విజయవాడ : డాక్టర్ నటరాజ రామకృష్ణ జయంతి సందర్భంగా నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ,హైదరాబాద్కు చెందిన స్వరనర్తన సంస్థలు,ఏపీ సృజనాత్మక సమితి సహకారంతో పటమట స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో ఆదివారం పంచశత ఆంధ్రనాట్య సంగమం త్రివేణీ సంగమంలా సాగింది.
ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి వచ్చిన నాట్యాచార్యులు ఆంధ్రనాట్య సంప్రదాయంలో పలు అంశాలను 500 మంది ఏకకాలంలో నృత్యాలను అభినయించారు. పంచశత నాట్య సమ్మేళన రూపకర్త నాట్యాచార్యుడు పిళ్ళా ఉమామహేశ్వర పాత్రుడు నిర్వహించారు.


