరణాలను మరో మహిళ చోరీ చేసింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతికి చెందిన పద్మావతి శుక్రవారం తన బంధువు చనిపోవడంతో చిత్తూరుకు వచ్చారు. అదేరోజు సాయంత్రం ఆర్టీసీ బస్సు లో తిరుపతి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లగానే తన పరుసు కనిపించలేదు. పర్సులో 10 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో ప్రయాణికురాలి అవతారంలో ఉన్న ఓ మహిళ ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. -
గంగాధరనెల్లూరులో రైతులు గరంగరం ...
జీడీనెల్లూరులోని మామిడి రైతులు శనివారం రోడ్డెక్కారు. తోతాపురి కేజీ రూ.5లని ఎలా బోర్డు పెడతారని గుజ్జు ఫ్యాక్టరీల ఎదుట నిరసనకు దిగారు. కిలో రూ.6లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పుత్తూరు జాతీయ రహదారి స్తంభించింది. వాహనాలు బారులు తీరాయి. పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి నిరసనను విరమింపజేయడానికి ప్రయత్నించారు. వారు ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే తూగుండ్రం రోడ్డులోని మరో ఫ్యాక్టరీ ఎదుట కూడా రైతులు ధర్నాకు దిగారు. ఫ్యాక్టరీ లోపల నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ఫ్యాక్టరీల సిండికేట్ దెబ్బతో గుడిపాలలోని ఫ్యాక్టరీలు కూడా బోర్డు తిప్పేశాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఫ్యాక్టరీ నిర్వాహకులతో ప్రశ్నల వర్షం కురిపించారు. -
శాంతియుత సమాజ నిర్మాణానికి సహకరించండి
కాణిపాకం: శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ హరీష్కుమార్ గుప్త కోరారు. ఆయన శనివారం కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, డీఎస్పీ జె.వెంకటనారాయణ, ఈవో పెంచల కిషోర్ డీజీపీకి స్వామిచిత్రపటం అందజేశారు. అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్త మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాల ని, శాంతిభద్రతలు మరింత బలోపేతం కావాలని వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శక, ప్రజా కేంద్రిత పోలీసు సేవలను అందించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతికత ఆధారిత ఆధునిక పోలీసింగ్కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
యాదమరి: మండలంలోని పెరుమాళ్లపల్లి వద్ద శుక్రవారం బైక్ను లారీ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీ సులు, స్థానికుల కథనం మేరకు.. పెరుమాళ్లపల్లికి చెందిన తులసి ఆచారి(60) స్థానికంగా వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో యాదమరి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ఐవోసీఎల్ వద్ద చిత్తూరు వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవేమి అడ్మిషన్లు సామీ! తిరుపతి సిటీ: 2026–27 విద్యా సంవత్సరంలో టీటీడీ జూనియర్ కళాశాలల్లో చేపట్టిన అడ్మిషన్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఇప్పటి వరకు ఎస్వీ జూనియర్ కళాశాల, పద్మావతి జూనియర్ కళాశాలలో మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయినా 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. రెండు కళాశాలల్లో 1750 సీట్లు అందుబాటులో ఉండగా సుమారు 47 వేల దరఖాస్తులు వచ్చాయి. మెరిట్ ప్రాతిపదికన తొలివిడత కౌన్సెలింగ్లో పూర్తి స్థాయి సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. అధికారులు అత్యుత్సాహంతో కఠిన నిబంధనలు విధించడంతో చాలా మంది విద్యార్థులు సీట్లు సాధించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఎస్వీ జూనియర్ కళాశాలలో అన్ని గ్రూపుల్లో 792 సీట్లు ఉండగా 43శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యా యి. ఇంకా 449 సీట్లు మిగిలిపోయాయి, పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో 968 సీట్లు ఉండగా 62 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ అధికారులు కఠిన నిబంధనలు పెట్టడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. నాలుగో విడత ప్రవేశాలే శరణ్యమా? టీటీడీ జూనియర్ కళాశాలల్లో మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తయినా 50 శాతం సీట్ల భర్తీ కాకపోవడంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. నాలుగో విడత ప్రవేశాలు చేపట్టా లా? స్పాట్ అడ్మిషన్లతో సరిపెడతామా అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఉద్యోగం పేరుతో రూ.2.16 లక్షల మోసం తిరుపతి క్రైం : ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.2,16,250 మోసం చేసిన ఇద్దరిపై తిరుపతి అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన కె.వెంకన్న (51) కుమారు డు బీటెక్ పూర్తి చేశాడు. అతనికి సురేష్ రాజ్ అనే వ్యక్తి పరియమయ్యాడు. తాను బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో హెచ్ఆర్గా పనిచేస్తున్నానని తెలిపాడు. బీటెక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని వెంకన్నను నమ్మించాడు. తర్వాత మమత శ్రీనివాస్ అనే మహిళ మొబైల్ నంబర్ ఇచ్చి సంప్రదించమని చెప్పాడు. ఆమెకు ఫోన్ చేయగా ఆమె తాను యాక్సెంచర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నానని తెలిపి, వెంకన్న కుమారుడి రెజ్యూమ్ పంపించాలని కోరింది. అనంతరం ఉద్యోగ ప్రక్రియలో భాగమంటూ అప్లికేషన్ ఫీజు, ప్రాసెస్ ఫీజు, ఆఫర్ లెటర్ ఫీజు, బ్యాంక్ అకౌంట్ ఫీజు, క్లయింట్ ఆఫర్ లెటర్ ఫీజు, మెడికల్ ఫీజు, ఆఫర్ లెటర్ రీజెనరేషన్ ఫీజు తదితర పేర్లతో విడతల వారీగా డబ్బులు చెల్లించాలని కోరింది. దీంతో వెంకన్న కుమారుడు 10 విడతల్లో రూ.2,16,250లను మమ త శ్రీనివాస్ ఖాతాకు బదిలీ చేశాడు. డబ్బులు అందుకున్న అనంతరం ఆమె ఫోనన్కు స్పందించడం మానేసింది. సురేష్రాజ్ను సంప్రదించినా కాలయాపన చేస్తూ తప్పించుకోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగాల పేరుతో వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేదా ఫోన్ నంబర్లకు డబ్బులు పంపవద్దని పోలీసులు సూచించారు. ప్రముఖ సంస్థలు ఉద్యోగాల కోసం వ్యక్తిగతంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయవని తెలిపారు. ఉద్యోగాల కు సంబంధించిన సమాచారాన్ని ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ల ద్వారానే నిర్ధారించుకోవాలని, ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్న్ లో లేదా 1930 సైబర్ హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ బాట గంగమ్మ గుడి వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 62,925 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,297 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది.దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
కిడ్నాపర్లకు సహకరించిందెవరు?
పలమనేరు: ఇంటర్నేషనల్ ట్రేడర్ ఎంసీ రవిని కేరళ పోలీసుల వేషంలో వచ్చిన దుండగులు ఈ నెల 7న కిడ్నాప్ చేశారు. అతని నుంచి రూ.కోటి నగదు, 900 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని వదిలిపెట్టిన విషయం విదితమే. ఈ కేసును సవాల్గా తీసుకున్న పట్టణ సీఐ మోహన్రెడ్డి తన బృందంతో శాసీ్త్రయ పద్ధతులతో అంతర్రాష్ట్ర ముఠాలో కొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దుండగులకు స్థానికంగా సహకరించిన వారెవరనేది ఒక ప్రశ్నలా మారింది. వారికి పక్కాగా సమాచారం ఇవ్వకపోతే అటవీ ప్రాంతంలో స్నేహితులతో కలిసి పార్టీలో ఉన్న రవిని ఎలా కిడ్నాప్ చేస్తారని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. లైవ్ లొకేషన్ ద్వారా పక్కాగా కిడ్నాప్ జాతరకు వచ్చిన రవి పలమనేరు మండలంలోని అడవి సమీపంలో ఉనన మామిడి తోపులో పార్టీ చేసుకుంటున్న విషయం అతని 20 మంది స్నేహుతులకు మాత్రమే తెలుసు. అదే తోపులోకి భానుప్రకాష్ వెళ్లి మామిడికాయలు కొంటామంటూ రవి ఉన్న విషయాన్ని చేరినట్టు చేసినట్టు తెలిసింది. ఆపై కేరళ పోలీసుల వేషంలోని ముఠా రవి కారును అడ్డగించి కిడ్నాప్ చేసింది. రవితో పాటు ఉన్న వారిలో ఎవరైనా లైవ్ లొకేషన్ సెండ్ చేశారా? లేక పార్టీకి రాని వారు కిడ్నాపర్లతో ఉంటూ ప్లాన్ చేశారా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సింది. ఈ విషయమై పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ కిడ్నాపర్లకు సహకరించిన స్థానికులపై పక్కా సాక్ష్యంతో త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పడం గమనార్హం. దీంతో రవి స్నేహితులతోపాటు, రవి విషయంలో ఉప్పందించిన వారిలో టెన్షన్ మొదలైంది. స్థానికులే సహకరించారా..? బెంగళూరులో ఉంటున్న రవి స్వగ్రామం గంగవరంలో జరిగే గంగ జాతరకు వస్తున్నానని ముఖ్య స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తనకు డబ్వులివ్వకుండా మోసం చేస్తున్నాడని చెబుతున్న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన సుంకర మహేష్నాయుడు పలుమార్లు రవి కోసం వచ్చాడు. అతను దొరకకపోవడంతో స్నేహితులకు విందు ఇచ్చినట్టు తెలిసింది. రవి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తాము సమాచారం ఇస్తామని వారు ఒప్పుకున్నట్టు సమాచారం. జాతరకు రవి వస్తున్నాడనే విషయం ముందుగా తెలిసిన వారే మహేష్నాయుడుకు చేరవేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ద్వారకా తిరుమలకు చెందిన భానుప్రకాష్ కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఉప్పలూరు నాగేశ్వర్రెడ్డికి చెప్పాడని, అతని ద్వారా కేరళ గ్యాంగ్ కలిసి జాతరకు ముందుగానే గంగవరంలోని ఓ లాడ్జిలో మకాం వేసినట్టు సమాచారం. వారికి స్థానికంగా ఉన్న ఒక వ్యక్తే లాడ్జిని తీసిచ్చినట్టు తెలిసిందే. -
కాయం చెరువులో మృతదేహం కలకలం
వడమాలపేట (పుత్తూరు): మండలంలోని కాయం చెరువులో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహం బయటపడడం స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వడమాలపేట ఎస్ఐ హరీష్ మాట్లాడుతూ మృతుడు తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణ పట్టు గ్రామాని కి చెందిన మునస్వామి (40)గా తేలిందన్నారు. బట్ట లు ఇసీ్త్ర చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వడమాలపేట మండలంలో ని కాయం చెరువులో మృతదేహమై తేలాడన్నారు. మృతునికి భార్య, కుమారు డు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ హరీష్ తెలిపా రు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం భాకరాపేట : దివంగత వి.సిద్ధరామిరెడ్డి జ్ఞాపకార్థం భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను చిన్నగొట్టిగల్లు కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు దండు కిషోర్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.40 వేల నగదు బహుమతి, రెండో స్థానానికి రూ.20 వేలు, మూడో స్థానానికి రూ.10 వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు రూ.500 నమోదు రుసుం చెల్లించి తమ జట్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక జట్టులో ఆడిన క్రీడాకారులు మరొక జట్టులో పాల్గొనడానికి అనుమతి ఉండదని, అంపైర్ల నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం 7569967760, 9177069693 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
కాయ కష్టం
మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాయల లోడుతో గుజ్జు ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని రోజుల తరబడి రాత్రింబవళ్లు అక్కడే ఉంటున్నారు. కుటుంబాలను వదిలి రోజుల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తోంది. రాత్రివేళ ట్రాక్టర్ల కిందే నిద్రిస్తున్నారు. ఒకవైపు కాయల నష్టం, మరోవైపు భద్రతపై ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ క్రమంలోనే గుడిపాలలోని ఓ ఫ్యాక్టరీ వద్ద నిద్రిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. జీడీ నెల్లూరులోని ఫ్యాక్టరీ వద్ద బారులు తీరిన మామిడి కాయల ట్రాక్టర్లు ట్రాక్టర్ కిందే కునుకు తీస్తున్న రైతు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మామిడికి గండం ముంచుకొచ్చింది. ప్రధానంగా తోతాపురి కన్నీళ్లు తెప్పిస్తోంది. కాయల కొనుగోలు స్తభించి.. కర్షకులకు కష్టాలు పెట్టిస్తోంది. ఈవిషయంలో ఫ్యాక్టరీలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గుడిపాలోని ఫ్యాక్టరీ ల్లో తమిళనాడు కాయల వ్యాపారం జోరందుకుంటోంది. అక్కడ కాయల కొనుగోలు పరిస్థితి దారుణంగా తయారైంది. అన్లోడింగ్కు వారం రోజులు పడుతోంది. అవస్థల నడుమ రైతులు కాయల కాడే కునుకుతీస్తున్నారు. జిల్లాలో 59 హెక్టార్లలో మామిడి సాగు ఉంది. ఇందులో తోతాపురి రకం 41 హెక్టార్లల్లో ఉండగా.. ప్రస్తుతానికి 25 శాతం కాయలు కోతకొచ్చాయి. ఇప్పటికే కొనుగోలు సక్రమంగా లేక రైతులు విలవిలలాడిపోతున్నారు. ఫ్యాక్టరీ వద్దకు కాయలు తీసుకెళితే టోకన్లు, వరుస నంబర్లు, సిఫార్సులంటూ...అయోమయానికి గురి చేస్తున్నారు. దీంతో రైతులు దిక్కు తోచక అల్లాడిపోతున్నారు. ప్రత్యేకించి జీడీ నెల్లూరు, గుడిపాల ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. బుధవారం సాయంత్రం నుంచి జీడీనెల్లూరులోని ఓ పల్ప్ ఫ్యాక్టరీ కొనుగోళ్లు నిలిపివేయడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర 600లకు పైగా ట్రాక్టర్లు వరుసగా నిలిచిపోయాయి. కొందరు రైతులు నాలుగు రోజులుగా, మరికొందరు వారం రోజులుగా అన్లోడింగ్ కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడిపాలలో... గుడిపాలలో సామాన్య రైతుల ట్రాక్టర్లు క్యూల్లోనే ఉండిపోతుంటే, తమిళనాడు నుంచి వచ్చే లారీలను ఫ్యాక్టరీల ఆవరణలోకి తీసుకెళ్లి దాచిపెడుతున్నారు. వెనువెంటనే అన్లోడింగ్ చేస్తున్నారు. సామాన్య రైతు ట్రాక్టర్లను మాత్రం అడపదడప గుంపులో గోవిందా అంటూ.. పరుగులు పెట్టిస్తున్నారు. ఈక్రమంలో నువ్వా.. నేనా అంటూ రైతులు పోటీపడుతున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం యాదమరి మండలం కొటాల దళితవాడకు చెందిన అనీల్కుమార్(30) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొటాల గ్రామంలో నుంచి బుధవారం ట్రాక్టర్లో మామిడికాయలు తీసుకొని గుడిపాల మండలంలోని 189కొత్తపల్లె గ్రామం సమీపంలో ఉన్న తాసా జ్యూస్ ఫ్యాక్టరీకి మామిడికాయలను తీసుకుచ్చాడు. ట్రాక్టర్ వెనుక భాగంలో నిద్రిస్తున్న అనీల్కుమార్పై బుధవారం అర్ధరాత్రి ట్రాక్టర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వరుస నంబర్లకే పరిమితమైన అధికారులు ఫ్యాక్టరీల వద్ద విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది కేవలం వరుస నంబర్లు కేటాయించడానికే పరిమితమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్యూలను పర్యవేక్షించడం, సిఫార్సుల జోక్యాన్ని అడ్డుకోవడం, అక్రమాలకు చెక్ పెట్టడం వంటి అంశాల్లో అధికారులు చొరవ చూపడం లేదని వాపోతున్నారు. వీఐపీ తరహాలో.. జీడీనెల్లూరులో సిఫార్సులకే ప్రాధాన్యం దక్కుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల సిఫార్సు ఉంటేనే త్వరగా అన్లోడింగ్ అవకాశం లభిస్తోందని రైతులు చెబుతున్నారు. లేదంటే రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సామాన్య రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ‘వీఐపీ దర్శనం‘ తరహాలో కాయల అన్లోడింగ్ జరుగుతోందని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. ట్రాక్టర్ల కిందే బస... తిండికి తిప్పలు అన్లోడింగ్ కోసం వేచి చూస్తున్న రైతులు చాలాచోట్ల నీడ లేకపోవడంతో మండుటెండల్లోనే రోజంతా గడుపుతున్నారు. రాత్రివేళ ట్రాక్టర్ల కిందే నిద్రిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి ట్రాక్టర్లు రోడ్లపైనే నిలిచిపోవడంతో మరో సమస్య రైతులను వేధిస్తోంది. ట్రాక్టర్లలోని బ్యాటరీలు, డీజిల్, ఇతర విడిభాగాలు చోరీకి గురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఒకవైపు కాయల నష్టం, మరోవైపు ట్రాక్టర్ భద్రతపై ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మామిడి రైతు పడిగాపులు -
శాంతిభద్రతలపై రాజీ వద్దు
చిత్తూరు అర్బన్: శాంతిభద్రతల పర్యవేక్షణలో ఎక్కడా రాజీ పడొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఆయన శుక్రవారం అదనపు డీజీ మధుసూదన్రెడ్డి, అనంతపురం రేంజ్ డీఐజీ షీమోషీతో కలిసి జిల్లాలోని పోలీసు అధికారులతో చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న ధైర్య–స్పర్శ, మాదకద్రవ్యాల నిర్మూలనపై చేపడుతున్న కార్యక్రమా లు, డ్రోన్ల వినియోగం, మహిళలు–పిల్లల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను ఎస్పీ తుషార్ డూడీ వివరించారు. డీజీపీ మాట్లాడుతూ డ్రోన్ ఆధారిత ఆధునిక పోలీసింగ్, కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పర్యవేక్షణ వ్యవస్థ, సైబర్–సోషల్ మీడియా పర్యవేక్షణ పనితీరుపై చర్చించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడానికి పోలీసులు ప్రయ త్నించాలన్నారు. ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. టమాట ధరలు పతనం వి.కోట: వి.కోట మార్కెట్లో శుక్రవారం ట మాటా ధరలు భారీగా పతనమయ్యాయి. 18 కిలోల బా క్సు రూ.30 నుంచి అత్యధికంగా రూ.200 పలకింది. దీంతో కాయలు కోసేందుకు కూలీలు, మార్కెట్కు తరలించే ఆటో బడుగలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా 18 కిలోల బాక్సు రూ.50 నుంచి రూ.250 వరకు ధరలు పలుకుతున్నాయి. దిగుబడి ఎక్కువగా ఉండడం, ఇతర మార్కెట్లకు అధికంగా సరుకు రావడంతో ధరలు పతనమైనట్టు కమిషన్ మండీ వ్యాపారులు చెబుతున్నారు. -
గ్రేడ్–1 కార్యదర్శులుగా పదోన్నతి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–1 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో 33 మందికి పదోన్నతులు లభించాయి. వీరిని జోన్–4 పరిధిలోని జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలకు బదిలీ చేశారు. అక్కడ కలెక్టర్లు వారికి పంచాయతీలను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు. నిబంధనలు పాటించాలి చిత్తూరు కలెక్టరేట్ : భూ వివాదాల సర్వేలో నిబంధనలు పాటించాలని సర్వేశాఖ డీడీ జయరాజ్ తెలిపారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్లో సర్వే అధికారులు, సిబ్బందికి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని భూ వివాదాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసేటప్పుడు ఖచ్చితమైన నియమ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్, ఎఫ్ లైన్స్, పట్టా సబ్ డివిజన్, ఆన్లైన్ సబ్ డివిజన్, రీసర్వే తదితర పనులు చేపట్టినప్పుడు అర్జీదారులతో సర్వే సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఆదేశించారు. అర్జీలను పరిష్కరించే క్రమంలో పాటించాల్సిన విధానాలు, పద్ధతులు, సమస్య పరిష్కారం తర్వాత ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం ముఖ్యమన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లపై పలు సూచనలు చేశారు. ఈ వర్క్షాప్లో పలువురు మండల సర్వేయర్లు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను డీడీ దృష్టికి తీసుకెళ్లారు. రీసర్వే ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే విస్తీర్ణ సవరణ అర్జీలను పరిష్కరించేందుకు గడువు పెంచాలని పెద్దపంజాణి మండల సర్వేయర్ కోరారు. ఈ వర్క్షాప్లో జిల్లా సర్వే శాఖ అధికారి పుల్లయ్య, ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, కృష్ణమూర్తి, రవిచంద్ర, ప్రసాదరావు పాల్గొన్నారు. -
వక్ఫ్బోర్డు ఆస్తుల రక్షణలో నిర్లక్ష్యం
● విధుల్లో జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అలసత్వం ● సమర్థులను నియమించాలని సీఈవోకు కలెక్టర్ లేఖ చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమంత్రి సొంత జిల్లాగా ఎంతో ప్రాధాన్యత కలిగిన చిత్తూరులోనే జిల్లాలో వక్ఫ్బోర్డు ఆస్తుల సంరక్షణ, భూ వివాదాల పరిష్కారం, రికార్డుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. జిల్లాలో వక్ఫ్బోర్డు సమస్యలపై క్షేత్రస్థాయిలో సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. వక్ఫ్బోర్డు ఆస్తులు, భూములు, పరిపాలనా సమస్యలు పెండింగ్లో పడిపోతున్నాయి. దీనిపై స్థానిక సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఇన్స్పెక్టర్ మహమ్మద్ రియాజ్ ఖాన్ స్థానంలో తక్షణమే మరొక సమర్థవంతమైన అధికారిని నియమించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు లేఖ రాశారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీలోకి ముస్లిం యువనేత పలమనేరు: పట్టణానికి చెందిన సైఫ్ అనే యువనేత శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరా రు. ఆయన మాట్లాడుతూ పార్టీ ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్టు పేర్కొన్నారు. అతనికి పార్టీ పట్టణ కన్వీనర్ హేమంత్కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత ఉత్సాహంగా పార్టీలోకి రావాలని సూచించారు. -
అయ్యోర్ల సర్దుబాటుకు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1,52,643 మంది విద్యార్థులు ఒకటి నుంచి పదవ తరగతి వరకు విద్యనభ్యసించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,26,771 మంది ఉన్నారు. ఈ ఏడాది 1.60 లక్షల మందికి అడ్మిషన్లు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులను పాఠశాలలకు సర్దుబాటు చేయడానికి సిద్ధమయ్యారు. గత ఏడాది జిల్లాలోని మోడల్ ప్రైమరీ స్కూళ్లకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఐదుగురిని నియమించారు. ఈ విద్యాసంవత్సరం వాటిలో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గితే అదనంగా ఉన్న ఉపాధ్యాయుడిని మరోచోటికి పంపిస్తారు. అలాగే బేసిక్ ప్రైమరీ స్కూల్ (బీపీఎస్)లో విద్యార్థుల సంఖ్య 60కి దాటితే మోడల్ ప్రైమరీ స్కూల్గా గుర్తించి నలుగురు టీచర్లను కేటాయిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేరు. ముఖ్యంగా కుప్పం, పలమనేరు, నగరి, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు తగ్గాయి. ఈ సమస్యను పరిష్కరించడంతోపాటు అడ్మిషన్ల సంఖ్యను పెంచడానికి సర్దుబాటు ప్రక్రియను చేపట్టినట్టు అధికారులు తెలిపారు. శాంక్షన్ పోస్టు ఉండి టీచర్లేని పాఠశాలలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నామని పేర్కొన్నారు. విభజన ప్రక్రియలోపు పూర్తి చేసేలా.. వచ్చే నెలలో జిల్లాల వారిగా టీచర్ల విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఈలోపు సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేపట్టారు. ముందుగా ప్రతి మండలంలోనూ మిగులు టీచర్లను అదే మండలంలో అవసరమైన చోటికి మారుస్తారు. తర్వాత డివిజన్ స్థాయిలో అదనంగా ఉన్న వారిని ఇతర మండలాలకు పంపిస్తారు. మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) టీచర్లనూ సర్దుబాటు చేసేందుకు జాబితా రూపొందించారు. ఈ ప్రక్రియలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 350 వరకు టీచర్లకు స్థానచలనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 30వ తేదీలోపు సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా టీచర్లను నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈనెల 20వ తేదీ నాటికి విద్యార్థుల అడ్మిషన్లను పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తు చేపట్టారు. టీచర్లు అదనంగా ఉన్న చోటి నుంచి అవసరమైన చోటుకు మార్చనున్నారు. పకడ్బందీగా సర్దుబాటు ప్రక్రియ ఉన్నతాధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సర్దుబాటు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నాం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. నిర్దేశించిన గడువులోపు ఈ తతంగాన్ని పూర్తిచేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం. – వెంకటేశ్వరరావు, ఇన్చార్జి డీఈవో -
కాయలన్నీ కుళ్లిపోతున్నాయి
గుడిపాల కొత్తపల్లి వద్ద అన్లోడింగ్కు నా లుగు రోజులు అవుతోంది. కాయలన్నీ కుళ్లిపోతున్నాయి. ఈ కాయలన్నీ రోడ్డుపైనా పడేస్తున్నాం. కాయల అన్లోడింగ్కు గుంపులు గుంపులుగా వదిలేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. – శ్రీధర్రెడ్డి, తాళంబేడు, చిత్తూరు మండలం వరుసగా పంపిస్తే కదా? గుడిపాలకు కాయలు తొలుకొచ్చి మూడు, నాలుగురోజులు అవతా ఉండాది. ఇక్కడొచ్చినాక భోజనానికి.. అన్నింటికి ఇబ్బంది పడ తా ఉండాం. సీరియల్ ప్రకారం ఎవరినీ పంపించడం లేదు. ఇబ్బంది పడుతున్నాం. రాత్రుల్లో ఈడే పడుకుంటాం. – లోకనాథం, కొండ్రెడ్డిపల్లి, చిత్తూరు మండలం లారీలను వదులుతున్నారు గుడిపాలలోని ఫ్యాక్టరీ ల్లో లారీలు అప్పటికప్పుడు అన్లోడింగ్ అవుతోంది. లారీకి 25 టన్నుల కాయలు పడుతుంది.. ట్రాక్టర్లు అన్లోడింగ్ కావాలంటే నాలుగు రోజులు అవుతోంది. ఒక్క అధికారి కూడా వచ్చి చూడడం లేదు. – ధృవ, మహాసముద్రం, బంగారుపాళ్యం వారం రోజులైతే ఎట్టా స్వామీ? కాయలు తెచ్చి ఇప్పటికి ఐదు రోజులైంది. బుధవారం సాయంత్రం ఉన్నట్టుండి అన్లోడింగ్ ఆపేశారు. మా తోటలో 80 టన్నుల కాయలు అయ్యాయి. 40 టన్నుల కాయలు మట్టిపాలయ్యాయి. మిగిలిన కాయలను ఫ్యాక్టరీకి తోలాదమనుకుంటే.. ఇక్కడ ఈ పరిస్థితి ఉంది. – సందీప్, కొట్రకోన, జీడీనెల్లూరు -
పుత్తూరులో వ్యాపారి ఆత్మహత్య
● యాప్లోన్ తీసుకుని కట్టలేకపోవడమే కారణమా? ● యాప్లోన్ నిర్వాహకుల ఒత్తిళ్లు? ● మృతుడు రాసివుంచిన ఫిర్యాదు పత్రం పుత్తూరు : మధ్య తరగతి కుటుంబాల వారు తీసుకునే యాప్ లోన్లు యమపాశాల్లా మారుతున్నాయి. యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లను భరించలేక బాధితులు ఎక్కడో ఒకచోట ప్రాణాలు తీసుకుంటున్నారు. వాటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇలాంటి సంఘటనే పుత్తూరు పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కూల్డ్రింక్స్ దుకాణం నిర్వహిస్తున్న మహదేవ్ రాయల్ (53) తన దుకాణంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. అతను డిజిటల్ రుణ సేవ ద్వారా అప్పు తీసుకున్నట్లు తెలిసింది. రుణం చెల్లింపులో జాప్యం కావడంతో యాప్ ప్రతినిధులు గురువారం సాయంత్రం దుకాణానికి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. మహదేవరాయల్ పోలీసులకు ఇవ్వడానికి సిద్ధం చేసి ఉంచిన ఫిర్యాదు పత్రం దీనికి బలం చేకూరుస్తోంది. అందులో తాను తన భార్య వరలక్ష్మి పేరు మీద కొన్ని నెలల క్రితం ‘భారత్ ఫోన్‘ అనే లోనే యాప్ ద్యారా లోను తీసుకున్నట్టు తెలిపాడు. అనివార్య కారణాల వల్ల లోన్ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయానని పేర్కొన్నాడు. దీంతో యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారని, డబ్బు చెల్లించకపోతే తన భార్య, తన ఫొటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించినట్టు వాపోయాడు. ఆ ఫొటోలను ఐదుగురు వ్యక్తులకు షేర్ చేశారని తెలిపాడు. వారు తమ అంగడి వద్దకు వచ్చి గొడవ చేశారని వాపోయాడు. వారెవరో తమకు తెలియదని తెలిపాడు. ఇలా ఫొటోలను పంపించడంతో తీవ్ర మానసిక క్షోభకు గురైనట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ఏదైనా జరిగితే భారత్ ఫోన్ యాప్ లోన్ తరపున మాట్లాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్న మహిళదే బాధ్యత అని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. అప్పుల ఒత్తిడి లేదా బెదిరింపులే ఆత్మహత్యకు కారణమన్న విషయంపై ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఎస్ఐకి రాసిన ఫిర్యాదు పత్రం -
గణనాథుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
కాణిపాకం: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శుక్రవారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బసవరాజ కూడా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. జడ్జిలు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ బసవరాజకు స్వామివారి చిత్రపటాలు అందజేస్తున్న ఆలయ అధికారులు -
అయ్య బాబోయ్.. ఫీజులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ బడుల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకటో తరగతికి కట్టే ఫీజులతో డిగ్రీ, పీజీ సైతం పూర్తి చేయవచ్చని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా 5 నుంచి 10 శాతం ఫీజులు పెంచుతున్నారని వాపోతున్నారు. యూనిఫాం దుస్తులు, పాఠ్య, నోటు పుస్తకాలు, బ్యాగ్ తదితర సామగ్రి మొత్తం తమ స్కూల్లోనే కొనాలంటూ నిబంధనలు పెడుతూ దోపిడీకి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కనిపించని తనిఖీలు సాధారణంగా ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అధికారులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. వసతులపై ఆరా తీయాలి. ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు అవుతున్నా విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. నిబంధనలు పాటించని పాఠశాలలకు అడ్డగోలుగా గుర్తింపునిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం సైతం పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫీజుల దోపిడీపై జిల్లాలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఉచిత సీట్లకూ ఫీజుల వసూలు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు ఉచితంగా కేటాయించాలి. ఉచిత సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు పలు రకాల ఫీజులంటూ వసూలు చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితాల్లోనే కమిటీలు ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్నా.. వాటి ఊసే లేదు. ఏడాదికి ఒకటి, రెండుసార్లు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు తప్ప కమిటీలను ఏర్పాటు చేయడం లేదు. కమిటీ సభ్యుల వివరాలు, తీర్మానాలను ఎంఈవో అనుమతితో డీఈవోకు అందజేయాలి. కమిటీ సిఫార్సులను నోటీసు బోర్డులో ఉంచాలి. అవి ఎక్కడా మచ్చుకై నా కనిపించడం లేదు. కానరాని బోర్డులు ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలను బోర్డుల్లో రాసి ప్రతి ఒక్కరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ఏ తరగతికి ఎంత ఫీజు కట్టించుకుంటున్నారు, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అర్హతల వివరాలు, విద్యాశాఖ అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు రాయాలి. ప్రైవేటు పాఠశాలల్లో ఇవేమీ కనిపించడం లేదు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు 161 ప్రాథమికోన్నత పాఠశాలలు 85 ఉన్నత పాఠశాలలు 185 మొత్తం పాఠశాలలు 431 ఇష్టానుసారంగా వసూళ్లు జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నారు. అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. స్కూల్ ప్రాంగణాల్లోనే పుస్తకాలు, యూనిఫాం, బెల్టులు, షూస్ వంటివి మార్కెట్ ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ప్రాంగణంలో అమ్మకాలు చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా ఆపడం లేదు. కలెక్టర్ చొరవ తీసుకుని అడ్డగోలు ఫీజుల వసూళ్లు, అమ్మకాలను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు చేయించాలి. – సద్దాం, జిల్లా స్టూడెంట్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్, చిత్తూరు. -
తెప్పోత్సవం
జ్యేష్టాభిషేకం చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం సాయంత్రం పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహించారు. అనంతరం స్వామి వారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం జ్యేష్టాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాలతో స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా ఉంచేందుకు 1990 నుంచి ఈ ఉత్సవాన్ని చేపడుతున్నారు. -
సరికొత్త బాట
వేగానికిసుందరపాళ్య నుంచి బైరెడ్డిపల్లి మార్గంలో మొదలైన రాకపోకలు బైరెడ్డిపల్లి నుంచే బెంగళూరుకు.. కర్ణాటకలోని సుందరపాళ్య నుంచి బైరెడ్డిపల్లికి వాహనాల రాకపోకలు మొదలు కావడంతో ఇకపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి వాసులు బైరెడ్డిపల్లి జంక్షన్లో ఎక్స్ప్రెస్ హైవే ఎక్కారంటే నేరుగా బెంగళూరుకు వెళ్లొచ్చు. ఇక అన్నమయ్య జిల్లా వాసులు సైతం మదనపల్లి నుంచి పుంగనూరు మీదుగా పలమనేరుతో సంబంధం లేకుండా బైరెడ్డిపల్లి మీదుగా బెంగళూరుకు మార్గం ఏర్పడింది. పలమనేరు : చైన్నె– బెంగళూరు 6 ట్రాక్ ఎక్స్ప్రెస్ హైవే పనులు కర్ణాటకలో శరవేగంగా పూర్తయ్యా యి. వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఆ మార్గంలో టోల్గేట్లు సైతం పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్లే వారు వీకోట నుంచి 40 నిమిషాల్లో హొసకోటకు చేరుకుంటున్నారు. ఫేస్–2లో భాగంగా కర్ణాటకలోని సుందరపాళ్య నుంచి చిత్తూరు జిల్లా లో బైరెడ్డిపల్లి వరకు గురువారం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరో రెండు నెలల్లో బైరెడ్డిపల్లి నుంచి బేలుపల్లి, మొగిలి ఘాట్, బ లిజపల్లి వరకు పనులు పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. ఫేజ్–2లో శరవేగంగా పనులు చైన్నె– బెంగళూరు మహానగరాల మధ్య ఎక్స్ప్రెస్ హైవే పనులు జిల్లాలోని పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో శరవేగంగా సాగుతున్నా యి. కౌండిన్యలోని ఎలిఫెంట్ జోన్ మినహా మిగిలిన చోట్ల పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. ఇప్పటికే బైరెడ్డిపల్లి వద్ద నిర్మించే జంక్షన్ పనులు పూర్తయ్యాయి. దీంతో ఇక్కడి వరకు వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. పది ప్యాకేజీల్లో సాగుతున్న రోడ్డు పనులు చైన్నె సమీపంలోని శ్రీపెరంబూదూర్ నుంచి బెంగళూరు సమీపంలోని హొసకోట వరకు 283.5 కిలోమీటర్ల మేర ఈ రహదారిని ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా) భారత్మాల పరియోజన పథకం ద్వారా రూ.16,730 కోట్లతో 2021 నుంచి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 90 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణంలో భాగంగా మూడు ఫేసుల్లో పనులు సాగుతున్నాయి. తొలిఫేస్లో కర్ణాటకలో 71 కిలోమీటర్ల పనులు పూర్తికాగా రెండు, మూడు ఫేస్లలో భాగంగా మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో పనులు జోరుగా సాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 91కి.మీల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే తారురోడ్లు, కల్వర్టులు, అండర్పాస్ బ్రిడ్జిల నిర్మాణాలు సైతం దాదాపు పూర్తికావస్తున్నాయి. ఎక్స్ప్రెస్ హైవేలో మొత్తం బ్రిడ్జిలు 162, రైల్వేక్రాసింగ్లు 4, కల్వర్టులు 143, పెడిస్ట్రిన్ అండర్పాస్లు 52, వాహనాల అండర్పాస్లు 41, ఫ్లైఓవర్లు 17 నిర్మిస్తున్నారు. వచ్చే మూడు నాలుగు నెలల్లో బైరెడ్డిపల్లి నుంచి చిత్తూరు మీదుగా చైన్నెకి వాహనాల రాకపోకలు సాగే అవకాశం ఉంది.ఏపీ ఎక్స్ప్రెస్ హైవేలో మొదలైన రాకపోకలు -
‘కాయ’కష్టం వృథా!
కాణిపాకం/గంగాధరనెల్లూరు: రైతుల కాయ కష్టం వృథా అయిపోయింది. నిండా వ్యథ మిగిల్చింది. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలోని ఓ గుజ్జు (పల్ప్) ఫ్యాక్టరీలో మామిడికాయల కొనుగోళ్లు స్తంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి కొనుగోళ్లు నిలిచిపోగా, గురువారం కూడా పునఃప్రారంభం కాలేదు. శుక్రవారమూ కొనుగోళ్లు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా వందలాది ట్రాక్టర్లు నిలిచిపోయాయి.కొందరు రైతులు ఐదు నుంచి ఏడు రోజులుగా అన్న్లోడింగ్ కోసం ఎదురుచూస్తున్నామని, రేయింబవళ్లూ నిద్రాహారాలు లేకుండా ట్రాక్టర్ల వద్దే ఉంటున్నట్టు ‘సాక్షి’కి చెప్పారు. అన్లోడింగ్ చేయకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో వేడికి కాయలు కుళ్లిపోవడం, నాణ్యత దెబ్బతింటుందని గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీలో కన్వేయర్ బెల్ట్ దెబ్బతినడంతో కొనుగోళ్లు నిలిపివేశామని, మరమ్మతులు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఇప్పటికే భారీగా కాయలు ఫ్యాక్టరీకి చేరుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇలా అయితే నిండా మునిగిపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.టమాటా రైతు కంట కన్నీరు15 కిలోల టమాటా బాక్సు రూ.100పలమనేరు: మొన్నటి దాకా బాక్సు ధర రూ.500 దాకా పలికి రైతుల్లో ఆశలు రేకెత్తించిన టమాటా ఉన్నట్టుండి నిరాశ మిగిల్చింది. ధర రూ.100కు పడిపోయింది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటకు ధర రాకపోవడంతో రైతులు కుమిలిపోతున్నారు. చివరకు కూలి కూడా దక్కడం లేదని, అప్పులే మిగులుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. పలమనేరు మార్కెట్కు గత నాలుగైదు రోజుల నుంచి టమాటాలు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో 30 లోడ్లు వస్తుండగా ఇప్పుడు 50 లోడ్లకు చేరింది. దీంతోపాటు అనంతపురం, అన్నమయ్య జిల్లాల సరుకుతోపాటు స్థానికంగా టమాటా సాగు పెరిగి ఇక్కడి సరుకు ఎక్కువగా మార్కెట్కు చేరుతోంది. దీంతో వ్యాపారులు టమాటా కొనేందుకు ఆసక్తిని చూపడం లేదు. డిమాండ్కు మించి సరఫరా ఉండడమే ధరాఘాతానికి కారణమని మండీ వ్యాపారులు చెబుతున్నారు. కాగా, పలమనేరు మార్కెట్లో గురువారం టాప్ ధర (15కిలోల) బాక్సు రూ.170 కాగా సగటు ధర బాక్సు రూ.100గా పలికింది. -
మా కోడళ్ల పరిస్థితేంటి ‘సర్’?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటర్లకు ఎదరువుతున్న పరిణామాలు కుటుంబీకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా 2002 తరువాత వివాహమైన మహిళలకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్స్ని బీఎల్వోలు తీసుకోవడం లేదు. అటువంటి వారి ఓటు మ్యాపింగ్ చేయాలన్న వివరాల గురించి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని వారు చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా ఇంటికి వచ్చి కోడళ్ల ఓట్లపై కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇందులో నిరక్షరాస్యులుగా ఉన్నటు వంటి వారి ఓట్లు ఉంటాయా? తొలగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2002 తరువాత అదనంగా 5.5 లక్షల మందికిపైగా కొత్త ఓటర్లు ఉన్నారు. వీరిలో 65 శాతం మందికిపైగా మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో కనీసం అంటే 50 శాతం మంది ఓటర్లు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వచ్చి ఉంటారని అధికారుల అంచనా. వీరంతా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్ చేసుకోవాలంటే సమస్యలు ఎదురువుతున్నట్లు బీఎల్వోలు చెబుతున్నారు. గిరిజన మహిళా ఓటర్లకే చిక్కులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.59 లక్షల మంది గిరిజన ఓటర్లు ఉన్నారు. వీరిలో 80వేల మంది మహిళా ఓటర్లే. గిరిజనులు ఎక్కువ శాతం మంది ఒకే చోట నివాసం ఉండే అవకాశం లేదు. జీవనం కోసం తరచూ ఊర్లు, జిల్లా మారుతుంటారు. ఇదిలా ఉంటే.. గిరిజనుల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులే అధికంగా ఉన్నారు. ఈ రెండు పరిణామాలతో వీరి ఓట్లు మ్యాపింగ్కి నోచుకునే అవకాశం ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ‘సర్’ కార్యక్రమం కారణంగా ఎవరి ఓట్లు ఉంటాయో.. ఎవరివి ఎగిరిపోతాయోననే జనం ఆందోళన చెందుతున్నారు. మహిళా ఓటర్లకు ‘సర్’ ప్రక్రియ చుక్కలు చూపిస్తోంది. 2002 తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికొచ్చిన కోడళ్లకు చిక్కుముడులు చుట్టుముడుతున్నాయి. పుట్టింటి నుంచి ఓటరు ఐడీ, లేదా ఇతర ఆధారాలు తెస్తేనే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తామని బీఎల్ఓలు స్పష్టం చేస్తున్నారు. ఇందులో చాలా మందికి పుట్టింటి నుంచి ఆధారాలు లభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువగా గిరిజన మహిళా ఓటర్లు ఉంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎవరి ఓట్లు ఉంటాయో.. ఎవరివి ఊడుతాయో తెలియని పరిస్థితి దాపురించింది. పుట్టింటి ఆధారాలు తప్పని సరి మెట్టినింటికి వచ్చిన మహిళలు ఓటరు జాబితాలో ఉండాలంటే పుట్టింటి ఆధారాలు చూపించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వచ్చినప్పుడు కోడళ్ల వివరాలు అడుగుతారు. వివాహానికి ముందు వారి స్వగ్రామంలో వారి తల్లిదండ్రుల ఓట్లకు సంబంధించిన జాబితాను తీసుకొస్తే ఆ ఓటుకు ఇక్కడ ఉన్న మహిళ (కోడళ్లు) ఓట్లను మ్యాపింగ్ చేస్తామని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి మహిళలు, గిరిజన ఓటర్లు పెద్ద ఎత్తున జాబితాలో ఉండే అవకాశం లేదని కొందరు బీఎల్వోలు స్పష్టం చేశారు. ఎందుకంటే అటువంటి వారి వద్ద ఓట్లకు సంబంధించిన జాబితా ఉండే అకాశం లేదని తెలుస్తోంది. -
అడ్డుకుని తరుముకున్న స్థానికులు
ప్రభుత్వ స్థలాన్ని దాదాపు చదును చేసేసిన కబ్జాదారులు ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడమే తరువాయి. స్థానికులు అధికారుల కు పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా చలనంలేదు. దీంతో గురువారం టీడీపీ నేతలు వచ్చి ఇక్కడ జరుగుతున్న కబ్జా పనులను పరిశీలించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులంతా ధైర్యంగా కబ్జా పనులను అడ్డుకున్నారు. పనులను పర్యవేక్షిస్తున్న పచ్చ మూకలను తరుముకున్నారు. చేసే దేమీలేక అందరూ తోక ముడి చి వెళ్లిపోయారు. విషయం కలెక్ట ర్ దృష్టికి వెళ్లడంతో ఆయ న కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం. -
సీసీ ఫుటేజి మాయంపై హోంమంత్రి స్పందించరెందుకు?
– మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్న నగరి : సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజి మాయంపై హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కేరోజా ప్రశ్నించారు. గురువారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. హోం మంత్రికి ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడానికి, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడానికి, సోషల్ మీడియా పోస్టులపై స్పందించడానికి సమయం ఉందన్నారు. అయితే సాయికృష్ణ కస్టోడియల్ డెత్, శవం మాయం, సీసీటీవీ ఫుటేజీ మాయం వంటి వాటిపై మాట్లాడడానికి ఆమెకు సమయం దొరక డం లేదన్నారు. ఈ కేసు విషయంలో ఆమె ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత ఆమెకు లేదా అని ప్రశ్నించారు. మౌనం పాటించకుండా వాస్తవాలను మీడియా ముందు బహిర్గతం చేయాలన్నారు. -
ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి.. కేంద్రం సానుకూలం
ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తిరుపతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్ ఏర్పాటు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వకంగా ఎంపీ గురుమూర్తికి సమాధానమిచ్చారు.ఈ ఏడాది మే నెలలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయడంతో పాటు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను నెలకొల్పాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దశలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. భూమి కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని నైలెట్కు సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్ అందిన వెంటనే కేంద్ర మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.అదే విధంగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి అందిందని, ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతిని సమాచార సాంకేతిక, సైబర్ భద్రతా విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. తిరుపతిలో నైలెట్ ఏర్పాటు కోసం ఎనలేని కృషి చేసిన ఎంపీ, ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే తిరుపతి యువతకు ఉన్నత స్థాయి సాంకేతిక విద్య, శిక్షణ అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా అరెస్ట్
పలమనేరు: కేరళ పోలీసులమంటూ పలమనేరు సమీపంలో హల్చ్ల్ చేసి ఆన్లైన్ ఇంటర్నేషనల్ ట్రేడర్ ఎంసీ రవి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన ముఠాను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంగవరానికి చెందిన ఎంసీ రవి పలుదేశాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. బెంగళూరులో ఉంటూ తరచూ ఇక్కడికి వచ్చి వెళుతుంటాడు. ఈనేపథ్యంలో ఈ నెల 7న తన స్వగ్రామంలో జరిగిన గంగజాతరకు వచ్చి స్నేహితులతో కలిసి పలమనేరు మండలంలోని ఓ మామిడి తోటలో విందు పెట్టుకున్నారు. కొందరు పలమనేరు పట్టణ సమీపంలోని టి.వడ్డూరు వద్ద అతని కారును అడ్డగించి కేరళ పోలీసులమంటూ కారులోకి ఎక్కించుకుని బేడీలు వేసి తీసుకెళ్లారు. అతని సెల్ఫోన్లోని సిమ్ను తీసేశారు. రూ.రెండు కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. కుటుంబ సభ్యులకు వేరే ఫోన్ల తో మాట్లాడించారు. ఈ నెల 8న చిక్బళ్లాపూ ర్ హైవేలో బాధితుని బంధువు నుంచి రూ. కోటి నగదు తీసుకున్నారు. బాధితుడు మెడలో ఉన్న 900 గ్రాము ల బంగారు చైన్లను లాక్కుని అతన్ని వదిలిపెట్టి కార్లలో ఉడాయించారు. దీనిపై బాధితుడు ఈ నెల 12న స్థానిక పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారా లు, సీసీటీవీ పుటేజీలు, కాల్డేటా, వాహనా ల కదలికల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలే కారణం కేరళ రాష్ట్రానికి చెందిన రోషన్ గ్యాంగ్ ఏపీ, తెలంగాణా వారితో కలిసి కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. పలమనేరు కోర్టులో ఓ ఐపీ కేసుకు సంబందించి రవికి, సంకరి మహేష్ నాయుడుకు మధ్య వివాదం ఉంది. ఈ క్రమంలో మహేష్నాయుడు ఏలూరు జిల్లా ద్వారక తిరుమలకు చెందిన భానుప్రకాష్ను సంప్రదించాడు. అతను కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఉప్పలూరు నాఽగేశ్వర్రెడ్డి (ప్రైవేట్ డిటెక్టివ్గా చెప్పుకొనే) కలిసి రవి కిడ్నాప్నకు పథకం వేసినట్టు తేలింది. దీంతో నాగేశ్వర్రెడ్డి కేరళకు చెందిన రోషన్ వర్గీస్ ముఠాను సంప్రదించి సొంతూరులో పండక్కి వచ్చిన రవిని కేరళ పోలీసులమంటూ ఆరు కార్లలో వచ్చిన 25 మంది రోడ్డుపైనే పట్టపగలే కిడ్నాప్ చేశారు. 11 మంది నిందితుల అరెస్ట్ ఈ కేసులో కేరళకు చెందిన అప్పు అరుణ్, ఎడ్విన్ థామస్, దీపుమోన్, నితిన్జానీ, అభయ్, రతీష్, లిబిన్, కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఉప్పలూరు నాగేశ్వర్రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన పందేళ్లపల్లి రామిరెడ్డి, గుండ్రా మహేశ్వర్రెడ్డి, తెలంగాణ రాష్ట్రం పనపర్తి జిల్లాకు చెందిన సుంకరి మహేష్ నాయుడును అరెస్ట్ చేశారు. వీరినుంచి మూడు కార్లు, రూ.22 లక్షల నగదు రికవరి చేశారు. పోలీసుల హ్యాండ్ కప్స్, 12 మొబైల్ ఫోన్లు, పోలీసుల నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న కేరళకు చెందిన రోషన్ వర్గీస్, సచూ, అనూప్, నికిల్మోహన్, స్వాజి, అరుణ్, సామ్, అమీన్, ద్వారకా తిరుమలకు చెందిన భానుప్రకాష్, పులివెందులకు చెందిన ప్రణీత్రెడ్డి, జస్వంత్, అనిల్, కృష్ణారెడ్డి, మరో వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. రవి ఇక్కడే ఉన్నాడనే సమాచారం ఇచ్చిన వారిపై కూడా దర్యాప్తు చేపడతామని డీఎస్పీ తెలిపారు. కిడ్నాప్ కేసులోని ప్రధాన నిందితుడు రోషన్పై కేరళలో హత్యాయత్నాలు, దాడులు, బెదిరింపులు, పేలుడు పదార్థాల సరఫరా, ఎస్డీపీఎస్ తదితర 21 కేసులు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక సింహాద్రిపురం నాగేశ్వర్రెడ్డిపై ఏపీలోని పలుచోట్ల 15 క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా కేసును ఛేదించిన పలమనేరు సీఐ మోహన్రెడ్డి టీమ్లోని సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ లోకేష్రెడ్డి, పీసీలు గణేష్, నరేష్, భాస్కర్, శశికుమార్ను డీఎస్పీ అభినందించారు. కేరళ పోలీసులమంటూ కిడ్నాప్ చేశారు -
ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గొచ్చు
పలమనేరు : ఈదఫా ఎల్నినో కారణంగా వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా వర్షాలు తగ్గే అవకాశం ఉందని, రైతులు బిందు, తుంపర్ల సేద్యంపై మక్కువ పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీ రైతులకు సూచించారు. ఆయన బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పలమనేరు మండలం టి.వడ్డూరు రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయం తదితరాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. తక్కువ నీటితో పంటలను పండించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. ఇందుకోసం ప్రస్తుతం పండిస్తున్న పంటలకు ప్రత్యామ్నాయంగా సోయాబీన్స్ పంటను సాగుచేసుకోవాలని సూచించారు. ఇది కూడా వేరుశనగ పంటలాగే తక్కువ నీటితో తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుందని తెలిపారు. సెరికల్చర్ జేడీ పద్మమ్మ మాట్లాడుతూ మల్బరీ సాగులో యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవాలన్నారు. పశుసరంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి మాట్లాడుతూ నాణ్యమైన పోషకాహారం అందజేయడం ద్వారా పాడిపశువుల్లో కొవ్వుశాతం పెరుగుతుందన్నారు. అనంతరం అధికారులు స్థానిక నాయకులతో కలిసి రైతులకు సోయాబీన్సు విత్తనాలను పంపిణీ చేసి సాగు విధానాన్ని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పీఎండీఎస్ కిట్ల ద్వారా పేలైజేషన్ ఎలా చేయాలో తెలిపారు. ఇందులో జిల్లా ఫిషరీష్ విభాగం అధికారులు ప్రకృతి వ్యవసాయశాఖ, స్థానిక వ్యవసాయ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
రక్త బంధం..
సహాయక చర్యల్లో పోలీసులు, స్థానికులు ఆ నలుగురూ రక్త సంబంధీకులే. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. బంధువుల పెళ్లికని సంతోషంగా ఆటోలో బయల్దేరారు. అందరికన్నా ముందు తామే ఉండాలని ఉబలాట పడ్డారు. కానీ వారి ఆనందం ఆవిరయ్యింది. మార్గ మధ్యంలో లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని పొట్టనబెట్టుకుంది. వారిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిలింది. ఈ ఘటన పాకాల మండలం, గుంతగాందంకి వద్ద బుధవారం చోటుచేసుకుంది. దారి కాచిన మృత్యువు ముందుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా సిగ్నల్ ఇవ్వకుండా ఆగిపోవడంతో వెనుక వస్తున్న ఆటో లారీని బలంగా ఢీకొట్టింది. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ పక్కన కూర్చున్న రాజశేఖర్ చనిపోగా.. సూర్యబాబు ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే వెనుక కూర్చున్న మాధవి, మేఘన, బేబి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. మధ్యలో ఉన్న వ్యక్తులు మాత్రం రక్తగాయాలతో బయటపడ్డారు. లారీ ఢీకొట్టిన సమయంలో ఆటోలో ఇరుక్కపోయి ఇద్దరు..విగతజీవులు కనిపించారు. క్షత్రగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మృతదేహాలు, క్షత్రగాత్రులను తిరుపతి రుయాకు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రెండు గ్రామాల ప్రజలు హుటహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి పరుగులు పెట్టారు. పెళ్లి బాజాలు చూడకనే..! పెళ్లి వేడుకకు వెళ్లేందుకు మాధవి తమ్ముడు ఆటోను ఏర్పాటు చేశాడు. మాధవి కొడుకు, కూతురిని తీసుకుని తమ్ముడి పిలుపు మేరకు పెరుమాళ్లపల్లి గ్రామానికి చేరకుంది. అక్కడి నుంచి మాధవి తమ్ముడు, తల్లి, తండ్రితో పాటు బంధువులు కలిసి గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం ఆటోలో పెళ్లి వేడుకకు బయలుదేరారు. మాధవి భర్తను ఇంటివద్దే వదిలేసి, పిల్లలు, బంధువులతో కలిసి బయల్దేరింది. కానీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారి ప్రయాణం శాశ్వతంగా ఆగిపోయింది. నుజ్జునుజ్జు అయిన ఆటోకాణిపాకం: దారి కాచిన మృత్యువు ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మృత్యుఒడికి చేర్చింది. పాకాల మండలం, గుంతగాదంకి ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన యాదమరి, చిత్తూరు రూరల్ మండలాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు.. చిత్తూరు మండలం, ఏనుగుంట్లపల్లి గ్రామానికి చెందిన మాధవి బావ కొడుకుకి తిరుపతి జిల్లా, రామచంద్రాపుర మండలంలో గురువారం ఉదయం 5–6గంటల మధ్య పెళ్లి జరనుంది. ఈ పెళ్లికి మాధవి, కుమార్తె, కుమారుడుతో పాటు మాధవి తల్లి, తమ్ముడు, తండ్రితో పాటు బంధువులు బయలు దేరారు. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో గుంత గాదంకి సమీపంలో మృత్యువు కబలించింది. పొట్టన పెట్టుకున్న లారీ చిత్తూరు మండలం, ఏనుగుంట్లపల్లి గ్రామానికి చెందిన కన్నయ్య కుటుంబం కూలినులతో జీవనం సాగిస్తోంది. కన్నయ్య భార్య మాధవి (37) దినసరి కూలీ. వారి కుమార్తె మేఘన (15) పలమనేరులోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాధవి తల్లి యాదమరి మండలం, పెరుమాళ్లపల్లి గ్రామానికి చెందిన బేబి(54), అలాగే ఆమె కుమారుడు రాజశేఖర్ (22) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. మాధవి కుమారుడు సూర్యబాబు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను పీలేరు సంక్షేమ హాస్టల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మరికొందరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆర్థిక కష్టాల మధ్య విషాదం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని మాధవి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కుమార్తెను వెంట తీసుకెళ్లి పెళ్లిలో పాల్గొనాలన్న ఆ తల్లి ఆశ.. చివరకు విషాదంగా ముగిసింది. కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న మాధవి మరణంతో భర్త కన్నయ్య, కుమారుడు సూర్యబాబు కన్నీరుమున్నీరవుతున్నారు. రాజశేఖర్కు తన అక్క కూతురిని కట్టబెట్టాలని చూసిన తల్లి బేబి కల నెరవేరకుండానే పోయింది. రఘు గ్రామంలో విషాదం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వ సహాయం అవసరమని గ్రామస్తులు కోరుతున్నారు. దహన సంస్కారాలపై కూడా గ్రామస్తులు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి జరగాలా లేదా అన్నది కూడా ఇంకా అనిశ్చితంగానే ఉంది. పెళ్లి ఆనందం కోసం బయలుదేరిన ఆ కుటుంబం చివరకు శవాలుగా తిరిగి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుబ్రమణ్యంపాకాల మండలం గుంతగాదంకి వద్ద ఘోర ప్రమాదం -
డీఈవో నియామకమెన్నడో..?
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, నాణ్యమై న విద్య అంటూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. తండ్రి సీఎం, కుమారుడు విద్యాశాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమైన ప్రజాప్రతినిధుల సొంత జిల్లాలో కీలకమైన డీఈవో పోస్టును భర్తీ చేయకుండా అలసత్వం వహిస్తున్నారు. కనీసం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడానికి కూడా జిల్లాపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా విద్యాశాఖలో ఇలాంటి దౌర్భాగ్య దుస్థితి నెలకొనడంపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జోరుగా లాబీయింగ్ డీఈవో పోస్టింగ్ కోసం తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు మాజీ డీఈవోలు (ఇందులో ఒకరు ఏడీ కేడర్) ఈ కీలకమైన పోస్టును దక్కించుకోవడానికి తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. వారిలో ఒకరికి బీజేపీ రాష్ట్ర నేతల మద్దతు ఉండగా, మరొకరికి జనసేన పార్టీ ముఖ్యనేతల మద్దతు ఉన్నట్లు సమాచారం. కూటమిలోని మిత్రపక్షాలు ఇద్దరు వేర్వేరు అధికారుల కోసం పట్టుబడుతుండడంతో, సొంత జిల్లా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చలేక తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ నియామకం వారాల తరబడి పెండింగ్లో పడిందని విద్యాశాఖ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. అలాగే ఇద్దరు డైట్ లెక్చరర్లు సైతం పోస్టు కోసం పోటీ పడుతున్నారు. డీఈవో పోస్టు భర్తీపై ఏఐఎస్ఎఫ్ నాయకులు డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు జిల్లాలో విద్యాశాఖ పర్యవేక్షణ కరువవడాన్ని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు రెచ్చిపోతున్నాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, కనీస వసతు లు లేని ప్రైవేట్ పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే విద్యావ్యవస్థ ను గాలికొదిలేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా రాజకీయ లాబీయింగ్లను పక్కనబెట్టి, జిల్లాకు తక్షణమే సమర్థుడైన రెగ్యులర్ డీఈవోను నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టడంలో డీఈవో పాత్ర కీలకం. విద్యాసంవత్సరం ప్రారంభంలో సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు, మధ్యాహ్న భోజనం అమలు తీరు, పాఠశాలల్లో మౌలిక వసతుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల కట్టడి, అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు, కొత్త పాఠశాలలకు అనుమతులు తదితర ముఖ్యమైన పనులు డీఈవో చేయాల్సి ఉంటుంది. మే 31వ తేదీన గత డీఈవో రాజేంద్రప్రసాద్ ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి డీఈవో పోస్టును భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. పెండింగ్లో ఫైళ్లు.. పర్యవేక్షణ శూన్యం జిల్లా విద్యాశాఖకు అత్యంత కీలకమైన డీఈవో పోస్టు ఖాళీగా ఉండడంతో విద్యా పరిపాలన పడకేసింది. ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాట్లు, ఉద్యోగోన్నతులు, టీచ ర్ల పర్యవేక్షణ, అడ్మిషన్ల పెంపు, పాఠశాలల నిర్వహణ నిధులు, విద్యార్థుల సంక్షేమ పథకాలకు సంబంధించిన వందలాది ఫైళ్లు డీఈవో కార్యాలయంలో మూలనపడ్డాయి. క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. -
కుళ్లుతున్న మామిడి
కాణిపాకం: జిల్లాలోని జీడీనెల్లూరు, గుడి పాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు, కార్వేటినగరం ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల వద్ద సిఫార్సుల దందా కొనసాగుతోంది. ఒక్కొ ఫ్యాక్టరీ వద్ద రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకు సిఫార్సు వాహనాలకు ప్రాధా న్యం ఇస్తున్నాయి. తద్వారా సాధారణ రైతుల ట్రాక్టర్లు నాలుగు రోజులకుపైగా అన్లోడింగ్ కోసం వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ గేట్ల వద్ద ఎవరి రాజ్యం? కొన్ని ఫ్యాక్టరీల వద్ద సెక్యూరిటీ సిబ్బందే పవ ర్ సెంటర్గా మారారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి వాహనం ముందుగా లోపలికి వెళ్లాలో వారే నిర్ణయిస్తున్నారని, కూటమి నేతల సిఫార్సు ఉంటే వారికి తక్షణమే గేట్లు తెరుచుకుంటున్నాయని రైతులు మండిపడుతున్నారు. ప్రధానంగా గంగాధర నెల్లూరులో ని ఓ ఫ్యాక్టరీ వద్ద సెక్యూరిటీ సిబ్బంది వరుస నంబర్లు ఇచ్చే క్రమంలో చేతివాటం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామా న్య రైతులను మాత్రం క్యూ కట్టించి నరకం చూపిస్తున్నారని వాపోతున్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ సిఫార్సుల ప్రభావం తగ్గలేదని అంటున్నారు. తమిళనాడు కాయల ప్రవాహం గుడిపాల సరిహద్దు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల వద్ద తమిళనాడు నుంచి వచ్చే మామిడి కాయ లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తపల్లి సమీపంలోని మరో ఫ్యాక్టరీ వద్ద సెక్యూరిటీ సిబ్బంది రైతులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కాయ లు కొనుగోలు చేయకుండా నేరుగా జీడీనెల్లూరుకు వెళ్లమని సూచించడంతో వందలాది ట్రాక్టర్లు అక్కడికి తరలివెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడు కాయలు 50పైగా లారీలు క్యూకడుతున్నాయి. ఇదీ ఫ్యాక్టరీలకు..అక్కడి వ్యా పారులకు సర్దుబాటు ఉందని, అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని పలు పల్ప్ ఫ్యాక్టరీల్లో సిఫార్సులు రాజ్యమేలుతున్నాయి. కొందరు కూటమి నేతలు సిఫార్సుల దందాను దర్జాగా నడిపిస్తున్నారు. నేరుగా ట్రాక్టర్లను ఫ్యాక్టరీ లోపలికి పంపించి అన్లోడింగ్ చేయిస్తున్నారు. వారికి ఫ్యాక్టరీల సెక్యూరిటీ సిబ్బంది సహకరిస్తున్నారు. సామాన్య రైతుల కాయలను రోడ్డుపైనే నిలబెడుతున్నారు. ట్రాక్టర్లలోనే కాయలు కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చిత్తూరు నగరంలోని పళ్ల గుజ్జు ఫ్యాక్టరీ కాయలు కొనుగోలుకు పంగనామాలు పెడుతోందని రైతులు గుర్రుమంటున్నారు. తవణంపల్లిలోని ఓ ఫ్యాక్టరీలో అన్లోడింగ్ ఆలస్యమవ్వడంతో ట్రాక్టర్లలోనే నిలిచిపోతున్నాయి. తవణంపల్లిలోని మరో ఫ్యాక్టరీ టోకన్లు, వరుస నంబర్లు ఇవ్వకుండా గందరగోళం నడుమ కాయలను అన్లోడింగ్ చేయిస్తోంది. టీడీపీ నేతల సిఫార్సులుంటే ఆ బండ్లను ముందు వరుసలో నిలబెడుతోంది. చిత్తూరు మండలం చెర్లోపల్లిలోని ఫ్యాక్టరీ గత ఏడాది బిల్లులు ఇవ్వలేదని, ఈసారి కొనుగోలుకు బ్రేకు వేసిందని రైతులు వాపోతున్నారు. ఈ తరుణంలో సిఫార్సుల వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని, ప్రతి రైతుకు సమాన అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శక విధానం అమలు చేయకపోతే ఐక్యంగా ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. -
పాఠశాల స్థాయిలోనే ఐచ్ఛిక సెలవులు అమలవ్వాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలోనే 2026–27 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఐచ్ఛిక (ఆప్షనల్ సెలవులు) అమలు కావాలని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో ఒక యూనిట్గా సెలవుల ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఏ ఉపాధ్యాయుడు కూడా ఐచ్ఛిక సెలవులను వ్యక్తిగత కారణాల కోసం విడిగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఐచ్ఛిక సెలవును పాఠశాల స్థాయిలో అమలు చేయాలనుకుంటే పర్యవేక్షణ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని డీవైఈవో, ఎంఈవోలు తమ పరిధిలోని పాఠ శాలలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించకుండా క్షేత్రస్థాయిలో తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలి – సర్వే, భూరికార్డుల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ నగరి : రైతుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలని, రీ సర్వేలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని సర్వే, భూరికార్డుల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ టి.జయరాజ్ తెలిపారు. ఆయన బుధవారం మాంగాడు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఆయన రీసర్వే చేస్తున్న విధానంపై రైతులను ఆరాతీశారు. రికార్డులను పరిశీలించారు. ఈకేవైసీని స్వయంగా తనిఖీ చేసి గ్రామ సర్వేయరు, రెవెన్యూ అధికారి, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. రీసర్వేను పారదర్శకంగా చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం నిండ్ర, నగరి మండలాలకు సంబందించిన పీజీఆర్ఎస్, ఎఫ్లైన్ పిటీషన్లను పరిశీలించా రు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సర్వే స ర్టిఫికెట్లను వెంటనే రైతులకు అందజేయాలని సూచించారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, మండల సర్వేయర్ సురేష్, గ్రామ సర్వేయర్, వీఆర్వో, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 95 శాతం సర్ ఫారాలు పంపిణీ శాంతిపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం–2 పంపిణీని 95 శాతం పూర్తి చేశారు. మొత్తం 2,30,474 మంది ఓటర్లలో బుధవారం సాయంత్రం వరకూ 2,18,807 మందికి ఫారాలను బీఎల్వోలు, బీఎల్ఏలు అందజేసినట్టు వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. వాటిని సరైన వివరాలతో నింపిన తర్వాత మళ్లీ బీఎల్వోలకు అందజేయడం ద్వారా తమ ఓటును కోల్పోకుండా చూడవచ్చని పేర్కొన్నారు. శాంతిపురం మండలంలో 48,760 మంది ఓటర్లలో 45,854 మంది, కుప్పం ఆర్బన్లో 39,984 మందికి గాను 39,898 మంది, కుప్పం రూరల్లో 58,904 మందిలో 55,232 మంది, గుడుపల్లిలో 36,015 మందిలో 34,776 మంది, రామకుప్పం మండలంలో 46,811 మంది ఓటర్లలో 43,047 మందికి ఎన్యూమరేషన్ ఫారం–2లను అందజేశారు. రాజకీయ పార్టీల నాయకులు పోలింగ్ స్టేషన్ల వారి గా నియమించిన బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు ఆయా ఫారాలను నింపడంలో సాయంగా నిలుస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్థలాలు మంజూరు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం స్థలం మంజూరు చేసిందని ఆశాఖ ఐజీ అంబేడ్కర్ తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చిత్తూరు రూరల్, నగరి, బంగారుపాళ్యం, కార్వేటినగరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవ నాల్లో ఉందన్నారు. సొంత భవనాల్లో వాటిని ఏర్పాటు చేసుకోవడానికి స్థలం మంజూరైనట్టు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్– జూన్ వరకు మొత్తం రూ.57.72 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు రూ.44.32 కోట్లు వసూలైందన్నారు. ఏప్రిల్, మే నెలల్లో కంటే జూన్లో ఆదాయం పెరిగిందన్నారు. -
ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పది, ఇంటర్ అడ్మిషన్లకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవా రం డీఈవో కార్యాలయంలో ఓపెన్ స్కూల్ 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్ల పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల మధ్యలో చదువు మానేసిన వారు ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదివేందుకు అర్హులన్నారు. అభ్యర్థులకు సమీపంలో స్టడీ సెంటర్లలో అడ్మిషన్ పొందవచ్చన్నారు. జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, ఏపీ ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత చదువులకు చెల్లుబాటు అవుతాయన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జూలై 30, అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు జూలై 31వ తేదీ చివరి తేదీ అని తెలిపారు. పదవ తరగతికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 (అందరికీ), అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీ పురుషులకు రూ.1300, సీ్త్రలకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు) రూ.900, పాఠ్యపుస్తకాలు, సర్టిఫికెట్లు ఇంటి చిరునామాకు పంపేందుకు పోస్టల్ చార్జీలు రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 (అందరికీ), ఫీజు జనరల్ పురుషులకు రూ.1400, సీ్త్రలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులకు) రూ.1100, పాఠ్యపుస్తకాలు, సర్టిఫికెట్లు ఇంటి చిరునామాకు పంపేందుకు పోస్టల్ చార్జీలు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ హేమాద్రి, జీడీనెల్లూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం సుబ్బరామయ్య, సీనియర్ అసిస్టెంట్ సల్లార్ ఖాన్, సిబ్బంది లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయలకు చుక్కెదురు
పలమనేరు: పలమనేరు ప్రాంతంలో ఎక్కువగా హైబ్రిడ్ టమాటా, బీన్సు, పొటాటో, వంగ, క్యారెట్, నిమ్మ, దోస, క్యాప్సికం, చిక్కుడు, కాకర, బీర, గుమ్మడి, కాలీఫ్లవర్, ముళ్లంగి, సొరకాయ, కరివేపాకు, బీట్రూట్ తదితర కూరగాయల పంటల సాగు చేస్తున్నారు. వీటి సాధారణ సాగు 3 వేల హెక్టార్లు. ఈ ప్రాంత వాతావరణం వీటి సాగుకు అనుకూలంగా ఉండడంతో సీజన్తో సంబందం లేకుండా రైతులు సాగు చేస్తుంటారు. ఈ సరుకు బయటి రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇటీవల రైతులు ఎక్కువగా పురుగు మందులు వినియోగిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా 270 రకాల సస్యరక్షణ మందులను నిర్దేశించిన మోతాదులో పంటలకు వాడాలనే నిబంధన ఉంది. రైతులు అధిక దిగుబడుల కోసం విచక్షణారహితంగా పురుగు మందులను వాడుతున్నారు. దీంతో మన కూరగాయలు విదేశాల నుంచి వెనక్కి వస్తున్నాయి. పాడవుతున్న భూమి మరోవైపు మితిమీరిన రసాయనిక ఎరువులతో భూములు నిస్సారం అవుతున్నాయి. ముఖ్యంగా మట్టిలో సేంద్రియ కర్బనం తగ్గిపోతోంది. ఇలాంటి పొలాల్లో సాగైన పంట ఉత్పత్తులను వినియోగించేవారికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందనే మాట గట్టిగా వినిపిస్తోంది. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జిల్లాలోనే కూరగాయల సాగులో పలమనేరు హార్టికల్చర్ డివిజన్ ముందంజంలో ఉంది. పొరుగునే ఉన్న కర్ణాటకలో ఇప్పటికే కూరగాయల సాగులో మంచి దిగుబడులు సాధిస్తున్న రైతుల స్పూర్తితో ఇక్కడి రైతులు పలు రకాల కూరగాయలను ఇక్కడ సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే కూరగాయల్లో ఫర్టిలైజర్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు లేవని చెబుతూ వెనక్కి పంపేస్తున్నారు. దీంతో వ్యాపారులు సరుకును కొనేందుకు ముందుకు రావడంలేదు. ఫలితంగా కూరగాయల ధరలపై ప్రభావం పడుతోంది. -
ఆగిన వి‘భజన’..!
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇప్పటి వరకు ఉన్న 50 వార్డులను పునర్విభజన చేసి 60 డివిజన్లుగా మార్చాలని మూడు నెలల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు రెక్కలు కట్టుకుని అధికార పార్టీ నేతలకు జీహుజూర్ అంటూ వార్డుల వి‘భజన’ చేశారు. వైఎస్సార్ సీపీ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ఎక్కడా భావించలేదు. ప్రతిపక్ష పార్టీ నేతలు జ్ఞానజగదీష్, ఆను, లోకనాథం, ఇమ్రాన్, నారాయణమూర్తి తదితరులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం 2027 జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని, అది పూర్తికాకముందే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల బీసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2027 జనగణన నిబంధనల ప్రకారం 2025 డిసెంబర్ 31 లోపు ఎన్నికల సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని, 2026 జనవరి 1 నుంచి 2027 ఏప్రిల్ 1 వరకు జనగణన నిర్వహించనున్న నేపథ్యంలో మొత్తం ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు స్పష్టంగా తెలియజేసిందన్నారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ వార్డుల విభజన చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో హైకోర్టు వార్డుల పునర్విభజన ప్రక్రియపై స్టే విధించింది. ఆగని సిఫార్సుల దందా..! ఇష్ట్రపకారం సరిహద్దులు నిర్ణయించారు. కొన్ని వార్డుల్లో కొన్ని సామాజిక వర్గాలు కనిపించనేలేదు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను లెక్కలోకి తీసుకోలేదు. ఫలితంగా చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో అధికారులు రూపొందించిన 60 వార్డుల పునర్విభజన ప్రక్రియకు హైకోర్టు బ్రేకులు వేసింది. న్యాయపోరాటం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు సరిహద్దులు మార్చేసిన అధికారులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆర్టీసీలో పీపీపీ..?
● ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలి ● డిపోలు, ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దు ● జిల్లాలో రెండో రోజూ ఎర్ర బ్యాడ్జీలతో నిరసనలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని నాలుగు డిపోల వద్ద రెండు రోజులుగా ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని, విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పేరిట ఆర్టీసీ డిపోలు, విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని నిలిపివేయాలని మండిపడుతున్నాయి. ఈ మేరకు జి.ఓ. నెం.88ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీ్త్ర–శక్తి పథకం కోసం 4 వేల కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని కోరాయి. ఉద్యోగులపై దాడులను అరికట్టాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు కొత్త డీఏలు, ఐఆర్ ప్రకటించాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషనన్ను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్కు బదులు పాత విధానాన్ని కొనసాగించాలని సూచించారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. చిత్తూరు టూ డిపో గేటు ఎదుట నిర్వహించిన నిరసనలో నాయకులు వినోద్కుమార్, సీవీ మురళీధర్, సతీష్, అన్బు, జేఎం బాలాజీ పాల్గొన్నారు. ఎంఈవోపై దాడి శ్రీరంగరాజపురం : మండల విద్యాధికారి అరుణాచలంరెడ్డి, అతని కుటుంబ సభ్యులను అడ్డగించి దాడిచేసిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట గ్రామం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏంఈవో అరుణాచలంరెడ్డి కుటుంబంతో కలిసి స్వగ్రామం 49 కొత్తపల్లి నుంచి చిత్తూరుకు వస్తుండగా మార్గమధ్యంలో 49 కొత్తపల్లిమిట్ట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అకారణంగా వారిని అడ్డగించి దాడి చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు
● డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, సీఐ ప్రసాద్, తహసీల్దార్ పరిశీలన ● రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న వైనం గంగాధర నెల్లూరు: మామిడి రైతుల సమస్యలను త్వరితగతన పరిష్కరిస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి హామీ ఇచ్చారు. తెలిపారు. జీడీ నెల్లూరులోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అలాగే మామిడి రైతుల దుస్థితిపై సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశాల మేరకు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, జీడీ నెల్లూరు సీఐ ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్ గౌడ్ బుధవారం జీడీనెల్లూరు చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఐ ప్రసాద్ ఫ్యాక్టరీ సిబ్బందితో మాట్లాడారు. సీరియల్ నంబర్ల గోల్మాల్కు సంబందించి రికార్డులను పరిశీలించారు. యూనిట్ వన్కు జీడీ నెల్లూరు తహసీల్దారు, యూనిట్ టూకు ఎంపీడీవోను అధికారులుగా నియమిస్తూ సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జరిచేశారు. మండల స్థాయి అధికారులు ఫ్యాక్టరీ వద్ద క్యూలో నిలుచున్న ఉన్న రైతులకు స్వయంగా సీరియల్ నంబర్లు కేటాయించారు. 34 మందికి పదోన్నతులు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 34 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి లభించింది. ఈ మేరకు అమరావతిలో బుధవారం గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శుల నుంచి గ్రేడ్–1గా పదోన్నతి పొందిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరికి పంచాయతీరాజ్ కమిషనర్ జోన్–4 పరిధిలోని జిల్లాలను కేటాయించగా సంబంధిత కలెక్టర్లు పంచాయతీలకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు
● విచ్ఛలవిడిగా గ్రావెల్ తరలింపు ● అధికార పార్టీ అండతోనే అక్రమ రవాణా పుత్తూరు: తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్లు మమ్మల్ని అడిగేదెవరు.. ఆపేదెవరు అంటూ కొండలను గుల్ల చేస్తూ గ్రావెల్ను విచ్ఛలవిడిగా తరలించేస్తున్నారు. పుత్తూరు మున్సిపల్ పరిధి 12వ వార్డు వినాయకపురం నుంచి కార్వేటినగరం మార్గంలో ఉన్న చలమేశ్వరి స్వామి ఆలయ దారిలో ఉన్న గుట్ట అక్రమ గ్రావెల్కు తవ్వకాలకు అడ్డాగా మారింది. ప్రతి రోజూ వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లు మట్టిని లోడు చేసుకుని కార్వేటినగరం మార్గంలో తమిళనాడుకు తరలిస్తున్నాయి. మన ప్రకృతి సంపద ఎడాపెడా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల గ్రామస్తులు పుత్తూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ గుట్టలు పుత్తూరును ఆనుకుని ఉన్న కార్వేటినగరం లెక్కదాఖలాలోకి రావడంతో ఆయన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గుట్ట పుత్తూరు మున్సిపాలిటీలో, రెవెన్యూ పరిధి కార్వేటినగరం మండలంలో ఉండడంతో అక్రమార్కులకు బాగా కలిసి వస్తోంది. భారీ వాహనాల సాయంతో గుట్టను తవ్వి సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లోనే గుట్ట మాయమవడం ఖాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతోనే ఈ తరలింపు జరుగుతోందని ఆరోపిస్తున్నారు. నెలరోజులుగా అక్రమరవాణా జరుగుతోందని, దీనిపై ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియడం లేదని వినాయకపురం, కుందిమాకుల గుంట, చిన్నబ్బనాయుడు కండ్రిగ, ఉత్తరపు కండ్రిగ గ్రామస్తులు కోరుతున్నారు. యువకుడిపై కత్తితో దాడి శ్రీరంగరాజపురం : మండలంలోని పొదలపల్లి గ్రామంలో మంగళవారం యువకుడిపై కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పోదలపల్లి గ్రామంలో మంగళవారం గంగజాతర నిర్వహించారు. ఈ జతరలో గంగయ్యకు బాబుకు మధ్య స్వల్ప గొడవ జరిగింది. గంగయ్య కుమారుడు ప్రకాష్ తన తండ్రిని ఎందుకు దూషిస్తున్నావు అని బాబును అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తత చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బాబు, అతని కుమారుడు స్టాలిన్ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకువచ్చి ప్రకాష్ కడుపుపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ప్రకాష్ను స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విష మంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాబు, అతని కుమారుడు స్టాలిన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యం రూ.15వేల కోట్లు చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరంగా ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ లక్ష్యం రూ.15వేల కోట్లుగా నిర్ణయించామని ఆ శాఖ ఐజీ అంబేడ్కర్ తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 295 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా తిరుపతి జిల్లా తిరుచానూరులో కొత్త కార్యాలయం ప్రారంభించామన్నారు. మహరాష్ట్ర తరహాలో ఫైలట్ ప్రాజెక్టుగా పీపీపీ విధానంలో మోడల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల విధానం రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నమన్నారు. ఆర్ఎస్కే (రిజిస్ట్రేషన్ సేవ కేంద్రం)కు కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. జిల్లా కేంద్రంలో కార్యాలయం పెడతామని సబ్రిజిస్ట్రార్ మినహాయించి మిగిలినవారు ప్రైవేటు సిబ్బంది అక్కడ ఉంటారన్నారు. అక్కడ డ్యాకుమెంట్ సిద్ధం చేసి చలాన్ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోనే అవకాశం ఉంటుందన్నారు. డ్యాకుమెంట్ ఫీజు కింద రూ.2వేలు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్ఆర్ నుంచి డీఆర్గా 18 మందికి, గ్రేడ్–2 ఎస్ఆర్ నుంచి గ్రేడ్–1 ఎస్ఆర్గా 52 మందికి పదోన్నతులు ఇచ్చామన్నారు. పంచాయతీలకు చెల్లించాల్సిన టీడీలు ఇవ్వనున్నమన్నారు. కార్యక్రమంలో డీఐజీ గిరిబాబు, డీఆర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అన్యాయం జరగకూడదనే..
వార్డుల పునర్విభజనపై వచ్చిన 20 అభ్యంతరాలు సహేతుకంగా లేవని అధికారులు పట్టించుకోలేదు. ప్రతిపాదిత వార్డుల విస్తరణస్థానికుల భౌగోళిక పరిస్థితులు లెక్కచేయలేయకపోగా, డివిజన్లలో పౌరుల–ప్రజల భాగస్వామ్యాన్ని బలహీనపరచేలా ఉంది. పైగా విభిన్న సామాజిక–ఆర్థిక పరిస్థితులపై సంప్రదింపులు జరపలేదు. కొత్త జనాభా లెక్కలే తీయకుండా బీసీ ఓటర్లను ఎలా గుర్తిస్తారు. 60 డివిజన్లుగా ఇష్టానుసారంగా మార్చేస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు మారిపోతాయి. అందుకే మా పార్టీ తరపున పోరాటం చేశాం. విచారణ చేసిన కోర్టు స్టే ఇచ్చింది. – ఎంసి.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త -
మామిడి గుజ్జు ఫ్యాక్టరీ వద్ద యువరైతు ఆత్మహత్యాయత్నం
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దుస్థితి దారుణంగా తయారైంది. సీరియల్ నంబర్ కోసం నాలుగు రోజులుగా గుజ్జు ఫ్యాక్టరీ వద్ద వేచి చూసిన ఓ యువరైతు చివరికి ఫ్యాక్టరీ గేటు వద్దే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. గంగాధర నెల్లూరు మండలం బొమ్మవారిపల్లికి చెందిన యువరైతు లోకేశ్ నాయుడు నాలుగు రోజుల క్రితం మామిడి లోడుతో జైన్ మామిడి గుజ్జు పరిశ్రమకు చేరుకున్నాడు. వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సీరియల్ నంబర్ ఇవ్వలేదు. కానీ అర్ధరాత్రి వేళ సిఫారసులతో వచ్చిన వాహనాలను వరుసగా ఫ్యాక్టరీలోకి వెళ్తుండటంతో ప్రశ్నించగా, అక్కడి సిబ్బంది, దళారులు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ దురుసుగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అవమానంతో కుంగిపోయిన లోకేశ్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న రైతులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడున్న రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఫ్యాక్టరీ లోపల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మోహన్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు చేపడుతామన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 12వ పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్స్ చెల్లింపులు పై చర్చించారు. ఉద్యోగుల వెల్ఫేర్ ఫండ్, మహిళా ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని సంఘ నాయకులు కోరారు. సమావేశంలో ఆపస్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు రాఘవులు, కార్యదర్శి రమేష్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్రెడ్డి పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల గళం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయిన జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలెక్టరేట్లో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లాలోని 19 గుర్తింపు పొందిన సభ్య సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరై ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలపై గళమెత్తారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ కౌన్సిల్ పునరుద్ధరించినందుకు కలెక్టర్కు సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. -
● వి.కోట విలేకరికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిక ● న్యాయం చేయాలని సీఎం చంద్రబాబుకు డాక్యుమెంట్ రైటర్ వినతి
డాక్యుమెంట్ రైటర్కు టీడీపీ నేత బెదిరింపులు తిరుపతి అన్నమయ్యసర్కిల్: కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సుమారు 14 సంవత్సరాలుగా డాక్యుమెంట్ రైటర్ గా జీవనోపాధి చేసుకుంటున్న తనకు పొంచి ఉన్న ప్రాణహాని నుంచి కాపాడాలని డాక్యుమెంట్ రైటర్ ఏఎస్ మహ బూబ్ ఉన్నతాధికారులకు విజ్ఞ ప్తి చేశారు. మంగళవారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. స్థానిక వార్డు కౌన్సిలర్, టీడీపీ నేత జాకీర్ ఈ నెల 15న తన వద్దకు వచ్చరన్నారు. తనకు ఒక డాక్యుమెంట్ చేసి పెట్టమని చేప్పాడన్నారు. కాగా అదే రోజు 11.30 గంటలకు బుక్ చేసి ఇచ్చానన్నారు. చలనా విషయంలో జరిగిన వాదనపై జాకీర్ దుర్భాషలాడి తన ఎడమ చెంపపై కొట్టి ‘నాతో పెట్టుకుంటే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తా. నా సెటిల్మెంట్లకు అడ్డు వస్తే వి కోటలో విలే కరికి పట్టిన గతే నీకు పడుతుంది. నువ్వు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎవరూ తీసుకోరు. నీ మీదే రిటర్న్ కంప్లైంట్ ఇస్తా, నీ భార్య బిడ్డలను బతకనివ్వను’ అని హెచ్చరించాడని ఆరోపించారు. వార్డు కౌన్సిలర్ జాకీర్, అతని అనుచరుల నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యతని, తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబా బు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు లేఖ ద్వారా కోరారు. వేరుశనగ 4,200 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇప్పటి వరకు జిల్లాకు వేరుశనగ విత్తనం 4200 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయింది. ఏప్రిల్లో వ్యవసాయశాఖ అధికారులు జిల్లాకు 27 వేల క్వింటాళ్ల కాయలు కేటాయించారు. ఈ మేరకు కుప్పం, పలమనేరు మండలాలకు మాత్రం 4,200 క్వింటాళ్ల కాయలొచ్చాయి. మిగిలిన మండలాలకు మొండిచేయి మిగిలింది. జూన్ నెల ముగుస్తున్నా కాయలు ఇవ్వకపోవడం ఏమి టని మండిపడుతున్నారు. -
21 రోజుల్లో రూ.1.74 కోట్లు కాణిపాకం :ఆలయంలో 21 రోజుల హుండీ లెక్కింపులో రూ.1.74 కోట్లు వచ్చిందని ఈఓ పెంచల కిషోర్ చెప్పారు.
సాయికృష్ణ కేసులో పలు అనుమానాలు నగరి : సాయికృష్ణ కేసులో మొదటి రోజు నుంచే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణలంక పోలీస్స్టేషన్లో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ మాయం అయిందనే వార్తలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయన్నారు. సాక్ష్యాలే మాయం అయితే నిజం ఎలా బయటకు తీస్తారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలన్నారు. సీసీటీవీ ఫుటేజి మాయం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందన్నారు. ఫుటేజీ మాయంపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదో తెలపాలన్నారు. లాకప్ డెత్లో నిజానిజాలు బయటపడే వరకు వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. -
ఆత్మహత్యలు చేసుకుంటుంటే..పాలాభిషేకాలా?
గంగాధర నెల్లూరు: మండల కేంద్రంలోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద మంగళవారం ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. యువరైతు లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నం ఘటనపై మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు పట్టించుకోలేదని , రైతులు రాత్రింభవళ్లు కిలోమీటర్ల మేర రోడ్లపై పడికాపులు కాస్తుంటే కూటమి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. గంగాధర నెల్లూరు మండలం జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బొమ్మవారిపల్లి గ్రామానికి చెందిన యువరైతు లోకేష్ నాయుడు తన ఎనిమిదెకరాల పొలంలో పండించిన మామిడి పంటను ట్రాక్టర్లలో నింపి నాలుగు రోజుల క్రితం పరిశ్రమ వద్దకు తీసుకురాగా మంగళవారం వరకు ఎలాంటి సీరియల్ నంబరు కేటాయించకపోవడంపై మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రతి ఒక్కరినీ కలిసి వేసిందన్నారు. మామిడి రైతులు అవస్థలు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటేపో ఓ పక్క కూటమి నేతలు మాత్రం పాలాభిషేకాలు చేస్తుండడంపై తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కష్టాలు పూర్తిగా నెరవేర్చిన తరువాత సంబరాలు చేసుకుంటే మంచిదన్నారు. రైతులు అవస్థలు పడుతూ కన్నీరు కారుస్తుంటే కూటమి నేతలకు పట్టడం లేదన్నారు. అదేవిధంగా విజయవాడలో సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగాధర నెల్లూరు పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, సీనియర్ నేత రాష్ట్ర మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గుణశేఖర్ రెడ్డి , ఏకాంబరం మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
● సీఎం సొంత జిల్లాలో గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు ● రూ.4 ధర ప్రకటించి చేతులు దులిపేసుకున్న కూటమి ప్రభుత్వం ● ఫల్ప్ ఫ్యాక్టరీల వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు ● ప్రభుత్వ తీరుపై భూమన ఆగ్రహం
మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమా? తిరుపతి మంగళం : చంద్రబాబు పాలనలో మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయమే దండగ, విద్యుత్ వైర్లపై బట్టలు ఆరేసుకోండి అంటూ రైతులను హేళన చేసిన ఘనుడు చంద్రబాబు అని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా మామిడి పంటకు పెట్టింది పేరన్నారు. అలాంటి జిల్లాలో మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కిలోకు రూ.15 ఇవ్వాల్సిందే కిలోకి రూ.15 ఇస్తే కానీ గిట్టుబాటు కాదని మామిడి రైతులు చెబుతుంటే చంద్రబాబు ప్రభుత్వం రూ.4 ప్రకటించి చేతులు దులిపేసుకుందని భూమన మండిపడ్డారు. జిల్లాలో 25 ఫల్ప్ ఫ్యాక్టరీలు కిలో రూ.5కు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. రోజుల కొద్దీ ఫల్ప్ ఫ్యాక్టరీల వద్ద లారీలు, ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయన్నారు. చిత్తూరు జిల్లాలో ఏడు లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తే అందులో గిట్టుబాటు ధర లేక రెండు లక్షల టన్నుల కాయలను రైతులు చెట్లల్లోనే వదిలేశారన్నారు. ఆత్మహత్యాయత్నం బాధాకరం గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలో టీడీపీ సానుభూతిపరుడైన మామిడి రైతు గిట్టుబాటు ధర లేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని భూమన వాపోయారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలోనే రైతు రాజుగా బతికాడని గుర్తుచేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఆ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులంతా తోపులను నరికేసి మామిడి కట్టెలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుంటే ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
దర్జాగా అక్రమ రవాణా
కుప్పం మూడు రాష్ట్రాల కూడలి ప్రాంతం. ఇది అక్రమ రవానాకు కేంద్రంగా మారింది. గతంలో సరిహద్దుల్లో అక్రమ రవాణా నియంత్రణ కోసం చెక్ పోస్టులు ఉండేవి. వాటిని ప్రస్తుతం మూసివేయడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొంతమంది తమిళనాడు రాష్ట్రం నుంచి బియ్యం కర్ణాటకలోని బంగారుపేటకు, అలాగే కుప్పం నుంచి గ్రానైట్ను తమిళనాడుకు తరలిస్తున్నారు. అలాగే ఉప్పు నుంచి పప్పు వరకు నిత్యావసర సరుకులను కర్ణాటక నుంచి కుప్పానికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికి అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమిళనాడు బియ్యం పట్టుకున్న పోలీసులు (ఫైల్) మూతపడిన బిసానత్తం చెక్ పోస్టు కుప్పం: తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డులకు ఇచ్చే బియ్యాన్ని వ్యాపారులు కిలో రూ.15లకు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత వాటిని కర్ణాటకలోని బంగారుపేటలో ఉన్న రైస్ మిల్లులకు కేజీ రూ.30 నుంచి రూ.40లకు విక్రయిస్తున్నారు. రైస్ మిల్లుల యాజమాన్యం వాటిని పాలీష్ పట్టి అధిక ధరలు అమ్ముతున్నారు. అక్రమార్కులకు కూటమి నాయకులు అండదండలు మెండుగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక కూటమి నాయకుల టిప్పర్లు, కంటైనర్ల ద్వారానే బియ్యం రవాణా చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. కుప్పం మండలంలోని ఇద్దరు మల్లానూరు చెందిన నాయకులు, శాంతిపురం మండలంలో ఇద్దరు, రామకుప్పంలో ఇద్దరు ముఠాగా ఏర్పడి బియ్యం స్మగ్లింగ్ను దర్జాగా సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు సరిహద్దులోని రామకుప్పం మండలం ఆరిమాను పెంట, శాంతిపురం మండలం విజలాపురం, కుప్పం మండలం మల్లానూను, అడవిబూదుగూరు గ్రామాల మీదుగా కర్ణాటకకు బియ్యం తరలిస్తున్నట్టు పేర్కొంటున్నారు. నిత్యం అర్ధరాత్రి వేళల్లో టిప్పర్లు, లారీల్లో బియ్యం తరలిపోతోందని చెబుతున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని ఓ గ్రామంలో బియ్యం గోడౌన్ ఏర్పాటు చేసుకుని శాంతిపురానికి చెందిన నాయకులు దర్జాగా బియ్యం రవాణా సాగిస్తున్నారు. తమిళనాడు గ్రానైట్ తరలింపు కుప్పం ప్రాంతంలో గ్రానైట్ ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడి క్వారీల్లో రాతి దిమ్మెలను గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు రాష్ట్రంలోని బరుగూరు, జగదేవి, హోసూర్, చైన్నె నగరాలకు తరిలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విష యం తెలిసినా అధికారులు కూటమి నేతలకు భయపడి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుట్టగొడుగుల్లా క్వారీలు కుప్పం నియోజకవర్గంలో రెండేళ్లుగా అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అధికార పార్టీ నేతలు నిర్ణయించిన రేటు చెల్లిస్తే ఎన్ని హెక్టార్లలోనైనా తవ్వకాలు చేసుకోవచ్చు. వారు ఆ జాబితాను సంబందిత శాఖ అధికారులు, పోలీసులకు పంపిస్తారు.దీంతో అధికారుల నుంచి క్వారీ పనులకు ఆంటంకాలు ఉండవు. దీంతో పాటు రాతి బ్లాక్ రవాణాకు సైతం అనుమతులు అందినట్లే. కర్ణాటక నుంచి నిత్యావసర సరుకుల దిగుబడి కుప్పానికి కర్ణాటకలోని బంగారుపేట 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి కుప్పానికి ప్రతి రోజూ అక్రమంగా నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సరుకులను పట్టణంలోని వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తూ ప్రజల నడ్డివిరుస్తున్నారు. మూతపడిన చెక్ పోస్టులు అక్రమ రవాణాను అరికట్టేందుకు గతంలో సరిహద్దు ప్రాంతంలో చెక్ పోస్టులు ఉండేవి. తమిళనాడు సరిహద్దులోని గాంధీనగర్, వేపనపల్లి, ఆరిమానుపెంట, మెట్లచేను, నడుమూరు, కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం, కెంపాపురం, సాతు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఉండేవి. సిబ్బంది నిరంతరం కాపలా కాస్తూ అక్రమ రవాణాను అరికట్టేవారు. ప్రస్తుతం ఆ చెక్ పోస్టులు మూతపడడంతో అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. -
తీరని శోకం
దాము కుటుంబం సభ్యులు(ఫైల్)తనలా కాకూడదని.. తాను చిన్నప్పుడు అనుభవించిన తల్లిలేని బాధను తన బిడ్డలు అనుభవించాల్సి వస్తుందన్న భయం, ఆలోచనలే దామును తీవ్ర మనోవేదనలోకి నెట్టాయి. బయటకు కనిపించని ఆ మౌన యుద్ధంలో అత్యంత విషాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ముందుగా భార్య నిర్మల (28), కుమారుడు దిలీప్ (14), కుమార్తె శ్రీవిద్య (12)కు విషమిచ్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకే కనిపించే దాము ఆ రోజు ఇంటి వద్దకు వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన అక్క చిన్ని ఇంటి వద్దకు వెళ్లింది. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులను పిలిచి తలుపులు పగులగొట్టి చూడగా నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): పలమనేరు మండలం మండీపేటకోటూరుకు చెందిన మునెప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మకు మార్కొండ, పండు, చిన్ని, దాము సంతానం. రెండో భార్య సుబ్బమ్మ. దాము వయసు నాలుగేళ్లు కూడా నిండకముందే తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. పెరుగుతున్న కొద్దీ తల్లి లేని లోటు దామును తీవ్రంగా వేధించింది. అక్క చెంత కొత్త జీవితం అక్క చిన్ని వివాహం చేసుకుని చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లికి వచ్చింది. దాము కూడా జీడీనెల్లూరు మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. వారికి దిలీప్, శ్రీవిద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. బంగారెడ్డిపల్లెలో స్థిరపడ్డాడు. డబ్బు కూడబెట్టి స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాడు. వారి జీవితం సంతోషంగా సాగుతోంది. ఇంతలోనే విధి వక్రించింది. భార్యకు పక్షవాతం పదేళ్ల క్రితం నిర్మలకు పక్షవాతం వచ్చింది. మొదట చికిత్సతో కొంత కోలుకున్నా, తర్వాత ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి దాము జీవితం ఆస్పత్రుల చుట్టూ తిరిగే ప్రయాణంగా మారింది. చిత్తూరు, వేలూరు, రాణిపేట, చైన్నెలోని ఆస్పత్రులకు భార్యను తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో అప్పులు చేశాడు. రాణిపేటలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్సకు రూ.3 లక్షలు అవసరమని చెప్పారు. ముందుగా రూ.50 వేల వరకు చెల్లించాడు. మిగిలిన డబ్బు సమకూర్చుకుని వస్తానని చెప్పి ఇంటికి చేరాడు. ఆ తర్వాత తిరుపతిలోని మరో ఆస్పత్రిలో చూపించాడు. అక్కడి వైద్యులు చిన్న మెదడుకు శస్త్రచికిత్స చేస్తే ప్రాణాపాయం తప్పదని స్పష్టం చేశారు. ఇక చేసేదేమీ లేదని చేతులెత్తేశారు. ఆ మాటలు దాము ఆశలపై చివరి దెబ్బగా మారాయి. కుమార్తెతో పాటు దాము మృతదేహం, నిర్మల మృతదేహం , విగతజీవిగా పడివున్న దిలీప్ గ్రామాన్నే కంటతడి పెట్టించింది సంఘటన స్థలంలో టీవీపై ఉంచిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ అంత్యక్రియలను ప్రభుత్వ ఖర్చుతో కాకుండా, తన సొంత నిధులతో నిర్వహించాలని అందులో రాసి ఉంది. ఆ లేఖ చదివిన వారందరూ ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. చివరి క్షణాల్లో కూడా తన కుటుంబ గౌరవం గురించి ఆలోచించిన దాము పరిస్థితి ఎంత దయనీయంగా ఉండి ఉంటుందోనని చర్చించుకున్నారు. తల్లి లేని చిన్ననాటి బాధను జీవితాంతం మోసిన దాము భార్య అనారోగ్యాన్ని తట్టుకోలేక, పిల్లల భవిష్యత్తుపై భయంతో చివరకు తీసుకున్న నిర్ణయం నలుగురు ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు ఆ ఇంటి ముందు మిగిలింది నాలుగు చితులు... గ్రామం గుండెల్లో మిగిలింది చెరగని విషాదం మాత్రమే. అతను చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. అనాథలా పెరిగాడు. పెళ్లి చేసుకుని జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలకు ఏ లోటూ రాకుండూ చూసుకుంటున్నాడు. విధి అతడిని వదల్లేదు. భార్య అనారోగ్యం పాలవడం.. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కుమిలిపోయాడు. ఖరీదైన వైద్యం చేయించడానికి చేతిలో చిల్లిగవ్వ లేక మనోవ్యథ చెందాడు. ఇంక బతకడం వృథా అనుకున్నాడు. తాను చిన్నప్పుడు పడిన తల్లిలేని బిడ్డ అనే ఆవేదన తన పిల్లలకు రాకూడదని భావించాడు. పిల్లలు, భార్యకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. చిన్ననాటి గాయం.. నలుగురిని మింగేసింది..! నా తమ్ముడు చివరగా ఏమన్నాడంటే.. ‘‘మనం తల్లి లేని బిడ్డలం కదా. మనం పడిన కష్టాలు తెలుసు కదా. నా బిడ్డలు కూడా తల్లిలేని బిడ్డలైపోతున్నారు’’ అని నా తమ్ముడు బాధపడేవాడు. తల్లి అయినా.. అత్త అయినా నేను ఉంటానని చెప్పాను. చేతిలో చేయి వేసి నేనుండానని చెప్పాను. ఆదివారం రాత్రి కూడా సంగటి, చికెన్ వండిపెడితే భార్యాభర్తలు తిన్నారు. నేను ఇక్కడే పడుకుంటాను అంటే వద్దన్నాడు. ఇంటికెళ్లు మామ ఒక్కడే ఉంటాడు అని చెప్పి నన్ను పంపించాడు. తెల్లారేకల్లా నా తమ్ముడు ఇలా విగతజీవిగా మారాడు. భార్య బతకాలని మొక్కని దేవుళ్లు లేరు. – చిన్ని, దాము సోదరి -
ఆ సీఐ వెనుక బిగ్బాస్ ఎవరు?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాలని, ఆ సీఐ వెనుక ఉన్న బిగ్బాస్ ఎవరో బయటపెట్టాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ మృతి, దళిత యువకుడు క్రాంతికుమార్ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికృష్ణ మరణం వెనుక ఉన్న అసలు బాధ్యులను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. కేసులో మర్డర్ సెక్షన్లు నమోదు చేసినప్పటికీ సంబంధిత సీఐపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ‘ఆ సీఐ వెనుక ఉన్న బిగ్బాస్ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో జరిగిన తూత్తుకుడి లాకప్ డెత్ కేసులో సాక్ష్యాలు ఆధారంగా తొమ్మిది మంది పోలీసులకు కఠిన శిక్షలు పడిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలో చట్టం తన పని చేసిందని, మన రాష్ట్రంలో మాత్రం నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దళిత కుటుంబానికి చెందిన యువకుడు క్రాంతికుమార్ సీఐ నాగరాజు వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటనపైనా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాలలు, మాదిగలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ దళితులపై దాడులు ఆగకపోవడం బాధాకరమన్నారు. గతంలో మాల, మాదిగలు ఐక్యంగా ఉన్నారని, అనంతరం రాజకీయ ప్రయోజనాల కోసం వారిని విడదీసి దళితుల ఐక్యతను బలహీనపరిచారని దుయ్యబట్టారు. దళితులపై అన్యాయం జరుగుతున్నా కొందరు నాయకులు, సంఘాల ప్రతినిధులు మౌనం పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ, క్రాంతికుమార్ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు లోకేష్రెడ్డి, ఇరుగమరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆదేశించారు. ఆయన సోమ వారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో లోఓల్టేజీ, వ్యవసాయ సర్వీసుల మంజూరు, ట్రాన్స్ఫార్మర్ల సరఫరాలో అంతరాయాలు తదితర సమస్యలు ఉన్నారు. అనంతరం ఎస్ఈ అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేయరాదని ఆదేశించారు. డీసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి కార్వేటినగరం: 2026–27లో డీఈడీ కోర్సు చేసేందుకు ఏపీ డీసెట్–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టౌన్లోడ్ చేసుకోవాలని డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దామోదర రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 1న ప్రవేశ పరీక్ష జరగనుందని తెలిపారు. హాల్టికెట్లను వెబ్సైట్ apdeecet.apcfss.in సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈమేరకు డీసెట్ చైర్మన్, డైరెక్టర్ పాఠశాల విద్య అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు పేర్కొన్నారు. బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు చిత్తూరు అర్బన్: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో వగళ్ల మోహన్ రెడ్డి (37) అనే ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహ న కుమారి ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. సదుం మండలం గుట్టమీదపల్లె బస్టాప్ వద్ద 2014 మే 24వ తేదీన 17 ఏళ్ల బాలిక బస్సు కోసం వేచి ఉంది. ఆ సమయంలో గుట్టమీదపల్లె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్రెడ్డి తన ఆటోలో ఆమెను ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక, ఆటోను పక్కకు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అదేరోజు బాలికను హైదరాబాద్కు తీసుకెళ్లాడు. బాలికను వదిలేయాలని మోహన్రెడ్డి స్నేహితుడు చెప్పగా, అక్కడే వదిలేశాడు. ఆపై బాలిక తన స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీనిపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో సదుం పోలీసులు కేసు నమోదుచేసి, నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో సహా నేరం రుజువుకావడంతో ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష, రూ.16 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తిగా ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ప్రభుత్వం తరఫున అందజేయాలని జిల్లా కలెక్టర్ను కోర్టు ఆదేశించింది. టిప్పర్ను ఢీకొన్న కారు – ఒకరి మృతి – మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గుడిపాల: మండలంలోని వసంతాపురం వద్ద సోమవారం టిప్పర్ను కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ రామ్మోహన్ కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం వందవాసికి చెందిన నారాయణస్వామి(60), దివ్య(16), బాలసుబ్రమణ్యం(50), విజయలక్ష్మి, చారులత, కావ్య, విజయలక్ష్మి కారులో శ్రీకాళహస్తి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వసంతాపురం వద్ద ముందు వెళుతున్న టిప్పర్ను కారు ఢీకొంది. దీంతో నారాయణస్వామి, దివ్య, బాలసుబ్రమణ్యం(50) తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలసుబ్రమణ్యం మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. విజయలక్ష్మి, చారులత, కావ్యకు స్వల్పగాయాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.10,700 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీన్కుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమవారం గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదువుతున్న 11 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.10,700 కోట్ల బకాయిలను ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజులు విడుదల చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. గత రెండేళ్లుగా రూ.2,200 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా తొక్కిపెట్టిందన్నారు. ప్రతి ఏటా ఫీజుల పథకానికి రూ.3,900 కోట్లు కేటాయించాల్సి ఉండగా, 2026–27 బడ్జెట్లో రూ.2,766 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లో రూ.1200 కోట్లు చూపి, రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. గతంలో వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్కు రూ.15 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు అందేవన్నారు. ప్రస్తుత కూటమి సర్కారు నిధుల కోతతో 11 లక్షల మంది విద్యార్థులను పథకాలకు దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే బకాయిలతో సంబంధం లేకుండా కాలేజీల నుండి విద్యార్థుల సర్టిఫికెట్లు తక్షణమే ఇప్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ధర్నాలో నాయకులు లిఖిత్, వివేక్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
నేతన్నల ధర్నా
చిత్తూరు కలెక్టరేట్: చేనేత కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగ దని రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యా చరణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షణ్ముగవర్మ మండిపడ్డారు. చేనేత కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు పెండింగ్లో ఉన్న రూ.203 కోట్ల బకాయిలు ఇవ్వాలన్నారు. గత ఏడాది ఆగస్టు 7న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా నేతన్న భరోసా కింద రూ.25 వేలు విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో చేనేత రంగానికి రూ.25 వేల కోట్లను కేటాయించాలన్నారు. చేనేతలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తరహాలోనే చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. చేనేత అనుబంధ ఉపవృత్తి కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు కె.వి.కుప్పయ్యశెట్టి, గౌరవాధ్యక్షుడు నీలా పండరి, జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు చల్లా బాలాజీ, నాయకులు చల్లా మురగయ్యశెట్టి, చల్లా లోకనాథంశెట్టి, కందల బాలాజీ, నీల శంకర్, కోటేశ్వరి పాల్గొన్నారు. ప్రశాంతంగా ముగిసిన కౌన్సెలింగ్ – 490 మంది టీచర్ల బదిలీలు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. చిత్తూరు ఇన్చార్జ్ డీఈవో వెంకటేశ్వరరావు, తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్ సంయుక్తంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌన్సెలింగ్ను పకడ్బందీగా చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 490 మంది ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ కోసం విద్యాశాఖ అధికారులు 868 ఖాళీలను ప్రదర్శించారు. ఈ బదిలీల్లో పాల్గొన్న వారిలో 1998 డీఎస్సీ టీచర్లు 316 మంది ఉండగా, 2008 డీఎస్సీకి చెందిన వారు 174 మంది ఉన్నారు. సీనియారిటీ, నిబంధనల ప్రకారం పారదర్శకంగా స్థానాలను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పర్యవేక్షణలో చిత్తూరు, తిరుపతి జిల్లాల విద్యాశాఖ సూపరింటెండెంట్లు రమేష్, నాగరాజు, గుడిపాల ఎంఈవో హస్సన్బాషా, ఏఎస్వో ఆనంద్, ఏపీవో జయప్రకాష్, ఉపాధ్యాయ సంఘం నేతలు గంటా మోహన్, కన్నన్, విజయ భాస్కర్, ప్రకాష్, మదన్ మోహన్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని బాలుడి మృతి
గంగవరం: బైక్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెద్దఉగిణి గ్రామంలో మహమ్మద్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతని మొదటి కుమారుడు అమిద్(10) ఇదే గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో 4వ తర గతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ట్యూషన్ ముగించుకుని చికెన్ సెంటర్లో ఉంటున్న తన తండ్రి దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో బెంగళూరు వైపు వెళ్తున్న బైక్ ఢీకొంది. బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనదారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా పెద్దఉగిణి గ్రామానికి సమీపంలో ఉన్న హైవే నుంచి గ్రామంలోకి రావాలంటే నానా తప్పలు పడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు క్రాస్ చేసే క్రమంలో వాహనాలు ఢీకొని ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు పేర్కొంటున్నారు. అక్కడ స్కై వాకర్ ఏర్పాటు చేయడంతో పాటు లైట్లు వెలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆలకించి దయచూపండయ్యా..!
చిత్తూరు కలెక్టరేట్ : అధికారుల తప్పిదాలు, కొందరి అక్రమాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. ‘ఆలకించి దయచూపండయ్యా.. అని పలువురు ప్రజలు వాపోయారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో తమ గోడును కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఎదుట వెల్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ వినతులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 238 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ అధికారు లు వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శ్ రా జేంద్రన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జీవితంలో యోగా భాగం కావాలి
చిత్తూరులో యోగాసనాలు వేస్తున్న అధికారులు, ప్రజలుకాణిపాకంలో యోగాసనాలు వేస్తున్న ఆలయ సిబ్బంది, ఉద్యోగులు చిత్తూరు కార్పొరేషన్/కాణిపాకం: నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చుడా చైర్పర్సన్ హేమలత, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్వో ఉదయభాస్కర్, ఆయుష్ నోడల్ అధికారి గోవిందప్ప, యోగా గురువులు శ్రీనివాసులునాయుడు, బాబునాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు, డీఈవో సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనపాల్, తదితరులు పాల్గొన్నారు. -
టమాటాలను మేమే అమ్ముకుంటాం
పలమనేరు: రైతులను మోసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఇలాగే చేస్తే తామే బాక్సులు తెప్పించి సరుకును విక్రయిస్తామంటూ టమాటా రైతులు స్థానిక మండీ వ్యాపారులకు అల్టిమేటం జారీ చేశారు. పొరుగునే ఉన్న కర్ణాటకలోని కోలారు మార్కెట్కు, ఇక్కడికి ధరల్లో వ్యత్యాసం ఉందని తెలిపారు. వారు ఆదివారం మార్కెట్ వద్ద ఆందోళనకు దిగారు. ఆపై మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్నను పిలిపించి స్థానిక మండీ వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ పొరుగునే ఉన్న కోలారులో టక్పట్టీ ద్వారా తక్కువ కమీషన్తో రైతుకు మేలు కలిగేలా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. దీంతో గిట్టుబాటు ధరలు దక్కుతున్నాయన్నారు. ఇక్కడ 15 కిలోల బాక్సు అంటూ 17 కేజీల బాక్సుల్లో కాయలు నొక్కేస్తున్నారని నిరూపించారు. వ్యాపారులు తమ మండీల వద్ద సరుకును ఎక్కువగా ఉంచుతుండడంతో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. మార్కెట్కు వచ్చే ఇతర కూరగాయలను ఎక్కడ పెట్టుకోవాలో, ఎక్కడ వేలం వేయాలో కూడా అర్థం కావడం లేదన్నారు. దీనిపై స్పందించిన చైర్మన్ రాజన్న మార్కెట్లోని దక్షిణం వైపు కూరగాయల వేలంపాట నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు కూరగాయల వేలాన్ని ఇకపై ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 9 గంటల లోపు పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశారు. చుట్టుపక్కలున్న మార్కెట్లతో పాటే ఇక్కడ కూడా వేలం పాటలు నిర్వహించేలా చూడాలన్నారు. రైతులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోకుంటే తామే బాక్సులు తెచ్చి వ్యాపారులతో మాట్లాడి సరుకు నేరుగా అమ్ముకుంటామని అల్టిమేటం జారీ చేశారు. ఇందులో రైతులు కూర్మాయి రవి, బేరుపల్లి గోవిందు రెడ్డి, బాలాజీ, దేవా, ఉమాపతి, నరేష్, రామాపురం హరి తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు ఉరి!
జిల్లాలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. కష్టాన్నే నమ్ముకుని .. చెమటను అమ్ముకుంటున్న రైతు పరిస్థితి గందరగోళంగా మారింది. చెరుకు పంటకు ఊపిరిగా నిలిచిన చక్కెర ఫ్యాక్టరీ మూతపడింది. మామిడికి గిట్టుబాటు ధర లేదు. ఖరీఫ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయలేదు. తాజాగా ప్రభుత్వం వరి సాగుపై చేస్తున్న వ్యాఖ్యలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ ప్రభుత్వం వ్యవసాయంలో పెడుతున్న కోతలతోపాటు ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయినా పరిహారం అందకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.కాణిపాకం: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 20 ఏళ్ల క్రితం చెరుకు సాగు 28 వేల హెక్టార్లకు పైగా ఉండేది. సుమారు 30 వేల మంది రైతులు చక్కెర ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు. చంద్రబాబు హయాంలో చిత్తూరు, గాజులమండ్యం చెరుకు ఫ్యాక్టరీల మూసివేతతో ఆ రైతు కుటుంబాలు వీధిన పడ్డాయి. కొంతమంది రైతులు బెల్లం తయారీ వైపు మొగ్గుచూపారు. బెల్లం తయారీపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో చెరుకు సాగు క్షీణించింది. ప్రస్తుతం సాధారణ సాగు విస్తీర్ణం 6 వేల హెక్టార్లు కాగా 2,500 హెక్టార్లకే పరిమితమైంది. ఎక్కువ మంది రైతులు మామిడి వైపు అడుగులు వేశారు. వేరుశనగ పంటకూ కోత జిల్లాలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో సుమారు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం. ఈ సారి 27 వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. వాటిలోనూ ఇప్పటి వరకు 3 వేల క్వింటాళ్లు మాత్రమే రైతుల చేతికి చేరాయి. సాధారణంగా మే చివరి వారంలోనే విత్తనాలు పంపిణీ చేయా ల్సి ఉండగా జూన్ చివరికి కూడా పూర్తిస్థాయిలో అందకపోవడంతో రైతులు ప్రైవేటు మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో వర్షాలను సాకుగా చూపుతూ వేరుశనగకు బదులు సోయా బీన్స్ సాగు చేయాలని అధికారులు సూచించడం రైతులను మరింత అయోమయానికి గురిచేస్తోంది. వరి వద్దంటున్నారు పంటలకు మార్కెట్ కల్పించడంతోపాటు గిట్టుబాటు ధరలు ప్రకటించాల్సిన ప్రభుత్వం ఆ పంటే వేయొద్దని చెబుతోంది. వరి సాగు లాభదాయకం కాదని, బియ్యానికి డిమాండ్ ఉండదని, ప్రత్యామ్నాయంగా పామాయిల్, కోకో వంటి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. దీంతో ఏ పంట సాగు చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఖరీఫ్లో జిల్లాలో 10 వేల హెక్టార్లు, రబీలో 30 వేల హెక్టార్లకు పైగా వరి సాగవుతుండగా, మంత్రి చేసిన వ్యాఖ్యలు రైతుల్లో తీవ్ర నిరాశను నింపాయని రైతు సంఘాలు అంటున్నాయి. ‘వరి వేయొద్దు... ఎవరు కొనరు‘ అనే సంకేతం రైతు భవిష్యత్తుపై ప్రభుత్వం చేతులెత్తేసినట్టేనని నాయకులు విమర్శిస్తున్నారు. పరిహారం మాటల్లోనే... 2024లో కరువు కారణంగా జిల్లాలో సుమారు 9 వేల హెక్టార్లలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. అధికారులు రూ.15 కోట్ల నష్టాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బృందం కూడా పర్యటించింది. నేటికీ రైతులకు పరిహారం అందలేదు. 2025లో వరుస తుపాన్లతో వరి, టమాటా, ఉద్యాన పంటలు భారీగా నష్టపోయాయి. రూ.1.20 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వ యంత్రాంగమే నివేదికలు సమర్పించినా పరిహారం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం జిల్లాలో ప్రధాన పంటలన్నింటిపైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిందిపోయి ప్రత్యామ్నాయ పంటల పేరుతో బాధ్యతలను రైతుపైనే నెట్టేస్తోందని మండిపడుతున్నాయి. అన్నం పెట్టే రైతు భరోసా కోల్పోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని హెచ్చరిస్తున్నాయి. రైతు ఆశలపై కూటమి కత్తి మామిడిపైనా దెబ్బ జిల్లలో 59 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగయ్యాయి. తోతాపురి రకంపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఏడాదికేడాది కాయల ధరలు పతనమవుతుండడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. సాధారణంగా తోతా పురి రకం కేజీ మామిడి పండించేందుకు రైతుకు రూ.14 వరకు ఖర్చవుతోంది. మార్కెట్లో రూ.3 నుంచి రూ.6 మాత్రమే ధర లభిస్తోంది. కనీస మద్దతు ధర ప్రకటించాల్సిన ప్రభుత్వం కేజీకి రూ.4 ప్రోత్సా హకం ప్రకటించి చేతులు దులుపుకుంటోంది. ఈ కారణంగా మామిడి తోటల తొలగింపుకు రైతులు సిద్ధమవుతున్నారు. చిల్లిగవ్వ కూడా సాయం లేదు నాకు 4 ఎకరాల పొలం ఉంది. రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. రెండేళ్లుగా వరుస తుపాన్లతో పంట మొత్తం నేలమట్టమైంది. నష్టం అంచనా వేసి ఏళ్లు గడుస్తోంది. ఇంత వరకు ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా సాయం చేయలేదు. మరో రెండు ఎకరాల దాకా మామిడి ఉంది. పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నాం. వ్యవసాయంలో జరిగే నష్టాలను చెబితే ప్రభుత్వం ఆ పంటలు వద్దు..ఈ పంటలు వద్దు అని చెబుతోంది. – మదివానన్, ఆముదాల, పాలసముద్రం మండలం -
పవన్కళ్యాణ్ పొలిటికల్ బఫూన్
నగరి : సుగాలి ప్రీతి కోసమే పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ ఎన్నికల్లో హంగామా చేసి, నేడు ఆ కేసులో ఆధారాలను వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చెరిపేశారంటూ చేతులెత్తేసిన పవన్కళ్యాణ్ పొలిటిల్ బఫూన్ అయిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆమె ఆదివారం వడమాలపేట తిరుమణ్యంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంపై పవన్కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. సుగాలి ప్రీతి చనిపోయింది 2017 చంద్రబాబు పాలనలో అని తెలిపారు. 2019 ఎన్నికల వరకు ఆ కేసు గురించే పవన్ మాట్లాడలేదన్నారు. గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతికి న్యాయం చెయ్యడం కోసమే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారన్నారు. నేడు అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సుగాలి ప్రీతికి ఆయన ఎందకు న్యా యం చెయ్యలేదని ప్రశ్నించారు. పైగా జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలను చెరిపేశారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మనసున్న మారాజు జగనన్న వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కర్నూలు పర్యటనకు వెళ్లిన సమయంలో సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమ బాధను చెప్పుకున్నారని తెలిపారు. దీంతో చలించిన ఆయన ఆమె తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం ఇవ్వడంతో పాటు కేసును సీబీఐ విచారించాలని కోరారని రోజా అన్నారు. మోదీతోను, అమిత్షాతోను సత్సంబంధాలు పెట్టుకున్న పవన్కళ్యాణ్ సీబీఐ విచారణను ఎందుకు కోరలేదన్నారు. విచారిస్తే పట్టుబడేది టీడీపీ, జనసేన నేతలే కనుక దారి మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ఏం సమాధానం చెబుతావు పవన్? జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళకు లోబరచుకొని ఐదు సార్లు అబార్షన్ చేయించి, రోడ్డుపై కొట్టిస్తే పవన్ ఏమాత్రం పట్టించుకోలేదని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. జనసేన పార్టీకి చెందిన కాపు యువకుడు సాయికృష్ణను పోలీసులు చంపి బూడిద చేస్తే మాట్లాడడం లేదన్నారు, క్రాంతి అనే దళిత బిడ్డ కనిపించకుండాపోతే పట్టించుకోలేదన్నారు. ఆయన నియోజకవర్గంలో ఒక చిన్నారి రెండు వారాలుగా కనిపించకుంటే పట్టించుకోలేదన్నారు. జనసేన జెండాలు మోసిన వారికీ న్యాయం చెయ్యలేకపోయారని, కాపులకూ న్యాయం చెయ్యలేకపోయారని, దళితులకు న్యాయం చెయ్యలేదని, ప్రజలను పట్టించుకోలేదన్నారు. రాజకీయాలకు పవన్ పనికిరారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని మాజీ మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని విషయాలపై అవగాహన ఉన్నట్లు ఊగిపోయిన పవన్ నేడు ప్రతి దానిపైనా అవగాహన లేదని తప్పించుకుంటున్నారన్నారు. చంద్రబాబు స్క్రిఫ్ట్ చదవడం మాత్రమే ఆయనకు తెలిసిన పని అన్నారు. ప్యాకేజీల కోసం చంద్రబాబు పల్లకీని మోస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కాలు కదిపే వరకు ప్రభుత్వంలో కదలికలు రావడం లేదన్నారు. సాయికృష్ణ తల్లిని జగనన్న వెళ్లి చూస్తే వెంటనే చంద్రబాబు ఇంటికి పిలిపించుకున్నారన్నారు. ఆమెకు ఎలాంటి భరోసా ఇచ్చారో మీడియా ముందు చెప్పడం లేదన్నారు. పవన్ను గెలిపించడానికి కష్టపడిన యువకుడు చనిపోతే అతనిపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి పవన్ చేతులు దులుపుకుంటున్నారని, తాను హోంమంత్రి కాదంటూ తప్పించుకుంటున్నారన్నారు. క్రిమినల్ కేసులు ఉంటే చట్టపరంగా శిక్షించాలని లాకప్లో కొట్టి చంపేయడం ఏంటన్నారు. అనిత హోమ్ మంత్రిగా పనికిరాదని ఆయనే చెప్పారని, ఎందుకు పవన్ హమ్ మంత్రిత్వశాఖ తీసుకోకూడదన్నారు. చదువులు అటకెక్కాయి మరోవైపు ప్రైవేటు పాఠశాలల, కళాశాలలపై మోజుతో ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయి, పాఠశాలలకు స్కూలు బుక్కులు, బ్యాగులు ఇవ్వలేని దౌర్భాగ్యపు పరిస్థితి ఉందంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నదెందుకని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో మాత్రమే పవన్, లోకేష్లు చంద్రబాబును మించిపోయారన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత పరిపాలనలో ఉండటంతో రాష్ట్రానికి శనిపట్టిందన్నారు. బిడ్డలు కనిపంచకుండా పోతే ఆ తల్లులు ఎలా బాధపడతారో తమకు తెలుసన్నారు. సీబీఐ ఎంక్వయిరీ వేసి వారికి న్యాయం జరిగేంత వరకు వదలిపెట్టమన్నారు. -
అపోలో యూనివర్సిటీ డీన్కు జాతీయ అవార్డు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ది అపోలో యూనివర్సిటీకి చెందిన అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె.భాస్కర్ రెడ్డికి జాతీయ అవార్డు దక్కింది. ఆయన ఔషధ శాస్త్ర పరిశోధన, విద్యా రంగంలో విశిష్ట సేవలకు గాను అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా (ఏపీటీఐ) – తమిళనాడు శాఖ ప్రతిష్టాత్మక రిసెర్చర్ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అవార్డు–2026ను ప్రదానం చేసింది. చైన్నెలోని రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్వహించిన ‘‘ఎంపవరింగ్ ఫ్యూచర్ ఫార్మసిస్టిస్ త్రూ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ జాతీయ సదస్సులో అవార్డు అందజేశారు. ఈ ఘనతపై ది అపోలో యూనివర్సిటీ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. డీన్ ప్రొఫెసర్ కె.భాస్కర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని మృతి పలమనేరు: రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఇంటర్ విద్యార్థిని చికి త్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసు ల కథనం మేరకు.. బైరెడ్డిపల్లి మండలం చిన్నపురానికి చెందిన భాస్కర్రెడ్డి కుమార్తె హర్షిత(17) పలమనేరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఏమి జరిగిందోకాని రెండు రోజుల క్రితం ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్లలోనే కుళ్లుతున్న మామిడి
● ఫ్యాక్టరీ వద్ద కిలోమీటర్ల మేర నిలిచి పోయిన వాహనాలు ● అన్లోడ్ చేయడానికి రోజుల తరబడి నిరీక్షణ ● గిట్టుబాటు ధర రూ.15 ఇవ్వాలి ● మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంగాధర నెల్లూరు: ఫ్యాక్టరీ నిర్వాహకులు సకాలంలో మామిడి కాయలను అన్లోడ్ చేయకపోవడంతో ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. మామిడి కాయలను తీసుకువచ్చిన ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆయన ఆదివారం జీడీ నెల్లూరు మండలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతూ మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద వందలాదిగా వేచి ఉన్న మామిడి ట్రాక్టర్లను చూసి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మోతరంగనపల్లి మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద దాదాపు 350 ట్రాక్టర్లు, అబ్బాస్ నగర్ కాలనీ వద్దగల పరిశ్రమ వద్ద దాదాపు 400 ట్రాక్టర్లు అన్లోడింగ్ కోసం వేచి ఉన్నాయ ని తెలిపారు. సీరియల్ నంబర్ కోసం రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. నంబర్ పొందాక అన్లోడింగ్ చేయడానికి లోడుకు వారం రోజులు పడుతోందని తెలిపారు. ఈ లోపు కాయలు సగానికి సగం కుళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల బాధను గుర్తించి రూ.15ల గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
చట్టం ప్రకారం జరిగి ఉంటే భయమెందుకు?
పోలీసులు చట్టప్రకారమే వ్యవ హరించి ఉంటే పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలి. అరెస్ట్ ఎప్పుడు చేశారు? ఏ పరిస్థితుల్లో ఉంచారు? ఎలా మృతి చెందాడు? ప్రతి ప్రశ్నకు ప్రభు త్వం సమాధానం చెప్పాలి. నిజం ప్రభుత్వ వైపే ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం ఏముంది? సాయికృష్ణ తల్లిదండ్రు లు తన కొడుకు మృతదేహమైనా.. లేకుంటే బూడిదైనా ఇవ్వండి అంటున్నారు. దీనిపై ప్రభు త్వం నోరు తెరవాలి. – విశ్వనాథ్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సభ్యులు, చిత్తూరు పవన్ కల్యాణ్ స్పందించాల్సిన సమయం ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్యాయం జరిగితే ముందుండి పోరాడిన పవన్ కల్యాణ్ ఇప్పు డు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక కాపు యువకుడి కుటుంబం న్యాయం కోరుతున్న వేళ ఆయ న మౌనం ప్రజలను బాధిస్తోంది. రాజకీయాలకు అతీతంగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలి. ఈ ఘటనపై అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హైకోర్టు పర్యవేక్షణ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. – మల్లేల గౌతమ్రాజ్, శ్రీకృష్ణదేవరాయుల బలిజ సభ్యులు, చిత్తూరు


