breaking news
Chittoor
-
నేటి నుంచి ఆధార్ శిబిరాలు
చిత్తూరు కలెక్టరేట్ : పిల్లలు తమ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాల అప్డేట్కు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు. జిల్లాలో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సినవారు 18 వేల మందికి పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికోసం గ్రామ/వా ర్డు సచివాలయాల్లోని 125 కేంద్రాల్లో పిల్లలు తమ ఆధార్లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కిక్కిరిసిన బోయకొండ చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆల యం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. కోరిన కోర్కె లు తీర్చే గంగమ్మా .. దీవెంచమ్మా అంటూ వేడుకున్నారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చా రు. ఆదివారం సెలవు కావడంతో అమ్మవారి దర్శనం కోసం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అఽధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం రద్దీతో క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కి రిసి పోయాయి. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసా దాలను పంపిణీ చేశారు. 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం కార్వేటినగరం : సారా తయారీ అమ్మకాలు జరిపితే కఠిన శిక్ష తప్పదని ఎస్ఐ తేజస్విని అన్నా రు. ఆదివారం మండల పరిఽధిలోని కనికాపురం సమీపంలో దాడులు నిర్వహించి సారా తయారీకి సిద్ధం చేసి ఉంచిన సుమారు 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మండలంలో కొటార్వేడు, గోపిశెట్టిపల్లి, కనికాపురం,కృష్ణసముద్రం, వంటి పలు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం కనికాపురం సమీపంలో కృష్ణాపురం జలాశయం సప్లై చానల్లో అక్రమంగా దాచి ఉంచిన ఊట, సారా తయారీకి వినియోగించే పరికరాలను ధ్వంసం చేశారు. కానిస్టేబుల్ రాజశేఖర్, రాజ ఉన్నారు. బ్రెయిలీ విగ్రహావిష్కరణ చిత్తూరు కలెక్టరేట్: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని చిత్తూరు నగరంలో ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగరంలోని కట్టమంచి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బ్రెయిలీ విగ్రహం వద్ద జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ అధికారులు కార్యక్రమం ఏర్పా టు చేశారు. నిర్వహణకు నిధులు మంజూరు అవుతున్నప్పటికీ జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ అధికారులు కార్యక్రమాన్నితూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. అంధులకు, సంఘ నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ అధికారులు అవమానం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులను పక్క దారి పట్టించేందుకు ఇలాచేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ తప్పనిసరి తిరుపతి లీగల్ : తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలల్లో రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరిగా సీఎం చంద్రబాబు కృషి చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య సూచించారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లా డుతూ రాష్ట్రంలో బీసీలకు చట్ట సవరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రిజర్వేష్లకోసం బీసీ సంఘాల తరఫున హైకోర్టులో రిట్ దాఖలు చేశామని, సోమవారం విచారణ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. చంద్రబాబు సర్కార్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోందని, రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం తిరుమల : వడమాలపేట మండలంలోని అంకాలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ టి.పీతాంబరం ఆచారి అనే భక్తుడు ట్రస్ట్ తరఫున ఎస్వీ విద్యాదాన ట్రస్ట్కు ఆదివారం రూ.10,01116 విరాళంగా అందించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి చెక్ అందజేశారు. -
నేటి నుంచి గ్రామసభలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని పలు పంచాయతీల్లో సోమవారం గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు అంశాల పై చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ వికసిత్ భారత్ వీబీ జీ రామ్ జీని తీసుకొచ్చింది. ఈ నూతన పథకం మార్పులపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద ఏక కాలంలో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. జాబ్కార్డు కలిగిన వారికి ఏడాదికి గరిష్టంగా ఇప్పటి వరకు వంద రోజుల పని కల్పిస్తుండగా ఇకపై 125 రోజులు కల్పించనున్నారు. పరిపాలనా వ్యయం ఇప్పటి వరకు 6శాతం ఇస్తుండగా దానిని 9 శాతానికి పెంచారు. పలు అంశాల పై చర్చ గ్రామసభలో పలు అంశాల పై చర్చించనున్నారు. వీబీ జీ రామ్ జీ పథకంలో మార్పులు, అమలు, స్వచ్ఛ గ్రామాల పేరుతో సంక్రాంతి లోపు అన్ని గ్రామాల్లో పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తారు. అలాగే స్వర్ణ పంచాయతీ యాప్ అమలు, పన్నుల చెల్లింపు స్వామిత్వ మూడో విడత సర్వేపై వివరించనున్నారు. – సుధాకర్రావు, డీపీఓ -
బడులపై ఇన్చార్జుల పెత్తనం
కార్వేటినగరం : రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం ఏర్పడుతోంది. ఎప్పుడెలాంటి ఆదేశాలు జారీ చేస్తారో ఎవరికి అంతుచిక్కని పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికే రక రకా ల యాప్ల నమోదుతో హెచ్ఎంలు, ఉపాధ్యాయు లు తలలు పట్టుకుంటుండగా తాజాగా ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో వందరోజుల ప్రణాళికను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవుల్లోనూ తరగతులు నిర్వహించాలని పేర్కొనడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరో ౖవైపు జిల్లాలోని 62 మండలాలకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించారు. విద్యాశాఖతో సంబంధం లేని ఇతర శాఖల ఉద్యోగులు, అధికారులను ఇన్చార్జులుగా నియమించడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు వారంలో రెండు రోజులు ఆయా పాఠశాలలకు వెళ్లి తనిఖీలి చేయాల్సి ఉంటుంది. పదో తరగతి సంబంధించి అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళిక గందరగోళానికి దారి తీస్తోంది. విద్యాశాఖలో సంబంధం లేని వ్యక్తుల నియామకం అగ్గి రాజేస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం ఇన్చార్జిల కనుసన్నల్లో జరగనుంది. ప్రత్యేక తరగతుల నిర్వహణ మొదలు స్లిప్ టెస్టులు, మార్కుల నమోదు. రిజిస్టర్ నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు ఇలా అన్నింటినీ పబ్లిక్ పరీక్షల ప్రారంభం వరకూ ఇన్చార్జిలే పర్యవేక్షించనున్నారు. ఇతర శాఖ అధికారుల పర్యవేక్షణ రెవెన్యూ, పంచాయతీరాజ్,డ్వామా, వైద్య, ఎంపీడీఓ ఆర్డబ్ల్యూ ఎస్.వ్యవసాయ, ఇరిగేషన్, హౌసింగ్, మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ తదితర శాఖల్లో పని చేస్తున్న వీరంతా వారి మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతిలో ప్రణాళిక అమలు అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. స్లిప్ టెస్టులు, ఉపాధ్యా యుల హాజరు, పదిలో షైనింగ్, రైజింగ్ స్టార్లుగా విభజించి పాఠాలు బోధిస్తున్నారనే అంశాన్ని రోజూ పర్యవేక్షించాలి. ఉపాధ్యాయులు హాజరు నమోదు సబ్జెక్టు టీచరు వస్తున్నారా, ఆదివారా లు, ఇతర సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నారనే అంశాన్ని మానిటర్ చేయాల్సి ఉంది. టీచర్ల మండిపాటు బడుల పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులను నియమించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్త వానికి ప్రతి మండలానికి ఏంఈవో 1,2, ఉన్నారు. వీరితో పాటు డీవైఈవోలు, ప్రతి పాఠశాలకు హెచ్ఎం ఉన్నారు. ప్రణాళిక అమలు పర్యవేక్షణకు వీరున్నప్పుడు ఇతర శాఖల అధికారులను ఇన్చార్జిలుగా నియమించడమేమిట ని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరిని అపాయింట్ మెంట్ చేయడం తమను అవమానించడమే నని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ, రికార్డులు పది సిలబస్పై వీరికి ఏ మేర కు అవగాహన ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ నూరు రోజుల పాటు సదరు ఇన్చార్జిలు తమ శాఖలో జరిగే పనులు మాని దీన్ని పర్యవేక్షిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఇలా...?జిల్లాలో 380 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 36 వేల మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించనున్నారు. ఈ తరుణంలో డిసెంబరు 6వ తేదీ నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనాలోచిత నిర్ణయం వంద రోజుల ప్రోగ్రామ్ ఉపాధ్యాయులు విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తోంది. కార్యక్రమ పర్యవేక్షణకు ఎంఈవో , డీవైఈవోలను నియమించాలి. ఇన్చార్జిల కంటే విద్యాశాఖ అధికారులు అయితే మంచి ఫలితాలు ఉంటాయి. వంద రోజుల ప్రణాళిక ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేయకపోవడం వల్ల కొంత మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం దారుణం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితంగా ఉంది. – సుదర్శన్రాజు, ఏపీటీఎఫ్ 1938 మాజీ మండల అధ్యక్షుడు, శ్రీరంగరాజపురం మండలం ఇతర శాఖల అధికారులతో తనిఖీలు సరికాదు పదో తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడానికి విధ్యాశాఖ చేపట్టిన వందరోజుల కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా జరుగుతోందో పర్యవేక్షించడానికి విద్యాశాఖకు ఏ మాత్రం సంబంధం లేని ఇతర శాఖలకు చెందిన అధికారులను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు. దీనివల్ల ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. – దేవయ్య, ఎస్టీయూ మాజీ జిల్లా నేత , పాలసముద్రం మండలం -
మారథాన్లో సీఐ రికార్డు
పలమనేరు : చైన్నె రన్నర్స్ సంఘం ఆధ్వర్యంలో చైన్నెలో ఫ్రెస్ వర్క్స్ ఆధ్వర్యంలో 21.97 కిలో మీటర్ల మారథా న్ పరుగు పందెం పోటీల్లో తిరుపతి పీటీసీ (పోలీస్ ట్రైనింగ్ సెంటర్)కు చెందిన సీఐ మధుసూధన్రెడ్డి గంటా 57 నిమిషాల్లో పూర్తిచేసి రికార్డ్ నెలకొల్పారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లికి చెందిన మధుసూధన్రెడ్డి కొన్నేళ్లుగా నడక, పరుగు పోటీల్లో పాల్గొంటూ పలు పతకాలను సాధించారు. ఈ నేపథ్యంలో చైన్నెలో ఆదివారం జరిగిన మారథాన్లో విజేతగా నిలిచి అక్కడి నిర్వాహకులచే ప్రశంసంతో పాటు మెడల్ను సాధించారు. టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ రాంగణేష్ మృతి చిత్తూరు కార్పొరేషన్ : మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీ ఉపాధ్యక్షుడు రాంగణేష్ (45) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని మురకంబట్టుకు చెందిన ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయ్యప్పమాల ధరించిన ఆయన శబరిమలకు వెళ్లారు. ఆదివారం సన్నిధానంకు కిలోమీటరు దూరం ఉండగా కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్న రాంగణేష్ అలాగే వాలిపోయాడన్నారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందారన్నారు. కాగా ఆయనకు ఇద్దరు కుమారులు మెతీష్, నితీస్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని, కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నట్లు పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. -
నేడు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. లడ్డూ పోటు తనిఖీ కాణిపాకం : లడ్డూలో నాణ్యత ఉండాలని..లోటు కనిపిస్తే చర్యలు తప్పవని ఈవో పెంచల కిషోర్ హెచ్చరించారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన లడ్డూ పోటును ఆదివారం తనిఖీ చేశారు. లడ్డూ తయారీని క్షుణంగా పరిశీలించారు. ఈవో మాట్లాడుతూ లడ్డూ రుచిని మరింత పెంచేలా..తయారీలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, సిబ్బంది ఉన్నారు. నేడు ఇంటర్ తత్కాల్లో ఫీజు చెల్లింపునకు అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఈనెల 5వ తేదీ లోగా ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజును తత్కాల్ పద్ధతిలో చెల్లించవచ్చని జిల్లా ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తత్కాల్ విధానంలో ఫీజు చెల్లించేందుకు ఆఖరి అవకాశం కల్పించారన్నారు. తత్కాల్లో రూ.5 వేల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
చతికిల‘బడి’
మూసివేతకు... బాబు సర్కారు కుట్ర ! ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయకపోగా మూసివేతకు చంద్రబాబు సర్కారు చర్యలు చేపడుతోంది. 2019కి ముందు రేషనలైజేషన్ పేరుతో వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే విలీనం పేరుతో పాఠశాలలను కనుమరుగుచేశారు. తాజాగా తక్కువ విద్యార్థుల సాకుతో మరిన్ని పాఠశాలలను మూసివేతకు రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందా.. తగినంత మంది విద్యార్థులు లేరనే సాకుతో బడులను మూసివేసేందుకు కుట్ర పన్నుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి రెండు రోజుల కిందట అన్ని జిల్లా లు, మండలాల విద్యాశాఖాధికారులతో వెబెక్స్ నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య ఐదులోపు ఉన్న ఫౌండేషన్న్ స్కూళ్లు, పదిలోపు ఉన్న బేసిక్ స్కూళ్లు, 30లోపు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య 50 లోపు ఉన్న హైస్కూళ్ల వివరాలు సేకరించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో కొన్ని పాఠశాలలను సమీప పాఠశాలల్లోకి విలీనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న విమర్శలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటర్ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోకి విద్యాశాఖ పంపేసింది. ఈ ప్రక్రియతో చాలా పాఠశాలలు మూతపడ్డాయి. వందల సంఖ్యలో పాఠశాలలు సింగిల్ టీచర్ (ఏకోపాధ్యాయ)కే పరిమితమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం 3, 4, 5 తరగతులను విలీనం చేసింది. ఈ విధానం వల్ల చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. బడులకు తాళం కార్టూన్ చిత్రం పాఠశాలలో పాఠాలు చెబుతున్న టీచర్ కార్టూన్ చిత్రంనియోజకవర్గం పాఠశాలల విద్యార్థుల సంఖ్య సంఖ్య చిత్తూరు 183 11,413 గంగాధరనెల్లూరు 399 15,139 కుప్పం 433 31,955 నగరి 177 10,334 పలమనేరు 463 33,327 పూతలపట్టు 355 15,642 పుంగనూరు 404 22,856 మొత్తం 2414 1,40,666 ఇది జిల్లాలో పరిస్థితి జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లోని పలు పాఠశాలలను తక్కువ విద్యార్థుల సాకుతో మూసివేతకు రహస్యంగా కసరత్తు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కసరత్తు నిర్వహించి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నివేదికలు పంపేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా సమాచారం -
సంక్రాంతికి ‘ప్రైవేటు’ బాదుడు!
పండుగ బాదుడుకు ప్రైవేట్ ఆపరేటర్లు సిద్ధమయ్యారు. అప్పుడే సంక్రాంతి బుకింగ్లు ఫుల్ అవుతున్నాయి. రైల్వే టిక్కెట్ల వెయింటిగ్ లిస్టు చాంతాడంత ఉండడం... హైదరాబాద్, బెంగుళూరు నుంచి వచ్చి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సు టిక్కెట్లు ఇప్పటికే కొనుగోలు పూర్తి కావడంతో ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలను రెండు, మూడు రెట్లు పెంచేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లేవారికి పండుగ రోజుల్లో ఇళ్ల వద్ద అయ్యే వ్యయం కన్నా ప్రయాణానికే అయ్యే ఖర్చు అధికం కానుంది. కాణిపాకం : జిల్లా నుంచి బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, విజయవాడ ప్రాంతాల్లో స్థిరపడ్డ వా రు చాలా మంది ఉన్నారు. అలాగే ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం లక్షల మంది వెళ్లారు. వీరు రాకపోకలు అప్పడప్పుడు సర్వసాధారణంగా కనిపిస్తోంది. అయితే పండగకు ఊర్లోకి రావడం సమ్థింగ్ స్పెషల్గా భావిస్తున్నారు. అందులోనూ సంక్రాంతి పండగకు పల్లెకొస్తే ఉత్సాహంగా గడపవచ్చునని అనుకుంటుంటారు. ఈక్రమంలో కొంత మంది కార్లలో పల్లెకు వస్తుంటారు. అయితే మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన వారు రైలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. శుక్రవారం నుంచే సొంతూళ్లకు.. ఈనెల 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈనెల 14వ తేదీ బుధవారం భోగి పండుగ వచ్చింది. అయితే తొమ్మిదో తేదీ రెండవ శనివారం కావడంతో చాలా మంది శుక్రవారం రాత్రి బయలుదేరనున్నారు. రెండవ శనివారం, తరువాత ఆదివారం సెలవు కావడంతో సోమ, మంగళవారాలు సెలవులు పెట్టుకుంటే తిరి గి 17వ తేదీ శనివారం, 18వ తేదీ ఆదివారం తిరిగి వలస ప్రాంతాలకు వెళ్లనున్నారు. 18వ తేదీ అమావాస్య కావడంతో చాలామంది 17వ తేదీన తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెంగళూరు నుంచి రూ.5 వేలు బెంగళూరు నుంచి చిత్తూరుకు సాధారణ రోజుల్లో నాన్ఏసీలో సీటర్ రూ.280 నుంచి రూ.350 వరకు ఉంటుంది. అదే ఏసీ సీటర్ అయితే రూ.500 వరకు ఛార్జ్ చేస్తారు. ఏసీ స్లీపర్ అయితే రూ. 500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. పండగ బాదుడు నేపథ్యంలో ఒక్కసారిగా చిత్తూరు రావడానికి ప్రైవేటు బస్సు చార్జీలు ఆకాశనంటుతున్నాయి. అప్పుడే ఆన్లైన్లో టిక్కెట్లు బుకింగ్ ఫుల్ కావడంతో ప్రైవేటు బస్సు నిర్వాహకులు భారీగా దోపిడీకి స్కెచ్ వేశారు. శుక్రవారం రాత్రి నుంచి ధరలు అమలులోకి పెట్టేశారు. ఈ నేపథ్యంలో నాన్ఏసీ ధరలు రూ. 500 నుంచి రూ.1500 పలుకుతున్నాయి. ఏసీ ధరలు రూ. 1500 నుంచి రూ.5 వేలు కనిపిస్తున్నా యి. ఈ టిక్కెట్ ధరలు చూసి చాలా మంది పెద్ద పండుగకు పల్లెకు వద్దని వాయిదా వేసుకుంటున్నారు. పట్టని నియంత్రణ ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీపై చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆపరేటర్లలో ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు, ప్రధాన నేతలు ఉండడంతో చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పండుగ సమయంలో దొడ్డిదారిన బస్సులు నడిపేందుకు సైతం ప్రైవేట్ ఆపరేటర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిమాండ్ లేని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలుపుదల చేసి డిమాండ్ ఉన్న సర్వీసులో తిప్పనున్నారు. ఇక పండగ సమయంలో చూసీచూడనట్లు వదిలేసే అవకాశం ఉండడంతో ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా బస్సులు తిప్పనున్నారు. ఇష్టానుసారంగా పెంచేసి..ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ, నాన్ఏసీ బస్సులు అనే తేడా లేకుండా టిక్కెట్లు అయిపోవడంతో చాలామంది ప్రైవేట్ బస్సుల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు బస్సు టిక్కెట్ ధరలు అమాంతంగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సు టిక్కెట్ ధరలు 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టిక్కెట్ ధరలు రెండు..మూడు రెట్లు పెరిగాయి. అన్ సీజన్లో నాన్ ఏసీ సిటింగ్ రూ. 620 నుంచి రూ.800 వరకు ఉంది. ఇప్పుడు నాన్ ఏసీ స్లీపర్ టిక్కెట్ ధర రూ.800 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. ఇక ఏసీ బస్సు సిటింగ్ ధర రూ. 620 నుంచి రూ.1000 వరకు ఉంది. స్లీపర్ టిక్కెట్ ధర రూ.900 రూ.1500 పలుకుతోంది. తొమ్మిదవ తేదీన అయితే ఏకంగా రూ.2,000 నుంచి రూ.5 వేలు దాటడం గమనార్హం. తిరిగి ఎక్కువ మంది వెళ్లే 18వ తేదీన నాన్ ఏసీ, ఏసీ సిటింగ్ ధర రూ. 1600 నుంచి రూ. ఽ1800 ఫిక్స్ చేశారు. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్ ధరలు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండడం గమనార్హం. టిక్కెట్లు ఫుల్ జిల్లాకు వచ్చేవారు సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి బయలుదేరి చిత్తూరుకు వస్తారు. ఆ రోజుల్లో రెగ్యులర్గా నడిచే రైళ్ల వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. ప్రధాన సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్ల టిక్కెట్లు వెయిటింగ్ లిస్టు పరిమితి దాటిపోవడంతో రిగ్రెట్లో పెట్టారు. పండుగ కోసం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్ల పరిస్థితి అలానే ఉంది. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇంచుమించు ఇదే పరిస్థితి, ఇక ఆర్టీసీ బస్సులలో కూడా టిక్కెట్లు అందుబాటులో లేకుండా పోయాయి. హైదరాబాద్ నుంచి రోజూ సుమారు 8 నుంచి 10 రెగ్యులర్ బస్సులున్నాయి. వీటిలో తొమ్మిదో తేదీ ఉదయం నడిచే బస్సులకు తప్ప మిగిలిన బస్సుల టిక్కెట్లు పూర్తవుతున్నాయి. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం, రాత్రి సర్వీసులు బస్సులు టిక్కెట్లు ఫుల్ అవుతున్నాయి. జిల్లాలో చిత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు డిపోల బస్సుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. -
శాంతి భద్రతలపై దిశానిర్దేశం
సదుం : పోలీసు స్టేషన్ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం తనిఖీ చేశారు. ఆయనకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహీంద్ర స్వాగతం పలికి, గౌరవ వందనం చేశారు. స్టేషన్లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అన్నమయ్య జిల్లా పరిధీలోకి చౌడేపల్లె సర్కిల్ చేరడంతో పరిస్థితుల అవగాహన కోసం సాధారణ తనిఖీ చేపట్టారు. కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సీఐ రాంభూపాల్, చౌడేపల్లె ఎస్ఐ నాగేశ్వర రావు, ఏఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. చల్లా ఇంటికి.. రొంపిచెర్ల : పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటికి కర్నూల్ రెంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ఉదయం వచ్చారు. మండలంలోని బొమ్మయ్యగారిపల్లె పంచాయతీలోని గర్నిమిట్టవారిపల్లెలోని చల్లా రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి కొంత సేపు ముచ్చటించి వెళ్లారు. అనంతరం నియోజక వర్గంలోని సోమల, చౌడేపల్లె, పుంగనూరు పోలీసుస్టేషన్లును డీఐజీ తనిఖీ చేశారు. జిల్లాలో పెద్ద రెవెన్యూ డివిజన్ పాయె! ఆలయాల భద్రత గాలికి తిరుపతి మంగళం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీకి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తు లపై బురద జల్లడం పరమావధిగా మారిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా మాట్లాడారు. టీటీడీ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. దీనికి అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయన్నారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఏడాది గడిచినా ఇప్పటివరకు ఆ నివేదిక వెలువడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అదే విధంగా తిరుమల, తిరుపతిలో వరుసగా భద్రతా లోపాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఆయా భద్రతా లోపాలపై లేఖలు రాశారని, దానికి ప్రతిగా కేంద్ర హోంమంత్రి అమిత్షా కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, మా లేఖకు వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఆలయాల భద్రతపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆలయాల పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లనే అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గోవిందరాజ స్వామి ఆలయంలోని నడిమి గోపురం ఎక్కి, పవిత్రమైన కలశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం, నకిలీ మద్యం విక్రయాలు జరగడం వల్ల ప్రజలు తాగి ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. పలమనేరు : పలమనేరు కొత్త రెవెన్యూ డివిజన్గా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవతరించింది. 2022 ఏప్రిల్లో పలమనేరులో డివిజన్ కార్యాలయ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోనే పలమనేరు వైశాల్యంలో పెద్ద డివిజన్గా మారింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని ఎటూ కాకుండా చేసేశారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని పుంగనూరు, చౌడేపల్లి మదనపల్లి డివిజన్లోకి, బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి, సోమల, సదుం మండలాలను పీలేరు డివిజన్లోకి విలీనం చేసేశారు. దీంతో పలమనేరు రెవెన్యూ డివిజన్ కేవలం ఐదు మండలాలకే పరిమితమైంది. ఫలితంగా విస్తీర్ణంలోనూ తగ్గి పెద్ద డివిజన్ పేరును పోగొట్టుకుంది. పలమనేరుపై ఇంత కక్ష జరుగుతున్నా దీనిపై పాలకులు నోరు మెదపకపోవడంపై జనంలో విమర్శలు వినిపిస్తున్నాయి. -
జలం.. గరళం
నగరి పట్టణంలోని భూగర్భ జలాలు కలుిషి తం అయ్యాయి. నూలుకు రంగు వేసే ప్రక్రియలో విడిచిపెట్టే వ్యర్థ రసాయన నీరు పారే కాలువలకు సమీపంగా ఉన్న ప్రాంతాల్లో బోరు నుంచి వచ్చేది జలం కాదని అది ప్రజల పాలిట పాషాణం అని నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం నిర్వహించిన తాగునీటి పరీక్షలో తేలిపోయింది. ఈ నీటిని తాగితే మంచాన పడటం ఖాయమని ఆ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామం ప్రజలను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై నేడు మహాధర్నాకు సన్నద్ధమయ్యారు. కుశస్థలి నదిలోకి వస్తున్న రసాయ రంగునీరు ఎరుపెక్కి పారుతున్న కుశస్థలి నది నగరి : నగరి మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో నీటి నాణ్యతను పరిశీలించడానికి నాలుగు ప్రాంతాల్లో మున్సిపల్ ట్యాప్లలో వచ్చే నీటితో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో నివాసితులు వేసుకున్న బోర్లలో వచ్చే నీటిని సేకరించి పరీక్ష చేశారు. మున్సిపల్ కొళాయిల్లో వచ్చే నీరు మినహా బోర్లలో వచ్చే నీరు తాగడానికి, వంటకు, స్నానానికి కూడా వినియోగించరాదని తేలింది. మునీశ్వర ఆలయం వద్ద బోరు నీటి పరీక్షలో యురేనియం 0.10 ఎంజీ/లీ ఉంది, ఓంశక్తి ఆలయం వద్ద తీసిన నీటిలో యురేనియం 0.265 ఎంజీ/లీ ఉన్నట్లు, ఇందిరానగర్లో తీసిన నీటిలో యురేనియం 0.33 ఎంజీ/లీ, మాంగనీసు 0.466 ఎంజీ/లీ ఉన్నట్లు, ఆనం లలితా లే అవుట్లో యురేనియం 0.49 ఎంజీ/లీ, మాంగనీసు 2.316 ఎంజీ/లీ ఉన్నట్లు తేలింది. పర్యావరణ పరిరక్షణ సంస్థ సూచనల మేరకు సురక్షిత నీటిలో ఉండాల్సిన మాంగనీసు పరిమాణం 0.3 ఎంజీ/లీ, యురేనియం పరిమాణం 0.03 ఎంజీ/లీ మాత్రమే. అయితే రసాయన నీటి ప్రభావంతో నగరిలో పరిశోధించిన ప్రాంతాల్లో చూపిన మాంగనీస్ స్థాయి రెండింతల నుంచి ఏడింతల వరకు ఎక్కువగా ఉండగా, యురేనియం స్థాయి మూడింతల నుంచి పదహారింతల వరకు ఎక్కువగా ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి మున్సిపల్ కొళాయిల్లో వచ్చే నీటిపైనే నగరి ప్రజలు ఆధార పడాల్సి ఉంది. ఆగని దందా భూగర్భ జలాలు పాడైపోయినా, మున్సిపల్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రశ్నల వర్షం కురిపించినా, డైయింగ్ యూనిట్ల దందాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నగరిలో డైయింగ్ యూనిట్లను అద్దెకు తీసుకున్న తమిళనాడుకు చెందిన ఈరోడు, సేలం వ్యాపారులు తమ పరిశ్రమలకు అవసరమైన నూలుకు రంగులు వేసుకొని వృథా రసాయనాలను దర్జాగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ప్రతి రోజు 20 వాహనాలు నూలును తమిళనాడుకు ట్రాన్స్పోర్టు చేస్తోంది. భారీ డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే రసాయన నీటితో కుశస్థలి ఎరుపెక్కి పారుతోంది. అందరికీ ఆంక్షలు విధించేస్తోంది. ఒక్క చుక్క రసాయనీరు కూడా బయటకు రాదన్న అధికారుల హామీలు పారే నీటిలోనే కొట్టుకుపోయింది. కాలువల్లో పారే మురుగు నీటిలో మునిగిపోయింది. విషపూరిత రసాయనాలు కాలువల్లో పారుతుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో..! చెరువుల్లో, నదిలో పారుతుంటే ఇరిగేషన్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడంలేదో, పర్యావరణం కాలుష్యభరితం అవుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారో నగరి ప్రజలకు జవాబు తెలియని ప్రశ్నగా మిగిలిపోతోంది. నీటి పరిశోధన నివేదిక కాలువల్లో పారుతున్న రసాయన నీరు నేడు మహాధర్నా నగరి పర్యావరణ పరిరక్షణ సమితి రసాయ నీటికి వ్యతిరేకంగా పోరాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. వ్యాపారం తమిళనాడులో వ్యర్థాలు నగరిలోనా అనే నినాదంతో నిరసన వ్యక్తం చేయనున్నారు. దీనిపై ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సుమారు 20 మిషన్ డైయింగ్ యూనిట్ల వారు 10 వేల మరమగ్గ పరిశ్రమలను సాకు చూపుతూ చాపకింద నీరులా వారికి కూడా చేటుచేస్తున్నారన్నా రు. మరమగ్గ పరిశ్రమనే నేడు వారు శాసించే స్థాయికి చేరుకోవడంతో నేత పరిశ్రమను నమ్ముకున్న వారు కూడా నేడు నీటి సమస్యతో సతమతం అవుతున్నారని, ఇది ప్రభుత్వానికి చెవికెక్కేలా చెప్పి తమిళనాడు డైయింగ్ యూనిట్లను తరిమికొట్టడం, స్థానిక డైయింగ్ యూనిట్ల వారిని నివాస ప్రాంతాలకు దూరంగా తరలించడమే ధర్నా ఉద్దేశమని చెబుతున్నారు. సమస్యలు తప్పవు పర్యావరణ పరిరక్షణ సంస్థ తన పరిశోధనలో పేర్కొన్న నీటిలో మాంగనీసు శాతం ఎక్కువగా ఉంటే నాడీ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ నీటిని వేడిచేస్తే మాంగనీసు మరింత దృఢంగా మారుతుంది. వంట, స్నానానికి కూడా ఈ నీటిని వాడకూడదు. కొళాయిలు, పైపులు, షింక్లపై ఉప్పులాంటి పదార్థం పేరుకుపోయి నలుపు, గోధుమ రంగు మరకలు ఏర్పరుస్తుంది. వస్తువులు త్వరగా పాడైపోతాయి. యురేనియం శాతం ఎక్కువగా ఉంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఎముకల సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు వచ్చేందుకు అధికంగా ఆస్కారం ఉంది. చిన్న పిల్లలకు ఈ నీటిని అస్సలు వినియోగించకూడదు. -
నకిలీ నోట్ల చలామనీ
కుప్పం : మూడు రాష్ట్రాల కూడలి ప్రాంతమైన కుప్పం కేంద్రంగా నకిలీ నోట్లు చలామనీ విచ్చలవిడిగా సాగుతోంది. ప్రధానంగా 500 రూపాయల నోటు చూస్తేనే వ్యాపారులు హడలిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా చిల్లర , పాల వ్యాపారులు దుకాణాల్లో 500 నకిలీ నోట్లు జోరుగా చలామని అవుతున్నాయి. కుప్పం ప్రాంతం మూడు రాష్టాల కూడలి కావడంతో అక్రమ వ్యాపారాలకు అనువుగా మారింది. కర్ణాటక రాష్ట్రం 10 కిల్లో మీటర్లు, తమిళనాడు 10 కిల్లో మీటర్లు దూరంలో ఉన్నాయి. కుప్పం కేంద్రంగా కర్ణాటక రాష్ట్రం కోలార్, కేజీఎఫ్ నుంచి తమిళనాడు చేరిన సేలం, కోయంబత్తూరు , దర్మపూరి పట్టణాల నుంచి నకిలీ నోట్లు జోరుగా సరఫరా జరుగుతున్నట్లు తెలిసింది. కుప్పం మీదుగా నకిలీ నోట్లు సరఫరా చేస్తూ కుప్పంలోనూ 500 నకిలీ నోట్లు చలామనీ చేస్తున్నారు. ఒకే దుకాణంలో నాలుగు నకిలీ నోట్లు పట్టణం ప్యాలెస్ ఎక్స్టెన్షన్లో ఉన్న ఓ పాల దుకాణంలో ఒకే రోజు నాలుగు నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వచ్చిన డబ్బును చలాన కట్టేందుకు బ్యాంకుకు వెళ్తే నాలుగు 500 రూపాయిల నోట్లు బ్యాంక్ అధికారులు రిజక్ట్ చేశారు. దీంతో పాల వ్యాపారి షాక్కు గురయ్యాడు. నిత్యం ఇలా ఒకటి రెండు 500 నకిలీ నోట్లు వస్తున్నాయని పాల వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పంలో అక్రమ రవాణాపై నిఘా కొరవడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు రిజక్ట్ చేసిన 500 నకిలీ కరెన్సీకుప్పంలో చలామనీ అవుతున్న నకిలీ నోట్లు -
మతిస్థిమితంలేని మహిళ కుటుంబ సభ్యుల చెంతకు
చిత్తూరు అర్బన్ : మతిస్థిమితంలేని ఓ మహిళ తప్పిపోయి చిత్తూరుకు రాగా.. పోలీసులు ఆమెను శనివారం తన కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. కర్నూలు జిల్లా ఆచార్య నగర్కు చెందిన ఓ మహిళ తన మానసిక ఆరోగ్యం సరిగాలేకపోవడంతో ఇంటి నుంచి వచ్చేశారు. రెండు రోజులుగా చిత్తూరులో ఉండటంతో ఆమెను మహిళా పోలీస్టేషన్ అధికారులు గుర్తించి స్టేషన్కు తీసుకెళ్లారు. ఆమె వద్ద కాగితాల ఆధారంగా తమ కుటుంబ సభ్యులను పిలిపించి.. కర్నూలుకు పంపించారు. 5న గ్రామసభలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీలలో సోమవారం గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీఓ సుధాకర్రావు తెలిపారు. ఈ సభలు సర్పంచుల ఆధ్వర్యంలో నిర్వహించనుండగా, కార్యదర్శులు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారన్నారు. స్వచ్ఛ సంక్రాంతిలో భాగంగా ఈనెల 10లోపు పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు వచ్చాయన్నారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణవ్రతం కాణిపాకం : పౌర్ణమిని పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరసిద్ది వినాయకస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీవరదరాజస్వామి ఆలయంలో శనివారం సత్యనారాయణ వ్రతంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామి వారికి అభిషేక పూజలు జరిపించారు. అనంతరం సత్యనారాయణవ్రతంను నిర్వహించారు. ఈ వ్రతానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి స్వామి వారిని గరు డు సేవలో ఊరేగించారు. మహిళా వర్సిటీలో 23 మందికి ఉద్యోగోన్నతి తిరుపతి రూరల్: మహిళా యూనివర్సిటీ లో కెరీర్ అడ్వానన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద 23 మంది బోధనా సిబ్బందికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ వైస్ చాన్సలర్ ఆచార్య ఉమ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి ఉత్తర్వులను వైస్ చాన్స్లర్ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. రజని అధ్యాపకులకు అందజేశారు. ఇటీవల నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగోన్నతికి ఆమో దం తెలపడంతో ఆ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. -
డిపార్ట్మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : డిపార్ట్మెంట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని ఆర్వీఎస్ నగర్లో ఉన్న ఎస్వీ సెట్, పలమనేరులోని మధర్ థెరిస్సా ఇంజినీరింగ్, మురకంబట్టులోని సీతమ్స్ ఇంజినీరింగ్, కుప్పంలో ని కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్స్లో 1797 మంది, కన్వెన్షనల్ పరీక్షకు 318 మంది హాజరవుతారన్నారు. సమావేశంలో కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ బ్యూలా, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నీళ్ల సాంబారు ..
ముద్ద అన్నం అన్నంపై పోస్తున్న నీళ్ల సాంబారు ముద్దకట్టిన మధ్యాహ్న భోజనం మండలంలోని తిరుమళరాజుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనంలో శనివారం నీళ్ల సాంబారు.. ముద్ద కట్టిన అన్నం ఎలా తింటారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తమిళనాడు సరిహద్దులో తిరుమళరాజుపురం హైస్కూల్లో 245 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంట్లో కంటే పాఠశాలలో ప్రభుత్వం మంచి భోజనం పెడుతుందని ఆశించిన విద్యార్థులకు నీళ్ల సాంబారు.. ముద్ద కట్టిన అన్నం పెట్టడంతో తినలేక అన్నంను ఉపాధ్యాయులకు తెలియకుండా కింద పడేస్తున్నారు. – పాలసముద్రం -
పిల్లల పోషణ, ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పిల్లల పోషణ, ఎదుగుదలపై ఐసీడీఎస్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేసే ఆహారం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అన్ని ప్రాజెక్టులలో టీహెచ్ఆర్ పంపిణీ 100 శాతం పకడ్బందీగా జరగాలన్నారు. ఫ్రీ స్కూల్ పిల్లలు 100 శాతం హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీషన్ గార్డెన్స్ నిర్వహించాలన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గర్భిణులలో హిమోగ్లోబిన్ తగ్గుదలలో కార్వేటినగరం, బైరెడ్డిపల్లి, పులిచెర్ల, కుప్పం, శాంతిపురం కేంద్రాల్లో ఎక్కు వగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల్లో బరువు తగ్గుదల అంశంలో పలమనేరు, వి.కోట, చిత్తూరు అర్బన్ తదితర ప్రాంతాలు వెనుకబడి ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, సీడీపీవోలు పాల్గొన్నారు. -
రూ.12 లక్షలు వంకపాలు!
చిత్తూరు రూరల్(కాణిపాకం) : ఓ టీడీపీ నేత లక్షణంగా రోడ్డు వేశామని... జనాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. కుప్పకూలిన రోడ్డులో ఓ బైక్ ఇరుక్కుపోయి శనివారం అవస్థలు పడ్డాడు. ఆ వివరాలు ఇలా.. గతేడాది వర్షానికి చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట వంకలో రాకపోకలకు అంతరాయం ఏర్ప డింది. ఈ వంకలో జీడీ నెల్లూరు మండల వాసులు పలు పనుల నిమిత్తం వస్తూ పోతుంటారు. వారి అంతరాయం ఆసరాగా చేసుకుని వంక మధ్యలో రోడ్డు వేయాలని ప్లాన్ వేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి రూ.12 లక్షల వరకు మంజూరు చేయించుకున్నారు. నీటి ప్రవాహం కుదుట పడిన వెంటనే పనులు ప్రారంభించారు. సిమెంట్ పైపులను అడ్డం పెట్టి మట్టి కప్పారు. ఆ పని తూతూమంత్రంగా చేయడంతో రెండు రోజులకే నాణ్యత తేలిపోయింది. వంక మధ్యలో రోడ్డు కుంగింది. నాలుగు రోజు కు పెద్ద పెద్ద చీలికలు పడి.. మట్టి కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ రోడ్డు ప్రమాదకరంగా ఉంది. కాలి నడక వెళ్లే వారు అతి జాగ్రత్తతో వంక దాటుతున్నారు. కుంగిన రోడ్డులో..జారి పడిపోయారు... జీడీనెల్లూరు మండలం కడపగుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి తనకు మారుడితో కలిసి శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో చిత్తూరు మండలంలోని బీఎన్ఆర్పేట గ్రామానికి బయలుదేరాడు. నెమ్మదిగా వంక రోడ్డు దాటుతు న్న సమయంలో ద్విచక్రవాహనంను కుంగిన రోడ్డు లాగేసింది. తండ్రి, కొడుకులు ఇద్దరు..ఈ గోతిలో పడ్డారు. వారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనం మాత్రం బాగా ఇరుక్కుపోయింది. అటువైపుగా వెళుతున్న కొందరు ఈవిషయాన్ని గమనించి...ఇరుక్కపోయిన ద్విచక్రవాహ నాన్ని పైకి లాగడానికి ప్రయత్నించారు. పైపుల మధ్య ముందు చక్రం ఇరుక్కుపోవడంతో అరగంట పాటు శ్రమించారు.రోడ్డును మళ్లీ బాగుచేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందులోనైనా నాణ్యత ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు. -
రాజనాలబండ.. నిజాయితీకి అండ
చౌడేపల్లె : సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయ స్వామి పేరు చెప్పగా చోరీ చేసిన సుమారు 150 గ్రాముల బరువు గల నగలు ఇంటి ముందు ప్రత్యక్షమైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చౌడేపల్లె మండలం వెంగళపల్లె పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన గిరిబాబు ఇంటి బీరువాలో దాచిన బంగారు నగలను గతనెల 25వ తేదీ చోరీ అయ్యాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో ఏర్పాటు చేసిన పంచాయతీకి ఇంటికొకరు చొప్పున హాజరయ్యారు. చోరీ సంఘటన గురించి ఆరా తీశారు. నేరం అంగీకరించకపోవడంతో ఈనెల 3న శనివారం ప్రతి ఇంటిలోని ఒకరు రాజనాలబండకు చేరుకొని ప్రమాణం చేయాలని తీర్మానించారు. ఇంతలో శనివారం ఉదయం చోరీ అయిన బంగారు నగల మూట ఇంటి ఆవరణలో ప్రత్యక్షం కావడంతో కథ సుఖాంతమైంది. అనంతరం టెంపుల్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్,, అర్చకుడు కష్ణమూర్తి పూజలు చేసి బాధితులకు బంగారు నగలు అందజేశారు. -
గొడవలో ముగ్గురికి కత్తిపోట్లు
● దుకాణంలో జరిగిన వాగ్వివాదమే కారణమా? ● పరారీలో దాడిచేసిన వ్యక్తి పలమనేరు : వస్త్ర దుకాణంలో జరిగిన వాగ్వాదం కారణంగా ముగ్గురు స్నేహితు లు ఓ వ్యక్తిని వెంబడించగా ఎదురుతిరిగిన అపరిచిత యువకుడు ముగ్గురిని కత్తి తో పొడిచి పరారైన సంఘ టన పలమనేరు పట్టణంలో ని గంటావూరు వద్ద శనివా రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. ఓ యువకుడు స్థానిక వస్త్ర దుకాణంలో కొనుగోలు చేస్తూ అక్కడి యజమానితో గొడవకు దిగినట్లు సమాచారం. అనంతరం ఆ యువకుడు బైక్ను ర్యాస్గా నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహించిన ఆ యజమాని తన స్నేహితులను పిలిపించి ఆ యువకుడి బైక్ను వెంబడించుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. గంటావూరు వద్ద వీరందరూ ఆ యువకుడిపై వాగ్వాదానికి దిగగా అక్కడ జరిగిన గొడవలో ఆ గుర్తు తెలియని యువకుడు తనవద్ద నున్న పదునైన కత్తితో ముగ్గురిపై దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో పట్టణానికి చెందిన లక్ష్మీపతి కుమారుడు భవంత్(27) వీపుపై తీవ్ర గాయమైంది. మధుశేఖర్ కుమారుడు సన్ని(25)కి కడుపు, వీపుపై కత్తిపోట్లు పడ్టాయి. సునీల్(26)కు వీపుపై గాయమైంది. వీరిని స్థానికులు ఇక్కడి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన భవంత్, సన్నిలను మెరుగైన చికిత్స కోసం సీఎంసీకి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. తుమ్మిందలో నేత్రావధానం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తుమ్మింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో నేత్రావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఎటువంటి సంభాషణలు లేకుండా కనుసైగలు, కనుబొమ్మల సంజ్ఞలతో మాట్లాడుకున్నారు. పృచ్ఛకులు ఇచ్చిన పదాలను, వాక్యాలను, సంఖ్యలను ఎనిమిదో తరగతి చదువుతున్న జ్ఞానప్రియ కనుబొమ్మలతో ఇచ్చిన సంజ్ఞలను అర్థం చేసుకొని ఏడో తరగతి చదువుతున్న పి.చాముండి వాటిని చకచక చెప్పేసింది. అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుజాత మాట్లాడుతూ ఇలాంటి అరుదైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తమ పాఠశాలలో నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో గణిత అవధాని హెచ్.అరుణ శివప్రసాద్ పృచ్ఛకులు వసంత లక్ష్మి సంజీవి, లలిత, కాళప్ప, ఈశ్వరి, అమర్నాథ్, జ్ఞాన దీపం, జయమణి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కత్తిపోట్లకు గురైన భవంత్,సన్ని -
‘బీమా’.. లేదిక ధీమా!
కార్వేటినగరం : ప్రమాదాలు.. సహజ మరణాల్లో కుటుంబ పెద్ద దిక్కును కోల్పో యిన పేదలకు అండగా ఉండే బీమా అమ లుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. కూట మి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా బీమా పథకం అమలుపై ఎటువంటిి ప్రకటనా చేయలేదు. రేషన్ కార్డు ఉన్న కుటుంబ పెద్ధ ఆకస్మిక, సహజ మరణం పొందినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలిగించడం కోసం ప్రభుత్వం బీమా పథకం ప్రవేశపెట్టింది.2014–19 మధ్య అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం అమలు చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పేరుతో ఈ పథకం అమలు చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. చంద్రన్న బీమా అమలెప్పుడు..? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా పథకం అమలు చేస్తామని ఆ పార్టీ నాయకులు హామీ ఇచ్చా రు. గతం కన్నా మిన్నగా ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తామని గొప్పలు చెప్పారు. సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడా దిన్నర పూర్తవుతున్నప్పటికీ ఇంత వరకూ చంద్రన్న బీమా పథకం గురించి పార్టీ నాయకులెవరూ మాట్లాడని పరిస్థితి నెలకొంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా యి. ఇలాంటి వారికి బీమా అమలు చేసి ఉంటే కాసింత ఉపశమనం కలిగేదని బాధి త కుటుంబాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం అలసత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బీమా పథకం ఆమలులో ఆలసత్వం చేస్తోంది. జిల్లాలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు 5.40 లక్షలు ఉన్నాయి. ఏటా 8 వందల నుంచి 1200 వరకు సహజ మరణాలు నమోదు అవుతున్నాయి. అదే విధంగా వివి ధ ప్రమాదాల్లో సుమారు 3 వందల మంది వరకు ప్రాణాలు విడుస్తున్నట్లు సమాచారం. అలాగే వివిధ ప్రమాదాల వల్ల వందల మంది వైకల్యం బారిన పడి మంచానపడి మగ్గుతున్నారు. బీమా పథ కం లేకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బీమా విషయంపై ప్రభు త్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అమలు చేయాలి కూటమి ప్రభు త్వం ఎన్నికల హామీలో భాగమై న చంద్రన్న బీమా పథకం తక్షణమే అమలు చేయాలి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం ఎంతో ఉపయోగకరం. ప్రమాదాలు, సహజ మరణాల్లో కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతుంది. బీమా సొమ్ము ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది. కూట మి ప్రభుత్వం బీమా పథకం అమలు చేయాల్సిన అవసరం ఉంది. – పురుషోత్తంరాజు, రాజుల కండ్రిగ, కార్వేటినగరం -
ఉత్తుత్తి ఆర్భాటమే!
కుప్పం : కుప్పంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని.. వందల కోట్లు కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు మంజూరు చేస్తున్నారని గొప్పలు చెబుతూ...అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే కుప్పం పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులే. పట్టణంలో అర్ధంతరంగా ఆగిన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికార పార్టీ నేతలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎంఆర్రెడ్డి సర్కిల్ నుంచి కుప్పం రైల్వే గేటు వరకు రెండవ రోడ్డు రీచ్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా ఆరు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరయ్యాయని హంగామా చేశారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం నిర్ణయించలేదు, రోడ్డు విస్తరణ మార్కింగ్ చేయకుండానే ఆర్భాటం చేశారు. తీరా రోడ్డు విస్తరణకు ఆర్అండ్బీ ప్రభుత్వ కార్యాలయం అడ్డంగా ఉందని, హఠాత్తుగా కార్యాలయం పూర్తి కానీ సొంత భవనంలోకి మార్చేశారు. రైల్వే గేటు సమీపంలోని ఆర్ అండ్బీ కార్యాలయం ప్రహరీ వద్ద పూజలు చేపట్టి జేసీబీతో గోడను కూల్చి వేశారు. అంతే ఇప్పటి వరుకు రోడ్డు విస్తరణ పనులు ఊసే లేకుండా పోయాయి. ప్రారంభానికి నోచుకోలే.. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉందని ఆర్అండ్బీ కార్యాలయాన్ని కృష్ణగిరి సర్కిల్లో నిర్మిస్తున్న సొంత భవనంలోకి మార్చేశారు. కానీ నెలలు గడుస్తున్నా రోడ్డు విస్తరణ పనులు మాత్రం ఫ్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఖాళీగా ఉన్న భవనంలో నూతనంగా కుప్పం ఉద్యానశాఖ కార్యాలయం ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు విస్తరణపై అధికారులు, నాయకులు చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉంది. అభివృద్ధి పనులు అంతంతే.. అధికార పార్టీ నేతలది కుప్పం అభివృద్ధిపై ఉత్తుత్తిఽ ఆర్భాటాలు తప్ప ఒరిగింది ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. కోట్లతో కుప్పం అభివృద్ధి అంటే కేవలం దస్త్రం మీదే కనిపిస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీ సైతం అభివృద్ధికి ఆమడ దూరంగా నిలుస్తోంది. -
కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. జిల్లాలోని 5 కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న 34 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. సాధారణ అభ్యర్థులకు 18–45 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థులకు ఐదు సంవత్సరా లు, దివ్యాంగులకు ఏడు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తులను కేజీబీవీ ప్రిన్సిపల్స్, ఎంఈఓల వద్ద పొందవచ్చని చెప్పారు. ఈ పోస్టులకు జిల్లాలో అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 11వ తేదీ లోపు నేరుగా డీఈఓ కార్యాలయంలో ఉన్న సమగ్ర శిక్ష శాఖలో అందజేయాలని ఆయన వెల్లడించారు. బోయకొండ గర్భాలయానికి ఇత్తడి తాపడం సమర్పణ చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ప్రధాన గర్భాలయంలో అమ్మ వారి విగ్రహానికి వెనుక అలంకరణ కోసం ఇత్తడి తాపడాన్ని శనివారం విరాళంగా అందజేసినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. మదనపల్లె టౌన్ ఎస్బీఐ కాలనీకు చెందిన పి.గంగాధరం సుమారు రూ.2.80 లక్షలు విలువ చేసే ఇత్తడి తాపడం షీట్ తయారు చేయించి ఆల యంలో అలంకరణ కోసం విరాళమిచ్చారు. వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ రుణాలపై వడ్డీమాపీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విక్రమ్కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరి ధిలో 2015–16 నుంచి 2018–19లో మంజూరు చేసిన ఎన్ఎస్ఎఫ్ దీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ అవకాశం కల్పించిందన్నారు. నాలు గు నెలల (ఏప్రిల్ 2026)లోపు అస లు రుణ మొత్తం చెల్లిస్తే, 2025 ఆగస్టు 31 వరకు ఉన్న మిగిలిన వడ్డీని మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని అంబేడ్కర్ భవనంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 83,032 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,272 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శ నం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కె ట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
టీచర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు రద్దు చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర విద్యాశాఖ అధికారులు టీచర్లకు షోకాజ్ నోటీసులుకాదు స్వేచ్ఛ నివ్వాలని వైఎస్సార్ టీఏ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రెడ్డి శేఖర్రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యా శాఖ అధి కారులు 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టిన 100రోజుల ప్రణాళికలో మార్కు లు నమో దు చేయలేదనే కారణంతో టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు టీచర్లకు స్వేచ్ఛ ని ఇవ్వకుండా ఉత్తీర్ణత శాతం పెంపునకు ఇబ్బంది పెట్టడం తగదన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు సరైన ఆహారం, విశ్రాంతి, వినోదం అవసరమని మానసిక వైద్యులు సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యాశాఖలో ఇతర శాఖల అధికారుల పెత్తనం ఎక్కువైందని టీచర్లు రగిలిపోతూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. తగిన కారణాలు తెలుసుకోకుండా టీచర్లకు ఏకపక్షంగా షోకాజ్ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. టీచర్లకు నోటీసులు ఇచ్చి భయపెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసులు వెంటనే రద్దు చేయకపోతే 100 రోజుల ప్రణాళికను టీచర్లు బహిష్కరిస్తారని హెచ్చరించారు. ఆర్మ్డ్ రిజర్వు ఏఎస్పీగా దేవదాసు చిత్తూరు అర్బన్ : చిత్తూరు పోలీసుశాఖలోని ఆర్మ్డ్ రిజర్వు (ఏఆర్) ఏఎస్పీగా ఎం.దేవదాసు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఏపీ పోలీసు అకాడమీలో పనిచేస్తున్న దేవదాసును చిత్తూరుకు బదిలీ చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో బాధ్యతలు తీసుకున్న ఆయన ఎస్పీ తుషార్ డూడీను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈయన గతంలో చిత్తూరు ఆర్ఎస్ఐగా, ఏఆర్ డీఎస్పీగా పనిచేశారు. -
ఒక్క టోకెన్ సామీ !
యూరియా రైతులను కుంగదీస్తోంది. టోకెన్ల కోసం పరుగులు పెట్టిస్తోంది. గంటలోపే టోకెన్లు అందక కన్నీళ్లు పెట్టిస్తోంది. క్యూకట్టి...వెన్ను విరిచేస్తోంది. తిండి తిప్పలు లేక పడిగాపులు పడుతున్నారు. ఇదీ చాలదన్నట్లు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పస్తులతో యూరియా కోసం అలమటిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.చిత్తూరు నగరంలోని సహకార మార్కెటింగ్ సొసైటీ భవనం వద్ద గుమికూడిన రైతులు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలో శనివారం యూరియా పంపిణీ చేశారు. మళ్లీ మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకె న్లు పంపిణీ చేశారు. ఇందుకు ముందుగానే చిత్తూ రు నగర పరిసర ప్రాంతాల్లోని రైతులు వందలాదిగా క్యూకట్టారు. ఉదయం 8గంటలకే కార్యాలయాన్ని చుట్టిముట్టేశారు. రైతులు అధిక సంఖ్యలో అక్కడికి రావడంతో గందరగోళంగా కనిపించింది. గంటల్లోనే టోకన్లు అమ్ముడుపోవడంతో చాలా మంది రైతులు నిరాశకు లోనయ్యారు. బతిమిలాడుతున్నా.. వందలాదిగా వచ్చిన రైతుల్లో కొంత మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయి. మిగిలిన రైతులను సోమవారానికి రమ్మని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత వచ్చిన వారికి టోకెన్లు లేవని తిప్పి పంపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు మాత్రం అల్లాడిపోయారు. అధికారులను ఒక్క టోకెన్ సామి అని బతిమిలాడుకున్నారు. వారిని అధికారులు.. మీ ఊళ్లోనే ఇస్తారని సర్ధిచెప్పి పంపించేశారు. ఇక టోకెన్లు అందిన వారికి కూడా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. నిల్వలు ఇవీ జిల్లాలో ప్రస్తుతం 324 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. 108 ఆర్బీకేలో 84 మెట్రిక్ టన్నులు, 7 సహకార సొసైటీలో 40 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు దుకాణాల్లో 200 టన్నులు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వీటిని రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. గంటల తరబడి పడిగాపులు చిత్తూరు నగరంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడకు ఉదయం 8గంటలకు వచ్చి క్యూలో నిలబడుతున్నారు. టోకెన్లు దొరకవని పొద్దు..పొద్దునే వచ్చేస్తున్నారు. కార్యాలయం వద్ద గంట నుంచి..రెండు గంటల సమయం తర్వాత టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. అక్కడ టోకెన్లు తీసుకుని గాంధీ రోడ్డులోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ భవనం వద్దకు నడిచి వెళ్లాలంటే అర గంట సమయం పడుతుంది. ఇంతలో రైతులు నీరసించిపోతున్నారు. యూరియా తీసుకోవాలంటే క్యూలో నిలబడి తల్లడిల్లిపోతున్నారు. బయోమెట్రిక్ వేసి..యూరియా బ్యాగు తీసుకుని బయటకు రావడానికి రెండు గంటల సమయం పడుతోంది. దీంతో రైతులు సొమ్మ సిల్లిపోతున్నారు. అధికారులు స్పందించి ఈ కష్టాల నుంచి విముక్తి కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. యూరియాకు..రెండు కి.మీ... యూరియాకు టోకెన్లు అందిన రైతులు కూడా మండిపాటుకు గురవుతున్నారు. ఆఫీసులో టోకెన్లు ఇస్తే..రెండు కి.మీ దూరం వెళ్లి యూరియా తెచ్చుకోవాలా అంటూ మండిపడుతున్నారు. రైతులను ఇలా ఇబ్బంది పెట్టించడం కరెక్టు కాదని ఆగ్రహానికి గురవుతున్నారు. యూరియా పంపిణీ చేసే చోటే..టోకెన్లు పంపిణే చేస్తే బాగుంటుందని, ఈ విషయంలో కలెక్టర్, పాలకులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరీక్షణ లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే యూరియా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని నివేదిస్తున్నారు. -
కోటా వినుత కేసు.. సుధీర్ రెడ్డిపై చంద్రబాబు సంచలన ఆరోపణలు
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి నియోజకవర్గం వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా కోటా వినుత భర్త కోట చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోటా చంద్రబాబు తాజాగా వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చెన్నై పోలీసులకంటే ముందే సుధీర్ రెడ్డి.. మా రిమాండ్ రిపోర్టును ఎలా బయటపెట్టారు?. మా అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి ఎందుకు తమిళనాడు పోలీసులను కలిశారు?. మమ్మల్ని అనవసరంగా డ్రైవర్ రాయుడు హత్య కేసులో ఇరికించారు. శ్రీకాళహస్తి నుంచి వన్ టౌన్ సీఐ గోపి చెన్నై సెవెన్ వెల్స్ పీఎస్లో మంతనాలు చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్తో మాట్లాడించారు. మాపై ఎఫ్ఐఆర్ నమోదు కాక ముందే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టారు. మా ఇష్యూపై మీడియాతో మాట్లాడారు. మీరు అర్దం చేసుకోండి మా పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చక ముందే చెన్నై పోలీసు కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్మీట్ పెడితే.. హత్య, ఆత్మహత్య అని తేల్చక ముందే మాపై నిందారోపణలు చేశారు. శ్రీకాళహస్తిలో హత్య జరిగి ఉంటే చెన్నై వరకు మృతదేహం తీసుకెళ్లడం సాధ్యమా?. ఈ హత్య కేసులో నిర్దోషులుగా బయటపడిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్ని వ్యాపారాలు చెన్నై కేంద్రంగా చేస్తూ మాపై కక్షసాధింపు చర్యలు చేశారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. కీలకంగా ఎదుగుతున్న తరుణంలో జనసేన పార్టీ నుంచి బహిష్కరించేలా చేశారు.ఒక మహిళపై కుట్రలా?తన రాజకీయ ప్రత్యర్ది ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే చేశారు. బలమైన రాజకీయ నాయకురాలిగా ఎదుగుతున్న వినుత కోటను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారు. రాజకీయ జీవితాన్ని సమాధి చేయడంలో భాగంగా ఈ హత్య కేసులో ఇరికించారు. 19 రోజుల్లో కోర్టులో ఈ కేసును నిరూపించలేకపోయారు. మేము ధైర్యంగా ఈ కేసులో నిర్దోషులం అని బయటపడతాం. హత్యకేసులో మాపై ఆరోపణలు నిరూపితం కాలేదు. డ్రైవర్ రాయుడు సెల్పీ వీడియోలో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు, కోర్టుకు అన్ని విషయాలు అందించాం. ఒక మహిళపై కుట్రలు చేసి ఇరికించారు. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోలో కొన్ని విషయాలే బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి.సుధీర్ రెడ్డి పాత్రే కీలకం..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ జరిపించాలి. మేము రిమాండ్కు వెళ్లక ముందే మాపై మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడటం గుమ్మడికాయలు దొంగ అన్నట్లుగా ఉంది. అన్ని విషయాలు మేము బయటపెడతాం. ఈ కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ప్రజలు అందరికీ తెలుసు. మమ్మల్ని చంపాలని నువ్వు కుట్రలు చేశావు. శ్రీకాళహస్తి సీఐ గోపీని చెన్నై పంపించి మాపై కుట్ర చేయించావు. మహిళలు రాజకీయాలు ముందుకు రాకుండా ఇబ్బందులు పెట్టినా ఈరోజు నిలబడి ఉన్నాం. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది, సత్యమేవ జయతే’ అంటూ కామెంట్స్ చేశారు. -
అందని రేషన్
పాలసముద్రం : మండలంలోని 10వ రేషన్ షాపు వద్ద రేషన్ బియ్యం సక్రమంగా వేయడం లేదని రేషన్ కార్డు లబ్ధిదారులు శుక్రవారం ధర్నా చేపట్టారు. రేషన్ కార్డుదారులు మాట్లాడుతూ.. శ్రీబొమ్మరాజుపురం ఆదిఆంధ్రవాడ, రాచపాల్యం, సన్నగుంట ఎస్టీ కాలనీ, గుండుబావి సన్నగుంట బీసీ కాలనీ గ్రామాలకు చెందిన 320 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ 10వ నంబర్ రేషన్ షాపును కేటాయించి ప్రభుత్వం నిత్యావసర సరుకులు సరఫరా చేస్తోంది. 320 రేషన్ కార్డులకు 5.500 టన్నులు రేషన్ బియ్యం పంపిణీ చేయాలి. ప్రస్తుతం ఆరు నెలలుగా 2.500 టన్నుల బియ్యం మాత్రమే షాపునకు పంపిణీ చేస్తున్నారు. మొదటి రెండు రోజులు వస్తున్న సుమారు 100 రేషన్ కార్డులకు 2.500 టన్నుల బియ్యం సరిపోతోంది. మిగిలిన 220 రేషన్ కార్డులకు బియ్యం లేవంటున్నారు. ప్రతి రోజు కూలీ పనులకు వెళ్లగా చాలీచాలని సంపాదనలో కుటుంబాలను పోషించుకుంటున్నామని, రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో మార్కెట్లో వేలకు వేలు పెట్టి బియ్యం కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా మా రేషన్ కార్డుల సరుకులు అందడం లేదని వాపోయారు. -
పాసు పుస్తకాలు పంపిణీ చేస్తాం
గుడిపాల : గ్రామాల్లో గ్రామసభ లు నిర్వహించి జనవరి 9వతేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. శుక్రవారం గుడిపాల మండలంలో వసంతా పురం సచివాలయంలో రైతు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ రీసర్వేతో కొత్తగా పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని మండలాలు కలిపి 59,701 మందికి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చాయని, వీటిని 298 గ్రామాలలో పంపిణీ చేస్తామన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శిరీషా, సర్పంచ్ రజినీకాంత్, మాజీ జడ్పీటీసీ బాలాజీనాయుడు పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనకు పారదర్శకంగా అనుమతులు
చిత్తూరు కలెక్టరేట్ : పరిశ్రమల స్థాపన నిమిత్తం పారిశ్రామికవేత్తలకు అనుమతులను పారదర్శకంగా మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమా ర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంఈజీపీ యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని, ప్రతి మండలానికి ఐదు యూనిట్ల లక్ష్యాన్ని డీఆర్డీఏకు కేటాయించాలన్నారు. భాగస్వామ్య ఒప్పంద యూనిట్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించి లైసెన్సులు మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల క్లస్టర్లను సందర్శించి విద్యుత్ సేవల అంతరాయంపై పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. ఇండస్ట్రీయల్ ఏరియా ఎస్టేట్ లోకల్ అథారిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవా లని పేర్కొన్నారు. డీఐసీ జీఎం సూరిబాబు, ఏపీఐఐసీ జెడ్ఎం సుబ్బారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం తొట్టంబేడు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన తొట్టంబేడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రాయచోటికి చెందిన చందు(21) శుక్రవారం తొట్టంబేడు పోలీస్స్టేషన్ పరిధిలోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చందు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపు తప్పి విద్యార్థి మృతి తవణంపల్లె : అరగొండ– చిత్తూరు ప్రధాన రహదారిలో వినాయక స్కూల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొనడంతో బీటెక్ చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడని తవణంపల్లె ఎస్ఐ డాక్టర్ నాయక్ తెలిపారు. సంఘటనకు సంబంధించి వివరాలిలా.. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం యల్లవపాల్లెకు చెందిన వంకరాజు సుధాకర్ కుమారుడు వంకరాజు సురేష్కుమార్(21) చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో సురేష్కుమార్ ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
రాతపై పట్టు.. మార్కులు రాబట్టు
కార్వేటినగరం : పరీక్ష రాసే విద్యార్థుల చేతి రాత బాగుంటే మూల్యాంకనం చేసే వారికి సులువుగా అర్థమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. చేతి రాత బాగా లేకపోతే మూల్యాంకనం చేసే వారికి సమాధానం అర్థం కాకుంటే ఒక మార్కు లేదా అర మార్కు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మార్కులపై ప్రభావం చూపి ర్యాంకు తగ్గే అవకాశం లేకపోలేదు. విద్యార్థులు చేతి రాతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పరీక్షలకు రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున విద్యార్థులు ప్రతి రోజూ అర గంట చేతిరాతపై సాధన చేయాలని. నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో చేతి రాత ఎలా ఉండాలో నిపుణుల మాటల్లోనే... ● విద్యార్థుల ఆన్సర్ షీట్ (బుక్లెట్)లో సమాధానాలను స్పష్టంగా రాయాలి. ● నాలుగు వైపులా మార్జిన్లు (బార్డర్లు) చేసుకుంటే అందంగా ఉంటుంది. ● బుక్ లెట్ ఎడమవైపు రెండున్నర సెంటీమీటరు, కుడివైపు, పైనా, కింద, ఒకటిన్నర సెంటీ మీటరు బార్డర్ వేసుకోవాలి. ● ఒకలైన్ , మరో లైనుకు ఒకటిన్నర సెంటీ మీటరు గ్యాప్ ఇవ్వాలి. ● పదానికి, పదానికి అర సెంటీ మీటరు స్పేస్ ఇవ్వాలి. ● బుక్లెట్లో వాక్యాలు పైకి కిందకు లేకుండా వరుస క్రమంలో ఉండాలి. ● బొటన వేలు, మూడవ వేలికి చూపుడు వేలు సహాయంతో పెన్నును చక్కగా పట్టుకోవాలి, ఇలా చేయడం వల్ల రాసే సమయంలో స్పీడుగా రాయవచ్చు. ● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం చేతిరాత పై కూడా పడుతుంది. ● మనసు ప్రశాంతంగా ఉంటే చేతిరాత చక్కగా వస్తుంది. సమాధాన పత్రంలో అక్షరాలు బాగుంటే ప్రతి సెబ్జెక్టులో కనీసం నాలుగు నుంచి ఐదు మార్కులు పెరిగే అవకాశం ఉంది. ● అక్షరాలు బాగా లేకపోతే చాలా మార్కులు కోల్పోవాల్సి వస్తుంది. సాధనతో సాధ్యం చక్కటి చేతిరాత సాధనతోనే సాధ్యం అవుతుంది. పరీక్షలకు ఇంకా సమ యం ఉన్నందున విద్యార్థులు అక్షరాలను గుండ్రంగా రాసేందుకు సమ యం కేటాయించి సాధన చేయాలి. చాలా మంది తొలి ప్రశ్నకు గుండ్రటి అక్షరాలతో సమాధానం రాస్తారు. ఆ తరువాత సమయం అయిపోతుందనే ఆందోళనతో వేగంగా రాయడం ప్రారంభిస్తారు. గుండ్రటి అక్షరాలు కుదరవు. ఈ ప్రభావం మా ర్కులపై పడుతుంది. అన్ని ప్రశ్నలకు సమాధానా లు గుండ్రంగా రాయాలంటే సాధన తప్పనిసరి. – జగదీశన్, చేతిరాత నిపుణుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కార్వేటినగరం -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ..
పుంగనూరు : అతి వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా, 10 మంది గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి పట్టణ సమీపంలోని కొత్తపల్లె మలుపు వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం, చెంబకూరు పంచాయతీ దిన్నిమీద హరిజనవాడకు చెందిన రా జమ్మ, కదిరప్ప , లక్ష్మీపతి, నారాయణమ్మ , గాయత్రి, రూపశ్రీ, లావణ్య, శరణ్య, రెడ్డెమ్మ , మనోజ్, ఆటో డ్రైవర్ రెడ్డెప్ప (38), నారాయణప్ప(52) కలసి ఆటోలో స్వగ్రామం నుంచి బయలుదేరి పెద్ద పంజాణి మండలం , వీరప్పల్లెలోని నల్లవీరగంగమ్మ గుడికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి పూజలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి సాయంత్రం స్వగ్రామానికి ఆటోలో తిరిగి బయలుదేరారు. మా ర్గ మధ్యలో కొత్తపల్లె వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ ఇమ్రాన్ అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో కారు ఆటో ను ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణప్ప కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మిగిలిన 10 మంది గాయాలుపాలయ్యారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి, బాధితులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నారాయణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేశారు. బిక్కుబిక్కుమంటున్న చిన్నారులతో అవ్వ... రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒకే కుటుంబానికి చెందిన లక్ష్మీపతి, గాయత్రి, లక్ష్మీపతి తల్లి రెడ్డెమ్మ, వారి చిన్నారులు లావణ్య, శరణ్య కలసి గుడికి వెళ్లి ప్రమాదంలో గాయపడ్డారు. చిన్నారుల తల్లిదండ్రులు ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ అదృష్టవశాత్తు అవ్వ రెడ్డెమ్మ కు , చిన్నారులు ఇద్దరికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో నిశ్చేష్టులైన చిన్నారులను అవ్వ రెడ్డెమ్మ ఒడిలో పెట్టుకుని భయకంపితురాలైంది. ఇద్దరు చిన్నారులకు తల్లిదండ్రులు ప్రమాదంలో గాయపడిన సంఘటన తెలియకపోయినా ఏం జరిగిందోనన్న భయంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ ఉండడం కనిపించింది. -
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ
సోమల(పుంగనూరు) : సోమల మండల కేంద్రంలో నివాసం ఉన్న చెన్నరాయుడు భార్య రెడ్డెమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును లాకెళ్లిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు రెడ్డెమ్మ సాయిబాబా గుడి ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్పై వచ్చి మెడలోని బంగారు గొలుసు లాకెళ్లారు. ఈ సంఘటనతో బాధితురాలు కేకలు వేయడంతో దొంగలు ఇద్దరు డిగ్రీ కళాశాల వైపు వెళ్లినట్లు గమనించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 గ్రాముల బరువు గల బంగారు గొలుసు విలువ సుమారు రూ.3 లక్షలు అని బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు సోమల పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నారు. 12న వాలీబాల్ పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఈనెల 12న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు మైభారత్ జిల్లా యువజన అధికారి ప్రదీప్ తెలిపారు. ఆరోజు స్థానిక మెసానికల్ గ్రౌండ్స్ నందు పోటీలు ఉంటాయన్నారు. యువజన, మహిళలు, స్వచ్ఛంద సంస్థలకు కిట్లను ఇవ్వనున్నామన్నారు. ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గంగమ్మకు రాహుకాల పూజలు చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. రాహుకాల సమయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు , అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, రంగు రంగు పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సారా స్వాధీనం రొంపిచెర్ల : అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు. శుక్రవారం మోటుమల్లెల గ్రామ పంచాయతీ ఆదినవారిపలె బస్టాప్ వద్ద యువకుడు సంచిలో క్యాన్ పెట్టుకుని ఉండగా అనుమానం వచ్చి తనిఖీ చేయగా సారాగా తేలిందన్నారు. రూ. 1500 విలువ చేసే సారాను స్వాధీనం చేసుకుని నిందితుడు సోమశేఖర్ (33)ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పీలేరు కో ర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్కు ఆదేశించినట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో ఎక్కడైన సారా తయారు చేసిన ,విక్రయించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లును రహస్యంగా ఉంచుతామన్నారు. -
పార్కింగ్ ఫీజుకు బ్రేక్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలోని వాహనాల పార్కింగ్ ఫీజుకు బ్రేకు పడింది. సాక్షి దినపత్రికలో నవంబర్ 25వ తేదీన ధర్మా స్పత్రిలో ఏమిటీ దౌ ర్బాగ్యం అనే పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన పత్రికలో వచ్చిన కథనాన్ని గుర్తు చేశారు. జనవరి 1 నుంచి పార్కింగ్ ఫీజు ను ఎత్తివేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పార్కింగ్ గేటు వసూళ్లకు బ్రేకులు వేశారు. వైద్య శాఖలో ఆ అధికారి బదిలీ ? సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఓ అధికారిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధ మైందనే విమర్శలు వస్తున్నాయి. శాఖలో ఓ అధి కారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బదిలీలు, పోస్టుల భర్తీ, కార్యాలయ నిర్వహణ, పలు కార్యక్రమాల నిర్వహణలో పెద్ద ఎత్తున ఆరోపణలు మూట కట్టుకున్నారు. అనతి కాలంలోనే శాఖలోని 90 శాతం మంది ఆ అధికారికి గిట్టని వాళ్లయ్యారు. కొంత మంది తమ తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఆ అధికారికి వద్ద ఊసరవెల్లులా ఉంటున్నారు. అయితే కార్యాలయంలో చీమ చిటుక్కుమన్నా..టక్కుమని రాష్ట్ర శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగానికి ఉప్పందిస్తున్నారు. దీనికితోడు రాత పూర్వకంగా పలు ఫిర్యాదులు వెళ్లాయి. దీని పై రాష్ట్ర శాఖ, జిల్లా యంత్రాంగం సైతం ఎప్పటి కప్పుడు గోప్యంగా విచారిస్తోంది. ఇటీవల జిల్లా కు వచ్చిన ఓ రాష్ట్ర శాఖ అధికారి సైతం ఆ అధికా రి తీరును పసిగట్టినట్లు తెలుస్తోంది. వస్తున్న ఫిర్యాదులను పలువురితో పంచుకున్నారనే విష యం బయటకొచ్చింది. త్వరలో బదిలీ ఉంటుందని రాష్ట్ర అధికారి చెప్పడంలో కార్యాలయంలో 95శాతం మంది కూల్ అయ్యారు. ఇక కార్యాలయంలో ఎప్పడు లేనంతగా ఫైళ్లు చకచకా కదలడంతో...మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. జిల్లా విభజనలో అధికారికి బదిలీ తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ అధికారి మాత్రం నన్ను బదిలీ చేసే పరిస్థితి లేదని ధీమాతో ఉన్నారు. ఉచిత శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : ఐటీఐ పూర్తి చేసి పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఐటీఐ రెండేళ్ల కోర్సులో 60 శాతం మార్కులు ఉత్తీర్ణత సాధించిన వారు ఈనెల 5 లోగా ఆధార్ , రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, పదో తరగతి జిరాక్స్ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవా లన్నారు. ఈనెల 5 నుంచి ఫిబ్రవరి 4వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నమన్నారు. శిక్షణ కాలంలో ఎటువంటి భత్యం చెల్లించరని సృష్టం చేశారు. -
సేవల తీరు ఇలా..
గంగమ్మకు రాహుకాల పూజలు బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. గుడిపాల మండలంలోని పీహెచ్సీని శుక్రవారం కలెక్టర్ సుమిత్కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఇద్దరు డాక్టర్లు లేరని, స్టాఫ్ నర్సులే చికిత్స అందిస్తున్నారని గుర్తించారు. ఒక డాక్టర్ మెడికల్ లీవులో వెళ్లగా..మరో డాక్టర్ విధులకు డుమ్మా కొట్టినట్లు తెలుసుకున్నారు. దీంతో కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట ఆస్పత్రిలో శుక్రవారం వైద్యుల కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా..ఒక డాక్టర్ మెటర్నటీ లీవులో ఉన్నారు. మరో డాక్టర్ విజిట్కు వెళ్లారు. ఆ డాక్టర్ చెర్లోపల్లిలో విజిట్కు వెళ్లినట్లు నోట్క్యామ్ ద్వారా ఫొటో తీసి పెట్టారు. అయితే ఉదయం 9 నుంచి ఓపీ చూడాలని ఆదేశాలున్నాయి. కాగా డాక్టర్ లేని కారణంగా పీహెచ్సీలో స్టాఫ్ నర్సులే వైద్యం చేసి మందుబిల్లలు ఇచ్చి పంపారు. చిత్తూరు నగరం టెలిఫోన్ కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్పై ఓ స్టాఫ్ నర్సు ఫిర్యాదు చేసింది. డాక్టరు కేంద్రంలో ఉన్నప్పుడు కూడా మమల్ని ఓపీ చూడాలని ఇబ్బంది పెడుతున్నట్లు నోటిమాటగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన అధికారులు ఆ డాక్టర్కు పలు సూచనలు చేశారు. -
ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పను లు వేగవంతం చేయాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం ఎస్ఈ కార్యాలయంలో నిర్మా ణ, ఎంఆర్టీ, డీపీఈ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పల్లెలకు త్రీఫేజ్ సరఫరా ఇవ్వడానికి ఈ పథకం కేంద్ర ప్రభు త్వం ప్రవేశ పెట్టిందన్నారు. దీంతో గ్రామాలకు మెరుగైన సరఫరా ఇవ్వడమే లక్ష్యమన్నారు. జిల్లా లో మార్చి నాటికి 421 ఫీడర్ల పరంగా పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 174 మాత్రమే చేశారన్నారు. మిగిలినవి యుద్ధప్రాతిపాదికన చేయాలని ఆదేశించారు. స్మార్ట్మీటర్ల ఏర్పాటు వాణిజ్య సర్వీసులకు బిగించడం పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పా టు చేస్తున్నామన్నారు. తదుపరి ప్రభుత్వ ఉద్యోగు ల నివాసాలకు చివరిగా మిగిలిన సర్వీసులకు స్మార్ట్ మీటర్లను పెట్టాలన్నారు. నగరి, కార్వేటినగర వినియోగదారులు చిత్తూరుకు రావడం ఎందుకన్నారు. కార్యక్రమంలో ఈఈలు హరి, భాస్కర్నాయుడు, రవి, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
నాడి పట్టని వైద్యులు
ప్రాథమిక ఆరోగ్యానికి సుస్తీ చేసింది. వైద్యులు నాడి పట్టకలేకపోతున్నారు. ఓపీకి..ఓపిక లేదంటున్నారు. విజిట్ పేరుతో విధులకు డుమ్మాకొడుతున్నారు. స్టాఫ్నర్సులే డాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఓపీ సంఖ్య దారుణంగా పడిపోతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూగబోతున్నా యి. ఆరోగ్య సేవలపై కలెక్టర్ సీరియస్ అవుతున్నారు. గుడిపాలలో చికిత్స అందిస్తున్న స్టాఫ్నర్సులు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో 50 పీహెచ్సీలు, 15యూపీహెచ్సీలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి రోజువారీగా 50 నుంచి 120 ఓపీలొస్తున్నా యి. ఇక్కడికి వస్తున్న వారిలో ఎక్కువ మంది పేద లే. అందులో అధికంగా వృద్ధులుంటున్నారు. వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. చంద్రబాబు సర్కారు వచ్చాక ఆరోగ్య సేవలు ఆమడ దూరమయ్యాయని పేద లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాడితప్పిన సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా గాడితప్పాయి. పర్యవేక్షణ లోపం కారణంగా డాక్టర్లు కనుమరుగవుతున్నారు. చెప్పాపెట్టకుండా డుమ్మాకొట్టేస్తున్నారు. ఉదయం 9 గంటలకు విధులకు హాజరై..ఫేషియల్ అటెండన్స్ పెట్టాలి. కానీ చాలా మంది సమయానికి అటెండన్స్ వేయడం లేదు. సాయంత్రం హాజరు ఊసే కనిపించడం లేదు. డాక్టర్లు విజిట్ పేరుతో తప్పించుకుని తిరుగుతున్నారు. సొంత వైద్యానికి పదును పెడుతున్నారు. విజిట్..వ్యసనంలా..! విజిట్ అనే పదాన్ని పలువురు వైద్యులు వ్యసనంలా మార్చేశారు. మూమెంట్, విజిట్ రిజిస్ట్రర్లను చూపించి...పలువురు వైద్యులు వైద్య సేవలను గాలిలో దీపంలా చేశారు. డాక్టర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విధిగా ఓపీ చూడాలి. కానీ ఆ రకంగా వైద్యులు ఓపీ చూడడంలేదు. ఆ సీట్లో కూర్చొనే ఓపిక లేకుండా పోతోంది. విజిట్ పేరుతో విధులకు స్వస్తి పలుకుతున్నారు. ఏదో ఒక చోట పరిశీలనకు వెళ్లినట్టు నోట్ క్యామ్ ద్వారా ఫొటోలు పెట్టి...సొంత పనులకు పరుగులు పెడుతున్నారు. లేకుంటే డీఎంహెచ్ఓ ఆఫీసులో మీటింగ్ అంటూ విధులను వదిలించుకుంటున్నారు. ఇద్దరు డాక్టర్లుంటే ఓ వైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టించుకోకుండా ..మరో వైపు 104 సేవలను కూడా నీరుగారుస్తున్నారు. స్టాఫ్నర్సులే అన్నీ తామై.. డాక్టర్లు లేని పీహెచ్సీలో స్టాఫ్ నర్సులే డాక్టర్లవుతున్నారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వైద్యులకు వారు వైద్యం చూసి పంపుతున్నారు. జబ్బు అడిగి..మందులు, మాత్రలు ఇవ్వడమే పనిగా పెట్టుకుంటున్నారు. స్టాఫ్ నర్సులే పీహెచ్సీలో అన్ని తామై వ్యవహరిస్తున్నారు. ఒక వేళ డాక్టర్లు ఉన్నా కొన్ని చోట్ల స్టాఫ్ నర్సుల ద్వారా చికిత్స చేయిస్తున్నారు. దీంతో వైద్య సేవలు పూర్తిగా గాడితప్పుతున్నాయి. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
మండిపడ్డ కలెక్టర్ గుడిపాల : విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. శుక్రవారం గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఇద్దరు డాక్టర్లు ఉండాల్సిన చోట ఒక్కరూ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక డాక్టర్ సెలవుపై ఉన్నార ని సిబ్బంది తెలిపారు. మరో డాక్టర్ ఎక్కడికి వెళ్లారని కలెక్టర్ ప్రశ్నించారు. స్టాప్ నర్సులే రోగులను ఎలా చూస్తారన్నారు. ఇలానే కొనసాగితే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదన్నారు. వచ్చే రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని కలెక్టర్ హెచ్చరించారు. పీహెచ్సీలోని అన్ని విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్ను పరిశీలించి సిబ్బందిపై మండిపడ్డారు. 15 రోజుల తరువాత మరోసారి ఆసుపత్రి విజిట్ చేస్తానని ఇంతలో తీరు మార్చుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఇలానే కొనసాగితే జనవరి నెలకు సంబంధించి జీతాలను నిలిపివేస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ సూర్యనారాయణ, వైద్య సిబ్బంది చంద్రశేఖర్, విజయ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
తోటలో డబ్బుల మూట
– స్వాధీనం చేసుకున్న పోలీసులు? పలమనేరు : పట్టణ సమీపంలోని నాగమంగళం వద్ద ఓ రైతు టమాట తోటలో కూలీలు పొలం పనులు చేస్తుండగా కర్ణాటక పోలీసులు రావడం ఓ వ్యక్తిని తీసుకురావడం ఆయన చెప్పినచోట తోటలో దాచిన మూట నగదును వారు స్వాధీనం చేసుకోవడం నిమిషాల్లో జరిగిపోయింది. దీన్ని చూసిన కూలీలకు ఏమీ అర్థం కాలేదు. ఈ సంఘటన వారం క్రితం జరగ్గా ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. బేరుపల్లికి చెందిన గోవిందురెడ్డి పట్టణ సమీపంలోని ఓ వ్యక్తికి చెందిన భూమిని కౌలుకు తీసుకొని అందులో టమాట, కాకర పంటలను సాగు చేశాడు. ఆ తోటలో గుర్తు తెలియని వ్యక్తి కరెన్సీ కట్టలున్న ఓ సంచిని దాచి వెళ్లిపోయాడు. ఈ విషయం రైతుకు తెలియదు. రోజువారి కూలీలు పొలం పనులు చేస్తుండగా కర్ణాటక పోలీసులు హుటాహుటిన రావడం వాహనంలోంచి ఓ వ్యక్తిని దింపి డబ్బు ఎక్కడ దాచావో చూపించాలని చెప్పడంతో అతను దాచిన స్పాట్ను చూపెట్టాడు. అక్కడ సురక్షితంగా ఉన్న డబ్బు సంచిని పోలీసులు స్వాధీనం చేసుకొని వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న కూలీలు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇంతకీ టమాట తోటలో డబ్బు సంచిని దాచిందెవరు? ఆసొమ్ము ఎవరిది? తోటలోకి ఆ వ్యక్తిని తీసుకొచ్చి సంచిని తీసుకెళ్లింది కర్ణాటక పోలీసులేనా? కాదా అనే విషయాలు ఇక్కడి పోలీసులకు సైతం తెలియకపోవడం కొసమెరుపు. తోటలోని కూలీల ద్వారా వెలుగుచూసిన ఈ విషయం ఇప్పుడు స్థానికంగా హాట్టాపిక్గా మారింది. పలమనేరు సమీపంలో కరెన్సీ కట్టలు దాచిన టమాట తోట ఇదే... -
యూరియాకు పరుగో.. పరుగు !
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : యూరియా పంపిణీలో టోకెన్లు ఓ చోట ఇస్తూ..మరో చోట యూరి యా బ్యాగులను చూపిస్తున్నారు. ఇలా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అది కూడా ముందు వెళ్లే వారికి టోకెన్లు చేతికిస్తున్నారు. వెనకొచ్చేవారికి రేపు రండి అని తరిమేస్తున్నారు. సిఫార్సులుంటే కుర్చీ వేసి టోకెన్లు ఇస్తున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే.. జేడీ ఆఫీసు నుంచి సిఫార్సు అని బహిరంగంగా వెల్లడిస్తున్నారు. సిఫార్సుల వెల్లువ యూరియా పంపిణీలో సిఫార్సులు వెల్లువెత్తాయి. కొందరు టీడీపీ నేతలు యూరియా కోసం పట్టుబడుతున్నారు. తమ వాళ్లకే ఇవ్వాలని ముందుండి టోకెన్లు ఇప్పిస్తున్నారు. సామాన్య రైతులకు తలుపులేసి...అయినా వారికి తలుపులు తెరుస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ..వ్యవసాయశాఖ సిబ్బంది... ఎవరికి టోకెన్లు ఇవ్వడం లేదని, జేడీ ఆఫీసు నుంచి ఫోన్ చేసినా వాళ్లకు మాత్రం టోకెన్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడున్న రైతులంతా అవాక్కయ్యారు. దీనిపై మండల వ్యవసాయశాఖ అధికారి వేణుగోపాల్ను వివరణ కోరగా...యూరియా పంపిణీలో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఇప్పుడే ఆ సిబ్బందిని కూడా హెచ్చరించారన్నారు. అలాంటివి జరగకుండా అందరికీ యూరియా అందేలా చూస్తామని తెలిపారు. సుదూరంగా పంపిణీ ఏఓ కార్యాలయంలో టోకెన్లు తీసుకున్న వారికి.. చిత్తూరు నగరం గాంధీ రోడ్డులోని జిల్లా సహకార సొసైటీ గోడౌన్లో యూరియా పంపిణీ చేపట్టారు. ఏఓ కార్యాలయం నుంచి గోడౌన్కు రెండు కి.మీ దూరం ఉంది. మండల కార్యాలయంలో టోకెన్లు తీసుకుని రైతులు పరుగు..పరుగున సొసైటీ భవనానికి చేరుకున్నారు. అప్పటికే టోకెన్ల కోసం నీరసించిపోయిన రైతులు..మళ్లీ యూరియా బ్యాగు తీసుకునేందుకు గంటల కొద్ది నిరీక్షించాల్సి వచ్చింది. ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తే ఈ బాధలు తప్పేవని రైతులు ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. టోకెన్లకు పడిగాపులు చిత్తూరు మండలంలో శుక్రవారం యూరియా పంపిణీ చేపట్టారు. ఇందుకు నగరంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకెన్ల పంపిణీ చేశారు. కొంత మందికి టోకెన్లు ఇచ్చి మరి కొంత మందికి ఇవ్వకుండా చేశారు. జిల్లా సహకార సొసైటీ వద్ద (యూరియా పంపిణీ చేస్తున్న ప్రాంతం) వద్ద రైతులు రద్దీగా ఉన్నారని టోకెన్ల పంపిణీ అర్థంతరంగా ఆపేశారు. దీంతో చాలా మంది రైతు లు మధ్యాహ్నం 2గంటల వరకు కార్యాలయం వద్ద పడిగాపులు పడ్డారు. వేచి ఉన్న వారిని రేపు రమ్మని చెప్పి పంపించేశారు. సిఫార్సులున్న వారిని లోపలికి రమ్మని చెప్పి గుట్టుగా టోకెన్లు ఇచ్చి పంపించారు. ఓ వృద్ధ మహిళా రైతు తలుపు వద్దే నిరీక్షించి తీవ్ర నిరాశతో వెనుదిరిగింది. ఆపై సిఫార్సు ఉండే వారికి మాత్రమే యూరియా ఇవ్వడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. ఇక టోకెన్లు ఇక్కడ ఇస్తూ..రెండు కిలో మీటర్ల దూరంలో యూరియా ఇవ్వడం విడ్డూరంగా ఉందని వారు అసహనం వ్యక్తం చేశారు. -
కోర్టు ఆదేశాలు బేఖాతర్!
ఎస్వీ పురంలో హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ గోడౌన్ సాక్షి, టాస్క్ఫోర్స్ : క్వారీల్లో బండలు పేల్చడానికి వాడే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ గోడౌన్ను నగరి మండలంలోని ఎస్వీ పురంలో నిర్మించారు. పెట్రోలియం ఎక్స్ప్లోజివ్స్ అండ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతులతో ఈ గోడౌన్ నిర్మిస్తున్నామని చెప్పడం దుమారం లేపుతోంది. గోడౌన్ నిర్మాణానికి గ్రామ స్తుల అనుమతి కోరుతూ గ్రామసభ నిర్వహించకపోవడం, ప్రజల అనుమతి పొందకుండా, పంచాయతీ రెజల్యూషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై స్థానికంగా పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా యి. గోడౌన్ నిర్మించే ప్రాంతం సంబంధిత రైతుకు తెలియకుండా వారికి చెందిన బావి భాగం భూమిలో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ గోడౌన్ నిర్మాణం చేపట్టారు. దీంతో రైతు లు జి.సుగుణమ్మ, జి.పరమేశ్వర్ నాయు డు హైకోర్టును ఆశ్రయించారు. సర్వే నం.119/4లోని బావిని పూడ్చి నిర్మాణాలు చేపడుతున్నారని విన్నవించుకున్నారు. పెట్రోలియం అండ్ సేఫ్టీ ఎక్స్ప్లోజివ్స్ ఆర్గనైజేషన్ అనుమతులు పొందడానికి చూపిన సర్వే నంబర్లలోను, ప్రస్తుతం నిర్మా ణం చేపడుతున్న సర్వే నంబర్లలోను వ్యత్యాసం ఉందని, అవి తేలేవరకు నిర్మాణాలు ఆపాలని కేసు వేశారు. ఆ వ్యత్యాసాలు తేలేవరకు నిర్మాణాలు ఆపాలని హై కోర్టు ఆదేశించింది. అయితే స్థానిక అధి కార పార్టీ, అధికారుల అండతో హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లు గోడౌన్ను నిర్మించేశారు. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు కూతవేటు దూరంలో ఈ గోడౌన్ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. శరవేగంగా గోడౌన్ ఏర్పాటు రహదారి, రైల్వే పనులు పూర్తయ్యేలోపు నగరి, విజయపురం మండలాల్లోని గ్రావెల్, స్టోన్ క్వారీలను చక చకా పేల్చేసి వేగంగా తమిళనాడుకు తరలించి కాసు లు కొట్టేయాలనే దురుద్దేశమే గోడౌన్ ఏర్పాటుకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్ ఎక్కువా అవసరం కావడంతో అందుబాటులోనే గోడౌన్ కూడా ఏర్పాటుచేసుకున్నారని చెబుతున్నారు. అపాయకర గోడౌన్ నిర్మాణంలో రెవెన్యూ అధికారుల హస్తం ఉందని బహిరంగంగా విమర్శిస్తున్నారు.ఆ బావి నీరే ఆధారం సర్వే నం.119/4లోని భావిని పూడ్చివేసి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ గోడౌన్ నిర్మించేశారు. మా కున్న ఒకటిన్న ఎకరా భూమికి ఆ బావి నీరే ఆధారం. ఈ విషయమై గ్రామంలో గ్రామ సభ కూడా నిర్వహించలేదు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే కొందరి వద్ద సంతకాలు తీసుకొని గోడౌన్ను నిర్మించారు. సర్వే నం.119/12లోని ప్రభుత్వ భూములను కూడా కాంట్రాక్టరు తన భూములుగా చూపారు. ఈ అంశాలపై హైకోర్టులో కేసు వేశాం. నిర్మాణాలు ఆపాలని హైకోర్టు ఆదేశించింది. అయినా లెక్క చేయలేదు. అధికార పార్టీ అండదండలతో దౌర్జన్యంగా గోడౌన్ నిర్మిస్తున్నారు. ఎవరినీ రానీయకుండా చెక్ పాయింట్ నిర్మాణం కూడా పూర్తిచేశారు. నిర్మాణాలు ఆపాలంటూ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులతో పాటు, ఉన్నతాధికారులను సంప్రదించినా ఫలితం లేదు. – జి.సుగుణమ్మ, ఎస్వీపురం, నగరి మండలం ఎలాంటి రెజల్యూషన్ ఇవ్వలేదు జాతీయ రహదారి పనుల నిమిత్తం ఎక్స్ప్లోజివ్స్ మెటరీయల్ గోడౌన్ ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ కాంట్రాక్టర్లు నన్ను సంప్రదించినా గ్రామ భద్రత దృష్ట్యా నిరాకరించాను. ఎక్స్ప్లోజివ్స్ మెటరీయల్ గోడౌన్కు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ అంశంపై గ్రామ సభ కూడా పెట్టలేదు. – ఎస్.కౌసల్య, సర్పంచ్, తడుకుపేట -
● శుభాకాంక్షల వెల్లువ
పెద్దిరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే చింతల భారీ కేక్ కట్ చేస్తున్న ఎంపీ మిథున్రెడ్డి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న నేతలుసదుం: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ గా వైఎస్సార్ సీపీ శ్రేణులు, అధికారులు గురువారం ఎర్రాతివారిపల్లెకు తరలివచ్చారు. వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గెస్ట్ హౌస్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన వంద కేజీల భారీ కేక్ను ఎంపీ కట్ చేశారు. వారిని కలిసిన వారిలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, కొండవీటి నాగభూషణం, జింకా చలపతి, ఎంపీపీలు సురేంద్రనాథ్రెడ్డి, భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్రెడ్డి ఉన్నారు. -
అయ్యప్ప ఆలయానికి పోటెత్తిన భక్తులు
సదుం: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మండలంలోని కోటమలై అయ్యప్పస్వామి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. క్యూల్లో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో అలంకరించారు. భక్తుల రద్దీని ఎన్సీసీ విద్యార్థులు క్రమబద్ధీకరించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఆలయానికి వచ్చే ప్రధాన రహదారిలో వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసు సిబ్బంది తగినంత మేర లేకపోవడంతో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మండల కేంద్రమైన సదుంలోనూ ట్రాఫిక్ అవస్థలు తప్పలేదు. కొత్తపల్లె శ్రీవారిపాద క్షేత్రం, సదుం సాయి మందిరంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో అయ్యప్పస్వామి, ఎర్రాతివారిపల్లె మార్గంలో ట్రాఫిక్ జామ్ -
వైభవంగా నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతన ఆంగ్ల సవత్సరం వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించగా అప్పటికే వేచిఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి పర్యవేక్షించారు. భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు పంపిణీ చేయించారు. కలెక్టర్కు శుభాకాంక్షల వెల్లువ చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని జిల్లా అధికారులు, పలువురు ప్రముఖులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ చైర్మన్ కట్టమంచి బాబి, పలు శాఖల అధికారులు వెంకటరమణ, శ్రీదేవి, రవికుమార్ నాయుడు, చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, అలాగే ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్కుమార్, చిత్తూరు ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రమేష్, సెక్రటరీ కాళేశ్వర్రెడ్డి ఉన్నారు. సమష్టిగా పనిచేద్దాం చిత్తూరు అర్బన్: కొత్త ఏడాది.. సరికొత్త సవాళ్లతో అందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలని చిత్తూరు తుషార్ డూడీ అన్నారు. న్యూ ఇయర్ను పురస్కరించుకుని గురువారం చిత్తూరు నగరంలోని పోలీసు శిక్షణ కేంద్రం, క్యాంపు కార్యాలయం, అనాథ–వృద్ధాశ్రమాల్లో ఎస్పీ నూతన సంతవ్సర వేడుకలు నిర్వహించారు. డూడీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం హోంగార్డు నుంచి ఎస్పీ వరకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు పోలీసు ఉద్యోగం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. శిక్షణ ఐపీఎస్ అధికారి తరుణ్, ఏఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీలు, సీఐలు, పోలీసు సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. మూడు రోజులుగా సందడే.. సందడి తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వరుస పర్వదినాలు రావడంతో మూడు రోజులుగా భక్తులు సందడి నెలకొంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన ఆంగ్లసంవత్స రాది సందర్భంగా ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులు అధికంగా అధికసంఖ్యలో తరలివచ్చారు. కొత్త ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని తుమ్మ లగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలోని కల్యాణ మండపంలో నిర్వహించిన అఖండ భజన భక్తులను ఆకట్టుకుంది. -
గంజాయికి దూరంగా ఉండాలి
చిత్తూరు కలెక్టరేట్ : భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుంచి కాపాడుకుందామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. ఈ మేరకు గంజాయి మహమ్మారి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు యూటీఎఫ్ సంఘ నాయకులు కరపత్రాలను ముద్రించారు. వాటిని గురువారం కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను గంజాయికి దూరం చేయాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెప్పనాయుడు, మణిగండన్, జిల్లా సహాధ్యక్షులు రెహానా బేగం, ఏకాంబరం, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్పీ బాషా పాల్గొన్నారు. -
ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
శ్రీకాళహస్తి: నూతన సంవత్సరం రోజున శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయానికి సుమారు 35 వేల మంది భక్తులు ఆల యాన్ని సందర్శించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో క్యూల్లో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణ భక్తులతోపాటు వృద్ధులు, మహిళలు, చిన్నారుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మౌలిక సదుపాయాల కొరతతో భక్తులు ఆలయ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. డేటా వివరాల ప్రకారం దర్శనాల విభాగంలో విఐపీ దర్శనం టికెట్లు 719 కొనుగోలు చేస్తే సుమారు 2 వేల మందికి పైగా వీఐపీ, శీఘ్ర దర్శనాలు చేసుకున్నారు. దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ భక్తులు క్యూల్లో గంటలకొద్దీ నిల్చుంటే, ప్రత్యేక దర్శనాలు వేగంగా కొనసాగడం ఆలయ ప్రాంగణంలో అసంతృప్తికి దారితీసింది. రాహు–కేతు పూజలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వివిధ టికెట్ల ద్వారా మొత్తం 2,145 రాహు–కేతు పూజలు నిర్వహించగా, ప్రసాద విభాగంలో 29,140 ప్రసాదాలు విక్రయమయ్యాయి. చిన్న లడ్డూలే 15,867 పంపిణీ కావడం భక్తుల రద్దీకి నిదర్శనంగా నిలిచింది. భారీ సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ క్యూ మేనేజ్మెంట్, ముందస్తు ప్రణాళికలో లోపాలు స్పష్టంగా కనిపించాయని భక్తులు ఆరోపిస్తున్నారు. -
ప్రాణం తీసిన అతివేగం!
● బైక్ను ఢీకొన్న కారు ● వ్యక్తి మృతి ● ఏ.కొత్తకోట వద్ద ఘటన చౌడేపల్లె: అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన గురువారం ఏ.కొత్తకోట వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. పుంగనూరు– దాదేపల్లె క్రాసు మధ్యలోని ఏ.కొత్తకోట గ్రామ శివాలయం ముందుగల మలుపు వద్ద అదే గ్రామానికి చెందిన కుమ్మరి వెంకట్రామయ్య(61) బైక్లో దాదేపల్లె వైపునకు బయలుదేరాడు. ఇదే మార్గంలో ఎదురుగా మేకలచిన్నేపల్లెకు చెందిన ఓ కారు అతివేగంగా వస్తూ బైక్ను ఢీకొట్టి ఆమడదూరం లాక్కొని వెళ్లింది. బైక్ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో వెంకట్రామయ్యకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందా డు. కారు డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుని కుటుంబీకులు ఆరోపించారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. గొర్రెల దొంగలు అరెస్ట్ కుప్పంరూరల్: కుప్పం ప్రాంతంలో పలు చోట్ల గొర్రెల దొంగతనానికి పాల్పడిని తమిళనాడుకు చెందిన నలుగురు దొంగలను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. డిసెంబర్ 5వ తేదీ చందం పంచాయతీ, అబ్బకుంటకు చెందిన రామప్ప గొర్రెలను దొంగతనం చేసేందుకు తమిళనాడు రాష్ట్రం కందికుప్పంకు చెందిన అబ్దుల్ మాలిక్, సాదుల్లా, అరవింద్కుమార్, యూరబ్ మహమ్మద్ రాత్రి టవేరా వాహనంలో వచ్చారు. రామప్పకొటంలోని గొర్రెలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అలజడి రావడంతో రామప్ప బయటికి వచ్చి దొంగలు దొంగలు.. అంటూ కేకలు వేశాడు. కేకలు విన్న దొంగలు పారిపోయేందుకు టవేరా వాహనం ఎక్కి కుప్పం వైపు వెళ్లారు. రామప్ప, అతని కుమారుడు కుమార్ దొంగలను వెంబడించారు. తీరా అర్చనా గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద దొంగలకు అడ్డుగా వచ్చి టవేరా వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, వారు రామప్పపై కత్తులతో దాడికి యత్నించారు. ఈ దాడిలో రామప్పకు రక్తగాయాలయ్యాయి. రామప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుప్పం అర్బన్ నేతృత్వంలోని ప్రత్యేక టీం ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రణాళిక రచించింది. తీరా దొంగలు బుధవారం రాత్రి మరో దొంగతనం చేసేందుకు కుప్పం రాగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కారు ఢీకొనడంతో మృతిచెందిన వెంకట్రామయ్య, నుజ్జునుజ్జు అయిన బైక్ -
అందరికీ శుభాలు కలగాలి
పాలసముద్రం: నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి ఆకాంక్షిచారు. గురువారం పాలసముద్రం పార్టీ కార్యకర్తలతో కలసి నూతన సంవత్సరానికి సంబంధించిన కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. కృపాలక్ష్మి మాట్లాడుతూ గత వైఎస్సార్ పానలలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గతంలో చేసిన అభివృద్ధికి, ప్రస్తు త టీడీపీ పాలనకు ఉన్న తేడాని ప్రజలు అంచనా వేసుకుంటున్నారని తెలిపారు. అప్పట్లో రైతు భరోసా కేంద్రాలు, ఇంటంటికీ వైద్య సేవలు, నాడు–నేడుతో రూపురేఖలు మారిన బడులు, విద్యార్థులకు ట్యాబ్ లు, బడుల్లో ఏఎంపీ ప్యానెళ్లు, డిజిటల్ బోర్డులు, స్మార్ట్ టీవీలు, ఆంగ్ల మాధ్యమం, ఆస్పత్రులు ఇలా.. ఎన్నో సమకూరాయన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం వీటన్నిటినీ నిర్వీర్యం చేసిందన్నారు. మాజీ డిప్యూటి సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్నాడన్నారు. పార్టీ నేతలు కృపాలక్ష్మిని సత్కరించారు. జెడ్పీటీసీ సభ్యుడులు అన్బ్లగన్, ఎంపీటీసీ గోవిందరాజ్, మాజీ మండల కన్వినర్ సుందరాజు, వైఎస్ ఎంపీపీ పుష్పప్రకాష్, సర్పంచ్ అనురేఖమదివానన్, ప్రేమ్ కుమార్, గోపాల్, ధనపాల్, చలయ్య, రాజ్కమల్, ఆనట్రాజ్, వేణు పాల్గొన్నారు. -
నెరవేరని లక్ష్యం
చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపా ల మండలం, 13 గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో అదనపు భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైంది. ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. భవన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. చిన్నపాటి పనులు పూర్తి చేస్తే భవనం వినియోగంలోకి వస్తుంది. అయితే బాబు ప్రభుత్వం వీటిని పూర్తిచేయకుండా మొండికేస్తోంది. విద్యార్థులు అసంపూర్తిగా ఉన్న భవనంలోనే విద్యనభ్యసిస్తున్నారు. అదే విధంగా కొత్తఇండ్లు ప్రాథమిక పాఠశాలలో రూ.25 లక్షలతో పనులు చేపట్టారు. చివరి దశలో అసంపూర్తిగా నిలిచిపోయాయి. అలాగే కమ్మతిమ్మాపల్లి, ఏఎల్.పురం ఉన్నత పాఠశాలల్లో మూడు గదుల పనులు ప్రారంభించలేదు. -
బాబు మొండిబడి!
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లి ఉన్నతపాఠశాలలో నాడు–నేడు ఫేజ్ 1, 2లో నాలుగు తరగతి గదుల నిర్మాణానికి రూ.84 లక్షలు అంచనాలు సిద్ధం చేశారు. ఇప్పటిదాకా రూ.38 లక్షలు మంజూరైంది. సెంట్రల్ ప్రోక్యూర్మెంట్ నిధుల నుంచి అందాల్సిన సామగ్రి పెండింగ్లో ఉంది. ఫలితంగా గదుల నిర్మాణం ఆగిపోయింది. కొన్ని గదులు పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి. పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో వెయ్యి మంది దాకా ఉన్నారు. వీరికి ఫేస్–2లో 15 అదనపు తరగతి గదులు మంజూరుకాగా వీటిల్లో 15 గదులకు రూ.1.16 కోట్లు మంజూరైంది. అయితే రూ.80 లక్షల బిల్లులు రాక పనులు ప్లాస్టింగ్, ఫ్లోరింగ్ దశల్లో ఆగాయి. వీకోట ఉర్దూ ఉన్నత పాఠశాలలో నాడు–నేడు పనులు స్తంభించాయి. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పాఠశాలల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులు చదువుపై మక్కువ పెంచేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నాడు–నేడుకు పెద్దపీట వేసింది. కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేసింది. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అట్టహాసంగా చేపట్టిన నాడు–నేడు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. అదనపు తర గతి గదులు మొండిగోడలకే పరిమితమయ్యాయి. వివిధ దశల్లో నాడు–నేడు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పడరా ని పాట్లు పడుతున్నారు. కొన్నిచోట్ల అసంపూర్తిగా ఉన్న పాఠశాలల్లోనే పాఠ్యాంశాలను బోధిస్తూ నెట్టుకొస్తున్నారు. నాడు చదువుల వెలుగు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యావ్యవస్థకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సకల వసతులు సమకూర్చింది. అమ్మఒడి, నాణ్యమైన మె నూ, యూనిఫామ్, బూట్లు, పాఠ్య పుస్తకాలు, ట్యాబ్ లు, ఇంగ్లిష్ మీడియం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. నాడు–నేడు కింద పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేసింది. పాఠశాలల్లో మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 1,533 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.354 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టింది. రెండో విడతలో చిత్తూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,183 పాఠశాలలు, 30 జూనియర్ కళాశాలల్లో రూ.424 కోట్లతో పనులు చేపట్టింది. ఈ పనుల్లో 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఎలక్షన్లు రావడం.. బాబు ప్రభుత్వం కొలువుదీరడంతో నాడు–నేడు పనులు అర్ధంతరంగా ఆగిపోయా యి. చివరి దశకు చేరిన పనులకూ నిధులు విడుదలగాక నీరసిస్తున్నాయి. చతికిలబడినాడు పలమనేరు నియోజకవర్గ సమాచారం నేడుజిల్లాలో అర్ధంతరంగా ఆగిన నాడు–నేడు పనులు చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో చేపట్టిన నాడు–నేడు పనులను గాలికొదిలేసింది. వీటిని పూర్తి చేస్తే అప్పటి సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న మీమాంసలో పడిపోయింది. ఇందులో భాగంగానే అర్ధంతరంగా ఆగిన పనులను పూర్తిచేయకుండా మొండికేస్తోంది. చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకుండా వేధిస్తోంది. మొండిగోడలతో ఉన్న అదనపు తరగతి గదుల్లోనే భావిభారత పౌరులు విద్యనభ్యసించాల్సిన దుస్థితి ఏర్పడింది. -
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, పుంగనూరు డివిజన్ల పరంగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బందితో కలిసి సమస్యలు తెలుసుకొని యాప్లో నమోదు చేస్తారన్నారు. వాటిని దశల వారీగా పరిష్కారిస్తామని చెప్పారు. బోయకొండ కిటకిట చౌడేపల్లె : ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం బోయకొండ గంగమ్మ, రాజనాలబండలోని ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారు, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈవో ఏకాంబరం పర్యవేక్షణలో తీర్థప్రసాదాల పంపిణీ జరిగింది. డీఏఓ బాధ్యతల స్వీకరణ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యవసాయశాఖ అధికారిగా మురళి బాధ్యతలు చేపట్టా రు. ఈయన నెల్లూరు జిల్లా ఆత్మలో డీడీగా పనిచేస్తూ.. బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈయన స్థానంలో ఉన్న మురళీకృష్ణ ఉద్యోగ విరమణ పొందారు. కాగా నూతనంగా బాధ్య తలు చేపట్టిన ఆయన అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఓం శ్రీ వరసిద్ధి వినాయక! కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి గురువారం భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుదరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. వేకువజామున మూలవిరాట్కు అభిషేకం చేశారు. 4 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి 10 గంటల వరకు దర్శన సేవలు కొనసాగాయి. భక్తుల తాకిడి నేపథ్యంలో అంతరాలయ దర్శనానికి బ్రేక్ వేశారు. వీఐపీ, శ్రీఘ్ర, అతిశీఘ్ర, ఉచిత దర్శన లైన్లు పోటెత్తా యి. రాత్రి వరకు అన్ని కూలైన్లు కిటకిటలాడాయి. ఆలయ లోపలి భాగంతో పాటు ఆవరణం కూడా జనసంద్రంగా మారింది. వినాయక నామస్మరణలతో మార్మోగాయి. వచ్చిన భక్తులకు దర్శన సేవలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఆల య అధికారులు, సిబ్బంది, పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ప్రసాద వితరణ, తయారీ, దర్శన సేవలను ఈవో పెంచలకిషోర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. -
అయ్యప్పస్వామి సేవలో పెద్దిరెడ్డి కుటుంబం
సదుం: నూతన సంవత్సరం పురస్కరించుకుని మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గురువారం సందర్శించారు. ఆలయంలోని వినాయక, ఆంజనేయ, నాగమల్లేశ్వర, అయ్యప్ప స్వామి ఆలయాల్లో పూజలు చేశారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అయ్యప్పస్వామిని ప్రా ర్థించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, కొండవీటి నాగభూషణం, భాస్కర్రెడ్డి, అమరనాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పుంగనూరు ఎంపీపీ భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థుల అవస్థలు పడుతున్నా..
నా పేరు సురేంద్రబాబు. మాది తవణంపల్లె మండలంలోని దిగువమోదలపల్లె. నా పిల్లవాడు దిగువ మోదలపల్లె ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. మా పాఠశాల గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకం కింద ఎంపికై ంది. అప్పట్లో అదనపు తరగతి నిర్మాణ పనులు చురుగ్గా చేపట్టారు. విద్యార్థుల సంఖ్య పెరిగింది. మరుగుదొడ్లు బాగుచేశారు. మరుగుదొడ్ల పనులు, పాఠశాలకు తాగునీటి కోసం పైపులైన్ పనులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తిచేయలేదు. విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అదే విధంగా తాగునీరు లేక అంగన్వాడీ కేంద్రం నుంచి బిందెలతో నీటిని తెచ్చి వాడుకుంటున్నారు. – పీ.సురేంద్రబాబు, విద్యార్థి తండ్రి, దిగువమోదలపల్లె, తవణంపల్లె -
ప్రాణం తీసిన అతివేగం!
కారును అతివేగంగా నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన చౌడేపల్లె మండలంలో చోటు చేసుకుంది. కక్షగట్టి..నిధులు ఎగ్గొట్టి నగరి నియోజకవర్గంలోని నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. విజయపురం మండలం, పన్నూరు ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హ యాంలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులకు రూ.80 వేలు అవస రం. అలాగే విజయపురం ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు పూర్తి కావడానికి రూ.3 లక్షలు విడుదల చేయాల్సి ఉంది. నగరి మండలం, ఎం. కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వంలో రూ.1.5 కోట్ల తో తరగతి గదుల నిర్మాణ పనులు చేపట్టారు. పనులు చివరి దశకు చేరాయి. రూ.18 లక్షలు విడుదలైతే పనులు పూర్తవుతాయి. కానీ ఈ నిధులు బాబు ప్రభు త్వం ఇంతవరకు విడుదల చేయలేదు. రెండు గదులకు స్లాబ్ కూడా వేయలేదు. నిండ్ర మండలం, కొత్త ఆరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి. -
న్యూ ఇయర్ కిక్కు రూ.14 కోట్లు
చిత్తూరు అర్బన్ : ప్రభుత్వం మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా చూడటం బహుశా ఏపీలోనే కావొచ్చేమో..! కేవలం మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రజల సంక్షేమ పథకాలను కొనసాగించేయొచ్చనే ధైర్యం పాలకుల్లో ఉంటోంది. న్యూ ఇయర్ను పురస్కరించుకుని జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.కోట్లు దాటేసింది. మామూలు రోజుల్లో జిల్లాలో సగటున రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోంది. కానీ జనవరి 1వ తేదీ వస్తోందంటే మద్యం వ్యాపారులకు.. ప్రభుత్వానికి పండగే. డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో మద్యం విక్రయాల సమయం పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం.. మందుబాబులు తాగుతూ, తూగడానికి రూ.కోట్లు ఖర్చు పెట్టేశారు. డిసెంబరు 30వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో 7,500 బాక్సుల మద్యం, 2,500 బాక్సుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.5.05 కోట్లు. ఇక డిసెంబరు 31వ తేదీన 4,900 మద్యం బాక్సులు, 2400 బీరు బాక్సులు అమ్మడం ద్వారా రూ.3.78 కోట్ల ఆదాయం లభించింది. రెండు రోజుల్లోనే రూ.8.83 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇక మద్యం బార్లలో రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరగడంతో మొత్తంగా రెండు రోజులకు రూ.10.83 కోట్లు మద్యం కాసులు కురిశాయి. ఇక జనవరి 1వ తేదీన అమ్మకాలు రూ.3 కోట్ల దాటొచ్చని నిర్వాహకులు ధీమాగా ఉన్నారు. ఈ లెక్కన న్యూ ఇయర్ కిక్కు దాదాపు రూ.14 కోట్లన్నమాట. -
కొత్త ఏడాదిలోనైనా గతం కంటే మెరుగ్గా ఉండాలని జనం కోటి ఆశలతో కొంగొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. గత కష్టాలు, నష్టాలను నెమరేసుకుంటూ నిట్టూరుస్తున్నారు. గత ఏడాదిలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని పలు రంగాలకు చెందిన ప్
కోటి ఆశలుకాణిపాకం : కాలగర్భంలో 2025 కలిసిపోయింది. గత కాలం పంచిన చేదు అనుభవాలను ప్రజలు దిగమింగుతున్నారు. 2026కు ప్రజలు ఆనందోత్సాహాలతో ప్రజలు స్వాగతం పలికారు. కొత్త ఏడాది అయినా ఆశలను ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలని కోరుకుంటున్నారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మెరుగైన వైద్యం అందాలని, వ్యాధులు ధరి చేరకుండా ఆరోగ్యం బాగుండాలని , వికలాంగుల కష్టాలు తొలగాలని, ఉన్నత చదువుల డోకా లేకుండా చూడాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని, మహిళలకు రక్షణ, ప్రశాంతంగా గడిపేలా... బతుకులు మారాలని ఆశ పడుతున్నారు. గత కష్టాలు మళ్లీ ఈ కొత్త సంవత్సరంలో ఉండకూడదని ,ఆయా వర్గాలు అవకాశం వస్తే అందిపుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. పలువురు తమ ఆశలు..ఆంక్షాలను సాక్షితో పంచుకున్నారు. -
అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలు
చిత్తూరు అర్బన్ : జనవరి ఒకటో తేదీని పురస్కరించుకుని టీడీపీ ప్రభుత్వం మందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రజల సంక్షేమం విషయం పక్కనపెట్టి.. మద్యాన్ని ఆదాయ వనరుగా గుర్తించింది. జిల్లాలోని 114 మద్యం దుకాణాలు, 8 మద్యం బార్లలో న్యూ ఇయర్ పేరిట అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధ, గురువారం మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు, మద్యం బార్లు రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. -
కాణిపాకం ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ది క్షేత్రానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఐఎస్ఓ సర్టిఫికెట్ వరించింది. ఎమ్మెల్యే మురళీమోహన్, దేవస్థానం చైర్మన్ మణి నా యుడు, ఈవో పెంచల కిషోర్, సీఈవో శివయ్య బుధవారం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద సర్టిఫికెట్లను అందజేశారు. ఆలయంలో ఆలయ మేనేజ్మెంట్ సిస్టం, క్యూలైన్లు, పరిశుభ్రత, ప్రసాదం తయారీ, అన్నదానం, పడితరం స్టోర్, నిర్వహణ తదితర వాటిలో నాణ్యతకు మార్క్గా ఈ సర్టిఫికెట్ను అందజేస్తున్నటు సంస్థ వెల్లడించింది. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సభ్యులున్నారు. డేటా సేకరణలో అలసత్వం వద్దు చిత్తూరు కలెక్టరేట్ : సంజీవిని డిజిటల్ నర్స్ సెంటర్ ప్రోగ్రాంకు సంబంధించిన డేటా సేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం క్షేత్రస్థాయి వైద్యశాఖ అధికారులతో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్న వారికి వైద్య సేవలు అందించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలకు అభా ఐడీ క్రియేట్ చేసి, సెల్ నంబర్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఈ కా న్ఫరెన్స్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో రూ. 2 లక్షల కోట్లు అప్పులు
తిరుపతి మంగళం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీనగర్లోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువే సంక్షేమ పథకాలు అందిస్తానని మాయమాటలు చెప్పి అపద్ధపు హామీలు గుప్పించి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన ప్రజాద్రోహి చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ. 2లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఏ సంక్షేమ పథకాలు అందించారని, ఏ ప్రాజెక్టులు నిర్మించారని ప్రశ్నించారు. కేవలం దోచుకోవడం, దాచుకోవడం తప్ప చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోరన్నారు. లండన్కు వెళుతున్నానంటూ సింగపూర్కు వెళ్లి తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడని ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రంతా మాయమాటలు చెప్పి మోసగించడం తప్ప ఒక మంచి పని చేసిన దాఖాలాలే లేవన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క సంక్షేమ పథకానైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉంటేనే మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలనే టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి, జైళ్లకు పంపుతుందని మండిపడ్డారు. – బాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యం – వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి -
అనుమతుల్లేని రూ.17.50 లక్షల మందులు నిషేధం
పుంగనూరు : పట్టణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయిస్తున్న మందుల విలువ రూ.17.50 లక్షలు కలిగిన వాటిపై విక్రయాలు నిలిపివేసినట్లు జిల్లా ప్రత్యేక అధికారులు సాయిరెడ్డి, సునీల్కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని పలు మందులు, విత్తనాలు విక్రయించే దుకాణాదారులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం తీసుకుని మందులు విక్రయించాలి. ఇందుకు విరుద్ధంగా 480 లీటర్లు వివిధ కంపెనీల వద్ద కొనుగోలు చేసినవి అనుమతి లేకుండా నిల్వ చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి విక్రయాలను నిషేధించారు. అనుమతి పొందకుండా మందులు విక్రయిస్తే షాపులు సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు. తనిఖీలో ఏడీ శివకుమార్, ఏవో రాధా పాల్గొన్నారు. -
ఆక్సిజన్ ఆవశ్యకతపై సైకిల్యాత్ర
బైరెడ్డిపల్లె : ఆక్సిజన్ ఆవశ్యకతను వివరిస్తూ సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తూ మొక్కలు పెంచేలా తన వంతు ప్రయత్నంలో భాగంగా ర్యాలీ ఫర్ ఆక్సిజన్ చేపట్టినట్లు తమిళనాడుకు చెందిన ముత్తసెల్వన్ తెలిపారు. 2021వ సంవత్సరం డిసెంబర్ 21న తమిళనాడు రాష్ట్రంలో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టినట్టు ముత్తసెల్వన్ తెలిపారు. గురువారం బైరెడ్డిపల్లెకు చేరుకోవడంతో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. కాలుష్యం వలన ఎంతో మందికి ప్రాణహాని కలుగుతోందని తెలుసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు సుమారుగా 8 లక్షలకు పైగా మొక్కలను నాటించినట్లు ఆయన పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ న్యాయ విభాగాన్ని పటిష్టం చేస్తాం
– మాజీ మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు : వైఎస్సార్సీపీ న్యాయ విభాగాన్ని అన్ని విధాల పటిష్టం చేస్తున్నట్లు మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ న్యాయ విభాగం సభ్యులు ఎమ్మెల్యే, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డిలను తిరుపతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. సీనియర్ న్యాయవాదులు వై.భాస్కర్రెడ్డి, గల్లాశివశంకర్నాయుడు, సి.మల్లికార్జునరెడ్డి , హరినాథరెడ్డి ,ప్రకాష్, అంజిబాబు, సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎమ్మెల్యే, ఎంపీని కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులకు నియామక పత్రాలను అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై న్యాయవాదులు న్యాయ పోరాటం చేయాలని , వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆనందకుమార్, రమణారెడ్డి, ప్రశాంతి, సమివుల్లా, విజయభాస్కర్, ప్రభాకర్రెడ్డి, జహుర్బాషా, ఇర్ఫాన్ పాల్గొన్నారు. -
పల్లె పాలనపై ఆంక్షలు
చిత్తూరు కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునేందుకు వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టైడ్ గ్రాంట్ను తాగునీరు, పారిశుద్ధ్యానికి, బేసిక్ (అన్టైడ్) గ్రాంట్ను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాథమిక అవసరాలకు (విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వేతనాలు) వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అయితే నిబంధనలను కాదని, తాము సూచించిన వాటికే ఈ నిధులను ఖర్చు పెట్టాలని ఈనెల 24న రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. వీటిపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదవీకాలం పూర్తవుతున్నా.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయనే నమ్మకంతో పలు గ్రామాల్లో సర్పంచులు, అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేయించారు. అయితే ప్రభుత్వం తాజాగా చేసిన ఆదేశాల మేరకు ఆయా పనులకు బిల్లుల విడుదలయ్యే అవకాశాలు లేనట్లే, మరో మూడు నెలల్లో సర్పంచుల పదవీకాలం పూర్తవుతున్న సమయంలో ఉమ్మడి జిల్లాకు కేంద్రం విడుదల చేసిన రూ.60.76 కోట్లు నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విఽధించింది. ఆదేశాలు ఇలా.. గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన అన్ని రకాల చెత్త కుప్పలు, పాత చెత్త సహా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలకు, 2025 డిసెంబర్ వరకు గ్రీన్ అంబాసిడర్లకు అన్ని రకాల బకాయిలను, విద్యుత్ బిల్లులు, నీటి పథకాల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. మండల పరిషత్తులో లింకు రోడ్లు, చేతి పంపుల నిర్వహణ, స్వచ్ఛ రథానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంది. జిల్లా పరిషత్లో సీపీడబ్ల్యూఎస్ పథకాలకు సంబంధించిన సీసీ చార్జీల చెల్లింపు, సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ అనుగుణంగా లింకు రోడ్ల మరమ్మతులు నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్సీపీ చెందిన ప్రజా ప్రతినిధులే ఉన్నారు. -
కక్ష సాధింపు చర్య
ఉమ్మడి జిల్లాలో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు సింహభాగం వైఎస్సార్సీపీ వారే. స్థానిక సంస్థల పై కక్ష సాధింపు చర్యకు దిగారు. సర్పంచుల పదవీకాలం దగ్గర పడే సమయంలో కుట్ర పన్నారు. ఆంక్షలు సవరించే విషయం పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. – శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ గౌరవం లేదు గ్రామాల్లో సర్పంచులంటే గౌరవం లేకుండా పోయింది. గ్రామ సభలో చేసిన తీర్మానాలను అమలు చేయడం లేదు. పలు నెలలుగా గౌరవవేతనం ఇవ్వడం లేదు. దీని పై అధికారులను ప్రశ్నిస్తే ఆర్థిక సంఘం నిధులు వచ్చాక ఇస్తామన్నారు. ఇప్పుడు అవి కూడా లేకుండా చేశారు. – రజనీకాంత్, సర్పంచ్, వసంతాపురం గుడిపాల మండలం అభివృద్ధి బిల్లులు ఆపేస్తారా? పంచాయతీ అభివృద్ధి కోసం పనులు చేపడితే నిధులు ఇవ్వరాదని హుకుం జారీ చేయడం దారుణంగా ఉంది. పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు మంజూరులో జాప్యం చేయడం కూటమి ప్రభుత్వానికి సమంజసం కాదు. – ధనుంజయవర్మ, సర్పంచ్, కార్వేటినగరం -
భూములు లాక్కొని పొట్టకొట్టద్దు
శాంతిపురం : ‘ పండించిన పంటకు గిట్టుబాటు ఉండదు.. అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం ఇచ్చిన డీకేటీ భూములతో పాటు పట్టా భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతు పొట్ట కొట్టద్దు.. రైతులకు జీవించే హక్కు ఉందా ? లేదా సార్?’ అంటూ జిల్లా కలెక్టర్ ముందు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయ రైతులతో కలెక్టర్ సుమిత్కుమార్ దండికుప్పం వద్ద బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. మూడవ విడత భూ సేకరణ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ రైతులు హై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు తమ అభ్యంతరాలను, ఆవేదనను జిల్లా కలెక్టరుకు నివేదించారు. బాధిత రైతు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. రైతలు కూలీలుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదారు గ్రామాల్లోనే 2 వేల ఎకరాలను తీసుకుంటే ఈ ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, పశువులు ఉనికి కోల్పోతాయన్నారు. విమానాశ్రయ కోర్ ఏరియాకు 800 ఎకరాలు అవసరమైతే ఇప్పటికే 1,420 ఎకరాలను ఇప్పటికే సేకరించిన ప్రభుత్వం మళ్లీ 450 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. గంటన్నరలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవచ్చని, చైన్నె, తిరుపతి ఎయిర్పోర్టులు అందుబాటులో ఉండగా మళ్లీ 2 వేల ఎకరాలతో విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. రామకుప్పం మండలం గాంధీనగరానికి చెందిన రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ.. విమానాశ్రయంతో పేద కుటుంబాలు మళ్లీ రోడ్డున పడతాయని చెప్పారు. ఇతర కులాల వారి భూములను వదిలిపెట్టి కేవలం ఎస్సీలనే టార్గెట్ చేశారన్నారు. గత ఎన్నికల్లో గ్రామం మొత్తం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు తమ ఊరిపై దండయాత్ర చేస్తున్నారని వాపోయారు. దండికుప్పం గ్రామానికి చెందిన లక్ష్మి మాట్లాడుతూ.. ఉన్న పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ మానసిక వికలాంగుడైన భర్తను పోషిస్తూ, కొడుకును చదివిస్తున్నానని చెప్పారు. భూమిని కోల్పోయి తాము బతకడంలో అర్థం లేదన్నారు. ఉన్న వాళ్లను చంపేసి భవిష్యత్తులో ఎవరినో అభివృద్ధి చేస్తామనటం న్యాయం కాదన్నారు. వెంకటేష్పురానికి చెందిన పెద్దన్న, సల్లాపురెమ్మ మాట్లాడుతూ, ఇప్పటికే హంద్రినీవా కాలువ, గ్యాస్ పైప్లైన్ కోసం భూములు ఇచ్చిన తమకు నామమాత్రంగా మిగిలిన భూములను కూడా లాక్కోవద్దని కోరారు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకే భూ సేకరణ ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ ఎంపిక చేసిన భూములనే విమానాశ్రయం కోసం తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి వివక్ష లేదని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ చెప్పారు. భూములు ఎవరి స్వాధీనంలో ఉంటే వారికే పరిహారం ఇస్తామన్నారు. భూములు కోల్పోయే కుటుంబాల వివరాలను సేకరించి విమానాశ్రయ కంపెనీకి ఇచ్చి అవకాశం ఉన్న అందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల సమావేశానికి ముందు దండికుప్పం గ్రామంలో పింఛన్ల పంపిణీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కడ పీడీ వికాస్ మర్మత్, ఆర్డీవో శ్రీనివాసరాజు, డీఎస్పీ పార్థసారధి, తహసీల్దార్ ప్రకాష్కుమార్, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. – ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ఆందోళన – ఎయిర్పోర్టు బాధితుల ఆక్రందన -
చదవడంలేదని మందలింపు.. పారిపోయిన విద్యార్థినులు
చిత్తూరు అర్బన్ : సరిగా చదవడంలేదని ఇంట్లో తల్లిదండ్రులు.. కళాశాలలో అధ్యాపకులు మందలించడంతో ముగ్గురు విద్యార్థినులు ఇంటి నుంచి పారిపోయారు. వన్టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. నగరంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో చిత్తూరుకు చెందిన 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు, 16 ఏళ్ల వయస్సున్న మరో బాలిక స్నేహితులు. ఇటీవల ఈ ముగ్గురూ సరిగా చదవడంలేదని గుర్తించిన అధ్యాపకులు .. ఇలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడుతారని చెప్పారు. విషయం పిల్లల తల్లిదండ్రులకు సైతం చెప్పడంతో వాళ్లు కూడా మందలించారు. దీంతో ముగ్గురూ కలిసి మంగళవారం కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి, మధ్యాహ్నం నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. పిల్లల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తీరా ముగ్గురు బాలికలు తిరుమలలో ఉన్నట్లు గుర్తించి, అక్కడి నుంచి తీసుకొచ్చి బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కీళపట్టుకు రాకపోకలు బంద్ నగరి : జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కీళపట్టు గ్రామం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నందున కీళపట్టు గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి ఎవరూ రాకుండా రోడ్డుపై రాళ్లు మట్టి పోసి అడ్డుకట్ట వేశారు. సర్వీసు రోడ్డు వేసే వరకు కీళపట్టు ప్రజలు నగరి మీదుగా వచ్చి బైపాస్లో వెళ్లాల్సి ఉంది. వైకుంఠ ద్వారంలో పలువురు ప్రముఖులు తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారంలో పలువురు ప్రముఖులు ప్రవేశించారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి కుటుంబ సమేతంగా తన అనుచరులతో కలసి స్వామివారిని దర్శించారు. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్రెడ్డి వారికి సాదర స్వాగతం పలికి దర్శనం చేయించారు. అలాగే పలువురు రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు సైతం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. -
జనంబాటకు విన్నపాలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో పలు సమస్యలు నమోదు చేశామని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ బుధవా రం తెలిపారు. చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్స్, పుంగనూరు డివిజన్ల నందు 11 కేవీ లైన్ పరంగా 304 రాగా అందులో 29 పరిష్కారం అయ్యాయన్నారు. ట్రా న్స్ఫార్మర్ల పరంగా 24 సమస్యలు వచ్చాయని, ఎల్టీ లైన్ పరంగా 272 రాగా 15 పరిష్కారం చూపామని, సర్వీస్ లైన్ పరంగా 29 రాగా 5 పరిష్కరించామన్నారు. దరఖాస్తుల ఆహ్వానం చిత్తూరు కార్పొరేషన్ : గ్రామాల్లో పొడి చెత్త సేకరణ మరింత పటిష్టంగా చేసేందుకు స్వచ్ఛరథం కార్యక్రమం చేపడుతున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీపీవో సుధాకర్రావ్ బుధవారం తెలిపారు. మొదటి దశలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు గ్రామీణ, బంగారుపాళ్యం, ఐరాల మండలాలు, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, మదనపల్లి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. స్వచ్ఛ రథం ఆపరేటర్లుగా పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సంబంధిత ఎంపీడీవోలకు ఈనెల 6లోగా అందజేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక వెదురుకుప్పం : రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు మండలంలోని చవటగుంట జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం.ఆజాద్ ఎంపికై నట్లు ఎంఈఓ మహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం తిరుపతిలో జోనల్ లెవల్ పోటీలలో దివ్యాంగ విద్యార్థి ఆజాద్ పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు చెప్పారు. త్వరలో విజయవాడలో జరిగే ఎవరెస్ట్ బేస్ క్యాంపులో పాల్గొననున్నట్లు చెప్పారు. కాగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా తర్ఫీదు చేసిన భవిత ఉపాధ్యాయురాలు శ్యామల, గుణను అభినందించారు. గ్రామ సర్పంచ్పై దాడి గంగాధర నెల్లూరు : మండలంలోని చెర్లోపల్లిలో వ్యభిచార గృహ నిర్వాహకులు, కొంత మంది వ్యక్తులు కలిసి పెద్ద కాలువ సర్పంచ్పై దాడి చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల మేరకు మండలంలోని చర్లోపల్లిలో ఓ మహిళ కొద్ది సంవత్సరాలుగా వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా పలుమార్లు పోలీసులకు సర్పంచ్ ఏకాంబరం ఫిర్యాదు చేశాడని మనసులో పెట్టుకొని బుధవారం తానా జంక్షన్ వద్ద ఓ చిల్లర దుకాణంలో సర్పంచ్ ఏకాంభరం ఉండగా వ్యభిచార గృహం నిర్వాహకురాలు, ఆమె కుమారులు, మరి కొంతమంది కలిసి దాడికి యత్నించగా వెంటనే చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని జీడి నెల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై పరస్పరం ఫిర్యాదులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి సీఐ నిత్యబాబు తెలిపారు. పింఛన్ తీసుకో.. పన్ను చెల్లించేయ్ పాలసముద్రం : పింఛన్ల పంపిణీ ఇంటి పన్నుల వసూలుగా మారిందని పింఛన్ లబ్ధిదారులు వాపోయారు. మండలంలో వెంగళరాజుకుప్పం, క్రిష్ణజమ్మపురం, పాలసముద్రం గ్రామ సచివాలయ పరిధిలో పింఛన్ పంపిణీ చేస్తున్న సిబ్బంది ఇంటి పన్నుల రశీదులు తీసుకొచ్చి.. ఇటు పింఛన్ సొమ్ము ఇచ్చి.. అటు ఇంటి పన్నుల నగదు తీసుకుంటున్నారు. నిబందన ప్రకారం ఇంటి పన్ను చెల్లించాలంటే 10 రోజులకు ముందు డిమాండ్ నోటీసు ఇవ్వాలి. ఆతరువాత ఇంటి పన్నులు కట్టించుకోవాలి. పూరి గుడిసెలకు కూడా రూ.600 పైగా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని లబ్ధి దారులు ఆవేదన చెందుతున్నారు. -
దుప్పి మాంసం..వ్యక్తి అరెస్టు
కార్వేటినగరం : దుప్పి మాంసం ఉందని వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన కార్వేటినగరం అటవీశాఖ కార్యాలయం పరిధిలోని దిగువ గెరిగదొన సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కార్వేటినగరం మండల బిల్లుదొన గ్రామానికి చెందిన దొరస్వామి కుమారుడు శ్రీను, వెదురుకుప్పం మండలం దిగువ గెరిగదొన గ్రామానికి చెందిన రమేష్, హేమసాయి ముగ్గురు కలిసి ఉదయం 11 గంటలకు తమ గ్రామం నుంచి పొలాల వైపు వెళుతున్న సమయంలో పాలదొన బండపై కుక్కలు దుప్పిని వేటాడి మాంసాన్ని తింటున్న సమయంలో అక్కడికి చేరుకుని కుక్కలను ఈ ప్రాంతం నుంచి తరిమి మిగిలిన కేజీ దుప్పి మాంసాన్ని తీసుకుని ముగ్గురు కలసి గ్రామానికి వెళుతున్న సమయంలో అటుగా వెళుతున్న అటవీశాఖ సిబ్బందిని చూసి దుప్పి మాంసాన్ని ముళ్లపొదల్లో వేసి పారిపోవడంతో అనుమానం వచ్చి వారిని వెంటాడి ఒక్కరిని పటుకున్నారు. మరో ఇద్దరు పరారీ కావడంతో అతడిని విచారించగా వెల్లడించిన పేర్లతో పాటు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీంతో అటవీశాఖ అదుపులో ఉన్న శ్రీనును అరెస్టు చేశారు. అలాగే పరారీలో ఉన్న రమేష్, హేమసాయి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వన్య ప్రాణులను వేటాడితే అరెస్టు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మట్టి..కొల్లగొట్టి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి నేతలు మైనింగ్ మత్తులో జోగుతున్నారు. ఇసుక, మట్టిని ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు. చిత్తూరు మండలం, బండపల్లి రెవెన్యూలోని 194 వెంకటాపురంలో కూటమికి సంబంధించిన వ్యక్తులు మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా కొండను తవ్వేస్తున్నారు. జేసీబీలతో కరిగించేస్తున్నారు. ట్రాక్టర్లతో పట్టణానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ మట్టి రూ.1000కి విక్రయిస్తున్నారు. ఇలా వందల ట్రాక్టర్లు తిప్పేస్తున్నారు. జేసీబీకి లోడ్కు రూ.150 చెల్లించి మిగిలిన ఆదాయాన్ని కూటమి నేతలు జేబులో వేసుకుంటున్నారు. మామిడి తోట అడ్డుగా ఉండడంతో ఈ దోపిడీ ఎవరి కంటా పడడం లేదు. 20 రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా మట్టి దోపిడీ సాగుతోంది. అడవిలో జింకల సంచారం ఉందని, మట్టి తవ్వకాలతో మూగజీవులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి.. మట్టి దోపిడీని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. సేదతీరుతున్న మూగజీవాలకు ఆటంకం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. -
పేదల బతుకులు చితికిపోతున్నాయి బాబూ!
–మాజీ ఉప ముఖ్యమంత్రి ధ్వజం కార్వేటినగరం: బాబు ప్రభుత్వంలో పేదల బతుకులు చితికిపోతున్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేవారు. మంగళవారం పుత్తూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా సూపర్సిక్స్ హామీలను అమలు చేయకపోగా కేవలం ధనంవతులు, ఉన్నవారికే పెద్దపీట వేయడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానం బడుగు, బలహీన వర్గాల పాలిట శాపంగా మారిందన్నారు. 2025లో చంద్రబాబు ప్రభుత్వం అనేక మార్పులకు శ్రీకారం చుట్టి తద్వారా అన్ని వర్గాల వారికి తీరని అన్యాయం, ద్రోహం చేసినట్లు చెప్పారు. వ్యవస్థలను ఎమ్మెల్యేల గుప్పెట్లోకి తీసుకుని పేదలను ముంచేస్తున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీల స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడిచేలా సీఎం చంద్రబాబు డైరెక్షన్ ఇవ్వడం విడ్డూరమన్నారు. సామాన్య ప్రజలు ఎక్కడికెళ్లినా న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన బాధితులను ఏ పార్టీకి చెందిన వారని అధికారులు అడగడం శోచనీయమన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేసి పేదల కడుపుకొట్టేందుకు పూనుకున్నట్లు విమర్శించారు. అన్నదాతల గురించి పట్టించకోకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇసుక, గ్రావెల్ను విచ్చిలవిడిగా సరిహద్దులు దాటిస్తూ దోచుకుంటున్నా అధికారులు ఏం చేయలేకున్నారని ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ నాయకు లు చెప్పినట్లు అడుతున్నాయని ఆక్షేపించారు. -
మా భూమిపై చల్లా బాబు పెత్తనం ఏంటి?
పలమనేరు: ‘మా భూమిపై చల్లాబాబు, అతని మనషుల పెత్తనం ఏంటి.. తనకు ఆరోగ్యం బాగోలేక కొంత ఆస్తిని అమ్ముకున్నా. దీనిపై మా కుటుంబంలో కోర్టు కేసులున్నాయు. వాటిని మేము తేల్చుకుంటాం. అయినా మా భూములపై పుంగనూరు టీడీపీ ఇన్చార్జి చల్లాబాబు, ఆయన మనుషుల ప్రమేయం ఏంటి..? అని ఓ బాధితురాలు మంగళవారం పలమనేరు ఆర్డీవో భవానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలు.. చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం, గాజులపల్లికి చెందిన లెట్ శంకరరాజు భార్య పరిమళకు పుంగనూరు పరిధిలో భర్త మరణాంతరం హక్కు కలిగిన కొన్ని భూములున్నాయి. బాధితురాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తన చికిత్స కోసం కొంత భూమిని ఇతరులకు విక్రయించుకొంది. దీనిపై ఆమె భర్త మొదటి భార్య కుమారుడైన దినకర్ మదనపల్లి సబ్కోర్టులో కేసు వేశాడు. ఇలా ఉండగా చల్లా బాబుకు చెందిన మనుషులు వెంకటముని, శ్రీకాంత్ అక్కడి తహసీల్దార్ ద్వారా పలమనేరు ఆర్డీవోకు చెప్పించి తమ భూములు రిజిస్ట్రర్ కాకుండా బ్లాక్లిస్ట్లో పెట్టించారని తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తనకు న్యాయం చేయాలని ఆర్డీవోను కోరింది. -
కాణిపాకంలో పలువురు ప్రముఖులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఆలయ పునఃనిర్మాణ దాతలు, వెండి వాకిలి, బంగారు వాకిలి దాత లు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ ఉన్నారు. వీరికి ఈవో పెంచల కిషోర్, ఆలయ బృందం ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. పండితుల ఆశీర్వచనాలు, ప్రసాదం అందజేశారు. రాష్ట్ర స్థాయి బేస్ క్యాంప్నకు ఎంపిక రొంపిచెర్ల: రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి విక్రాంత్ ఎంపికై నట్లు ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం తిరుపతిలో జరిగిన జోనల్ లెవల్ పోటీలలో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్టు పేర్కొన్నారు. రొంపిచెర్ల బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడని తెలిపారు. విక్రాంత్ ఎంపికకు కృషి చేసిన భవిత పాఠశాల ఉపాధ్యాయులు అములు, మానసను అభినందించారు. త్వరలో విజయవాడలో జరిగే ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో పాల్గొంటారని ఎంఈవో తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత గుడిపాల: తమిళనాడు నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. తమిళనాడు నుంచి ఆంధ్రకు అక్రమంగా బియ్యం సరఫరా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డులోని రెట్టగుంట ఫ్లైఓవర్ వద్ద వేచి ఉన్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో చిత్తూరు రూరల్ మండలం, మాపాక్షి గ్రామానికి చెందిన అరుణ్(45) అనే వ్యక్తి ద్విచక్ర వాహ నంలో బియ్యాన్ని తీసుకువెళుతుండగా పట్టుకున్నామన్నారు. అతన్ని విచారించగా తక్కువ రేటుకు కొనుగోలు చేసి అధిక రేటుకు అమ్ముకుంటున్నట్లు తెలిపాడన్నారు. అతని వద్ద ఉన్న 250 కిలోల బియ్యాన్ని సీజ్ చేసి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పల్లెలు శుభ్రంగా ఉండాలిచిత్తూరు కార్పొరేషన్: పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలన్నారు. సంక్రాంతి పండుగకు గ్రామాలు శుభ్రంగా ఉంచాలన్నారు. వచ్చే నెల 15లోపు స్వచ్ఛరథం సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకోసం పాత రేషన్ సరఫరా వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ పాల్గొన్నారు. -
కేంద్ర నిధులపై ఆంక్షలేంటి?
జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ధ్వజం చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ఆర్థిక సంఘ నిధుల పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల పై నిబంధనలు పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఏడాదిన్నరగా అక్రమాలు జరుగుతుంటే ఎందుకు విచారణ చెయ్యలేదని ప్రశ్నించారు. స్పరంచుల పదవీ కాలం ముగయనుండడంతో ఇలాంటి చర్యలకు కుట్రపన్నారని ధ్వజమెత్తారు. గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వరాదని, ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు మంజూరు చేయరాదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం జీతాలు లేకుండా పనిచేయడం లేదు కదా అని ప్రశ్నించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. ఎర్రవారిపాళెంలో రూ.20 లక్షలతో ఆస్పత్రిలో పోస్ట్మార్టం భవనం నిర్మించడానికి అనుమతులిచ్చినా ఎందుకు పనులు చేయలేదని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు సమావేశానికి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వితంతు పింఛన్లు 319, వికలాంగ పింఛన్లు 222 కొత్తగా మంజూరైనట్టు వెల్లడించారు. సీఈఓ రవికుమార్నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ భారతి పాల్గొన్నారు. మొక్కుబడిగా.. స్టాండింగ్ కమిటీ సమావేశమంటే పలు శాఖల అధికారులకు లెక్క లేకుండా పోయింది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి హెచ్ఓడీలు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. చిత్తూరు జిల్లా నుంచి పలువురు అధికారులు హాజరుకాలేదు. దీంతో సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.43 గంటలకు ముగించేశారు. కమిటీల పరంగా జెడ్పీటీసీ సభ్యులు మారాల్సి ఉండగా మారలేదు. హాజరుపట్టికలో మాత్రం సంతకాలు పెట్టేశారు. 4వ కమిటీ సమావేశానికి 1,7 కమిటీలో ఉన్న సభ్యులే ఉన్నారు. సమస్యలపై నిలదీత పలు అంశాల పై జెడ్పీటీసీ సభ్యులు అధికారులను నిలదీశారు. కుప్పంలో కొలమాసపల్లె–నెలిపట్ల రోడ్డు టెండర్ అయినా ఇంతవరకు ఎందుకు పనులు ప్రారంభిచలేదని ప్రశ్నించారు. అలాగే పుంగనూరు, సదుం, పీలేరు, భాకరాపేట దారులు గుంతలుపడినా పట్టించుకోలేదన్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో హంద్రీ–నీవా ప్రాజెక్టు నుంచి ఉపకాలువలు నిర్మించి తద్వారా చెరువులను నింపాలన్నారు. గతంలో ఇంటి స్థలం మంజూరైన వారికి ప్రస్తుతం రుణ సాయం చేస్తారనే అంశాన్ని లేవదీశారు. అలాగే పునాది పనులు పూర్తయిన గృహాలకు సాయం అందిస్తారా..? అని ప్రశ్నించారు. విద్యుత్ అధికారులు తాగునీటి సర్వీసులకు కూడా కరెంటు పోల్స్ ఇవ్వకపోవడమేంటని మండిపడ్డారు. ఆర్డీఎస్ఎస్ పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. పలు ప్రాంతాల్లో కేబుల్స్ పాడైనా మార్చడం లేదన్నారు. పాలసముద్రం మండలంలో అంగన్వాడీ భవనం పూర్తయినా ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. కార్యక్రమంలో పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
తిరుపతి జిల్లాలో చేర్చే వరకు పోరాటం ఆగదు
కార్వేటినగరం: తమ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపేంత వరకు పోరాటం ఆగదని అఖిల పక్ష నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని గాండ్లమిట్ట కూడలిలో అఖిలపక్ష నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు కార్వేటినగరంలో బాదుడేబాదుడు కార్యక్రమంలో భాగంగా కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా ఇదేమాదిరిగా హామీలిచ్చారన్నారు. అయితే రాష్ట్రంలో నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతున్నప్పటికీ ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలపకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని నెరవేర్చేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రసాద్రెడ్డి, సుబ్రమణ్యంరాజు, గౌతంరాజు, శివలింగం, పయణి పాల్గొన్నారు. ఉపాధి పనులపై విజి‘లెన్స్’! పులిచెర్ల(కల్లూరు): మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలు జరిగాయని గతంలో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కేంద్ర విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు మూడు నెలల క్రితం మండలానికి విజిలెన్స్ అధికారులు విచ్చేశారు. ఆ సమయంలో వర్షాలు పడుతుండడంతో పులిచెర్ల మండలంలోని పాళెంపంచాయతీలో రెండు ఫారంపాండ్లను తనిఖీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అదే విధంగా సామాజిక తనిఖీ బృందం కూడా తనిఖీలు చేపట్టింది. మంగళవారం 106 రామిరెడ్డిగారిపల్లె, పులిచెర్లలో చేసిన పనులను కొలతలు తీశారు. నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
పుంగనూరు: అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారున్ని ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పట్టణ సమీపంలోని అరబ్బీ కాలేజీ వద్ద చోటుచేసుకుంది. మండలంలోని గుడిసె బండకు చెందిన వెంకటరమణ కుమారుడు సోమశేఖర్(26) పట్టణంలోని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని రాత్రి ఇంటికి వెళుతుండగా అరబ్బీ కాలేజీ వద్దకు రాగానే ఎదురుగా పుంగనూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సోమశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి
ఐరాల: సమాజంలోని ప్రతి హిందువు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని విశిష్ట అతిథి భువనేశ్వరి పీఠం, గన్నవరం శ్రీ కమలానంద భారతిస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని వారపు సంతలో ఆర్ఎస్ఎస్ వంద ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మండల హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుతగా స్వామిజీకి మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక బజారువీధి నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనంలో ఊరేగింపు నిర్వహించారు. స్వామిజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా స్వామిజీ హాజరై మాట్లాడారు. ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూసిన నాడే సమ సమాజ స్థాపన సాధ్యమన్నారు. కులాన్ని ఇంటి వరకే పరిమితం చేయాలని, గడప దాటితే మనమంతా హిందువులమనే భావన అందరిలో ఉండాలని సూచించారు. సమ్మేళనంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. అనంతరం నిర్వహకులు అన్నదానం చేశారు. అతిథి విశ్రాంత ప్రధోనపాధ్యాయుడు సీతాపతినాయుడు, విభాగ్ సహకార్యవాహ ప్రధాన వక్త రెడ్డెప్ప పాల్గొన్నారు. -
భూలోక వైకుంఠం!
తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు.బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025తిరువీధుల మెరసీ దేవదేవుడు..తిరువీధుల మెరసీ దేవదేవుడు.. గరిమల మించిన సింగారములతోడను.. అని అన్నమయ్య ఆ శ్రీనివాసుడిని కీర్తించాడు. ఆ కీర్తనలు నిజం చేస్తూ మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమల.. చూసిన కనులదే భాగ్యమన్న రీతిలో మెరిసింది. దీనికితోడు అశేష భక్తజన సందోహం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తవత్సలుడిని దర్శించు కుంది. ఈ పర్వదినం రోజున వేంకటాచలపతి స్వర్ణరథంపై ఊరేగుతుండగా భక్తకోటి స్వామివారిని దర్శించుకుని, తన్మయం చెందింది. భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా తిరుమలలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకుంది. – తిరుమల శ్రీవారి ఆలయంలో ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణస్వర్ణరథోత్సవంలో పాల్గొన్న భక్తులువిద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం లోపలి భాగం -
నేడే చివరి రోజు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సబ్సిడీ అదనపులోడ్ క్రమబద్ధీకరణకు బుధవారం చివరి రోజు అని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 6వేల మంది వినియోగదారులు 9వేల కిలోవాట్ల లోడ్ను క్రమబద్ధీకరించుకున్నరన్నారు. తద్వారా సంస్థకు రూ.1.1 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. స్వచ్ఛందంగా గృహ వినియోగదారులు లోడ్ను క్రమబద్ధీకరించుకుంటే సబ్సిడీ 50 శాతం వర్తిస్తుందన్నారు. గిరిజనుల ఆరోగ్య భద్రతే లక్ష్యం పూతలపట్టు(యాదమరి): గిరిజనుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని గువ్వల కాలనీలో గిరిజన వికాసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను దగ్గర చెయ్యడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం ఆయన పలు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కాగా ఈ వైద్య శిబిరంలో కాలనీ ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, తహసీల్దార్ రమేష్బాబు పాల్గొన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించొద్దు చిత్తూరు అర్బన్: కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను పెట్టుకుని ముందుకు వెళ్లండి.. అని ఎస్పీ తుషార్డూడీ సూచించారు. శాంతిభద్రతల పర్యవేక్షణ, ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి పోలీసుశాఖ పనిచేస్తుందన్నారు. మహిళలపై నేరాల నియంత్రణకే ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా తనను కలిసి చెప్పొచ్చని సూచించారు. న్యూ ఇయర్ పేరిట బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి వాహనాలు నడపడం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల పాటు పోలీసులు అన్నిచోట్ల తనిఖీలు నిర్వహిస్తారన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించకుండా న్యూ ఇయర్ చేసుకోవాలని చెప్పారు. పకడ్బందీగా యూరియా పంపిణీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో రబీ సీజన్కు గాను పంటలకు అవసరమైన 20,183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 5,747 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటికే 6,753 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు యూరియా కొరత రాలేదన్నారు. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే లైసెన్స్లను రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మరో బాధితుడు చిత్తూరు కార్పొరేషన్: తుక్కు మాఫియా బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీఎస్టీ నోటీసులు వస్తుండడంతో అమయాకులు బయటపడుతున్నారు. నగరంలో తోపుడు బండిపై వీధి వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తికి రూ.12.3 కోట్లు ఫెనాల్టీ నోటీసులు జారీ అయిందన్న సమాచారం మంగళవారం సంచలనం రేకెత్తించింది. ఆ వ్యక్తి కోసం సీజీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు గాలిస్తున్నారని, అయితే నోటీసులు అందుకున్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సంబంధం లేని వ్యక్తులకు రూ.లక్షలు, కోట్లు చెల్లించాలని నోటీసులు రావడంతో వారు షాక్అవుతున్నారు. ఇప్పటికే రూ.400 కోట్లు అక్రమంగా రిటర్న్లో తీసుకునున్నట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించుకున్నారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ట్రెజరీశాఖ డీడీ రామచంద్ర సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్దారులు వార్షిక జీవ న ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. 01–01–2026 నుంచి 28–02–2026 లోపు పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలన్నారు. గడువు తేదీలోపు సమర్పించకపోతే ఏప్రిల్ 1న ఇచ్చే మార్చినెల పెన్షన్ నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని సబ్ ట్రెజరీ ఆఫీసుల్లోనూ సర్టిఫికెట్ అందజేయొచ్చన్నారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
నగరి : అడ్డూఅదుపు లేకుండా తిరుగున్న టిప్పర్లు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మంగళవారం మండలంలోని ఏడుగట్లు గ్రామంలో కేశవరాజకుప్పం మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరువళ్లూరు జిల్లా, పళ్లిపట్టు తాలుకా, గొల్లాల కుప్పంకు చెందిన చెంచుగాన్ (29) మృతిచెందాడు. మృతిని బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చెంచుగాన్ తమిళనాడు పొన్పాడిలోని ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య చాముండేశ్వరి తిరుపతిలోని ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ అక్కడే ఉంటోంది. నూతన సంవత్సర వేడుకలను భార్యతో కలిసి జరుపుకునేందుకు అవసరమైన సరంజామా తీసుకుని మంగళవారం పని ముగించుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళుతున్నట్లు తల్లికి చెప్పి వచ్చాడు. అయితే మార్గ మధ్యంలోనే అతనిని మృత్యువు టిప్పర్ రూపంలో బలిగొంది. కేశవరాజకుప్పం మలుపు వద్ద టిప్పర్ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టడంతో చెంచుగాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. టిప్పర్ వదలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. కాగా చెంచుగాన్కు పిల్లలు లేరు. తల్లిదండ్రులకు చెంచుగాన్ ఒక్కగానొక్క కుమారుడు, కుటుంబానికి అతనే ఆధారం. కన్నీరు పెట్టించిన తల్లిదండ్రుల ఆక్రందన తల్లితండ్రులు తన కుమారుడి మృతదేహాన్ని చూసి పెట్టిన ఆక్రందన అందరినీ కలచివేసింది. టిప్పర్ వదలిపెట్టి డ్రైవర్ పరారు కావడం.. ఎవరూ వచ్చి సమాధానం చెప్పకపోవడంతో మృతుని బంధువులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకున్నారు. మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు, (ఇన్సెట్) చెంచుగాన్ (ఫైల్)టిప్పర్లకు అడ్డుకట్ట ఏదీ జాతీయ రహదారి, రైల్వే పనులంటూ విచ్చలవిడిగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లతో గ్రామీణ రోడ్లు రద్దీగా మారాయి. వీటికి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ‘గ్రామీణ రోడ్లు.. నరకానికి నకళ్లు’ అన్న కథనంతో సాక్షి దినపత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. అయినా అధికారులు గానీ, గ్రావెల్ కాంట్రాక్టర్లు గానీ ఈ మార్గాన్ని బాగుచేయడానికి ఎలాంటి చొరవ చూపలేదు. టిప్పర్లను అదుపు చేయలేదు. ఫలితంగా నేడు ఒక యువకుడు ప్రాణం బలైపోయింది. -
భూలోక వైకుంఠం!
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలో వెలసిన శ్రీ కల్యా ణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాము 4 గంటల నుంచే వైకుంఠ ద్వార ప్రవేశానికి భక్తులు పోటెత్తారు. ఎప్పటిలాగే ఆలయంలో ఆగమోక్తంగా పూజలు నిర్వహించారు. ఆ తరువాత వైకుంఠ ద్వారాలకు పూజచేసి తలుపులు తెరిచారు. అనంతరం ఆలయ నిర్వాహకులతో పాటు అర్చకులు, వేద పండితులు ముందుగా వైకుంఠ ద్వార ప్రవేశం చేయగా ఆ తర్వాత సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. తిరుమల వెళ్లలేక.. తుమ్మలగుంటకు తిరుమల వెళ్లి స్వామిని దర్శించలేని భక్తులందరూ తుమ్మలగుంట చేరుకున్నారు. ఆ తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం చేసి గోవింద నామస్మరణలతో భక్తితత్వం పంచుకున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆయన కుటుంబీకులు ఆయం వద్ద భక్తుల హృదయాలను హత్తుకునేలా భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. పుష్పాలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంతో పాటు వైకుంఠ ద్వారాన్ని సుంగదభరిత పుష్పాలు, పరిమళ భరిత పత్రాలతో అలంకరించారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా బ్రహ్మోత్సవాల్లో స్వామి వారు అధిరోహించే సప్త వాహనాలను దర్శించుకుని ఆపై సప్తద్వారాల గుండా ఆనంద నిలయం కింద ఆలయం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెరుచుకున్న సప్త ద్వారాలు భక్తులు రాగానే ఆలయానికి అతి సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సప్త ద్వారాలు తెరుచుకున్నాయి. అర్చక స్వాములు సప్త ద్వారాలు, ఆనంద నిలయం, గరుడ ద్వారానికి పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులందరూ అక్కడ ఏర్పాటు చేసిన సప్తద్వారాలు, ఆనంద నిలయం, గరుడ ద్వారాలను చూసి ఆశ్చర్యపోయారు. 85 వేల మందికిపైగా దర్శనం తిరుమల వెళ్లడానికి స్థానికులకు టోకెన్లు ఇవ్వకపోవడంతో అత్యధిక శాతం మంది భక్తులు తుమ్మలగుంట కు చేరుకున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వదర్శనం కల్పించడంతో సుమారు 85 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించి వైకుంఠ ద్వారంలో ప్రవేశించారు. వీఐపీల దర్శన సమయంలో కూడా సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తుమ్మలగుంటకు పోటెత్తిన భక్తులు సామాన్య భక్తులకు పెద్ద పీట తిరుమల తరహాలో ఆగమశాస్త్రం ప్రకారం వైకుంఠ ద్వారానికి పూజలు చేసి ప్రారంభించారు. అంతకుముందు స్వామి వారి మూలమూర్తికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చన వంటి దైనందిన పూజా కార్యక్రమాలు పూర్తిచేశారు. అనంతరం భక్తులను వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతించారు. క్యూల్లోకి వచ్చిన భక్తులకు ఒక గంటలో స్వామి దర్శనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నప్పటికీ క్యూల్లో ఎక్కడా నిలబడే అవకాశం లేకుండా చేసి, దర్శనం కల్పించారు. -
మా భూమి వ్యవహారంలో వారి పెత్తనమా.?
నా భర్త ద్వారా సంక్రమించిన ఆస్తిలో మా కుటుంబంలో ఏమైనా తగరార్లుంటే మేం చూసుకుంటాం. కానీ అధికార పార్టీ నాయకులు ఆర్డీవోకు చెప్పి మా భూములను బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఏంటి. నా ట్రీట్మెంట్కు కావాల్సిన డబ్బులు రాకుండా పోయాయి. దీనికి కారణం కూటమి నాయకులే. మా భూమిపై వీరి పెత్తనం ఏంటి. తనకు న్యాయం కావాలనే ఆర్డీవో వద్దకొచ్చా. – పరిమళ, బాధితురాలు దీనిపై విచారించి న్యాయం చేస్తాం పరిమళ అనే బాధితురాలు తన సమస్యను తెలుపుకుంది. కోర్టు కేసులో ఉన్న ఆస్తిపై బ్లాక్లిస్ట్లో పెట్టారని చెప్పింది. దీనిపై పుంగనూరు తహసీల్దార్ ద్వారా విచారించి ఆమెకు న్యాం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇందులో రాజకీయ ప్రమేయం లేదు. దీనిపై మానవతా హృదయంతో బాధితురాలికి న్యాయం చేస్తాం. – భవాని,ఆర్డీవో, పలమనేరు -
ఎరువుల దుకాణాలపై దాడులు
పలమనేరు/కాణిపాకం: జిల్లాలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో యూరియా.. లేదయ! అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. ఇది నిజమని తేలడంతో ప్రత్యేక అధికారుల ద్వారా తనిఖీలు చేపట్టారు. ఆ మేరకు పలమనేరు ప్రాంతంలో ప్రత్యేక అధికారి సాలురెడ్డి, ఏవో సునీల్కుమార్రెడ్డి మంగళవారం తనిఖీలు చేశారు. పట్టణంలోని నాగలింగయ్యశెట్టి అండ్ సన్స్, కౌండిన్య ఏఓపీవోలలో ఫామ్–2 లేకుండా ఉన్న రూ.4.87 లక్షల విలువైన 12.5 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. పలు ఎరువుల దుకాణాల్లో ఎరువుల నిల్వ, అమ్మకం రికార్డులను పరిశీలించారు. కాగా సోమవారం బైరెడ్డిపల్లి, వీకోట మండలాల్లో రూ.15 లక్షల విలువజేసే 60 టన్నుల కాంప్లెక్స్ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పుంగనూరు, తవణంపల్లె మండలాల్లోనూ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పలమనేరులో రికార్డులను పరిశీలిస్తున్న అఽధికారులు ఎరువుల దుకాణాలపై దాడులు చేస్తున్న ప్రత్యేక అధికారులు -
ఏటా పెరుగుతున్న ‘క్రైమ్’
●చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా.. మూడు రాష్ట్రాలకు సరిహద్దు. చిన్నపాటి చైన్ స్నాచింగ్ కేసుల్లో కూడా నిందితులు పక్క రాష్ట్రాల వాళ్లే. నేరం పూర్తయిన వెంటనే నిముషాల్లో రాష్ట్ర సరిహద్దు దాటేయొచ్చు. నేరస్తులను పట్టుకోవడం, చోరీకి గురైన సొమ్ము రికవరీ, సైబర్ వలలో వేల కి.మీ ప్రయాణం.. ఇన్ని చేసినా ప్రతీ రోజూ నేరస్తులు జిల్లా పోలీసులకు సరికొత్త సవాళ్లను విసురుతూనే ఉన్నారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది పోలీసుశాఖ విడుదల చేసిన వార్షిక నేర సంక్షిప్త నివేదికలో కొన్ని గణాంకాలు ఆశ్చర్య పరస్తుంటే.. మరికొన్ని పర్వాలేదనిపిస్తున్నాయి. సామాన్య ప్రజల ప్రశాంత జీవనమే పోలీసు ప్రధాన కర్తవ్యమని ఎస్పీ డూడీ చెబుతున్నారు. మంగళవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ 2025 పోలీసుశాఖ పనితీరు తెలిపే నివేదికను మీడియాకు వివరించారు. సంచలనాలు 2015లో జరిగిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు చింటూతో సహా ఐదుగురికి చిత్తూరు కోర్టు ఉరిశిక్ష విధించడం రాష్ట్రంలోనే సంచనాత్మక తీర్పుగా మారింది. ఇక చిన్నపిల్లలపై లైంగిక దాడుల ఘటనల్లో వేర్వేరు కేసుల్లో ఐదుగురికి 20 ఏళ్ల జైలుశిక్ష కూడా పడింది. చిత్తూరు నగర శివారుల్లో ఓ మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు గ్యాంగ్రేప్ చేయడం, ఒడిశా నుంచి కుప్పంకు గంజాయి దిగుమతి చేయడం, రూ.80 వేలు అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం లాంటి ఘటనలు రాష్ట్రంలోనే చర్చనీయాంశమయ్యాయి. చైన్స్నాచింగ్ చేస్తూ పూతలపట్టులో మహిళ మృతికి కారణమైన హేమచంద్ర, సురేష్, మస్తాన్ను పోలీసులు అరెస్టు చేయడం, వి.కోటలో దారిదోపిడీ చేస్తున్న జయపాల్ను అరెస్టు చేసి రూ.3.2 కోట్ల విలువ చేసే బంగారు బిస్కెట్లు సీజ్ చేయడం, గుడిపాలలో యువతులను బెదిరించి లైంగిక దాడులు చేసిన కేసులో జాన్ అలెక్స్ను పట్టుకోవడం కూడా జిల్లా పోలీసులకే సాధ్యం. పెరిగిన నేరాలు నేరం 2024 2025 రోడ్డు ప్రమాదాలు 748 771 మృతులు 402 381 పోక్సో 46 56 మాదకద్రవ్యాలు 49 50 హత్యలు, గొడవలు 857 859 చోరీలు 476 426 ఛేదించినవి 236 207 చోరీకి గురైన సొమ్ము రూ.6.20 కోట్లు రూ.11.52 కోట్లు రికవరీ రూ.2.95 కోట్లు రూ.8.39 కోట్లు సామాన్యులకు అండగా.. గతేడాది మొత్తం 7,034 కేసులు రిపోర్టయితే, ఈ సారి 5,216 నమోదయ్యాయి. దాదాపు 26 శాతం క్రైమ్ రేట్ తగ్గించగలిగాం. రోడ్డు ప్రమాదాల్లో సాంకేతిక తప్పిదాలను సరిచేయడానికి కలెక్టర్తో మాట్లాడుతున్నాం. కొత్త ఏడాదిలో ‘ధైర్యస్పర్శ’ పేరిట ప్రజలు భయపడే కొన్ని ప్రాంతాలను మారుస్తున్నాం. మహిళా భద్రత, పిల్లలపై నేరాల నియంత్రణపై దృష్టి పెడుతున్నాం. గంజాయి, లాటరీ, పేకాటను ఏమాత్రం ఉపేక్షించం. ప్రజలు సహకరించాలి. – తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు. తగ్గిన నేరాలు నేరం 2024 2025 మహిళలపై 507 443 చోరీలు 124 88 మోసాలు 194 152 సైబర్ నేరాలు 30 19 ప్రాపర్టీ నేరాలు 480 466 -
చట్టాన్ని అతిక్రమించే పనులొద్దు
చిత్తూరు అర్బన్ : నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు, యువత చట్టాన్ని అతిక్రమించే చర్యలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాదీ నూతన సంవత్సరం అర్ధరాత్రి ఆనందోత్సవాల్లో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే కుటుంబాలు సురక్షితంగా, సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. 31వ తేదీ రాత్రి వేడుకల పేరుతో బైకులపై తిరుగుతూ గోల చేయడం చట్టానికి వ్యతిరేకమన్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు. వీడియో రికార్డింగ్కు వినతి శాంతిపురం: కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం భూ సేకరణలో భాగంగా బుధవారం జరగనున్న పబ్లిక్ హియరింగ్ ప్రక్రియను పూర్తిగా వీడియో తీయాలని బాధిత రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం కుప్పం ఆర్డీవో, శాంతిపురం తహసీల్దార్లకు వారు వినతి పత్రాలను అందించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ విచారణలో రైతుల అభిప్రాయాలు, అధికారుల ప్రకటనలు, ప్రసంగాలను వీడియో రికార్డింగ్ చేసి, మొత్తం వీడియో కాపీని తమకు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూ సేకరణకు కొందరు రైతులు ససేమిర అంటూ హై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అధికారులు నేడు మరో విడత బహిరంగ విచారణ నిర్వహించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ఆదర్శంగా ఉండాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు ఆదర్శంగా ఉండాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య మహాజన సభ నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల జీవన ప్రమాణాల పెంపునకు అనేక సంక్షేమ పథకాలున్నాయన్నారు. మన డబ్బులు మన లెక్కలు పైన ప్రతి సంఘ సభ్యురాలికి సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో 58 వేల మందిని అక్షరాసులుగా తీర్చిదిద్దేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలుగా అముద, కార్వేటినగరం, కార్యదర్శిగా పూతలపట్టుకు చెందిన ప్రసన్న, కోశాధికారిగా కుప్పానికి చెందిన గౌతమి, ఉపాధ్యక్షురాలుగా యాదమరి చెందిన రజియా, ఉప కార్యదర్శిగా గుడిపాలకు చెందిన సరళాను ఎన్నుకున్నారు. డీపీఎం రవి, ఏపీడీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
అట్టహాసంగా చదరంగం పోటీలు
కల్యాణ వెంకన్న ఆలయం వద్దసప్తద్వారాల ఏర్పాటుచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఆర్కే పాఠశాలలో నిర్వహించిన ఏపీ ఓపెన్ చెస్ టోర్నీ అట్టహాసంగా సాగింది. ఈ టోర్నీలో ఏపీ చెస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఆర్బీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో చదరంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మొత్తం 11 కేటగిరీల్లో సాగిన ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలు నిలిచారు. గెలుపొందిన వారికి రూ.1.29 లక్షల విలువైన నగదు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం విజేతలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, నగదు అందజేశారు. కార్యక్రమంలో చెస్ సంఘం జిల్లా అధ్యక్షుడు బాబుప్రసాద్రెడ్డి, పాఠశాల నిర్వాహకులు రవీంద్ర, కోమల, చెస్ సంఘం సభ్యులు దినేష్, కిశోర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ముక్కోటికి ముస్తాబు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శోభాయమానంగా అలంకరించారు. ఆలయ అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేకించి వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలు, చలువ పందిళ్లు, రంగవల్లులు, విద్యుత్దీపాలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం వేకువ జాము 12–05 గంటలకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొల్పి, ధనుర్మాస కై ంకర్యాలు నిర్వహించనున్నారు. ఉదయం 1.35 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి వైకుంఠ ద్వారం గుండా అనుమతించనున్నారు. సాయంత్రం 4గంటలకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. 31 బుధవారం వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకొని ఉదయం 6.30 గంటల నుంచి 7.30 వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నాన్నం నిర్వహించనున్నారు. విద్యుత్ దీపకాంతులతో అలరారుతున్న ప్రసన్నుడి ఆలయం -
కాళ్లుమొక్కుతాం.. సమస్యలు పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా మీ కాళ్లుమొక్కుతాం.. మా సమస్యలు పరిష్కరించి న్యాయం చేయండి’ అంటూ అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు పాల్గొని ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ ఆన్లైన్ సర్వర్ మొరాయించడంతో ఆఫ్లైన్ విధానంలో అర్జీలను నేరుగా స్వీకరించారు. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి రాష్ట్రంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి కోరారు. ఈ మేరకు ఆ పరిషత్ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైజాగ్ గ్రామీణ, వేములవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 500 ఎకరాలకు పైగా ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
పునర్విభజనం.. అసంబద్ధం
జిల్లాల పునర్విభజన అసంబద్ధంగా జరిగింది. టీడీపీకి అనుకూలంగా మండలాలను ఒకటిగా చేసి, వైఎస్సార్సీపీకి పట్టున్న మండలాలు, నియోజకవర్గాలను ముక్కలు ముక్క లుగా చేసింది. వేర్వేరు జిల్లాల్లోకి కలిపివేసింది. దీంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న నిపుణుల హెచ్చరికలను సైతం తోసిపుచ్చింది. టీడీపీ అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇక్కట్లుపడక తప్పదని మేధావులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జిల్లాల పునర్విభజన చేపట్టారనే ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు ప్రభుత్వం నియోజక వర్గాలను చిందర వందరగా చేసింది. అసెంబ్లీ ఒకటైతే.. ఆ నియోజక వర్గ పరిధిలోని మండలాలను మరో జిల్లాలోకి చేర్చి గందరగోళానికి తెరతీశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్ని మండలాలు ఒకే నియోజకవర్గంలో ఉండడం, ఆ నియోజక వర్గం ఒకే జిల్లాలో ఉంటేనే పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాల స్వరూపాన్నే మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభీష్టం మేరకు అని చెబుతూ.. చంద్రబాబు ప్రభుత్వం సోమవారం జిల్లాల మార్పులు, చేర్పులు చేపట్టింది. ఈ మార్పులు చేర్పుల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని సోమల, సదుం, చౌడేపల్లి, పుంగనూరు మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు. అదే పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్షతోనే పుంగనూరు నియోజక వర్గాన్ని ముక్కలు ముక్కలుగా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాను విడగొట్టడంతో నాలుగు డివిజన్లు, 28 మండలాలతో చిత్తూరు చిన్నదిగా మారిపోయింది. గందరగోళంగా తిరుపతి జిల్లా.. తిరుపతి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాలు ఉండేవి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోకి కొత్తగా కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలుపుతూ కాబినెట్ నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కోట, చిల్లకూరు, గూడూరు మండలాలను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి కలిపారు. ఇదే గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, చిట్టమూరు మండలాలను మాత్రం తిరుపతి జిల్లాలోనే ఉంచారు. అలాగే వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలిపారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు నాలుగు డివిజన్లు, 36 మండలాలను తిరుపతి జిల్లాగా ప్రకటించారు. ఇలా చేయడంతో ప్రతి ఎన్నికల్లోనూ, పాలనాపరమైన సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా -
హెచ్పీవీతో క్యాన్సర్ కిల్!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సర్వైకల్ క్యాన్సర్ను నియంత్రించే హెచ్పీవీ టీకాను కిశోర బాలికలకు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు శిక్షణ ఇచ్చింది. వైద్యులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు ఉన్న బాలికలను గుర్తించనున్నారు. కాగా ఇప్పటి వరకు వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 53 వేల మంది కిశోర బాలికలు ఉన్నట్టు అంచనా. వారికి ఒక డోసు హెచ్పీవీ టీకా వేస్తే భవిష్యత్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు తలెత్తకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసులు మహిళల్లో రొమ్ము క్యాన్సర్తో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు పెరుగు తున్నాయి. హ్యుమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఇది సోకుతుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల పాటు వృద్ధి చెంది క్యాన్సర్కు కారణమవుతుంది. ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పోతే ప్రమాదమే. అందుకే ప్రభుత్వం బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా వేయాలని నిర్ణయించింది. టీకా జిల్లాకు రాగానే సిబ్బంది 14ఏళ్లు నిండిన బాలికలను గుర్తించనున్నారు. ఎన్సీడీ 4.0లో.. గతనెల రోజులుగా జిల్లాలో ఎన్సీడీ సర్వేను చేపడుతున్నారు. 16 లక్షల మందిని సర్వే చేయాల్సి ఉండగా...ఇప్పటి వరకు 4 లక్షల మందిని సర్వే చేశారు. ఈ సర్వేలో ఇది వరకు ఓరల్ క్యాన్సర్ ఉన్న వారు 160 మంది బయటపడ్డారు. బ్రెస్ట్ క్యాన్సర్ 124 మందికి ఉన్నట్లు గుర్తించారు. సర్వైకల్ క్యాన్సర్ 98 మందికి ఉన్నట్లు నిర్థారించారు. సర్వే పూర్తయితే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్న వారి సంఖ్య 300 దాటొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ఓరల్ క్యాన్సర్లో కూడా మహిళలే అధికంగా ఉంటున్నట్టు సమాచారం. టీకా ఇచ్చేలా.. ముందుగా కిశోర బాలికలకు టీకా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులకు శిక్షణ ముగిసింది. బడిలో చదివే కిశోర బాలికలను గుర్తించాలని ఆదేశించారు. త్వరలో వారికి టీకాలు ఇవ్వనున్నారు. సర్వైకల్ క్యానర్స్ లక్షణాలు యోని నుంచి రక్తస్రావం లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం రుతు క్రమంలో సమస్యలు పీరియడ్స్ ఆగిపోయినా తర్వాత రక్తస్రావం మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలు మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను కట్టడి చేసేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. అందుకోసం జిల్లాలో 14 ఏళ్లు నిండిన కిశోర బాలికలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాంగంగా సోమవారం సీహెచ్సీ, పీహెచ్సీ వైద్యులకు శిక్షణ పూర్తి చేసింది. బాలికల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన ఈ వ్యాక్సిన్ను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి మహిళలు మూడేళ్లకు ఒకసారి స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి. ఈ టెస్టులపై నిర్లక్ష్యం వద్దు. అలాంటప్పుడే ఈ సర్వైకల్ క్యాన్సర్ను గుర్తించగలం. లేకుంటే అది ప్రమాదకరంగా మారుతుంది. ఇక 9 నుంచి 14 ఏళ్ల వయస్సులోని బాలికలు రెండు డోస్ల హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలాగే పెళ్లికి ముందు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడం ఉత్తమం. ఈ విషయలో నిర్లక్ష్యం చేయకండి. బాలికలతో పాటు మహిళలు కూడా సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలి. ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు -
రెండేళ్లుగా.. ఏం చేస్తున్నారు?
పుంగనూరు: ‘తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రతిపక్ష పార్టీలపై కేసులు, అరెస్ట్లు చేయడమే పనిగా పెట్టుకుంది’..అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై తొలిసారిగా వినతులు స్వీకరించారు. ప్రజలతో విడివిడిగా మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్ లేదయ్యా! ప్రజలు చాలా మంది పింఛన్ల కోసమే ఎక్కువగా వినతులు సమర్పించారు. దివ్యాంగ పెన్షన్లు , మూడు చక్రాల సైకిళ్లు కావాలని కోరారు. అలాగే వితంతువులు పెన్షన్లు కావాలని, మహిళలు ఇంటి పట్టాలు కావాలని అభ్యర్థించారు. నక్కబండ ప్రాంతంలో గత ఇరవై రోజులుగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ వాటిని అప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తా అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇకపై ప్రతి సోమవారం ప్రజా వినతులు స్వీకరించి, సమస్యలు పరిష్కరించేందుకు ఒక్కొక్క మండలంలో పర్యటిస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని మండి పడ్డారు. ‘ఈ ప్రభుత్వంలో నలుగురు తపేదారులు ఉన్నారు. వారికి డబ్బులిస్తే సరిపోతుంది. ప్రజా సమస్యలు పరిష్కరించకపోయినా పరవలేదు అనే ధోరణిలో అధికారులు పనిచేస్తే సహించేది లేదు’ అన్నారు. మా పార్టీ కార్యకర్తలే సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తారని హెచ్చరించారు. అప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోతే అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. స్వలాభం కోసమే! టీడీపీ అధికారంలోకి వచ్చినరోజు నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, అధికారులు కలసి స్వలాభం చూసుకుంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసం సద్వినియోగం చేయాలని కోరారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వక్ఫ్ బోర్డు మాజీ జిల్లా చైర్మన్ అమ్ము, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇర్ఫాన్, ఎంపీపీ భాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి, కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, కమిషనర్ మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ రాము పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
గుడిపాల: టిప్పర్ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. సోమవారం ఉదయం 189 కొత్తపల్లెకు చెందిన నేషన్(55) రోడ్డు దాటుతుండగా వేలూరు నుంచి చిత్తూరు వైపునకు వెళ్తున్న ఓ టిప్పర్ లారీ ఢీకొని వెళ్లిపోయింది. తలకు బలమైన గాయం తగలడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నాలుగు టిప్పర్లు సీజ్ నగరి : ఓవర్లోడ్తో వెళుతున్న నాలుగు టిప్పర్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. అధిక లోడ్ టిప్పర్ల కారణంగా రోడ్లు ఛిద్రమవుతున్నట్లు ప్రజల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో ఆర్డీవో సూచనల మేరకు సోమవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సహకారంతో తనిఖీలు నిర్వహించామన్నారు. ఓవర్లోడ్తో వెళ్తుతున్న నాలుగు టిప్పర్లను సీజ్ చేసి రూ. 91,120 జరిమానా విధించామన్నారు. సీజ్చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. తరచూ తనఖీలు నిర్వహిస్తామని బిల్లుల్లో తేడా వచ్చినా, ఓవర్ లోడ్ అని తేలినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాణిపాకంలో ప్రముఖులు కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి క్షేత్రం సోమవారం ప్రముఖులతో సందడిగా కనిపించింది. పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు స్వామి సన్నిద్ధికి వచ్చారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నీరజ్ తివారీ, పాట్నా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణారెడ్డి, పుల్లా కార్తీక్, కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ ఎస్కినాగి , సందేశ్, ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు, తెలంగాణ రాష్ట్ర ఆర్టీ కమిషన్ శ్రీనివాసులురావు, తెలంగాణ రాష్ణ్ర గవర్నర్ సతీమణి సుధాదేవ్ వర్శ, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర, హిందూపురం ఎంపీ పార్థసారథితో పలువురు ఎమ్మెల్యేలు దర్శించున్నారు. వీరికి ఆలయ ఈవో పెంచలకిషోర్, చైర్మన్ మణినాయుడు, ఏఈవో రవీంద్రబాబు అతిథి మర్యాదలు చేశారు. ఎరువుల దుకాణాల తనిఖీ చిత్తూరు రూరల్ (రూరల్): జిల్లాలోని ఎరువుల దుకాణాలను సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ తనిఖీ బృంద అధికారులు పరిశీలించారు. బంగారుపాళ్యం, వి.కోట, బైరెడ్డిపల్లి, కుప్పం మండలాల్లోని పలు దుకాణాలను బృందం అధికారులు సునీల్, మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, సాలురెడ్డి, వెంకటేశ్వరు తనిఖీ చేశారు. ఎరువులు, క్రయ విక్రయాలపై క్షుణంగా పరిశీలించారు. ఎరువుల నిల్వలను లోతుగా విచారించారు. ఈ తరుణంలో బిల్లులు సక్రమంగా లేని కారణంగా...రూ.15 లక్షల విలువ చేస 60 మెట్రిక్ టన్నుల యూరియాను గుర్తించారు. ఈ తనిఖీ మరో రెండు రోజుల పాటు సాగనుందని వ్యవసాయశాఖ ఆధికారులు తెలిపారు. నేడు జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. ఉదయం 10.30కు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. 1–7 కమిటీ అంశాలైన ఆర్థిక, ప్రణాళిక, పనులు, గ్రామీణభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం అంశాల పై చర్చ ఉంటుందన్నారు. అధికారులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. -
చిత్తూరుకు ఐపీఎస్ తరుణ్ పహ్వ
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు జిల్లాలో ఆరు నెలల శిక్షణ నిమిత్తం ఐపీఎస్ అధికారి డా.తరుణ్ పహ్వ నియమితులయ్యారు. సోమవారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. హర్యాణ రాష్ట్రం, చర్కీదాద్రీ జిల్లాకు చెందిన తరుణ్ 2020లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గతేడాది ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఆర్నెళ్ల పాటు జిల్లాలో పోలీసు పరిపాలనపై శిక్షణ పొందనున్నారు. జీఎస్టీ మోసంపై ఎస్పీకి ఫిర్యాదు చిత్తూరు అర్బన్: చిత్తూరులో వెలుగు చూసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను (ఐటీసీ) దోచుకోవడంపై సోమవారం ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేశారు. సంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు తన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని.. ఓ కంపెనీ స్థాపించి జీఎస్టీ పేరిట భారీగా ఐటీసీ దోచుకోవడంపై విజయ్చక్రవర్తి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఏఐటీయూసీ నాయకుడు నాగరాజన్తో కలిసి ఎస్పీకి వినతిపత్రం అందచేశారు. తనకు ఇందులో సంబంధంలేదని పేర్కొన్నాడు. అయితే బాధిత వ్యక్తి ప్రమేయం లేకుండా రూ.కోట్లలో లావాదేవీలు ఎలా జరిగాయంటూ ఎస్పీ ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీసు గ్రీవెన్స్కు 50 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 50 వినతులు అందాయి. ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. తాగి రోడ్లపైకి వస్తే చర్యలు! చిత్తూరు అర్బన్: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం ఉత్తమమని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. అలాకాదని తప్పతాగి రోడ్లపైకి రావడం, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ న్యూసెన్స్ చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. 31వ తేదీ రాత్రి 9 నుంచి.. తెల్లవారు జాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు గస్తీ ఉంటుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బ్లూకాట్స్, రక్షక్ వాహనాలతో నిత్యం పహారా ఉంటుందన్నారు. వేడుకల పేరిట ఎవ్వరికీ ఇబ్బందులు కలిగించొద్దని.. కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం మంచిదని సూచించారు. డయల్ యువర్ ఎస్ఈకి ఏడు ఫిర్యాదులు చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ఫిర్యాదులను స్వీకరించారు. సోమల నుంచి ఫోన్లో మాట్లాడుతూ పైకం చెల్లించినా వ్యవసాయ సర్వీసును విడుదల చేయలేదని ఫిర్యాదు చేశారు. అలాగే బార్బర్షాప్నకు విద్యుత్ సబ్సిడీ మంజూరు చేయాలని కోరారు. చిత్తూరులోని మురకంబట్టు, ఆర్వీఎస్ నగర్ నుంచి లోఓల్టేజీ సమస్య ఉందని అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కేబుల్ మార్పు చేయాలని వినియోగదారులు తెలిపారు. యాదమరి నుంచి సోలార్కు నెట్ మీటర్ ఏర్పాటు చేయాలని, బైరెడ్డిపల్లె నుంచి వ్యవసాయ సర్వీసు విడుదల చేయాలని, నిండ్ర నుంచి వ్యవసాయ సర్వీసుకు అంచనా వేయాలని, గంగవరం నుంచి ఓల్టేజీ సమస్య తీర్చాలని ఫిర్యాదులు వచ్చాయి. -
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.రాత్రి 12:05 గంటలకు అర్చకులు, జీయర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలను తెరిచారు. అనంతరం నిత్య కైంకర్యాలు పూర్తి చేసి వేకువజాము 1:25 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం ఒక్కరోజే సుమారు 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా కేవలం 2–3 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీవీఐపీల దర్శనాలు కేవలం మూడు గంటల పాటు మాత్రమే నేరుగా వచ్చిన వీవీఐపీలకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు రోజుల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా సుమారు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు.ఉదయం 4:30 గంటల నుంచి టోకెన్లు ఉన్న భక్తులకు వారి కేటాయించిన టైమ్ స్లాట్ల ప్రకారం సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు ఈవో వివరించారు. టోకెన్లు లేని భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా, రేడియో అనౌన్స్మెంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ మధ్య తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనానికి పట్టే సమయం, రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు తాజా అప్డేట్స్ అందిస్తున్నామని తెలిపారు. భద్రత పరంగా సుమారు 3,500 మంది పోలీస్, విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.వైకుంఠ ద్వార దర్శనంలో ప్రముఖులువైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా దర్శనం చేసుకున్నారు.నిర్మాత బండ్ల గణేష్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, క్రికెటర్ తిలక్ వర్మ, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్సీ భరత్, దేవినేని అవినాష్ తదితరులు వైకుంఠ ద్వార దర్శనంలో తరించారు. భక్తులు తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
నకిలీలకు కళ్లెం
– వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చోరీలు, నేరాలు, నకిలీ నంబరు ప్లేట్లతో సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)ను తప్పనిసరి చేసింది. ఇవి వాహన భద్రతను పెంచడమే కాకుండా నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నమోదు కోసం ఇలా.. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కోసం www. siam. in వెబ్సైట్లో వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. వాహన నంబరు, ఛాసిస్ నంబరు వివరాలు పంపాలి. కంపెనీలను బట్టి నంబరు ప్లేట్లు ద్విచక్ర వాహనాలకు రూ.320 నుంచి రూ.500 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.600 పైనే ఉంది. వీటిలో కావాల్సింది ఎంపిక చేసుకుని ఓటీపీ ద్వారా ఆన్లైన్లోనే నగదు చెల్లించాలి. దీని ప్రత్యేకతలు ఇవీ.. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్పై యూనిక్ లేజర్ ఐడీ ఉంటుంది. నకిలీగా మార్చలేని విధంగా దీన్ని రూపొందించారు. ఒకసారి అమర్చితే తొలగించడం సాధ్యం కాదు. నంబర్ ప్లేట్ను స్కాన్ చేయడం ద్వారా పోలీసులకు పూర్తి సమాచారం అందుతుంది. జరిమానా తప్పదు జిల్లాలో ఈ ప్లేట్ ప్రభావం పెద్దగా లేకపోయినా.. పక్కా రాష్రాల్లో హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్లను క్షుణంగా పరిశీలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ రకమైన నంబరు ప్లేట్ లేకపోతే జరిమానాలు పడుతున్నాయి. త్వరలో ఈరకమైన నంబర్ ప్లేట్ జిల్లాలో అమలయ్యే అవకాశాలున్నాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. -
నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన
పుంగనూరు: మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పుంగనూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. 10 నుంచి సంక్రాంతి సెలవులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆ ఉత్తర్వులు డీఈవో కార్యాలయానికి చేరాయి. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. జనవరి 19 న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖా పరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్మ్డు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవై నా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. స్క్రబ్ టైఫస్..టెన్షన్ – అవగాహన లేక ఆందోళన చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు అధికమయ్యాయి. కేసుల నమోదులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కాలంలో 492 కేసులు నిర్ధారణ కాగా.. నవంబర్ నుంచి ఇప్పటి వరకు 57 కేసులు వచ్చాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కేసులను గుర్తించడంతో పాటు అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఇంటివద్ద అపరిశుభ్రత, పూల, ఇతరచెట్లు ఉండండంతో కొంత మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని వా రి విచారణలో తేలింది. అయితే అత్యధిక మంది రైతులే కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. వ్యవసాయ పొలలాకు వెళ్లేవారు, పశువుల పెంపంకం దారులే ఈ వ్యాధి బారిన పడినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కట్టడికి శాఖతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థకశాఖ అధికారులు, సిబ్బంది రైతులకు అవగాహన కల్పి స్తే బాగుంటుందని వైద్యశాఖ పేర్కొంటోంది. తద్వారా స్క్రబ్ టైఫస్ కేసులను నివారించవచ్చునని శాఖ భావిస్తోంది. విద్యుత్ బిల్లుల వసూళ్లు రూ.1.35 కోట్లు చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు పనిచేశాయి. దీంతో రెండు జిల్లాల నుంచి 11,200 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. తద్వారా సంస్థకు రూ.1.25 కోట్లు వచ్చిందని ట్రాన్స్కో ఎస్ఈ లు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్రావు తెలిపారు. సకాలంలో విద్యుత్ బిల్లులను వినియోగదారులు చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్ఎస్యూలో ఇంటర్వ్యూలు తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలకు వా క్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వర్సి టీ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ ఫెలో–1, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ ప్రూఫ్ రీడర్– 4 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు. -
టమోతనారు
గత సంవత్సర కాలంగా టమాట ధరలు పెరుగుతూ తగ్గుతూ ఊగిసలాడుతూ వచ్చాయి. నెల రోజులుగా టమాట ధరలు పుంజుకోవడంతో రైతులు మళ్లీ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం టమాట కిలో ధర రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. రేటు రావడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. .దీంతో అందరూ టమాట నారు కోసం నర్సరీల చుట్టూ తిరుగుతుండడంతో నారుకు గిరాకీ పెరిగింది. నెల రోజుల వరకు నర్సరీల్లో కూడా నారు దొరకని పరిస్థితి రావచ్చని కొంత మంది రైతులు అభిప్రాయపడుతున్నారు. – పులిచెర్ల (కల్లూరు) -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 16 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 91,147 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,400 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే తిరుమలలో చలి తీవ్రత పెరిగిపోయింది. భక్తులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూములు దొరక్క ఉన్న భక్తులు వెయిటింగ్ హాళ్ల వద్ద, టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద చలికి వణుకుతూ కనిపిస్తున్నారు. -
రేపు హిందూ సమ్మేళనం
ఐరాల: మండల కేంద్రంలోని వారపు సంతలో మంగళవారం ఉదయం 10 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మండల హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి నిర్వాహకులు తెలిపారు. విశిష్ట అతిథిగా భువనేశ్వరి పీఠం, గన్నవరం శ్రీకమలానంద భారతి స్వామి హాజరవుతారని తెలిపారు. పెద్ద సంఖ్యలో హిందువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం ముగిసిన తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి యాదమరి: యువత మత్తు పదార్థాలు, గంజాయికి దూరంగా ఉండాలని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఆదివారం మండల పరిది బుడితిరెడ్డిపల్లి గ్రామంలో పశ్చిమ విభాగం సీఐ శ్రీధర్ నాయుడు, స్థానిక పోలీసులతో కలసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులతో పాటు వారి ఇళ్లను తనిఖీలు చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై మత్తు పదార్థాల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పులిచెర్ల(కల్లూరు): చాలా రోజుల తర్వాత ఆదివారం ఒంటరి ఏనుగు మండలంలోకి వచ్చింది. పొలాల్లో ప్రవేశించి పంటలను నాశనం చేసింది. ఏడాదిగా మండలంలో తిష్ట వేసిన ఏనుగుల గుంపును నెల రోజుల క్రితం ఫారెస్టు అధికారులు ఇతర ప్రాంతాలకు మళ్లించారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంటల సాగుకు సిద్ధమయ్యారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మండలంలోని పాళెం పంచాయతీ కోటపల్లెలోని ఒక రైతు మామిడి తోటలోకి ఒంటరి ఏనుగు ప్రవేశించి కొమ్మలను విరిచి వేసింది. దీంతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. చరిత్రకు సాక్ష్యాలు నాణేలు చౌడేపల్లె : పురాతన నాణేలు, కరెన్సీ నోట్లు ఆయా దేశాల చరిత్ర, నాగరికతను తెలియజేస్తాయి. గత చరిత్ర ఘనతను భావితరాల వారికి అందించాలన్న ఉద్దేశంతో పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యానికి చెందిన సాయికృష్ణ ముందుకు సాగుతున్నాడు. 12 ఏళ్లుగా పురాతన నాణేతలతోపాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను సేకరిస్తున్నాడు. వాటిని పాఠశాలల్లో ప్రదర్శిస్తూ చరిత్రతోపాటు పిల్లలకు స్పూర్తినింపుతున్నాడు. ప్రస్తుతం అతని వద్ద రాజుల కాలంలో వినియోగించిన 26 రకాల నాణేలు, బ్రిటీష్ పాలనలోని నాణేలు, రిపబ్లిక్ పాలనలో ఉన్న ప్రస్తుత కరెన్సీ, రద్దు చేసిన 500, 1000 నోట్లతో సహా 96 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటి తరానికి మన ఘన చరితను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు సాయికృష్ణ వెల్లడించారు. -
రైతుల పాట్లు
మామిడి తోటల్లో అరకొరగా పూసిన పూత ఆపేందుకు ఓ వైపు, కొత్తగా పూత వచ్చేందుకు మరో వైపు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పూత రసం పీల్చే నల్లి, పూతను తొలిచే పురుగు ఆశించాయని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ. 40 నుంచి రూ. 50 వేల చొప్పున ఖర్చు చేస్తూ మూడు విడతులుగా మందులు పిచికారీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో అనుకున్న సమయానికి పూత వస్తే ఎకరానికి 5 టన్నుల దిగుబడి లభిస్తుందంటున్నారు. కానీ ఇంత వరకు పూత కనిపించపోవడంతో ఈ ఏడాది కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుందని, ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు కొలుకోవడం కష్టమవుతుందని ఆవేదన చెందుతున్నారు. -
లక్షా 65 వేల హెక్టార్లలో తోటలు
మామిడిపై ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ప్రతి సంవత్సరం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో సుమారు లక్షా 65 వేల హెక్టార్లలో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. 21 మండలాల్లో మేజర్ క్రాప్ మామిడి ముందున్నది. ఇందులో 65 శాతం తోతాపురి సాగు చేస్తున్నారు. దీంతో పాటు నీలం, బేనిషా, ఖాదర్, మల్లిక, హిమా పసందు సాగులో ఉన్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల వల్ల గతేడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రాక మామిడి రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఈ ఏడాది ఆ నష్టాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నా...వాతావరణ ప్రభావంతో ఇంత వరకు మామిడిలో పూత కనిపించకపోవడంతో ఈ ఏడాది కూడా రైతులు నిరాశ చెందుతున్నారు. -
కంటైనర్ లారీ, బస్సు ఢీ
వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత తిరుపతి క్రైమ్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల, తిరుపతితోపాటు జిల్లాలోని అన్ని ఆలయాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ● తిరుమలలో సుమారు 2వేల మంది, తిరుపతిలో సుమారు 1,500 మంది పోలీసులతో బందోబస్తు పెట్టాం. ● వైకుంఠ ద్వార దర్శనం మొత్తం 10 రోజులపాటు కొనసాగుతుంది. ఈ నెల30, 31 మరియు జనవరి 1 తేదీలలో టోకెన్ ఉన్నవారికి మాత్రమే దర్శనముంటుంది. ● టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతల పరిక్షణకు పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. ● భక్తులు సైతం పోలీసులకు సహకరించాలి. తమతో వచ్చిన పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ముక్కంటి సేవకు పోటెత్తిన భక్తులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దాదాపు 30 వే ల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజులోనే అన్ని 5,158 వరకు రాహుకేతు పూజలు నిర్వహించబడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా రూ.500, రూ.750 రాహుకేతు పూజలకు భక్తులు అధికంగా తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు గంటల తరబడి క్యూల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. అనుమానాస్పద ిస్థితిలో వ్యక్తి మృతి చౌడేపల్లె : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లె వద్ద వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు ... బుటకపల్లెకు చెందిన అంజప్ప(56) గ్రామాని కి సమీపంలోని ఆంజనేయస్వామి గుట్ట వద్ద ఓ చెట్టుకు వేలాడుతుండగా గుర్తించిన పశువుల కాపరులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి ధర్యాప్తుచేస్తున్నారు. -
పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. పెద్ద పండుగలో ముందుగా గుర్తుకొచ్చేది ఎద్దుల పందేలు. వెదురుకుప్పం మండలం జల్లికట్టుకు ప్రసిద్ధి. ఈ క్రమంలోనే మండలంలోని పచ్చికాపల్లం పంచాయతీ చిన్నపోటుచేనులో ఆదివారం ఎద్దుల పందేలు యువత కేరింతలు... రంకెలేస్తూ దూసుకు
సందడే సందడి చిన్నపోటుచేనుల్లో జరిగిన ఎద్దుల పందేలు కోలాహలంగా ముగిశాయి. పశువులకు పూజ చేసి ఈ పోటీలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎద్దుల పందేలకు వదులుతున్న సమయంలో యువకులు ఈలలు,కేకలు వేసుకుంటూ ఎద్దులపై వేసిన పలకలు తీసుకునేందుకు పోటీపడడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. జల్లికట్టును తిలకించేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎద్దుల పందేలను తిలకించారు. – వెదురుకుప్పం -
పూత కలవరం
అకాల వర్షాలు, తీవ్రమైన మంచు, చీడ పీడలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా సాధారణంగా నవంబర్, డిసెంబర్లో మామిడి పూత వస్తుంది. ఇప్పటి వరకు పూత రాకపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో పిందెలు రావాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలల్లో కాయలు కోతకు వస్తాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా గతేడాది తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు.. ఈ సారి ఇంకా పూత రాకపోవడంతో అందరిలోనే కలవరం మొదలైంది. విజయపురంలో పూతలేని మామిడి తోట విజయపురం : వాతావరణంలో మార్పులు మామి డి రైతులకు శాపంగా మారాయి. మోంథా తుపాన్ కారణంగా భూమిలో తేమ శాతం పెరిగింది. ఫలితంగా మామిడి చెట్లకు పూత రావడంలో ఆలస్యమవడంతో రైతులు కలవర పడుతున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి పూత వచ్చి, ఫిబ్రవరి, మార్చిలలో పిందెలు వచ్చేవి. కానీ డిసెంబర్ నెల చివరి వారం గడస్తున్నా ఇంత వరకు పూత జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మామిడి పూత కోసం రూ. లక్షలు వెచ్చించి రైతులు మందులను పిచికారీ చేయాల్సి వసతవస్తోంది. సూచనలు, సలహాలు ఏవీ? పంటల సీజన్లో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ఉద్యాన శాఖ(హార్టికల్చర్) ఆఫీసర్లు మామిడి తోటలను పట్టించుకోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. వచ్చిన పూత రాలకుండా, కొత్త పూత వచ్చేందుకు తీసుకోవాల్సి న సస్య రక్షణ చర్యలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో ఆ దిశగా చర్యలు ఎక్కడా కనిపించడం లేదని, పొలం–పిలుస్తోంది కార్యక్రమాల్లో ఎక్కడ కాని హార్టికల్చర్ అధికారులు కనిపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. దీంతో రైతులే సొంతగా మందులు పిచికారీ చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు మామి డి తోటలను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. లక్ష రూపాయల మందులు కొట్టించా.. నాలుగు ఎకరాల మామిడి తోట సాగు చేస్తున్నా. ఇప్పటి వరకు పూత సరిగా రాలేదు. ఇప్పటికే లక్ష పెట్టి క్లోరిఫై పాస్, సాఫ్ పొడి, ప్లానోఫాస్, మందులను చెట్లకు కొట్టించా. గతేడాది అనుకున్న దిగుబడి రాలే.. ఈసారైనా లాభాలు వస్తాయనుకుంటే పూతే లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – శరత్, మల్లారెడ్డికండ్రిగ, విజయపురం రైతులకు ఏటా కష్టాలే గత ఏడాదిలో దిగుబడి లేక చాలా నష్టపోయాం. ఈ ఏడాదైనా మంచి దిగుబడి వస్తే, అప్పులను తీర్చుకుంటామని అనుకొన్నా, కానీ ఇంత వరకు పూత లేకపోవడంతో ఆందోళనగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. – సురేష్ రాజు, వడమాలపేట -
కార్డన్ సెర్చ్ .. 58 వాహనాలు సీజ్
చిత్తూరు అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో చిత్తూరు, పలమనే రు, కుప్పం, నగరి సబ్–డివిజన్లలో పోలీసు లు కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు సరిగా లేని 57 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 200 లీటర్ల సారాను ధ్వంసం చేసి, వారి నుంచి రూ.13,835 జరిమానా వసూలు చేశారు. చిత్తూరు టూటౌన్ పరిధిలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నేరా లను ముందస్తుగా అరికట్టాలనే ఉద్దేశం, ప్రజ ల్లో భద్రతా ప్రమాణాలకు బలపరిచేలా చేయ డం, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే కార్డన్సెర్చ్ లక్ష్యమని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక వి.కోట : తిరుపతిలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో మండలంలోని నలంద విద్యాసంస్థల విద్యార్థి సంజయ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. స్కూల్ గేమ్స్ పెఢరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ –17 విభాగం రగ్బీ పోటీల్లో తమ పాఠఽశాలలో 9వ తరగతి చదువుతున్న సంజయ్ జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయ న పేర్కొన్నారు. -
కొత్త బాస్ టీం రెడీ
చిత్తూరు అర్బన్ : శ్రీస్పెషల్ బ్రాంచ్...శ్రీ జిల్లా పోలీసు శాఖలో కీలకమైన విభాగం. పోలీసుశాఖ పరిపాలనతో పాటు స్టేషన్లలో అధికారుల పనితీరు, రాజకీయ పార్టీల పనితీరు, నాయకుల తప్పటడుగులు, శాంతిభద్రతలు ప్రజలకు ప్రశాంతతను ఇస్తోందా..? గంజాయి, మాదక ద్రవ్యాలు, లాటరీ, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎస్పీకి చేరవేయాల్సిన బాధ్యతతో పనిచేయాల్సిన విభాగం స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ). తాము సేకరించిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎస్పీకు చేరవేయాలి. చిత్తూరు కొత్త ఎస్పీగా నాలుగు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడీ పనితీరుపై ఇలా ఉంటుందనే భావనపై ఇప్పటి వరకు స్పష్టమైన సంకేతాలు ఏవీ వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఆయన తొలుత ఎస్బీ విభాగంపై ఫోకస్ చేసి, దాన్ని ప్రక్షాళన చేశారు. జిల్లాలో ఏం జరుగుతున్నా తన దృష్టికి రావాల్సిందేనంటూ ఎస్బీ విభాగాన్ని ప్రక్షాళన చేసి, కొత్త టీంను నియమించుకున్నారు. వాస్తవాలు చేరితే సరి..! ఎస్బీ ప్రక్షాళన పూర్తవడంతో ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై బాధ్యత పెరిగిందనే చెప్పాలి. రాజకీయ పరిస్థితులు పక్కన పెడితే, సామాన్యులకు ఇబ్బందులు కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు ఎస్పీకి చెప్పాల్సిన అవసరం ఎస్బీ విభాగంపై పడింది. అందులోనూ కొత్త కూర్పుతో ఎస్బీను ఏర్పాటు చేసుకున్న ఎస్పీ ఎదుట వాస్తవాలను తప్పనిసరిగా ఉంచాల్సిందే. ఇప్పటికే జిల్లా కేంద్రంలో జరుగుతున్న లాటరీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపి, దీనికి వంత పాడుతున్న సొంతశాఖలోని కొందరిని సాగనంపడానికి విచారణ పూర్తి కావచ్చింది. ఇక గంజాయి, పేకాట క్లబ్బులు, కొన్ని స్టేషన్లలో న్యాయం కోసం వెళితే ప్రైవేటు వ్యక్తుల వద్దకు పంచాయతీలకు పంపడం లాంటి ఘటనలపై ఎస్పీ వాస్తవాలను తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అలా కాకుండా అధికారికి భయపడో, వాస్తవాలు చెబితే మన ఉనికికి ఇబ్బందా..? అని ఆలోచిస్తే ఎస్పీ నమ్మకం వమ్మువుతుంది. ముందుగా సొంత పోలీసుశాఖను సరిదిద్దుకుని ఆపై ప్రజలకు నమ్మకం కలిగించే దిశగా అడుగులు వేస్తున్న డూడీకు.. స్పెషల్ బ్రాంచ్ ఫీడ్ బ్యాక్ కచ్చితంగా ఇస్తారా లేదా.. షారా మామూలేనా ? అనేది వేచి చూడాల్సిందే. గతంలా ఉండొద్దని.. డూడీ రాక మునుపు ఎస్బీ విభాగంపై అవినీతి ఆరోపణలు లేకున్నా.. వాస్తవాలను అప్పటి ఎస్పీకి చేరవేయడంలో ధైర్యం చేయలేకపోయారనే అపవాదు ఉంది. ప్రధానంగా కానిస్టేబుళ్ల బదిలీల్లో పోలీసు కుటుంబాలు పడ్డ ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్న వాళ్లను, పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నవాళ్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడంపై దుమారం రేగింది. ఇక కొందరు అధికారులు దొంగల నుంచి డబ్బులు తీసుకుని వాటాలు వేసుకున్నారనే ఆరోపణలు, గుట్కా వాహనాల నుంచి మామూళ్లు, లింగ నిర్ధారణపై స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి నిందితులను పట్టించినా.. డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వాస్తవామా కాదా అనే విషయాన్ని గత పోలీస్ బాస్కు చెప్పడంలో ఎస్బీ సాహసం చేయలేదని నింద మిగిలిపోయింది. కొత్తగా వచ్చిన డూడీ.. అసలు జిల్లాలో ఏం జరిగినా తన నోటీసులో ఉండాల్సిందేనంటూ ఎస్బీని ప్రక్షాళన చేశారు. ఇక్కడ పనిచేసిన ఇన్స్పెక్టర్ మనోహర్ను డీసీఆర్బికు, ఎస్ఐ అనిల్ను డీటీసీకు బదిలీ చేస్తూ.. మురళీ మోహన్ను ఎస్బి పగ్గాలు అప్పగించారు. దీంతో ఈ విభాగంలో పారదర్శకత ఉంటుందని నమ్మకం ఉంచారు. -
‘కుట్టు’కు శఠగోపం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వేల మంది మహిళలు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణలో పాల్గొన్నారు. ఏడాది కిందట చంద్రబాబు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు.ఎమ్మెల్యేలు వెళ్లి ప్రచార ఆర్భాటం చేశారు. ఈ శిక్షణకు జిల్లాలో 9,514 మంది ఇప్పటి వరకు సొంత ఖర్చులతో శిక్షణ పొందారు. వారందరికీ చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చింది. పబ్లిసిటీ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చేతులు దులుపేసుకుంది. ఆర్థిక స్వావలంబనకు టోపీ చంద్రబాబు ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు టోపీ పెట్టింది. ఇంటి పట్టున ఉంటూ పనులను చక్కదిద్దుకుంటూ ఉపాధి పొందేలా అవకాశం కల్పిస్తా మని వేల మంది మహిళలను ఉచిత టైలరింగ్ శిక్షణ పేరుతో మోసగించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తమని చెప్పి నట్టేటముంచారు. ఉచితంగా శిక్షణ పూర్తి చేసిన వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వకుండా మోసగించారు. ఉచితంగా మిషన్లు ఇవ్వనప్పుడు శిక్షణ ఎందుకు ఇప్పించారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రా రంభంలో శిక్షణ పూర్తి చేశాక మహిళలకు ప్రభుత్వం ఉచితంగా మిషన్లు ఇస్తుందని ఎమ్మెల్యేలు ఆర్భాటంగా హామీలు ఇచ్చా రు. ఇప్పుడేమో ఆ హామీలన్నీ నీరుగారా యి. శిక్షణ పొందిన మహిళలకు కనిపిస్తే ఎక్కడ కుట్టు మిషన్లు అడుగుతారోనని ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి పర్యటనకు కనుమరుగయ్యారు. ఎప్పుడిస్తారు...ఎవరిని అడగాలి శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కు ట్టు మిషన్లు ఎప్పుడిస్తారు....ఎవరిని అడ గాలి అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉచితంగా శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు ఇవ్వకుండా మోసగించడం తగదని మహిళలు పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులు నోరు మెదపని పరిస్థితి. దీంతో మహిళలు కుట్టు మిషన్లు ఎప్పుడిస్తారు....ఎవరిని అడగాలనే సందేహంలో ఉన్నారు. ఒక్కరికీ ఉచిత మిషన్ ఇచ్చిందే లేదు..జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఉచిత టైలరింగ్ శిక్షణలో 9,514 మంది పాల్గొనగా, ఇందులో ఒక్కరికీ ఉచితంగా మిషన్ ఇచ్చింది లేదు. ఉచితంగా మిషన్ ఇవ్వకపోగా కనీసం ధ్రువపత్రం సైతం ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో ఈ శిక్షణలో పాల్గొన్న వేల మంది మహిళలను చంద్రబాబు సర్కారు మోసం చేసింది. శిక్షణలో పాల్గొన్న మహిళలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉచిత టైలరింగ్ శిక్షణ విషయంలో మోసగించిన చంద్రబాబు సర్కారుపై మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. -
అన్నదాతకు ఆసరా
కార్వేటినగరం : గ్రామీణ ప్రాంత ప్రజలకు పాడి పంటలే జీవనాధారం. ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనం, దళారుల మోసాలతో రైతులు వ్యవసాయంలో కష్టాలు చవిచూసినప్పుడు పాడి పశువులు అన్నదాతకు ఆసరాగా నిలిచి ఆదుకుంటున్నాయి. పశుపోషణలో రైతులు సరైన అవగాహన పెంచుకుంటే సంపద వృద్ధి చెందుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. పశు సంవర్థక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారుగా ఆవులు 4,67,507, గేదెలు 35,036, మేకలు 13,80,063, గొర్రెలు 4,38,362 ఉన్నాయి. ఉత్తమ జాతుల ఎంపిక మేలు పాడి పరిశ్రమలో అధిక లాభాలు పొందాలంటే మేలు జాతి పశువులను ఎంచుకోవాలి. అధిక పాలు ఇచ్చే మేలుజాతి ముర్రా గేదె, సంకర జాతి ఆవులను ఆ ప్రాంతాలకు తగ్గట్టు పశువుల జాతులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సంకర జాతి పశువులు ఎంపికకు ప్రాధాన్యం ఇస్తే అధిక లాభాలు సాఽధించవ చ్చు. పశువులకు సీజనల్గా సంక్రమించే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏదైన వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యులను సంప్రదించి చికిత్సలు అందించాలి.పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలు పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు, పశుదాణా, గడ్డిసాగు చేసే యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. రాయితీపై పశువుల కొనుగోలు, పశువుల పాక నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పాడి రైతు లు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధి చెందాలి. – డాక్టర్. ఉమామహేశ్వరి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిణి, చిత్తూరు -
అక్రమ గ్రావెల్పై జనం కన్నెర్ర
పుత్తూరు : తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలించే క్రమంలో వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ పాదచారుడిని ఢీకొట్టి ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలకుప్పం గ్రామస్తులు శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రమాదంపై ప్రశ్నించిన మరో వ్యక్తిపైనా దాడి చేసిన డ్రైవర్ తీరుతో ఆగ్రహించిన గ్రామస్తులు పలు టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరి స్థితి నెలకొంది. గ్రామస్తులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ రూరల్ పార్టీ ప్రెసిడెంట్ అన్నాలోకనాథం మాట్లాడుతూ.. ఆంధ్రా నుంచి తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు అతివేగంగా నడపడం ద్వారా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ మాఫియాపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో నడచివెళ్తున్న శివలింగం అనే స్థానికుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, ఒకవేళ జరగరాని ప్రమాదమే జరిగి ఉంటే ఆ కుటుంబానికి దిక్కెవరని ప్రశ్నించారు. పైగా డ్రైవర్లు, క్వారీ యాజమాన్యం వ్యవహార శైలి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. అధికారులు తక్షణం ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులు అక్రమ రవాణా చేస్తున్న క్వారీల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్తులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
పలమనేరు : పట్టణ సమీపంలోని టి.వడ్డూరు గ్రామ సమీపంలోని ఓ ఇంట్లో ఓ యువకుడు అనుమా నాస్పదంగా మృతి చెందిన ఘటన శనివా రం వెలుగు చూసింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా మండలంలోని నూనేవారిపల్లికి చెందిన జితేంద్ర (26)గా గుర్తించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమి కంగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా రెండు రోజుల కిందట ఇంట్లో గొడవపడి ఇంటి నుంచి ఇటువైపు వచ్చినట్టుగా సమాచారం. కాగా అతడి సోదరుడు సైతం కోతిగుట్ట హత్యాయత్నం కేసులో కొన్నాళ్ల కిందట అరెస్టు అయిన విషయం తెలిసిందే. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. యువకుడి ఆత్మహత్య కుప్పంరూరల్ : ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుప్పం మండలం, నూలుకుంటలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. నూలుకుంట గ్రామానికి చెందిన కాళీ (35) ఇటీవల ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా నిత్యం కుటుంబంలో కలహాలు చోటు చేసుకునేవి. శనివారం సాయంత్రం కాళీ ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కల్లు గీత కార్మికుడిగా పని చేసే కాళీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళపై యువకుడి దాడి వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం వేమాపురం గ్రామానికి చెందిన కిషోర్ (24) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మ అనే మహిళపై శనివారం దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరీష్ తెలిపారు. చోరీకి విఫలయత్నం పుత్తూరు : పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలోనే వరుసగా మూడు దొంగతనాలు జరగ్గా 105 గ్రాముల బంగారు నగ లు, 400 గ్రాముల వెండి ఆభరణాలను దుండగు లు దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము 2–30 గంటల ప్రాంతంలో స్థానిక నగరం రోడ్డులోని సూర్య ఎలక్ట్రికల్ దుకాణంలోకి ఓ దుండగు ప్రవేశించడానికి విఫలయత్నం చేశాడు. రాడ్ ను ఉపయోగించి రెండు తాళాలు విరగొట్టిన దొంగ మూడవ తాళం తొలగించలేకపోయాడు. దీంతో వెనుదిరిగాడు. ఉదయం షాపు వద్ద జరిగిన దొంగతనం ప్రయత్నాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దొంగ చిత్రాల ఫుటేజీని అందజేశాడు. దొంగతనాల నివారణకు రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
జీఎస్టీ స్కాం!
సాక్షి, టాస్క్ఫోర్స్ : చిత్తూరు కేంద్రంగా సాగుతున్న జీఎస్టీ స్కాం రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. అమాయకులైన పేదల ఐడీ కార్డుతో అధికార పా ర్టీకి చెందిన ఓ నేత అక్రమార్జనే ధ్యేయంగా రూ.కోట్లా ది రూపాయలు కొల్లగొడుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ అండతో అతడిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఎట్టకేలకు ఓ బాఽధితుడు బయటకు వచ్చాడు. నగరానికి చెందిన విజయచక్రవర్తి తనకు జరిగిన అన్యాయం పై ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, ఆర్థికశాఖ మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి, హోంమంత్రి, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్లకు తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం ముదురుతోంది. దీనిపై బాధితుడు కలెక్టర్కు సోమ వారం నేరుగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ముదురుతున్న వివాదం నగరానికి చెందిన విజయచక్రవర్తి 2018లో మదీన స్టీల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేశారు. ఆ సమయంలో వేతనం వేసేందుకు యజమాని అతడి ఆధార్, పాన్కార్డు, తదితర ఐడీ ఫ్రూప్స్ తీసుకున్నాడని బాధితుడు తెలిపాడు. తీరా 2019లో ప్రభుత్వ వైన్షాప్లో ఉద్యోగం రావడంతో అక్కడ పనిమానేశాడన్నారు. ఇటీవల అతడికి విడతల వారీగా మొత్తం రూ.42 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వచ్చాయన్నారు. గతంలో పనిచేసిన యజమానిని సంప్రదించగా తనపై వ్యాపారం చేశానని... అధికారులు మన గుప్పెట్లో ఉన్నారని , ఏమి భయపడవద్దని సర్దిచెప్పి పంపినట్లు చెప్పాడు. సమస్య తీరకపోవడంతో తిరిగీ యజమానిని సంప్రదించగా దురుసుగా ప్రవర్తించాడన్నారు. దీంతో ప్రధానమంత్రి నుంచి వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ వరకు మొత్తం 9 మందికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నోటీసులు ఎక్కడ ? ఇంత జరుగుతున్నా జీఎస్టీ అధికారులు అతడికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న తలెత్తుతోంది. చట్ట ప్రకారం రూ.5 కోట్లు పన్ను అక్రమాలకు పాల్పడితే జీఎస్టీ అధికారులు అరెస్టు వారెంటు నోటీసులు జారీ చేయవచ్చు. కానీ ఇంత వరకు ఈ స్కాం పై ఎటువంటి నోటీసులు జారీ చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో సైతం మనీలాండరింగ్ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదుల పై స్పందించిన కొందరు అధికారుల పై పోలీసు కేసులు, రాజకీయ పలుకుబడితో స్కాందారుడు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. తనకు సరుకు విక్రయించని వ్యాపారుల పై దౌర్జన్యాలకు దిగడం, లారీలో వెళుతున్న లోడ్ను ఆపేయడం, జీఎస్టీ అధికారులు విచారణకు పిలుస్తున్నారని లోడ్ను తీసుకెళ్లడం వంటి జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. సమగ్ర నివేదిక అధికారులు వీటిపై సమగ్ర రిపోర్టు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వాటిని రాష్ట్ర అధికారులతో పాటు ఈడీ, సీబీఐ, ఎన్ఐఏకు పంపనున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అండదండలు ఉండటంతో స్కాందారుడు తప్పించుకు తిరుగుతున్నాడని అధికారుల వాదన. దీంతో కేంద్ర అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నకిలీ కంపెనీల నుంచి రూ.118.70 కోట్లు జిల్లాలో పలు నకిలీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా రూ.118.70 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. వీటి ద్వారా ఐటీసీ కొల్లగొట్టినట్లు తెలుసుకున్నారు. లలిత ట్రేడర్స్ రూ.25.43 కోట్లు, ఆర్పీ ఎంటర్ప్రెజెస్ రూ.15.98 కోట్లు, తాజ్ ట్రేడర్స్ రూ.13.37 కోట్లు, మహాదేవ్ ఎంటర్ప్రెజెస్ రూ.9.54 కోట్లు, ఎంఎఫ్ ఎంటర్ప్రెజెస్ రూ.9.06 కోట్లు, ఐబీ ట్రేడర్స్ రూ.2.04 కోట్లు, రూ.2.16 కోట్లు, ఎఆర్ స్టీల్స్ రూ.3.11 కోట్లు, జెడ్ఎఫ్ ట్రేడర్స్ రూ.4.59 కోట్లు, ముజు మెటల్స్ రూ.5.73 కోట్లు, అబ్రార్ టుడే ఫ్యాషన్ మాల్ రూ.5.36 కోట్లు చేసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. ఇవే కాకుండా మరిన్ని కోట్లు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.రూ.400 కోట్లకు పైగా అక్రమాలు జీఎస్టీ స్కాం దాదాపు రూ.400 కోట్ల వరకు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దీని పై సమగ్ర రిపోర్టు సిద్ధం చేశారు. అమ్మకం, కోనుగోలు చేయకుండా ఐటీసీ క్లెయిమ్ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు వారి విచారణలో తేలింది. గతంలోనూ అక్రమ వ్యాపారంపై రూ.93 కోట్లు జరిమానా, పరిహారం చెల్లించాలని స్కాందారుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై అతడు హైకోర్టులో సవాల్ చేస్తూ కేసు వేశాడు. అది ఇంకా కొనసాగుతోంది. వంద మంది పేదల నుంచి ఐడీ ఫ్రూఫ్స్ సంపాదించి నకిలీ వ్యాపారాలు చేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. ముంబాయి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో లావాదేవీలు జరిపినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నారు. వందల కోట్లు సరుకు కోనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి స్టాక్ పాయింట్లో మాత్రం సరుకు లేదని తెలుసుకున్నారు. -
బాలికను మోసం చేసిన యువకుడు అరెస్టు
పాలసముద్రం : మండలంలో ఓ బాలికను గర్భిణిగా చేసిన యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు శనివారం నగరి డీఎస్పీ మహమద్ అజీజ్ తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ.. మండలంలోని వెంగళరాజుకుప్పం పంచాయతీ ఇందిరానగర్ ఆదిఆంధ్రవాడ గ్రామానికి చెందిన దినేష్ (19) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక శరీరర మార్పులను గమనించి ప్రశ్నించడంతో విషయం వారికి తెలియజేసింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దినేష్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ హనుమంతప్ప, ఎస్ఐ రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
ఏఎంసీ చైర్మన్ కారు బోల్తా
పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం బీసీ కాలనీ మలుపులో ఎస్ఆర్పురం ఏఎంసీ చెర్మన్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెరకు తోటలో బోల్తా పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. కేజే పురంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎస్ఆర్పురం ఏఎంసీ చెర్మన్ జయంతి గుండయ్య కారు మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారు పైకప్పు నుజ్జునుజ్జు అయినా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదన్నారు. కొందరు యువకులు పోలీసులు రాకముందే తోటలోని కారును బయటికి తీశారు. పోలీసులు ఏఎంసీ చెర్మన్ కారు అనడంతో వారు కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. -
అధికార మదంతో పచ్చనేతల దౌర్జన్యం
సాక్షి టాస్క్ఫోర్స్: తమ పార్టీ అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా.. తమది కాని భూమిని కబ్జా చేయొచ్చా.. ఎంతవరకు న్యాయం..కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడుకునే ప్రయత్నంలో బాధితులపైనే విచక్షణా రహితంగా కూటమి నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన గంగవరం మండలంలోని జరావారిపల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. కీలపట్ల పంచాయతీ జరావారిపల్లి గ్రామానికి చెందిన లేట్ వెంకటస్వామి పేరిట గత 1981వ సంవత్సరంలో సర్వే నెంబర్ 550/4లో విస్తీర్ణం 2.02 ఎకరాల భూమి రెవెన్యూ లెక్కల్లో నమోదై ఉంది. దీనికి సంబంధించిన పట్టా కూడా వెంకటస్వామి కుటుంబీకుల దగ్గర ఉందని చెబుతున్నారు. గత 1998వ సంవత్సరంలో వెంకటస్వామి మరణించడంతో అనువంశికంగా వచ్చే డీకేటీ భూమిని వెంకటస్వామి కుమారుడు చెంగల్రాయులు సాగు చేసుకుంటున్నాడు. అయితే ఆ భూమి తన తండ్రి పేరిటే రికార్డులో ఉంది తప్ప ఇన్నేళ్లు గడుస్తున్నా చెంగల్రాయులు పేరుపైకి పట్టా మార్చుకోలేదు. చెంగల్రాయులు కుటుంబీకులకు అనాదిగా వస్తున్న భూమిపై ఇదే పంచాయతీ గాంధీనగర్ గ్రామానికి చెందిన రెడ్డిశేఖర్ కన్ను పడింది. తమ భూమి ఆనుకునే ఈ భూమి కూడా ఉండటంతో భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని నిర్ణయించుకున్నాడు. గత ఐదేళ్ల కిందట భూమి తమదంటూ చెంగల్రాయులు కుటుంబీకులతో గొడవలు పడిన రెడ్డిశేఖర్ కుటుంబీకులు తీవ్రంగా గాయపరిచారు. అప్పట్లో బాధితులు పలమనేరు కోర్టును ఆశ్రయించగా బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ, పోలీసుల సమక్షంలో భూమిని సర్వే చేసి భూమిని శాశ్వతంగా చెంగల్రాయులు కుటుంబీకులకు అప్పగించారు. ఆ తరువాత భూమిలో మామిడి మొక్కలు నాటుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటంతో భూమిని మళ్లీ ఎలాగైనా కబ్జా చేయాల్సిందేనంటూ రెడ్డిశేఖర్ కంకణం కట్టుకున్నాడు. బాధితులను బెదిరింపులకు గురి చేసి భూమిలో ఉన్న మామిడి చెట్లను జేసీబీతో తొలగించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా అంతలోనే పోలీస్ స్టేషన్కు వచ్చిన రెడ్డిశేఖర్ ప్రభుత్వం మాది , మీరు పట్టించుకోవద్దు అంటూ పోలీసులను సైతం తమ ఎదుటే హెచ్చరించినట్టు బాధితులు తెలిపారు. రెవెన్యూ అధికారులు మాత్రం తమ సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోలేదంటూ వాపోయారు. అధికారులెవరు తమ సమస్యను పట్టించుకోకపోవడంతో భూమి వద్ద మామిడిచెట్ల తొలగింపును అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులు చెంగల్రాయులు, భూలక్ష్మి, సురేష్ ముగ్గురిపై రెడ్డిశేఖర్ కుటుంబీకులు విచక్షణారహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేసి గాయాలపాలు చేశారని తెలిపారు. దాడిలో గాయపడిన బాధితులు పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ భూమిని టీడీపీ నాయకుడు రెడ్డిశేఖర్ కబ్జా చేసి మామిడి చెట్లను తొలగిస్తుంటే అడ్డుకున్నందుకు తీవ్రంగా కొట్టినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంగల్రాయులు, కొడుకు సురేష్ -
వికసిత్ భారత్కు పిల్లలే పునాది
చిత్తూరు కలెక్టరేట్ : పిల్లలే వికసిత్ భారత్కు పునా ది అని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వీర్బాల్ దివస్ పోస్టర్లను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత భవిష్యత్తుకు మూలస్తంభాలైన బాలలను గౌరవించాలన్నారు. బాలల్లో స్ఫూర్తిని నింపేందుకు వీర్బాల్దివస్ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల వయస్సుకు అనుగుణంగా పెయింటింగ్, వ్యాసరచన, కథలు చెప్పడం, క్విజ్, గ్రూప్ చర్చలు, స్కిట్స్ వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 30వ తేదీ వరకు ర్యాలీలు, ఇతర అవగాహన కార్యక్రమాలు మండల స్థాయిలో చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కార్వే టినగరం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి పాల్గొన్నారు. శిశు మరణాలను కట్టడి చేద్దాం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో శిశు మరణాలు జరగకుండా చూద్దామని డీసీహెచ్ఎస్ పద్మాంజలి, డీఐఓ హనుమంతరావు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు శిశు మరణాలపై సిబ్బందిని విచారించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. గర్భిణుల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు విధిగా వారిని పర్యవేక్షించాలన్నారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తూ..మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. టీనేజీ గర్భిణులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. హైరిస్క్ కేసుల విషయంలో అలసత్వం వద్దన్నారు. ప్రసవం జరిగే వరకు గర్భిణులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నా రు. శిశు మరణాలను కట్టడి చేయడంలో క్షేత్రస్థాయిలోని వైద్య సిబ్బందే కీలకమని వారు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, వైద్యులు లత, భార్గ వ్, యోగేష్, రమ్య, అనూష, రోజారాణి, వెంకటేశ్వరి, మోహన్బాబు పాల్గొన్నారు. రేపు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. జిల్లాలో మొదటిసారి కార్యక్రమాన్ని సీఎండీ ఆదేశాల మేరకు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పై వినియోగదారులు సోమవారం ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేయాలని వివరించారు. 16 మంది వీఏఓలకు ఉద్యోగోన్నతులు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి జిల్లాలో 16 మంది వీఏఓ ( గ్రామ వ్యవసాయ సహాయకులు)లకు ఏఈఓలు(వ్యవసాయ విస్తరణ అధికారులు)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ...జిల్లా వ్యవ సాయశాఖ అధికారి మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి లభించిన అధికారులు 15రోజుల్లో కేటాయించిన స్థానంలో విధుల్లో చేరాలని ఆదేశాలిచ్చారు. -
భక్తిశ్రద్ధలతో పడి పూజోత్సవం
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లెలో బురుజుబండపై వెలసిన కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో పడి పూజోత్సవాన్ని శని వారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలోని పద్దెనిమిది మెట్లను వివిధ రకాల పుష్పాలు, నేతి దీపాలు, చందన, కుంకుమ, ఫలాలతో తీర్చిదిద్దారు. ఆలయ మేల్శాంతి నంబూద్రి నారాయణన్ కేరళ సంప్రదాయ పద్ధతులతో ప్రతి మెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అయ్యప్ప స్వాముల భజనలు భక్తులను అలరించాయి. పూజలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. అయ్యప్ప నామ స్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులకు ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి స్వర్ణలతమ్మ, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి కవితమ్మ, రేణుకమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, అమరనాథ రెడ్డి ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి (ఇన్సెట్) పూజల్లో ఎమ్మెల్యే కుటుంబీకులు ప్రత్యేక అలంకరణలో పడిమెట్లు -
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● డీఎంహెచ్ఓ సుధారాణి వార్నింగ్
అక్రమ స్కానింగ్లు, అబార్షన్లు చేస్తే కటకటాలే చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చట్టానికి విరుద్ధంగా అక్రమ స్కానింగ్లు, అబార్షన్లు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని డీఎంహెచ్ఓ సుధా రాణి మండి పడ్డారు. సాక్షి దినపత్రికలో వీటిపై వరుస కథనాలు ప్రచురితమయ్యా యి. కన్నింగ్ స్కానింగ్, అబార్షన్ల అనకొండలు, డెమో డమ్మీ అంటూ వరుస కథనాలతో వైద్య ఆరోగ్యశా ఖ అధికారులను కదిలించాయి. ఈ మేరకు ఓ ప్రకటను విడుదల చేశారు. అక్రమ స్కానింగ్పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామన్నారు. స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు. నిబంధనలు పాటించని, రికార్డులు సక్రమంగా నిర్వర్తించని సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఆర్ఎంపీ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అక్రమ అబార్షన్లకు పా ల్పడితే వైద్యులు, వారికి సహకరించే వ్యక్తుల ను జైలుకు పంపుతామని హెచ్చరించారు. అబార్షన్లు, అక్రమ స్కానింగ్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని డీఎంహెచ్ఓ వెల్లడించారు. నేడు విద్యుత్ బిల్ కేంద్రాలు పనిచేస్తాయ్ చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు అందుబాటులో ఉంటాయని ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్రావు తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు సెలవు రోజున కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వీరితో పాటు హెచ్టీ సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని కోరారు. 30న జెడ్పీ స్టాండింగ్ కమిటీ చిత్తూరు కార్పొరేషన్ : జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల 30న నిర్వహించనున్నట్లు చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 1–7 కమిటీ అంశాలు అయిన ఆర్థిక, ప్రణాళిక, పను లు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం అంశాలపై చర్చ ఉంటుందన్నారు. -
వైకుంఠ ఏకాదశికి పకడ్బందీ ఏర్పాట్లు
కాణిపాకం : వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం రోజున శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు దర్శనంలో లోటు లేకుండా చూస్తామని కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ తుషా ర్ డూడీ పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్ల పై శనివారం వారు సమీక్ష నిర్వహించారు. వారితో పాటు ఎమ్మెల్యే మురళీ మోహన్, ఈవో పెంచలకిషోర్, ఆలయ చైర్మన్ మణి నాయుడు కలసి వివిధ ప్రభుత్వ శాఖలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్తో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం జనవరి 1న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు వస్తారన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆల య అధికారులను ఆదేశించామన్నారు. డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల సంవత్సరాది జనవరి 01వ తేదీలలో సుమారు 60 వేల మందికి పైగా భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తు ల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆ మూడు రోజులు అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నామన్నారు. ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ.. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్రాఫి క్ సమస్య తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల పార్కింగ్ సంబంధించి స్థలం పరిశీలించామన్నారు. జిల్లా అధికారుల సమన్వయంతో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మె ల్యే, ఈవో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి, వరుస సెలవులు రావడంతో మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. రద్దీ పెరిగినా భక్తులకు సౌకర్యవంతమై న దర్శనం కలిగించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉదయం 2 నుంచి నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉభయదారులకు దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుందన్నారు. జనవరి 1న ఆర్జిత సేవలు, అంతరాలయ దర్శనం రద్దు చేశామని, రాత్రి 11 గంటల వరకు సామాన్య భక్తులు నిరాటంకంగా స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు. -
మార్కులు నమోదు చేయకపోతే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికలో విద్యార్థుల మార్కులను నమోదు చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని డీఈఓ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీ చేసిన షెడ్యూల్ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఈ ప్రణాళిక అమలులో విద్యార్థులకు నిర్వహించే పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. నమోదు చేయని వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. 331 పాఠశాలల్లో 13,065 మంది విద్యార్థుల మార్కులను మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేశారన్నారు. మిగిలిన పాఠశాలల్లో మార్కులను ఎందుకు అప్లోడ్ చేయడం లేదనే అంశం పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. క్షేత్రస్థాయిలో ఇందుకు కారణాలు పరిశీలించిన తర్వాత సబ్జెక్టు టీచర్లపై చర్యలు చేపడుతామని డీఈవో హెచ్చరించారు. -
సాధారణ సాగే కష్టమై
ఏఎంసీ చైర్మన్ కారు బోల్తా ఎస్ఆర్పురం ఏఎంసీ చైర్మన్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కారు ధ్వంసం అయింది.ఈ ఏడాది రబీ సాగు అంత ఆశా జనకంగా లేదు. వరుస తుపాన్ల కారణంగా ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రబీ సాగు అనుకున్నంత ముందుకు సాగడం లేదు. రబీ ప్రారంభమై రెండున్నర నెలలు దాటినా అతి కష్టంపైన సాధారణ సాగులో 40 శాతం దాటింది. గతేడాది ఈ సమయానికి సాధారణ సాగు 28586 హెక్టార్లకుగాను జిల్లాలో 24877 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా ఈ ఏడాది అదే సమయా నికి 11570 హెక్టార్లు మాత్రమే సాగయింది. ప్రస్తుతం వేరుశనగ, మొక్కజొన్న, మినుములు వేసుకునేందుకు అవకాశం ఉన్నా ముందుకు సాగడం లేదు. దీంతో రైతన్నల్లో నిరాశక్తి అలుముకుంది. -
కుప్పం నియోజకవర్గంలో కీచకపర్వం
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన 10 రోజుల అనంతరం వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.కుప్పం పోలీస్ స్టేషన్లో బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. కుప్పం మండలం ఎన్. కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి గ్రామంలో ఘటన జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.విషయం బయటకు చెప్తే.. తన కుటుంబాన్ని అంతం చేస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలి భర్త తెలిపారు. దీంతో నా భార్య విషయం బయటకు చెప్పలేక 10 రోజులుగా మానసికంగా కుంగిపోయింది. నన్ను చంపేస్తామని, నా పిల్లలని చంపుతామని నా భార్యను బెదిరించారు’’ అని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. -
కాకినాడ టూ శబరిమల!
నగరి : కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కి.మీ పాదయాత్ర చేసి అయప్ప స్వామివారిని దర్శించుకోవడం వారి భక్తి పారవశ్యాన్ని చాటిచెబుతోంది. తూర్పుగోదావరి జిల్లా, తణుకు మండలం, మండపాకం గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ, రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానీశంకర్ (44) 18 ఏళ్ల నుంచి తమ యాత్రలను కొనసాగిస్తున్నారు. అర్జున్స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవానీశంకర్ కన్నిస్వామిగా మాలధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. ఇరువురూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఏడాది మళ్లీ ఇద్దరూ కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీశంకర్ 18వ సారి, అర్జున్ స్వామి 36వ సారి యాత్రను కొనసాగించారు. వారి పాదయాత్ర శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భవానీశంకర్ నవంబర్ 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్స్వామి డిసెంబర్ 4న తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు వివరించారు. -
వదిలేశారా?
మైనింగ్ శాఖలో వసూళ్ల దందా దుమారం రేపుతోంది. సర్వం సత్యం జగత్ మయవుతోంది. కాసులు కురిపించేవారిని అందలం ఎక్కిస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై బదిలీ వేటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు జీఎంలపై బదిలీ వేటు పడింది. ఇక్కడే ఏళ్లుగా పాతకుపోయిన కలెక్షన్ కింగ్లను మాత్రం అలాగే వదిలేశారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో 400 క్వారీలున్నాయి. వీటిలో ప్రస్తుతం 150పైగా నడుస్తున్నాయి. అక్రమంగా 140 వరకు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా కూటమి నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. కుప్పం, పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి, చిత్తూరు, జీడీనెల్లూరు, ఎస్ఆర్పురం, పాలసముద్రం, వెదురుకుప్పం, గుడిపాల మండలాల్లో ఈ అక్రమ క్వారీలు పుంజకుంటున్నాయి. వీటి నుంచి కోట్ల విలువ చేసే గ్రానైట్ దిమ్మెలు సరిహద్దులు దాటుతున్నాయి. అయినా పట్టించుకునే వారు కరువుతున్నారు. జిల్లాలో ప్రధానంగా అక్రమ మైనింగ్ పుంజుకుంటోంది. కొందరు కూటమి నేతలు ఇసుక, మట్టి, గ్రానైట్ విచ్చలవిడిగా తవ్వేసుకుంటున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ అక్రమాలకు ఆ శాఖలోని కొందరు అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. అక్రమ మూలాలు నేర్పించి రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకుంటున్నారు. అనుమతులు లేకుండా క్వారీలు తవ్వుకోవడం, తప్పుడు పత్రాలతో గ్రానైట్కు అనుమతులు ఉన్నాయని చెప్పడం, తవ్విన గ్రానైట్ దిమ్మెలను కొలతలు వేసి జిల్లాతో పాటు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విక్రయించేకునేలా చేయడం, సరిహద్దులు దాటించడం, అక్రమ క్వారీలను పట్టుకుంటే.. బండి వదిలి పెట్టేలా చేయించడం, దొంగ బిల్లులు ఇవ్వడం, సంఘం పేరుతో బిల్లులు ఇప్పించడం, పోలీసులు, విజిలెన్స్, ట్రాన్స్ఫోర్ట్, సేల్స్ ట్యాక్స్ వారు టచ్ చేయకుండా కంటి రెప్పలా కాపాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొత్త దరఖాస్తులు వస్తే.. పిండుకుంటున్నారనే ఆరోపణులున్నాయి. స్కెచ్ గీస్తే ఒక రేటు, ఫైల్లో సంతకం పెడితే మరో రేటు, బండి కదలలాంటే ఇంకో రేట్ ఫిక్స్ చేసి దండుకుంటున్నట్టు సమాచారం. మంత్రి బంధువుగా చెప్పుకుంటున్న ఓ అధికారి అంటకాగుతున్న వారిని అంటిపెట్టుకుని ఈ దందా నడిపిస్తున్నారని ఆ శాఖలోని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లాలో అక్రమ క్వారీల నిర్వహణలో ఓ ద్వితీయ స్థాయి అధికారి పాత్ర అంత్యత కీలకమని తెరపైకి వచ్చింది. సాక్షిలో వచ్చిన వరుస కథనాలకు ఆ అధికారిపై విచారణ కూడా జరిగింది. విజిలెన్స్ అధికారులు కూడా జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలు సమర్పించుకున్నారు. ఆపై సీఎంఓ ఆఫీసు నుంచి విచారణ కూడా జరిగింది. ఈ దెబ్బతో కొన్ని అక్రమ గనులు మూసుకున్నాయి. కానీ ఓ అధికారి అక్రమాలకు అడొచ్చిన వారిపై పగబట్టారు. తమకు సహకరించకుండా..ప్రశ్నించే గొంతుపై కత్తి పెట్టారు. పలమనేరు, చిత్తూరు జీఎంలపై బదిలీ వేటు వేయించారు. ఈ బదిలీ వెనుక ముగ్గురు ప్రజాప్రతినిధులున్నారని ఆ శాఖలోని అధికారులు చర్చించుకుంటున్నారు. కానీ పైసా వసూల్ పైచేయిగా ఉన్న అధికారిని మాత్రం వదిలిపెట్టేశారు. దీనిపై ఓ వర్గంలోని కూటమి నేతలు భగ్గుమంటున్నారు. మళ్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పుకొస్తున్నారు. కాగా త్వరలో జిల్లా శాఖలో మరో ఇద్దరిపై బదిలీ వేటు పడనుందని సమాచారం. జిల్లా మైనింగ్శాఖలో సత్యం జగత్ వసూళ్ల సీన్ ఇదీ జరుగుతోంది! -
అలరించి..ఆలోచింపజేసి!
సదుం: ఓ చిన్నారి ముద్దులొలికే మాటలతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఆలపించిన గీతం సోషయల్ మీడియాలో వైరల్గా మారింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మండలంలో పర్యటించారు. పాలమందలో పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకుడు విజయరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుమార్తె భువిక్షరెడ్డి పెద్దిరెడ్డిపై ఓ గీతాన్ని ఆలపించారు. ఆయన ప్రజలకు అండగా ఉంటారని.. అయ్యప్ప ఆలయాన్ని కట్టించారంటూ అందరినీ ఆలరించేలా ఆలపించారు. ఆ చిన్నారిని పెద్దిరెడ్డి ఆప్యాయంగా అభినందించారు. ఈ గీతాన్ని సోషయల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ చిన్నారి కలికిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతోంది. మద్యం సీజ్ – ఇద్దరి అరెస్ట్ పుంగనూరు: చట్ట వ్యతిరేకంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను, మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కెవి.రమణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఐ సుబ్బరాయుడుకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. పట్టణ సమీపంలో నక్కబండలో కేశవ అనే వ్యక్తి తన చిల్లర అంగడిలో మద్యాన్ని పెట్టుకుని విక్రయిస్తున్నట్టు తెలిసి దాడులు నిర్వహించామన్నారు. అలాగే ఈడిగపల్లె సమీపంలోని శక్తి డాబా వెనుక నుంచి శ్రీనివాసులు అనే వ్యక్తి మద్యాన్ని సరఫరా చేస్తుండగా అతనిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వీరిద్దరి వద్ద నుంచి 76 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, ఇరువురునీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి చిత్తూరు కలెక్టరేట్ : కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాల సూపరింటెండెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూపరిషత్ జిల్లా అధ్యక్షుడు పట్నం సురేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం డీఈవో రాజేంద్రప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ప్రత్యక్ష ప్రోద్భలంతోనే మత ప్రచారం, బలవంతపు ప్రార్థనలు, వసతి గృహంలో మత మార్పిడులు, బయట వ్యక్తుల ప్రవేశం జరుగుతోందన్నారు. దీనిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
డెమో డమ్మీ?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో డెమో విభాగం డమ్మీ అవుతోంది. స్కానింగ్ సెంటర్ల పర్యవేక్షణను విస్మరించింది. డెకాయ్ ఆఫరేషన్ను గాలికొదిలేసింది. సెంటర్ నిర్వాహకులతో కుమ్మకై బాధ్యతలను పట్టించుకోకుండా పోయింది. ఓ అధికారి పర్యవేక్షణకు వెళ్లొద్దని హుక్కుం జారీ చేయడంతో ఆె విభాగానికి జ్వరమొచ్చింది. కార్యాలయానికి అతుక్కుపోయి.. విధులను పట్టాలెక్కించింది. తీరా కలెక్టర్ ఆదేశించినా.. డెకాయ్ ఆఫరేషన్కు ముందడుగు పడనంటోంది. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డెమో విభాగం ఉంది. ఈ విభాగంలో పీసీపీఎన్డీటీ నోడల్ ఆఫీసర్తో పాటు ఐదుగురు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షించడం, డెకాయ్ ఆఫరేషన్ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా వారు పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కన్నెత్తి చూడం! జిల్లాలో 700పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో చాలావరకు నియమనిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నా.. కొన్ని అక్రమాలకు పదును పెడుతున్నాయి. ఒక దానికి అనుమతి తీసుకుని మరో మిషన్ పెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పాత బడిన మిషన్లను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయించేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. దేవుళ్ల బొమ్మలను చూపించి లింగాలను బయటపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా ఈ దందా జోరుగా నడుస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు ఆ శాఖలోని పలువురి సహకారం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వీరు స్కానింగ్ గుట్టు బయటకు పొక్కకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొందరు అధికారులు మండిపడుతున్నారు. అక్రమంగా వెలిసిన స్కానింగ్ సెంటర్లకు కూడా కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో డెమో విభాగం మూగబోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుర్చీలకు అతుక్కుపోయారు! అక్రమ స్కానింగ్ సెంటర్ల ఆట కట్టించాల్సిన అసలైనా అధికారులు కుర్చీలకు అతుక్కుపోయారు. బయటకు కదలకుండా పీసీపీఎన్డీటీ నోడల్ ఆఫీసర్కు సంకెళ్లు పడేశారు. గుడిపాల మండలం బొమ్మసముద్రంలో జరిగిన ఓ అబార్షన్పై ఆ అధికారి తోటపాళ్యంలోని ఓ స్కానింగ్ సెంటర్పై తనిఖీ చేశారు. తనిఖీ చేసినందుకు అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. తనకు తెలియకుండా ఎలా తనిఖీ చేస్తావంటూ ఓ పెద్ద స్థాయి అధికారి చురకలు పెట్టడం గమనార్హం. దీంతో స్కానింగ్ సెంటర్ల పర్యవేక్షణ గాడితప్పింది. అప్పటి నుంచి అడ్డదిడ్డమైన స్కానింగ్లు, అబార్షన్లు జరుగుతున్నా డెమో విభాగం మిన్నకుండిపోతోంది. కలెక్టర్ ఆదేశించినా డెకాయ్ ఆఫరేషన్ వైపు శాఖ కదలడం లేదు. ఆ విభాగానికి సంబంధించిన ఒకరిద్దరూ అధికారులను కదిలిస్తే.. మాకు ఎందుకొచ్చిన తంట.. అని వెనకడుగు వేస్తున్నారు. స్కానింగ్ సెంటర్లపై తనిఖీ చేస్తే.. ఆ అధికారి నుంచి ఇబ్బందులు తప్పవని భయపడుతున్నారు. ఆరోపణలు ఇలా.. జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై పూర్తిగా నిఘా కొరవడుతోంది. అసలు ఆ సెంటర్లను పట్టించుకునే వారే కరువయ్యారు. కొందరు వసూళ్ల మత్తులో పడి తనిఖీచేయడం లేదని అంటున్నారు. ఆ శాఖలో ఓ సిబ్బంది దళారీగా వ్యవహరించి.. వసూళ్ల పర్వాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం. ఒక వేళ తనిఖీకి వెళ్లినా ముందస్తు సమాచారం ఇచ్చేస్తూ.. కంటికి రెప్పలా కాపాడుతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. జిల్లాలో అధ్వాన్నంగా డెమో విభాగం -
ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి
పుంగనూరు: తప్పుడు కేసులు, భూదోపిడీలు, భూ కబ్జాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పుంగనూరు మండల పర్యటనలో భాగంగా కొత్తపల్లె వద్ద ఆయన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సభ్యులతో సమావేశమయ్యారు. ఐటీ వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ భాస్కర్, రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్పూసపాటి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయపాల్, జాయింట్ సెక్రటరీ వేణు, అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ శివ, ఉపాధ్యక్షులు ప్రవీన్, జయచంద్ర, ఉమ్మడి జిల్లాల ఐటీవింగ్ ఇన్చార్జ్ ప్రకాష్రెడ్డి, పార్టీ జిల్లా యూత్ వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డితో పలు విషయాలపై చర్చించారు. టీడీపీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలు, తప్పుడు కేసులు, భూకబ్జాలు, దోపిడీల పై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనపై కూడా ప్రజలకు అవగాహన కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించారు. -
ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్
తిరుపతి సిటీ: ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిగా నిలిచి ప్రశంసలు పొందుతోందని వక్తలు కొనియాడారు. జాతీ య సంస్కృత యూనివర్సిటీలో శుక్రవారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వల న చేసి, ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత్ గొప్పతనం, సాంస్కృతి సంప్రదాయాలు, విజ్ఞానాన్ని, లక్ష్యాలను, ప్రగతిని చాటి చెప్పేందుకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం సరైన వేదిక అని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరుసార్లు భారతీయ విజ్ఞాన సమ్మేళం నిర్వహించామని, తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత తొలిసారి సమ్మేళనం నిర్వహించడం శుభపరిణామని తెలిపారు. ఈ సందర్భగా సమ్మేళానికి హాజరైన సీఎం, ఆర్ఎస్ఎస్ చీఫ్, అతిథులను వర్సిటీ అధికారులు ఘనంగా సన్మానించారు. తరువాత సమ్మేళనంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు పరిశీలించి అభినందించారు. కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు సమగ్ర వికాసానికి భారతీయ చింతన అనే భావంతో ఎన్ఎస్యూ, కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మేళనానికి సుమారు 1,250 మంది ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ ఔనత్యాన్ని చాటిచెప్పేలా పలు అంశాలపై వారు ఈ సమ్మేళనంలో పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం సమ్మేళనం ప్రారంభం అనంతరం వర్సిటీలోని చెలికాని అన్నారావు భవన్లో ఎన్ఎస్ఏబీ సభ్యులు, మాజీ డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్ విజ్ఞాన్ సమ్మేళనంపై ప్రత్యేక ప్లీనరీ సెషన్ నిర్వహించారు. అనంతరం డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రిక కౌషిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లాలోని పలు పాఠాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజ్ఞాన సమ్మేళనాన్ని తప్పక వీక్షించాలి తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత యూనివర్సిటీలో నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని విద్యార్థులు తప్పక వీక్షించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. శుక్రవారం వర్సిటీలో ప్రారంభభమైన కార్యక్రమాన్ని ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మేళనంలో ఎగ్జిబిషన్ స్టాళ్లు, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని, ఇవి విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, పరిశోధనాత్మక దృష్టిని మరింత పెంపొందించేలా ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల నుంచి ప్రతిరోజు 3 వేల మంది విద్యార్థులు, వారితోపాటు ఉపాధ్యాయులు, సందర్శించడానికి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని మిగిలిన అన్ని మండలాల నుంచి వీలున్న ప్రతి ఒక్కరూ తప్పక విచ్చేసి ఈ ప్రదర్శనను వీక్షించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. -
వేగంగా కేసుల పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో మోహన్కుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ కోర్టుల్లో నమోదైన కేసుల పట్ల అధికారులు అలసత్వం వహించకూడదన్నారు. ఎప్పటికప్పుడు కోర్టు కేసులపై స్పందించాలన్నారు. పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. 24 గంటల్లోపు ప్రతి అర్జీనీ ఓపెన్ చేసి పరిశీలించాలన్నారు. కరెంట్ సమస్యల పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో 116 సమస్యలను పరిష్కారించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా 11 కేవీ లైన్ సమస్యలు 404లో 50 పరిష్కరించామని, ఎల్టీ లైన్, సర్వీసు లైన్ పరంగా 490 సమస్యలు రాగా అందులో 66 పరిష్కారించినట్టు వెల్లడించారు. ఇంటింటా ఫీవర్ సర్వే చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మాపాక్షిలోని గాజులపల్లెలో శుక్రవారం వైద్య సిబ్బంది ఇంటింటా ఫీవర్ సర్వే చేశారు. గ్రామంలో అబేట్ పిచికారీ చేశారు. జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ జ్వరాల కేసులపై ఆరా తీశారు. స్క్రబ్ టైఫస్ కేసుల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది రామకృష్ణ, నారాయణ, రాణి, హేమలత, సరసమ్మ తదితరులు పాల్గొన్నారు. జనవరి 5 నుంచి ఎఫ్ఏ–3 పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో జనవరి 5 నుంచి ఫార్మేటీవ్ అసెస్మెంట్–3 (ఎఫ్ఏ–3) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీచేశారు. ఆ షెడ్యూల్ మేరకు జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 5వ తరగతి వరకు జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 72,255 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,154 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంట ల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇది లా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది. కల్కి ట్రస్టు ఆక్రమిత భూములపై విచారణకు ఆదేశం వరదయ్యపాళెం: కల్కిట్రస్టు పరిధిలో ఆక్రమిత అటవీ, ప్రభుత్వ డీకేటీ భూముల వివరాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు సూళ్లూరుపేట ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేస్తూ బీఎన్కండ్రిగ, వరదయ్యపాళెం మండల తహసీల్దార్లకు ఉత్తర్వులు పంపారు. ఇటీవల కల్కి ట్రస్టు భూముల ఆక్రమణపై భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్ని వెంకటసుబ్బయ్య, అటవీశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ మేరకు అంజూరు అటవీ ప్రాంతంలో 21 ఎకరాలు, అలాగే వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ప్రభుత్వ డీకేటీ భూముల ఆక్రమణ గురించి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా పెల్లేటి కోట: రాష్ట్ర హైకోర్టు కేంద్రప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా పెల్లేటి రాజేష్కుమార్ను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజేష్కుమార్ తిరుపతి జిల్లా, గూడూరు నియోజకవర్గం, కోటకు చెందిన సీనియర్ న్యాయవాది పెల్లేటి గోపాల్రెడ్డి కుమారుడు. రాజేష్కుమార్ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించినట్లు ఆయన తండ్రి గోపాల్రెడ్డి తెలిపారు. -
బాబు తప్పుడు విధానాలే గెలిపిస్తాయి!
పుంగనూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలు, తప్పుడు హామీలతో ప్రజలు విసిగిపోయి వైఎస్సార్సీపీ సమావేశాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారని, వైఎస్సార్సీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయమని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరు మండలంలో శుక్రవారం ఎంపీ రెడ్డెప్పతో కలసి పెద్దిరెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లరాళ్లపల్లె గంగమ్మగుడి వద్ద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో అనేక అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించారని మండిపడ్డారు. మోసాలు చేసి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మేరకు సూపర్–6 ఎక్కడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న ఘనత టీడీపీదేనని ఆరోపించారు. అథోగతిపాలవుతున్న రాష్ట్రాన్ని తిరిగి కాపాడే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి భుజస్కంధాలపై వేసుకోవాలని అవసరం ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి అన్ని హామీలు నేరవేర్చారని గుర్తుచేశారు. రెండేళ్లు కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాటను తూచ తప్పకపాటించారని కొనియాడారు. రెండేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలు గ్రహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్సార్సీపీని గెలిపించే పరిస్థితులను చంద్రబాబు, ఆయన కోటగిరీ రాష్ట్రంలో చేపట్టడం అభినందనీయమన్నారు. ఎంపీపీ భాస్కర్రెడ్డి, పీకేఎం ఉడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, శ్రీనాథరెడ్డి, జిల్లా యూత్వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, ఉమ్మడి జిల్లా ఐటీవింగ్ ఇన్చార్జ్ ప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు -
ఇదెక్కడి రూల్స్ సామీ!
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. తాము చెప్పిందే వేదమని.. అలాగే నడుచుకోవాలని అధికారుల మెడపై కత్తిపెడుతున్నారు. ఏ మాత్రం అతిక్రమించినా అందరి ఎదుటే వారిపై చిందులు తొక్కడం.. బదిలీ వేటు వేయడం ఇట్టే అలవాటు చేసుకుంటున్నారు. ఇలాంటిదే కుప్పం రెస్కోలో అమలు చేస్తున్నారు. కొత్త విద్యుత్ మీటర్ తీసుకోవాలంటే కూటమి నేతల నుంచి సిఫార్సు లేఖ ఉండాలని హుకుం జారీచేశారు. లేకుంటే కొత్త విద్యుత్ మీటరు ఇవ్వరాదని అధికారులను హెచ్చరిస్తున్నారు. సిఫార్సు లేఖలు సంపాదించలేక.. కూటమి నేతలను ప్రసన్నం చేసుకోలేక సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు తిరిగి తిరిగి అలసిపోతున్నారు. కుప్పం: పరిపాలన పరంగా రాష్ట్రమంతా ఒక విధానాన్ని కొనసాగిస్తుంటే.. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మాత్రం మరో విధంగా ముందుకెళ్తున్నారు. ఇక్కడ కూటమి నేతలు చెప్పిందే వేదంగా అధికారులు సైతం నడుచుకుంటున్నారు. వారి అడుగులకు మడుగులొత్తుతూ పేదల సమస్యలను గాలికొదిలేస్తున్నారు. కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో) పరిధిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఎవరైనా కొత్తగా విద్యుత్ మీటర్ కావాలంటే స్థానికంగా ఉన్న కూటమి నేతల సిఫార్సు లేఖ తీసుకురావాలి. లేదంటే వారి వద్ద నుంచి అధికారులకు ఫోన్లు చేసి చెప్పారు. ఈ నిబంధనను రెస్కోలో తప్పనిసరి చేశారు. సాధారణంగా విద్యుత్ మీటర్ కోసం స్థానికంగా ఉన్న సచివాలయంలో నమోదు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ నోఅబ్జెక్షన్ (ఎన్ఓసీ) సర్టిఫికెట్తో పాటు సంబంధిత అధికార పార్టీ నేతల సంతకాలు తప్పని సరిగా ఉండాలని రెస్కోలో పనిచేస్తున్న పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి లైన్మన్ల వరకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. రెస్కోలో విద్యుత్ మీటర్కు నగదు చెల్లిస్తే మీటర్ను సంబంధిత సిబ్బంది అందిస్తారు. దీనిపై స్థానిక నాయకుల సంతకాలు ఎందుకో అర్థం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. 1 కేవీ విద్యుత్ మీటర్కు 1,700 చెల్లించాలి. దీని ప్రకారం ఎన్ని కేవీలు కావాలంటే అంత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. దీనికి స్థానికంగా ఉన్న నాయకుడి సంతకం ఎందకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని విస్మరించినందుకు గత నాలుగు రోజు క్రితం మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఓ టీడీపీ నేత సబంధిత రెస్కో ఉద్యోగిపై చిందులు తొక్కినట్టు సమాచారం. తమకు తెలియకుండా విద్యుత్ మీటరు ఎలా ఇస్తారంటూ నిలదీసినట్టు తెలుస్తోంది. ఇది పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో సైతం ఈ కొత్త రూల్ అమలు చేస్తున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. కుప్పంలోని రెస్కో సంస్థ పాలన గాడి తప్పుతోంది. గతంలో ఇక్కడ పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) బదిలీపై వెళ్లారు. ఆయన వెళ్లి ఆరు నెలలవుతున్నా ఇంతవరకు ఆ పోస్టును భర్తీ చేయలేదు. రెస్కో పాలనపై ప్రస్తుతం ఉన్న పాలకవర్గం పట్టుకోల్పోయింది. దీంతో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. పాలకవర్గ సభ్యుల్లో సైతం సమన్వయం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెస్కో ఎండీ పోస్టుకు పోటాపోటీ కుప్పం రెస్కో సంస్థ ఎండీ పోస్టుకు తీవ్రమైన పోటీ నెలకొంది. సాధారణంగా ట్రాన్స్కో నుంచి సీనియర్ ఇంజినీరింగ్ అధికారిని ఎండీగా నియమిస్తారు. దీంతో పలువురు ఆశావహులు పోటాపోటీగా తమ ప్రయత్నాల్లో మునిగితేలుతున్నట్టు సమాచారం.గాడితప్పిన రెస్కో పాలన సిఫార్సు లేఖ ఉంటేనే కొత్త విద్యుత్ మీటర్ కొత్త విద్యుత్ మీటర్ కావాలంటే ఎందుకో ఇలా.. -
పలమనేరులో రెచ్చిపోయిన కూటమి నేతలు
చిత్తూరు జిల్లా: పలమనేరు నియోజకవర్గంలో కూటమి నేతలు రెచ్చిపోయారు. దారి ఇవ్వలేదని కారణంతో కొబ్బరి చెట్లను కూటమి నేతలు నరికేశారు. బైరెడ్డి పల్లి మండలం మిట్టపల్లిలో ఘటన జరిగింది. నాగిరెడ్డిపల్లికి చెందిన మురుగేశ్ శెట్టి, కిషోర్, జనార్ధన్, నాగరాజు శెట్టి, రాజా, మోహన్, శంకర్లు గురువారం అర్థరాత్రి కొబ్బరి చెట్లను నరికి వేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.హైకోర్టు పరిధిలో విచారణలో ఉండగా తమపై దాడి చేసి.. కొబ్బరి చెట్లు ధ్వంసం చేశారని.. తమ ప్రాణాలకు రక్షణ లేదని మిట్టపల్లికి చెందిన సంపంగి, కృష్ణప్ప, రుద్రప్ప, వేణుగోపాల్ బాధితులు అంటన్నారు. -
మేం వచ్చాక అన్నీ సరిచేస్తాం: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పుంగనూరు నల్లరాళ్లపల్లై గంగమ్మ గుడి సీసీ రోడ్డును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పట్ల ప్రజలు విసిగి పోయారని.. అసంతృప్తితో ఉన్నారన్నారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన ఉచిత హామీలు నమ్మిన ప్రజలు.. ఓట్లు వేసి మోసపోయారు. అబద్ధపు హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు. వైఎస్ జగన్ ఐదేళ్లు పాలన ఎలా ఉంది, చంద్రబాబు ఏడాదిన్నర పాలనపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. చంద్రబాబు వైఫల్యాలే వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుంది. కూటమి ప్రభుత్వం తప్పులు మీద తప్పులు చేస్తోంది. మేం వచ్చాక అన్నీ సరిచేస్తాం’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. -
అనుభవించక తప్పదు
చేసిన పాపాలు సోమల(సదుం): కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలను భవిష్యత్లో అనుభవించక తప్పదని, బాబు నీచరాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటరు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. సోమల మండలంలో గురువారం వారు విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన నాయ కులు చేసిన తప్పిదాలు, అరాచకాలను సైతం వైఎస్సార్ సీపీపై నెట్టేసి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. చేసిన పాపాలను రానున్న రోజుల్లో అనుభవించక తప్పదని హెచ్చరించారు. గత ప్రభుత్వ పాలనలో అమలు చేసిన పలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రస్తుతం నిలిపివేశారని, ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేక చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పేదలకు వైద్యం, విద్యను దూరం చేసే ఈ విధానంపై ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. మైనారిటీల సంక్షేమానికి కృషి సోమల: ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మైనారిటీలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఎంపీ మైనారిటీలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే, ఎంపీ తెలిపారు. సోమల ఈద్గా వద్ద మైనారిటీలతో సమావేశం నిర్వహించారు. ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ ఈశ్వరయ్య, నాయకులు అమాసమోహన్, గంగాధర్రాయల్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సరస్వతమ్మ, వైస్ ఎంపీపీలు ప్రభాకర్, సయ్యద్బాషా, కల్యాణ భరత్, దామోదరరాజు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం..నిరుపయోగం
అరగొండ బాలికోన్నత పాఠశాలలో సమస్యల తిష్ట అరగొండలో నిరుపయోగంగా ఉన్న బాలికల హైస్కూల్ అదనపు తరగతి గదులు, ఆట స్థలంలో పిచ్చిమొక్కలు తవణంపల్లె: మండలంలోని అరగొండ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అరగొండ బాలికోన్నత పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడ 193 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియెట్లో 20 మందిదాకా చదువుతున్నారు. హైస్కూల్ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. నీటి సరఫరా సైతం సక్రమంగా లేదు. 20 ఏళ్ల క్రితం జెడ్పీ నిధులతో నిర్మించిన మూడు తరగతి గదులు, ఆట స్థలం, మరుగు దొడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. వీటి చుట్టూ ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. రోడ్డు దాటలేకనే.. అరగొండ బాలికోన్నత పాఠశాలకు రెండు ప్రదేశా ల్లో సుమారు 200 మీటర్ల దూరంలో అదనపు తరగతి గదులు నిర్మించారు. కానీ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఒకే ప్రదేశంలో తరగతులు నిర్వహిస్తున్నారు. మరోచోట ఉన్న తరగతి గదులకు రాకపోకలకు రోడ్డును దాటి వెళ్లాల్సి ఉంది. దీంతో అటువైపు ఎవ్వరూ వెళ్లడం లేదు. గతంలో నుంచే నిరుపయోగం నేను హెచ్ఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లవుతోంది. అంతకుముందు నుంచే మూడు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఆట స్థలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం ఆట స్థలాన్ని వినియోగంలోకి తేవడానికి చర్యలు చేపడుతాం. మౌలిక వసతులు కల్పిస్తే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తా. – మోహన్రెడ్డి, హెచ్ఎం, అరగొండ బాలికోన్నత పాఠశాల -
వెంకన్న దర్శనానికి వెళ్తూ..
చౌడేపల్లె: పుంగనూరు మండలం, ప్రసన్నయ్యగారి పల్లెకు చెందిన గుండ్లపల్లి శ్రీరాములు(62) తిరుమలకు పాదయాత్రగా వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. ప్రసన్నగారిపల్లెకు చెందిన గుండ్లపల్లి శ్రీరాములు గ్రామస్తులతో కలిసి ప్రతి యేటా తిరుమలకు పాదయాత్రగా వెళ్లి స్వామిని దర్శించుకునేవారు. ఈక్రమంలో గురువారం ఇంటి వద్ద నుంచి బయలుదేరి కాలినడకన వెళ్తుండగా చౌడపల్లె పోలీస్ స్టేషన్కు సమీపంలోని పెద్దయల్లకుంట్ల వద్ద పుంగనూరు నుంచి చౌడేపల్లెకు వెళ్తున్న ఓ స్కూటర్ ఢీకొంది. శ్రీరాము లు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. బైక్తోపాటు ఆమినిగుంటకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
దేవుడు కనిపించాడు!
దివ్యదర్శన టోకెన్ల క్యూలలో తోపులాట ఆ నగుమోమును చూడాలని.. నిలువెత్తు మూర్తిని దర్శించుకోవాలని.. ఆ అమృతమూర్తిని కనులారా వీక్షించాలని వారంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరునగరికి చేరుకున్నారు. అయితే వారికి ఏడుకొండల వాడి పాదాల చెంతన ఉన్న అలిపిరిలోనే ఆ దేవదేవుడు కనిపించాడు. తోపులాటలో చిన్నా, పెద్దా, వయోవృద్ధులు వర్ణించనలవికానీ అగచాట్లు పడ్డారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో తండ్రీ నిను చూడాలని వచ్చిన మాకు ఇన్ని ఇక్కట్లా అని ఆవేదన చెందారు. పండుగ సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం గురువారం తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్కు భక్తులు అత్యధిక సంఖ్యలో చేరుకున్న దర్శన టోకెన్ల కోసం అష్టకష్టాలు పడ్డారు. నిర్దేశించిన లక్ష్యం కంటే మించి రెండింతల మేరకు భక్త జనం చేరుకోవడంతో క్యూలన్నీ కిక్కిరిసి పోయాయి. దివ్యదర్శన టోకెన్ జారీ కౌంటర్ వద్ద భక్తులు పోటెత్తడంతో నిలువరించే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది చర్యలు ఏమాత్రం ఫలించలేదు. భక్తులు టోకెన్ల కోసం ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాటలు చోటుచేసుకుని అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కంచెలను దాటే ప్రయత్నంలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తుల రద్దీ ఏ మాత్రం దగ్గలేదు. నిర్దేశించిన మేరకు టోకెన్ల జారీ పూర్తి అయిందనే విషయం తెలుసుకున్న పలువురు భక్తులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ నిరుత్సాహంగా ఊసురోమంటూ వెనుదిరిగారు. కాగా ఈ ఘటన చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి ఫొటో గ్రాఫర్ కెమెరాను ఏవీఎస్ఓ లాక్కున్నారు. – తిరుపతి అన్నమయ్యసర్కిల్ -
కిస్మస్ వేడుకల్లో కలెక్టర్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం,కొంగారెడ్డిపల్లిలోని బీటీ మెమోరియల్ చర్చి లో గురువారం జరిగిన కిస్మస్ వేడుకల్లో కలెక్టర్ సుమిత్కుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నా రు. కాసేపు దైవ సందేశాన్ని ఆలకించారు. అనంతరం చర్చి పాస్టర్లు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. తర్వాత శాలువతో సత్కరించారు. కిక్కిరిసిన కాణిపాకం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గురువారం సెలవు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం భక్తులతో నిండిపోయింది. క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆలయ ఆవరణంలో కూడా భక్తజన సందడి కనిపించింది. భక్తుల తాకిడితో దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆలయ అధికారులకు స్వామి దర్శనం కల్పించారు. రేపు పడిమెట్ల పూజోత్సవం సదుం: మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం పడిమెట్ల పూజోత్సవం నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో ప్రాముఖ్యత కలిగిన పడిమెట్ల పూజోత్సవాన్ని ఆలయ ధర్మకర్త, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విశేషంగా తరలివచ్చే స్వాములు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధం
శ్రీరంగరాజపురం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని పాతపాళ్యం దళితవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన వరప్రసాద్తోపాటు కుటుంబ సభ్యులు గురువారం క్రిస్మస్ సందర్భంగా చర్చికి వెళ్లారు. అదే సందర్భంలో అకస్మాత్గా షార్ట్ సర్క్యూట్ కారణంగా అతని పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.30 వేల నగదు, 40 గ్రాముల బంగారు ఆభరణాలు, వరి ధాన్యం, బియ్యం, దుస్తులు కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితుడు కోరారు. దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేత శాంతిపురం: పంచాయతీ కేంద్రమైన నడింపల్లిలో తన ఇంటిని దౌర్జన్యంగా కూల్చివేయడంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు మారప్ప తెలిపారు. భూ వివాదంపై కుప్పం కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే జేసీబీతో ఇంటిని కూలదోశారని వాపోయాడు. కోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఆగాలని కోరినా వినిపించుకోకుండా ప్రత్యర్థి పక్షం వారు కూల్చివేశారని చెప్పాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, కోర్టు వివాదంలో ఉన్న ఆస్తిలో ఎవరూ ప్రవేశించ కుండా చూడాలని కోరారు. ప్రభుత్వ కుంట ఆక్రమణ చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేట సమీపంలో సుమారు రూ.40 లక్షల విలువైన ప్రభుత్వ కుంటను స్థానిక టీడీపీ నేత ఆక్రమించుకుంటున్నాడు. ఆరేపల్లి లెక్క దాఖల సర్వే నంబర్ 142/6లో 30 సెంట్ల కుంట ఉంది. ఇక్కడ గతంలో పురాతన కోనేరు ఉండేది. కాలక్రమేణ కోనేరు పూడిపోవడం, రెవెన్యూ రికార్డుల్లో కుంట భూమిగా నమోదైంది. ఇదే అదునుగా భావించిన పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఆ భూమిపై కన్నేశాడు. రెండు రోజులుగా నిరంతరం మట్టిని తరలించి, కుంటను చదును చేసే పనిలో నిమగ్నమయ్యాడు. విలువైన భూములు ఇలా అన్యాక్రాంతం కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రగిరిలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు చేస్తే, నామమాత్రంగా పనులను అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 60 సవర్ల బంగారం, రూ1.5 లక్షల నగదు చోరీ వెంకటగిరి రూరల్: కుమార్తె ఉన్నత చదువులు కోసం ఇంట్లో దాచి ఉంచిన నగదు, బంగారం ఎవరు లేని సమయం చూసి దుండగలు చోరీ చేశారు. ఈ ఘటన పట్టణంలోని తోలిమిట్టలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం మేరకు..తోలిమిట్టకు చెందిన చీమల కృష్ణమూర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తె ప్రస్తుతం తిరుపతిలో విద్యనభ్యసిస్తూ అక్కడే ఉంది. కుమార్తె బాబోగులు చూసుకునేందుకు బుధవారం తిరుపతికి వెళ్లిన కృష్ణమూర్తి గురువారం ఇంటికి వచ్చి చూసేసరికే గుర్తు తెలియని దుండగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందర వందరగా చేసి ఉన్నారు. అనుమానంతో తాను దాచి ఉంచిన బంగారం, నగదును చూడగా కనిపించలేదు. బాధితుడు ఈ విషయమై పోలీసుల కు సమాచారం అందించాడు. స్థానిక ఎస్ఐ ఏడుకొండలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, క్లూస్టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నట్లు తెలిపారు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు 60 సవర్ల బంగారం, రూ.1.50 లక్షల నగదు చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దగ్ధమైన వస్తువులు -
ఘనంగా హనుమాన్ చాలీసా
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో గురువారం హనుమాన్ చాలీసాను ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సంకీర్తనలు, భజనల తో భక్తులను హోలలాడించారు. కార్యక్రమాని కి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వారికి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
ఉపాధిలో వేతన వెతలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉపాధి కూలీల అవస్థలు అన్నీఇన్నీ కావు. నాలుగు నెలలుగా వేతనాలు, కూలీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించి 15 రోజుల్లో జీతాలు అందించేలా చట్టం ఉన్న ప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూలీలకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 15 నుంచి అందని జీతాలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉపాధి కూలీలు పస్తులుండాల్సి వస్తోంది. చంద్రబాబు సర్కారు ఉపాధి కూలీల పట్ల చిన్నచూపు చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఉపాధి కూలీలకు జీతాలు అందడం లేదు. పేరుకుపోయిన బకాయిలు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల జీతాలు రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఇందుకు కారణం కేంద్రమేనని, బడ్జెట్ విడుదల చేయడం లేదని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జీతాలు రాకపోవడంతో ఉపాధి కూలీలు వలస బాట పట్టారు. రామకుప్పం, ఐరాల, పూతలపట్టు మండలాల్లో యంత్రాలతో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్ని చోట్ల కూలీలకు అందాల్సిన నిధులు రానివ్వకుండా నొక్కేసేందుకు పచ్చ నేతలు యంత్రాలతో పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. నత్తనడకన ఉపాధి పనులు గ్రామాల అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తున్నామని డప్పు కొంట్టుకుంటున్న చంద్రబాబు సర్కారు క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు. డ్వామా శాఖ పరిధిలో ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు మొత్తం 62,848 పనులు మంజూరు చేశారు. అయితే వీటిలో 17,788 మాత్రమే పూర్తి చేయగలిగారు. ఫీడర్ చానళ్ల పూడిక తీతకు 3,422 పనులను మంజూరు చేయ గా 324 మాత్రమే పూర్తి చేశారు. జిల్లాలో 23,583 ఫామ్పాండ్స్ పనులను మంజూరు చేయగా ఇప్పటి వరకు 6,678 పూర్తి చేసి మిగిలినవి నిలిపివేశారు. ఆర్భాటంగా నిర్వహించిన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2,395 పశువుల పాకలు మంజూరు చేయగా ఇందులో 682 మాత్రమే పూర్తి చేశారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు 6,678 మంజూరు చేయగా 2,283, కంపోస్ట్ గుంతలు 9,791కి 4,769, పశువుల తొట్టెలు 1,788కి గాను 761 పూర్తి చేసి మిగిలిన పనులను నిలిపివేశారు. గ్రామీణ రహదారుల అభివృద్ధిలో జిల్లా వ్యాప్తంగా 1,434 సీసీ రోడ్లను మంజూరు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 127 రోడ్లు మాత్రమే వేయగలిగారు. -
యూరియా..లేదయ?
రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో ఏ ఎరువుల దుకాణానికి వెళ్లినా కావాల్సినంత యూరియా దొరికేది. సకాలంలో పంటలకు వేసుకునేవారు. కానీ ఇప్పుడు యూరియా కోసం తిరిగి తిరిగి చెప్పులరుగుతున్నా ఎక్కడా దొరకడం లేదు. వచ్చే అరకొర యూరియా ఎక్కడికీ చాలడం లేదు. ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్ఎస్కేలు.. ఫర్టిలైజర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు పాలకులుగానీ.. అటు అధికారులు గానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలమనేరులోని రైతు సమాఖ్య సెంటర్, గ్రోమార్ దుకాణాల వద్ద యూరియా కోసం క్యూకట్టిన రైతులు (ఫైల్) బ్లాక్లో బస్తా యూరియా రూ.500 పైమాటే స్థానికంగా యూరియా దొకరడం లేదు. దీన్ని అదునుగా చేసుకొని కర్ణాటకలో యూరియాను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి ఆటో డ్రైవర్లకు ఇది బాగా కలిసి వస్తోంది. నిత్యం బోర్డర్కు వెళ్లడం.. పది బస్తాలను ఆటోలో తెచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయించడం రివాజుగా మారుతోంది. కర్ణాటకలో బస్తా యూరియా ధర రూ.270 కాగా అది బ్లాక్లో రూ.500 దాటుతోంది. ఎరువుల దుకాణాల్లో నోస్టాక్ జిల్లాలోని ఎరువుల దుకాల్లో యూరియా స్టాకు లేదు. వీరికి హోల్సేల్గా సరఫరాచేసే ఏజెన్సీలు యూరియా కావాలంటే కాంప్లెక్స్ తీసుకోవాలంటూ మెలిక పెట్టాయి. దీంతోపాటు ఇక్కడ ఎమ్మార్పీ రూ.275కి విక్రయించాల్సి ఉండగా..ట్రాన్స్ఫోర్ట్ చార్జీలు అదనంగా ఉంటున్నాయి. దీంతో బస్తా రూ.300పైగా విక్రయించాలి. లేని సమస్యలకెందుకని ఫర్టిలైజర్స్ యూరియాను అసలు కొనడం లేదు. దీనికితోడు ప్రభుత్వం సైతం ఆర్ఎస్కేలు, రైతు సమాఖ్య, గ్రోమార్ సెంటర్లకు మాత్రమే యూరియాను పంపుతోంది. పలమనేరు: జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతు న్న కష్టాలు అన్నీఇన్నీకావు. మొన్నటి దాకా కాంప్లెక్స్ లేదా ఫర్టిలైజర్స్ కొంటేనే యూరియా అమ్మిన ఎరువుల దుకాణదారులు ఇప్పుడు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. హోల్సేల్ కంపెనీల నుంచి డైరెక్ట్గా అందే జిల్లాలోని గ్రామోర్ అవుట్లెట్లు, రైతు సమాఖ్య దుకా ణాలకు వందలాది మంది రైతులు క్యూకడుతున్నారు. వారిని నియంత్రించేందకు పోలీసు బందోబస్తు చేపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వరి నారుమళ్లకు సైతం యూరియా దొరకడం లేదు. ఏపీ రైతుల దెబ్బ కు పక్కనే ఉన్న కర్ణాటకలో సైతం స్టాకు లేకుండా పోయింది. ఉన్న స్టాకును కొందరు బ్లాక్ మార్కెట్లోకి తరలించి స్థానికంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల్లో కావాల్సినంత యూరియా దొరగ్గా కూటమి పాలనలో మాత్రం ఎందుకు యూరియాకు డిమాండ్ వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్కడా యూరియా లేదు జిల్లాలో యూరియా దొరక్క రైతులు పొరుగునే ఉన్న కర్ణాటకకు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ఇక్కడ నెలకొన డిమాండ్ కారణంగా అక్కడ కూడా యూరియా దొరకడం లేదు. ఉన్న యూరియా అంతా ఆంధ్రావాళ్లకే చాలడం లేదు.. ఇక మా వద్ద స్టాకెక్కడుంటుందనే మాట అక్కడి వ్యాపారుల నుంచి వినిపిస్తోంది. భారీగా పెరిగిన వరి సాగు జిల్లాలో గత ఖరీఫ్లోనూ వరిసాగు పెరిగింది. ఈ మధ్య కురిసిన వర్షాలతో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. దీంతో సాధారణ వరిసాగు ఈ రబీలో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నారుమళ్ల సీజన్ నడుస్తోంది. దీంతోపాటు మొక్కజొన్న, పశుగ్రాసం, మల్బరీ పంటలకు సైతం రైతులు యూరియాను వాడుతున్నారు. జిల్లాలో డిమాండ్ మేరకు యూరియా అలాట్మెంట్ మాత్రం పెరగడం లేదు. గంటల్లో ఖాళీ ఇటీవల జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో ఒక్కో పంచాయతీకి రూ.250 బస్తాల యూరియా వచ్చింది. ఇది కేవలం గంటల్లో ఖాళీ అయిపోయింది. ఇందులో సింహభాగం కూటమి నేతలకే చేరిపోయింది. ఫలితంగా అవరసమైన రైతులు బ్లాక్లో కర్ణాటక నుంచి అధిక ధరతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లా సమాచారం జిల్లాలో యూరియా నో స్టాక్ దొరకలేదు ఓ బస్తా యూరియా కోసం వారం రోజులుగా పలమనేరు లోని దుకాణాల వద్దకు తిరు గుతున్నా. కానీ ఫలితం లేదు. మొన్నటి దాకా యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాలన్నారు. దానికి కూడా రెడీ అన్నా ఇప్పుడు యూరియా దొరకడం లేదు. మా బంధువుల ద్వారా కర్ణాటకలోని వడ్డిపల్లికెళ్లి బస్తా యూరియా తెచ్చుకున్నా. – సుబ్బన్న, గొల్లపల్లి, రైతు, పలమనేరు మండలం -
మన్నిక, నాణ్యతకు ప్రతీకగా భారతి సిమెంట్
నాయుడుపేట టౌన్: మన్నిక, నాణ్యతలకు ప్రతీక భారతి సిమెంట్ అని, ఇది అన్ని వర్గాల వారి మన్ననలు పొందుతోందని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి పాస్టర్ ఆదర్ష్ ప్రీతం కొనియాడారు. నాయుడుపేటలోని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి వద్ద ఆ సంఘం పెద్దలు యువతతో కలిసి పాస్టర్ కేక్ కట్ చేసి భారతి సిమెంట్స్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ ఏటా క్రిస్మస్ వేడకలను భారతి సిమెంట్స్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి జరుపుకోవడం ఎంతో హర్షణీయమన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భారతి సిమెంట్స్ పరిశ్రమకు సంబంధించి క్యాలెండర్లను ఆవిష్కరించారు. భారతి సిమెంట్స్ కంపెనీ నెల్లూరు జిల్లా డిప్యూటీ మేనేజర్ జేఎన్ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చైర్మన్ కారల్ మధు, కేఎంవీ కళాచంద్ర, సండే స్కూల్ సూపరిండిండెంట్ ప్రేమ్చంద్, భారతి సిమెంట్స్ డీలర్లు కామిరెడ్డి అమరేంద్రరెడ్డి, కరీంబాయి, చెంచయ్య మొదలియార్, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు బెన్హర్, కాళహస్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ వి‘ప’త్తు!
చౌడేపల్లె: పడమటి మండలాల రైతులు టమాట సాగుపై దృష్టి సారించారు. నారుకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నర్సరీ నిర్వాహకులు నకిలీ నారును అంటగడుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో దశలవారీగా టమాట పంటను సాగుచేయనున్నారు. సీజన్ దగ్గరపడుతుండడంతో పలువురు నర్సరీ నిర్వాహకులు విత్తనాలు విత్తి మొలకల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. తక్కువ నీటి సౌకర్యం ఉన్న రైతు కూడా అధిక దిగుబడులు పొందడానికి మార్కెట్లో వెలువడిన కొత్తరకం విత్తనాలపై ఆశపడుతున్నారు. నర్సరీలో ప్రస్తుతం సాహో, సల్లార్, కావేరి, 778, శివంగితోపాటు పలు కొత్త రకం టమాట మొలకలు లభిస్తున్నాయి. ముందుగానే రిజర్వేషన్లు మొలకల కోసం రైతులు ముందుగానే నర్సరీ యజమానుల వద్ద ఒప్పదం కుదుర్చుకుంటున్నారు. ఒక్కొక్క టమాట మొలకను రూ.1.2 పైసల నుంచి రూ.2 వరకు విక్రయిస్తున్నారు. నారు పెంచేందుకు 27 రోజులు పడుతుందని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఎకరం పొలానికి 7 వేల నుంచి 8 వేల టమాట మొలకలు అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు. నకిలీ నారు, నకిలీ విత్తనాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.టమాట నారుకు భలే డిమాండ్ నకిలీల జోరు టమాట మొలకల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు బయట ప్రాంతం నుంచి నారును సరఫరా చేస్తున్నారు. దీంతో నకిలీ విత్తనాలతో తయా రు చేసిన నారు జోరుగా విక్రయిస్తున్నట్టు రైతులు ఆ రోపిస్తున్నారు. అధికారులకు సమాచారం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
–త్రుటిలో తప్పిన ప్రమాదం కార్వేటినగరం : చెరకు ట్రాక్టర్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన మండల పరిధిలోని చిన్నకనుమ వద్ధ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ గోవిందస్వామి కథనం మేరకు వివరాలిలా.. బెంగళూరు నుంచి కేఎస్ ఆర్టీసీ బస్సు పుత్తూరుకు వెళుతుండగా ఎస్ఎన్జే షుగర్ ఫ్యాక్టరీకి చెరకు లోడ్తో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. బస్సు డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయట పడ్డారు. ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్కు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనపై ఇంత వరకు ఫిర్యాదు అందలేదని ఏఎస్ఐ గోవిందస్వామి తెలిపారు. తప్పిన ప్రమాదం అసలే ప్రమాదాలకు నిలయంగా ఉన్న చిన్న, పెద్ద కనుమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో కూడా అదే కనుమపై ఇటుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. కనుమకు ఎడమ వైపు సుమారు 30 అడుగుల లోతు లోయ ఉంది. కానీ చెరకు ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో బస్సు ఎడమ వైపు వాలకుండా చెరుకు లోడ్డు ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
పుంగనూరు : క్రిస్మస్ను పురస్కరించుకుని క్రైస్తవులకు బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి విడివిడిగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులతో కలసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్.. శాంతి నెలకొల్పడమే చిత్తూరు అర్బన్ : సమాజంలో శాంతి నెలకొల్పడంతో పాటు ప్రతి ఒక్కరిపై కరుణ, సహనం కలిగి ఉండటమే క్రిస్మస్ పండుగ లక్ష్యమని ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. పరస్పర గౌరవంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మంచి విలువలను పాటించాలని కోరారు. బీఎల్వోల జీతాల పెంపు చిత్తూరు కలెక్టరేట్ : బీఎల్వోల జీతాలను పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వివేక్యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు బుధవారం కలెక్టరేట్కు అందాయి. జిల్లాలోని బీఎల్వోలకు ఇకపై రూ.12 వేలు, బీఎల్వో సూపర్వైజర్లకు రూ.18 వేలు సంవత్సరానికి, స్పెషల్ ఇన్సెంటివ్ ప్రత్యేక డ్రైవ్స్ కార్యక్రమాలకు రూ.2 వేలు చొప్పున అందజేయనున్నారు. పెంచిన జీతాలు ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. పూర్తి సంవత్సరం పనిచేసిన వారికి పూర్తి జీతం, పాక్షికంగా పనిచేసిన వారికి అనుబంధంగా చెల్లింపు ఉంటుందని పేర్కొన్నారు. వరసిద్ధుడికి రూ.1.60 కోట్ల ఆదాయం కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.1,60,25,165 ఆదాయం వచ్చింది. బంగారం 16 గ్రాములు, వెండి 1.650 కిలోలుగా లెక్కకట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.13,316, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.25,720 వచ్చింది. యూఎస్ఏ 636 డాలర్లు, సింగపూర్ 162 డాలర్స్, మలేషియా 23 రింగిట్స్, యూఏఈ 5 దిర్హామ్స్, ఆస్ట్రేలియా 370 డాలర్స్ , సౌదీ 185 రియాల్స్ వచ్చాయి. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, డీఈవోలు సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 28న ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఈనెల 28వ తేదీన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఆర్బీ ప్రసాద్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా చెస్ అసోసియేషన్, ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పోటీలు ఈ నెల 28 వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ లో జరుగుతాయన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు, ట్రోఫీలు, పతకాలు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 27 వ తేదీ లోపు www. apchess.org వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9000475799, 9849313676 నంబర్లో సంప్రదించాలని కోరారు. మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి -
వేతన.. యాతన
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన 104 ఉద్యోగులు పల్లెల్లో వైద్యసేవలు అందిస్తున్న ఆపద్బాంధవులకు ఆపదొచ్చింది. 104 అంబులెనన్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువుతోంది. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారి జీవితాలు తలకిందులవుతున్నాయి. అదనపు భారం కొండెక్కింది. వేధింపులు తార స్థాయికి చేరాయి. ప్రశ్నిస్తే..వేటు వేస్తున్నారు. ప్రభుత్వ అండదండలతో యాజమాన్యం విడ్డూరంగా వ్యవహరిస్తోంది. వారి పోరు పడలేక ఉద్యోగులు రోడ్డెక్కారు. నిరవధిక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. – చిత్తూరు రూరల్ (కాణిపాకం) జిల్లాలో 729 గ్రామాలకు గాను ’104’ వాహనాలు కేవలం 42 మాత్రమే ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) ఉన్నారు. మొత్తం మీద 93 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ 104 కాంట్రాక్ట్ చేపట్టింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ఉద్యోగులలో 10 శాతం అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంది. కానీ ఆ సిబ్బంది నియామకంలో నిర్వాహకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వీడని వేధింపులు సరిపడా సిబ్బంది లేకపోయినప్పటికీ భవ్య యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తోంది. ఒక ఉద్యోగి చేత ఇద్దరు ఉద్యోగుల పనిని చేయించుకుంటోందని ముండిపడుతున్నారు. రెండు వాహనాలకు ఒక డ్రైవర్కు డ్యూటీ వేయడం. ఒక డీఈఓతో రెండు వాహనాల డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు ఊపి రాడని పరిస్థితి నెలకొంటోంది. రోగులకు సేవలందించడంతో పాటుగా ప్రతి రోజూ వివిధ రికార్డులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరు రకాల రికార్డులు పూర్తి చేయడమే కాకుండా ఎంఓ యాప్ కూడా ఆన్లైన్ చేయాలి. దీనికితోడు ఇటీవల భవ్య యాప్ తీసుకొచ్చి దానిని కూడా ఆన్లైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఫార్మసీ పనులు కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారానే చేయిస్తున్నారు. ఈ తరణంలో ప్రజలకు జరకూడనిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యలని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెలవులు ఏవీ.. కొంతమంది ఉద్యోగులకు ఇంటి వద్ద తల్లిదండ్రులు ఉన్నారు. వారి బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. వా రు వృద్ధాప్యంలో తరచూ అనారోగ్యం పాలవుతుంటా రు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా 104 ఉద్యోగులకు యాజమాన్యం సెలవులు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య ప రిస్థితుల సమయంలో సెలవులివ్వకుండా వేధింపుల కు పాల్పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సెలవు పెట్టినప్పటికీ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఉద్యోగు లు వాపోతున్నారు. సెలవు రోజు వేతనం మాత్రం క ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల హక్కులు సరే మానవ హక్కులను కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల నుంచి కోతలు గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించిన అరబిందో ఇచ్చిన జీతాల కంటే ప్రస్తుతం భవ్య యాజమాన్యం తక్కువ జీతాలు చెల్లిస్తోంది. ఇస్తున్న ఆరకొర జీతాల్లో నుంచి ఉద్యోగులకు ఎలాంటి సమా చారం ఇవ్వకుండా సీనియర్ల నుంచి నెలకు రూ.800 , జూనియర్ల నుంచి నెలకు రూ.500 కోత విధిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు కోత విధిస్తున్నారో. ఎవరు విధిస్తున్నారో సమాధానం చెప్పే వారే లేకుండా పోవడంతో 104 ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏడు నెలలుగా ఉద్యోగులకు పే స్లిప్పులు ఇవ్వకుండా యాజమాన్యం దాగుడు మూతలు ఆడుతోంది. గతంలో ఇచ్చినట్లుగానే భవ్య యాజమాన్యం కూడా జీతాలు సక్రమంగా చెల్లింస్తుందని, అధికారులు ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఈఎస్ఐ, పీఎఫ్ యాజమాన్యం వాటా చెల్లించాల్సి ఉంది. కానీ 104 ఉద్యోగుల నుంచి కంపెనీ వాటా, ఉద్యోగి వాటా రెండూ వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు అభద్రతకు గురవుతున్నారు. నిరసనలు ఇలా... నిబంధనలకు తూట్లు భవ్య యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఉద్యోగులకు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్ద తలకాయల మద్దతుతో రెచ్చిపోతున్న యాజమాన్యం వైఖరిని ప్రశ్నించడం నేరమవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి అధికారిని కలవడానికి ప్రయత్నించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద వేధింపులకు దిగనట్టు సమాచారం. గత నాలుగురోజులుగా చేపడుతున్న ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు నిర్వాహకులు ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తోందని పలువురు వాపోతున్నారు. -
నరసింహపురంలో కోడి పందేల జోరు
పాలసముద్రం : మండలంలోని నరసింహపురం పంచాయతీ తమిళనాడు సరిహద్దులో బుధవారం కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తమిళనాడు సరిహద్దులో కొన్ని రోజులుగా కోడి పందేలు, పేకాట జోరుగా సాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో కోడి పందేలు, పేకాట జోరుగా సాగుతున్నాయని చెబుతున్నా రు. తిరుమళరాజుపురం (రైస్మిల్) కూడలిలో తమిళనాడు వాసులు కోడి పుంజులతో వచ్చి పందేలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది యువజనోత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ ఎస్వీయూ తిరుపతి సిటీ : దక్షిణాది రాష్ట్రాల యువజనోత్సవాల్లో ఎస్వీయూ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడం ఎంతో గర్వకారణమని ఆ వర్సిటీ వీసీ నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. యువజన ఉత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి యూనివర్సిటీకి వచ్చిన కళాబృందాలను బుధవారం వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ దక్షిణాదిలోనే ఎస్వీ యూనివర్సిటీ ఓవరాల్ చాంపియన్ షిప్ను కై వసం చేసుకోవడం గర్వకారణమన్నారు. వారిని ప్రోత్సహించిన కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతలు సాధించిన జ్ఞాపికలను యూనివర్సిటీ కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీసీ డీన్ ప్రొఫెసర్ చెండ్రాయుడు, కల్చరల్ అఫైర్స్ మాజీ డైరెక్టర్ కేఎం భాను, డాక్టర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,583 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,936 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.936 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలి తిరుపతి అన్నమయ్యసర్కిల్: వచ్చే నెలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత తిరుపతి క్రైం: తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో వారు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రుల కమిటీలు సమీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. తిరుమలలో సుమారు 3వేల మంది పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేసినట్లు వివరించారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమతి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. – ఈ ఏడాది 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులు తప్పనిసరిగా నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే హాజరు కావాలని సూచించారు. భక్తులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని తెలిపారు. అదనపు ఎస్పీలు విమనోహరాచారి, శ్రీనివాసులు, డీఎస్పీలు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళుతూ..ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచి పెడుతున్న వాహక నౌకసదుం : మంత్రులు ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములను తక్కువ ధరకే పప్పు బెల్లాల్లా పంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదుం మండలంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పెద్దిరెడ్డికి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఠంచన్గా అందించి అన్ని వర్గాలను గత ప్రభుత్వ పాలనలో ఆదుకున్నామని గుర్తు చేశారు. పలు పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ అమలుపై కూటమి నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ తిమ్మారెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, పార్టీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఖమ్రుద్దీన్, మస్తాన్, ధనశేఖర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో బుధవారం క్రిస్మస్ కోలాహలం మొదలైంది. గురువారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ మందిరాలు, విశ్వాసుల గృహాలు నూతనత్వాన్ని సంతరించుకున్నాయి. త్యాగానికి ప్రతీక అయిన క్రిస్మస్ వేడుకను జరుపుకునేందుకు క్రైస్తవులు సన్నద్ధమయ్యారు. చర్చిలను విద్యుత్ దీపాలతో అలకరించారు. చర్చి లోపలి భాగంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పలుచోట్ల ఏసు జన్మ వృత్తాంతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు క్రైస్తవులు తమ గృహాలను సుందరంగా అలంకరించారు. అర్ధరాత్రి నుంచి ఏసును స్తుతిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ఆరాధనలు, ప్రార్ధనలు నిర్వహించారు. పిల్లలు, యువజనులు క్రీస్తు జనన వృత్తాంతాన్ని వివరించే నాటికలు ప్రదర్శించారు. గురువారం ఉదయం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు జరగనున్నాయి. కాగా క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీలు, చర్చిల అలంకరణ సామగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జాన్బాస్కో చర్చిలో క్రిస్మస్ ట్రీకాణిపాకం : జిల్లాలో జరుగుతున్న స్కానింగ్, అబార్షన్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. సాక్షి దినపత్రికలో మంగళవారం కన్నింగ్..స్కానింగ్ కథనం ప్రచురితమైంది. అలాగే బుధవారం అబార్షన్ల అనకొండలు పేరిట కథనం వచ్చింది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాతో పాటు అక్రమ స్కానింగ్ గుట్టు రట్టు కావాలని ఆదేశించారు. ఏయే జిల్లాలో అక్రమ స్కానింగ్లు, అబార్షన్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలోని వైద్యులు, ఏఎన్ఎంలు దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని హెచ్చరించారు. అక్రమస్కానింగ్లు ఏ రకంగా జరుగుతున్నాయి..? వారికి ఎవరెవ్వరూ సహకరిస్తున్నారు..? వారికి ఎంటీపీ కిట్లు ఎక్కడ దొరుకుతున్నాయి? అవి ఎలా సరఫరా జరుగుతున్నాయి? ఇందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వ్యక్తుల సహకారం ఏమైనా ఉందా? ఆడిట్ జరుగుతోందా అనే విషయాలపై రాష్ట్ర స్థాయి అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికైనా అబార్షన్లు, అక్రమ స్కానింగ్లు ఆగేనా?.క్రీస్తు జన్మవృత్తాంతం.. జాన్బాస్కో చర్చిలో అలంకరణఅక్రమ స్కానింగ్, అబార్షన్లపై ఆగ్రహం -
వ్యవసాయ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 45 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడం జరిగిందని, ఈ డిసెంబర్ 31వ తేదీలోగా మరో 5 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరుతో 50 వేల సర్వీసుల మార్కును చేరుకోవాలని జిల్లా స్థాయి విద్యుత్ అధికారులకు సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రూఫ్ టాప్ సోలార్పై అవగాహన సంస్థ పరిధిలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా రూఫ్ టాప్ సోలార్ సిస్టంపై వినియోగదారుల్లో అవగాహనను పెంపొందించాలని సీఎండీ సూచించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు మాత్రమే కాకుండా, ఇతర గృహ వినియోగదారులను కూడా సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ’కరెంటోళ్ళ జనబాట’ కార్యక్రమం జరిగిన తీరుపై అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కే.గురవయ్య, కే.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జే.రమణాదేవి, కె. ఆదిశేషయ్య, పీహెచ్ జానకీరామ్, ఎం.మురళీకుమార్, పి. సురేంద్రనాయుడు, జనరల్ మేనేజర్లు కృష్ణారెడ్డి, విజయన్, రామచంద్రరావు, చక్రపాణి, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, ఎస్ఈలు చంద్రశేఖరరావు, రాఘవేంద్రరావు, రమణ, ఇస్మాయిల్ అహ్మద్, శేషాద్రి శేఖర్, ప్రదీప్ కుమార్, సుధాకర్, సంపత్ కుమార్, సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేసు కుక్కల దాడి
గుడిపాల : రేసు కుక్కల దాడిలో ఆవు దూడ మృతి చెందింది. గుడిపాల మండలం వెప్పాలమానుచేను గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి తమ వ్యవసాయ పొలాల వద్ద దూడను కట్టి ఉంచాడు. ఆ పొలాలకు ఆనుకునే అటవీ ప్రాంతం ఉంది. మంగళవారం రాత్రి రేసు కుక్కలు వచ్చి దూడపై దాడి చేసి చంపేశాయి. గ్రామస్తులు చిరుతపులి దాడి చేసిందని భయాందోళన చెందారు. అటవీశాఖ పారెస్ట్ బీట్ ఆఫీసర్ కుసుమకుమారి సంఘటనా స్ధలాన్ని పరిశీలించి చిరుతపులి దాడి చేయలేదని చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవి రేసుకుక్కలు దాడిచేసినట్లు నిర్ధారించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ సాయిసుధ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి దూడకు పంచనామా చేశారు. రాత్రి వేళల్లో అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద పాడి పశువులను ఉంచొద్దని గ్రామస్తులకు సూచించారు. -
పోలీసు శిక్షణను పరిశీలించిన ఎస్పీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని జిల్లా పోలీ సు శిక్షణా కేంద్రం(డీటీసీ)లో కానిస్టేబుళ్లకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ పరిశీలించా రు. కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారికి ఇటీవల శిక్షణ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం డీటీసీలో జరుగుతున్న తరగతులను పరిశీలించి, అభ్యర్థులతో మాట్లాడారు. ఇక్కడ అందుతున్న వసతులు, సదుపాయాలపై ఆరా తీ శారు. అలాగే బోధనా పద్ధతులు, ఉపయోగిస్తున్న పరికరాలు, సిలబస్పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీటీసీ డీఎస్పీ రాంబాబు, ఇన్స్పెక్టర్ అమరనాథరెడ్డి ఉన్నారు. ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వర ఆలయంలో హుండీల ద్వారా రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. దేవస్థానం ఈఓ బాపిరెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో కానుకలను లెక్కించారు. 19 రోజుల వ్యవధిలో రూ.1.31 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే భక్తులు 25.300 గ్రాముల బంగారం, 352.17 కిలోల వెండి కానుకలుగా సమర్పించారన్నారు. విదేశీ కరెన్సీ అమెరికా 31 డాలర్లు, మలేషియా 13, సింగపూర్ 3, యూఏఈ 2, దిర్హమ్లు. ఇంగ్లాండ్ 2, కెనడా 2 డాలర్లు వచ్చినట్లు తెలిపారు. -
ఆడబిడ్డని చెరువులో పడేశారా?
బంగారుపాళెం : ఆడబిడ్డ భారమని పుట్టిన వెంటనే చెరువులో పడేశారా.. భారం తగ్గించుకుందా మనుకున్నారా..లేక ఇతర కారణాలతో పుట్టిన బిడ్డను వదిలించుకుందామనుకున్నారో.. భూమి మీద పడి కళ్లు తెరవక ముందే, ఆడ శిశువుకు నూరేళ్ల నిండిపోయాయి. నవమాసాలు మోసి కన్నపేగు తెంచకుండానే పుట్టిన బిడ్డను చెరువులో పడేశారు. ఈ సంఘటన మండలంలోని తుంబకుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బిక్కిరెడ్డి చెరువులో శిశువు మృతదేహం తేలాడుతుండగా బుధవారం సాయంత్రం పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆడ శిశువుగా గుర్తించారు. రెండు రోజుల క్రితం పుట్టిన ఆడబిడ్డను చెరువులో పడేసినట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన శిశువు గురించి గ్రామంలో విచారణ చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేక ఇతరులు ఎవరైనా బిడ్డను పడేసి వెళ్లారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు. -
అధికారంలోకి రాగానే పెట్రో ధరలు తగ్గిస్తామన్న పెద్ద బాబు, చిన బాబు ● గుడుపల్లె సభలో చంద్రబాబు హామీ ● యువగళంలో పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలతో నారా లోకేష్ హల్చల్ ● అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా అమలుకాని హామీ ● రెండు జిల్లాల్లో రోజుకు రూ.5.4 కోట్ల
పలమనేరు: ‘పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో పెట్రో ల్, డీజిల్ ధరలు తక్కువ. ఇక్కడ జగన్మోహన్రెడ్డి పెట్రోల్ ధర లు పెంచేశారు. సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం’ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ హామీలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక సరిహద్దులోని పెట్రోల్ బంకుల వద్దకెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ హంగా మా సృష్టించారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక పోయారు. పె ట్రోల్, డీజిల్ ధరలు అలాగే కొనసాగుతున్నాయి. దీనికారణంగా జిల్లా లో రోజుకు వాహనదారుల పై రూ.5.4 కోట్లకుపైనే అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.167.4కోట్లు, ఏడాదికి రూ.2,008.8 కోట్లుదా కా ప్రజలు అదనంగా చెల్లించా ల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.4,017.6 కోట్లు దాకా ప్రజలపై భారం పడింది. పెట్రో ధర తగ్గిస్తామని బాబు కర్రుకాల్చి వాత పెట్టారని పలువురు వాపోతున్నారు. ఆంధ్రలో వెలవెల..కర్ణాటకలో కళకళ చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి ఆనుకొని గండ్రాజుపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. మండల కేంద్రమైన వీకోట టౌన్కు ఆనుకొనే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు కొనసాగుతోంది. అలాగే తిరుపతి జిల్లాలో ఇటు నగరి, పిచ్చాటూరు, సత్యవేడు నుంచి తమిళనాడు సరిహద్దు వెళ్తుంది. అటు నాయుడుపేట నుంచి తమినాడు బోర్డర్ ఉంది. ఆయా సరిహద్దుల్లోని ఆంధ్ర పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. అదే కర్ణాటక, తమినాడు పెట్రోల్ బంకులు కళకళలాడుతున్నాయి. కారణం.. ధరల్లో వ్యత్యాసాలు ఉండడమే. ఒక్క పలమనేరు నియోజకవర్గంలోనే దాదాపు 20 పెట్రోల్ బంకుల దాకా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మొగిలి ఘాట్లో లారీ బోల్తా
మొగిలి ఘాట్లో సోమవారం రాత్రి లారీ బోల్తా పడింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2023 జనవరి 30న యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ పలమనేరు సమీపాన కర్ణాటక పరిధిలో ఉన్న పంతాన్హల్లికి చేరుకున్నారు. అక్కడి పెట్రోలు బంకుకు చేరుకుని కర్ణాటక రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలను మీడియాకు చూపారు. సెల్ఫీ తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం కంటే కర్ణాటకలో పెట్రోలు ధరలు తక్కువ ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటకలో ఉన్న ధరలే ఏపీలో కూడా ఉంటాయన్నారు.


