మార్కులు నమోదు చేయకపోతే చర్యలు | - | Sakshi
Sakshi News home page

మార్కులు నమోదు చేయకపోతే చర్యలు

Dec 28 2025 8:22 AM | Updated on Dec 28 2025 8:22 AM

మార్కులు నమోదు చేయకపోతే చర్యలు

మార్కులు నమోదు చేయకపోతే చర్యలు

● 100 రోజుల ప్రణాళిక పక్కాగా చేపట్టాలి ● విలేకరులతో డీఈఓ రాజేంద్ర ప్రసాద్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికలో విద్యార్థుల మార్కులను నమోదు చేయకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని డీఈఓ రాజేంద్ర ప్రసాద్‌ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీ చేసిన షెడ్యూల్‌ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఈ ప్రణాళిక అమలులో విద్యార్థులకు నిర్వహించే పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నమోదు చేయని వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. 331 పాఠశాలల్లో 13,065 మంది విద్యార్థుల మార్కులను మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారన్నారు. మిగిలిన పాఠశాలల్లో మార్కులను ఎందుకు అప్‌లోడ్‌ చేయడం లేదనే అంశం పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. క్షేత్రస్థాయిలో ఇందుకు కారణాలు పరిశీలించిన తర్వాత సబ్జెక్టు టీచర్లపై చర్యలు చేపడుతామని డీఈవో హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement