జోరుగా శనగ పంట కోత పనులు | - | Sakshi
Sakshi News home page

జోరుగా శనగ పంట కోత పనులు

Mar 24 2026 9:00 AM | Updated on Mar 24 2026 9:00 AM

మండలంలో శనగ పంట కోత పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో పనులు సాగలేదు. దీంతో రెండు రోజుల నుంచి రైతులు శనగ పంట కోత పనులు, రాసులు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలో సుమారు 5,800 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఎకరాకు 7 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు శనగలకు ప్రభుత్వం రూ.5,850 మద్దతు ధరను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. త్వరలో రాయికోడ్‌లో గల శనగల కొనుగోలు కేంద్రంను ప్రారంభించనున్నారు.

రాయికోడ్‌(అందోల్‌):

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement