● సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ తేజస్విని నిరంజన
పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్లం, ఇతర భారత విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ సాన్నిహిత్యం, అంతర్–ఆసియాలో యువతులు అనే అంశంపై శుక్రవారం ప్రత్యేక ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని గీతంలోని సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ తేజస్విని నిరంజన అందించారు. ఆసియా నగరాలైన హాంగ్ కాంగ్, సింగపూర్, గ్వాంగ్జౌ, బెంగళూరులలో ఆమె ఇటీవల జరిపిన బహుళ–ప్రాంతీయ పరిశోధన ఆధారంగా, నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల సంస్కృతులచే రూపుదిద్దుకున్న డిజిటల్ మాధ్యమం, యువతులు తమ గుర్తింపు, సంబంధాలు, ఆత్మీయతను నిర్వహించుకునే విధానాలను ఎలా మారుస్తుందో ప్రొఫెసర్ నిరంజన అన్వేషించారు. ప్రజా, వ్యక్తిగత జీవితాల మధ్య సరిహద్దుల పునర్వ్యవస్థీకరణ, డిజిటల్ మాధ్యమాల ద్వారా సామాజికత ఆవిర్భావం, రోజువారీ అనుభవంలో స్మార్ట్ ఫోన్ల పాత్ర కీలకంగా మారడం వంటి అంశాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.


