ముందే జాగ్రత్త పడదాం..
పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో కొంత జాప్యం జరుగుతుంది. దీంతో సంగారెడ్డిలో జనమంతా ఇంధన కొరత వస్తుందేమో అని భయపడుతున్నారు. అందరూ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. దీనికి తోడు అదనంగా నిల్వ చేసుకునేందుకు డబ్బాలలో తీసుకువెళ్తున్నారు. దీంతో కొంత మందికే పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది. అత్యవసర పనులు ఉన్న వారు దొరకక ఇబ్బంది పడుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి


