breaking news
Chittoor
-
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● రూ.1.5 లక్షల విలువచేసే 4 ద్విచక్ర వాహనాల స్వాధీనం నగరి : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ తిరుత్తణికి చెందిన సర్గుణన్(50)ని నగరి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఏకాంబరకుప్పం పరిసర ప్రాంతాల్లో గత మూడు నెలలుగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల వరుస చోరీలపై ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు నిఘా పెట్టారు. తమిళనాడు సరిహద్దులో వా హనాల రాకపోకలు రికార్డు అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చోరీదారులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇ టీవల ఇద్దరిని అరెస్టు చేయగా సోమవారం మరో అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. సీఐ విక్రమ్ మాట్లాడుతూ ముందస్తు సమాచారంతో మండ పం జంక్షన్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టు తెలిపారు. విచారణలో అతను గత కొంత కాలంగా నగరి మున్సిపాలిటీ, ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్ వద్ద నాలుగు మోటార్ సైకిళ్లను దొంగలించినట్లు తెలిసిందన్నారు. అతని వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువ చేసే 4 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్టు చెప్పారు. ముద్దాయిపై గతంలో తిరుత్తణి రైల్వే పోలీసు స్టేషన్లో కేసు ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది సురేష్, సత్య, గజేంద్ర, అశోక్, లోకనాథం, రమేష్ను అభినందించారు. -
పచ్చమేత
● బియ్యం అక్రమ రవాణాలో బరితెగించిన టీడీపీ నేతలు ● పీడీఎస్ బియ్యంతో పాటు టీడీపీ నేతల అరెస్ట్ ● సుమారు రూ.6 లక్షల విలువ చేసే 13 టన్నుల బియ్యం స్వాధీనం నగరి : అక్రమ రవాణాకు సిద్ధం చేసి ఉంచుకున్న 13 టన్నుల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరి మున్సిపాలిటీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ విక్రమ్ కథనం మేరకు.. ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు రేషన్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం నగరి మున్సిపల్ పరిధి కీళపట్టు వద్ద తిరుత్తణి బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న జోర్ ఎంజాయ్ హోటల్ పక్కన ఖాళీ ప్రదేశంలో పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కాగా సమాచారం అందింది. సీఐ తన సిబ్బందిని వెంటబెట్టుకుని రెవెన్యూ అధికారులు, వీఆర్వోతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నాలుగు చిన్న వాహనాలు, ఒక ఐచర్లో లోడ్ చేసి ఉంచిన 13 టన్నుల బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నాయకుడు అమృతరాజ్ నాడార్ అలియాస్ టీఆర్ఎస్(62), వై.ధనుష్ (19), డీ.బోస్ (20), ఎన్.రోహిత్ (18), వీ.దినేష్ (23), గజేంద్రన్ (20), రాజేష్ అలియాస్ రాజు (25) మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నగరి, నారాయణవనం, పుత్తూరు, పిచ్చాటూరు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం సేకరించుకుని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. వీరు ఎక్కడకు పంపుతున్నారు.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న చైన్ లింక్ను పూర్తి స్థాయిలో కూపీలాగి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పట్టుకున్నవి ప్రభుత్వ ముద్రతో సీలు ఉన్న బస్తాలే పోలీసులు సోమవారం పట్టుకున్న పీడీఎస్ బస్తాలన్నీ ప్రభుత్వ ముద్రతో సీలున్న బస్తాలే కావడంతో గోడౌన్ నుంచి వచ్చాయా.. రేషన్ షాపుల నుంచి వచ్చాయా అనే అంశాలపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మద్యం రాసిన మరణ శాసనం
మద్యానికి బానిసై..కుటుంబానికి దూరమై..! ● కన్నీళ్లు మిగుల్చుతున్న ఘటనలు బంగారుపాళెం: వేళాపాళా లేని మద్యం విక్రయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. తాగుడు మానేయయని ఇంట్లో వారు ఒత్తిడి చేస్తే మందు బాబులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మద్యం రాసిన మరణ శాసనానికి ఇటీవల జిల్లాలో ముగ్గురు బలయ్యారు. బంగారుపాళెంలో.. పలమనేరు మండలం, జగమర్లకు చెందిన సుధాకర్, అతని భార్య పల్లవి బంగారుపాళెం మండలం, నలగాంపల్లెలో ఓ రైతు మామిడితోటలో కాపలాగా ఉంటున్నారు. ఈ నెల 22వ తేదీ పల్లవి భర్త మద్యం సేవించి ఇంటికి వెళ్లడంతో ప్రశ్నించింది. ఈ విషయమై భార్యాభర్తలు గొడవలు పడ్డారు. మొదట భర్త సుధాకర్ విషం తాగాడు. భార్య పల్లవి భయపడి ఆమె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ భర్త సుధాకర్ కోలుకున్నాడు. భార్య పల్లవి(23) ఈ నెల 26వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందింది. పాలసముద్రంలో భార్యను చంపిన భర్త పులిచర్లకు చెందిన కార్తీక్, ప్రమీల దంపతులు. ఏడాది క్రితం పాలసముద్రం మండలం తిరుమలరాజపురానికి వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన భర్త కార్తీక్ మద్యం తాగి రావడంతో భార్య ప్రమీల అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య కొడవ సాగింది. కార్తీక్ తాగిన మత్తులో భార్యను తలపై కట్టెతో కొట్టడంతో ఆమె మృతి చెందింది. అతిగా మద్యం సేవించి.. బంగారుపా ళెం దళితవాడకు చెందిన వినాయకం అనే యువకు డు మద్యాని కి బానిసయ్యాడు. దీంతో భార్య దూరమైంది. మే 4వ తేదీ అతిగా మద్యం సేవించి ఓ వైన్ షాప్ వద్దే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి ఘటనలు జిల్లా లో చోటు చేసుకుంటునే ఉన్నాయి. -
గందరగోళంగా సర్వేయర్ల బదిలీలు
● ముడుపులు తీసుకుని బదిలీలు చేశారని వెల్లువెత్తిన ఆరోపణలు ● తప్పిదాల కారణంగా రెండు గంటల పాటు ఆగిన కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ సచివాలయ సర్వేయర్ అసిస్టెంట్ల బదిలీలు గందరగోళంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సర్వే అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించారు. చిత్తూరు సర్వే శాఖ ఏడీ జయరాజ్ ఆధ్వర్యంలో సర్వే అసిస్టెంట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి సర్వేశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళంగానే సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న 398 సర్వేయర్ అసిస్టెంట్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. చాలా మందికి అన్యాయం జరగడంతో కలెక్టరేట్ భవనంలో అరుపులు.. కేకలు వినిపించాయి. న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ముడుపుల ఆరోపణలు సర్వే అసిస్టెంట్ల బదిలీల్లో పలవురుకి అనుకూలమైన స్థానాలను కేటాయించేందుకు సర్వే శాఖ అధికారులు ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో పోస్టింగ్ నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల వరకు స్వీకరించారని కౌన్సెలింగ్కు విచ్చేసిన సర్వే అసిస్టెంట్లు ఆరోపించారు. జిల్లాల పునర్విభజన కారణంగా ఆయా జిల్లాల సర్వే అసిస్టెంట్లకు ప్రత్యేకంగా బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాలి. అయితే సర్వే శాఖ అధికారులు అలా చేయకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వే అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ప్రదర్శించి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. దీంతో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 120 మంది తిరుపతి జిల్లాకు బదిలీ అయినట్టు సమాచారం. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న సర్వే అసిస్టెంట్లు చిత్తూరు జిల్లాకు బదిలీ కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. సీనియారిటీ జాబితాలో అవకతవకలు సీనియారిటీ జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసుకోవాల్సిన సర్వే శాఖ అలసత్వం వహించింది. ఆ జాబితా రూపకల్పనలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఒకే ర్యాంక్ను ఇద్దరు సర్వేయర్లకు కేటాయించారు. అలా ఎలా కేటాయిస్తారని సర్వే అసిస్టెంట్లు అధికారులను ప్రశ్నించారు. కనీసం జాబితా ప్రచురించకుండా కౌన్సెలింగ్ నిర్వహించారని ఆరోపించారు. ఈ తప్పిదాల కారణంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సెలింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏడీ ప్రకటించారు. సీనియారిటీ జాబితాలో తప్పిదాలు చోటుచేసుకున్నాయని స్వయంగా ఏడీనే ప్రకటించారు. దీంతో రెండు గంటల పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించేటప్పుడు సీనియారిటీ, ఖాళీల జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని సర్వే అసిస్టెంట్లు ప్రశ్నిస్తున్నారు. -
ఆలయ స్థలం స్వాధీనం
ఐరాల: ఆక్రమణకు గురైన శ్రీకృష్ణ భజన మందిరం ఆలయానికి సంబంధించిన స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మండలంలోని అగరంపల్లె శ్రీకృష్ణ భజన మందిరం ఆలయానికి సంబంధించిన సర్వే నం.365, 366లో అదే గ్రామానికి చెందిన పీ.దొరస్వామి, పీ.మధు ఆక్రమించుకుని రేకుల షె డ్డు, పెంకుటిళ్లు నిర్మించుకున్నారు. గుంటూరు దేవదాయ, ధర్మాదాయ శాఖ ట్రిబ్యూనల్ వారి ఆదేశాల మేరకు జిల్లా ఏసీ చిట్టెమ్మ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖాల ఆధ్వర్యంలో ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ లోకేశ్వరి పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి బంగారుపాళెం: గుర్తుతెలియని వాహనం ఢీకొ ని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పాలేరు వద్ద చైన్నె–బెంగళూరు జాతీ య రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. బెంగళూరు నగరం కేజీ హళ్లి కి చెందిన సెల్వరాజ్ కుమారుడు శ్యామ్ జయకర్(37) ద్విచక్ర వాహనంపై చిత్తూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో పాలేరు వద్ద గుర్తుతెలియ ని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయశంకర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. యువతి ఆత్మహత్య పుంగనూరు(చౌడేపల్లె): తల్లిదండ్రులు దూరమయ్యారని మనస్తాపం చెందిన ఓ యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పట్టణంలోని సుబేదారు వీధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. సుబేదారువీధిలో నివాసం ఉన్న షేక్వలిబాషా సుమారు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అతని భార్య రెండేళ్ల క్రితం మరో వివాహం చేసుకుంది. ఆమె కుమారుడు ఖాజా, కుమార్తె హసీనా తోపాటు మరో చెల్లి నివాసమున్నారు. తండ్రి మృతి చెందడం, తల్లి మరొక వివాహం చేసుకొని దూరమవ్వడంతో హసీనా (19) మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని యువతి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమి త్తం శవాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సిఫారసుకే పెద్దపీట
మతలబు ఏంటీ? ఇంజినీర్ సహాయకుల బదిలీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 664 మందికి బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆది, సోమవారాలతో కలిపి మొత్తం 469 మందికి మాత్రమే కౌన్సెలింగ్ చేపట్టారు. మిగిలిన 195 మందికి చేయలేదు. సీఎం కార్యక్రమం ఉండడంతో వీటిని అనధికారికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. హడావిడిగా ఈ ప్రక్రియను ముగించి అధికారులు వెళ్లిపోయారు. మిగిలిన వారికి ఎప్పుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తారో అనే విషయం పై సృష్టత లేదు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లో కౌన్సెలింగ్ చేపట్టనున్నట్టు సమాచారం. చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ ఇంజినీర్ సహాయకుల బదిలీల్లో సిఫారసుకే పెద్దపీట వేశారు. ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వారికి చెప్పిన చోటుకు బదిలీ చేశారు. ఏ పలుకుబడీ లేని వారి పరిస్థితి దారుణంగా మారింది. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో సోమవారం రెండో రోజు జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఉద్యోగులు ఆరోపించారు. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారికి ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. తమశాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగులని ఏమాత్రం గౌరవం లేకుండా ఎస్ఈ కార్యాలయ సిబ్బంది హేయ్, రేయ్, చెప్పింది చేసి పో అంటూ ఏకవచనంతో మాట్లాడుతూ వారితో అమర్యాదగా ప్రరవర్తించారని ఇంజినీరింగ్ సహాయకులు అసహనం వ్యక్తం చేశారు. ర్యాంకులు పట్టించుకోరు తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యోగాలు ఎలా కేటాయించారో అలాగే బదిలీలు చేపట్టాలని, జాబితాలు సిద్ధం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అయినా అధికారులు వాటిని పట్టించుకోలేదు. ప్రతిభను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. సీనియారిటీ జాబితా లేకుండానే ఏ శాఖలో అయినా సీనియారీ జాబితా ప్రదర్శించి దా ని ఆధారంగానే బదిలీలు చేస్తారని, అయితే సచివాల య ఉద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీనియారిటీ జాబితా రూపొందించకుండా ప్రాంతాలను కోరుకోమని, వాటి ని ఫారంలో నింపి వెళ్లిపోవాలని సూచించడం నిబంధనలకు విరుద్ధమని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచి ర్యాంకు ఉన్నా దూరంగానే పోస్టింగ్ పలుకుబడి లేని ఉద్యోగుల పరిస్థితి దయనీయం అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల అసహనం ముగిసిన కౌన్సెలింగ్లెటర్లు ఉన్నవారికి ప్రాధాన్యం ఎమ్మెల్యే లెటర్లు ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. సిఫార్సు ఉన్నవారికి వారు కావాల్సిన స్థానం కోరుకోండి అంటూ అడిగి మరీ వారికి సహకరించారు. మరికొందరి విషయంలో ఎమ్మెల్యేలు నేరుగా ఫోన్లు చేసి పేర్లు సిఫార్సు చేయడం గమనార్హం. పంచాయతీరాజ్ ఇన్చార్జి ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఈఈ రామ్మోహన్, మదనపల్లె ఈఈ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే ఏ మాత్రం పలుకుబడి లేని వారికి అడిగిన చోటు కాకుండా ఇష్టం వచ్చిన చోటుకు బదిలీ చేశారు. -
బాబు హామీలు రీ–కాల్!
డీఐఈఓ శ్రీనివాసులును సత్కరిస్తున్న ప్రిన్సిపాళ్లుచిత్తూరు అర్బన్: ‘చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకమునుపు ప్రజలపై హా మీల వరాలు గుప్పించారు. అప్పటి వరకు సీఎంగా ఉన్న వైఎస్.జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలతో పాటు మరో 143 పథకాలు అమలు చేస్తామని, సూపర్సిక్స్ పేరిట ఇంకో ఆరు పథకాలు ఇస్తా మని ఊదరగొట్టారు. కానీ సీఎం అయ్యాక ఏడాది పాలనలో ఒక్కటీ అమలు చేయలేదు. అందుకే చంద్రబాబునాయుడు ఇచ్చి న అబద్ధపు హామీలను వివరిస్తూ ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో (తప్పుడు హామీలు ప్రజలకు గుర్తు చేయడం)’ పేరిట ప్రజల్లో చైతన్యం కల్పిద్దాం..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మిన ప్రజలు.. కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మోసపోయారన్నారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ, ఇదే సమయంలో వైఎస్.జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రజలకు జరిగిన మేలును వివరించడానికి గ్రామా లు, పట్టణాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు నడుం బిగించాలన్నారు. సోమవారం చిత్తూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ.విజయానందరెడ్డితో కలిసి ఆయన పార్టీ నాయకులు, శ్రేణులతో సమావేశం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు రూ.2.85 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అందించినట్టు గుర్తుచేశారు. కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి నేతలు ప్రజలకు మోసపూరిత హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారన్నారు. హామీలు అమలు చేయకపోగా.. వైఎస్సార్సీపీ నేత లు, కార్యకర్తలను హతమార్చడం, దాడు లు చేయడం, విధ్వంసాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి బాధ్యతలను గుర్తుచేసినప్పుడల్లా.. డైవర్షన్ పాలిటిక్స్తో బాబు తప్పించుకుంటున్నారన్నారు. తల్లికి వందనం కింద 80 లక్షల మంది లబ్ధిదారులకు నిధులు ఎగ్గొట్టారని, 5 లక్షల మంది రేషన్కార్డులు తొలగించారని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి లాంటి పథకాల ఊసే ఎత్తలేదన్నారు. వీటన్నింటినీ ఇంటింటికీ నయవంచన పేరిట వివరిస్తామన్నారు. 149 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చ లేదు ఆ హామీల విలువ రూ.75 వేల కోట్లు ప్రతీ గడప మెట్లెక్కి.. అబద్ధపు హామీలను వివరిద్దాం చిత్తూరులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరెడ్డి మామిడికి మద్దతు ధర ఏదీ? విజయానందరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం చేస్తున్నారన్నారు. చిత్తూరు చరిత్రలో మామిడి రైతులు పడుతున్న పాట్లు గతంలో ఎన్నడూ లేవన్నారు. మామిడికి కనీస ధరను అందించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఫ్యాక్టరీల వద్ద పర్మిట్లను టీడీపీ నేతల చేతుల్లో పెట్టుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. మామిడి రైతుల బాధలు ఆలకించడానికి తమ నాయకుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి త్వరలోనే జిల్లాకు రానున్నట్టు చెప్పారు. కూటమి నేతలు ప్రతి ఇంటికీ మంజూరు చేసిన అబద్ధపు బాండ్లను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేతలు పెడుతున్న తప్పుడు కేసులను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని, ఏ ఒక్క పార్టీ కార్యకర్త భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ చిత్తూరు నగర అధ్యక్షులు కేపీ.శ్రీధర్, హరిణిరెడ్డి, నాయకులు గాయత్రీదేవి, లీనారెడ్డి, ప్రకాష్, జ్ఞాన జగదీష్, ప్రసాద్రెడ్డి, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా ఎంఎస్కే బదిలీల కౌన్సెలింగ్
చిత్తూరు అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల (ఎంఎస్కే) బదిలీ కౌన్సెలింగ్లో అదే గందరగోళం నెలకొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు సోమవారం కూడా చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 600 మందికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. సాయంత్రం 6 గంటలకు సంగం మందికి మాత్రమే కౌన్సెలింగ్ పూర్తయ్యింది. అయితే కౌన్సెలింగ్ సక్రమంగా నిర్వహించడంలేదని, సిఫార్సులు ఉన్న వాళ్లకు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగులు ఇస్తున్నారంటూ పలువురు ఎంఎస్కేలు నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, తిరుపతి ఏఎస్పీ వెంకటాద్రి, ఇతర అధికారులు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. దాదాపు మెజారిటీ ఉద్యోగులు తిరుపతి అర్బన్, చిత్తూరు అర్బన్ ప్రాంతాలనే కోరుకోవడం.. అక్కడ ఖాళీలు లేకపోవడం, కుప్పంలో 50కు పైగా పోస్టులు ఖాళీ ఏర్పడడంతో ఎవర్ని నియమించాలో తెలియక అధికారులు సైతం ఒకింత గందరగోళానికి గురయ్యారు. సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు శాంతిపురం: సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటించే ప్రాంతాలను సోమవారం ఆయన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. తుమ్మిశి వద్ద హెలీప్యాడ్, తులసినాయనపల్లి వద్ద బహిరంగ సభా వేదిక, మోడల్ స్కూలు, తిమ్మరాజుపల్లితోపాటు కడపల్లి వద్ద సీఎం నివాసాలను సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి సీఎం పర్యటన ముగిసే వరకూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. బారికేడ్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలలో ఎక్కడికక్కడ చేయాల్సిన పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాల్లో సీఎంవో అధికారులు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీపీవో ప్రభాకర్, ఆర్డీవో శ్రీనివాసులురాజు, అదనపు ఎస్పీ నందకిశోర్, డీఎస్పీలు రాజ్నాథ్, సాయినాథ్, ఎంపీడీవో కుమార్, తహసీల్దార్ శివయ్య పాల్గొన్నారు. నేడు చంద్రబాబు కుప్పం రాక కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళ, బుధ వారాల్లో కుప్పంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం శాంతిపురం మండలం, కడపల్లె వద్ద ఆయన సొంతింటికి చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేసి బుధవారం ఉదయం శాంతిపురం మండలం, తిమ్మరాజుపల్లిలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం తుమ్మిశి వద్ద ఉన్న మోడల్ పాఠశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం కుప్పం వంద పడకల ఆస్పత్రిలో టాటా సంస్థతో ఒప్పందం కుదర్చుకున్న డీఎన్సీ సెంటర్ను ప్రారంభిస్తారు. అనంతరం తుమ్మిశి వద్దనున్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుని తిరుగుప్రయాణమవుతారు. ‘సమగ్ర’ంగా బదిలీల కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రశిక్ష శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఆ శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ ఆధ్వ ర్యంలో సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించి పో స్టింగ్లు ఇచ్చారు. ఏపీసీ మాట్లాడుతూ జిల్లా లోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న సీఆర్పీ, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్, కేజీబీవీ సిబ్బందికి రిక్వెస్ట్ బదిలీలు నిర్వహించాలన్నారు. సీనియారిటీ జాబితా ఆధారంగా బదిలీలకు 26 మంది దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. 17 మంది బది లీల కౌన్సెలింగ్కు హాజరయ్యారన్నారు. ఐదు గురు అన్ విల్లింగ్ ఇవ్వగా, ఇద్దరు గైర్హాజరైన ట్లు చెప్పారు. అంతర్ జిల్లా బదిలీలకు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారని, వారికి రాష్ట్ర స మగ్రశిక్ష కార్యాలయంలో బదిలీలు నిర్వహిస్తారన్నారు. సెక్టోరల్ అధికారులు ఇంద్రాణి, శశిధర్, సూపరింటెండెంట్ కుమార్ పాల్గొన్నారు. -
యూడైస్లో కచ్చితమైన వివరాలుండాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో యూడైస్ నివేదికలను కచ్చితమైన వివరాలతో నమోదు చేయాలని ఇంటర్మీడియెట్ డీఐఈవో శ్రీనివాసులు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్తో మిట్టూరులోని ఆర్కే జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు హొలి స్టిక్ ప్రోగ్రెస్ కార్డులను మెగా పేరెంట్స్, టీచర్ సమావేశం రోజును పంపిణీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న మెగా పీటీఎం సమావేశాలను నిర్వహించాలని తెలిపారు. మూడు నెలల పాటు చిత్తూరు జిల్లా ఇంటర్మీడియెట్ డీఐఈవోగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన డీఐఈఓ శ్రీనివాసులును ప్రిన్సిపల్స్ దుశ్శాలువతో సత్కరించారు. -
మామిడికి మద్దతు ధర ఇవ్వకుండా కుట్ర
● ఫ్యాక్టరీ యజమానులతో కూటమి నేతల కుమ్మక్కు ● కడుపు మండి.. రైతుల ఆందోళన ● రైతుల దృష్టిని మరల్చేందుకు పెద్దిరెడ్డిపై నిందలు కూటమి సర్కారు దొంగాట ఆడుతూ మామిడి రైతులను నిండా ముంచేసింది. దొంగచాటుగా అధికార పార్టీ నేతల సిఫార్సులకు టోకెన్లు ఇచ్చి సామాన్య రైతులను పక్కన పెట్టేసింది. దీంతో ప్రభుత్వ పెద్దల తీరుపై మామిడి రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న మామిడి చెట్లను నిలువునా నరికేసుకుంటున్నారు. ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయకపోవడంతో మామిడి కాయలను రోడ్లపై పారబోస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నా, కనికరించే నాథుడు కరువయ్యారు. కాయలు అమ్ముకోవడానికి రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా నిరీక్షించిన రైతులు కడుపు మండి ధర్నాకు దిగుతున్నారు. ఈ పరిణామాల నుంచి రైతులు, ప్రజల దృష్టిని మరల్చడానికి కూటమి నేతలు, ఎల్లో మీడియాతో కలిసి వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు పక్కా స్కెచ్ వేశారు. రెండు రోజులుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం ప్రారంభించారు. గుడిపాల మండలం గొల్ల మడుగు వద్ద.. క్యూ కట్టిన మామిడి కాయల వాహనాలుసాక్షి టాస్క్ఫోర్స్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత కొద్ది రోజులుగా మామిడి రైతుల అవస్థలు వర్ణనా తీతంగా ఉన్నాయి. ప్రభుత్వం మొదట్లో మామిడి కిలో రూ.12గా ప్రకటించింది. ఆ తరువాత రూ.8 అని చెప్పింది. ఇంకో రోజు రూ.6 అని, ఆ తరువాత రూ.5 అని ఇష్టానుసారంగా రోజుకొక ధర చెబుతూ రైతులను మభ్యపెడుతూ వస్తోంది. ధర లేకపోతే పోనీ ఏదో ఒక రేటుకు కాయలు విక్రయించేస్తామన్న రైతులకు టోకెన్లు ఇవ్వడం లేదు. దానికి టీడీపీ నేతల సిఫార్సులు కావాలి. దీంతో పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక మామిడిని రోడ్లపై పారబోస్తున్నారు. మరి కొందరు రైతులు మామిడి కాయల లోడ్లను తీసుకొచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చాలా వరకు కాయలన్నీ ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్నాయి. తెల్ల కాగితాలపై సంతకాలు రైతులు పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఫ్యాక్టరీ నిర్వాహకులు తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుని కాయలు దించుకుని పంపేస్తున్నారు. ఈ పరిణామాలతో రైతులు ధర్నాలకు దిగుతున్నారు. గంగాధరనెల్లూరు వద్ద ఓ ఫ్యాక్టరీ యజమాని, అధికారులు, కూటమి నేతలు కుమ్మకై ్క దొంగచాటుగా వారికి అనుకూలంగా ఉన్న వారి కాయలను మాత్రం దించుకోవడాన్ని మామిడి రైతులు గమనించారు. వారి తీరుని నిరసిస్తూ ఆదివారం రోడ్డుపై వాహనాలతో మెరుపు ధర్నా చేపట్టారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ కూటమి నేతలు వారి దృష్టిని మరల్చేందుకు వైఎస్సార్సీపీపై బురద జల్లడం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ నేతలే కొందరిని రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారంటూ ఎల్లో మీడియాతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇంత దిగజారుడుతనమా? రైతులను ఆదుకోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా దిగుజారుడు రాజకీయాలకు దిగడం దారుణం. మామిడి దిగుబడులకు మద్దతు ధర కల్పించలేక, రోజుల తరబడి క్యూలో ఉన్న మామిడిని కొనుగోలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫ్యాక్టరీ యజమానులు, కూటమి నేతలు కుమ్మకై ్క మామిడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వ తీరుని గమనిస్తున్న మామిడి రైతులు తిరగబడుతున్నారు. దీని నుంచి రైతుల దృష్టిని మరల్చటానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇంతకన్న దిగజారుడు తనం మరొకటి లేదు, ఉండబోదు. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు అడుగడుగునా దగా.. ● ఒక ట్రాక్టర్ కాయలు ఫ్యాక్టరీల వద్ద అన్లోడ్ చేయడానికి 3 రోజుల నుంచి వారం రోజులు సమయం తీసుకుంటున్నారు. అదే కూటమి నేతలు, అధికారులకు తెలిసిన వారి ట్రాక్టర్లు దొంగ చాటుగా ఒక్క రోజులోనే అన్లోడింగ్ చేసి పంపేస్తున్నారు. ● ప్రస్తుతం ఒక్కో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద సుమారు 3 కిలోమీటర్ల దూరం మేర మామిడి కాయల ట్రాక్టర్లు క్యూ కట్టి ఉన్నాయి. ● దీని వల్ల ఒక ట్రాక్టర్లో 5 టన్నుల కాయలతో వస్తే అన్లోడ్ చేసే నాటికి దాదాపు 1.5 టన్ను కాయలు పాడైపోతున్నాయి. ● ఫ్యాక్టరీ యాజమాన్యాలు ట్రాక్టర్ల అన్లోడింగ్ కోసం రోజుకు 100 టోకెన్లు ఇస్తామని చెబుతున్నా కేవలం 50 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. ● అన్లోడింగ్ చేసుకుని ఎన్ని టన్నులు దించుకున్నామంటూ రైతులకు బిల్లులు ఇస్తున్నారు. అయితే ఆ బిల్లులో కిలో మామిడి ధర ఎంతో స్పష్టం చేయలేదు. ● దీనిపై రైతుల నుంచి తిరుగుబాటు రాకుండా అంగీకార పత్రంపై రైతు వద్ద నుంచి సంతకం తీసుకుని పంపుతున్నారు. ● దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తర్వాత ఎంత ధర చెల్లించినా రైతులు ప్రశ్నించే అవకాశం లేదు. ● ఒక ట్రాక్టర్కు లోడ్ చేసే మామిడి కాయలు కోయడానికి రైతుకు రూ.4 వేలు ఖర్చు అవుతోంది. బాడుగ (ఐదు రోజులకు) రూ.7 వేలు. ● ఒకవేళ ఐదు రోజుల్లోపు ఫ్యాక్టరీ యాజమాన్యం కాయాలను దించుకోకుంటే, ఐదో రోజు తర్వాత మళ్లీ అదనంగా రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు రైతు అదనంగా బాడుగ చెల్లించాలి. ● టీడీపీ కూటమి నాయకులు సిఫారసు చేసిన రైతుకు చెందిన మామిడి కాయల ట్రాక్టర్లను రాత్రి వేళ ఫ్యాక్టరీలోకి పంపి అన్లోడ్ చేసుకుంటున్నారు. సామాన్య రైతులు మాత్రం రోజుల తరబడి రోడ్లపైన వేచి ఉండలేక కొందరు రోడ్డుపైనే కింద పారబోసి వెళ్లిపోతున్నారు. ● ప్రభుత్వం మామిడి కాయలను రైతు నుంచి ఒక కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలకు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు 8 రూపాయల లెక్కన ఎక్కడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం ● ర్యాంపుల వద్ద కిలో మామిడి కేవలం రెండు రూపాయలుగా మాత్రమే నిర్ణయించారు. చేసేది లేక రైతులు రూ.2కే అమ్ముకోవాల్సిన దుస్థితి కలిగింది. -
స్లో బైక్ రైడింగ్ పోటీలు
చిత్తూరు అర్బన్ : రహదారి భద్రతా నియమాలను పాటించడంలో భాగంగా త్వరలోనే చిత్తూరులో స్లో మోటారు సైకిల్ రైడింగ్ పోటీలను నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు అన్నారు. ఆదివారం నగరంలోని ఆర్మ్డ్ రిజర్వు మైదానంలో పోలీసులకు ఈ పోటీలపై అవగాహన కల్పించడానికి ట్రయల్ నిర్వహించారు. హెల్మెట్లు పెట్టుకుని, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్న వారు ఎవ్వరైనా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. వీలైనంత నిదానంగా వాహనం నడపగలగడమే ఈ పోటీ లక్ష్యమన్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు నమోదు చేసుకున్నారని, ఇంకా ఆసక్తి ఉన్నవాళ్లు 94910 74515 నంబరుకు ఫోన్చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
నేడు పోలీసు గ్రీవెన్స్ రద్దు
చిత్తూరు అర్బన్ : చిత్తూరులో సోమవారం నిర్వహించాల్సిన పోలీసు గ్రీవెన్స్ను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మణికంఠ ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా గ్రీవెన్స్ రద్దు చేశామని, ప్రజలు ఎవ్వరూ కూడా వినతులు ఇవ్వడానికి చిత్తూరుకు రావొద్దని ఆయన సూచించారు. పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా జూలై 1వ తేదీన సామాజిక పింఛన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై 1వ తేదీన ఉదయం 7 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నామన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందిస్తామన్నారు. ఈ నెల 30వ తేదీన బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పంపిణీ కానీ పింఛన్ నగదును రెండురోజుల్లో బ్యాంకుల్లో తిరిగి చెల్లించాలని డీఆర్డీఏ పీడీ తెలిపారు. త్రుటిలో తప్పిన ప్రమాదం గుడిపాల: మండలంలో ఆదివారం కారు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలోని మద్రాస్ క్రాస్ రోడ్డు సమీపంలో లారీ చైన్నె రోడ్డు నుంచి వేలూరు వైపు తిరుగుతోంది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు లారీ కిందకు దూసుకెళ్లింది. లారీకి వున్న బంపర్లు తగులుకుని కారు ఆగిపోయింది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. బైక్ దొంగ అరెస్టు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన రాజేష్ (20) అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం వన్టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐలు మహేశ్వర, నెట్టికంటయ్య వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని రెడ్డిగుంట సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రాజేష్ అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకుని విచారిస్తే.. నగరంలోని పలు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడన్నారు. తమిళనాడులోని వేలూరు నగరానికి చెందిన రాజేష్ నుంచి రూ.3 లక్షల విలువ చేసే అయిదు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి రిమాండు విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. -
కాళ్లరిగేలా తిరుగుతున్నాం
మాది అనంతపురం. 15ఏళ్లుగా తిరుపతిలో ఉంటున్నాం. భవన నిర్మాణ కూలీలుగా పనిచేసుకుంటూ బతుకీడుస్తున్నాం. ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయికి మా దగ్గర ఉన్న సొమ్ముతో ఇటీవలే పెళ్లి చేశాం. మూడో అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో పది చదువుతోంది. రెండో అమ్మాయి మంచి మార్కులతో ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసింది. కానీ, పైచదువులకు పంపాలంటే భయమేస్తోంది. అయితే మాలాగా కష్టం చేయకూడదని బాగా చదివించాలనే కోరిక ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలో రూ.లక్షలు అడుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై నమ్మకం పెట్టుకోవదని చెబుతున్నారు. దీంతో అప్పు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. – శారద, భవన నిర్మాణ కూలీ, తిరుపతి వడ్డీకి తెచ్చాం పిల్లలను చదివించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థి తి ఏర్పడింది. మా అమ్మా యి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివింది. పదో తరగతి కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చేర్పించాం. ఏడాదికి హాస్టల్తో పాటు మొత్తం ఫీజు రూ.1.80వేలు కట్టాల్సి వచ్చింది. దాచుకున్న రూ.50వేలకుతోడు మరో రూ.1.30వేలను వడ్డీవ్యాపారుల వద్ద రూ.5లకు వడ్డీకి తెచ్చి కట్టా. ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్ స్థాయిని అందుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. నేను చిన్న ఉద్యోగిని. నా భార్య దివ్యాంగురాలు. మా కష్టం పిల్లలకు రాకూడదని అప్పు చేసి చదివిస్తున్నాం. – రామకృష్ణ, ప్రైవేటు ఉద్యోగి, గూడూరు -
గందరగోళంగా బదిలీలు
చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి జిల్లాలోని గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా సాగింది. ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్లో ఈ ప్రక్రియను ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టారు. చాలీచాలని స్థలంలో బదిలీలు నిర్వహించడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో పలువురు రోడ్డు పై నిలబడి కౌన్సెలింగ్ పిలుపు కోసం నిరీక్షించారు. బదిలీ కౌన్సెలింగ్ను ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకుల లేఖలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు నెలకొన్నాయి. తిరుపతి పరిసర మండలాల్లోని పంచాయతీ ఖాళీలను బదిలీ కౌన్సెలింగ్లో డిస్ప్లే చూపకుండా బ్లాక్ చేశారని బాధితులు వాపోయారు. సీనియార్టీలో మొదటి 50 మందికి కూడా తిరుపతి పరసర ప్రాంతాలు చూపించకుండా 50, 60 కి.మీ, దూరంలోని పంచాయతీలను ఎంపిక చేసుకోవాలని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇంజినీరింగ్ సహాయకుల బదిలీ కౌన్సెలింగ్ భారీ సంఖ్యలో జరిగాయి. చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఇంచార్జి ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఈఈ రామ్మోహన్, మదనపల్లె ఈఈ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. స్పౌజ్ కోటాలో సమీప పంచాయతీల ఎంపికకు అవకాశం కల్పించలేదని ఆరోపణలు గుప్పుమన్నాయి. కేంద్రాల్లో ఆందోళన నిబంధనలకు విరుద్దంగా ప్రక్రియ నిర్వహించారని ఉద్యోగులు కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని స్థానాలను బ్లాక్ చేయించినట్లు తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీలు చూపకుండా మొక్కుబడిగా కౌన్సెలింగ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ కౌన్సెలింగ్ కేంద్రంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్ ప్రక్రియ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో అభ్యర్థులు ఆందోళనను విరమించారు. టీడీపీ ఎమ్మెల్యేల మితిమీరన జోక్యంతో కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళానికి దారి తీసింది. సిఫార్సులకు పెద్దపీటపై సచివాలయ ఉద్యోగుల నిలదీత కౌన్సెలింగ్ కేంద్రంలో అసౌకర్యాలతో అవస్థలుసౌకర్యాల్లేక ఇబ్బందులు రెవెన్యూ భవన్లో అధికారులు కనీస సౌకర్యాలు కూడ కల్పించలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో 664 మంది సచివాలయాల్లో ఇంజినీరింగ్ సహాయకులు ఉన్నారు. 650 చోట్ల ఖాళీలు ఉండగా దాదాపు 450 ఖాళీలు చూపించారని బాధితులు ఆరోపించారు. బదిలీ కౌన్సెలింగ్ సోమవారం కూడా జరగనుంది. -
దహనక్రియలకు వెళ్లి వస్తుండగా..
● వేగంగా వచ్చి ద్విచక్ర వాహనదారుడిని ఢీకొన్న టాటాఏస్ ● శరీరం నుంచి తెగిపడిన తల శ్రీరంగరాజపురం : గ్రానైట్లోడుతో వేగంగా వచ్చిన వాహనం ద్విచక్రవాహనదారున్ని ఢీకొట్టడంతో శరీరం నుంచి తల వేరుపడి మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి దళితవాడకు చెందిన రమేష్ (44) శ్రీరంగరాజపురం మండలంలోని క్షీరసముద్రం గ్రామంలో తమ సమీప బంధువు మరణించడంతో దహనక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్లో బయలుదేరాడు. అయితే 49 కొత్తపల్లిమిట్ట నుంచి గ్రానైట్ లోడ్తో వచ్చిన టాటాఏస్ వాహనం చిత్తూరు పుత్తూరు జాతీయరహదారి మర్రిపల్లి వద్ద రమేష్ బైక్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో రమేష్ శరీరం నుంచి తల తెగి సమీప పొలంలో పడింది. అక్కడికక్కడే రమేష్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. అయితే టాటాఏస్ వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని పశువుల కాపరులు తెలిపారు. తాము చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. టాటాఏస్ వేగంగా వచ్చి రమేష్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం – మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండలంలోని మర్రిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన రమేష్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. శనివారం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్ మరణించడం బాధాకరమన్నారు. రమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. -
నేడు ‘రీకాల్ బాబు మేనిఫెస్టో’ పోస్టర్ ఆవిష్కరణ
చిత్తూరు కార్పొరేషన్ : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు మరిచారని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. సోమవారం దీనిపై పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పోస్టర్ను విడుదల చేయనున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు నియోజకవర్గ నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమానికి చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణకర్రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకులు రాజశేఖర్రెడ్డి ముఖ్య అతిథులుగా వస్తారన్నారు. బాబు ఘ్యూరిటీ..మోసం గ్యారెంటీ అనే సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తామన్నారు. కూటమి సర్కారు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ఐదు వారాల పాటు ప్రచార కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఎన్నికల హామీల ద్వారా ప్రజలు పొందాల్సిన లబ్ధి ఇతర విషయాలు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, క్షేత్రస్థాయిలో నిర్వహణ తదితర అంశాలపై ముఖ్య నాయకులు దిశా నిర్దేశం చేస్తారన్నారు. నియోజకవర్గంలోని నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని విజయానందరెడ్డి కోరారు. -
రోజుల తరబడి పడిగాపులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 వేల హెక్టార్లల్లో మామిడి పంట వ్యాపించి ఉంది. ప్రధానంగా తోతాపురి 39,895 హెక్టార్లల్లో సాగవుతోంది. తద్వారా 4,9,274 మెట్రిక్ టన్నుల కాయలు దిగుబడి అయిందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ దిగుబడులను విక్రయించడానికి ఈ సారి రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. కాయ కోతకోసి ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే పడిగావులు కాస్తున్నారు. వందలాది ట్రాక్టర్లు కాయలతో క్యూ కడుతున్నాయి. ఈ గందరగోళంలో కాయలను అన్లోడింగ్ చేసేందుకు రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోంది. -
ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందాం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలలను సంరక్షించుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ అన్నారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు ఆదివారం జిల్లా కార్యాలయంలో జిల్లాస్థాయి యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, మంచి విద్యను అందించి, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించి ప్రభుత్వ పాఠశాలను విద్యా కేంద్రాలుగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం జీఓ 19ని అమలు చేసి 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,652 మోడల్ ప్రాథమిక స్కూళ్లు, 1–10 తరగతుల ఉన్నత పాఠశాలలు 1552, ప్రాథమికోన్నత స్కూళ్లను అప్గ్రేడ్ చేయగా 779 ఉన్నత పాఠశాలలు, ఫౌండేషన్ స్కూళ్లు 5000, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు 19,000 ఏర్పాటు చేశారన్నారు. ఈ విధానం వల్ల ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని, వీటిని బలమైన స్కూళ్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారానే ప్రభుత్వ విద్యారంగం మనుగడ సాధ్యపడుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు సోమశేఖరనాయుడు, మణిగండన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు జూలై 5వ తేదీ వరకు చేపడుతున్న నమోదు డ్రైవ్లో యూటీఎఫ్ కేడర్ పాల్గొనాలన్నారు. 10 మంది పిల్లలను చేర్పించిన వారికి మండల స్థాయిలో, 20 మందిని చేర్పించిన వారికి జిల్లాస్థాయిలో అభినందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు ఊరి బడిలో పిల్లలను చేరుద్దాం అనే కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో ఆ సంఘం సహాధ్యక్షులు ఎస్ రెహనా బేగం, కే రెడ్డప్ప నాయుడు, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్పీ బాషా, పిఆర్ మునిరత్నం, జిల్లా కార్యదర్శులు ఏ కష్ణమూర్తి, సిపి ప్రకాష్, కె సరిత, టి. దక్షిణామూర్తి, పంటపల్లి సురేష్, ఎం పార్థసారథి, పి సి బాబు, శశి కుమార్, ఎంసీ నిర్మల, తుంబూరు బాలాజీ, సాధన కుమార్, ఎస్ వి రమణ, మోహన్ రెడ్డి వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ‘ఊరి బడిలో పిల్లలను చేరుద్దాం’ కరపత్రిక ఆవిష్కరణ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ -
నేటి నుంచి పుర కార్మికుల సమ్మె ఉధృతం
చిత్తూరు అర్బన్ : మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం కార్మికులు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంజినీరింగ్, ఇతర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించలేదన్నారు. సోమవారం నుంచి కార్మికులు ఎవరూ నీటి సరఫరా విధులకు హాజరుకాబోరని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళుతున్నట్లు కమిషనర్కు స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శరవణ, శివకుమార్, వెంకటేష్, హరికృష్ణ పాల్గొన్నారు. -
జనసేన కార్యకర్తనని చిన్నచూపా?
చిత్తూరు జిల్లా: ‘కూటమి ప్రభుత్వంలో జనసేన కార్యకర్తలను అసలు పట్టించుకోరా? బిడ్డకు లివర్ మార్పిడి సర్జరీ కోసం సీఎం చంద్రబాబును కలిసేందుకు సిఫార్సు లేఖపై సంతకం పెట్టమని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని అడిగితే స్థానిక టీడీపీ నాయకుల మాటలు విని సంతకం పెట్టలేదు. నా బిడ్డ చనిపోయింది’ అంటూ చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ కైగల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే జనసేన కార్యకర్త మృతి చెందిన బిడ్డ, లేఖ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు వైరల్గా మారింది. అందులోని విషయం ఏమిటంటే... శ్రీనివాసులు జనసేన పార్టీ కార్యకర్త. కూలీ చేసుకునే ఇతనికి ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె సౌమ్యకు పచ్చకామెర్లు ముదిరి కాలేయం దెబ్బతింది. దీంతో పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించారు. అయితే వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని, అందుకోసం రూ.30 లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సాయం పొందే అవకాశం ఉందని కొందరు చెప్పడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సిఫార్సు సంతకం కోసం వెళ్లగా ఆయన లోకల్ నాయకుల మాట విని సంతకం పెట్టలేదు. పరిస్థితి విషమించి ఈ నెల 24న ఆ పాప మృతి చెందింది. -
జాండ్లవారిపల్లె సర్పంచ్ ఆత్మహత్య
రొంపిచెర్ల: రొంపిచెర్ల మండలం, జాండ్లవారిపల్లె పంచాయతీ సర్పంచ్ నాగిరెడ్డి (67) ఆత్మహత్యకు పాల్పడారు. ఈ మేరకు మృతుని కుమారుడు డీ.కిరణ్కుమార్రెడ్డి రొంపిచెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24న సర్పంచ్ దేవులపల్లె నాగిరెడ్డి తన కారులో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. జాండ్లవారిపల్లె సమీపంలో వెళ్తుండగా ఫోన్ వచ్చింది. గ్రామానికి అర కిలో మీటరు దూరంలో కారు దిగేశారు. బుధవారం కూడా ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆందోళన చెందారు. శనివారం ఉదయం గ్రామానికి సమీపంలోని ఒట్టిగుట్ట దగ్గర వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నాగిరెడ్డి శవాన్ని గుర్తించారు. తన తండ్రికి అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుందని, దాని బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగిరెడ్డి మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటు సర్పంచ్ దేవులపల్లె నాగిరెడ్డి మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మృతుడు నాగిరెడ్డి దహనక్రియలకు హాజరయ్యారు. నాగిరెడ్డి కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ రెడ్డిశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కరీముల్లా, ప్రేమానందం, రవీంద్ర, సూర్యనారాయణరెడ్డి, యుగంధర్ రెడ్డి, కోటా వెంకటరమణ, లక్ష్మీప్రసాద్రెడ్డి, అశోక్రెడ్డి, విజయశేఖర్ పాల్గొన్నారు. -
జర్నలిస్టులపై కేసులు .. స్వేచ్ఛను హరించడమే
చిత్తూరు అర్బన్: పత్రికల్లో వార్తలు రాసినందుకు గాను జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షులు ఎం.లోకనాథన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కేఎం.అశోక్కుమార్ స్పష్టం చేశారు. జర్నలిస్టులపై ఏదైనా ఫిర్యాదుల వస్తే వాటిలో వాస్తవాలు విచారించి ఆపై పోలీసులు నిర్ణయం తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠను కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఓ వార్త రాసినందుకు గాను స్థానిక సాక్షి రిపోర్టర్ నాగరాజు పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం .. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసిన విషయంపై ఏపీయూడబ్ల్యూజే నాయకులు చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మణికంఠ చందోలుతో చర్చించారు. జర్నలిస్టులను యాజమాన్యాలతో ముడి పెట్టొద్దని.. తమను పాత్రికేయులు గానే గుర్తించి.., హక్కులను రక్షించడానికి పోలీసు శాఖ చొరవ చూపాలని కోరారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో పాత్రికేయులు పనిచేస్తున్నారని తెలిపారు. పాత్రికేయుల హక్కులు, కలం గౌరవాన్ని కాపాడాలని కోరారు. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను నివారించడానికి కమిటీని సైతం రూపొందిస్తామని ఇటీవల కలెక్టర్ హామీ ఇచ్చిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎప్పుడూ ఎవరిపైనా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎస్పీ స్పష్టం చేశారు. పత్రికల్లో వార్త రాయడంతో పాటు వాటిని ఉదేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగారు అనే ఫిర్యాదు పైనే కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్నారు. విచారణలో సంబంధిత రిపోర్టర్ ప్రమేయం లేదని తేలితే తదుపరి చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. పాత్రికేయుల రక్షణ కోసం ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని తాము కచ్చితంగా పాటిస్తామన్నారు. కలెక్టర్తో మాట్లాడి పాత్రికేయులపై దాడుల నివారణ కమిటీని సైతం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లు, విల్లాలపై పడి దోచుకుంటున్న దొంగలు ఇప్పుడు కొత్త రూటును ఎంచుకుంటున్నారు. ఇటీవల బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా రైలు ప్రయాణికులనే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్లీపర్ క్లాసుల్లోని ప్రయాణికులనే ఎంచుకుని చెలరేగిపోతున్నారు. స
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ప్రయాణ సమయంలో ప్రయాణికులు ఒంటిపై ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించడం మంచిది కాదు. ● ఆభరణాలు వేసుకున్నా బయటకు కనిపించకుండా చూసుకోవాలి. ● విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్ను పక్కవారికి అప్పగించడం, రైల్లోనే వదిలేసి రైలు ఆగిన సమయంలో ప్లాట్ఫాం మీదకు వెళ్లడం వంటివి చేయరాదు. ● విలువైన వస్తువులు కర్ర సంచుల్లో నిర్లక్ష్యంగా ఉంచి తీసుకెళ్లడం మంచిది కాదు. ● బ్యాగులు, సూట్ కేసులకు చైన్లాక్ సిస్టంను వేసుకోవాలి. ● అపరిచిత వ్యక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలను తినరాదు. ● రాత్రి వేళల్లో ప్రయాణించే సమయంలో కిటికీలు మూసుకోవాలి. ● అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే డయల్ 100, రైల్వే పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 1082 లేదా 139కు సమాచారం అందించాలి. రైళ్లలో రాత్రివేళ చెలరేగిపోతున్న దొంగలు ● బంగారు నగలే లక్ష్యంగా దోపిడీ ● సిగ్నల్ ట్యాంపరింగ్తో చోరీలు ● రెండు నెలల్లో మూడు ఘటనలు ● దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు ● ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు ఏసీల కంటే స్లీపర్ క్లాస్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా రైల్వేస్టేషన్లో సిగ్నల్ వ్యవస్థ ఉంటుంది. ఇందులో రెడ్, గ్రీన్, ఆరెంజ్ రంగుల లైట్స్కు సంబంధించి బాక్స్లో మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. స్టేషన్ టు స్టేషన్ (మిడ్ స్టేషన్) మధ్యలో ఉండే సిగ్నల్ మానిటరింగ్ వ్యవస్థలో రెడ్, గ్రీన్ లైట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో గ్రీన్ లైట్ వైర్ను దొంగలు తీసివేస్తున్నారు. ఆ సమయంలో సిగ్నల్ చూపితే రెడ్లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆ సిస్టమ్ను కనుక్కొని దొంగల ముఠా దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలు ● మే 2న రాత్రి 10.30 గంటలకు ముంగిలిపట్లు రైల్వేస్టేషన్ పరిధిలో హోమ్సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్కు గురైంది. రెడ్లైట్ వెలుగుతుండడంతో రైలు ఆగిన తర్వాత కొందరు దుండగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఇద్దరి ప్రయాణికుల మెడలో బంగారు గొలుసులు తీసుకొని పారిపోయారు. ● మే 14న వేకువజామున 2.30 గంటలకు అదే ముంగిలిపట్లు రైల్వేస్టేషన్ పరిధిలో మళ్లీ హోమ్సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ చేశారు. కొందరు రైలు బయట నుంచే బంగారు గొలుసులు దొంగలించారు. ● జూన్ 26 వేకువజామున 2.30 గంటలకు సిద్ధంపల్లె రైల్వేస్టేషన్ పరిధిలో హోమ్ సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ గురవ్వడంతో రైలును ఆపేశారు. కొంతమంది ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను తెంచుకొని వెళ్లారు. ఈ మూడు దొంగతనాల్లో 10 మంది మహిళల మెడల్లోని దాదాపు 120 గ్రాముల పైగా బంగారాన్ని కాజేశారు. చిత్తూరు కార్పొరేషన్: రైలు ప్రయాణమంటేనే ఉమ్మడి జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల వరుసుగా చోటుచేసుకుంటున్న ఘటనలు తలుచుకుని భయాందోళనకు గురవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడం.. కిక్కిరిసిన జనాల మధ్యన ప్రయాణం చేయాల్సి రావడంతో దొంగలకు వరంగా మారింది. ప్రయాణికుల సంఖ్యకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో చోరీల నివారణ కష్టతరమవుతోంది. ఎక్కువగా రాత్రి 10.30 నుంచి వేకువజామున 3 గంటల లోపు దొంగతనాలు జరగుతున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. కిటీకీల వద్ద నగలు చోరీ చేసి పరారవుతున్నారు. బంగారు నగలే లక్ష్యం రైళ్లలో చిల్లర దొంగతనాలు పాత పద్ధతి. ఇప్పుడు దొంగలు రూట్ మార్చారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారాన్ని చాకచక్యంగా కొట్టేసేందుకు పూనుకుంటున్నారు. ఊర్లకు వెళ్లేటప్పుడు మహిళలు ఆభరణాలు ధరించుకువెళ్లడం అలవాటుగా మారిన నేపథ్యంలో దొంగలు వారినే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువగా రైలు కిటికీల నిద్రిస్తున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను దోచుకెళ్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, రోడ్డుకు దగ్గర్లో ఉండే స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నిమిషాల్లో తమ పనికానిచ్చేస్తున్నారు. మహారాష్ట్ర ముఠాగా అనుమానం వరుస దొంగతనాల వెనుక మహారాష్ట్ర (పార్థీ గ్యాంగ్) ముఠాకు చెందిన వారు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్లలో నేరాలకు పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. వీరు 4–8 మంది దొంగతనానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. చిత్తూరు రూరల్ మండలం, సిద్ధంపల్లె స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనలో వేకువజామున 2.30 గంటలకు రైలు ఆగింది. దుండగలు రైలు వెలుపల ఒకరు వెనుక ఒకరు ఉన్నారు. ఒకరి భుజం పై మరొకరు కూర్చొని తెరిచిన కిటికీల్లో టార్చ్ వేస్తూ ఓ మహిళ మెడలో బంగారు గొలుసు తెంపారు. ఇలా ఎస్–7, 10 బోగిల్లో నలుగురి వద్ద 60 గ్రాముల వరకు బంగారం దోచుకున్నారు. రైలులో ఉండే బీట్ పోలీసులు విజిల్స్ వేసే లోపల దొంగలు తప్పించుకున్నారు. ఘటన జరిగిన అర గంటలో రైల్వే పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అరకొరగా ఎస్కార్ట్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరకొరగా ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క స్టేషన్ నుంచి ఇద్దరు బీట్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక బీట్లో 3 నుంచి 4 రైళ్లను కవర్చేసే విధంగా డ్యూటీలు అమలు చేస్తున్నారు. వీరితో పాటు ఆర్ఫీఎఫ్ విభాగం నుంచి ఇద్దరు ఉంటారు. కనీసం ఒక బీట్కు నలుగురు జీఆర్పీ పోలీసులు, నలుగురు ఆర్పీఎఫ్ పోలీసులు వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లను కవర్చేసే విధంగా ఉంటే భద్రత పటిష్టపరిచే విధంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్పీఎఫ్ విభాగానికి చెందిన వారి విధులు బలోపేతంగా లేవన్న విమర్శలున్నాయి. రైళ్లలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నా జీఆర్పీ పోలీసులకు కాల్చివేత ఉత్తర్వులు అమలు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత స్లీపర్క్లాస్లో ఎక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయో చూసుకుని నిద్రలోకి జారుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంకట్రాది ఎక్స్ప్రెస్ రైలులో కడప రైల్వేస్టేషన్ వరకు ఇద్దరు ఎస్కార్ట్గా వచ్చి కడపలో దిగుతున్నారు. కట్ చేసిన సిగ్నల్ వైర్ గస్తీ ముమ్మరం రైళ్లలో దొంగతనాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. వివిధ బృందాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. త్వరలో నిందితులను పట్టుకుంటాం. రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు అప్రమ్తతంగా ఉండాలి. వేసవి దృష్ట్యా రైళ్లలో గస్తీని ముమ్మరం చేశాం. నేరాలు జరగకుండా ప్రతి రైల్వే స్టేషన్లో పికెట్లు ఏర్పాటు చేశాం. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రయాణికులు సహకరించాలి. – హర్షిత, రైల్వే డీఎస్పీ, గుంతకల్లురేంజ్ రెండు నెలల్లో మూడు రాబరీలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు నెలల వ్యవధిలో మూడు రాబరీలు జరిగాయి. ఇందులో రెండు తిరుపతి జిల్లాలోని ముంగలిపట్టు వద్ద కాగా మరొకటి చిత్తూరు జిల్లా సిద్ధంపల్లె సమీపంలో చోటు చేసుకుంది. చిత్తూరులో ఇటువంటి దోపిడీ జరగడం ఇదే మొదటి సారి. కానీ ఈ దొంగతనాల్లో దాదాపు రూ.15 లక్షల విలువైన 120 గ్రాముల బంగారం దొంగతనం జరిగినట్లు సమాచారం. ఇటీవల చిత్తూరు రూరల్ పరిధిలో జరిగిన రాబరిపై పోలీసులు ప్రత్యేక బృందంగా విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన బ్యాగ్లను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్, యాక్టివ్ క్రిమినల్స్ గురించి ఆరా తీస్తున్నారు. -
విలీనంపై రగడ
బైరెడ్డిపల్లె: తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేయడంపై మండలంలోని మిట్టపల్లె గ్రామస్తులు శనివారం పలమనేరు–కుప్పం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు 32 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అయితే ఇందులో 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలో మీటర్ దూరంలోని నాగిరెడ్డిపల్లె పాఠశాలలో విలీనం చేశారని చెప్పారు. ఉదయం, సాయంత్రం విద్యార్థులు వ్యవసాయపొలాల గుండా వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 20 రోజులుగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం లేదన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. సుమారు 30 నిమిషాల పాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బైరెడ్డిపల్లె ఎస్ఐ పరశురాముడు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఎంపీడీఓ రాజేంద్రబాలాజీ, ఎంఈఓ సుబ్రమణ్యంకు వినతి పత్రం అందజేశారు. -
చంద్రబాబు మోసాల మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి సూచించిన పెద్దిరెడ్డి, భూమన తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ మేనిఫెస్టో బాండ్లను ఇచ్చి మోసగించిన చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు,తిరుపతి జిల్లాల అధ్య క్షులు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి మారుతీనగర్లోని పెద్దిరెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మెయిళ్ల గౌరీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు బొర్ర మాదవిరెడ్డి తదితరులు శనివారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి దుస్సాలువలు కప్పి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించడంలో మహిళా విభాగం కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఏడాది పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకపోయినా అన్నీ చేసేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్న విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా, మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందన్న విషయాన్ని మహిళలకు తెలియజేయాలన్నారు. -
అవినీతి కూటమి
శ్రీరంగరాజపురం: కూటమి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. శనివారం పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగాధరనెల్లూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక ఎమ్మెల్యే, అతని అనుచరులు ఇసుక, గ్రావెల్, గ్రానైట్ను దోచుకుంటున్నారన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు హరీష్యాదవు ఒక క్వారీ యజమాని నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని గుర్తుచేశారు. పాలసముద్రం, శ్రీరంగరాజపురం మండలాల్లో గుట్టలను మాయం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణ చేపట్టాలి ఎమ్మెల్యే థామస్ చేస్తున్న అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు గిట్టుబాటు ధర లేక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. మామిడికి పరిశ్రమలు అందించే టోకన్లు సైతం బ్లాక్లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. -
వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ
గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 355 మంది హాజరయ్యారు. 7శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,229 మంది స్వామి వారిని దర్శించుకోగా 30,559 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో ‘అన్నమయ్య పదామత వర్షణి’ కార్యక్రమం సంగీత ప్రియులను అలరించింది. శ్రీసిటీ –శ్రీవాణి వేదిక కావడం తమకు గర్వకారణమని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. చిత్తూరుఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025– 8లో -
చంద్రబాబు ఇలాకా.. వెలుగులోకి టీచర్ల నిర్వాకం
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ఇలాకా కుప్పం నియోజకవర్గంలో ఉపాధ్యాయుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఆవరణలో విద్యార్థులతో ఉపాధ్యాయులు చెత్త ఎత్తించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బైరుగానపల్లి ప్రభుత్వ స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్వీపర్లు ఉన్నా కానీ విద్యార్థులతో పనులు చేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో విద్యార్థుల బతుకు విలువ ఇదేనా?’ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు. చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?. ఇది విద్యాలయమా? లేక శిక్షా శిబిరమా?. నారా లోకేష్.. పేద పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్జుకొని ఇప్పటికైనా విద్యాశాఖపై దృష్టి పెట్టండి’’ అంటూ రోజా హితవు పలికారు.చిత్తూరు - కుప్పంలో..ముఖ్యమంత్రి @ncbn గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో... విద్యార్థుల బతుకు విలువ ఇదేనా?స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు!తల్లిదండ్రుల ఆవేదన: “చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?”ఇది విద్యాలయమా?… pic.twitter.com/X6KvLxtzSp— Roja Selvamani (@RojaSelvamaniRK) June 27, 2025 -
ధర ‘కోతా’పురి
చిత్తూరుకు చెందిన ఓ రైతు తోతాపురి రకం మామిడి కాయలను కోసి లారీలో ఫ్యాక్టరీకి అమ్మకానికి పెట్టాడు. రోజులు గడిచినా ఫ్యాక్టరీ నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాయలను ఉచితంగా ఇచ్చేయాలని లారీ డ్రైవర్కు చెప్పడంతో... చిత్తూరు కైలాసపురం వాసులకు పంచిపెట్టారు.తవణంపల్లి మండలం కృష్ణాపురం గ్రామ రైతు సుబ్రమణ్యంరెడ్డి రెండు రోజుల క్రితం ట్రాక్టర్ కాయల (5 టన్నులు)ను రోడ్డు మీద పారబోశారు. ర్యాంపులో తోతాపురి కేజీ రూ.2కు కొంటున్నారు. దీంతో స్థానిక తహసీల్దార్ తనిఖీ చేసి రూ.3కు కొనాలని నిర్వాహకుడిని ఆదేశించారు. దీనికి అతడు ఒప్పుకోలేదు. తహసీల్దార్ ర్యాంపునకు కరెంట్ కట్ చేయించారు. విసిగిన సుబ్రమణ్యంరెడ్డి కాయలను రోడ్డుపై పారబోసి వెళ్లిపోయారు.చిత్తూరు రూరల్: మామిడి రైతుల వ్యథ తీవ్రమవుతోంది. ఫలం పండినా... వారికి ప్రతిఫలం దక్కడం లేదు. ప్రధానంగా తోతాపురి రైతు తిప్పలు చెప్పనలవి కాదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8 ఎక్కడా దక్కడం లేదు. ర్యాంపుల్లో తోతాపురి కేజీ రూ.2కు మించి కొనడమే లేదు. ఫ్యాక్టరీలో కొద్ది రోజులు రూ.8 నుంచి ప్రారంభమై..రూ.6, రూ.5, రూ.4కు చివరికి రూ.2కి పడిపోయింది. ప్రస్తుత ధరపై ఫ్యాక్టరీలు అసలు నోరు విప్పడం లేదని రైతులు మండిపడుతున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 56 వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించాయి. తోతాపురి రకమే 39,895 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 4.99 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు తోతాపురి 1.5 లక్ష టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ⇒ 43 పళ్ల గుజ్జు (పల్ప్) పరిశ్రమలున్నాయి. వీటిలో 31 పనిచేస్తున్నాయి. నిరుడు తయారు చేసిన గుజ్జు నిల్వలు యుద్ధాల కారణంగా నిలిచిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎగుమతులు పుంజుకున్నాయి. ప్రస్తుతం 50 వేల టన్నుల గుజ్జు స్టాక్ ఉంది. దీన్ని సాకుగా చూపించి ఫ్యాక్టరీలు తోతాపురి కొనుగోలును ఆపేశాయి. తర్వాత జిల్లా అధికారుల ప్రయత్నంతో కొన్ని ఫ్యాక్టరీలు తాళం తీశాయి. ఈ నెల 6 నుంచి టోకెన్ల జారీ ప్రారంభించి కాయల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాయి. ఫ్యాక్టరీల ఎదుట ట్రాక్టర్ల క్యూ ఈ నెల 8 నుంచి ఫ్యాక్టరీలు తోతాపురి కొనుగోలుకు గేట్లు తెరిచాయి. అప్పటి నుంచి ట్రాక్టర్లు, లారీలు లోడ్తో వేచి చూస్తున్నాయి. రోజులు గడుస్తున్నా అన్ లోడింగ్ కావడం లేదు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీ నుంచి వేలాది ట్రాక్టర్లు, లారీలు రాష్ట్ర సరిహద్దును దాటి తమిళనాడు రాష్ట్రం కాటా్పడిలోని కింగ్స్టన్ కాలేజీ వరకు క్యూ కట్టాయి. ఇదే మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్న టాసా ఫ్యాక్టరీని ట్రాక్టర్లు, లారీలు చుట్టుముట్టాయి.రోజుల తరబడి అన్లోడింగ్ కాకపోవడంతో బండ్లల్లోని కాయలు జ్యూస్ అవుతున్నాయి. గంగాధరనెల్లూరు మండలం జైన్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. రైతులు ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పూతలపట్టు, తవణంపల్లి, బంగారుపాళ్యం, పెనుమూరు, తిరుపతి జిల్లాలోని దామలచెరువు తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ రైతులు పస్తులు ఉంటున్నారు. ఫ్యాక్టరీలో మద్దతు కరువు⇒ మద్దతు ధర కేజీ రూ.8, ప్రోత్సాహక నిధి రూ.4... మొత్తం కేజీ తోతాపురికి రూ.12 ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఫ్యాక్టరీలు తొలుత కేజీ రూ.8 చొప్పున కొన్నాయి. వారం రోజుల్లో రూ.6కు తగ్గించేశాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనలేమని చేతులెత్తేశాయి. 10 రోజుల తర్వాత కొన్ని ఫ్యాక్టరీలు రేటును రూ.5కు దించాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఫ్యాక్టరీలు కొనుగోలు ధరను వెల్లడించడం లేదు. నగదు చెల్లింపులపై స్పష్టత ఇవ్వకుండా రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. బిల్లుల్లో తూకం వివరాలు మాత్రమే నమోదు చేయడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా 40 ర్యాంపులున్నాయి. వీటి నిర్వాహకులు సిండికేట్ అయి మామిడి ధరలను తగ్గించేస్తున్నారు. తొలుత తోతాపురి కేజీ రూ.4 అంటూ రంగంలోకి దిగారు. తర్వాత రూ.3.50, రూ.3కు కొన్నారు. గత వారం రూ.2.50 అని.. ఈ వారం రూ.2కు చేర్చారు.కాయలు చెట్లల్లో రాలిపోయే పరిస్థితి ఉండడంతో... విధి లేని పరిస్థితుల్లో రైతులు చాలామంది ఇదే రేటుకు దింపి వస్తున్నారు. కొందరు రైతులు గిట్టుబాటు గాక, నీరసించి.. విసిగిపోయి.. రోడ్డుపై పారబోసి కన్నీళ్లతో ఇంటికెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రైతులు మండిపడుతున్నారు. మద్దతు ధరలో మభ్యపెట్టాలని చూస్తోందని విరుచుకుపడుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మద్దతు ధర పేరుతో మాయ చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు.విధిలేక ర్యాంపునకు తోలుతున్నా.. నాకు 5 ఎకరాల దాకా మామిడి తోట ఉంది. తోతాపురి 20 టన్నుల వరకు వచి్చంది. ఫ్యాక్టరీకి ట్రాక్టర్లో రెండు లోడు కాయలు తరలించా. అక్కడ కొనలేమని చెబితే విధిలేక ర్యాంపుకు తీసుకొచ్చా. ర్యాంపుల్లో కేజీ రూ.2 అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. పెట్టుబడి కూడా రాదు. ఈసారి రైతులు నిండా నష్టపోయారు. – సూర్యప్రకాష్, దాసరపల్లి, యాదమరి మండలం -
మత్తు వదలాలి.. భవిష్యత్ మారాలి
చిత్తూరు అర్బన్: యువత మత్తు వదిలి.. భవిష్యత్ బంగారు బాట పట్టేలా అడుగులు వేయాలని కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి భారతి పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం–అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా గాంధీ విగ్రహం నుంచి దర్గా సర్కిల్, చర్చివీధి మీదుగా ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ యువత మత్తుకు బానిసలైతే జీవితం చిత్తవుతుందన్నారు. గంజాయి జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో అవగాహన తీసుకోవాలన్నారు. మత్తు వదిలేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్మన్ కఠారి హేమలత, డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ చిత్తూరులో మాదక ద్రవ్యాల నివారణపై ర్యాలీ -
రోడ్డు ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
ఐరాల: రోడ్డు ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మండలంలోని ఎం.పైపల్లె వద్ద గురువారం చోటు చేసుకుంది. కాణిపాకం ఇన్చార్జి ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని మామిడిగుంట్లపల్లెకు చెందిన ఏ.ప్రకాష్(42) కాణిపాకం ఆలయంలో ఔట్ సోర్సింగ్ హెల్పెర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో చిత్తూరుకు సొంత పనుల నిమిత్తం బయలుదేరాడు. మండలంలోని చిన్నవెంకటంపల్లెకు చెందిన నరసింహారెడ్డి ఓ కారులో చిత్తూరు నుంచి ఐరాల వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో నరసింహారెడ్డి అతివేగంగా కారు నడుపుతూ ఎం.పైపల్లె వద్ద ద్విచక్రవాహనంలో వెళుతున్న ప్రకాష్ను కారుతో ఢీకొన్ని, వెనుక వస్తున్న ఆటోను ఢీకొన్ని కొంత దూరం కారుతో లాక్కొని వెళ్లి ఓ చెట్టుకు ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఆటోలో ఉన్న మండలానికి చెందిన జుబేరా కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను ఓ ప్రైవేటు వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రకాష్ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం జుబేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోస్టుమార్టమ్ అనంతరం ప్రకాష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి మురగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాష్ మృతికి కాణిపాకం ఆలయ సిబ్బంది ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. -
ఐదుగురు జూదర్ల అరెస్టు
చౌడేపల్లె: మండలంలోని పెద్దకొండామర్రి చెరువు కింద గల పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. రహస్య సమాచారం మేరకు సిబ్బందితో కలసి పేకాట స్థావరంపై దాడులు చేయగా కేశవరెడ్డి, శ్రీనివాసులు, ముకుంద, లక్ష్మన్న, సహదేవను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,100 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తపాలా బీమా ఏజెంట్ల ఎంపికకు ఇంటర్వ్యూలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని తపాలాశాఖ పరిధిలో బీమా ఏజెంట్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ తెలిపారు. పదో తరగతి పాసై 18 ఏళ్లు దాటిన వారు ఇందుకు అర్హులన్నారు. తపాలా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలను బుక్ చేయాలన్నారు. ఆసక్తిదారులు జూలై 5వ తేదీ లోపు కార్యాలయ పనివేళల్లో చిత్తూరులోని ప్రధాన తపాలా కార్యాలయంలో సంప్రదించాలన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి బంగారుపాళెం: విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మ హిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువా రం మృతి చెందినట్లు ఏఎస్ఐ రామచంద్రారెడ్డి తెలిపారు. ఏఎస్ఐ కథనం మేరకు.. పలమనేరు మండలం జగమర్ల గ్రామానికి చెందిన సుధాకర్, అతని భార్య పల్లవి బంగారుపాళెం మండలం నలగాంపల్లెకు చెందిన శ్యామల మామిడితోటలో కాపలాగా ఉన్నారు. ఈ నెల 22న భర్త సుధాకర్ మద్యం సేవించి రావడంతో భార్య పల్లవి ప్రశ్నించింది. ఈ విషయంపై భార్య, భర్త గొడవలు పడ్డారు. దీంతో సుధాకర్ మొదట విషం తాగాడు, భయపడిన పల్లవి కూడా విషం తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు భార్యాభర్తలను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. భర్త సుధాకర్ కోలుకోగా, భార్య పల్లవి(23) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆఖరి మజలీలో మళ్లీ కష్టాలు!
పుత్తూరు: పట్టణంలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.151 కోట్ల వ్యయంతో నాటి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పుత్తూరు పట్టణానికి అత్యాధునిక గ్యాస్ ఆధారిత శవ దహనవాటిక (ఎలక్ట్రికల్ క్రమటోరి యం షెడ్డు)ను ఏర్పాటు చేయించారు. శ్మశాన వాటిక మధ్యలో రోజా చారిటబుల్ ట్రస్ట్చే ముక్తి ప్రదాత శివుని భారీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. దీనికి దక్షిణ కైలాస ముక్తిథామం అని నామకరణం చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది తిరక్క ముందే రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన క్రమటోరియం మిషన్లు పాడై పోయాయని షెడ్కు తాళాలు వేశారు. దీంతో మృత దేహాలను మళ్లీ పిడకలపై కాల్చే పాత పద్ధతికి శ్రీకా రం చుట్టినట్లైంది. పాడైన విషయం తెలియని ప్రజలు మృతదేహాలతో శ్మశాన వాటికలోకి వచ్చేస్తున్నారు. తీరా ఇక్కడి వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని అప్పుడు పిడకల కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు. గొయ్యి తీసి పూడ్చేందుకు మనుషులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తంతు గత నెల రోజులుగా జరుగుతున్నా మున్సిపల్ అధికారులు ఎలక్ట్రికల్ క్రమటోరి యం మిషన్లు మరమ్మతు చేయించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మరమ్మతులు త్వరతగతిన పూర్తి చేసి ఎలక్ట్రికల్ క్రియేషన్ షెడ్ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.త్వరలో మరమ్మతులు పూర్తి చేస్తాం ఎలక్ట్రికల్ క్రమటోరియం షెడ్లో ఓ మోటారు తో పాటు రెండు సెన్సార్లు పనిచేయడం లేదు. వీటిని చైన్నెకి చెందిన కంపెనీ వారు ఏర్పాటు చేశారు. అదే కంపెనీ వారిని మరమ్మతులకు పిలిచాం. రెండు రోజుల్లో వస్తామని చెప్పి ఉన్నా రు. వారు వచ్చిన వెంటనే మరమ్మతులు పూర్తి చేసి, షెడ్ను వినియోగంలోకి తీసుకొస్తాం. – ఎం.మంజునాథ్గౌడ్, కమిషనర్, పుత్తూరు మున్సిపాలిటీ -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
విజయపురం : స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 23వ తేదీ భూ తగాద కారణంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేశ్వరన్ (55) హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరి డీఎస్పీ సయ్యద్ అబ్దుల్ అజీజ్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. తమిళనాడు తిరుత్తణి తాలూకా అరుంబాకం గ్రామానికి చెందిన వెంకటేశ్వరన్, అదే కాలనీకి చెందిన వెంకటేశన్కు గత 12 సంవత్సరాలుగా భూ తగాదా ఉంది. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీ వెంకటేషన్, తన ఇద్దరి కుమారులు ప్రభు, సేత పాతర్కాడు సమీపంలో కొబ్బరి తోట వద్ద వెంకటేశ్వరన్ను కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం వెంకటేషన్ను అరెస్టు చేశారు. అతని ఇద్దరి కుమారులు పరారీలో ఉన్నారు. ఈ కేసు ఛేదించడంలో సహకరించిన సీఐ భాస్కర్, ఎస్ఐ రంగా, గోవిందరాజులు, సుబ్రమణ్యం, నరేష్, సత్యరాజ్, మణివల్లన్, అయ్యప్ప, శశికుమార్, దామోదరం, హరి, ప్రసాద్, లక్ష్మయ్యను డీఎస్పీ అభినందించారు. -
టీడీపీలో కుమ్ములాట
పాలసముద్రం : మండలంలోని తెలుగుదేశం గ్రామ స్థాయి కమటీల నియామకంలో గురువారం శ్రీకావేరిరాజుపురంలో జరిగిన కార్యక్రమంలో మండలంలో ఇరువర్గాలు కుమ్ములాడుకున్నాయి.. టీడీపీ పాలసముద్రం మండల అధ్యక్ష పదవికి మండలంలో నెల రోజులుగా ఎమ్మెల్యే, చిట్టిబాబు నాయుడు వర్గాల నడుమ విబేధాలు ఎక్కువయ్యాయి. పార్టీ మండల అధ్యక్ష పదవికి అధిస్థానం గ్రామస్థాయి కమిటీ నమోదు చేసుకుని, అందులో ఎక్కువ మంది ఎవరికి అమోదం తెలుపుతారో అతన్ని మండల అధ్యక్షుడిగా నియమించకోవచ్చని చెప్పడంతో మండంలో ఎమ్మెల్యే.. చిట్టిబాబు నాయుడు ఇరుఇర్గాలు గ్రామస్థాయి కమిటీ నియామకానికి కుమ్ములాడుకుంటున్నాయి. కమిటీ నమోదు చేయడానికి వచ్చిన అబ్జర్వర్లు కూడా నాయకులు చేస్తున్న గొడవలు చూసి గ్రామస్థాయి కమిటీలు నియామకం చేయకుండా పేరు నమోదు చేసుకుపోతున్నారు. మండలంలో ఎమ్మెల్యే ఎవరిని అమోదిస్తారో వారికే మండల అధ్యక్ష పదవి వస్తుందని టీడీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు. కొలమాసనపల్లి అడవిలో పేకాట పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లి, గొల్లపల్లి అటవీప్రాంతంలో రహస్య ప్రదేశంలో పేకాట సాగుతోందని తెలిసింది. కొందరు అధికారపార్టీ అండతో పేకాటను నడిపిస్తున్నట్టు సమాచారం. అడవిలోని రహస్య ప్రదేశంలో స్థానికులే కాకుండా బయట రాష్ట్రాలకు చెందిన వారు సైతం వచ్చి ఇందులో పాల్గొంటున్నట్టు తెలిసింది. గతంలో ఇదే అడవిలో పేకాట ఆడుతుండగా స్థానిక పోలీసులు, స్పెషల్ బ్రాంచి సిబ్బంది మూకుమ్మడి దాడులు చేసి, పేకాటరాయుళ్లను పెద్దసంఖ్యలో అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్పీ పీడీ యాక్టు నమోదు చేసి జిల్లా బహిష్కరణ సైతం విధించారు. మళ్లీ కూటమి రాకతో ఓ పోలీసు కానిస్టేబుల్ సహకారంతో ఓ వ్యక్తి అడవిలో జూదం నడిపిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడికి నిత్యం పెద్దసంఖ్యలో జూదగాళ్లు బైకులపై వచ్చి వాటిని రహస్యంగా దాచి అక్కడి నుంచి కాలినడకన వెళ్లి ఆటలో పాల్గొంటున్నారని సమాచారం. ఈ అడవిలోకి వెళ్లే మార్గంలో ఎవరు లోనికొస్తున్నారని తెలుసుకొని సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ఇరువురు ఏజెంట్లు ఉన్నట్టు తెలిసింది. వీరు ఈలలు వేయడం, సెల్ఫోన్ ద్వారా మెసేజ్ లివ్వడం ద్వారా జూదగాళ్లకు వద్దకు ఎవరూ వెళ్లకుండా కాపుగాస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై జిల్లా అధికారులైనా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చెబుతున్నారు. గురుకుల టీచర్లకు బదిలీలు నిర్వహించాలి చిత్తూరు కలెక్టరేట్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీజీటీ, పీజీటీలకు బదిలీలు నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం కోరారు. ఆ సంఘ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ పద్మజను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా, టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలన్నారు. గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లకు సకాలంలో జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఆర్జేసీ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటం ప్రదర్శించాలన్నారు. ఆరో తరగతి పాఠ్యాంశాల్లో అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు డీసీఓను శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు మురళి, భాస్కర్, షణ్ముగం, పొన్నయ్య, సంతానం తదితరులు పాల్గొన్నారు. -
అంతా మా ఇష్టం!
● కుప్పం లైనింగ్ పనుల్లో రూ.169 కోట్ల పనులు ఆ ఇద్దరికే! ● ఇద్దరితో నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ సాధ్యమా? ● ఏరికోరి వారినే నియమించిన ఉన్నతాధికారులు మదనపల్లె: వడ్డించే వాడు మనోడైతే ఏ బంతిలో ఉన్నా కొరవుండదన్న సామెత హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగమైన చిత్తూరు జిల్లా కుప్పం ఉపకాలువ లైనింగ్ పనులకు అతికినట్టు సరిపోతుంది. ఈ లైనింగ్ పనులు చేపట్టింది అనకాపల్లె ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, అందులోనూ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో ఇక చెప్పేదేముంటుంది. ఎవరెమనుకున్నా సరే మనోళ్లు, మనం చెప్పినట్టు వినేవాళ్లకు పనులు అప్పగిస్తే..ఇక అడ్డు అదుపు ఉండదనుకున్నారేమో.. సరిగ్గా అదే జరిగింది. రూ.169 కోట్ల విలువైన పనులను చూసే బాధ్యతను కేవలం ఇద్దరంటే ఇద్దరే అధికారులకు అప్పగించి, ఉన్నతాధికారులు స్వామి భక్తిని చాటుకున్నారు. అంతటిలో ఆగలేదు..మీ పనులు మీ ఇష్టం అన్నట్టుగా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేశారన్న విమర్శలు వినిస్తున్నాయి. డివిజన్ అధికారిని తప్పించేసి.. హంద్రీనీవా ప్రాజెక్టు సబ్ డివిజన్ కేంద్రం కుప్పంలో ఉంది. దీనికి సెల్వరాజ్ డీఈగా స్థానికంగా ఉండి పని చేస్తున్నారు. వాస్తవానికి కుప్పం ఉపకాలువ లైనింగ్ పనుల్లో ఈయన కీలకంగా పని చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థకు నచ్చలేదో లేక చెప్పినట్టు పని చేయరని అనుకున్నారో కాని కుప్పం లైనింగ్ పనుల బాధ్యత వహించాల్సిన సెల్వరాజ్కు ఒక్కశాతం బాధ్యత లేకుండా పూర్తిగా తొలగించి, పక్కన పెట్టారు. అయితే పూర్తిగా బాధ్యతలు అప్పగించకపోతే వివాదం రేగుతుందని అనుకున్నారేమో ఆయనకు చిత్తూరు జిల్లాలో పని కల్పించకుండా అన్నమయ్యజిల్లాలో జరుగుతున్న పుంగనూరు ఉపకాలువ పనుల్లో 12 కిలోమీటర్ల బాధ్యతలను అప్పగించి చేతులు దులుపుకున్నారు. అంతా ఆ ఇద్దరికే.. రూ.169 కోట్ల విలువ కలిగిన 90 కిలోమీటర్ల కాలువ పనులు..అందులో లైనింగ్, షార్ట్ క్రీటింగ్ పనులు కీలకమైనవి. అయితే ఉన్నతాధికారుల కనుసన్నల్లో పనుల అప్పగింత వ్యవహారం సాగింది. పీబీసీ పనుల్లో ఐదుగురు డీఈఈలను నియమిస్తే..కుప్పం పనులకు అంతేమందిని నియమించాలి. అయితే ఇక్కడ నిబంధనలు పని చేయలేదు. డీఈ సెల్వరాజ్ను తప్పించాక..ఏరికోరి ఇద్దరికి బాధ్యతలు ఇచ్చారు. 90 కిలోమీటర్ల కాలువ పనులకు ఒకే ఒక్క డీఈగా గోవర్దన్ను, ఒకే ఒక్క ఈఈగా వెంకటేశ్వర్లును నియమించారు. ఎక్కువ మంది ఉండాల్సిన జేఈల సంఖ్య కేవలం నాలుగుకే పరిమితం చేశారు. మిగిలిన ఎవరికీ ఈ పనుల్లో భాగస్వామ్యం కానీ, బాధ్యతలు కానీ అప్పగించకుండా దూరంగా ఉంచేశారు. కుప్పం లైనింగ్ పనులకు ఒక ఈఈ, ఒక డీఈకే పూర్తి కాలువ బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు మరి పుంగనూరు ఉపకాలువ విషయంలో అలా వ్యవహరించలేకపోడం వెనుక కారణాలేమిటన్నది చర్చనీయాంశమైంది. ఇక్కడ ఐదుగురు డీఈలకు బాధ్యతలు ఇస్తే..90 కిలోమీటర్లకు ఒకే డీఈకి ఎలా బాధ్యత ఇచ్చారో..ఒక్కరే ఇంత పని ఎలా నిర్వహిస్తారని ఉన్నతాధికారులు భావించారో అర్థంకాని వ్యవహారంగా మారింది. పీబీసీ పని నామినేషన్పై అప్పగిస్తే..కుప్పం పనిని టెండర్ ద్వారా రెండు రీచ్లుగా పనులు చేపట్టారు. ఇలా అయినా కనీసం ఇద్దరు ఈఈలు, ఇద్దరు డీఈలైనా ఉండాలి. అలా కూడా లేకుండా ఒక్క డీఈనే నియమించారు. పనులపై అనుమానాలెన్నో కుప్పం ఉపకాలువలో జరుగుతున్న లైనింగ్ పనులు కేబీసీ లైనింగ్ పనులివీ.. కుప్పం ఉపకాలువ(కేబీసీ)లో లైనింగ్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాక రెండు కాంట్రాక్టు సంస్థలు టెండర్లలో పాల్గొనగా అందులో రిత్విక్ ప్రాజెక్ట్ సంస్థ అదనంగా టెండర్ దాఖలు చేయడంతో ప్రభుత్వం దాన్నే ఖరారు చేసి పనులు అప్పగించింది. రెండు రీచ్లుగా నిర్ణయించిన ప్రభుత్వం రూ.169,80,935తో 90.393 కిలో మీటర్ల కాలువకిరువైపులా సిమెంట్ లైనింగ్, అందులో 26.391 కిలోమీటర్లు షార్ట్ క్రీటింగ్ పనులు పూర్తి చేయాలి. మిగిలిన 64.002 కిలోమీటర్లు లైనింగ్ చేయాలి. ఈ పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయించాలన్నది లక్ష్యం. ఇందుకోసం పూర్తిస్థాయి సాంకేతిక అధికారులను నియమించి, పర్యవేక్షణ, నాణ్యతా ప్రమాణాల పాటింపు, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి. అంటే ఇందుకు తగినంతమంది అధికారులను నియమించాలి. అయితే ఇక్కడ నిక్కచ్ఛిగా పనిచేసే అధికారులు అవసరం లేదనుకున్నారు. అంతే అయినవారికి పనులు అప్పగించేశారు. కుప్పం ఉప కాలువ పనులను 2015లో చేపట్టిన అప్పటి టీడీపీ ప్రభుత్వం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట సంస్థలోకి సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కాంట్రాక్టు సంస్థకు భాగస్వామ్యం కల్పించడంతో పనుల వ్యవహారం అస్తవ్యస్తంగా మారడమే కాకుండా రూ.122 కోట్లను అదనం పేరుతో దోపిడీ చేశారు. ఈ పరిస్థితుల్లో లైనింగ్ పనుల కాంట్రాక్టు రిత్విక్ సంస్థకు దక్కడంతో దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనుల పర్యవేక్షణ కేవలం ఒక డీఈకే అప్పగించడం, వాటి వివరాల నమోదు, నాణ్యత పరిశీలన తదితర అంశాల్లో పారదర్శకంగా సాగడం లేదన్న వాదన వినిపిస్తోంది.పది మంది జేఈలు కుప్పం లైనింగ్ పనులకు ఒకే డీఈ, ఒకే ఈఈకి అప్పగించడం, కేవలం నలుగురు జేఈలే ఉన్నారన్న అంశంపై ప్రాజెక్టు ఎస్ఈ విఠల్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. పది మంది జేఈలు పని చేస్తున్నారని చెప్పారు. పనులను పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. -
వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు
చిత్తూరు కలెక్టరేట్ : తల్లికి వందనం పథకం.. తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి జాబితాలో పథకం వర్తించని పిల్లలు రెండో జాబితాకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో గ్రీవెన్స్ స్వీకరిస్తుండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఎవరు ఏ సమస్యతో అనర్హత జాబితాలో ఉన్నారో పేర్ల వారీగా వివరణ ఉన్న జాబితాలను ఇప్పటికే సచివాలయాల్లో ప్రదర్శించడంతో వాటి ఆధారంగా తగు పత్రాలను జతచేసి గ్రీవెన్స్కు దరఖాస్తులు ఇస్తున్నారు. ఈ క్రమంలో జత చేయాల్సిన పత్రాల కోసం రెండు జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తల్లులు చక్కర్లు కొడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఏటా పకడ్బందీగా అమలు చేశారు. తల్లులకు ఎలాంటి సమస్యలు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసి, నేరుగా ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక వేళ పొందలేని వారికి తిరిగి మరోసారి అవకాశం కల్పించి, ఏటా డిసెంబర్లో అమ్మఒడి పథకం అందజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేసిన మొదటి సారే గందరగోళ పరిస్థితి తలెత్తేలా అర్హులకు నష్టం కలిగేలా పథకాన్ని అమలు చేసింది. రెండు జిల్లాల్లో 12,589 అర్జీలు చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని సచివాలయాల పరిధిలో 1,327 సచివాలయాల పరిధిలో 12,589 అర్జీలు పోటెత్తాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోని 612 సచివాలయాల పరిధిలో 5,897 వరకు అర్జీలు వచ్చాయి. అర్జీల్లో ఎక్కువశాతం విద్యుత్ బిల్లుకు సంబంధించినవే. పథకం వర్తించని వారు విద్యుత్ కార్యాలయాల వద్దకు వెళ్లి ఏడాది విద్యుత్ వినియోగ బిల్లులు తీసుకుని అర్జీలతో జత చేయడం విశేషం. తమ పేరుపై అనేక విద్యుత్ మీటర్లు సీడింగ్ అయి ఉన్నాయని వాటిని తొలగించాలనే అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లా ట్రాన్స్కో పరిధిలో సీడింగ్ సమస్య అర్జీలు 1,789 వరకు ఉండగా, తిరుపతి జిల్లాలో 1,815 వరకు ఉన్నాయి. తమ కారు విక్రయించినా పథకం అమలు కాలేదని అనేక అర్జీల్లో తల్లులు ప్రస్తావించారు. ఆదాయ పన్ను దరఖాస్తులదీ ఇదే తీరు. వివాహం తర్వాత తాము కుటుంబం నుంచి విడిపోయి విడిగా ఉంటున్నా ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆదాయం చూపించి తీసేశారంటూ అర్జీల్లో అనేక మంది పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అనేక మంది అర్జీలు దాఖలు చేశారు. సర్టిఫికెట్లకు ఇబ్బందులు చిత్తూరు జిల్లాలో మొత్తం 1,30,382 మందిని, తిరుపతి జిల్లాలో 2,10,407అర్హులుగా గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు 98748 మంది అనర్హుల జాబితాలో ఉన్నారు. రెండు జిల్లాల్లో అధిక శాతం మందికి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కాలేదు. అనర్హత జాబితాలో ఉన్న వారు సచివాలయాలు, పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. గ్రీవెన్స్ దరఖాస్తుతోపాటు జత చేయాల్సిన సర్టిఫికెట్లను పొందడంలో ఆలస్యం అవుతుండడంతో ఇంకా సగం మందికిపైగా సవరణ/ ఫిర్యాదు దరఖాస్తులు సమర్పించాల్సి ఉందని తెలుస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేలల్లో అనర్హులుంటే కేవలం 12,589 అర్జీలు రావడమే అందుకు ఉదాహ రణ. సచివాలయ సిబ్బందికి తల్లికి వందనం గ్రీవెన్న్స్పై అవగాహన లేకపోవడంతో ఆయా కార్యాలయాల్లో సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. తల్లికి కూటమి పరీక్ష సచివాలయాల వద్ద క్యూ కట్టిన అనర్హులు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీగా అర్జీలు రెండు జిల్లాల్లో 12 వేలకు పైగా దరఖాస్తులు అధికంగా విద్యుత్ బిల్లులు, కారు, ఐటీ కారణాలు వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో పారదర్శకంగా అమ్మఒడి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏ ముహూర్తాన ఈ పథకం అమలు చేసిందో కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లుల్లు సమస్యలతో అల్లాడుతున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా మంది అర్హులకు ఈ పథకంలో కోత విధించారు. గతంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకంలో అనర్హులుగా గుర్తించారు. అలాగే విద్యుత్ బిల్లులు, కారు, ఐటీ వంటివి వర్తించనప్పటికీ చాలా మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సచివాలయాల వద్ద అనర్హుల జాబితాలో ఉన్న తల్లులు అర్జీలను చేతపట్టుకుని క్యూ కట్టారు. ఈ పరిస్థితి చూస్తుంటే కూటమి ప్రభుత్వం తల్లులకు పరీక్ష పెట్టినట్టుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తల్లికి వందనం పథకంలో అనర్హులైన తల్లుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కథనం. ‘తల్లికి వందనం’ పథకం తమకు వర్తింపజేయాలంటూ చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా వేల సంఖ్యలో అర్జీలు పోటెత్తుతున్నాయి. తమకు అర్హత ఉన్నా పలు కారణాలతో జాబితాలో పేర్లు లేకుండా చేశారంటూ వేలాది మంది తల్లులు సచివాలయాలకు క్యూకడుతున్నారు. ఎప్పుడో కారు విక్రయించినా కారు ఉందనే సాకుతో పథకం నుంచి తొలగించారని కొందరు.. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు అధికంగా చూపడంతో డబ్బులు పడలేదని మరికొందరు.. మూడేళ్ల కింద ఆదాయపు పన్ను చూపించి డబ్బులివ్వలేదని ఇంకొందరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు, రేషన్కార్డు సమస్యలున్న కుటుంబాలు ఇలా రకరకాల కారణాలతో తమను పథకానికి దూరం చేశారంటూ వాపోతున్నారు. అర్హులుగా నిర్ధారించి డబ్బులివ్వాలంటూ దరఖాస్తులు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 12,589 మంది తల్లులు అర్జీలు దాఖలు చేశారు. వీరిలో అర్హులుంటే వచ్చేనెల 5వ తేదీన తిరిగి ప్రభుత్వం డబ్బులు జమచేయనుంది. ఈ నేపథ్యంలో అధికారులు మళ్లీ ఈ అర్జీలను పునఃపరిశీలిస్తున్నారు. ఈ పథకంలో సమస్యలు ఎదుర్కొంటున్న తల్లులకు క్షేత్రస్థాయిలో సరైన అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైనట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. పరిశీలనలో అలసత్వం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది. అయితే ఆయా శాఖల అధికారులు పరిశీలనలో అలసత్వం చూపిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కారు సంబంధిత అర్జీ సమస్యను ఆయా జిల్లా రవాణా శాఖకు నేరుగా సచివాలయాలు పంపి ఆరా తీస్తున్నాయి. అయితే ఆ అర్జీల పరిష్కారంలో ముందడుగు పడడం లేదు. ఆదాయ పన్ను అర్జీలను తహసీల్దార్లకు లాగిన్లో పంపుతున్నారు. ఆ అర్జీలను తహసీల్దార్లు అస్సలు పట్టించుకోవడం లేదు. కొంత మంది తహసీల్దార్లు పరిష్కరించి ఆర్డీఓ లాగిన్లకు పంపుతున్నారు. పనిఒత్తిడిలో ఉన్న ఆర్డీఓలు వాటిని పట్టించుకోని దుస్థితి ఉంది. విద్యుత్ బిల్లులకు సంబంధించిన అర్జీలను ఆ శాఖ అధికారులు తిరస్కరిస్తున్నారు. వీరికి పథకం వర్తించదని నిర్ధారించి, సచివాలయాల దశలోనే రెండోసారి అనర్హత కేటగిరీలో చేర్చుతున్నారు. ఈ నెలాఖరులోగా అర్హుల జాబితా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే రెండు జిల్లాల్లో ఈ పథకంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించని దుస్థితి నెలకుంది. -
సెలవు విషయంలో నిమిషానికో నిర్ణయం
టీడీపీలో కుమ్ములాట శ్రీకావేరిరాజపురంలో టీడీపీ గ్రామస్థాయి కమిటీ నియామకంలో ఆ పార్టీలోని ఇరువర్గాలు కుమ్ములాడుకున్నాయి.● గందరగోళం సృష్టించిన డీసీఈబీ ● బడులు వదిలేశాక పాఠశాలలున్నట్లు మెసేజ్లు ● నేడు పాఠశాలలు పనిచేస్తాయి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఉ మ్మడి పరీక్షల విభాగం (డీసీ ఈబీ) శాఖ పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జి ల్లాలోని పాఠశాలలకు ఈ నె ల 27వ తేదీన సెలవు ప్రకటించే విషయంలో డీసీఈబీ అధికారులు గందరగోళం సృష్టించారు. ఆ శాఖ సెక్రటరీ బుధవారం డీసీఈబీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అకడమిక్ క్యాలెండర్లో ఇవ్వాల్సిన ఐదు ఆప్షనల్ సెలవులతో నిర్ణ యం తీసుకున్నారు. తొలి ఆప్షనల్ సెలవుగా ఈ నె ల 27వ తేదీన జిల్లా మొత్తానికి సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరోసారి ఆప్షనల్ సెల వు అనేది జిల్లా మొత్తానికి వర్తించదని, స్కూల్ యూనిట్కు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించారు. జిల్లాలోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కచ్చితంగా ఆప్షనల్ సెలవును లీప్ యాప్లో నమోదు చే యాలని చెప్పారు. లేని పక్షంలో ఆబ్సెంట్గా పరిగణిస్తామని తెలిపారు. ఈ ఆదేశాలు పాఠశాలలు ముగిసిన తర్వాత పంపారు. ఆర్జేడీ మరో మెసేజ్ ఈ ఆప్షనల్ సెలవు విషయంలో వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్ మరో మెసేజ్ పంపారు. ఆ ప్షనల్ సెలవు అనేది కేవలం ఉద్యోగి వ్యక్తిగతమని, ఇది పాఠశాల మొత్తానికి సంబంధించింది కాద ని పేర్కొన్నారు. ప్రత్యేకించి పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో పాఠశాలలకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు ప్రకటించకూడదన్నారు. ఈ ఆదేశా లు కమిషనర్ ఉత్తర్వుల మేరకు తెలియజేస్తున్న ట్లు పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఆదేశాలు జా రీ చేస్తూ గందరగోళం సృష్టించారు. ఆప్షనల్ సెలవులను అమలు చేసే విషయం విద్యాశాఖ అధికారులకు ముందస్తుగా తెలియదా? అని పలువురు టీచ ర్లు ప్రశ్నిస్తున్నారు. నిమిషానికి ఒక ఆదేశం ఇచ్చి గందరగోళం ఎందుకు సృష్టించాలని మండిపడుతు న్నారు. డీసీఈబీ సెక్రటరీ సొంత నిర్ణయం తీసుకోవడం సరికాదని టీచర్లు మండిపడుతున్నారు. చివ రికి ఈ నెల 27వ తేదీన జిల్లాలో స్కూళ్లు పనిచేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. – 8లో -
మామిడి సబ్సిడీపై అవగాహన కల్పించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు ప్రభుత్వం అందజేసే రూ.4 సబ్సిడీపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇస్తున్న రూ.4 సబ్సిడీని రైతులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో గతంలో పండే దాదాపు 70 వేల మెట్రిక్ టన్నుల మామిడిని వ్యాపారవేత్తలు నేరుగా మామిడి తోటలకే వెళ్లి కొనుగోలు చేసే వారన్నారు. ప్రస్తుతం ర్యాంప్ల వద్ద కొనుగోలు తగ్గిందని చెప్పారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో మామిడి గుజ్జు పరిశ్రమలు లేవని, ఈ కారణంగా జిల్లాలోని ఇతర మామిడి గుజ్జు పరిశ్రమల వద్దకు రైతులు పోటెత్తుతున్నారన్నారు. మామిడి కాయల దిగుబడి పెరిగి డిమాండ్ తగ్గడంతో మార్కెట్లో మామిడి కాయల ధర తగ్గిందన్నారు. ప్రస్తుత పరిస్థితి కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో మార్కెట్ ధరకు అనుగుణంగా రూ.4 సబ్సిడీని రైతుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేయడం జరుగుతోందన్నారు. మండలాల్లో ఉన్న ర్యాంప్లను మండల వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ అసిస్టెంట్లు తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తున్న సిబ్బంది ర్యాంప్ల వద్ద రైతులు నిర్వహిస్తున్న అమ్మకాలను నిర్దేశించిన ప్రోఫార్మాలలో నమోదు చేసి, కలెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు. ఈ క్రాప్తో సంబంధం లేకుండా సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.4 సబ్సిడీని సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతు స్వయంగా మామిడి తోట నుంచి నేరుగా తమ పంటను వేరే రాష్ట్రాలకు సరఫరా చేసినప్పటికీ ఆ వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమాచారాన్ని విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు రైతులకు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. -
పీజీ సెట్లో 88.60 శాతం ఉత్తీర్ణత
తిరుపతి సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా 17 వర్సిటీల్లోని 143 పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 9 నుంచి నాలుగు రోజులు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ పీజీ సెట్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఎస్వీయూలో వీసీ, పీజీ సెట్ చైర్మన్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు సబ్జెక్టుల వారీగా ఫలితాలు వెల్లడించారు. వారు మాట్లాడుతూ పరీక్షలకు 21,995 మంది హాజరుకాగా 19,488 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. 88.60 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఎస్వీయూ రీజియన్లో 5,764 మంది పరీక్ష రాయగా 5,019 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,422 మంది పరీక్షలకు హాజరుకాగా 1,279 మంది అర్హత సాధించినట్టు వెల్లడించారు. జాగ్రఫీ, జనరల్ టెస్ట్లో చిత్తూరు జిల్లాకు చెందిన దివ్వేష్రెడ్డి, ఎం.ప్రేమ్కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టు వివరించారు. సీట్లు 25 వేలు, ఉత్తీర్ణులైన అభ్యర్థులు 19 వేలు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలో 25 వేలకు పైగా పీజీ సీట్లు ఉన్నాయి. ఏపీ పీజీ సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు 19,488 మంది. ఒక సీటుకు ఒక అభ్యర్థి కూడా పోటీ లేకపోవడం విశేషం. తద్వారా 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీల్లో పీజీ అడ్మిషన్లు భారీ స్థాయిలో పడిపోనున్నాయి. దీంతో వర్సిటీల భవితవ్యం ప్రశ్నార్థకమేనంటూ మేధావు లు, విద్యానిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు విడుదల ఎస్వీయూ రీజియన్లో 87.07 శాతం ఉత్తీర్ణత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 89.94 శాతం మంది జాగ్రఫీ, జనరల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ పీజీ సెట్–2025 ఫలితాల వివరాలు కోర్సులు సెట్కు హాజరైన ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారు కెమికల్ సైన్స్ 5,396 4,719 లైఫ్ సైన్స్ 3,641 3,408 కంప్యూటర్ కోర్సులకు 1,858 1,547 కామర్స్ 1,203 1,009 ఇంగ్లీష్ 721 702 హ్యుమానిటీస్ 736 726 జువాలజీ 1,347 1,177 గణితం 983 821 ఫిజిక్స్ 808 652 బోటనీ 1,146 1,041 ఇతరాలు 4,156 3,686 మొత్తం 21,995 19,488 -
పరిశీలనలో ఇలా..
కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణుల, బాలింతలకు పంపిణీ చేసిన నాసిరకం, పురుగు పట్టిన కందిపప్పు సరఫరాపై ఈనెల 25న సాక్షి జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ నాసిరకం కందిపప్పు సరఫరా అయినట్లు తేలింది. ● గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని 389 అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం కందిపప్పు సరఫరా చేశారు. ఆ నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం ఆముదాల, సింహరాజపురం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించగా పుచ్చిపోయిన పురుగు పట్టిన కందిపప్పు దర్శనమిచ్చింది. మరికొన్ని చోట్ల తుది గడువు ముగిసిన కందిపప్పు ప్యాకెట్లను పంపిణీ చేశారు. ● పుంగనూరు నియోజకవర్గంలో 380 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం అంగన్వాడీ కేంద్రం–3 ను పరిశీలించగా కందిపప్పు నాసిరకంగా ఉంది. అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 15,431 మంది చిన్నారులకు, 4259 మంది గర్భిణులు, బాలింతలకు మొత్తం పురుగు పట్టిన, నాసిరకం కందిపప్పును సరఫరా చేసేశారు. ● పలమనేరు నియోజకవర్గంలో 408 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో బుధవారం సాక్షి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించింది. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నీలకుంట అంగన్వాడీని పరిశీలించగా పురుగు పట్టిన కందిపప్పు కనిపించింది. -
రైతులకు సేవ చేద్దాం
చిత్తూరు రూరల్(కాణిపాకం) : జిల్లాలో మామిడి రైతులు గిట్టుబాటుధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, క్లబ్ సేవల్లో ఇకపై రైతులకు సేవ చేసేలా చూద్దామని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ చంద్ర హెచ్ రెడ్డి, మాజీ గవర్నర్ భానుమూర్తి రెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా శ్రీధర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా శ్రీనివాసమూర్తి, కోశాధికారిగా ప్రసాద్రెడ్డి ఎన్నియ్యారు. గవర్నర్లు మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా శ్రీధరర్రెడ్డి అధ్యక్షుడిగా ఎంపికయ్యారన్నారు. లయన్స్గోల్డ్ సేవలను విస్తృతం చేస్తూ..ముందుకు వెళ్లాలన్నారు. ప్రధానంగా జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. బెంగుళూరులో కేజీ మామిడి కాయ రూ.200 వరకు పలుకుతుంటే..ఇక్కడ రూ.4 రూ.5 అంటున్నారు. ఇలాంటి తరుణంలో క్లబ్ తరపున రైతులకు మేలు చేసేలా చూద్దామన్నారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు టీకాలు అందుబాటులోకి వచ్చాయని , 25 మంది ఆడపిల్లలకు తొలి వ్యాక్సిన్ ఖర్చులను తాను భరిస్తానని మాజీ గవర్నర్ వెల్లడించారు. అనంతరం కుట్టుమిషన్లు, గొడుగులు పంపిణీ చేశారు. మాజీ గవర్నర్ విజయభాస్కర్రెడ్డి, రీజన్ చైర్పర్సన్ లయన్ ఏవీ భాస్కర్, జోన్ చైర్పర్సన్ రవి, సభ్యులు సుభాష్ జైన్, మనోహర్, జమీర్ అహ్మద్, నరేష్, మోహన్రెడ్డి, విజయకుమార్రెడ్డి, పూల సుబ్రమణ్యం, చంద్రశేఖర్రెడ్డి, రమణ, మల్లి, ఎర్రయ్య పాల్గొన్నారు. -
చివరి కాయ వరకు మామిడిని కొంటాం
గంగాధరనెల్లూరు : మామిడి రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని గంగాధర నెల్లూరులోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బుధవారం రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. తోతాపురి మామిడి చిట్టచివరి దాకా ఆగస్టు నెల చివరి కాయ వరకు ఎంత పంట వస్తుందో అంతటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మామిడి కాయల కొనుగోలు ధరలపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. మార్కెట్లో డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల సమస్యలు ఉన్నాయన్నారు. టోకెన్ పద్ధతి విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక పది రోజులు ఇలా ఉండొచ్చు తర్వాత అన్ని సమస్యలను తగ్గిపోతాయని కలెక్టర్ చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, తహసీల్దార్ శ్రీనివాసులు , సీఐ శ్రీనివాసంతి, జైన్ ఫ్యాక్టరీ మేనేజర్ దిలీప్ పాల్గొన్నారు. -
ఆరుగురు
విద్యార్థులు గురువులునగరి : ఉపాధ్యాయుల బదిలీల్లో తమిళ మాధ్యమ ఉపాధ్యాయులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల బదిలీ ప్రక్రియలో విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా ఉపాధ్యాయులు ఉండాలన్న అంశాన్ని పూర్తిగా విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం శ్రీ రంగంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు తమిళ మాధ్యమ విద్యార్థులు ఉండగా వారికి ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించడం ఆరోపణల్లో వాస్తవికతను చాటి చెబుతోంది. తమిళనాడు సరిహద్దును ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లాలో తమిళ మాధ్యమం కలిగిన 16 ఉన్నత పాఠశాలలు, 40 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సుమారు 200 మంది తమిళం బోధించే ఉపాధ్యాయులున్నారు. వీరికి ఇటీవల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. వెబ్ కౌన్సెలింగ్ మేరకు బలవంతపు బదిలీలు నిర్వహించిన అధికారులు ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీ చేస్తున్నామా? లేదా? అనే అంశాన్ని విస్మరించారు. దీంతో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. నగరి మున్సిపాలిటీలో 252 మంది తమిళ మాధ్యమ విద్యార్థులున్న ఏకాంబరకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 6 గురు ఉపాధ్యాయులను, 230 మంది తమిళ మాధ్యమం విద్యార్థులున్న సత్రవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 6 గురు ఉపాధ్యాయులనే కేటాయించారు. గుడిపాల మండలం శ్రీరంగంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 గురు విద్యార్థులకే ఆరుగురు ఉపాధ్యాయులను కేటాయించారు. అలాగే బొమ్మసముద్రం పాఠశాలలో 8 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లను కేటాయించారు. దీంతో తమిళ ఉపాధ్యాయులు ఇదేమి వెబ్ కౌన్సెలింగ్ అంటూ విస్తుపోతున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ బదిలీలేంటని అవాక్కవుతున్నారు. అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతున్నారు. తమిళ మాధ్యమ టీచర్లపై వివక్ష వెబ్ కౌన్సెలింగ్ పేరిట బలవంతపు బదిలీలు 252 మంది ఉన్న పాఠశాలకు ఆరుగురే టీచర్లు -
అంగన్వాడీల తనిఖీ
నగరి : నిండ్ర మండలం అత్తూరు అంగన్వాడీ సెంటర్లో గర్భిణులకు పురుగు పట్టిన కందిపప్పు ఇవ్వడాన్ని వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘జల్లించి.. ఎండలో వేసి..వండి పెట్టేయండి’ అంటూ వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం సీడీపీఓ ఇందిరా ప్రియదర్శిని అత్తూరు అంగన్వాడీ సెంటర్కు వెళ్లి విచారణ చేపట్టారు. పిండి అయిన కందిపప్పు స్థానంలో మంచి కందిపప్పు ప్యాకెట్లను గర్భిణులు, బాలింతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 202 అంగన్ వాడీ కేంద్రాలకు సివిల్ సప్లై గోడౌన్ నుంచి చౌక దుకాణాల ద్వారా 2476 కేజీల కందిపప్పు సరఫరా అవుతుందని ఇందులో చాలా వరకు పాడైపోయినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవ్వరికీ సరఫరా చెయ్యకండని అంగన్వాడీ సెంటర్లకు కూడా ఆదేశించడం జరిగిందన్నారు. అత్తూరు సెంటర్లో మాత్రమే సమాచారం అందకా సరఫరా జరిగిందని దానిని కూడా సరిదిద్దడం జరిగిందన్నారు. సివిల్ సప్లై గోడౌన్ డీటీతో మాట్లాడి 821 కేజీల పాడైన కందిపప్పు వాపసు ఇవ్వడం జరిగిందని ఆ స్థానంలో మంచి కందిపప్పు అందించామన్నారు. ఆమె వెంట ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.వెంకటేశులు, ఉపాధ్యాయులు లోకేశ్వరి, ప్రమీల, డీలర్ చంద్రకళ పాల్గొన్నారు. -
క్వారీ పేలుళ్లల్లో ఒకరి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు కుప్పం రూరల్ : కుప్పం పట్టణానికి సమీపంలోని క్వా రీలో జరిగిన పేలుళ్లల్లో ఒకరి మృతి చెందగా మరొక రు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం చో టు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇ లా.. కుప్పం పట్టణానికి సమీపంలోని బీసీఎన్ కన్వెన్ష న్ హాల్ వెనుక వైపు కొంత మంది క్వారీ చేపడుతున్నా రు. ఈ క్రమంలో బుధవారం బండలను చీల్చేందుకు చేపట్టిన పేలుళ్లల్లో గుడుపల్లె మండలం, పాపానూరు గ్రామానికి చెందిన రాజు (20), మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు క్వారీ యాజమాన్యం ప్ర యత్నించింది. మార్గమధ్యలోనే రాజు మృతి చెందిన ట్లు స్థానికులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ క్వారీపై మున్సిపాలి టీ పరిధిలోని 7వ వార్డు ప్రజలు అధికారులకు ఫిర్యా దు సైతం చేశారు. జనవాసాల మధ్య క్వారీ నిర్వహించడంపై తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని పేలుళ్ల తో వెలువడే శబ్దాలతో చెవులు పోతున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
కూటమి నేతల దౌర్జన్యం
● ఏకపక్షంగా వ్యవహరించిన తహసీల్దార్ యాదమరి: కట్టకిందవూరులో తమ పొలాలకు వెళ్లే కాలువ మార్గాన్ని దౌర్జన్యంగా కొందరు కూటమి నేతలు ఆక్రమించుకుని జేసీబీతో దారి ఏర్పాటు చేశారని వైఎస్సార్సీపీ నాయకులు సుధాకర్ రెడ్డి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ, 50 ఏళ్లుగా తాము ఈ కాలువ గుండా తమ పొలాలకు వెళ్లేవారమని, ఇప్పుడు కూటమి నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించి, జేసీబీతో వచ్చి, మట్టితో దారి ఏర్పాటు చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ పార్థసారథి సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే చివరికి కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరించారు. పది మందికి ఉపయోగపడే చెరువు కాలువ విషయంలో తహసీల్దార్ కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. -
డ్రోన్లతో నిఘా పెంచండి
–ఎస్పీ మణికంఠ చందోలు చిత్తూరు అర్బన్: అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా జిల్లాలో డ్రోన్లతో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో బుధవారం పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ప్రజలతో సామరస్యంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా డ్రోన్ల సాయంతో నిఘా పెంచాలన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేర పరిశోధన చేయాలన్నారు. శాంతిభద్రతల పరిక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే సైబర్మిత్రను సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు తదితరులు పాల్గొన్నారు. పెళ్లి పేరుతో మోసం చిత్తూరు అర్బన్ : తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై ఓ యువతి మంగళవారం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా ఎస్ఐ నాగసౌజన్య వివరాల మేరకు.. రామ్నగర్ కాలనీకి చెందిన జాహిద్, గిరింపేటకు చెందిన రేష్మ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇరువురి కుటుంబాలకు తెలిపి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలో రేష్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో జావిద్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనను మోసం చేసిన జావిద్పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు రేష్మ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
పుంగనూరు(చౌడేపల్లె) : కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం మండలంలోని సింగిరిగుంటలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సురేష్ భార్య వెంకటమ్మ (39) కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతుండేది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో ఇంట్లో పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకులకు తీవ్రగాయాలు పాలసముద్రం : మండలంలోని తొట్టికండ్రిగ గ్రామం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. తొట్టికండ్రిగ గ్రామంలో గంగజాతర పురస్కరించుకుని పరిసరాలు శుభ్రం చేసి, జేసీబీని రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువకులు ద్విచక్ర వాహనంలో వస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన జేసీబీని ఢీకొన్నారు. దీంతో ఇద్దరి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో సోళింగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. ప్రెస్, పోలీసు స్టిక్కర్లు అనధికారికంగా వేసుకుంటే చర్యలు పలమనేరు : జిల్లాలో కొందరు జర్నలిస్టులు కాకున్నా వారి వాహనాలపై ప్రెస్ అని, పోలీసులు కాకున్నా పోలీస్ అని, సైనికులు, పలు డిపార్ట్మెంట్ల పేర్లతో పేర్లు రాసుకొని తిరుగుతున్నారని వీరిపై చర్యలు తప్పవని ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు కాకున్నా యూట్యూబ్ విలేకరులమంటూ కొందరు, తాము పోలీసుల బంధువులమంటూ మరికొందరు, వివిధ శాఖలకు సంబంధించి వాహనాలు, ద్విచక్ర వాహనాలపై రాసుకున్న వారిపై తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సంబంధం లేకుండా బైక్లపై ప్రెస్ స్టిక్టర్ వేసుకున్న వారిపై చర్యలు తప్పవన్నారు. కేవలం జిల్లా కలెక్టర్ ద్వారా అక్రిడేషన్ కలిగి ఉన్న విలేకరులు మాత్రమే బైక్లపై ప్రెస్ అని వేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన స్టిక్కర్లను తమ శాఖ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. మట్టి గణపతిని పూజించాలి కాణిపాకం : వినాయక చవితి దృష్ట్యా భక్తులు మట్టి గణపతిని పూజించి.. ప్రకృతికి హాని కలగకుండా చూడాలని ఈఓ పెంచల కిషోర్ అన్నారు. కుమారస్వామి అనే భక్తుడు రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మట్టి గణపతుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తొలుత ఆ మట్టి గణపతి పంపిణీని బుధవారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో ప్రారంభించారు. ఈఓ ఈ పంపిణీని ప్రారంభిస్తూ..మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. -
మా ఎమ్మెల్యేకి రూ.50 లక్షలు ఇచ్చి పిచ్చోడినవుతున్నా!
సాక్షి టాస్క్ ఫోర్స్: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల దందాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే థామస్ అనుచరుడితో ఓ క్వారీ వ్యాపారి మాట్లాడిన ఆడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్వేటినగరం మండలంలోని సురేంద్రనగరం పంచాయతీ పరిధిలో.. తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరెడ్డి క్వారీ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే థామస్, ఆయన ప్రధాన అనుచరులు క్వారీ నిర్వాహణకు కప్పం కట్టాలని హుకుం జారీ చేశారు. ఇందుకు వేంకటేశ్వరరెడ్డి అంగీకరించక పోవడంతో రాళ్లు తరలిస్తున్న లారీలను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడు ఎమ్మెల్యేను సంప్రదించగా.. తన అనుచరుడు హరీష్ యాదవ్తో మాట్లాడాలని చెప్పినట్లు సమాచారం. దీంతో హరీష్ యాదవ్ను కలసి మాట్లాడి రూ.50 లక్షలు ఇచ్చారు. అయినా పనులు పాగనీయలేదు. ఇలా అడ్డుకోవడం బాగోలేదని వారిద్దరి మధ్య చర్చ నడిచింది. ఇందుకు సంబంధించిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే వెంకటేశ్వరరెడ్డి ఎవరో.. ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చారో తెలియదని హరీష్ యాదవ్ చెబుతున్నారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. వెంకటేశ్వరరెడ్డి: సార్ మిమ్మల్ని నమ్మి మీ చేతికి రూ.50 లక్షలు ఇచ్చాను. నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తక పోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. హరీష్ యాదవ్: మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. నేను అన్నీ తెలుసుకుని మీకు కాల్ చేస్తా. వెంకటేశ్వరరెడ్డి: అది కాదు సార్.. ఎమ్మెల్యే వద్ద నుంచే ప్రాబ్లం..రూ.50 లక్షలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నా. అనారోగ్యంతో బాధ పడుతున్నాను. హరీష్యాదవ్: నేను చెప్తాను అన్నా.. మాట్లాడతాను. వెంకటేశ్వరరెడ్డి: కొద్దిగా మాట్లాడు హరీష్. ఎందుకంటే రూ.50 లక్షలు ఇచ్చి పిచ్చోడిని అయిపోతాను హరీష్. ఎందుకంటే నీవు ఎదో పొలిటికల్ నుంచి వచ్చావని నమ్మకంతో ఇచ్చాను. హరీష్ యాదవ్: మెటీరియల్ చేరాల్సిన చోటుకు చేరింది. వెంకటేశ్వరరెడ్డి : నేను ఎవరితో మాట్లాడేది చెప్పు. నాకు నీవే.. ఎమ్మెల్యే కూడా హరీష్తో మాట్లాడు అని చెప్పారు కదా. హరీష్ యాదవ్: నేను మాట్లాడుతాను.. ఓకే నేను సార్తో మాట్లాడుతాను. చిన్న డిస్టబెన్స్తో ఉన్నాడు. నిన్ను కూడా మాట్లాడిస్తాను. డబ్బులు విషయమైతే కాదు. రెండు మూడు చోట్ల సమస్యలు. నిన్న వచి్చనా మాట్లాడలేకపోయాను. డబ్బులు విషయమైతే కాదు.. చాలా బిజీగా ఉంటున్నారు. వెంకటేశ్వరరెడ్డి: కొంచం మాట్లాడండి సార్.. ఇక్కడ మీరే నాకు.. ప్లీజ్.. హరీష్యాదవ్: నేను ముందున్నాను కాబట్టి ఎమ్మెల్యేకి క్లారిటీగా చెప్పాలి వెంకటేశ్వరరెడ్డి: మీరు ముందున్నారనేగా మీ వద్దకు అనేకసార్లు తిరుగుతున్నా సార్ హరీష్యాదవ్: శనివారం, ఆదివారంలో కలసి మాట్లాడతాను.. మీకు క్లారటీ ఇస్తాను వెంకటేశ్వరరెడ్డి.. నేను మీకు చేస్తాను సార్, మీకు ఎమీ కాదు. వెంకటేశ్వరరెడ్డి: నాకు ఇబ్బంది లేకుండా చూడండి. నేను దీనిపై ఆధారపడి ఉన్నాను ప్లీజ్ సార్. ఎమ్మెల్యే థామస్ అనుచరుడు హరీష్ -
పాత కక్షలతో 108 ఉద్యోగిపై దాడి
వి.కోట : పాత కక్షల తో ఓ వ్యక్తిపై పలు వురు దాడి చేసిన ఘటన మండలంలోని చింతమాకులపల్లె పంచాయతీ కాంచిమట్లపల్లెలో మంగళవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజు(35) 108లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు లక్ష్మీపతి, గణేష్, గంగులప్ప, కుమార్, సుధాకర్ , వి,కోటకు చెందిన అశోక్ కలసి మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న నాగరాజుపై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో నాగరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబీకులు హుటాహుటిన 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాలుగేళ్ల క్రితం వారితో నాగరాజు గొడవ పడిన నేపథ్యంలోనే ప్రస్తుతం దాడి చేశారని కుటుంబీకులు ఆరోపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.శ్రీవారి దర్శనానికి 18 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 84,179 మంది స్వామివారిని దర్శించుకోగా 33,036 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.72 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని, కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. -
విద్యను వ్యాపారంగా మార్చేశారు!
– కేశవరెడ్డి పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని కేశవరెడ్డి పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీని విద్యాశాఖ అధికారులు అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరులోని మురుగానపల్లిలో ఉన్న కేశవరెడ్డి పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఆ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రిని పాఠశాల ఎదుట పెట్టి ధర్నా నిర్వహించారు. బండి చలపతి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యూనిఫాం, పుస్తకాలను అమ్ముకుంటున్న కేశవరెడ్డి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులతో పాటు విద్యాసామగ్రిని దోచుకుంటున్నారన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చేసిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా, నాయకులు యోగేష్, నిరంజన్ పాల్గొన్నారు. -
అంతా మా ఇష్టం.. ధరలు చెప్పం!
బారులు తీరిన ట్రాక్టర్లు గుడిపాల సరిహద్దులోని ఓ ఫ్యాక్టరీ నుంచి తమిళనాడులోని కాట్పాడి కింగ్స్టన్ కాలేజీ వరకు మామిడి కాయల ట్రాక్టర్లు క్యూకట్టాయి. గత మూడు రోజులుగా ఈ సమస్య తీవ్రతరమవుతోంది. అన్లోడింగ్కు రైతులు రోడ్డుపైనే కాపు కాస్తున్నారు. తిండీలేక తిప్పలు పడుతున్నారు. గుడిపాలలోని కొత్తపల్లి వద్ద ఇదే పరిస్థితి ఎదరవుతోంది. జీడీనెల్లూరు మండలం ఎట్టేరి వద్ద ఉన్న ఫ్యాక్టరీ వద్ద కూడా మూడు కి.మీ మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ఇక్కడ కాయలు అన్లోడింగ్కు ఐదు రోజులకుపైనే పడుతోంది. దీని దెబ్బకు ఆయా ఫ్యాక్టరీల నిర్వాహకులు కాయలు కొనలేమని చేతులెత్తేశారు. చిత్తూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ సైతం మామిడి కొనుగోలు చేయలేమని బోర్డు పెట్టేస్తున్నాయి. పూతలపట్టు, బంగారుపాళ్యం, తవణంపల్లి, కార్వేటినగరం తదితర ప్రాంతాల్లో కూడా ఈ రకంగా ఫ్యాక్టరీలు రైతులను వేధిస్తున్నాయి. జిల్లాలో పళ్ల గుజ్జు పరిశ్రమదారులు సిండికేట్ అయ్యారు. మామిడి రేటును చెప్పకుండా నాన్చుతున్నారు. ఇన్నాళ్లూ రూ.8 నుంచి రూ.5 వరకు పాటపాడారు. తీరా కూటమి ప్రభుత్వం పరువుపోతోందని నోటిమాటగా అమలవుతున్న మద్దతు ధరకు తాళం వేసేశారు. దీని దెబ్బకు రెండు రోజులుగా మామిడిరేట్లు మూగబోయాయి. రైతులకు ఇస్తున్న బిల్లుల్లో తూకం వివరాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ధర వివరాలను ప్రస్తావించకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. కాణిపాకం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. ఇందులో 31 ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. ఇవీ ఈనెల 6 నుంచి తోతాపురి కొనుగోలును ప్రారంభించాయి. ఫ్యాక్టరీలు తోతాపురి కేజీ రూ.8కి కొనుగోలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున కేజీకి రూ.4 చొప్పన రైతులకు ప్రోత్సాహక నిధి ఇస్తామని పాట పాడింది. ఫ్యాక్టరీలు టోకన్లు జారీచేసి కాయలు కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టాయి. అయితే ఈటోకన్ల జారీ గందర గోళంగా మారడంతో ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. మధ్యలో పోలీసులు, అధికారులు కల్పించుకుని రైతులందరికీ టోకెన్లు ఇప్పించే ప్రయత్నాలు చేశారు. కొనేవారేరీ? టోకన్ల గోల ముదరడంతో అధికారులు కొత్తపల్లవిని అందుకున్నారు. ఇకపై టోకన్లు అవసరం లేదని ప్రకటించారు. కాయలు కోత కోసి ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళితే తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంతో ఫ్యాక్టరీలు కాయలు కొనలేమని బోర్డులు పెట్టేస్తున్నాయి. కాయలు కోసి తెచ్చిన వారిని తిప్పి పంపిచేస్తున్నాయి. లేకుంటే ఐదు రోజుల తర్వాత వరస నంబరు వేసి రైతు ఫలాన్ని మట్టిపాలు చేస్తున్నాయి. సిఫార్సులుంటే అప్పటికప్పుడే దింపుకుంటున్నాయి. మామిడి విపత్తును అదునుగా తీసుకుని ఫ్యాక్టరీలు సిండికేట్ అయ్యాయి. మామిడి రైతులను దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ధర ఎంత? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 వేల మంది రైతుల వరకు సుమారు 1.5 లక్ష టన్నుల మామిడి కాయలు ఫ్యాక్టరీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో తొలుత వచ్చిన రైతులకు ఫ్యాక్టరీ నిర్వాహకులు తోతాపురి కేజీ ధర రూ.8ని రుచిచూపించారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన రైతులకు కేజీ ధర రూ.6ని తీసుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత వచ్చిన రైతులకు రూ.5ని చెప్పి ముఖం చాటేశారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు రైతులకు పెద్ద షాక్ ఇస్తున్నా యి. తోతాపురి ఎంతకు కొనుగోలు చేస్తున్నాయో చెప్పడం లేదు. గుండె గు‘బిల్లు’ ఈనెల 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఏ ఒక్కరైతుకు కూడా బిల్లులో ఫ్యాక్టరీలు ధరల విషయాన్ని ప్రస్తావించ లేదు. కేవలం కాయలు, ట్రాక్టర్ లోడింగ్తో సహా ఎంత బరువు ఉంది.. ఖాళీ ట్రక్కుతో ఎంత బరువు ఉంది.. అని మాత్రమే బిల్లుల్లో ప్రస్తావిస్తున్నారు. ధర విషయాన్ని ఖాళీగా చూపుతున్నారు. ధరలు చెప్పకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.ఫ్యాక్టరీలో మామిడి కాయల క్లీనింగ్ టబ్ ధరల బోర్డు పెట్టాలి కదా..? ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు. మా కడుపు మంట ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. విధిలేని పరిస్థితుల్లో కాయలు దింపుకుంటే చాలనుకుంటున్నాము. దీన్ని అదునుగా చేసుకుని ఫ్యాక్టరీలు ఇప్పుడు ఎంతకు కొంటున్నాయో కూడా చెప్పడం లేదు. బయట మాత్రం కాయలు కొనలేం.. టోకన్లు ఇవ్వలే మని బోర్డులు పెడుతున్నారు. ధరలపై కూడా బోర్డు పెట్టాలి కదా. దీనిపై అధికారులు కూడా నోరు విప్పడం లేదు. –గోవర్దన్, పెనుమూరు మండలం -
మామిడి రైతుకు కూటమి వెన్నుపోటు
ప్రశ్నిస్తే కేసులా? బంగారుపాళెం: ‘కూటమి ప్రభుత్వం మామిడి రైతునూ వదల్లేదు. ఆర్భాటంగా మద్దతు ధర ప్రకటించి చేతులు పైకెత్తేశారు. దిగుబడి వచ్చినా.. మద్దతు ధరలేక.. రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఫ్యాక్టరీల ఎదుట రోజుల తరబడి తిండీతిప్పలు లేక అల్లాడాల్సి వస్తోంది..’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ ధ్వజమెత్తారు. కిలో మామిడికి రూ.12 లెక్కన మద్దతు ధర ప్రకటించి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ మంగళవారం బంగారుపాళెంలోని మామిడి మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. స్థానిక గ్రామీణ బ్యాంక్ వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా మామిడి మార్కెట్ వరకు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ చేపట్టారు. అనంతరం మామిడి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. మామిడి మార్కెట్యార్డు ప్రధాన గేట్ వద్ద బైఠాయించి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మద్దతు ధర అమలులో అంతులేని నిర్లక్ష్యం బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డ్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల ధర్నా ప్రభుత్వం ప్రకటించిన ధరను అమలు చేయాలని డిమాండ్ ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి రకం మామిడికి గిట్టుబాటుధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. తోతాపురి కిలో రూ.12 కు కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద టోకన్ల కోసం పడరాని పాట్లు పడి కాయలు కోసి తరలిస్తే రోజుల తరబడి తిండిలేక అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు. వ్యాపారులు, జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తోతాపురి కిలో రూ.2కు కొనుగోలు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయాందోళనకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల కన్వీనర్లు రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ధనుంజయరెడ్డి, జిల్లా మహిళా కార్యదర్శి గోహతిసుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి ప్రకాష్రెడ్డి, సీనియర్ నాయకుడు థామస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ దత్తాత్రేయరెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కిషోర్కుమార్రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు అరుణామల్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు గజేంద్ర, ఎస్సీ, బీసీ, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజ, మొగిలీశ్వర్, షాకీర్, వాణిజ్య విభాగం మండల అధ్యక్షుడు విజయకుమార్, బూత్ కమిటీ అధ్యక్షుడు భానుప్రకాష్రెడ్డి, సోషియల్మీడియా వింగ్ అధ్యక్షడు శైలేష్, మణిరాజ్, నియోజకవర్గ పరిధిలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
పోటీలు నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని డీఈఓ వరలక్ష్మి ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తల్లి పాత్ర సహకారం అనే అంశంపై పోటీలు నిర్వహించాలన్నారు. ఈ నెల 28 వరకు వ్యాసరచన, వ్యక్తృత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని సూచించారు. భోజనం సకాలంలో అందుతుందా? గుడిపాల: సమస్యలు ఏమైనా పరిష్కారమయ్యాయా..? భోజనం సకాలంలో అందుతుందా..? అంటూ కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఆయన గుడిపాల మండలంలోని ఫుడ్ అండ్ ఇన్స్, తాసా మామిడి గుజ్జు పరిశ్రమలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల వద్దకు వెళ్లి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సకాలంలో అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ముందుగా వచ్చిన రైతులకు ముందుగా టోకెన్లు జారీ చేయాలన్న నిబంధన పాటించాలని మామి డి గుజ్జు పరిశ్రమ వారిని ఆదేశించారు. ప్రభు త్వం ప్రకటించిన రూ.4 మద్దతు ధరను డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, డెప్యూటీ తహసీల్దార్ లక్ష్మి ఉన్నారు. టమాట ధరలకు రెక్కలు పలమనేరు: టమాట ధరలకు రెక్కలొచ్చాయి. పలమనేరు మార్కెట్లో 15కిలోల బాక్సు మంగళవారం రూ.350 దాకా పలికింది. పొరుగునే ఉన్న కర్ణాటకలోని వడ్డిపల్లి మార్కెట్లో రూ.400 దాకా పెరిగింది. వర్షాల కారణంగా సరుకు నాణ్యత తగ్గింది. దీనికితోడు సీజన్ ముగిసిపోతుండడంతో దిగుబడి తగ్గుతోంది. ఫలితంగా టమాట రేట్లు పెరుగుతున్నాయి. జూలై నుంచి ఆశాజనకంగా ధరలు ఇలా ఉండగా జూలై తొలి వారంలో కోతకొ చ్చే తోటలకు ధరలు ఆశాజనంగా ఉంటాయని ఇక్కడి వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా ఉన్న తోటలు ఈనెల ఆఖరుకల్లా వడిగిపోతాయి. ఆపై కొత్త తోటలు కోతకు రావడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆశాజనకంగా ఉంటాయని చెబుతున్నారు. దీంతోపాటు పలు రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంటుందనే మాట వినిపిస్తోంది. -
ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఆంధ్ర యూనివర్సిటీ ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్–2025 ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులో 13 పీజీ సబ్జెక్టుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీపీజీసెట్కు ఎస్వీయూ రీజియన్ నుంచి 3,946 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ప్రవేశ పరీక్షకు 3,434మంది హాజరయ్యారు. వీరిలో 3,208 మంది ఉత్తీర్ణత సాధించారు. జీఈఓ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫోమ్యాటిక్స్ విభాగంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన టి. సుధాకర్రెడ్డి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో తిరుపతికి చెందిన విజయ్వర్మ 5వ ర్యాంకు సాధించాడు. నేడు కరికులంపై ప్రాంతీయ వర్క్షాప్ తిరుపతి ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ డిప్లొమో కరికులంపై తిరుపతిలోని గోల్డెన్ తులీప్ హోటల్లో బుధవారం ప్రాంతీయ వర్క్షాపు నిర్వహించనున్నట్టు స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాఽథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్షాప్కు సాంకేతిక విద్య డైరెక్టర్ జి.గణేష్కుమార్, ఎస్బీటీఈటీ కార్యదర్శి జీవీవీఎస్.మూర్తి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎంఏవీ.రామకృష్ణ, డెప్యూటీ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మీపతి హాజరవుతారని, ఈ వర్క్షాప్లో పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాళ్లు, టీచర్లు పాల్గొని పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులకు అవసరమైన సిలబస్ తయారీపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. -
ఊరిలోని బడి కోసం పోరాటం
పలమనేరు : తమ గ్రామంలోనే బడి ఉండాలని, పక్క ఊరికి మారిస్తే పిల్లలను పంపే ప్రసక్తే లేదని, ఇందుకోసం పోరాటం కొనసాగిస్తామని మండలంలోని కొలమాసనపల్లె పంచాయతీ పాలమాకులపల్లె వాసులు స్పష్టం చేశారు. మంగళవారం ఈమేరకు పలమనేరు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మా గ్రామంలోని బడిలో 30మంది పిల్లలున్నారన్నారు. ఎర్రగొండేపల్లె, కురప్పల్లె, జల్లిక్వారీ, హాచరీ ప్రాంతాలనుంచి ఇక్కడికే విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. అయితే ఈ బడిలోని 3,4,5 తరగతుల పిల్లలను దిగువ కల్లాడు పాఠశాలకు పంపాలంటే ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించారు. ఆ మార్గంలో నిత్యం టిప్పర్లు వేగంగా వెళుతుంటాయని, దీంతో పిల్లలకు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎక్స్ప్రెస్ హైవే పనుల వద్ద బ్లాస్టింగ్లు జరుగుతుంటాయని వాపోయారు. అలాగే రోడ్డు పక్కనే చెరువులా వరదనీరుందని అందులో పిల్లలు పడిపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని మా గ్రామంలోని బడిని మార్చవద్దని కోరారు. దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
మేం చూసుకుంటాం.. నువ్వు నిర్మించుకో!
పలమనేరులో జోరందుకున్న అక్రమ నిర్మాణాలు ● అధికారులు, నేతల అండతో సాఫీగా పనులు ● రాత్రికి రాత్రే వెలుస్తున్న భవనాలు ● నోరుమెదపని మున్సిపల్ అధికారులు పలమనేరు: ‘చూడబ్బా అధికారం మాది. పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాం.. ఇప్పుడు సంపాదించుకోకుండా ఇంకెప్పుడు సంపాదించేది. మాకు పైనుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు.. నీవు అక్రమ నిర్మాణాలు చేస్కో.. అధికారులు అసలు మాట్లాడరు.. వారికిచ్చేది ఇస్తాం.. ఎవరైనా అడిగితే మేం చూసుకుంటాం..’ ఇది పలమనేరు మున్సిపాలిటీలో సాగుతున్న అక్రమ నిర్మాణాల జోరు. ఎక్కడ ఆక్రమణలు జరిగినా మున్సిపల్ అధికారులకు చెప్పి వారి అండతోనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. దీన్ని చూసిన జనం వీళ్లేమి నాయకులు సామీ అని ముక్కున వేలేసుకుంటున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు పట్టణంలోని మదనపల్లి రోడ్డులో చదరపు అడుగు విలువ రూ.4 వేలుగా ఉంది. దీంతో ప్రభుత్వ స్థలాలపై పలువురి కన్ను పడింది. అంబేడ్కర్ విగ్రహానికి కూతవేటు దూరంలోని ప్రభుత్వ స్థలాన్ని గతంలో మాజీ మంత్రిగా ఉన్న అమరనాథ్రెడ్డి బీసీ భవన్ కోసం శంకుస్థాపక చేశారు. ఇప్పుడు కూటమి పాలనలో ఈ స్థలాన్ని ఓ వ్యక్తి ఇటీవలే ఆక్రమించుకొని దాంట్లో రేకుల షెడ్డు వేసుకున్నాడు. ఈ విషయం నేతలకు తెలిసే జరిగింది. అధికారులకు సైతం తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆక్రమణకు గురైన ఈ స్థలం విలువ ఇప్పుడు రూ.50 లక్షలకు పైమాటే. ఏమీ భయపడొద్దు? పట్టణంలోని మదనపల్లి రోడ్డులో సత్య బిల్డింగ్కు ఎదురుగా బసవన్న గుడి వెనుక వైపున్న డ్రైన్పై ఓ వ్యక్తి ఇటీవలే రాత్రికి రాత్రే రేకుల షెడ్డును కట్టేశాడు. దీనివెనుక ఆ ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీ నేత హస్తంతోనే ఈ వ్యవహారం సాగినట్టు తెలుస్తోంది. మున్సిపల్ అధికారుల ద్వారా పర్మిషన్ కోసం ఆలయానికి చెందిన వారి ద్వారా ఆరు నెలల ఖాళీస్థలం లీజు అగ్రిమెంట్ రాయించుకొన్నట్టు తెలిసింది. దీన్ని మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులకు చూపెట్టి ఎన్క్రోచ్మెంట్ ఫీజు చెల్లించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. దీనిపై పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మూడు రోజులు మూతబడిన ఈ అక్రమ దుకాణం తాజాగా తెరుచుకుంది. మున్సిపల్ అధికారులు సైతం అధికారపార్టీ నేతలకు తలొగ్గి దీన్ని పట్టించుకోలేదు. ఓ కీలక నేత తానున్నానంటూ ముందుండి మళ్లీ దీన్ని ప్రారంభించడం గమనార్హం. దండపల్లి రోడ్డులో ఇదేతంతు మున్సిపాలిటీ పరిధిలోని దండపల్లి రోడ్డులో ఓ కూటమి నేత ఇటీవలే తనకు పట్టా ఉందని ఓ రేకుల షెడ్డును నిర్మించాడు. గతంలో నాగమణి అనే తహసీల్దార్ విధుల్లో ఉన్నప్పుడు భాను అనే వ్యక్తి పట్టణంలో పలు నకిలీ ఇంటిపట్టాలను భారీగా డబ్బు వసూలు చేసి విక్రయించేశాడు. ఇలా పట్టాలు పొందిన వాళ్లు గత ఎన్నికల్లో కూటమి పార్టీలో చేరి వారుపొందిన పట్టాల్లో మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మున్సిపల్ టీపీఎస్ ఇందిరను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిని వివరణ కోరగా పట్టణంలో ఆక్రమణ విషయాలు తన దృష్టికి రాలేదని చెప్పారు. -
ఆదేశాలు బేఖాతరు
విద్యా హక్కు చట్టం ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఆనన్లైన్ ద్వారా సీట్లు కేటాయిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయనట్టే. దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. స్కూల్ అనుమతి రద్దు చేయడం జరుగుతుంది. అయితే పేదల సీట్ల విషయంలో అధికారులు ప్రైవేటు/ కార్పొరేటు స్కూళ్లను బతిమలాడుకోవాల్సి వస్తోంది. చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. అయితే రెండు జిల్లాల్లో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. స్కూళ్లు ప్రారంభించిన వెంటనే ఆర్టీఈ (విద్యాహక్కు చట్టం) కింద ఒకటో తరగతి అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన అనంతరం ఆన్లైన్ లాటరీ విధానంలో విద్యార్థులకు పలు పాఠశాలల్లో ప్రవేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రవేశాల పత్రాలను తల్లిదండ్రులు తీసుకెళ్లి పాఠశాలల్లో ఇస్తుంటే అడ్మిషన్లు ఇచ్చేది లేదంటూ తిరిగి పంపించేస్తున్నారు. ఇదేమిటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయరెందుకు అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే....తమకు ఆర్టీఈ అడ్మిషన్ల జాబితానే ఇవ్వలేదంటూ పాఠశాలల నిర్వాహకులు సమాధానమిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 3978 సీట్లు కేటాయిస్తే అందులో 10 శాతం సీట్లను సైతం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశాలు చేసుకోని దుస్థితి నెలకొంది. వివరాలు గోప్యం? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు తప్పనిసరిగా విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలి. ఆర్టీఈ ద్వారా కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపడుతున్నా.. వాటి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతోంది. ఏటా అడ్మిషన్ల సమయంలో హడావుడి చేసే విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఏయే పాఠశాలలో ఎన్ని ప్రవేశాలు కల్పించారనే వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఆర్టీఈ ద్వారా కల్పించిన వివరాలు విద్యాశాఖ బయట పెట్టలేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఒత్తిడితోనే వివరాలు బయటపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.విద్యాశాఖ అధికారులకే స్పష్టత కరువు ఉచితమైనా లాగేస్తున్నారు.. జిల్లాలో మొక్కుబడిగా ఆర్టీఈ అడ్మిషన్లు పర్యవేక్షించే నాథుడే కరువు చిత్తూరు, తిరుపతి జిల్లాలో 3,978 సీట్లు కేటాయింపు ఆమోదించిన సీట్లు 10శాతం లోపే చట్టం ఆదేశాలు పట్టించుకోని యాజమాన్యాలు వైఎస్సార్సీపీ పాలనలో పక్కాగా ఆర్టీఈ అమలు ఆర్టీఈ అడ్మిషన్ల ప్రక్రియపై జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ అధికారులకే స్పష్టత లేని దుస్థితి. ఈ చట్టం ద్వారా ఎంత మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారనే విషయంపై అధికారులు స్పష్టత లేదు. నిత్యం వందల మంది తల్లిదండ్రులు ఆర్టీఈ అడ్మిషన్ల విషయంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన ఉండటం లేదు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు ఆర్టీఈ ప్రవేశాలు పొందినప్పటికీ తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది ఒకటో తరగతిలో జాయిన్ చేసుకున్న చిత్తూరు నగరంలోని ఓ ప్రముఖ కిడ్స్ పాఠశాల.. ఈ ఏడాది మాత్రం ఏకంగా తమ స్కూల్లో ఒకటి, రెండు తరగతులు నిలిపివేశామని సెలవిచ్చింది. దీంతో ఆన్లైనన్లో కేటాయింపు జరిగిన 18 మంది పిల్లల అడ్మిషన్లు అయోమయంలో పడ్డాయి. రెండు జిల్లాల్లో ఇలాంటి సమస్యలు మరెన్నో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీఈ ప్రవేశాలు పకడ్బందీగా అమలు చేయాలి ఆర్టీఈ అడ్మిషన్లు ఖరారు అయినప్పటికీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ఏ మాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమస్యను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం స్పందించడం లేదు. ఫలితంగా నిత్యం తల్లిదండ్రులు విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు తప్ప న్యాయం మాత్రం జరగడం లేదు. చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు ఆర్టీఈ ప్రవేశాలను పకడ్బందీగా అమలు చేయాలి. – ప్రవీణ్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే పదో తరగతి వరకూ ఆ వెసులుబాటు ఉంటుంది. ఇవాళ ప్రైవేటు/ కార్పొరేటు పాఠశాలల్లో చూస్తే ఒకటో తరగతికి రూ.లక్ష లాగేస్తున్నారు. వాస్తవంగా లెక్కలు వేస్తే పాక్షిక ఉచితమనే విషయం బోధపడుతుంది. బస్సు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, బిల్డింగ్ ఫండ్, స్పెషల్ ఫీజు, ఐఐటీ, నీట్ ఇలా రకరకాల బాదుడు మామూలే. ఈ డబ్బులు ఆయా తల్లిదండ్రులు చెల్లించాల్సిందే. కేవలం ట్యూషనన్ ఫీజులో మాత్రమే ఉచితం కాదుగానీ రాయితీ ఇస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీఈ ప్రకారం అడ్మిషన్లు అనగానే యాజమాన్యాలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకొనే అవకాశం విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. -
పర్యవేక్షణ కరవు
తొలిబడి అమ్మ అయితే.. మలిబడి అంగన్వాడీ కేంద్రాలే. పిల్లలకు ఆరోగ్యం, పౌష్టికాహారం, భద్రత కల్పించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలి. అయితే అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదు. నాణ్యమైన ఆహారం అందజేస్తున్నామ ని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మా త్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పురుగులు పట్టిన కందిపప్పును గ ర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తున్నారు. ఈ నాసిరకం కందిపప్పునే అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు వండి పెడుతున్నారు. నగరి: నగరి ఐసీడీఎస్ పరిధిలో 202 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 161 మెయిన్, 41 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. ఈ సెంటర్లకు నగరి సివిల్ సప్లయిస్ గోదాము నుంచే సరుకులు సరఫరా చేస్తారు. గోదాముకు వచ్చి చేరిన సరుకే నాసిరకంగా ఉంటోంది. దానినే మూడు మండలాల అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. ఈ పురుగులు పట్టిన పప్పునే నిండ్ర మండలం అత్తూరు గ్రామ అంగన్వాడీ కేంద్రలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసేశారు. పురుగులు పట్టిన పప్పు చూసుకున్న వారు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీ చేయాల్సినవారు కాసులకోసం కక్కుర్తిపడి అడ్డదారులు తొక్కుతున్నారంటూ ఆరోపించారు. సరఫరా ఆపేయమన్నాం వచ్చిన కందిపప్పు నాసిరకంగా ఉండడంతో సీడీ పీఓ గోదాము డీటీని సంప్రదించారని, అలా ఉంటే పప్పు పంపిణీ చేయొద్దని, వాపసు పంపేస్తే వేరే పప్పు ఇస్తామన్నారని సూపర్వైజర్ శంకరమ్మ తెలిపారు. దీంతో అందరికీ సరఫరా చేయవద్దని ఆదేశాలు కూడా ఇచ్చామన్నారు. నగరి, విజయపురం మండలాల్లో పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదన్నా రు. అయితే విషయం తెలియక నిండ్ర మండలం అ త్తూరు అంగన్వాడీ కేంద్రంలో సరఫరా చేశారన్నా రు. సరఫరా ఆపేయమని వారికి సూచించామని త్వరలో వేరే సరకులు ఇస్తామని ఆమె తెలిపారు. అంగన్వాడీలకు గోదాము అధికారుల సూచన చిన్నారులకు.. నాణ్యత లేని ఆహారం అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం కంది పప్పు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గర్భిణులు, బాలింతలు ‘జల్లించి, ఎండలో వేసి, వండి పెట్టేయండి.. ఏమీ కాదు’ అని నాసిరకం కందిపప్పు సరఫరా చేయడంపై ప్రశ్నించిన అంగన్వాడీ కార్యకర్తకు సివిల్ సప్లయిస్ గోదాము అధికారులు చేసిన సూచనలివి. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడేలా గోదాము అధికారులు నిర్లక్ష్యపు సమాధానమివ్వడంతో నిండ్ర మండలం, అత్తూరు అంగన్వాడీ కేంద్రం కార్యకర్త నివ్వెరపోయారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సరుకుల పంపిణీ దారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే పప్పును చెరిగితే సగానికి సగం వేస్టేజీ పోతుందని, పప్పు గింజల కంటే ఎక్కువగా పురుగులు ఉంటున్నాయన్నారు. దీనినే కేంద్రంలోని పిల్లలకు కూడా వండిపెడుతున్నారన్నారు. ఇప్పటికే విజయపురం పన్నూరు హాస్టల్లో 30 మందికిపైగా పిల్లలు అస్వస్థతకులోనై ఆస్పత్రి పాలయ్యారు. ఆ పరిస్థితి అంగన్వాడీ పిల్లలకు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అత్తూరు కేంద్రంలోనే ఆరుగురు గర్భిణులు ఉన్నారు. వారికేమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారని అంతా ప్రశ్నిస్తున్నారు. -
అగ్రికల్చర్ డిప్లొమా ప్రవేశాలకు 30 వరకు గడువు
తిరుపతి సిటీ: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు గడుపు ఈనెల 30 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.సుమతి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ నెల 16తో ప్రవేశాల గడువు ముగిసిందని, విద్యార్ధుల సౌకర్యార్థం నెలాఖరు వరకు గడువు పెంచినట్లు చెప్పారు. అగ్రికల్చర్, ఆర్గానిక్, సీడ్ టెక్నాలిజీ, అగ్రి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్ధులు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదని, పదోతరగతిలో పొందిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలియజేశారు. ఎస్వీయూను సందర్శించిన యూకే డిప్యూటీ హైకమిషనర్ తిరుపతి సిటీ: యునైటెడ్ కింగ్డమ్ డిప్యూటీ హైకమిషనర్ విన్ ఓవెన్ మంగళవారం ఎస్వీ యూనివర్సిటీని సందర్శించారు. ఆయన ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడుతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ, భారతీయ పారిశ్రామిక రంగాలతో యూకే బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు అంకితభావంతో ఉందన్నారు. ఉమ్మడి పరిశోధన, విద్యామార్పిడి, వాణిజ్య వెంచర్ల కోసం స్పష్టమైన మార్గాలను అన్వేషించడం తన సందర్శన లక్ష్యమని చెప్పారు. ఏపీలో అమలవుతున్న విద్యా విధానం, అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో సహాయ సహకారాలకు ఉన్న అవకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో వంశీకృష్ణ, లక్ష్మి, శ్రీనివాస్, శశికుమార్ పాల్గొన్నారు -
పాఠశాలను విలీనం చేస్తే.. నిరాహార దీక్ష చేస్తాం!
పుత్తూరు: తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేస్తే నిరాహార దీక్ష చేస్తామని తిరుపతి జిల్లా పుత్తూరు మండలం ఎగువ గూళూరు గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ అశోక్రెడ్డికి వినతి పత్రం అందచేశారు. తడుకు పంచాయతీ పరిధిలోని పాఠశాలను శిరుగురాజు పాళెం పంచాయతీలోని దిగువ గూళూరులో ఉన్న పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. 75 ఏళ్లుగా ఉన్న పాఠశాలను మూసివేయడానికి ఎవరికీ అధికారం లేదనీ, ఇక్కడ చదువుతున్న దళిత విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చదువుకొనే పరిస్థితి లేదని చెప్పారు. అధికారులు సానుకూలంగా స్పందించకపోతే అంబేడ్కర్ సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు స్పష్టం చేశారు. మా పాఠశాలే మాకు ముఖ్యం వరికుంటపాడు ఎస్సీకాలనీ వాసుల ఆందోళనవిద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన మోడల్ స్కూల్ విధానాన్ని విద్యావంతులు, ఉపాధ్యాయ లోకం విమర్శిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పలువురు తమ పిల్లలను వేరే పాఠశాలల్లో చేర్పించబోమని స్పష్టం చేస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్సీ కాలనీలో 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉంది. మోడల్ స్కూల్ విధానంలో ఎస్సీకాలనీ పాఠశాలలోని 3, 4, 5 తరగతులను వరికుంటపాడు రామాలయం సమీపంలో ఉన్న మోడల్ స్కూల్లో విలీనం చేశారు. అంతదూరం తమ పిల్లలు ఎలా వెళతారంటూ సోమవారం కాలనీ వాసులు పాఠశాల ఎదుట ఆందోళన చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రం పంపారు. మా పాఠశాలే మాకు కావాలంటూ నినాదాలు చేశారు. – ఉదయగిరి (వరికుంటపాడు) -
● ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, నిరుద్యోగ భృతి అంతా ఉత్తుత్తిమాటలే ● పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు, పవన్, లోకేష్కు మాత్రమే ఉన్నత ఉద్యోగాలు ● బాండ్లు పంచిన జేమ్స్బాండ్లు ఎక్కడ ? ● యువతకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం ● మాజీ మంత్రి ఆర్కేరోజా
నగరి : కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తాం, డీఎస్సీ నిర్వహిస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, 10 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలిస్తాం అంటూ మాయమాటలు చెప్పి నిరుద్యోగులను పక్కాగా మోసం చేసిందని, జాబ్ గ్యారెంటీ అనుకున్న వారికి వెన్నుపోటు గ్యారెంటీ అని తెలిసిందని మాజీ మంత్రి ఆర్కేరోజా ధ్వజమెత్తారు. సోమవారం నియోజకవర్గం నుంచి యువతపోరుకు తిరుపతి కలెక్టరేట్కు బయలుదేరిన బైక్ ర్యాలీని వడమాటపేట వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు మేనిఫెస్టోలో కూటమి ఇచ్చిన హామీలు ఏదీ నెరవేరకపోవడం, క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో యువత ఆగ్రహావేశాలకు లోనయ్యారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 500 మంది నిరుద్యోగులకు 10 లక్షల స్వయం ఉపాధి రుణాలిస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పక్క రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న చంద్రబాబుకు సీఎం పోస్టు, పవన్కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పోస్టు, లోకేష్కు మంత్రి పోస్టు, నాగబాబుకు ఎమ్మెల్సీ పోస్టు వచ్చిందని ఎద్దేవా చేశారు. బాండ్లు ఇచ్చి ఎగ్గొట్టారు ఎన్నికల ముందు ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచిన జేమ్స్బాండ్లు నేడు ఎక్కడికెళ్లారని ఆర్కే రోజా ప్రశ్నించారు. పవర్ స్టార్ పవర్ వచ్చాక ఫ్లవర్లా మారిపోయారన్నారు. గబ్బర్ సింగ్లాగా డైలాగు లు చెప్పిన ఆయన రబ్బర్లాగా మెలికలు తిరుగుతున్నాడన్నారు. నేడు నిరుద్యోగులు తమకు ఉ ద్యోగం రాలేదు న్యాయం చెయ్యండని అడగడాని కి వెళితే ఆయన సినిమాల్లో బిగాగా ఉన్నాడన్న సమాధానం వస్తోందన్నారు. డిప్యూటీ సీఎం కనబడటం లేదని ఫ్లెక్సీలు పెట్టే పరిస్థితి వచ్చిందన్నా రు. చంద్రబాబుకు, పవన్కు, లోకేష్కు స్పెషల్ ఫ్లై ట్లు, స్పెషల్ హెలికాప్టర్లుకు ఉన్న డబ్బు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి లేదా అని ప్రశ్నించారు. ని రుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే వరకు, 13 నెల ల భృతి ఇచ్చేంతవరకు వారికి అండగా నిల బడి పోరాడుతామన్నారు. నియోజవర్గ యువత విభా గం నాయకులు, పార్టీ నాయకులు, కమిటీ లు, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు. -
మా ఊరే ముద్దు.. విలీనం వద్దు
ఐరాల: మోడల్ స్కూల్ పేరుతో తమ గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులను పుత్రమద్దికి తరలించడం సమంజసం కాదని మండలంలోని కుల్లంపల్లె, కామినాయనపల్లె గ్రామస్తులు సోమ వారం పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వారు హెచ్ఎంకు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో సుమారు 25 మంది విద్యార్థులు 3, 4, 5 తరగతులు చదువుతున్నారన్నారు. మోడల్ స్కూల్ పేరుతో 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుత్రమద్ది పాఠశాలకు విలీనం చేస్తూ విద్యార్థులను తరలించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో 1942 నుంచి ప్రాథమిక పాఠశాల కొనసాగుతోందని, తమ గ్రామాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ప్రస్తుతం పాఠశాలలో 96 శాతం మంది దళిత పిల్లలే ఉన్నారని చెప్పారు. పాఠశాల దూరమైతే దళిత విద్యార్థులకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని వాపోయారు. పుత్రమద్దికి వెళ్లే మార్గం గుండా మధ్యలో చెరువు కట్ట ఉందని, చెరువు నిండిన సమయంలో మొరవ ఉధృతంగా సాగుతుందని, ఆ సమయంలో ఆ మార్గం గుండా పాఠశాలకు వెళ్లడం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎంసీ అనుమతి లేకుండా తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేశారని మండిపడ్డారు. ‘మోడల్ స్కూల్ మాకొద్దు.. మా ఊరు పాఠశాల మాకు ముద్దు’ అంటూ తల్లిదండ్రులు నినాదాలు చేశారు. -
యువతకు వెన్నుపోటు గ్యారెంటీ
మా బడిని విలీనం చేయొద్దు మా ఊరి బడిని విలీనం చేయొద్దని పలమనేరు మండలం, అయ్యంరెడ్డిపల్లె గ్రామస్తులు డిమాండ్ చేశారు. హామీల డాబు..మేము చెప్పిన పాఠశాలలోనే చేరాలి! మద్యం దుకాణానికి నోటిఫికేషన్ తోతాపురి @ రూ.2 మొన్నటి దాకా ఫ్యాక్టరీల్లో రూ.8.. ఆ తర్వాత రూ.5.. ఇప్పుడు.. ర్యాంపుల్లో అయితే తోతాపురి కిలో రూ.2కు కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2025‘ఎన్నికల ముందు యువతకు ప్రాధాన్యత నిస్తామన్నారు. భవిష్యత్ గ్యారంటీ అంటూ ఊదరగొట్టారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలంటూ గొప్పలు చెప్పారు. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ జబ్బలు చరిచారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అటకెక్కించేశారు. అడిగేవారు లేరని యువతను వెన్నుపోటు పొడిచారు. జాబులు చూపండి బాబూ..! అంటూ రోడ్డున పడాల్సిన దుస్థితికి దిగజార్చారు..’ అని నిరుద్యోగులు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన యువత పోరు కార్యక్రమానికి పోటెత్తారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. యువతకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని నినాదాలు మిన్నంటించారు. చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు కార్పొరేషన్: ‘అధికారమే పరమావధిగా ఎన్నికల సందర్భంగా సవాలక్ష హామీలు గుప్పించారు. అధికారం చేపట్టాక ఒక్క హామీనీ నెరవేర్చకుండా దగా చేశారు..’ అంటూ యువత, నిరుద్యోగులు నిరసన గళం వినిపించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఆ ధ్వర్యంలో నిరుద్యోగులకు భాసటగా సోమవారం యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఉద యం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని రెడ్డిగుంట జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్టులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన యువత, నిరుద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు కిషోర్, దొరబాబు, విద్యార్థి సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ సద్ధాం, నాయకులు రూపేష్, సుబ్బునాయుడు, శివ, బావాజీ, గజేంద్ర, నవీన్రెడ్డి, స్టాండ్లీ, మురళీరెడ్డి, చక్రీ, ఢిల్లీబాబు, లోకనాథ, కల్యాణ్, భరత్, విద్యార్థి నాయకులు విఘ్ణరెడ్డి, శశిదీప్రెడ్డి, కళ్యాణ్, భరత్, నరేష్, మహేష్, శ్రీకాంత్, ధనరాజ్, సుమంత్, మనోజ్నాయుడు పాల్గొన్నారు. బాబూ..జాబు! కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మోసగించిందని వైఎస్సార్సీపీ యువత విభాగం రాష్ట్ర కార్యదర్శి చెంగారెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రూ.3 వేలు భృతి ఎప్పుడిస్తారని నిలదీశారు. రీజనల్ కో ఆర్డినేటర్ హేమంత్రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో యువతను మభ్యపెట్టిన చంద్రబాబు అండ్ కో నేడు హామీల ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తొలగించకపోతే చాలని చెప్పారు. జాబ్క్యాలెండర్ అమలు చేస్తామన్న లోకేశ్ ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం 420 హామీలు ఇచ్చిందని, అందులో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రతి నిరుద్యోగికి ఇప్పటి వరకు భృతి కింద రూ.36 వేలు చెల్లించాలని చెప్పారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న యువత, నిరుద్యోగులు బోయకొండ హుండీ ఆదాయం రూ.86.84 లక్షలు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.86.84 లక్షలు వచ్చినట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించగా నగదు రూ.86,84,343, బంగారం 64 గ్రాముల 400 మిల్లీలు, వెండిి 780 గ్రాముల 400 మిల్లీలు వచ్చినట్టు పేర్కొన్నారు. వీదేశీ కరెన్సీతోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.59,250 నగదు లభించినట్టు వెల్లడించారు. ఈ ఆదాయం 46 రోజులకు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ పాల్గొన్నారు. మూడు చక్రాల సైకిల్ వితరణ చిత్తూరు అర్బన్: రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి చిత్తూరు ట్రాఫిక్ పోలీ సులు చేయూత అందించి అండగా నిలిచారు. సోమవారం దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్ను ఉచితంగా అందజేశారు. నగరానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి గతంలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. ఇతనికి మూడు చక్రాల సైకిల్ అవసరమని గుర్తించిన.. చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జ్యోతి, తన నగదుతో ఓ సైకిల్ను కొనిచ్చాడు. సీఐ నిత్యబాబు చేతులు మీదుగా సైకిల్ను బాధితుడికి అందచేశారు. రెవెన్యూ డే నిర్వహించకుండా అవమానం చిత్తూరు కలెక్టరేట్ : ఎంతో గొప్ప చరిత్ర ఉన్న చిత్తూరు జిల్లాలో రెవెన్యూ డే నిర్వహించకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని అవమానించారని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయసింహారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ డేని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ డేని ఎందుకు నిర్వహించలేకపోయారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రెవెన్యూశాఖతో పాటు ఆ శాఖ అధికారులను, సిబ్బందిని కించపరిచినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అలసత్వ ధోరణి రెవెన్యూ వ్యవస్థనే అవమానించనట్లని ఆయన ఆరోపించారు. చౌడేపల్లె: మేము చెప్పిన పందిళ్లపల్లె ప్రాథమిక పాఠశాలలోనే చేరాలి... చౌడేపల్లె ఎమ్మార్సీ వద్ద ఉన్న పాఠశాలలో ఎవర్నీ చేర్చుకునేది లేదంటూ ఎంఈఓ కేశవరెడ్డి, హెచ్ఎం నాగరత్నమ్మ చెప్ప డం వివాదానికి దారితీసింది. ఈ ఘటన సోమవారం ఎమ్మార్సీ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. చౌడేపల్లె మండలం, మేకలచిన్నేపల్లె ప్రాథమిక పాఠశాలకు చెందిన 3, 4 ,5 తరగతి విద్యార్థులను పందిళ్లపల్లెలోని పాఠశాలలో విద్యాశాఖ అధికారులు విలీనం చేశారు. మేకలచిన్నేపల్లె పాఠశాల నుంచి పరిసర గ్రామాలైన ముదిరెడ్డిపల్లె, మేకలచిన్నే పల్లె, యానాదిండ్లు, తోటకురప్పల్లెకు చెందిన 35 మంది విద్యార్థులకు అక్కడి ఉపాధ్యాయులు టీసీలు ఇచ్చి పంపారు. మేకలచిన్నేపల్లె నుంచి పందిళ్లపల్లెకు చెరువు కట్టపై సుమారు కిలోమీటరుకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా..? అంటూ తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. మేకలచిన్నేపల్లెలో అంగన్వాడీ కేంద్రం నుంచి ఉన్నత పాఠశాల వరకు సౌకర్యం ఉందని, ఆ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యార్థులెవ్వరూ పందిళ్లపల్లెలోని పాఠశాలకు వెళ్లేది లేదని, చౌడేపల్లె ఎమ్మార్సీ వద్ద గల ప్రాథమిక పాఠశాలలో చేర్పిస్తామంటూ తల్లిదండ్రులు పట్టుబట్టారు. ఈ మేరకు సోమవారం అక్కడికి చేరుకొని హెచ్ఎం నాగరత్నమ్మను కలిశారు. అయితే ఆమె ససేమిర అనడంతో వివాదం నెలకొంది. తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించుకోరంటూ తల్లిదండ్రులు హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. తీరా ఎంఈఓ కేశవరెడ్డి ఆదేశాల మేరకు హెచ్ఎం అక్కడికి వచ్చిన 15 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. దీనిపై ఎంఈఓను వివరణ కోరగా తాము ఎమ్మార్సీ వద్ద గల పాఠశాలలో చేర్చుకోబోమని చెప్పలేదని.. రెండు రోజులు ఆగాలని, లేకుంటే మీరు పందిళ్లపల్లె పాఠశాలకు వెళ్లి చేరాలని చెప్పినట్లు తెలిపారు. చిత్తూరు అర్బన్: పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణిలో కల్లుగీత సామాజికవర్గాలకు రిజర్వు చేసిన మద్యం దుకాణం నిర్వహణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండ్ శ్రీనివాస్ తెలిపారు. 50 శాతం లైసెన్సు ఫీజుతో గౌండ్ల సామాజికవర్గానికి చెందిన వాళ్లు మాత్రం ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లాలోని ఏదైనా ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. 319 గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 319 గ్రామాల్లో భూముల విభజనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2022–24 సంవత్సరాల్లో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో వెబ్ల్యాండ్ 2.0లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు ఆ భూముల విభజనకు సదావకాశం కల్పించారన్నారు. ఈ భూముల విభజనకు ఫీజు రూ.50 చెల్లిచి గ్రామ సచివాలయంలో జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాయింట్ హక్కుదారులుగా ఉన్న భూములపై తరచూ వివాదాలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిలో ఆటంకాలు వస్తున్నాయన్నారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన గ్రామసభల్లో వచ్చిన అర్జీలను పరిశీలించి కొన్ని జాయింట్ ఎల్పీఎంలను పరిష్కరించామన్నారు.– 8లో– 8లో– 8లోన్యూస్రీల్ఏడాదైంది ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? కదంతొక్కిన యువత, నిరుద్యోగులు కలెక్టరేట్ వద్ద యువత పోరు కార్యక్రమం కూటమికి వ్యతిరేక నినాదాలు హామీలు నెరవేర్చాలని డిమాండ్ ససేమిరా అంటున్న తల్లిదండ్రులు చౌడేపల్లెలో చేర్చుకోమనడంతో వివాదం ఎంఈఓ, హెచ్ఎంతో వాగ్వాదం ఎట్టకేలకు 15 మందికి అడ్మిషన్లుబకాయిలు విడుదల చేసే వరకు పోరు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బ కాయిలు చెల్లించే వరకు యువత, విద్యార్థులు కలిసికట్టుగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం. జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగమైన ఇవ్వాలి, లేదా ఈ 12 నెలల కాలానికి రూ.3వేలు చొప్పున భృతి అయినా విడుదల చేయాలి. –మనోజ్రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మేనిఫెస్టో పట్టించుకోరా? ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను కూటమి ప్రభుత్వం అ మలు చేయాలి. అధికా రం చేపట్టి ఏడాది అవుతున్నా ఇంతవరకు వా టి ప్రస్తావన ఎందుకు చేయడం లేదు. హామీ లు అమలు చేస్తారో లేదో అనే సందేహం అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. నిరుద్యోగభృతితో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి. – కిరణ్కుమార్, పుంగనూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు ఉన్న ఉద్యోగాలు తొలగించేశారు కూటమి ప్రభుత్వం అ ధికారంలో వచ్చి ఏడాది అవుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపా యి కూడా అందించలేదు. యువతకు ఇస్తాన న్న నిరుద్యోగభృతి ఇవ్వడం లేదు. కొత్త ఉద్యోగాలు లేవు. ఏడాదిలో ఉన్న ఉద్యోగులను పీకేశా రు. అకారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నారో తెలియడం లేదు. – తేజారెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ యువత అధ్యక్షుడు భృతి ఇవ్వాల్సిందే నిరుద్యోగభృతి అందిస్తామని ఎన్నికల్లో హా మీ ఇచ్చారు. ఈ పథకం పై తక్షణం సృష్టత ఇవ్వాలి. ఎంతో మంది నిరుద్యోగులు ఆశగా భృతి కోసం వేచి చూస్తున్నారు. ఏడాది గడుస్తున్నా ఇంతవరకు పథకం పై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడంలేదు. – చంద్రశేఖర్, పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడుఅప్పు చేసి ఫీజులు వసతిదీవెన, విద్యాదీవెన సొమ్ము సకాలంలో విడు దల చేయకపోవడంతో వి ద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి గత టీడీపీ పాలనలో చూశాం. ఇప్పుడు మరోసారి చూస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభు త్వం ఇచ్చినట్లు వసతి దీవెన, విద్యాదీవెన క్ర మం తప్పకుండా అందించాలి. –కిషోర్రెడ్డి, జీడీనెల్లూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు -
పోలీస్ గ్రీవెన్స్కు 33 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 33 వినతులు అందాయి. స్థానిక ఏఆర్ కార్యాలయంలో చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో మోసాలు, వేధింపులు, కుటుంబ తగాదాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదుపై విచారణ చేపట్టి, పరిష్కరించాలని ఆదేశించారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకరరావు కూడా ఫిర్యాదులు స్వీకరించారు. -
5న జాతీయ లోక్ అదాలత్
చిత్తూరు అర్బన్: జూలై 5న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి కోరారు. సోమ వారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోని జిల్లా న్యాయ సేవాసదన్ భవనంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం జాతీయ అదాలత్ నిర్వహించనున్నట్టు చెప్పారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, చెన్ బౌన్స్, ఇతర కేసులను అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే చిత్తూరు కోర్టులో డీఎల్ఎస్ఏ భవనంలో సంప్రదించాలన్నారు. -
వస్తూనే ఉన్నాం..న్యాయం చేయండి
● ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన ప్రజలు ● వివిధ సమస్యలపై 283 అర్జీలు మామిడి లోడింగ్ చేస్తున్న కూలీలు కమ్మ కార్పొరేషన్లో రుణం ఇప్పించండి ఏపీ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కమ్మ రుణంకు దర ఖాస్తు చేసుకున్నానని, రుణం ఇప్పించాలని చిత్తూరు రూరల్ తాళంబేడు గ్రామానికి చెందిన దివ్యాంగులు గోపాల్ కోరారు. ఈ మేరకు ఆయన జేసీకి వినతిపత్రం అందజేశారు. పాఠశాల విలీనం వద్దు తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేయకూడదని పలమనేరు మండలం, కోతిగుట్ట గ్రామస్తులు వనజ, బుజ్జెమ్మ, రోజా కోరారు. ఈ మేరకు గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద తమ పిల్లలతో కలిసి నిరసన చేపట్టారు. తమ గ్రామంలోని పాఠశాలలో 3, 4, 5 తరగతులను దూరప్రాంతంలో ఉన్న పెంగరకుంట గ్రామంలోని పాఠశాలలో విలీనం చేశారని, ఆ పాఠశాలకు వెళ్లడం ప్రమాదాలతో కూడుకున్న పని అని వాపోయారు. ఆయా తరగతులను తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు కలెక్టరేట్ : శ్రీప్రతి వారం దూరాభారం నుంచి కలెక్టరేట్కు వస్తూనే ఉన్నాం.. తమ సమస్యలు పరిశీలించి న్యాయం చేయాలిశ్రీ అని బాధిత అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు వినతులు అందజేశారు. పాల్గొన్న జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 283 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి పాల్గొన్నారు. రేషన్ కార్డు ఇప్పించండి రేషన్ కార్డు ఇ ప్పించాలని చి త్తూరు రూ రల్ మండలం, అ నుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు కస్తూరి కోరారు. ఈ మే రకు ఆమె పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశా రు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన కూతురి వద్ద గత నాలుగేళ్లుగా అనుపల్లిలో నివసిస్తున్నాని, చాలా రోజులుగా రేషన్కార్డు కు దరఖాస్తు చేసుకుంటున్నా మంజూరు చేయడం లేదన్నారు. విలీనం వద్దు పాఠశాల విలీనం అ న్యాయం అని శ్రీరంగరాజపురం మండలం, దిగువ మెదవాడ ఎస్ టీ కాలనీ వాసులు గాంధీ, ధనలక్ష్మి, దేవి వాపో యారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను దూర ప్రాంతంలో ఉన్న ఎగువ మెదవాడ పాఠశాలలో విలీనం చేయడం అన్యాయమన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించకుండానే బడిని విలీనం చేయడం సబబు కాదన్నారు. మా గ్రామంలోనే బడి కొనసాగించాలి తమ గ్రామంలోనే ప్రభుత్వ బడిని కొనసాగించాలని గంగాధరనెల్లూరు మండలం, అంబోధరపల్లి గ్రామస్తులు రామయ్య, నరసమ్మ, భారతి తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ గ్రామంలోని బడిని విలీనం చేయకూడదన్నారు. ఎవరిని అడిగి తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేశారని ప్రశ్నించారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. -
సచివాలయ ఉద్యోగులపై వివక్ష తగదు
చిత్తూరు అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శుల బదిలీలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులతో వేలాది మందికి ఇబ్బందులు తప్పవని సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ జీవో వల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో నెం–05ను సవరించాలని కోరుతూ సోమవారం చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. యూనియన్ నాయకులు మహేష్, వినోద్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేసుకునే అవకాశం కల్పించకుండా, ప్రభుత్వం తమపై వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ నరసింహ ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు ప్రతాప్, వెంకటేష్, సతీష్, జానకిరామ్ పాల్గొన్నారు. -
అక్రమ మైనింగ్పై దాడులు
శాంతీపురం/ పలమనేరు: కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, 121 పె ద్దూరు సమీపంలోని జేబీ కొ త్తూరు వద్ద పచ్చనేతలు అక్రమంగా సాగిస్తున్న మైనింగ్పై అధికారులు కొరడా ఝుళిపించారు. మైనింగ్ డీడీ సత్యనారాయణ ఆదేశాలతో పలమనేరు మైనింగ్ అధికారులు సోమ వారం దాడులు చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన పది గ్రానైట్ దిమ్మెలను సీజ్చేశారు. తెల్లబోయే దోపిడీ శీర్షికన సాక్షి దినపత్రికలో సోమ వారం వెలువడిన కథనంపై మైనింగ్ డీడీ స్పందించారు. పులిగుండ్లపల్లికి చెందిన డీకేటీ రైతుల పొలాల్లోని తెలుపు గ్రానైట్ను అధికార పార్టీకి చెందిన వారు యథేచ్ఛగా మైనింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే అక్కడ పనులు చే స్తున్న వాహనాలను ఎందుకు వదిలేశారో చెప్ప డం లేదు. ఇదే మండలంలో అక్రమ మైనింగ్ సా గుతోందని గతంలో ప్రతిపక్ష నేతగా ఉండిన చంద్రబాబునాయుడు నానా హంగామా చేసిన విష యం తెలిసిందే. ఇప్పుడు అధికార పార్టీ వాళ్లే అ క్రమ మైనింగ్కు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనే మాట అక్కడ వినిపిస్తోంది. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారా అని మైనింగ్ డీడీ సత్యనారాయణ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన సెల్ఫోన్ను లిప్ట్ చేయకపోవడం కొసమెరుపు. -
తోతాపురి @ రూ.2
ఉమ్మడి జిల్లా సమాచారం మామిడి విస్తీర్ణం: 56వేలహెక్టార్లు దిగుబడి అంచనా: 6.45 లక్షల మెట్రిక్ టన్నులు తోతాపురి సాగు విస్తీర్ణం: 39,895 ఎకరాలు దిగుబడి అంచనా: 4.99 లక్షల మెట్రిక్ టన్నులు పళ్ల గుజ్జు పరిశ్రమలు: 43 పనిచేస్తున్న ఫ్యాక్టరీలు: 31 ర్యాంపులు: 40 ఫ్యాక్టరీలకు చేరిన కాయలు: 1.3 లక్షల మెట్రిక్ టన్నులు ఉమ్మడి జిల్లాలో మామిడి ధర మళ్లీ పతనమైంది. ర్యాంపుల్లో తోతాపురి కేజీ రూ.2 పలుకుతోంది. ఫ్యాక్టరీలో రూ.5కు అమ్ముడుబోతోంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8 పూర్తిగా అంతమైంది. జిల్లా యంత్రాంగం ఫ్యాక్టరీల్లో రూ.6, ర్యాంపుల్లో రూ.3.5 తగ్గదని చెప్పింది. కానీ క్షేత్ర స్థాయిలో ఇవేవీ అమలుగాకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 వేల హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉంది. మొత్తంగా 6.45లక్షల మెట్రిక్ టన్నుల వరకు మామిడి దిగుబడి అయ్యింది. టేబుల్ రకాలు కోత చివరి దశకు చేరుకుంటే... తోతాపురి కోతలు ఇప్పుడిప్పుడే ఆరంభమయ్యాయి. ఈ రకం మామిడి 39,895 హెక్టార్లు ఉంటే.. 4.99 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 1.5 లక్షల టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు చేరినట్లు వారి గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి తోతాపురి కోతలు ప్రారంభమైతే.. చాలా ఫ్యాక్టరీలు తోతాపురి కొనలేమని చేతులెత్తేశాయి. అధికారులు పట్టుబట్టినా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మద్దతు ధర మూన్నాళ్ల ముచ్చటే కూటమి ప్రభుత్వం తోతాపురి రకం మామిడి కేజీ రూ.8గా మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వ ప్రోత్సాహ నిధి కింద మరో రూ.4తో కలిపి మొత్తం రూ.12 ఇస్తామని ప్రచారం చేసింది. దీంతో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు రోడ్డుపైకి వచ్చి పండుగ చేసుకున్నారు. తీరా ఆ సంబరాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ర్యాంపుల్లో కేజీ రూ.2 ఈ సారి మామిడి ధరలు, అవస్థలు చూసి ర్యాంపులు తెరుచుకోవడం కష్టతరంగా మారింది. ర్యాంపులు ఫ్యాక్టరీకి రోజూ ఒక లారీ కాయలు తరలించేలా అవకాశం కల్పించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 ర్యాంపులు ఏర్పడ్డాయి. ఈ ర్యాంపుల్లో చాలా వాటికి రిజిస్ట్రేషన్ కూడా లేవు. అనాధికారికంగా ర్యాంపులను నిర్వహిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండే ఫలాన్ని ర్యాంపు నిర్వాహకులు చులకనగా చూస్తున్నారు. వీరు ఆడిందే..ఆట పాడిందే పాటగా ధరలను ఫిక్స్ చేస్తున్నారు. తొలుత తోతాపురి కేజీ రూ.4 అంటూ రంగంలోకి దిగారు. తర్వాత రూ.3.50, రూ.3కు సిండికేట్ అయ్యారు. శనివారం నుంచి తోతాపురి కేజీ ధర రూ.2 పలుకుతోంది. చిత్తూరు, పులిచెర్ల, బంగారుపాళెం, దామలచెరువు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో రూ.2 లెక్కన కొనుగోలు చేస్తున్నారు. ఫ్యాక్టరీలో రూ.5 ఫ్యాక్టరీల్లో తోతాపురి కేజీ రూ.4, రూ.5కు కొనుగోలు చేస్తున్నారు. అదే టోకన్ తీసుకున్న రైతు వద్ద తోతాపురి రూ.6కు కొనుగోలు చేస్తున్నాయి. పలు ఫ్యాక్టరీలు సిండికేట్ అయ్యి ధరలను రూ.6 నుంచి రూ.5కు తగ్గించేశాయి. 95శాతం ఫ్యాక్టరీలో ఇదే ధరలు మాత్రమే అమలవుతున్నాయి. ఈ పర్యటనలు ఎందుకో? జిల్లా అధికారులు ఫ్యాక్టరీల వద్దకు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రైతులు, ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. అయితే అధికారులు మరోవైపు తప్పులన్నీ రైతులపై నెట్టేస్తున్నారు. పక్వానికి రాని కాయలను కోసి తెచ్చేస్తున్నారని, ఆగస్టు వరకు కోత కోయవచ్చని, ర్యాంపులు, ఫ్యాక్టరీలు అడిగిన రేట్లకు ఇచ్చేస్తున్నారని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ విషయం చేరవేసి మామిడి రైతులను నట్టేటా ముంచేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. చిత్తూరు నగరంలోని మామిడి కాయల ఫ్యాక్టరీలో క్యూకట్టిన వాహనాలు మళ్లీ పతనమైన మామిడి ధరలు తోతాపురి ర్యాంపుల్లో కేజీ రూ.2 ఫ్యాక్టరీలో రూ.5కు కొనుగోలు రూ.6 తగ్గకుండా చూస్తామన్న అధికార యంత్రాంగం మరింత దిగజారే అవకాశం మండిపడుతున్న రైతులు ఏమైపోవాలి? ఈసారి దిగుబడి బా గొచ్చింది. పది రూపాయలు వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఆ పంటను చూస్తే కన్నీళ్లు తప్ప కాసులు రావడం లేదు. ఫ్యాక్టరీలకు తోలుదామనుకుంటే టోకన్లు లేవు. నేరుగా తీసుకెళితే ఫ్యాక్టరీ వాళ్లు తీసుకోవడం లేదు. ర్యాంపుకు వెళితే కేజీ రూ.2కు అడుగుతున్నారు. ఇలాగైతే రైతులు ఏమైపోవాలి. –హరినాథ్, పులిచెర్ల మండలం మద్దతు ధరపై ఏమంటారు? కూటమి ప్రభుత్వం తోతాపురి కేజీకి రూ. 12 కల్పించింది. ఈ ధరకే కొనాలని చిత్తూ రు ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నిర్వాహకులకు, మ ధ్యవర్తులకు మీడియా ముందు వార్నింగ్లు ఇచ్చారు. ఫ్యాక్టరీలు కొనలేదంటే సీజ్ చేస్తామన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చిత్తూరు పర్యటనకు వచ్చి ఫ్యాక్టరీలు కేజీ రూ.8కి కొంటాయని ప్రగాల్భాలు పలికారు. కానీ వీరి మాటలు.. వార్నింగ్లు అన్నీ ఉత్తుత్తిదేనని తేలిపోయింది. ఇప్పుడు ర్యాంపుల్లో కిలో రూ.2కు, ఫ్యాక్టరీల్లో రూ.5కు కొనోగులు చేస్తున్నారు. –విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు -
పుట్టిన రోజే మృత్యుఒడిలోకి
ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. వివాహమైన ఎనిమిదేళ్లకు కవల పిల్లలు జన్మించారు. భర్త ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందాడు. ప్రస్తుతం ప్రైవేటు గన్మెన్గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో తమ కలల రూపాలైన కవలలను ఉన్నతంగా చదివించాలని ఆరాట పడ్డారు. ఈ నేపథ్యంలో సొంతూరి నుంచి చిత్తూరుకు మకాం మార్చారు. ఆ దంపతులు పిల్లల భవిష్యత్తుపై ఎన్నో కలలుకన్నారు. కానీ ఆ కలలను దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం చిదిమేసింది. దంపతులిద్దరినీ మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో కుమారుడు, కుమార్తె గాయపడి స్పృహ కోల్పోయారు. గాయపడిన ఆ కుటుంబ ఆశాదీపాలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు ఏం జరిగింది.. ఎలా ఉన్నారో..ఎక్కడ ఉన్నారో ఆ పసి హృదయాలకు పాపం తెలియదు.చిత్తూరు: గుడిపాల మండలంలోని కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన మాజీ సైనికుడు సిద్దయ్య(47), అతడి భార్య జ్యోతిలక్ష్మి (43) మృతి చెందగా, కొడుకు, కుమార్తె గాయపడ్డారు. దీంతో కుప్పిగానిపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల దైవదర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లి వస్తుండగా పనపాకం సమీపంలోని గడ్డకిందపల్లె వద్ద ఆవును తప్పించబోయి డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే దంపతులు మృతి చెందారు. దంపతుల ఇద్దరిదీ కుప్పిగానిపల్లె గ్రామమే. వీరికి ఇద్దరు కవల పిల్లలు. పిల్లల చదువు కోసం చిత్తూరులో నివాసం ఉంటున్నారు. గిరి(13), గాయత్రి(13) బివిరెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.తండ్రి అడుగుజాడలోనే ఆర్మీలో చేరి..కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నాగరత్నం, సరస్వతీలకు 1978లో సిద్దయ్య జన్మించాడు. నాగర త్నం ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి టీటీడీలో పనిచే శాడు. నాగరత్నం చొరవతో కుమారుడు సిద్దయ్య 1998లో ఆర్మీలో ఉద్యోగం చేస్తూ కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు, జగద కుమార్తె జ్యోతి లక్ష్మిని 2002లో వివాహం చేసుకున్నాడు. వీరికి సుమారు ఎనిమిదేళ్ల వరకు పిల్లలు కలగలేదు. అనంతరం ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.పిల్లలను ఉన్నతంగా చదివించాలని..పిల్లలు జన్మించిన అయిదు సంవత్సరాలకు వారి చదువు కోసం చిత్తూరులో కాపురం పెట్టారు. సిద్దయ్య 2020 సంవత్సరంలో ఆర్మీ నుంచి ఉద్యోగ విరమణ పొందారు.ఈక్రమంలో చిత్తూరులోని ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్నారు.పుట్టిన రోజే మృత్యుఒడిలోకిసిద్దయ్య పుట్టిన రోజుకి ఎప్పుడూ తిరుమల దైవద ర్శనానికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తిరు మలలో స్వామిని దర్శించుకొని పిల్లలు, భార్యతో కలిసి కారులో తిరిగి వస్తున్న నేపథ్యంలో వారిని మృత్యువు వెంటాడడంతో దంపతులు మృత్యుఒడికి చేరుకోగా పిల్లలు తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ సైనికుడిగా ఉన్న సిద్దయ్య ప్రస్తుతం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డికి ప్రైవేట్ గన్మెన్గా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోహిత్రెడ్డి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
మామిడికి ‘తమిళ’ సెగ
● జిల్లాలోని మామిడిని కొనలేమంటున్న ర్యాంపు నిర్వాహకులు ● తమిళనాడు కాయలకు ప్రాధాన్యం ఇవ్వాలని రోడ్డెక్కిన అక్కడి రైతులు ● క్రిష్ణగిరిలో ఫ్యాక్టరీల ఎదుట క్యూకట్టిన వాహనాలు ● జిల్లాలోని మామిడి కాయలకు తమిళ రైతుల సెగ ● కాయలు వద్దంటున్న క్రిష్ణగిరి ఫ్యాక్టరీలు ● కొనుగోలుకు విరామం ప్రకటించిన ర్యాంపులు కాణిపాకం : మామిడి కొనుగోలు ర్యాంపులకు తమిళనాడు రైతుల సెగ తగులుతోంది. అక్కడి తోతాపురి కాయలు రోడ్డు పాలు కావడంతో తమిళ రైతులు రోడ్డెక్కుతున్నారు. స్థానికంగా పండిన పంటకు ప్రాధాన్యం ఇవ్వాలని అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. క్రిష్ణగిరిలోని ఫ్యాక్టరీలపై దండ యాత్రకు దిగుతున్నారు. దీంతో అక్కడి ఫ్యాక్టరీలు ఆంధ్రా కాయలను వెనక్కు నెట్టుతున్నారు. ఈ దెబ్బతో జిల్లాలోని ర్యాంపులు కాయలు కొనలేమని చేతులెత్తేస్తున్నారు. ఆరు రోజుల వరకు కొనుగోలుకు విరామం పలకనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 23 ర్యాంపులున్నాయి. ఈ ర్యాంపులు తోతాపురి కాయలను కొనుగోలు చేసి జిల్లాలోని పలు ఫ్యాక్టరీలకు తరలించడంతో పాటు అధికంగా తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరిలోని పండ్ల గుజ్జు పరిశ్రమలకు తరలిస్తున్నాయి. 30 నుంచి 40 శాతం కాయలు జిల్లాలోని వివిధ ఫ్యాక్టరీలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటే..మిగిలిన 60 నుంచి 70 శాతం పంటను తమిళనాడులోని క్రిష్ణగిరికి పంపుతున్నాయి. ఈ క్రమంలో ర్యాంపు నిర్వాహకులకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. క్రిష్టగిరిలో పరిస్థితి ఇదీ.. తమిళనాడులోని క్రిష్ణగిరిలో గుజ్జు పరిశ్రమలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిశ్రమలకు తోతాపురి కాయలు భారీగా క్యూ కడుతున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ వద్ద వందల లారీలు, ట్రాక్టర్లు కిక్కిరిస్తున్నాయి. ఇవీ అన్ లోడింగ్ కావాలంటే ఐదు రోజుల సమయం పడుతోంది. ఈ కారణంగా పలు వాహనాల్లోని కాయలు మాగిపోతున్నాయి. దీంతో అక్కడి రైతులు కాయలను రోడ్డుపైనే పడేసి వెళ్లిపోతున్నారు. ఈ సమస్య ఉధృతం కావడంతో అక్కడి రైతులు రోడ్డెక్కారు. తమిళనాడు రైతులను ముందు వరుసలో పెట్టాలని ఫ్యాక్టరీని ముట్టడించారు. దీని దెబ్బకు అక్కడి ఫ్యాక్టరీలు తలొగ్గాయి. జిల్లా అధికారులు చెప్పే ధరకు కొనలేం తమిళనాడులోని వేలూరు, క్రిష్ణగిరి మార్కెట్లో తోతాపురి కేజీ రూ.2 నుంచి రూ.2.50 అమ్ముడవుతోంది. ఇక్కడ రూ.3.50 నుంచి రూ.4 వరకు కొనుగోలు చేయమంటున్నారు. ఇదీ సాధ్యం కాదు. తమిళనాడులోని ఫ్యాక్టరీలు కిలో రూ.4కు కొంటున్నాయి. మేము అదే రేటుకు కొంటే..చేతులు కాల్చుకోవాల్సిందే. ఒక్కో లారీలో 20 వేల టన్నుల కాయలు పంపుతున్నాం. టన్నుకు రూ.1300 నుంచి రూ.1500 వరకు ఇస్తున్నాం. ఇలా ఒక్క లోడ్ పంపించాలంటే లారీకి మొత్తం రూ.30 వేల వరకు ఖర్చువుతోంది. అక్కడి రైతుల సెగతో ఇక్కడి కాయలు వద్దని చెప్పారు. కాయలు కొనుగోలు ఆపేస్తున్నాం. ఈ రోజే కొనుగోలు ఆఖరు. – విజయన్, ర్యాంపు నిర్వాహకులు, చిత్తూరు కాయలు వద్దంటున్న నిర్వాహకులు తమిళళనాడులో తలెత్తిన సెగతో క్రిష్ణగిరిలోని ఫ్యాక్టరీలు జిల్లా కాయలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. అక్కడి కాయలు రోడ్డుపాలు కావడం, రైతుల నిరసనలు, ధర్నాలతో జిల్లా కాయలను వద్దంటున్నారని ర్యాంపు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కారణంగా కాయల కొనుగోలు వారం రోజుల పాటు నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది వరకు రోజుకు 15 లక్షల టన్నుల కాయలు జిల్లా నుంచి క్రిష్ణగిరికి ఎగుమతి చేస్తున్నారు. తోతాపురి కిలో రూ.2 నుంచి రూ.2.50కు కొనుగోలు చేసి..అక్కడి ఫ్యాక్టరీలో రూ.4 వరకు విక్రయిస్తున్నారు. ఇక జిల్లా యంత్రాంగం రూ.3.50 నుంచి రూ.4 వరకు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ధరకు తాము కొనలేమని ర్యాంపు నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. జిల్లా నుంచి క్రిష్ణగిరికి కాయలు తరలించాలంటే లారీ బాడుగలే రూ. 30 వేలు వ్యయమవుతోందని వారు వివరిస్తున్నారు. దీనికి తోడు తమిళనాడులోని వేలూరు, క్రిష్ణగిరి ప్రాంతాల్లోని మార్కెట్లో తోతాపురి కేజీ రూ.2 నుంచి రూ.2.50కు పలకడంతో జిల్లాలోని ర్యాంపు నిర్వాహకులు అదే రేటును ఫిక్స్ చేశారు. ఇవన్నీ కూడా సిండికేట్ దెబ్బ అంటూ...రైతులు మండిపడుతున్నారు. -
యువతకు తీరని ద్రోహం
● ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు ● కూటమి ప్రభుత్వంపై భూమన ఆగ్రహం ● యువత పోరును విజయవంతం చేయాలని పిలుపుతిరుపతి మంగళం : అధికారంలోకి వస్తే ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. లేకుంటే నిరుద్యోగ భృతి అందిస్తామంటూ మాయమాటలు చెప్పి యువతకు మొండిచెయ్యి చూపించి చంద్రబాబు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ను సైతం విద్యార్థులకు అందించలేదని విమర్శించారు. దీంతో కళాశాలల యాజమాన్యాల వేధింపులతో పిల్లలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్లో సైతం అవకతవకలు జరిగినట్లు వెల్లడించారు. కేవలం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మినహా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని బలహీనపరచి అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని కీలక నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులపై పెడుతున్న శ్రద్ధలో పావు వంతు కూడా యువత, ప్రజా సంక్షేమంపై చూపడం లేదని మండిపడ్డారు. ఇది ఉద్యమ సమయం కూటమి ప్రభుత్వం చేసిన మోసం, ద్రోహంపై యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని భూమన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు యువత పోరుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, ప్రజలు తరలిరావాలని కోరారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగాల జిల్లా అధ్యక్షులు అందరితో సమన్వయం చేసుకుంటూ తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్ల వద్ద శాంతియుత నిరసన చేపట్టాలని సూచించారు. అనంతరం యువతకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును కోరుతూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని స్పష్టం చేశారు. అబద్ధపు హామీలు గుప్పించిన కూటమి ప్రభుత్వానికి హడలు పుట్టేలా భారీ సంఖ్యలో యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ పాల్గొన్నారు. -
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
పుంగనూరు (చౌడేపల్లె) : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆయన పర్యటించిన అనంతరం పుంగనూరులో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం చాలా బాధాకరమన్నారు. రైతు భరోసా కేంద్రాలన్నీ మరుగున పడేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతులకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోయారన్నారు. అలాగే పత్తి, మిర్చి, పొగాకు, షుగర్కెన్ (చెరకు) పంటలు సాగుచేసిన రైతులు, చిత్తూరు జిల్లాలో కోట్లు ఖర్చుపెట్టి సాగుచేసిన టమాట రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పల్ప్ ప్యాక్టరీ కూడా మ్యాంగో తోతాపూరి కొనే పరిస్థితి లేదన్నారు. కొద్దో గొప్పో కొనుగోలు చేసినా రూ.2 నుంచి రూ.3కు కొనుగోలు చేస్తే రైతు ఏ విధంగా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేరుకు మాత్రం రూ.8 ఇచ్చి కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలకు చెప్పడం, ప్రభుత్వం ఏమో రూ.4 సబ్సిడీ ఇస్తామని చెబితే రూ.12 గిట్టుబాటు ధర అవుతుందని అనుకుంటే బూటకపు మాటలు చెప్పి రైతుల నుంచి కేవలం రూ.2 నుంచి రూ.3కు కొనుగోలు చేయడం పరిస్థితి దురదృష్టకరమన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిందన్నారు. ప్రతిపక్ష నేత వెళ్లకుండా అడ్డంకులు రెతులను పలకరించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి వెళ్తుంటే రకరకాల అడ్డంకులు, కేసులు పెట్టడం, రైతులను, పార్టీ నేతలను వేధించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో టమాటాకు ధరలు లేని సమయంలో గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసి రైతులను ఆదుకొన్న ఘటనను గుర్తుచేశారు. ఇప్పుడు టమాటా, మామిడి కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. నాలుగేళ్ల పాటు రైతులందరూ క్రాప్ హాలిడే ప్రకటించి సెలవుల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆలీం బాషా, నాయకులు ఫకృద్దీన్ షరీఫ్, రాజేష్,హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నాలుగేళ్లు రైతులకు క్రాప్ హాలీడేనే చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ -
‘తెల్ల’బోయే దోపిడీ
● తమ్ముళ్ల అక్రమ గ్రానైట్ దందా ● రైతుల భూముల్లో దౌర్జన్యంగా పనులు ● యథేచ్ఛగా పేలుళ్లు ● నిలదీసిన వారికి బెదిరింపులు ● పట్టించుకోని అధికారులు చంద్రన్నే కాపాడాలి మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ అభిమానులం. మా అందరికీ పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి. మా తాతగారి నుంచి వచ్చిన భూమిలో గుట్టలు ఉన్న ప్రాంతంలో నీలగిరి చెట్లు పెట్టుకుని, మరికొంత విస్తీర్ణం చదును చేసి సేద్యం చేసుకుని బతుకుతున్నాం. కానీ ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉండి కూడా మా భూముల్లో దౌర్జన్యంగా రాళ్లు తవ్వుతుంటే ఏమీ చేయలేకపోతున్నాం. రాత్రింభవళ్లు జరుపుతున్న పేలుళ్లతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియడం లేదు. మా పొలంలోకి వెళ్లాలంటే భయంగా ఉంటోంది.మా చంద్రన్నే (సీఎం) స్పందించి మమ్మల్ని కాపాడాలి. – మురుగేష్, బాధిత రైతు, జేబి కొత్తూరు అక్రమంగా రాళ్లను ఎత్తుకుపోతున్నారు మా అనుమతి లేకుండా, మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా మా భూముల్లో రాళ్లను బ్లాకులుగా కత్తిరించి ఎత్తుకుపోతున్నారు. శాంతిపురంలో ఉన్న పెద్ద నాయకుడు వెనుక ఉండి పెద్దూరులో ఉన్న చిన్న నాయకుడితో ఈ పని చేయిస్తున్నాడు. అడిగితే కేసులు పెడతామని, ఆఫీసర్లకు చెప్పి మాకు ఉన్న భూములను కూడా పీకేసుకుంటామని అంటున్నారు. ఎవరికి చెప్పినా పట్టించుకునే వారు లేకపోయారు. మా పార్టీ అధికారంలో ఉన్నా మా బతుకులకు దిక్కు లేకుండా పోయింది. – మునిరాజు, బాధిత రైతు, జేబీ కొత్తూరుశాంతిపురం : అధికార అండతో కొందరు తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. సీఎం ప్రాతినిధ్యంలోని ప్రాంతంలో సొంత పార్టీలోని వారే వద్దని వారించినా అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. విలువైన గ్రానైట్ (తెల్లరాయి)ను అక్రమంగా తరలిస్తూ రూ.లక్షలు దోచేస్తున్నారు. దీనికి అడ్డు చెప్పిన వారికి నరకం చూపుతున్నారు. తమ భూముల్లో రాళ్ల తవ్వకం పనులు చేయొద్దన్న పాపానికి ఓ కుటుంబాన్ని వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. విపక్షంలో ఉండగా అక్రమ క్వారీలను ఆపాలని పోరాటం చేసిన చంద్రబాబు పాలనలోనే కుప్పంలో కుప్పలు తెప్పలుగా అక్రమ క్వారీలు సాగుతున్నాయి. 121 పెద్దూరు పంచాయతీలోని జేబీ కొత్తూరు వద్ద ఉన్న పులిగుండ్లపల్లి ప్రాంతంలో రెండు నెలలుగా అక్రమ క్వారీ పనులు చేస్తున్నారు. రైతుల అధీనంలోని అసైన్డ్ భూముల్లో ఉన్న భారీ రాళ్లను కత్తిరించి బ్లాకులుగా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేలుడు పదార్థాలను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. దీనికి అభ్యంతరం చెప్పిన రైతు కుటుంబాలను బెదిరింపులతో నోరు నొక్కుతున్నారు. గుట్టలపై కన్నేసి చెట్ల తొలగింపు జేబీ కొత్తూరుకు చెందిన మునెప్ప కుమారులైన వెంకటరాజు, మునిరాజు, నారాయణస్వామికి అసైన్డ్ భూములు ఉన్నాయి. భాగ పరిష్కారాల్లో అన్నదమ్ములు వీటిని పంచుకున్నారు. అవకాశం ఉన్న మేర భూములు చదును చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. మిగతా భూమి గుట్టలు ఎక్కువగా ఉండటంతో వాటి మధ్య నీలగిరి చెట్లు నాటుకుని వాటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. కానీ ఆ గుట్టలపై కన్నేసిన టీడీపీ నాయకులు నీలగిరి చెట్లను పెకిలించి వేసి క్వారీ పనులకు పూనుకున్నారు. కంప్రెషర్లు, హిటాచీలతో బ్లాకులను సిద్ధం చేసి కర్ణాటక మీదుగా తెల్లరాయిని తరలిస్తున్నారు. తమ నీలగిరి చెట్లను ధ్వంసం చేయడంపై రైతులు అభ్యంతరం చెప్పడంతో వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా మొత్తం భూములను లాక్కుంటామని, ఓవరాక్షన్ చేస్తే కేసులు పెట్టి బొక్కలో వేస్తే జన్మలో బయటకు రాలేరని దబాయింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కావడంతో ఆ పార్టీలోని ఇతర నాయకులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. ఎట్టకేలకు వారు గత్యంతరం లేక మీడియాకు సమాచారం ఇచ్చారు. తమ గోడును వెలుగులోకి తెచ్చి న్యాయం జరిగేలా చూడాలని, సీఎం చంద్రబాబు స్పందించి తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. అధికార పార్టీలో పట్టున్న నాయకులు సాగిస్తున్న ఈ అక్రమ బాగోతంపై అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. -
యువతకు కూటమి దగా
● నేడు జిల్లా కేంద్రంలో ‘యువతపోరు’ నిరసనలు ● అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్కు ర్యాలీ ● హామీలు అమలు చేయాలని కలెక్టర్కు వినతిపత్రాలు చిత్తూరు కలెక్టరేట్/కార్పొరేషన్ : సార్వత్రిక ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినప్పటికీ నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా మాట తప్పింది. ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ యువజన విభాగం నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గళం వినిపించేందుకు సిద్ధమైంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో యువత పోరు నిరసన చేపట్టనున్నారు. అగమ్య గోచరంగా చదువులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంత వరకు సంక్షేమ పథకాలు అమలు చేయని దుస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలు ఊసే లేకుండా పోయాయి. పేద కుటుంబాల్లో పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటికీ గతంలో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్లో పెట్టారు. జిల్లాలో 183 ఉన్నత కళాశాలల్లో చదువుతున్న 24,149 మంది విద్యార్థులకు రూ.44.76 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫలితంగా ఉన్నత చదువులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నిరసన కార్యక్రమం ఇలా.... జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న అమూల్ డెయిరీ వద్ద యువత పోరు నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి యువత విచ్చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టర్కు డిమాండ్ల వినతిపత్రం అందజేయనున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి పలు శాఖల్లో ఉద్యోగుల తొలగింపును వెంటనే ఆపాలి. ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి 20 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి పోస్టులను భర్తీ చేయాలి గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి నిరుద్యోగ భృతి అమలు చేసి నిధులు కేటాయించాలి. నిరుద్యోగ భృతి విడుదల చేయాలి. -
మామిడి రైతులను ఆదుకోవాలి
గంగాధర నెల్లూరు : మామిడి రైతుల కన్నీళ్లు చూస్తుంటే కడుపు కాలిపోతోందని రైతు ఉద్యమ నేత ఈదర వెంకటాచలం నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు పూత్తూరు మార్గంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద మామిడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 15 రోజులుగా మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రైతుల పడుతున్న కష్టాలను గమనిస్తున్నామన్నారు. ఏడాది పొడువునా కన్న బిడ్డల్లా మామిడి పంటను సాగు చేస్తే నేడు గిట్టుబాటు ధర లేక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. కుటుంబాన్ని వదిలి వారాల పొడవున ఫ్యాక్టరీ గేట్లు ఎదుట కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతో తిండి నిద్రలేక రోడ్లపై రైతులు అగచాట్లు పడుతున్నా ఆదుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మామిడికి కనీసం మద్దతు ధర 50 రూపాయలు ఇచ్చి, రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని లేకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామన్నారు. -
ఎంటీఎస్ టీచర్లపై కుట్ర
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) టీచర్ల బదిలీల ప్రక్రియలో ఖాళీలన్నీ చూపించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభించారు. ఆ రెండు డీఎస్సీల టీచర్లకు టీడీపీ ప్రభుత్వం పాలనలో అన్యాయం జరిగితే గత వైఎస్సార్సీపీ సర్కారు మేలు జరిగేలా చేసింది. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ టీచర్గా పనిచేయాలని కలలు కన్న ఆ టీచర్ల కోరికను వైఎస్సార్సీపీ సర్కారు నెరవేర్చింది. అయితే ఇంత వరకు బాగానే ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లపై కక్ష సాధింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఖాళీలు బ్లాక్ చేసి.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్ల బదిలీల్లో కుట్రకు పాల్పడేందుకు ప్రయత్నించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఖాళీలన్నీ చూపించకుండా తక్కువ ఖాళీలను చూపించి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎంటీఎస్ టీచర్లు తమకు అన్యాయం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని విద్యాశాఖ అధికారులకు హెచ్చరించారు. దీంతో ఆదివారం ఉదయం నిర్వహించాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3.15 గంటల వరకు ప్రారంభం కాని దుస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వివిధ మండలాల నుంచి హాజరైన ఎంటీఎస్ టీచర్లు పడిగాపులు కాశారు. మొదటి విడత కౌన్సెలింగ్ ఎంటీఎస్ టీచర్ల డిమాండ్లను పరిశీలించిన జిల్లా వి ద్యాశాఖ అధికారులు సమస్యలను ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న ఖాళీలన్నింటినీ ప్రదర్శించి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించిన తర్వాత 3.15 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి, ఏడీ వెంకటేశ్వరరావు, తదితరులు పర్యవేక్షించారు. వైఎస్సార్ 98 డీఎస్సీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు స్వామి కణ్ణన్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్రెడ్డి, యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు ఎంటీఎస్ టీచర్ల సమస్యలను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 180 పోస్టులకు మొదటి విడతగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు 369 పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 1664 పోస్టులను ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్లో చూపించారు. ఇందులో 549 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం జిల్లాలో 1115 టీచర్ల పోస్టులు మిగులు ఉంటాయి. ఆ పోస్టులను ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించే అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. -
యువతను నమ్మించి వంచించింది
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్లు, ఉద్యోగాల కల్పనలో ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా ఇంత వరకు యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ యువజన రాష్ట్ర విభాగం యువత పోరుకు పిలుపునిచ్చింది. సోమవారం ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు చర్యలు చేపట్టాం. యువత అధిక సంఖ్యలో హాజరై తమ గళాన్ని వినిపించాలి. – హేమంత్రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్, వైఎస్సార్సీపీ యువజన విభాగం హామీల అమలులో విఫలం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందింది. యువతకు ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు పలు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాకా యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగించారు. కూటమి ప్రభుత్వం మోసానికి నిరసనగా నేడు యువత పోరు ర్యాలీ నిర్వహించనున్నాం. డిమాండ్లు పరిష్కరించకపోతో ఆందోళనలు ఉధృతం చేస్తాం. – మనోజ్రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు ● -
శ్మశానంలో పూడ్చనివ్వం..!
కుప్పం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రోజుకో ఆటవిక చర్య వెలుగు చూస్తూనే ఉంది. మొన్న శాంతిపురం మండలంలో ఎయిర్పోర్ట్ భూముల వ్యవహారంలో మహిళలను కొట్టడం, నిన్న కుప్పం మండలం నారాయణపురంలో భర్త అప్పు చెల్లించలేదని భార్యను చెట్టుకు కట్టేసి కొట్టడం, జరుగు పంచాయతీలో మగదిక్కు లేని మహిళను ఆస్తి తగాదాలో కట్టేసి కొట్టడం వంటి ఘటనలు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఈ పరంపరలో తాజాగా ఆదివారం మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందిన వ్యక్తిని గ్రామంలో అంత్యక్రియలకు అనుమతించకుండా అడ్డుకున్న వైనం విస్తుగొలుపుతోంది. వివరాల్లోకి వెళితే... కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన నాగరాజుకు శివానంద, మంజునాథ్, శివశంకర్ (35) అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. శివశంకర్ నెల రోజుల క్రితం డెంగీ జ్వరం బారిన పడ్డాడు. స్థానికంగా చూపించినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని సెంట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివశంకర్ శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబీకులు మృతదేహంతో గ్రామానికి బయలుదేరారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు.. మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చడానికి అనుమతించమని, సొంత పొలంలో ఖననం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. అంత్యక్రియల సమయంలో ఆచారాలు (క్రతువు) నిర్వహించే ఇతర సామాజిక వర్గాల వారిని అడ్డుకున్నారు. ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కనికరించ లేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఉదయం పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా అన్నారు. చివరకు డీఎస్పీ పార్థసారథి అక్కడికి చేరుకుని కేసు పెట్టాల్సి వస్తుందని మందలించడంతో వెనక్కు తగ్గారు. పోలీసు భద్రత మధ్య వారు శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
‘వ్యవసాయం దండగన్న చంద్రబాబు.. రైతులకు ఏం మేలు చేస్తాడు?’
సాక్షి, చిత్తూరు జిల్లా: వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతులకు ఏం మేలుచేస్తాడంటూ.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పుంగనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు నష్టపోయారన్నారు. తోతాపురి మామిడి కాయలు కిలో 2,3 రూపాయలు ధరలు ఉంటే రైతులు ఎలా బతకాలి? చంద్రబాబు చెప్పేటివి బూటకపు మాటలు’’ అంటూ మండిపడ్డారు.‘‘ఎన్నిసార్లు చంద్రబాబు సీఎం అయిన రైతులను పట్టించుకున్నది లేదు. వ్యవసాయం దండగ అని స్వయనా ఒక సీఎంగా ఉంటూ ఆయన మాట్లాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయి?. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా బాధాకరం. మన రాష్ట్రంలో దాదాపు 75 శాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. రైతులకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా నిలవాల్సిందిపోయి అందరి రైతుల ఉసురుతీస్తున్నారు’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వైఎస్ జగన్ వెళ్తుంటే.. వైఎస్సార్సీపీ నాయకులను వేధిస్తూ కేసులు పెడుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు ఈ ప్రభుత్వం గురిచేస్తోంది. మా ప్రభుత్వంలో రైతుల నుంచి టమోటా కొని రైతులను అదుకున్నాం. గతంలో రైతులు క్రాప్ హాలిడే అని పెట్టారు. ఇక నాలుగు సంవత్సరాలు రైతులు ఈ ప్రభుత్వంలో సెలవులో ఉండాల్సిందే. రైతులకు చేయూత ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. -
తిరుపతి: కారులో చెలరేగిన మంటలు.. దంపతులు మృతి
తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి రోడ్డు ప్రమాదంలో ఒక కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా రామాపురం పంచాయతీ కుప్పిగానిపల్లికి చెందిన సిద్దయ్య కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి చిత్తూరుకు వెళుతుండగా కారు చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్ద డివైడర్ను వేగంగా డీకొంది.ఈ ఘటనలో సిద్దయ్య (40), ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించగా చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రా‘నైట్’..రైట్రైట్!
చిత్తూరు అర్బన్: భూగర్భ గనులశాఖ (మైన్స్) పరిపాలన చిత్తూరు జిల్లాలో పూర్తిగా గాడి తప్పింది. సహజ ఖనిజాలను తవ్వుకున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్ (ఖనిజాల రాయల్టీ) రుసుములను వసూలు చేయాల్సిన గనులశాఖ చేతులు పైకెత్తేసింది. అధికార పారీ్టకి చెందిన నాయకులు గత ఐదు నెలలుగా ఫ్యాక్టరీల నుంచి దౌర్జన్యంగా సీనరేజ్ వసూలు చేసుకుంటుంటే వేడుక చూస్తోంది. కూటమి నేతలు వేసే బిస్కట్లకు ఆశపడ్డ కొందరు అధికారులు.. ప్రభుత్వ ఖజానాకు జమకావాల్సిన రూ.కోట్ల సొమ్మును నేతల జేబుల్లోకి మళ్లిం చేయడం విమర్శలకు తావిస్తోంది. రౌడీ మామూళ్లు చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో గ్రానైట్ ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. క్వారీల రూపంలో వీటిని దక్కించుకున్న వ్యక్తులు భూగర్భ గనులశాఖ పర్యవేక్షణలో గ్రానైట్ రాళ్లను తవి్వ, వాటిని ఫ్యాక్టరీల్లో కట్ చేయించి, పాలిష్ వేసి, ఆపై విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం చేయడానికి వ్యాపారులు క్యూబిక్ మీటరు గ్రానైట్కు వాటి రంగు ఆధారంగా స్లాబ్ పద్ధతుల్లో ప్రభుత్వానికి సీనరేజ్ రుసుములను చెల్లించాలి.రాఘవ కన్స్ట్రక్చన్స్ అనే కంపెనీ ఫ్యాక్టరీల నుంచి రుసుములు చెల్లించే కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీతో ఈ కంపెనీకి రుసుములు వసూలు చేసుకునే కాల పరిమితి ముగిసింది. ప్రైవేటు కంపెనీ స్థానంలో మైన్స్ శాఖ, ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను వ్యాపారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. కానీ గత ఐదు నెలలుగా రుసుముల వసూళ్ల నుంచి మైన్స్ అధికారులను పక్కకు తోసేసిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు.. ఫ్యాక్టరీల నుంచి నెల నెలా బెదిరించి, బలవంతంగా రౌడీ మామూళ్లు వసూలుచేసి వారి జేబుల్లో వేసుకుంటున్నారు. ఇష్టారాజ్యం కొందరు క్వారీ యజమానులు గ్రానైట్ ఖనిజాన్ని దోచుకుంటున్నారు. భారీ మొత్తంలో గ్రానైట్ వెలికితీసి, అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా రాత్రి 11 గంటలు దాటితే చిత్తూరు, కుప్పం, గంగాధరనెల్లూరు ప్రాంతాల నుంచి భారీ వాహనాల్లో గ్రానైట్ స్మగ్లింగ్ జరుగుతోంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. -
భృతి ఎగ్గొట్టారు
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులందరికీ మాయమాటలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగభృతి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచేసింది. మోసం చేయడం సబబుకాదు. – మున్నా, చిత్తూరు మోసం చేశారు 2014–2019 సంవత్సరాల్లో రూ.2వేలు నిరుద్యోగభృతి ఇస్తామని హామీనిచ్చారు. తూతూమంత్రంగా ఆ భృతిని కొందరికే ఇచ్చి మోసం చేశారు. ఈ సారి కూడా అలాగే మోసం చేస్తున్నారు. నిరుద్యోగులు కూటమి ప్రభుత్వం ఉచ్చులో పడి అల్లాడుతున్నారు. ఉద్యోగాలు ఏమైన ఇస్తార అంటే అది కూడ లేదు. – సంజయ్, చిత్తూరు -
ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంటు నిధులు మంజూరు చేయాలి. – మన్సూర్, పుంగనూరు ఇస్తారో.. ఇవ్వరో కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ట్ ఇస్తారో ఇవ్వరో కూడా తెలియడం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికం ఫీజు రీయింబర్స్మెంటు నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. ఇప్పుడు ఆ నిధుల గురించి ఎవరిని అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు. ఇలా చేస్తే ఎలా..? – రుషి, పలమనేరు -
ఇటు కోతలు.. అటు దాడులు!
నేలరాలుతున్న మామిడి సీజన్ ఆఖర్లోనైనా ధరలు పలుకుతాయేమోనని చాలామంది రైతులు తోటల్లోనే కాయలను వదిలేశారు. మాగిన కాయలు రాలి నేలపాలవుతున్నాయి. ఎంత ధర దక్కినా అమ్ముదామునుకొని కాయలు దింపిన రైతులు గుజ్జు ఫ్యాక్టరీల వద్దకెళితే టోకెన్లు దొరకడం లేదు. ఫ్యాక్టరీల వద్ద బండ్లు పెట్టుకొని వేచి చూడాల్సి వస్తోంది. దీంతో కొందరు రైతులు మార్కెట్కు తీసుకెళ్లిన మామిడి కాయలను చేలల్లో పారబోసి వచ్చేస్తున్నారు. మరికొందరు తోటల్లో కాయలు కోయకుండానే వదిలిపెట్టేస్తున్నారు. టమాటాలకంటే తోతాపురి మామిడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా మద్దతు ధర లేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సకాలంలో అన్లోడ్ చేసుకోక ట్రాక్టర్ల ట్రక్కుల్లోనే కాయలు కుళ్లిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. కొందరు కాయలను తోటల్లోనే వదిలేయడంతో అవి మాగి వాసన వెదజల్లుతున్నాయి. ఇదే అదునుగా ఏనుగుల మంద తోటలపై పడి ఉన్న కాయలను ఊడ్చేస్తుండడంతో మరిన్ని అవస్థలు పడాల్సి వస్తోంది. పలమనేరు: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏడాది మామిడి నట్టేన ముంచేసింది. తోతాపురి రైతులను కష్టాల్లోకి నెట్టేసింది. వీటికి ధరల్లేక గుజ్జు పరిశ్రమల్లో టోకెన్లు చిక్కక, స్థానిక మండీల్లో అడిగేవారు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. అధికారులేమో తోటల్లోని కాయలను పలు దఫాలుగా కోయాలని ఆంక్షలు పెడుతున్నారు. మరోవైపు తోటల్లోనే కాయలు మాగి నేలరాలుతున్నాయి. మాగిన మామిడి వాసనతో కౌండిన్య అడవిలోంచి ఏనుగుల గుంపు మామిడి తోటలపై పడి కాయలను ఆరగిస్తున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో మరీ ఘోరం... జిల్లాలో 87వేల ఎకరాల్లో మామిడితోటలున్నాయి. ఏటా ఈ సీజన్లో 7 లక్షల టన్నుల దాకా దిగుబడి ఉంటుంది. ఇందులో 45 వేల ఎకరాల్లో తోతాపురి రకమే ఉంది. మూడున్నర లక్షల టన్నుల దాకా తోతాపురి దిగుబడి ఉంటుంది. కాగా ఏనుగుల సంచారం ఉన్న పలమనేరు, కుప్పం, పుంగనూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో 40వేల ఎకరాల్లో మామిడి ఉండగా.. ఇందులో 22వేల ఎకరాలు తోతాపురి రకంగా ఉంది. వీటికి ధరల్లేక రైతులు తోటల్లోనే మామిడిని వదిలేశారు. ఇదే అదునుగా ఏనుగులు మామిడి తోటలనే టార్గెట్ చేస్తున్నాయి. పలమనేరు, బంగారుపాళెం, పెద్దపంజాణి, గంగవరం, సోమల, గుడిపాల తదితర మండలాలు కౌండిన్య అడవికి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవల ఏనుగుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా రెండు విధాలుగా మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. లోకల్ ర్యాంపుల్లో మొదలుకాని వ్యాపారం తోతాపురికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోనే ఏటా వ్యాపారులు ర్యాంపులు పెట్టి సరుకును కొనేవారు. దీంతో ఫ్యాక్టరీలకు వెళ్లే సరుకు తగ్గేది. ఈ దఫా ధరలు లేనందున బయటి వ్యాపారులు చాలా చోట్ల ర్యాంపుల వద్ద మామిడి కాయల వ్యాపారాలు మొదలు పెట్టలేదు. బంగారుపాళెం సమీపంలో మామిడిని చేలల్లో అన్లోడ్ చేస్తున్న రైతుఏనుగులు తినేస్తున్నాయి మాకు 2.5 ఎకరాల్లో మామిడితోట ఉంది. ఈ మధ్య రెండు సార్లు ఏనుగుల మంద తోటపై పడి కాయలను తిని, కొమ్మలను విరిచేశాయి. పోనీ కాయలు దించి అమ్ముదామంటే కిలో రూ.3 కూడా కొనేవారు లేరు. సంతవ్సరానికోపంట.. దీన్ని నమ్ముకుని బతికేటోళ్లం. అందుకే మామిడితోటే వద్దనుకుంటున్నాం. – నాగరత్మమ్మ, తిప్పిరెడ్డిపల్లి భారీగా నష్టపోయాం ఈ దఫా మామిడితోటలుకొని లక్షల్లో నష్టపోయాం. తోటకు కొట్టిన మందుల ఖ ర్చు, తోటమాలి డబ్బు కూడా మిగల్లేదు. పలమనేరులో ర్యాంపు లేదు. బంగారుపాళెంకు పోవాలంటే టన్నుకు ట్రాక్టర్ బాడుగ, కూలీలకే రూ.2,500 అవుతోంది. అక్కడ టన్నుకు దక్కేది రూ.3 వేలు. మాకు మిగిలేది రూ.500. – నయాజ్, మామిడితోటల కొనుగోలుదారు, పలమనేరు పలు దఫాలుగా కోతలు కోయాలి రైతులు తోటల్లోని కాయల ను మాగినవి మాత్రమే పలు దఫాలుగా కోయాలి. అప్పుడు సీజన్ ఆఖర్ దాకా కోతలుంటాయి. ఒకేసారి కాయలన్నీ దించేసి వాటిని అమ్ముకోలేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇంకా ర్యాంపులు ప్రారంభం కానిచోట్ల ర్యాంపులు ప్రారంభించే చర్యలు తీసుకుంటున్నాం. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి -
మామిడి రైతులకు న్యాయం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి నేలరాలుతోందని, న్యాయం చేయాలని మామిడి రైతులు, రైతు సంఘాల నాయకులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. శనివారం కలెక్టరేట్ వద్ద రైతు సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి న్యాయం చేయాలంటూ కూటమి ప్రభుత్వ అలసత్వ వైఖరిని ఎండగట్టారు. రైతు సంఘం నాయకులు జనార్ధన్ మాట్లాడుతూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మామిడి కిలో రూ.12 పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలోని అనేక ఫ్యాక్టరీలు ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. చాలా ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వాల్సింది పోయి రూ.5 ఇస్తున్నాయన్నారు. వారిని చూసి ర్యాంపుల నిర్వాహకులు రూ.3 ఇస్తున్నారని చెప్పారు. ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతుల ట్రాక్టర్లు రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఉందన్నారు. ప్రభుత్వం అందజేసే రూ.4 సబ్సిడీని రూ.6గా అందజేయాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ రూ.5 ఇచ్చేలా ప్రతిపాదనలు అనంతరం రైతు సంఘ నాయకులతో కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ చర్చలు జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా గుజ్జు పరిశ్రమల యజమానులు రూ.6 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సబ్సిడీ రూ.4కు బదులు రూ.5 ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ర్యాంపుల ఆగడాలను అరికడతామని హామీ ఇచ్చారు. జిల్లాలో నిబంధనలు పాటించని నాలుగు ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. ర్యాంప్లను సైతం క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. రైతు సంఘ నాయకులు రామానాయుడు, ఉమాపతి, మునీశ్వర్రెడ్డి, ఆనంద్నాయుడు, మునిరత్నం, హేమలత, భారతి, రాజేందర్రెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ● గిట్టుబాటు ధరపై కలెక్టరేట్ వద్ద ధర్నా ● రైతులతో కలెక్టర్ చర్చలు ● ప్రభుత్వ సబ్సిడీ పెంపునకు ప్రతిపాదనలు -
కాణిపాకం కిటకిట
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచి రాత్రి వరకు ఆలయంలో రద్దీ చోటుచేసుకుంది. క్యూలన్నీ కిక్కిరిసిపోయాయి. రాత్రి వరకు కూడా రద్దీ తగ్గలేదు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నేడు ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 1998, 2008 డీఎస్సీ (ఎంటీఎస్, మినిమం టైం స్కేల్) టీచర్లకు ఆదివారం బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంటీఎస్ టీచర్లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల సీనియారిటీ జాబితా సంబంధిత మండలాలకు పంపినట్లు చెప్పారు. ఆ జాబితా ప్రకారం ఆదివారం చిత్తూరులోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే కౌన్సెలింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. 2008 ఎంటీఎస్ టీచర్లకు ఉదయం 10 గంటలకు, 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. నేడు గురుకులాల్లో సీట్ల కేటాయింపు తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఆదివారం సీట్లు కేటాయించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి బాలికలకు చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు సమీపంలోని సంజయ్ గాంధీ కాలనీలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అలాగే బాలురకు చిత్తూరులోని వేము ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని పూతలపట్టు బాలుర గురుకుల పాఠశాలలో సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి హాజరు కావాలని ఆమె కోరారు. గిన్నిస్ రికార్డు కోసం గిరిజన పిల్లలకు కష్టాలా? చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ రికార్డు, ప్రధాని మోదీ మెప్పు కోసం గిరిజన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిన్నిస్ రికార్డు కోసం అనేక మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన హాస్టల్స్ నుంచి యోగాంధ్ర కార్యక్రమానికి అర్ధరాత్రి 2 గంటలకు బస్సులో తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విద్యార్థులు నిద్రించడానికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఇదే రీతిలో ప్రజాప్రతినిధుల పిల్లలను తరలిస్తారా..? అని ప్రశ్నించారు. వసతి గృహాల్లో ఉండే పిల్లలకు పౌష్టికహారం పెట్టడానికి, జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందించడం చేతకాదని, యోగాంధ్ర కార్యక్రమానికి మాత్రం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. భవిష్యత్లో ఇటువంటి చర్యలకు పాల్పడితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. -
గోసంరక్షణ ట్రస్టుకు విరాళం
కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకు శనివారం హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ 2,300 డాలర్లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఈవో పెంచలకిషోర్కు ఆ నగదును అందజేయగా.. ఆయన దాత కుంటుంబానికి ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. గుర్తుతెలియని వాహనం ఢీ : ఒకరికి తీవ్ర గాయాలు రొంపిచర్ల: గుర్తుతెలియ వివాహం ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారి, రొంపిచర్ల మండలం, పెట్రోల్ బంక్ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. తూర్పు దళిత వాడకు చెందిన వెంకటరమణ 42 బండికింద పల్లె పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వచ్చి ఢీకొంది. వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రొంపిచర్ల పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వెంకటరమణను చికిత్స నిమిత్తం అన్నమయ్య జిల్లా, పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్యూటీలో గుండెపోటుతో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్ చిత్తూరు అర్బన్: విధి నిర్వహణలో ఉంటూ గుండెపోటుతో మురళీకృష్ణ (61) అనే హెడ్ కానిస్టేబుల్ శనివారం మృతి చెందారు. చిత్తూరులోని గంగనపల్లికు చెందిన మురళీకృష్ణ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రికి 8.30 గంటల సమయంలో గుండె నొప్పి రావడంతో అక్కడే డ్యూటీలోనే ఇబ్బంది పడ్డారు. తోటి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. హెడ్కానిస్టేబుల్ మృతిపై ఎస్పీ మణికంఠ చందోలు ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. -
మాజీ ఎమ్మెల్యే సతీమణికి పరామర్శ
చిత్తూరు కార్పొరేషన్: పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజ అనా రోగ్యం కారణంగా చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీలో బంధువుల నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆమెను శనివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సతీమణి స్వర్ణలత, కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి పరామర్శించారు. యోగక్షేమాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పారు. తొలుత నగరంలోని దొడ్డిపల్లె సప్తకనికలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్కుమార్రెడ్డి, చుడా మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు శ్రీధర్రెడ్డి, ఆను, అన్బు, మురళీరెడ్డి, చక్రి, ప్రసన్న, మనోజ్రెడ్డి, శేఖర్, అల్తాఫ్, స్టాండ్లీ పాల్గొన్నారు. కళ్యాణ్పై పీడీ యాక్టు పలమనేరు: పట్టణంలోని మొండోళ్ల కాలనీకి చెందిన ఎం.కళ్యాణ్(30)పై పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్టు పలమనేరు డీఎస్పీ డేరంగుల ప్రభాకర్ శనివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసుతోపాటు మరో పది నేరాలు కళ్యాణ్పై ఉన్నాయన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పీడీ చట్టాన్ని నమోదు చేశామన్నారు. -
గ్రానైట్ రాయి పడి..
గుడిపాల: గ్రానైట్ రాయి పడి కాళ్లు నుజ్జునుజ్జు అయిన ఘటన గుడిపాల మండలంలో చోటుచేసుకుంది. గుడిపాల క్రాస్ సమీపంలో ఉన్న రాధిక గ్రానైట్లో అస్సాం రాష్ట్రానికి చెందిన రంజన్వల్లి(32) పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం గ్రానైట్ రాయిని కోసేందుకు మిషన్పై ఎక్కించి తోస్తుండగా అదుపుతప్పి రాయి కాళ్లపై పడింది. దీంతో అతని కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. 108 సిబ్బంది శివ అతన్ని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. -
హెడ్ కానిస్టేబుల్పై కేసు
పుత్తూరు: గత ఏడాది మే 13న జరిగిన అసెంబ్లీ, లోకసభ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న వివాదంపై కోర్టు ఆదేశాల మేరకు పుత్తూరు హెడ్ కానిస్టేబుల్పై శుక్రవారం రాత్రి పోలీసు కేసు నమోదైంది. సీఐ సురేంద్రనాయుడు కథనం మేరకు.. పుత్తూరు పట్టణానికి చెందిన కె.మురగారెడ్డి(59) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జి.మాధవ (హెచ్.సి.2727)పై పుత్తూరు జుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. మురగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో గత ఏడాది మే 13వ తేదీన తాను ఓటు వేయడానికి తిమ్మాపురంలోని పోలింగ్ బూత్ నం.40 వద్దకు వెళ్లిన సమయంలో మొబైల్ పార్టీ ఇన్చార్జ్ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మాధవ తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరిస్తూ, దౌర్జన్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులోని అంశాలు కేసు నమోదు చేయలేని (నాన్–కాగ్నిజబుల్) స్వభావం కలిగి ఉన్నందున స్థానిక జేఎఫ్సీఎం కోర్టు అనుమతితో ఏఎస్ఐ పొన్నుస్వామి కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును పుత్తూరు డీఎస్పీ ఆదేశాల మేరకు మరో స్టేసన్కు బదిలీ చేసే అవకాశం ఉంది. -
వేతనాలు పెంచాలని నిరసన
చిత్తూరు అర్బన్: మున్సిపల్ ఇంజినీరింగ్, కార్మికులు జీతాలు పెంచాలని మున్సిపల్ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి రామమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధ్యక్షుడు యం.శరవణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్ రూ.29,200, సెమీ స్కిల్డ్ రూ.24,600 చెల్లించాలన్నారు. మినిమం టైం స్కేల్, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కు పెంచాలన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ కింద కార్మికులకు గ్రాట్యూటీ రూ.10 లక్షలు మంజూరు చేస్తూ.. కార్మికునికి నెలకు పింఛను రూ.10000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిఅసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శరవణ, ప్రధాన కార్యదర్శి డీ.శివకుమార్, కోశాధికారి శివప్రసాద్, గౌరవ సలహాదారు పీ.వెంకటేష్, ఉపాధ్యక్షుడు ఎం.హరికృష్ణ, ఎన్.వెంకటేష్, జాయింట్ సెక్రెటరీ టీ.గోపాలాచారి, ఏ.ఉషా యూనియన్ సభ్యులు కే.వీ.సునీల్కుమార్, డీఎపీ.శంకర్, ఎస్.పీరుల్లా, ఎం.వేలు, కే.సుజాత పాల్గొన్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రతి రోజూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో యోగాంధ్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలోని పులిగుండు, బోయకొండ, కంగుంది, కాణిపాకం, బోయకొండలో యోగా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన గుర్తుచేశారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం వల్ల అనారోగ్యం నుంచి బయటపడొచ్చన్నారు. అనంతరం యోగా ట్రైనర్స్ ఉన్న విశాల్, రెడ్డిమస్తాన్, రాధిక, సునీత, ప్రేమ్సాయి, శ్రీనివాస్, బాబుకు మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్మన్ హేమలత, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జిల్లా అటవీశాఖ అధికారి భరణి, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, టూరిజం అధికారి గౌరీ, అర్బన్ తహసీల్దార్ కులశేఖర్ పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ -
పేరుకుపోయిన ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు
● అప్పు చేసి చదువుకుంటున్న పేద విద్యార్థులు ● బకాయిలు విడుదల చేయకుండా మొండికేస్తున్న కూటమి నేతలు ● ఏడాదిగా భృతి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ● రేపు కలెక్టరేట్ ఎదుట యువత పోరుకు వైఎస్సార్సీపీ సన్నద్ధం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ కళాశాలల్లో 2,30,456 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు 90 వేల మందికి పైగా ఉన్నారు. ఉన్నత చదువులు చదివి అరకొర జీతంపై ఆధారపడి స్థానికంగా, ఇతర రాష్టాలకు వెళ్లి వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. వీరిలో ఎంతోమంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. హామీలిచ్చి..తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలతో పాటు 147 హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఏడాదిగా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అటకెక్కించింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని ప్రకటించి చేతులు పైకెత్తేసింది. ఏటా 20 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా.. ఎన్నో హామీలను తుంగలో తొక్కేసింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,85,458 మంది నిరుద్యోగులు భృతికోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. 2014లో ఇదే తరహా మోసం 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 600కు పైగా హామీలిచ్చి గద్దెనెక్కారు. ఆపై ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. జాబు రావాలంటే..బాబు రావాలి.. అంటూ ఊదరగొట్టారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కపట ప్రేమ కురిపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు యువనేస్తం పేరుతో ముందుకొచ్చి సవాలక్ష ఆంక్షలు విధించారు. భృతిని రూ.వెయ్యికి కుదించేశారు. అప్పట్లో చిత్తూరు జిల్లాలో లక్షకు పైగా నిరుద్యోగులు ఉండగా ప్రభుత్వం విధించిన నిబంధనలతో పథకానికి 12 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. ఊసేలేని ఫీజు రీయింబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. విద్యాదీవెన, వసతిదీవెన నిధుల కోసం విద్యార్థులు ఏడాదిగా ఎదురుచూడాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ పాలనలో త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ‘నేను మారాను.. మిమ్మల్ని మారుస్తాను. నన్ను నమ్మండి. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి ఇస్తాం. ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఫీజురీయింబర్స్మెంట్తో ఉన్నత విద్యకు బాటలు వేస్తాం. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం. పేద విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తాం’ అంటూ గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించారు. బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారంటీ అంటూ యువతరాన్ని బుట్టలో వేసుకున్నారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలన్నీ అటకెక్కించేసి నిరుద్యోగులను రోడ్డున పడేశారు. ఫీజురీయింబర్స్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధమైంది. సోమవారం కలెక్టరేట్ ఎదుట యువతపోరుకు సన్నద్ధమవుతోంది. యువతపోరుపై ‘సాక్షి’ గ్రౌండ్రిపోర్ట్..జిల్లా సమాచారం డిగ్రీ కళాశాలలు 116 ఇంజినీరింగ్ కళాశాలలు 14 ఐటీఐ కళాశాలలు 18 నర్సింగ్ కళాశాలలు 07 పాలిటెక్నిక్ కళాశాలలు 08 మెడికల్ 02 బీఈడీ 07 ఎంబీఏ, ఎంసీఏ 11 మొత్తం కళాశాలలు 183 ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు నియోజకవర్గం విద్యార్థులు పెండింగ్ మొత్తం (రూ.కోట్లల్లో) చిత్తూరు 2,517 4,82,02,359 నగరి 3,444 6,20,96,235 పుంగనూరు 4,694 8,76,63,867 పూతలపట్టు 3,006 6,28,15,905 పలమనేరు 4,252 6,99,16,920 కుప్పం 3,049 5,04,42,063 గంగాధరనెల్లూరు 3,187 6,64,84,512 మొత్తం 24,149 44,76,21,861 భృతి ఇవ్వాల్సిందే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి యువత, విద్యార్థులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలి. – మనోజ్రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు వలసలే గతి జాబ్ క్యాలెండర్ లేక, నిరుద్యోగ భృతి అందక ఉన్నత చదువులు చదివిన యువతీయువకులు వలసబాట పడుతున్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, తదితర చదువులు చదివిన యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేట్ రంగాలవైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె తదితర నగరాల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వందలాది మంది నిరుద్యోగులు స్థానికంగానే చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలకు వయస్సు దాటి పోతుండడంతో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. రేపు కలెక్టరేట్ వద్ద యువత పోరు పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, జాబ్క్యాలెండర్ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరుద్యోగుల పక్షాన యువత పోరుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు అమూల్ డెయిరీ వద్ద విద్యార్థులు, యువతతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి యువత, ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు సిద్ధమవుతున్నారు. -
మరో నాలుగేళ్లు రైతులకు ఇబ్బందులు తప్పవు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ముందుకు రావడం లేదన్నారు.వైఎస్ జగన్ పాలనలో మామిడి రైతులకు మేలు జరిగింది. గత మూడేళ్లుగా కిలో మామిడి సరాసరి రూ.25 రూపాయలకు అమ్మకం చేశారు. గత ఏడాది కిలో మామిడి 27 రూపాయలుపైనే అమ్మకం చేశారు. కూటమి ప్రభుత్వం పాలనలో కిలో మూడు రూపాయలకు అమ్మకం చేద్దామన్న కొనుగోలు చేయని దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి.. ఈరోజు రైతులకు ఏవిధం మేలు చేస్తాడు. రాష్ట్రంలో మామిడి, మిర్చి, పొగాకు, టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. మరో నాలుగేళ్లు రైతులకు ఈ పాలనలో ఇబ్బందులు తప్పవు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం: మిథున్రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం జరుగుతోందని.. మామిడి, పాలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మామిడి రైతులు కిలో రూ.3 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమూల్ పాల డైరీ దెబ్బతీసి లీటర్ పాలకు 4-5 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వైఎస్ జగన్ రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజలు పక్షాన పోరాటం కొనసాగిస్తాం’’ అని మిథున్రెడ్డి చెప్పారు. -
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
నిండ్ర: అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. మండలంలోని శ్రీరామపురం పంచాయతీ శ్రీరామాపురం గ్రామానికి చెందిన యవరైతు హేమాద్రి(29) భార్య దీప, కుమారుడు ఉన్నాడు. తనకున్న పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో కొంత వరకు బ్యాంక్లోను, ఇతరుల వద్ద అప్పు చేశాడు. ఇలా సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. రుణదాతల ఒత్తిళ్లు భరించలేక బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం హేమాద్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐజర్ ఇన్చార్జి రిజిస్ట్రార్గా కోహ్లీ ఏర్పేడు : మండలంలోని జంగాలపల్లి సమీపంలో ఉన్న తిరుపతి ఐజర్ ఇన్చార్జి రిజిస్ట్రార్గా ఇంద్రప్రీత్సింగ్ కోహ్లీ నియమితులయ్యారు. విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోని ఐజర్లో ప్రొఫెసర్గా పని చేస్తున్న ఆయనను ఇన్చార్జి రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఐజర్ పాలనా చట్రాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. బైక్పై నుంచి జారిపడి మహిళ మృతి చౌడేపల్లె: బైక్పై నుంచి జారిపడి మహిళ మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం... చారాల పంచాయతీ, జంగాలపల్లెకు చెందిన రాజమ్మ(65) చౌడేపల్లెకు వచ్చింది. ఆమె సమీప బంధువైన శ్రీరాములుతో కలిసి బైక్ పై స్వగ్రామానికి వెళ్తుండగా పలమనేరు మార్గంలోని చిట్రెడ్డిపల్లె సమీపంలోని డౌన్లో కుక్క ఎదురుగా రావడంతో బైక్ అదుపుతప్పింది. ఈ క్రమంలో బైక్పై నుంచి రాజమ్మ జారిపడింది. వెంటనే ఆమెను మదనపల్లెలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు దర్యాప్తులో ఉంది. -
బండి దొరక్క బేజారు!
● జిల్లాలో ట్రాక్టర్లకు భలే డిమాండ్ ● మామిడికాయల ఎఫెక్ట్తో ట్రాక్టర్ల కొరత ● మామిడి కాయల తరలింపునకు రాని లారీలు కాణిపాకం: మామిడి రైతులు ఆలస్యంగా వచ్చిన పూతతో పులకరించిపోయారు. కాయలొచ్చాక మీసం తిప్పారు. కోత కొచ్చాక కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాయలు అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. టోకన్ల కోసం తొక్కిసలాట, తోపులాటలో నలిగిపోయారు. టోకన్లు చేతికొచ్చాక కోత కోసి తీసుకెళితే ఫ్యాక్టరీ వద్ద పడిగావులు కాస్తున్నాయి. ట్రాక్టర్ చార్జీలు, వెయిటింగ్ చార్జీలు, డ్రైవర్ కూలీలు పట్టిపీడిస్తున్నాయి. దీనికితోడు లారీలు మామిడి కాయల తరలింపునకు పంపలేమంటూ ఓనర్లు మొండికేస్తున్నారు. దీంతో ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగింది. నిరీక్షిస్తూ.. నీరసిస్తూ! జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి వేగంగా మామిడి కోతలు ప్రారంభయ్యాయి. అష్టకష్టాలు పడి టోకన్లు సంపాధించిన రైతులు వారికి ఇచ్చిన తేదీ ప్రకారం కాయలు కోసి ట్రాక్టర్లలో ఫ్యాక్టరీలకు తీసుకెళుతున్నారు. అయితే అక్కడ రైతులు అనుభవిస్తున్న కష్టాలు అన్నీఇన్నీకావు. కాయలు అన్లోడింగ్కు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఫ్యాక్టరీల్లో సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వడంతో సామాన్య రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో ఫ్యాక్టరీ వద్ద 200 నుంచి 800 ట్రాక్టర్లు నిరీక్షిస్తున్నాయి. ఒక్కలోడయ్యా..రావయ్యా! ట్రాక్టర్లన్నీ కూడా ఫ్యాక్టరీల వద్దే నిలబడి పోయాయి. రోజులు తరబడి అక్కడే ఉండిపోతున్నాయి. ముందుకు..వెనక్కు వెళ్లడం తప్ప ఫ్యాక్టరీలో కాయలు దింపాలంటే ఐదు రోజుల సమయం పడుతోంది. ట్రాక్టర్ యజమానులకు వారి..వారి గిరాకీలే సరిపోతున్నాయి. కొంతమంది సొంత పంటను తరలించుకునేందుకు పరిమితం చేశారు. మిగిలిన ట్రాక్టర్లు బాడుగలకు పంపుతున్నారు. ఈ బండ్లు చాలక రైతులు అల్లాడి పోతున్నారు. ఫ్యాక్టరీలో లోడ్ దింపిన బండ్లు అట్టే బుక్ అవుతున్నాయి. చాలా మంది రైతులు టోకన్లు ఉన్నా ట్రాక్టర్లు దోరకక కోతలు కోయలేకపోతున్నారు. ఒక్క లోడే రండి అని బతిమిలాడుకున్నా ట్రాక్టర్ల యజమానులు ఖాతరు చేయడం లేదు. తడిసిమోపుడవుతున్న ట్రాక్టర్ బాడుగలు ఈసారి మామిడి రైతులకు దిగుబడి బాగున్నా...అందుకు తగ్గ ప్రతిఫలం లేదు. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోగా..చేతిలోని పైసలు ఖాళీ అవుతున్నాయి. కోత కూలీలు రైతులకు చెమటలు పట్టిస్తున్నాయి. దీనికితోడు ట్రాక్టర్ బాడుగలు భారమయ్యాయి. కి.మీను బట్టి రూ.1000 నుంచి రూ.2000 వరకు ట్రాక్టర్ బాడుగలు అడుగుతున్నారు. మళ్లీ వెయిటింగ్ చార్జీ రోజుకు రూ.500 నుంచి రూ.1000 ఫిక్స్ చేస్తున్నారు. డ్రైవర్ కూలీ రూ.500, కొంత మంది డ్రైవర్లకు రాత్రి అయితే లిక్కర్ బాటిల్ కూడా ఇవ్వాల్సి ఉంది. లారీలు రావు మామిడి తరలింపునకు లారీలు రానంటూ మొండికేస్తున్నాయి. జిల్లా రవాణా శాఖ అధికారులు లారీ యజమానులతో మాట్లాడినా ఫలితం లేకపోతోంది. కాయలకు వెళితే లారీలకు గిట్టబాటు కాదని సమాచారం. అలాగే తమిళనాడు లారీలను కూడా జిల్లాలోకి అనుమతించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాక్టర్లను సమకూర్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ట్రాక్టర్ దొరకడం లేదు ట్రాక్టర్ కోసం రెండు రోజులుగా తిరుగుతున్నా. ట్రాక్టర్లు దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను శనివారానికి ఫ్యాక్టరీకి తోలేలా టోకన్ ఇచ్చారు. ఇప్పుడు టోకన్ ఉంది కానీ ట్రాక్టర్ దొరకడం లేదు. కోతకోయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. – బాలాజీ, అనుపల్లి, చిత్తూరు -
సిఫారసులు అనుమతించొద్దు
కార్వేటినగరం: మామిడి కాయల రవాణాలో ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ సుమిత్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అన్నూరు వద్ద ఉన్న ఏబీసీ జ్యూస్ కర్మాగారాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మామిడి రవాణాలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాయలను దిగుమతి చేసుకోవాలని, మామిడి కొనుగోళ్లలో సిఫార్సులకు తావు లేకుండా చూడాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ నాగరాజు, సీఐ హనుమంతప్ప, వ్యవసాయశాఖ అధికారిణి హేమలత, ఏబీసీ జ్యూస్ పరిశ్రమ మేనేజర్ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరాజు, యుగంధర్ ఉన్నారు. రిక్వెస్ట్, మ్యూచువల్కే అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సమగ్రశిక్ష శాఖ పరిధిలో నిర్వహిస్తున్న బదిలీల్లో రిక్వెస్ట్, మ్యూచువల్కు మాత్రమే అవకాశం ఉన్నట్లు జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ మొదలైందన్నారు. జిల్లాలోని కేజీబీవీల్లోని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, మండల స్థాయిలో పనిచేస్తున్న ఐఈఆర్పీ, పీటీ, సీఆర్ఎంటీలు, అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, సైట్ ఇంజిర్లకు బదిలీలు నిర్వహిస్తామన్నారు. బదిలీలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 21న చివరి తేదీ అని తెలిపారు. అభ్యర్థుల స్టేషన్ సీనియారిటీ, స్పెషల్ సర్వీస్, సీనియారిటీ పాయింట్లను ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లాలనుకునేవారు దరఖాస్తులను రాష్ట్ర కార్యలయానికి పంపించాల్సి ఉంటుందని ఏపీసీ వెల్లడించారు. -
నవోదయ ఫలితాల్లో విశ్వం ప్రభంజనం
తిరుపతి ఎడ్యుకేషన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన 2వ జాబితా ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అర్హత సాధించి ప్రభంజనం సృష్టించినట్లు తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.హృతిక్ రాయల్, సలాడీ భువనేష్, ఎం.నిహాంత్ కుమార్, డి.మహిదర్తో పాటు మొత్తం 54 మంది విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో సీట్లు సాధించారని తెలిపారు. గత 35 ఏళ్లుగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్స్ తదితర పోటీ పరీక్షలకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. దీంతో తమ విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశం సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఆ విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, కరస్పాండెంట్ ఎన్.తులసీ విశ్వనాథ్ అభినందించారు. వచ్చే ఏడాదికి నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
విలీనం మా కొద్దు
బైరెడ్డిపల్లె: ‘విలీనం మాకొద్దు. మా గ్రామంలోనే పాఠశాలను పునరుద్ధరించాలి. ఇతర గ్రామాలకు మా విద్యార్థులను పంపించేది లేదు’ అని బైరెడ్డిపల్లె సచివాలయ పరిధిలోని మిట్టపల్లె గ్రామస్తులు తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం పలమనేరు–కుప్పం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లితండ్రులు మాట్లాడుతూ తమ గ్రామంలో 36 మంది విద్యార్థులు ఉన్నారని, అందులో 3, 4, 5 తరగతుల విద్యార్థులను పక్క గ్రామమైన నాగిరెడ్డిపల్లె పాఠశాలలో విలీనం చేశారని చెప్పారు. పక్క గ్రామానికి వెళ్లే టప్పుడు వ్యవసాయ పొలాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉన్నతాదికారులు స్పందించి తమ గ్రామంలోనే పాఠశాలను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న బైరెడ్డిపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల తల్లితండ్రులతో సంప్రదించారు. సుమారు అర్ధగంటపాటు ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుక్కలతో తీవ్ర ఇబ్బందులు మండలంలోని ఆకులకొత్తూరు గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులను చలగానిపల్లెలో విలీనం చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు ఎంఈఓ సుబ్రమణ్యంకు ఫిర్యాదు చేశారు. గురువారం విద్యార్థులు పాఠశాల నుంచి తమ గ్రామానికి వస్తుండగా కుక్కల బెడదతో భయాందోళనకు గురయ్యారని వాపోయారు. పిల్లల భవిషత్తును దృష్టిలో పెట్టుకొని విలీనం ఆపాలని కోరారు. -
రోడ్డున పడ్డ మామిడి!
● టన్నుల కొద్దీ రోడ్డుపైనే ● అయోమయంలో అన్నదాతలు కాణిపాకం: మామిడి రోడ్డున పడింది. టన్నుల కొద్దీ తోతాపురి రోడ్డుకే అంకితమవుతోంది. ఫ్యాక్టరీలో అన్లోడింగ్ కష్టాలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 90శాతం కాయలు పక్వానికి వచ్చేశాయి. ఇకపై కోతలు ఇబ్బముబ్బడిగా ప్రారంభం కానున్నాయి. ఫ్యాక్టరీలు గుజ్జు తయారీ విషయంలో తప్పుడు లెక్కలు చూపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీనికితోడు విదేశాల్లో యుద్ధాలు ఫ్యాక్టరీలను భయపెడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 56 హెక్టార్ల మేర మామిడి పంట సాగవుతోంది. తద్వారా 6.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చని అధికారుల అంచనా. ఇందులో టేబుల్ రకాలు 16,105 హెక్టార్లకు గాను 1,45,960 మెట్రిక్ టన్నులు, తోతాపురి 39,895 హెక్టార్లకు 4.9 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్టు ఈసారి పంట దిగుబడి వచ్చింది. అయితే పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు విలవిల్లాడిపోతున్నారు. గత ఏడాది నిల్వలతో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 పళ్లగుజ్జు పరిశ్రమలున్నాయి. చిత్తూరు జిల్లాలో మాత్రం 35 ఫ్యాక్టరీలున్నాయి. వీటిలో 12 ఫ్యాక్టరీలు మామిడి గుజ్జు తయారీకి దూరమయ్యాయి. ఇందులో కొన్ని టమాటా వంటి వాటిని గుజ్జు చేసి అమ్ముకుంటున్నాయి. గత ఏడాది యూరఫ్ దేశాల్లో జరిగిన యుద్ధాల ప్రభావం వల్ల ఫ్రిబవరి వరకు 2.5 లక్షలక్ష టన్నుల గుజ్జు నిల్వలు పేరుకుపోయాయి. ఆ తర్వాత కొద్దికొద్దిగా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం 80 వేల టన్నుల వరకు నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఈ భయంతో ఫ్యాక్టరీలు మామిడిపై చిన్న చూపుచూస్తున్నాయి. ఈ ఏడాది అధికారులు బలవంతం చేయడంతో 23 ఫ్యాక్టరీలు తోతాపురి కాయలు కొనుగోలు చేస్తున్నాయి. గుజ్జు తయారీ ఎక్కువ.. లెక్కలు తక్కువ ఉమ్మడి జిల్లాలోని 43 ఫ్యాక్టరీలో 90 లైన్ (మామిడిగుజ్జు తయారీకి అవసరమైన యంత్రపరికరాలు)లు ఉన్నాయి. చిత్తూరులో జిల్లా విషయానికి వస్తే 35 పళ్లగుజ్జు పరిశ్రమలుంటే అందులో 60 లైన్లు ఉన్నాయి. వీటిలో 23 ఫ్యాక్టరీలకు గాను 54 లైన్లు పనిచేస్తున్నాయి. ఒక లైన్లో రోజుకూ 10 టన్నుల కాయల వరకు గుజ్జు తయారీ చేయొచ్చు. కానీ లైన్ క్లీనింగ్ కారణంగా 6 నుంచి 8 టన్నుల కాయల వరకు గుజ్జు చేస్తున్నాయి. ఇలా రోజువారీగా ఒక్కో ఫ్యాక్టరీ 200 నుంచి 250 టన్నుల కాయలను గుజ్జు తయారీ చేస్తున్నాయి. ఈ లెక్కన్న మొత్తం ఫ్యాక్టరీలు 10 వేల నుంచి 11వేల టన్నుల కాయల వరకు గుజ్జు తయారీకి వాడుతున్నాయి. తద్వారా గుజ్జు రూపంలో 5 నుంచి 6 టన్నులకు ఫ్యాకింగ్ అవుతున్నాయి. అయితే అధికారులు వద్ద ఉన్న లెక్కలకు, ఫ్యాక్టరీ నిర్వాహకులు చెప్పే లెక్కలకు పొంతన ఉండడం లేదు. తమిళనాడు నుంచి వస్తున్న కాయలకు ఫ్యాక్టరీలు ఈ లెక్కల్లోకి ఎక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిల్వలు, గుజ్జు తయారీని అధికంగా చూపించి తోతాపురి కొనుగోలును నిలుపుదల చేయాలని ఫ్యాక్టరీ నిర్వాహకులు సిద్ధమైనట్టు రైతులు చెబుతున్నారు. యుద్ధాలతో మళ్లీ వణుకు జిల్లాలో తయారైన పళ్లగుజ్జును గల్ఫ్, యూరఫ్ దేశాలకు అధికంగా ఎగుమతి చేస్తారు. అయితే ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధాలు, ఉక్రెన్–రష్యా యుద్ధాలు పళ్లగుజ్జు పరిశ్రమదారులను గడగడలాడిస్తున్నాయి. ఈ భయంతో మధ్యలో కూడా తోతాపురి గుజ్జును నిలుపుదల చేసే అవకాశాలున్నాయని పరిశ్రమదారుల చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో తోతాపురి అమ్మకాలు మూగబోయే అవకాశాలున్నాయి. తద్వారా 60శాతం పంట తోటలకు పరిమతం కానున్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా ఇక్కడే ఉన్నాం కాయలు తెచ్చి మూడు రోజులు అవుతా ఉండాది. ఈ మూడు రోజులు తిండీలేదు.. ఏమీలేదు. తిండి లేకపోయిన పర్వాలేదు. కాయలు దింపుకుంటే చాలు. కానీ ఇంత వరకు దింపుకోలేదు. ఈడ నుంచి ఆడ వరకు 800ట్రాక్టర్లు బారులు తీరాయి. ఇంకో రోజు ఉంటే బండిలో ఉండే కాయలు దేనికీ పనికి రావు. ఈసారి నిండా మునిగిపోయాం. మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి స్వామీ. – సుందరయ్య, చిత్తూరు మండలం దమ్మిడీకి పనికిరావ్ మూడు రోజులు, నాలుగు రోజులు ట్రాక్టర్లోనే కాయలుంటే ఎందుకూ పనికిరావు. ఫ్యాక్టరీకి పనికి రావు. రోడ్డు మీద పారేసి రావాల్సిందే. ఫ్యాక్టరీ వద్ద అవస్థలు పడుతున్నాం. బండికి రాత్రంతా కాపాల కాస్తున్నాం. ఇలా అయితే రైతులు ఏమైపోవాలి. ఫ్యాక్టరీ వాళ్లు మాత్రం వాళ్ల సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో పక్క యుద్ధాలు అని చెబుతున్నారు. దాని వల్ల మాకు నష్టమే అంటున్నారు. – కిరణ్కుమార్, పెనుమూరు 41,005 టన్నులు మాత్రమే ఫ్యాక్టరీకి ఈ నెల 6వ తేదీ నుంచి కాయలు కొనుగోలు చేయగా.. అధికారుల వద్ద 8వ తేదీ నుంచి కాయలు కొనుగోలు వివరాలున్నాయి. ఫ్యాక్టరీ నిర్వాహకులు 12 వేలకు పైగా టోకన్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే 5,993 మంది రైతులు 41,005 టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు చేరినట్లు వారి వద్ద గణాంకాలున్నాయి. రోడ్డుపైనే గత మూడు రోజులుగా 80 వేల టన్నుల వరకు ట్రాక్టర్లల్లోనే మూలుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. జీడీ నెల్లూరు మండలం ఎట్టేరిలోని ఫ్యాక్టరీ వద్ద 800 ట్రాక్టర్లు బారులు తీరగా.. 4వేల టన్నుల కాయలు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి. గుడిపాలలోని పానటూరు వద్ద ఉన్న మ్యాంగో ఫ్యాక్టరీ వద్ద 650పైగా ట్రాక్టర్లు, లారీలు క్యూకట్టాయి. ఇందులో 3,800 టన్నుల మేర ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. అలాగే గుడిపాల మండలంలోని కొత్తపల్లి సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద 850 ట్రాక్టర్లు, లారీల్లో 5 వేల టన్నుల కాయలు రోడ్డుపైనే కాపలాకాస్తున్నాయి. మరిన్ని ఫ్యాక్టరీల వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. -
ప్రతిశాఖలోనూ మహిళా కమిటీలు
– రెండో రోజు కలెక్టరేట్లో మహిళా కమిషన్ సమీక్ష తిరుపతి అర్బన్ : ప్రతి శాఖలోనూ అంతర్గత మహిళా కమిటీలను ఏర్పాటు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ ఆదేశించారు. రెండో రోజు శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలసి అధికారులతో సమీక్షించారు. ప్రాథమిక దశలోనే శాఖల సమన్వయంతో పనిచేస్తే మహిళా సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పని చేసే ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించాలంటే ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లుకు సంబంధించిన యాక్ట్ను పటిష్టం చేయాలన్నారు. మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యకు జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తుందని తెలిపారు. మహిళలపై నేరాలు ఎక్కువ కావడానికి కారణం సరైన అవగాహన లేకపోవడం, భద్రత కలిగించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. మరోవైపు రాష్ట్రాలలో బాల్య వివాహాలు జరగడంతో యుక్త వయసులోనే గర్భం దాల్చడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేసి అరికట్టే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. జాతీయ మహిళా కమిషన్ సూచనలు క్రమం తప్పకుండా పాటించి లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో జిల్లాలో మహిళల పై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా కృషి చేస్తామని తెలిపారు. మహిళల్లో ఆర్థిక సాధికారత సాధించినప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జిల్లాలో బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయం నుంచి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీస్ అందుబాటులో ఉంటారని తెలిపారు. వీరందరూ కూడా మహిళలపై జరుగుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్పీ హర్షవర్ధన్రాజు మాట్లాడుతూ.. జాతీయ మహిళా కమిషన్ సూచనల మేరకు జిల్లాలోని మహిళలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ మెంబర్ రోఖాయా బేగం, మహిళా పోలీస్ డిఎస్పి శ్రీలత, కృష్ణకుమారి జాయింట్ డైరెక్టర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వసంత భాయి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
23న యువత పోరు
● వాల్పోస్టర్ విడుదల చేసిన విజయానందరెడ్డి ● అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చిత్తూరు కార్పొరేషన్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘యువతపోరు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో యువతపోరు వాల్పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు చిత్తూరులోని అమూల్ డెయిరీ వద్ద విద్యార్థులు, యువతతో కలిసి ర్యాలీగా బయలుదేరుతామన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేసి, సమస్యల పై కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. అస్తవ్యస్తంగా చదువులు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వాపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన పథకాల ఉసేలేవన్నారు. పేద కుటుంబాల్లో పిల్లలు చదవులు అగమ్యగోచరంగా మారినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా ఫీజులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.18,663 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించిందన్నారు. పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ నిర్వహణ ఖర్చుల కింద రూ.7,800 కోట్లు చెల్లించినట్టు గుర్తుచేశారు. కాగా కూటమి ప్రభుత్వం ఫీజుల కింద రూ.700 కోట్లు ఇచ్చామని చెబుతున్నా ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఈ విద్యా సంవత్సరం రూ.3,900 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. జాబ్క్యాలెండర్ ఎక్కడ? చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనోజ్రెడ్డి మాట్లాడుతూ మీకు రూ.15వేలు... అంటూ ఉకదంపుడు ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు రూ.13వేలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అదేఽ విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేతులు పైకెత్తేశారని ఎద్దేవా చేశారు. డీఎస్సీ నోటీఫికేషన్ ఇచ్చినా నిబంధనల పేరుతో అభ్యర్థులకు నష్టం కలిగించారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులను తొలగించారని తెలిపారు. భృతి ద్వారా అందాల్సిన వేలకోట్లు నిరుద్యోగులు నష్టపోయారన్నారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ.శ్రీధర్, చిత్తూరు రూరల్ యువత అధ్యక్షుడు స్లాండ్లీ, జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ సద్దాం, నాయకులు రెడ్డిసాయి, శబరీష్, హితీష్, ప్రవీన్, తరుణ్, సచిన్ పాల్గొన్నారు. -
పుత్తూరు సిద్ధార్థలో గ్రాడ్యుయేషన్ డే
నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సుదర్శనరావు, వోల్వా గ్రూప్ రిటైర్డ్ డైరెక్టర్ ఇందు శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పాస్ అవుట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మెడల్స్ను, పట్టాలు అందజేశారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన కాన్వొకేషన్ డే సమావేశంలో కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించడానికి సిద్ధార్థ గ్రూప్ కళాశాలలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ స్థాయి ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, ఇంకుబేషన్ సెంటర్లను అభివృద్ధి చేశామని అన్నారు. విద్యా ప్రమాణాలు, నాణ్యతలో రాజీ పడకుండా విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. వైస్ చాన్స్లర్ సుదర్శనరావు మాట్లాడుతూ తోటి వారితో పోటీ పడి సృజనాత్మక, ఇన్నోవేటివ్ విద్యపై శ్రద్ద చూపాలన్నారు. యువ ఇంజినీర్లు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 903 మంది, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 485 మందికి డిగ్రీ కాన్వొకేషన్లు అందజేశారు. 2024–25లో విద్యా సంవత్సరానికి సంబందించి 17 మంది విద్యార్థులకు గోల్డ్ మెడళ్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నామినీస్ ప్రశాంతి, అరుణక్రాంతి, ప్రిన్సిపాల్ మధు, జనార్ధనరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ విజయభాస్కర్, గోపి, హెచ్వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
Kuppam: మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి,గుంటూరు: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్.హెచ్.ఆర్.సీ. సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్,డీజీపీని ఆదేశించించింది.తన భర్త చేసిన అప్పులు తీర్చలేదని నారాయణపురంలో మహిళను టీడీపీ కార్యకర్త, కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేశారు. ఈ అమానవీయ ఘటనను సాక్షిటీవీ వెలుగులోకి తెచ్చింది. నేషనల్ మీడియా సైతం వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. A video from #Kuppam surfaced where a woman was tied to tree after her husband failed to repay loan of 80,000. Police had registered a case & accused taken in custody.#AndhraPradesh CM @ncbn orders strict action against those who attacked the woman. pic.twitter.com/D3nID4char— Aneri Shah Yakkati (@tweet_aneri) June 17, 2025‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను’‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే. మేం బాగా బతికినోళ్లమే‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే. మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది.నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు.వికలాంగ పెన్షన్ను కాజేశారుమా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించారు. -
గౌరవం లేనప్పుడు.. కుర్చీలెందుకు?
నగరి: ప్రజా ప్రతినిధులైన తమను అడుగడుగునా అధికారులు అవమానపరుస్తున్నారని, గౌరవం లేనపుడు సర్వసభ్య సమావేశంలో కుర్చీలపై ఎందుకు కూర్చోవాలంటూ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కో–ఆప్షన్ సభ్యులు నేలపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక వెలుగు కార్యలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులు నేలపై కూర్చోవడంతో విస్తుపోయిన అధికారులు అలాగే నిలబడ్డారు. ఎంపీడీఓ కృష్ణయ్య సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా అధికారుల వ్యవహార శైలిపై సభ్యులు నిప్పులు చెరిగారు. ఎంపీపీ భార్గవి, జడ్పీటీసీ సభ్యుడు గాంధీ మాట్లాడుతూ గ్రామాల్లో ఏ పనులు జరుగుతున్నాయో, అవి ఎవరు చేస్తున్నారో, ఏ అధికారులు వస్తున్నారో సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, చివరకు ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు కూడా తెలియని ప రిస్థితి ఉందన్నారు. పథకాలకు ఎవరు అర్హులవుతు న్నారో, ఎవరు అనర్హులవుతున్నారో ఇదివరలో జా బితాను ప్రజాప్రతినిధులకు ఇచ్చేవారని ప్రస్తుతం అలా జరగడం లేదన్నారు. చెరువు ఆయకట్టు కమి టీని ఎన్నుకున్న విషయం కూడా ప్రజాప్రతినిదుల దృష్టికి రాలేదన్నారు. పాస్ ఆర్డరు అయిన రూ.45 లక్షల బిల్లులు చెల్లించకుండా ఆపి ఉంచారని, ఏవే వో కారణాలు చెబుతూ జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవం లేదు.. గౌరవ వేతనం కూడా లేదు ఏడాది కాలంగా గౌరవంతోపాటు గౌరవ వేతనం కూడా ఆగిపోయిందన్నారు. దీనిపై ఎంపీడీఓ వారి కి సమాధానమిస్తూ ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తానని, రెండు రోజుల్లో పాస్ఆర్డరు అయిన బిల్లుల చెల్లింపు జరిగేలా చూస్తానని సభ్యులకు హా మీ ఇచ్చారు. అందరూ కుర్చీల్లో కూర్చోవాలంటూ కోరారు. దీనిపై సభ్యులు మాట్లాడుతూ రెండు రో జుల వరకు సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తామని ఆలోపు పరిష్కరించకుంటే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రోడ్డెక్కుతామన్నారు. ఆ పై అందరూ కుర్చీలపై కూర్చోగా సమావేశం ప్రా రంభమైంది. అధికారులు వారి రంగాల్లో జరుగుతు న్న పనులను సభ్యులకు వివరించారు. మామిడి త రలింపునకు ఇక్కడే టోకెన్లు ఇవ్వాలని, 108 వాహనం మునుపటిలా రావడంలేదని, గ్రావెల్ తరలింపు ఆపాలని సభ్యులు అధికారులను కోరారు. వైస్ ఎంపీపీలు వెంకటలక్ష్మి, కన్నియప్ప పాల్గొన్నారు. -
అవి పచ్చ పార్టీకి కొత్తేమీ కాదు
నగరి : యువకుల జీవితాలతో చెలగా టాలు పచ్చపార్టీకి కొత్తేమీ కాదని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రప్పారప్పా కోస్తాం అంటూ పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడడానికి వచ్చిన జనంలో నుంచి ఒక యువకుడు ప్లకార్డు చూపడంతో వచ్చిన వివాదాలపై ఆమె గురువారం స్పందించారు. ప్లకార్డు ప్రదర్శించిన రవితేజను సత్తెనపల్లి పోలీసులు అరెస్టు చేశారని, నిజానికి రవితేజ టీడీపీకి చెందిన వ్యక్తి అన్నారు. ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించడానికి టీడీపీ చేసిన కుట్ర అని తేటతెల్లమైందన్నారు. తమ బిడ్డ టీడీపీలో ఉన్నాడని స్వయంగా వారి కుటుంబ సభ్యులు చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రవితేజ టీడీపీ సభ్యత్వ నమోదు కార్డును కూడా వారు చూపెట్టినట్టు గుర్తుచేశారు. రవితేజను బలవంతంగా తీసుకువెళ్లడంతోనే ప్లకార్డులు పట్టుకున్నాడని తెలిపారు. -
దళితులకు అడుగడుగునా అవమానాలే!
వెదురుకుప్పం: కూటమి ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో దళిత గ్రామాలకు వెళ్లి నేను పెద్ద మాదిగ అని చెప్పుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజకవర్గంలో మాదిగపల్లె సామాజిక బహిష్కరణకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో దళితుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తే ఎలాంటి చర్యల్లేవన్నారు. దళిత సర్పంచ్ని సైతం అగౌరపరుస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తే ఎందుకు మిన్నకుండిపోతున్నారని ప్రశ్నించారు. గురువారం వెదురుకుప్పంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత జాతి పట్ల ఘోర అవమానాలు జరుగుతున్నా హోం మంత్రి చర్యలు తీసుకోలేదన్నారు. -
ముసలిమడుగుకు మరో కుంకీ ఏనుగు
పలమనేరు: మండలంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపునకు మరో కుంకీ ఏనుగు చేరింది. స్థానిక అటవిశాఖ అధికారులు తిరుపతి జూ నుంచి గనేణ్ అనే కుంకీ ఏనుగును ప్రత్యేక వాహనంణంలో గురువారం ఇక్కడికి తీసుకొచ్చారు. గతంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతం నుంచి నాలుగు కుంకీ ఏనుగులు, ఆపై రామకుప్పం మండలంలోని ననియాల నుంచి రెండు కుంకీ ఏనుగులకు ఇక్కడికి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ఇక్కడ ఏడు కంకీ ఏనుగులు క్యాంపులో ఉన్నాయి. కుంకీ ఏనుగుల ద్వారా కౌండిన్యలోని ఏనుగులను అదుపులోకి తీసుకొచ్చి వాటిని అడవిలోంచి పంటపొలాల వైపునకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్టు స్థానిక అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. -
మూలకోనలో వ్యక్తి మృతి
పుత్తూరు: మండలంలోని మూలకోనలో తిరుపతికి చెందిన ధర్మ (38) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. బుధవారం తిరుపతికి చెందిన ఆరుగురు ద్విచక్ర వాహనాల్లో పుత్తూరు మండలంలోని మూలకోనలో సరదాగా గడిపేందుకు వచ్చారు. వారిలో ఽతిరుపతి బాలాజీ నగర్కు చెందిన ధర్మ అతిగా మద్యం సేవించడంతో అపస్మారక స్థితికి వెళ్లి మృతిచెందాడు. సహచరుల ఫిర్యాదుతో పుత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య మంజు, కుమారుడు హేమంత్ ఉన్నారు. గుండ్లపల్లిలో యథేచ్ఛగా కోడిపందేలు పెద్దపంజాణి/పలమనేరు: పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, కొళత్తూరు పంచాయతీ గుండ్లపల్లిలో యథేచ్ఛగా కోడిపందేలు సాగుతున్నాయి. గురువారం జరిగిన పోటీలకు ఆ ప్రాంతం వారే కాకుండా పుంగనూరు, పలమనేరు, సదుం, సోమల, ఉప్పరపల్లి ప్రాంతాలకు చెందిన పందెం కోళ్లు, నిర్వాహకులు, బెట్టింగ్ రాయుళ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలోని పాఠశాల వద్ద పందేలు సాగాయి. స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సొంత మండలంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక నియోజకవర్గంలో ఎలా ఉంటుందోనని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. 11 మంది జూదరుల అరెస్ట్ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 11 మందిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సంతపేటలోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇన్చార్జ్ సీఐ మహేశ్వర ఆధ్వర్యంలో దాడులు చేసిన పోలీసులు 11 మందిని అరెస్టుచేసి, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వాహకుడు శ్యామ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడ్ని అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. మరో ఐదుగురి అరెస్ట్ పలమనేరు: కనకదుర్గ గోల్డ్లోన్ ఫైనాన్స్లో అందులో పనిచేసే సిబ్బంది చేసిన మోసం కేసులో పలమనేరు పోలీసులు గురువారం మరో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీఎస్పీ డేరంగుల ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు బ్రాంచ్ల్లో సిబ్బందే నకిలీ బంగారాన్ని పెట్టి రూ.8 కోట్ల రుణాలు పొందిన మోసం కేసులో వందలాది మందిని విచారించామన్నారు. ఇందులో భాగంగా ముందు ఏడుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఇదే కేసులో పలమనేరుకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో బొమ్మిదొడ్డి శంకరప్ప, బోసురెడ్డి, గణేష్, నరేష్కుమార్, భానుప్రకాష్ ఉన్నట్టు తెలిపారు. వ్యభిచార గృహంపై దాడి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు బుధారం రాత్రి తనిఖీలు చేపట్టారు. రాంనగర్ కాలనీ బీ–క్రాస్ వీధిలో ఓ మహిళ అద్దె ఇంటిని తీసుకుని, వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెతో పాటు ఇద్దరు మహిళలు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ మహేశ్వర తెలిపారు. -
గ్రా‘నైట్’..రైట్రైట్!
ఫ్యాక్టరీల వద్ద కూటమి నేతల రౌడీ మామూళ్లు ● ఒక్కో బ్లేడ్కు రూ.35 వేల చొప్పున.. నెలకు రూ.10 కోట్లు వసూలు ● కప్పం కట్టకుంటే.. మైన్స్, విజిలెన్స్ దాడులు ● అంతా తెలిసినా పట్టనట్టు వ్యవహరిస్తున్న యంత్రాంగం చిత్తూరు అర్బన్: భూగర్భ గనులశాఖ (మైన్స్) పరిపాలన జిల్లాలో పూర్తిగా గాడి తప్పింది. సహజ ఖనిజాలను తవ్వుకున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్ (ఖనిజాల రాయల్టీ) రుసుములను వసూలు చేయాల్సిన గనులశాఖ చేతులు పైకెత్తేసింది. అధికార పార్టీకి చెందిన నాయకులు గత ఐదు నెలలుగా ఫ్యాక్టరీల నుంచి దౌర్జన్యంగా సీనరేజ్ వసూలు చేసుకుంటుంటే వేడుక చూస్తోంది. కూటమి నేతలు వేసే బిస్కట్లకు ఆశపడ్డ కొందరు అధికారులు.. ప్రభుత్వ ఖజానాకు జమకావాల్సిన రూ.కోట్ల సొమ్మును నేతల జేబుల్లోకి మళ్లిం చేయడం విమర్శలకు తావిస్తోంది. రౌడీ మామూళ్లు చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో గ్రానైట్ ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. క్వారీల రూపంలో వీటిని దక్కించుకున్న వ్యక్తులు భూగర్భ గనులశాఖ పర్యవేక్షణలో గ్రానైట్ రాళ్లను తవ్వి, వాటిని ఫ్యాక్టరీల్లో కట్ చేయించి, పాలిష్ వేసి, ఆపై విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం చేయడానికి వ్యాపారులు క్యూబిక్ మీటరు గ్రానైట్కు వాటి రంగు ఆధారంగా స్లాబ్ పద్ధతుల్లో ప్రభుత్వానికి సీనరేజ్ రుసుములను చెల్లించాలి. రాఘవ కన్స్ట్రక్చన్స్ అనే కంపెనీ ఫ్యాక్టరీల నుంచి రుసుములు చెల్లించే కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీతో ఈ కంపెనీకి రుసుములు వసూలు చేసుకునే కాల పరిమితి ముగిసింది. ప్రైవేటు కంపెనీ స్థానంలో మైన్స్ శాఖ, ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను వ్యాపారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. కానీ గత ఐదు నెలలుగా రుసుముల వసూళ్ల నుంచి మైన్స్ అధికారులను పక్కకు తోసేసిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు.. ఫ్యాక్టరీల నుంచి నెల నెలా బెదిరించి, బలవంతంగా రౌడీ మామూళ్లు వసూలుచేసి వారి జేబుల్లో వేసుకుంటున్నారు. ఇష్టారాజ్యం కొందరు క్వారీ యజమానులు గ్రానైట్ ఖనిజాన్ని దోచుకుంటున్నారు. నిర్ణయించిన దానికంటే భారీ మొత్తంలో గ్రానైట్ వెలికితీసి, అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ప్రధానంగా రాత్రి 11 గంటలు దాటితే చిత్తూరు, కుప్పం, గంగాధరనెల్లూరు ప్రాంతాల నుంచి భారీ వాహనాల్లో గ్రానైట్ స్మగ్లింగ్ జరుగుతోంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బ్లేడ్కు ఒక్కో రేటు క్వారీల్లో తవ్విన గ్రానైట్ రాయిని ఫ్యాక్టరీలను తీసుకెళ్లి, అక్కడ పెద్దపాటి బ్లేడు ద్వారా కటింగ్ చేసి, వాటిని విక్రయిస్తుంటారు. కొన్ని ఫ్యాక్టరీల్లో సింగిల్ బ్లేడు ఉంటే, మరికొన్ని వాటిల్లో తొమ్మిది వరకు మల్టీబ్లేళ్లు ఉంటాయి. ప్రైవేటు కంపెనీకి ఇచ్చిన టెండరు గడువు ముగియడంతో రంగంలోకి దిగిన కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజా ప్రతినిధులు గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులతో భేటీ అయ్యారు. ఒక్కో బ్లేడుకు నెలకు రూ.35 వేల చొప్పున.. ఎన్ని బ్లేళ్లు ఉంటే అంత మొత్తం నెలవారీగా మామూళ్లు వసూళ్లుచేస్తున్నారు. జిల్లాలో దాదాపు 3 వేల గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటే, 1500 ఫ్యాక్టరీల వరకు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఈ లెక్కన సగటున ఒక్కో ఫ్యాక్టరీలో రెండు బ్లేళ్లు ఉన్నాయకున్నా.. నెలకు రూ.70 వేల చొప్పున ఏకంగా రూ.10 కోట్ల మేర అక్రమంగా దిగమింగుతున్నారు. ఎవరైనా ఫ్యాక్టరీ నిర్వాహకులు ఈ మొత్తం ఎందుకు చెల్లించాలి..? అని ప్రశ్నిస్తే వెంటనే మైన్స్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఆ ఫ్యాక్టరీతో పాటు గ్రానైట్ వచ్చిన క్వారీపై దాడులకు దిగుతున్నారు. భారీ మొత్తంలో అపరాధ రుసుములు విధిస్తున్నారు. రాయల్టీ ఇన్స్పెక్టర్గా చెప్పుకునే ఓ అధికారి జిల్లా మొత్తం చక్రం తిప్పుతూ ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నాడనే ఆరోపణలున్నాయి. -
మహిళల రక్షణకు అండగా నిలుస్తాం
● కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణ ● జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ తిరుపతి అర్బన్ : మహిళల రక్షణకు.. వారి హక్కుల పరిరక్షణకు మహిళా కమిషన్ కృషి చేస్తోందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్ వెల్లడించారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్, మహిళా జన్ సున్వై అనే కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్రాజు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మంజుదార్ పలువురు మహిళల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటికి పరిష్కారం చూపలేకపోవడానికి కారణాలను అధికారులు వెల్లడించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని...వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. తిరుపతి జిల్లాలోను కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని వెల్లడించారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు హెల్ప్లైన్, మెయిల్ అందుబాటులో ఉందని...వాటి ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునని చెప్పారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం, వారి సమస్యలను చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను పర్సనల్గా తీసుకొని పరిష్కారం చూపేలా మహిళా కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. తిరుపతి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తీవ్ర అసంతృప్తిలో మహిళలు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సభ్యులు డాక్టర్ అర్చన మజుందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ఆయా శాఖల సమక్షంలో విచారించే కార్యక్రమంపై పలువురు మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపకపోగా తిరిగి కొత్తగా ఫిర్యాదు చేయాలనే సమాధానమే చెప్పడంతో నిరాశ చెందారు. పోలీసులు మహిళలను వేధిస్తున్న సమస్యలే అధికంగా వచ్చాయి. అయితే వీటి పరిష్కారానికి మళ్లీ పోలీసులనే కలవమని చెప్పడంపై అసంతృప్తికి గురయ్యారు. అధిక సంఖ్యలో వయోవృద్ధులు చిన్నపిల్లలతో మహిళలు హాజరై మధ్యాహ్నం భోజనం కూడా లేకుండా నిరీక్షించినప్పటికీ సమస్యలు అపరిష్కతంగా మిగిలిపోవడంతో అనేక మంది మహిళలు నిరాశతో వెనుదిరిగారు. -
‘మద్దతు’గా నిలవాల్సిందే!
● రేపు కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల నిరసన ● ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.12 అమలు చేయాల్సిందే ● లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం ● హెచ్చరించిన రైతు సంఘాల నాయకులు జ్యూస్ ఫ్యాక్టరీని సందర్శించిన జేసీ మండలంలోని నలగాంపల్లెలోని సన్గోల్డ్ జూస్ ఫ్యాక్టరీని గురువారం జేసీ విద్యాధరి సందర్శించారు. తోతాపుర మామిడి కాయలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారా లేదా, కాయల కొతలకు సంబంధించి తీసుకుంటున్న నియమ నిబంధనలు, జూస్ ఫ్యాక్టరీ వద్ద రైతులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తోతాపురి కొనుగోలు చేయాలని సూచించారు. తహసీల్దార్ బాబురాజేంద్రప్రసాద్, ఏఓ భారతి పాల్గొన్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడి రైతులను ఆదుకోవడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి మాటలకు కూడా విలువ లేకుండా పోయిందని రైతులు ధ్వజమెత్తారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద శనివారం సత్యాగ్రహం నిర్వహించనున్నట్టు మామిడి రైతుల సంక్షేమ సంఘ నాయకులు జనార్దన్, ఎస్.ఆనంద నాయుడు ప్రకటించారు. జిల్లాలో గురువారం మామిడి రైతుల సంక్షేమ సంఘం కమిటీ జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు గుజ్జు ఫ్యాక్టరీల యజమానులు, ర్యాంపుల నిర్వాహకులు నరకయాతన చూపిస్తున్నారన్నారు. ఇంకోపక్క జిల్లా యంత్రాంగం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అమలు చేయాల్సి ఉండగా పూర్తిగా చేతులెత్తేయడం దారుణమన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఫ్యాక్టరీ యజమానులు, ర్యాంపుల నిర్వాహకులు ధరల పట్టిక ప్రదర్శించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతరుచేయని ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో సీఎం జరిపిన సమీక్ష సమావేశంలో సైతం కిలోకు రూ.12 మద్దతు ధర కచ్చితంగా కల్పిస్తామని స్పష్టం చేసినా.. జిల్లాలో ఎక్కడా అమలు కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మామిడి ఫ్యాక్టరీల వద్ద అన్లోడింగ్ సైతం పూర్తిగా రాజకీయ జోక్యం పెచ్చుమీరుతోందని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పల్ఫ్ నిల్వలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో హరిబాబు, ఉమాపతినాయుడు, సంజీవరెడ్డి, భారతి పాల్గొన్నారు. రైతులకు నష్టం కలగకుండా చూస్తాం బంగారుపాళెం: మామిడి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం బంగారుపాళెం మామిడి మార్కెట్ ఆవరణలో మామిడి మండీ యజమానులు, రైతులతో మద్దతు ధరపై సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తోతాపురి(బెంగళూర)మామిడి కాయలను చివర కేజీ వరకు కొనుగోలు చేస్తామన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపటిందన్నారు. ప్రభుత్వం అందించే రూ.4 మద్దతు ధర సబ్సిడీ రూపంలో రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమచేస్తామాన్నరు. కాయలు పక్వానికి రాకముందే జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించొద్దని సూచించారు. జేసీ విద్యాధరి, మార్కెట్శాఖ ఏడీ పరమేశ్వర్, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్రెడ్డి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ గంగాధరనెల్లూరు: జైన్ మామిడి గుజ్జు పరిశ్రమను గురువారం రాత్రి కలెక్టర్ సుముత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కర్మాగారం వద్ద ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మామిడి కొనుగోలుపై ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. జిల్లా హార్టికల్చర్ డీడీ మధుసూదన్ రెడ్డి, డీఆర్డీవో పీడీ శ్రీదేవి, జైన్ మేనేజర్ దీలీప్ శర్మ, ఇన్చార్జ్ తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీవో కృష్ణమహేష్రెడ్డి పాల్గొన్నారు. మద్దతు ధర చెల్లించకుంటే చర్యలు తోతాపురి మామిడికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్కుమార్ హెచ్చరించారు. గురువారం జీడీనెల్లూరులోని జైన్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. మామిడి కాయల కొనుగోలుపై పరిశ్రమ యాజమాన్యం, రైతులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు తోతాపురికి మద్దతు ధర చెల్లించాలన్నారు. మద్దతు ధర చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గుజు పరిశ్రమలకు మామిడికాయలను తెచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలో మామిడి దిగుబడి ఎక్కువగా ఉండడంతో ప్యాకింగ్ మెటీరియల్ను సమకూర్చుకుని ప్రాసెసింగ్ యూనిట్ల కెపాసిటీని పెంచుకోవాలని సూచించారు. డీఆర్డీఓ పీడీ శ్రీదేవి, మండల ఇన్చార్జ్ తహసీల్దార్ తులసీరాం, జైన్ మేనేజర్ పాల్గొన్నారు. పక్వానికి వచ్చిన కాయలనే కోయండి తవణంపల్లె: మామిడి రైతులు పక్వానికి వచ్చిన కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలించాలని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు సూచించారు. మండలంలోని టి.పుత్తూరు, ఎగువ తవణంపల్లె గ్రామాల్లో మామిడి పంట కోత కోయడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఈఓ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.4 మద్దతు ధర చిట్టచివరి పంట వరకు ఇచ్చేందుకు జీఓ కూడా విడుదల చేసిందన్నారు. రూ.4 మద్దతు ధర ఆగిపోతుందని అపోహలు వద్దన్నారు. అనంతరం ఎఫ్–3 ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. రైతులకు నష్టం జరగకుండా ఫ్యాక్టరీ యజమానులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి, ఇన్చార్జ్ వ్యవసాయాధికారి వందన పాల్గొన్నారు.మామిడి రైతుల గోడు కూటమికి పట్టదా? బంగారుపాళెం: మామిడి రైతుల గోడు కూటమికి పట్టనట్టుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పూతలప ట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమా ర్ ధ్వజమెత్తారు. మామిడి పంటకు కనీస గిట్టుబాటు ధర లేక గత 15 రోజులుగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వాపోయారు. జిల్లాలో అత్యధికంగా బెంగళూర(తోతాపురి)రకం పంటను రైతులు సాగుచేస్తున్నారన్నారు. పండిన పంటను అమ్ముకునేందుకు మండీలు, జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండీలు, ర్యాంప్లలో కిలో రూ.3 నుంచి రూ.4కు కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8కు జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీల వ ద్ద పర్మిట్ల కోసం వారాల తరబడి తిరగాల్సివస్తోంద న్నారు. పర్మిట్లు పొంది కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలిస్తే అక్కడ రోజుల తరబడి ఉండాల్సి వస్తోందని చె ప్పారు. రైతులు పండించిన పంటకు వేరొక్కరు మద్ద తు ధర ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. -
మామిడి కాయలు అన్లోడ్ చేసి వెళ్తూ..!
బంగారుపాళెం: మండలంలోని కాటప్పగారిపల్లె సమీపంలో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ట్రాక్టర్ను కారు ఢీ కొన్న ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమా రుడు తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు రూరల్ మండలం, కొడిగుట్ట గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్నాయుడు, ఆయన కుమారుడు యుగేష్ మామిడి కాయలను ట్రాక్టర్లో బంగారుపాళెంకు తీసుకొచ్చారు. కాయలను మార్కెట్లో దింపి తిరి గి స్వగ్రామానికి ట్రాక్టర్పై బయలుదేరారు. యుగే ష్ డ్రైవింగ్ చేస్తుండగా, చంద్రశేఖర్నాయుడు పక్కన కూర్చున్నాడు. మార్గమధ్యంలో కాటప్పగారిపల్లె వద్ద ట్రాక్టర్ను పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్నాయుడు (62)పై ట్రాక్ట ర్ ట్రాలీ చాసిన్ పడడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. యుగేష్(32) తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన యుగేష్ను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో అన్లోడింగ్ దందా! చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని పలు ఫ్యాక్టరీల్లో అన్లోడింగ్ దందా నడుస్తోంది. కొన్ని ఫాక్యరీల్లో లోడ్ దింపే వారికి రూ.50 నుంచి రూ.200 వరకు టీ, కాఫీ ఖర్చుల పేరుతో టిప్పు ఇస్తుంటారు. అప్పోసస్పో చేసి రైతులు కాయలను ఫ్యాక్టరీకి తీసుకొస్తుంటే ట్రాక్టర్ అన్లోడింగ్కు రూ.500 నుంచి రూ.800 వరకు గుంజుకుంటున్నారు. చిత్తూరు మండలం చెర్లోపల్లిలోని హయాత్ ఫుడ్స్లో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పు మంటున్నాయి. జేసీ విద్యాధరి గురువారం ఫ్యాక్టరీని తనిఖీ చేసినట్లు తెలిసింది. ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడి పలు సూచనలు చేస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. -
జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అరెస్ట్ను వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులందరిపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న భూమన.. తప్పుడు కేసులు బనాయించడంలో చంద్రబాబు ప్రభుత్వం రాటుదేలిపోయిందన్నారు.చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. నిన్న పల్నాడులో ఏం జరిగింది ప్రత్యక్షంగా చూశారు. వైఎస్ జగన్ బయటకు వస్తే ప్రజలు కడలి వలె ఉప్పొంగి తరలి వస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు అండగా ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది పాటు వైఎస్సార్సీపీపై విష ప్రచారం చేయడానికే వెచ్చించారు’’ అంటూ చంద్రబాబు సర్కార్పై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చదువు‘కొన’లేం!
● ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ● ఖాళీ అవుతున్న సామాన్యుల జేబులు ● నోటీసు బోర్డుల్లో ప్రదర్శించని ఫీజుల వివరాలు ● కూటమి పాలనలో జాడలేని ఫీజు నియంత్రణ కమిటీలు ● పర్యవేక్షణలో విద్యాశాఖ అధికారులు విఫలం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు 31,922 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు 11,750 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు 29,303 ప్రాథమిక, హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో విద్యార్థులు 5,929చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 వేలు, మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో రూ.10 వేలు, జిల్లా కేంద్రంలో రూ.13 వేలు చొప్పున ఫీజులు నిర్ధారించారు. అయితే 4, 5 తరగతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.9 వేలు, పట్టణాల్లో రూ.11 వేలు, జిల్లా కేంద్రంలో రూ.13 వేలు, ఆరో తరగతికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.11 వేలు, మండల కేంద్రాల్లో 15 వేలు, పట్టణాల్లో రూ.17 వేలు సంబంధిత పాఠశాలల స్టార్ రేటింగ్ మేరకు ఫీజులను నిర్ణయించి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఫీజుల నియంత్రణ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులపై అధ్యయం చేసేందుకు ఐఏఎస్ అధికారులతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీలను నియమించింది. ఏ పాఠశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ప్రాంతాల వారీగా ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపొందిం ప్రభుత్వానికి అందజేసేది. ఆ నివేదికల ఆధారంగా అధిక ఫీజులు వసూలు చేసే కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకునేవారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రామాలు, పట్టణాల్లో పాఠశాలలను ఐదు కేటగిరీలుగా విభజించారు. స్టార్ రేటింగ్ స్కూల్స్కు 1 నుంచి 10 వ తరగతి వరకు ఫీజులు సైతం ఫీజు నియంత్రణ కమిటీ సిఫార్సు చేసింది. నిబంధనలకు తూట్లు జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఫీజు వసూళ్లు, సౌకర్యాల వంటి వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. అయితే ఈ నిబంధనలను ప్రైవేట్ పాఠశాలలు పాటించడం లేదు. సిలబస్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించే పుస్తకాలను బోధించాలి. కానీ కొన్ని పాఠశాలల్లో ఒక్కొక్క పబ్లికేషన్ పుస్తకాలను ఐటీఐ ఒరియెంటెడ్ పేరుతో విక్రయిస్తూ వాటినే బోధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఇంటర్ స్థాయిలో ఉండే సిలబస్ను జోడించి సొంతంగా పుస్తకాలను విక్రయిస్తున్నారు. నిబంధనలు పాటించని పాఠశాలలను విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వివరాలు ప్రాథమిక పాఠశాలలు 166 ప్రాథమికోన్నత పాఠశాలలు 79 ఉన్నత పాఠశాలలు 159 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 18 ప్రాథమిక, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు 06 మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ అధికారులు ఫీజుల నియంత్రణపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. తనిఖీలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఫలితంగా కూటమి ప్రభుత్వంలో సామాన్యులు నష్టపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి అధిక ఫీజుల దందాను అరికట్టాలి. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
పంటను అమ్ముకోవడానికి ఫలరాజు పాట్లు
కాణిపాకం : జిల్లాలో మామిడి విపత్తు ఎదురవుతోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పంట పక్వానికి వచ్చినా కోతలు కోయలేక కన్నీళ్లు పెడుతున్నారు. ఫ్యాక్టరీలు ముఖం చాటేస్తున్నాయి. ర్యాంపులు ఇదే దారిలో పయనిస్తూ... కాయలను కొనలేమని చేతులెత్తేస్తున్నాయి. టోకెన్లు గడువు ఉన్నంత వరకు కాయలకు గడువులేదని... ప్రభుత్వం ప్రోత్సాహక నిధి ప్రకటించి రైతుల గోసను గాలికొదిలేసిందని రైతులు ఆక్రోశానికి గురవుతున్నారు.టోకెన్ ఉన్న రైతుల పరిస్థితి ఇదీ..మామిడి రైతులు పండించిన పంట విక్రయానికి జిల్లాలోని ఫ్యాక్టరీల వద్దకు పోటెత్తుతున్నారు. వేల మంది రైతులు ఒక్కసారిగా ఫ్యాక్టరీలను ముట్టడిస్తున్నారు. ఈపోరు పడలేక ఫ్యాక్టరీలు, అధికారులు కలిసి వచ్చిన వారి అందరికీ టోకెన్లు పంచిపెట్టేస్తున్నారు. ఈ టోకెన్ల జారీ జూన్ నెల దాటింది. పలు ఫ్యాక్టరీలు జులై నెల ఆఖరు వరకు కొనుగోలు చేస్తామని టోకెన్లు ఇచ్చేసింది. మరో వారం..పది రోజుల్లో మామిడి పంట పూర్తిగా నేల మట్టమయ్యే అవకాశం ఉందని రైతులు కంట తడి పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో జులై నెల ఆఖరు వరకు పంట ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయ పండై...పురుగు పట్టి రాలిపోవడం ఖాయమని కన్నీళ్లు కారుస్తున్నారు. ఇప్పటి వరకు 30 శాతం వరకు మాత్రమే పంట అమ్ముడుబోయినట్లు రైతులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలకు వచ్చిన సగం కాయలు తమిళనాడు కాయలని, వాటిని కూడా అధికారులు ఈ లెక్కల్లోనే కలిపేస్తున్నారని రైతులు వాపోతున్నారు.నష్టపరిహారం ఇవ్వాల్సిందే...మామిడి పంటను కోసి అమ్ముకునే పరిస్థితి లేదని రైతులు దిగాలు చెందుతున్నారు. ఫ్యాక్టరీలు జిల్లా మామిడిని తోసి పుచ్చుతున్నాయంటూ గోల చేస్తున్నారు. సిఫార్సులకు పెద్దపీట వేస్తూ...సామాన్య రైతు కష్టాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీల వద్ద ఇబ్బంది పడుతోంది... సామాన్య రైతులేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కొనాలంటే..మాకేమి లాభమని..ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాల కాయలపై మొగ్గు చూపుతున్నాయంటూ ఆగ్రహానికి గురవుతున్నారు. ఫ్యాక్టరీలు రూ.5, రూ.6ను కూడా తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ప్రోత్సాహక నిధిని పక్కన పెట్టి మామిడి కష్టాలను విపత్తుగా గుర్తించి రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.2018 నష్టాలు గుర్తుకొస్తున్నాయి..ప్రస్తుతం మామిడి పరిస్థితి చూసి రైతులు 2018 మామిడి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 శాతం పంట మాత్రమే వచ్చింది. ఆ పంటను విక్రయించుకోవడానికి అప్పటి రైతులు నానా అవస్థలు పడ్డారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలు మామిడి పంటను కొనలేని పరిస్థితి ఏర్పడితే రైతులు పండిన తోతాపురి కాయలను తీసుకొచ్చి కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై పోసి నిరసనకు దిగారు. చివరకు కేజీ తోతాపురి రూ.2 వరకు పలికింది. అప్పటి కూడా కొనలేని పరిస్థితులు ఉంటే 30శాతం నుంచి 40శాతం పంట చెట్లల్లోనే రాలిపోయాయి. కాగా అప్పట్లో ఫ్యాక్టరీలకు 20,053 మంది రైతులు 1,04,777 టన్నుల కాయలను విక్రయించారు. ఇందుకు గాను ఫ్యాక్టరీలు రూ.78.58 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటే 8 నెలల తర్వాత బిల్లులు చెల్లించాయి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధి రూ.2.50 చొప్పున రూ.2.19 కోట్ల నిధులు చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా రైతులు అప్పులు చేసి తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురు కావడంతో రైతుల్లో గుబులు పట్టుకుంటోంది.నష్ట పరిహారం ఇవ్వాలిఈసారి మామిడి రైతు నిండా నష్టపోయాడు. మామిడి సా గు ఖర్చులు, కూలీల ఖర్చు లు, ట్రాక్టర్ ఖర్చులు కలిసి రై తులను ముంచేస్తున్నాయి. కా యలు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్కు ఒక్క రోజుకు రూ.1000 బాడుగ ఇస్తున్నాం. బండి మూడు రోజు లు ఇక్కడే ఉంది. రోజుకు రూ.1000 చొప్పున మూ డు రోజులకు రూ.3 వేలు ఇవ్వాలి. కోసి తీసుకొచ్చింది కొంత వరకు మాత్రమే. మిగిలిన కాయలు చెట్లల్లో అలానే ఉన్నాయి. జులై వరకు టోకెన్లు ఇస్తున్నా. అ ప్పటి వరకు చెట్లల్లో కాయలు ఉండవు. నష్టపరిహా రం ఇచ్చి ఆదుకోవాలి. – వెంకటేష్, పెనుమూరుచేతులెత్తేసిన ర్యాంపులుజిల్లాలో ఇప్పటి వరకు 23 ర్యాంపులు నడుస్తున్నాయి. ఈ ర్యాంపులకు రోజువారీగా ఒక్క లారీ నుంచి రెండు లారీలా వరకు ఫ్యాక్టరీలకు అమ్ముకోవడానికి అనుమతులున్నాయి. ఈ ర్యాంపును నిర్వర్తించే వ్యాపారులు సొంత కాయలు, బంధువులు, తెలిసినా వాళ్ల మామిడి కాయలు అమ్ముకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలిన రైతుల మామిడిని కొనలేమని, ఫ్యాక్టరీ వాళ్లు తీసుకోవడం లేదని తలుపులు వేసేస్తున్నారు. ర్యాంపులకు వెళ్లిన రైతులకు వారం తర్వాతే కాయలు కొంటామని చెప్పేస్తున్నారు. అధికారులు చెప్పిన రేటు (రూ.3.50) కుదరదని, రూ.3 నని, మరో వారం తర్వాత ఆ రేటు చెప్పలేమని రైతులకు సమాధానమిస్తున్నారు. దీంతో మామిడి రైతులు తల్లడిల్లిపోతున్నారు.ఒక్క టోకెన్ స్వామీ !జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ఫలంపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తోటలోని కాయలు మట్టిపాలవుతున్నాయి. రైతులు ఫలం పరిస్థితి చూసి కన్నీళ్లు కారుస్తున్నారు. చాలా మంది కాయలను అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల వద్దకు పరుగులు పెడుతున్నారు. వారి అనుమతి కోసం బంగారుపాళ్యం, చిత్తూరు, గుడిపాల, పెనుమూరు, పూతలపట్టు, తవణంపల్లి, జీడీ నెల్లూరు తదితర ప్రాంతాలకు తిరిగేస్తున్నారు. తెలిసిన వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, కూటమి నేతలు, పలుశాఖ అధికారుల ద్వారా టోకెన్ల కోసం బతిమిలాడుకుంటున్నారు. ఒక్క టోకెన్ అయినా తీసి ఇవ్వు స్వామీ అంటూ రైతులు వారిని ప్రాధేయపడుతున్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్పై కొరడా
● ఆర్కే గార్డెన్స్కు జరిమానా విధింపు ● జిల్లా రిజిస్ట్రార్ విచారణలో అక్రమాలు బహిర్గతం ● రూ.10.80 లక్షల స్టాంపు డ్యూటీ చెల్లించాలంటూ ఆదేశం ● ఫలించిన సమాచార హక్కుల వేదిక పోరాటం పుత్తూరు : మండల పరిధిలోని ఆర్కే గార్డెన్స్ ఫంక్షన్ హాల్ యజమాని రవీంద్రన్కు రూ.10.80 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు అపరాధ రుసుం చెల్లించాలంటూ తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ జి.శ్రీరామ్కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆర్డర్ కాఫీని గత మే నెల 29వ తేదీన జారీ చేశారు. ఆర్డర్ కాఫీ అందుకున్న 15 రోజుల్లోపు స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని చెల్లించాలని లేని పక్షంలో ఇండియన్ స్టాంప్స్ సెక్షన్ 1899 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నివాస ఖాళీ స్థలంగా చూపడంతో.. స్థానిక ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.రవీంద్రన్ పుత్తూరు మండల పరిధిలోని ఉత్తరపుకండ్రిగ పంచాయతీ చిన్నబ్బనాయుడు కండ్రిగ వద్ద ఆర్కే గార్డెన్ ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఆయన 2023 డిసెంబర్ 13, 14 తేదీలలో పుత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన కుమార్తె ప్రత్యూష పేరిట సదరు ఆస్తిని రిజిస్ట్రర్ చేయించారు. ఈ సందర్భంగా సదరు ఆస్తిని నివాస ఖాళీ స్థలంగా చూపుతూ డిక్లరేషన్ ఇచ్చారు. ఆస్తి మొత్తం విలువ రూ.1,08,96,604గా పేర్కొన్నారు. సమాచార హక్కుల వేదిక ఫిర్యాదు పుత్తూరు మండలంలోని ఆర్కే గార్డెన్స్ నిర్మాణానికి పంచాయతీ నుంచి, తుడా కార్యాలయం నుంచి పొందిన అనుమతులను కోరుతూ స్థానిక సమాచార హక్కుల వేదిక కార్యదర్శి కె.మురగారెడ్డి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరడంతో అసలు విషయం బయట పడింది. కేవలం రూ.2.18 లక్షలు చెల్లించి.. స్టాంప్ డ్యూటీ రూ.12.94 లక్షలు కాగా, రవీంద్రన్ ఇచ్చిన తప్పుడు డిక్లరేషన్ ద్వారా కేవలం రూ.2.18 లక్షలు మాత్రం చెల్లించినట్లు విచారణలో తేటతెల్లం అయింది. దీంతో డెఫిసిట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.4,720తో కలిపి మొత్తం రూ.10,80,520 చెల్లించాలంటూ రవీంద్రన్ను ఆదేశించారు. ఫిర్యాదు మేరకే విచారణ చేపట్టాం ఆర్కే గార్డెన్స్ క్రయ విక్రయాలపై వచ్చిన ఫిర్యాదు మేరకే విచారణ చేపట్టాం. విచారణలో పుత్తూరు ఎంపీడీఓ 2023 డిసెంబర్కు ముందే ఆ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్లో జరిగిన ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ చట్టం సెక్షన్ 27కి వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. దీంతో పూర్తి స్థాయి స్టాంప్ డ్యూటీ చెల్లించాలని ఆదేశించాం. – జి.శ్రీరామ్కుమార్, జిల్లా రిజిస్ట్రార్, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ విచారణ ఇలా.. ● సమాచార హక్కుల వేదిక వారు ఆర్టీఐ ద్వారా అడిగిన వివరాల మేరకు తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ చేపట్టిన విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి. ● జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు పుత్తూరు ఎంపీడీఓ స్థల పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలో సర్వే నంబర్ 145–1ఏ2, 145–2సి2లో 2023 డిసెంబర్ నాటికే ఆర్కే గార్డెన్ ఫంక్షన్ హాలు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ● పుత్తూరు సబ్ రిజిస్ట్రార్ సైతం స్థల పరిశీలన చేసి శాశ్వత భవనాలు ఉన్నట్లు గుర్తించి, మార్కెట్ విలువను దాచిపెట్టి రిజిస్ట్రేషన్ జరిగినట్లు నివేదిక ఇచ్చారు. ● ఆర్సీసీ నిర్మాణం 2,591 చదరపు అడుగుల్లో జరిగిందని, ఏసీసీ నిర్మాణం 17,361 చదరపు అడుగులుగా నివేదికలో పొందుపరిచారు. ● రవీంద్రన్ తెలిపిన ఆస్తి విలువ రూ.1.8 కోట్లు కాగా విచారణలో మొత్తం ఆస్తి విలువ రూ.6.47 కోట్లుగా లెక్కగట్టారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కుప్పం రూరల్ : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన కుప్పం మండలం నూలుకుంట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. నూలుకుంట గ్రామానికి చెందిన నాగప్ప (64) జీవనోపాధి కోసం చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం కోళ్లను కోసి బాయిలర్లో వేసి క్లీన్ చేసే సమయంలో బాయిలర్కు వచ్చే విద్యుత్ తీగకు ఎలుకలు కొరికి ఉన్న విషయం గుర్తించలేదు. దీంతో బాయిలర్ స్విచ్ వేయగానే నాగప్ప విద్యుత్ షాక్కు గురయ్యాడు. కొన ఊపిరితో ఉన్న నాగప్పను కుటుంబ సభ్యులు కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకోగానే నాగప్ప మృతి చెందినట్లు తెలిపారు. కాగా నాగప్పకు భార్య , నలుగురు పిల్లలు ఉన్నారు. పొలానికి రాకుండా దౌర్జన్యం – బాధిత మహిళా రైతు ఆవేదన పలమనేరు : తమ పొలాన్ని ఆక్రమించుకొనేందుకు ఓ టీడీపీ నేత ప్రమేయంతో కొందరు ప్రయత్నిస్తున్నారని తమ పొలం వద్దకు రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని బైరెడ్డిపల్లి మండలం చిక్కనపల్లికి చెందిన బాధితులు రమాదేవి కుటుంబీకులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ తమకు శెట్టిపల్లి రెవెన్యూలో 2.72 సెంట్ల డీకేటీ భూమి ఉందని దాన్ని 20 ఏళ్లుగా సాగుచేస్తున్నామని తెలిపారు. ఇదే భూమిపై బ్యాంకులో రుణం కూడా పొందామన్నారు.అయితే బేలుపల్లికి చెందిన ఓ టీడీపీ నేత ప్రోద్భలంతో తమ పొలాన్ని పక్కనున్న భూమి వారికి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసి జేసీబీతో తమ పొలాన్ని వారి పొలంలో కలిపేలా పనులు చేశారన్నారు. దీనిపై తాము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు టీడీపీ నాయకులను కలసి పరిష్కరించుకోవాలని తామేమీ చేయలేమని చెప్పారన్నారు. దీంతో బేలుపల్లికి చెందిన టీడీపీ నేతవద్దకెళితే తాను చెప్పినంత డబ్బులిస్తే మీ భూమి మీకు దక్కుతుందని లేదంటే మీభూమి పక్కనున్న వాళ్లకి చేసేస్తామని బెదిరిస్తున్నాడని వాపోయారు. గోల్డ్ లోన్ కేసులో పోలీసుల అదుపులో మరికొందరు పలమనేరు : పట్టణంలోని కనకదుర్గ గోల్డ్లోన్ ఫైనాన్స్ కంపెనీలో జరిగిన మోసం కేసులో మరికొందరిని పలమనేరు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలో ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో సంబంధం ఉన్న మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక సీఐ నరసింహరాజును వివరణ కోరగా మరికొందరిని విచారిస్తున్నామని తదుపరి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
వైఎస్సార్సీపీ కీలక నేతలను వేధిస్తున్న ప్రభుత్వం
వైఎస్సార్సీపీలో క్రి యాశీలకంగా వ్యవహరించే నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో కుట్రలకు తెరతీసింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కీలక నాయకులపై కక్షగట్టింది. వైఎస్ జగన్ వెంట నడిచేవారిని వేధించేందుకు పన్నాగాలు పన్నుతోంది. వెంటాడి మరీ అరెస్ట్లు చేయించి పైశాచికానందం పొందుతోంది. అందులో భాగంగానే లిక్కర్ స్కామ్ అంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని సర్కారు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేయించింది. అన్యాయంగా అపనిందలు మోపి అప్రతిష్టపాలు చేసేందుకు.. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాదరణను అణచి వేసేందుకు యత్నిస్తోంది.సాక్షి, టాస్క్ఫోర్స్ : జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగం కుట్రలు పరాకాష్టకు చేరాయి. మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దల డైరెక్షన్లో అధికారులు పని చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇప్పుడు తప్పులు కేసులు పెడుతున్న అధికారులు.. రేపనేది ఒకటి ఉంటుందని.. ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటనేది ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా జిల్లాలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్టు చేసి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెవిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించేందుకు కూటమి ప్రభుత్వంలోని కొందరు కుట్రలు పన్నుతూ వచ్చారు. అయితే నిత్యం ప్రజల మధ్య ఉండే చెవిరెడ్డి ఎటువంటి తప్పులు చేయరని అందరికీ తెలుసు. అయితే ఇటీవల ఎర్రావారిపాళెం మండలంలో ఓ బాలికపై అఘాయిత్యం జరిగిందని ఆమె తండ్రి చెవిరెడ్డికి ఫోన్ చేసి సాయం చేయమని అడిగితే.. ఆయన అక్కడకు వెళ్లి ఆడబిడ్డకు సాయం చేసినందుకు పోక్సో కేసు పెట్టారు.. ఆ కేసులో అరెస్టు చేయాలని చూసినా ఆ బిడ్డ తల్లిదండ్రులే మీడియా ముందుకు వచ్చి చెవిరెడ్డిపై తాము ఫిర్యాదు చేయలేదని చెప్పడంతో పోలీసులు వెనకడుగు వేశారు.లిక్కర్ కేసులో ఎలా ఇరికించారంటే..!ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రూ.8 కోట్లు పోలీసులకు పట్టుబడితే దానిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఆ నగదుకు సంబంధించిన వారు వ్యాపార నిమిత్తం తరలిస్తుండగా పట్టుబడినట్టు చెబుతూ అందుకు తగిన ఆధారాలను కోర్టుకు, విజయవాడ పోలీసు కమిషనర్కు, ఎన్నికల అధికారులకు కూడా అందించారు. దానిపై కోర్టులో కేసు నడుస్తుండగానే చెవిరెడ్డి దగ్గర గతంలో పనిచేసిన గన్మెన్ గిరిని సిట్ అధికారులు తీసుకువెళ్లి బెదిరించి ఎన్నికల్లో పట్టుబడిన డబ్బుతో పాటు రూ.200 నుంచి రూ.250కోట్లు చెవిరెడ్డి తరలించినట్టుగా తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని అరెస్టుకు ముందు చెవిరెడ్డి మీడియాకు వివరించారు. గన్మెన్ గిరి ఇచ్చిన వివరాల మేరకు మరో గన్మెన్ మదన్రెడ్డి, గతంలో చెవిరెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకులుగా పనిచేసిన బాలాజీ, నవీన్ పేర్లను కూడా ఆ కేసులో ఇరికించారని, వారందరినీ భయపెట్టి చెవిరెడ్డి తీసుకురమ్మంటేనే ఆ డబ్బులు తరలించినట్టుగా స్టేట్మెంట్లు రికార్డు చేశారని మీడియా ముందు చెవిరెడ్డి స్వయంగా వెల్లడించారు.ఇంతమందిని వేధించి, నరకం చూపించడం కన్నా తనను నేరుగా అరెస్టు చేసుకోవచ్చని కూడా చెప్పారు. అయితే సిట్ అధికారులు మాత్రం చెవిరెడ్డికి బెయిల్ లభించకుండా చేయడానికి అన్ని విధాలుగా స్టేట్మెంట్లు తయారు చేసుకున్న తరువాతే ఆ పనిచేశారు. మదన్రెడ్డి డీజీపీకి రాసిన లేఖతో ఖంగుతిన్న సిట్ అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెవిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఆ సమయంలో ఆయన విజయవాడలోనే ఉన్నట్టు తెలిసినా సిట్ అధికారులు ఎందుకు అరెస్టు చేయలేదనేది ప్రశ్నార్థకం.ఎల్లో నేతల పైసాచిక ఆనందంఏపీ లిక్కర్ స్కాం కింద సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్టు చేయడంతో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు పైసాచిక ఆనందం పొందుతున్నారని చెవిరెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సాయం చేయడంతో పాటు ఎవరినీ ఇబ్బంది పెట్టని చెవిరెడ్డికి ఇన్ని కష్టాలు రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెవిరెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని గ్రామస్తులు, బంధువులు స్పష్టం చేస్తున్నారు. చెవిరెడ్డి అరెస్టుపై కూటమి ప్రభుత్వం కక్షకట్టిందని ఈ రాష్ట్ర ప్రజలకు సుస్పష్టమైంది.నేరుగా అరెస్టు చేసుకోండని సవాల్ చేసినా..ఏ తప్పు జరగని లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డిని అక్రమంగా ఇరికించారు. అంతేకాదు.. అరెస్టు చేసిన తరువాత బెయిల్ రాకుండా చేయడానికి ఆయన దగ్గర గతంలో పనిచేసిన వారందరినీ వేధించి మరీ స్టేట్మెంట్లు తీసుకున్నట్టు స్వయంగా చెవిరెడ్డి మీడియాకు తెలిపారు. చెవిరెడ్డి దగ్గర పనిచేసిన వారందరికీ సిట్ అధికారుల వేధింపులు మాత్రం తప్పలేదు. ఇంతమందిని వేధించడం వెనుక తప్పుడు కేసుల్లో చెవిరెడ్డిని ఇరికించడానికి చేసిన ప్రయత్నమే అనేది ఆయన దగ్గర గన్మెన్గా పని చేసిన మదన్రెడ్డి ఇటీవల డీజీపీకి రాసిన లేఖతో తేటతెల్లమైంది. ఆ లేఖతో అప్పటి వరకు సిట్ అధికారులు చేసిన టార్చర్ను సోషల్ మీడియా వేదికగా చెవిరెడ్డి స్వయంగా బయటకు తేవడంతో మీడియాలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. సిట్ అధికారులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి సామాన్యులను నరకం చూపుతున్నారనే విషయం బహిర్గతం కావడంతో చేసిన తప్పు కప్పి పుచ్చుకునేందుకు, ఆ విషయాన్ని దారి మళ్లించేందుకు చెవిరెడ్డిని అరెస్టు చేయడం ఒక్కటే మార్గమని సిట్ అధికారులు భావించారు. అందుకే ఎలాంటి ఎఫ్ఐఆర్ కాపీని చెవిరెడ్డికి ఇవ్వకుండా, కేసు పెట్టినట్టు చెప్పకుండా విజయవాడలోనే తిరుగుతున్న చెవిరెడ్డిని పట్టుకోకుండా.. లుక్అవుట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు వెళ్తుంటే బెంగళూరు విమానాశ్రయంలో పట్టుకున్నట్టు సిట్ అధికారులు కలరింగ్ ఇచ్చారనే విమర్శలు వైఎస్సార్సీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.ఏడాదిగా ఏపీలో అరాచక పాలనజరగని స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరు చేర్చి అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం. ఏడాది నుంచి రాష్ట్రంలో కూటమి అరాచక పాలనకు అంతులేకుండాపోతోంది. ప్రజాప్రతినిధుల వద్ద గన్మెన్లుగా పనిచేసిన పోలీసులను సైతం లాక్కెళ్లి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వమని చిత్రహింసలకు గురిచేయడం ఏపీలోని కూటమి పాలనకే చెల్లింది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు పర్యటన కార్యక్రమం నుంచి జనం దృష్టి మరల్చడానికే చెవిరెడ్డిని రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. అక్రమ కేసులు, అరెస్ట్లతో భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనం. ప్రజల నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి భయపడి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు.– భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు -
నేడు అగ్నివీర్పై అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని నాగయ్య కళాక్షేత్రంలో 19న అగ్నివీర్ వాయు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ విద్యాధరి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో యువతకు అగ్నివీర్పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి 12వ ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు విచ్చేస్తారన్నారు. భారత వైమానిక దళంలో ఉండే వివిధ ఉద్యోగ అవకాశాలు, అగ్నివీర్ పథకం విషయాలపై అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ కోరారు. వాయిదా వేసిన డీఎస్సీ పరీక్షలు జులైలో నిర్వహణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేశారని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందున 20, 21 తేదీల్లో నిర్వహించే డీఎస్సీ పరీక్షలను వాయిదా వేశారన్నారు. వాయిదా వేసిన పరీక్షలను తిరిగీ జులై 1, 2 తేదీల్లో నిర్వహిస్తారన్నారు. మారిన పరీక్ష కేంద్రాలు, తేదీలతో హాల్ టికెట్లు ఈనెల 25వ తేదీ నుంచి https://apdsc.apcfsc.in వెబ్సైట్లో అందు బాటులో ఉంటాయని డీఈఓ వెల్లడించారు. డీపీటీఓగా రాము చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరం ఆర్టీసీ బస్టాండులోని కార్యాలయంలో బుధవా రం డీపీటీఓగా రాము బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న జగదీష్ తిరుపతి డీపీటీఓగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాము బాధ్యతలను స్వీకరించారు. అప్రెంటీస్కు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి ఎడ్యుకేషన్ : టీటీడీ రవాణా శాఖలో ఏడాది పాటు అప్రెంటీస్ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్/కన్వీనర్ పి.గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అప్రెంటీస్కు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లలో పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. పది, ఐటీఐ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ, పాన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో ఈ నెల 30వ తేదీలోపు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోని అప్రెంటీస్షిప్ అడ్వైజర్ సి.గంగాధరానికి దరఖాస్తులను సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 94416 47174, 95507 22922 నంబర్లలో సంప్రదించాలని కోరారు. డీఈఓకు డైట్ ప్రిన్సిపల్గా అదనపు బాధ్యతలు కార్వేటినగరం : చిత్తూరు డీఈఓగా విధులు నిర్వహిస్తున్న బి.వరలక్ష్మికి జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్) ప్రిన్సిపల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో డైట్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శేఖర్ గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఇక ఏకై క సీనియర్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.సుబ్రమణ్యం అన్నమయ్య జిల్లా డీఈఓగా వెళ్లడంతో కార్వేటినగరం డైట్ ప్రిన్సిపల్గా చిత్తూరు డీఈఓ వరలక్ష్మికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిందని, త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. -
తల్లులకు బాబు ఎగనామం
● చంద్రబాబు పాలనపై మాజీ ఉప ముఖ్యమంత్రి మండిపాటు కార్వేటినగరం : నీకు 15 వేలు.. నీకు 15 వేలు అంటూ ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు నేడు తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లులకు ఎగనామం పెట్టారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం మండల పరిధిలోని అల్లాగుంట ఇందిరా కాలనీ వద్ద కూటమి ఏడాది పాలనపై వెన్నుపోటు పుస్తకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకం ద్వారా 84 లక్షల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అందరికీ తల్లికి వందనం అందిస్తానని చెప్పిన నేడు సాంకేతిక సమస్యల పేరుతో లక్షల మందికి మోసం చేశారని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని తొలగించి పేదలకు అన్యాయం చేశారన్నారు. పాఠశాలల విలీనం పేరుతో పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగనన్న ప్రభుత్వంలో మామిడి రైతులకు రూ.30 అందిస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం రూ.5 కూడా చెల్లించక పోవడం దారుణం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు, మండల మాజీ కన్వీనర్ ధనంజయవర్మ, ఎంపీటీ మురగయ్య, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు లోకనాధరెడ్డి, మాజీ సర్పంచ్ఽలు అమీద్, కుప్పారెడ్డి, మునికృష్ణ, నందగోపాల్, దేవరాజ్, స్టీఫెన్, దనశేఖర్యాదవు,గాంధీ,ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. -
మామిడి రైతుల ముట్టడి
– సిఫార్సులకు టోకెన్లు ఇస్తున్నారని మండిపాటు పూతలపట్టు(కాణిపాకం) : పూతలపట్టు మండలం పోలవరంలోని పళ్ల గుజ్జు పరిశ్రమను బుధవారం మామిడి రైతులు ముట్టడించారు. స్థానిక రైతులకు టోకెన్లు ఇవ్వకుండా సిఫార్సులతో టోకెన్లు ఇచ్చేస్తున్నారని ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సిఫార్సులతో వచ్చే వారికి ఎలా టోకెన్లు ఇస్తారని నిలదీశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడారు. దీంతో వాగ్వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలో మామిడి కాయలు లోడింగ్ చేసుకొచ్చిన ట్రాక్టర్లు క్యూ కట్టాయి. -
వీరు రూ. 8 అంటారు.. వారు రూ. 3కి కొంటారు
తోతాపురి మామిడి రైతుకు మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం కిలోకు రూ. 8 మేర కొనాల్సిందే అని కంపెనీలకు చెబుతున్నా, పక్కాగా దాన్ని అమలు చేయడంలేదు. మరోవైపు చిత్తూరు జిల్లా ర్యాంపుల్లో కిలో కాయ ధర రూ. 3 మించి పలకని దైన్యం నెలకొంది. ఈ నేపథ్యంలో తోతాపురి రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాణిపాకం: చిత్తూరు జిల్లాలో తోతాపురి ధరలు పాతాళానికి పడిపోయాయి. ర్యాంపుల్లో కేజీ రూ.3కు మించి కొనుగోలు చేయడంలేదు. ఫ్యాక్టరీలో రూ.5, రూ.6కు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తోతాపురికి మద్దతు ధర కేజీ రూ.8గా నిర్ణయించింది. ప్రభుత్వ ప్రోత్సాహక నిధిగా కేజీకి రూ.4 ఇస్తామని ప్రకటించింది. ఈనెల 14వ తేదీన చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించి, కచి్చతంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ఫ్యాక్టరీలు తోతాపురిని కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ మద్దతు ధర ఎక్కడా అమలుకావడం లేదు. రైతుకు కనీస ధర ఇప్పించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది.కిలో రూ.6 కు తగ్గకుండా చూస్తాంః జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కిలో మామిడికాయల ధర రూ.6కు తగ్గకుండా చూస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి మీడియా సమావేశంలో వెల్లడించారు. ర్యాంపుల్లో రూ.3.50కి కొంటున్నారని తెలిపారు. కిలో రూ. 6లు చెల్లించేలా టాస్్కఫోర్స్ కమిటీ వేస్తామన్నారు. తద్వారా «రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని వివరించారు. ఉద్యానశాఖ కుంటిసాకులు జిల్లాలో మామిడి రైతుల ఆందోళనల నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాయలు పక్వానికి రాకుండా కోత కోయడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని కుంటిసాకులు చెబుతూ మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. అధికారుల తీరుపై జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. మద్ధతు ధర రూ. 8 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టోకెన్ల కోసం తోపులాటలు..తొక్కిసలాటలు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఓ పరిశ్రమ వద్ద టోకెన్ల కోసం మామిడి రైతులు పడరాని పాట్లు పడ్డారు.మంగళవారం సుమారు మూడు గంటల పాటు టోకెన్ల కోసం అవస్థలు పడ్డారు. రద్దీని గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని నియంత్రించి టోకెన్లు జారీ చేశారు. ఈ తరుణంలో ఫ్యాక్టరీ వద్ద గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. టోకెన్ల కోసం గేటు తీసే క్రమంలో తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ముగ్గురు వ్యక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఫ్యాక్టరీల ఆవరణలో వందలాది వాహనాలు మామిడి కాయలను విక్రయించేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులు ఫ్యాక్టరీలకు వచ్చారు. అయితే సరైన మద్దతు ధర లభించని కారణంగా తెచ్చిన కాయలను ఇంటికి తిరిగి తీసుకెళ్లలేక, అయినకాడికి తెగనమ్ముకోలేక వచ్చిన వాహనాల్లో రోజులుగా వేచిచూస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ఆవరణలో వందలాది ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా ఆ వాహనాలు ముందుకు, వెనక్కు కదలకుండా అలానే నిలిచిపోయాయి. -
విలీనం పేరుతో కూటమి నాటకాలు
‘ఈ ప్రభుత్వం(గత వైఎస్సార్సీపీ) బడులను కూడా వదల్లేదు. ఊర్లోనే చిన్న పిల్లలు చదువుకోవడం ఇష్టం లేదు. అందుకే కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. అంతదూరం పిల్లలు ఎలావెళ్తారో కూడా ఆలోచించడం లేదు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విలీన ప్రక్రియకు ఫుల్స్టాప్ పెడుతుంది. ఎక్కడ బడి ఉంటే అక్కడే పిల్లలు చదువుకునేలా అవకాశం కల్పిస్తుంది’ అంటూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ బడులకు ఉరివేశారు. తమ సొంత గ్రామాల్లోనే పేద పిల్లలు చదువుకుంటున్న బడులను సుదూర ప్రాంతాల్లోకి విలీనం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర పిల్లలు నడిచి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. తమ పిల్లల బాధలు తీర్చాలంటూ తల్లిదండ్రులు ఆందోళన బాట పడుతున్నారు.చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వ నిర్ణయాలు పేద విద్యార్థులకు గుదిబండగా మారుతున్నాయి. గ్రామంలోనే చదువుకోవచ్చన్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. విలీనం పేరుతో వేధింపులకు దిగడం.. సుదూర ప్రాంతాలకు తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మోడల్ ప్రైమరీ పాఠశాలలు, ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వ బడులను విలీనం చేయడం విడ్డూరంగా ఉందని పలువురు మండిపడుతున్నారు. పాఠశాలలు యథావిధిగా తమ గ్రామాల్లోనే కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. వినతిపత్రాలు అందించి తమ పిల్లల కష్టాలు చెప్పుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.ప్రభుత్వ బడులపై కూటమి కక్షకూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే జిల్లాలోని సర్కారు బడులపై కక్షగట్టింది. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాల్సింది పోయి విలీనం పేరుతో కత్తి దూసింది. అసంబద్ధత నిర్ణయాలు తీసుకుని పేద విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో మోడల్ ప్రైమరీ పాఠశాలలను నెలకొల్పడంతో చాలా గ్రామాల్లో ప్రభుత్వ బడులు విలీనం అయ్యాయి. పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను దూరాభారం పంపించలేక అష్టకష్టాలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు పిల్లలను బడికి పంపడం మాన్పిస్తున్నారు. మరికొందరు ప్రయివేటు పాఠశాలలకు పంపుతున్నారు.బడికి దూరంజిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విలీన ప్రక్రియ వల్ల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేల మంది విద్యార్థులు బడికి దూరం కావాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,436 పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి 64,519, 1 నుంచి 8వ తరగతి 45,800, 6 నుంచి 10వ తరగతి వరకు 30,898 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 60 మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు) పేరుతో మార్పు చేశారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి ఆఘమేఘాల మీద దొంగ సంతకాలు చేయించుకుని బడులను విలీనం చేశారు. తల్లిదండ్రుల సమ్మతి లేకుండానే తామనుకున్నది నెరవేర్చారు. ప్రస్తుతం బడులు పున:ప్రారంభమయ్యాక తల్లిదండ్రులకు కూటమి చేసిన అసలు విషయం బయటపడింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో విలీన ప్రక్రియ చేపట్టి 498 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో వేల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు.జిల్లాలో 545 ప్రభుత్వ బడులు విలీనంకూటమి ప్రభుత్వం మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరుతో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 545 ప్రభుత్వ బడులను విలీనం చేసింది. ఆ బడులను దూర ప్రాంతాల్లో విలీనం చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేపడుతున్నారు. విలీనం చేసిన బడులను తిరిగి యథాతధంగా కొనసాగించాలని ధర్నాలకు దిగుతున్నారు. ప్రస్తుతం విలీనం చేసిన 545 బడులను మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరుతో 498 పాఠశాలల్లోకి 3,4,5 తరగతులను విలీనం చేశారు. -
గుట్టలనే మింగేస్తున్నారు
పాలసముద్రం: మండలంలోని బాలక్రిష్ణాపురం సమీపంలోని గుట్ట నుంచి తమిళనాడు తమిళనాడు రాష్ట్రానికి ఎర్రమట్టి గ్రావెల్ అక్రమంగా తరలిపోతున్నదని గ్రామస్తులు రెవె న్యూ, పోలీస్ యంత్రాంగానికి తెలిపినా ప ట్టించుకోవడం లేదు. మండలంలో ప్రజలు, రైతులు చెరువులో మట్టి, ఇంటి పక్కన ఉన్న గుంతలను పూడ్చేందుకు ట్రాక్టర్లో మట్టి తీసుకెళ్లుతుంటే మాత్రం రెవెన్యూ అధికారులు ట్రాక్టర్, జేసీబీని సీజ్ చేస్తున్నారు. నెల రోజులుగా టిప్పర్లో కొండను తవ్వేస్తుంటే అధికారులు అటువైపు కన్నెత్తి చూసినవారు లేరని రైతులు అంటున్నారు. టిప్పర్లు తమిళనాడువే, పని చేసేవారు కూడా తమిళనాడు వారే. గ్రామస్తులు కొండలోని మట్టిని ఎందుకు తీసుకెళ్లుతున్నారని అడిగితే వారి బెదిరిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా గుట్టలోని ఎర్రమట్టి రవాణా అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. పుత్తూరు విద్యార్థి ముంబయిలో ఆత్మహత్య ● మంగళవారం పుత్తూరుకు చేరిన మృతదేహం పుత్తూరు: ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్), ఎన్ఐఈఎల్టీ ఫలితాలు రద్దయ్యాయన్న మనస్తాపంతో పుత్తూరుకు చెందిన ఓ విద్యార్థి ముంబయిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన ఎన్ఎస్ జార్జ్, స్వర్ణలత దంపతులకు శ్రీమధుర్, హాషిక ఇద్దరు సంతానం. కుమారుడు శ్రీమధుర్ బీటెక్ పూర్తి చేసి బ్యాంకు కాంపిటీషన్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ముంబయి ఎస్బీఐలో ఐటీ మేనేజర్గా ఉద్యోగం సంపాదించాడు. అయితే ఎన్ఐసీ, ఎన్ఐఈఎల్టీ పరీక్షలో సత్తా చాటాడు. అహర్నిశలు శ్రమించి 5వ ర్యాంకు సాధించాడు. అయితే ఆ పరీక్ష ఫలితాలను కొన్ని సాంకేతిక కారణాలతో ఈ ఏడాది రద్దు చేశారు. తన లక్ష్యానికి అవరోధంగా నిలిచినందుకు మనస్తాపానికి గురైన శ్రీమధుర్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు, తోబుట్టువు కుప్పకూలిపోయారు. తల్లిదండ్రులు ముంబయికి వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసి, మృతదేహాన్ని తీసుకొని మంగళవారం పుత్తూరుకు చేరుకున్నారు. సాయంత్రం అశ్రునయనాల మధ్య శ్రీమాధుర్ అంత్యక్రియలు ముగించారు. శ్రీమధుర్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తన బిడ్డకు జరిగిన అన్యాయం ఏ బిడ్డకూ జరగకూడదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఐసీ పరీక్షల నిర్వాహుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జిల్లాలో దిగజారిన మామిడి ధర
● ర్యాంపుల్లో కేజీ రూ.3లే ● ఫ్యాక్టరీల వద్ద రైతుల పడిగాపులు ● టోకన్ల కోసం గుడిపాలలో తొక్కిసలాట ● సొమ్ముసిల్లిన రైతులు ● అడ్డగోలుగా దళారీ వ్యవస్థ ● పట్టనట్టు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం జిల్లాలో మామిడి ధర పతనమవుతోంది. తోతాపురి ధర దిగజారుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మూలనపడింది. ర్యాంపుల్లోనే కేజీ రూ.3కే అమ్ముడవుతోంది. దీనికితోడు దళారీ వ్యవస్థ అడ్డగోలుగా తయారైంది. తమిళనాడు కాయలను కొని.. ప్రభుత్వ ప్రోత్సాహక నిధి రూ.4 కోసం దందా సాగిస్తోంది. ఈ ప్రభావం జిల్లా రైతులపై పడుతోంది. ఫ్యాక్టరీల వద్ద రైతాంగం పడిగాపులు కాస్తోంది. టోకన్ల కోసం తొక్కిసలాట, తోపులాటలతో సొమ్మసిల్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కాణిపాకం: జిల్లాలో తోతాపురి అవస్థలు తార స్థాయికి చేరాయి. అధిక దిగుబడిని సాకుగా చూపి అందినకాడికి దోచుకునేందుకు ర్యాంపులు తళుక్కుమంటున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 23కి పైగా ర్యాంపులు తెరపైకి వచ్చాయి. వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. మరికొన్నింటికి రిజిస్ట్రేషన్లు లేవని అధికారులే చెబుతున్నారు. కోతలు పెరిగే కొద్దీ ర్యాంపులు తొతాపురి కేజీ రూ.4 నుంచి రూ.3కు తగ్గిపోయింది. జిల్లా కేంద్రంలో అది కూడా కలెక్టరేట్కు కూత వేటు దూరంలో ఉన్న ఓ ర్యాంపులో కేజీ రూ.3కే కొనుగోలు చేస్తున్నారు. అలాగే చిత్తూరు రూరల్ మండలం, బంగారుపాళ్యం, పలమనేరు, పులిచెర్ల, జీడీనెల్లూరు, పెనుమూరు తదితర ప్రాంతాల్లోని ర్యాంపుల్లో కేజీ రూ.3కే ఫిక్స్ అయ్యారు. ర్యాంపుల్లో ఈ రకమైన దోపిడీ అధికమవుతున్నా సంబంధిత అధికారులుగానీ, కూటమి నేతలు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. దళారుల దోపిడీ ఇలా..! మామిడి పంట విషయంలో తమిళనాడు రాష్ట్రం చేతులెత్తేసింది. ఈ కారణంగా అక్కడ మామిడి ధరలు పూర్తిగా క్షీణించాయి. ప్రస్తుతం అక్కడి రైతులు తోతాపురి కేజీ.3కి విక్రయిస్తున్నారు. అయితే ఈ ధరలు దళారులకు కలిసొస్తోంది. వీరు గ్యాంగ్గా ఏర్పడి ఫ్యాక్టరీ నిర్వాహకులతో కుమ్మకై తమిళనాడు కాయలను రూ.3కు కొనుగోలు చేసి జిల్లాలోని ఫ్యాక్టరీలకు తీసుకొచ్చేస్తున్నారు. తమిళనాడు కాయలను ఇక్కడ కేజీ రూ.4, రూ.5కు విక్రయించి దళారులు దండుకునేపనిలో పడ్డారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధి రూ4ను దోచుకోవడానికి కొత్తదారిని ఎంచుకున్నారు. దళారులకు మామిడి పంట లేకున్నా.. రూ.4 కోసం కొత్త దోపిడీని మొదలుపెట్టారు. ఏదో ఒక పట్టా పాసుపుస్తకాన్ని చూపిస్తున్నారు. ఇలా గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, చిత్తూరు, జీడీ నెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్పురం తదితర మండల సరిహద్దు ప్రాంతాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. సమయం లేదు మిత్రమా మేలో సంవృద్ధిగా వర్షాలు కురిశాయి. ఈ వర్షానికి మామిడి పంట పక్వానికి వచ్చింది. రెండు వారాల్లో కోతలు కోయకుంటే ..మామిడికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే తోటలోని కాయలు రాలిపోతున్నాయి. టోకన్లు జూలై నెలాఖరు వరకు ఇస్తే.. అంతవరకు చెట్లోని కాయలు ఏమైపోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. టోకన్ల కోసం గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీ ఎదుట గుమికూడిన రైతులు ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు రైతులకు గుజ్జు పరిశ్రమల వద్ద అవస్థలు తప్పడం లేదు. జీడీనెల్లూరు మండలం ఎట్టేరి సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. టోకన్లు తీసుకున్న రైతులు మామిడి పంటను కోతలు కోసి విక్రయానికి తెచ్చుకున్నారు. వీరి రాకతో కిలో మీటరు మేర ట్రాక్టర్లు, లారీలు క్యూకట్టాయి. ఇలా రెండు, మూడు రోజులు కాయలు ట్రా క్టర్లలోనే ఉండిపోవడంతో కాయలు నల్లగా మారిపోతున్నాయి. గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి 20 ట్రాక్టర్లను ఎలాంటి అనుమతి లేకుండా ఫ్యాక్టరీ వాళ్లను బెదిరించి స్థానిక కూటమి నాయకులు బలవంతంగా ఫ్యాక్టరీకి అంటగట్టారని నిర్వాహకులు వాపోయారు. వారి వల్ల ఇక్కడున్న వందలాది వాహనాలు ఇబ్బంది పడాల్సి వచ్చిందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మా బతుకులు దారుణం మామిడి రైతుల బతుకులు దారుణంగా మారాయి. ఎప్పుడూ లేనంతగా రైతు ఈసారి అవస్థలు పడుతున్నాడు. మామిడి కాయలు అమ్ముకోవడానికి ఇలా క్యూలో పడి నలిగిపోతున్నాము. కేవలం టోకన్ల కోసమే ఈ పరిస్థితి ఉంటే.. వచ్చిన కాయలు అక్కడికక్కడికి అలానే నిలిచిపోయాయి. టోకన్లు జూలై నెలాఖరు వరకు ఇస్తున్నారు. అంత వరకు చెట్లల్లో కాయలు ఉంటాయా..? ప్రభుత్వమే ఆలోచించాలి. –జ్యోతీశ్వర్రెడ్డి, బంగారుపాళ్యం తొక్కిసలాట.. తోపులాట గుడిపాల మండలంలోని ఫుడ్ ఇనోసిస్ ఫ్యాక్టరీ వద్దకు రైతులు మంగళవారం టోకన్ల కోసం వేలా ది మంది తరలివచ్చారు. చిత్తూరు, గుడిపాల, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, యాదమరి, రాష్ట్ర సరిహద్దులోని తమిళనాడు రైతులు సైతం వేకువజామున 5 గంటలకే ఫ్యాక్టరీ ఎదుట భారీగా క్యూకట్టారు. వచ్చిన రైతులను కట్టడి చేయలేక ఫ్యాక్టరీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గుడిపాల పోలీసులు అదనంగా ఎస్టీఎఫ్ సిబ్బందిని రప్పించారు. ఒక్కసారిగా రైతులు ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. టోకన్ల కోసం ముందు వరుసలో నిలవాలని పోటీ పడ్డారు. ఇలా మూడు గంటలపాటు అక్కడ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తో పులాట, తొక్కిసలాటలు జరిగాయి. ఓ వ్యక్తి తొ క్కిసలాటలో నలిగిపోయాడు. మరో వ్యక్తి సొమ్మ సిల్లి పడిపోయాడు. ఓ మహిళ కూడా గేటు తీసి టోకన్ల కోసం లోపలికి అనుమతించే క్రమంలో సొమ్మసిల్లింది. పోలీసులు తక్షణం స్పందించాల్సి వచ్చింది. -
వివాహిత ఆత్మహత్య!
పలమనేరు: మున్సిపాలిటీ పరిధిలో ని గంటావూరు బీసీ కాలనీకి చెందిన విన్సీప్రియ(34) అనే మహిళ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడింది. ఈ ఘటన మంగళవారం పలమనేరులో వెలుగులోకి వచ్చింది. స్థానిక సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల మేరకు.. మృతురాలి భర్త పసుపతి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో భార్య, ఏడేళ్ల కుమారుడు ఉంటున్నారు. ఇలా ఉండగా డ్యూటీలో భాగంగా విజయవాడలో ఉన్న భర్త సోమవారం రాత్రి భార్యతో మాట్లాడినట్టు సమాచారం. అయితే మంగళవారం పొద్దున నుంచి తన భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె లిప్ట్ చేయలేదు. దీంతో తమ ఇంటి పక్కనున్న వారికి చెప్పగా వారు వెళ్లి చూడగా ఉరేసుకుని ఉండడంతో అదే వీధిలో ఉంటున్న మృతురాలి తల్లికి సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో మృతురాలి కొడుకు అమ్మమ్మవద్దే ఉన్నాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దించి ఆమె భర్తకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు. మరోవైపు స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
చిరు దుకాణంలో అగ్నిప్రమాదం
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి పక్కన ఉన్న చిరుదుకాణంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తినుబండారాలు తయారు చేసే ఆ చిరుదుకాణంలో గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బేకరిలోని వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ.10 వేల వరకు ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. -
మామిడి రైతుకు కూటమి శఠగోపం
కార్వేటినగరం: మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం శఠగోపం పెట్టేసిందని, మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం ఉడమలకృత్తి గ్రా మంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ఉ మ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి రైతులకు ఎక్కడా సంతోషం లేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పరిశ్రమలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. గత జగనన్న ప్రభుత్వంలో కిలో మామిడి రూ.30 వరకు చెల్లించినట్టు ఆయన గు ర్తుచేశారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం కిలో రూ.4కు పరిమితం చేయడం సమంజసం కాదన్నారు. పరిశ్రమలు ఇచ్చే టోకన్లలోనూ రాజకీయాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిని రైతులు ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదు చేసి వేధించడం పనిగా పెట్టుకున్నట్టు విమర్శించారు. మామిడి రైతుల నుంచి దళారులు అతి తక్కువ ధరలకు పంటను కొనుగోలు చేస్తుంటే అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వెంటనే మామిడి రైతు కన్నీళ్లు తుడాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆరోపించారు. పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాలికలు, మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇలాక కుప్పం నియోజకవర్గంలో భర్త చేసిన అప్పు చెల్లించలేదని భార్య శిరీషను చెట్టుకు కట్టి దాడి చేసిన పచ్చనేతపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత బాలికపై 14 మంది టీడీపీ కామాంధులు అత్యాచారానికి ఒడిగడితే వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. -
తోతాపురి కిలో రూ.6
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తోతాపురి కిలో రూ.6కు తగ్గకుండా చూస్తామని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ జి.విద్యాధరి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఆమె తోతాపురి మామిడి కాయల కొనుగోలు ప్రక్రియపై మీడియాతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 98 వేల ఎకరాలలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి పండిస్తున్నారని చెప్పారు. జిల్లాలో 35 ప్రొసెసింగ్ యూనిట్లు ఉండగా అందులో 27 పరిశ్రమలు మాత్రమే మామిడి పండ్ల ప్రొసెసింగ్ చేస్తున్నాయన్నారు. గుజ్జు పరిశ్రమల ద్వారా రోజూ దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల మామిడి ప్రొసెసింగ్ జరుగుతోందన్నారు. మామిడి రైతులు నష్టపోకూడనే ఉద్దేశంతో తోతాపురి మామిడి కిలో రూ.12గా మద్దతు ధర నిర్ణయిస్తూ జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఇందులో గుజ్జు పరిశ్రమలు రూ.8 చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం అధనంగా రూ.4 మద్దతు ధరను రైతుల ఖాతాలకు నేరుగా జమచేస్తుందన్నారు. 38 ర్యాంపులు, 2 మండీల వద్ద అమ్ముకునే రైతులకు కూడా ప్రభుత్వం రూ.4 మద్దతు ధరను అందిస్తుందన్నారు. మామిడి కాయల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి ప్రొసెసింగ్ యూనిట్, మండీలు, ర్యాంప్ వద్ద హార్టికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక వీఆర్వోతో కూడిన టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని మామిడి రైతులకు సమస్యలుంటే 08572–242777, 9491077325 హెల్ప్లైన్లోకు సంప్రదించాలని కోరారు. గత ఎనిమిది రోజుల నుంచి తోతాపూరి మామిడికాయలు 38 వేల టన్నులు ఫ్యాక్టరీలకు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. -
రాష్ట్రాల మధ్య వివాదాల పురి
తోతాపురి మూడు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆజ్యం పోసింది. ఆయా రాష్ట్రాల నుంచి మామిడి దిగుమతి కాకుండా చేస్తోంది.ధరలు వి‘ఫలం’! జిల్లాలో మామిడి ధరలు భారీగా పతనమయ్యాయి. ర్యాంపుల్లో కిలో రూ.3 లెక్కన పలుకుతోంది. బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025● మాది చిత్తూరు రూరల్ మండలం, అనంతాపురం గ్రామం. మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను 16 కి.మీ దూరంలో ఉన్న బీఎన్ఆర్.పేట గ్రామంలోని పాఠశాలలో విలీనం చేశారు. బీఎన్ఆర్ పేటకు వెళ్లాలంటే నాలుగు చెరువులు దారిలో ఉన్నాయి. చిత్తూరు–తిరుత్తణి హైవే ఉంది. ఇలాంటి ప్రమాదపు దారుల్లో పిల్లల్ని ఎలా పంపాలి. ● గంగాధరనెల్లూరు మండలం, నెల్లేపల్లి పంచాయతీ, కొత్తూరు గ్రామంలో ఉన్న పాఠశాలను కూట మి ప్రభుత్వం సమీపంలో ని నెల్లేపల్లి మోడల్ ప్రాథమిక పాఠశాలలోకి విలీ నం చేసింది. చాలా దూరంలో ఉన్న ఈ పాఠశాలకు మా పిల్లల్ని పంపాలంటే కష్టంగా ఉంది. కూటమి వింత నిర్ణయం వల్ల పిల్లల కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. ● మాది గంగాధరనెల్లూరు మండలం, అగ్రహారం గ్రామం. మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల పిల్లలను కే.వీ.పురం పాఠశాలలో విలీనం చేశారు. దీని వల్ల 40 మంది విద్యార్థులు దూర ప్రాంతంలో ఉన్న కేవీ పురానికి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాలను మార్చకూడదని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో మూడు సార్లు నిర్ణయం తీసుకుని ఎంఈవోకు ఇచ్చినా ఫలితం లేకపోయింది.● మాది వెదురుకుప్పం మండలం, యనమల మంద గ్రామం. మా గ్రామంలో దాదాపు 520 కుటుంబాలు ఉన్నాయి. 50 మంది పిల్లలు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నారు. ఇప్పుడు పాఠశాలను దూర ప్రాంతంలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేశారు. విలీనం వల్ల మా పిల్లలు నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో వెళ్లాల్సి వస్తోంది. ఇది న్యాయమేనా?. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ -
అదే పట్టుగూళ్లు, టమాటాలకు ఏడాదంతా సీజనే
జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో ఎక్కువగా పట్టుగూళ్లు, టమాటా సాగవుతోంది. ప్రస్తుతం 36వేల ఎకరాల్లో 22 వేలమంది రైతులు మల్బరీని సాగుచేస్తున్నారు. ఏటా 1500 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ పండించిన పట్టుగూళ్లను పలమనేరు, కుప్పం, మదనపల్లి పట్టుగూళ్ల విక్రయకేంద్రాలకు తీసుకెళ్లాలి. కానీ ఇక్కడికంటే కర్ణాటకలోని కోలారు, విజయపుర, సిడ్లగట్ట, రామనగరలలో ధర ఎక్కువగా పలుకుతుంది. దీంతో ఇక్కడ ఉత్పత్తయ్యే గూళ్లలో 20 శాతానికి పైగా అక్కడికే చేరుతోంది. ఇక టమాటాలు ఇక్కడి నుంచి కర్ణాటకలోని కోలారు, తమిళనాడులోని కోయంబేడు( చైన్నె) మార్కెట్లకు నిత్యం వందలాది టన్నుల సరుకు వెళుతోంది. -
అల్లుడి అరెస్ట్
పుత్తూరు: పట్టణ పరిధిలో ని కళ్యాణపురం ఎస్టీ కాలనీలో జరిగిన హత్య కేసులో నిందితుడ్ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సురేంద్రనాయుడు కథ నం మేరకు.. గ్రామానికి చె ందిన చెంచయ్య భార్య ఎన్.నరసమ్మ(53) ఈనెల 4వ తేదీన హత్యకు గురైంది. నరసమ్మ పెద్ద కుమార్తె ఎన్.కళ్యాణిని జీ.మోహన్కు ఇచ్చి 2019లో వివాహం చేసింది. పెద్ద అల్లుడు మోహన్ వివాహం అయినప్పటి నుంచి తాగుడికి బానిసై భార్యాబిడ్డలను పట్టించుకునేవాడు కాదు. దీంతో విసుగు చెందిన కళ్యాణి బిడ్డలతో నెల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో మోహన్ అత్త ఇంటికి వచ్చి తన భార్యను కాపురానికి పంపా లని నరసమ్మను అడిగాడు. వీరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశానికి లోనైన మోహన్ కర్రతో నరసమ్మ తలపై బలంగా కొట్టాడు. ఆమె కు మార్తె కళ్యాణి తల్లి నరసమ్మను మొదట పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 6వ తేదీన నరసమ్మ మృతి చెందింది. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు మోహన్ను మంగళవారం తడుకు బస్ స్టాప్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
పీఎం శ్రీకి షాక్
చిత్తూరు కలెక్టరేట్/ తిరుపతి ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకుండా నాన్చుతోంది. ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకటించే సమయంలో బీజేపీ మేనిఫెస్టోకు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలకు పథకాలు ఇవ్వకుండా మినహాయించింది. ఫలితంగా వేలాది మంది పేద విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందలేకపోయారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకత్వం ఈ నెల 21న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పీఎంకు ఈ మెయిల్స్ పంపిస్తున్నా రు. అయితే పీఎం కార్యాలయం నుంచి విద్యార్థులకు, ఆ పాఠశాలలకు ఇంకా ఎలాంటి సమా ధానం రాలేదు. ఈ సమాచారం అందుకున్న కూటమి ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులను, తల్లిదండ్రులను సచివాలయాల్లో ఫిర్యా దు చేసుకోవాలని సూచించింది. అయితే సచివాలయ సిబ్బంది మాత్రం తల్లికి వందనం దరఖాస్తులను ఆయా బడుల్లోనే చేసుకోవాలని వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలలకు సమాచారం చేరవేశారు. ఈ సమయంలో ఈ పథకం వర్తింపుపై బీజేపీ శ్రేణులే చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.వేల మందికి నష్టంతిరుపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో పీఎం శ్రీ పాఠశాలలు 2, రేణిగుంటలో 1, ఏర్పేడు ఐఐటీలో 1, వెంకటగిరిలో 1 మొత్తం 5 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 30 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ఒక్క విద్యార్థికి సైతం తల్లికి వందనం నగదు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.లోలోపలే కక్ష సాధింపులుపైకేమో కూటమి సర్కారు అంటూ ఆర్భాటాలు...లోపలేమో కక్ష సాధింపులు. తాజాగా విడుదలైన తల్లికి వందనం పథకంలో సెంట్రల్ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాలల విద్యార్థులకు తల్లికి వందనం పథకం మంజూరు చేయని దుస్థితి. గత వైఎస్సార్సీపీ సర్కారులో ఎలాంటి తారతమ్యం లేకుండా అన్ని యాజమాన్యాల పిల్లలకు అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు తమతో పాటే ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల టీడీపీ కక్ష సాధింపు ధోరణి చేస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్స్ లో వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం మంజూరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. ఎన్నికల సందర్భంగా టీడీపీ రూపొందించిన మేనిఫెస్టోను బీజేపీ విస్మరించడంతోనే ఇలా కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
9న ఆశావర్కర్ల సమ్మె
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన సమ్మెకు దిగుతున్నట్లు ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణిని కలిసి సమ్మె నోటీసును అందజేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఆశవర్కర్లకు కనీస వేతనం అమలు చేయాని, సమస్యలపై స్పందించి పరిష్కరించేలా చూడాలన్నారు. ఆశా వర్కర్లకు అదనపు పనులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నిరసనలకు అనుమతి తప్పనిసరి చిత్తూరు అర్బన్: బహిరంగ ప్రదేశాల్లో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలంటే తప్పనిసరిగా డీఎస్పీ స్థాయి అధికారి నుంచి అను మతి తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతియుత ర్యాలీ లు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేప్పుడు ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు సంబంధిత వ్యక్తులు పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. డీఎస్పీకి రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే, ఆయన పరిస్థితిని సమీక్షించి అనుమతలిస్తేనే కార్యక్రమాలు జరుపుకోవాలన్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు బాబోయ్! చిత్తూరు కార్పొరేషన్: నివాసాలకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య మాట్లాడారు. ఇళ్లకు అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ విధానంతో భవిష్యత్లో పలు ఇబ్బందులు రావడం ఖాయమన్నారు. ఇందులో బిల్లులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జవాబుదారీ తనం కూడా ఉండదన్నారు. వీటిని దశలవారీగా ప్రీపెయిడ్ మీటర్లకు మారుస్తారన్నారు. అప్పుడు ముందుగానే వాటికి రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాత్రుల్లో కరెంటు పోతే రీచార్జ్ చేస్తే గానీ విద్యుత్ సరఫరా కాదన్నారు. నాయ కులు సురేంద్రనాథ్, శ్రీనివాసమూర్తి, సౌక త్, మునస్వామి, రషీద్, సురేంద్రనాథ్, రో జా, కోమల, విజయగౌరి, రవి, విజయభాస్కర్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో నియామకాలు చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీలో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురికి రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు కల్పిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలు వెల్లడించింది. నగరి నియోజకవర్గానికి చెందిన చిరంజీవిని రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శిగా, పలమనేరు నియోజకవర్గానికి చెందిన నాగరాజును రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, కుప్పం, శ్రీకాళహస్తి, సూళ్లూ రుపేట నియోజకవర్గాలకు చెందిన రాజచంద్రశేఖర్గౌండర్, వెంకటరమణయ్య, జయరామయ్యను రాష్ట్ర కల్చరల్ వింగ్ కార్యదర్శులుగా నియమించినట్టు పేర్కొంది. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 84,681 మంది స్వామి వారిని దర్శించుకోగా 35,261 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.43 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
రాష్ట్రాల మధ్య వివాదాల పురి
కర్ణాటకలో ధర ఎక్కువ మేం ఎన్నో ఏళ్లుగా పట్టు గూళ్లను కర్ణాటకలోని మార్కెట్లకు తీసుకెళుతున్నాం. ఎందుకంటే ఇక్కడి మార్కెట్లలో కంటే అక్కడ కేజీపై రూ.40 నుంచి రూ.50 ఎక్కువగా పలుకుతోంది. ఇక్కడ తక్కువ ధరలకు అమ్మి ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటీవ్ కంటే అక్కడ అమ్మితే ఎక్కువగా దక్కుతుంది. అందుకే కర్ణాటక మార్కెట్లకు గూళ్లను అమ్ముతున్నాం. – రెడ్డెప్ప రెడ్డి, పట్టు రైతు, టీఎస్ అగ్రహారం, పలమనేరు కోలారు మార్కెట్లో అమ్మేస్తా నేను ఏటా సీజన్తో సంబంధం లేకుండా పదెకరాల్లో టమాటా సాగుచేస్తా. ఎక్కువ పె ట్టుబడి పెట్టి కేవలం హైబ్రిడ్ సీడ్స్మాత్రమే ఎంచుకుంటా. ఈ సరుకు ఇక్కడి మార్కెట్లో ఆశించిన ధరతో అమ్ముడుపోదు. అందుకు క ర్ణాటకలోకి కోలారు టమాటా మార్కెట్కు తీ సుకెళ్తాం. అక్కడికి ఇక్కడికి ధరలో వ్యత్యాసం ఉంటుంది. – గోవిందురెడ్డి, టమాటా రైతు, బేరుపల్లి, పలమనేరు మండలం జిల్లాలో మామిడి సీజన్ నడుస్తున్న నేపథ్యంలో మామిడి ధరలు నిలకడగా ఉండాలని పొరుగు రాష్ట్రాల నుంచి తోతాపురి కాయలు జిల్లాలోకి రాకుండా అధికార యంత్రాంగం ఇప్పటికే ఆంక్షలను విధించింది. ఇటీవల చిత్తూరుకొచ్చిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సైతం పొరుగు రాష్ట్రాలనుంచి మామిడి ఇక్కడికి రాకూడదని దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం గమనార్హం. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తెచ్చేలా ఉంది. పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీజన్తో సంబంధం లేకుండా పట్టుగూళ్లు కర్ణాటకలోని పలు మార్కెట్లకు ఇక్కడి రైతులు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అదే విధంగా టమాటాలు అటు కర్ణాటకలోని కోలారు ఇటు తమిళనాడులోని చైన్నై కోయంబేడు మార్కెట్కు నిత్యం వెళుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రాలనుంచి జిల్లాలోని గుజ్జు పరిశ్రమలకు వచ్చే తోతాపురిని మనం అడ్డుకుంటే వారు అదే విధంగా కట్టడి చేస్తే ఇక్కడి టమాటా, పట్టుగూళ్ల రైతుల పరిస్థితి ఏంటనే మాట రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రాల మధ్య వివాదాలకు ఆజ్యం? కర్నాటక, తమిళనాడునుంచి జిల్లాలోకి మామిడి కాయలు రాకుండా ఆంక్షలు విధించారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద రెవెన్యూ యంత్రాంగం కాపాలా కాస్తోంది. దీనికి కారణం జిల్లాలో ఈ దఫా మామిడికి గిట్టుబాటు ధర లేదు. కలెక్టర్ చెప్పినా కిలోకు రూ.8 ఇవ్వలేమని గుజ్జుపరిశ్రమల నిర్వాహకులు మొండికేస్తున్నారు. కనీసం రూ.6 కూ కొనడంలేదు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలనుంచి మామిడి రాకుంటే జిల్లాలోని మామిడికి ధర పెరుగుతుందని అధికారులు ఆంక్షలను పెట్టారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఘాటుగా స్పందించి మన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇది రాష్ట్రాల మధ్య వివాదాలకు దారితీసేలా ఉంది. మామిడి సీజన్ కొన్నాళ్లే జిల్లాలో 87వేల ఎకరాల్లో మామిడి తోటలుంటే ఏటా సీజన్లో 7లక్షల టన్నుల దిగుబడి వస్తున్నట్టు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మామిడి సీజన్ ప్రధానంగా మే నుంచి జూలై ఆఖరుదాకా సాగుతుంది. జిల్లాలో సాగయ్యే మామిడిలో తోతాపురి 55శాతం ఉంది. జిల్లాలో 15కుపైగా గుజ్జుపరిశ్రమలున్నాయి. తోతాపురిని పల్ప్ ఫ్యాక్టరీలకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్రాలు వీటిపై మెలిక పెడితే... చిత్తూరు జిల్లానుంచి పట్టుగూళ్లు, టమాటాలను కర్ణాటకలో కొన మని ఆ రాష్ట్రం ఆంక్షలు పెడితే ఇక్కడి రైతుల పరిస్థితేంటనే మాట వినిపిస్తోంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం ఇక్కడి టమాటాలను వద్దంటే అప్పుడు టమాటా ధరలు మరింత పతనం కావడం తథ్యం. ఇప్పటికే టమాటా ధరలు తగ్గుముఖం పట్టి జిల్లాలోని రైతులు తీవ్రనష్టాల్లో మునిగిపోయారు. ఇదే పరిస్థితి రేపు పట్టుగూళ్ల రైతులకు వస్తే రైతులకు కష్టాలు మొదలై పొరుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల తోతాపురిపై కూటమి ఆంక్షలు జిల్లా నుంచి కర్ణాటకకు మన పట్టుగూళ్లు తమిళనాడుకు ఇక్కడి టమాటాలు వెళుతున్నాయి వీటికి ఆ రాష్ట్రాలు అడ్డుకట్ట వేస్తే పరిస్థితేంటి? -
అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నా
కుప్పం రూరల్: ‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే. తీవ్రంగా గాయపడిన శిరీష ప్రస్తుతం కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే.మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది. నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు. మా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించింది.నలుగురికి రిమాండ్ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు శిరీషను హోంమంత్రి అనిత, జిల్లా ఇన్చార్జి మంత్రి రామ్ప్రసాద్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును ఆదేశించారు. కాగా.. శిరీషపై దాడిచేసిన మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు రాజా, వెంకటమ్మ, జగదీశ్వరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అండగా ఉంటాం: ఎమ్మెల్సీ భరత్ కూటమి ప్రభుత్వం రాగానే సామాన్యులపైనా దాడులు ఎక్కువయ్యాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఎయిర్పోర్ట్ భూముల విషయంలో టీడీపీ కార్యకర్తలు మగ దిక్కులేని కుటుంబంపై దాడిచేసిన ఘటన మరువక ముందే కుప్పం మండలం నారాయణపురంలో మరో ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. భర్త అప్పులు చేస్తే భార్యను చెట్టుకు కట్టేసి బట్టలు చించేందుకు ప్రయత్నించడం చాలా దారుణమన్నారు. విడతల వారీగా అప్పు తీరుస్తానని మహిళ మొర పెట్టుకుంటున్నా చెట్టుకు కట్టేసి కొట్టడం అత్యంత హేయమైన చర్య అన్నారు. కొడుకు చూస్తుండగా, తల్లిని కొడుతూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో తెలియడం లేదని ఆవేదన చెందారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం మరింత దారుణమన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని భరత్ చెప్పారు. -
కడుపు మండిన మామిడి రైతులు
కాణిపాకం: కడుపు మండిన తోతాపురి మామిడి రైతులు సోమవారం కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనలేమంటూ కంపెనీలు చేతులెత్తేయడంతో చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారులపై నిరసన తెలిపారు. చిత్తూరు, జీడీనెల్లూరు, బంగారుపాళ్యం, తవణంపల్లి మండలాల్లోనూ రైతులు ఆందోళనలు చేశారు. చిత్తూరు గంగసాగరం ఫ్యాక్టరీలో మామిడి కొనుగోలుకు టోకెన్లు జారీ చేస్తున్నారని ప్రకటించడంతో మామిడి రైతులు ఆదివారం అర్థరాత్రి నుంచే అక్కడ పడిగాపులు పడ్డారు.సోమవారం ఉదయం 5 గంటల సమయానికి వందలాది రైతులు టోకెన్ల కోసం గుమిగూడారు. టోకెన్లు పంపిణీ చేయకపోగా గేట్లు మూసివేయడంతో రైతులు కర్మాగారాన్ని చుట్టుముట్టారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఇద్దరు మహిళా రైతులు స్పృహతప్పేలా ఉండడంతో రైతులంతా హాహాకారాలు చేశారు. దీంతో ఫ్యాక్టరీ సిబ్బంది మహిళా రైతులను లోపలకు అనుమతించారు. పోలీసులు రైతులను అదుపు చేసే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అరకొరగా టోకెన్లు పంపిణీ చేసి మళ్లీ వచ్చేనెల 5న ఇస్తామంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం బోర్డు పెట్టింది. దీంతో రైతులు ఉసూరు మన్నారు.గంగాధర నెల్లూరు మండలంలోని ఫ్యాక్టరీ వద్ద కూడా టోకెన్లు ఇస్తారంటూ ప్రచారం చేయడంతో రెండు, మూడు రోజులుగా రైతులు మామిడి కాయలతో పడిగాపులు పడ్డారు. సోమవారం ఉదయానికీ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. బంగారుపాళ్యం మండలంలోనూ ఫ్యాక్టరీ టోకెన్లు ఇవ్వలేదని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై రైతులు నిరసనకు దిగారు. తవణంపల్లి మండలంలోనూ ఫ్యాక్టరీ నిర్వాహకులు మామిడి కొనలేమని బోర్డు పెట్టేసింది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించినట్టు రూ.8కి మామిడి కాయలు కొనలేమని, రూ.5కూ కష్టమేనని ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. -
ఆటో దొంగల అరెస్టు
చిత్తూరు అర్బన్: ఆటోలు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను వన్టౌన్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పట్టుబడిన ఆ ఇద్దరినీ చిత్తూరు నగరంలోని పోలీసుల అతిథి గృహంలో సీఐ మహేశ్వర అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు, ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటోలు చోరీకి గురవుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చేసిన దర్యాప్తులో దొంగలు తిరుపతివాసులుగా తేలడంతో వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, చిత్తూరు కట్టమంచి వద్ద పట్టుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరూ తిరుపతి జీవకోనకు చెందిన కొండల ఆదినారాయణ, చిన్నంగారి షణ్ముగంగా గుర్తించారు. వారి నుంచి రూ.10.50లక్షలు విలువ చేసే మూడు ఆటోలు, ఒక ఆటో విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశామని, రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. -
ఇంత నీచ రాజకీయం తగదు బాబూ..
పుంగనూరు(చౌడేపల్లె): ఇలాంటి నీచ రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప అన్నారు. ఆయన సోమవారం పుంగనూరులో పార్టీ నాయకులతో కలిసి జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, మహిళలకు రక్షణలేదని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలీం బాషా, రాష్ట్ర జానపద కళల మాజీ చైర్మన్ కొండేటి నాగభూషణం, రాయలసీమ మైనారిటీ విభాగం నాయకుడు ఫకృద్దీన్ షరీఫ్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు అమరనాథరెడ్డి, ఇర్ఫాన్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. భక్తులు సంతృప్తి చెందేలా చర్యలు చౌడేపల్లె: ఆలయాలకు వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా దైవ దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ రాష్ట్ర కమి షనర్ రామచంద్రమోహన్ తెలిపారు.షాయన సోమవారం బోయకొండలో పర్యటించగా, ఈఓ ఏకాంబరం స్వాగతం పలికారు. ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులకు అందుతున్న సేవలు, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంయుక్త కమిషనరేట్ పరిధిలో ఉన్న 7 ఆలయాలు, ఉపకమిషనరేట్ పరిధిలో ఉన్న 17 ఆలయాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
● వారం క్రితం నగల దుకాణంలో చోరీ ● ఎట్టకేలకు పట్టుబడిన నిందితుడు ● ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు చిత్తూరు అర్బన్: అంతర్రాష్ట్ర దొంగకు సినిమాలంటే మోజు. ఆ మోజుతో సినిమా తీసి అప్పుల్లో కూరుకుపోయాడు. బాలనేరస్తుడిగా మొదలై ప్రస్తుతం 23 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల చిత్తూరులోని ఓ బంగారు దుకాణంలో చోరీ చేసి పోలీ సుల చేతికి చిక్కాడు. నగరంలోని పోలీసుల అతిథి గృహంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు సమక్షంలో పోలీసులు అతడిని అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. చిత్తూరు నగరం జెండామానువీధిలోని శరవణ బంగారు దుకాణంలో ఈనెల 4వ తేదీన చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం తలుపులు పగలగొట్టి 126 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. షాపు యజమాని శరవణ ఆచారి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు దొంగ ను పట్టుకోవడానికి కసరత్తులు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగ జాడలను పసిగట్టారు. కర్ణాటక రాష్ట్రం ఎంఆర్ఎస్ పాళ్యకు చెందిన ఆనంద్గా నిర్ధారణకు వచ్చారు. చాకచక్యంగా అతడిని పట్టుకుని, రూ.11.80 లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.3 లక్షలు విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు. సినిమా మీద పిచ్చితోనే దొంగతనం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కీచకుడు అనే కన్నడ సినిమాను తెరకెక్కించాడని..అయితే అది రిలీజ్కు నోచుకోలేదని పోలీసులు వెల్లడించారు. ఈ సినిమా పిచ్చి వల్ల చోరీలకు అలవాటు పడ్డాడని పోలీసులు వివరించారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో బాలనేరస్తుడిగా మద్రవేసుకుని, మొత్తం 23 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టూటౌన్ సీఐ నెట్టికంఠయ్య, ఇతర పోలీసు అధికారులను అడిషనల్ ఎస్పీతో పాటు డీఎస్పీ సాయినాథ్ అభినందించారు. బైక్ దొంగతనాలను అరికడుతామని, త్వరలో అరెస్టులు ఉంటాయని అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. -
ఇంకెన్ని సార్లు తిరగాలో..?
● వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు విచ్చేసిన ప్రజలు ● వినతులు స్వీకరించిన ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ● పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలు 254 చిత్తూరు కలెక్టరేట్ : ‘‘మా సమస్యలు ఇంకెన్ని సార్లు విన్నవించుకోవాలి, ఇంకెన్ని సార్లు తిరగాలో ఏమో..’’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు మార్లు అర్జీలిస్తున్నప్పటికీ తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని బాధితులు దిగులు చెందుతున్నారు. కలెక్టరేట్లో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలను ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి స్వీకరించారు. పలు సమస్యలపై 254 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. దివ్యాంగ పింఛన్ మంజూరు చేయండి అన్ని అర్హతలున్నప్పటికీ తనకు దివ్యాంగ పింఛన్ ఇవ్వడం లేదని పలమనేరుకు చెందిన దివ్యాంగుడు నాగం ఆవేదన వ్య క్తం చేశారు. తనకు 100 శాతం వైకల్యం ఉన్నట్లు తెలిపారు. దివ్యాంగ పింఛన్ కోసం పలు మార్లు అధికారులకు అర్జీ ఇచ్చినప్పటికీ ఎవరూ న్యాయం చేయడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. దివ్యాంగులపై కనికరం చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనమైనా ఇవ్వండి... పథకాలైనా వర్తింపచేయండి అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ వేతనమైనా ఇవ్వాలి లేదా సంక్షేమ పథకాలైనా వర్తింప చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ మేరకు అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు లలిత, షకీల మాట్లాడుతూ సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను నమోదు చేసి తప్పుచేశారన్నారు. వితంతువులకు పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గిరిధర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయ, సుజని, ధనకోటి, ప్రమీల, సరళ, కస్తూరి, లీలా పాల్గొన్నారు. దళితులను వెలివేయాలని చూస్తున్నారు దళితులను గ్రామం నుంచి వెలివేయాలని అగ్రకులస్తులు చూస్తున్నట్లు చిత్తూరు నగరం మాపాక్షి రెవెన్యూ ఉయ్యాలచింత గ్రామస్తులు జయ, పార్వతి, జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ చిత్తూరు నగరం 13వ వార్డు లో సర్వే నెంబర్ 123 లో 30 ఏళ్ల నుంచి జీవిస్తున్నామన్నారు. తమకు ప్రభుత్వం రాస్తా పోరంబోకు స్థలంలో ఇంటి స్థలాలు మంజూరు చేసిందన్నారు. ఇటీవల కొందరు అగ్రకులస్తులు వచ్చి వెలివేయాలని చూస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు రాష్ట్ర ప్రభుత్వం అదానీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లా డుతూ పేదలకు నష్టం జరిగే స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆ సంఘం నాయకులు శ్రీనివాసమూర్తి, షౌకత్, మునస్వామి, రషీద్, రాజేంద్రన్ పాల్గొన్నారు. -
ఇది ముంచే ప్రభుత్వం
● నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ● ఆయనకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య ● ‘5 కోట్ల మందికి వెన్నుపోటు’ పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి రోజా నగరి : ‘కూటమి నాయకులు మాది మంచి ప్రభుత్వం అంటూ డప్పు కొట్టుకుంటుంటే.. ప్రజలు మాత్రం ఇది ముంచే ప్రభుత్వం అంటున్నారు’ అని మాజీ మంత్రి ఆర్కేరోజా ఎద్దేవా చేశారు. నగరి పట్టణంలోని తన నివాసంలో సోమవారం ‘5 కోట్లమందికి వెన్నుపోటు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం అనేది వెన్నతో పెట్టిన విద్య అని ముక్త కంఠంతో జనం చెబుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇస్తామని ఏడాదైనా సూపర్ సిక్స్ పథకాలు అమలు లేదన్నారు. నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ లేదు, ఉచిత బస్సు లేదు. 18 యేళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 లేదు, ఇప్పటి వరకు ప్రజలకు సెంటు భూమి ఇవ్వలేదని గుర్తుచేశారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో జన తాకిడి చూసిన తర్వాత భయపడి తల్లికి వందనం హడావుడిగా విడుదల చేశారన్నారు. అది కూడా 87 లక్షల మందికి అందాల్సిన పథకం కేవలం 57 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకే ఆధార్ నెంబర్తో 349 మందికి, 54 మందికి, 92 మందికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులను అనర్హత కింద పరిగణించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ పాలనలో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి తీసుకుంటే రాద్ధాంతం చేసిన చంద్రబాబు, నేడు రెండు వేలు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మూలన ఉండే ముసలమ్మ కూడా బలన్ నొక్కుతుందన్న చంద్రబాబు ఒక్క బటన్ నొక్కడం కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి..ఎల్లో మేనిఫెస్టో అమలు చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ పెరిగిపోయాయని వాటిని అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు పీజీ నీలమేఘం, హరి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, దీప, మున్సిపల్ వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారులకు న్యాయం చేయండి
చిత్తూరు అర్బన్: ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలిగించకుండా, వచ్చిన ఫిర్యాదులను త్వ రితగతిన పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూ రు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వేధింపులు, కుటుంబ సభ్యులు, దారి సమస్యలకు సంబంధించి మొత్తం 14 అర్జీలు వచ్చాయి. వీటిని పరిశీలించి ఫిర్యాదులకు న్యాయం చేయాలని ఆయన ఆదేశించారు. మామిడి తోటల్లో గజ దాడులు పలమనేరు: మండలంలోని ఎలిఫెంట్ క్యాంపు పక్కనే ఉన్న ముసలిమడుగు సమీపంలోని మామిడి తోటల్లో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు దాడి చేసింది. కాయలను తిని, కొమ్మలను విరిచేసినట్టు గ్రామస్తులు తెలిపా రు. పంటనష్టాన్ని స్థానిక ఫారెస్ట్ సిబ్బంది సోమవా రం పరిశీలించి పరిహారానికి నివేదికలు సిద్ధం చేశారు. అడవిలోంచి వచ్చి రైతుల పంటలను రుచిమరిగిన మదపుటేనుగులను కుంకీ ఏనుగులు అదుపు చేయడం చాలా కష్టమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. అయితే ఇక్కడి ఏనుగుల సమస్యను కుంకీ ఏనుగుల ద్వారా అటవీశాఖ ఎలా కట్టడి చేస్తారో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తండ్రి మరణానికి కారణమైన కుమారుడు అరెస్టు చౌడేపల్లె: కన్నతండ్రి మరణానికి కారణమైన కుమారుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ ఐ నాగేశ్వరరావు సోమవా రం తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు, చౌడేపల్లె మండలం అంకుతోటపల్లెకు చెందిన చిన్నప్పరెడ్డి, రాజమ్మ దంపతుల కుమారుడు మనోహర్రెడ్డి ఆస్తి విషయమై మార్చి 30వ తేదీ తండ్రితో గొడవకు దిగాడు. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. మనోహర్రెడ్డి చేసిన దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయన్ను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయమై మార్చి 31న ‘కడుపున పుట్టికోళ్ళా... తోడేళ్లా అనే’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ ఘటనలపై స్పందించిన జిల్లా ఎీస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు పొందిన అనంతరం చిన్నప్పరెడ్డిని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఆయన తీవ్ర మనోవేదనకు గురై ఏప్రిల్ 21వ తేదీ మృతి చెందాడు. తండ్రి మృతికి కారణమైన కుమారుడు మనోహర్రెడ్డి, కోడలు సరస్వతమ్మ పరారయ్యారు. ఈ క్రమంలో పోలీసులు సోమవారం మనోహర్రెడ్డిని అరె్స్ట్ చేసి రిమాండుకు తరలించారు. పరారీలో ఉన్న సరస్వతమ్మను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
మామిడి రైతుకు అండగా ఉంటాం
● రైతుల ఆందోళనపై తక్షణం ప్రభుత్వం స్పందించాలి ● కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలి ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని సోమవారం పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి రైతులు కన్నీరు పెడుతున్నా కూటమి ప్రభుత్వానికి కనికరించడం లేదని మండిపడ్డారు. రైతుల గోడుపై తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా మామిడి కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయించాలని, లేకుంటే వైఎస్సార్సీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని హెచ్చరించారు. మామిడి రైతుకు న్యాయ జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఆయన మాటల్లోనే.. ● మామిడికి కనీస గిట్టుబాటు ధర కూడా దక్కకడం లేదు. ఫ్యాక్టరీలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ● మామిడి రైతులు తమ పంటలను ట్రాక్టర్లో తీసుకువచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, పొ రుగు రాష్ట్రాల మామిడి నేరుగా ఫ్యాక్టరీల్లోకి వెళ్లి పోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? సరిహద్దుల్లో చెక్పోస్టు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో మామిడి ఎలా వస్తోంది. ఫ్యాక్టరీ నిర్వాహకులతో కూటమి నేతలు కుమ్మకై ్క రైతులను నాశనం చేస్తున్నారు. ● తోతాపురి రకం అమ్ముడుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలంటూ మామిడి రైతులు రోడ్డెక్కారు. జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. ● గుజ్జు ఫ్యాక్టరీలు కాయల కొనుగోలుకు టోకెన్ విధానం తీసుకువచ్చాయి. ఈ టోకెన్ల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే ఫ్యాక్టరీలు మాత్రం అరకొర టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నాయి. మిగిలినవి కూటమి నేతలు చెప్పిన వారికే గంపగుత్తగా ఇచ్చేస్తున్నాయి. ● ప్రభుత్వం సైతం జిల్లా రైతులను దగా చేస్తోంది. కూటమి నేతల కోసం ఫ్యాక్టరీలకే కొమ్ముకాస్తోంది. మామిడి కిలోకి రూ.12 గిట్టుబాటు అవుతుందని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీలు కేవలం రూ.6 మాత్రమే రైతులకు చెల్లిస్తున్నాయి. ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గుజ్జు ఫ్యాక్టరీల వారు పంట కొనుగోలు చేసిన వారానికే రైతులకు నగదు అందించేవారు. ఇప్పుడు 3 నెలలకు ఇస్తామని తెగేసి చెబుతున్నారు. కాదంటే సరుకు కొనం.. వెళ్లిపోండి అని తరిమేస్తున్నారు. ● గతంలో తోతాపురి రకం కోత సమయంలో పండు కాయలు తక్కువ ధరకు కొనేవారు. ఇప్పుడు చిన్న మచ్చ ఉన్నా గ్రేడింగ్లో పారేస్తున్నారు. ● మామిడి కొనుగోలు విషయంలో రైతుల గోడును కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో ధర పడిపోతే ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు నష్టపోకుండా కొనుగోలు చేయించింది. ● కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్పమామిడి రైతుల కష్టాలు కనిపించడంలేదు. మామిడి రైతులకు న్యాయం జరిగేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ● వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యాచరణతో రైతులకు అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం మెడలు వంచి, గిట్టుబాటు రేటుకు మామిడిని కొనుగోలు చేయించే వరకు పోరాటం కొనసాగిస్తుంది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు ఎక్కడైనా కిలో మామిడి రూ.8కు కొనుగోలు చేస్తున్నారా? నిరూపించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా? రైతులతో ఈ మాట చెప్పించగలరా? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. రైతుల ఆగ్రహం చూసిన కూటమి ప్రభుత్వం కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలను ఆదేశించి చేతులు దులుపుకుంది. ప్రభు త్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహక నిధి ఇస్తామని గొప్పగా ప్రకటించింది. అయితే ఎక్కడా అమలు జరగడం లేదు. ఎకరా మామిడి సాగు చేయాలంటే కనీసం రూ.45వేలు ఖర్చవుతోంది. ఫ్యాక్టరీల వారు చిన్న మచ్చ ఉంటే కూడా కాయలు కొనడం లేదు. దీంతో రైతులకు కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన
వేతనాలు పెంచాలని కోరుతూ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. టోకెన్ల కోసం ధర్నా చేశాం టోకెన్లు ఇస్తారని గంగాసాగరంలోని ఫ్యాక్ట రీ వద్దకు వేకు వజామున 4 గంటలకు వచ్చాం. టోకె న్లు ఇవ్వకపోవడంతో ధర్నాకు దిగాం. ఆ తర్వాత టోకెన్లు ఇస్తా రని చెప్పడంతో పొలోమని ఫ్యాక్టరీ గేటు వద్దకు వెళ్లడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. –కస్తూరి, అనుపల్లి, చిత్తూరు నగరం రైతుల వద్దకే టోకెన్లు ఇవ్వాలి అర్ధరాత్రి వచ్చా మండి. వీళ్లు తెల్లారి 7 గంటలవుతున్నా టోకెన్లు ఇవ్వలేదు. అంతకు ముందే ఇ చ్చుంటే ఈ గోల ఉండి ఉండదు. ఒక్క టోకెన్ కోసం ఈ దుస్థితి ఏమిటో మాకు అర్థకావడంలేదు. రైతుల పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. టోకెన్లు సక్రమంగా ఇస్తే బాగుంటుంది. లేకుంటే మేమంతా కలిసి రోడ్డెక్కాల్సిందే. –ధనంజయ్యనాయుడు, వరదరాజులపల్లి, చిత్తూరు మండలం ఎందుకీ మీనమేషాలు? ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఈ సంవత్స రం మామిడి ఆర్డర్లు ఉన్నప్పటికీ కొనటానికి మీనమేషాలు లె క్కిస్తున్నాయి? కూ టమి ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మామిడి రైతులు గుజ్జు పరిశ్రమలకు లాభాలు అందిస్తుంటే ... నిర్వాహకులు మాత్రం రైతును ముప్పుతిప్పలు పెట్టి నష్టాల్లో ముంచేస్తున్నారు. – ప్రవీణ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం నాయకులు – 8లో -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
గత వారం చిత్తూరులో నగల దుకాణంలో చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025జిల్లాలోని మామిడి రైతులకు దిక్కులేకుండా పోయింది. అధికారులు, పాలకుల మాటలను ఫ్యాక్టరీ యజమానులు లెక్క చేయడం లేదు. దీంతో మామిడి కాయలు అమ్ముకోవడానికి పోరాటం చేయాల్సి వస్తోంది. చిత్తూరు, జీడీ నెల్లూరు, తవణంపల్లె, బంగారుపాళ్యం మండలాల్లో సోమవారం టోకెన్లు ఇవ్వలేమని ఫ్యాక్టరీలు బోర్డులు పెట్టేశాయి. దీంతో ఫ్యాక్టరీల ఎదుట రైతుల ఆందోళనకు దిగి రోడ్లపై బైఠాయించారు. రహదారులపై ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కొన్ని ఫ్యాక్టరీలు నామమాత్రంగా టోకెన్లు ఇచ్చాయి. అయినా రైతుల గోడును పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం. – కాణిపాకం జిల్లాలో ప్రస్తుతం తోతాపురి రకం మామిడి కాయలు పక్వానికి రావడంతో కోతలు జోరందుకు న్నాయి. ఈ కాయలను ఫ్యాక్టరీ నిర్వాహకులు కొన డం లేదు. ఏదో కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం బయట రాష్ట్రాల నుంచి వచ్చే తోతాపురి కాయలను కొనుగోలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో రూ.8కు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా ఫ్యాక్టరీలు వాటిని లెక్కచేయడంలేదు. చిత్తూరులో ఏం జరిగిందంటే... చిత్తూరు నగరం గంగాసాగరంలోని ఓ గుజ్జు పరిశ్రమ సోమవారం టోకెన్లు ఇస్తున్నట్లు వారం రోజుల ముందే బోర్డు పెట్టింది. టోకెన్లు ఇస్తారని మామిడి రైతులు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అక్కడే కునుకు తీస్తూ.. ఆధార్, పట్టా పాసు పుస్తకం జెరాక్స్ నకలను క్యూలో పెట్టారు. ఉదయం 7గంటలకు రైతు లు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నప్పటికీ ఫ్యాక్టరీ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో రైతులంతా కలిసికట్టుగా చిత్తూరు–వేలూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడారు. టోకెన్లు ఇస్తామని చెప్పడంతో ఆ తర్వాత ఫ్యాక్టరీ గేటును రైతులు చుట్టుముట్టేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. అక్కడ రైతుల అరుపులు, కేకలతో ఫ్యాక్టరీ ఆవరణ దద్ధరిల్లింది. అక్కడే ఉన్న వృద్ధురాలికి ఊపిరి ఆడలేదు. వెంటనే రైతులు ఆ వృద్ధురాలిని ఫ్యాక్టరీ లోపలికి పంపారు. ఆపై అరకొరగా టోకెన్లు ఇచ్చిన ఫ్యాక్టరీ నిర్వాహకులు వచ్చేనెల 5వ తేదీ టోకెన్లు ఇస్తామంటూ మరో బోర్డు పెట్టారు. దీంతో టోకెన్లు అందని రైతులు మళ్లీ నిరసనకు దిగారు. పలుచోట్ల ఇదే పరిస్థితి గంగాధర నెల్లూరు మండలంలో మూడు రోజులుగా మామిడి కాయలను ట్రాక్టర్ల నుంచి అన్లోడింగ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు రోడ్డెక్కడంతో రాకపోకలు స్తంభించాయి. ఇప్పటివకే ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు భారీ సంఖ్యలో క్యూకట్టాయి. బంగారుపాళ్యం మండలంలో కూడా ఫ్యాక్టరీలు టోకెన్లు ఇవ్వకుండా తలుపులు వేసేశాయి. వచ్చే నెల టోకెన్లు ఇస్తామని ముఖం చాటేశాయి. ఒక చేసేది లేక రైతులు ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి, చివరికి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. తవణంపల్లె మండలంలోని ఫ్యాక్టరీలు కూడా మామిడి రైతులకు టోకెన్లు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నాయి. చిత్తూరు: గంగాసాగరం ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగిన రైతులు– 8లో– 8లో పంట అమ్ముకోవడానికి తంటాలు పడిగాపులు కాసి కాసి సహనం కోల్పోయిన వైనం రోడ్డెక్కిన రైతులు.. స్తంభించిన ట్రాఫిక్ జీడీనెల్లూరు, బంగారుపాళెం, తవణంపల్లెలోనూ అదే తంతు! పట్టించుకోని కూటమి ప్రభుత్వం రైతుల గోడు పట్టని ప్రభుత్వం రైతులు తాము పండించిన మామిడి కాయలు అమ్ముకోవడానికి చావో రేవో అని పోరాడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. రాత్రి, పగలు తేడా లేకుండా నిద్రాహారాలు మాని ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటివరకూ ఏ ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధి కానీ వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. కూటమి నేతల సిఫార్సులకే టోకెన్లు కూటమి నేతల సిఫార్సులకు మామిడి టోకెన్లు అమ్ముడుబోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ, కలెక్టరేట్, ఇతరత్రా అధికారుల పేర్లు చెబుతూ టోకెన్లను దండుకుంటున్నారని ఫ్యాక్టరీ నిర్వాహకులు బహిరంగంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య రైతులు నిండా మునిగిపోతున్నారు. జిల్లాల్లో కొద్ది రోజులుగా హల్చల్ చేసిన రైతు సంఘం నాయకులు ఫ్యాక్టరీల ఎదుట కనిపించడం లేదు. వారి పంటను మాత్రం అమ్ముకుని వెళ్లిపోయారని రైతులు మండిపడుతున్నారు.