ఉగాది ఉత్సవాల నేపథ్యంలో కల్హేర్ మండలం మార్డి, సిర్గాపూర్లో గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలకు చెందిన మల్ల యోధులు తరలివచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఎన్నం విజయలక్ష్మి, శ్రీనివాస్రావు, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరావు, నాయకులు కల్యాణ్రావు పాటీల్, రవీందర్రెడ్డి, జితేందర్రెడ్డి పాల్గొన్నారు.
–కల్హేర్(నారాయణఖేడ్)


