breaking news
Sangareddy
-
యాత్ర దానం విశేషాలివీ..
● యాత్ర దానం పేర బస్సును అద్దెకు తీసుకునేందుకు 55 సీట్లకు సంబంధించిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ● అనాథ చిన్నారులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులను ఈ ప్యాకేజీ కింద వారు కోరిన చోటుకు వెళ్లిరావచ్చు. ● దాతలు ప్రయాణికులెవరినీ సూచించని పక్షంలో ఆర్టీసీయే ఆ బాధ్యత తీసుకుంటుంది. ● ఎవరైనా దేవస్థానాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే అధికారులను సంప్రదించి యాత్ర దానం ద్వారా వెళ్లే బస్సుల్లో ఖాళీ ఉంటే వినియోగించుకోవచ్చు. ● కార్యక్రమం ద్వారా ఆర్టీసీకి ఆదాయం రావడంతోపాటు దాతలకు సామాజిక సేవ చేశామనే సంతృప్తి మిగులుతుంది. ● స్వచ్చంద సంస్థలు, దాతలు ఒకేసారి ఎక్కువమందిని ఈ సౌకర్యంతో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. -
రోడ్ల అభివృది్ధకి నిధులు
నారాయణఖేడ్: నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ రిజర్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ (సీఆర్ఐఎఫ్) నిధులు రూ.20కోట్లతో ఎన్హెచ్ 161బీ అనుసంధానంతో మూడుగుంటల చౌరస్తా నుంచి వయా సంజీవన్రావుపేట్, కడ్పల్, సిర్గాపూర్, చాప్టా(కె) క్రాస్రోడ్డు వరకు రహదారి అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కృషితో కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఈ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్కు అనుసంధానిస్తూ నాలుగు రోడ్లను, హ్యామ్కింద రూ.300 కోట్లతో రహదారులకోసం ప్రతిపాదించినట్లు తెలిపారు. బోర్గి, చౌకాన్పల్లి, కంగ్టి, ఖేడ్, రాయిపల్లి బీటీ రెన్యూవల్కు కూడా ప్రతిపాదించామని వెల్లడించారు. రూ.5కోట్లతో ఎన్జీ హుక్రాన రహదారి నిర్మాణం, వాసర్, కరస్గుత్తి ఎరక్పల్లికి రూ.5కోట్లు, రూప్లా తండా నుంచి లచ్చు తండాకు రూ.4.50కోట్లతో రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎస్టీ హ్యాబిటేషన్ కింద కొండానాయక్ తండా రూ.2.20కోట్లు, ఎకరన్పల్లి నుంచి హనుమాన్ తండాకు రూ.1.10 కోట్లు, లక్యానాయక్ తండాకు రూ.1.75కోట్లతో రహదారులను బీటీ రెన్యూవల్ చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యాదవరెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. సీఆర్ఐఎఫ్ ద్వారా రూ.20కోట్లు మంజూరు ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడి -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలే: అదనపు కలెక్టర్
సంగారెడ్డి జోన్: నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో పీసీసీ ఎన్డీటీ యాక్ట్ అమలుపై బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పూర్తిగా నిషేధించిందని, అందుకు పీసీసీఎన్డీటీ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్యాధికారి నాగనిర్మల తదితరులు పాల్గొన్నారు.ఎకరాకు రూ.20 వేల నష్ట పరిహారం ఇవ్వాలిమంజీర రైతు సమాఖ్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ డిమాండ్ రాయికోడ్(అందోల్): అతివృష్టి వల్ల జిల్లాలో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మంజీర రైతు సమాఖ్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. రాయికోడ్లో బుధవారం పాడైన పత్తి పంటలను సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వ రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దు అభిమానులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విజ్ఞప్తి పటాన్చెరు: ఈ ఏడాది తన పుట్టినరోజును జరుపుకోవడంలేదని అభిమానులు, పార్టీ కార్యకర్తలెవరూ తన జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి మరణం తర్వాత పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోకూడదని నిర్ణయం తీసుకున్నానని, అభిమానులెవరూ తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఈనెల 19న తన పుట్టినరోజున సన్నిహితులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు ఆయన తెలిపారు. తప్పనిసరిగా రశీదు ఇవ్వాలి జేడీఏ శివప్రసాద్ కొండాపూర్(సంగారెడ్డి): ఎరువులు కొంటున్న రైతులకు సంబంధిత డీలర్ తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయాధికారి కొండాపూర్లోని పీఏసీఎస్తో పాటు యూరియా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎరువులను అధిక ధరలకు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. అనంతరం బిల్ బుక్కులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అదేవిధంగా కొండాపూర్లో పత్తిపంటను పరిశీలించారు. అల్గోల్లో ఎన్సీసీ శిబిరం జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో తెలంగాణ 33 బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్ల సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం బుధవారం ప్రారంభమైంది. 600 మంది క్యాడెట్లకు 10 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ మాట్లాడుతూ...క్యాడెట్లకు నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, జాతీయ ఐక్యత స్ఫూర్తి పెంచుతామన్నారు. కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్ జె.రాములు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ జమీల్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి రవిపూరి సుబేదార్ మేజర్లు పాల్గొన్నారు. -
త్వరలో చెరువుల సుందరీకరణ
కంది(సంగారెడ్డి): హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) నిధులతో చెరువుల సుందరీకరణ చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. కంది చుట్టుపక్కల దేవుని చెరువు, కిసాన్సాగర్ చెరువు, పాత చెరువును టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి సందర్శించారు. చెరువుల వద్ద చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం మెట్లతోపాటు గణేశ్ నిమజ్జనం కోసం గద్దెలు నిర్మించాలన్నారు. చెరువుల చుట్టూ నెక్లెస్ రోడ్లను నిర్మించి పచ్చదనం ఏర్పాటుచేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. భూములను ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే పరిహారం చెల్లించి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ బాలగణేశ్ పాల్గొన్నారు.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి -
ముంపు బారిన మంజీరా తీరం
పుల్కల్(అందోల్): భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో మంజీరా నది తీరం వెంబడి పంటలు మునిగిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మంజీరానది పరీవాహకం సారవంతమైన నేల కావడంతో పంటలు బాగా పండుతాయని ఆశించిన రైతులను వరదలు దిక్కుతోచని స్థితిలోకి నెట్టాయి. ప్రాజెక్టుకు భారీ వరదలు రావడంతో క్రస్టుగేట్ల ద్వారా నీటిని వదలడం...ఆ నీరు మంజీరా బ్యారేజ్ గుండా దిగువకు సరాసరి పోకపోవడంతో మంజీరా నది ప్రవాహం వెంబడి నీరు నిలిచిపోయి పంటలు మునిగిపోయాయి. ప్రతీ ఏటా ఇదే పరిస్థితి సింగూరు ప్రాజెక్టు దిగువ నుంచి మంజీరా బ్యారేజ్ వరకు 22 కిలోమీటర్ల మంజీరా నది పరివాహకం ఇరువైపులా వరదల వల్ల పంటలు ముంపు బారిన పడుతున్నాయి. వరదలు వచ్చిన ప్రతి ఏటా పంటలు మునిగి పోవడం ఇక్కడ సాధారణమైపోయింది. పుల్కల్,సదాశివపేట,మునిపల్లి తదితర మండలాల పరిధిలోని మంజీరా నది పరీవాహకం రైతులకు కండగండ్లు మిగులుతున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి.. మంజీరా నది పరీవాహకంలో వరదల వల్ల ఏటా పంటలు మునిగిపోతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా బ్యారేజ్ వరకు ఉన్న భూముల్లో వరదల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. – కమాల్రెడ్డి రైతు, ముద్దాయిపేట ఏటా మునుగుతున్న పంటలు నష్టపోతున్న రైతులు -
అరు్హలందరికీ సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి జోన్: ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేవిధంగా చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రితో పాటు కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి నివాళులర్పించారు. అనంతరం మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ..నేటి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తుందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రెట్టింపు ఉత్సాహంతో కలిసికట్టుగా శ్రమించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 14,538 మంది లబ్ధిదారులకు ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారిని గుర్తించి, వారు నిర్మించుకునేందుకు జిల్లాలో 14,538 మంది దరఖాస్తుదారులకు ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 7,429 పనులు ప్రారంభం కాగా, 239 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.46కోట్లు లబ్ధిదారులకు చెల్లించడం జరిగిందని వివరించారు.విద్య, వైద్యానికి ప్రాధాన్యత జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 59 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించుకుంటున్నామని, అందుకు రూ. రూ.1.80 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రూ.186 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల భవనాన్ని ఇటీవలే ప్రారంభించామని, రూ.273 కోట్ల నిధులతో సంగారెడ్డిలో 500 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి వెల్లడించారు. దేశాభివృద్ధిలో శిల్పుల పాత్ర కీలకం నేటి సమాజంలో శిల్పులు, కార్మికులు, వృత్తిదారులు సాంప్రదాయ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.ఆహార భద్రత పథకం ద్వారా సన్నబియ్యం ప్రజా పాలన వేడుకల్లోమంత్రి దామోదర అమరవీరుల స్తూపం వద్ద నివాళులు కలెక్టరేట్లో ఆకట్టుకున్నసాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకం ద్వారా ప్రతీనెల ఉచితంగా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 846 రేషన్ దుకాణాల ద్వారా 13, 3719 మంది సభ్యులకు 3,736 క్వింటాళ్ల బియ్యం ప్రతీనెల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 4,10,652 తెల్ల రేషన్ కార్డులు, 26,078 అంత్యోదయ, 100 అన్నపూర్ణ కార్డులున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: చరిత్రను బీజేపీ, ఆర్ఎస్సెస్ వక్రీకరిస్తున్నాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. బీజేపీ నేతలకు, ఆర్ఎస్సెస్కు సాయుధ పోరాటానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు? సంగారెడ్డిలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడారు. నిజాం, బీజేపీ విధానాలు ఒక్కటేనని, మతం పేరిట ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాడు బ్రిటిష్ వాళ్లకుతొత్తుగా పని చేసింది ఆర్ఎస్సెస్ వాళ్లేనని, సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని తేల్చి చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ విమోచనదినంగా నిర్వహించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు, రాష్ట్ర నాయకుడు మల్లిఖార్జున్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికిఆర్ఎస్సెస్, బీజేపీలకు సంబంధమేంటి? సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడుబీవీ రాఘవులు -
ప్రతీ ఇంటికి ప్రభుత్వ సేవలు
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: ప్రతీ ఇంటికి ప్రభుత్వ సేవలు అందించడమే ప్రజా పాలన ప్రధాన లక్ష్యం అని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి చివరి వరకు ఒకే ఉత్సాహంతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కల్యాణి, తదితరులు పాల్గొన్నారు. -
కొండెంగలను పట్టుకుంటాం
జహీరాబాద్: పట్టణంలో ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్న కొండెంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నట్లు డీఎఫ్ఓ సి.శ్రీధర్రావు పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షి’ మెయిన్లో ‘కొండెంగల వీరంగం’, 20 మందికి గాయాలు శీర్షికన ప్రచురితమైన కథనానికి ఫారెస్టు, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు స్పందించారు. పట్టణంలోని శాంతినగర్, బాగారెడ్డిపల్లి, హౌసింగ్బోర్డు, హమాలీ కాలనీల్లో కొండెంగల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించారు. ఆయా కాలనీల ప్రజలు వాటి నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి విన్నవించారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ప్రజలు కోరారు. కాగా డీఎఫ్ఓ శ్రీధర్రావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్రావుతో సంప్రదింపులు జరిపారు. కొండెంగలను పట్టుకునేందుకు నిపుణుల బృందాన్ని రప్పించేందుకు ఏర్పాట్లు చేశామని, మహబూబ్నగర్ నుంచి పిలిపిస్తున్నట్లు చెప్పారు. గురువారం ఉదయం పట్టుకుంటారని తెలిపారు. బాధితులకు తగిన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరిపై దాడి .. జహీరాబాద్ టౌన్: పట్టణంలోని శాంతినగర్కు చెందిన మరో ఇద్దరిపై కొండముచ్చులు దాడి చేసి బుధవారం గాయపరిచాయి. శాంతినగర్కు చెందిన మారుతీరావు, సిద్ధులు వీధిలో వెళ్తుంటే రెండు కొండు ముచ్చులు వారిపై ఆకస్మికంగా దాడి చేశాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. జాగో తెలంగాణ నాయకులు రాములు నేత, శివప్రసాద్, ఎండీ ఇమ్రాన్ తదితరులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా అధికారులు వచ్చి గాయపడిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. వీరికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నాం జిల్లా ఫారెస్టు అధికారి శ్రీధర్రావు ‘సాక్షి’ కథనానికి స్పందన -
మిరుదొడ్డిలో నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే
మిరుదొడ్డి(దుబ్బాక): ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీనగర్, నిమ్హాన్స్ బెంగళూరు ఆధ్వర్యంలో బుధవారం మిరుదొడ్డిలో నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2 నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య స్థితి, జీవన శైలి సమస్యలు, ఆరోగ్య అవగాహన స్థాయిని అంచనా వేయడం, చికిత్స అంతరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్స్ డాక్టర్ వామన్ కులకర్ణి, డిపార్టుమెంట్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ సాయి కృష్ణా తిక్కా, తెలంగాణ స్టేట్ కో ఆర్డినేటర్ బి.ప్రవళిక, రారష్ట్ర ఆరోగ్య బృందం సభ్యులు గ్రేస్, వేణు మాధురి, రంజీత్, యాదవ్, శ్రీధర్, వెంకట్రావు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా పీహెచ్సీ డాక్టర్ సమీనా సుల్తానా, సీహెచ్ఓ లింగమూర్తి సర్వేను సమీక్షించారు. కళా ఉత్సవ్ పోటీలకు విద్యార్థులు ఎంపిక సిద్దిపేటరూరల్: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళా ఉత్సవ్ పోటీల్లో రాఘవాపూర్ కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారి జె .హేమలత ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశా ఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు గ్రూప్ డ్యాన్స్ విభాగంలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కరీనా , రాధిక, సుహాని, లిఖితను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జీఈసీఓ నర్మద, మండల విద్యాధికారి రాజిరెడ్డి అభినందించారు. జానపద పోటీల్లో రాణించిన విద్యార్థి సిద్దిపేట ఎడ్యుకేషన్: వరంగల్లో జరిగిన ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) విద్యార్థి సింధు పురుషోత్తం జానపద గేయపోటీల్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. కళాశాల సాంస్కృతిక విభాగం కన్వీనర్ డాక్టర్ మట్టా సంపత్కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం కళాశాలలో విద్యార్థిని ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, కృష్ణయ్య, ఉమామహేశ్వరి, వెంకటరమణ విద్యార్థిని అభినందించారు. విద్యార్థులకు గుణాత్మకమైన బోధనకొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మకమైన బోధనలు అందేలా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకుడు రమేశ్ తెలిపారు. బుధవారం మండలంలోని సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలోని 3,4,5 తరగతుల విద్యార్థులను సబ్జెక్టులలో పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి, హెచ్ఎం జయప్రకాశ్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భవనం పైనుంచి దూకి..
వట్పల్లి(అందోల్): మతిస్థిమితం సరిగాలేని మహిళ భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసు మండలంలో చర్చనీయాంశమైంది. వివరాలు... మునిపల్లి మండలం పెద్ద చెల్మడ గ్రామానికి చెందిన అంజమ్మ (45) అందోలు మండలంలోని మాసానిపల్లి గ్రామంలో గల తమ బంధువు కుమార్ గౌడ్ ఇంట్లో ఉంచారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో ఉండటంతో 15 రోజులుగా మందులు వాడకపోవడం వల్ల మతిస్థిమితం తప్పినట్లు బంధువులు చెప్పారు. 16న రాత్రి 9 గంటల సమయంలో అంజమ్మ భవనంపైకి ఎక్కి దూకింది. గమనించిన కుమార్ గౌడ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు సీపీఆర్ చేసి, జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అభ్యంతరం తెలిపారు. 17న 3 గంటల సమయంలో మృతదేహాన్ని పెద్ద చెల్మడ గ్రామానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పాండు వెళ్లి మృతదేహాన్ని తమకు అప్పగించాలన్నారు. దీంతో మృతురాలి బంధువులు, మృతురాలి భర్త రాజయ్య పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరకు నచ్చజెప్పి సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వారికి అప్పగించారు. మతిస్థిమితం సరిగా లేని మహిళ మృతి ఆస్పత్రి నుంచి మృతదేహం తరలింపు పోలీసులతో బంధువుల వాగ్వాదం -
గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
కొమురవెల్లి(సిద్దిపేట): గంజాయి అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ఫోర్స్, పోలీసులు కలిసి అరెస్టు చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చేర్యాల సీఐ ఎల్. శ్రీను ఎస్ఐ రాజుతో కలిసి వివరాలు వెల్లడించారు. మండల శివారులోని దాచారం గుట్ట సమీపంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, పోలీసులు కలిసి దాడి చేశారు. ఈ దాడిలో కుంభ భూమరాజును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 195 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.పారిశ్రామిక వాడలో.. తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): పారిశ్రామిక ప్రాంతంలో బీహార్కు చెందిన వ్యక్తి నుంచి 1.350 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సీఐ గోపాల్ వివరాలు వెల్లడించారు. మనోహరాబాద్ మండలం పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయాలపై నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించినట్లు తెలిపారు. తమ విచారణలో ఓ స్టోరేజీ పరిశ్రమలో బీహార్కు చెందిన ముఖేశ్ కుమార్ మండల్(29) ఆయా పరిశ్రమల్లో కార్మికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల యువకులకు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ఎండు గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నర్సాపూర్ ఎకై ్సజ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్ఐ బాలయ్య, హెడ్కానిస్టేబుల్ చంద్రయ్య, కానిస్టేబుళ్లు రాజు, నరేశ్, రవి, హరీశ్లు పాల్గొన్నారు. -
రజాకార్లకు ఎదురొడ్డిన బైరాన్పల్లి
మద్దూరు(హుస్నాబాద్): నిజాం రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బైరాన్పల్లి అమరవీరులదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా వీర బైరాన్పల్లి గ్రామంలోని అమవీరుల స్తూపం, బురుజు వద్ద భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజమైజన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అర్ధరాత్రి నెత్తురు పారిన నేల బైరాన్పల్లి అని పేర్కొన్నారు. రజాకార్ల ఆగడాలను అడ్డుకుంటూ , వారి మూకలను తరిమిగొట్టిన గొప్ప చరిత్ర ఈనేలకు ఉందన్నారు. 1948 ఆగస్టు 27న రజాకార్లు గ్రామంలోకి ప్రవేశించి కాల్చి చంపి , ఇంటింటికీ తిరిగి మారణకాండ సృష్టించి మరో జలియన్వాలా బాగ్ను సృష్టించారన్నారు. గ్రామం బయట శవాల చుట్టూ మహిళలను వివస్త్రలు చేసి బతుకమ్మ ఆటలు ఆడించిన ఘటనను గుర్తు చేసుకుంటే బాధేస్తుందన్నారు. ఈ ప్రాంతం స్ఫూర్తితో వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు, సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సీఎంతో మాట్లాడి బైరాన్పల్లి అమరవీరుల స్మారకం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటూ వారిని గౌరవించుకుంటామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.బైరాన్పల్లి అభివృద్ధికి కృషి: ఎంపీ చామలమనందరం ఈరోజు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామంటే బైరాన్పల్లి అమరవీరుల త్యాగాల వల్లేనని అని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. గ్రామానికి వీర బైరాన్పల్లిగా పేరు మార్చుకోడానికి గెజిట్ తీసుకువస్తామని, స్తూపం, బురుజు నిర్మాణం కోసం రూ. 10లక్షల నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డికి చెప్పి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని గత ప్రభుత్వం పదేళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, టీపీసీసీ కార్యదర్శి గిరి కొండల్రెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కమలాకర్ యాదవ్, బైరాన్పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామంలో స్మారక స్తూపం నిర్మిస్తాం -
సంజీవనితో పసి హృదయాలు పదిలం
కొండపాక(గజ్వేల్): సత్యసాయి సంజీవని ఆసుపత్రి.. పసి హృదయాలను పదిలం చేస్తున్న దేవాలయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కొండపాకలోని సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆస్పత్రిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 196 మంది చిన్న పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు విజయవంతమవ్వడంతో బుధవారం గిఫ్టు ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడుతూ సత్యసాయి సంజీవని ఆస్పత్రి సేవలు విశ్వవ్యాప్తం అయ్యేలా ప్రతీ ఒక్కరం బాధ్యతగా కృషి చెద్దామన్నారు. జీవితం శాశ్వతం కాదని చేస్తున్న మంచి పనులు శాశ్వతంగా నిలుస్తాయన్నారు. కొండపాక శివారులో అనాథ వృద్ధాశ్రమం, అష్టాదశ శక్తి పీఠ దేవాలయం, సత్యసాయి బాలికల జూనియర్ కళాశాలతో పాటు సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రి వెలువడంతో ప్రపంచ దేశాల్లో ఈ గడ్డ సేవా రంగంలో గొప్పగా పేరొందుతోందని అన్నారు. అనంతరం గుండె ఆపరేషన్ చేయించుకున్న పిల్లలకు గిప్టు ప్ లైఫ్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి నిర్వహణ చైర్మన్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు -
చికిత్స పొందుతూ తల్లి మృతి
గజ్వేల్రూరల్: విద్యుదాఘాతానికి గురై మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన మండలంలోని కొడకండ్లలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మిందె గౌరయ్య–మనిలా(38) దంపతులకు కూతురు రేణ, కొడుకు విష్ణు ఉన్నారు. వీరికి ఇంటితో పాటు ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. గౌరయ్య 4 ఏళ్ల క్రితం అనారోగ్యానికి గురై మృతి చెందడంతో పిల్లల బాధ్యత మనీలాపై పడింది. దీంతో ఆమె గజ్వేల్లోని ఓ హోటల్లో కూలీ పనులు చేస్తూ పిల్లలను సాకుతుంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం హోటల్లో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. నాలుగేళ్ల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. గ్రామస్తులు, బంధువుల సహకారంతో చందాలు వేసి బుధవారం మనీలా అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు పిల్లలను మానవతావాదులు, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.అనాథలుగా మారిన చిన్నారులు -
సేవే లక్ష్యం.. అవగాహనే ముఖ్యం
మర్కూక్(గజ్వేల్): గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందని, ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చేలా తమ వంతు కృషి చేస్తున్నారు. సేవే లక్ష్యంగా స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు. గ్రామంలోని వీధుల్లో చెత్తా చెదారం, ప్లాస్టిక్, మురుగు నీరు, ప్రజలకు రోగాలు ఏ విధంగా వస్తున్నాయని అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తయారు చేయాలనే లక్ష్యంతో 60 మంది విద్యార్థినులు గ్రూపులుగా విడిపోయి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని మాజీ సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో హైదరాబాద్లోని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఎన్ఎస్ఎస్ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల విద్యార్థినులు సుమారు 15 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మూడు రోజుల నుండి ఎర్రవల్లి గ్రామంలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామంలో రోడ్లపై మురుగునీరు పారుతుండటంతో దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు సోకే ప్రమాదం ఉందని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్త్ క్యాంపు నిర్వహించి రక్త పరీక్ష, హిమోగ్లోబిన్, బీపీ, షుగర్ వాటికి వెంటనే మందులు ఇస్తున్నారు. గ్రామ వీధుల్లో తిరుగుతూ పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, కవర్లను తొలగిస్తున్నారు. మూడు రోజులుగా గ్రామ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్నారని మాజీ సర్పంచ్ భాగ్య తెలిపారు.వ్యాధులపై అవగాహన ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. రోగాల భారిన పడకుండా ఉండేందుకు తమ వంతు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. వారికి అవగాహన కల్పించేలా స్వయంగా తామే పరిసరాలను శుభ్రం చేశాం. ప్రత్యేకంగా డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించాం. – ప్రియా, విద్యార్థిని ప్రజలతో మమేకమై.. నేను బేగంపేట మహిళా కళాశాలలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఎన్ఎస్ఎస్ క్యాంపులో పాల్గొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది. గ్రామాల్లోకి వచ్చి ప్రజలతో మమేకమై చాలా విషయాలు తెలుసుకున్నా. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతా. – నిక్షిత, విద్యార్థిని వ్యాధులు సోకకుండా జాగ్ర త్తలు గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాం. హెల్త్ క్యాంపు నిర్వహించి రక్త నమూనాలను సేకరించి వెంటనే మందులు పంపిణీ చేశాం. డెంగీ సోకకుండా జాగ్రత్తలు సూచించాం. ప్రజల సహకారం అభినందనీయం. – డాక్టర్ ప్రసన్న (ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్)ఎర్రవల్లిలో ప్లాస్టిక్ను సేకరిస్తున్న విద్యార్థులు పల్లె సేవలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థినులు -
బడిలో సందడి చేసి..
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీ హైదరాబాద్ చొరవతో కంది మండల పరిధిలోని ఎద్దు మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జపాన్లోని విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి ఆటలు ఆడి, చదువుతున్న తీరును, సంస్కృతి సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్చార్జి ఎంఈఓ జోగప్ప, ఐఐటీ ప్రొఫెసర్ హేమంత్ నూతలపాటి పాల్గొన్నారు. - కంది(సంగారెడ్డి)గడ్డపోతారం పట్టణ పరిధిలోని వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హిందీ పండిట్ మాధవీలత విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజారావు శర్మ, ఋషి, రాజిరెడ్డి, జయలతా, పవన్ రాజ్, పెంటయ్య తదితరులుపాల్గొన్నారు. - జిన్నారం (పటాన్చెరు) -
ఖేడ్ గురుకులం ప్రిన్సిపాల్ బదిలీ
నారాయణఖేడ్: నారాయణఖేడ్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ నాయక్ బదిలీ అయ్యారు. ప్రిన్సిపాల్గా శ్రీనివాస్ నాయక్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతోపాటు విద్యార్థులు గజ్జి, తామరతో సతమతమయ్యారు. ఈ విషయాలు పత్రికల్లో రావడంతో ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాఠశాలను తనిఖీ చేసి గురుకులం నిర్వహణ తీరుపై, ప్రిన్సిపాల్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ సెక్రెటరీ తిరుపతి, ఆర్సీవో గౌతమిరెడ్డి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ప్రిన్సిపాల్ను జూబ్లిహిల్స్ పాఠశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జేఎల్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రతిభకు ఇన్చార్జీ బాధ్యలు అప్పగించారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్ : విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో మంగళవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌడలకు రక్షణ కల్పించాలి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్ సంగారెడ్డి టౌన్: గౌడ కులస్తులకు గ్రామాల్లో రక్షణ కల్పించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలోని గౌడ కులానికి చెందిన వారిని విడిసి పేరుతో గ్రామ బహిష్కరణ చేసి దౌర్జన్యం చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ...గౌడలకు రక్షణ కల్పించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వలంటీర్లతో భర్తీ చేయండిజిన్నారం (పటాన్చెరు): జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలను తక్షణమే విద్యా వలంటీర్లతో భర్తీ చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిన్నారంలో ఆయన విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ...ఇటీవల మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులపై వెళ్లడంతో ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. పలు పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పోరాటాలకుసిద్ధం కావాలి: రాజయ్యజహీరాబాద్ టౌన్: తెలంగాణ రైతాంగ సాయుఽ ద పోరాటాల స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాజయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని శ్రామిక్ భవన్లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు ఆయన హాజరై మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయక్వతం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాటం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యుడు బి.రాంచందర్, నాయకులు మహి పాల్, సలీమోద్దీన్ పాల్గొన్నారు. -
సీఎం పర్యటనలోగా డీపీఆర్ సిద్ధం
● ఇంజనీరింగ్ అధికారులసమావేశంలో జగ్గారెడ్డి ఆదేశం ● 30లోగా మంజీరా తాగునీటి పథకం అంచనాలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి పర్యటన నేపథ్యంలో మంజీరా తాగునీటి పథకానికి సంబంధించిన అంచనాలను ఈనెల 30 లోగా సిద్ధం చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. కన్సల్టెన్సీ కంపెనీ ఈ డీపీఆర్లను సిద్ధం చేయాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశమందిరంలో హెచ్ఎండబ్ల్యూఎస్, పబ్లిక్హెల్త్, నీటిపారుదల, మిషన్ భగీరథ, మున్సి పల్ కమిషనర్లతో మంగళవారం సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ...సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు రానున్న 50 ఏళ్ల జనాభాకు సరిపడేలా ఈ తాగునీటి పథకాల పైప్లైన్లు, ఇంటెక్ వెల్లు, ఓవర్హెడ్ ట్యాంకులు, ఫిల్టర్బెడ్లను డిజైన్ చేయాలన్నారు. తాళ్లపల్లి ఫిల్టర్బెడ్ ఆధునీకరణ, సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాల్లోని 54 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరాకు పైప్లైన్ల మరమ్మతులకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సదాశివపేట మున్సిపాలి టీకి 25 ఎంఎల్డీ, సంగారెడ్డికి 50 ఎంఎల్డీ నీటి కేటాయింపుల కోసం నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ ఈఎన్సీలకు ప్రతిపాదన లేఖలు పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, ఆయా శాఖల పర్యవేక్షక ఇంజనీర్లు, డీఈలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డీజేఎఫ్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణసంగారెడ్డి టౌన్: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సెప్టెంబర్ 19న జరగనున్న దళిత జర్నలిస్ట్ ఫోరం 10వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను మంగళవారం సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, సీనియర్ జర్నలిస్టులు దేవదాస్ పాల్గొన్నారు. -
మళ్లీ టెర్మినల్ ప్రతిపాదనలు
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్ అంశం మరోసారి తెరపైకి రావడంతో స్థానిక ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొన్నేళ్లుగా టెర్మినల్ ప్రతిపాదనలు వినిపిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. ప్రస్తుతం తెల్లాపూర్వైపు శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. దీంతో రైల్వే టెర్మినల్ ప్రతిపాదనలు మరోసారి ముందుకురావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెర్మినల్ను అభివృద్ధి చేస్తే ప్రజా రవాణ వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈదులనాగులపల్లి అనువైన ప్రాంతం.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్లు ప్రయాణికులకు సరైన విధంగా సేవలందించలేకపోతోంది. గతంలో రైల్వే అధికారులు దీనిపై నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా చర్లపల్లి, ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ టెర్మినల్ ఏర్పాటైతే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను ఇక్కడ నుంచి నడిపించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నాయి. హైదరాబాద్, ముంబై వెళ్లే మార్గంలోనే ఈదులనాగులపల్లి ఉండటం, ప్రస్తుత ప్లాట్ఫామ్లతోపాటు మరిన్ని ప్లాట్ఫామ్లను పెంచడానికి అనుకూలమైన ప్రాంతంగా అధికారులు ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అయితే అప్పటి జిల్లా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూసేకరణ సజావుగా సాగలేదు. ఎంపీ రఘునందన్రావు ప్రత్యేక కృషితో టెర్మినల్ ఏర్పాటుపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ప్రయాణం మరింత సులభం పటాన్చెరు పారిశ్రామికవాడ కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారు సొంతగ్రామాలకు పోవాలంటే సికింద్రాబాద్, నాంపల్లిలోని రైల్వేస్టేషన్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాఫిక్ సమస్యతో సకాలంలో రైల్వేస్టేషన్కు చేరుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో టెర్మినల్ ఏర్పాటైతే స్థానిక యువతతోపాటు వేలాదిమందికి ఉపాధి కలుగుతుందని, అభివృద్ధితోపాటు వాణిజ్య, రియల్ వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయడుతున్నారు. రైల్వేస్టేషన్ను సందర్శించిన కేంద్ర రైల్వే సహాయ మంత్రి ఇటీవల బీదర్కు వెళుతున్న కేంద్ర రైల్వే సహాయమంత్రి సోమన్నను ఈదులనాగులపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఎంపీ రఘునందన్రావు ఆపి సమస్యను వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇక్కడి వసతులను చూపించారు. ఇక్కడ రైల్వే టెర్మినల్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరగడంతోపాటు రైల్వే శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని వివరించి వినతిపత్రంఅందజేశారు. మరింత అభివృద్ధి జరుగుతుంది ఈదులనాగులపల్లి రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వాలను కోరాం. రైల్వే టెర్మినల్ ఈప్రాంత ప్రజలకు ఎంతో అవసరం. దాని వలన ఈప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఇందుకోసం తనవంతు కృషి చేస్తాను. – గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్యే టెర్మినల్ ఎంతో అవసరం ఈ ప్రాంతంలో అనేక రాష్ట్రాల ప్రజలు నివాసముంటున్నారు. వారు సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటే సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు పోతున్నారు. ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ టెర్మినల్ ఏర్పాటైతే వారి ప్రయాణం సులభంగా మారుతుంది. టెర్మినల్ ఏర్పాటుకు అవసరమైన భూమి కూడా అందుబాటులోనే ఉంది. ఈ విషయాన్ని సంబంధిత కేంద్రమంత్రులదృష్టికి తీసుకెళ్లాం. – ఎం.రఘునందన్ రావు, ఎంపీ -
అంకితభావంతో పనిచేయాలి: ఎస్పీ
హత్నూర పీఎస్ ఆకస్మిక తనిఖీ హత్నూర (సంగారెడ్డి): విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. హత్నూర పోలీస్స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన ప్రతి పోలీసుకు గుర్తింపు లభిస్తుందన్నారు. సిబ్బందికి విధుల పరంగా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎస్పీ కార్యాలయంలో తను నేరుగా కలవచ్చని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు మెయింటెనెన్స్ బాగుందని ఎస్ఐ శ్రీధర్రెడ్డితోపాటు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన పెంచాలని తెలిపారు. ఎప్సీ పరితోశ్ వెంట డీఎస్పీ ప్రభాకర్, సీఐ నయీముద్దీన్, ఎస్సై శ్రీధర్రెడ్డి, సీసీ వినయ్ సిబ్బంది ఉన్నారు. -
వందరోజుల్లో అమీన్పూర్కు రోడ్డు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్కుఎంపీ ఎం.రఘునందన్రావు వినతిరామచంద్రాపురం(పటాన్చెరు): భెల్ చౌరస్తా నుంచి అమీన్పూర్ మీదుగా సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కు వరకు వందరోజుల్లో రోడ్డును పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ను ఎంపీ ఎం.రఘునంద న్రావు కోరారు. మంగళవారం రామచంద్రాపురం పట్టణంలోని భెల్ చౌరస్తాలో కర్ణన్తో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భెల్ చౌరస్తాలోని జాతీయరహదారి నుంచి రింగ్రోడ్డు వరకు రూ.వందకోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం తన ప్రధాన లక్ష్యమన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. నాలాగా మారిన చిన్నవాగులోని ఆక్రమణలను వెంటనే తొలగించి దానిపై వంతెన నిర్మించాలని ఆదేశించారు. ఈ రహదారి పూర్తయితే అమీన్పూర్, బొల్లారం ప్రాంతంలోని ప్రజలతో పాటు శేరిలింగంపల్లి ప్రజలకు రింగ్ రోడ్డు ప్రయాణం సులభతరమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, నాయకులు ఎడ్ల రమేశ్, నర్సింగ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
రేషన్దుకాణం తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 53వ నంబరు రేషన్ దుకాణాన్ని స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణం ఎదుట గోడపై ఏర్పాటుచేసిన నిల్వలపట్టిక బోర్డు, దుకాణంలో తూకపు యంత్రం, రేషన్ సరుకులు నిల్వ ఉంచే చోటును పరిశీలించారు. దుకాణం పరిధిలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య, సరఫరా అయ్యే సరకులు తదితర విషయాలను డీలరు సంతోషిరాణిని అడిగి తెలుసుకున్నారు. దుకాణాన్ని శుభ్రంగా ఉంచి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆమె వెంట పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దారు మహేశ్, ఆర్ఐ మాధవరెడ్డి, గ్రామ పాలనాధికారి సుధాకర్ ఉన్నారు. -
మేకులు మింగిన ఖైదీలు.. వైద్యానికి సహకరించకుండా హల్చల్
చోరీ కేసుల్లో అరెస్టై సంగారెడ్డి కారాగారాంలో ఉన్న ఇద్దరు ఖైదీలు.. మేకులు,బ్యాటరీలు మింగి హల్చల్ చేసిన ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే.. చోరీ కేసులో జైలుకొచ్చిన ఛావుస్,మధు ట్రబుల్ మేకర్లుగా ఉన్నారు. రెండురోజుల క్రితం అందుబాటులో ఉన్న మేకులు, టీవీరిమోట్కు ఉండే బ్యాటరీలు మింగి గుడ్లు తేలేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పతత్రికి తరలించారు. ఇద్దరూ రెండ్రోజులుగా వైద్యానికి సహకరించడం లేదని దగ్గరకు వచ్చేవారిపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారి కడుపులో ఉన్న బ్యాటరీలు,మేకులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని లేదంటే సెప్టిక్ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో ఉంటే బ్యాటరీలు పగిలితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై జైలు సూపరిటెండెంట్ కళాసాగర్ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులో లేరు. -
''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్కు తన లేఖలో పేర్కొంది. -
నిరుద్యోగులకు వరంగా డీట్
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయాలు కీలకపాత్ర పోషించేవి జిల్లా ఉపాధి కేంద్రాల్లో నమోదైన సీనియారిటీని బట్టి ఉద్యోగ సమాచారాన్ని అభ్యర్థులకు అందజేసేవి. కాలక్రమేణా వచ్చిన మార్పులకనుగుణంగా ప్రైవేటు ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ను కూడా డిజిటల్ రూపంలో అందజేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’(డీట్) యాప్ ఇప్పుడు నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’(డీఈఈటీ/డీట్) యాప్ను తీసుకొచ్చింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల సమన్వయంతో రూపొందిన ఈ ఏఐ ఆధారిత డిజిటల్ ఫ్లాట్ఫాం నిరుద్యోగులకు నమ్మకమైన ఉద్యోగావ కాశాలను కల్పిస్తోంది. ఈ యాప్తో యువత బోగస్ కంపెనీలు, మోసగాళ్ల బారిన పడకుండా ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఖాళీల సమాచారం డీట్యాప్ ద్వారా పరిశ్రమలు, కంపెనీలు తమ ఖాళీలను నిరుద్యోగుల మొబైల్ఫోన్లకు పంపిస్తాయి. ఈ సమాచారంలో విద్యార్హతలు, వేతన వివరాలు, ఖాళీల సంఖ్య, మౌఖిక, రాత పరీక్షల వివరాలు ఉంటాయి. ఈ విధంగా సమగ్ర సమాచారం అందిన నిరుద్యోగులు నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరుకావచ్చు. యాప్కు కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను అనుసంధానం చేశారు. దీంతో ఇది మరింత సమర్థవంతంగా, వేగవంతంగా సేవలను అందిస్తోంది. పదో తరగతి నుంచి ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్హతలు కలిగినవారు ఎవరైనా ఈ యాప్లో నమోదుకావచ్చు. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఖాళీలున్నా వారి అర్హతల ఆధారంగా ఉద్యోగ సమచారం లభిస్తుంది. ప్రయోజనాలివే... రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా... ఆన్లైన్లో వెబ్సైట్ నుంచి లేదా గూగుల్ప్లే స్టోర్ నుంచి డీట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. పేరు, పుట్టినతేదీ, సెల్నంబర్, ఈమెయిల్ఐడీ, విద్యార్హతలు, టెక్నికల్ కోర్సులు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆశించే ఉద్యోగరకం, పనిచేయాలనుకునే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలి.వినియోగించుకోవాలి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డీట్లో నమోదు చేసుకున్న యువతకు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోని కంపెనీల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలు ఎప్పుటికప్పుడు వారి ఫోన్లకు నోటిఫికేషన్లు అందుతాయి. వాటి ఆధారంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. – తుల్జా నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి(జీఎం)యాప్లో నమోదైతే ఫోన్లకు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం -
రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
తహసీల్దార్ కార్యాలయం వద్ద పీడీఎస్యూ ఆందోళన సదాశివపేట(సంగారెడ్డి): పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సరస్వతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ...ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ క్రమం తప్పకుండా విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయడం లేదన్నారు. దీంతో ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి పరిహారం అందించాలిసంగారెడ్డి జోన్: సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం వెంటనే అందించాలని కార్మిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందినా ఇప్పటివరకు యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు పరిహారం అందలేదని మండిపడ్డారు. వంద పడకల ఆస్పత్రిగాఅప్గ్రేడ్ చేయాలిడీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రభుత్వ హాస్పిటల్ను వందపడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్చేసి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని సందర్శించి అక్కడి సమస్యలను రోగులు, సహాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రోగులకు సరిపోను పడకలు లేక మెరుగైన సదుపాయాలు లేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారన్నారు. భూసేకరణ నోటిఫికేషన్రద్దు చేయాలిసీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు సంగారెడ్డి ఎడ్యుకేషన్: నిమ్జ్కోసం ఝరాసంగం మండలంలోని ఎల్గొయి గ్రామంలో 195 ఎకరాల భూసేకరణకు వేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ రైతులు చేస్తున్న ధర్నాకు సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...సారవంతమైన, బహుళ పంటలు పండే వ్యవసాయ భూములను పరిశ్రమల పేరుతో బలవంతంగా లాక్కోవడం సరికాదన్నారు. -
చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాదులు
దుబ్బాక: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని మతోన్మాదులు చరిత్రను వక్రీకరించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో సీపీఎం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి ,వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడికే భూమి దక్కాలని దొరలు, భూస్వాములు, రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో పోరాటాలు నిర్వహించి 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. ఈ సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భాస్కర్, జిల్లా నాయకులు గోపాలస్వామి, నవీన, భాస్కర్, ఎల్లయ్య, సాధిక్ పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి -
పంట నష్టం 5,548 ఎకరాలు
● అత్యధికంగా పత్తి పంటకు నష్టం ● ప్రభుత్వానికి అధికారుల నివేదికసంగారెడ్డి జోన్: గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 5,548 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు వ్యవసాయాధికారులు వెల్లడించారు. 20 మండలాల్లో 4,706 మంది రైతులు జిల్లాలో 20 మండలాల్లో 4,706 మంది రైతులు పంట పొలాల్లో నష్టం వాటిలినట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇందులో అత్యధికంగా పత్తి పంటకు నష్టం జరగగా సోయాబీన్, వరి, మొక్కజొన్నతోపాటు పప్పు దినుసులు దెబ్బతిన్నాయి. పెసర, మినుము పంటలు కోతదశలో వర్షాలు కురవడంతో రంగు మారి దెబ్బతిన్నాయి. పరిహారం కోసం ఎదురుచూపులు కురిసిన వర్షాలకు రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. అదేవిధంగా సాగులో ఉన్న పంటలకు సైతం తెగుళ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఎప్పుడు అందుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వానికి నివేదికలు నష్టపోయిన పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. త్వరలోనే నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తాం. – శివప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, సంగారెడ్డి -
నిరుపయోగంగా ఏడీఏ కార్యాలయం
లక్షల నిధులు వెచ్చించి.. అసంపూర్తిగా వదిలిన వైనంజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలో వ్యవసాయశాఖ ఏడీఏ కార్యాలయం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిధుల కొరత కారణంగా వినియోగంలోకి రాకుండాపోయింది. దీంతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్ భవానీ మందిరం రోడ్డులో రాచన్నపేట ఉన్న వ్యవసాయశాఖ డివిజన్(ఏడీఏ) కార్యాలయం నిరుపయోగంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన కార్యాలయం భవనం దెబ్బతింది. ఏడీఏ కార్యాలయం పక్కనే ఉన్న గోదాం స్థానంలో నూతన ఏడీఏ కార్యాలయం నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020లో రూ.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి ప్రారంభంలో భవన నిర్మాణ పనులు శరవేగంతో చేపట్టారు. ఇంకా కరెంట్, కలర్, లైట్స్, ప్రహారీగోడ తదితర పనులు మిగిలిపోయాయి. నిధుల కొరత వల్ల సదరు కాంట్రాక్టు పనులు అసంపూర్తిగా వదిలేశారు. మరో రూ.10 లక్షలు ఖర్చుచేస్తే ఏడీఏ కార్యాలయ భవనం వినియోగంలోకి వస్తుందన్నారు. అయితే గతేడాది జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ పరిశీలించారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. కానీ, ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడంతో ఆ కార్యాలయం అసంపూర్తిగా ఉంది. అసంపూర్తిగా ఉన్న ఏడీఏకార్యాలయ భవనం -
పోషక లోప నివారణ.. ఆరోగ్య రక్షణ
నిత్యం కార్యక్రమాలు ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రోజుకో కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణి, పాలిచ్చే తల్లులు, శిశువులు, చిన్నపిల్లల పోషణపై సలహా సమావేశం, పౌష్టికాహారం తయారీపై వంటకాల పోటీలు, కిశోర బాలికలకు, పెద్దవాళ్ల కోసం బీఎంఐ పరీక్షలు, పిల్లల కోసం ఎత్తు, బరువు, కొలతలు తీయడం, ఆహారంలో చెక్కెర, నూనె వినియోగాన్ని తగ్గించే విషయంపై అవగాహన కల్పించనున్నారు. తండ్రులతో పోషకాహార ప్రతిజ్ఞ, 3 ఏళ్లలోపు పిల్లల ఆరంభ అభివృద్ధి, స్థానిక ఉత్పత్తులు, బొమ్మలపై అవగాహన కల్పిస్తారు. వంటకాలు స్వయంగా తయారు చేయడం, బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టడంపై, ఆహారపు అలవాట్లు అలవర్చుకునేలా వివరిస్తారు. ఆరోగ్యవంతమైన పిల్లలు, తల్లులు, పోషణ లోపం ఉన్న వారి మధ్య అనుభవం పంచుకోవడం, చిరు ధాన్యాలు, ఫలాలు, కూరగాయలపై , అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలకు పరీక్షలు, రక్తహీనత, అధిక బరువు వల్ల వచ్చే సమస్యలపై కిశోర బాలికలకు అవగాహన చేపట్టనున్నారు.నిర్వహణకు ఏర్పాట్లు జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం నిత్యం ఓ కార్యక్రమం నెల పాటు నిర్వహిస్తాం. చిన్నారులు, మహిళలకు ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కల్పించనున్నాం. – లలితకుమారి, ప్రాజెక్టు డైరెక్టర్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, సంగారెడ్డి చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగు పర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోంది. అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పోషణ సందేశం చేరవేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పోషణ మాసంలో ప్రజాప్రతినిధులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులకు ఆ శాఖ ద్వారా లేఖలు కూడా పంపించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, ఆరోగ్య పరీక్షల క్యాంపులు నిర్వహించనున్నారు. పోషణ మాసం సందర్భంగా చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు, పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.17 నుంచి పోషణ మాసం షురూ.. చిన్నారులు, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహణ నెల రోజులపాటు నిత్యం ఓ కార్యక్రమం -
పెచ్చులూడిన పాఠశాల పైకప్పు
విద్యార్థులకు తప్పిన ప్రమాదం అల్లాదుర్గం(మెదక్): పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాఠశాల స్లాబు పెచ్చులూడి కింద పడ్డాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి గడి పెద్దాపూర్ జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ భవనాన్ని 60 ఏళ్ల క్రితం నిర్మించారు. కొన్ని గదులు రేకులతో నిర్మించగా వాటికి రంధ్రాలు పడ్డాయి. మరో రెండు గదులు సైతం శిథిలావస్థకు చేరుకొని వర్షం పడితే గదుల్లోకి నీరు చేరుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తరతిగది పెచ్చులూడి పడ్డాయి. విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రసవానికి వెళితే పుస్తె అపహరణ జోగిపేట ఏరియా ఆస్పత్రిలో ఘటన జోగిపేట(అందోల్): ఆస్పత్రికి ప్రసవానికి వెళితే పుస్తెను అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఈనెల 13న అందోలు మండలం పోసానిపేట గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవం కోసం జోగిపేట ఏరియా ఆస్పత్రిలో చేరింది. సర్జరీ తప్పనిసరి కావడంతో శనివారం ఆ మహిళను ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లారు. ఆపరేషన్ సమయంలో సిబ్బంది థియేటర్ ప్రక్క గదిలోకి తీసుకువెళ్లి మెడలో పుస్తె, బంగారు ఆభరణాలు(నాలుగు గ్రాములు) తీసేశారు. అదే రోజు సర్జరీ చేశారు. ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. సర్జరీ తర్వాత బయటకు వచ్చాక బంగారు పుస్తెను భర్తను అడుగగా తనకు ఇవ్వలేదని చెప్పాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని అడుగగా తమకు తెలియదని చెప్పారు. ఈ వివాదం ఆస్పత్రి సూపరింటెండెంట్ సౌజన్య వద్దకు వెళ్లడంతో సిబ్బందిని పిలిచి మందలించింది. అయినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి భర్త అశోక్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం రూ.40వేల విలువ ఉంటుందని బాధితులు తెలిపారు. అయితే ఆడపిల్ల పుట్టగానే రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.వెయ్యి ఇచ్చినట్లు బాధిత మహిళ చెప్పారు. -
కుంటలో బాలుడి గల్లంతు
జహీరాబాద్ టౌన్: ఈతకు వెళ్లిన బాలుడు కుంటలో గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... కోహీర్ మండలం పిచరాగడి గ్రామానికి చెందిన రిజ్వాన్(17) స్నేహితులు సలీం, గుల్లుతో కలిసి సోమవారం హుగ్గెల్లి గ్రామ శివారులో గల కుంటలో ఈత కొట్టేందుకు వచ్చారు. రిజ్వాన్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో ఈత రాకపోవడంతో నీట మునిగాడు. ఈ ఘటనతో భయపడిన స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కుంటలో గాలింపు చేపట్టారు. చీకటి పడుతున్నా బాలుడి ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం గాలింపు చేపట్టనున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. -
కరెంటు వైరు లాగుతుండగా..
నర్సాపూర్: కరెంటు వైరు లాగుతుండగా సోమవారం ఇద్దరు కార్మికులు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలిలు ఇలా... నర్సాపూర్లోని ఫైర్ స్టేషన్కు కొత్త భవనం మంజూరు కావడంతో నిర్మాణ పనులు ఇటీవల చేపట్టారు. భవనం నిర్మిస్తున్న స్థలం మీదుగా కరెంటు వైర్లు ఉండటంతో వాటిని తొలగించి కొత్త వైరు లాగే పనులు విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్ స్వామికి అప్పగించారు. సోమవారం ఐదుమంది కార్మికులతో ఫైర్ స్టేషన్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి హై టెన్షన్(హెచ్టీ) కరెంటు సప్లై టవర్ మీదుగా పనులు చేపట్టారు. ఈ క్రమంలో కార్మికుడు అనిల్ హెచ్టీ కరెంటు సప్లై టవర్ వద్ద పని చేస్తుండగా మరో కార్మికుడు సంతోష్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలోని స్తంభం వద్ద పనులు చేస్తున్నారు. అనిల్కు కరెంటు షాక్ తగలడంతో హెచ్టీ సప్లై టవర్ నుంచి మరో స్తంభానికి ఉన్న కండక్టర్ వైరుపై వేలాడాడు. సంతోష్కు షాక్ కొట్టడంతో పక్కనే ఉన్న దుకాణం రేకుల షెడ్డుపై పడ్డాడు. కాగా వైరుపై వేలాడుతున్న అనిల్ను కిందకు దించేందుకు ఫైర్ స్టేషన్ సిబ్బంది ప్రయత్నించే లోపు నేలపై పడ్డాడు. సంతోష్ను రేకుల షెడ్డుపై నుంచి ఫైర్ సిబ్బంది కిందకు దించారు. ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం అనిల్ను గాంధీ ఆస్పత్రికి , సంతోష్ను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అనిల్ కౌడిపల్లి మండలం గౌతాపూర్ తండా, సంతోష్ అదే మండలం కొత్త చెరువు తండాకు చెందిన వాడు. కాగా ఇద్దరు కొంత కాలంగా కరెంటు కాంట్రాక్టర్ల వద్ద కార్మికులుగా పని చేస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా.. వైరు లాగే పనులు చేపట్టేందుకు సబ్స్టేషన్ నుంచి విద్యుత్ శాఖ ఉద్యోగి, కాంట్రాక్టర్ ఎల్సీ తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్సీ తీసుకుని పనులు చేపట్టారు: ఏడీఈ ఫైర్ స్టేషన్కు కొత్త భవనం నిర్మించాలనుకున్న చోట కరెంటు వైర్లు ఉన్నందున వాటిని తొలగించి కొత్త వైర్లు లాగాలని ఫైర్ స్టేషన్ అధికారులు కోరారని స్థానిక ఏడీఈ రమణారెడ్డి తెలిపారు. అందులో భాగంగా కాంట్రాక్టర్ స్వామికి పనులు అప్పగించారన్నారు. స్థానిక లైన్ ఇన్స్పెక్టర్ శివరాం లైన్ క్లియర్ తీసుకున్న తర్వాత పనులు చేపట్టారని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. షాక్ కొట్టి ఇద్దరు కార్మికులకు గాయాలు మెదక్ జిల్లాలో ఘటన -
అభివృద్ధి పనులపై అధ్యయనం
మల్కాపూర్లో యూపీ బృందం పర్యటనతూప్రాన్: మండలంలోని ఆదర్శ గ్రామం మల్కాపూర్ను ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్రజాప్రతినిధుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధ్యయనం చేశారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో యూపీకి చెందిన సుమారు 20 మంది ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్యార్డు, సిగ్రిగేషన్, రాక్ గార్డెన్, కమ్యూనిటీహల్, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించించారు. ఇదే తరహాలో తమ రాష్ట్రంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వారి వెంట ఎంపీడీఓ సతీశ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. -
మార్షల్ఆర్ట్స్తో ఆత్మవిశ్వాసం
వర్గల్(గజ్వేల్): మార్షల్ ఆర్ట్స్ బాలికలకు ఆత్మరక్షణతోపాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందింపజేస్తాయని పూలే బాలికల గురుకుల బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు అన్నారు. సోమవారం గురుకులంలో కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు డైనమిక్ షోటోకాన్ అసోసియేషన్ బెల్ట్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 104 మంది విద్యార్థులకు వారి స్థాయిలను బట్టి బ్రౌన్, పర్పుల్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో బెల్ట్లను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గోవిందరావు, స్పోర్ట్స్ ఇన్చార్జి శాలిని, పీడీ లోకేశ్వరి పాల్గొన్నారు.104 మందికి బెల్ట్లు ప్రదానం -
కమ్యూనిస్టులే.. సాయుధ పోరాట వారసులు
హుస్నాబాద్రూరల్: తెలంగాణ సాయుధ పోరాట వారసులు భారత కమ్యూనిస్టు నేతలేనని సీపీఐ నాయకుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సోమవారం మహ్మదాపూర్లో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించింది కమ్యూనిస్టులేనన్నారు. చరిత్ర చెరిపేస్తే పోయేది కాదని ఏడాది పాటు సాగిన సాయుధ పోరాటంలో 4,500 మంది సీపీఐ నేతలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆనాటి సాయుధ పోరాటంను హిందు, ముస్లింలకు జరిగినట్లుగా బీజేపీ నాయకులు చిత్రీకరించి చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చి 13 ఏళ్లు గడిచినా విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మల్లేశ్, శ్రీనివాస్, శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్గా కృష్ణమూర్తి
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్గా కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ డీవీ శ్రీనివాస్రావును మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఇన్చార్జి బాధ్యతలను కూడా సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తికి అప్పగించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అలాగే పేకాట, గ్యాంబ్లింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అణచివేయాలని సూచించారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినులురామాయంపేట(మెదక్): పట్టణంలోని పలు కళాశాలలు, హాస్టళ్లకు చెందిన విద్యార్థినులు జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో హాస్టళ్ల భవనాల చుట్టూ మురుగు నీరు నిలిచి దోమలతో సతమతమవుతున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. కాగా గురుకుల డిగ్రీ హాస్టల్కు చెందిన ముగ్గురు విద్యార్థినులు జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యుత్ వైరు కాళ్లకు తాకి..– షాక్తో రైతు మృతి పాపన్నపేట(మెదక్): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని యూసుఫ్పేటలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మిన్పూర్ శేఖర్(30)పొలానికి వెళ్తూ.. హైదరాబాద్లో ఉంటున్న తన తమ్మునితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో తెగి పడిన విద్యుత్ వైరును చూడకపోవడంతో కాళ్లకు తగిలింది. షాక్ కొట్టగానే అరుస్తూ కిందపడ్డాడు. ఫోన్లో అన్న అరుపు విన్న తమ్ముడు అప్రమత్తమై కుటుంబీకులకు చెప్పాడు. వెంటనే వాళ్లు పొలం వద్దకు వెళ్లి కొన ఊపిరితో ఉన్న శేఖర్ను మెదక్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య యశోద, కొడుకులు ప్రదీప్, హర్షవర్ధన్ ఉన్నారు. పోక్సో కేసులో ఒకరికి జైలుపెద్దశంకరంపేట(మెదక్): పోక్సో కేసులో కోర్టు ఒకరికి 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమాన విధించింది. ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి వివరాల ప్రకారం... మండల పరిధిలోని మాడ్చెట్పల్లి గ్రామానికి చెందిన నిందితుడు తలారి మోహన్ 2020లో ఎనిమిదేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం చేశాడు. దీంతో అతడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ పూర్తి కావడంతో మెదక్ ఫాస్ట్రాక్ కోర్టు జడ్జి నీలిమ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమాన విధించినట్లు పోలీసులు తెలిపారు. కొండముచ్చుల దాడిలో వ్యక్తికి గాయాలుజహీరాబాద్ టౌన్: పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో సోమవారం కొండముచ్చులు వ్యక్తిపై దాడి చేశాయి. ఈ దాడిలో శాంతినగర్కు చెందిన అమర్కు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం రాంనగర్, గాంధీనగర్ ప్రాంతంలో కొండముచ్చుల గుంపు రోడ్డుపై నుంచి వెళ్తున్న ప్రజలపై దాడి చేయగా శరణమ్మ, రాజ్కుమార్లకు గాయాలైన విషయం తెలిసిందే. వరుసగా కొండముచ్చులు దాడి చేయడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
దైవదర్శనానికి వెళ్లొస్తుండగా..
అబ్దుల్లాపూర్మెట్ / జిన్నారం (పటాన్చెరు): స్నేహితులంతా కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతిచెందగా ముగ్గురికి తీవ్ర, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిఽధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ వెంకటేశ్వర్ రెడ్డి కూతురు సౌమ్యారెడ్డి (25) నగరంలోని ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. తన స్నేహితులైన నందకిశోర్, వీరేంద్ర, ప్రణీష్, సాగర్, అరవింద్, ఝాన్సీ, శృతితో కలిసి ఆదివారం కారులో రాచకొండ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి బొంగ్లూర్ వద్ద ఔటర్పై నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో బలిజగూడ సమీపంలోకి రాగానే భారీగా కురుస్తున్న వర్షం కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సౌమ్యారెడ్డితో పాటు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సౌమ్యారెడ్డి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దర్శనానికి అని వెళ్లిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు, అక్క రమ్యారెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. సౌమ్యారెడ్డి మృతితో వావిలాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డివైడర్ను ఢీకొట్టి ఔటర్పై కారు బోల్తా యువతి మృతి, ఏడుగురికి గాయాలు -
ఇందిరమ్మ.. మరింత వేగవంతం
మెదక్ కలెక్టరేట్: నిరుపేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 90 శాతం నిరుపేదలే కావడంతో డబ్బులు లేక పనులు ప్రారంభించలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా ఇసుక తెచ్చుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొన్ని నిర్మాణాలు చేపట్టగా ఇంకా చాలా మంది నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత ఉండాలని, లబ్ధిదారులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. ఇటీవల జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం ఏఈలతో సమావేశం నిర్వహించి టోల్ ఫ్రీ నంబర్ లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆరు నియోజకవర్గాలకు.. మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, ఆందోల్, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాలకు చెందిన 21 మండలాలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉంటాయి. అన్ని మండలాలకు కలిపి మొత్తం 9600 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 5వేల ఇళ్లు ప్రారంభం కాగా 360 ఇళ్లు బేస్మెంట్స్థాయిలో ఉన్నాయి. ఇంకా ప్రారంభానికి నోచుకోనివి 4వేలకు పైచిలుకు ఉన్నాయి. కాగా లబ్ధిదారులు తహసీల్దార్ ద్వారా ఆమోదం పొంది ప్రభుత్వం ఇసుక తెచ్చుకునే వీలు కల్పించింది. ఇంటి నిర్మాణం ప్రారంభించలేని నిరుపేదలకు స్వయం సంఘాల నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గ్రామాల్లో లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతుంది. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరింత పారదర్శకత, బిల్లుల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1800 5995991 ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూం హైదరాబాద్లో ఉంటుంది. బిల్లులు, నిర్మాణం తదితర సమస్యలపై లబ్ధిదారులు నేరుగా ఫోన్చేసి మాట్లాడవచ్చు. ఇటీవల హౌసింగ్ పీడీ జిల్లాలోని ఏఈలతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేటప్పడు ఏర్పడిన సమస్యలను ఈ నంబర్కు కాల్చేసి చెబితే అధికారులు కావాల్సిన సహాయం అందిస్తారు. పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకుంటే లబ్ధిదారులే నేరుగా ఫొటోతోపాటు తమ వివరాలు యాప్లో అప్లోడ్ చేయొచ్చు. ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ లబ్ధిదారులే ఫొటో అప్లోడ్ చేసే అవకాశం ఇల్లు ప్రారంభించని వారికి రుణ సౌకర్యం -
బ్యాడ్మింటన్లో సత్తా చాటిన జట్టు
మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో మెదక్ జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ నెల 12 నుండి 14 వరకు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం కూనూరులో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో ఖమ్మం జిల్లా జట్టును ఓడించి మెదక్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ట్రోఫీతో పాటు బహుమతులు ప్రదానం చేశారని ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ ిపీవీ.రమణ, ట్రెజరర్ శ్రీనివాస్రెడ్డి, జాయింట్ సెక్రెటరీ శరణప్ప తెలిపారు. -
నిలువెత్తు సాక్ష్యాలు
నాటి ప్రతిభకు● చెక్కుచెదరని కట్టడాలు ● కళాత్మకతకు, చరిత్రకు తార్కాణం నాటి పురాతన కట్టడాలు నేటి తరానికి చరిత్రను చెబుతాయి. పనిలో నైపుణ్యత కన్పిస్తుంది. ఆకాశాన్నంటుతాయా అన్నట్లు నిర్మించిన రాతి కట్టడాలు ఔరా అనిపిస్తాయి. అప్పటి ఇంజినీరింగ్ అద్భుతాలతో అబ్బుర పరుస్తాయి. కొలత వేసినట్లు సరిచేసిన భారీ రాళ్లను అంత ఎత్తుకు ఎలా చేరవేశారో ఆలోచింపజేస్తాయి. నేడు ఇంజినీర్స్ డే సందర్భంగా పురాతన కట్టడాలపై ప్రత్యేక కథనాలు. అప్పట్లో నిర్మించిన అతిథిగృహం -
జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి
జహీరాబాద్: విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకుని దేశ భక్తులుగా ఉండాలని ఏబీవీపీ మెదక్ విభాగ్ సంఘటన మంత్రి బోడ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలలో రెండు రోజుల శిక్షణ, వర్గ ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతి పునర్నిర్మాణం అవుతుందన్నారు. నగరాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఇన్చార్జి మాసాడి బాపూరావు, ప్రాంత సహా సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్, ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తలు, పూర్వ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎర్రరాయితో మెథడిస్టు చర్చి..
ఎర్ర రాయితో అద్భుతంగా నిర్మించిన మెథడిస్టు సెంట్రల్ చర్చి జహీరాబాద్ టౌన్: జహీరాబాద్లో నిర్మించే ఇళ్లలో 90 శాతం ఎర్రరాయి కట్టడాలే. నవాబుల కాలం నాటి నుంచి నేటి వరకు స్థానికంగా లభించే ఎర్రరాయిని వినియోగిస్తారు. ఈ రాయితో పట్టణంలో మెథడిస్టు సెంట్రల్ చర్చిని అద్భుతంగా నిర్మించారు. చర్చి వ్యవస్థాపకుడు జాన్వెస్లీ ఆధ్వర్యంలో అన్న అరెల్ట్, డీబీ గార్డెన్, రూథ్ ప్యాటరైజ్ పట్టణంలోని అల్లీపూర్ ప్రాంతంలో 1931లో నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1951లో పూర్తి చేశారు. శిలువ ఆకారంలో నిర్మించిన చర్చి ఇంజినీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతుంది. దీనికి దగ్గరలో నిర్మించిన పాఠశాల భవనం కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. తరగతి గదుల్లో గాలి, వెలుతురు ప్రవేశించే విధంగా నిర్మించారు. -
పేకాటరాయుళ్ల అరెస్ట్
కంగ్టి(నారాయణఖేడ్): పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐ దుర్గారెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రంలోని శివారులో ఆదివారం పంట చేన్లలో పేకాట ఆడుతున్న ఏడుగురు జూదరులను పట్టుకొని వారి వద్ద నుంచి రూ. 47,820 స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు చేను యజమానిపై సైతం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. దాడిలో పోలీసు సిబ్బంది రాజ్కుమార్, సాయికిరణ్, సతీశ్ పాల్గొన్నారు. పలువురికి గాయాలు చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మెదక్ నుంచి వస్తున్న టాటా ట్రాలీ వాహనం మూల మలుపు వద్ద అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరు మందికి గాయాలు కాగా తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా లచ్చవ్వ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ బేగంపేట నుంచి మెదక్ చర్చికి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి క్రైమ్: బంధువుల ఇంటికి వచ్చిన వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... మానురు మండలం డోవురు గ్రామానికి చెందిన కుర్నం నర్సింలు(53) పట్టణంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కొత్త బస్టాండ్లో బస్సు దిగిన వెంటనే తన అల్లుడికి ఫోన్లో సమాచారం అందించాడు. అనంతరం బంధువులు కొత్త బస్టాండ్కు రాగా కనిపించలేదు. చుట్టుప్రక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సిద్దిపేటజోన్: ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే వర్కర్లకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తూర్పు రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఓ గార్డెన్లో ప్రైవేట్ హాస్పిటల్స్ మజ్దూర్ మహాసంఘ్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. వర్కర్లకు సంవత్సరానికి ఒకసారి డీఏను కలుపుకొని జీతాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని, గ్రాట్యూటీతో కూడిన కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దసరా, దీపావళికి ఒక నెల బోనస్ ఇవ్వాలని, వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు చామకూర రాజయ్య, ప్రైవేటు హాస్పిటల్స్ ఇన్చార్జి ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీపేట టూ రాష్ట్ర స్థాయికి
● వేస్ట్ పేపర్లతో టీఎల్ఎం మెటీరియల్ ● మేళాలో రాష్ట స్థాయికి ఎంపికైన ● యూపీఎస్ ఉపాధ్యాయురాలు కీర్తి కౌడిపల్లి(నర్సాపూర్): ఆలోచనకు పదునుపెట్టి సరైన పద్ధతిలో వినియోగిస్తే పనికిరానిది ఏది ఉండదని, ప్రతీది వినియోగించు కోవచ్చని రుజువు చేసింది ఓ ఉపాధ్యాయురాలు. వేస్ట్ పేపర్లతో తయారు చేసిన ప్రాజెక్టు ఎఫ్ఎల్ఎన్, టీఎల్ఎం మేళాలో ఉత్తమ ప్రదర్శణగా నిలిచి రాజీపేట టూ రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. వివరాలు ఇలా... మెదక్లో జరిగిన ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లెట్రసీ అండ్ న్యూమరసి), టీఎల్ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాలో రాజీపేట యూపీఎస్ ఉపాధ్యాయురాలు కీర్తి పల్లె, పట్టణం మధ్యలో తేడాలు చూపుతూ తరగతిలోని వేస్ట్, న్యూస్ పేపర్లు, అట్టముక్కలు, చార్ట్, గడ్డి, దారం, పాడైన పెన్నులు, రిఫిల్స్తో గమ్ప్లాస్టర్ అందమైన పట్టణం, గ్రామం ఆకారాలు తయారు చేసి ప్రదర్శించారు. ఇందులో రహదారులు, వాహనాలు, పంటపొలాలు, అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీ, నీటికాలుష్యం, పార్క్, జూను పల్లె, పట్టణ వాతావరణం కనిపించేలా తయారు చేశారు. దీంతో మేళాలో ఆకట్టుకోవడంతో డీఈఓ రాధాకిషన్, అధికారులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. దీంతో త్వరలో జరిగే రాష్ట్రస్థాయి మేళాలో ప్రదర్శించనున్నారు. ఉపాధ్యాయురాలు కీర్తిని మండల ఎంఈఓ బాలరాజు, హెచ్ఎం కిశోర్, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. -
ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
నిజాంపేట(మెదక్): మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు... పోలీసుల వివరాల ప్రకారం .. నిజాంపేట గ్రామానికి చెందిన బండారి చిన్నక్క(37) వ్యవసాయ కూలీ చేసుకుని జీవనం కొనసాగిస్తుంది. ఈ మేరకు ఆదివారం ఉదయం తన భర్త యాదగిరి పొలంలో మందు చల్లడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో చిన్నక్క ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేశాడు. మద్యానికి బానిసైన వ్యక్తి.. పటాన్చెరు టౌన్ : మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన లక్ష్మణ్(39) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. రోజు మద్యం తాగుతుండటంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా మార్పు రాలేదు. రోజు తాగుతుండటంతో భార్య నిహారిక మూడు నెలల క్రితం పిల్లలను తీసుకుని తల్లి గారింటికి వెళ్లిపోయింది. మద్యానికి బానిసైన లక్ష్మణ్ ఆదివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గడికోట.. గత వైభవానికి ప్రతీక
పెద్దశంకరంపేటలోని గడికోట పెద్దశంకరంపేట: శతాబ్దాల చరిత్రకు నాటి కళాత్మకతకు, ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం పెద్దశంకరంపేట గడికోట. 400 ఏళ్ల క్రితం 40 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ కోట ఇప్పటికీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పెద్దశంకరంపేట గ్రామంలో ఉన్న ఈ కోటను 1764లో రాణి శంకరమ్మ కట్టించినట్లు ఆధారాలున్నాయి. నిజాం పాలనలో అతిపెద్ద సంస్థానాలుగా ఉన్న పెద్దశంకరంపేట, పాపన్నపేటలను రాజధానిగా చేసుకొని శంకరమ్మ, వారి వారసులు పాలించారు. ఈ కోటను చతురస్రాకారంలో, నాలుగు బురుజులతో నిర్మించారు. దీనిలో గురప్రు, ఎనుగు శాలలు ఉన్నాయి. కోటలోని ఫిరంగులను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేశారు. -
పటిష్ట్టతకు అద్దం రంగంపేట కోట
కోట ముఖ ద్వారంకొల్చారం(నర్సాపూర్): నిజాం కాలం నాటి హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి 14 సంస్థానాల్లో పాపన్నపేట సంస్థానం ఒకటి. వారి కిందే కొనసాగింది నిజాం నవాబులచే రాయ్ భాగన్(ఆడ సింహం)గా బిరుదును పొందిన రాణి శంకరమ్మ. ఆమె దత్త పుత్రుడు సదాశివరెడ్డి చే 1700 సంవత్సరం మధ్యకాలంలో నిర్మించిందే రంగంపేట కోట. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో నిర్మించాడు. చుట్టూ నాలుగు బురుజులు, రెండు ప్రధాన ద్వారాలు, రాణి మహల్, మెట్ల బావి, గురప్రు శాల, అంతర్గత డ్రైనేజీ నిర్మాణం, అద్దాల మేడ, గోడలపై నక శిల్పాలు ఇలా ఎన్నో ప్రస్తుతం కోటలో శిథిలావస్థకు చేరుకొని కనిపిస్తాయి. ఈ కోట బురుజు పైనుండి చూస్తే మెదక్ ఖిల్లా కనిపించడం విశేషం. నిర్మాణానికి రాయితోపాటు డంగు సున్నాన్ని వాడారు. -
జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మేలు
మెదక్ ఎంపీ రఘునందన్రావుసదాశివపేట(సంగారెడ్డి): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ రెండు స్లాబుల విధానంలో 85 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ధరలపై ఆదివారం పట్టణంలోని బసవ సేవాసదన్ ఫంక్షన్ హాలులో వర్తక, వాణిజ్య వ్యాపారస్తులతో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్కమ్ టాక్స్ 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడంతో మధ్యతరగతి ఉద్యోగులకు లాభం చేకూరుతుందన్నారు. మోదీ ప్రధాని పదవి చేపట్టిన రెండున్నరేళ్లలోనే రాజకీయ పార్టీలను ఒప్పించి 2017లో జీఎస్టీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేశారన్నారు. వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వల్ల మార్కెట్లో వస్తువుల కొనుగోళ్లకు చాలా డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తాయన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత మొరిగినా మోదీ భయపడలేదని, దేశాన్ని కాపాడుకుంటానని వేసిన అడుగులే స్వదేశీ వైపు వేసే అడుగులని ప్రతి ఒక్క భారతీయుడు గర్వించతగ్గ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆస్తి పంపకాలు, పదవుల కూర్చీల పంచాయితీ నడుస్తుందన్నారు. కార్యక్రమంలో మెదక్ బీజేపీ పార్టీ కోకన్వీనర్ సంగమేశ్వర్, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, జగన్, వేణుమాధవ్, వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు. -
కేంద్రంలో ఉండే సదుపాయాలు
● వృద్ధులు ఆడుకోవడానికి వీలుగా క్యారం, చెస్తో పాటు ఇతర సదుపాయాలు ● సేదతీరడానికి ఆహ్లాదరక వాతావారణం, గార్డెనింగ్, మొక్కల పెంపకం ● వంట గది, గ్రంథాలయంతో పాటు ఇతర మౌలిక వసతులు ● తరచూ కేంద్రంలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ ● వీల్ చైర్స్తో పాటు ర్యాంప్ల నిర్మాణం ● అత్యవసర పరిస్థితుల్లో అలారం సిస్టమ్ ఏర్పాటు ● మానసిక వేధన, భావోద్వేగానికి గురయ్యే వారికి కౌన్సెలింగ్ -
తీగలు.. తెగిపడితే తిప్పలే
సదాశివపేట(సంగారెడ్డి): విద్యుత్ స్తంభాలపై అస్తవ్యస్తంగా ఉన్న టీవీ, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు వాహనచోదకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కేబుల్ వైర్లు తెగిపడి పలువురు వాహనదారులు ప్రమాదానికి గురైన ఘటనలున్నా చర్యలు చేపట్టాల్సిన విద్యుత్శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సదాశివపేటలో 2,500 విద్యుత్ స్తంభాలు, 400 ట్రాన్స్ఫార్మర్లు, 25,000 విద్యుత్ కనెక్ష న్లున్నాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా క్రమపద్ధతిలో కేబుల్ వైర్లు అమర్చాల్సి ఉండగా నిబంధనలు ఉల్లంఘిస్తూ కేబుల్వైర్లు ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు లేదా మరమ్మతులు చేయాల్సి వచ్చి స్తంభాలు ఎక్కేటప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్శాఖ అధికారులు స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను తొలగించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. తొలగించాలని ఆదేశించాం పలుచోట్ల విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు విద్యుత్ ఉద్యోగులు స్తంభాలు ఎక్కడానికి కేబుల్ వైర్లు అడ్డంకిగా మారుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని సంబంధిత కేబుల్ ఆపరేటర్లకు తెలియజేశాం. –మధుసూదన్రెడ్డి, ఏఈ ట్రాన్స్కో, సదాశివపేట -
అల్గోల్లో ఎన్ఎస్ఎస్ శిబిరం
జహీరాబాద్ టౌన్: ఆచార్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 3 వలంటీర్లు మండలంలోని అల్గోల్ గ్రామంలో ప్రత్యేక శీతాకాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరికుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ నందుగౌడ్, యూనిట్ వన్ అధికారి దత్తు ఆధ్వర్యంలో వలంటీర్లు గ్రామంలో శ్రమదానం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి అక్షరాస్యత పెంపు, పిల్లలను పాఠశాలలో చేర్పించడం, మూఢనమ్మకాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ హరికుమార్ మాట్లాడుతూ...ఐదేళ్ల నుంచి అల్గోల్, పొట్పల్లి గ్రామాలను ఆచార్య కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు దత్తత తీసుకుని ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారని చెప్పారు. -
పారదర్శకంగా విద్యావలంటీర్ల ఎంపిక
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ● త్వరలో ఎంపికై న అభ్యర్థుల వివరాల ప్రకటన పటాన్చెరు/రామచంద్రాపురం (పటాన్చెరు): పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాథమిక పాఠశాలల్లో విద్య వలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆది వారం విద్యా వలంటీర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక కమిటీ సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అంతకుముందు రామచంద్రాపురం పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఎటువంటి సిఫార్సులను అనుమతించకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కమిటీ ఆధ్వర్యంలో తయారు చేసిన తుది జాబితాను జిల్లా కలెక్టర్ కు పంపిస్తామని ఆ తర్వాత అభ్యర్థుల వివరాలను ఆయా మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయంలో ప్రచురిస్తామని తెలిపారు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. గతంలో నిర్మించిన పెన్షనర్ల సంక్షేమ సంఘం భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకునిరాగా రామచంద్రాపురం ప్రెస్క్లబ్ సభ్యులతో చర్చించి మరో అంతస్తు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నూతనంగా రూ.30 లక్షల నిధులతో ప్రస్తుత భవనంపై అన్ని సౌకర్యాలతో ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.సమావేశంలో అన్ని మండలాల తహసీల్దార్లు, విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
పోరాటాలకు సిద్ధంకండి
నారాయణఖేడ్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.నర్సింహులు పిలుపునిచ్చారు. ఖేడ్ సీపీఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభను శ్రీనివాస కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ...1946 నుంచి 1951వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. నైజాం, రజాకార్లు, జాగిర్దార్ల, జమిందార్లకు వ్యతిరేకంగా నాడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం మహత్తరమైన పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఈ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఏరి యా కార్యదర్శి రమేశ్, నాయకులు సతీశ్, అరు ణ్, రఘు, కాన్షీరాం తదితరులు పాల్గొన్నారు. బకాయిలు విడుదల చేయండినారాయణఖేడ్: స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సీహెచ్ ఆనంద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చింపితే చరిత్ర చెరిగిపోదుసాయుధ పోరాట వారోత్సవాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రకాశ్రావు సదాశివపేట(సంగారెడ్డి): చరిత్రను బీజేపీ నేతలు చెరిపినంత మాత్రాన చెరిగిపోదని తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రకాశ్రావు పేర్కొన్నారు. సదాశివపేటలో సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలకు ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రకాశ్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పరిపాలనలో ఉందన్నారు. నిజాం సంస్థానం దేశంలో విలీనం కావాలని 1947 సెప్టెంబర్ 11న తెలంగాణ సాయుధ పోరాటానికి సీపీఐ నేతలు రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొయీనుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షాయిబుల్లాఖాన్, రాజాబ్ అలీలు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులో పోరాటంతోనే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానా న్ని దేశంలో విలీనం చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రెహమాన్,కార్యదర్శి వర్గ సభ్యుడు షఫీ, పట్టణ మండల కార్యదర్శులు అనసూయ, పాండు, మునిపల్లి మండల కార్యదర్శి గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. శిథిలాల తొలగింపు పనుల పరిశీలనమునిపల్లి(అందోల్): లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఉండేందుకు చేపట్టిన తాత్కాలిక పనులను మాజీ జెడ్పీటీసీ అసత్ పటేల్ ఆదివారం పరిశీలించారు. గురుకుల పాఠశాల హాస్టల్ శిథిలాలను జేసీబీతో తొలగించే పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థులు తాత్కాలికంగా ఉండేందుకు రేకులషెడ్ పనులు పూర్తి కావచ్చాయన్నారు. మైనర్ పనులు పూర్తి కాగానే విద్యార్థులను పంపిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, మక్సూద్ పటేల్తోపాటు తదితరులు పాల్గొన్నారు. -
కొలువుదీరిన జీపీఓలు
● జిల్లాకు 238 మంది నియామకం ● అదనపు కలెక్టర్ను కలిసిన అధికారులు సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ చర్యలలో భాగంగా క్లస్టర్లవారీగా జీపీఓల నియామకం చేపట్టింది. గత ప్రభుత్వంలో రద్దు చేసిన పాత అధికారుల నుంచి వారి ఆసక్తి మేరకు దరఖాస్తులు స్వీకరించి, అర్హత పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలో 238 మంది జీపీఓలను నియమించారు. జిల్లాలో 325 క్లస్టర్లు జిల్లావ్యాప్తంగా నాలుగు డివిజన్ల పరిధిలో 325 క్లస్టర్లుగా విభజించారు. పాత ఉద్యోగులను 238 మందిని ఎంపిక చేసి నియమించారు. మిగతా క్లస్టర్లలో ఆయా మండలాల్లోని జూనియర్ అసిస్టెంట్లకు ఇన్చార్జిలుగా నియమించనున్నారు. పోస్టింగ్లు వచ్చిన జీపీఓలు సంబంధిత తహసీల్ కార్యాలయ పర్యవేక్షణలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అదనపు కలెక్టర్ను కలిసిన జీపీఓలు నూతనంగా నియమితులైన జీపీఓలు అదనపు కలెక్టర్ మాధురిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ లో పూల మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా నిర్వర్తించాలని సూచించారు. -
పత్తి.. వర్షార్పణం
రైతుల ఆశలు గల్లంతురాయికోడ్(అందోల్): ఎంతో ఆశతో పత్తి పంటను సాగు చేసిన పలువురు రైతుల కష్టం వర్షం పాలైంది. కనీసం ఎకరాకు క్వింటాలు దిగుబడి రాని పరిస్థితులు ఉండటంతో ఇప్పటికే రూ.15వేల నుంచి రూ.20 వేల పెట్టుబడి పెట్టిన రైతులు పంట సాగుకు స్వస్తి పలుకుతున్నారు. మండలంలోని రాయికోడ్, ధర్మాపూర్, అల్లాపూర్, నల్లంపల్లి నాగ్వార్, కుసునూర్ తదితర గ్రామాల్లో రైతులు పంటపై పూర్తిగా ఆశలు వదిలేశారు. చేలల్లో విపరీతంగా గడ్డి పెరగడం, పూత, కాత రాలడం, పంట మొక్కలు నలుపు, ఎరుపు రంగులోకి మారడంతో పెట్టుబడులు కూడా వస్తాయనే నమ్మకం లేక వివిధ గ్రామాల్లో రైతులు పత్తి పంట సంరక్షణ చర్యల జోలికి వెళ్లడంలేదు. కలుపుతీయడం, మందులు చల్లడం, పిచికారీ చేయడం మానేశారు. 33% పంట దెబ్బతింటేనే పరిహారానికి సిఫార్సు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ ఈ ఏడాది రైతులకు సగం దిగుబడి కూడా వచ్చే సూచనలు లేవు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
క్రషింగ్ అనుమానమే!
● సీజన్ ప్రారంభానికి రెండు నెలలే గడువు ● ‘ట్రైడెంట్’లో క్రషింగ్ లేకపోతే ప్రత్యామ్నాయం చూపాలంటున్న రైతులు ● ఈసారి జిల్లాలో పెరిగిన చెరుకు విస్తీర్ణం చెరుకు విక్రయించడం రైతులకు సవాల్గా మారింది. రెండు నెలల్లో చెరుకు క్రషింగ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండేళ్లుగా మూసివున్న ట్రైడెంట్ కర్మాగారంలో ఈ ఏడాది కూడా క్రషింగ్ జరుగుతుందో లేదోనన్న అనుమానాలు చెరుకు రైతుల్ని వెంటాడుతున్నాయి. దీంతో జిల్లాలోని ఇతర కర్మాగారాలపై ఆధారపడాల్సి రావడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. జహీరాబాద్ టౌన్: జిల్లాలో ఈ సంవత్సరం చెరుకు సాగు విస్తీర్ణం పెరిగింది. చెరుకు సాగులో జహీరాబాద్ డివిజన్ టాప్లో ఉంది. జహీరాబాద్ సమీపంలో ట్రైడెంట్, సంగారెడ్డి వద్ద గణపతి, రాయికోడ్ వద్ద గోదావరి–గంగా చక్కెర పరిశ్రమలున్నాయి. ఈ మూడు చక్కెర కర్మాగారాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో చెరకు పంట సాగవుతునట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 3 వేల ఎకరాల్లో పంట విస్తీర్ణం పెరిగింది. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 10 లక్షల టన్నుల చెరుకు పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా అందులో 50% జహీరాబాద్లో పండనుంది. ఈసారి కూడా తరలింపు తప్పదా! జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం రెండేళ్ల నుంచి గానుగ ఆడించడంలేదు. ఈసారి కూడా స్పష్టత లేకపోవడంతో పంటను ఇతర కర్మాగారాలకు తరలింపు తప్పని పరిస్థితులున్నాయి. ఈ ప్రాంతంలో పండించిన పంటను సంగారెడ్డి గణేష్ షుగర్స్, కామారెడ్డి గాయత్రి, కొత్తకోట కృష్ణవేణితోపాటు పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్రలోని మిల్లులకు రైతులు పంటను తరలిస్తున్నారు. రాయికోడ్ మండలంలోని మాటూర్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన గోదావరి–గంగా కర్మాగారంలో క్రషింగ్ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. దీంతో రైతులు బ్రోకర్స్ను ఆశ్రయించడంతో నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా పంట సరఫరా కోసం రైతులకు తిప్పలు తప్పేటట్లు లేదు. షుగర్ క్రేన్ అధికారులు జోక్యం చేసుకుని ట్రైడెంట్ కర్మాగారంలో క్రషింగ్ జరిపించాలని, లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. టన్నుకు రూ. 3 వేలు చెల్లించాలి చెరుకు పంట ద్వారా లాభం తగ్గినా నష్టం అంతగా ఉండదని గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా ప్రతీ ఏటా పంట వేస్తున్నాం. స్థానిక కర్మాగారంలో క్రషింగ్ లేక నష్టపోవాల్సి వస్తోంది. కొన్నేళ్ల నుంచి బ్రోకర్లను ఆశ్రయిస్తున్నాం. టన్నుకు రూ. 2,500 వేలు ఇవ్వడంవల్ల లాభాలు రావడం లేదు. పెట్టుబడులు పెరిగినందున టన్నుకు రూ.3 వేలు చెల్లించాలి. –డి.శివకుమార్, ఎల్గోయి, జహీరాబాద్ -
నేటి నుంచి ఎస్జీఎఫ్ క్రీడలు
● ఏర్పాట్లు చేసిన అధికారులు ● అక్టోబర్లో రాష్ట్రస్థాయి పోటీలు న్యాల్కల్(జహీరాబాద్): జిల్లా స్థాయి ఎస్జీఎఫ్(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) క్రీడా పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అన్ని క్రీడలు ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పోటీలు కూడా జరగనున్నాయి. ఈ పోటీలు ఈ నెలాఖరు వరకు జరగనున్నాయి. వచ్చే అక్టోబర్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. క్రీడలివే.... ఎస్జీఎఫ్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, కరాటే, బ్యాడ్మింటన్, తైక్వాండో, సాఫ్ట్బాల్, బేస్బాల్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, షటిల్, చందరంగం, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, ఫెన్సింగ్, క్రికెట్, రెజ్లింగ్ తదితరల క్రీడలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో బాలిబాలికలు పాల్గొననున్నారు. ముందు బ్యాడ్మింటన్.. కబడ్డీ పోటీలు పటాన్చెరువు మండల పరిధిలోని బీరంగూడ లో (ఉమ్మడి మెదక్) జిల్లా బ్యాడ్మింటన్ పోటీ లు సోమవారం ప్రారంభం కానున్నాయి. అండర్ 14, 17 బాల బాలికలు పాల్గొననున్నారు. వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రా లతో పోటీలకు హాజరు కావాలని అధికారులు చెబుతున్నారు. కబడ్డీ పోటీలను ఈ నెల 16, 17న జహీరాబాద్ మండల పరిధిలోని రంజోల్ సంగమేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించ వలసి ఉండగా ఆ పోటీలను వాయిదా వేసినట్లు తెలిసింది. వాటిని ఈనెల 18న నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పోటీలు పూర్తయిన తర్వాత మిగిలిన వాటిని నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. -
శ్రీకృష్ణాష్టమి వేడుక ప్రధానం
సంప్రదాయ వేషధారణలో కాయితీ లభాణీ పురుషులువీరి ప్రధాన పండుగలో శ్రీకృష్ణాష్టమిని ఘనంగా నిర్వహిస్తారు. విజయదశమి వేడుక సైతం అందరితో పాటు జరుపుకోకుండా దసరా ముందు వచ్చే మంగళవారం నిర్వహించడం ఆనవాయితీ. వర్షాకాలం ఆరంభంలో యువతులు తీజ్ ఉత్సవం జరుపుకుంటారు. సంప్రదాయ వేషధారణలో మహిళలు, పురుషులు బృందాలుగా నృత్యాలు చేస్తారు. శ్రీకృష్ణుని వంశస్తులుగా చెప్పుకొనే కాయితీ లభాణీలు మద్యం తాగరు. మాంసాహారం భుజించరు. నియమ, నిష్టలకు పెట్టింది పేరుగా ఉంటుంది వీరి జీవన విధానం. -
జీఎస్టీ తెచ్చిన గొప్ప నాయకుడు మోదీ
సిద్దిపేటకమాన్: భారతదేశంలో ఒకటే పన్ను విధానం ఉండాలని జీఎస్టీ తెచ్చిన గొప్ప నాయకుడు మోదీ అని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సిద్దిపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో వర్తక, వాణిజ్య వ్యాపారస్తులతో జీఎస్టీపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. అప్పట్లో పదేండ్లు పాలించిన కాంగ్రెస్ జీఎస్టీ బిల్లును ఎందుకు పాస్ చేయలేకపోయిందని ప్రశ్నించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీవీ, ఫ్రిడ్జ్, కార్లు, పన్నీరు, పిండిపదార్థాలు, డైరీ ఉత్పత్తులు వంటి 85వస్తువులపై ధరలు తగ్గనున్నట్లు తెలిపారు. ఓటు, నోటు చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులేనని చెప్పుకొచ్చారు. దేశంలో ఒక కోటి 51 లక్షల మంది జీఎస్టీ చెల్లిస్తున్నారన్నారు. 173దేశాల్లో ఏ ప్రధాని కూడా చేయని విధంగా 11ఏళ్ల నుంచి మన దేశానికి మోదీ ప్రధానిగా చేస్తున్నారన్నారు. దేశంలో 11 ఏళ్లలో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు, వ్యాపారస్తులు గంప కృష్ణ, భూపతి, వీరేశం, సత్యనారాయణ, సుతారి కార్తీక్ పాల్గొన్నారు. అవగాహన సదస్సులో ఎంపీ రఘునందన్రావు కాంగ్రెస్ పాలనలో బిల్లు ఎందుకు పాస్ కాలేదు -
యూరియా ‘బ్లాక్’!
పరిగి: యూరియా కోసం ఓ వైపు రైతులు పడరాని పాట్లు పడుతుంటే ఫర్టిలైజర్ దుకాణదారులు మాత్రం బ్లాక్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిపూట అధిక ధరలకు అమ్ముతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ కేంద్రంలోని చిన్నారి ఆస్పత్రి పక్కన ఉన్న గోదాం నుంచి శనివారం రాత్రి దుకాణదారుడు యూరియాను ఆటోలో తరలిస్తుండగా ఓ రైతు వీడియో తీసి వాట్సప్లో వైరల్ చేశాడు. ఒక్క బస్తా కోసం పగలురాత్రి తేడాలేకుండా తాము లైన్లో నిలబడినా, స్టాక్ అయిపోందని వెనక్కి పంపిస్తూ.. ఇలా రాత్రి వేళ బ్లాక్ మార్కెట్కు తరలించడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
బైక్ చోరీ
నిజాంపేట(మెదక్): పొలం వద్ద ఉంచిన బైక్ చోరీకి గురైంది. ఈ ఘటన మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కంపె నాగరాజు తన వ్యవసాయ పొలంలోని గుడిసె వద్ద బైక్ను ఉంచి పని చేసుకుంటున్నాడు. పనులు ముగించుకుని వచ్చే సరికి అక్కడ బైక్ కనిపించలేదు. దీంతో చుట్టు ప్రక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో సీసీ కెమెరాల ఆధారంగా వ్యక్తిని గుర్తు పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మాసాయిపేటలో... వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రమైన మాసాయిపేటలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కిరాణం షాపు, లాండ్రీ షాపు తాళాలు పగులగొట్టి చోరీ చేశాడు. నగదుతోపాటు వస్తువులు చోరీకి గురైనట్లు షాపు యజమానులు తెలిపారు. ఇదిలా ఉండగా దగ్గరలోనే ఉన్న సాయిబాబ దేవాలయం వద్ద గల తాళాలు సైతం ధ్వంసమయ్యాయని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి..నిజాంపేట(మెదక్): ప్రమాదవశాత్తు చెరువులో పడిన వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నార్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బదనకంటి (గొల్ల) లక్ష్మి , పర్శరాములు దంపతుల కుమారుడు మహేశ్(24) శుక్రవారం ఉదయం గేదెలను మేపడానికి వెళ్లి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. దీంతో చుట్టు ప్రక్కల వెతుకుతుండగా గ్రామంలో ఉన్న హైదర్ చెరువు వద్ద మృతుని చెప్పులు కనబడటంతో పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ సహాయంతో వెతకగా శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. చెరువులోకి దిగిన గేదెలను బయటకు తోలుకురావడానికి మహేశ్ నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బోల్తా పడిన కోడిగుడ్ల వాహనం
కొండపాక(గజ్వేల్): కోడిగుడ్ల వాహనం రాజీవ్ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటన కుకునూరుపల్లి గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గొల్లపల్లిలోని పౌల్ట్రీఫాం నుంచి టాటా ఏసీ వాహనంలో కోడిగుడ్లను హైదరాబాద్కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కుకునూరుపల్లి శివారులో అదుపు తప్పి వాహనం సుమారు 20 గజాల దూరం వరకు డివైడర్ను ఢీకొట్టుకుంటూ వెళ్లి రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. దీంతో వాహన డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. కోడిగుడ్లు పగిలి రోడ్డుపై పడటంతో ద్విచక్ర వాహనదారుడు అందులోంచి వెళ్తూ స్కిడ్ అయి పడగా గాయాలు సైతం అయ్యాయి. సుమారు 15 నిమిషాల పాటు వాహనాలు నిలిపోయాయి. పోలీసులు కోడిగుడ్ల వాహనాన్ని రోడ్డు పైనుంచి తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా ఇదే ప్రదేశంలో ఇటీవల ద్విచక్ర వాహన దారుడు డివైడర్ను ఢీకొని మృతి చెందాడు. ఈ ప్రదేశాన్ని డేంజర్ జోన్గా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరారు.డ్రైవర్, మరో వ్యక్తికి స్వల్ప గాయాలు -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారం జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... దుబ్బాక గ్రామానికి చెందిన నూనె అశోక్, సుశాంత్ బైక్పై సిద్దిపేట నుండి దుబ్బాకకు వెళుతున్న క్రమంలో ధర్మారం శివారులో అదుపు తప్పి ప్రమాద సూచిక బోర్డును బలంగా ఢీకొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో ఢీకొని.. నారాయణఖేడ్: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాందేడ్– అకోలా 161 జాతీయ రహదారిపై నిజాంపేట్ మండలం బాచేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం నుంచి ఆటోలో యూరియా బస్తాలను కంబాపురం తరలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మందాల వీరప్ప, అమృత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఖేడ్ ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
3787 కేసులు పరిష్కారం
లోక్ అదాలత్లో సిద్దిపేటకమాన్: లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల విలువైన సమయం, డబ్బులు ఆదా అవుతుందన్నారు. రాజీ చేసుకోదలచిన క్రిమినల్, గృహహింస, చెక్ బౌన్స్, మోటారు ప్రమాద కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. లోక్ అదాలత్లో 3,733 క్రిమినల్, 39 సివిల్, 15మోటారు ప్రమాద కేసులతో పాటు మొత్తం 3,787 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. మోటారు ప్రమాద కేసుల్లో బాధితులకు రూ.1కోటి75వేలు బాధితులకు ఇప్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్కాంబ్లి, సంతోష్కుమార్, సాధన, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, న్యాయవాదులు సత్యనారాయణ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి -
డబ్బుల విషయంలో వివాదం
● పన్నెండేళ్ల తర్వాత అన్నాచెల్లెలు రాజీ ● లోక్అదాలత్లో కేసు పరిష్కారం గజ్వేల్రూరల్: డబ్బుల విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో కేసులు నమోదు చేసుకున్న అన్నాచెల్లెలు పన్నెండేళ్ల తరువాత లోక్ అదాలత్లో రాజీ పడ్డారు. గజ్వేల్ సీఐ రవికుమార్ వివరాల ప్రకారం... 2012 జూలై 29న నాసిరుద్దీన్తో పాటు అతని కుటుంబ సభ్యులకు తండ్రి అబ్దుల్ నబీ దుబాయ్ నుంచి పంపించిన డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఒకరిపై ఒకరు ఇరువర్గాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. 12ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. శనివారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన లోక్ అదాలత్లో జడ్జీ స్వాతిగౌడ్ ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చారు. ఈ కార్యక్రమంలో కోర్టు కానిస్టేబుల్ రవికుమార్, పీపీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. పొలానికి వెళ్లొస్తుండగా..ఆటో ఢీకొట్టడంతో రైతు మృతి కల్హేర్(నారాయణఖేడ్): రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందాడు. మండలంలోని కృష్ణాపూర్ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్డి గ్రామానికి చెందిన చింతల భూమయ్య(35) టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పనులు ముగించుకొని కృష్ణాపూర్కు వెళ్లి, తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో అతడిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భూమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య బాలమణి, కూతురు అంజలి, కొడుకులు ప్రసాద్, గణేశ్ ఉన్నారు. విద్యార్థి అదృశ్యం జహీరాబాద్ టౌన్: విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. టౌన్ ఎస్ఐ.వినయ్కుమార్ కథనం ప్రకారం... పట్టణంలోని మోమిన్ మొహల్లాకు చెందిన ఇస్మాయిల్ కుమారుడు ఎండీ అర్బాస్(17) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ నెల 12న మార్కెట్కు వెళతానని చెప్పి తిరిగి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అన్న ముబీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో చోట వివాహిత..పటాన్చెరు టౌన్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎంజీ రోడ్డుకు చెందిన శ్రీనివాస్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 12న భార్య స్వరూప శ్రీనివాస్ గొడవ పడ్డారు. అదేరోజు సాయంత్రం శ్రీనివాస్ వాష్ రూమ్కి వెళ్లి వచ్చేసరికి భార్య ఇంటి నుండి వెళ్లిపోయింది. వెంటనే భార్య కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. -
లైంగిక వేధింపుల నివారణకు..
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పోష్ చట్టంతో పాటు షీ–బాక్సు పోర్టల్ను తప్పకుండా అమలు చేయాలని డీడబ్ల్యూఓ హేమభార్గవి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో సురక్షితమైనవిగా ఉండేలా 2013లో భారత ప్రభుత్వం వీటిని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేకుండా ఉండేందుకు అంతర్గత ఫిర్యాదుల పరిష్కారానికి షీ– బాక్స్ పెట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని వివరించారు. దీనికి సంబంధించి కమిటీ సభ్యుల వివరాలను సమర్పించడానికి 10 మంది అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ఫిర్యాదుల పరిష్కారం కోసం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ షీ–బాక్స్ ఆన్లైన్ ప్లాట్ఫారాన్ని ప్రారంభించిందని తెలిపారు. దీని ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగులు, సిబ్బంది నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 181 ఫిర్యాదు, సహాయానికి సంప్రదించాలని కోరారు.జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి హేమభార్గవి -
స్మార్ట్ సిటీకి అడుగులు
ఝరాసంగం మండలంలోని నిమ్జ్ ప్రాంతంసంగారెడ్డి జోన్: జహీరాబాద్ నియోజకవర్గంలోని నిమ్జ్ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్న స్మార్ట్ సిటీకి అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించి ఏడాది పూర్తి కావొస్తున్నా, అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం ఆమోదించిన నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. ఈ మేరకు నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. 3,200 ఎకరాలు.. రూ. 2,361 కోట్లు జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్– నాగపూర్ పారిశ్రామిక అభివృద్ధి అమలులో భాగంగా ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు. ఇందుకోసం సుమారు 3,200 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,361 కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఏర్పాటవుతున్న నిమ్జ్ (జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి) పరిధిలోని బర్దిపూర్, ఎల్గోయి, చిలపల్లి, చీలపల్లి తండా గ్రామాల శివారులో స్మార్ట్ సిటీ ఏర్పాటు కాబోతుంది. ఇందులో భాగంగా పారిశ్రామికవాడలో రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు మౌలిక వసతుల కోసం అభివృద్ధి చేయనున్నారు. కేటాయించిన భూములను ఇటీవల టీజీఐఐసీ ఎండీ శశాంక్తో పాటు కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులు పరిశీలించారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమయ్యే భూములను గుర్తించి ఫెన్సింగ్ వేయాలని అధికారులకు ఆదేశించారు. నవంబర్ వరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు రూపకల్పన చేస్తున్నారు. కొనసాగుతున్న భూ సేకరణ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో వివిధ గ్రామాల్లో నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూములు గుర్తించారు. 12 వేల ఎకరాలకుపైగా భూములు స్వీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడతలో బర్ధిపూర్, ఎల్గోయి, చీలపల్లి, చిలపల్లి తండా గ్రామాల్లో 3,600 ఎకరాల భూమిని సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ నిలిచిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసింది. అయితే ఇప్పటివరకు సుమారు 8,000 ఎకరాల వరకు భూమి సేకరణ పూర్తి కాగా, మిగితా భూమి సేకరణ కొనసాగుతోంది. నిమ్జ్ పరిసర గ్రామాల్లో ఏర్పాటు 3,200 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 2,361 కోట్లు త్వరలో టెండర్ ప్రక్రియ, ప్రారంభం కానున్న పనులుమారనున్న రూపురేఖలు స్మార్ట్ సిటీ రాకతో జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాలతో పాటు సరిహద్దు కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్– ముంబై హై స్పీడ్–బుల్లెట్ రైలు వెళ్లేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే హుగ్గెల్లి నుంచి నిమ్జ్ ప్రాంతానికి రహదారి ఏర్పాటు చేశారు. స్థానికంగా పరిశ్రమలు రావడంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. -
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబుజహీరాబాద్: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు విమర్శించారు. శనివారం జహీరాబాద్లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా విభాగ్ అభ్యాస వర్గ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రూ. 8,500 కోట్ల పైచిలుకు ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. దీంతో యాజమాన్యాలు విద్యాసంస్థలను నడపలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్య కోసం బడ్జెట్లో 13 నుంచి 14 శాతం కేటాయింపులు చేస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం అందులో సగం కూడా కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారందన్నారు. గ్రూప్–1 నియామకాలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపడితేనే వాస్తవాలు బహిర్గతం అవుతాయన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని, ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు ఆకాష్, రాజు, ఆదిత్య, లక్ష్మణ్, జిల్లా ప్రముఖ్ మాధవరెడ్డి, అగ్రి విజన్ స్టేట్ కన్వీనర్ మానస, స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ ఉదయ్సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఇసుక బజార్లు..
జిల్లాలో 10చోట్ల ఏర్పాటుకు చర్యలు ● అనుమతి ఇచ్చిన ‘టీజీఎండీసీ’ ● ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు పంపిణీనారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరగడంతో పాటు నిర్మాణ దారులకు ఇసుక ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో 10 ఇసుక బజార్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందులో మూడింటికి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ఆందోల్, నారాయణఖేడ్ మండలంలోని జకల్ శివారులో ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. మరో వారం పది రోజుల్లో కోహీర్ మండలంలోని కవేలి వద్ద మరొకటి ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో జహీరాబాద్ నియోకవర్గంలోని సింగీతం, జహీరాబాద్, ఝరాసంఘం మండలంలోని మాచ్నూర్, సంగారెడ్డి, సదాశివపేట్ మండలంలోని సిద్దాపూర్, పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కుల్, జిన్నారం, ఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండలంలోని మునిగేపల్లి గ్రామాల్లో ఇసుక బజార్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటి ద్వారా లబ్ధిదారులకు వారి వారి ఇళ్ల నిర్మాణాల స్టేజీలను బట్టి ఇసుకను అందించనున్నారు. అన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించి ఇసుకను పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఇసుక బజార్లకు నల్గొండ, సిద్దిపేట జిల్లాలోని కొండపాక ప్రాంతాల నుంచి ఇసుక సరఫరా జరిగింది. ప్రస్తుతం టన్నుకు రూ. 1,200 చొప్పున అందజేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కామారెడ్డి జిల్లాలోని రీచ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడి నుంచి ఇసుక సరఫరా జరిగితే ధర మరింత తగ్గే అవకాశం ఉంది. జోరుగా నిర్మాణాలు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం 4 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. జిల్లాలో 14,538 ఇళ్లు మంజూరు కాగా, 4,291 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. 655 ఇళ్లు రూఫ్లెవల్, 183 ఆర్సీసీ స్టేజీలో ఉన్నాయి. వివిధ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో అధికారులు డబ్బులు జమ చేశారు. -
గురువులు.. సమాజ నిర్దేశకులు
పటాన్చెరు: దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని.. అలాంటి గురువులను గత 24 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి గౌరవించడం అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు కొనియాడారు. శనివారం డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులగా ఎంపికై న వారిని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రారంభమై, నేడు పార్లమెంటు సభ్యుడి వరకు ఎదగడం వెనక తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల కృషి ఉందని ప్రశంసించారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ వాడకం అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థి చదువుతో పాటు మానసిక ప్రవర్తనను గమనించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలల ద్వారా పోటీ ఉన్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, వివిధశాఖల అధికారులు, ప్రైవేట్ పాఠశాలల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
ఖాళీలు భర్తీ చేయాలి
జహీరాబాద్ టౌన్: ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సాబేర్ కోరారు. శనివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. చాలాకాలంగా ఇన్చార్జి ఎంఈఓలుగా కొనసాగుతున్నారని, దీని వల్ల సబ్జెక్టుల కొరత ఏర్పడుతుందన్నారు. ఖాళీలను సీనియర్ ప్రధానోపాధ్యాయులతో పదోన్నతి ద్వారా భర్తీ చేయాలన్నారు. నూతన పీఆర్సీ అమలుచేసి రెండు డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. యూనియన్ నాయకులు రమణకుమార్, బషీర్ అహ్మద్, బూర్ఖన్ పాల్గొన్నారు. 4,334 కేసులు పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: రాజీ మార్గంతోనే కేసులు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. చాలా కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న కేసులను రాజీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యలను సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 4,334 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
వర్షం.. ఆర్టీసీకి నష్టం
మెదక్ కలెక్టరేట్: భారీ వర్షాలు ఆర్టీసీకి నష్టం మిగిల్చాయి. ఆగస్టు చివరి వారంలో మెతుకు సీమలో కురిసిన కుంభవృష్టితో భారీగా వరద పొటెత్తింది. దీంతో జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్ పరిధిలో 63 కిలో మీటర్ల మేర 14 రోడ్లు ధ్వంసం కాగా, 15 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఆర్అండ్బీ శాఖ పరిధిలో 29 రోడ్లు ఉండగా, 53 కిలో మీటర్ల మేర ధ్వంసం అయ్యాయి. దీంతో మెదక్ నుంచి ఎల్లారెడ్డికి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ నుంచి సిద్దిపేటకు ప్రతిరోజు పది బస్సులు నడుస్తాయి. సిద్దిపేట వరకు మెదక్ బస్సు వెళ్లడంతో రోజుకు రూ. 20 వేల ఆదాయం వస్తుంది. భారీ వర్షాల కారణంగా రోడ్డు తెగిపోవడంతో ప్రస్తుతం రామాయంపేట వరకే బస్సును నడిపిస్తున్నారు. దీంతో సగం ఆదాయం పడిపోయింది. ఈ లెక్కన ఈ రూట్లో ఇప్పటివరకు రూ. 15 లక్షల ఆదాయం తగ్గింది. అలాగే ఎల్లారెడ్డి రూట్లో మెదక్ బస్సులు రోజుకు 5 చొప్పున నడుస్తాయి. ఒక్కో ట్రిప్కు రూ. 2 వేల చొప్పున రోజుకు రూ. 10 వేల ఆదాయం వస్తుంది. పోచారం డ్యాం పొంగిపొర్లి రోడ్డు తెగిపోవడంతో 5 రోజులు బస్సులను నిలిపివేశారు. దీంతో సుమారు రూ. 1.30 లక్షల నష్టం వాటిల్లింది. అలాగే పాపన్నపేట రూట్లో బొడ్మట్పల్లి వరకు రోజుకు 6 బస్సులు నడుస్తాయి. రెండు రోజులు బస్సులు నిలిచి పోవడంతో సుమారు రూ. 1.50 లక్షల నష్టం చేకూరింది. ఇలా మొత్తం 5 రోజుల పాటు ఆయా రూట్లలో 42,090 కిలో మీటర్ల మేర బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా మెదక్ ఆర్టీసీ డిపో రూ. 2,69,580 ఆదాయం కోల్పోయినట్లు డీఎం సురేఖ తెలిపారు. -
సింగూరు నీరు విడుదల
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో ఒక గేట్ను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. గత రెండు రోజులుగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో 9వ నంబర్ గేట్ను మీటరున్నర ఎత్తుకు ఎత్తి దిగువకు 7262 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రం నుంచి 2500 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 9230 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. ఔట్ఫ్లో 9675 క్యూసెక్కులని అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 17.345 టీఎంసీలు నిల్వ ఉంచి, మిగితా నీటిని దిగువకు వదులుతున్నారు. ఏడుపాయల ఆలయం మూసివేత పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయాన్ని శనివారం మళ్లీ మూసివేశారు. సింగూరు నుంచి 9675 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఆలయం ఎదుట నుంచి వరద వెళ్తుండటంతో ఇరిగేషన్ అధికారుల సూచన మేరకు ఆలయాన్ని మూసివేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేస్తున్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్ వేర్వేరుగా అమ్మవారికి పూజలు చేసి మంజీరా వరదను పరిశీలించారు. అటు వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంధ విద్యార్థికి ఆర్థిక సాయం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లొంక తండాకు చెందిన అంధ బాలుడు వికాస్ నాయక్ నిజామాబాద్లోని అంధుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల వయస్సులోనే చూపు కోల్పోయాడు. తండ్రి రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ నిరుపేద కుటుంబం శనివారం జగ్గారెడ్డి వద్దకు వచ్చి తమ గోడు వెల్లబోసుకోగా, వైద్య ఖర్చుల కోసం వికాస్కు రూ. 7.50 లక్షల నగదు అందజేశారు. వికాస్ కొమురవెల్లి మల్లన్న, బీరప్ప, సీతారామచంద్రులు వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక గాయాలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించారు. కాగా అతడికి కొత్త సెల్ఫోన్ అందజేసి, యూట్యూబ్ చానెల్ పెట్టించేందుకు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అంనంత కిషన్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ పాల్గొన్నారు. నియమాలు పాటిద్దాం.. ● ప్రమాదాలను నివారిద్దాం రామాయంపేట(మెదక్): కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డులు పొందేవారికి ప్రభుత్వం కొత్త తరహాలో అవగాహన కల్పిస్తోంది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేరిట ప్రత్యేకంగా లేఖ ప్రతితో పాటు కార్డులను పోస్టులో పంపుతోంది. మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. భద్రతా నియమాలు పాటిద్దాం.. ప్రమాదాలు నివారిద్దామని లేఖలో పేర్కొంది. ఇదే విషయమై జిల్లా రవాణా అధికారి వెంకటస్వామి మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో కనీసం 600 మందికిపైగా వాహనదారులకు వాహన రిజిస్ట్రేషన్ కార్డులతో పాటు మంత్రి పేరిట లేఖలు పంపించామని తెలిపారు. -
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
మునిపల్లి(అందోల్)/సంగారెడ్డి జోన్: ఇటీవల కూలిపోయిన లింగపల్లి గురుకుల హాస్టల్ భవనం స్లాబ్ శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ స్థానంలో కొత్త భవనం నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న పనులను కలెక్టర్ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల కోసం తాత్కాలికంగా రేకుల షెడ్డును పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...నూతన భవనం నిర్మించడానికి స్థలాన్ని త్వరితగతిన గుర్తించాలని, లేదంటే కూలిపోయిన భవనం స్థానంలోనే నిర్మించాలంటే శిథిలాలను తొలగించి స్థలం చదను చేయాలని సూచించారు. నూతన భవన నిర్మాణానికి, ఫర్నీచర్, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన అంచనా ప్రతిపాదనలను త్వరగా తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంబంధిత అధికారులు, ఎంపీడీఓ హరినంధ్రావు పాల్గొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ భవనంలో శిక్షణ జహీరాబాద్: యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా హోటల్ మేనేజ్మెంట్ భవనంలో త్వరలో ఉపాధి శిక్షణ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. కోహీర్ మండలంలోని కవేలి గ్రామ శివారులోని నిరుపయోగంగా ఉన్న హోటల్ మేనేజ్మెంట్ భవనాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వారంలోగా ఈ భవనాన్ని శుభ్రం చేసి అన్ని మౌలిక వసతులు కల్పించి ఓరియంటేషన్ ప్రోగ్రాంలు కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లూరులోని డ బుల్బెడ్ రూమ్ ఇళ్లను మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నీతమ్ డైరెక్టర్ వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, జిల్లా ఉపాధికల్పనాధికారి అనిల్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ తుల్జరామ్, జహీరాబాద్ ఆర్డీఓ డెవుజా, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ ప్రావీణ్య -
మున్సిపాలిటీల్లో కొత్త పోస్టులు
● ఆర్థిక శాఖ ఆమోదం ● పోస్టింగ్ల కోసం 27 మందివిలీన కార్యదర్శుల ఎదురు చూపులు ● మిగతా సిబ్బందికి ఇప్పటికే సర్దుబాటుసంగారెడ్డి జోన్: పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేసిన నేపథ్యంలో నాటి నుంచి పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ శాఖలో వేతనం పొందుతూ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొత్త ఏర్పడిన మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 165 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జిల్లాకు 27 పోస్టులు ఉన్నాయి. పోస్టులు మంజూరుకు ఆర్థిక శాఖ ఆమోదం జిల్లాలో నాలుగు విడతల ద్వారా 45 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశారు. మొదటి, రెండవ విడతలలో విలీనం ఆయన కార్యదర్శులను మున్సిపల్ శాఖలోకి మార్చేందుకు కొత్తగా జిల్లాకు 27 పోస్టులను ఆర్ధిక శాఖ మంజూరు చేసింది. పోస్టులు మంజూరు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవటంతో పోస్టింగుల కోసం ఎదురుచూపులు తప్పలేదు. మూడు, నాలుగు విడతలలో విలీనమైన అధికారులకు పోస్టుల మంజూరు ఎప్పుడు చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీరంతా మున్సిపల్ లోనే తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నారు. తాత్కాలిక పోస్టులతో విధుల నిర్వహణ జిల్లాలో విలీన పంచాయతీ కార్యదర్శులు 45తోపాటు మల్టీపర్పస్ వర్కర్లు కూడా ఉంటారు. విలీనం అయిన నాటి నుంచి మున్సిపాలిటీలలో వారి గ్రేడ్ల ఆధారంగా రెవెన్యూ అధికారి, జూనియర్ అసిస్టెంట్, వార్డ్ అధికారి, శానిటరీ ఇన్స్పెక్టర్గా వివిధ స్థాయిలలో తాత్కాలిక పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిని పంచాయతీరాజ్ శాఖలోని కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంతమంది విలీన కార్యదర్శులు మున్సిపల్ శాఖలోని విధులు నిర్వహిస్తామంటూ కోర్టును ఆశ్రయించారు. విలీన కార్యదర్శులకు అనుకూలంగా కోర్టు స్టే ఇవ్వడంతో పంచాయతీరాజ్ శాఖకు మార్చే ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. -
బాలికలకు చదువే భరోసా
● మంత్రి దామోదర రాజనర్సింహ ● ఆస్పత్రులకు వెళితే ఆర్థిక భారంపడకూడదన్నదే లక్ష్యం ● 126 మంది ఉపాధ్యాయులకు సన్మానంవట్పల్లి (అందోల్): తాను గతంలో విద్యాశాఖ మంత్రిగా ఎనిమిదేళ్లు పనిచేశానని, ఇప్పటికీ ఆ శాఖ అంటే చాలా ఇష్టమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అందోలు మండలం అల్మాయిపేట లక్ష్మిదేవి గార్డెన్లో శుక్రవారం జరిగిన నియోజకవర్గస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గురువు ఉన్న ప్రదేశంలో అక్కడి సమాజ ప్రవర్తన తెలుస్తుందని చెప్పారు. ఆస్పత్రికి వెళితే ప్రజలకు ఆర్థికభారం కలగకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వైద్యం రెండు శాఖలు ముఖ్యమైనవేనని అందోల్ నియోజకవర్గంలో ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలు, మండలానికొక మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. సమాజానికి బాలికల చదువు చాలా ముఖ్యమని, అమ్మాయిలు చదివితేనే కుటుంబానికి సంపూర్ణ భరోసా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో రూ.15 కోట్లతో బాలికల విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజనర్సింహ అంటే గుర్తింపు రావడం అందోల్ నుంచే లభించిందన్నారు. అందుకే ఈ ప్రాంతానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పీఆర్టీయు అధ్యక్షుడు ఎ. మాణయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్క్ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, ఆర్డీఓ పాండు తదితరులు పాల్గొన్నారు. -
మీడియాపై దాడి అప్రజాస్వామికం
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడమేకాకుండా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వంపై వివిధ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా కర్తవ్యమని అన్నారు. నిరంకుశంగా వ్యవహరించడాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ నిర్బంధ చర్యలపై పలువురి నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే.. కేసుల నమోదు అప్రజాస్వామికం జహీరాబాద్: పాత్రికేయులపై కేసులు పెట్టడం అనేది అప్రజాస్వామికం. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ‘సాక్షి’పై కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. తపస్ ఉపాధ్యాయ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. – దత్రాత్తి, తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు,జహీరాబాద్అది రాజ్యాంగం కల్పించిన హక్కు సంగారెడ్డి జోన్: ప్రజాస్వామ్యంలో వార్తలు రాసే హక్కు పాత్రికేయులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అణిచి వేయబడుతున్న వారికి మద్దతుగా నిలబడి, అన్యాయం చేస్తున్న వారి దౌర్జన్యాలను నిలదీస్తూ ప్రజలకు తెలియజేసే హక్కు పత్రికలకు ఉంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ప్రజలే సరైన బుద్ధి చెబుతారు. – రాంచందర్ భీం వంశీ, ఉపాధ్యాయుడు,టీజేఏసీ చైర్మన్, జహీరాబాద్కేసులు పెట్టడం సరికాదు సంగారెడ్డి టౌన్: పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికలు మూలస్తంభాలు. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉండే వారిపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణం. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. – మహమ్మద్ నిజాముద్దీన్ రషీద్, న్యాయవాది ప్రశ్నించే గొంతు నొక్కడమే జీహరాబాద్: సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే వారిపై కేసులు పెట్టడం అంటే ప్రశ్నించే గొంతుకలను నొక్కడమే అవుతుంది. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు విలేకరులపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని హరించడమే. – తులసీరాం రాథోడ్, టీబేస్రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జహీరాబాద్ -
తారా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘దోస్త్’ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి మిగిలిన సీట్లకు ఈనెల 15, 16వ తేదీలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఈ మే రకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 94410 69020ను సంప్రదించవచ్చని తెలిపారు. సింగూరుకు 6,136క్యూసెక్కుల నీరుపుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుంది. గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 6,136 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా..దిగువకు 2,329 క్యూసెక్కుల ఇన్ఫ్లో వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రం ద్వారా రెండు టర్బయిన్లను ఆన్చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. లోక్ అదాలత్ను విజయవంతం చేయాలిజిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పేర్కొన్నారు. కక్షిదారులకు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏఐ పాఠంపై విద్యార్థుల ఆసక్తి: డీఈఓపటాన్చెరు టౌన్: ప్రభుత్వ పాఠశాలలో కృత్తిమ మేథ(ఏఐ) బోధనపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి ప్రభుత్వ పాఠశాలను డీఈఓ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పాఠశాల తరగతిగదిలో పర్యటించి, అక్కడ ఉపాధ్యాయులు చెపుతున్న బోధన తీరును పరిశీలించారు. అనంతరం ఏఐ బోధన ద్వారా పాటలు వింటున్న విద్యార్థులను చూశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... కంప్యూటర్ ఆధారిత బోధన ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరిగిందన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షిజహీరాబాద్: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్–2 గా విశాలాక్షి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ కార్యాలయంలో జేడీగా పని చేసిన ఆమెను జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్గా నియమించారు. ఈ సందర్భంగా ఆమె జహీరాబాద్ ఇన్చార్జి ఆర్డీఓ డెవుజాతో సమావేశమయ్యారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలిచుక్కా రాములు సంగారెడ్డి ఎడ్యుకేషన్: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో శుక్రవారం సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘మతోన్మాదదాడులు–రాజ్యాంగం–లౌకికవాదం ఆవశ్యకత’అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ...సీతారాం ఏచూరి మృతి ప్రజలకు, పార్టీకి తీరని లోటన్నారు. -
సేవాభావంతో మెలగాలి
ఎంపీ రఘునందన్రావు జిన్నారం(పటాన్చెరు): ప్రతీ కార్యకర్త ప్రజలతో సేవాభావంతో మెలగాలని ఎంపీ రఘునందన్రావు సూచించారు. జిన్నారం పట్టణ పరిధిలోని ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవాకార్యక్రమాలను నిర్వహించాల ని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు పరిష్కరించేలా ముందుకు వెళ్లాల ని చెప్పారు. ఈ నెల 17న ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిరంలో ప్రతీ కార్యకర్త పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అనంతరం ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు దోమడుగు రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
కేంద్రం వల్లే యూరియా కొరత
రైతు సంఘం రాష్ట్ర నాయకులు గొల్లపల్లి జయరాజుసంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ విధానాలే యూరియా కొరతకు కారణమని, రైతులకు కావలసిన యూరియాను వెంటనే అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం యూరియా, ఎరువులను సరఫరా చేయలేదని విమర్శించారు. రసాయన ఎరువులపై సబ్సిడీని కేంద్రం క్రమంగా కోత పెడుతూ నానో యూరియాను బలవంతంగా మోపే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా రైతులు యూరియా సరఫరా కేంద్రాల వద్ద బారులు తీరి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సకాలంలో ఎరువులు అందుబాటులో లేకపోతే పంటలు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే యూరియా కొరతను తీర్చాలని కోరారు. -
చేపా..చేపా ఎప్పుడొస్తావు!
చేప పిల్లల పంపిణీలో ఈసారి మరింత ఆలస్యం! ● టెండర్లకు ముందుకురాని కాంట్రాక్టర్లు ● త్వరలోనే పంపిణీ చేస్తామంటున్నఅధికారులు వట్పల్లి(అందోల్): మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పథకం అమలు ఈ ఏడాది మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. జూలై మూడో వారంలోనే చేపట్టాల్సిన చేప పిల్లల పంపిణీ సెప్టెంబర్ వచ్చేసినా ఈ ప్రక్రియ టెండర్ల దశలోనే ఉండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పరిధిలో 36,029 హెక్టార్ల విస్తీర్ణంలో 1,135 నీటి వనరులు ఉండగా మూడు రిజర్వాయర్లు, 79 పెద్ద చెరువులు, 1,059 చిన్న చెరువులున్నాయి. 234 మత్య్స సహకార సంఘాలు ఉండగా వీటిలో 12,889 మంది సభ్యులున్నారు. ఈ ఏడాది 3.50 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది 3.41 కోట్ల చేప పిల్లలు వదలాలని లక్ష్యం పెట్టుకోగా 68,31,132 చేప పిల్లలను వదిలినట్లు అధికారులు చెబుతున్నారు. బిడ్లు దాఖలుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ప్రభుత్వం జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలకు సంబంధించి గత నెల ఆగస్టు 18 నుంచి 30 వరక్లు టెండర్లను పిలువగా ఒక్కరూ కూడా టెండర్ వేయడానికి రాలేదు. ఇందుకు గతంలో ప్రభుత్వానికి సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించి బిల్లులను చెల్లించకపోవడం వంటివి కారణాలుగా తెలుస్తోంది. దీంతో మరోసారి బిడ్లు వేయడానికి ఈనెల (సెప్టెంబర్) 12 వరకు బిడ్లు వేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించగా శుక్రవారం బాక్స్లను ఓపెన్ చేయగా ఒక్కరు మాత్రమే టెండర్ దాఖలు చేశారు. సాధారణంగా రాజమండ్రి, కై కలూరు ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు మాత్రమే ఈ ప్రాంతంలో చాలాకాలంగా టెండర్లలో పాల్గొంటున్నారు. రూ.లక్షలు పెట్టి కొనుగోలు ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యమవుతుండటంతో మత్స్యకారులు సొంత ఖర్చులతో ప్రైవేట్గా కొనుగోలు చేసి చెరువులలో వదులుకుంటున్నారు. ప్రభుత్వం పంపిణీచేసే చేప పిల్లల సైజు తక్కువగా ఉండటంతో చెరువుల్లో నీరు తగ్గే సమయానికి చేప అరకిలో వరకు బరువు పెరగడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో ఉచిత చేప పిల్లల కోసం ఎదురు చూడకుండా సొంత డబ్బులతో ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకువచ్చి వదులుతున్నామంటున్నారు. ఇటీవల అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లిలో మత్య్సకారులు సుమారుగా రూ.3లక్షలు వెచ్చించి ప్రైవేట్గా కొనుగోలు చేసి చెరువులలో వదిలారు. పెరుగుదలపై ప్రభావం చెరువుల్లో రెండు పరిమాణాల్లో చేప పిల్లలను వదులుతారు. పూర్తిగా నీటితో నిండిన చెరువుల్లో 45రోజుల వయసున్న 35–40 మి.మీ. పొడవున్న వాటిని, ఏడాది మొత్తం నీరు నిల్వ ఉండే పెద్ద చెరువులు, జలాశయాల్లో 75 రోజుల వయసున్న 80–100 మి.మీ. పొడవున్న వాటిని వదులుతారు. నీటిలో వదిలిన తర్వాత కిలో పరిమాణానికి రావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. జూన్, జూలై నెలల్లో వదిలితే డిసెంబరు నుంచి రెండు, మూడు నెలలపాటు చేపలను పట్టి విక్రయించుకునే అవకాశముంటుంది. దీంతో మత్స్యకారులు చేపల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో! జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ చేసేందుకు బిడ్లు ఆహ్వానించినా ఎవరూ రాకపోవడంతో రెండుసార్లు గడవు పొడిగించాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నాం. మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. నాణ్యమైన చేప పిల్లలు చెరువుల్లో వదులుతాం. – మధుసూదన్రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి -
కార్లు అద్దెకు తీసుకుని..
సిద్దిపేటకమాన్: కార్లు కిరాయికి తీసుకుని విక్రయిస్తున్న ముఠాలో ఒక సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన సమీర్ తన వద్ద రంగారెడ్డి జిల్లా చర్లపటేల్ గూడకు చెందిన పట్నం నరేశ్ కారును అద్దెకు తీసుకెళ్లి తిరిగి ఇవ్వడం లేదని ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నరేశ్, చిన్నకోడూరుకు చెందిన మిద్దెల మహేశ్, రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శేఖర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మాతృ, నల్గొండ జిల్లాకు చెందిన సంతోష్ ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా కార్లను అద్దెకు తీసుకుని, తాకట్టు పెట్టడం, కొన్నింటిని విక్రయించి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఆరు నెలలుగా సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి ప్రాంతాల్లో 17 కార్లు కిరాయికి తీసుకుని విక్రయించారు. నిందితుడు నరేశ్ను రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. విక్రయిస్తున్న ముఠాలో ఒకరి అరెస్టు ఆరు కార్లు స్వాధీనం.. -
చేనేత హస్తకళ ప్రదర్శన
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో చేనేత హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. చేనేత వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, జైపూర్ స్టోన్స్, ఉడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఒడిశా పెయింటింగ్ తదితర ఉత్పత్తులు పలువురిని ఆకట్టుకున్నాయి. చేగుంట(తూప్రాన్): మండలంలోని కరీంనగర్ అటవీ ప్రాంతంలో మేకలతో పాటు కాపరి రాజుపై చిరుత దాడి చేసిన స్థలాన్ని ఫారెస్టు అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి చిరుత దాడి చేసిన ప్రదేశానికి వెళ్లిన అటవీశాఖ అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజు ఇంటికి వెళ్లి పరిశీలించారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు, మేకల కాపరులు ఒంటరిగా అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దన్నారు. ఒకవేళ చిరుత ఆనవాలు కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ పరిశీలనలో సెక్షన్ ఆఫీసర్ కిరణ్కుమార్, బీట్ ఆఫీసర్ రవికిరణ్తో పాటు గ్రామస్తులు ఉన్నారు. పటాన్చెరు టౌన్: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పోచారానికి చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళకు పురటి నొప్పులు రా వడంతో 108 వాహ నంలో తరలిస్తున్నా రు. మార్గమధ్యలోకి రాగానే నొప్పులు అధికం కావడంతో సిబ్బంది ప్రసవం చేశారు. దీంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని ధరిపల్లిలో అక్రమంగా ఇసుకు తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ నారాయణగౌడ్ తెలిపారు. ధరిపల్లి శివారులోని వాగునుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచరం మేరకు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ట్రాక్టర్లను సీజ్చేసీ కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. దుబ్బాకరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ హరీశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పుసుకూరి సతీశ్ పలు గ్రామాల్లో ప్రతి ఇల్లు తిరిగి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నాడు. వాటిని ఎక్కువ ధరకు కోళ్ల ఫారాలకు ట్రాక్టర్లో తరలిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ట్రాక్టర్ను గ్రామ శివారులో పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేక పోవడంతో 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మిరుదొడ్డి ఎంఎల్సీ పాయింట్కు, ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
యువకుడు ... పటాన్చెరుటౌన్: యువకుడు అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు సాయంత్రం తన అన్న విట్టల్ వాట్సాప్కు ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నానని మెసేజ్ పెట్టాడు‘. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తమ్ముడి అదృశ్యంపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ... నర్సాపూర్ రూరల్: గిరిజన మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని తుజల్పూర్ పంచాయతీ పరిధిలోని అర్జున్ తండాలో జరిగింది. ఎస్సై జగన్నాథం కథనం ప్రకారం.. తండాకు చెందిన కొర్ర పవన్ భార్య మౌనిక (20). గురువారం మధ్యాహ్నం బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకడంతో పాటు బంధువులు, తెలిసిన వారిని ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడు ... తూప్రాన్: మతి స్థిమితం సరిగాలేని బాలుడు అదృశ్యం అయ్యాడు. ఈ ఘటన ఘనపూర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిహార్కు చెందిన మనోజ్ప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా ఘనపూర్ సమీపంలోని ఓ సీడ్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇతని పెద్ద కుమారుడు సందీప్కుమార్(16)కు చిన్నప్పటి నుంచి మతి స్థితిమితం సరిగా లేదు. హైదరాబాద్లో వైద్యం చేయించేందుకు బిహార్ నుంచి ఇటీవల తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 8న సందీప్కుమార్ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రిలో అరుదైన ఆపరేషన్
మహిళ కడుపులోంచి 3.2 కిలోల గడ్డ తొలగింపు దుబ్బాక: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా.. మండలంలోని హబ్షీపూర్ గ్రామానికి చెందిన శోభ(43) కొన్ని నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం దుబ్బాక వంద పడకల ఆస్పత్రికి రాగా వైద్యులు ఆమెకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి కడపులో పెద్ద గడ్డ ఉందని నిర్ధారించారు. శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి శోభ కడపులోంచి 3.2 కిలోల పెద్ద పైబ్రాయిడ్ గడ్డను తొలగించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని బాధిత కుటుంబీకులు అభినందించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొండపాక(గజ్వేల్): ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రవీంద్రనగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవీంద్రనగర్ గ్రామానికి చెందిన నాలగం కనకయ్య(40) బీడీ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శుక్రవారం పని ఉండడంతో తన ఇంటిపైకి వెళ్లాడు. బిల్డింగ్పైన ఉన్న డిష్ వైర్ను సరిచేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుకునూర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నీవు లేని లోకంలో ఉండలేను..
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య● భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య ● అనాథలైన పిల్లలుసిద్దిపేటరూరల్: అనారోగ్యంతో భర్త మృతిచెందగా, ఒకరోజు గడవక ముందే భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ సైఫ్అలీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొబ్బరిచెట్టు మహేందర్(40)కు చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్కు చెందిన కావ్యతో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం మహేందర్ అనారోగ్యానికి గురి కాగా, సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కుటుంబీకులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య కావ్య గంటల వ్యవధిలోనే ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించగా, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కావ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బావిలో దూకి యువకుడి ఆత్మహత్యపెద్దశంకరంపేట(మెదక్): జైలు నుంచి వచ్చిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముసాపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బైకాని దేవయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇందులో చిన్నవాడైన బైకాని గంగమేశ్వర్కు కొన్నేళ్ల క్రితం టేక్మాల్ మండలం హసన్మహ్మద్పల్లికి చెందిన మానసతో వివాహం జరిగింది. గంగమేశ్వర్ అత్తగారింటికి ఇల్లరికం వెళ్లాడు. మూడు నెలల క్రింతం కుటుంబ కలహాల నేపథ్యంలో మానస ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గంగమేశ్వర్పై కేసు నమోదు కాగా జైలుకు కెళ్లాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చాడు. శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగాఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబీకులు వెతుకుతుండగా గ్రామశివారులోని బావిలో మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోల్కంపల్లి సంజీవులు(39) కూలీ పని చేస్తుంటాడు. మద్యానికి బానిసైన ఆయన శుక్రవారం మండలంలోని ఆత్మకూర్ శివారులోని రావుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్షించేందుకు స్థానికులు ప్రయత్నం చేసిన ఫలితం రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చేగుంట(తూప్రాన్): చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పోలంపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండి లక్ష్మి (42)కి పంచాయతీ కార్యదర్శి స్రవంతితో ఇటీవల గొడవ జరిగింది. ఈ గొడవపై గ్రామస్తులు గురువారం గ్రామ పంచాయతీ వద్ద మాట్లాడారు. అయితే ఆ తర్వాతి రోజే లక్ష్మి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పంచాయతీ కార్యదర్శితో జరిగిన గొడవపై మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. -
వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలి
యువశాస్త్రవేత్తలకు అవగాహన కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ గోపాల్లాల్ చిలప్చెడ్(నర్సాపూర్): వ్యవసాయాభివృద్ధికి యువశాస్త్రవేత్తలు కృషి చేయాలని ఐసీఏఆర్ డైరెక్టర్ గోపాల్లాల్ తెలిపారు. మండలంలోని శిలాంపల్లిలో కౌడిపల్లి మండలం తునికి కేవీకే, ఐసీఏఆర్ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నామ్(నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసర్చ్ మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో శుక్రవారం 115వ వ్యవసాయ పరిశోధన శిక్షణ కార్యక్రమంలో భాగంగా 22రాష్ట్రాలకు చెందిన 107మంది యువశాస్త్రవేత్తలకు వ్యవసాయంపై అవగాహన, రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోపాల్లాల్ మాట్లాడుతూ...వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు యువశాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను రైతులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు క్షేత్రపర్యటన నిర్వహించి రైతులతో మాట్లాడారు. సాగు పెట్టుబడులు, నీటియాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, దిగుబడి, మార్కెటింగ్ గురించి వివరించారు. అనంతరం గ్రామం చిత్రపటాన్నివేసి యువశాస్త్రవేత్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే విభాగాధిపతి డాక్టర్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రవికుమార్, డాక్టర్ ప్రతాప్రెడ్డి, ఐసీఏఆర్ ప్రతినిధులు డాక్టర్ దామోదర్రెడ్డి, డాక్టర్ వెంకట్కుమార్, డాక్టర్ వెంకటేశన్, రైతులు పాల్గొన్నారు. -
నిమ్జ్ భూబాధితులకు బాసట
జహీరాబాద్ టౌన్: ఎన్నో ఉద్యమాలు, పోరాటాల తర్వాత రైతులకు మేలు చేసే 2013 భూసేకరణ చట్టాన్ని ప్రఽభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆరోపించారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం చట్టానికి వ్యతిరేకంగా బలవంతంగా భూములను తీసుకోవడానికి నిరసిస్తూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జహీరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రామిక్ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం నిమ్జ్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ సమగ్ర భూచట్టాలను అమలు చేస్తేౖ రైతులకు పరిహారం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వాలు స్వార్థప్రయోజనాల కోసం భూసేకరణ చట్టానిక తూట్లు పొడుస్తున్నాయని మండిపడ్డారు. భూముల ధరలను సవరించకుండా ఏకపక్షంగా నిమ్జ్ భూసేకరణకు ఎందుకు నోటిఫికేషన్లు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఽరెండు పంటలు పండే సారవంతమైన భూములకు 15 లక్షల పరిహారం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.50 లక్షలు పలుకుతుంటే రూ.15 లక్షలు ఎలా ఇస్తారన్నారు. చట్ట ప్రకారం భూమిలేని కూలీలకు పునరావాసం కూడా ఇవ్వడంలేదన్నారు. రైతుల భూముల్లో పనులు చేపడుతూ చట్టాన్ని ఉల్లఘిస్తున్నారని ఆరోపించారు. పరహారం పెంచాలని, ఎకరానికి 120 గజాల ప్లాటు, వ్యవసాయ కూలీలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్, నాయకులు సుకుమార్, నర్సింలు, శంకర్, సీఐటీయూ నాయకులు మహిపాల్, నిమ్జ్ భూబాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాలు వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ -
నా భర్త ఆచూకీ కనిపెట్టండి
మంత్రి పొన్నంకు జవాన్ భార్య విన్నపంఅక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని ఐనపూర్ గ్రామానికి చెందిన తోట అనీల్ (ఆర్మీ జవాన్) ఆచూకీని కనిపెట్టాలని భార్య అనూష మంత్రి పొన్నం ప్రభాకర్ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 6వ తేదీన ఇంటి నుంచి పంజాబ్లో విధి నిర్వహణకు వెళ్లాడని, మరుసటి రోజునుంచి సెల్ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుందన్నారు. నెలరోజులుగా భర్త ఆచూకీ కోసం వెతికినా సరైన సమాధానం రాలేదని అనూష కన్నీరుమున్నీరయ్యారు. అక్కడి కమాండర్ను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆమె అమ్మగారి ఇల్లు చౌటపల్లి గ్రామం కావడంతో మంత్రి మల్లంపల్లి–చౌటపల్లి గ్రామాల బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలుసుకుని వచ్చారు. పూర్తి వివరాలతో కూడిన ఒక లెటర్ను మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేస్తే పంజాబ్లోని ఆర్మీ కమాండర్తో మాట్లాడి వివరాలను తెలియజేస్తామని మంత్రి భరోసా కల్పించారు. -
కూటమి నిరంకుశత్వాన్ని ఖండిద్దాం
రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు ‘సాక్షి’పత్రిక విషయంలో వ్యవహరిస్తున్న నిరంకుశత్వాన్ని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఏపీ పాలకుల ప్రోద్బలంతో అక్కడి పోలీసులు ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు, విలేకరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను హరించేలా అక్కడి పోలీసులు తీరును తప్పుబడుతున్నాయి. ఏపీలో జరుగుతున్న దమననీతిని ప్రతీఒక్కరు ఖండించాల్సిందేనంటున్నారు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డి, విలేకరులకు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సంఘీభావాన్ని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాల నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఏపీలో నియంతృత్వ పాలన పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఏపీలోని కూటమి సర్కారు నియంతృత్వ పాలన సాగిస్తోంది. తమను విమర్శించే వార్తలు ప్రచురితమైతే వివరణ ఇవ్వాలే కానీ, పాలకుల ప్రోద్బలంతో పత్రికలపై పోలీసులు కేసులు పెట్టడం సరికాదు. పత్రికల విషయంలో కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. – మల్లేశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి. మెదక్పత్రికా స్వేచ్ఛను హరించడమే ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఏపీలో జరుగుతున్న దమన నీతిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలి. నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ వార్తలు రాస్తున్న ‘సాక్షి’పై కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు, ఈ పత్రికా రిపోర్టర్లపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – బండారు యాదగిరి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడుహక్కులను కాలరాయడమే ఏపీలోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమే. ‘సాక్షి’ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెట్టడం అంటే ప్రశ్నించే గొంతు నొక్కడమే. – అక్కపల్లి యోగానందరెడ్డి,జిల్లా అధ్యక్షుడు, టెంజు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిత్యం ప్రతికలు వెలుగులోకి తెస్తాయి. పత్రికల్లో వచ్చే రాజకీయ విమర్శల వార్తల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు రాజ్యంగబద్ధంగా వ్యవహరించాలి. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల ప్రకారం మాత్రమే ముందుకెళ్లాలి. – చిన్నమైల్ గోదావరి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గొంతు నొక్కే ప్రయత్నమే పత్రికలపై కేసులు పెట్టడం..ప్రశ్నించే వారి గొంతు నొక్కేలా వ్యవహరించడం ఏ ప్రభుత్వాలకు మంచిదికాదు. నేతలు మాట్లాడిన మాటలు ప్రచురించినందుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు, విలేకరులపై కేసులు పెట్టడం అంటే కక్షసాధింపే అవుతుంది. నిత్యం ప్రజాసమస్యలను వెలికి తీసే పత్రికల గొంతునొక్కడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. – నిర్మలారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కక్ష సాధింపు సరికాదు పత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు, అక్కడి విలేకరులపై కేసులు పెట్టడం అంటే ఆ ప్రభుత్వం అభద్రతాభావంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పత్రికల గొంతు నొక్కడం అంటే ప్రజాస్వామ్యాన్ని హరించడం, దాడి చేయడమే అవుతుంది. – చింత ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే -
కుమ్మేసిన వాన
మెదక్లో అత్యధికంగా17 సెం.మీ వర్షపాతం ● కొల్చారంలో 8 సెం.మీ నమోదు ● లోతట్టు ప్రాంతాలు జలమయంమెదక్జోన్: భారీ వర్షంతో మెదక్ మరోసారి అతలాకుతలం అయింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కురిసిన కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా రాందాస్ చౌరస్తాలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు భారీగా నిలిచింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు దుకాణాల్లోకి నీరు చేరింది. స్పందించిన మున్సిపల్ అధికారులు అడ్డుగా ఉన్న డివైడర్ను జేసీబీతో తొలగించి నీరు దిగువకు వెళ్లేలా చేశారు. అలాగే పట్టణంలోని గాంధీనగర్లో పలువురి ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బృంధావన్నగర్, ఫతేనగర్, సాయినగర్, నర్సిఖేడ్ కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 17 సెంటీ మీటర్లు, కొల్చారం మండలంలో 8 సెంటీ మీటర్లు, హవేళిఘణాపూర్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. -
పంట నష్టం అపారం
● ఆందోళనలో రైతులు ● నివేదిక తయారుచేసిన అధికారులుజహీరాబాద్ టౌన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలో ఖరీఫ్ పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. రూ.వేల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నారింజ వాగు పరీవాహక ప్రాంతాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపించామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలో జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్ మండలాలు మండలాల్లో వేసిన పెసర, మినుము,పత్తి, సోయాబిన్, కంది తదితర పంటలను రైతులు సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెసర, మినుము, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక పత్తి చేలలోనీళ్లు నిలిచి కాయలనుంచి పత్తి బయటకొచ్చిందని తెలిపారు. ఇప్పటికే రైతుల పట్టపాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్ తదితర వివరాలను అధికారులు సేకరించారు.జాగ్రత్తలు తీసుకోవాలి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను నివేదికలను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. నారింజ వాగు ప్రాంతంలో పంట నష్టం అధికంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పంటలలో నీరు నిలువ ఉండటం వల్ల చీడపీడల బెడద కూడా పెరగకుండా వ్యవసాయ అధికారులను సంప్రదించి తగు సూచనలు సలహాలు తీసుకోవాలి. – భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్ప్రభుత్వం ఆదుకోవాలి భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయాం. కోత దశలో ఉన్న పెసర, మినుము పూర్తిగా దెబ్బతింది. పత్తి పంట కూడా రంగు మారుతోంది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి. – శ్రీనివాస్, రైతు కంబాలపల్లి -
పేషీల ప్రక్షాళన
● సదరు అధికారి పనిచేసే మండలానికి పంపిన అధికారులు ● ఇప్పటికే తన పేషీలోని సీసీలనుమార్చిన కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లో ఏళ్లుగా పాతుకుపోయి పెద్ద పెద్ద వ్యవహారాలను సైతం నడిపే క్యాంపు క్లర్క్ (సీసీ)లపై కలెక్టర్ ప్రావీణ్య దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఎక్కువకాలం ఒకే చోట పనిచేయడం వల్ల అవినీతి వ్యవహారాల్లో ఆరితేరిన కొంతమందిని నెమ్మదిగా కలెక్టరేట్ నుంచి పంపించే యోచన చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పేషీల్లో ప్రక్షాళన చేపట్టిన కలెక్టర్ తాజాగా మరో ఉన్నతాధికారి వద్ద పనిచేసే సీసీపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కలెక్టరేట్లో ఆయా ఉన్న తాధికారుల పేషీల ప్రక్షాళన కొనసాగుతోంది. ఇప్పటికే తన పేషీలో పాతుకుపోయిన సీసీ (క్యాంపు క్లర్క్)లను మార్చి వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కలెక్టర్ ప్రావీణ్య.. తాజాగా మరో కీలక ఉన్నతాధికారి వద్ద పాతుకుపోయిన మరో సీసీని మార్చి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అతన్ని ఆయన పనిచేయాల్సిన మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సదరు సీసీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. భూముల విషయంలో కలెక్టరేట్కు వచ్చే బడాబాబులకు వ్యవహారాల ను చక్కబెట్టడంలో సదరు సీసీ కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ప్రావీణ్య తక్షణం అతడి పోస్టు ఉన్న మండలానికి పంపారు. జిల్లా కలెక్టర్గా మూడు నెలలక్రితం బాధ్యతలు తీసుకున్న ప్రావీణ్య కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పేరుకే క్లర్కులు.. నడిపేది పెద్ద వ్యవహారాలు పేరుకు క్లర్కులైనా పెద్ద పెద్ద వ్యవహారాల్లో వీరి పాత్ర చాలా కీలకంగా మారింది. సదరు అధికారి వద్దకు ఏ ఫైలు త్వరగా వెళ్లాలన్నా వీరు చేతివాటం ప్రదర్శిస్తుంటారనే విమర్శలున్నాయి. బడాబాబుల భూముల వ్యవహారాలు, ప్రజాప్రతినిధుల పైరవీలతో వచ్చే వారికి సంబంధించిన ఫైళ్లు ఉన్నతాధికారుల ముందుకు తీసుకెళ్లి పనులు పూర్తి చేయడంలో వీరు ఆరితేరి పోయారు. ఒకరిద్దరి పనితీరు అయితే సీసీని కలిస్తే సరిపోతుంది..పని అయిపోయినట్లే..అనే స్థాయికి ఎదిగారంటే వీరు ఏ స్థాయిలో వ్యవహారాలు నడిపారనేది అర్థం చేసుకోవచ్చు. ఉన్నతాధికారులను కలిసి తమ గోడును వెళ్ల బోసుకుందామని వచ్చే సామాన్యులను లోనికి అనుమతించని ఈ సీసీలు పైరవీకారులను, బడాబాబులను, రాజకీయ పలుకుబడి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తారనేది బహిరంగ రహస్యం. మరోవైపు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాలనాపరమైన విషయాలను చర్చించేందుకు, ఫైళ్లకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు కలెక్టర్ వద్దకు వస్తుంటారు. ఇలాంటి జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ సీసీలకు జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని శాఖలకు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు జిల్లా బాస్లుగా ఉంటారు. ఈ స్థాయి అధికారులు ఈ క్లర్కుల వద్దకు వచ్చి వినయం ప్రదర్శించాల్సిన పరిస్థితిలో వ్యవహారాలు నడిపారు. ఏళ్లుగా పాతుకు పోయి.. జిల్లాలో కొందరు కీలక ఉన్నతాధికారుల వద్ద పనిచేస్తున్న క్యాంపు క్లర్కులు పాతుకు పోయా రు. జిల్లాకు ఏ అధికారి బదిలీపై వచ్చినా వారే సీసీలుగా కొనసాగుతుండటం పరిపాటైపోయింది. గతంలో ఓ కలెక్టర్ వద్ద పనిచేసిన ఓ సీసీ..సదరు అధికారి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిపోతే..ఆయనతో పాటే సీసీని కూడా తాను పనిచేసే జిల్లాకు తీసుకెళ్లిన ఘటనలున్నాయంటే వీరి వ్యవహారాలు ఏ స్థాయిలో ఉంటాయనేది అర్థం చేసుకోవచ్చు. ఒకరిద్దరు సీసీలైతే గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిన కీలక అధికారి సంతకాలను పాత తేదీల్లో పెట్టించుకువచ్చిన ఘనులు కూడా ఉన్నారు. ఇలా క్లర్కులుగా పనిచేసిన వీరిలో కొందరు కోట్లకు పడగలెత్తారు. కీలక ఉన్నతాధికారుల స్థిరాస్తులకు బినామీలుగా ఉన్న సీసీలు కూడా ఉన్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు చాలా ఏళ్లుగా పాతుకు పోయి..తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీలను ఒక్కొక్కరిగా పంపించివేస్తుండటం కలెక్టరేట్లో చర్చనీయాంశంగా మారింది. -
భూములు గుర్తించి ఫెన్సింగ్ వేయాలి
ఝరాసంగం(జహీరాబాద్): జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతున్న నిమ్జ్ పరిసరాల్లో స్మార్ట్ సిటీఏర్పాటు కోసం భూములను పరిశీలించారు. టీజీఐఐసీ ఎండీ శశాంక్, కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామ శివారులో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా శశాంక్ మాట్లాడుతూ..స్థానిక అధికారులు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కోసం అవసరమయ్యే భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. త్వరలో అభివృద్ధి పనులకు టెండర్ వేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. సుమారు 3,200 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,300 కోట్లతో పనులు చేపట్టనున్నారు. అనంతరం నిమ్జ్ ప్రాంతాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.స్మార్ట్ సిటీ భూముల పరిశీలనలో టీజీఐఐసీ ఎండీ -
మొక్కనాటు.. ఫొటో పెట్టు
న్యాల్కల్ (జహీరాబాద్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల పెంపకంపై దృష్టిని సారించాయి. హరితహారం, వనమహోత్సవం లాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా, ఏక్ పేడ్ మా కే నామ్ 2.0 పేరుతో తల్లి పేరిట ప్రతీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 1,709 మొక్కలను విద్యార్థులు నాటగా వాటి ఫొటోలను ఉపాధ్యాయులు పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఉపాధ్యాయులకు అవగాహన జిల్లాలో 864 ప్రాథమిక, 187ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలలు, 22 కేజీబీవీలు, 10 మోడల్ స్కూళ్లు ఉండగా, 109 గురుకుల, సాంఘిక సంక్షేమ తదితర ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటితోపాటు సుమారు 500 వరకు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 3.40లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’కార్యక్రమంలో భాగంగా ప్రతీ పాఠశాల ఆవరణలో విద్యార్థులు తమ తల్లి పేరిట మొక్కలు నాటి వాటి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టల్లో వివరాలు ఎలా నమోదు చేయాలనే అంశాలపై ఎంఈఓలు, శిక్షణ పొందిన ఆర్పీలు మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. వివరాలు నమోదు ఇలా..https://ecoclubs.education.gov.in పోర్టల్లోకి వెళ్లి విద్యార్థి పేరు, తరగతి, తల్లిదండ్రుల పేర్లు, చదువుతున్న పాఠశాల వివరాలను నమోదు చేయాలి. పాఠశాల ఆవరణలో తల్లితో కలిసి మొక్కలు నాటిన ఫొటోను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. తర్వాత విద్యార్థి తల్లితో కలసి నాటిన ఫొటోతో సర్టిఫికెట్ వస్తుంది. సరఫరా చేస్తున్న ఉపాధి పథకం సిబ్బంది అన్ని పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. అవసరమైన మొక్కలను ఉపాధి పథకం సిబ్బంది సరఫరా చేస్తుండగా అవి సరిపోకపోతే ఎక్కడైనా కొనుగోలు చేసి మరీ మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. జూలైలో ప్రారంభమైన ఈ కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతోంది. జిల్లాలో 1,900లకు పైగా పాఠశాలలు ఉండగా ఇప్పటివరకు 164 పాఠశాలల్లో 1,709 మొక్కలు నాటినట్లు సమాచారం. అయితే చాలా పాఠశాలల్లో మొక్కలు నాటినప్పటికీ పోర్టల్లో నమోదు చేయలేదని అధికారులు చెబుతున్నారు. మంచి కార్యక్రమం స్కూల్ ఆవరణలో తల్లి పేరిట మొక్కలు నాటడం చాలా మంచి కార్యక్రమం. బిడ్డతో కలసి మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ఈ చెట్ల వల్ల పిల్లలకు, ఉపాధ్యాయులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించనుంది. – శకుంతల, విద్యార్థి తల్లి, కల్బెమల్ నెలాఖరుకు పూర్తి చేయాలి విద్యార్థులు తమ తల్లితో కలసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించాం. – వెంకటేశ్వర్లు, డీఈఓపాఠశాలల్లో పచ్చని ఆహ్లాదం -
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరికి రిమాండ్
పటాన్చెరు టౌన్: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. క్రైమ్ సీఐ రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధికి చెందిన రంగారావు గత నెల 26న మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు మెడలో ఉన్న బంగారు చైన్ అపహరించారు. దీంతో బాధితుడు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం ఇస్నాపూర్ చౌరస్తాలో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన మొయినా బాద్ అజిత్నగర్కు చెందిన మహమ్మద్ అబ్బాస్, మాదాపూర్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ షాన్వాస్ అదుపులోకి తీసుకొని విచారించారు. ఇస్నాపూర్లో చైన్ స్నాచింగ్ తామే చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే వీరిపై పలు పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వారి నుంచి 1.3 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, బైకు, ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసి వారిని రిమాండ్కి తరలించారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● ఒకేసారి ఐదు ఇళ్లల్లో చోరీ ● బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు ● క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభం నర్సాపూర్ రూరల్: తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. బుధవారం అర్ధరాత్రి ఒకేసారి ఐదు ఇళ్లల్లో చోరీ జరగడం కలకలం రేగింది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్ ప్రాంతానికి చెందిన నీరుడి స్వరూప, ఎడ్ల పోచయ్య, రొటం ప్రభాకర్, చిన్న బాలమణి, పిచ్చకుంట్ల నర్సింలు ఇళ్ల తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. ఇంట్లోని బీరువాలు ధ్వంసం చేసి బంగారం, వెండి, నగదు తీసుకెళ్లారు. అయితే నీరుడి స్వరూప ఇంటికి తాళం వేసి గ్రామంలోనే ఉన్న తన కూతురు ఇంట్లో నిద్రించింది. ఆమె ఇంట్లో దొంగలు చొరబడి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 20 వెండి గొలుసులు, రూ.60 వేల నగదు ఎత్తుకెళ్లారు. అలాగే ఎడ్ల పోచయ్య కుటుంబ సభ్యులు వేరే గ్రామానికి వెళ్లగా దొంగలు తాళం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న 8 తులాల వెండి, రూ 16వేల నగదు దోచుకెళ్లారు. అదే విధంగా రొటం ప్రభాకర్, చిన్న బాలమణి, పిచ్చకుంట్ల నర్సింలు ఇళ్ల తాళాలు ధ్వంసం చిన్న చిన్న వస్తువులు ఎత్తుకెళ్లారు. ఒకే రోజు నారాయణపూర్లో తాళాలు వేసిన ఉన్న ఐదు ఇళ్లల్లో చోరీ జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎస్ఐ లింగం, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్లు క్లూస్ టీంతో దొంగతనం జరిగిన ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దాతృత్వాన్ని చాటుకున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కంటి చూపు కోల్పోయి అంధుడిగా మారిన సంపూరన్ నాయక్ అనే విద్యార్థికి కంటి చికిత్స కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం రూ.పది లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కందిలో స్థిరపడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిసాన్పవార్, శాంతాబాయిల కుమారుడు సంపూరన్ నాయక్కు ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడటంతో కోమాలోకి వెళ్లిపోయాడు. తిరిగి కోలుకున్నప్పటికీ.. కంటి చూపు పోయింది. నాయక్ కోసం ఇప్పటికే రూ.ఐదు లక్షల వరకు ఆ పేద కుటుంబం ఖర్చు చేసింది. చూపు రావాలంటే రెండు ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ. పది లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అంత మొత్తాన్ని వెచ్చించే స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం జగ్గారెడ్డిని ఆశ్రయించగా వెంటనే రూ.పది లక్షల నగదును అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. -
మొన్న తల్లి.. నేడు తండ్రి మృతి
● చిన్నారుల పరిస్థితి దైన్యం ● వెంటాడిన వరుస విషాదాలు ● గౌరారంలో విషాదం వర్గల్(గజ్వేల్): విధి ఆడిన వింత నాటకం.. రెండు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులు, అమ్మమ్మ.. కానరాని తీరాలకు చేరారు. దీంతో చిన్నారులు ప్రేమకు దూరమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన వెల్దుర్తి మంజునాథ్ సెలూన్ నిర్వహిస్తుంటారు. భార్య కవిత వికలాంగురాలు. నయనిక(13), అక్షయ్(10) ఇద్దరు పిల్లలున్నారు. ఇల్లరికపు అల్లుడు కావడంతో అత్త భారతమ్మ వారితోనే ఉండేది. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తమ అనారోగ్యానికి తోడు అల్లుడు కూడా తీవ్రఅనారోగ్యం పాలయ్యాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం (జులై 10న) చిన్నారుల తల్లి కవిత, అమ్మమ్మ భారతమ్మ పురుగుల మందు తాగి బలవన్మరణం చెందారు. ఆ విషాదం మరవకముందే గురువారం తండ్రి మంజునాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మృతదేహం వద్ద పిల్లల బేలచూపులు చూస్తుండటంతో చూపరులు కన్నీంటిపర్యంతమయ్యారు. వృద్ధులైన తాత శివరాములు, నానమ్మ పెంటమ్మ, బంధుగణం దుఃఖసాగరంలో మునిగిపోయారు. పదేళ్ల కుమారుడు అక్షయ్ తలకొరివి పట్టి అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకున్నాడు. ఈ ఘటనతో గౌరారంలో విషాదం అలుముకున్నది. -
కల్యాణం వరకు పనులు పూర్తి
మల్లన్న ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్ కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న కల్యాణం నాటికి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని ఈవో టంకశాల వెంకటేశ్ తెలిపారు. గురువారం ఆలయంలో కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక సమగ్ర నివేదికను విడుదల చేశారు. దాతల సహకారంతో నిర్మించబోయే 100 వసతి గదులకు సంబంధించి ప్లాన్, ఎస్టిమేట్లను, మేడలమ్మ, కేతమ్మలకు బంగారు కిరీటం కోసం బంగారాన్ని ముంబైలోని ప్రభుత్వ మింట్ ద్వారా కరిగించడానికి అనుమతి కోసం దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మల్లన్న గుట్టపై నిర్మాణం చేపడుతున్న త్రిశూలం, ఢమరుకం పనులకు నిధులు సరిపోక పోవడంతో రూ.84.15 లక్షలకు పరిపాలన అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. రూ.12కోట్లతో నిర్మాణం చేపడుతున్న క్యూ కాంప్లెక్స్ పనులు 70 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. బండ గుట్టపై 50 వసతి గదుల పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే మిగతా పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రంమలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకులు, సురేందర్ రెడ్డి, శ్రీరాములు, మధుకర్ పాల్గొన్నారు. -
పగలు రెక్కీ.. రాత్రి చోరీలు
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్అక్కన్నపేట(హుస్నాబాద్): పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఎస్ఐ ప్రశాంత్ నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. హుజుర్నగర్లోని శ్రీనగర్కాలనీకి చెందిన దంపతులు మామిడి గోపి, నాగమణి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన దంపతులు జాదవ్ గణేశ్, శిరీష కలిసి ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, సిద్దిపేటతో పాటు ఇతర జిల్లాల్లో పలు రకాల దొంగతనాలు చేసి 25 కేసుల్లో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించారు. చోరీ చేసిన సొత్తును స్టేషన్ఘన్పూర్, జనగామ జిల్లాలోని స్క్రాప్షాప్ నిర్వాహకురాలికి విక్రయించారు. వీరి వద్ద నుంచి రెండు గుడి గంటలు, బంగారు ముక్కుపుడక, వెండి అమ్మవారి పట్టీలు, రూ. 4 వేలతో పాటు వారు ఉపయోగించిన ఆటో, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అనంతరం వీరిని రిమాండ్కు తరలించారు. వీరిని మండలంలోని జనగామ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా, పోలీసులను చూసి ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని విచారించగా, పలు ఆలయాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఉదయం గ్రామాల్లో చెత్త ఏరుకుంటూ ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో చూసి, రాత్రి అయిందంటే చాలు గుడి తాళాలు పగలగొట్టి అందులో ఉన్న విలువైన వస్తువులతో పాటు హుండీలను పగలగొట్టి డబ్బులను ఎత్తుకెళ్తారు. అలాగే విలువైన వస్తువు లను అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. -
ఇందిరమ్మ ఇళ్లకు 8 ట్రాక్టర్ల ఇసుక
ఖేడ్లో ఇసుక బజార్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.5 లక్షలతోపాటు 8 ట్రాక్టర్ల ఇసుకను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని మార్కెట్ యార్డు ప్రక్కన గురువారం ఇసుక బజార్ను సబ్కలెక్టర్ ఉమాహారతితో కలిసి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఇసుక పంపిణీని ప్రారంభించారు. అంతకుముందు ఖేడ్ తహసీల్ గ్రౌండ్లో 69వ స్కూల్గేమ్ ఫెడరేషన్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదన్నారు. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ అధికారులను సంప్రదించి ఇసుకను పొందవచ్చన్నారు. చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు కూడా ముఖ్యమని తమకు నచ్చిన ఆటల్లో నైపుణ్యాలను అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, గృహనిర్మాణశాఖ పీడీ చలపతిరావు, డీఈ తివారీ, ఏఈ వంశీ, తహసీల్దారు హసీనాబేగం, క్రీడల జిల్లా ఇన్చార్జీ శ్రీనివాస్, జిల్లాలోని పీడీలు, పీఈటీలు, నాయకులు వినోద్పాటిల్, రమేశ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆక్రమిస్తే అంతే సంగతులు
రామాయంపేట(మెదక్): అటవీ భూముల పరిరక్షణలో భాగంగా ఆక్రమణదారులపై ఆ శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇందులోభాగంగా ఆక్రమణదారులపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదు చేసి సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారు. ఆనుకున్న భూమిని ఆక్రమించుకుని.. జిల్లా పరిధిలో 57 వేల హెక్టార్లకు పైగా అటవీభూమి ఉంది. గతంలో కొన్ని గిరిజన తండాల్లో ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్న వారికి ప్రభుత్వం అటవీ హక్కుల పట్టాలిచ్చింది. ఇలా పట్టాలు పొందినవారితోపాటు మారుమూల గ్రామాల్లో కొందరు తమ భూములను ఆనుకుని ఉన్న అటవీ భూమిని నెమ్మదిగా ఆక్రమించేసుకుంటున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ప్రతి ఏటా కొంతమేర కబ్జాకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీ అధికారులు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేశారు. దీంతోపాటుగా సదరు భూముల్లో దున్నకాలు చేపట్టిన ట్రాక్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీన భూమిలో మొక్కలు నాటుతున్న అధికారులు కాగా ఆక్రమణదారులనుంచి తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్న భూముల్లో అధికారులు ఇప్పటివరకు 40 వేల మొక్కలు నాటారు. మరో 60 వేల మొక్కలు నాటుతామని చెబుతున్నారు. జిల్లా పరిధిలో సుమారుగా ఆరు వేల ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలో దిగిన అటవీ అధికారులు దాడులు నిర్వహిస్తూ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. గత జూలైలో రామాయంపేట మండలం బాపనయ్య తండాలో ఐదెకరాలమేర అటవీ భూమి కబ్జాకు గురైనట్లు తెలుసుకున్న అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారు. గతేడాది హవేళీఘనపూర్ మండల పరిధి తండాల్లో ఆక్రమణకు గురైన భూములను విడిపించే క్రమంలో గిరిజనులకు, అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఆక్రమిస్తే కఠిన చర్యలే అటవీ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని మండలాల్లో కేసులు నమోదు చేశాం. స్వాధీనం చేసుకున్న భూముల్లో 40 వేల మొక్కలు నాటాం. – జోజి, జిల్లా అటవీ అధికారి అటవీ భూమి పరిరక్షణపై దృష్టిసారించిన అధికారులు ఆక్రమణదారుల చేతుల్లో ఆరువేల ఎకరాల అటవీ భూములు స్వాధీనం చేసుకుని మొక్కలు నాటుతున్న వైనం -
లోక్అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి టౌన్ : జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘రాజీయే రాజమార్గం’అనే నినాదంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు లోక్అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తున్నాయి. రాజీయే రాజమార్గమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జీలు సూచిస్తున్నారు. పెండింగ్ కేసులు ఎక్కువగానే... జిల్లా వ్యాప్తంగా 19,858కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ లోక్ అదాలత్లో విద్యుత్, టెలిఫోన్ రికవరీ, సివిల్, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాణాలు, మోటార్ వెహికల్ కేసులు, బ్యాంకుల రికవరీ కేసులు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా 12 బెంచీలు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా 12బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. సంగారెడ్డిలో ఏడు, జహీరాబాద్లో మూడు, నారాయణఖేడ్, జోగిపేటలో ఒక్కొక్కటి చొప్పున బెంచ్లు ఏర్పాటు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి టీఎల్ఎంకు నందిని ఎంపిక
శివ్వంపేట(నర్సాపూర్): సమగ్ర శిక్షా రాష్ట్ర స్థాయి టీఎల్ఎం మేళాకు శివ్వంపేట ఉపాధ్యాయురాలు ఎంపికై ంది. బుధవారం మెదక్లో నిర్వహించిన జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో శివ్వంపేట శివాలయనగర్ పీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు మెతుకు నందిని పాల్గొంది. మేళాలో ఈవీఎస్ సబ్జెక్ట్ నుంచి విద్యార్థులకు సులభంగా బోధన అర్థమయ్యేలా ప్రదర్శించినందుకు గాను రాష్ట్ర స్ధాయిలో నిర్వహించే మేళాకు ఎంపికై నట్లు ఎంఈఓ బుచ్చనాయక్ తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక పట్ల పాఠశాల హెచ్ఎం శేఖర్, మండల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. -
షాబుద్దీన్ దర్గాకు చాదర్ సమర్పణ
జహీరాబాద్: సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు హజ్రత్ షేక్ షాబుద్దీన్ దర్గాకు చాదర్ను సమర్పించారు. మంగళవారం రాత్రి హరీశ్రావు మండలంలోని శేఖాపూర్లో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలపై చాదర్ పెట్టుకుని దర్గాకు సమర్పించారు. అనంతరం దర్గాను దర్శించారు. ఖవ్వాలీ కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు ఖిజర్ యాఫై, తట్టు నారాయణ, సంజీవరెడ్డి, వెంకటేశం, మొహియొద్దీన్, యాకూబ్, నామ రవికిరణ్, విజేందర్రెడ్డి, చిన్నారెడ్డి, ఉర్సు కమిటీ సభ్యులు కిజర్, చస్మొద్దీన్ పాల్గొన్నారు.హామీలు వెంటనే అమలు చేయాలి ములుగు(గజ్వేల్): వికలాంగులు, చేయూత పింఛన్దారులకు ఎన్నికలకు ముందూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగె మహేశ్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. హామీల అమలు విషయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 15న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. వాహనం ఢీకొని యువతి మృతి పటాన్చెరు టౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువతి మృతిచెందిన సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. బొల్లారం వైపు నుంచి ముత్తంగి రింగ్ రోడ్డు ఎగ్జిట్ సమీపంలో గుర్తుతెలియని యువతి (25)ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి సంబంధించిన బంధువులు ఉంటే పటాన్చెరు పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఇందిరమ్మ’ పనుల్లో వేగం పెంచండి
● లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించండి ● ఏఈలకు హౌసింగ్ పీడీ మాణిక్యం ఆదేశం మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, లబ్ధిదారుల దగ్గరుండి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం ఏఈలకు సూచించారు. బుధవారం జిల్లా హౌసింగ్ కార్యాలయంలో ఏఈలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా నిర్మాణాలు ప్రారంభించని ఇందిరమ్మ లబ్దిదారులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వారం వారం బిల్లులు అందజేస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు తెలిపాలన్నారు. నిర్మాణాలు త్వరితగతిన చేపట్టేందుకు లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎప్పటికప్పుడు నిర్మాణాలను ఫొటో క్యాప్చర్ చేసి హౌసింగ్ యాప్లో పొందు పర్చాలన్నారు. తద్వారా లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లులు అందుతాయన్నారు. ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 18005995991కు సంప్రదించాలని కోరారు. అన్ని మండలాల ఏఈలు పాల్గొన్నారు. -
పంటల సస్యరక్షణపై అవగాహన
తొగుట(దుబ్బాక): విద్యార్థులు క్షేత్రస్థాయిలో పొలంబాట పట్టారు. మండలంలోని గుడికందుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి తోర్నాల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థినులు వ్యవసాయ పరిశోధనలో భాగంగా పంటలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాల పంటలకు రసాయనాలు వాడకుండా పెరమోన్, ట్రాప్ జిగురు అట్టల వాడకంపై పాఠశాల విద్యార్థులకు వివరించారు. అలాగే కృత్రిమ ఎరువుల వాడకం వివిధ రసాయనాలను చల్లడం వల్ల కలిగే నష్టాల గూర్చి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అంజిరెడ్డి, ఉపాధ్యాయులు భిక్షపతి, శివయ్య పాల్గొన్నారు. పెద్దశంకరంపేట(మెదక్): ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన 2025–26 అగ్రిసెట్ ప్రవేశ పరీక్షలో మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకి చెందిన బుచ్చగోని ప్రజ్ఞశ్రీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. బీఎస్సీ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ ఫలితాలు మంగళవారం విడుదలవ్వగా.. ప్రియాంక కాలనీకి చెందిన శంకర్గౌడ్, మంగమ్మ చిన్న కుమార్తె ప్రజ్ఞశ్రీ ర్యాంకు సాధి ంచింది. అంతకుముందు అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన ఆమె జిల్లా టాపర్గా నిలిచింది. హైదరాబాద్లోని బండ్లగూడ నిర్వహణ ఉచిత కోచింగ్ సెంటర్లో గత ఆరు నెలలుగా కోచింగ్ తీసుకుంటూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులు, కాలనీవాసులు అభినందించారు. న్యాల్కల్(జహీరాబాద్): గుట్టు చప్పుడు కాకుండా పత్తి పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చాల్కికి చెందిన గౌని గుండప్ప పత్తి పంటలో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నాడు. సమాచారం మేరకు హద్నూర్ పోలీసులు, ఎకై ్సజ్ పోలీసులు రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోగా.. వీటి విలువ సుమారు 1.70లక్షలు ఉంటుందని ఎస్ఐ తలిపారు. అనంతరం నిందితుడు గుండప్పను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. పటాన్చెరు టౌన్: ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. పటాన్చెరు డివిజన్లోని సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికుడికి ఆపన్నహస్తం అందించారు. గత శనివారం పరిశ్రమలో ప్రమాదవశాత్తు అమర్సింగ్ అనే కార్మికుడు (59) యంత్రంలో పడి కుడి చేయి కోల్పోయాడు. ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు కార్మికులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని ఆశ్రయించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి రూ. 25 లక్షల పరిహారం ఇప్పించారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు. -
కాపర్ కేటుగాళ్లు
● ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి వైర్ చోరి ● దుండగులకు పట్టుకోవాలని రైతుల విజ్ఞప్తి మద్దూరు(హుస్నాబాద్): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాఫర్ వైర్ చోరి అయిన సంఘటన మద్దూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వారాల శ్రీను వ్యవసాయ బావి వద్ద గల 16కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కాఫర్ వైర్ను దొంగిలించినట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని రైతులు వాపోతున్నారు. -
గులాంగిరి.. కాదంటే గురి!
పటాన్చెరు: జిల్లా అధికారులకు పటాన్చెరు పారిశ్రామికవాడ బంగారు బాతుగుడ్డుగా మారింది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న మండల స్థాయి అధికారులందరూ జిల్లా బాస్లకు గులాంగిరి చేస్తేనే ఇక్కడ కొనసాగే పరిస్థితి నెలకొంది. లేకపోతే మారుమూల ప్రాంతాలకు బదిలీ కావాల్సిందే. ఇది ఒక్క రెవెన్యూలోనే కాకుండా పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్ లాంటి ప్రధాన శాఖల్లో ఇదే తంతు నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్డీఓ బదిలీ అంశం పారిశ్రామికవాడ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇక్కడ అధికారులపై చేసిన ఒత్తిడిపై చర్చ జరుగుతుంది. సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్రెడ్డిపై వచ్చిన ఆరోపణల్లో ప్రధానంగా ఆయన జిల్లా ఉన్నతాధికారులకు మధ్యవర్తిగా కూడా పని చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామచంద్రాపురం మండలంలో ఓ అసైన్డ్ భూమికి ఎన్ఓసీ జారీ చేసే ప్రక్రియలో గతంలో ఇక్కడ పని చేసిన జిల్లా ఉన్నతాధికారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో జిల్లా ఉన్నతాధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో వార్తలు రావడంతో మీడియాను మచ్చిక చేసుకునేందుకు ఆ ఆర్డీఓ జిల్లా ఉన్నతాధికారికి, మీడియాకు మధ్యవర్తిగా వ్యవహరించారు. సంగారెడ్డి ఆర్డీఓపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఆయనను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను గతంలో ఇక్కడ నుంచి బదిలీ చేస్తే పీసీసీ స్థాయి నేత ఒకరు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంగారెడ్డి ఆర్డీఓగా తిరిగి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. రెవెన్యూ శాఖ రాష్ట్ర మంత్రిత్వ శాఖ వరకు ఆ ఆర్డీఓ అవినీతి కార్యకలాపాలపై ఫిర్యాదులు అందడంతోనే బదిలీ వేటు పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.మండల స్థాయి అధికారులు జిల్లా బాస్ల నుంచి అనేక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు తమ అనుకూలమైన సిబ్బందిని మాత్రమే ఈ ప్రాంతంలో కొనసాగనిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసైన్డ్, వక్ఫ్, ప్రభుత్వ, చెరువు భూము లను చెరబట్టేందుకు రియల్టర్లు వేసే ఎత్తుగడలకు జిల్లా స్థాయి అధికారులే లొంగిపోతున్నారని వారి ఆదేశాల తోనే చేసేదేమీ లేక మండల స్థాయిలో అధికారులు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వారు జిల్లా బాస్లకు గులాంగిరి చేస్తేనే ఇక్కడ కొనసాగే పరిస్థితి నెలకొంది. మితిమీరుతున్న జిల్లా బాస్ల ఆగడాలు పారిశ్రామికవాడలో ఒత్తిడికి గురవుతున్న రెవెన్యూ అధికారులు ఇతర శాఖల్లోనూ ఇదే తంతు -
విజయవంతం చేయాలి
జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధి కారులు కలసి జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రాజీమార్గంతో ఎక్కువ కేసులను పరిష్కరించుకోవడానికి సహకరించాలి. – భవానీ చంద్ర, జిల్లా ప్రధాన న్యాయమూర్తిసరిదిద్దుకోవచ్చు అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోవద్దు. జిల్లా వ్యాప్తంగా నమోదైన, పెండింగ్లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడేలా జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలి. – పరితోశ్ పంకజ్, జిల్లా ఎస్పీ -
నగదు రహిత లావాదేవీలు
వర్గల్(గజ్వేల్): సమయం ఆదా, పారదర్శకత, జవాబుదారి ధ్యేయంగా మహిళా స్వయం సహాయక సంఘాల నగదు రహిత లావాదేవీల కోసం పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా నుంచి వర్గల్ మండలం ఎంపికై ంది. బుధవారం వర్గల్ సెర్ప్ కార్యాలయంలో నగదు రహిత లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, యూపిఐ పేమెంట్లు తదితర అంశాలపై అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులకు, గ్రామ సంఘ సహాయకులకు కమ్యూనిటీ రిసోర్స్పర్సన్లు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సెర్ప్ ప్రధాన కార్యాలయ బ్యాంకు లింకేజీ ప్రాజెక్టు మేనేజర్ నర్సింహస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ జయదేవ్ ఆర్య మాట్లాడుతూ మహిళా సంఘాల్లో డిజిటల్ పేమెంట్స్ కోసం పైలెట్ ప్రాజెక్టుగా వర్గల్ మండలం ఎంపిక కావడం అభినందనీయమన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు ఇందుకు అనుగుణంగా తర్ఫీదుపొంది, నగదు లావాదేవీలతో మండలాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ నర్సింహస్వామి, డీపీఎం ప్రకాష్, ఏపీఎం కిరణ్ కుమార్, గజ్వేల్ ఏరియా సీబీఓ ఆడిటర్ బ్రహ్మచారి తదిరులు పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా వర్గల్ మండలం ఎంపిక ఊరూరా మహిళా సంఘాలకు శిక్షణ కార్యక్రమం -
సాఫ్ట్ స్కిల్స్పై శిక్షణ
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత వర్గల్(గజ్వేల్): స్థానిక పూలే గురుకుల బాలికల డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ సాధనకు ఉపయుక్తంగా నిలిచే అంశాలపై నంది ఫౌండేషన్ నిర్వహించిన వారం రోజుల శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. శిబిరంలో 100 మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఫేసింగ్ మెలకువలు, రెస్యూమే ప్రిపరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు ఎలా సాధించాలో ట్రైనర్లు వోమిజి, శ్యామ్ వివిధ యాక్టివిటీల ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఉపయోగపడే మాన్యువల్ పుస్తకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాధ పాల్గొన్నారు. -
311 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: వికారాబాద్ జిల్లా శంకర్పల్లి ప్రాంతం నుంచి సేకరించిన రేషన్ బియ్యం గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తుండగా బుధవారం చిరాగ్పల్లి పోలీసులు పట్టుకున్నారు. చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్రెడ్డి కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులో గల ఆర్టీఏ చెక్పోస్టు వద్ద 65వ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న క్రమంలో అక్రమ బియ్యం లారీ పట్టుబడింది. అందులో 311 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం విలువ రూ.9,95,840 మేర ఉన్నట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా గుజరాత్కు చెందిన డ్రైవర్ రమేష్ కజారీయాను అదుపులోకి తీసుకున్నారు. చెవ్వ భాస్కర్తో కలిసి రమేష్లు శంకర్పల్లి ప్రాంతంలో రేషన్ వినియోగదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని అధిక ధరలకు అమ్మేందుకు గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నారు. దాడుల్లో పౌరసరఫరాల శాఖ అధికారి బస్వరాజ్, పోలీసులు పాల్గొన్నారు. -
రైతులు సమన్వయం పాటించాలి
డీఏఓ స్వరూప రాణిమిరుదొడ్డి(దుబ్బాక): రైతులకు సరిపడా యూరియా అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అన్నదాతలు కాస్త ఓపికతో సమన్వయం పాటించాలని డీఏఓ స్వరూప రాణి కోరారు. బుధవారం మిరుదొడ్డిలోని రైతు వేదికను ఆమె సందర్శించారు. యూరియా టోకెన్ల పంపిణీలో జరిగిన రైతుల ఆందోళన, ఫర్నీచర్ ధ్వంసంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నప్పటికీ కొంత మంది కావాలని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూడటం సరికాదన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడే రైతు వేదికలపై దాడికి పాల్పడటం విచారకరమన్నారు. ఇబ్బందులు కలగకుండా యూరియా సరఫరా చేయడానికి వ్యవసాయ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక ఏడీఏ మల్లయ్య, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, ఏఈఓలు అఖిల్, రేఖ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా ప్రణాళిక
మున్సిపాలిటీల్లో ఘనంగా ప్రారంభించిన వందరోజుల ప్రణాళిక అంతగా ఫలితాలనివ్వలేదు. అమలులో నిర్లక్ష్యం, నిధుల లేమి, పాలనాధికారుల బదిలీలు వంటి అంశాలు ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రణాళిక అమలులో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఒకటి రెండు బల్దియాలు ఇందుకు మినహాయింపుగా నిలిచాయి. అన్ని మున్సిపాలిటీలలో వందరోజులు ప్రణాళిక ఏమేరకు సత్ఫలితాలనిచ్చిందోనని సాక్షి బృందం చేసిన పరిశీలనలో అనేక అంశాలు వెల్లడయ్యాయి.నెరవేరని లక్ష్యంజోగిపేట(అందోల్): మున్సిపాలిటీల్లో చేపట్టిన వంద రోజుల ప్రణాళిక మొక్కుబడిగానే సాగింది. మున్సిపాలిటీలో 20 వార్డులున్నాయి. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఈ కార్యక్రమం చేపడుతున్న సమయంలోనే కమిషనర్గా పనిచేస్తున్న తిరుపతి బదిలీ అయి వేరొక కమిషనర్ నియామకం, బాధ్యతల స్వీకరణ వంటి వాటితో వందరోజుల ప్రణాళిక అమలులో కొంత జాప్యం జరిగింది. దీంతో పట్టణంలోని ఓపెన్ ప్లాట్లల్లో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి పాములు ఇళ్ల మధ్యనే సంచరించి భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా పట్టణంలోనే ఇద్దరు పాము కాటుతో మరణించిన ఘటనలున్నాయి.కొంతవరకే పనులు పూర్తినారాయణఖేడ్: వందరోజుల ప్రణాళికలో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలో చేపట్టిన కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా చేసినా మరికొన్ని ప్రాంతాల్లో సమస్యలు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. బస్టాండ్ ఆవరణలో చెత్తా చెదారంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ప్రధాన రహదారి వెంట పూర్తిగా తొలగించిన చెత్తకుప్పలు తిరిగి పునరావృతమవుతున్నాయి. ప్రధాన రహదారితోపాటు పలు ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో శిథిలావస్థలో ప్రమాదకరంగా మారి కూలేందుకు సిద్ధంగా ఉన్న 6 ఇళ్లను కూల్చివేశారు. నీటి క్లోరినేషన్, రహదారులపై గోతులు పూడ్చివేత పనులు పూర్తిచేశారు.పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాంపారిశుద్ధ్య సమస్యను చాలావరకు నివారించాం. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేశాం. తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాం. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించాం. – జగ్జీవన్, మున్సిపల్ కమిషనర్మున్సిపాలిటీలో పనులు చేపట్టాంవంద రోజుల ప్రణాళికలో భాగంగా వార్డుల్లో ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించాం. 38,328 మొక్కలను నాటాం. దోమల నివారణకు ఫాగింగ్ చేశాం. వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఎస్హెచ్జీ గ్రూపులకు సంబంధించి రూ.5.73 కోట్ల రుణాలకు సంబంధించి లింకేజీ చేశాం. కళాశాలలో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి దామోదర పాల్గొన్నారు. - రవీందర్, కమిషనర్,జోగిపేట మున్సిపాలిటీవంద రోజులతో ఒరిగిందేమీలేదుపటాన్చెరు: వంద రోజుల ప్రణాళికతో అమీన్పూర్ మున్సిపాలిటీలో పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆ కార్యక్రమానికి ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించలేదు. కొన్ని రోజులుగా ప్రత్యేకాధికారి అమీన్పూర్కు రాకపోవడం, ఆమె నిర్లక్ష్యం కారణంగా సాధారణ నిధులు కూడా విడుదల కాలేదు. అదనపు కలెక్టర్ అమీన్పూర్కు ప్రత్యేకాధికారిగా నియమితులైన తర్వాతే సింఫనీ వెళ్లే చౌరస్తా, మండే మార్కెట్ చౌరస్తా వద్ద కూడళ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేశారు. 1,273 ఇళ్లకు అసెస్మెంట్లు నిర్వహించి రూ.కోటి 23 లక్షల వసూలు చేశారు. వరద సాఫీగా వెళ్లేందుకు డ్రైనేజ్లను శుభ్రం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై మురుగునీరు పొంగిపొర్లింది.ప్లాస్టిక్పై అవగాహన కల్పించాంప్రజల్లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాం. ఇళ్ల వద్ద తడి పొడి చెత్త సేకరిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు రూ.కోట్ల నిధులు మంజూరయ్యాయి.– జ్యోతి రెడ్డి, కమిషనర్పారిశుద్ధ్యం పనులు అరకొరజహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో వంద రోజుల ప్రణాళిక పనులు సుమారు 90% మేర పూర్తయ్యాయి. 13 వేల నల్లా కనెక్షన్లను ఆన్లైన్లో చేయాల్సి ఉండగా 11వేల వరకు పూర్తి చేశారు. ఆరు వ్యాటర్ ట్యాంకులను క్లీన్ చేశారు. 80% మేర శానిటేషన్ పనులు పూర్తి చేశారు. కాలువల్లో పేరుకు పోయిన మురికి, చెత్తను క్లీన్ చేయడం వంటి పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడా కాలువలను పూర్తి చేసే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ట్రేడ్ లైసెన్సులను 60% మేర అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు స్టాళ్లను కేటాయించారు. రోడ్లపై ఏర్పడిన గోతులను పూడ్చివేసే పనులు పూర్తి చేశారు.లక్ష్యం మేరకు పనులు పూర్తివంద రోజుల ప్రణాళికలో ఇచ్చిన పనులను లక్ష్యం మేరకు పూర్తి చేశాం. పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేలా కృషి చేయడంతో లక్ష్యాన్ని అందుకున్నాం. ఇదే స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాం.– సుభాష్రావు, మున్సిపల్ కమిషనర్, జహీరాబాద్నిధుల కేటాయింపులేవీ?సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపాలిటీలో చేపట్టిన వంద రోజుల ప్రణాళిక నామమాత్రంగానే జరిగింది. నిధులు కేటాయించకపోవడంతో రోజువారీ పనులనే ప్రణాళికలో చేర్చి పూర్తి చేశారు. పారిశుద్ధ్య పనులు, 8,800 మొక్కలు నాటించడం, 51వేల మొక్కల పంపిణీ, 202 కుక్కలకు శస్త్రచికిత్సలు, 303 వ్యాక్సినేషన్, స్ట్రీట్ వెండర్ ఫుడ్ స్టాల్స్ ప్రదర్శన, 50ఎస్హెచ్సీ గ్రూపులకు రూ.కోటి 35లక్షల రుణాల చెక్కుల పంపిణీ, నూతన గ్రూపుల ఏర్పాటు, నాలాల్లో పూడికతీత పనులు చేపట్టారు. గుంతల పూడ్చివేత, పాతభవనాల కూల్చివేత వంటి పనులు పూర్తి చేశారు. ట్యాంకుల క్లీనింగ్, దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. నల్లా కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్స్లు మంజూరు పనులు పూర్తి చేశారు. సేకరించిన చెత్తను డంపింగ్యార్డుకు తరలించకుండా రోడ్ల పక్కనే పడేశారు. దీంతో ఎంపీడీఓ కార్యాలయం ముందు మురుగునీటి కాలువలో పేరుకుపోయి అపరిశుభ్రతకు నిలయంగా మారింది.రోజువారీ పనులే చేపట్టాం15 రోజుల కిందటే కమిషనర్గా బాధ్యతలు చేపట్టాను. రోజువారీ పారిశుద్ధ్య పనులకే ప్రాధాన్యతనిచ్చాం. ప్రతీ రోజు నిర్వహించే శానిటేషన్, ప్లాస్టిక్ వ్యర్థాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.– శివాజీ, మున్సిపల్ కమిషనర్పనులు నామమాత్రంగాసంగారెడ్డి: సంగారెడ్డిలో పారిశుద్ధ్యం పడకేసింది. వందరోజుల ప్రణాళిక పేరుతో చేపట్టిన చర్యలు ఫలితాలనివ్వలేదు. వివిధ విభాగాల మధ్య సమన్వయం లోపంతో ఎక్కడ ఏ పని చేపట్టి పూర్తి చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలోపం కారణంగా పనులు నామమాత్రంగానే పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన 11 భవనాలను కూల్చివేశారు. అయితే మున్సిపాలిటీలో మొత్తంగా 80 వరకు శిథిలావస్థకు చేరిన పాతభవనాలను గుర్తించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే వీటి జోలికి పోలేదన్న విమర్శలున్నాయి.స్వచ్ఛ సంగారెడ్డికి ప్రయత్నిస్తాస్వచ్ఛత విషయంలో సంగారెడ్డి మున్సిపాలిటీని నంబర్వన్గా తయారు చేసేందుకు కృషి చేస్తా. ప్రణాళిక పనులపై సమగ్ర విచారణ చేశాకే బిల్లులు చేస్తాం.– శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
పరిషత్ ఓటర్లు 7,44,157
సంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రాదేశిక పరిషత్ ఎన్నికలకు 7,44,157 మంది ఓటర్లు ఉండగా 1,458 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. త్వరలో నిర్వహించే పరిషత్ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు, వాటి స్థితిగతులతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బుధవారం తుది ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్లు జాబితాను విడుదల చేశారు. 635 ప్రాంతాలలో 1458 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 25 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 261 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. కొత్తగా మండలాల ఏర్పాటుతో పాటు పాత మండలాలు మున్సిపాలిటీలుగా మారటంతో పరిషత్ స్థానాల సంఖ్య తగ్గింది. 2019 సంవత్సరంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలలో 25 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 295 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. గతంలో కంటే ప్రస్తుతం స్థానాల సంఖ్య తగ్గింది. -
నూతన భవనం కోసం స్థల పరిశీలన
● అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ● కూలిన హాస్టల్ పైకప్పు శిథిలాల తొలగింపు ● పనులు పర్యవేక్షిస్తున్న తహసీల్దార్మునిపల్లి(అందోల్): లింగంపల్లి గురుకుల పాఠశాల, హాస్టల్ నూతన భవనం కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని లింగంపల్లిలో మంగళవారం కూలిపోయిన గురుకుల పాఠశాల, హాస్టల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. కూలిన శిథిలాల తొలగింపు పనులను తహసీల్దార్ గంగాభవానీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ...కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులు ఎంత త్వరగా పూర్తయితే అంతే వేగంగా హాస్టల్కు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభిచే అవకాశముందన్నారు. అయితే కూలిన స్థలంలోనా లేక కొత్త స్థలంలో నిర్మించడమా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వారిని మరో భవనంలోకి తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్కుమార్, మైనార్టీ సీనియర్ నాయకులు మక్సూద్ పటేల్, ప్రిన్సిపాల్ చైతన్య, తహసీల్ధార్ గంగాభవాని, పంచాయతీ ఈఈ మనీష్, ఇన్చార్జి శ్రీనాథ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉత్తమ ప్రతిభ కనబరచాలి
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది, అధికారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొ న్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్లో ఎస్పీ మాట్లాడుతూ..వర్టికల్ నియమాలను పాటి స్తూ విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరచాలని చెప్పారు. వర్టికల్ విభాగంలో ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు అందిస్తామని వెల్లడించారు. ఇన్చార్జి ఆర్డీఓగా పాండు బాధ్యతల స్వీకరణసంగారెడ్డి : సంగారెడ్డి ఇన్చార్జి ఆర్డీఓగా ఆర్.పాండు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జోగిపేట ఆందోల్ డివిజన్ ఆర్డీవోగా పనిచేస్తున్న ఆయనకు సంగారెడ్డి ఇన్చార్జిగా కలెక్టర్ ప్రావీణ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఇక్కడ ఆర్డీవోగా ఉండి పని చేసిన రవీందర్రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. నూతనంగా బాధ్యతలు తీసుకున్న పాండును రెవెన్యూ డివిజన్ శాఖ సిబ్బంది ఆయనకు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. కార్యాలయ ఏవో తన్మొళి, సంగారెడ్డి తహసీల్దార్ జయరాం నాయక్, సిబ్బంది తదితరులున్నారు. -
తప్పని యూరియా తిప్పలు
హత్నూర(సంగారెడ్డి): యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. పనులు మానుకుని రోజుల తరబడి పడిగాపులు కాసినా యూరియా దొరకడం కష్టంగానే ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రమైన హత్నూర సొసైటీ కార్యాలయం, దౌల్తాబాద్లోని ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం ఉదయం నుంచి ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూశారు. బుధవారం సుమారు 90 మెట్రిక్ టన్నుల యూరియా (2000 బస్తాలు) రావడంతో ఒక్కసారిగా దుకాణాల ముందు ఎగబడ్డారు. ఆధార్ కార్డుకు ఒక రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి వరుసలో నిలబెట్టారు. అయినా కొంతమందికి సరిపడా యూరియా దొరకలేదు. వరి పత్తి సాగు చేసి నెలలు గడిచిపోయిన యూరియా అవసరమున్నంత మేర దొరకకపోవడంతో పంటలు ఎదగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి హత్నూర మండలం రైతులకు అవసరం ఉన్న యూరియాను సరఫరా చేయాలని వేడుకున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావును సంప్రదించగా ఇప్పటికీ సుమారు 1,700 మెట్రిక్ టన్నుల యూరియా మండలానికి వచ్చిందని మరో రెండు రోజుల్లో హత్నూర సొసైటీ సిరిపురం ఎరువుల దుకాణానికి రానుందని తెలిపారు. ఇంకా సుమారు 300 మెట్రిక్ టన్నుల యూరియా మండలానికి అవసరం ఉందని ప్రతిపాదనలు నివేదించామని వివరించారు. -
మొదటికొచ్చిన ధరణి కష్టాలు!
కలెక్టరేట్లో భూభారతి సహాయ కేంద్రం వద్ద ఉన్న ఈ మహిళా రైతు పేరు ఎర్కొల్ల సత్తమ్మ. ఈమెది ఝరాసంఘం మండలం ఎల్గొయి గ్రామం. ఈమెకు 2 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. ధరణి పోర్టల్లో 23 గుంటలకు మాత్రమే పట్టాదారు పాసుపుస్తకం రాగా, మిగిలిన ఎకరం 30 గుంటల భూమికి సంబంధించిన పాసుపుస్తకం కోసం 2022 నుంచి అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతోంది. ఈ మిస్సింగ్ సర్వే నంబర్ కేటగిరీకి చెందిన దరఖాస్తులను పరిష్కరించే అధికారం ధరణి పోర్టల్లో సీసీఎల్ఏ కార్యాలయానికే ఉండేది. ఈ దరఖాస్తుకు సంబంధించిన స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ ఇచ్చిన నివేదికలు.. ఇన్నాళ్లు సీసీఎల్ఏ వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు భూభారతి వచ్చాక ఈ మిస్సింగ్ సర్వే నంబర్ను సరిచేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు. దీంతో ఈ ప్రక్రియంతా తిరిగి తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభం కావాల్సి ఉందని, అక్కడి నుంచి మళ్లీ నివేదికలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : భూసమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి పోర్టల్లో కొన్ని మాడ్యూల్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియ మళ్లి మొదటి కొచ్చింది. ఇప్పటికే ధరణి పోర్టల్ ఉన్న తహసీల్దార్లు ఇచ్చిన నివేదికలతో కూడిన ఫైళ్లు పక్కన బెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. కొన్ని కేటగిరీలకు చెందిన దరఖాస్తుల ప్రక్రియను తిరిగి తహసీల్దార్ స్థాయి నుంచి ప్రారంభిస్తున్నామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో బాధిత రైతులు కష్టాలు తప్పడం లేదు. మిస్సింగ్ సర్వే నంబర్తోపాటు, ఆర్ఎస్ఆర్ వేరియేషన్స్ వంటి మాడ్యుల్లలోని భూసమస్యలను తిరిగి తహసీల్దార్స్థాయి నుంచి ప్రక్రియప్రారంభిస్తున్నారు.సుమారు 2 వేలకు పైగా ఇలాంటి దరఖాస్తులే..ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా తెచ్చిన భూభారతి అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి తిరిగి దరఖాస్తులు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 604 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో మొత్తం 13,897 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తిరిగి తహసీల్దార్ నుంచి ప్రక్రియ ప్రారంభం కావాల్సిన కేటగిరీల దరఖాస్తులు సుమారు రెండు వేలకు మించి ఉంటాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.రైతులకు అవే తిప్పలుభూభారతి వచ్చినా రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. తమ భూసమస్యల పరిష్కారం కోసం వారు చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఈ భూసమస్యల పరిష్కారం కోసం వచ్చిన రైతులే అధికంగా ఉంటున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సైతం రైతులు కలెక్టరేట్కు వస్తున్నారు. తీరా ఇక్కడి వచ్చాక వారికి ఫైల్ తహసీల్దార్ల వద్ద ఉందని అధికారులు చెప్పి పంపుతున్నారు. భూభారతి సహాయ కేంద్రానికి వెళ్లి తమ దరఖాస్తు పరిష్కారం ఎంత వరకు వచ్చిందని ఆరా తీసి నిరాశగా ఇంటికి వెళుతున్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వెల్దుర్తి(తూప్రాన్) : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అందుగులపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఫాం సత్యనారాయణ(40), సునీతలు భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. సత్యనారాయణ వ్యవసాయంతో పాటు తాపీమేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆయన మూడు రోజుల క్రితం పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. -
కాళోజీ ఆలోచనలు యువతకు ఆదర్శం
సంగారెడ్డి జోన్: తెలంగాణ ప్రజా కవి కాళోజి నారాయణరావు ఆలోచనలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని డీఆర్ఓ పద్మజారాణి పేర్కొన్నారు. మంగళవారం కాళోజీ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కాళోజీ చిత్రపటానికి ఏఆర్ డీఎస్పీ నరేందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు. -
బైకును ఢీకొట్టిన కంటైనర్
● యువకుడు మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు పటాన్చెరు టౌన్: స్నేహితుడితో కలిసి వెళ్తుండగా బైకును కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడికి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అభిమాన్ సింగ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చిన్న శంకర్పల్లికి చెందిన భాను ప్రకాష్ (25)ఎలక్ట్రిషియన్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అతని స్నేహితుడు బల్వంత్ రెడ్డితో కలిసి భోజనం చేసేందుకు బైక్పై ముత్తంగి బయలుదేరారు. ఈ క్రమంలో శివారులోకి రాగానే అర్ధరాత్రి కంటైనర్ వీరి బైక్ని ఢీ కొట్టింది. బైక్పై ఉన్న భాను ప్రకాశ్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బల్వంత్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి విజయ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బస్సును ఢీకొన్న కారు: ఇద్దరికీ గాయాలు అల్లాదుర్గం(మెదక్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి ఈ ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని 161 జాతీయ రహదారి రాంపూర్ గ్రామం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శంకర్ వివరాల ప్రకారం... సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పిట్లం వైపు వెళుతుంది. రాంపూర్ గ్రామం వద్ద ప్రయాణికులను దింపేందుకు బస్సు ఆపారు. వెనుక నుంచి పిట్లం వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పిట్లంకు చెందిన సాయి, స్నేహిత్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అంబులెన్న్స్లో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సును కారు ఢీకొట్టడంతో పూర్తిగా నుజ్జునుజ్జైంది. -
ఆర్డీఓ రవీందర్ ఆకస్మిక బదిలీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీ ఇప్పుడు రెవెన్యూశాఖతోపాటు, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆందోల్ ఆర్డీఓగా పనిచేస్తున్న పాండుకు సంగారెడ్డి ఆర్డీఓగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రవీందర్రెడ్డికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రవీందర్రెడ్డి చాలా కాలంగా సంగారెడ్డి జిల్లాలో పాతుకుపోయారు. గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఆయన సంగారెడ్డి ఆర్డీఓగా పనిచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయనను జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్గా లూప్లైన్ పోస్టుకు బదిలీ చేశారు. అక్కడ కొద్దిరోజులే పనిచేసిన రవీందర్రెడ్డి తిరిగి సంగారెడ్డి ఆర్డీఓగానే పోస్టింగ్ తెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు పది నెలలుగా ఆర్డీఓగా పనిచేస్తున్న రవీందర్రెడ్డిని ఇప్పుడు ఆకస్మికంగా బదిలీ చేయ డం జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన బదిలీని నిలిపివేసుకునేందుకు రవీందర్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచా రం రెవెన్యూశాఖ వర్గాల్లో జరుగుతోంది. ఇందుకోసం జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీలోని కీలక ప్రజాప్రతినిధులను, నేతలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. జిల్లాలో రూ.వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. నేతలు, ప్రజాప్రతినిధుల బినామీలు ఈ భూములను చెరబట్టారు. మరోవైపు వందలాది ఎకరాల్లో అసైన్డ్ భూములు చేతులు మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని మండలాలు..పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల, కంది, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట వంటి మండల్లాలో విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనూ ఆయన సంగారెడ్డి ఆర్డీఓగా చాలాకాలం పనిచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆయనకు బదిలీ జరిగినా తిరిగి సంగారెడ్డి ఆర్డీఓ పోస్టుకే చేరుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని కీలక పోస్టింగ్లను దక్కించుకుంటారనే విమర్శలు రవీందర్రెడ్డిపై ఉన్నాయి. ఇన్చార్జిగా ఆందోల్ ఆర్డీఓపాండుకు బాధ్యతలు పలు భూ వివాదాలే కారణమా?పైరవీకారులకు నిలయం!సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం పైరవీకారులకు నిలయంగా మారిందనే విమర్శలున్నాయి. సాధారణ ప్రజలు, నిరుపేద రైతులు తమ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తే కనీసం పట్టించుకోని ఈ కార్యాలయం అధికారులు, పైరవీకారులకు మాత్రం పెద్ద పీట వేస్తారనేది సాధారణ విషయమేననే అభిప్రాయం ఉంది. బడాబాబులు, రియల్ ఎస్టేట్ కంపెనీల పనులను వెంట వెంటనే చేసి పెట్టే ఈ అధికారులు, సాధారణ రైతులను, నిరుపేదలను మాత్రం చెప్పులరిగేలా తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. -
గండ్లు పూడ్చరేం..?
సింగూరు ఆయకట్టు రైతుల సాగు ఇక్కట్లు నీరు లేని కాలువలుపుల్కల్(అందోల్): ఇటీవల భారీ వర్షాల కారణంగా తెగిపడ్డ పంటకాలువలు, యూరియా కొరతతో రైతులు కష్టాలనెదుర్కొంటున్నారు. ఈ కష్టాలకు తోడు ఈ ఏడు వానాకాలం నుంచి సింగూరు సాగునీరు వస్తాయా లేదోనని ఎదురుచూసిన రైతులకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా సింగూరు కాలువకు పడ్డ గండ్లు రైతుల్ని మరింత కుంగదీస్తున్నాయి. రైతులకు ఊహించని షాక్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బస్వాపూర్ చెరువు అలుగు పారి నీరు కాలువలోకి రావడం, మిన్పూర్ వద్ద కాలువకు బుంగపడి ఆ నీరంతా చెరువులోకి వెళ్లి అలుగు పారడంతో దిగువన వరిచేలు మునిగిపోయాయి. ఇసోజిపేట వద్ద ఫారెస్టు నీళ్లు కాలువలోకి చేరి ప్రవాహ ఒత్తిడి పెరగడంతో అక్కడ మరో గండి పడి నీరంతా ఫారెస్టు నుంచి మంజీరా నదికి చేరాయి. దీంతో సాగునీటిని నిలిపివేయడంతో రైతులకు ఊహించని షాక్ తగిలింది. ఆది నుంచి అంతే వానాకాలం ప్రారంభం నుంచి సింగూరు కాలువలకు సిమెంట్ లైనింగ్ పేరుతో కాలయాపన చేశారు. వానాకాలం ప్రారంభమై రెండు నెలలైనా సిమెంట్ లైనింగ్ ప్రారంభం కాలేదు. అలాగే సాగునీరు విడుదల చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి ఇబ్బంది కలుగుతుందని భావించి కాంగ్రెస్ నాయకులు మంత్రి దామోదరను సంప్రదించి సిమెంట్ లైనింగ్ పనులు ఆపించి వరినాట్లకు నీటిని వదిలారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడే మంత్రి దామోదర రాజనర్సింహ రహదారులు బాగోలేకపోయినా ట్రాక్టర్పై జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య, జిల్లా ఎస్పీ పంకజ్ పరితోశ్, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి వెళ్లి మరీ తెగిపడ్డ గండ్లను పరిశీలించారు. అక్కడే గండ్లను పూడ్చాలని ఆదేశించారు. ఈ ఘటన జరిగి 25 రోజులు కావొస్తున్నా గండ్లను పూడ్చలేకపోయారు. స్వయంగా మంత్రే ఆదే శించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు గండ్లను పూడ్చి సాగునీటిని సరఫరా చేయాలని రైతులు కోరారు.ట్రాక్టర్పై వెళ్లి గండ్లనుపరిశీలించినా.. -
రెడ్కో చైర్మన్ను కలిసిన రమేశ్ చౌహాన్
నారాయణఖేడ్: తెలంగాణ రెడ్కో నూతన ఛైర్మన్గా నియమితులైన డా.శరత్ నాయక్ను మంగళవారం హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.రమేశ్ చౌహాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనవెంట సంఘం నాయకులు చంద్రమోహన్ తదితరులు ఉన్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టాలి: డీఈఓపటాన్చెరు టౌన్: వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అమీన్పూర్ ము న్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, గండిగూడ ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన తీరును తరగతి గదిలోకి వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ పరితోశ్సంగారెడ్డి జోన్: ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండి రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న కక్షిదారులకు ఈ లోక్అదాలత్ మంచి అవకాశమని తెలిపారు. వీలైనన్ని ఎక్కువ కేసులు లోక్అదాలత్లో రాజీ పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్జీఎఫ్ క్రీడల్లో అల్గోల్ గురుకుల విద్యార్థులుజహీరాబాద్ టౌన్: 69వ మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) క్రీడల్లో అల్గోల్ మైనార్టీ గురుకుల విద్యార్థులు సత్తాచాటి ప్రతిభ కనబరిచారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అండర్ –14, అండర్–17 విభాగాల్లో పోటీలు నిర్వహించగా మూడు విభాగాల్లోనూ అల్గోల్ విద్యార్థులు మొదటి బహుమతి సాధించారని ప్రిన్సిపాల్ జె.రాములు తెలిపారు. గురుకులం నుంచి 26 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఖలీల్, పీఈటీ అనిల్కుమార్, పీడీ.ప్రశాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘స్థానికం’లో యువతకు ప్రాధాన్యం: నరేశ్గౌడ్ జహీరాబాద్: త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేశ్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ...గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో 20% కోట యువతకు కేటాయించాలన్నారు. అన్ని ఎన్నికల్లో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందన్నారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ నియోజకవర్గం అధ్యక్షుడు నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు నరేశ్ యాదవ్, వసీం, ప్రధాన కార్యదర్శులు అక్బర్, శ్రీహరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుతెచ్చిన కాళోజీ
మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్రావుమెదక్ మున్సిపాలిటీ/మెదక్ కలెక్టరేట్: తన కవిత్వంతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి కాళోజీ నారాయణరావు అని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... కాళోజీ రచనలు సామాజిక చైతన్యాన్ని పెంపొందిచేలా ఉంటాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో డీఆర్ఓ భుజంగరావు పాల్గొని కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. 13న జాతీయ లోక్ అదాలత్ ఈనెల 13న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోవద్దన్నారు. -
ఒక్క క్షణంలో.. అంతా శూన్యం!
సంగారెడ్డి క్రైమ్: చిన్న సమస్యను అధిగమించలేక కొంత మంది యువత ఒక క్షణం ఆలోచించకుండా ఉరి తాడును వెతుక్కతున్నారు. క్షణికావేశంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేక పురుగుల మందు తాగి అసువులు బాసుతున్నారు. అప్పులు, కుటుంబ సమస్యలు, మోయలేని చదువు భారం, ఉద్యోగం రాలేదని నిరుద్యోగి, ప్రేమ విఫలమైందని, టీచర్, తల్లిదండ్రులు మందలించారని ఇలా అనేక మంది చిన్నచిన్న కారణాలతో జిల్లాలో ఎక్కడో చోట నెలకొక్కరూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. యువతీ యువకులు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోవాలి. ఏ సమస్యకై నా ఆత్మహత్య పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు. కుటుంబం, సన్నిహితుల బాధ్యత ఇది తమ కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులతో చర్చిస్తే పరిష్కార మార్గాలు లభిస్తాయి. కానీ అవేమీ ఆలోచించకుండా చాలామంది చావు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో వారి జీవితం అర్థంతరంగా ముగిసిపోతుంది. వారిపై ఆధారపడిన పిల్లలు తల్లిదండ్రులు భార్య రోడ్డున పడుతున్నారు. భార్యాభర్తల్లో ఒకరు లోకం వీడితే రెండో వ్యక్తి కుంగుబాటుకు గురవుతారు. వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైనా తాను బతకనని, కుటుంబానికి బరువయ్యా అని చెబితే తేలికగా తీసుకోవద్దు. నువ్వులేని ఇంటిని జీవితాన్ని ఊహించుకోండి అంటూ చాలామంది మానసిక వేదనను వెలిబుచ్చుతారు. వారిని మార్చే దిశగా ప్రయాత్నం చేయకపోతే కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే.. వ్యాయామం అలవాటు చేయడం ద్వారా కొంత మార్పు ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో గడిచిన ఎనిమిది నెలల్లో దాదాపు 140 మంది వివిధ కారణాలతో తమ ప్రాణాలు తీసుకున్నారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన మహిళ మే నెల 29న ఆత్మహత్య చేసుకుంది. తన తల్లి మందలించిందని క్షణికావేశంలో బలవన్మరణానికి పాడింది. దీంతో ఆమె ఐదేళ్ల పాప అనాథ అయ్యింది. అలాగే.. పుల్కల్ మండలానికి చెందిన యువకుడు కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా జిల్లాలో రోజుకొకి బలవన్మరణం ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటోంది. చిన్న కారణాలతో యువత బలవన్మరణం జిల్లాలో నెలకొకరు చొప్పున ఆత్మహత్య మానసిక స్థితిని గమనించి, ధైర్యం చెప్పాలి మానసిక నిపుణుల సూచన ఇలా అరికట్టవచ్చు.. వైద్యనిపుణుల ప్రకారం.. ఆత్మహత్యకు పాల్పడాలనుకునేవారు ఒంటరిగా ఉంటారు. వెంటనే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చు. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తారు. మహిళల కోసం 181కు కాల్ చేస్తే సఖీ కేంద్రం సిబ్బంది ఇంటికొచ్చి కౌన్సెలింగ్ ఇస్తారు. పిల్లలకై తే 1098కి సమాచారం ఇవ్వాలి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
చిట్టోజిపల్లిలో రైతు.. చేగుంట(తూప్రాన్): ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైర్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిట్టోజిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తలారి గోవర్ధన్(32) మంగళవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైర్ పోయిందని గుర్తించి వైరు సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో గోవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. చిట్కుల్లో యువకుడు.. చిలప్చెడ్(నర్సాపూర్): విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిట్కుల్ గ్రామంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కామగోల్ల శివకుమార్(28) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా గ్రామానికి చెందిన కొండారెడ్డి పొలం గట్లపై గడ్డి పెరగడంతో యంత్రంతో గడ్డి కోసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం గట్టుపై బోరుమోటార్కు కనెక్షన్ ఉన్న సర్వీస్ వైరును గమనించని అతడు వైరును కూడా కట్ చేయగా విద్యుత్ షాక్కు గురై పొలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ నర్సింహులు, ఇన్చార్జ్ విద్యుత్శాఖ ఏఈ సల్మాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా మృతుడికి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. -
భూములు బలవంతంగా తీసుకోవద్దు
జహీరాబాద్ టౌన్: నిమ్జ్ ప్రాజెక్టు కోసం రైతుల భూములను బలవంతంగా తీసుకోవద్దని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని శ్రామీక్ భవనంలో సోమవారం నిమ్జ్ భూబాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రూ.కోటి వరకు ధర పలికే భూములను ప్రభుత్వం ఎకరాకు రూ.15 లక్షలే చెల్లిస్తుందన్నారు. నిమ్జ్ కోసం ఇప్పటికే వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ వేసిందని, బలవంతపు భూసేకరణకు నిరసనగా ఈ నెల 12న భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకలు ఎస్.కుమార్, బి.నర్సింలు, తుల్జరాం, సంగన్న రైతులు పాల్గొన్నారు.వ్యవసాయ కార్మిక సంఘంజిల్లా అధ్యక్షుడు రాంచందర్ -
సమాజ మార్గదర్శకులు గురువులే
డీఈఓ రాధాకిషన్పాపన్నపేట(మెదక్): ఉపాధ్యాయులు నవ సమాజ మార్గదర్శకులని జిల్లా విద్యాశాఖ అఽధికారి రాధాకిషన్ పేర్కొన్నారు. పాపన్నపేటలో మంగళవారం జరిగిన మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదర్శవంతమైన సమాజాన్ని తయారు చేసే శక్తి ఉపాధ్యాయునికే ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, క్రీడాకారులు, సైంటిస్టులుగా దేశానికి సేవలందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పాపన్నపేట మండల స్థాయిలో విశిష్ట సేవలు అందించిన 28 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించారు. వీరితోపాటు మండలం నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికై న సాయిసిరికి, జిల్లా స్థాయికి ఎంపికై న సాయిలు, చంద్రశేఖర్, మల్లేశం, దుర్గా ప్రసాద్లకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్రెడ్డి, డీఎస్ఓ రాజిరెడ్డి, హెచ్ఎంలు మహేశ్వర్, శ్రీనివాస్రావు పాల్గొన్నారు. -
రైతుల ఇబ్బందులు తొలగించాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డినర్సాపూర్: రైతులకు యూరియా అందించి వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదిక వద్దకు వెళ్లిన సునీతారెడ్డికి రైతులు తమ ఇబ్బందులను వివరించారు. నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా ఒక్క బస్తా యూరియా దొరకలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. యూరియా దొరకనందున పంటలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నారని, మాజీ సీఎం కేసీఆర్ సమర్థవంతంగా రాష్ట్రానికి యూరియా తీసుకురాగలిగారని, రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడలేదని ఆమె చెప్పారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి యూరియా తేవడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు యూరియా కోసం ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోపించారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్తోపాటు వ్యవసాయాధికారులతో మాట్లాడి నర్సాపూర్కు అవసరం మేరకు యూరియా సరఫరా చేయాలని కోరారు. రైతులకు ప్రాధాన్యత పద్ధతిలో యూరియా అందజేయాలని మండల వ్యవసాయాధికారి దీపికకు సునీతారెడ్డి సూచించారు. ఆమె వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
బాధితులకు న్యాయం జరగాలి
పటాన్చెరు టౌన్: సిగాచి పరిశ్రమ బాధితులకు న్యాయం జరగాలని, ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్లో టీపీజేఏసీ కన్వీనర్ అశోక్ కుమార్, సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు పలువురు మేధావులు, వక్తలు, బాధిత కుటుంబ సభ్యులు, కార్మిక సంఘం నాయకులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమ బాధలను పంచుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ...సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. యాజ మాన్య తప్పిదం తోనే ప్రమాదం జరిగినట్లు నిపుణులు చెప్తున్నారని తెలిపారు. పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేసినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం సరి కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై కేసులు పెట్టి దొరికిన వారిని అరెస్టు చేసిన ప్రభుత్వాలు ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాలపై మరొకలా వ్యవహరించడం ఏం నీతని నిలదీశారు. కార్మికుల సజీవ దహనానికి కారణమైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలతోపాటు పౌర సమాజం ఈ ప్రమాదం నుంచి గుణ పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిర్మాణాత్మక శైలిలో నిబంధనలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్మిక సంఘాలతోపాటు నిపుణులు, మేధావులు ఒకతాటిపై వచ్చి ప్రణాళిక సిద్ధం చేసి సీఎంను కలిసి వివరిద్దామని తెలిపారు. సంఘటన సమయంలో సీఎం రేవంత్రెడ్డి మృతిచెందిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతోపాటు గాయపడిన క్షతగాత్రులకు రూ.పది లక్షల పరిహారం ప్రకటించారని వెంటనే ఆ పరిహారాన్ని చెల్లించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం: బాబూరావు సిగాచి పరిశ్రమ నిర్లక్ష్యం, కాలం చెల్లిన మెషీనరీతో అవగాహన లేని కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించడం, పరిశ్రమలో తయారుచేసే మిశ్రమం నుంచి వచ్చిన ధూళితోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని సైంటిస్ట్ ఫర్ పీపుల్స్ వ్యవస్థాపకులు బాబూరావు తేల్చిచెప్పారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు రూ.కోటితో పాటు గాయపడ్డ క్షతగాత్రులకు రూ.పదిలక్షల నష్టపరిహారం ప్రకటించినా ఇప్పటివరకు కార్మికులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదన్నారు. పక్క రాష్ట్రంలో ప్రమాదం జరిగిన వారం రోజుల్లోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.కోటి, గాయపడ్డ వారికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తే తెలంగాణలో మాత్రం కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అడ్వొకేట్ వసుదా నాగరాజు సహకారంతోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో బాధితులందరికీ న్యాయం జరిగే వరకూ విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. పరిశ్రమల్లో కార్మిక భద్రత గురించి ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిగాచిపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రొఫెసర్ కోదండరామ్ బాధిత కుటుంబ సభ్యుల సమస్యలు చెబితే సీఎం దృష్టికి తీసుకువెళ్తా ప్రకటించిన పరిహారం త్వరగా చెల్లించండి -
జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ కేంద్రాలు
సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసిందని, క్యాన్సర్ వ్యాధి చికిత్సను ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ప్రారంభం ద్వారా ఆ వ్యాధిపై పోరాటానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ...ప్రజలకు క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలోనూ, చికిత్స అందించడంలోనూ జరిగే జాప్యం కారణంగానే చాలామంది ప్రాణాలు కో ల్పోతున్నారన్నారు. ఇకమీదట అలా జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ నిర్మూలన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమానికి అడ్వైజర్గా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయను నియమించిందని వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి నియంత్రణలో ఆయన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకాన్ని మంత్రి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. క్యాన్సర్ డే కేర్ సెంటర్లలో రోగులకు సమయానుకూల స్క్రీనింగ్ పరీక్షలు, రేడియేషన్, పాలియేటివ్ కేర్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాలలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలను సైతం అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిమ్స్, ఎన్ఎంజే ఆస్పత్రులలో 80 పడకల క్యాన్సర్ ప్రత్యేక విభాగాలు కొనసాగుతున్నాయని, త్వరలో వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల శిక్షణకు ఒప్పందం రాష్ట్రంలో ప్రతి ఏటా 3,000 మంది నర్సింగ్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇంగ్లిష్లతోపాటు పలు విదేశీ భాషల్లో శిక్షణనివ్వడం కోసం ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఒప్పందం వల్ల నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలపై ప ట్టు సాధించేలా ఇఫ్లూ అధ్యాపకులు శిక్షణనిస్తారని వెల్లడించారు. ఈ శిక్షణతో నర్సింగ్ విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్ చోగ్తూ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రకుమా ర్, అదనపు డీఎంఈ డాక్టర్ వాణి, డైరెక్టర్ ఆఫ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య కళాశాల అధ్యాపకులు, జీజీహెచ్ సూప రింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.డే కేర్ సెంటర్ల ప్రారంభోత్సవంలోమంత్రి దామోదర త్వరలో అందుబాటులోకి క్యాన్సర్స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలు డాక్టర్ నోరి దత్తాత్రేయ అడ్వైజర్గా క్యాన్సర్ నిర్మూలన కార్యక్రమం -
మీరెందుకు నివాసం ఉండటం లేదు
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని డబుల్బెడ్ రూంలను అద్దెలకు ఇచ్చారని, కొంతమంది విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై రెవెన్యూ అధికారులు 120 మందికి నోటీసులు జారీ చేశారు. తమకు కేటాయించిన డబుల్బెడ్ రూం ఇళ్లల్లో ఎందుకు నివాసం ఉండటం లేదు అన్న విషయమై మూడు రోజుల్లో లబ్ధిదారులు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులను తాళం వేసి ఉన్న గదులకు అతికించారు. ఈ విషయం తెలుసుకున్న లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము డబుల్బెడ్ రూం ఇళ్లల్లోనే ఉంటున్నామంటూ లిఖిత పూర్వకంగా రెవెన్యూ అధికారులకు అందజేశారు. తహసీల్దారు, ఆర్డీఓ కార్యలయం ఎదుట ఆందోళన డబుల్బెడ్ రూం ఇళ్ల వద్ద ఉద్దేశపూర్వకంగానే అధికారులు నోటీసులు అతికించారని సీఐటీయూ నాయకులు విద్యాసాగర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పి.నారాయణ, రఫీక్ ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేసిన అనంతరం లబ్ధిదారులతో కలిసి ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. తాము లేని సమయంలోనే నోటీసులు అతికించారని పలువురు లబ్ధిదారులు సూచించారు. 120 మంది డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు నోటీసులు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన తిరిగి విచారణ జరిపిస్తాం: ఆర్డీఓ మళ్లీ విచారణకు ఆర్డీఓ ఆదేశం డబుల్బెడ్ రూం ఇళ్లను అద్దెకు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై తిరిగి విచారణ జరిపిస్తామని ఆర్డీఓ పాండు సూచించారు. వాస్తవంగా డబుల్బెడ్ రూం ఇళ్లల్లో నివాసం ఉంటే ఇబ్బంది లేదని, తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని చె ప్పారు. డబుల్బెడ్ రూం ఇళ్లను అమ్ముకున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఇళ్ల నిర్మాణాలకు అనుమతివ్వాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యంకొండాపూర్(సంగారెడ్డి): ఇళ్ల స్థలాల పొజిషన్ కలిగి పట్టా సర్టిఫికెట్లు ఉన్న వారికి ఇంటి నిర్మాణాలకు అనుమతివ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కొండాపూర్లోని తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని గంగారంలో సర్వే నంబర్ 1,5,243లోని ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు సుమారు 100 మందికి రెండేళ్ల క్రితం ప్రభుత్వాధికారులు ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చి పొజిషన్ చూపెట్టారన్నారు. గత రెండేళ్లుగా ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్లు ఇవ్వాలని కోరగా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. అధికారులిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీనికి తహసీల్దార్ స్పందిస్తూ మంగళవారం గంగారంలో పర్యటించి అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
బాలికల హక్కులపై అవగాహన
వట్పల్లి(అందోల్): కిశోర వయస్సు బాలికలు తమ హక్కులు, చట్టాలపై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త జి.పల్లవి స్పష్టం చేశారు. మండల పరిధిలోని పోతులబోగుడా మోడల్ పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే అత్యవసర సమయాల్లో 1098 బాలల, 181 మహిళా హెల్ప్లైన్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎంఈఓ ఎన్.రంజిత్ కుమార్ మాట్లాడుతూ..యువతులు ఉన్నత విద్యనభ్యసించడం ద్వారా ఉద్యోగం సాధించి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త జి.పల్లవి -
ఇల్లు కట్టు.. ఫొటో పెట్టు
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మరింత పారదర్శకంగా మారింది. ఇకపై అధికారులు ఫొటోలు తీయకుండానే, లబ్ధిదారులే యాప్ ద్వారా ఇళ్ల ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ ఫొటోలను పరిశీలించి, వాటి ఆధారంగా బిల్లు విడుదల చేయనున్నారు. సకాలంలో ఆర్థిక సహాయం అందుతుంది. ఈ యాప్ వినియోగం ఈ నెల 4 నుంచి అమల్లోకి వచ్చింది. అధికారుల అవసరం లేకుండానే.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం జరుగుతున్న క్రమంలో అధికారులే వివిధ స్థాయిలలో ఫొటోలు తీశారు. హౌసింగ్ ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ఫొటోలు తీసేవారు. దీంతో లబ్ధిదారులకు బిల్లులు రావడంలో ఆలస్యం అవుతుంది. ప్రస్తుత నూతన యాప్ ద్వారా సకాలంలోనే డబ్బులు అందనున్నాయి. లబ్ధిదారులే తమ ఇళ్ల నిర్మాణాల ఫొటోలు నేరుగా ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేసుకోనున్నారు. అధికారులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది. పథకం అమలు విధానం మొదటి దశలో ముగ్గులు పోసి.. బేస్మెంట్ నిర్మించిన తర్వాత డబ్బులు జమ చేస్తారు. గోడలు నిర్మించిన ఫొటోలు పంపిన తర్వాత రెండో సారి.. పైకప్పు పూర్తయిన తర్వాత మూడో విడత డబ్బులు వస్తాయి. చివరగా ప్రారంభం అనంతరం చివరి బిల్లు వస్తుంది. ఫొటోల అప్లోడ్ ఇలా.. పారదర్శకత కోసమే.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అందించేందుకు ఈ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇల్లు నిర్మించుకునే వారు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి. యాప్పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి సాంకేతిక సమస్య ఎదురైనా టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు. – జయదేవ్ఆర్యా, హౌసింగ్ పీడి, సిద్దిపేట ఇందిరమ్మ ఇళ్ల పథకం.. మరింత పారదర్శకం -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ మండలం బండ్రాన్పల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గానికి మొదటివిడతగా 3,500 ఇళ్లు మంజూరుకాగా వాటి నిర్మాణం పూర్తయిన వెంటనే అదనంగా మరో 1,000 ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక, పేదలకు మహిళాసంఘాల ద్వారా రూ.లక్ష చొప్పున రుణం, దశలనుబట్టి విడతలవారీగా బిల్లులను అందజేయడం జరుగుతుందన్నారు. ఇళ్లు మంజూరయిన వారు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తిచేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట గృహనిర్మాణ శాఖ ఏఈ వంశీ, మాజీ ఎంపీటీసీ మాణిక్యం, నాయకులు పండరీరెడ్డి, సంగయ్య, సర్దార్నాయక్ ఉన్నారు. -
ప్రభుత్వ విద్యకు తొలి ప్రాధాన్యం
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ● మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలి ● జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ పటాన్చెరు: ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేయడమే తొలి ప్రాధాన్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్లే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొ న్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలసి మహిపాల్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారన్నారు. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ..మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మత్తుపదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరా రు. అంతకుముందు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
పత్తికి టెం‘డర్’ కత్తి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఈసారి పత్తిని విక్రయించడంలో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లుల లీజుకు సంబంధించిన టెండరు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో జిల్లాలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సీసీఐ కొత్తగా తెరపైకి తెచ్చిన నిబంధనల కారణంగా ఒక్క జిన్నింగ్ మిల్లు యజమాని కూడా ఈ టెండరు ప్రక్రియలో పాల్గొనలేదు. ఈ కొత్త నిబంధనలతో జిన్నింగ్, ప్రెస్సింగ్ ప్రక్రియ నిర్వహించడం తమతో సాధ్యం కాదని ఆయా మిల్లుల యాజమాన్యాలు టెండరు ప్రక్రియకు దూరంగా ఉన్నాయి. దీంతో ఈసారి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. ఏటా అక్టోబర్ తొలి వారం నుంచి రైతులు పత్తి తీయడం షురూ చేస్తారు. అదే నెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి ఆలస్యమయ్యే అవకాశముండటంతో ఈ విషయంపై నేడో రేపో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నేతలు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో సమావేశం కావాలని నిర్ణయించారు. దళారులను ఆశ్రయించక తప్పదా..? సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులను లీజుకు తీసుకుంటుంది. అందులో పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేసి బెయిళ్లుగా మార్చుకుంటుంది. అయితే సీసీఐ కొత్తగా తెరపైకికి తెచ్చిన నిబంధనల కారణంగా సీసీఐకు మిల్లు ఇచ్చేందుకు ఒక్క యజమాని కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేదు. దీంతో సీజను ప్రారంభమయ్యాక కొన్న పత్తిని ఎక్కడికి తరలించాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితి చక్కదిద్దకపోతే రైతులు తమ పత్తిని దళారులు, ప్రైవేటు వ్యాపారులకే పత్తిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడి..కనీస మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారనుంది. లింట్, సీడ్ నిబంధనల విషయంలో.. ముడి పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేశాక సీసీఐకి ఇవ్వాల్సిన పత్తి, గింజల శాతం విషయంలో ఈసారి నిబంధనలు మారాయి. తరుగు శాతం విషయంలో పెట్టిన నిబంధన మేరకు జిన్నింగ్, ప్రెస్సింగ్ చేయడం తమకు ఇబ్బందిగా ఉందని జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నాయకులు పేర్కొటున్నారు. ఈ నిబంధనలతో జిన్నింగ్, ప్రెస్సింగ్ చేయడం సాధ్యం కాదని, అందుకే టెండరు ప్రక్రియకు దూరంగా ఉంటున్నామని చెబుతున్నారు. 19 చోట్ల కొనుగోలు కేంద్రాలు.. ● సీసీఐ ఏటా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలిపి మొత్తం 19 చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. సదాశివపేట, జోగిపేట, రాయికోడ్, వట్పల్లి, నారాయణఖేడ్, పాపన్నపేట (మెదక్ జిల్లా)లో ఈ కేంద్రాలు ఉంటాయి. ● సంగారెడ్డి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనులో మొత్తం 7.28 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 3.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఎకరానికి సుమారు 7.5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినా..సుమారు 26 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అనధికారిక అంచనా. ● మెదక్ జిల్లాలో 3.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో 34,720 ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఈ జిల్లాలో సుమారు 2.60 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి ఉంటుందని అంచనా. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం! విక్రయాలకు పొంచి ఉన్న ముప్పు సీసీఐకి జిన్నింగ్ మిల్లులు ఇచ్చేందుకు విముఖత టెండరు ప్రక్రియకు దూరంగా యాజమాన్యాలు -
సమస్యల పరిష్కారంపై దృష్టి
● కలెక్టర్ ప్రావీణ్య ● ప్రజావాణికి 61 అర్జీలు సంగారెడ్డి జోన్: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి వహించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు ప్రజలనుంచి 61 అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులతో మొరపెట్టుకున్నారు. భూ సమస్యలతో పాటు, పింఛన్లు, సంక్షేమ పథకాలు తదితర వాటిపై దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రహదారుల్లేని తండాలను గుర్తించాలి జిల్లాలో రహదారులు లేని తండాలను గుర్తించి, నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో రహదారుల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులను వినియోగించి పీడబ్ల్యూడీ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల నిర్మాణాలకు సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించాలన్నారు. -
‘బెస్ట్ అవైలబుల్’ బిల్లులు చెల్లించాలి
పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేశ్సంగారెడ్డి ఎడ్యుకేషన్: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్లో ఉన్న రూ.200 కోట్లను తక్షణమే చెల్లించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు సంగారెడ్డిలోని ఐటిఐ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ...బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రైవేట్ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల కాకపోవడంతో ఫీజులు కట్టాలని విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులకు ఫీజు బకాయిలను విడుదల చేయని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
‘సీజనల్’ పంజా
సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో జిల్లాలోని ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఎక్కడ ఏ దవాఖాన చూసినా రోగుల రద్దీ కనిపిస్తోంది. ఓ వైపు అవుట్ పేషంట్ విభాగంలో రోజుకు సుమారు 1,100కి పైగా కేసులు నమోదవుతుండగా మరోవైపు వైద్యులు, మందుల కొరత ఆస్పత్రులను వేధిస్తోంది. రోగులు గంటల తరబడి క్యూల్లో నిరీక్షిస్తూ అసహనం వ్యక్తం చేస్తుండగా మరికొందరు తమ రోగాలను నయం చేయించుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులను తప్పనిసరి పరిస్థితుల్లో ఆశ్రయిస్తున్నట్లు ‘సాక్షి’విజిట్ లో వెల్లడైంది. – సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/ జహీరాబాద్/జోగిపేట(అందోల్) రోజుకు 1,200 నుంచి 1,800 వరకు ఓపీ, ఐపీ సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రి నిత్యం రోగులతో కిక్కిరిసిపోతోంది. రోజుకు 1,200 నుంచి 1,800 వరకు రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 1,475 మంది అవుట్ పేషంట్లు నమోదు కాగా ఇందులో 92 మంది ఇన్ పేషంట్లుగా ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆస్పత్రిలో సరిపడా వైద్యులు లేక ఉన్నవారితోనే రోగులను చూసేందుకు సమయం పడుతుండటంతో రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు చూసేంతవరకు వేచి ఉండలేక కొంతమంది రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎక్కువశాతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల్లేరు.. మందుల్లేవు జహీరాబాద్ ఏరియా ప్రభుత్వాస్పత్రికి నిత్యం అవుట్ పేషంట్లు 1,000 నుంచి 1,200 వరకు వస్తుండటంతో ఆస్పత్రి రోగులతో నిండిపోతోంది. దీంతో గంటల తరబడి క్యూలో నిలబడి వైద్యం పొందాల్సి వస్తోంది. పేరు నమోదు కోసం, వైద్యుడిని కలిసేందుకు, మందులు పొందేందుకు గాను మూడు చోట్ల క్యూలో నిల్చోవాల్సి రావడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో పలు రకాల మందుల కొరత కూడా రోగులను వేధిస్తోంది. వాంతుల నివారణ కోసం ఉపయోగించే ఆండిసిట్రాన్, గ్యాస్ట్రిక్ ఇబ్బందులతోపాటు కడుపులో వచ్చే మంట నివారణ కోసం అవసరమై ప్యాంటాప్, ర్యాంటడీన్ ఇంజక్షన్లను రోగులు బయటనుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. కిట్ల కొరత కారణంగా సీబీపీ, వీడీఆర్ఎల్, హెచ్బీఎస్ఏజీ రక్త పరీక్షలను బయట చేయించుకోవాల్సివస్తోందని రోగులు వాపోతున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పటాన్చెరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి 1,100 అవుట్ పేషంట్లు వస్తున్నారు. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రిలో ఉన్న 120 బెడ్లు రోగులతో నిండిపోయాయి. ఇక్కడ సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. ఆర్ధోపెడిక్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్లో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయని వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ చెబుతున్నారు. వేధిస్తోన్న వైద్యుల కొరత ఆస్పత్రిలో ఎనిమిది వరకు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో చిన్న పిల్లలకు సంబంధించిన వైద్యుల పోస్టులు మూడు వరకు ఖాళీగా ఉన్నాయి. కొందరు వైద్యులు ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. పదికి పైగా నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలువురు డిప్యూటేషన్పై వెళ్లినా వారి స్థానాల్లో ఇతరులు చేరలేదు. 25 మంది నర్సులు, 35 మంది నర్స్ ట్రైనీ విద్యార్థులతో సేవలందిస్తున్నారు. రోగులు ఎక్కువ.. డాక్టర్లు తక్కువ జోగిపేట ఏరియా ఆస్పత్రిదీ దాదాపు ఇదే పరిస్థితి. సోమవారం ఒక్కరోజే సుమారు 700 మంది అవుట్ పేషంట్లు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకున్నారు. అయితే రోగులకు సరిపడా వైద్యులు లేకపోవడంతో రోగులందరినీ వైద్యులు చూసేందుకు సమయం పడుతుంది. ఈ ఆస్పత్రిలో 21 మంది డాక్టర్లుండగా కేవలం 9 మందే విధులకు హాజరయ్యారు. –డాక్టర్ అశోక్, ఆర్ఎంఓ మందులు అందుబాటులో ఉన్నాయి సాధారణంగా జ్వరాలకు అవసరమయ్యే ఔషధాలన్నీ అందుబాటులోనే ఉన్నాయి. కొన్ని మందులు మాత్రం ఒక్కోసారి రవాణ కారణంగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. సైకియాట్రిస్ట్, చర్మవ్యాధులకు సంబంధించిన మందులు మాత్రం ఇక్కడ లభించవు. –మురళీకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్, సంగారెడ్డిమందుల కొరత లేదు ఆస్పత్రిలో ఎలాంటి మందుల కొరత లేదు. రక్తపరీక్షలు ఆస్పత్రిలోనే చేస్తున్నాం. ఎప్పుడైనా కిట్ల కొరత ఉంటే బయటకు పంపి ఉండవచ్చు. రోగులకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. –శ్రీధర్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, జహీరాబాద్ -
ట్యాబ్ ఒక ఉపాధ్యాయుడితో సమానం
● ఎంపికై న 60 ప్రభుత్వ పాఠశాలలకు ● 3 ట్యాబ్లు : డీఈఓమెదక్ కలెక్టరేట్: ఒక ట్యాబ్ ఒక ఉపాధ్యాయుడితో సమానమని, ఈ లర్నింగ్ ప్రోగ్రాంలో ఈ ట్యాబ్లు ఎంతగానో ఉపయోగ పడుతాయని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో మేఘశాల అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లాలోని 60 పాఠశాలలకు 180 ట్యాబ్లను డీఈఓ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ఈ లర్నింగ్ అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ కృషి చేయడం అభినందనీయమన్నారు. తక్కువ విద్యార్థులున్న పాఠశాలల్లో ఈ ట్యాబ్ల ద్వారా బోధన ఎంతో సులభంగా ఉంటుందని, అలాంటి పాఠశాలలను ఎంపిక చేసి నట్లు తెలిపారు. అనంతరం మేఘశాల సంస్థ ప్రతినిధులు ప్రశాంత్రెడ్డి, జయలక్ష్మి మాట్లాడుతూ... ఈ ఏడాది మెదక్ (60), సిద్దిపేట(45), యాదాద్రి భువనగిరి (45)ల చొప్పున పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు 3 ట్యాబ్లను అందజేసినట్లు చెప్పారు. వీటికి ఎలాంటి ఇంటర్నెట్ అవసరం ఉండదని, ఆఫ్లైన్లోనే విద్యార్థులకు పాఠాలు బోధించవచ్చునని తెలిపారు. ’ఒక్కో పాఠశాలలో 6,7,8 తరగతులకు గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్లు నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ మానిటరింగ్ అధికారి సుదర్శన్మూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మెదక్ ఎంఈఓతోపాటు మేఘశాల ప్రతినిధులు సత్యప్రియ జిల్లాలో ఎంపికై న 60 పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.