breaking news
Sangareddy
-
డ్రగ్స్పై నిఘా పెంచాలి
సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై నిఘా పెంచాలని సీపీ అనురాధ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీసు కమిషనరేట్లో పెండింగ్ కేసులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసుల్లో శిక్షల శాతం పెంచాలన్నారు. ఆత్మహత్యలకు గల కారణాలు గుర్తించి నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులతో కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100 కాల్స్పై అలసత్వం వహించవద్దన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీలు రవీందర్రెడ్డి, నరసింహులు, సదానందం, రవిందర్, శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్గౌడ్, కిరణ్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, దుర్గ, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.గంజాయి పట్టివేత రామచంద్రాపురం (పటాన్ చెరు): గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీధర్ మాలిక్ జీవనోపాధి కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరుకు వలస వచ్చాడు. ఇక్కడ లేబర్ క్యాంపులో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో తన గ్రామం నుంచి గంజాయి తీసుకొచ్చి లేబర్ క్యాంపులో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి నిందితులకు జైలు జహీరాబాద్ టౌన్: గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జహీరాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం... ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా గంపవరానికి చెందిన పవన్ కుమార్ (36), అనిమేశ్ మండల్ (26) 10 కిలోల ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా 2019లో పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో రిమాండ్ చేశారు. జిల్లా అదనపు కోర్టులో వాదనలు జరిగిన అనంతరం జడ్జి సోమవారం నిందితులకు ఐదేళ్ల శిక్షతోపాటు రూ. 25 వేల జరిమానా విధించారు. వృద్ధురాలిని నమ్మించి.. చైన్ స్నాచింగ్ తూప్రాన్: వృద్ధురాలి మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయిన ఘటన మున్సిపల్ పరిధిలోని పడాల్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెప్యాల లలిత (68) కొందరు మహిళలతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షలకు వచ్చింది. తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఆటో స్టాండు వద్ద నిలుచుంది. ఈ క్రమంలో ఓ యువకుడు వచ్చి ‘అమ్మ ఇక్కడ ఉన్నవా.. మీ కోసం మీ ఇంటికి వెళ్లాను. అక్కడ మీరు లేరు. మీకు పింఛన్ వచ్చింది’ అని నమ్మబలికాడు. రెండు పాస్ ఫొటోలు, ఆధార్ కార్డు కావాలని అడిగాడు. వృద్ధురాలు ఆ యువకుడి మాటలు నమ్మి ఫొటోలు లేవని తెలిపింది. ఆధార్కార్డుపై ఉన్న ఫొటోను చూసి ఇందులో నీ మెడలో నగలు లేవు.. ఫొటో తీయించుకువస్తాను నీ మెడలోని గొలుసు ఇవ్వమని అడిగాడు. దీంతో నమ్మిన వృద్ధురాలు ఆధార్కార్డుతో పాటు గొలుసు ఇచ్చింది. అవి తీసుకెళ్లిన యువకుడు ఎంతకు తిరిగిరాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దిద్దుబాటేది?
పారిశ్రామికవాడల్లో ప్రమాదాలు అరికట్టే చర్యలు శూన్యంపటాన్చెరు: మనం అనుకోకుండా జరిగేవే ప్రమాదాలు..జీవితంలో ఎదురైన అనుభవాలు, ప్రమాదాల నుంచి మనం ఏదోక గుణపాఠం నేర్చుకుంటుంటాం. అయితే పటాన్చెరు పారిశ్రామిక వాడలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పరిశ్రమల యాజమాన్యాలు గుణపాఠం నేర్వడం లేదు. పాశమైలారంలో సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో శ్రమజీవులు పిట్టల్లా రాలి పోయిన ఘటనే అందుకు నిదర్శనం. కార్మికులంతా ఔట్సోర్సింగే... సిగాచీలో కార్మికులందరూ ఔట్సోర్సింగ్ వారే కావడం విశేషం. కార్మికులకు తాము చేస్తున్న పనికి వేతనం వస్తే చాలనే పరిస్థితి నెలకొంది. బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చి ఇక్కడ పరిశ్రమల్లో పని చేయిస్తున్నారు. ప్రమాదకర యంత్రాలపై ఏమాత్రం నైపుణ్యంలేని అన్స్కిల్డ్ లేబర్తో పని చేయిస్తున్నారు. అదేమంటే నిపుణుల కొరత ఉందని స్థానికులెవరూ పరిశ్రమల్లో పని చేసేందుకు ముందుకు రావడం లేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. కారణాలు ఏమైనా పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికుల వివరాలేవీ ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉండటం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ అవన్నీ తప్పుడు నివేదికలే అయి ఉంటున్నాయి. అధికారుల తనిఖీలు కూడా సరిగ్గా చేయడం లేదని తెలుస్తోంది. గతంలో జరిగిన ప్రమాదాలివే.. ఇదే పరిశ్రమలో 2002లో ప్రమాదం జరిగింది. అప్పుడు ఒకరు మృతి చెందారు. తర్వాత ఏరిస్లో భారీ ప్రమాదం జరిగి కార్మికులు మృతి చెందారు. పాశమైలారంలో చైతన్య క్లోరైడ్స్, రాంటస్ పరిశ్రమలో భారీ ప్రమాదాలు జరిగాయి. రాంటస్లో జరిగిన ప్రమాదంలో మంటలార్పిన మూడు రోజులకు ముగ్గురు కార్మికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. ఇక జయవిజయ అల్లాయిస్ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదంలో అక్కడికక్కడే ఆరు మంది కార్మికులు చనిపోయారు. వీరుపాక్ష రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. 2023లో గడ్డ పోతారంలో మైలాన్ పరిశ్రమలో రసాయన డ్రమ్ములు పేలిన ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. తర్వాత లీ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఏడాదిలోనే పాశమైలారం ఎంఎస్ఎన్లో ప్రమాదం జరిగింది. ఇలా ప్రతీసారి ఏదో ఒక పరిశ్రమలో ఏదో ఒక ప్రమాదం కార్మికులను పొట్టనబెట్టుకుంటోంది. కొన్ని పరిశ్రమల్లో అయితే జరిగిన ప్రమాదాలు సైతం వెలుగులోకి రావడం లేదు. చనిపోయిన వారి కుటుంబసభ్యులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండకపోవడంతో పరిశ్రమల యాజమాన్యానికి కలిసివస్తోంది. మృతుల కుటుంబాలకు సదరు కాంట్రాక్టర్ ద్వారా ఎంతోకొంత సొమ్మును ముట్టజెప్పి వారి నోళ్లను నొక్కేస్తున్న ఘటనలు కోకొల్లలు. -
సెంట్రల్ బ్యాంకులో చోరీకి యత్నం
వెల్దుర్తి(తూప్రాన్): బ్యాంకులో చోరీకి యత్నించి అలారం మోగడంతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఆదివారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటలకు బ్యాంక్ వెనకవైపు స్టోర్ రూం గోడకు కన్నం చేసి ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో బ్యాంకును అనుక్షణం పర్యవేక్షించే ఐవీఎస్ టీం అలర్ట్ అయి అలారం మోగడంతో దుండగులు గోడకు వేసిన కన్నం ద్వారా పరారయ్యారు. అదే సమయంలో డయల్ 100 ద్వారా పోలీసులను అలర్ట్ చేయడంతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, క్లూస్ టీం, బ్యాంక్ మేనేజర్ సుమన్ భాగే, సిబ్బందితో ఘటనా స్థలాన్ని సందర్శించి వేలిముద్రలు సేకరించారు. నిందితులిద్దరూ ముఖానికి మాస్కులు ధరించినట్లు తెలిసింది. చోరీలో ఇద్దరు దుండగులే పాల్గొన్నారా? లేక బయట ఎవరైనా కాపలాగా ఉన్నారా? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ వెంట తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, వెల్దుర్తి ఎస్సై రాజుతో పాటు మనోహరాబాద్, శివంపేటకు చెందిన పోలీస్ సిబ్బంది ఉన్నారు. గతంలో కూడా ఓ యువకుడు చోరీకి ప్రయత్నించగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించి కేసు నమోదు చేశారు. గోడకు కన్నం చేసి లోనికి వచ్చిన దుండగులు అలారం మోగడంతో పరారీ -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
జహీరాబాద్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈఘటన మండలంలోని రంజోల్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గుండారెడ్డి(30) జూన్ 18న ఉదయం కారు డ్రైవింగ్కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద కుటుంబ సభ్యులు వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. సోమవారం అతడి అన్న శ్రీనివాస్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నర్సాపూర్ పట్టణంలో వృద్ధుడు నర్సాపూర్ రూరల్: వృద్ధుడు అదృశ్యమైన ఘటన నర్సాపూర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... పట్టణంలోని సునీతా రెడ్డి కాలనీకి చెందిన ఎర్రోళ్ల మల్లయ్య (75) అనే వృద్ధుడు ఈ నెల 27న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మల్లయ్య కుమారుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి
సంగారెడ్డి క్రైమ్: కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పట్టణంలోని రుక్మిణి థియేటర్ వద్ద గల డ్త్రెనేజీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించి మేనేజర్ వెంకటేశం పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో పట్టణంలోని విజయ్నగర్ కాలనీకి చెందిన కడమంచి దుర్గాప్రసాద్ (23)గా గుర్తించారు. ఇతడు వృత్తిరీత్య కూలీ పనులు చేసుకుంటున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ చిన్నారి.. జహీరాబాద్ టౌన్: చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబంతో జహీరాబాద్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. జూన్ 22న ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష్మణ్ రెండవ కుమార్తె షరోని(7) గాయపడింది. ప్రమాదవశాత్తు దీపం చిన్నారిపై పడి మంటలు అంటుకున్నాయి. కుటుంబ సభ్యులు చూసి మంటలను ఆర్పేలోపు గాయాలయ్యాయి. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. -
సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం
శివ్వంపేట(నర్సాపూర్) : వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... శభాష్ పల్లి గ్రామానికి చెందిన పానగారి సుధాకర్(28) ఆదివారం భార్యాపిల్లలను కొత్తపేట గ్రామంలో అత్తగారి ఇంటి వద్ద దింపాడు. అక్కడి నుంచి బైక్పై నర్సాపూర్కు వెళ్లి ఓ ఫర్టిలైజర్ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశాడు. రుస్తుంపేట గ్రామ శివారులో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నేను తప్పు చేయలేదు నా పిల్లలు దూరమవుతున్నారంటూ సెల్ఫీ వీడియోను తన స్నేహితుడికి వాట్సప్ చేశాడు. అతడు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. శివ్వంపేట పోలీసుల సహకారంతో లొకేషన్ ఆధారంగా కుటుంబ సభ్యులు వెళ్లేలోపు గుర్తించిన స్థానికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ నాలుగేళ్ల క్రితం గ్రామంలో జరిగిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. కేసు ట్రయల్కు రావడంతో శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. -
స్నాతకోత్సవానికి వేళాయె..
నేడు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సంబురాలు ఏర్పాట్లు చేశాం రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నాలుగో స్నాతకోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. 267 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేయనున్నాం. రోజురోజుకు పెరుగుతున్న ఉద్యాన పంటల విస్తీర్ణం నేపథ్యంలో విద్యార్థులకు ఈ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. విశ్వవిద్యాలయంలో పరిశోధనల(రీసెర్చ్)లో విస్తృత అవకాశాలున్నాయి. విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న కొట్యాల బోధన కళాశాలలో వాణిజ్యపరమైన ఉద్యాన పంటల మోడల్ ఉద్యాన క్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. –డాక్టర్ దండా రాజిరెడ్డి, విశ్వవిద్యాలయం, వైస్ ఛాన్స్లర్ ● కార్యక్రమానికి హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ● పట్టాలు అందుకోనున్న 267 మంది విద్యార్థులు ములుగు(గజ్వేల్): నిత్యం విద్యార్థులు వివిధ అధునాతన పరిశోధన అంశాలపై సందడిగా కనిపించే సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవ సంబురానికి సిద్ధమైంది. మంగళవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో స్నాతకోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పటాన్చెరు ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్ హాజరు కానున్నారు. 2014లో విశ్వవిద్యాలయం ఏర్పాటు శ్రీ కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్కేఎల్టీఎస్హెచ్యూ) 2014లో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఏర్పాటు చేశారు. 2019లో సిద్దిపేట జిల్లాలోని ములుగులో అప్పటి సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభమైంది. ఎస్కేఎల్టీఎస్హెచ్యూకు అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 పరిశోధన స్థానాలు, 4 బోధన కళాశాలలు, ఒక కృషి విజ్ఞానకేంద్రం, మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం తనదైన శైలిలో ఇప్పటికే అనేక విజయాలను సాధించింది. విద్యాబోధన, విస్తరణ పరిశోధన రంగాల్లో విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలు, ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలు, శాసీ్త్రయ సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. ఉద్యాన విద్య, విస్తరణ పరిశోధనలకు ఆదరణ పెరుగుతోంది. ఈ రంగంలో అపారమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉండటంతో అధిక శాతం విద్యార్థులు ఉద్యాన బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నాలుగో స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ మొదటి స్నాతకోత్సవం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో నిర్వహించారు. రెండో స్నాతకోత్సవాన్ని ములుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, మూడో స్నాతకోత్సవాన్ని ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం ఆడిటోరియంలో చేశారు. నాలుగో స్నాతకోత్సవాన్ని రాజేద్రనగర్లో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో 267 మంది విద్యార్థులు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు. అందులో 158 మంది బ్యాచిలర్స్ ఆఫ్ హార్టికల్చర్, 55 మంది బ్యాచిలర్స్ ఆఫ్ ఫారెస్ట్రీ, 38 మంది మాస్టర్స్ హార్టికల్చర్, 11 మంది మాస్టర్స్ ఫారెస్ట్రీ, 5 మంది పీహెచ్డీ హార్టికల్చర్ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నారు. అలాగే 13 మందికి గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేయనున్నారు. -
మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి కోసం వస్తే ఏకంగా ఉసురే తీసేసింది సిగాచీ పరిశ్రమ. సోమవారం ఈ కంపెనీలో జరిగిన విస్ఫోటనం బతుకుదెరువుకోసం వలస వచ్చిన వారి జీవితాలను బుగ్గిపాలు చేసింది. పేలుడు ధాటికి దూరంగా ఎగిరిపడ్డ కార్మికుల మృతదేహాలతో..చిధ్రమైన శరీరభాగాలతో, కూలిన శిథిలాలతో సిగాచీ మరుభూమిని తలపించింది. తమ వారి ఆచూకీ కోసం బాధితుల ఆక్రందనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతిల్లింది. ఈ పారిశ్రామికవాడలో కార్మికుల కుటుంబాలు కోల్పోతున్నా పరిశ్రమ యాజమాన్యానికి మాత్రం సాధారణమేనని తరచూ జరిగే ప్రమాదాలు నిరూపిస్తూనే ఉన్నాయి. అనుభవాలు, ప్రమాద పాఠాల నుంచి యాజమాన్యాలు, ప్రభుత్వాలు గుణపాఠం నేర్వవని మరోసారి ఈ ప్రమాదంతో రుజువైంది. సోమవారం ఉదయం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. పారిశ్రామిక వాడలో విషాదం ఉదయమే తమ ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుసుకున్న బాధిత కార్మికుల కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. కుటుంబసభ్యుల ఆచూకీ లభించకపోవడంతో కార్మికుల కుటుంబసభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. తమ వారు ఏమయ్యారో తెలియకపోవడంతో వారు అధికారుల చుట్టూ తిరిగారు. అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. దీంతో పాశమైలారం పారిశ్రామికవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. కాలినగాయాలతో బాధపడుతున్న తమ ఆత్మీయులను చూసి బోరున విలపించారు. కళ్లముందే విగత జీవులుగా మారిన తమ వారిని చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. తమ వారి జాడ ఎక్కడైనా లభిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.పాశమైలారంలో భారీ పేలుడు మరుభూమిగా ఘటనా స్థలంసిగాచీ పరిశ్రమ ఎదుట భీతావహం తమ వారి ఆచూకీ కోసం విలపించిన బాధిత కుటుంబ సభ్యులువారంతా రోజు మాదిరిగానే విధుల్లోకి వచ్చారు. తమ తోటి కార్మికులు, ఉద్యోగులకు శుభోదయం చెప్పుకున్నారు. అప్పుడప్పుడే ఎవరికివారు తాము పని చేసే స్థలాల్లో నిమగ్నమవుతున్నారు. ఒక్కసారిగా మృత్యువు పేలుడు రూపంలో కబళించింది. ఉన్నపళంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పొగ పూర్తిగా కమ్ముకోవడంతో చుట్టూ చీకటి. అగ్నికీలలకు దేహాలు ఆహుతైపోయాయి. శరీరభాగాలకు మంటలు అంటుకున్నాయి. మరికొందరి శరీరాలు మాడి మసైపోయాయి. ఎటు చూసినా హాహాకారాలు. ప్రమాదం నుంచి బయటపడేందుకు ఆర్తనాదాలు.. సిగాచీ పరిశ్రమల్లో రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించి భీతావహ వాతావరణం ఇది. ఎక్కడపడితే అక్కడ కార్మికుల శవాలు. కాలి బూడిదై.. మసైపోయిన శరీర భాగాలు. ఇలా పేలుడు జరిగిన ప్రదేశం పూర్తిగా మరుభూమిని తలపించింది.ఉపాధి కోసం వచ్చి అనంత లోకాలకు.. వారంతా పొట్ట చేతబట్టుకుని వచ్చిన నిరుపేద కుటుంబాలే. ఉపాధి కోసం వందల కిలోమీటర్లు నుంచి వచ్చిన కార్మికులే అధికం. బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి భార్యాబిడ్డలతో వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. చాలీ చాలని జీతాలున్నప్పటికీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కార్మికుల కుటుంబాల్లో ఈ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పొట్ట చేతబట్టుకుని వచ్చిన తమ వారిని మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధి కోసం వస్తే ఉసురే పోయిందని విలపిస్తున్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించకపోవడంతో వారు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. -
బైక్ను ఢీకొట్టిన కారు
● ప్రమాదంలో భార్య మృతి ● భర్తకు తీవ్రగాయాలు తూప్రాన్న్ /మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ సమీపంలో సోమవారం చేసుకుంది. ఎస్ఐ వివరాల ప్రకారం... మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన దాసరి రమేశ్, స్వప్న(29) దంపతులు యాక్టీవాపై చేగుంట మండలం మక్కరాజ్పేటలో స్వప్న పెద్దనాన్న ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆదివారం వెళ్లారు. తిరిగి సోమవారం ఇంటికి వస్తున్న క్రమంలో 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట స్టేషన్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. రమేశ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వృక్ష ప్రేమికుడు విశ్వమోహన్ కన్నుమూత
జహీరాబాద్: నాలుగు దశాబ్దాలపాటు సర్పంచ్గా పని చేసిన కాలంలో రహదారికి ఇరువైపులా చెట్లు పెంచి వృక్ష ప్రేమికుడిగా ప్రశంసలందుకున్న విశ్వమోహన్(88) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కోహీర్ మండలంలోని గొటిగార్పల్లి గ్రామ సర్పంచ్గా పనిచేసిన ఆయన పలుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు సర్పంచ్గా కొనసాగిన ఆయన తాండూర్ క్రాస్ రోడ్డు నుంచి గొటిగార్పల్లి గ్రామం వరకు మూడు కిలోమీటర్ల పొడువు ఉన్న రహదారికిరు వైపులా మొక్కలు నాటించారు. అవిప్పుడు మహా వృక్షాలయ్యాయి. -
అర్జీల పరిష్కారానికి ఎదురుచూపులు
● ప్రజావాణిలో వాపోతున్న అర్జీదారులు ● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు సంగారెడ్డి జోన్: తమ సమస్యల పరిష్కారానికి ఎదురు చూపులు తప్పటం లేదని అర్జీదారులు వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు వేసినా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు కలెక్టరేట్కు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ పద్మజారాణి హాజరై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రజావాణి సమస్యలు పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇంటి నంబరు చూపించడం లేదు: రాజు, సదాశివపేట తమ ఇంటి నంబరు రికార్డులతోపాటు ఆన్లైన్లో చూపించడం లేదని అధికారులు చెబుతున్నారు. 2005 వరకు ఇంటికి సంబంధించిన పన్ను కట్టాను. మా నాన్నమ్మ మృతి చెందడంతో పన్ను కట్టేందుకు వెళితే మీ ఇంటి వివరాలు అందుబాటులో లేవని చెబుతున్నారు. కుల ధ్రువపత్రాలు అందించాలి: బొప్పల బాబు, తోలుబొమ్మలాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తమకు తమ కుల ధ్రువ పత్రాలు అందించాలి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త కులాల జీవో ఉన్నప్పటికీ తమకు పత్రాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో తమ పిల్లలకు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తమకు పత్రాలు అందించాలి. -
యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం
పటాన్చెరు టౌన్: యాజమాన్యం నిర్లక్ష్యం..ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రలకు మెరుగైన వైద్యంతోపాటు రూ.50లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి ఎమ్మెల్యే గూడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజి ఇక్బాల్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 30 ఏళ్లుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎన్నడూ కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి..ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ. 50 లక్షలపరిహారం ఇవ్వాలి ఒకరికి ఉద్యోగం కల్పించాలి అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం -
పోలీసుల ఓవరాక్షన్
బాధిత కుటుంబాల పట్ల దురుసు ప్రవర్తన పటాన్చెరు: ‘నా భర్త ఎక్కడ’అంటూ కొందరు మహిళలు గుండలవిసేలా విలపించారు. ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త పేరు ఆస్పత్రిలో చేరిన వారి జాబితాలో లేదు. చనిపోయిన వారి జాబితాలో కూడా లేదని చెబుతున్నారు. మరి ఎక్కడున్నారు..? చెప్పాలి అంటూ బాధితులు తమ వారి ఆచూకీ కోసం కలియదిరుగుతుంటే లోపలికి రాకూడదంటూ పోలీసులు వారి పట్ల అమానవీయంగా దురుసుగా వ్యవహరించారు. అనిత, సంజీవ్లాల్ అనే మహిళలు పోలీసులతో వాదిస్తూ పోలీసులపై రాయి ఎత్తి పట్టి తిట్టిపోశారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన మావాళ్లు ఇంటికి తిరిగి రాలేదు. పొద్దున్నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా..అని ఓ మహిళ వాపోయింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్ఫోటనంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబీకుల పరిస్థితి ఇది. -
అప్పుడే మేల్కొనుంటే..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్ లేక.. పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవీ.. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ప్రమాదం జరిగాక హడావుడి సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్బీఆర్గానిక్స్ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నాడు ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు మృతి.. ఇదే తరహాలో ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో ఘటన.. -
సీసీఆర్టీ శిక్షణకు 10 మంది టీచర్లు
● ఈనెల 3 నుంచి ఢిల్లీలో సీసీఆర్టీ శిక్షణ తరగతులు ● 15 రోజుల పాటు నిర్వహణన్యాల్కల్(జహీరాబాద్): విద్యార్థులకు పూర్తిస్థాయి లో అర్థమయ్యే వినూత్న విధానంలో బోధనా పద్ధతులపై ప్రదర్శించిన పలువురు ఉపాధ్యాయులకు న్యూ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలో పది మంది ఉపాధ్యాయులను అధికారులు ఎంపిక చేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి లోని రేజింతల్ ప్రాథమిక పాఠశాలకు చెందిన సఫియా సుల్తానా, ములుగు జిల్లా ఒడ్డెరగూడెం పాఠశాలకు చెందిన రాజేశ్కుమార్, మాన్సింగ్ తండా పాఠశాల కు చెందిన స్వప్న, మంచిర్యాల్ జిల్లా లోని ముల్కల్గూడ పాఠశాలకు చెందిన దిలీప్కు మార్, యాదగిరి జిల్లాలోని పాయిల్వాన్పూర్ పాఠశాలకు చెందిన రమేశ్, వికారాబాద్ జిల్లాలోని కన్కల్ పాఠశాలకు చెందిన ఈశ్వర్రావు, జగిత్యాల్ జిల్లాలోని తండ్రియాల్ పాఠశాలకు చెందిన విజయ్కుమార్, వర్షకొండ పాఠశాలకు చెందిన రమేశ్, మెదక్ జిల్లాలోని దంతెనపల్లి పాఠశాలకు చెందిన కవిత నిర్మల్ జిల్లాలోని సేవాలాల్ తండా పాఠశాల కు చెందిన ప్రవీణ్కుమార్ ఢిల్లీలో నిర్వహించే ప్రద ర్శనలకు ఎంపికై న ట్లు అధికారులు తెలిపారు. జాతీ య విద్యా విధానం 2020లో భాగంగా సాంస్కృతిక వనరులు శిక్షణ కేంద్రం వీరికి ఈ నెల 3 నుంచి 19వ వరకు 15 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
పాశమైలారం ఘటనా స్థలిలో సీఎం రేవంత్ రెడ్డి
పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్యను 45గా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతోంది. తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది. Updates: పాశమైలారం ఘటనా స్థలిలో సీఎం రేవంత్పాశమైలారం సిగచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డివెంట మంత్రులు పొంగులేటి, వివేక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి..ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రిప్రమాదం జరిగిన తీరును.. సహాయక చర్యలపై అధికారులను ఆరా తీస్తున్న సీఎం రేవంత్పటాన్చెరు మార్చురీలో 37 మృతదేహాలు11 మృతదేహాల గుర్తింపు పూర్తి పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలుడీఎన్ఏ టెస్ట్కు ఒకరోజు నుంచి రోజున్నర టైం పడుతుందంటున్న అధికారులు సిగచి ప్రమాద స్థలికి కేంద్రమంత్రి కిషన్రెడ్డిసంగారెడ్డి పటాన్ చెరువు సిగచి కంపెనీ ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిమధ్యాహ్నం ప్రమాద స్థలిని పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్న కిషన్రెడ్డికిషన్రెడ్డి వెంట బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్రావు కూడాకొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుపాశమైలారం ఘటనలో కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుడీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లుఘటనాస్థలానికి వచ్చిన డీఎన్ఏ పరీక్షలు చేసే బృందాలుఇప్పటిదాకా కేవలం 6 మృతదేహాలకు మాత్రమే గుర్తింపుపటాన్చెరు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డికాసేపట్లో పటాన్చెరు పాశమైలారం పారిశ్రామికవాడకు సీఎం రేవంత్ రెడ్డిఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు ఆస్పత్రిలో పరామర్శపాశమైలారం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎంసీఎం వెంట మంత్రులు కూడాసిగచి ఆవరణలో పోలీసు ఆంక్షలుసిగచి ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డిఅంతకంటే ముందు.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శసీఎం రాక నేపథ్యంలో సిగచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలుసిగచి కంపనీ వైపు ఎవరిని అనుమతించని పోలీసులునిన్న ప్రమాదం తర్వాత బాధిత కుటుంబాలతో పోలీసులకు వాగ్వాదంతమ వారి గురించి సరైన సమాచారం లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులుతోసేసిన పోలీసులు.. ఫ్యాక్టరీ వద్ద కాసేపు ఉద్రిక్తత42కు చేరుకున్న మృతుల సంఖ్యశిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగింపు..మరో రెండు గంటల పాటు శిధిలాల తొలగించే ప్రక్రియ కొనసాగే అవకాశం..కుప్పకూలిన సిగచి ప్రొడక్షన్ బిల్డింగ్చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారే..వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 34 మంది క్షతగాత్రులుమూడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులుశిథిలాల కింద మరో 20 మంది42కి చేరిన మృతుల సంఖ్యశిథిలాల కిందే మరో 20 మంది?మృతుల సంఖ్య 55కి చేరే అవకాశంకొనసాగుతున్న శిథిలాల తొలగింపుధ్వంసమైన ప్లాంట్ను పక్కకు తొలగించిన సహాయక బృందాలుగుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలుమృతుల్లో తమిళనాడు, యూపీ వాసులేక్కువడీఎన్ఏ పరీక్షల అనంతరమే కుటుంబ సభ్యులకు అప్పగించే ఛాన్స్ఇప్పటివరకు గుర్తు పట్టినవి ఆరు మృతదేహాలు మాత్రమేఅంతకు ముందు.. ఈ ఉదయం ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. ఘటన వివరాలతో పాటు సహాయక చర్యలు ఇతరత్రా వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో 47 మంది గల్లంతు అయ్యారుఇప్పటివరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అందులో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించాం.ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరికొందరు మృతిగుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు ఉన్నాయి మరో 27 మంది జాడ తెలియాల్సి ఉందిఆస్పత్రిలో తీవ్ర గాయాలతో 35 మందికి చికిత్స అందుతోంది.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది57 మంది సరక్షితంగా ఇంటికి వెళ్లారుప్రమాద సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయిందిశిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారు.. వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయిసహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు ఇదీ చదవండి: పరిశ్రమల్లో ప్రాణాలు.. గాలిలో దీపాలు సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంతక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చన్న కలెక్టర్ ప్రావీణ్యబ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ ఉత్పత్తి ప్రాథమికం సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యిందన్న ప్రత్యక్ష సాక్షులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న కొందరు కార్మికులు అయితే ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి?మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడుసంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు అగ్నికీలల్లో పలువురి సజీవదహనం.. కార్మికులు, ఉద్యోగులు దుర్మరణం! సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు మృతుల్లో ఎక్కువమంది ఒడిశా, బిహార్, యూపీ వారే.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం 36 మందికి కాలిన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కింద మరికొందరు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్... ఘటనా స్థలాన్ని,ఆస్పత్రులను సందర్శించిన మంత్రులు.. నేడు ఘటనా స్థలానికి సీఎం రేవంత్ ఆస్పత్రిలో బాధితులకు సీఎం పరామర్శ -
బతుకులు బుగ్గి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/పటాన్చెరు/రామచంద్రాపురం/జిన్నారం/చందానగర్: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని సిగాచి అనే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఇద్దరు ఆస్పత్రుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 16 మంది మరణించినట్లు అనధికారిక సమాచారంకాగా, మంత్రులు దామోదర, వివేక్ మాత్రం 12 మంది మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తదితర ప్రముఖులు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ను ఉ త్పత్తి చేస్తారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి? మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్కు పలు సూచనలిచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పరిశ్రమల శాఖ ఫైర్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్గ్రేషియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రులు దామోదర, వివేక్ రాజకీయం చేయొద్దు: మంత్రులు పేలుడు ఘటనలో గాయపడిన వారిలో హేమ సుందర్, ధర్మరాజ్ ప్రసాద్, రాజేష్ కుమార్ చౌదరి, కమలేష్ ముఖియా, చందన్కుమార్ నాయక్, నగ్నజిత్, అభిషేక్ కుమార్, అజిత్ తివారి, సంజయ్కుమార్, యశ్వంత్ కుమార్, ధన్వీర్ కుమార్, సంజయ్ ముఖియా, రాజశేఖర్రెడ్డి, దేవనంద్, గణేష్ కుమార్, సంజయ్కుమార్ యాదవ్, నీలాంబర్ బట్రా, సమీర్, అమర్జిత్, అర్జున్కుమార్, అజిమ్ అన్సారీలను మియాపూర్ మదీనాగూడలోని ప్రణామ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ అభిషేక్ కుమార్, అజిత్ తివారి మృతి చెందారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నవారిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎవరూ ఎలాంటి రాజకీయం చేయవద్దని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సీఎం సందర్శన సిగాచి పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడనున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కేసీఆర్ సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలావుండగా పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పలువురు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధానిసాక్షి, న్యూఢిల్లీ: సంగారెడ్డి జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదం గురించి విని చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపడుతున్నారు..’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం ఎంతో దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం..’ అని ఖర్గే అన్నారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. ప్రమాదంపై ఆరా సాక్షి, హైదరాబాద్: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ జితేందర్, సీఎస్ రామకృష్ణారావుతో సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజాస్టర్మేనేజ్మెంట్స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫైర్సరీ్వసెస్అడిషనల్డీజీని సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. -
పాశమైలారంలో ఇది మూడో ఘటన: హరీష్రావు
పాశమైలారం ఘటన ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బాధితులకు భారీగా పరిహారం అందించాలని డిమాండ్ చేసిన ఆయన.. ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మాజీ మంత్రి హరీష్రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారాయన. సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పాశమైలారంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఇది మూడో ఘటన. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలి. ఎంత మంది చనిపోయారో కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. గాయపడిన వాళ్లకు రూ. 50 లక్షలు అందించాలి’’ అని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. గాయపడ్డ 26 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. వాళ్లకు మెరుగైన వైద్యం అందాలి. అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి అని హరీష్ రావు కోరారు. సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా చాలా ప్రాంతం కుప్పకూలిపోగా.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
పద్మ చావుకు కారణమెవరు?
పాపన్నపేట(మెదక్): ‘వీఓఏ ఉద్యోగం చివరకు నా ప్రాణం మీదకు తెచ్చింది. బ్యాంకు, సెర్ప్ అధికారులు, తోటి ఉద్యోగులు కలిసి నా చావుకు కారణమయ్యారు. నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని, నా ద్వారా డబ్బులు తీసుకున్నారు. చివరకు నన్ను దోషిగా నిలబెట్టారు. ఇంత జరిగినా ఇంకా చచ్చిపోలేదా? అన్నట్లు కొందరు నిలదీస్తుంటే ఎలా బతకాలి. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా. కలెక్టర్ గారు నా చావుకు కారణమైన వారిని మాత్రం వదలొద్దు. విచారణ జరిపి, నిందితులను గుర్తించి, నా ఆత్మకు శాంతి కలిగించండి’ అంటూ చివరిసారి లేఖ రాసి..ఉరి తాడుకు వేలాడింది.. పొడిచన్పల్లి వీఓఏ పద్మ. కానరాని అధికారులు పొడిచన్పల్లి వీఓఏ పద్మ ఆర్థిక నిందలు భరించలేక ఆత్యహత్య చేసుకొని 5 రోజులైంది. తనపై వచి్చన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని చివరి కోరిక కోరుతూ.. లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఇంత వరకు ఒక్క అధికారి కూడా కనీసం వారి ఇంటికి వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. 18 ఏళ్లు సేవ చేసినా కనీసం సానుభూతి కరువైంది. చివరకు వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఆమె పేరును తొలగించి, జ్ఞాపకాలు సైతం చెరిపేశారని కొందరు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిధుల గోల్మాల్లో పాత్రదారులెవరు! పొడిచన్పల్లి గ్రామ సమాఖ్య పరిధిలో కొంత కాలం నుంచి జరిగిన సుమారు రూ.85 లక్షల కుంభకోణం రెండు నెలల క్రితం బయట పడింది. ఇందులో వీఓఏ పద్మతో పాటు బ్యాంకు అధికారులు, సెర్ఫ్ ఉద్యోగులు, సహచరుల పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. కాగా తూతూ మంత్రంగా విచారణ జరిపిన అ«ధికారులు సీసీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నా యి. అయితే స్త్రీనిధి నుంచి నెలనెలా వస్తున్న రుణ రికవరీల డబ్బును కొంత మంది బ్యాంకు, సెర్ఫ్ అధికారులు వాడుకొని.. వాటిని చెల్లించడానికి డ్వాక్రా సంఘాల పేరిట సభ్యులకు తెలియకుండా రుణాలు తీసుకున్నారు. వాటిని పద్మ ద్వారా మళ్లించి, స్త్రీనిధికి జమ చేశారని పద్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నుంచి కూడా 18 చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేయించి పద్మను బలిచేశారని వాపోతున్నారు. అసలు డ్వాక్రా రుణాలు మొదట గ్రూపు ఖాతాలోకి, తర్వాత సభ్యుల బ్యాంకు ఖాతాలోకి వెళ్లాల్సి ఉండగా, అధికారుల ప్రమేయం లేకుండా పద్మ ఎలా కాజేస్తుందని ప్రశి్నస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నిధులు సైతం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి సంతకాలు లేకుండా ఆమె ఎలా మళ్లించుకుంటుందని అడుగుతున్నారు. పద్మ మరణానికి కారకులెవరు? డ్వాక్రా సంఘాల నిధుల గోల్మాల్లో ‘తిలా పాపం తలా పిడికెడు’అన్న చందంగా బ్యాంకు, సెర్ప్, తోటి ఉద్యోగుల పాత్ర ఉందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిధుల గోల్మాల్ బయట పడగానే అధికారులంతా పద్మను బాధ్యురాలిని చేస్తూ నిధుల రికవరీ కోసం ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. మరో వైపు కొంత మంది గ్రామస్తుల అవమానకర మాటలు, సంఘ సభ్యుల శాపనార్థాలు ఆమెను కుంగదీశాయని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర లేని డబ్బులు ఎలా చెల్లించాలనే ఆందోళన ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాయని అంటున్నారు.బాధ్యులను గుర్తించి శిక్షించాలిఅమ్మ చివరి కోరిక మేరకు డ్వాక్రా రుణాల గోల్మాల్పై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపండి. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోండి. మాకు అప్పులు తప్ప ఆస్తులు లేవు. మా అమ్మ అన్ని డబ్బులు తీసుకుంటే మా భూములు ఎందుకు అమ్ముకుంటాం. పెంకుటింట్లో ఎందుకు నివసిస్తాం. మేము చదివింది సర్కార్ బడిలోనే. మా అమ్మ చనిపోయి 5 రోజులు అయ్యింది. కనీసం చివరి కోరికకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. పోయిన మా అమ్మను తెచ్చి ఇవ్వకున్నా, పోయిన పరువును కూడగట్టుకోవాలని పరితపిస్తున్నాం. – నవీన్ రెడ్డి (మృతురాలి కొడుకు) -
రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు.. ఫ్యాక్టరీ ప్రమాదంపై మంత్రి వివేక్
పటాన్చెరు పారిశ్రామికవాడ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. షిఫ్ట్లో 150 మంది కార్మికులు ఉండగా.. ప్రమాదం జరిగిన బ్లాక్లోనే 90 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. మృతుల సంఖ్య 15కి చేరింది. కంపెనీ మేనేజర్ ఒకరు సైతం మృతి చెందినట్లు సమాచారం. 26 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో పలువురిపరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 9గం. సమయంలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు పడిపోయారు. ప్రమాద సమయంలో లోపల కార్మికులు చాలామందే ఉన్నారు. మంటల్లో.. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకునిపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. అలాగే అధికారులు సకాలంలో స్పందించి చుట్టపక్కల ప్రజలను ఖాళీ చేయించడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో.. సహాయక చర్యలపై మంత్రులు కీలక ప్రకటనలు చేస్తున్నారు.భవన శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులుశిథిలాలను తొగించిన కొద్దీ బయటపడుతున్న మృతదేహాలుగుర్తు పట్టరాని స్థితిలో మృతదేహాలుపాశమైలారంలోని ప్రమాద స్థలం నుంచి మరో రెండు మృత దేహాలు వెలికితీత15కి చేరిన మృతుల సంఖ్యమరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై వెలువడని అధికారిక ప్రకటనపరిశ్రమ వద్ద, ఆస్పత్రుల వద్ద కార్మికుల కుటుంబాల నిరీక్షణ.. రోదనలుఆచూకీ లభించక శోకసంద్రంలో కుటుంబాలుభారీ వర్షంలోనూ కొనసాగుతున్న సహాయక చర్యలురేపు సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డిరేపు ఉదయం పాశమైలారం ప్రమాద ఘటన స్థలానికి వెళ్లనున్న రేవంత్పాశమైలారం ఘటనపై సీఎం విచారంక్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరాప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశంగాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎంబాధాకరం: ప్రధాని మోదీ సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతిచాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరంతమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుక్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాంసీఎం రేవంత్ విచారంపాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై సీఎం రేవంత్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలిచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిపటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన రియాక్టర్ పేలుడుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతికార్మికులు చనిపోవడం అత్యంత విషాదకరంగాయపడిన వారిని రక్షించి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధ్యులను శిక్షించాలి 15 నిమిషాల్లో స్పందించాం: మంత్రి వివేక్ఘటన జరిగిన 15నిమిషాల్లో స్పందించాం. కలెక్టర్, జిల్లా యంత్రాగ సమన్వయంతో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వెంటనే 34మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం.. 12మంది ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. మొత్తం ఘటనలో12మంది చనిపోయారు. ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చర్మం, శరీరం తీవ్రంగా కాలిపోయాయి. హైడ్రా కూడా చేరుకుంది.. షాకిలాలను తీసివేస్తున్నారు. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది.. రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు. నిర్లక్ష్యం ఏంటి అనేది ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది. నిజంగా విచారణ జరిపి బాద్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం అని మంత్రి వివేక్ మీడియాకు తెలిపారు.ఎక్కడా నిర్లక్ష్యం లేదు: మంత్రి రాజనర్సింహసిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని.. సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు. సిగచి కంపెనీ ప్రమాదం బాధాకరం. ఉదయం 9గం.ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మూడు గంటల నుంచి ప్రమాద స్థలంలోనే ఉన్నాం. సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఎమర్జెన్సీ సిస్టం ద్వారా త్వరితగతిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాం. ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టల్ పౌడర్ ని తయారు చేస్తుంటారు. మార్నింగ్ 60మంది వర్కర్స్ పనిలో ఉన్నారు. జనరల్ వాళ్ళు 20మంది ఉన్నారు. ఆస్పత్రిలో 34మందికి చికిత్స అందుతోంది. 12 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశాం. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం వైద్యం అందిస్తుంది.. ఎక్కడ నిర్లక్ష్యం లేదు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తాం. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటాం. ప్రతి కార్మిక కుటుంబాన్ని అదుకుంటాం. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదు అని మంత్రి రాజనర్సింహ అన్నారు. ఇదీ చదవండి: ఫ్యాక్టరీ ప్రమాదం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే!👉ఐజీ సత్యనారాయణ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. రియాక్టర్ పేలడంతో ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన టైంలో.. షిఫ్ట్లో 150 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటిదాకా 8 మంది మరణించారు. మూడు ఆస్పత్రుల్లో 26 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉంది.. అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని తెలిపారు. 👉ప్రమాదం తర్వాత.. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ప్రమాదం గురించి తెలియగానే కలెక్టర్, ఐజీ, సంగారెడ్డి ఎస్పీ, అడిషనల్ కలెక్టర్.. అధికార యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 👉ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండడంతో అక్కడున్నవాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరూ రావొద్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు అక్కిడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా ఆంబులెన్స్లు చేరుకుని క్షతగాత్రుల్ని తరలిస్తున్నాయి. భారీ క్రేన్లు, కట్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా బృందం.. అడ్మిన్స్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. -
పద్మ చావుకు కారణమెవరు?
నిధుల గోల్మాల్లో పాత్రదారులెవరో.. ● దాదాపు రూ.85 లక్షల కుంభకోణం ● బయటకు రాని బ్యాంకుఅధికారుల లీలలు ● బలవుతున్న అమాయకులు పాపన్నపేట(మెదక్): ‘వీఓఏ ఉద్యోగం చివరకు నా ప్రాణం మీదకు తెచ్చింది. బ్యాంకు, సెర్ప్ అధికారులు, తోటి ఉద్యోగులు కలిసి నా చావుకు కారణమయ్యారు. నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని, నా ద్వారా డబ్బులు తీసుకున్నారు. చివరకు నన్ను దోషిగా నిలబెట్టారు. ఇంత జరిగినా ఇంకా చచ్చిపోలేదా? అన్నట్లు కొందరు నిలదీస్తుంటే ఎలా బతకాలి. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా. కలెక్టర్ గారు నా చావుకు కారణమైన వారిని మాత్రం వదలొద్దు. విచారణ జరిపి, నిందితులను గుర్తించి, నా ఆత్మకు శాంతి కలిగించండి’ అంటూ చివరిసారి లేఖ రాసి..ఉరి తాడుకు వేలాడింది.. పొడిచన్పల్లి వీఓఏ పద్మ. కానరాని అధికారులు పొడిచన్పల్లి వీఓఏ పద్మ ఆర్థిక నిందలు భరించలేక ఆత్యహత్య చేసుకొని 5 రోజులైంది. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని చివరి కోరిక కోరుతూ.. లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఇంత వరకు ఒక్క అధికారి కూడా కనీసం వారి ఇంటికి వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. 18 ఏళ్లు సేవ చేసినా కనీసం సానుభూతి కరువైంది. చివరకు వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఆమె పేరును తొలగించి, జ్ఞాపకాలు సైతం చెరిపేశారని కొందరు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిధుల గోల్మాల్లో పాత్రదారులెవరు! పొడిచన్పల్లి గ్రామ సమాఖ్య పరిధిలో కొంత కాలం నుంచి జరిగిన సుమారు రూ.85 లక్షల కుంభకోణం రెండు నెలల క్రితం బయట పడింది. ఇందులో వీఓఏ పద్మతో పాటు బ్యాంకు అధికారులు, సెర్ఫ్ ఉద్యోగులు, సహచరుల పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. కాగా తూతూ మంత్రంగా విచారణ జరిపిన అఽధికారులు సీసీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నా యి. అయితే సీ్త్రనిధి నుంచి నెలనెలా వస్తున్న రుణ రికవరీల డబ్బును కొంత మంది బ్యాంకు, సెర్ఫ్ అధికారులు వాడుకొని.. వాటిని చెల్లించడానికి డ్వాక్రా సంఘాల పేరిట సభ్యులకు తెలియకుండా రుణాలు తీసుకున్నారు. వాటిని పద్మ ద్వారా మళ్లించి, సీ్త్రనిధికి జమ చేశారని పద్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నుంచి కూడా 18 చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేయించి పద్మను బలిచేశారని వాపోతున్నారు. అసలు డ్వాక్రా రుణాలు మొదట గ్రూపు ఖాతాలోకి, తర్వాత సభ్యుల బ్యాంకు ఖాతాలోకి వెళ్లాల్సి ఉండగా, అధికారుల ప్రమేయం లేకుండా పద్మ ఎలా కాజేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నిధులు సైతం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి సంతకాలు లేకుండా ఆమె ఎలా మళ్లించుకుంటుందని అడుగుతున్నారు. పద్మ మరణానికి కారకులెవరు? డ్వాక్రా సంఘాల నిధుల గోల్మాల్లో ‘తిలా పాపం తలా పిడికెడు’అన్న చందంగా బ్యాంకు, సెర్ప్, తోటి ఉద్యోగుల పాత్ర ఉందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిధుల గోల్మాల్ బయట పడగానే అధికారులంతా పద్మను బాధ్యురాలిని చేస్తూ నిధుల రికవరీ కోసం ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. మరో వైపు కొంత మంది గ్రామస్తుల అవమానకర మాటలు, సంఘ సభ్యుల శాపనార్థాలు ఆమెను కుంగదీశాయని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర లేని డబ్బులు ఎలా చెల్లించాలనే ఆందోళన ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాయని అంటున్నారు. బాఽధ్యులను గుర్తించి శిక్షించాలి అమ్మ చివరి కోరిక మేరకు డ్వాక్రా రుణాల గోల్మాల్పై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపండి. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోండి. మాకు అప్పులు తప్ప ఆస్తులు లేవు. మా అమ్మ అన్ని డబ్బులు తీసుకుంటే మా భూములు ఎందుకు అమ్ముకుంటాం. పెంకుటింట్లో ఎందుకు నివసిస్తాం. మేము చదివింది సర్కార్ బడిలోనే. మా అమ్మ చనిపోయి 5 రోజులు అయ్యింది. కనీసం చివరి కోరికకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. పోయిన మా అమ్మను తెచ్చి ఇవ్వకున్నా, పోయిన పరువును కూడగట్టుకోవాలని పరితపిస్తున్నాం. – నవీన్ రెడ్డి (మృతురాలి కొడుకు) -
కాలేజీకి రోడ్డు నిర్మించరూ?
నెలలు గడిచినా పూర్తి కాని పనులుహుస్నాబాద్రూరల్: హుస్నాబాద్కు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు కావడం ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాలేజీ తరగతులను ఇప్పుడు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ప్రారంభించనున్నారు. 2017లో ప్రారంభమైన పాలిటెక్నిక్కు 2023 ఎన్నికల ముందు డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.90లక్షలను కలెక్టర్ మంజూరు చేసి టెండర్లు పిలిచారు. కానీ నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం మారడంతో రోడ్డు మంజూరు పనులు మళ్లీ మొదటికీ వచ్చాయి. కాలేజీ ప్రిన్సిపాల్ విజ్ఞప్తి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు కాలేజీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ఈజీఎస్లో రూ.50లక్షల నిధులు మంజూరు చేయించారు. మార్చిలో కాలేజీ ముందు రెండు ట్రిప్పర్ల కంకర పోసిన కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. పాలిటెక్నిక్ అడ్మిషన్లు, ఇంజినీరింగ్ అడ్మిషన్లు జరుగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరగనుంది. కాలేజీ వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, లెక్చరర్లు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ ప్రజాప్రతినిధికి బంధువు కావడంతో అధికారులు పనులు చేయాలని అడగడానికి వెనుకడుగు వేస్తున్నారు. -
కారు బోల్తా.. బాలిక మృతి
పాపన్నపేట(మెదక్): కారు బోల్తాపడి బాలిక మృతి చెందింది. ఈ ఘటన ఏడుపాయల ఆలయ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం... హైదరాబాద్కు చెందిన కొత్తూరి ప్రతిమ (17)ఇంటర్ పూర్తి చేసింది. కొంత కాలంగా నగరంలోని ఫతేనగర్ ప్రాంతానికి చెందిన గొల్ల చింటూ (17) ప్రతిమను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఈ విషయంలో ఇదివరకు రెండు , మూడు సార్లు ప్రతిమ కుటుంబీకులు అతన్ని మందలించారు. అయినా అతని తీరు మారలేదు. ఈ క్రమంలో శనివారం ప్రతిమ ఇంట్లో చెప్పకుండా చింటూతో వెళ్లింది. అతని స్నేహితులు మనోహర్, శివకుమార్తో కలిసి నలుగురు ఇన్నోవా కారులో ఏడుపాయలకు వచ్చారు. చింటూ కారు నడుపుతుండగా, ప్రతిమ, మనోహర్, శివకుమార్ వెనుక కూర్చున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భోజనం చేయడానికి పోతంషెట్పల్లి వైపు వెళ్తుండగా, ఏడుపాయల బస్టాండ్ సమీపంలో అతివేగంగా వెళ్తూ, కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. అటుగా వెళ్లినవారు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ప్రతిమ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చింటూ, మనోహర్, శివకుమార్లకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా తమ కూతురి చావుకు చింటూనే కారణమని మృతురాలి తండ్రి అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిమ మృతదేహం -
భవనం పైనుంచిపడి మేరిస్తీ మృతి
శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కింద పడి తాపీ మేరిస్తీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మాసాయిపేటకు చెందిన కండ్లకోయ ఆనంద్(22) తాపీ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని శభాష్పల్లి గ్రామంలో శనివారం భవన నిర్మాణ పనులు చేస్తుండగా కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతిచెందాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుకర్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి శివ్వంపేట(నర్సాపూర్): చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని మగ్దుంపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రశాంత్ ఆదివారం తెల్లవారుజామున ఇండ్ల ముందు నల్లాలకు బిగించిన మోటార్లతో పాటు కేబుల్ వైర్ల చోరీకి పాల్పడుతుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధరిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ దగ్ధం చిన్నశంకరంపేట(మెదక్): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైన ఘటన మండలంలోని ధరిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ఈదురుగాలులు వీచడంతో పాటు స్వల్ప వర్షం మొదలైన కొద్దిసేపటికే ట్రాన్స్ఫార్మర్లో మంటలు ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు. సమీప నివాస గృహాల్లోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు అప్రమత్తమై వెంటనే విద్యుత్ సబ్స్టేషన్కు సమాచారం అందించడంలో సరాఫరాను నిలిపివేశారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయంపై ట్రాన్స్కో ఏఈ దినకర్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైందని, సరఫరాకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాయీ బ్రాహ్మణులు సంఘటితం కావాలి సంగారెడ్డి: నాయీ బ్రాహ్మణులు సంఘటితమై ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని భారతీయ విద్యా మందిర్ స్కూలులో నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన కాలం నుంచి అందరికీ ఆరోగ్యం, సౌందర్యాన్ని అందించిన ఘనత నాయీ బ్రాహ్మణులకు దక్కుతుందని గుర్తు చేశారు. అనంతరం నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో విషయ పరిజ్ఞానం కలిగినవాడు నాయీ బ్రాహ్మణుడని అన్నారు. సుకుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు నాగభూషణం, దత్తాత్రి, సత్యం, రాజారాం, కిరణ్, నర్సిహులు, రామ్ కిషన్, పట్టణ అధ్యక్షుడు మాణిక్ ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, కార్యదర్శి శ్రీశైలం, యువత కార్య దర్శి రాము, ఉపాధ్యక్షులు అనిల్ పాల్గొన్నారు. -
శంకుస్థాపన ఘనం.. పనులు శూన్యం
పనులు ప్రారంభించాలి డబుల్ రోడ్డు విస్తరణ పనులు త్వరగా ప్రారంభించాలి. కొమురవెల్లి దేవస్థానానికి ఈ రోడ్డు మార్గంలోనే వెళ్తుంటారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు వెళ్లడంతో రద్దీగా ఉంటుంది. సింగిల్ రోడ్డు కావడంతో రాత్రి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు దృష్టి సారించి పనులు వెంటనే చేపట్టాలి. – లింగాల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ, రామవరం గ్రామం త్వరలో ప్రారంభిస్తాం హుస్నాబాద్ మీదుగా రామవరం గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తాం. ఇటీవల కాంట్రాక్టర్తో కూడా మాట్లాడినం. పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించాం. ఐదారు రోజుల్లో రోడ్డు విస్తరణ పనులు చేపడతాం. – రాహుల్, ఏఈ ఆర్అండ్బీ అక్కన్నపేట(హుస్నాబాద్): రోజురోజుకు వాహనాల సంఖ్య పెరగడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు సింగిల్ రోడ్లు మాత్రమే ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తా నుంచి గౌరవెల్లి మీదుగా రామవరం గ్రామం వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జనవరిలో రామవరంలో శంకుస్థాపన చేశారు. ఈ డబుల్ రోడ్డు నిర్మాణానికి సుమారుగా రూ.25కోట్ల నిధులు మంజూరు చేశారు. కాగా శంకుస్థాపన చేసి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. అయితే హుస్నాబాద్ నుంచి రామవరం వరకు సుమారుగా 17కిలో మీటర్లు ఉంటుంది. కొమురవెల్లి దేవస్థానానికి దారి హుస్నాబాద్ మీదుగా గౌరవెల్లి గ్రామం నుంచి కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి రోజు వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. సింగిల్ రోడ్డు మాత్రమే ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలను పక్కకు తప్పించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గౌరవెల్లి గ్రామం రోడ్డంతా గుంతలమయంగా ఉంది. ఈ ఒక్క ఊరు దాటడానికే దాదాపు 20నిమిషాల సమయం పడుతుందని వాహనదారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి త్వరగా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. హుస్నాబాద్– రామవరం డబుల్ రోడ్డుకు మోక్షమెప్పుడో రూ.25కోట్లు నిధులు మంజూరు కన్నెత్తి చూడనీ అధికారులు -
అడవి కాకర అధరహో
కిలో రూ.350 పలుకుతున్న వైనం మెదక్ కలెక్టరేట్: ఎన్నో ఔషధ గుణాలున్న అడవి కాకరకాయ ధరలు ప్రస్తుతం మార్కెట్లో అదరహో అనే స్థాయిలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న ధరను చూసి ప్రజలు అదిరిపోతున్నారు. మార్కెట్లో అప్పుడప్పుడు కనిపించే అడవి కాకరకాయలు చాలామందికి తెలియదు. రేటు ఎక్కువైతేనేం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాంటి కాకర ప్రస్తుతం మెదక్ మార్కెట్లో కిలో రూ.350 ధర పలుకుతోంది. దీంతో వాటిని కొనాలని ఆశ ఉన్నప్పటికీ చాలా మంది కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇవి అటవీ ప్రాంతంలోనే పండుతాయి. కాబట్టే వీటికి అంత రేటు. ఆరోగ్యాన్నే కాదు మంచి రుచిని కలిగి ఉంటుంది. వీటిని అన్ని వయసుల వారు తినొచ్చు. వర్షాకాలంలో తింటే మరీ మంచిదని పెద్దలు చెబుతారు. వర్షాకాలంలో మొదలయ్యే జలుబు, దగ్గు, తుమ్ముల నుంచి రక్షిస్తుంది. కాకరతో బహుళప్రయోజనాలు ఉన్నాయి. -
భూ తగాదాలో స్నేహితుడి హత్య
కల్హేర్(నారాయణఖేడ్): భూ తగాదాలో స్నేహితుడు దారుణ హత్యకు గురయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ హన్మండ్లు, కుర్మ రమేష్ కుటుంబీకుల మధ్య దారి విషయంలో భూ తగాదా జరుగుతోంది. కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. భూ తగాదా విషయమై గ్రామంలో ఆదివారం ఉదయం పంచాయతీ జరిగింది. పంచాయతీలో సమస్య పరిష్కారం కాలేదు. మధ్యాహ్నం కుర్మ రమేష్, కర్పట్ల జైపాల్ కలిసి వ్యవసాయ భూమికి వెళ్లారు. రమేష్కు జైపాల్ సహకరిస్తున్నాడని ఇద్దరిని అంతం చేయాలని కుర్మ హన్మండ్లు కుటుంబీకులు పథకం రచించారు. అప్పటికే ఇద్దరి రాక కోసం మార్గమధ్యలో వేచిచేస్తున్నారు. ఇరువురి మధ్య మాటలతో గొడవ మొదలైంది. గొడ్డలి, మరణాయుధాలతో వారిద్దరిపై దాడి చేయగా దాడిలో జైపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. రమేష్కు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని కంగ్టీ సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఐలు వెంకట్రెడ్డి, దుర్గ రెడ్డి, వెంకటేశం పరిశీలించారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. మృతుడు జైపాల్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మరొకరికి తీవ్ర గాయాలు సంగారెడ్డి జిల్లాలో ఘటన -
నారాయణఖేడ్ కోసం ఎంపీ, ఎమ్మెల్యే ప్రయత్నాలు
మారుమూల ఖేడ్ నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే మారుమూల పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి దామోదరలను సైతం కలిసి ఖేడ్లో ఏర్పాటు చేయాలని కోరారు. కాగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరిని కలిసి జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం మారుమూలన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఖేడ్లో ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కోరారు. అందుకు అనువైన స్థలం కూడా ఉన్నట్లు వివరించారు. అందుకు మంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ వెల్లడించారు. ఖేడ్ ఆర్డీఓ అశోక చక్రవర్తి, రెవెన్యూ అధికారులు ఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్– బాచేపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. నవోదయ పాఠశాల ఏర్పాటుకు ఈ భూమి అనుకూలంగా ఉన్నట్లు అధికారులు నివేదిక సమర్పించారు. -
ఆర్ఆర్తో ట్రాఫిక్ సమస్యలు దూరం
రింగ్ రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: ఖేడ్ పట్టణం చుట్టూ లింకురోడ్లను కలుపుతూ నిర్మిస్తున్న రింగురోడ్డుతో ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారంశంకర్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్రెడ్డి, మాజీ ఎంపీటీసీ పండరీరెడ్డి, అవుటి శంకర్, జానీపటేల్లతో కలిసి రింగురోడ్డు పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని రహదారిని విస్తరించడంతోపాటు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. పట్టణం చుట్టూ రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు పట్టణం విస్తీర్ణం కూడా పెరిగనుందన్నారు. పేదల సంక్షేమానికి కృషి ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషిచేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. నాయకులు కృష్ణ, దుర్గయ్య, తుకారాం, రాజేందర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 94901 29839 నంబర్ సంప్రదించాలని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘తపస్’ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోట సుధాకర్జహీరాబాద్ టౌన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోట సుధాకర్ నియమితులయ్యారు. తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ ఆదివారం జహీరాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా తపస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోట సుధాకర్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తపస్ జిల్లా కార్యదర్శిగా నియమించడం పట్ల సుధాకర్ రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ రఘునందన్రావుకు ఎమ్మెల్యే గూడెం పరామర్శపటాన్ చెరు టౌన్: ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావును ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పరామర్శించారు. సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో ఎంపీ రఘునందన్రావును ఆదివారం పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి కృపతో త్వరితగతిన కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. ఉచిత వైద్య శిబిరానికి స్పందన భేష్న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని మెటల్కుంట గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. జహీరాబాద్లోని ప్రగతి నర్సింగ్హోమ్, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) వారి ఆధ్వర్యంలో మెడ్ బ్రిడ్జి స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామంతోపాటు ఇతర గ్రామాలకు చెందిన రోగులు తరలి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. 250 మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించిన వైద్యు లు వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. శిబిరానికి జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి హాజరై మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల రోగులకు ప్రయోజనం కలుగుతుందన్నా రు. ఈ సందర్భంగా వారికి డీడీఎస్ సభ్యులు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో విక్రమ్ ఆదిత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా
కార్యకర్త సురేశ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దామోదర వట్పల్లి(అందోల్): కాంగ్రెస్ కార్యకర్త తలారి సురేశ్ మరణం అతని కుటుంబానికే కాదు.. పార్టీకే తీరని లోటని, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ అన్నారు. మండల పరిధిలోని మేడికుందా గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు తలారి సురేశ్ అనారోగ్యానికి గురై శనివారం మృతి చెందాడు. విషయం తెలిసిన మంత్రి ఆదివారం మృతుని ఇంటికి వెళ్లి సురేశ్ మృతిపట్ల నివాళులర్పించి మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుని తల్లిదండ్రులు, భార్య పిల్లలను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
మెరుగుబడినాయ్..
‘మన్ కీ బాత్’ వీక్షించిన మాజీ ఎంపీ బీబీపాటిల్ బీజేపీతోనే అభివృద్ధి రామచంద్రాపురం(పటాన్చెరు): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలో ఆదివారం ప్రధాని మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలసి ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పడు ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రెడ్డి, మల్లేశ్, కిష్టన్న, లక్ష్మణ్గౌడ్, కృష్ణమూర్తి, శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.జహీరాబాద్ టౌన్: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ. బీబీపాటిల్ పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. జహీరాబాద్ పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో 200 బూత్ లో ‘మన్ కీ బాత్’ను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన్ కీ బాత్’ద్వారా ప్రధా ని మోదీ అనేక విషయాలను ప్రజల్లోకి తీసు కెళ్లుతున్నారని చెప్పారు. మహిళా శక్తికి మోదీ కితాబు నారాయణఖేడ్: ‘మన్ కీబాత్’ కార్యక్రమంలో తెలంగాణ మహిళా శక్తికి ప్రధాని మోదీ ప్రత్యేక కితాబునిచ్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జన్వాడే సంగప్ప తెలిపారు. ‘మన్కీ బాత్’123వ ఎపిసోడ్ను ఖేడ్లో ఆయన కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలంలో మహిళాగ్రూపు మిల్లెట్ బిస్కెట్ల తయారీ గురించి ప్రస్తావించారన్నారు. -
‘నవోదయ’ం ఎక్కడ?
● మూడు ప్రాంతాల్లో స్థలాలు పరిశీలన ● నివేదికలు సమర్పించిన అధికారులు ● ఫైనల్ చేయనున్న జేఎన్వీ ● తాత్కాలికంగా విద్యా సంవత్సరం ప్రారంభం నారాయణఖేడ్: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జవహార్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీ) మంజూరు చేసింది. రాష్ట్రానికి 9 కొత్త విద్యాలయాలను గతేడాది మంజూరు చేయగా అందులో సంగారెడ్డి జిల్లాకు ఒక విద్యాలయాన్ని కేటాయించారు. జిల్లాకు కేటాయించిన విద్యాలయం ఏర్పాటు విషయంలో ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలో అంటే తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో తమ తమ ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మారుమూల ప్రాంత విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు కేటాయించిన విద్యాలయం మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని విద్యాభిమానులు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. అందోల్ కోసం మంత్రి.. పటన్చెరు కోసం ఎంపీ ఆందోల్ నియోజకవర్గంలో నవోదయ ఏర్పాటు చేయాలన్న పట్టుతో మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఆందోల్ శివారులో 20 ఎకరాల స్థలాన్ని సైతం అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించారు. తన నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో మంత్రి ఉన్నారు. కాగా మెదక్ ఎంపీ రఘునందన్రావు పటాన్చెరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలన్న యోచనతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దల ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటుకు యత్నిస్తున్నారు. కాగా, అక్కడ కూడా అధికారులు స్థలాలను పరిశీలించారు. అమీన్పూర్ ప్రాంతంలో తగినంత స్థలం అందుబాటులో లేదని అధికారులు గుర్తించారు. జేఎన్టీయూలో తరగతులు.. రాష్ట్రానికి మంజూరైన నవోదయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. జూలై 14 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రణాళిక తయారు చేస్తున్నారు. జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం తరగతులను తాత్కాలికంగా ఆందోల్లోని జేఎన్టీయూలో ఏర్పాటు చేశారు. వచ్చేనెల రెండు లేదా మూడో వారంలో తరగతులను ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు పరిశీలించి గదులను సిద్ధం చేశారు. నిజాంపేట్– బాచేపల్లి మార్గంలో స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ, రెవెన్యూ అధికారులుతరగతులు ప్రారంభం.. జూలై రెండు లేదా మూడో వారంలో తరగతులు ప్రారంభిస్తున్నాం. ఆందోల్లోని జేఎన్టీయూలో తాత్కాలికంగా నవోదయ ఏర్పాటుకు భవనాలను పరిశీలించాం. ఈ విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రారంభం అవుతుంది. నవోదయ ఎక్కడ నిర్మించాలనే అంశం జేఎన్వీ (జనవహార్ నవోదయ విద్యాలయం) బృందం నిర్ణయించాల్సి ఉంటుంది. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి,సంగారెడ్డి -
గంగమ్మకు ప్రత్యేక పూజలు
మునిపల్లి(అందోల్): వర్షాలు పడాలని సింగూర్ ప్రాజెక్టు సమీపంలో గ్రామస్తులంతా కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మండలంలోని బుస్సారెడ్డిపల్లి గ్రామస్తులు వర్షాలు పడాలని గ్రామంలో ఆయా దేవాలయాల్లో దేవతలకు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు పెట్టారు. పంటలు మొలకెత్తి రోజులు గడుస్తున్నా వర్షాలు పడక పోవడంతో రైతులు ఆందోళన చెందిన గ్రామంలో దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. గంగమ్మకు నైవేద్యం పెట్టి గ్రామస్తులంతా అక్కడే భోజనం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. వానలు కురిపించు బీరప్పా! నారాయణఖేడ్: వర్షాలు కురియాలని కోరుకుంటూ ఖేడ్ మండలం రుద్రారం గ్రామ రైతులు ఆదివారం బీరప్పదేవుడి పండగను ఘనంగా నిర్వహించారు. భజనలతో గ్రామం నుంచి గ్రామ శివారులోని బీరప్ప ఆలయానికి వెళ్లి స్వామి వారికి ప్రత్యేకపూజలు చేశారు. అన్నప్రసాద వితరణ చేపట్టారు. వివిధ పార్టీల గ్రామనాయకులు ప్రభాకర్, శ్రీకాంత్రెడ్డి, సిందోల్ దశరథ్, రైతులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమాజంలో దోపిడీ అణచివేత పోవాలన్నా, సమసమాజం రావాలన్నా అది కేవలం మార్కిస్ట్ సిద్ధాంతంతోనే సాధ్యమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య స్పష్టం చేశారు. సంగారెడ్డిలో ఆదివారం కేవల్కిషన్ భవన్లో సీపీఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ...సమాజంలో సామాజిక అసమానతలు, మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాల పేరిట, మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజ య్య, మల్లేశం, మాణిక్ తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి : ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ఇంటర్న్షి ప్ చేస్తున్న వైద్య విద్యార్థులతోపాటు పీజీ వైద్యవిద్య అభ్యసిస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్న్షి ప్ విద్యార్థులతోపాటు పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టైపెండ్ను 15 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జీవో 90ను విడుదల చేసూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్వర్వులిచ్చారు. మరోవైపు పెంచిన స్టైపెండ్స్ను ఇకపై ప్రతి నెలా 10వ తేదీన చెల్లించాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. ఈ మేరకు సంవత్సరానికి సరిపడా స్టైపెండ్స్ చెల్లించేందుకు అవసరమైన బీఆర్వోను (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) అధికారులు విడుదల చేశారు. పెండింగ్ స్టైపెండ్ బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. పెరగనున్న స్టైపెండ్ ప్రస్తుతం హౌస్సర్జన్ (మెడికల్, డెంటల్)కు ప్రతినెలా రూ.25,906 స్టైపెండ్ ఉండగా, ఇక నుంచి ప్రతినెలా రూ.29,792 అందనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.58,289 ఉండగా, ఇక నుంచి రూ.67,032, సెకండ్ ఇయర్లో రూ.61,528 ఉండగా, ఇక నుంచి రూ.70,757, ఫైనల్ ఇయర్లో రూ.64,767 ఉండగా, ఇప్పటి నుంచి రూ. 74,482 స్టైపెండ్ ఆయా మెడికోలకు అందనున్నది. పీజీ డిప్లమో విద్యార్థులకు ఫస్ట్ ఇయర్లో రూ.58,289 ఉండగా, ఇక నుంచి రూ.67,032 స్టైపెండ్ రానున్నది. సెకండ్ ఇయర్లో రూ.61,528 ఉండగా, ఇక నుంచి రూ. 70,757 చొప్పున స్టైపెండ్ రానున్నది. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు రూ.లక్ష పైనే.. మరోవైపు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.92575 ఉండగా, అది రూ. 1,06,461కి పెరిగింది. సెకండ్ ఇయర్లో రూ. 97,204 ఉండగా, ఇక నుంచి రూ.1,11,785 అందనుంది. థర్డ్ ఇయర్లో రూ.1,01,829 ఉండగా, ఇక నుంచి రూ, 1,17,103కి చేరనున్నది. ఎండీఎస్ ఫస్ట్ ఇయర్లో రూ.58,289 ఉండగా, ఇక నుంచి రూ. 67,032 ఇవ్వనున్నారు.సెకండ్ ఇయర్లో రూ. 61,528 ఉండగా, ఇక నుంచి రూ, 70,757, థర్డ్ ఇయర్లో రూ.64,767 ఉండగా, ఇక నుంచి రూ.74,482కి పెరగనున్నది. సీనియర్ రెసిడెంట్స్కు రూ.92,575 ఇక నుంచి రూ.1,06,461 చేరనున్నది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని విద్యార్థులు తమకు కనీస స్టైపెండ్ కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల వద్ద ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. జూడాలతో చర్చలు సఫలంజూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సంగారెడ్డిలోని తన నివాసానికి జూడాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రి సుదీర్ఘంగా చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించారు. జూడాల డిమాండ్లను దశల వారీగా నెరవేరుస్తామని మంత్రి స్పష్టం చేయడంతో వారు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జూడాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, జూడాల రాష్ట్ర అధ్యక్షుడు ఐజాక్ న్యూటన్, డాక్టర్లు కీర్తన ,గిరిప్రసాద్, సందీప్, అవినాశ్ పాల్గొన్నారు. -
ప్రణాళిక పనులు పక్కాగా సాగాలి
పట్టణ ప్రణాళిక పనులను ప్రారంభిస్తున్న నిర్మలారెడ్డి సంగారెడ్డి: పట్టణంలో వంద రోజుల ప్రణాళిక పనులు పక్కాగా జరగాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 32వ వార్డులో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంతకిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్, 32వ వార్డు ఇన్చార్జి సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సంతోష్, మాజీ కౌన్సిలర్ రామప్ప, అధికారులు పాల్గొన్నారు.టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి -
● రెవెన్యూ సదస్సుల్లో వచ్చినఅర్జీల్లో ఇవే అధికం ● ఆయా సర్వే నంబర్లోనిపట్టాదారులకు నోటీసులు ● భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూశాఖ కసరత్తు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భూభారతి అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులే అధికంగా ఉన్నాయి. మూడో వంతు అర్జీలు ఈ కేటగిరికి చెందినవే ఉన్నాయి. వీటి పరిష్కారం రెవెన్యూశాఖకు సవాల్గా మారింది. టీఎం–33 మాడ్యుల్ కింద వీటిని పరిష్కరించేందుకు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ దరఖాస్తులను పరిష్కరించాలంటే ముందుగా ఆయా సర్వే నంబర్లో ఇతర పట్టాదారులకు నోటీసులు జారీ చేయాలి. ఆయా నంబర్లలలో గల్లంతైన భూమిని వెతకాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్లి పంచనామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలంటే తగిన సిబ్బంది అవసరం. అయితే చాలా మండలాల్లో రెవెన్యూ సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీఆర్ఓలను ప్రభుత్వం తిరిగి రెవెన్యూశాఖకు పంపాలని నిర్ణయించినప్పటికీ.. వారు ఇంకా పూర్తిస్థాయిలో రెవెన్యూశాఖకు రాలేదు. దీంతో ఉన్న సిబ్బందితోనే ఈ పక్రియను నిర్వహించాల్సి వస్తోంది. మూడో వంతు ఇవే.. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పక్షం రోజుల క్రితం వరకు గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. జిల్లాలో మొత్తం 596 గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో రైతుల నుంచి 16,036 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్కు సంబంధించిన దరఖాస్తులే 5,324 రావడం గమనార్హం. అంటే వచ్చిన దరఖాస్తుల్లో 33 శాతం మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించినవే ఉన్నాయి. వీటి తర్వాత భూములకు వారసత్వ హక్కులు కల్పించాలని వచ్చిన అర్జీలు అధికంగా ఉన్నాయి. ఇలా సక్సేషన్ కోసం 1,412 దరఖాస్తులు రాగా, మ్యూటేషన్ల కోసం మరో 1,485 దరఖాస్తులు వచ్చాయి. నిషేధిత భూముల జాబితాల్లోంచి తమ భూమిని తొలగించాలని కోరుతూ వచ్చిన వినతులు 1,180 ఉండగా, అసైన్డ్ భూములకు సంబంధించినవి 767, మరో 2,290 దరఖాస్తులు సాదాబైనామాలు.. ఇలా అన్నిరకాల దరఖాస్తులు ఉన్నాయి. పోర్టల్లో నమోదు.. వచ్చిన దరఖాస్తులను భూభారతి పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఆయా తహసీల్దార్లకు ఇచ్చిన ప్రత్యేక లాగిన్లో ఈ దరఖాస్తులను ఉంచుతున్నారు. ఈ ఆన్లైన్ ప్రక్రియ కొంత ప్రహాసనంగా సాగుతోంది. ఒక్కో దరఖాస్తుకు సుమారు 20 నిమిషాలు పడుతోందని, సర్వర్ స్లోగా ఉంటే మరింత టైం పడుతోందని రెవెన్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. అర్జీల పరిష్కారంపై దృష్టి భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ నమోదు పూర్తయిన మండలాల్లో ఆయా అర్జీల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. డాక్యుమెంట్లను పరిశీలించి సంబంధిత పట్టాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సైతం చేపడుతున్నారు. -
ఫైర్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
రీజినల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్రావు రామాయంపేట(మెదక్): తూప్రాన్, మేడ్చల్లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని అగ్నిమాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్రావు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఫైర్స్టేషన్ను తనిఖీ చేసి జిల్లా అధికారి వెంకటేశ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన పరిధిలో 19 జిల్లాల్లో సుమారుగా 70 అగ్నిమాపక కేంద్రాలున్నాయన్నారు. ఒక్కో కేంద్రంలో 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల విషయమై తమ సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. కొత్తగా మహదేవ్పూర్, కేసముద్రం పట్ట ణాలకు అగ్నిమాపక కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. మేడ్చల్ నుంచి నిజామాబాద్ వరకు జాతీ య రహదారిపై ఎక్కడా ఫైర్స్టేషన్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయ న్నారు. అంతకుముందు ఫైర్ పరికరాలను పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు. -
నేడు జాబ్మేళా
నర్సాపూర్: పట్టణంలోని సాయికృష్ణ ఫంక్షన్హాల్లో ఆదివారం జాబ్మేళా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో జాబ్మేళా ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించామన్నారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాకు వస్తారని, 1,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. మొక్కలు నాటి సంరక్షించండి సంగారెడ్డిటౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి దేవిలాల్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఓ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీశాఖ అధికారి వేణుగోపాల్, పాఠశాల సిబ్బంది వేణు పాల్గొన్నారు. బేస్లైన్ టెస్టులు నిర్వహించాలి జహీరాబాద్ టౌన్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పరిక్షించేందుకు బేస్లైన్ టెస్టులు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం మండలంలోని హుగ్గెల్లి జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలా బోధించాలి.. వారు ఏమి నేర్చుకోవాలనే దాని గురించి ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, టీచింగ్ డైరీ, యూనిట్ ప్లాన్ రాయాలని సూచించారు. ఐఎఫ్పీ ప్యానె ల్లను వాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక పాఠశాల కిచెన్, టాయిలెట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ మాణయ్య ఉన్నారు. పింఛన్ల మంజూరుకు చర్యలు నర్సాపూర్: అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి హేమలత చెప్పారు. శని వారం ఆమె పట్టణంలోని విజన్ వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వృద్ధులను అప్యాయంగా పలకరించారు. ఏమైనా ఇబ్బందులుంటే చెప్పాలని కోరారు. దీంతో పలువురు తమకు పింఛన్ రావడం లేదని, ఇప్పించాలని కోరారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వృద్ధులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విద్యుత్ స్తంభాలనుపునరుద్ధరించాలి హవేళిఘణాపూర్(మెదక్): కొన్ని రోజుల క్రితం ఈదురుగాలులతో కిందపడిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేసి రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా చేసే విధంగా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని స్కూల్ తండా శివారులో పడిపోయిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ అధికారులు స్పందించి సకాలంలో చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల సాయిలు, మాజీ సర్పంచ్ యశోద, వార్డు సభ్యులు రవి, సాయిలు, యామిరెడ్డి, దాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ ప్లాంట్లతో మహిళా సాధికారత
నర్సాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాల ప్రతినిధులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గ్రామీ ణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు తెలిపారు. పలుశాఖల అధికారులతో కలిసి నర్సాపూర్లోని దేవాదాయశాఖకు చెందిన భూములను శనివారం పరిశీలించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సబ్స్టేషన్కు పవర్ సరఫరా, తదతర అంశాల గురించి ఆరా తీశారు. స్థానికంగా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ను నాలుగు గ్రామాల మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారని చెప్పారు. కాగా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆయన వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు, నాబార్డు ఏజీఎం రామారావు, కన్సల్టెంట్ రామకృష్ణ, తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ సంస్థ అధికారి రవీందర్ చౌహాన్, ఏడీఈ రమణారెడ్డి, దేవాదాయ ఈఓ శ్రీనివాస్, ఏపీఎం గౌరిశంకర్, ఏపీఓ అంజిరెడ్డి, సర్వేయర్ అభిలాష్ తదితరులు ఉన్నారు.సెర్ప్ చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు -
తాగునీటి సమస్య తలెత్తొద్దు
కలెక్టర్ ప్రావీణ్యసంగారెడ్డి జోన్: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధి కారులకు సూచించారు. శనివారం క్యాంపు కార్యా లయంలో మంజీరా బ్యారేజీ, సింగూర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్కు సరఫరా అవుతున్న తాగునీటి వివరాలను, మంజీరా బ్యారేజ్ పరిస్థితి, నారింజ వాగు, సింగూర్ పరివాహాక ప్రాంతం వివరాలు, నూతనంగా చేపట్టిన చెరువులు, కుంటల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఝరాసంఘం, న్యాల్కల్ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని గురుకుల సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని లీకేజీలకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మిషన్ భగీరథ డీఈ రఘువీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఖేడ్లో నవోదయ ఏర్పాటుకు కృషి
ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల మిత్ర సోషల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆందోల్ నవోదయ విద్యాలయం కోసం మంత్రి దామోదర, తన నియోజకవర్గంలో ఏర్పాటుకు ఎంపీ రఘునందన్రావు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. అయినా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. తామూ ఈ పాఠశాలలోనే చదువుకున్నామని, పాఠశాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను సమీకరిస్తామన్నారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించారు. రూ.40 లక్షలతో అవసరమైన పరికరాలున్న కొత్త అంబులెన్స్ను సమకూరుస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. వెద్యుల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. కోటి మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ సంగారెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్ని హంగులతో కోర్టు భవనం
జిన్నారం(పటాన్చెరు): మండల కేంద్రంలోని కోర్టు భవనాన్ని జిల్లా జడ్జి భవానిచంద్ర శనివారం పరిశీలించారు. నూతనంగా నిర్మించిన భవనంలో వసతులపై ఆరా తీశారు. వినియోగదారుల కోసం ప్రత్యేక శౌచాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఛాంబర్ హాల్లో ఫర్నీచర్, టేబుల్స్ వివిధ వసతులు ఏర్పాటుకు పలు సూచనలు చేశారు. కోర్టు భవనానికి కావాల్సిన అన్ని హంగులు, వసతులు పూర్తిచేసిన అనంతరం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్గౌడ్, నర్సాపూర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, తహసీల్దార్ దేవదాస్, సీఐ నయిమొద్దీన్, ఎస్ఐ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై అనాసక్తి
● ముందుకు రాని లబ్ధిదారులు ● జిల్లాకు 14,518 ఇళ్లు మంజూరు ● ప్రారంభించినవి 5,023 మాత్రమే.. వారంలో 50 శాతం ప్రారంభిస్తాం మరో వారం రోజుల్లో 50 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నాం. లబ్ధిదారులకు వెంట వెంటనే బిల్లులు చెల్లిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో బేస్మెంట్ వరకు పూర్తయిన 286 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున బిల్లులు అందించాం. గ్రామాల్లో అధికారులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది ఆషాడం అని ముందుకు రావడం లేదు. – చలపతిరావు, గృహ నిర్మాణ శాఖ పీడీహత్నూర(సంగారెడ్డి): ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకురావడం లేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆసక్తి చూపడం లేదు. జిల్లాకు 14,518 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం 5,023 మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. 286 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తి కావడంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు రూ. లక్ష చొప్పున జమ చేశారు. అయితే 15 రోజుల క్రితం వరకు జిల్లాలో కేవలం 2,000 మంది మాత్రమే ఇళ్లు కట్టుకోవడానికి ముందుకొచ్చారు. ఈ వారంలో 3,000 మంది లబ్ధిదారులు ముగ్గుపోయడంతో కొంత పురోగతి కనిపించింది. 60 గజాలలోపు ఇంటి నిర్మాణం చేపట్టాలనే నిబంధనతో కొంతమంది ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. మరికొందరు తమకు అనుకూలంగా ముగ్గుపోసుకొని ఇంటి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అయితే వాటికి బిల్లు మంజూరు కాదని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతిఒక్కరూ అధికారులు వచ్చి ముగ్గు పోసిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. అవగాహన కల్పిస్తున్న అధికారులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు పనులు ప్రారంభించాలని అవగాహన కల్పిస్తున్నారు. అయితే డబ్బులు లేక కొందరు, స్థలం అనుకూలంగా లేక మరికొందరు ముందుకు రావడం లేదు. ఇంకొందరు ఉన్న ఇంటిని కూల్చివేసి కొత్తది నిర్మించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. హత్నూర మండలం ముచ్చర్ల గ్రామానికి 94 ఇళ్లు మంజూరు కాగా, 50 మంది ఆర్థిక స్థోమత లేదని, ఇళ్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నామని అధికారులకు రాత పూర్వకంగా రాసిచ్చారు. -
మతోన్మాదుల కుట్రలు తిప్పికొట్టాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్సంగారెడ్డి ఎడ్యుకేషన్: భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి సోషలిజం, సెక్యులర్ పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన వైఖరి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండా రవికుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో నాయకత్వ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. భారతదేశం మత రాజ్యం కాకూడదని, అభివృద్ధి చెందిన దేశాల సరసన పోటీ పడాలని రాజ్యాంగ స్ఫూర్తి వెల్లడిస్తుందన్నారు. దేశాన్ని మత రాజ్యంగా మార్చాలని మతోన్మాద శక్తులు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలందరూ తమకు నచ్చిన మతాన్ని ఆచరిస్తూనే లౌకిక భావనతో పరమత సహనాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, రాంచందర్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, రేవంత్, నాగేశ్వర్ రావు, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వల్లూర్లో ముదిరిన చేపల వివాదం
16 మంది ముదిరాజ్ల బైండోవర్చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం వల్లూర్లో ఏడాదిగా చెరువులో చేపలు పట్టుకునే విషయంలో గ్రామస్తులు, ముదిరాజ్లకు వివాదం నడుస్తోంది. వల్లూర్ చెరువులో చేపలు పట్టేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను డీసీఎంలో ముదిరాజ్లు తీసుకురావడంతో గ్రామస్తులు అడ్డుకొని పోలీస్లకు అప్పగించారు. గతంలో పంచాయతీ వద్ద నిర్వహించిన గ్రామసభలో అధికారులు ఇరువర్గాలతో చర్చించారు. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యశాఖ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే అర్హులని తేల్చిచెప్పారు. దీనికి గ్రామస్తులు కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఇతరులు వస్తే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. కాగా శనివారం డీసీఎంలో వలలతో ఇతర ప్రాంతానికి చెందిన మత్స్యకారులను చేపలు పట్టేందుకు రావడంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ ఇరువర్గాలను సముదాయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 16 మంది ముదిరాజ్లను బైండోవర్ చేశా రు. మరోవర్గానికి చెందిన వారిని సోమవారం బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు. -
పోలీసుల అదుపులో కొమురవెల్లి చోరీ నిందితుడు!
కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించిన నిందితుడిని కొమురవెల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన నిందితుడు కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చి పక్కగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని పోతుగంటి కొమురవెల్లి ఇంట్లో బుధవారం చోరీ జరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యా దు చేసిన విషయం తెలిసిందే. అయితే విషయమై ఎస్ఐ రాజును వివరణ కోరగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. బంధువుల ఇంటికి వెళ్తూ...బైక్ అదుపుతప్పి కొడుకు మృతి తల్లికి తీవ్ర గాయాలు హత్నూర(సంగారెడ్డి): బంధువుల ఇంటికి వెళ్తూ బైక్ అదుపుతప్పడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలవగా అతడి తల్లి తీవ్రంగా గాయపడింది. హత్నూర మండలం గోవిందరాజు పల్లి గ్రామ శివారులో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హత్నూర మండలం సికిందలాపూర్ గ్రామానికి చెందిన కురుమ దానయ్య(42) అతడి తల్లి వీరమ్మతో కలిసి ఉదయం మెదక్ జిల్లా సోమక్కపేటలో ఉండే బంధువుల ఇంటికి బైక్పై బయల్దేరారు. సరిగ్గా గోవిందరాజు పల్లి గ్రామ శివారులో చేరుకునేసరికి బైక్ అదుపు తప్పి పక్కనున్న పొదల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో దానయ్య అక్కడికక్కడే మృతి చెందగా వీరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న పశువుల కాపరులు వీరిని చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వీరమ్మను చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దానయ్య మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 108 అంబులెన్స్లో ప్రసవంతల్లీ బిడ్డా క్షేమం వర్గల్(గజ్వేల్): గజ్వేల్ మండలంలో ఓ గర్భిణిని ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రికి అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. వర్గల్ మండలం గౌరారం వద్ద శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పిడిచేడ్ గ్రామానికి చెందిన పుల్ల కల్యాణికి నెలలు నిండటంతో పురుటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం గజ్వేల్లోని మాతాశిశు సంక్షేమ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు ఫిట్స్ రావడంతో అక్కడి వైద్యులు గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో శనివారం ఉదయం ఆమెను 108 అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పురుటినొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమై ఆమెకు ప్రసవం చేశారు. తల్లీ, మగశిశువు క్షేమంగా ఉన్నారని వారిని తిరిగి గజ్వేల్ ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. మద్యం తాగి వ్యక్తి మృతికౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని కంచన్పల్లిలో శనివారం అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటన వివరాలిలా ఉన్నా యి. కంచన్పల్లి గ్రామానికి చెందిన నీలబోయిన నర్సింహులు(48) ప్లంబర్ పనిచేస్తుంటా డు. కాగా మద్యానికి బానిసై భార్య లావణ్య, తల్లి క్యాతమ్మతో గొడవ పడి కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం భార్య, తల్లితో గొడవపడి బయటకు వెళ్లి అతిగా మద్యం తాగాడు. అనంతరం ఇంటికి వచ్చి నిద్రపోయాడు. నర్సింహులును భోజనానికి లేపితే ఎంతకూలేవకపోవడంతో అనుమానమొచ్చిన భార్య తరచి చూడ గా భర్త మృతి చెందినట్లు గుర్తించింది. మృతుడి తమ్ముడు మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హత్య కేసులో నిందితుడికి రిమాండ్
● నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు ● సిబ్బందిని అభినందించిన జిన్నారం సీఐ నయీముద్దీన్ హత్నూర(సంగారెడ్డి): హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీను (25) హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించి నిందితుడిని రిమాండ్కు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కాసాల గ్రామ శివారులోని ఇప్పలకుంట సమీపంలో ఓ గుర్తుతెలియని కాలిపోయిన మృతదేహాన్ని ఈనెల 25న పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని కాసాల గ్రామానికి చెందిన ఎరుకలి శ్రీనుగా గుర్తించారు. హత్యకు గురైన శ్రీను అతని బంధువైన దౌల్తాబాద్ గ్రామానికి చెందిన ఎరుకలి మల్లేశం కంపెనీలో పనిచేసేవాడు. గతంలో వీరిద్దరూ దొంగతనం కేసులో నేరస్తులుగా ఉండటంతోపాటు ఇతర తగాదాల్లో కూడా ప్రమేయం ఉంది. ఒక విషయంలో వీరిద్దరి మధ్యా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈనెల 25న వీరిద్దరికీ కోర్టులో కేసు ఉండటంతో శ్రీను ఈనెల 24న బీరంగూడ నుంచి దౌల్తాబాద్కు వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మద్యం తాగుతున్న సమయంలో పథకం ప్రకారం మల్లేశం వెంటతెచ్చుకున్న బ్లేడుతో శ్రీనుపైదాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శ్రీను మృతదేహాన్ని మల్లేశం గ్రామశివారులోని ఇప్పలగుంట సమీపంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో మల్లేశంను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. త్వరితగతిన హత్య కేసును ఛేదించిన హత్నూర పోలీస్ సిబ్బందిని సీఐ నయీముద్దీన్ అభినందించారు. -
హెచ్ఎం సొంత నిధులు
కొండపాక(గజ్వేల్): దూర ప్రాంతాలనుంచి విద్యార్థులు తమ స్కూలు వచ్చేందుకు ఏడాది పాటు ఆటో ద్వారా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయప్రకాశ్రెడ్డి. దీంతోపాటుగా పాఠశాల ఆవరణలో ఆట వస్తువులు క్రీడా దుస్తులు, స్వచ్ఛమైన తాగు నీటి ఆర్వో ప్లాంట్, ఐఎఫ్బీ స్క్రీన్ ఎల్ఈడీ ప్యానల్, కంప్యూటర్, తరగతి గదుల్లో కార్పెట్లు, పాఠశాలకు అందమైన రంగులు వేయడం వంటి వాటి కోసం సుమారు రూ. 9లక్షలను తన సొంత డబ్బుల్ని ఖర్చుపెట్టి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. ఇక బడిబాట కార్యక్రమంలో ఇల్లిల్లూ తిరుగుతూ పాఠశాలలో లభించే వసతులు, సౌకర్యాల గురించి వివరించడంతో తమ పిల్లలను ఈ బడిలో చేర్పించేందుకు ముందుకు వచ్చారు. సుమారు 70 మందికిపైగా ప్రైవేట్ స్కూల్కు వెళ్లే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ప్రస్తుతం 210 మంది విద్యార్థులు ఈ బడిలో చదువుకుంటున్నారు. -
కార్పొరేట్కు దీటుగా నిల‘బడి’న వైనం
● సత్ఫలితాలనిచ్చిన ‘బడిబాట’ కార్యక్రమం ● ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న ప్రవేశాలు ● దాతల వితరణ, టీచర్ల ప్రత్యేక కృషితో బడిలో చేరేందుకు మొగ్గు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు జోరందుకున్నాయి. అడ్మిషన్లు పెంచేందుకు అటు ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు ఇటు సదరు పాఠశాలల ఉపాధ్యాయులు ‘బడిబాట’పేరుతో చేసిన విస్తృత ప్రచారం సత్ఫలితాలనిచ్చింది. ఇదే ఊపును కొనసాగిస్తే జూలై చివరాఖరి వరకు ప్రవేశాలకు ఇంకా సమయం మిగిలి ఉండటంతో ప్రభుత్వం నిర్దేశించిన ప్రవేశాల లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ప్రభుత్వ బడుల్లో దాతల వితరణలతో మెరుగుపడిన మౌలిక వసతులు, విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు, పెన్నులు, స్కూల్ బ్యాగ్లు ఉచిత పంపిణీ వంటి అంశాలు అడ్మిషన్లు పెరిగేందుకు ఎంతగానో దోహదపడ్డాయి.ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఇందులో మొదటి వరుసలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొదటి వరుసలో ఉంటుంది. ఈ పాఠశాల అంటే విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంత క్రేజ్ అంటే...ఈ ఏడాది ఆరో తరగతిలో 180 సీట్లు ఉండగా 150 సీట్లు కాంప్లెక్స్ పాఠశాల పరిధిలోని విద్యార్థులకు కేటాయించగా...మిగిలిన 30 సీట్లకోసం ఏకంగా 340 దరఖాస్తులు వచ్చాయి. అందుకే ఈ పాఠశాలలో ప్రతీ ఏటా నో అడ్మిషన్ బోర్డు పెడుతుంటారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 1,217 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటి? ఈ పాఠశాలలో పుస్తకాల్లోని చదువు మాత్రమే కాకుండా సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. డిజిటల్ విద్యా బోధన, గ్రంథాలయం, క్రీడాప్రాంగణం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సీటీ) ఆధ్వర్యంలో వివిధ భాషలలో శిక్షణ, కవిత్వం, ఆర్థిక, సామాజిక, తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. పాఠశాలకు సంబంధించిన నిర్వహణ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పోటీలు పడుతున్నారురామచంద్రాపురం(పటాన్చెరు): విద్యార్థులు పోటీపడి మరీ బడిలో చేరాలనుకుంటున్న పాఠశాలల్లో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని జిల్లా పరిషత్ పాఠశాల ఒకటి. ఇందులో చేరాలంటే విద్యార్థులు ముందుగా పరీక్ష రాసి అందులో ప్రతిభ చాటాలి. ఈ స్కూల్లో ప్రతీ ఏటా టెన్త్ నూరుకు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తుండటంతోపాటుగా చదువులో వెనుకబడిన విద్యార్థులకు తెల్లాపూర్ నైబర్హూడ్ అసోసియేషన్ సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆధునిక పాఠశాల భవనం, ల్యాబ్, డిటిటల్ తరగతులతో విద్యాబోధన, వారానికి ఒకసారి లైఫ్స్కిల్పై ప్రత్యేక శిక్షణ, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుండటం ఈ స్కూల్ ప్రత్యేకతలు. దీంతో విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతేడాది 410మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 545 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టినప్పటికీ తమ పిల్లలకు ప్రవేశం కోసం వివిధ మార్గాల ద్వారా రికమండేషన్స్ చేయిస్తున్నారు. మోడల్ స్కూల్ లో అడ్మిషన్లు ఫుల్ ఝరాసంగం(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండలంలోని మోడల్ స్కూల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధనతోపాటు వృత్తి విద్యా బోధన కూడా చేస్తుండటంతో విద్యార్థులు ఈ ప్రభుత్వ బడిలో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఈ పాఠశాలలో బోధిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో ఈ స్కూల్లో అడ్మిషన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. లక్ష్యానికిపైగా కస్తూర్బాలో అడ్మిషన్లు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో లక్ష్యానికిపైగా అడ్మిషన్లు ఉన్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పదో తరగతిలో 100% ఫలితాలు సాధిస్తుండటంతో 208 మంది బాలికలు వసతిగృహంలో ఉండి చదువుకుంటున్నారు. సర్కారీ స్కూళ్లకు సలామ్..!ప్రత్యేక శ్రద్ధతో పెరిగిన ప్రవేశాలు న్యాల్కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మామిడ్గి ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. గతేడాది 129 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 140కి పైగా విద్యార్థులు ఉండటమే ఇందుకు నిదర్శనం. ఈ బడిలో టీచర్లతోపాటు దాతల సహకారంతో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ప్లేట్లు, పెన్నులు, బ్యాగ్లు వంటి వాటిని ఉచితంగా అందిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ బడిలో చేర్పేంచేందుకు ముందుకు వస్తున్నారు. ఇక డప్పూర్ పాఠశాలలో హెచ్ఎం జావీద్ ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఇల్లిల్లు తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అవగాహన కల్పించారు. దీంతో ఈ ఏడాది ప్రవేశాలు పెరిగాయి. గతేడాది 70 మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం 110 విద్యార్థులు చేరారు. ఇక హద్నూర్ పాఠశాలలో ఈ ఏడాది కొత్తగా 40 మందికి పైగా విద్యార్థులు చేరారు. అదనంగా గంట సేపు బోధన నర్సాపూర్ రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధపెట్టి చదివిస్తుండటంతోపాటు ఆట పాటలు, సంస్కృతి సంప్రదాయాలను కూడా బోధిస్తుండటం గ్రామస్తుల్ని బాగా ఆకర్షించింది. పైగా ఈ గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకన్నా ఈ బడిలో చదివిన విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారు. దీంతో తమ పిల్లలను ఈ స్కూల్లోనే చేర్పించారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ అదనంగా గంట సమయాన్ని కేటాయించి పాఠాలు బోధించేలా చేశారు. ఉపాధ్యాయులు సొంత డబ్బులతోపాటు దాతల సహకారంతో విద్యార్థులకు అవసరమైన టై, బెల్టులు, గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీనెల స్లిప్ టెస్టులు పెడుతూ సీ గ్రేడ్లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధిస్తున్నారు. దీంతో గతేడాది 1 నుంచి 5వ తరగతి వరకు 33 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసించగా...ప్రస్తుతం 65 మంది విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఆరోవ తరగతి వరకూ అప్గ్రేడ్ చేస్తూ అధికారులు ప్రాథమికోన్నత పాఠశాలగా ప్రకటించారు. -
పొలం తన పేరున కాక.. అప్పులు తీర్చలేక
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యహవేళిఘణాపూర్(మెదక్): అప్పు చేసి కొనుగోలు చేసిన పొలం తన పేరున కాకపోవడం, ఇంటి అవసరాలకు చేసిన అప్పులు పేరుకుపోవడంతో జీవితంపై విరక్తి చెందిన రైతు పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం చౌట్లపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చీమల చంద్రయ్య (55) కొంతకాలం క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 20 గుంటల పొలం అప్పు చేసి కొనుగోలు చేశాడు. ఆ పొలం తన పేరున కాకపోవడంతో పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి పురుగు మందు సేవించాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు కుటుంబీకులకు సమాచారం అందించగా, అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే 108లో మెదక్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీకి తరలించేలోపే మృతిచెందాడు. పొలం కోసం, ఇంటి అవసరాల కోసం అప్పులు అయ్యాయని బాధపడుతూ ఉండేవాడని, కొనుగోలు చేసిన భూమి కూడా తన పేరునకాకపోవడంతో ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమంలో దరఖాస్తు కూడా సమర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రైతు చంద్రయ్య పేరున పొలం లేకపోవడంతో రైతుబీమా సైతం వర్తించిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. రైలు పట్టాలపై యువతితూప్రాన్: రైలు పట్టాలపై యువతి బలవన్మరణంకు పాల్పడిన ఘటన శనివారం పట్టణ సమీపంలోని బ్రహ్మణపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన శవర్తి నర్సవ్వ, శంకర్ దంపతుల మూడో కూతురు స్వర్ణ(24) కొన్నేళ్లుగా మనోహరాబాద్ మండలం రామాయిపల్లి గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తుంది. ఈ క్రమంలోనే రోజు మాదిరిగా ఉద్యోగానికి వెళ్లిన యువతి ఇంటికి చేరుకుంది. అనంతరం తూప్రాన్లో పని ఉందని ఇంటి నుంచి బయల్దేరిన స్వర్ణ బ్రహ్మణపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు వస్తుండగా ఒక్కసారిగా దూకేసింది. దీంతో స్వర్ణ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది -
కోనాయిపల్లి గ్రామస్తుల తీర్మానం
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి(పీబీ) గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు స్కూలుకు పంపించవద్దని తీర్మానించుకున్నారు. గ్రామానికి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రాకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామంలోని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. ఇదే గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే 20 మందికి పైగా విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరారు. వాలంటీర్కు గ్రామస్తులే వేతనం గ్రామస్తులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఒక వాలంటర్ను కూడా నియమించి ప్రతీ నెల రూ.5వేల చొప్పున వేతనం గ్రామస్తులే అందిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లిష్లో బోధన, ప్రత్యేక యూనిఫాం, వివిధ రకాల క్రీడలు తదితర విభాగాల్లో శిక్షణనిస్తుండటంతో విద్యార్థులు ఈ సర్కారు బడికి ఆకర్షితులయ్యారు. ఫలించిన బడిబాట పాఠశాలల పునఃప్రారంభానికి ముందు నుంచే ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణతోపాటు బడిబాట కార్య క్రమం చేపట్టింది. ఉపాధ్యాయులు విద్యార్థులను బడిలో చేర్చుకునేందుకు ఇంటింటా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తుల ద్వారా సత్ఫలితాలు సాధించారు. -
మట్టి రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
జిన్నారం (పటాన్చెరు): అక్రమ మట్టి రవాణాపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. రాళ్లకత్వ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 286లో కొంతకాలంగా అక్రమార్కులు ప్రభుత్వ భూముల నుంచి మట్టి రవాణాకు పాల్పడుతున్నారు. తహసిల్దార్ దేవదాస్, ఎస్ఐ నాగలక్ష్మి శనివారం మట్టి రవాణా చేస్తున్న భూములను పరిశీంలించారు. అనంతరం గ్రామస్తులను కలిసి మట్టి రవాణపై ఆరా తీశారు. ప్రభుత్వం నిరుపేద రైతులు వ్యవసాయం చేసేందుకు అసైన్డ్ భూములను ఇచ్చిందన్నారు. అలా కాకుండా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఇప్పటికై నా అక్రమ మట్టి రవాణాను ఆపాలని లేకపోతే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి మరీ..
నారాయణఖేడ్: విద్యార్థుల అడ్మిషన్లకోసం ప్రతీ ఏటా పోటీ నెలకొనే స్కూళ్లలో ఖేడ్లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఒకటి. పాఠశాలలో సాయంత్రం సమయంలో హెచ్ఎం మన్మథకిషోర్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్, వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ గంటసేపు క్లాసులు, చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ప్రత్యేకంగా బోధిస్తుండటంతో ఈ స్కూల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి సహకారంతో ఈ స్కూల్లో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా కంప్యూటర్ శిక్షణ కొనసాగుతోంది. ఇదే పాఠశాలకు చెందిన హిందీ ఉపాధ్యాయు డు చంద్రశేఖర్ ఆచార్య సేవోద్గం ఫౌండేషన్ ద్వారా 800 మందికి బ్యాగులు, ఇంగ్లిష్ డిక్షనరీలు, నెట్డాటా సంస్థ సహకారంతో 4 ల్యాప్టాప్లు, లయన్స్క్లబ్ సౌజన్యంతో క్రీడాసామగ్రి, మార్చి ఫాస్ట్ డ్రెస్లు, ఇతర దాతర సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్సులు, గుర్తింపు కార్డు లు ఉచితంగా అందజేస్తున్నారు. ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి,జక్కుల యాదగిరి సౌజన్యంతో రూ.3లక్షల విలువైన మినరల్ వాటర్ప్లాంటు ను విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో ఇటీవలే ఏర్పాటు చేశారు. న్యాయవాది అనుపమారెడ్డి సహకారంతో తరగతి బోధనలో ఉపాధ్యాయులకు ఉపయోగపడే సౌండ్సిస్టమ్ను ఇచ్చారు. దీంతో ఈ ఏడాది అడ్మిషన్లు కూడా భారీగానే పెరిగాయి. గతేడాది 800 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది మరో 850 మంది అడ్మిషన్లు పొందారు. ఇక ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా 150 మంది విద్యార్థులు ఈ స్కూల్లో ప్రవేశాలు తీసుకున్నారు. -
మంజీరా మరమ్మతుకు 3.5కోట్లు
నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి మండలంలోని మంజీరా డ్యామ్ ను శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జంట (హైదరాబాద్, సికింద్రాబాద్) నగరాలకు తాగునీరు అందించే మంజీరా డ్యామ్కు ఎలాంటి పగుళ్లు లేవన్నారు. మంజీరా డ్యామ్ మరమ్మతుల కోసం రూ.3.5 కోట్లు కేటాయించామని తెలిపారు. అనంతరం డ్యామ్ను పరిశీలించారు. ఆర్డీవో రవీందర్రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ పటాన్చెరు డివిజన్ జనరల్ మేనేజర్ మాణిక్యం, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మట్టి మాఫియా!
రూటు మార్చినఆ చెరువుల్లోంచే నల్లమట్టి అక్రమ రవాణా మట్టిమాఫియా కేంద్రంగా రాళ్లకత్వ జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ శివారులోని 286 సర్వే నంబర్లలో అక్రమార్కులు నాలుగు గ్రూపులుగా ఏర్పడి మట్టి మాఫియా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. శివానగర్ ఎల్ఈడీ పార్క్ తదితర పరిశ్రమలకు మట్టి రవాణా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అర్ధరాత్రి సాగుతున్న మట్టి రవాణా వ్యవహారాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా భయాందోళనకు గురి చేయడమే కాకుండా దర్జాగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మట్టి మాఫియాతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ వ్యాపారం సాగుతుందని చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, సంగారెడి : మట్టి మాఫియా రూటు మార్చింది.. అక్రమ దందాను మూడు ప్రొక్లయినర్లు..ఆరు టిప్పర్లుగా కొనసాగించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ముంబై జాతీయ రహదారి (ఎన్హెచ్.65) పై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రహదారిపై డిజైన్ లోపాన్ని సరిచేయడం కోసం సదాశివపేట మండలం నందికంది వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. ఈ ఫ్లైఓవర్ కోసం అవసరమైన మట్టి కోసం నందికంది చెరువులోంచి 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకెళ్లేందుకు నీటిపారుదలశాఖ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. అయితే ఇదే చెరువు నుంచి వేరే వాళ్లు అక్రమంగా మట్టిని తవ్వుతున్నారు. ఈ మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో ఈ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. తమకున్న రాజకీయ పలుకుబడిని ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమ దందాకు తెరలేపారు. ఎవరైనా చూస్తే జాతీయ రహదారి కోసం మట్టిని తవ్వుతున్నారనుకుంటారు. వాస్తవానికి నేషనల్ హైవే పనుల కంటే ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిపోతున్న మట్టే ఎక్కువగా ఉంటోంది. కొండాపూర్ మండలంలో కూడా పలు చెరువుల నుంచి ఇదే తరహాలో సహజ సంపద దోపిడీకి గురవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా.. ఇటుకబట్టీలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం చెరువుల్లో మట్టిని తవ్వుకునేందుకు అనుమతులు అంత ఈజీగా రావు. దీంతో ఇలా ముంబై జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మట్టిని తవ్వుతున్న చెరువుల నుంచే మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ అక్రమార్కులకు రాజకీయ అండదండలుండటంతో అధికారులు చూసీచూడనట్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి పగలు తేడా లేకుండా.. ఈ మట్టి అక్రమ రవాణా రాత్రి, పగలు అనే తేడా లేకుండా సాగుతోంది. భారీ ప్రొక్లయినర్లు ఈ చెరువులోంచి నల్లమట్టిని తవ్వి జిన్నారం మండలంలో పలుచోట్ల ఉన్న ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు, భారీ వాహనాల్లో ఈ నల్లమట్టి తరలిపోతుండటం గమనార్హం. ఈ చెరువులో ఒక్కోరోజు అర్ధరాత్రి వరకు కూడా తవ్వకాలు జరుగుతున్నప్పటికీ..ఇటు పోలీసులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అనుమతులు ఇచ్చిన నీటిపారుదలశాఖ కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నల్లమట్టి టిప్పర్లు నందికంది నుంచి పొత్తిరెడ్డిపల్లి చౌరస్తా.. కంది..ముత్తంగి మీదుగా జిన్నారం మండలంలోని ఇటుకబట్టీలకు రవాణా అవుతోంది. ఈ దందాలో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందా చేస్తున్న వారికి రాజకీయ అండదండలుండటంతో ఇటు పోలీసులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నందికంది చెరువు నుంచి నల్లమట్టి అక్రమ రవాణాపై స్థానికులు పలుమార్లు నీటిపారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. కానీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.ఫిర్యాదులు వచ్చాయి కానీ: నందికంది చెరువు నుంచి మట్టిని తవ్వుకునేందుకు నేషనల్ హైవే పనుల కోసం అనుమతి ఇచ్చాము. ఈ చెరువులో వేరే వాళ్లు కూడా నల్లమట్టిని తవ్వుతున్నారనే ఫిర్యాదులు మాకు వచ్చాయి. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపి పరిశీలించాము. కానీ, అక్కడ అలాంటి తవ్వకాలు జరిగినట్లు మా దృష్టికి రాలేదు. ఇకపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తాం. – మహేశ్, నీటిపారుదలశాఖ ఏఈ, సదాశివపేట యథేచ్ఛగా ఇటుక బట్టీలకు తరలింపు నందికంది చెరువునుకొల్లగొడుతున్న అక్రమార్కులు మట్టి టిప్పర్లు సీజ్కొండాపూర్ (సంగారెడ్డి): అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసి కొండాపూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... నాలుగు రోజులుగా మండల కేంద్రంలోని చెరువులో మట్టిని గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు రాత్రి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తూతూ మంత్రంగా రైతు పేరు మీద ఇరిగేషన్ విభాగంలో అనుమతులు తీసుకున్నారు. గ్రామంలో మట్టిని వేరే గ్రామానికి తరలించడం ఏంటని నిలదీసి టిప్పర్లను అడ్డుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన తహసీల్దార్ టిప్పర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. -
బడుల తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం
నారాయణఖేడ్: పాఠశాలల తనిఖీకోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. ఖేడ్లో శనివారం నిర్వహించిన సంఘం డివిజన్స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులను పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యుటీ ఈవో, ఎంఈవో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలని, అవసరమైనచోట్ల కొన్ని అదనపు పోస్టులను మంజూరు చేసి ప్రత్యేక యంత్రాంగం ద్వారానే పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమిస్తే క్యాడర్, సీనియారిటీ సమస్యలతోపాటు విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శులు నరేశ్, ఏశప్ప, హరిసింగ్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అండర్పాస్ బ్రిడ్జి నిర్మించండి
ఎంపీ రఘునందన్రావుకు రుద్రారం గ్రామస్తులు వినతి పటాన్చెరు టౌన్: పటాన్చెరు మండలం రుద్రారం గణేశ్ గడ్డ దేవాలయం వద్ద దేవాలయం సమీపంలో అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలని రుద్రారం నాయకులు, గ్రామస్తులు మెదక్ ఎంపీ రఘునందన్ రావును కోరారు. ఈ మేరకు గ్రామస్తులు హైదరాబాద్లోని ఎంపీ నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంపీ రఘునందన్రావు అక్కడ అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని స్థానిక నాయకులు తెలిపారు. నేడు జాబ్మేళాసంగారెడ్డి టౌన్ : జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 28 శనివారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి అనిల్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫ్లిప్కార్ట్, పూస్కల్ ఆగ్రో టెక్లో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని..టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని చెప్పారు. జిల్లా ఉపాధి కార్యాలయం పాత వెలుగు కార్యాలయంలో జరిగే ఈ మేళాకు సకాలంలో హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వివరాలకు 08455–271010లో సంప్రదించాలని కోరారు. సమస్యలతోవిద్యార్థుల సతమతంయూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి సంగారెడ్డి ఎడ్యుకేషన్: సంక్షేమ హాస్టల్స్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో యూఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం హాస్టల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2025 విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల హాస్టళ్లలో మాత్రం కనీస వసతులు కల్పించలేదని దీంతో విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. విద్యార్థుల బాగోగులు పట్టించుకోని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించి ‘చలో కలెక్టర్’కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. టెన్త్ సప్లిమెంటరీఫలితాలు విడుదలసంగారెడ్డి ఎడ్యుకేషన్: పది సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జిల్లా లో 195 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా 109 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 117 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 61 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 78 మంది విద్యార్థులకు 48 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా మొత్తంగా ఉత్తీర్ణత శాతం 55.90గా నమోదైంది. రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించి జూలై 7వ తేదీ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసిన అప్లికేషన్ ఫారం, హాల్ టికెట్ జిరాక్స్, ప్రింట్ మెమోను జతచేసి పాఠశాలలనే సమర్పించాని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. నేడు ఆస్పత్రి అభివృద్ధి సమావేశంనారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రి సలహా సంఘం సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.జి.రమేశ్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆస్పత్రి సమావేశ మందిరంలో మధ్యా హ్నం 2గంటలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి సభ్యులు విధిగా హాజరు కావాలని కోరారు. రైతుఖాతాల్లో రూ.113,37 కోట్లు జమ జహీరాబాద్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు భరోసా పథకం కింద జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని రైతులకు రూ.113.37 కోట్ల నిధులు జమ అయినట్లు ఏడీఏ భిక్షపతి శుక్రఓవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
త్వరలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనులు
● ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు: నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువుల పరిధిలో రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు కోసం భూమి కేటాయింపులు 90% పూర్తయ్యాయని..త్వరలో ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శ్మశాన వాటిక పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...నూతన ఎస్టీపీ ప్లాంట్ల కు సంబంధించి వివాదాలకు తావు లేకుండా భూ కేటాయింపులు చేశామన్నారు. నియోజకవర్గ పరిధి లోని తిమ్మక్క చెరువు, మేళ్ల చెరువు, ఉసికే బావి, ఇక్రిశాట్, గండిగూడెం, బచ్చుగూడెం, అమీన్పూర్ పరిధిలోని చెరువుల సమీపంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 1,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రజల కోసం 3 ఎకరాల విస్తీర్ణంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కమ్యూనిటీల కోసం 1.71కోట్లతో నిర్మించిన శ్మశాన వాటికలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సమావేశంలో జలమండలి ఎస్టీపీ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ పద్మజ, అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ఘనంగా జగన్నాథ రథయాత్ర
సంగారెడ్డి టౌన్: పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగన్నాథ రథయాత్ర శుక్రవారం ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. పట్టణంలోని నటరాజ్ థియేటర్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. పూరీ జగన్నాథుని రథయాత్రను అందంగా అలంకరించి, భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ ఆనందోత్సవాల మధ్య రథయాత్ర కొనసాగింది. రథయాత్రలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్ పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. నేటి యువతరానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళలు, ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
వన మహోత్సవానికి సర్వం సిద్ధం
ప్రభుత్వ ఆదేశాలతో.. ప్రభుత్వ ఆదేశాలతో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ముందస్తు ప్రణాళికతో నర్సరీలు ఏర్పాటు చేశాం. ఒక్కో నర్సరీలో 6 వేల వరకు మొక్కలను పెంచాం. మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. సమృద్ధిగా వర్షాలు పడిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలతో మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. – అశోక్ కుమార్, ఏపీఓ, జహీరాబాద్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారంకు కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కారు వనమహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వర్షాకాలం సీజన్ మొదలు కావడంతో జూలై నుంచి వన మహోత్సవంను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పనుల్లో నిమగ్నమైంది. జహీరాబాద్ టౌన్: అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కాలుష్యం పెరిగి వాతావరణంలో సమత్యుం లోపిస్తుంది. వేసవిలో ఎండలు మండుతున్నాయి, సరైన సమయంలో వానలు పడక రైతులు అవస్థలు పడుతున్నారు. సమస్యను అధిగమించడానికి గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ జాతీయ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలోని ప్రతి పంచాయతీకో నర్సరీనికి ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలో 26 మండలాల్లో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ఒక్కో నర్సరీలో 6 వేల వరకు పెంచారు. ప్రతీ పంచాయతీలో 3 వేల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. జిల్లాలో 19.50 లక్షల మొక్కలను నాటనున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, అటవీ భూములు, ఊరు వాడ, రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలతో గుంతలను తవ్విస్తున్నారు.ఇవీ నర్సరీల్లో మొక్కలు ఆహ్లాదాన్ని పంచే, నీడ, ఫల సాయం అందించే మొక్కలను పంపిణీ చేసి నాటనున్నారు. దానిమ్మ, జామ, మునగ, అల్లనేరేడు, బొప్పాయి, బాదం, ఉసిరి, ఈత, మందారం, గులాబీ, జాస్మిన్, గుల్మోహర్, కానుగ, వేప,చింత, గన్నేరు, మేంది, జామ, మునుగ, మామిడి, కరివేపాకు తదితర రకాల మొక్కలు నాటేందుకు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. 19.50 లక్షల మొక్కలునాటాలని లక్ష్యం ప్రతీ పంచాయతీలో మూడు వేలు.. నర్సరీలో 6 వేల వరకుమొక్కల పెంపకం వన మహోత్సవానికి యంత్రాంగం సిద్ధం -
రమణీయం.. రథోత్సవం
జిన్నారం(పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో పూరి జగన్నాథుని రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. శుక్రవారం రథోత్సవ వేడుకలకు పట్టణ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాజీ జెడ్పీటీసీ బాల్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు హనుమంత్ రెడ్డి, బీరప్ప యాదవ్, గోపాలమ్మ, రమణయ్య, నాయకులు వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. హెచ్ఎండీఏ ప్లాట్లు ఇవ్వాలికంది(సంగారెడ్డి): మండల కేంద్రమైన కందిలోని సర్వే నంబర్ 656లో హెచ్ఎండీఏ లేఅవుట్ కోసం తీసుకున్న భూముల యజమానులకు ప్లాట్లను ఇవ్వాలని బాధితులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ రవికుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం హెచ్ఎండీఏ లేఅవుట్ కోసం తమ నుంచి భూములు తీసుకుందని తెలిపారు. ఎకరాకు 600 గజాల ప్లాటును ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్న అధికారులు ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. కాలయాపన చేయకుండా వెంటనే ప్లాట్లను భూములు కోల్పోయిన వారికి చేయాలని కోరారు. ఈపీఎఫ్పై కార్మికులకు అవగాహన జిన్నారం(పటాన్చెరు): కార్మికుల జీవితాలకు ఈపీఎఫ్ భద్రత కల్పిస్తుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీధర్రావు అన్నారు. శుక్రవారం బొల్లారం పారిశ్రామికవాడలో మైలాన్ పరిశ్రమ కార్మికులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. కార్మికులు ఈపీఎఫ్ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. పరిశ్రమ యాజమాన్యాలు కార్మికులకు తప్పనిసరిగా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధి సత్యనారాయణ, వంశీ పాల్గొన్నారు. -
పుణ్యక్షేత్రాలకు బయలుదేరిన బస్సులు
నారాయణఖేడ్: రాష్ట్రంలోని 10 పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకుని వచ్చేలా ఖేడ్ నుంచి ప్రత్యేకంగా ఒక ఎక్స్ప్రెస్, ఒక సూపర్ డీలక్స్ బస్సు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఖేడ్ నుంచి బయలుదేరాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఆయా బస్సులకు డ్రైవర్లు పూజలు నిర్వహించగా ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మెనేజర్ కృష్ణమూర్తి జెండా ఊపి పంపించారు. బస్సులు 36 గంటలపాటు ప్రయాణించి 10 పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామగుండం, మిడ్మానేరు డ్యాం, వరంగల్, సిద్దిపేట, మెదక్, ఏడుపాయలను దర్శించుకుని శనివారం సాయంత్రం తిరిగి ఖేడ్కు చేరుకోనున్నాయి. స్థానిక ఆర్టీసీ డీఎం మల్లేశయ్య, అసిస్టెంట్ మెనేజర్ నర్సింహులు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ దశరథ్, నెహ్రూ, బీరయ్య, పాండు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాడుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న పంచాయతీ కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో వారిని కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పంచాయతీ సిబ్బంది వేతనాలకు బడ్జెట్ కేటాయించి.. గ్రీన్చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బందిని కూడా రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. జీవోనంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి దశరథ్,యూనియన్ నాయకులు సంజీవ్, శేఖర్, రాములు, నగేష్, మైపాల్, యాదమ్మ, అశోక్, నర్సింలు తదితరులున్నారు. -
గుంతలమయంగా రోడ్లు
● మరమ్మతులకు నోచుకోని వైనం ● ప్రమాదాలకు గురవుతున్నవాహనదారులు హత్నూర(సంగారెడ్డి): ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. ఈ రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. మండల కేంద్రం నుంచి జోగిపేటకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. హత్నూరలో సుమారు 200 మీటర్ల వరకు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోవడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్యాల వెళ్లే ప్రధాన రహదారితో పాటు దౌల్తాబాద్ నుంచి నాగుల్దేవులపల్లి వెళ్లే ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హత్నూర నుంచి నవాబుపేట వెళ్లి రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. మల్కాపూర్ నుంచి పటాన్చెరు వెళ్లే ప్రధాన రహదారి సైతం గుంతలమయంగా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఆ రోడ్డుపై వెళ్లాలంటే భయం హత్నూర నుంచి సిరిపురం వరకు బైక్పై వెళ్లాలంటే ఎప్పుడు ఏ గుంతలో పడి ప్రమాదం సంభవిస్తోందనని భయంగా ఉంది. రాత్రి సమయంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయాలి. – ప్రవీణ్గౌడ్, హత్నూర నిధులు రాగానే మరమ్మతులు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయిస్తాం. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే గుంతలు ఏర్పడిన రహదారులకు మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తాం. – రవీందర్, ఆర్అండ్బీ, డీఈ● -
మతోన్మాద శక్తుల అభివృద్ధే బీజేపీ ధ్యేయం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్పొరేట్, మతోన్మాద శక్తుల అభివృద్ధే బీజేపీ ధ్యేయమని, ప్రజా సంక్షేమం మరిచి ప్రజల మధ్య విద్వేషాలను పెంచడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో సీపీఎం సంగారెడ్డి, మెదక్ జిల్లా నాయకత్వ స్థాయి శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం చుక్కా రాములు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వర్గాలకు వ్యతరేకంగా చట్టాలను రూపొందిస్తూ, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూరేలా వ్యవహారిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత, గిరిజనుల మీద దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం, రాజయ్య, సాయిలు, రాంచందర్, నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, రేవంత్, నాగేశ్వర్ రావు, మహిపాల్, యాదగిరి పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చుక్కా రాములు -
ఎల్వోసీ అందజేత
నారాయణఖేడ్: కల్హేర్ మండలం మాసానిపల్లికి చెందిన పొన్నం యాదగిరికి అత్యవసర వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల మంజూరుకు సంబంధించి ఎల్వోసీ ఉత్తర్వు జారీ అయింది. శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ బాధితుడి కుటుంబీకులకు ఎల్వోసీని అందజేశారు. మాజీ సర్పంచి గోపాల్ పాల్గొన్నారు. రాయికోడు మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ రెడ్డికి రూ.54 వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును ఖేడ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్ లబ్ధిదారుడి కుటుంబీకులకు అందజేశారు. నాయకులు సాగర్ షెట్కార్, పీఏసీఎస్ చైర్మన్ మారుతిరెడ్డి పాల్గొన్నారు. కార్మికుల సేవలు అభినందనీయం నారాయణఖేడ్: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారు జామునుంచే విధుల్లో చేరి కార్మికులు అందించే సేవలు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు కాస్మోటిక్ కిట్లు దోహదపడతాయన్నారు. అనంతరం పలు వార్డుల్లో జరుగుతున్న పనులు, నీరు నిల్వ ఉన్నచోట్ల దోమలు ప్రబలకుండా ఆయిల్బాల్ వేయడం, యాంటీ లార్వా ద్రావణం పిచికారీ పనులను శానిటరీ అధికారి శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం నారాయణఖేడ్: సంస్కృతి, సంప్రదాయ విద్యతోనే సేవా కార్యక్రమాలు సాధ్యమవుతాయని ఖేడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి అన్నారు. ఖేడ్ శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో దాత జక్కుల యాదగిరి రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి ప్లాంటును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతీ శిశుమందిరాలు విద్యార్థుల్లో దేశభక్తి, ఆధ్యాత్మికత, నైతిక విలువలను పెంపొందిస్తుండటం గొప్ప విషయమన్నారు. రిటైర్డ్ హెచ్.ఎం రామకృష్ణ, పాఠశాల కమిటీ బాధ్యులు నారాయణ, వీరేశలింగం, చంద్రశేఖర్, శ్రీశైలం, జ్ఞానేశ్వర్, శివరాజ్, సంగమేశ్వర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంహత్నూర( సంగారెడ్డి): ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులను త్వరితగతిన కొనసాగించాలని ఎంపీడీవో శంకర్ స్పష్టం చేశారు. మండల కేంద్రమైన హత్నూరలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణం కోసం శుక్రవారం ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ...అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం ముగ్గు పోసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఈఓ యూసుఫ్, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేశ్, నాయకులు కిష్టయ్య, మధుసూదన్ గౌడ్, నరేందర్, సాయికుమార్ లబ్ధిదారులు పాల్గొన్నారు. వర్షాలు కురవాలని గంప జాతర న్యాల్కల్(జహీరాబాద్): వర్షాలు కురవాలని కోరుతూ శుక్రవారం మండలంలోని చినిగెపల్లి వాసులు గంప జాతర కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం గ్రామస్తులు భాజా భజంత్రీలతో గ్రామం నుంచి సమీపాన గల చెరువు వద్దకు గంపలతో నైవేద్యాలు తీసుకుని తరలివెళ్లారు. అక్కడ గంగా మాతకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. -
చేయూత.. ఉపాధి
● డిజిటల్ పద్ధతిలో నెలవారీగా చెల్లింపులు ● అవగాహన కల్పిస్తున్న అధికారులు ● వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న అతివలుసంగారెడ్డి టౌన్: మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలు ప్రవేశపెడుతున్నాయి. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు వివిధ ఉపాధి అవకాశాలు లభించేలా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు అందిస్తున్నారు. మహిళలకు కిరాణా దుకాణాలు, టెంట్ హౌస్, కోళ్ల పరిశ్రమ, డెయిరీ పామ్, వివిధ చిన్న తరహా వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని మహిళా సంఘాల ద్వారా లబ్ధి పొందుతూ జీవనోపాధి పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో సీ్త్రనిధి ద్వారా ఈ సంవత్సరంలో రూ.83 కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. జిల్లాలో 25 మండలాలు, 365 గ్రామ సంఘాల్లో 10,016 మంది సభ్యులకు సీ్త్ర నిధి బ్యాంకు ద్వారా రుణాలిచ్చారు. సీ్త్ర నిధి నుంచి రుణాలు పొంది స్వయం ఉపాధి పొందడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. సభ్యులు తీసుకున్న రుణాలకు ప్రతి నెల ఆన్లైన్లో నేరుగా చెల్లించే అవకాశం కల్పించడంతోపాటు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు సీ్త్ర నిధి ద్వారా రూ.83 కోట్ల రుణాలుమహిళలు సద్వినియోగం చేసుకోవాలి మహిళా సంఘంలోని సభ్యులకు సీ్త్ర నిధి ద్వారా రుణాలిస్తూ వ్యాపారాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. తీసుకున్న డబ్బులను ప్రతి నెల ఆన్లైన్లో సకాలంలో చెల్లిస్తున్నారు. మహిళలకు మరింత అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. వంద శాతం రుణాలు అందజేశాం. – శ్రీనాథ్, సీ్త్ర నిధి రీజినల్ మేనేజర్ -
గాయపడ్డ నెమలికి చికిత్స
శివ్వంపేట(నర్సాపూర్): గాయపడిన నెమలికి అటవీ సిబ్బంది చికిత్స చేయించారు. గురువారం మండల పరిధిలోని గోమారం గ్రామ శివారులో వెంకట్రెడ్డికి చెందిన పౌల్ట్రీ పామ్ వద్ద ఓ నెమలి గాయపడి ఉండగా గుర్తించిన రైతు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. శివ్వంపేట ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రీధర్కుమార్, బీట్ అధికారి శ్రీవల్లి గాయపడిన నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నెమలికి నర్సాపూర్లో పశు వైద్యశాలలో చికిత్స చేయించి అడవిలో వదిలిపెట్టారు. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య గజ్వేల్రూరల్: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాదగారి రేగొండకు భార్య మంజులతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజు మాదిరిగానే భార్యాభర్తలు వ్యవసాయ పొలానికి వెళ్లారు. మంజుల పొలంలో పనిచేస్తుండగా, రేగొండ సమీపంలోని చింతచెట్టుకింద పడుకున్నాడు. మంజుల కొద్దిసేపటి తర్వాత రేగొండ వద్దకు వెళ్లి చూడగా పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించింది. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆర్టీసీ సేవల్ని వినియోగించుకోవాలిమాజీ సర్పంచ్ స్వరూప చిలప్చెడ్(నర్సాపూర్): ఆర్టీసీ బస్ సేవల్ని గ్రామ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు వినియోగించుకోవాలని మాజీ సర్పంచ్ స్వరూప సూచించారు. నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ చిలప్చెడ్ మండలం గౌతాపూర్ గ్రామానికి రాగా, గ్రామస్తులు దానిని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ...గతంలో గ్రామానికి బస్ సౌకర్యం ఉండేదని కొద్దికాలంగా గౌతాపూర్తోపాటు, పలు గ్రామాలకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయన్నారు. దీనిపై ఆర్టీసీ సేవల్ని పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులను, పలుమార్లు కోరడంతో తిరిగి గ్రామానికి బస్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు విఠల్, భీమయ్య, రమేశ్నాయక్, యాసిన్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ మెదక్ మున్సిపాలిటీ: పేకాట ఆడుతున్న వారి ని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ సీఐ రాజారెడ్డి వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నా రు. వారి నుంచి 5 మొబైల్స్, రూ. 8,765 నగదు ను స్వాధీనం చేసుకుని మెదక్ టౌన్ ఎస్ఐకి అప్పగించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు దాడి చేసినట్లు తెలిపారు. తూప్రాన్లో.. తూప్రాన్: పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రంగాకృష్ణ వివరాల ప్రకారం... అల్లాపూర్ సమీపంలో ఓ వెంచర్లో పేకాటాడుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10700, మూడు బైకులు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
చెరువులో పడి వృద్ధురాలి మృతి
● కుమారులు సరిగా చూడటం లేదనా.. ● అనారోగ్య సమస్యతో ఆత్మహత్యనా?అక్కన్నపేట(హుస్నాబాద్): చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన గురువారం సాయంత్రం మండలంలోని అంతక్కపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పూదరి కనకవ్వ(70)కు నలుగురు కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు కరీంనగర్లో ఉంటున్నాడు. మిగిలిన కుమారుల వద్ద ఆమె ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా కుమారులు సరిగా పట్టించుకోకపోవడంతో పాటు అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. అనార్యోగ సమస్య తట్టుకోలేకనా? లేక కుమారులు సరిగా చూడటం లేదని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. వృద్ధురాలి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సాక్షి ఎస్ఐ విజయ్భాస్కర్ను సంప్రందించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తున్నామని తెలిపారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య కౌడిపల్లి(నర్సాపూర్): వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని తునికిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎతిరాజుల సుశీలకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు నర్సాపూర్లో నివాసం ఉంటున్నాడు. కాగా చిన్న కొడుకు యాదగిరి(32) తునికిలో తల్లి వద్ద ఉంటున్నాడు. మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. తల్లి కూలీపనులు చేస్తూ పోషిస్తుంది. పలుమార్లు మద్యం సేవించి తల్లితో సైతం గొడవపడేవాడు. గురువారం తల్లి గ్రామంలోకి వెళ్లొచ్చేసరికి ఇంట్లో యాదగిరి ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య పదేళ్లక్రితం చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇళ్లు కూలగొట్టి రోడ్డున పడేశారు
● పెట్రోలు డబ్బాతో దివ్యాంగుడి ఆందోళన ● డబుల్ బెడ్రూం నుంచి వెళ్లిపోవాలని లబ్ధిదారుల ఒత్తిడి గజ్వేల్రూరల్: రోడ్డు వెడల్పులో తమ ఇండ్లను తొలగించిన గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోకుండా తాత్కాలికంగా డబుల్ బెడ్రూంలను కేటాయించి చేతులు దులుపుకున్నదని బాధితులు పేర్కొన్నారు. పెట్రోల్ డబ్బా పట్టుకొని ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ దివ్యాంగుడు ఆందోళనకు దిగాడు. ఈ ఘటన గజ్వేల్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం... గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో రోడ్డు వెడల్పులో భాగంగా గత ప్రభుత్వ పాలనలో 19 మందికి చెందిన ఇళ్లను తొలగించేందుకు అధికారులు సిద్ధమవగా, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి బాధితులకు నచ్చజెప్పి సంగాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోకి పంపించారు. అక్కడ మొదటి అంతస్తులో ఇళ్లు కేటాయించారు. కానీ, దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, గ్రౌండ్ఫ్లోర్లోకి మార్చాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 9 మంది బాధితులకు ఉండేందుకు అనుమతించారు. కాగా డబుల్ లబ్ధిదారులు వచ్చి ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నా రని, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాధిత దివ్యాంగుడు నాగరాజు పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టెను చేతిలో పట్టుకొని ఆందోళనకు దిగాడు. సమాచారం తెలుసుకున్న సీఐ సైదా ఘటనా స్థలానికి వెళ్లి నచ్చ జెప్పారు. బాధితులందరిని పోలీస్స్టేషన్కు తరలించారు. నాగరాజు మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో తమ ఇండ్లను తొలగించారని, ప్రస్తుత ప్రభుత్వం ఆదుకొని గూడు కల్పించాలని కోరాడు. -
చేపల కోసం వెళ్లి.. స్తంభాన్ని ఢీకొట్టి
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతికొమురవెల్లి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రం శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సార్ల రామ్చరణ్(16) అదే గ్రామంలో 10 వతరగతి చదువుతున్నాడు. గ్రామానికి చెందిన ఆంజనేయులుతో కలిసి కొమురవెల్లి చెరువులో చేపలు పట్టడానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. చెరువులో చేపలు పడకపోవడంతో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కొమురవెళ్లి నుంచి తిమ్మారెడ్డిపల్లి వెళ్లే రోడ్డులో ఎదురుగా వస్తున్న బొలోరో వాహనాన్ని తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ద్విచక్రవాహనం నడుపుతున్న రామ్చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.గుర్తు తెలియని వాహనం ఢీకొని.. కంది(సంగారెడ్డి): వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై రవీందర్ కథనం ప్రకారం... కందికి చెందిన కోస్కే వినోద్ కుమార్ గౌడ్(22) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి కందిలో దాబాకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో పటాన్ చెరు వైపు నుంచి సంగారెడ్డికి వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్ కుమార్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు కింద పడి కార్మికుడు.. పటాన్చెరు టౌన్: ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నేపాల్కు చెందిన మూసారహు సాదే (55) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం వచ్చి పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వాష్ రూమ్కి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు కిందపడి తలకి గాయమైంది. తోటి కార్మికులకు చెప్పగా ఇస్నాపూర్లో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగోల్లో గుర్తు తెలియని మృతదేహం కొండపాక(గజ్వేల్): గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం మండలంలోని మంగోల్ గ్రామంలో కనిపించింది. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం... గ్రామంలో 15 రోజులుగా గుర్తు తెలియని వృద్ధుడు భిక్షాటన చేస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి బస్టాప్ వద్ద పడుకొని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. -
ప్రణాళిక.. ప్రహసనం
కానరాని కార్యాచరణ – ఎక్కడి చెత్త అక్కడే● మున్సిపాలిటీల్లో తాండవం చేస్తున్న సమస్యలు ● విఫలమైన అధికారులు ● ఇబ్బందులు పడుతున్న ప్రజలుజోగిపేట(అందోల్): పట్టణంలోని భరత్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో గల పార్కు పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఈ పార్కు మున్సిపల్ కార్యాలయం ప్రక్కనే ఉండటం గమనార్హం. గాంధీ పార్కుకు తాళం వేయడం వల్ల అందులో చెత్త పేరుకుపోయింది. జోగిపేట–అన్నాసాగర్ వెళ్లే రహదారి ప్రక్కనే చెత్త పేరుకుపోయింది. వంద రోజుల ప్రణాళిక తూతూ మంత్రంగా నిర్వహించారని పలువురు ఆరోపిస్తున్నారు. 20 వార్డులను టార్గెట్ చేసి పనులు చేపట్టినా పారిశుధ్యం, పిచ్చి మొక్కల తొలగింపు పనులు చేపట్టలేదని ప్రజలు వాపోతున్నారు. ప్రణాళిక అమలేది? మెదక్ మున్సిపాలిటీ: మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక ముందుకు సాగడం లేదు. అక్కడక్కడ మొక్కుబడి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనంతరం వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పట్టణంలోని చెరువులు, ఎంఎన్ కెనాల్ పారిశుద్ధ్య లోపంతో కంపుకొడుతున్నాయి. మల్లం చెరువు కట్టపై చెత్త పేరుకుపోయింది. ఎంఎన్ కెనాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో పిచ్చిమొక్కలు, చెత్తతో నిండిపోయి కంపు కొడుతోంది. కాలనీల్లోని మురుగు కాల్వలు సైతం ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పురపాలికల్లో వందరోజుల ప్రణాళిక సరిగా అమలవ్వడం లేదు. వెరసి మురుగునీటి కాలువల అపరిశుభ్రత, చెత్త తరలింపులో నిర్లక్ష్యం, మురుగు గుంతలు, దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు, తదితర పనులు చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారులు పకడ్బందీ ప్రణాళికతో మున్సిపాలిటీల్లో సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. వృద్ధి చెందుతున్న దోమలు నర్సాపూర్: మున్సిపాలిటీలో మురికి కాలువల శుభ్రం, పిచ్చి మొక్కలు తొలగింపు, భగీరథ పథకం నీటి ట్యాంకుల క్లోరినేషన్ చేయడం తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆ పనులను సక్రమంగా చేపట్టక పోవడం గమనార్హం. పిల్లల పార్కులోని మిషన్ భగీరథ ట్యాంకు నీరు లీకవుతుంది. వాల్వుల వద్ద మురికి కూపంగా తయారైంది. సునీతారెడ్డి కాలనీలో డ్రైనేజీ నిర్మించకపోవడంతో మురికి నీరు నేలపై పారి పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో దోమలు పెరగుతున్నాయని కాలనీవాసులు చెప్పారు దుబ్బాక: మున్సిపాలిటీలోని 20 వార్డులలో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం డ్రైనేజీ శుభ్రం చేసే పనులు కూడా సరిగా చేయడం లేదు. వార్డులలో ప్రజలకు తడి,పొడి చెత్త, వానాకాలంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రూ.20 కోట్ల నిధులు వస్తే సమస్యలు తీరుతాయని, అవి లేకే సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా ఉన్న సమస్యలు అధికారులు నోటీఫై చేసుకుంటున్నప్పటికీ అవి ఎంత వరకు పరిష్కారం అవుతాయో.. చూడాలని ప్రజలు వాపోతున్నారు. పారిశుధ్య పనుల్లో నిర్వహణ లోపం.. అవగాహన కల్పిస్తే.. ఇలా చేస్తారా? రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నామమాత్రంగా ప్రణాళిక నిర్వహిస్తున్నారు. మొత్తం యాక్షన్ప్లాన్లో 50 అంశాల్లో పారిశుద్ధ్యం ఒకటి. తడి, పొడి చెత్తపై మాత్రం అవగాహన కూడా కల్పించడం లేదు. పలుచోట్ల చెత్తను బహిరంగంగా తగలబెడుతున్నారు. పారిశుద్ధ్యంపై కాలనీలు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ మున్సిపల్ పరిధిలో అమలు కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లోన్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు
సైబర్ నేరస్తుడి అరెస్ట్ చేర్యాల(సిద్దిపేట): లోన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ ఎల్.శ్రీను, ఎస్ఐ పి.నీరేష్ కేసు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుగొండ మండలానికి చెందిన పిల్లెల శ్రీకాంత్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సంక్షేమ సంఘం పేరిట వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందులో చేరేలాగా చేసిన శ్రీకాంత్ జాతీయ రియల్ ఎస్టేట్ సంఘం నుంచి రుణాలు వస్తాయని, అందుకు సభ్యత్వ రుసుము రూ. 25 వేలు చెల్లించాలని గ్రూపులో పోస్ట్ చేశాడు. ఇది నిజమేనని నమ్మిన మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు లోన్ కావాలని వాట్సాప్లో అడిగాడు. వెంటనే అతనికి ఫోన్ చేసి సభ్యత్వ రుసుము రూ.25వేలు పంపించాలని శ్రీకాంత్ కోరాడు. సదరు వ్యక్తి గూగుల్పే ద్వారా రూ.25 వేలు రెండు విడతల్లో పంపించాడు. ఫోన్చేస్తే ఎత్తకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు నేరస్తుడిని అరెస్టు చేశారు. -
ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్న
సీ్త్ర నిధి ద్వారా మూడు లక్షల రుణం తీసుకున్న. ఆ డబ్బుతో ఫ్యాన్సీ స్టోర్ దుకాణం ఏర్పాటు చేసిన. తీసుకున్న రుణాన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాను. అలాగే పొదుపులో కూడా ప్రతి నెలా డబ్బులు కడుతున్నాం. ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు సీ్త్రనిధి ఉపయోగపడుతుంది. – సరస్వతి, తాలేల్మా గ్రామం, అందోల్ శుభకార్యాలకు డెకరేషన్ సీ్త్ర నిధి ద్వారా రుణం తీసుకున్న. ఈ డబ్బులతో వివాహాలకు సంబంధించిన డెకరేషన్ వస్తువులను కొనుగోలు చేశా. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నా. శుభ కార్యాలకు డెకరేషన్ నిర్వహిస్తూ మంచి ఆదాయం పొందుతున్న. – పద్మ, దేవుని గ్రామం, వట్టిపల్లి మంచి అవకాశాలు మహిళా సంఘాల్లోని సభ్యులకు మంచి అవకాశాలు ఉన్నాయి. సీ్త్ర నిధి ద్వారా మూడు లక్షలు రుణం తీసుకొని సొంతంగా టెంట్ హౌస్ను నడుపుతున్న. గ్రామంలోనే ఉంటూ వివాహాది శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు సామాన్లు ఇస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నాను. – లక్ష్మి, ఇస్మాయిల్ ఖాన్పేట్, సంగారెడ్డి -
నిండుకున్న అడుగుమందు
● సహకార సంఘాల్లో అందుబాటులోలేని డీఏపీ ● అడిగినా పంపని మార్క్ఫెడ్ ● ఈ సంస్థ వద్ద కూడా అడుగంటినబఫర్స్టాక్ ● ఇబ్బందులు పడుతున్న రైతులు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో ఎరువుల కొరత షురూవైంది. ప్రధానంగా డీఏపీ ఎరువు పూర్తిస్థాయిలో దొరకడం లేదు. రైతుల అవసరాల మేరకు ఈ ఎరువు అందుబాటులో లేదు. పలు మండలాల్లోని సహకార సంఘాల్లో డీఏపీ నిల్వలు అయిపోయాయి. తమకు ఈ ఎరువులు పంపాలని ఆయా సహకార సంఘాలు అడుగుతున్నా...ఈ ఎరువులు అందుబాటులో లేకపోవడంతో నిల్వలు పంపలేకపోతున్నారు. పంటలకు అడుగుమందుగా పేరున్న ఈ ఎరువు ఇప్పుడు పత్తి, సోయా, చెరుకు వంటి పంటలు సాగుకు ఎంతో అవసరం ఉంటుంది. రైతుల అవసరాల మేరకు సహకార సంఘాల్లో ఈ స్టాక్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సంగారెడ్డి, మునిపల్లి, జహీరాబాద్ మండలాల్లో పలు సహకార సంఘాల్లో ఈ డీఏపీ ఎరువు కొరత ఏర్పడింది. 18 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఈ వానాకాలం సీజన్లో 7.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ సీజన్కు సుమారు 18 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరమని ఈ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు అవసరమైన ప్రతిపాదనను పంపింది. కానీ, ఇప్పటివరకు సుమారు తొమ్మిది టన్నులు మాత్రమే వచ్చింది. ఇప్పటికే ఈ ఎరువు విక్రయం అయింది. అయితే చాలామంది రైతులు ముందు జాగ్రత్తగా ఈ డీఏపీ ఎరువులను కొనుగోలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఎరువుల నిల్వలు తగ్గాయని చెప్పుకొస్తున్నారు. గతేడాది వానాకాలం సీజన్ మొత్తానికి 16 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ విక్రయం జరిగిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. మార్క్ఫెడ్ వద్ద కూడా అడుగంటాయి.. జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు, డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాలకు మార్క్ఫెడ్ ద్వారా ఎరువులు సరఫరా అవుతాయి. అయితే ఈ మార్క్ఫెడ్లోనే డీఏపీ లేదు. వాస్తవానికి మార్క్ఫెడ్ బఫర్ స్టాక్ను దగ్గర ఉంచుకోవాలి. ఎక్కడైనా ఎరువుల కొరత ఏర్పడితే.. ఈ బఫర్ స్టాక్ నుంచి ఎరువులను విడుదల చేయాలి. కానీ మార్క్ఫెడ్ వద్ద ప్రస్తుతం బఫర్ స్టాక్ దేవుడెరుగు..అసలు స్టాకే నిండుకుంది. ఈ ఖరీఫ్ సీజన్లో సరఫరా చేసేందుకు మార్క్ఫెడ్కు సుమారు 3 వేల మెట్రిక్ టన్నులు అవసమని అధికారులు తెలిపారు. కానీ, ఇప్పటి వరకు కేవలం సుమారు వెయ్యి టన్నులే వచ్చింది. 700 మెట్రిక్ టన్నులు బఫర్ స్టాక్ ఉండాలి. కానీ ఇప్పుడు 200 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఈ నిల్వలు ఏ మూలకు సరిపోవు. దీంతో ఈ ఎరువులు అడిగిన సహకార సంఘాలకు డీఏపీ పంపలేకపోతోంది. ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో.. రైతులకు సేవలందించే సహకార సంఘాల్లో డీఏపీ ఎరువులు అందుబాటులో లేకపోగా, ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం ఈ నిల్వలున్నాయి. ప్రస్తుతం 2,400 టన్నులు డీలర్ల వద్ద డీఏపీ ఉందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతుండటం గమనార్హం. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు డీలర్లు ఈ ఎరువుల ఎక్కువ ధరలకు విక్రయించే అవకాశాలున్నాయి. దీనిపై వ్యవసాయశాఖ అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ అరకొర నిల్వలను డీలర్లు బ్లాక్మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది.స్టాక్ రావడం లేదు డీఏపీ ఎరువుల స్టాక్ రావడం లేదు. ప్రస్తుతానికి 200 టన్నుల డీఏపీ ఉంది. ఎమర్జెన్సీ అవసరాల కోసమని ఈ నిల్వలను ఉంచాము. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదేశాల మేరకే ఈ నిల్వలను సహకార సంఘాలకు పంపుతున్నాం. గతేడాది ఈ ఎరువుల స్టాక్ బాగానే ఉంది. కానీ, ఈసారి అనుకుంత రాకపోవడంతో నిల్వలు తగ్గాయి. – శ్రీదేవి, మార్క్ఫెడ్, డీఎం -
గురుకులాల్లో జేఎల్ పోస్టుల భర్తీ
జహీరాబాద్ టౌన్: తాత్కాలిక అధ్యాపకుల పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మొగుడంపల్లి గురుకుల ప్రిన్సిపాల్ హిమబిందు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు జిన్నారం గురుకులంలో దరఖాస్తు చేసుకోవాలని, జూలై 1 తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు హాజరుకావాలని చెప్పారు. పీజీలో 55% మార్కులు సాధించి ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9346436829, 98492,37238 నంబర్కు సంప్రదించాలని చెప్పారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలిన్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని పసల్వాది గ్రామ శివారులోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మాదకద్రవ్యాల వినియోగం అనారోగ్యాలకు గురి చేయడమే కాకుండా వాటికి బానిసలుగా మారుస్తుందన్నారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర సమస్యలకు గురవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐగా రామకృష్ణారెడ్డిసంగారెడ్డి క్రైమ్ : సంగారెడ్డి ట్రాఫిక్ సీఐగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. మల్టీజోన్–2 నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇక్కడ విధులు నిర్వహించిన సీఐ సుమన్ కొండాపూర్కు బదిలీపై వెళ్లారు. దివ్యాంగులకు పింఛను ఇవ్వండికంగ్టి (నారాయణఖేడ్): అర్హులైన దివ్యాంగులకు పింఛను అందించాలని కేవీపీఎస్ జిల్లా నాయకుడు బి.శ్రీనివాస్ కోరారు. సిర్గాపూర్ ఎంపీడీవో మన్సుర్ నాయక్ గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అర్హులున్నా చాలామందికి పింఛను రావడంలేదన్నారు. 90% వైకల్యం ఉన్న వారికి కూడా పింఛను జారీ చేయడంలేదని, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పండరీ, శ్రీకాంత్, కృష్ణ పాల్గొన్నారు. రాళ్ల ధరలు పెంచడం తగదుజహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రాంతంలో లభించే ఎర్ర రాళ్ల ధరలు పెంచడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై ఆర్థికభారం పడుతుందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేష్ గురువారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా లభించే ఎర్రరాళ్లతోనే ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం పనులు చేపడతారని చెప్పారు. పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభంకావడంతో వ్యాపారులు రాళ్ల ధరలు ఒక్కసారిగా పెంచారని ఆరోపించారు. రూ.15కు లభించే రాయిని ఒక్కసారిగా రూ.25కు పెంచారని చెప్పారు. రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకు రాళ్లను ఇప్పించాలని కోరారు. విలీన గ్రామాల్లో ఉపాధి కొనసాగించాలిసంగారెడ్డి ఎడ్యుకేషన్: మున్సిపల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో ఇన్చార్జి ఏఓ సదానందంకు వినతి పత్రం అందజేశారు. -
టాక్స్ చెల్లించకుంటే జరిమాన
● 200 బస్సులకు సామర్థ్య పరీక్షలు ● జహీరాబాద్ ఎంవీఐ వెంకటయ్య జహీరాబాద్ టౌన్: సాక్షి: జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి. బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయా? ఎంవీఐ: జహీరాబాద్ డివిజన్ పరిధిలో జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు వస్తాయి. డివిజన్ వ్యాప్తంగా 218 ప్రైవేట్ స్కూల్ బస్సులున్నాయి. ఇప్పటి వరకు 200 బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాం. మిగిలిన బస్సులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. సాక్షి: నిబంధనలు పాటించకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎంవీఐ: నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేస్తాం. ఫిట్నెస్తోపాటు టాక్స్ కట్టని బస్సులకు రూ.5 వేల వరకు జరిమాన విధిస్తాం. సాక్షి: ఆటోల్లో పిల్లలను స్కూల్కు తీసుకెళ్లవచ్చా? ఎంవీఐ: నిబంధన ప్రకారం ఆటోలో విద్యార్థులను తీసుకెళ్లకూడదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే సామర్థ్యం మేరకు పిల్లలను కూర్చో బెట్టాలి. స్కూల్ ట్రిప్ అని ముందు వెనుక రాయాలి. నిబంధనలు పాటించకుండా నడిపితే కేసులు పెడతాం. సాక్షి: డ్రైవర్లు ఎలాంటి నిబంధనలు పాటించాలి? ఎంవీఐ: డ్రైవర్కు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు 60 సంవత్సరాల లోపు ఉండాలి. తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. డ్రైవర్కు కచ్చితంగా సహాయకుడు ఉండాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.ఎం.వెంకటయ్య, ఎంవీఐ, జహీరాబాద్సాక్షి: బస్సుల ఫిట్నెస్ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎంవీఐ: బస్సు పూర్తిగా కండిషన్లో ఉండాలి. బస్సు టైర్లు, బ్రేకులు, సీట్లు, ఫుట్బోర్డు, ఫస్ట్ ఎయిడ్ కిట్, పాఠశాల రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలిస్తాం. బస్సుపై పాఠశాల పేరు, సెల్ఫోన్ నంబర్ కచ్చితంగా ఉండాలి. నిబంధనలు పాటించకుంటే బస్సులకు అనుమతులు ఇవ్వం. -
● టీచర్ల తనిఖీలపైవెల్లువెత్తుతున్న విమర్శలు ● విద్యలో నాణ్యత పెంపునకుబడుల్లో ఆకస్మిక సందర్శనలు ● అధికారులుగా ఉపాధ్యాయులు ● రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
నారాయణఖేడ్: విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడుల తనిఖీ కోసం ఉపాధ్యాయుల నియామకం ప్రక్రియపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ నెల 25న ఆర్సీ నంబరు 70 ద్వారా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఉపాధ్యాయుల నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో కూడా త్వరలో బడుల తనిఖీ కోసం ఉపాధ్యాయుల ఎంపిక జరగనుంది. జిల్లాలో మొత్తం ఉపాధ్యాయులు 5,278మంది కాగా, ఎస్జీటీలు 2,587మంది ఉన్నారు. ఇటీవల కొత్తగా 415మంది నియామకం అయ్యారు. ఈ లెక్కన ప్రాథమిక పాఠశాలలకు 9 నుంచి 10మంది వరకు, హైస్కూల్స్కు 8 నుంచి 10మంది వరకు టీచర్లు తనిఖీ అధికారులుగా నియామకం కానున్నారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేక వైఖరి వ్యక్తం అవుతుండగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి ఉపాధ్యాయులు కాకుండా ఇతర అధికారుల ద్వారా తనిఖీలు జరగాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తనిఖీలు తప్పకుండా జరాగాలని, కానీ ఉపాధ్యాయులే తనిఖీలు చేస్తే వారు సహ ఉపాధ్యాయులపై చర్యలకు సిఫారసు చేసే అవకాశాలు ఉండవని అంటున్నారు. తనిఖీ అధికారిగా నియామకం అయ్యే ఉపాధ్యాయుడు సదరు పాఠశాలలో ఖాళీ కావడం వల్ల అక్కడి పిల్లలకు అన్యాయం జరిగే అవకాశముంటుందన్న అభిప్రాయాలు సంఘాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. నాణ్యతకోసమే తనిఖీలు... ప్రస్తుతం ప్రతీ మండలంలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు పాఠశాలల పర్యవేక్షణ చేస్తుండగా ప్రత్యేకంగా ఎంపిక చేసి నియమించిన టీచర్లను తనిఖీ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఉన్న టీచర్లలో 2% ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియామకం కానున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రోజుకు కనీసం రెండు పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో రోజుకు ఒక్క పాఠశాలను తనిఖీ చేయాలి. బోధనా పద్ధతులు పెర్మార్మెన్స్, రికార్డుల నిర్వహణ, పాఠ్య ప్రణాళిక తయారీని వాడుతున్నారా లేదా?, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ అవుతుందా లేదా?, మూల్యాంకన విధానం జరుగుతున్న తీరు, కో–కరిక్యులర్స్ , పాఠశాల గ్రంథాలయం నిర్వహణ, ఫిజికల్ ఎడ్యుకేషన్, లేబోరోటరీ నిర్వహణ తదిరత అంశాలను పాఠశాలల వారీగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఉపాధ్యాయ సంఘాల పెదవి విరుపు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించడం సరికాదని, ఈ ఉత్తర్వులను విరమించుకోవాలని పలు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయుల తనిఖీ బాధ్యతల్లో ఉండటంవల్ల వారు సేవలందిస్తున్న ఆయా పాఠశాలల్లో బోధన స్తంభించిపోతుందని చెబుతున్నారు. -
శాండ్ బజార్కోసం స్థలం పరిశీలన
నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందజేసేందుకు నిజాంపేట్ మండల కేంద్రంలోని 79 సర్వే నంబరులో శాండ్ బజార్ ఏర్పాటుకు 14 ఎకరాల స్థలాన్ని గృహనిర్మాణశాఖ పీడీ చలపతిరావు, నిజాంపేట్ తహసీల్దార్ నాగజ్యోతి, ఆర్ఐ జాన్సన్, రాష్ట్ర గనుల శాఖ అధికారులు గురువారం పరిశీలించారు. నిజాంపేట్, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇక్కడి నుంచే ఇసుకను అందజేస్తామని చలపతిరావు చెప్పారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని స్థలంలో నిల్వ చేసే ఇసుకను నారాయణఖేడ్, నాగల్గిద్ద, మనూరు, కంగ్టి మండలాల లబ్ధిదారులకు అందిస్తామన్నారు. -
దరఖాస్తుల విచారణ వేగిరం
● కలెక్టర్ ప్రావీణ్య వెల్లడి సంగారెడ్డి జోన్: ప్రజాపాలన, మీ సేవ ద్వారా అందిన కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం సేకరణ, సీఎంఆర్ డెలివరీ, రేషన్ పంపిణీ, పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు తదితర అంశాలపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అంతకుముందు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి సంగారెడ్డి ఐబీ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దు, కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులలో నిఘా విభాగాన్ని అప్రమత్తం చేసి మాదకద్రవ్యాల రవాణా, అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2023–24 రబీ సీజన్ కింద తొమ్మిది మిల్లుల నుంచి సరఫరా కావలసిన సీఎంఆర్ తక్షణమే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణాలను తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు, విద్యాశాఖతో సమన్వయంతో గ్యాస్ కనెక్షన్ల కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవ్రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు లలిత కుమారి, డీఈఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
ముత్తంగి పాఠశాల భవనంప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు: ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడంతోపాటు..నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి దత్తాత్రేయనగర్ కాలనీలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో రూ.2.50కోట్ల నిధులతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డిలోని కలెక్టరేట్లో కలెక్టర్తో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కలెక్టర్తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేటి తరం తల్లితండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై నెలకొన్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు కల్పించామన్నారు. నియోజకవర్గంలో నూతన పాఠశాలల భవన నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న గ్లాండ్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యే గూడెం కోరారు. కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సీఎస్ఆర్ హెడ్ రఘురామన్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కొమురవెల్లిలో దొంగతనం
బంగారం, వెండి, రూ. 50 వేలు అపహరణ కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఏఎస్ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన పోతుగంటి కొమురెల్లికి రెండు ఇళ్లు ఉన్నాయి. అతను పాత ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి వెనుకాల ఉన్న గేట్లో నుంచి దూకి కొత్త ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. తాళాలతో బీరువాను తెరిచి సుమారు ఐదు తులాల బంగారు, 22 తులాల వెండి అభరణాలు, రూ.50వేలు అపహరించారు. దీంతో బాధితుడు పోలీసలకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్టీంతో వివరాలు సేకరించారు.లద్నూరులో చోరీకి యత్నంమద్దూరు(హుస్నాబాద్): దొంగలు చోరీకి యత్నించి గ్రామంలో తచ్చాడుతూ పట్టుబడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన గడ్డం పద్మ బుధవారం ఉదయం 8 గంటలకు ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. తిరిగి 10గంటలకు కుమారుడితో కలిసి వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దొంగలు పడ్డారని గ్రహించి వెతకగా.. గ్రామ శివారులోని దుర్గమ్మ ఆల యం వద్ద ఏడుగురు మహిళలు, ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంబడించి ప్రశ్నించగా ముగ్గురు పరారయ్యారు. మిగిలిన ఐదుగురిని గ్రామస్తులతో కలిసి పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించి, పోలీసులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. కాగా ఇప్పటికే వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు తెలిపారు. పార్కు చేసిన ఆటో చోరీ నర్సాపూర్: ఇంటి ముందు పార్కు చేసిన ఆటో మంగళవారం రాత్రి నర్సాపూర్లో చోరీకి గురైంది. ఆటో యజమాని అశోక్ వివరాల ప్రకారం.. ఆటో అవసరం ఉందని తన మిత్రుడు సమీర్ అడగడంతో అతనికి ఇచ్చాడు. సమీర్ తన పనులు పూర్తి చేసుకుని రాత్రి నర్సాపూర్లోని షాదీఖానా ఏరియాలోని తన ఇంటి ముందు పార్కు చేశాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆటోను దొంగిలించాడు. చోరీ జరిగిన తర్వాత తూప్రాన్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. చోరీ విషయమై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లగా తూప్రాన్ లో సీసీ కెమెరాలు పరిశీలించాల్సి ఉంటుందని చెప్పగా తాను అక్కడికి వెళ్లి ఆటో వివరాలు అందచేశానని అశోక్ తెలిపారు. ఫిర్యాదు తర్వాత తీసుకుంటామని పోలీసులు చెప్పారని బాధితుడు పేర్కొన్నాడు. ఇప్పలకుంట సమీపంలో కాలిన మృతదేహం హత్నూర(సంగారెడ్డి): గుర్తు తెలియని కాలిన మృతదేహం కనిపించింది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని కాసాల గ్రామ శివారులో ఇప్పలకుంట సమీపంలో సుమారు 25 నుంచి 30 సంవత్సరాల గల వ్యక్తి కాల్చివేసి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి ఒంటిపై గ్రే కలర్ జీన్ పాయింట్ వేసుకొని ఉన్నాడు. కుడిచేతికి వెండి కడియం ఉంది. వివరాలు తెలిస్తే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. అక్రమ ఇసుక వాహనం పట్టివేత కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని వింజపల్లి గ్రామ శివారులో గల మోయతుమ్మెద వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ సిబ్బంది కొమురయ్య పట్టుకున్నారు. వివరాలు ఇలా... వింజపల్లి గ్రామం నుంచి చిన్నకోడూరు మండలానికి అక్రమంగా ఇసుకను తీసుకువెళ్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో గ్రామంలోకి వెళ్లి చూడగా ఎలాంటి అనుమతులు లేకుండా బొలెరో వాహనంలో ఇసుకను తరలిస్తున్నారు. వాహనాన్ని పట్టుకొని తహసీల్దార్ అహ్మద్కు అప్పగించారు. -
కేతకీలో అమావాస్య పూజలు
తరలివచ్చిన భక్తజనంఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. అమావాస్యను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పవిత్ర పుణ్యస్నానాలు చేసి, గుండంలోని జల లింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రాతః కాల పూజ నిర్వహించి భక్తులకు దర్శనం ప్రారంభించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక పూజలు భక్తులు స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, హారతి, కేశఖండనంతోపాటు తదితర పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలోని బలభీముని ఆలయం, నాగులకట్ట, పోగడ చెట్టు, నవగ్రహాలతోపాటు తదితర ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
ప్రజాస్వామ్య హక్కుల కు పోరాటం చేద్దాం
సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్యపటాన్చెరు టౌన్: ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను రక్షించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య ప్రజానీకం, కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బుధవారం సీపీఎం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్లో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పక్కదారి పట్టించడం కోసం ఇందిరా గాంధీ ఆనాడు ఎమర్జెన్సీ విధించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం, జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను ప్రజలు, కార్మికులు జయప్రదం చేయాల ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.జయరాజు, కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, ీవాజిద్ అలీ, పాండు రంగారెడ్డి, రాజు, ప్రసాద్, సత్తిబాబు, రామచంద్ర మూర్తి పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
హవేళిఘణాపూర్(మెదక్): రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా అనుకుంటకు చెందిన మైనాబాయి(62) మూడు రోజుల క్రితం ఫొటో ఫ్రేమ్లు అమ్ముకునేందుకు మెదక్ పట్టణానికి వచ్చింది. ఔరంగాబాద్ శివారులోని కలెక్టరేట్ కార్యాలయం ముందు గల గేటు వద్ద మెదక్ వైపు నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు గోవింద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి.. మనోహరాబాద్(తూప్రాన్): ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాల ప్రకారం... కొండాపూర్ గ్రామానికి చెందిన కుక్కదువ్వు మల్లేష్(54), పెంజర్ల యాదయ్య తమ టీవీఎస్ మోపెడ్పై పని నిమిత్తం మండల కేంద్రానికి వెళుతున్నారు. అదే సమయంలో నిజమాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలో జాతీయ రహదారి–44పై జీడిపల్లి శివారులోకి రాగానే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా నడుపుతూ ముందు వెళుతున్న మోపెడ్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెనకాల కూర్చున్న మల్లేష్కు తీవ్రగాయాలవ్వగా, యాదయ్యకు కుడిచెయ్యి విరిగింది. స్థానికులు తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మల్లేష్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మురికిపాలిటీలు!
● పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం ● పేరుకుపోతున్న చెత్తాచెదారం ● వ్యాధులు ప్రబలే ప్రమాదం మొక్కుబడిగా వంద రోజుల ప్రణాళికఉమ్మడి జిల్లాలో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జూన్ 2నుంచి ప్రారంభించిన 100 రోజుల ప్రణాళిక తూతూ మంత్రంగా కొనసాగుతోంది. చెత్త సేకరణ, పారిశుద్ధ్యంపై అవగాహన కరువైంది. అధికారులు నామమాత్రంగా కార్యక్రమాలు చేపట్టి చేతులు దులుపుకోవడంతో చెత్త పేరుకుపోయింది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో మురుగు నీరు నిలిచి కుంటలను తలపిస్తున్నాయి. అమలు కాని ప్రణాళిక గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక సక్రమంగా అమలు కావడం లేదు. గజ్వేల్తోపాటు ప్రజ్ఞాపూర్, సంగుపల్లి, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్, ముట్రాజ్పల్లి, క్యాసారం గ్రామాలు, ఆర్అండ్ఆర్ కాలనీ కూడా భౌగోళికంగా మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇక్కడ వంద రోజుల ప్రణాళిక మచ్చుకై నా కనిపించడం లేదు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. మున్సిపాలిటీలో నిత్యం 20 టన్నులకుపైనే చెత్త ఉత్పత్తి అవుతున్నది. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేక.. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో చెత్త దర్శనమిస్తోంది. ఈ పరిస్థితి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది. ఎక్కడ చూసినా మురికి కూపం సంగారెడ్డి: మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వార్డులకు సరిపడా వాహనాలను సిబ్బందికి అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పనులన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో కొనసాగుతుండటంతో అర్థం గాని పరిస్థితి నెలకొంది. దీంతో పట్టణంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే దర్శనమిస్తూ చెత్తకుప్పలను కాలుస్తున్నారు. తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అరకొర పనులే.. పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వర్షాకాలంలో పొంగి పొర్లుతున్నాయి సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రధాన లైన్లలో సిల్టును తొలగించారు. ప్రజలకు తడి,పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. ట్రేడ్ లైసెన్స్ జారీ ఇతర ప్రధాన అంశాలను నిర్వహించలేకపోతున్నారు. పట్టణ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, సిబ్బంది కొరతతో సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించ లేకపోతున్నారు. మురుగు పరుగు సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వర్షాకాలం కావడంతో మురుగుకాల్వల పర్యవేక్షణ లోపభూయిష్టంగా మారింది. కొద్దిపాటి వర్షానికి వరద నీరు రోడ్లపైకి రావడంతో జలమయమవుతున్నాయి. దోమలతో పాటు కుక్కల బెడద అధికంగా ఉంది. అధికారులు యానిమల్ బర్త్ కంట్రోల్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీధి విక్రయ జోన్ పటిష్టంగా అమలు కావడం లేదు. వెరసి సమస్యలతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నం జిన్నారం (పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీలో పారిశుధ్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11వ వార్డు బీరప్ప బస్తీలో చెత్తకుప్పలు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయి. అధికారులు మాత్రం ప్రణాళిక హట్టహాసంగా సాగుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని అసహనానికి గురవుతున్నారు. సేకరించిన చెత్తను నివాసాల మధ్య వాహనాల్లో నింపి వదిలేయడంతో దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. రాబోయే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు శుభ్రత పనులు చేపట్టాలని కోరుతున్నారు.అమలు అంతంత మాత్రమే! జహీరాబాద్ టౌన్: మున్సిపాలిటీలో ప్రణాళిక పూర్తిగా పట్టాలెక్కలేదు. పట్టణంలోని గడి ప్రాంతం నుంచి వెళ్తున్న పెద్ద వాగు కాలువల్లోని చెత్తను జేసీబీలతో తొలగిస్తున్నారు. ముఖ్యంగా పిచ్చి మొక్కల తొలగింపు, పారిశుధ్యం, ట్యాంకుల శుభ్రతపై శ్రద్ధ వహిస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ను విస్మరించారు. మెప్మా ఉద్యోగులు నూతన పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, మొక్కలు నాటడం ప్రారంభం కాలేదు. పనులు తూతూ మంత్రంగా చేస్తున్నారు. సదాశివపేటలో అధ్వానం సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పట్టణంలోని 26 వార్డులలో రోడ్ల ప్రక్కన చెత్తాచెదారం దర్శనమిస్తోంది. సిద్ధాపూర్ ప్రధాన రోడ్డు ప్రక్కన కుళ్లిన కూరగాయలు, మాంసపు వ్యర్థాలు పడేయడంతో దుర్గంధంతో ప్రజలు, వాహనదారులు ముక్కుమూసుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పట్టణంలోని మురుగు నీరు కాలువల ద్వారా ఊబ చెరువులో కలుస్తుండటంతో చెరువు కలుషితమవుతోంది. పట్టణంలోని ప్రధాన డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
జనావాసాల్లో మురుగు కుంటలు
హుస్నాబాద్: పట్టణంలో పారిశుద్ధ్య పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. తడి, పొడి, హానికమైన చెత్తపై ప్రజలకు అవగాహన, వాటర్ ట్యాంక్ల వద్ద తాగునీటి క్లోరినేషన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కొన్ని వార్డుల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. కుంటలను తలపించేలా ఇండ్ల మధ్య మురికి నీరు నిలువడంతో దోమలకు నిలయంగా మారింది. మురుగునీరు బయటకు వెళ్లే మార్గం చేయకపోవడంతో దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్స్ కాలనీలో డ్రైనేజీ లేక మురుగు, చెత్త ఒకే చోట నిలిచి పందులకు ఆవాసాలుగా మారుతోంది. -
భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
● చెదరగొట్టిన పోలీసులు ● పూరిగుడిసెను దహనం చేశారని ఫిర్యాదుచిన్నశంకరంపేట(మెదక్): భూ వివాదం ముదిరి అనుమానాస్పదంగా పూరిగుడిసె దగ్ధమైన ఘటనలో ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. ఈ ఘటనపై మండలంలోని సంగాయిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల పోచయ్య అదే గ్రామానికి చెందిన చల్ల సాయిలు వద్ద 4 గుంటల పొలం 2013లో కొనుగోలు చేశాడు. ఈ భూమిలో గుడిసేవేసి తన కూతురు నర్సమ్మను ఉంచాడు. ఈ భూమి విషయంలో సాయిలు కుమారులు చల్ల రాజు, నవీన్ నర్సమ్మతో మంగళవారం మధ్యాహ్నం గొడవపడ్డారు. దీంతో నర్సమ్మ తనతల్లిగారి ఇంటికి వెళ్లింది. ఇదే సమయంలో బుధవారం తెల్లవారుజామున నర్సమ్మ పూరిగుడిసె అనుమానాస్పదంగా దగ్ధమైంది. కాగా తన కూతరు గుడిసెను చల్ల రాజు, నవీన్ తగలబెట్టడంతో పాటు దాడిచేశారని పోచయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు. -
ఎక్కడి సమస్యలు అక్కడే
తూప్రాన్: మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య ప్రణాళిక నామమాత్రంగా కొనసాగుతుంది. మురికి కాలువల శుభ్రం, రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కల తొలగింపు, తడి, పొడి చెత్త పనులపై అధికారులు అవగాహన కల్పించి చేతులు దులుపుకుంటున్నారు. పట్టణంలోని16 వార్డుల్లో అధికంగా 5, 6, 12, వార్డుల్లో సమస్యలు ఉన్నాయి. చిన్నపాటి వర్షానికి గుంతలమయంగా రోడ్లు, బురదమయంగా నడవరాని పరిస్థితి నెలకొంది. ఈ కాలనీల్లో గతంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిర్మించిన మ్యాన్హోల్స్ ప్రమాదకరంగా మారాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి -
డ్రగ్స్తో జీవితాలు చిత్తు
సిద్దిపేటకమాన్: డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని సీపీ అనురాధ పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది వారం రోజులుగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం పలువురు అధికారులు పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్కు అలవాటు పడి విద్యార్థులు సమస్యలను కొనితెచ్చుకోవద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్పై పెయింటింగ్, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి త్వరలో ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులతో జిల్లా కేంద్రంలో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ ఉపేందర్, త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, రూరల్ సీఐ శ్రీను ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డ్రగ్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే పోలీసు కన్వెన్షన్ సెంటర్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు, సిబ్బంది వినియోగించే ఆయుధాలు, ఇతర పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ఏసీపీ రవీందర్రెడ్డి, సుమన్కుమార్, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, శ్రీధర్గౌడ్, దుర్గ, ఎస్ఐలు అపూర్వరెడ్డి, రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సీపీ అనురాధ ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన -
సమస్యలు పరిష్కారం
విద్యా వ్యవస్థ పటిష్టంతోనే సంగారెడ్డి/జోగిపేట(అందోల్)/పాపన్నపేట(మెదక్): విద్యా వ్యవస్థ పటిష్టమైతేనే దేశంలో ఏ సమస్యకై నా సరైన పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ కళాశాలను, అందోలులోని గురుకుల పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. అంతకుముందు మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో ఇప్పటివరకు 26 గురుకుల పాఠశాలలను సందర్శించి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదికను అందజేశామన్నారు. తెలంగాణలో ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే భరించలేరన్నారు. గురుకుల పాఠశాలలో బోధన, భోజనం ఎలా ఉందని అక్కడి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించారు. వెంకటయ్య వెంట ఆర్డీఓ పాండు, డిప్యూటీ తహసీల్దార్ మధుకర్రెడ్డిలతోపాటు కళాశాల, గురుకుల పాఠశాల సిబ్బంది ఉన్నారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకూడదుసంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూముల సమస్యలను జూలై 30వ తేదీ నాటికి పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ...ప్రతీ నెల అన్ని మండలాల్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసమే వినియోగించాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. సమీక్షలో ఎస్పీ పరితోశ్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
స్వేచ్ఛా వాతావరణంలోనే బోధన
కొండాపూర్(సంగారెడ్డి): చిన్నారులను మూడేళ్ల వయసు నుంచే కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, విద్యా బోధన ఎప్పుడూ స్వేచ్ఛాయుత వాతావరణంలోనే జరగాలని ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు పేర్కొన్నారు. మండల పరిధిలోని తొగర్పల్లిలో అంగన్వాడీ విద్యార్థులకు బుధవారం నిర్వహించిన బాల మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నేర్పించే ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి రోజూ అంగన్వాడీ పిల్లలకు అందించే పూర్వ ప్రాథమిక విద్య ఏ విధంగా ఉంటుందో ప్రదర్శన ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దశరథ్, సీడీపీఓ చంద్రకళ, సూపర్వైజర్లు విమల, శైలజ, టీచర్లు స్వప్న, సుశీల, లలిత, అరుణ తదితరులు పాల్గొన్నారు.ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు -
సీఎంని కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ
పటాన్చెరు: ఇటీవల టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పటాన్చెరుకు చెందిన బాలమురళీకృష్ణ (చిన్న ముదిరాజ్) బుధవారం గాంధీ భవన్లో రాష్ట్ర కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీలో తనకు చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి చేరేందుకు తనవంతు కృషి చేస్తానని మురళీకృష్ణ చెప్పారు.పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలిజిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్యసంగారెడ్డి టౌన్: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సబిత ప్రతిభావంతుల పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.10 పుణ్యక్షేత్రాలకు రేపు ప్రత్యేక బస్సులునారాయణఖేడ్: రాష్ట్రంలోని 10 పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చేలా ఖేడ్ నుంచి ఈనెల 27న గురువారం ప్రత్యేకంగా ఒక సూపర్లగ్జరీ, ఒక ఎక్స్ప్రెస్ సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. బస్సులు ఉదయం 8గంటలకు ఖేడ్ నుంచి బయల్దేరి 36 గంటల పాటు ప్రయాణించి 10 పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామగుండం, మిడ్మానేరుడ్యాం, వరంగల్, సిద్దిపేట, మెదక్, ఏడుపాయలను దర్శించుకుని 28న సాయంత్రం తిరిగి ఖేడ్కు చేరుకుంటాయని తెలిపారు. ఒక్కొక్కరికి ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.1,400, డీలక్స్బస్కు రూ.1,600 చార్జీ ఉంటుందన్నారు. కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు, టికెట్ బుకింగ్ కోసం 9959223170, 9441071134, 9676667703 నంబర్లలో సంప్రదించాలని కోరారు.దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలిసంగారెడ్డి ఎడ్యుకేషన్: జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్యభవన్లో బుధవారం జరిగిన జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. వెంటనే లేబర్ కోడ్లు రద్దు చేయడంతో పాటు కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా మాణిక్యం, కార్యదర్శిగా సురేశ్ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు. -
పంచాయతీ పోరు
మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ ● ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ● ఇప్పటికే సిద్ధమైన ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు ● రిజర్వేషన్లు తేలకపోవడంతో నిలిచిన ఎన్నికల ప్రక్రియ ● కోర్టు తాజా ఆదేశాలతో వేడెక్కనున్న పల్లె రాజకీయంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పల్లె రాజకీయ మళ్లీ వేడెక్కనుంది. మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి షురూ కానుంది. సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు మళ్లీ మద్దతు కోసం మంతనాలు ప్రారంభించనున్నారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాకే ఆశావహులు ప్రత్యక్ష కార్యచరణకు దిగాలని యోచిస్తున్నారు. ఈ రిజర్వేషన్ తమ అనుకూలంగా వస్తే..అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటినుంచి మద్దతు కోసం కార్యాచరణ ప్రారంభిస్తే ఖర్చులు తడిసి మోపెడవుతాయని..తీరా రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే ఖర్చులన్నీ వృథా అవుతాయనే ఆలోచనలో చోటా మోటా నాయకులు ఉన్నారు. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం 2024 జనవరి 31తోనే ముగిసిన విషయం విదితమే. అప్పట్నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోవడంతో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి ఈ ఎన్నికలను ఆరు నెలల క్రితమే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం జనవరిలో చకచకా ఎన్నికల ఏర్పాట్లు చేసింది. ఓటరు జాబితాలను కూడా సిద్ధం చేసింది. ఈవీఎంలు కాకుండా, బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉండటంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను జిల్లాకు తెప్పించారు. అలాగే బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా గుర్తించారు. స్టేజ్–1, స్టేజ్–2 ఇలా వివిధ స్థాయిల్లో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఆయా స్థాయిల్లోని అధికారులను, సిబ్బంది జాబితాను రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన దాదాపు అన్ని ప్రక్రియలు ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు తీరా రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో పోలింగ్ ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఈ ఎన్నికల ఏర్పాట్లపై నిమగ్నం కానుంది.ముఖ్యనేతలకు ప్రతిష్ఠాత్మకమే..గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. తమ అనుచరులనే సర్పంచులుగా గెలిపించుకుంటేనే ఆయా గ్రామాల్లో నియోజకవర్గస్థాయి నాయకులకు పట్టు ఉంటుంది. దీంతో అన్ని పార్టీల నాయకులు తమకు అనుకూలమైన వ్యక్తులను బరిలోకి దింపేందుకు ఇప్పట్నుంచి అన్వేషణ ప్రారంభించనున్నారు. -
ఆయిల్పామ్తో వందశాతం భరోసా
జహీరాబాద్ టౌన్: ఆయిల్పామ్ సాగు రైతులకు ప్రభుత్వం వందశాతం భరోసా కల్పిస్తుందని ఉద్యానశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్రావు అన్నారు. మండలం పరిధి గోవింద్పూర్లోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఉద్యానశాఖ, గోద్రేజ్ ఆగ్రోవిట్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించి 250 ఎకరాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సోమేశ్వర్రావు మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగు చేసే రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పంట భవిష్యత్లో లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు. జిల్లాలో 2025–26 సంవత్సరానికి 3,750 ఎకరాల లక్ష్యంగా నిర్దేశించుకుని 2500 ఎకరాల రైతుల పేర్లను నమోదు చేసుకున్నామని చెప్పారు. ఇప్పటికే 1024 ఎకరాలకు పరిపాలన మంజూరు ఇచ్చామన్నారు. ఆయిల్పామ్ సాగు కోసం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు ఇస్తామని తెలిపారు. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంఘం మండలాల్లోని రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తున్నారని, జిల్లాలోని మిగతా ప్రాంత రైతులు ముందుకురావాలని చెప్పారు. ఆయిల్పామ్ గెలలను గోద్రెజ్ కంపెనీ కొంటారని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకుని పంటలను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి పండరి, సేరికల్చర్ అధికారి శ్రీనివాస్, గోద్రేజ్ కంపెనీ జిల్లా ఇన్చార్జి కొండల్రావు, ప్రతినిధి వెంకటేశ్వర్లు, అధికారులు మహేందర్సింగ్, మహేశ్, నవదీప్, పాండు, రైతులు పాల్గొన్నారు.ఉద్యానశాఖ జిల్లా డీడీ సోమేశ్వర్రావు -
పీఆర్ శాఖలోనే కార్యదర్శులు
సంగారెడ్డి జోన్: జిల్లాలో మున్సిపాలిటీలలో విలీనమైన పంచాయతీల కార్యదర్శులు పంచాయతీ రాజ్ శాఖలోనే కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయడంతోపాటుగా పలు గ్రామాలను కలుపుతూ నూతన మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేసింది. పంచాయతీలను విలీనం చేసినప్పటికీ సంబంధిత పంచాయతీ కార్యదర్శులు మాత్రం ఇప్పటివరకు మున్సిపల్ పరిధిలోనే విధులు నిర్వహించారు. మున్సిపల్కే ఆసక్తి చూపి.. మున్సిపల్లో విలీనం అయిన సంబంధిత కార్యదర్శులు ఆ శాఖలోనే విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపించారు. కొన్ని నెలల క్రితం విలీనం అయిన గ్రామ అధికారుల నుంచి పంచాయతీరాజ్ శాఖలో విధులు నిర్వహిస్తారా? మున్సిపల్ శాఖలో విధులు నిర్వహిస్తారా? అనే అంశంపై సంబంధిత కార్యదర్శుల నుంచి మున్సిపల్ అధికారులు ఆప్షన్లు తీసుకున్నారు. మున్సిపల్లో త్వరితగతిన పదోన్నతులు లభించటంతో పాటు అర్బన్ ఏరియాలో పనిచేసే అవకాశం ఉంటుందనే కారణాలతో ఎక్కువగా మున్సిపల్లోనే విధులు నిర్వహించేందుకు ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కోర్టును ఆశ్రయించి.. మున్సిపాలిటీలలోనే తాము విధులు కొనసాగిస్తామంటూ పలువురు పంచాయతీ కార్యదర్శులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పలు గ్రామాలు మున్సిపాలిటీలలో విలీనం అయిన తర్వాత ఇప్పటివరకు మున్సిపల్లోనే విధులు నిర్వహించారు. అయితే తిరిగి పంచాయతీరాజ్ శాఖకు రావాలని ఉత్తర్వులు రావడంతో కోర్టుకు వెళ్లారు. మిగతా వారికి త్వరలో పంచాయతీ కార్యదర్శులుగా కేటాయించనున్నారు. ఇక జిల్లాలోని జిన్నారంతోపాటు పటాన్ చెరువు మండలంలోని పలు గ్రామాలను కూడా త్వరలో మున్సిపాలిటీలలో విలీనం అవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు కోర్టును ఆశ్రయించిన పలువురు పంచాయతీ కార్యదర్శులు త్వరలో మరిన్ని పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం -
పక్కా భవనాల్లో పంచాయతీలు
ఉపాధి హామీ పథకం ద్వారా తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పనులు చేపడుతూ పలు సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా పక్కా భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు గాను కూలీలకు పనికల్పిస్తూ డబ్బులు చెల్లించడంతోపాటు మెటిరీయల్ కాంపోనెంట్ ద్వారా భవనాల నిర్మాణాలను చేపట్టనున్నారు. ప్రధానంగా అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. – నారాయణఖేడ్:యూనిక్ మోడల్గా భవనాలు నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు యూనిక్ మోడల్గా ఉండాలని ఆశాఖ మంత్రి సీతక్క ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ భవనాలను ప్రజలు చూడగానే అవి గ్రామ పంచాయతీ భవనాలు అని, ఇవి అంగన్వాడీ భవనాలుగా గుర్తించేలా ఉండేలా డిజైన్ రూపొందించాలని సూచించారు.గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి రెండు నెలల క్రితమే అధికారులు ప్రతిపాదనలు పంపించగా పలు భవనాలకు నిధుల మంజూరు లభించింది. కాగా ప్రతీ మండలంలో రెండేసి చొప్పున గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పనులకు సంబంధించి ఏయే మండలాల్లో నిర్మిస్తున్నా రో అందుకు సంబంధించి స్థలసేకరణ చేపట్టి నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించింది. రూ.20లక్షల వ్యయంతో ఒక్కో పంచాయతీ భవనం నిర్మించనుండగా, ఒక్కో అంగన్వాడీ భవనానికి ఉపాధి నిధులు రూ.8లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2లక్షలు, మహిళా, శిశు సంక్షేమం నుంచి రూ.2లక్షలు కలిపి రూ.12లక్షలతో వెచ్చించనున్నారు. ఈ భవనాల నిర్మాణాలకు సంబంధించి నెలాఖరులో శంఖుస్థాపనలు చేసి మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థలాల గుర్తింపులో జాప్యం కారణంగా జిల్లాలో 27 మండలాలకు గాను 54 చొప్పున అంగన్వాడీలు, మరో 54 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాల్సి ఉంది. భవన నిర్మాణాల కోసం గత నవంబర్లోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం నిర్దేశించుకోగా స్థలాల గుర్తింపు, అప్పగింతలో జాప్యం కారణంగా అనుకున్నస్థాయిలో భవనాల నిర్మాణాలు జరగలేదు. ఆ అనుభవాల దృష్ట్యా మండలానికి రెండు చొప్పున జీపీలు, అంగన్వాడీలను నిర్ణయించి స్థలాల ఎంపికను వేగంగా పూర్తి చేయాలనుకుంటోంది. చెట్లకింద పాలన జిల్లాలో 631 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో పక్కా భవనాలు 412 గ్రామ పంచాయతీలకు మాత్రమే. 219 పంచాయతీలకు భవనాలు లేవు. పాఠశాలలు, చావిడీలు, కమ్యూనిటీ భవనాలు, చెట్లకింద పాలన సాగుతోంది. జిల్లాలో కొత్తగా 11 పంచాయతీలు ఏర్పాటు కాగా అవికూడా చెట్లకింద పాలనగానే ఉన్నాయి. మండలానికి రెండు చొప్పున 54 భవనాలు నిర్మాణం జరిగితే కొంత వెసులుబాటు కానుంది. జిల్లాలో ఐదు అంగన్వాడీ ప్రాజెక్టుల పరిధిలో 1,504 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో సొంత భవనాలు 509 అంగన్వాడీలకు మాత్రమే ఉన్నాయి. 528 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉచిత భవనాల్లో 466 ఉన్నాయి. మండలానికి రెండేసి చొప్పున నిర్మాణం జిల్లాకు 27 జీపీలు, 62 అంగన్వాడీలు మంజూరు మరో 27 జీపీలకు గుర్తించనున్న స్థలాలు నెలాఖరులోగా స్థలాల ఎంపిక.. పనులు ప్రారంభం వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి భవనాలుభవనాల నిర్మాణాలకు చర్యలు ప్రభుత్వం ప్రతీ మండలానికి రెండు చొప్పున గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు నిర్మించాలని ఆదేశించింది. ఉపాధి కూలీల ద్వారా పనులు కల్పిస్తూ మెటీరియల్ కాంపోనెంట్ మంజూరు చేస్తూ నిర్మాణాలు చేపడతాం. – బాల్రాజ్, అదనపు పీడీ, డీఆర్డీఏ, సంగారెడ్డి -
సర్కారు బడికి ఆదరణ అదరహో!
● బడిబాటలో 14,215 మంది ప్రవేశాలు ● అత్యధికంగా జహీరాబాద్ మండలంలోన్యాల్కల్(జహీరాబాద్): సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. బడుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేయడంతోపాటుగా ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ తదితరాలను సకాలంలో విద్యార్థులకు అందిస్తుండటంతో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని నిర్వహించిన బడిబాట కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల వైఖరిలో మార్పును తెచ్చిపెచ్చినట్లు కనిపిస్తోంది. బడిబాట కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు భాగస్వాములు కావడంతో మంచి స్పందన లభించింది. బడిబాటతో పెరిగిన ప్రవేశాలు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆచార్య జయ శంకర్ బడిబాట ఈ నెల 6న ప్రారంభ 19 వ తేదీ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇల్లిల్లు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధన, నాణ్యమైన విద్య తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో బడి బాటలో 14,215 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఒకటవ తరగతిలో 5,423 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా మిగిలిన 8,792 విద్యార్థులు ఇతర తరగతుల్లో చేరారు. ఇంకా లక్ష్యానికి దూరంగా పదివేలకు పైనే... జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలతో కలిపి మొత్తం 1,249 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 1,09,319 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2025–2026 ఏడాదికి గాను సుమారు 25వేల మంది విద్యార్థులను బడుల్లో చేర్పించాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 14,215 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఇంకా 10,785 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందవలసి ఉంది. ఐతే ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు నెలాఖరు వరకు ఉన్నందున అప్పటివరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బడిబాటలో ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,230 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. జిల్లాలో అత్యధికంగా జహీరాబాద్ మండలంలో 1,374 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా, పటాన్చెరులో 1,095 మంది, జిన్నారంలో 1,092 మంది విద్యార్థులు బడుల్లో చేరారు. గతేడాది 13వేల మంది విద్యార్థులు చేరగా ఈ ఏడాది 19వ తేది నాటికి 14,215 మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు అధికారులు తెలిపారు.ఆగస్టు నెలాఖరు వరకు ప్రవేశాలు ఈనెల 6 నుంచి నిర్వహించిన బడిబాటతో మంచి ఫలితాలు వచ్చాయి. గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతోపాటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు తదితరాలను అందిస్తున్నందున తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి, సంగారెడ్డి -
మరణంలోనూ భర్త వెంటే..
● ఒక్కరోజు వ్యవధిలో దంపతుల ఆత్మహత్య ● సంగారెడ్డి జిల్లా బొల్లారంలో విషాదం జిన్నారం (పటాన్చెరు): భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం పట్టణ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో నివాసముంటున్న గొల్ల గణేష్ (55) అనారోగ్య సమస్యతో బాధపడుతూ మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య అమరావతి (47) భర్త మరణాన్ని జీర్ణించుకోలేక సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చీరతో అదే ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 24 గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడంతో కాలనీ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరువురి మరణం భార్యాభర్తల ప్రేమ అనుబంధాలకు నిదర్శనంగా నిలిచిందని సంఘటనను చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. -
ప్రజావాణి అర్జీలు పరిష్కరించండి: కలెక్టర్
సంగారెడ్డి జోన్/వట్పల్లి(అందోల్): ప్రజావాణిలో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్తోపాటు ఇతర ఉన్నతాధికారులు ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. కాగా, ఒక్కరోజులో ప్రజావాణికి 71 దరఖాస్తులు రాగా అందులో సగానికిపైగా భూ సమస్యలకు సంబంధించిన వినతులే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక కొత్త కలెక్టర్ ప్రావీణ్యను జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు ఏ.మాణయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో కలిసి మొక్కను, సంఘం డైరీని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లల హక్కులు కాపాడండి నా భార్య నేను వేర్వేరుగా జీవిస్తున్నాం. మాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు పెద్ద పిల్లలు అక్షయ శ్రీ, అక్షిత్లను చదివించకుండా వ్యవసాయ పనులతోపాటు ఇంటి పనులు చేయిస్తున్నారు. బాలల హక్కులు సంరక్షించి, పిల్లలు చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఎర్రగొల్ల నాగరాజు, గ్రామం, సదాశివపేట కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి పట్టణంలోని ప్రభుత్వ స్థలంతోపాటు రహదారులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు పత్రాలు సృష్టించి ఇండ్లు లేకున్నా, ఇండ్ల నంబర్లు కేటాయించి స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. –శ్రీధర్, వాజిద్, సంగారెడ్డి -
గుమ్మడిదల టోల్ ప్లాజా తొలగించండి
ఎమ్మెల్సీ అంజిరెడ్డిజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీలో టోల్ప్లాజా ఏర్పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులు, వాహనదారులకు ఆర్థిక భారంగా మారిందని వెంటనే దానిని తొలగించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అధికారి మాధవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేషనల్ హైవే నిబంధన ప్రకారం రోడ్డు ప్రారంభం నుంచి ముగింపు మధ్యలో టోల్ప్లాజా ఏర్పాటు చేయాల్సి ఉండగా రోడ్డు ప్రారంభంలోని గుమ్మడిదలలో ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల, మండలాల ప్రజలకు టోల్ భారం తప్పడం లేదన్నారు. దీంతో జిన్నారం, మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రయాణించే వాహనదారులు టోల్ ప్లాజా ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. గుమ్మడిదల ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో అక్కడ టోల్ ప్లాజా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుందని వెంటనే టోల్ ప్లాజాను తొలగించాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో అంజిరెడ్డితోపాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాప్రెడ్డి తదితరులు ఉన్నారు. -
కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి
కొల్చారం(నర్సాపూర్): ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొల్చారం మండలంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారి కిష్టాపూర్ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం.. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కన్నెబోయిన గంగారాం (33) ఉదయం తన బైక్పై ఏడుపాయల నుంచి మెదక్కు పనిపై వెళ్తున్నాడు. కిష్టాపూర్ సమీపంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం సమీపంలోకి రాగానే.. మెదక్ వైపు నుంచి వస్తున్న కారు.. గంగారం బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కోమటిచెరువు సుందరీకరణ!
ప్రక్షాళన దిశగా బల్దియా అడుగులు ● మూడు కిలోమీటర్ల పొడవునా ప్రక్రియ ● కెనాల్ ఇరువైపులా ఫుట్పాత్ ● అక్రమకట్టడాల తొలగింపు ● రేపో మాపో క్షేత్రస్థాయిలో ఆరా ● రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల జాయింట్ సర్వే సిద్దిపేటజోన్: దశాబ్ధాల చరిత్ర ఉన్న సిద్దిపేట బావిష్ఖానపూల్ కోమటిచెరువు కెనాల్) ప్రక్షాళన దిశగా బల్దియా అడుగులు వేస్తోంది. సుందరీకరణ, అక్రమ కట్టడాల నియంత్రణతో మునిసిపల్ అధికారులు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు. కోమటిచెరువు మత్తడివాగును సుందరీకరణ చేసేందుకు యంత్రాంగం సన్నద్ధం అయింది. సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా ఉన్న కెనాల్ను అందంగా తీర్చిద్దేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే రెండు రోజుల్లో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో కెనాల్కు ఇరువైపులా జాయింట్ సర్వే చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. నీటిపారుదల శాఖ నిబంధనలకు విరుద్ధంగా కెనాల్కు ఇరువైపులా నిర్మించిన అక్రమ కట్టడాల గుర్తింపు ప్రక్రియ జాయింట్ సర్వే ద్వారా తేల్చనున్నారు. కెనాల్కు ఇరువైపులా పాదచారుల నడక కోసం పాత్ వేతో పాటు రెండు పక్కలా బయో ఫెన్సింగ్ చేయాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు మత్తడివాగు చాలా పురాతనమైనది. కోమటిచెరువు వరద నీటి ప్రవాహం మత్తడి ద్వారా ఇదే కెనాల్ మార్గం గుండా నర్సాపూర్ చెరువులోకి వెళ్లేది. ప్రస్తుతం పట్టణం పెరిగిపోతోంది. దీనితో కెనాల్ ఇరువైపులా నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరోవైపు కెనాల్ పర్యవేక్షణ వైఫల్యం వల్ల కెనాల్ మొత్తం గుర్రపు డెక్క, చెత్త చెదారం లాంటి వాటితో నిండిపోయింది. కెనాల్ అస్తవ్యస్తంగా మారి పట్టణ సుందరీకరణకు ఆటంకంగా మారింది. వర్షాకాలంలో కోమటిచెరువు నీటి మట్టం పెరిగిపోయి, మత్తడి ద్వారా నీటి ప్రవాహం, దీనికి తోడు వర్షాల వరదనీటి ప్రవాహానికి కెనాల్లో నిండుకున్న మట్టి, గుర్రపు డెక్క అడ్డంకిగా మారుతోంది. దీనితో రోడ్లపైకి వరద నీరు ఉప్పొంగి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం బల్దియా కోమటిచెరువు కెనాల్ సుందరీకరణ ప్రక్రియ చేపట్టింది. మూడు శాఖలతో సర్వే కోమటిచెరువు నుంచి నర్సాపూర్ వరకు ఉన్న నీటిపారుదల శాఖ కెనాల్ హద్దులు తేల్చే లెక్కల్లో అధికారులు ఉన్నట్లు సమాచారం. నీటిపారుదల శాఖ నిబంధనల మేరకు ఇరువైపులా కెనాల్కు ఒక మార్కింగ్ ఇచ్చి భూముల అన్యాక్రాంతం కాకుండా చూడాలనే సమాలోచనలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అందుకు సంబంధించిన రెండు, మూడు రోజుల్లో రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ అధికారులు జాయింట్ సర్వే చేయనున్నారు. మూడు కిలోమీటర్ల పొడవునా కెనాల్ మధ్య భాగం నుంచి ఇరువైపులా కొలతలు వేసి, నిబంధనల ప్రకారం హద్దులు నిర్ణయించాలని సంకల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన అక్రమ కట్టడాలు గుర్తించి వాటికి నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ద్విముఖ లక్ష్యంతో... కోమటిచెరువు కెనాల్ను సుందరీకరణ చేస్తూ. కెనాల్కు ఇరుపక్కలా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా పరిరక్షణకు బల్దియా సుందరీకరణ పేరిట ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగానే కోమటిచెరువు నుంచి హైదరాబాద్ రోడ్డు బ్రిడ్జి (బావిష్ ఖాన ఫుల్) వరకు ఒక భాగంగా, అక్కడి నుంచి నర్సాపూర్ చెరువు వరకు రెండవ భాగంగా విభజన చేసింది. మూడు కిలోమీటర్ల పొడవునా ఉన్న కెనాల్లో మొదటి దశలో డెక్క, సిల్ట్, చెత్త చెదారం తొలగించి, కెనాల్కు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తీసివేసే ప్రక్రియ చేపట్టారు. కెనాల్ను శుద్ధి చేసి తదుపరి చర్యలో కెనాల్కు రెండు వైపులా పట్టణ ప్రజలు వాకింగ్, జాగింగ్ చేసేలా పాత్ వే నిర్మాణం, ఇరుపక్కలా గచ్చకాయ చెట్లతో బయో ఫెన్సింగ్ చేయనున్నారు. అక్కడక్కడ వివిధ రకాల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశారు. కెనాల్ ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాక్షన్ ప్లాన్లో భాగంగా.. వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా కోమటిచెరువు కెనాల్ బ్యూటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. వర్షాకాలంలో వరద నీటి ప్రవాహనికి అడ్డంకులు లేకుండా కెనాల్ శుద్ధి చేస్తాం. ఇరువైపులా పాత్ వే, బయో పెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చూస్తాం. త్వరలో జాయింట్ సర్వే జరగనుంది. –ఆశ్రిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ -
పీహెచ్డీ అవార్డు గ్రహీతలకు సన్మానం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల పీహెచ్డీ అవార్డును పొందిన ఐదుగురు అధ్యాపక బృందానికి సోమవారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ఎస్.రత్న ప్రసాద్ మీడియాకు వివరించారు. నూతనంగా డాక్టరేట్ పొందిన అధ్యాపకులలో వృక్షశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ సోఫియా రాణి, మైక్రో బయాలజీ విభాగానికి చెందిన డాక్టర్ వెంకట రామచందర్, కామర్స్ విభాగానికి చెందిన డాక్టర్ రవీందర్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అశ్విని, ఫిజిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ మంజులను కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ నిర్మల, జగదీశ్వర్, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి కామరాజ్, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సంఖ్యను పెంచాలి
● ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించండి ● ఎంఈవోలు రోజుకు రెండు పాఠశాలలు తనిఖీ చేయాలి ● కలెక్టర్ ప్రావీణ్య ఆదేశం ● ఎంఈఓ, కస్తూర్బా ఎస్ఓలతో సమీక్ష సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. సోమవారం ఎంఈఓలు కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారుల బడిబాట, మనఊరు– మనబడి, పాఠశాల విద్యా పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సర్కార్ కల్పిస్తున్న సౌకర్యాలు , విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు వార్షిక విద్యా క్యాలెండర్ను పూర్తిగా అమలు చేయాలన్నారు. తనిఖీలకు వెళ్లినప్పుడు సమస్యలను విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో చదువుకోవడం ఆపేసిన బాలికలను ఆయా మండలాలలో గల కస్తూర్బా పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంఈఓలు ప్రతిరోజు కనీసం రెండు పాఠశాలలను తనిఖీ చేయాలన్నారు. ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల హాజరు శాతం ఉపాధ్యాయుల బోధనకు విద్యార్థులు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు.. తదితర విషయాలను గమనించాలన్నారు. ప్రతిరోజు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో తనిఖీ వివరాలు నమోదు చేయాలని చెప్పారు. మనఊరు– మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నచోట వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 3429 మంది విద్యార్థులు వివిధ కళాశాలలో చేరినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి గోవిందరావు, టీజీ ఈడబ్ల్యుఐడీసీ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● ఆ పాఠశాలల బకాయిలు చెల్లించాలి
దళిత, గిరిజనసంఘాల డిమాండ్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు చెందిన బకాయిలు తక్షణ మే చెల్లించాలని దళిత, గిరిజన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ మేరకు సోమవారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత సంఘా ల నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ... మూడేళ్ల నుంచి రావాల్సిన బకాయిలు రూ.200 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆ పాఠశాలలకు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలలకు రానివ్వడం లేదన్నారు. బెస్ట్ అవైలబుల్ హాస్టల్స్ను తెరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, అంబేడ్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయం ఏదీ?
రైతు కూలీలపైఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందని ద్రాక్షేనా?ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రైతు కూలీలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. పథకాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా 70గ్రామాల్లో ప్రారంభించి దాదాపు ఐదు నెలలవుతున్నప్పటికీ ఇంకా అన్ని గ్రామాల్లో అమలు చేయడం లేదు. లబ్ధిదారులు ఎంపికై నప్పటికీ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మారింది. భూమిలేని ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా కింద ఏటా రూ.12వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు విడతల్లో సాయం అందించనుంది. అందులో భాగంగా జనవరి 26న జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలం ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి 2,181 మందికి ఆత్మీయ భరోసా అందించారు. 70 గ్రామాలకే పరిమితం ఉమ్మడి మెదక్ జిల్లాలో 70మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి జనవరి 26న 2.181 మందికి మంజూరు పత్రాలను అందజేశారు. తర్వాత రూ.6వేల చొప్పున బ్యాంక్ ఖాతాలలో రూ. 1,30,86,000 జమ చేశారు. పైలెట్ ప్రాజెక్ట్లో అందుకున్న వారికి మరో నెల రోజులైతే రెండో విడత సాయం అందించాల్సిన సమయం వస్తుంది. మిగతా లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా వస్తుందా? రాదా ? అని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఇస్తారనేది అధికారులు ఎవరు చెప్పడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింది ఎంపిక చేసిన లబ్ధిదారులకు సాయం అందజేయాలని కోరుతున్నారు. ఆత్మీయ పథకం వివరాలు.. జిల్లా లబ్ధిదారులు సంగారెడ్డి 22,792 సిద్దిపేట 16,505 మెదక్ 12,521 పైలెట్ గ్రామాలకే పరిమితమా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 51,818 మంది లబ్ధిదారులు ఎంపిక త్వరగా అందజేయాలంటూ వేడుకోలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. వ్యవసాయ భూమి లేనివారు, ఉపాధి హామీ కూలీగా 20 రోజుల పాటు పని చేసిన వారు అర్హులని నిబంధన పెట్టారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,531 గ్రామాల్లో 51,818 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో ఇప్పటి వరకు 2,181 మందికే అందించడంతో 49,637 మంది లబ్ధిదారులు ఆత్మీయ భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. -
పైసలిస్తేనే రిజిస్ట్రేషన్ !
● భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం నాలుగురోజులుగా ఓ మహిళ ప్రదక్షిణలు ● ఖేడ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన మహిళ ఆందోళన ● లంచం అడగలేదని తహసీల్దార్ వివరణ నారాయణఖేడ్: మనవళ్ల పేరిట భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వస్తే.. పైసలిస్తేనే గానీ పనికానిచ్చేది లేదని అధికారులు నాలుగైదు రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటు న్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సదరు మహిళ ఆందోళనకు దిగింది. ఖేడ్ మండలంలో సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు బాధితుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. కొండాపూర్ స్కూల్ తండాకు చెందిన లక్ష్మీబాయికి ఖేడ్ మున్సిపల్ పరిధిలోని మన్సుర్పూర్ శివారులో ఎకరం భూమి ఉంది. ఈ భూమిని తన మనవళ్లు అయిన వినోద్, శ్రీకాంత్ల పేరుపై గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు నాలుగు రోజుల క్రితం ఖేడ్ రెవెన్యూ కార్యాలయానికి వెళ్లింది. ఆయా రికార్డులు పరిశీలించిన అధికారులు రిజిస్ట్రేషన్కు సంబంధించి నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసి ఫొటోలు కూడా తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సోమవారం రావాల్సిందిగా లక్ష్మీబాయికి అధికారులు చెప్పగా...అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అధికారులు చెప్పిన ప్రకారం సోమవారం కార్యాలయానికి వచ్చిన లక్ష్మీబాయి రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూసింది. అయితే డబ్బులు ముట్టజెబితేనే రిజిస్ట్రేషన్ చేస్తామని తహసీల్దార్ హసీనాబేగం చెప్పడంతో విసిగిపోయిన లక్ష్మీబాయి తన కుటుంబ సభ్యులతో కలసి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. భూమి రిజిస్ట్రేషన్ చేసేంతవరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పగా సిబ్బంది వచ్చి ఆమెకు సర్దిచెప్పారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ఈ ఘటనపై తహసీల్దార్ హసీనాబేగంను వివరణ అడగగా...ముడుపుల కోసం లక్ష్మీబాయిని తను వేధించలేదని, మొత్తం మనవళ్ల పేరుమీద భూమి రిజిస్ట్రేషన్ చేస్తే ఆమె జీవనాధారం ఏమిటని మాత్రమే అడిగానని చెప్పారు. ఇక లక్ష్మీబాయి కూతుళ్లను కూడా రిజిస్ట్రేషన్కు తీసుకురావాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. -
● అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేయాలి
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్సంగారెడ్డి ఎడ్యుకేషన్: అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యకార్మికులను, స్వీపర్లను విద్యాశాఖ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ...విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇస్తున్న రూ.2 వేల నుంచి రూ. 3 వేలు కాకుండా స్కావెంజర్లకు , స్వీపర్ లకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి పనికి సంబంధించిన సామగ్రిని, యూనిఫాంను, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సాయిలు, సహాయ కార్యదర్శి లక్ష్మి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మన మహోత్సవం కార్యక్రమంపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటేందుకు ముందుగానే అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి కల్హేర్(నారాయణఖేడ్): రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని నారాయణఖేడ్ ఏడీఏ నూతన్కుమార్ కోరారు. సోమవారం మండలంలోని కృష్ణాపూర్లో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ చేపట్టారు. ఫార్మర్ రిజిస్ట్రీ గురించి అవగాహన కల్పించారు. వాసవీమాతదయతోనే పదవిసంగారెడ్డి టౌన్: వాసవీ కన్యకా పరమేశ్వరీమాత దయతోనే తనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కిందని తోపాజి అనంత కిషన్ పేర్కొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తోపాజి అనంత కిషన్ను సంగారెడ్డిలోని శ్రీ వాసవీ మహాసంస్థాన్లో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆర్య వైశ్యులు దేవాలయ కమిటీ సభ్యులు, తనపై చూపుతున్న ఆదరాభిమానాలకు సదా కృతజ్ఞుడినన్నారు. దేవాలయాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలిజహీరాబాద్ టౌన్: పెండింగ్లో ఉన్న ఆస్పత్రి కార్మికుల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ కోరారు. ప్రభుత్వాస్పత్రి కాంట్రాక్టు కార్మికులతో కలిసి సోమవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ...ప్రతీ నెల 7 తేదీలోపు జీతాలు ఇవ్వాల్సి ఉండగా 23 రోజులైనా ఇంతవరకు చెల్లించలేదన్నారు. కార్మికులంతా నిరుపేదలని, జీతంపైనే ఆధారపడి కుటుంబ పోషణ చేస్తున్నారని వాపోయారు. రెండురోజుల్లో జీతాలు చెల్లించకుంటే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు. కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంజహీరాబాద్ టౌన్: హోతి(కె) కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేకాధికారి ఎం.లక్ష్మి సోమవారం ప్రకటనలో తెలిపారు. విద్యాలయంలో అటెండర్, నైట్ వాచ్ఉమెన్, అసిస్టెంట్ కుక్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొగుడంపల్లికి చెందిన విద్యాలయంలో హోతి(కె)లో కొనసాగుతుందని, స్థానికులు మాత్రమే ఈ నెల 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. 18–45 ఏళ్ల వయసు కలిగిన మహిళలు అర్హులన్నారు. వాచ్మెన్ పోస్టుకు 10వ తరగతి , అసిస్టెంట్ కుక్కు 7వ తరగతి చదవి ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9542174387 నంబర్కు సంప్రదించాలని చెప్పారు. అందాల పోటీల్లో జహీరాబాద్ బాలికజహీరాబాద్ టౌన్: జహీరాబాద్లోని అల్లీపూర్కు చెందిన ప్రార్థన రాయ జూనియర్ మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నారు. బట్టు రాజు బెంజిమన్ కుమార్తె ప్రార్థనరాయ(13) హైదరాబాద్లోని కూకట్పల్లి నెక్సాస్మాల్లో సోమవారం జరిగిన అందాల పోటీలకు హాజరై ర్యాంప్ వాక్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ప్రార్థనరాయ ఈ పోటీల్లో పాల్గొనడం పట్ల తల్లిదండ్రులు బెంజిమన్, ప్రణీతలు హర్షం వ్యక్తం చేశారు. -
అవే వినతులు!
జిల్లా అధికారులు రావాల్సిందే.. ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ విషయంలో జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రజావాణికి రాకుండా తమ కింది స్థాయి సిబ్బందిని పంపుతున్నారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్న ఈ అధికారులు ప్రతీ సోమవారం ప్రజావాణి ఎగనామం పెట్టడం సాధారణమైపోయింది. దీన్ని గమనించిన కొత్త కలెక్టర్ ప్రావీణ్య తప్పనిసరిగా ఆయా శాఖ జిల్లా ఉన్నతాధికారులే స్వయంగా ప్రజావాణికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. కారణం లేకుండా కిందిస్థాయి సిబ్బందిని పంపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : భూ భారతి రెవెన్యూ చట్టం అమలులో భాగంగా మూడు రోజుల క్రితం వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు జరిగాయి. ఈ సదస్సుల్లో తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఏకంగా వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ సదస్సులు ముగిసి మూడు రోజులు కాకముందే సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అవే భూసమస్యలపై అత్యధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. పి.ప్రావీణ్య కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన రెండో ప్రజావాణి కార్యాక్రమానికి సోమవారం పెద్ద సంఖ్యలో జిల్లా వాసులు తరలివచ్చిన వినతిపత్రాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చిన దరఖాస్తుదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. పెద్ద ఎత్తున క్యూ దర్శనమిచ్చింది. ఆన్లైన్లో నమోదైన 1,436 అర్జీలు జిల్లాలో జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు జరిగిన విషయం విదితమే. మొత్తం 574 గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 13,888 దరఖాస్తులు వచ్చాయి. తమ భూ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ప్రజలు ఈ దరఖాస్తులు చేసుకున్నారు. ముందుగా పైలెట్ మండలాల్లో సదస్సులు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత అన్ని మండలాల్లో ఈ సదస్సులు చేపట్టారు. ఈ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,436 దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరిచారు. మిగిలిన వాటినికి కూడా ఆన్లైన్ చేయనున్నారు. ప్రజావాణిలోనూ అవే రెవెన్యూ సదస్సు ముగిసి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ప్రజావాణి కార్యక్రమంలో ఈ భూసమస్యల దరఖాస్తులే వెల్లువెత్తాయి. మొత్తం 71 దరఖాస్తులు రాగా, ఇందులో 32 దరఖాస్తులు భూసమస్యలకు సంబంధించినవేనని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. సుమారు 52 శాఖలకు కలిపి 71 దరఖాస్తులు వస్తే..రెవెన్యూశాఖకు సంబంధించిన భూ సమస్యల దరఖాస్తులు సుమారు సగం ఉండటం గమనార్హం. తమ సమస్య పరిష్కారం కోసం ప్రజలు చెప్పులరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. ఎంతో ఆశతో వస్తున్న జిల్లా ప్రజలు ఈసారైనా తమ సమస్య పరిష్కారం కాకపోతుందా అని కలెక్టరేట్కు వస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భూవివాదాలకు సంబంధించిన వినతిపత్రాలే ప్రజావాణిలో ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి రికార్డుల్లో తన పేరును పూర్తిస్థాయిలో నమోదు చేసుకోవడంలో నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. దీంతో అమ్మిన వ్యక్తులు వచ్చి రికార్డుల ప్రకారం తామే ఉన్నామని, అక్రమంగా తమ భూమిని కబ్జాను చేస్తున్నారని అమ్మిన వ్యక్తులు ఇస్తున్న దరఖాస్తులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో13వేలకు పైగా దరఖాస్తులు ప్రజావాణిలోనూ భూసమస్యలపైనేఅత్యధిక వినతులు -
పేలిన సిలిండర్
● తృటిలో తప్పిన పెను ప్రమాదం ● మహిళకు గాయాలు నారాయణఖేడ్: ప్రమాదవశాత్తు వంటగ్యాస్ సిలిండర్ పేలి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఒకరు గాయాలతో బయట పడ్డారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలంలోని జంబికుంటలో భూలక్ష్మమ్మ జాత ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో అన్ని కుంటుంబాల్లో బంధువుల అలజడి ఉంది. గ్రామానికి చెందిన నీరుడి మోహన్కు చెందిన కుటుంబంలో బందువుల రాకతో 25 మంది వరకు ఉన్నారు. ఉదయం బంధువులకు టిఫిన్ చేసేందుకు మోహన్ అత్త నాగమణి వంటగ్యాస్ సిలిండర్పై టిఫిన్ను తయారు చేస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఎగిసి పడ్డాయి. నాగమణి చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబీకులు, బంధువులు వెంటనే స్పందించి ఇంట్లోని నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు చాలాసేపు ఎగిసి పడ్డాయి. కుటుంబీకులు, కాలనీవాసులు నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇంటి పైకప్పు, దూలాలు, బట్టలు, విద్యుత్ వైర్లు, బల్బులు పూర్తిగా కాలిపోయాయి. ఇల్లు కాలిపోయి పూర్తిగా దెబ్బతింది. ప్రమాద విషయం తెలుసుకొని తహసీల్దార్ నాగజ్యోతి ఆదేశాల మేరకు ఆర్ఐ జాన్సన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. -
రైస్మిల్లు కార్యాల యంలో రూ. 90 వేలు చోరీ
శివ్వంపేట(నర్సాపూర్): రైస్మిల్లు కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ సంఘటన అదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శివ్వంపేట గ్రామ శివారులో ఉన్న ఓంసాయి వెంకటరమణ రైస్మిల్లు కార్యాలయంలోకి గుర్తుతెలియని వ్యక్తి గదుల తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డాడు. కౌంటర్లో ఉన్న రూ.90 వేలు తస్కరించాడు. నిందితుడు ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజ్ ధరించి సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఎస్ఐ మధుకర్రెడ్డి, క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. మిల్లు యజమాని రంగాయ్యగుప్తా ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉసురు తీసిన అప్పులు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పాపన్నపేట(మెదక్): అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చింతకుంట గంగయ్య(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పొలంలో మూడు బోర్లు వేసినా ఆశించిన రీతిలో నీరు పడలేదు. దీంతో పంట దిగుబడి తగ్గింది. దీనికి పెద్దకూతురు పెళ్లికి అప్పు చేశాడు. అప్పులను తీర్చడానికి భూమి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. ప్రస్తుతం భూమి అమ్మితే.. ,రెండో కూతురు పెళ్లి ఎలా చేయాలన్న ఆవేదనతో ఈ నెల 15న క్రిమి సంహారక మందు తాగాడు. పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పార్ట్టైం జాబ్ పేరిట మోసం రూ.6.58 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు నర్సాపూర్: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఓ వ్యక్తి రూ.6.58 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పార్ట్టైం జాబ్ పై ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ లింకు ఓపెన్ చేయాలని ఉదయ్కిరణ్కు మెసేజ్ వచ్చింది. అతను లింకును ఓపెన్ చేయగా రూ.10,870 బోనస్ పాయింట్స్ వచ్చాయని ఉంది. అనంతరం కొన్ని రోజులకు రూ.10 వే లు పెట్టుబడి పెట్టాడు. దీంతో ఖాతాకు కొన్ని డబ్బులు వచ్చాయి. కొన్నాళ్ల పాటు వైబ్సైట్కు ఉదయ్కిరణ్ డబ్బులు పంపడం, అతనికి తిరి గి డబ్బులు వచ్చాయి. ఇలా రూ.6.58 లక్షలు జమ చేశాడు. డబ్బులు డ్రా చేసుకునేందుకు యత్నించగా.. అది పని చేయకపోవడంతో మోస పోయాయని గ్రహించిన ఉదయ్కిరణ్ గుర్తించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు. మోకు మేకై ందితాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు చేర్యాల(సిద్దిపేట): తాటి చెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దరాజుపేటలో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యడ చంద్రంగౌడ్ ఎప్పటిలాగే కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తూ మోకు జారి కింద పడ్డాడు. గమనించిన తోటి గీత కార్మికులు.. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కల్లు గీత వృత్తిపైనే ఆధారపడి జీవించే చంద్రంను ప్రభుత్వం ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి అరుణ్ కోరారు. ఏడుగురు జూదరుల అరెస్టు చేగుంట(తూప్రాన్): జూదం ఆడుతున్న వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన చేగుంట మండలంలోని చిట్టోజిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం చిట్టోజిపల్లి శివారులో జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు నిందితులను పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.44వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. సీజ్ చేసిన ఇసుక డంప్ మాయం తూప్రాన్: సీజ్ చేసిన ఇసుక డంప్ మాయమైంది. ఈ మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని కిష్టాపూర్ హల్దీవాగులో అక్రమంగా ఇసుక ఫిల్టర్ ద్వారా తయారు చేసిన ఇసుక డంప్ను ఎస్ఐ శివానందం, రెవెన్యూ అధికారులు ఈ నెల 20న సీజ్ చేశారు. 23న సోమవారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. కానీ సీజ్ చేసిన ఇసుక డంప్ను అక్రమ వ్యాపారులు రాత్రికి రాత్రే డంప్ను మాయం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
న్యాల్కల్(జహీరాబాద్): మత్తు పదార్థాలకు అలవాటు పడి కొందరు విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని హద్నూర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ అన్నారు. న్యాల్కల్లోని ఎస్బీఐ ఆవరణలో మాదక ద్రవ్య నిర్మూలన కార్యక్రమంపై ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు. మత్తు పదార్థాలు వినియోగించడం, సరఫరా చేయడం నేరమన్నారు. డ్రగ్స్ వినియోగించడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక పీఏసీఎస్ చైర్మన్ సిద్ధిలింగయ్యస్వామి, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం
సంగారెడ్డి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ సీనియర్ నాయకుడు కర్కం శ్రీశైలం యాదవ్ అన్నారు. పట్టణంలోని 9వ వార్డు గొల్లగూడెం కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి మురికి నీరు పోవడానికి కాలువలు సరిగ్గా లేక అవస్థలు పడుతున్న కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం శ్రీశైలంయాదవ్ అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత మురికి నీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. కాలనీవాసులకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానన్నారు. అనంతరం కాలనీవాసులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిరణ్గౌడ్, సతీష్రెడ్డి, రాంరెడ్డి, కాలనీవాసులు రాజేశ్వర్, మాణిక్యం, నవీన్, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
యువతి అదృశ్యం
పటాన్చెరు టౌన్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మెదక్కు చెందిన స్వరూప, కూతురు లావణ్యతో కలిసి నాలుగు రోజుల క్రితం అమీన్పూర్లో ఉండే పెద్ద కూతురు భానుప్రియ వద్దకు వచ్చింది. శనివారం భానుప్రియ కూలీ పనికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంటి వద్ద ఉన్న లావణ్య బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి స్వరూప ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మమ్మను చూసేందుకు వచ్చి.. పటాన్చెరు టౌన్: అమ్మమ్మను చూసేందుకు వచ్చిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దివ్య ఈనెల 15వ తేదీన గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో ఉన్న అమ్మమ్మ వెంకట వరలకి్ష్మ్ని చూసేందుకు వచ్చింది. ఈ క్రమంలో 18వ తేదీన ఆమెను డిశ్చార్జ్ చేయగా వారితో కలిసి అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ వందనపుర కాలనీకి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు కోసం వెతకగా బ్యాగు తీసుకుని వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
47 మందిపై కేసులు నమోదు
సిద్దిపేటకమాన్: పట్టణ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆదివారం నిర్వహించిన ఆకస్మిక వాహన తనిఖీల్లో 47 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని రాజీవ్ రహదారిపై, ఇతర ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది ఆదివారం సాయంత్రం 5నుంచి 7 గంటల వరకు ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 47 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో పాటు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 65 ఈ పెట్టి కేసులతో పాటు మొత్తం 375 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వాహన తనిఖీల్లో సీఐలు వాసుదేవారావు, ఉపేందర్, శ్రీను, సైదా, లతీఫ్, మహేందర్రెడ్డి, ప్రవీణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది బస్టాండ్లో మరిచిపోయిన బ్యాగు అప్పగింత హుస్నాబాద్: ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో తమ నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... హుస్నాబాద్ బస్టాండ్లో బస్సు ఎక్కిన ఓ మహిళా ప్రయాణికురాలు బస్టాండ్లోనే బ్యాగు మరిచిపోయింది. రద్దీగా ఉండటంతో బస్సు సీటు ఆపడం కోసం బస్సు ఎక్కింది. గ్రామానికి వెళ్లాక బ్యాగు మర్చిపోయినట్లు గుర్తించి ఆర్టీసీ సిబ్బందికి సమాచారం అందించింది. సమాచారం అందిన వెంటనే బ్యాగు రికవరీ చేసిన ఆర్టీసీ సిబ్బంది తిరిగి ప్రయాణికురాలి కుటుంబ సభ్యులకు బ్యాగును సురక్షితంగా అప్పగించారు. బ్యాగులో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు, 20 తులాల వెండి, రూ.15వేలు నగదు ఉన్నాయి. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికురాలు, ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయి ఫుట్బాల్కు గజ్వేల్ క్రీడాకారులుగజ్వేల్రూరల్: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్కు గజ్వేల్ ఫుట్బాల్ అసోసియేషన్కు చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు జీఎఫ్ఏ(గజ్వేల్ ఫుట్బాల్ అసోసియేషన్) అధ్యక్షుడు గంగిశెట్టి రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ –15 బాలుర ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలో గజ్వేల్ ఫుట్బాల్ అసోసియేషన్కు చెందిన క్రీడాకారులు కే.సాయి, సీహెచ్.సుశాంత్. ఎం.కార్తీక్ ఎంపికై నట్లు తెలిపారు. ఈనెల 28 నుంచి జూలై 1వరకు నిజామాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులతో పాటు కోచ్ నాగేష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీఎఫ్ఏ ప్రతినిధులు నరేష్, శ్రీనివాస్, సతీష్, శ్రీకాంత్, మహేష్ పాల్గొన్నారు. కుక్కల దాడి.. లేగదూడ మృతి రేగోడ్(మెదక్): కుక్కల దాడిలో ఓ లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని మర్పల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు భూంరెడ్డికి చెందిన ఆవుకు ఇటీవల ఓ లేగదూడ జన్మించింది. మూడు రోజుల ఆ దూడపై కుక్కలు పైశాచికంగా దాడిచేసి పీక్కుతిన్నాయి. గమనించిన స్థానికులు కుక్కలను వెంబడించి తరిమేశారు. గతంలో కూడా పలువురిపై కుక్కలు దాడి చేశాయని గ్రామస్తులు తెలిపారు. కుక్కలను నివారించాలని గతంలో అధికారులకు వినతిపత్రం అందజేశామన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తి ఆత్మహత్య జిన్నారం (పటాన్చెరు): అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేసన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... నగర పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసముండే గొల్ల నారాయణ రావు కొంత కాలంగా కంటి సమస్యతో బాధపడుతున్నాడు. కాగా పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉన్నత చదువులకోసం వెళ్లి..
విగతజీవిగా వచ్చి... ● చాట్లపల్లి విద్యార్థి పంజాబ్లో ఆత్మహత్య ● మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు ● సిద్దిపేట జిల్లాలో విషాదంజగదేవ్పూర్(గజ్వేల్): ఉన్న ఒక కొడుకు ఉన్నత చదువుల కోసం పోయి కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. చక్కగా చదువుకో కొడుకా అంటూ సాగనంపిన తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. ఏమైందో ఏమో కానీ అతడు ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బరిగె భిక్షపతి, కవిత దంపతులు. వీరికి కొడుకు అజయ్(22), కూతురు ఉన్నారు. దంపతులిద్దరు గ్రామంలోనే తమకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఉన్నత చదువుల కోసం పంజాబ్ రాష్ట్రంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చేరాడు. బీటెక్ నాలుగోవ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెలలో స్వగ్రామానికి వచ్చి తిరిగి ఈ నెల 10న కళాశాలకు వెళ్లాడు. తండ్రికి ఫోన్ చేసి కళాశాల ఫీజు కోసం డబ్బులు పంపమని అడుగగా పంపించారు. ఇంతలోనే ఏమైందో ఏమోగానీ ఈ నెల 20న అక్కడే ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాడ్జి నిర్వాహకులు తన ఫోన్ ద్వారా స్నేహి తులకు సమాచారం అందించారు. వెంటనే స్నేహితులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమా చారం అందించారు. అక్కడి పోలీసులు కేసు నమో దు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు, అక్కడి నుంచి చాట్లపల్లికి తీసుకొచ్చారు. అయ్యో బిడ్డా.. అయ్యో బిడ్డా మమ్మల్ని ఆగం చేసి పోతివా అంటూ ఆజయ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. చివరి చూపు కోసం తండోపాతండాలుగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత వంటేరు ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
గుగ్గిల్లలో భారీ చోరీ
రూ.4.10లక్షలు, వెండి ఆభరణాలు అపహరణబెజ్జంకి(సిద్దిపేట): ఓ ఇంట్లో నగదుతో పాటు వెండి ఆభరణాలను గుర్తు తెలియని దండగులు అపహరించారు. ఈ ఘటన మండలంలోని గుగ్గిల్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ శంకర్రావు కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కేడిక కృష్ణారెడ్డి, భార్య రమ వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తున్నారు. శనివారం రాత్రి ఇంటి ఆరు బయట పడుకున్నారు. ఇంట్లో టీవీ బంద్ చేయడానికి అర్ధరాత్రి కృష్ణారెడ్డి వెళ్లి తిరిగి వస్తుండగా ఇంటి వెనుక గల దర్వాజ తెరిచి ఉంది. అనుమానంతో వెంటనే పక్క గదిలో వున్న బీరువాను పరిశీలించగా తాళం తీసి వుంది. ఫైనాన్స్లో కట్టేందుకు అప్పుగా తెచ్చి బీరువాలో పెట్టిన రూ.4.10 లక్షలు, బంగారు వెండి ఆభరణాలతో పాటు మరో బ్యాగులోని 10వేల నగదును దుండగులు అపహరించారు. దొంగలు పడ్డారని అరువడంతో స్థానికులు వీధిలోకి వచ్చారు. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల యువకులిద్దరు ఆయిల్ పూసుకుని కత్తులు పట్టుకుని వెళ్లడం చూశామని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఏఎస్ఐ శంకర్రావు పరిశీలించారు. చోరీ ఘటనలో 4.65 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను గుర్తించేందుకు రెండు టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశామని పేర్కొన్నారు. -
ఇప్పటికే వర్షాలు కురిసేవి
జూన్లో వర్షాలు ప్రారంభమయ్యేవి. ఏప్రిల్లో వర్షాలు కురవడంతో సంబురపడ్డాం. కానీ ఆఽశించిన మేర కురవడం లేదు. చిరుజల్లులు మాత్రమే అప్పుడప్పుడు వస్తున్నాయి. రైతులు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్ప్రింక్లర్లు, డ్రిప్ల ద్వారా పంటలకు నీరు అందించాల్సి వస్తుంది. –రాజిరెడ్డి, రైతు, మాచాపూర్ జూలై 15 వరకు విత్తుకోవచ్చు జిల్లాలో పలు చోట్ల రైతులు విత్తనాలు విత్తారు. జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అందువల్ల మంచి వర్షాలు కురిశాకే విత్తనాలు వేయాలి. కందులు సెప్టెంబర్ వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్న సంవత్సరం పొడవున విత్తుకునే అవకాశం ఉంది. రైతులు అధైర్యపడొద్దు. వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి. –రాధిక, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
వికాస్నగర్ వెల్ఫేర్ సొసైటీ వద్ద ఉద్రిక్తత
పటాన్చెరు: మండలం పరిధి ఇంద్రేశం గ్రామంలోని వికాస్నగర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ప్లాట్లు యజమానులను వెంచర్ల లోపలికి వెళ్లనివ్వకుండా గేటు వేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్లాట్ల యజమానులు వెంచర్ అభివృద్ధి నిమిత్తం మాట్లాడుకునేందుకు వచ్చి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సీఐ వినాయక్ రెడ్డి వచ్చి ఇరు వర్గాల వారితో మాట్లాడారు. ప్లాట్లు యజమానులు లోనికి రానివ్వకుండా అడ్డు చెప్పవద్దని సొసైటీ సభ్యులను హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే రెండు రోజుల తర్వాత ఇరు వర్గాల వారు దస్త్రాలు తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తానని సీఐ తెలిపారు. -
స్థానిక ఎన్నికల కోసమే హడావిడి
నారాయణఖేడ్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు హడావిడి చేస్తున్నారని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. రైతు భరోసా కింద సహాయం రూ.15 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు హామీనిచ్చి రెండు విడతలు ఇవ్వకపోగా ప్రస్తుతం రూ.12 వేలకు పరిమితం చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజల పేరిట సందడి చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే లబ్ధిదారుల ఖాతాల్లో అడ్వాన్సుగా బిల్లులు వేసి నిర్మించుకునేలా చేయాలన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మాజీ జెడ్పీటీసీ రవీందర్ నాయక్, మండల మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వరాచారి, ముజమ్మిల్, సంగప్ప, వెంకటేశం, మల్గొండ, లక్ష్మన్రావు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
తూప్రాన్, మనోహరాబాద్(తూప్రాన్): పొలం వద్ద కరెంటు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్గౌడ్ వివరాల ప్రకారం... తూప్రాన్ మండలంలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన మర్రి రాములు( 49) పదేళ్లుగా కాళ్లకల్ గ్రామ పంచాయతీలో ఔట్సోర్సింగ్ విద్యుత్ ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తాను సొంతంగా ప్రైవేట్గా విద్యుత్ మరమ్మతు పనులు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో రాములు, మరో కార్మికులు నర్సింహ, మైలారం మల్లేష్లతో కలిసి కాళ్లకల్ గ్రామానికి చెందిన రైతులు సాయం సంజీవ, దుర్గయ్యల పొలంలో విద్యుత్ మరమ్మతుల పనులు చేయడానికి వెళ్లారు. కాగా అక్కడ స్టాటర్బాక్స్కు విద్యుత్ సరఫరా రావడం లేదు. దీంతో రాములు విద్యుత్ స్తంభం ఎక్కి వైర్ సరి చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని కుటుంబీకులు, అల్లాపూర్ గ్రామస్తులు ప్రభుత్వ ఆస్పత్రి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు. కాగా మృతునికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి.. కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివా స్ కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లాలోని అన్నా రం గ్రామానికి చెందిన అవిరాల్ సింగ్ టొమర్ (27) వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంగారెడ్డి నుంచి ఉదయం రెండు ద్వి చక్ర వాహనాలపై స్నేహితులతో కలిసి రంగనాయ క్ సాగర్ను సందర్శించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కుకునూరుపల్లి శివారులో వాహనం అదుపు తప్పి రాజీవ్ రహదారి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అవిరాల్ సింగ్ టొమర్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులు కుటుంబీకులకు సమాచా రం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్.. గజ్వేల్రూరల్: రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పట్టణానికి చెందిన కాశమైన చేతన్కుమార్(23) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. మూడ్రోజుల క్రితం జగదేవ్పూర్లోని పోలీస్స్టేషన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న చేతన్కుమార్ను ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లాడు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు అవయవదానానికి ఒప్పుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. గజ్వేల్ ఫొటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు చేతన్కుమార్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. బస్సు,కారు ఢీ.. –ప్రయాణికులకు స్వల్ప గాయాలు సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.ఈ ఘటన మండలంలోని నందికంది శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నందికంది గ్రామ సమీపంలో అదుపుతప్పిన బస్సు కారును ఢీకొట్టింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై కొనసాగుతున్న సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల్లో రోడ్డు భద్రత చర్యలు చేపట్టకుండా పనులు చేపడుతుండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాన కురవక.. సాగు సాగక
అన్నదాతల ఎదురు చూపులు ● ఇప్పటివరకు 42,191 ఎకరాల్లోనే సాగు ● ఎండుతున్న మొలకలు ● జూలై పైనే రైతన్నల ఆశలుప్రశాంత్నగర్(సిద్దిపేట)/దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో పంటల సాగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏప్రిల్లో ముందస్తుగా వర్షాలు కురవడంతో రైతులు సంబురపడ్డారు. జూన్లో మాత్రం ముఖం చాటేశాయి. అప్పుడప్పుడు కురిసిన చిరు జల్లులకు రైతులు పలు చోట్ల విత్తనాలు విత్తారు. కానీ కొద్ది రోజులుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆకాశం వైపునకు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా వేసిన విత్తనాలు భూమిలో తడి లేకపోవడంతో మొలకెత్తడం లేదు. ఈ వానాకాలంలో జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 42,191 ఎకరాల్లో మాత్రమే రైతులు విత్తనాలు విత్తారు. 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా 37,609 ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు చేశారు. అలాగే వరి 3.75లక్షల ఎకరాల్లో సాగు అంచనా వేయగా 174 ఎకరాల్లో నాట్లు వేశారు. 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని అంచనా వేయగా నేటి వరకు 4253 ఎకరాల్లో విత్తనాలు వేశారు. కందులు–135 ఎకరాలు, పెసర–20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు తొందరపడొద్దని, దుక్కులు దున్ని సిద్ధం చేసుకుని, వర్షాలు పడగానే విత్తనాలు విత్తుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి దుబ్బాకకు చెందిన రైతు ఎంకమ్మగారి నారాయణరెడ్డి. వానలు లేక ఇప్పటి వరకు వరినారు పోయలేదు. బోరు బావి పెట్టి నారు పోద్దామంటే వానలు లేవు తూకం పోస్తే దుక్కులు ఎలా పారుతాయి. దున్నడం ఎట్లా అనే పరేషాన్లో ఉండు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా పెద్ద వానలు కొట్టకపోవడంతో నార్లు పోయలేదు. ఎప్పుడు వానలు పడతాయో తోస్తలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిండు. ఇది ఒక్క రైతు నారాయణరెడ్డి బాధనే కాదు జిల్లాలోని అందరి అన్నదాతల ఆవేదన ఇదే. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీరు జూన్లో విత్తిన విత్తనాల ద్వారా మొలకెత్తిన మొలకలను రక్షించుకునేందుకు నీటి సౌకర్యం ఉన్న రైతులు డ్రీప్, స్ప్రింక్లర్ల ద్వారా పంటకు నీరు అందిస్తున్నారు. దీంతో నీరు లేని రైతులు మాత్రం వరుణుడి రాక కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. చిన్న చిరు జల్లులు పడినప్పటికీ మొలక పెరిగే దశలో వర్షాలు లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విధంగా రైతులు సాగుకు వెనకడుగు వేస్తున్నారు. సకాలంలో విత్తకపోతే పంటకు తెగులు, దిగుబడి తగ్గే అవకాశం లేకపోలేదని రైతులు వాపోతున్నారు. -
మాజీ చైర్మన్కు పరామర్శ
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి గుండ్లపల్లి గ్రామానికి చెందిన నర్సాపూర్ ఆత్మకమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఎమ్మెల్యే హరీశ్రావు వెంకట్రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు హరికృష్ణ, మన్సూర్, రమాకాంత్రెడ్డి, తదితరులు ఉన్నారు. ఉచిత వైద్య శిబిరం జిన్నారం (పటాన్చెరు): గడ్డపోతారం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లీఫార్మా పరిశ్రమ, లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని సభ్యులతో కలిసి మాజీ సర్పంచ్ ప్రకాశంచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ ఐ హాస్పిటల్ వైద్య బృందం పారిశ్రామికవాడలోని పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కోమల్ రెడ్డి, ప్రకాష్, నరేందర్ బాబు, ఎంఎస్రెడ్డి, మౌలాలి పాల్గొన్నారు. వీరశైవ లింగాయత్ల ప్రమాణ స్వీకారం రాయికోడ్(అందోల్): రాయికోడ్లోని వీరభద్రేశ్వర ఆలయ ఫంక్షన్ హాలులో ఆదివారం వీర శైవ లింగాయత్ మండల, గ్రామాల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం చేశారు. వీర శైవ లింగాయత్ మండల అధ్యక్షుడిగా సంగమేశ్వర్ పాటిల్, ఆయా గ్రామాల అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఇందూర్ ఆశ్రమ నిర్వహకులు చిన్న మల్లికా ర్జునస్వామి, వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షులు నర్సింలు, నాయకులు రాజేశ్వర్, మల్లికార్జున్, అరుణ, వివిధ గ్రామాల లింగాయత్ సమాజ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. -
బిడ్డకు జన్మనిచ్చి... కన్ను మూసిన తల్లి
అల్వాలలో విషాదం మిరుదొడ్డి(దుబ్బాక): పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తీవ్ర అస్వస్థతకు గురై కన్ను మూసింది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని అల్వాల లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మంగళి లింగం, వాణి దంపతులు. లింగం గ్రామంలో సెలూన్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వాణి (32) ఐకేపీలో సీఏగా పని చేస్తుంది. కాగా ఆమె గర్భిణి కావడంతో ఇటీవల సిద్దిపేట లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షించి ప్రసవ సమయంలో తల్లీ బిడ్డలకు ప్రాణాపాయం ఉందని తేల్చి చెప్పారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 18న హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు సైతం తల్లి, బిడ్డలకు ప్రమాదమని చెప్పా రు. ఈ నేపథ్యంలో వాణికి పురిటి నొప్పులు రాగా ఆపరేషన్ చేశారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు బ్లీడింగ్ ఎక్కువడంతో పాటు నోటి వెంట రక్తం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వైద్యులు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె శుక్రవారం కన్ను మూసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఆ కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
సీఐ వినాయక్ రెడ్డి పటాన్చెరు టౌన్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పాటుపడాలని పటాన్చెరు సీఐ వినాయక్రెడ్డి అన్నారు. ఆదివారం మండలం పరిధి ఇంద్రేశం వికాస్ అసోసియేషన్ సభ్యులకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ వార్షికోత్సవ లక్ష్యం అన్నారు. సే నో–టు డ్రగ్స్ అనే నినాదం ప్రతి ఒక్కరి దాకా చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, కానిస్టేబుల్లు, ప్లాట్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
పటాన్చెరు టౌన్: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రైతు భరోసా విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రూ.8,565 కోట్లను రైతు భరోసా కింద వారి జమ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. తెలంగాణ ఉద్యమంలో వందలాది విద్యార్థుల ఆత్మబలిదానాలకు కారకుడైన హరీశ్రావు మరొకసారి జిన్నారం రైతులను రెచ్చగొట్టి వారిని వారి కుటుంబాలకు నష్టాన్ని కలిగించే పక్కా ప్రణాళికలో ఉన్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, జీ పీసీసీ కార్యదర్శి మతిన్, ట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు మల్లేశ్యాదవ్, అక్షిత్ హనుమంతు, నాయకులు విజయ్, నాగయ్య, అశోక్ , రమేష్ ,సంజయ్ ప్రవీణ్ పాల్గొన్నారు.ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి -
స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి
కంది(సంగారెడ్డి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం కంది, సంగారెడ్డి మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీతో ఉన్న వారందరినీ ఆదుకుంటామన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఆంజనేయులు, పీసీసీ ప్రధాన కార్యదర్శిలు తోపాజి అనంత కిషన్, చిన్నా ముదిరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి -
భగవద్గీతను ఆచరించాలి
నారాయణఖేడ్: ప్రతి ఒక్కరూ భగవద్గీతను ఆచరిస్తూ తమ జీవితాలను సుఖమయం చేసుకోవాలని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్ అన్నారు. ఖేడ్లోని షిర్డీ సాయిబాబా ఆలయ దశమ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అభిషేకం, అలంకరణ, హారతి, కార్యక్రమాలతో పాటు సామూహిక కుంకుమార్చనలు, హోమం, చప్పన్భోగ్ ప్రసాదాల సమర్పణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు మోహన్జ్యోషి ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతర్గాం పీఠాధిపతి కరణ్ గజేంద్ర భారతి మహరాజ్, రాధాస్వామి సత్సంగ్ భక్తుడు రామకృష్ణ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన క్రిష్ణమూర్తి బృందం సంగీత విభావరి నిర్వహించారు. భక్తులకు ఉపాధ్యాయులు శివరాంపల్లి విజయ్ కుమార్, భారతి దంపతులు మహాప్రసాదాన్ని అందించారు. -
వీడని మహిళ హత్య మిస్టరీ
నిందితుల అరెస్టులో జాప్యంచిన్నకోడూరు(సిద్దిపేట): గత నెలలో మండలాన్ని కుదిపేసిన కమ్మర్లపల్లి మహిళా హత్య మిస్టరీ ప్రశ్నార్థకంగా మారింది. మహిళను పట్టపగలే ఆమె నివాసంలో హత్య చేసిన నిందితుల జాడ కనుక్కోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నా రనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ పేరిట గ్రామంలోని పలువురిని అదుపులోకి తీసుకుని విచారించి వదిలివేయడం లాంటి ఘటనల నేపథ్యంలో గ్రామ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోజులు గడుస్తున్నా హత్య మిస్టరీ వీడకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన గాలి బాలలక్ష్మి(50) ఇంట్లో కిరాణా షాపు నడుపుతుండగా, భర్త సుధాకర్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. గత నెల 30న మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి నిద్రిస్తున్న బాలలక్ష్మిని కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంగారు, ఆభరణాల కోసమే గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. హత్య జరిగి 22 రోజులు అవుతున్నా నిందితులను గుర్తించలేదు. దీంతో కమ్మర్లపల్లిలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణను అడగగా.. విచారణ చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. -
అవినీతిపై చర్యలు తీసుకోవాలి
పోలీసులకు ముదిరాజ్ కులస్తుల ఫిర్యాదురామాయంపేట(మెదక్): స్థానిక మల్లె చెరువులో పట్టిన చేపల అమ్మకంలో అవినీతికి పాల్పడి సంఘానికి నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వందలాది మంది ముదిరాజ్ కుల సంఘం సభ్యులు ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... ముదిరాజ్ సంఘంలో సుమారుగా ఎనిమిది వందలకు పైగా సభ్యులున్నారని తెలిపారు. చేపలు అమ్మితే వచ్చే ఆదాయాన్ని సభ్యులందరికీ సమానంగా వర్తింపజేయాలని, ఇలా కాకుండా కొందరు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి ఏటా సంఘం తరపున పెద్దమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, జాతర ఖర్చుల నిమిత్తం మల్లెచెరువులో ఉన్న చేపల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ఏకపక్షంగా మల్లె చెరువులో చేపలు పట్టి అమ్ముకున్నారని, తూకంలో సైతం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జాతర ఖర్చుల నిమిత్తం రూ.ఎనిమిది లక్షలు ఖర్చు అవుతాయని, నిరుపేదలైన కుల సంఘం సభ్యులు డబ్బులు ఇచ్చే అవకాశం లేకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు
పటాన్చెరు టౌన్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గండిగూడెం వైఎస్సార్ కాలనీకి చెందిన లక్ష్మణ్ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లి పని ముగించుకొని సాయంత్రం తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో గండిగూడెం శివారు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దాటుతుండగా పటాన్చెరు వైపు నుంచి దుండిగల్ వైపు వెళ్లే గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. దీంతో లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నోరూరిస్తున్న అల్లనేరేడు మిరుదొడ్డి(దుబ్బాక): అల్లనేరేడు పండ్లను చూడగానే నోరూరిస్తున్నాయి. వగరు, పుల్లగా, తియ్యగా మేలు రుచులతో ఉండే నేరేడు పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. దీంతో గ్రామీణ ప్రాంత వాసులకు, రైతులకు మంచి ఉపాధిగా మారుతోంది.తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు -
పాలిథిన్.. పాయిజన్!
పర్యావరణానికి ప్లాస్టిక్ కవర్ల ముప్పు ● మృత్యువాత పడుతున్న పశువులు ● పట్టించుకోని అధికారులు జహీరాబాద్ టౌన్: పాలిథిన్ కవర్లు తిని ఈ నెల 18న ఓ ఆవు మృతి చెందింది. జహీరాబాద్ పట్టణంలో రోడ్లపై సంచరిస్తూ ప్లాస్టిక్ కవర్లు తిని అస్వస్థతకు గురైంది. చికిత్స అందించిన మూడు రోజుల తరువాత చనిపోయింది. పాలిథిన్ కవర్లు తిని పశువులు తరుచూ మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణానికి హాని కల్గించే ప్లాస్టిక్ కవర్లను వినియోగించొద్దని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నా ఎక్కడ అమలు కావడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం కాగితాలకే పరిమితమైంది. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, టిఫిన్ బండ్లు, మాసం దుకాణాలు ఖాళీ ప్రదేశాలు, మురికి కాలువలు ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కవర్లు ముంచెత్తుతున్నాయి. కవర్లకు తోడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకం పెరగడంతో మురికి కాలువలు, రోడ్ల పక్కన కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విఫలం మున్సిపల్ పరిధిలో కవర్ల నిషేధం పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వ్యాపారులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. కరపత్రాలను పంచారు. 40మైక్రోన్స్ కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను వాడరాదని ఆదేశించారు. జ్యూట్ బ్యాగులు, బట్ట బస్తాలు వినియోగించాలని చెప్పారు. తనిఖీలు నిర్వహించి కొంత మందికి జరిమానాలను విధించారు. కొన్ని రోజుల తరువాత యథేచ్ఛగా కవర్లను వినియోగిస్తున్నారు. 175 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, అందోల్ మున్సిపాలిటీల్లో సుమారు 175 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది.అందులో 60 మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయి. పాలిథిన్ కవర్లను వాడటం వల్ల అనేక అనార్ధాలు చోటు చేసుకుంటున్నాయి. పశువులు వీటిని తినడం వల్ల అనారోగ్య బారిన పడుతూ చనిపోతున్నాయి. పర్యావరణానికి హానికలిగిస్తూ ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయన్నారు. పెళ్లిళ్లు తదితర శుభకార్యాలయాలు సమయంలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లను ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన, మురికి కాలువల్లో కవర్లు పారబోయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మున్సిపల్ అధికారులు పాలిథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ రావు దృష్టికి తీసుకెళ్లాగా క్యారీ బ్యాగ్స్ నిషేధానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కవర్లు అమ్మినా.,. వాడానా జరిమానా విధిస్తామన్నారు. ప్రజలు మార్కెట్కు వెళ్లినప్పుడు బట్ట సంచులు తీసుకెళ్లాలని సూచించారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
వెల్దుర్తి(తూప్రాన్): పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మిక సోదరులు జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి గౌరి పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రం వెల్దుర్తిలో కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపట్టే సమ్మెకు ప్రజలు, ప్రజాతంత్రవాదులు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాల పంపిణీ నారాయణఖేడ్: పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రాథోడ్ లక్ష్మీబాయికి, నాగల్గిద్ద మండలం మోర్గికి చెందిన గొల్లమల్లప్ప, ప్రేమలకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మశ్చందర్ ప్రతినిధులు ఆదివారం నెలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. నిరుపేదలను ఆదుకోవడంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీకాంత్, తుకారాం, శ్రీనివాస్ సాగర్, అభిపవార్ పాల్గొన్నారు. భూభారతికి 1690 దరఖాస్తులు తహసీల్దార్ తులసిరాం టేక్మాల్(మెదక్): ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులు మండలంలో పూర్తయినట్లు తహసీల్దార్ తులసిరాం పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 3 నుంచి 21 వరకు ఆయా గ్రామాల్లో రెవెన్యూ భూభారతి సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. పలు రకాల భూసమస్యలతో 1690 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను గ్రామాల వారీగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసి పైఅధికారులకు నివేదిక అందించినట్లు తెలిపారు. రైతులెవ్వరూ భూసమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. స్నేహితురాలికి చేయూత శివ్వంపేట(నర్సాపూర్): ఆపదలో ఉన్న స్నేహితురాలికి బాల్య స్నేహితులు చేయూతనందించారు. మండల పరిధి పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన వడ్ల మాధవికి మియాపూర్కు చెందిన యాదగిరితో వివాహం జరిగింది. అనారోగ్యంతో యాదగిరి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లలతో మాధవి తల్లి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తూ జీవనోపాధి పొందుతుంది. విషయం తెలుసుకున్న 2011–2012 విద్య సంవత్సరం పదవ తరగతి మాధవి బాల్యస్నేహితులు రూ.40 వేల ఆదివారం అందజేశారు. దీంతో తన స్నేహితులు ఆర్ధికసాయం చేయడంపై మాధవి కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికల నిర్వహణ బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు పాండు సంగారెడ్డి : బీసీ రిజర్వేషన్లు 42 శాతం కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల నిర్వహించాలని బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడంతో చాలా నష్టపోయామని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మల్లయ్య, రమేష్, జగదీశ్వర్, బాలుయాదవ్ పాల్గొన్నారు. -
ఫల క్షేత్రం.. రైతుకు ఊతం
ఫల వృక్షాల పరిశోధనకు, రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడం ద్వారా ఉద్యాన వికాసానికి సిద్దిపేట జిల్లా ములుగు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రూట్స్’ బాటలు వేస్తోంది. ఇక్కడ 53 ఎకరాల్లో ఆధునిక సాగు పద్ధతులు నిరంతర శాస్త్రవేత్తల పరిశోధనలు ఉద్యాన అధికారుల పర్యవేక్షణలో ఫలజాతి తదితర మొక్కల నర్సరీతో భాసిల్లుతున్నది. వృద్ధి చేస్తున్న మామిడి, జామ, నిమ్మ, కొబ్బరి రకాల మొక్కలకు డిమాండ్ ఉన్నది. సాగు రకాలు, దిగుబడి తదితర వివరాలను సీఓఈ అధికారి ఆశీష్ వివరించారు.ఉద్యాన వికాసానికి బాటలు వేస్తున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రూట్స్’కొబ్బరి కోనసీమను మరిపించేలా కొబ్బరి తోటలు కోనసీమలో సాగు చేస్తుంటారు. తెలంగాణలో సైతం వీటిని ప్రోత్సహించేలా ములుగు సీఓఈలో చౌగాట్ ఆరేంజ్ ద్వార్ప్ పొట్టి రకాలు, ఎల్లో పొట్టి కొబ్బరి రకాలను నర్సరీల్లో పెంచుతున్నారు. ఎకరానికి 100 మొక్కలు నాటుకోవచ్చు. వర్షాకాలంలో నాటడంతో పాటు ఏ నేలలైనా అనుకూలం. ఒక చెట్టుకు 150 వరకు కాయల దిగుబడి వస్తుంది. నీరు తప్పని సరిగా ఉండాలి.● నర్సరీల్లో పలు ఫలజాతి మొక్కలు ● అవసరమైన రైతులకు పంపిణీ ● నేలల అనుకూలతను బట్టి నాటుకోవచ్చుపోషకాల జామ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా లభించే పోషక ఫలం. ఇందులో అలహాబాద్ సఫేదా, లక్నో 49 రకాలున్నాయి. ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఎకరంలో 250 మొక్కలు నాటవచ్చు. సంవత్సరానికి 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. నిమ్మ.. ఔషధ గని ప్రతి నిత్యం ఆహార పదార్థాల్లో వినియోగించుకునే ఫలం. ఇందులో పెట్లూరి సెలక్షన్–1, బాలాజీ నిమ్మజాతి రకాలున్నాయి. ఏప్రిల్, మేలో కాకుండా ఎప్పుడైనా నాటుకోవచ్చు. నీరు ఆగని నేలల్లో నాటుకోవాలి. ఎకరానికి 111 మొక్కలు వేసుకోవాలి. ఒక చెట్టుకు 700 నుంచి 750 కిలోల దిగుబడి వస్తుంది. గజ్జి తెగులు సోకుతుంది, నివారణకు చర్యలుంటాయి. కేఎన్ఎం 1638 వరి (సన్నరకం) పంట కాలం: వానాకాలంలో 120 నుంచి 125 రోజులు, యాసంగిలో 130 నుంచి 135 రోజులు దిగుబడి ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్లు ప్రత్యేకతలు : ఉల్లికోడు బయోటైప్ 3, అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. అన్నం రుచిగా, నాణ్యతగా ఉంటుంది. తునికి కేవీకేలో ఈ యాసంగి సీజన్లో సన్నరకం ఈ రకం విత్తనాన్ని సాగు చేశారు. 200 బస్తాల విత్తనాలను రైతులకు విక్రయించారు. కూనారం సన్నలు (కేఎన్ఎం118) దొడ్డు రకం వానాకాలం, యాసంగి సీజన్కు అనుకూలం పంటకాలం: వానాకాలం 118 నుంచి 120 రోజులు యాసంగి 120 నుంచి 125 రోజులు దిగుబడి ఎకరాకు 28 నుంచి 32 క్వింటాళ్లు ప్రత్యేకతలు: అగ్గితెగులు, మెడ విరుపు కొంతవరకు తట్టుకుంటుంది. పంట నేలపై పడిపోదు. ఆర్ఎన్ఆర్ 28361 రాజేంద్రనగర్ ఆర్ఎన్ఆర్ 28361 దొడ్డు రకం వరి విత్తనం వానాకాలంలో సాగుకు అనుకూలం పంట కాలం: 130 రోజులు, మధ్యకాలిక రకం, దిగుబడి ఎకరాకు 30 నుంచి 32 క్వింటాళ్లు ప్రత్యేకతలు: సుడిదోమ, మెడ విరుపు తెగులు, బ్యాక్టీరియా ఎండుటాకు తెగులు, పొట్ట కుళ్లు తెగులును మధ్యస్థంగా తట్టుకుంటుంది. విత్తన నిద్రావస్థ మూడు వారాలు ఉంటుంది. తెలంగాణ సోన, ఆర్ఎన్ఆర్ 15048 సన్న రకం పంట కాలం: వానాకాలం 125 రోజులు, యాసంగి 135 రోజులు దిగుబడి ఎకరాకు 26 నుంచి 28 క్వింటాళ్లు ప్రత్యేకతలు: అగ్గి తెగులు తట్టుకుంటుంది. పొట్టకుళ్లు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. నత్రజని ఎక్కువగా వినియోగించవద్దు. ఈ సన్న రకం వరిని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఫలరాజు.. మామిడి ఫలరాజుగా మామిడి ప్రసిద్ధి గాంచింది. కేసరి, హిమాయత్, దసేరి, బంగినపల్లి మామిడి మొక్కలను నర్సరీలో పెంచుతున్నారు. ఎర్ర నేల, నీరు నిల్వని నేలలు సాగుకు అనుకూలం. ఎకరంలో 160 మొక్కలు నాటవచ్చు. మూడేళ్ల తరువాత కోత మొదలవుతుంది. కేసరి రకం ఎకరానికి 8 నుంచి 9 టన్నులు, హిమాయత్ 4 నుంచి 5 టన్నులు, దసేరి 6 నుంచి 8 టన్నులు, బంగినపల్లి 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది. – కె. కృపాకర్ రెడ్డి, ములుగు(గజ్వేల్):అందుబాటులో మొక్కలు వివిధ రకాల ఉద్యాన మొక్కలను సీఓఈ ద్వారా పెంచుతున్నాం. వీటిని అవసరమైన రైతులకు అందజేస్తున్నాం. మామిడి, జామ, నిమ్మ, కొబ్బరి మొక్కలు ఉన్నాయి. రైతులు ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి సహకారం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ 89777 14250 లేదా ఉద్యానశాఖ అధికారి 90001 36490 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. – ఆశీష్, ఉద్యాన శాఖ అధికారిపంపిణీకి సిద్ధంగా ఉన్న మామిడి మొక్కలువిత్తన శుద్ధి తప్పనిసరి రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు నాణ్యమైన విత్తనాలు, తెగులు, చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. వానాకాలం, యాసంగి సీజన్కు తగినట్లుగా నీటి ఎద్దడి, ఎండ తీవ్రతను తట్టుకునే రకాలను ఎంచుకోవడం మంచిది. సాగులో సమస్యలుంటే వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో ఎరువులు, విత్తనాలు వాడాలి. విత్తన శుద్ధి తప్పని సరిగా చేయాలి. మోతాదుకు మంచి ఎరువులు, పురుగుల మందులు వాడొద్దు. – ప్రతాప్రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త, తునికి -
చెట్టును ఢీకొట్టిన కారు
దుబ్బాకటౌన్: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన కుంట దుర్గాప్రసాద్ (36) హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తమ్ముడి ఇంట్లో శుభకార్యం ఉండటంతో ఇక్కడికి వచ్చాడు. శనివారం ఉదయం రాయపోల్ నుంచి సిద్దిపేట మీదుగా హైదరాబాద్ బయలుదేరాడు. మంతూర్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో దుర్గాప్రసాద్ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్ఐ రఘుపతి తెలిపారు.డ్రైవర్ మృతి -
నిత్యం భర్త గొడవ పడుతున్నాడని..
జిన్నారం (పటాన్చెరు): భర్త తరచూ తనతో గొడవ పడుతున్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... బీహార్కు చెందిన సద్దాం అంసారి, భార్య అమన్ ఖాతూన్ ముగ్గురు పిల్లలతో కలిసి గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్లో నివాసముంటున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం కూడా మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన కాటున్ (24) భర్త, ముగ్గురి పిల్లలు ఇంట్లో ఉండగా బయటి నుంచి తలుపులు పెట్టింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొద్ది దూరంలో ఉన్న ఆమె తల్లిదండ్రుల ఇంట్లో చున్నీతో ఉరివేసుకుంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చెట్టుకు ఉరి వేసుకుని..పటాన్చెరు టౌన్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన మల్లేశం(41) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో 19వ తేదీన ఇంట్లో గొడవ పడి, 20వ తేదీన పనికి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మల్లేశం కోసం వెతుకుతుండగా ఇస్నాపూర్ శివారులోని సూర్యవంశం వెంచర్లో చెట్టుకి ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పురుగుల మందు తాగి యువకుడు.. మద్దూరు(హుస్నాబాద్): పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన చేర్యాల మండలంలోని అర్జున్పట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీకాంత్(26) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఈనెల 19న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య ఆత్మహత్య -
స్వచ్ఛ బడి బహు బాగు
సిద్దిపేటజోన్: మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛ బడి బాగుందని ప్రతినిధులు కితాబిచ్చారు. శనివారం వివిధ రాష్ట్రాల ప్రతినిధులు సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. స్వచ్ఛ బడిలో తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, డంప్ యార్డు, బయో గ్యాస్, స్లాటర్ హౌస్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, మధ్యప్రదేశ్ అధికారులు, ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పాల్గొన్నారు. -
నా భూమిలో సబ్స్టేషన్ నిర్మించొద్దు
చిలప్చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని చండూర్ శివారులో గల సర్వే నం.2లో సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్ శాఖ అధికారులు ముగ్గు పోసిన విషయం విధితమే. కాగా ఆ భూమి తనదని, ఎన్నో ఏళ్లుగా తన పేరు మీదే ఉందని గ్రామానికి చెందిన పుల్కంటి లాజర్ పేర్కొన్నాడు. శనివారం లాజర్ అధికారులు పోసిన ముగ్గును దున్నేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నం.2లో గల లావుణి పట్టా ఎకరన్నర భూమి తన పేరు మీదే ఉందని, దానికి సంబంధించిన పట్టాబుక్కులు సైతం ఉన్నాయన్నారు. అధికారులు సబ్స్టేషన్ నిర్మాణానికి ముగ్గు పోయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆ భూమిలో నిర్మాణం చేపడితే, బదులుగా మరో చోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సర్వే నం.2లో చాలావరకు లావుణి పట్టాలు ఉన్నాయని, వారందరివి కాదని, తన భూమిలోనే ముగ్గు పోయడం సరైంది కాదన్నారు. ఈ విషయమై రెవెన్యూ కార్యాలయంలో సైతం వినతిపత్రం ఇచ్చానన్నారు. ఆ భూమి విషయంలో నాకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటా భూ బాధితుడు లాజర్ -
ఢిల్లీ సెమినార్కు ఉపాధ్యాయుడు ఎంపిక
చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 24, 25వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అడ్వాన్సుడ్ శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాల సెమినార్ నిర్వహించనున్నారు. ఈ సెమినార్కు మెంటర్గా మండలంలోని ఆకునూరు జెడ్పీహెచ్ఎస్లో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాస రవీందర్ ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి 10 మంది ఎంపికవగా అందులో చేర్యాల ప్రాంతానికి చెందిన రవీందర్ ఒకరు. ఈ అరుదైన గౌరవం ఆయనకు దక్కడం పట్ల పాఠశాల హెచ్ఎం ఎం.ఐలయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ సైదా బేగం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిని అభినందించారు. స్కూల్ బస్సు సీజ్ నిజాంపేట(మెదక్): ఫిట్నెస్ లేని కారణంగా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీశంకర స్కూల్కు చెందిన బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. స్కూల్ బస్సులు కండీషన్తోపాటు అన్ని ధ్రువ పత్రాలు ఉండాలని వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. బస్సుతోపాటు ఆటోను కూడా సీజ్ చేశారు. ఈ మేరకు సీజ్ చేసిన వాటిని పోలీస్స్టేషన్కు తరలించారు. విధులకు ఆటంకం.. కేసు నమోదుహవేళిఘణాపూర్(మెదక్): విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు చేస్తున్న పోలీసులపై దుర్బాషలాడిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు మెదక్ రూరల్ ఎఎస్ఐ దయానంద్ శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి మెదక్ మండల పరిధిలోని మంభోజిపల్లి వద్ద డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా మాచవరం గ్రామానికి చెందిన కట్ట యాదగిరి, టేక్మాల్ కుమార్ మద్యం తాగి వాహనం నడుపుతుండటంతో పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగినట్లు తేలడంతో వాహనాన్ని పోలీస్స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాచవరం గ్రామానికి చెందిన యాదగిరి, శేఖర్లతోపాటు, కొందరు పోలీసు సిబ్బంది వాహనం తాళాలు లాక్కొని, మీ సంగతి చెబుతామంటూ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కొల్చారం(నర్సాపూర్): తొమ్మిది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వరిగుంతం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓనమాల నాగభూషణం(33) కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 12న తన టీవీఎస్ ఎక్సెల్పై మెదక్ నుంచి వస్తున్నాడు.అప్పాజీపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ నాగభూషణం ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది.దీంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో, చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేస్తు దర్యాప్తు చేస్తున్నారు. మూర్ఛ వ్యాధితో..పటాన్చెరు టౌన్: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్కు చెందిన నవీన్ (25) కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న నవీన్ శుక్రవారం నైట్ డ్యూటీకి వెళ్తున్నానని చెప్పాడు. శనివారం ఇస్నాపూర్ వాక్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో రామ్ రాజ్ షాపింగ్ మాల్ ముందు మృతి చెంది కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అనారోగ్యం కారణంగా తమ కుమారుడు మృతి చెంది ఉండవచ్చని, మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు..సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం... సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన గంగాధరి గణేష్ (17) తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 11న ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి సిద్దిపేటకు వస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన గణేష్ను హైదరాబాద్ నిమ్స్కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయి చికిత్సకు సహకరించకపోవడంతో 16వ తేదీన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. -
బాల్యంపై పుస్తకాల భారం
తూప్రాన్: బాల్యంపై పుస్తకాల భారం పడుతుంది. శక్తికి మించిన బరువును మోయలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు లెక్కలేని పుస్తకాల బరువు మోపి ఆదాయం దండుకుంటుంటే, చిన్నారులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. లేలేత భుజాన బస్తాలు మోసినట్లు పుస్తకాల బ్యాగులను మోస్తూ కార్పొరేట్ స్కూళ్లలో నాలుగైదు అంతస్తులు మెట్లు ఎక్కేందుకు ఆపసోపాలు పడుతున్నారు. వయసుకు మించిన బరువు మోస్తే వారి వెన్నెముక దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే పుస్తకాల బ్యాగును భుజాన వేసుకొని లంచ్బాక్స్ చేత పట్టుకొని పాఠశాలకు హుషారుగా వెళ్లే పిల్లలు సాయంత్రమయ్యేసరికి నీరసంగా ఇంటికి వస్తున్నారు. ప్రతి విద్యార్థి తన బరువులో ఎనిమిదో వంతు బరువు మోయాలని వైద్యులు చెబుతున్నారు. కానీ విద్యార్థులు తన బరువుకంటే 15నుంచి 20శాతం అధికంగా మోస్తున్నారు. ఐదేళ్ల నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు అధిక బరువు మోయరాదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. సొంత సెలబస్, స్మార్ట్ క్లాసులు, రివిజనల్ టెస్టుల పేరుతో అధిక పుస్తకాలను విద్యార్థులకు అంటకడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు విధిగా సర్కారు ముద్రించిన పాఠ్యపుస్తకాలతోనే విద్యార్థులకు బోధన చేయాలని సూచిస్తున్నాయి. అనవసరమైన పుస్తకాలే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు ఆరు పాఠ్య, నోట్ పుస్తకాలు, మరో నాలుగు పుస్తకాలు ఉంటాయి. కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఇందుకు విరుద్ధంగా పరిస్థితి కనబడు తోంది. ఒకటవ తరగతి చదివే విద్యార్థికి సాధారణంగా 16 పుస్తకాలు ఉండాలి. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి 32 నుంచి 34 పుస్తకాలు ఉంటున్నాయి. తరగతుల వారీగా పుస్తకాలు, బరువు ఒకటో తరగతికి 14పుస్తకాలు, బరువు 6కిలోలు, 2వ తరగతికి 16పుస్తకాలు, 7కిలోలు, 3వ తరగతికి 18 పుస్తకాలు, 9కిలోలు, 4వ తరగతికి 21పుస్తకాలు, 12కిలోలు, 5వ తరగతికి 25 పుస్తకాలు, 14కిలోలు ఉండాలి. 6వ తరగతికి 28 పుస్తకాలు, 16కిలోలు, 7వ తరగతి 31పుస్తకాలు, బరువు 18కిలోలు, 8,9,10వ తరగతులకు 38పుస్తకాలు 20నుంచి 25కిలోల బరువు నిర్దేశించారు. జిల్లాలో మొత్తం ప్రైవేటు పాఠశాలలు 105 ప్రైవేటు విద్యార్థులు 40,584ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలే ఉండాలి ప్రభుత్వ సిలబస్ను కాదని సొంత సిలబస్ పేరుతో విద్యార్థులతో ఇష్టారాజ్యంగా కొనుగోలు చేయించడం నిబంధనలకు విరుద్ధం. పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ గుర్తింపు పొందిన విక్రయ దుకాణాల్లో కొనుగోలు చేయాలి. ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతాం. విద్యాసంస్థలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చిన పక్షంలో వారు ఫిర్యాదు చేస్తే సదరు పాఠశాలపై చర్యలు తీసుకుంటాం. –రాధాకృష్ణ, జిల్లా విద్యాధికారి, మెదక్ విద్యార్థులకు పెరుగుతున్న బ్యాగుల మోత నిర్దేశించిన పుస్తకాలు కొనాల్సిందేనని ఒత్తిడి వయసుకు మించిన బరువు ఎదుగుదలకే ఆటంకం ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అధిక పుస్తకాలతో అనర్థాలు విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల నడుము, వెన్ను, కండరాల నొప్పికి గురవుతారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. చదువుపై దృష్టి సారించలేకపోతారు. జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. సమయానికి ఆకలి వేయదు. పుస్తకాలను చూడగానే ఆందోళనకు గురవుతారు. పాఠశాలకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత అసహనానికి లోనవుతారు. –డాక్టర్ అమర్సింగ్, సీహెచ్సీ సూపరింటెండెంట్, తూప్రాన్ -
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన నర్సాపూర్ పట్ట ణంలో జరిగింది. ఎస్సై లింగం కథనం మేరకు... పట్టణంలోని కాజీగల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ.జావిద్ అలీ రెండో కూతురు ఫరియా సుల్తానా (19) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈనెల 19న వేకువ జాము నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలతో పాటు స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియలేదు. శనివారం జావిద్ అలీ ఖాజీగల్లీకి చెందిన ఎండీ ఫయాజ్ తన కూతురిని కిడ్నాప్ చేశాడని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టరేట్ను ముట్టడిస్తాం: హరీశ్రావు
జిన్నారం (పటాన్చెరు): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, రైతు భరోసా అందరికీ వేయకుంటే ఓఆర్ఆర్ పరిధిలోని 22 వేలమంది రైతులతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పటాన్చెరు నియోజకవర్గ కన్వీనర్ ఆదర్శ్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రైతుమహాధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 22 వేల రైతులు ఉండగా కేవలం గుమ్మడిదల మండలంలోని కొంత మంది రైతులకు రైతు భరోసా వేయడం సరికాదన్నారు. ఈ రైతు భరోసా అయినా రైతులు నాట్లు వేసుకునేందుకు కాదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతుల ఓట్లను రాబట్టుకునేందుకే రేవంత్రెడ్డి ఆడుతున్న నాటకమని విమర్శించారు. రైతుల ఖాతాల్లో రైతుభరోసా వేయకుంటే ఓఆర్ఆర్ పరిధిలోని 22 వేలమంది రైతులతో వంటావార్పు, కలెక్టర్ కార్యాల యం ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాణిక్యరావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
పరేక్ప్లాస్ట్ కార్మికులకు మెరుగైన వేతనాలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు: పటాన్చెరు పరిధిలోని పరేక్ ప్లాస్ట్ పరిశ్రమ కార్మికులకు మెరుగైన వేతనాలు కల్పించేందుకు ఒప్పందం చేసినట్లు పరేక్ ప్లాస్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కార్మిక శాఖ కార్యాలయంలో డీసీఎల్ రవీందర్ రెడ్డి సమక్షంలో శనివారం పరిశ్రమ యాజమాన్యం తరఫున సమీర్ కులకర్ణి, కార్మిక సంఘం తరఫున యూనియన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మధ్య వేతన ఒప్పందంపై చర్చలు జరిగాయని తెలిపారు. మెరుగైన వేతన ఒప్పందం అందిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వేతన ఒప్పందంలో రాబోయే మూడేళ్లకు గాను ప్రస్తుతం అందుకుంటున్న వేతనానికి అదనంగా ప్రతీ కార్మికుడు ప్రతీ ఏటా రూ.4 వేల చొప్పున మొత్తం 12 వేల వేతనం అందుకునేలా ఒప్పందంలో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రతీ దసరాకు రూ. 2,500 యాన్యువల్ డే గిఫ్ట్తో పాటు, బోనస్, ఇతర సౌకర్యాలు లభిస్తాయన్నారు. -
అధిక మోతాదుకు చెల్లు
ఖేడ్లో మట్టి పరీక్ష కేంద్రం ఏర్పాటు ● ఉమ్మడి జిల్లాలో రెండో కేంద్రం ● ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు ప్రయోజనం నారాయణఖేడ్: ఎరువులు, రసాయన మందుల విచ్చలవిడి వాడకం ద్వారా నష్టపోతున్న రైతన్నలకు ఉపయోగపడేలా ఉమ్మడి జిల్లాకు మరో మట్టి నమూనా కేంద్రం మజూరైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే మట్టి నమూనా పరీక్షా కేంద్రం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రాంతం రైతులైనా తమ మట్టి నమూనాలను ఇక్కడే పరీక్షించుకోవాల్సి వస్తుంది. కాగా, ప్రభుత్వం తాజాగా నారాయణఖేడ్కు మట్టి పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను రూ.1.95కోట్లను విడుదల చేసింది. రూ.1కోటి ద్వారా భవన నిర్మాణం పనులు చేపట్టగా, రూ.95క్షలతో పరికరాలు, గాజు సామగ్రి, రసాయనాలు, ఫర్నీచర్, మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు వినియోగించనున్నారు. ఈ కేంద్రం పరిధిలో జిల్లాతోపాటు మెదక్ జిల్లా పరిధిలోని మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలతోపాటు, మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట, రేగోడ్, టేక్మాల్ తదితర మండలాల రైతులకు అనువుగా ఉండనుంది. ఖేడ్ పట్టణ శివారులోని జూకల్ శివారులో స్థలాన్ని ఇదివరకే ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఈ కేంద్రంలో ఒక ఏడీఏ, ఏవో, ఏఈవోలు, ల్యాబ్ టెక్నీషియన్స్ను నియమించనున్నారు. భారీగా ఎరువుల వినియోగం రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎరువుల వినియోగం జరుగుతుందని, ప్రధానంగా యూరియా వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎరువుల, రసాయనాల మంత్రిత్వ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. యూరియా వినియోగం ఎక్కువవుతోందని, దాని ప్రభావం సాగు భూములపై చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక పురుగు మందుల వినియోగం మోతాదుకు మించి ఉందని వెల్లడించింది. మట్టి పరీక్షల ద్వారా ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంది. రైతులకు మేలు.. కొందరు రైతులు అవగాహన లేమితో మట్టి పరీక్షలు జరిపించుకోలేక యూరియా, రసాయనాలు అధికంగా వాడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులను తీర్చేందుకు సీఎంను కోరగానే ఖేడ్కు మట్టి నమూనా పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేశారు. మారుమూల ఖేడ్లో ఏర్పాటు చేయడంవల్ల పలు ప్రాంతాల రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. –సంజీవరెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్ ఇవీ ప్రయోజనాలు.. మట్టి పరీక్ష అనేది మట్టిలోని పోషక పదార్థాల స్థాయిలు, పీహెచ్ విలువ, ఉప్పు సమతుల్యత, సూక్ష్మపదార్థాల ఉనికి తెలుసుకోవడం వ్యవసాయంలో చాలా కీలకమైన అంశం. మట్టి పరీక్ష పంటకు సరిపోయే ఎరువుల ఎంపికకు సహాయ పడుతుంది. మట్టిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయా, ఏవి కొరతగా ఉన్నాయో తెలుసుకుని అందుకు అవసరమైన ఎరువులను సరిగ్గా వినియోగించుకునే వీలుంది. అనవసర ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చు. ఫలితంగా అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల కలిగే హానిని నివారించుకోవచ్చు. సమతుల్య పోషకాల నిచ్చెన వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి దిగుబడి వస్తుంది. పైగా పెట్టుబడి ఖర్చూ తగ్గుతుంది. మట్టిలో మార్పులను గమనించి భవిష్యత్తులో తగిన పంటలు వేసే అవకాశం కలుగుతుంది. అధిక రసాయనాల వాడకాన్ని నియంత్రించి నేల, నీటి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కొత్త భూమిలో పంట సాగు ప్రారంభించే ముందు, ప్రతీ రెండు మూడేళ్లకు ఒకసారి, పంట దిగుబడులు తగ్గిన సందర్భాలు, భూమి మార్పు జరిగిన సందర్భాల్లో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించుకోవాలి. -
ఫీజు వసూలు లక్ష్యంరూ.3.90 కోట్లు
రాయికోడ్ మార్కెట్ ఆదాయం సమకూర్చేందుకు నిర్ణయం రాయికోడ్(అందోల్): 2025–26 ఆర్థిక ఏడాదికిగాను రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రూ.3.90 కోట్లను మార్కెట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. మార్కెట్ పరిధిలో రాయికోడ్, మునిపల్లి మండలాలు ఉన్నాయి. రాయికోడ్ మండలంలో రెండు, మునిపల్లి మండలంలో మూడు పత్తి జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. రాయికోడ్ మండలంలో ఒక చెక్పోస్టు ఉంది. మార్కెట్కు ప్రధానంగా మిల్లులు, సీసీఐ కేంద్రాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. 2025–26 ఏడాదిలో చెక్పోస్టు ద్వారా రూ.25 లక్షల రుసుం వసూలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సీసీఐ కేంద్రాల ద్వారా రూ.2.55 కోట్లు, జిన్నింగ్ మిల్లుల ద్వారా రూ.1.10 కోట్ల ఫీజు వసూలు అవుతుందని అధికారులు తెలిపారు. నిర్ణీత సమయంలో లక్ష్యం మేర రుసుం వసూలు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. లక్ష్యానికి మించి ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 3.86 కోట్ల ఆదాయాన్ని మార్కెట్ కమిటీకి సమకూర్చాలని నిర్ణయించారు. లక్ష్యానికి మించి రూ.రూ.3.91 కోట్ల ఆదాయం సమకూరింది. వచ్చిన ఆదాయం 101% వచ్చినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి రవికుమార్ తెలిపారు. రాయికోడ్ మార్కెట్ కమిటీకి ప్రధానంగా పత్తి పంట ద్వారానే సమకూరుతుంది. రాయికోడ్, మునిపల్లి మండలాల్లో ప్రధానంగా పత్తి పంటనే పండిస్తారు. అధిక ఆదాయం పత్తి మిల్లులు, సీసీఐ కేంద్రాల ద్వారా ఆదాయం వస్తోంది. ఇక రైతుల పంట ఉత్పత్తులు మార్కెట్కు తరలించే క్రమంలో చెక్పోస్టులో వసూలు చేసే ఫీజుతో కొంత ఆదాయం సమకూరుతుంది. పకడ్బందీగా ఫీజు వసూలు మార్కెట్ పరిధిలోని చెక్పోస్టు ద్వారా పకడ్బందీగా ఫీజు వసూలు చేయిస్తాం. మార్కెట్ కమిటీ చైర్మెన్, సభ్యులు, సిబ్బంది సహకారంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేర ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తాం. గతేడాది లక్ష్యం కంటే ఒక శాతం ఎక్కువ ఫీజు వసూలు చేశాం. –రవికుమార్, కార్యదర్శి రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు -
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా వేడుకలు
హాజరైన ఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: అంతర్జాతీయ యోగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలోని శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ పరితోశ్ పంకజ్తోపాటు ఇషా ఫౌండేషన్ ప్రతినిధి సుమిట్ పాటిల్, డా.మోహిని హాజరయ్యారు. యోగాసనాలు ధ్యానం, శ్వాసపై ధ్యాస, సూర్యనమస్కారాలు, ప్రాణాయానంతోపాటు వివిధ రకాల ఆసనాలు వేయించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే వారోత్సవాలను ఎస్పీ ప్రారంభించారు. ‘ఐయామ్ యాంటీ డ్రగ్ సోల్జర్’పేరుతో కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 27న పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులునారాయణఖేడ్: రాష్ట్రంలోని 10 పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకుని వచ్చేలా ఈనెల 27న ఖేడ్ నుంచి ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులను నడుపుతున్నట్లు ఖేడ్ ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బస్సులు 27న ఉదయం 8 గంటలకు ఖేడ్ నుంచి బయల్దేరి 36 గంటలపాటు ప్రయాణించి 10 పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామగుండం, మిడ్ మానేరు డ్యాం, వరంగల్, సిద్దిపేట, మెదక్, ఏడుపాయలను దర్శించుకుని 28న సాయంత్రం తిరిగి ఖేడ్కు చేరుకుంటాయని తెలిపారు. ఒకొక్కరికి ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.1,400, డీలక్స్ బస్సుకు రూ.1,600 చార్జీ ఉంటుందన్నారు. పూర్తివివరాలు, టికెట్ బుకింగ్ కోసం 9959223170, 9441071134, 9676667703 నంబర్లలో సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాధినిరోధక టీకాలు వేయించాలిజిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి కొండాపూర్(సంగారెడ్డి): ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి సూచించారు. మండల పరిధిలోని గారకుర్తిలో శనివారం టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో, ధనుర్వాతం, అమ్మవారు, తట్టు వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. ఇప్పటివరకు చిన్నారులకు టీకాలు వేయించని చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు టీకాలు వేసుకోకుంటే జరిగే ప్రమాదాలను కూడా వివరించాలని సూచించారు. ప్రతి చిన్నారికి టీకాలు వేయించే బాధ్యత ఆశావర్కర్లదేనన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి రసజ్ఞ, ఏఎన్ఎం శివలత తదితరులు పాల్గొన్నారు. చలో కలెక్టరేట్ను జయప్రదం చేయండిరామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్వీపర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో కలెక్టరేట్’కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నీరుడు సాయిలు, ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ పిలుపునిచ్చారు. రామచంద్రాపురం పట్టణంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్వీపర్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వారికి గుర్తింపు కార్డులతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలని కోరారు.