వయసు అనేది ఇండస్ట్రీలో సమస్య కాదని సీనియర్ నటి మనీషా కొయిరాలా (55) చెప్పిన విషయం తెలిసిందే.
తన కెరీర్ ఆరంభంలో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన మనీషా..మిలాన్, క్రిమినల్, బొంబాయి, భారతీయుడు, దిల్సే వంటి చిత్రాల్లో ఆమె నటించారు.
2012లో అండాశయ క్యాన్సర్తో బాధ పడుతున్నట్లు వెల్లడించి సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. 2014లో దానినుంచి కోలుకున్నారు.
50 ఏళ్లు దాటిన తర్వాత కూడా అద్భుతమైన జీవితాన్ని గడపగలం అని ఆమె చెప్పింది. అందుకే తన హెయిర్కు ఎలాంటి కలర్ వేయనని చెప్పింది.


