● డా.మురళీకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్
సదాశివపేట (సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ సంక్షేమం అభివృద్ధి సమతుల్యతకు ప్రతిబంబమని సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పి.మురళీ కృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అర్థికాభివృద్థి, సమాన అవకాశాలు, అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా రూపొందించిన సమతుల్య బడ్జెట్ ఇది. రూ 3,24,324కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఈ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సంక్షేమం ఆర్థిక పురోగతికి సమాన ప్రాధాన్యం ఇచ్చి సమగ్ర ప్రణాళికగా నిలిచిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరుకోవడం ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధి సామర్థ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.


