breaking news
tamil nadu
-
Tamil Nadu: విజయ్-రంగస్వామి మెగా ప్లాన్..
చెన్నై: తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేత విజయ్ తన తొలి బహిరంగ సభ కోసం పుదుచ్చేరిని వేదికగా ఎంచుకోవడం వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. మంగళవారం నాటి ఈ ర్యాలీలో, విజయ్ తన ప్రధాన విమర్శనాస్త్రాలను డీఎంకే (డీఎంకే)పై సంధించారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆ పార్టీని నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.రంగస్వామిపై పొగడ్తల వర్షంసభలో విజయ్.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని, ఆయన ఎన్ఆర్ కాంగ్రెస్ (NR Congress) ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. తన పుదుచ్చేరి సభకు కట్టుదిట్టమైన భద్రత కల్పించినందుకు రంగస్వామికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి సర్కారును చూసి, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఎంతో నేర్చుకోవాలని ఆయన సూచించారు. విజయ్ తన ప్రసంగంలో కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేసినప్పటికీ, రంగస్వామిని లేదా ఎన్ఆర్ కాంగ్రెస్ను మాత్రం విమర్శించకపోవడం గమనార్హం. ఆయన ప్రసంగం ప్రారంభం నుండీ ముగిసేవరకు రంగస్వామి పట్ల సానుకూలత స్పష్టంగా కనిపించింది.నూతన రాజకీయాలకు ఆరంభంవిజయ్ తన ప్రసంగంలో డీఎంకేను మాత్రమే తీవ్రంగా విమర్శించారు. విజయ్ ర్యాలీని రంగస్వామి తన మొబైల్లో చూస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం నూతన రాజకీయాలకు తెర లేవనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమిలో ఉన్న విభేదాలను ప్రస్తావించడం ద్వారా విజయ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక బలమైన రాజకీయ కూటమి ఏర్పాటుకు సంకేతంగా కనిపిస్తోంది.ఎంజీఆర్ బాటలో..రంగస్వామితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో విజయ్ రాబోయే ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయనే వాదన వినిపిస్తోంది. 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరి.. తమిళనాడుతో పోలిస్తే విజయ్కు రాజకీయంగా సులభంగా కలసివచ్చే ప్రాంతమనే భావన చాలామందిలో ఉంది. ఎంజీఆర్ తమిళనాడుకు ముఖ్యమంత్రి కాకముందు, అతని ఏఐఏడీఎంకే (ఏఐడీఎంకే) పుదుచ్చేరిలో ఎలా అధికారాన్ని చేపట్టిందో విజయ్ తన ప్రసంగంలో గుర్తుచేయడం వెనుక వ్యూహాత్మక ఉద్దేశం ఉంది. పుదుచ్చేరిలో విజయం సాధించడం ద్వారా తమిళనాడులోకి ప్రవేశించవచ్చనేది విజయ్ లక్ష్యంగా కనిపిస్తోంది.పొత్తుతో లబ్ధిరంగస్వామి నాయకత్వాన్ని తన ప్రజాదరణను జోడించడం ద్వారా, పుదుచ్చేరి ఓటర్లను ఆకర్షించడం సులభమవుతుందని విజయ్ విశ్వసిస్తున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ లాంటి స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, టీవీకే కనీసం కొన్ని ఎమ్మెల్యే స్థానాలనైనా గెలవాలని ఆశిస్తోంది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే పుదుచ్చేరికి 'రాష్ట్ర హోదా' డిమాండ్ను విజయ్ మరోమారు లేవనెత్తారు.ఇరువురికి కలసివచ్చేలా..విజయ్ పుదుచ్చేరిలో రంగస్వామిని దగ్గర చేసుకోవడం అనేది 2026 ఎన్నికల వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీతో ఎన్ఆర్ కాంగ్రెస్కు సంబంధాలు దెబ్బతింటున్న ప్రస్తుత సమయంలో ఈ కొత్త పొత్తు ప్రతిపాదన రంగస్వామికి కూడా ప్రత్యామ్నాయ మార్గంగా మారనుంది. తమిళనాడులోకి ప్రవేశించడానికి పుదుచ్చేరిని గేట్వేగా విజయ్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో రంగస్వామి పుదుచ్చేరిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు విజయ్తో జతకలవాలని యోచిస్తున్నారని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు కీలకం కానున్నాయయని సమాచారం.ఇది కూడా చదవండి: Year Ender 2025: ఇడ్లీ విప్లవం.. ఉగాది పచ్చడికి పట్టం! -
క్షమించండి, తీర్పు అనంగీకారం!
‘తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్’ కేసులో సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యం: తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించ లేదు. వాటిని ఆయన రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కూడా ఆ బిల్లులకు సమ్మతి తెలుపలేదు. మరోసారి పరిశీలించవలసిందిగా కోరుతూ శాసనసభకు తిప్పి పంపనూ లేదు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం–గవర్నర్ మధ్య వివాదానికి దారితీసింది.ఇక్కడ మూడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి: 1. ఆమోదం పొందని బిల్లుపై సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు చెప్పగలదా? శాసనసభ ఆమోదించి పంపినా గవర్నర్ లేదా రాష్ట్రపతి దానికి సమ్మతి ఇవ్వనప్పుడు అది చట్టం హోదా పొందినట్లేనని భావించ వచ్చా? 2. ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ గవర్నర్ లేదా రాష్ట్రపతిని, ఆర్టికల్ 142 కింద, సంపూర్ణ న్యాయం అనే సూత్రం ప్రాతిపదికగా సుప్రీం కోర్టు బలవంత పెట్టగలదా? 3. శాసన సభ–గవర్నర్ మధ్య వివాదాన్ని పరిష్కరించే అధికారం రాజ్యాంగం సుప్రీం కోర్టుకు దఖలు పరిచిందా?రాజ్యాంగం ఏం చెబుతోంది?ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్ బిల్లును అందుకున్న తరువాత సాధ్యమైనంత త్వరగా దానికి ఆమోదముద్ర వేయాలి లేదా తన వ్యాఖ్యలు జోడించి వెనక్కు పంపాలి లేదా రాష్ట్రపతికి నివేదించాలి. ఒకసారి తిప్పిపంపిన తర్వాత, శాసనసభ ఆ బిల్లును మళ్లీ పంపితే, దానికి ఆమోదముద్ర వేయడం తప్ప గవర్నర్కు మరో మార్గం లేదు. తమిళనాడు విషయంలో బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు, వెనక్కు పంపలేదు. శాసనసభ తనకుతానుగా అదే బిల్లును రెండోసారి ఆమోదించి గవర్నర్కు పంపింది. గవర్నర్ ఎంతకాలం బిల్లును పెండింగులో పెట్టగలరు? రాజ్యాంగం కాలపరిమితి విధించడం లేదు. ‘సాధ్యమైనంత త్వరగా’ తిప్పి పంపాలని మాత్రమే చెబుతోంది. ఒకవేళ బిల్లు ఆమో దించడానికి నిరాకరిస్తే? అలాంటప్పుడు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, గవర్నర్ లేదా రాష్ట్రపతి మీద చట్టసభల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం. రెండు, ఆ బిల్లును మరోసారి పరిశీలించి ఆమోదించి పంపడం. తమిళనాడు శాసనసభ ఈ రెండో మార్గం ఎంచుకుంది. అది ప్రారంభించిన ఈ రాజ్యాంగ సంప్రదాయానికి రాజ్యాంగబద్ధత ఉందా? సుప్రీం కోర్టు ఈ అంశాన్ని చర్చించలేదు. మరొక పరిస్థితిని పరిశీలిద్దాం. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం నివేదించినప్పుడు, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయకుండా నిలిపివేస్తే, రాష్ట్ర శాసనసభ ఏం చేయాలి? రాష్ట్రపతి నుండి ఎలాంటి సందేశం రాకపోతే, శాసనసభ స్వయంగా బిల్లును పున:పరిశీలించి రెండోసారి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించ వచ్చు. బిల్లు రెండోసారి సభ ఆమోదం పొందినప్పుడు, ఆమోద ముద్ర వేయడం తప్ప రాష్ట్రపతికి మరో మార్గం లేదు. ఆర్టికల్ 143 కింద, రాష్ట్రపతి సుప్రీం కోర్టును అడిగిన ప్రశ్న: రాష్ట్రపతి ఎంతకాలం బిల్లును నిలిపివేయవచ్చు? దీనికి సమాధానంగా ఒక సంప్రదా యాన్ని నెలకొల్పే అవకాశం ఇదే ఆర్టికల్ కల్పిస్తోంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో మార్గదర్శక న్యాయస్థానంగా వ్యవహరించకుండా, దేశానికి సూపర్ హీరోగా, బాస్గా వ్యవహరించింది.ప్రస్తుత పరిస్థితిప్రస్తుత కేసులో రాష్ట్రపతి బిల్లును తిప్పి పంపలేదు, ఆమోద ముద్రా వేయలేదు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఇవ్వకపోయినా, లేదా సందేశంతో వెనక్కు పంపకపోయినా, శాసనసభకు ఉన్న ప్రత్యామ్నాయం ఆ బిల్లును తిరిగి పరిశీలించడం. అలా రాష్ట్రపతి సలహా లేకుండా బిల్లును పున:పరిశీలించి ఆమోదిస్తే, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయడం తప్ప మరోలా చేయలేరు. భవిష్య త్తులో శాసనసభకు రాష్ట్రపతికి మధ్య విభేదాలు వస్తాయని రాజ్యాంగం ఊహించలేదు.కానీ సుప్రీం కోర్టు తీర్పు వ్యవస్థల అధికార పరిధి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే ప్రధాన సమస్య. ఆర్టికల్ 145 ప్రకారం, సుప్రీం కోర్టుకు తన కార్యకలాపాలకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం ఉంది. అలాగే, ఆర్టికల్స్ 118, 208 ప్రకారం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు తమ సభావ్యవహారాల నిర్వహణకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం కలిగి ఉన్నాయి. ఆర్టికల్స్ 122, 212 ప్రకారం సభా కార్యకలాపాలను కోర్టులో ప్రశ్నించే వీల్లేదు. రాష్ట్రం, కేంద్రం నడుమ వివాదమా?భారత రాజ్యాంగం శాసనసభ, గవర్నర్ మధ్య సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించింది. అయితే, ఆచరణలో అనేక సందిగ్ధతలు ఉత్పన్నమవుతున్నాయి. బిల్లులు స్పీకర్ ద్వారా మాత్రమే గవర్నర్కు చేరతాయి. గవర్నర్ సమ్మతి పొందే వరకు బిల్లు శాసనసభ ఆస్తిగా ఉంటుంది. ఆమోదముద్ర పడిన తర్వాత అది చట్టంగా మారుతుంది. బిల్లు ఆమోదముద్ర పొందనంత వరకు ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు.ఆర్టికల్ 212 ప్రకారం శాసనసభ ప్రక్రియలు న్యాయస్థాన అధికార పరిధిలోకి రావు. అదే సమయంలో, ఆర్టికల్స్ 32, 131 ప్రకారం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదా రాష్ట్రం–కేంద్రం నడుమ వివాదాలు సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తాయి. గవర్నర్ లేదా రాష్టపతి బిల్లుపై సంతకం చేయకపోవడం రాష్ట్రం–కేంద్రం మధ్య వివాదం అవుతుందా? అలా అయ్యేట్లయితే అది సుప్రీం పరిధిలోకి వస్తుంది. సమస్య ఏమిటంటే, సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశాన్ని పరిశీలించలేదు. ఈ ప్రతిష్టంభనను అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, శాసనసభ బిల్లును రెండోసారి ఆమో దించడం. దీనివల్ల గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా తప్పించు కోలేరు. రెండవది, ఆర్టికల్ 156(1) ప్రకారం, రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్ పదవిలో ఉంటారు. అసెంబ్లీ తీర్మానం చేసి, గవర్నర్ను వెనక్కి పిలిపించవలసిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఈ మార్గాన్ని ఉపయోగించకపోవడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఉత్పన్నమైంది.గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసినప్పుడు, ఆయన తన అధికారాన్ని రాష్ట్రపతికి అప్పగించినట్లే. అందువల్ల రాష్ట్రపతి, గవర్నర్ ఒకే గుర్తింపు కలిగిన వారవుతారు. ఈ ముఖ్యాంశాన్ని సుప్రీం కోర్టు పరిశీలించలేదు. ఆర్టికల్ 12 ప్రకారం ‘స్టేట్’ అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ; కేంద్రంలో కేంద్రప్రభుత్వం, పార్లమెంటు అవుతాయి. కాబట్టి, రాష్టం గవర్నర్పై పిటిషన్ వేయడం అంటే తన మీద తనే కేసు వేసుకున్నట్లు అవుతుంది. ఇదెలా సాధ్యం? రాష్ట్రంలోని ఒక విభాగం మరొక విభాగానికి వ్యతి రేకంగా రిట్ పిటిషన్ను ఎలా దాఖలు చేయగలదో తేల్చడంలో అత్యున్నత న్యాయస్థానం విఫలమైంది. ఈ కారణాల వల్లనే నేను ఆ తీర్పుతో ఏకీభవించడం లేదు.ప్రకాశ్ అంబేడ్కర్వ్యాసకర్త లోక్సభ, రాజ్యసభ మాజీ సభ్యులు, అడ్వకేట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
విజయ్ ర్యాలీలో గర్జించిన లేడీ సింగం
కరూర్ విషాదం నేపథ్యంలో.. టీవీకే సభలు, ర్యాలీలకు షరతులు, పరిమితులతో నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా పుదుచ్చేరిలో జరిగిన విజయ్ ర్యాలీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పరిమిత సంఖ్యలో కార్యకర్తలు(అభిమానుల్ని) అనుమతించడంతో కొందరు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే లేడీ సింగం గర్జించింది.. మంగళవారం ఉదయం ఉప్పలం ఎక్స్పో గ్రౌండ్ వద్ద విజయ్ ర్యాలీ జరుగుతున్న సమయంలో టీవీకే నేత బస్సీ ఆనంద్.. బారికేడ్ల వద్దకు వచ్చి ‘‘లోపల స్థలం ఉంది.. రండి..’ అంటూ జనాల్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్ వెంటనే ఆయన చేతిలో ఉన్న మైక్ను లాగిపడేశారు. 40 మంది ప్రాణాలు పోయాయి కదా.. మళ్లీ అలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారా? అని ఆయన్ని ఆమె నిలదీశారు. ఈ క్రమంలో.. అనుమతించిన సంఖ్యకు మించి ఒక్కరినీ కూడా లోపలికి అనుమతించబోమని కుండబద్ధలు కొట్టారామె. దీంతో.. ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కరూర్ ఘటన తర్వాత పుదుచ్చేరి పోలీసులు కఠిన నియమాలు అమలు చేశారు. రోడ్షోకు అనుమతి లేదు, ప్రజల సంఖ్యను 5,000కి పరిమితం చేశారు. QR కోడ్ పాస్ ఉన్నవారికే ప్రవేశం ఇచ్చారు. అయితే అంత జాగ్రత్తలు పాటించినా కూడా ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది.Isha Singh IPS: UT: 2021 Gets Promotion To SSP Rank. She brings a rare combination of legal expertise and enforcement experience to her role. Read: https://t.co/D9i27rqJBi@HMOIndia @PuducheryPolice @iamishasingh @RajeshwarS73 pic.twitter.com/szTgMDL0Xx— Witness In The Corridors (@witnesscorridor) September 1, 2025 ఇషాసింగ్(28) 2020లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 191 ర్యాంకర్. 2021 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఇషా సింగ్.. ప్రస్తుతం పుదుచ్చేరి పోలీస్ సూపరింటెండెంట్. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్ వైపీ సింగ్(ముంబై పోలీస్ కమిషనర్గానూ పని చేశారు). తల్లి అభాసింగ్ లాయర్, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్ నేషనల్ లా స్కూల్నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐపీఎస్ కాకముందు.. లాయర్గా ప్రాక్టీస్ చేశారు.தவெக தொண்டர்களால் பாராட்டு பெற்ற Isha Singh IPS 🔥புதுச்சேரியில் விதித்த கட்டுப்பாடு தமிழ்நாட்டில் விதித்தால் உடனே தமிழ்நாடு அரசாங்கம் இடையூறு செய்கிறது என்று குற்றம் சொல்லுவான் தற்குறி விஜய்.🤦🏽♀️கரூர் சம்பவம் மூலம் விஜய் கூட்டத்தை எப்படி கெடுபிடிகள் செய்து நடத்தவேண்டும் என்று… pic.twitter.com/3DTUksgxqY— நந்தினி ❣️ (@Nandhini1360381) December 9, 2025 -
Tamil Nadu: ఈడీ చేతికి టెండర్ స్కాం.. సంచలన వివరాలు వెల్లడి
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న టెండర్ల కుంభకోణంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా శాఖ (ఎంఏడబ్యూఎస్)అధికారులు సంయుక్తంగా టెండర్లలో రూ.1,020 కోట్ల లంచం వసూలు చేశారనే ఆరోపణలతో ఎప్ఐఆర్ నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరింది. కాంట్రాక్టర్ల నుండి టెండర్ల నంచి లబ్ధి పొందేందుకు ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది.డీఎంకే మంత్రి సహచరులు ఎంఏడబ్యూఎస్ పనుల కాంట్రాక్ట్ విలువలో 7.5 శాతం నుండి 10 శాతం వరకు పార్టీ నిధులుగా వసూలు చేశారని ఏజెన్సీ తన లేఖలో పేర్కొంది. కాగా ఈ ఆరోపణలపై ఎంఏడబ్యూఎస్ మంత్రి కె.ఎన్. నెహ్రూ తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటానని ప్రకటించారు, ఇవి రాజకీయ ప్రేరేపితమని ఖండించారు. ప్రతిపక్షాలు డీఎంకే ప్రభుత్వ విజయాలను అంగీకరించలేకనే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని దుర్వినియోగం చేస్తోందని, దానిని పనికిమాలిన సంస్థగా మార్చిందని మంత్రి ఆరోపించారు. ఏఐడీఎంకే-బీజేపీ కూటమి ఆదేశం మేరకే ఈ ఆరోపణలు వస్తున్నాయని ఆయన ‘ఎక్స్’పోస్ట్లో పేర్కొన్నారు. తన కుటుంబంపై గతంలో ఉన్న కేసులను హైకోర్టు రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు.కాగా ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకే ఈ విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు డిమాండ్ చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కే పళనిస్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కమీషన్-కలెక్షన్-కరప్షన్ పాలన నడుపుతోందని ఆరోపించారు. మంత్రి బంధువులు నిర్వహించే కమిషన్ నెట్వర్క్ ద్వారా టెండర్లు తారుమారు చేశారని, కాంట్రాక్టర్ల నుండి 7.5 శాతం నుండి 10 శాతం వరకు వివిధ స్థాయిలలో 20 శాతం నుండి 25 శాతం వరకు కమీషన్లు వసూలు చేసిందని ఈడీ గుర్తించినట్లు ఏఐడీఎంకే పేర్కొంది. ప్రభుత్వంపై గతంలో వచ్చిన రూ.888 కోట్ల ‘ఉద్యోగాలకు నగదు కేసును కూడా పళనిస్వామి ప్రస్తావించారు, ప్రభుత్వం.. నిందితులను కాపాడుతోందని ఆరోపించారు. ఈ అవినీతి డబ్బును రికవరీ చేస్తే.. మెట్రో రైలు ప్రాజెక్టులు, విద్యార్థులకు వార్షిక ల్యాప్టాప్ పంపిణీ, రేషన్ కార్డుదారులకు రూ.5,000 పొంగల్ సహాయం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూరుతాయని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు క్షమాపణలు.. ఇండిగో పైలట్ భావోద్వేగం -
పుదుచ్చేరిలో విజయ్ సభ.. తుపాకీ కలకలం
చెన్నై: తమిళనాడులో కరూర్ తొక్కిలాట తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే (TVK) చీఫ్ విజయ్ నేడు పుదుచ్చేరి (Puducherry)లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. విజయ్ సభ నేపథ్యంలో సభా వేదిక వద్దకు ఓ వ్యక్తి తుపాకీతో రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, సదరు వ్యక్తిని టీవీకే పార్టీ నేతగా పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఉప్పాలం (Uppalam) లోని ఎక్స్పో గ్రౌండ్ (Expo ground) నేడు విజయ్ బహిరంగ సభ జరుగుతుంది. కరూర్ ఘటన నేపథ్యంలో పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి తుపాకీతో సభా వేదికలోకి ప్రవేశిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. అయితే, సదరు వ్యక్తి శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్గా అధికారులు గుర్తించారు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.Everyone stay safe and go home, please 🙏 #தமிழகவெற்றிக்கழகம் #TVKVijay #உங்கவிஜய்_நா_வரேன் #TVKVijay #ThalapathyVijaypic.twitter.com/eqckGwYgVt— Ꮋꭼꭺꭱꭲ Ꮋꭺꮯꮶꭼꭱ 💫 (@hearthacker031) December 9, 2025మరోవైపు.. పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు అనుమతి ఇచ్చినా.. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. విజయ్ మంగళవారం ఉదయం 11 గంటలకు కారులో సభాస్థలికి చేరుకుంటారు. సభకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అనుమతి ఉంది. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగం మొదలుపెట్టనున్నారు. పోలీసులు విధించిన షరతుల మేరకు విజయ్ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచారం రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదు. చిన్నారులు, గర్భిణి మహిళలు, వృద్ధులను ఈ సభకు అనుమతించకూడదు. ఈ నిబంధన మేరకు పార్టీ 5 వేల మందికి మాత్రమే ఎంట్రీ పాసులు ఇవ్వాలి. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాలకు చెందిన వారు సభకు రావద్దని టీవీకే కోరింది. -
విజయ్ ర్యాలీపై పోలీసుల ఆంక్షలు.. క్యూఆర్ కోడ్ గుర్తింపుతో..
సాక్షి, చెన్నై: టీవీకే నేత విజయ్ తన కేడర్కు 11 రకాల ఆంక్షలను విధించారు. కరూర్ విషాద ఘటన నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలలో నిమగ్నమయ్యారు. బుధవారం పుదుచ్చేరిలో జరగనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకుని ముందుగా కేడర్కు 11 రకాల ఆంక్షలను వినయ పూర్వకంగా విజయ్ సోమవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పుదుచ్చేరి ఉప్పలంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు విస్తృతం చేశారు. ఈసభకు హాజరయ్యే వారికి క్యూఆర్ కోడ్తో కూడిన గుర్తింపు కార్డులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలో అందజేస్తూ వస్తున్నారు. పార్టీ ఆవిర్భావంతో పుదుచ్చేరిలో జరగనున్న తొలి సభను పోలీసులకు అనేక ఆంక్షలు,సూచనలు, షరుతుల నడుమ విజయవంతం చేసుకునేందుకు టీవీకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో ఈ సభ విజయవంతానికి సహకరించాలని కోరుతూ కేడర్కు విజయ్ లేఖరాశారు. దయ చేసి ఈ సభకు తమిళనాడు నుంచి ఎవ్వరూ రావద్దని విన్నవించారు. తన వాహనాన్ని ద్విచక్ర వాహనాలు, కార్లలో వెంబడించ వద్దని వేడుకున్నారు. గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులు, బాల బాలికలు దయ చేసిన రావొద్దని విన్నవించారు. శాంతిభద్రతల పరిరక్షణకు.. పోలీసుల సూచనలను తప్పని సరిగా అనుసరించాలని, ట్రాఫిక్ జాం పరిస్థితులు కలి్పంచ వద్దు అని, శాంతి భద్రతల పరిరక్షణలో గానీయండి, క్రమశిక్షణలో గానీయండి హుందాగా వ్యవహరించాలని విన్నవించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించాలని, సభా ప్రాంగణ పరిసరాలలో చెట్లు ఎక్కడం, గోడలపైకి ఎక్కడం, విద్యుత్ స్తంభాలపై నిలబడటం వంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడ కూడదని కోరారు. అంబులెన్స్లకు, మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆ పరిసరాలలో వ్యవహరించాలని, బహిరంగ సభ ముగిసిన అనంతరం శాంతియుతంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది, సమస్య అన్నది సృష్టించకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. కాగా, సోమవారం ఏర్పాట్లను పరిశీలించిన భుస్సీ ఆనంద్ చేసిన వ్యాఖ్య హాట్టాపిగా పుదుచ్చేరిలో మారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పొత్తు విషయంగా విజయ్ సమాచారం ఇస్తారని పేర్కొనడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఇక పార్టీ వర్కింగ్ కమిటీ సమన్వయ కర్త సెంగొట్టయ్యన్ పేర్కొంటూ, టీవీకే ఎన్నికల చిహ్నం చూసి దేశమే ఆశ్యర్య పోబోతందని స్పందించడంతో ఎలాంటి గుర్తు దక్కబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈరోడ్లో విజయ్ ర్యాలీకి పోలీసులు నో -
సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ-2025లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా తమిళనాడు 3 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. సాయి సుదర్శన్ ఒంటిచేత్తో తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు వరుసగా ఔటైనా, టెయిలెండర్ సన్నీ సంధు (30) సాయంతో తన జట్టును గెలిపించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. విశ్వరాజ్ జడేజా (70), సమ్మద్ గజ్జర్ (66) మెరుపు అర్ద శతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో వీరిద్దరు మినహా ఎవరూ రాణించలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో సిలంబరసన్ 3, ఎసక్కిముత్తు 2, సన్నీ సంధు, రాజ్కుమార్ తలో వికెట్ తీశారు.అనంతరం ఛేదనలో తమిళనాడు కూడా తడబడింది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే సాయి సుదర్శన్ ఒక్కడు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలుత రిత్విక్ ఈశ్వరన్ (29), ఆఖర్లో సన్నీ సంధు సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. సుదర్శన్ దెబ్బకు తమిళనాడు 18.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జయదేవ్ ఉనద్కత్ (4-0-30-3), అంకుర్ పవార్ (3.4-0-26-2) తమిళనాడు ఆటగాళ్లను ఇరుకున పెట్టినప్పటికీ సాయి సుదర్శన్ వారిపై ఎదురుదాడి చేసి విజయం సాధించాడు. -
ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్ జర్నీ
ఒక ప్రమాదంలో కంటి చూపు పూర్తిగా పోయింది. కానీ మనోధైర్యాన్ని ఏమాత్రం కోల్పో లేదు. విధికెదురొడ్డి తన జీవితాన్ని తానే అత్యంత దృఢంగా నిర్మించుకున్నారో సాహసి. పట్టుదల, దృఢ సంకల్పానికి తోడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో భారతదేశంలోని తొలి పూర్తి అంధుడైన అధికారిగా నిలిచారు. సైన్యంలో క్రియాశీల విధుల్లో పనిచేస్తున్నలెఫ్టినెంట్ కల్నల్ సి. ద్వారకేశ్ విజయగాథ ఏంటో తెలుసుకుందాం.లెఫ్టినెంట్ కల్నల్ సి ద్వారకేశ్ ప్రయాణం ప్రతికూలతకు లొంగని అసాధారణ సంకల్పానికి నిదర్శనం. 2014లో పని సంబంధిత ప్రమాదంలో కంటి చూపు కోల్పోయారు. దీంతో సైనికుడిగా అతడి జీవితం అక్కడితో ముగిసిపోతుందని చాలామంది భావించారు. కానీ అతను మాతరం ఫీనిక్స్లా తన చరిత్రను తిరగరాసి చరిత్ర సృష్టించాడు , పూర్తిగా కంటి చూపు కోల్పోయినప్పటికీ తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నాడు. అత్యాధునిక AI సాధనాలు, ఇతర సాంకేతికత మద్దతుతో, ద్వారకేశ్ తన దృష్టిగల సహచరుల మాదిరిగానే నైపుణ్యంతో తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు.సియాచిన్ హిమానీనదం ఎక్కడం నుండి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో ప్రపంచ రికార్డు సృష్టించడం, ఈత, షూటింగ్ , విద్యావేత్తలలో ఒకడిగా రాణించడం వరకు ప్రతీ సవాలును విజయంగా మార్చుకున్న వైనం స్ఫూర్తి దాయకం. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వికలాంగుల జాతీయ అవార్డును అందుకున్నారు. దేశానికి ఆయన చేసిన అసమానమైన కృషికి గుర్తింపుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగన్ విభాగంలో బుధవారం (డిసెంబర్ 3, 2025) ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల దినోత్సవం రోజున వికలాంగుల జాతీయ అవార్డు ను లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేశ్కు ప్రదానం చేశారు. రుజువు చేస్తుంది.ద్వారకేశ్ ఏమన్నారంటే.. విద్యా ,సాంకేతికత ద్వారానే నా వైకల్యాన్ని అధిగమించగలిగాను. అనేక పోటీ పరీక్షలను విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాను. నేను ఇప్పుడు పారా క్రీడలపై, ముఖ్యంగా అంధ క్రీడలపై పూర్తి పరిశోధన చేయగలనని గర్వంగా చెప్పగలను. వైకల్యాన్ని శక్తిగా మార్చుకున్నాను. సాధారణ స్థితికి తిరిగి రావడానికి మార్గాలను కనుగొన్నాను.’’అన్నారు. 2009లో,సైన్యంలో అధికారిని అయ్యాను, భారత రాష్ట్రపతిచే కమిషన్ పొందాను. ఇపుడురాష్ట్రపతి నుండి ఈరోజు అవార్డుతో ధన్యుడినయ్యాను అన్నారు.ఎవరీ ద్వారకేశ్ద్వారకేశ్ తమిళనాడుకు చెందినవారు. పాఠశాల రోజుల నుండి ఆర్మీలో చేరాలనేది అతని కల. అలా NCCలో చేరారు. 2004లో తమిళనాడు NCC డైరెక్టరేట్ ఉత్తమ NCC క్యాడెట్గా ఎంపిక చేసింది. UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)కి కూడా అర్హత సాధించారు. పట్టుదలే జీవితం భారత సైన్యం సాంకేతిక ప్రవేశం క్యాడెట్ శిక్షణ విభాగం (CTW)లో చేరాడు. ఆ తర్వాత అతను 2009లో ఆర్మీ యొక్క కార్ప్స్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ను ఎంచుకున్నారు. 2014లో పూణేలో జరిగిన ప్రమాదంలో గాయం కారణంగా రెండు కళ్ళలో పూర్తిగా కంటి చూపు కోల్పోయారు. తన కెరీర్ ప్రారంభంలో ప్రమాదం అతని కళ్ళను కోల్పోయిన తర్వాత, 36 ఏళ్ల ద్వారకేశ్ 2023లో జాతీయ షూటింగ్ పోటీలో స్వర్ణ పతకం గెల్చుకున్నారు. తాను కంటి చూపును కోల్పోయాను, జీవిత దృష్టిని కాదున్న ఆత్మవిశ్వాసం ద్వారకేశ్ది. క్రీడా ప్రయాణం ప్రారంభం2018లో ఖడ్కీలో నియమితులైన ద్వారకేష్ బాంబే ఇంజనీరింగ్ గ్రూప్సెంటర్లో కొత్తగా స్థాపించబడిన పారాలింపిక్ నోడ్లో పారా-స్పోర్ట్స్ను అభ్యసించడం ప్రారంభించారు. 2021లో ఉదయపూర్లో జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో పతకం గెలుచు కున్నారు. గాయం తర్వాత అది అతని తొలి పతకం. ఈ గెలుపు మనోధైర్యాన్ని పెంచే పంచ్ ఇచ్చింది. అప్పటినుంచి పతకాల వేట మొదలైంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాక్టీస్ సెషన్లు మరియు పోటీలలో మెరుగైన నైపుణ్యం ప్రదర్శించారు. అక్టోబర్ 2025లో యుఎఇలో జరిగిన షూటింగ్ ప్రపంచ కప్లో ఆయన ఇటీవల సాధించిన 624.6 ప్రపంచ రికార్డు స్కోరు పట్టుదలకు నిదర్శనం. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) కూడా అర్హత సాధించారు.ప్రస్తుతం భారత పారా షూటింగ్ జట్టులో భాగం. అలాగే మధ్యప్రదేశ్లోని మహౌలోని ఆర్మీ మార్క్స్మ్యాన్షిప్ యూనిట్లో అధునాతన శిక్షణ పొందుతున్నారు. పారాలింపిక్స్లో అసాధారణ విజయాన్ని సాధించడం ద్వారా దేశానికి , కార్ప్స్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్కు అనేక పురస్కారాలను తెచ్చిపెట్టడం విశేషం.ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్ -
ఏపీ అయ్యప్ప భక్తులకు ఘోర రోడ్డు ప్రమాదం
-
ప్రమాదంలో మృతి చెందిన.. విజయనగరం అయ్యప్ప భక్తులు!
-
TN: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసుల దుర్మరణం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామనాథపురం జిల్లాలో రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన వాళ్లు అని పోలీసులు ప్రకటించారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ ముస్తాక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు.గాయపడిన వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, మరుపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మృతులు వీళ్లే.. 1) వంగర రామక్రిష్ణ(51) కొరప కొత్తవలస2)మార్పిన అప్పలనాయుడు(33) కొరప కొత్తవలస 3)మరాడ రాము(50) కోరప కొత్తవలస4)బండారు చంద్ర రావు(35) మరుపల్లి గ్రామం, గజపతినగరం మండలంమృతుల కుటుంబాలకు తమిళనాడు పోలీసులు ఇప్పటికే సమాచారం అందించారు. పోస్ట్మార్టం పూర్తైన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామన్నారు. మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంతో మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
టీవీకే విజయ్కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు అక్కడి ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ పాలకులు అనేక ఆంక్షలు విధించారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన విజయ్కు రోడ్ షో నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించారు. కావాలంటే బహిరంగ సభ నిర్వహించుకోవచ్చు అని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం ప్రకటించింది. దీంతో, విజయ్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.వివరాల ప్రకారం.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో పూర్తిగా తన దృష్టిని తమిళనాడుపైన విజయ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా చేపట్టిన మీట్ ది పీపుల్ ప్రయాణానికి కరూర్ విషాద ఘటన రూపంలో బ్రేక్ పడింది. డిసెంబర్ 4 నుంచి సేలం వేదికగా మళ్లీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనా, కార్తీక దీపోత్సవాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తనను కలిసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజల వద్దకే వెళ్లే విధంగా విజయ్ ముందుకు సాగుతున్నారు. గత వారం కాంచీపురం ప్రజల్ని కలిశారు. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తన దృష్టిని తాజాగా పుదుచ్చేరిపై కూడాపెట్టే పనిలో పడ్డారు.కాగా, డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షో, ర్యాలీ, బహిరంగ సభకు సన్నద్దమయ్యారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే వర్గాలు వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర డీజీపీ షాలిని సింగ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర వివరాలను అందులో తెలియజేశారు. పుదుచ్చేరి పర్యటన ముగించుకుని మరుసటి రోజన కడలూరు వెళ్లేందుకు విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పుదుచ్చేరి పాలకులు విజయ్కు అనేక ఆంక్షలతో అనుమతి ఇవ్వక తప్పలేదు.కరూర్ ఘటన దృష్టా ముందు జాగ్రత్తగా రోడ్ షోకు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. మంగళవారం టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితరులు అనుమతి కోసం ఓ వైపు డీజీపీ కార్యాలయం, మరోవైపు సీఎం రంగస్వామిని కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. చివరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అనేక ఆంక్షలతో బహిరంగ సభను నిర్వహించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. -
గోల్డ్లోన్స్లో దక్షిణాది రాష్ట్రాలే టాప్
సాక్షి, స్పెషల్ డెస్క్: రుణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావడం, తక్కువ పత్రాలు, సౌకర్యవంతమైన నిబంధనలు.. అందుకే జనం గోల్డ్లోన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పైగా ఇటీవలి కాలంలో పుత్తడి ధర భారీగా పెరిగింది. దీంతో తాకట్టు పెట్టిన పసిడిపై అందుకునే రుణ మొత్తమూ అధికమైంది. అయితే ఆసక్తికర విషయం ఏటంటే భారత్లో దక్షిణాది వాసులే అత్యధికంగా బంగారంపై లోన్లు తీసుకుంటున్నారు. ఖరీదైన రుణాలవైపు.. సగటున ఒక్కో వినియోగదారుడు అందుకున్న రుణ మొత్తం 2023 సెప్టెంబర్లో రూ.1.1 లక్షలు ఉంటే.. రెండేళ్లలో రూ.1.64 లక్షలకు చేరింది. రూ.లక్ష లోపు విలువ చేసే రుణ ఖాతాల సంఖ్య తగ్గింది. రూ.లక్షకుపైగా విలువ చేసే రుణ ఖాతాలు దూసుకెళ్లాయి. మొత్తం రుణాల్లో విలువ పరంగా.. రూ.లక్ష లోపు విలువచేసే రుణాల వాటా రెండేళ్లలో 25.9% నుంచి 14.4% పడిపోయింది. అలాగే రూ.5 లక్షలకుపైగా విలువ చేసే రుణాల వాటా దాదాపు రెండింతలైంది. పసిడి విలువ పెరగడమూ ఈ జోరుకు కారణమైంది. దేశవ్యాప్తంగా మొత్తం రిటైల్ రుణాల్లో గోల్డ్లోన్స్ అత్యధికంగా 27 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.దేశంలో మొత్తం బంగారు రుణాలు సెపె్టంబర్ నాటికి రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 76.55% ఉంది. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు తొలి స్థానం కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. మొత్తం గోల్డ్ లోన్స్లో టాప్–10 రాష్ట్రాలు రూ.13.2 లక్షల కోట్లు కైవసం చేసుకోగా, మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్ర మే. అయితే ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య 3.69 కోట్ల మంది కస్టమర్లు రూ.6 లక్షల కోట్ల విలువ చేసే పసిడి రుణాలు అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే రుణ మొత్తం 53%, వినియోగదారుల సంఖ్య 16% పెరగడం విశేషం. -
జస్ట్ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్ సక్సెస్ స్టోరీ
నూనూగు మీసాల విద్యార్థి దశలోనే ఉండగానే 18 ఏళ్ల వయసులో ఒక సంస్థకు సీఈఓ కాగలనని ఎవరైనా కలగంటారా? కానీ ఒకబ్బాయి కన్నాడు. పెద్ద సాహసమే చేశాడు. అభిరుచి, అభ్యాసం పట్టుదల ఉంటే ఏదైనా సాధించి తీరవచ్చని నిరూపించాడొక యువకుడు. కలలు కంటూ కూర్చోవడం కాదు, వాటిని సాకారం చేసుకోవడంలోనే ఉంటుంది కిక్కు. సూర్య వర్షన్ను చూస్తే అచ్చం ఇలాగే అనిపిస్తుంది. పదండి ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.తమిళనాడులోని తూత్తుకుడిలో ఒక చిన్న వంటింటి నుంచి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఆవిస్కృతమైన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. సూర్య వర్షన్ అద్భుతమైన నేకెడ్ నేచర్ (Naked Nature)ను స్థాపించాడు. కంపెనీ సీఈవోగా స్కిన్కేర్ అండ్ హెయిర్కేర్ బ్రాండ్ పరిశ్రమలో విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచాడు. View this post on Instagram A post shared by Surya Varshan (@zany_shan) ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన తూత్తుకుడి పట్టణంలో సూర్యకు చిన్నప్పటి నుంచి ఉప్పును ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. మరీ ముఖ్యంగా గాయాలకు ఉప్పు కాపడం పెట్టడం చూసి ఆశ్చర్యపోయేవాడు. అసలు ఉప్పులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది. దానిగురించి స్టడీ చేశాడు. తద్వారా మెగ్నీషియం, కాల్షియం ఉప్పులో ఎక్కువగా ఉంటాయని, అవి కండరాల నొప్పులను తగ్గిస్తాయని లుసుకున్నాడు. అయితే ఉప్పుతో పాటు ఏదైనా పదార్థాన్నికలిపి మెడిసిన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. రసాయనాలు కలపకుండా సహజ ఉత్పత్తులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గతల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ రూ.200 తో,600 చదరపు అడుగుల ఇంటిలో మందారం పువ్వు, బార్లీ, వేపాకుతో కలిపి బాత్ సాల్ట్ ను తయారు చేశాడు. దానికి హైబిస్కస్ బాత్ సాల్ట్ అని పేరుపెట్టాడు. దీని ధర రూ. 320. 12వ తరగతిలో సూర్య వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమై 2019లో ఒక చిన్న ఫ్యాక్టరీ సెటప్కు మారింది. దాదాపు అన్ని పనులూ సింగిల్ హ్యాండ్తోనే నడిపించాడు. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ అవే ఈరోజు సూర్యను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. చదవండి: సమంత-రాజ్ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!సేంద్రీయ, చేతితో తయారు చేసిన ఉత్పత్తులు, పైగా దేశీ-ఆవు నెయ్యిని ఉపయోగించడంతో ముగ్ధుడైన ఆయుర్వేద వైద్యుడు బల్క్ ఆర్డర్ ఇవ్వడంతో సూర్య వ్యాపారం కీలక మలుపు మలుపు తిరిగింది. ఈ విజయంతో సూర్య తన చదువులను మధురైకి మార్చుకుని పూర్తిగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు. యూట్యూబ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. వాటిని ఆన్లైన్లో బోధించి రూ. 2.2 లక్షలు సంపాదించాడు. దీన్ని తిరిగి నేకెడ్ నేచర్లో స్కేల్ ఆపరేషన్లకు పెట్టుబడి పెట్టాడు.ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?ప్రస్తుతం నేకెడ్ నేచర్ చర్మ ,జుట్టు సంరక్షణ, బాత్ బేబీ కేర్ వర్గాలలో, 70 ఉత్పత్తులనుపైగా సహజ ఉత్పత్తులను అందిస్తుంది. 2021-22 నాటికి రూ. 10 కోట్ల విలువను చేరుకుంది. కంపెనీ ఆఫీసు 4ఏవేల చదరపు అడుగులకు మారింది. ఈ బ్రాండ్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, అంతర్జాతీయంగా కూడా ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 2023లో గ్లోబల్ స్టూడెంట్ ఆంట్రపెన్యూర్ అవార్డు దక్కించుకున్నాడు. -
ఒంటరిగా ఉంటున్న వదినపై కన్నేసి..!
తమిళనాడు: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని కట్టుకుడలూర్ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్ భార్య తమిళరసి (35). వీరికి ఇద్దరు కుమారులు హరికృష్ణన్ (13), హరిశక్తి (10) ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా గత 10 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళరసి తన ఇద్దరు కుమారులతో కలిసి తన భర్త తమ్ముళ్లయిన బాలకృష్ణన్, మురుగనాథం ఇంట్లో నివసిస్తోంది. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం, బాలకృష్ణన్, మురుగానందం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మురుగానందాన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలకృష్ణన్కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలకృష్ణన్ తాగి ఇంటికి వచ్చాడు. తర్వాత తమిళరసితో గొడవ పడ్డాడు. తర్వాత తన వద్ద దాచిన కత్తితో తమిళరసి తలను నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న బాలకృష్ణన్ను అరెస్టు చేశారు. -
#CycloneDitwah : తమిళనాడులో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో చెన్నై (ఫొటోలు)
-
వీడు మనిషి కాదు.. భార్యను చంపి సెల్ఫీ..
తమిళనాడు: నెల్లై జిల్లాలో మహిళా హాస్టల్లో చొరబడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన వ్యక్తి బాలమురుగన్. అతని భార్య శ్రీప్రియ(32). వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలమురుగన్, శ్రీప్రియల మధ్య కుటుంబ కలహాలున్నాయి. దీంతో శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి టౌన్హాల్ ప్రాంతంలోని ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం చేస్తోంది. రేస్కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఆమె ఉంటోంది. ఆదివారం ఉదయం శ్రీప్రియను కలిసేందుకు బాలమురుగన్ నెల్లై నుంచి వచ్చాడు. భర్త వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీప్రియ బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలమురుగన్, తాను దాచి ఉంచిన కత్తిని తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. కత్తి వేటు మెడపై బలంగా పడడంతో ఆమె అక్కడికక్కడే విలవిల్లాడుతూ మృతి చెందింది. భార్య రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడుతూ మృతి చెందింది. శ్రీప్రియ చనిపోయిందని నిర్ధారించుకున్నాక, మృతదేహం పక్కన ఒక కుర్చీ వేసి అందులో కూర్చుని సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాడు. అందులో ద్రోహానికి జీతం మరణం అని పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలమురుగన్ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో శ్రీప్రియ ఒక యువకుడితో వివాహేతర సంబంధం కలిగి ఉందని, అందుకే హత్య చేశానని బాలమురుగన్ పోలీసులకు తెలిపాడు. శ్రీప్రియను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆదివారం వచ్చానని, సముదాయించినట్లు నటించి ఆమెను హత్య చేశానని తెలిపాడు. -
వాట్సాప్ స్టేటస్గా ‘మధ్యాహ్నం హత్య’!
సాక్షి, క్రైమ్: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేసిన దారుణ ఘటన ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి రేస్కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్లో ఉంటూ టౌన్ హాల్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్ వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, అందుకే కోపంతో హత్య చేశాడని బాలమురుగన్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్య ఆదివారం తమిళనాట పెను సంచలనం సృష్టించింది. -
తమిళనాడులో ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ప్రభుత్వ బస్సులు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలతో సహా 11 మంది మరణించారు. తిరుప్పూర్ నుంచి కారైక్కుడి వస్తున్న తమిళనాడు రవాణా సంస్థ ఎక్స్ప్రెస్ బస్సు, కారైక్కుడి నుంచి దిండుగల్ వైపుగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సు అతివేగంగా పిల్లయార్పట్టి సమీపాన సమత్తువ పురం వంతెన వద్ద ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొన్నాయి. దీంతో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి. స్థానికులు గాయపడ్డ వారిని, శిథిలాలలో చిక్కుకున్న వారిని బయటకు తీసి కారైక్కుడి ఆస్పత్రికి తరలించారు.ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మరణించగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలొదిలారు. శివగంగై జిల్లా కలెక్టర్ పొర్కొడి, ఎస్పీ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వంతెన దాటగానే ఉన్న మలుపు వద్ద రెండు బస్సులు అతివేగంగా దూసుకు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శివగంగ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 40 మంది ఉండగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
బలహీన పడుతున్న ‘దిత్వా’.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/తిరుమల/ఇందుకూరుపేట/ఒంగోలు సబర్బన్/సాక్షి, చెన్నై: దిత్వా తుపాను ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ క్రమేపీ బలహీనపడుతోంది. సోమవారం తెల్లవారుజాముకల్లా ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రానికి ఇది గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదులుతూ చెన్నైకి 150 కిలోమీటర్లు, వేదరన్నియంకు 170, కరైకల్కు 120, కడలూరుకు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నావూరులో 4.8, బుచ్చిరెడ్డిపాలెంలో 4.7, జలదంకిలో 3.6, పులికల్లులో 3.6, తిరుపతి జిల్లా చిట్టమూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. మైపాడు, కోడూరు, జువ్వలదిన్నె, తుమ్మలపెంట, రామాయపట్నం బీచ్లలోకి పర్యాటకులు రాకుండా మెరైన్, స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తుపాను నేపథ్యంలో చల్లగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.తిరుపతి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం దిత్వా తుపాను తిరుపతి జిల్లాను వణికిస్తోంది. జిల్లాలోని 24 మండలాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లాలోని అంగన్వాడీ స్కూల్స్తోపాటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుజాగ్రత్తగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. తిరుమలలోని ఐదు డ్యామ్లు పూర్తిగా నిండినట్లు టీటీడీ వాటర్ వర్క్స్ ఈఈ సుధాకర్రెడ్డి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (ఫోన్ నంబర్ 0877 2236007)ను ఏర్పాటు చేశారు.ప్రకాశం, వైఎస్సార్సీపీ కడప జిల్లాల్లో...ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి చిరు జల్లులు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒంగోలులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోనూ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు వర్షం కురుస్తోంది. జిల్లాలో అత్యధికంగా ఒంటిమిట్టలో 25.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను వర్షం దెబ్బతీస్తుందని భయపడుతున్నారు. తమిళనాడులో భారీ వర్షం... ఆరుగురు మృతినాగపట్నంలో కుంభవృష్టి... 23 సెం.మీ. వర్షపాతం నమోదు. దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు అతిభారీ వర్షం కురిసింది. కావేరి డెల్టా పరిధిలోని తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షం పడింది. అత్యధికంగా నాగపట్నంలో 23 సెం.మీ., మైలాడుతురైలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. గోడలు, ఇళ్లు కూలి రామనాథపురం జిల్లాలో ముగ్గురు, తుత్కుకూడి, నాగపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు, విద్యుత్ షాక్తో మైలాడుతురై జిల్లాలో ఒకరు మృతిచెందారు. దిత్వా తుపాను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాగపట్నం, కడలూరు మీదుగా పుదుచ్చేరి వైపునకు నెమ్మదిగా ప్రయాణించి కరైకాల్–పుదుచ్చేరి మధ్య బలహీన పడుతుండటంతో చెన్నై నగరంతోపాటు శివారు జిల్లాల్లో పెద్దగా వర్షం కురవలేదు. -
తమిళనాడులో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
శివగంగ జిల్లా: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. శివగంగ జిల్లా తిరుపత్తూర్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఓ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తుండగా.. మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్కు వస్తుండగా ప్రమాదం జరిగింది.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తమిళనాడుకు దిత్వా పెనుప్రమాదం
-
'దిత్వా' తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
దిత్వా తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను పుదుచ్చేరికి 280 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 380 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర దిశగా కదులుతున్న తుపాను రాత్రికి చెన్నై, రేపు పుదుచ్చేరి తీరాన్ని తాకనుంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలకు కూడా దిత్వా తుపాను ముప్పు ఉంది. దక్షిణ కోస్తా , రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రేపు ప్రకాశం, అన్నమయ్య, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించనున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోని అన్ని పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. -
అది సరికాదు.. కేంద్రంపై మరోసారి సీఎం స్టాలిన్ ఫైర్
చెన్నై: కేంద్రంపై మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. తమిళనాడును కేంద్రం మోసం చేస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడు నుంచి కేంద్రానికి ఎక్కువ రెవెన్యూ వెళ్తోందని.. కేంద్రం నుంచి మాత్రం తమిళనాడుకు తక్కువ నిధులొస్తున్నాయంటూ కేంద్రాన్ని స్టాలిన్ నిలదీశారు. రాష్ట్రానికి సంబంధించిన న్యాయమైన డిమాండ్లను కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని దుయ్యబట్టారు.అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకుంటూ, తమిళనాడు ప్రజల గొంతును బీజేపీ ప్రభుత్వం విస్మరించడం సరైనదేనా? అంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. తమిళనాడు డిమాండ్లు, అవసరాలను లేఖలు, వ్యక్తిగత పిటిషన్లు, శాసనసభ తీర్మానాల ద్వారా తీసుకొని వాటిని వినకపోవడం న్యాయం కాదు. అత్యధిక పన్ను ఆదాయాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రమైన తమిళనాడును మోసం చేయడాన్ని మనస్సాక్షి ఉన్న ఎవరూ అంగీకరించరు. మేము తలవంచం. నిటారుగా నడుస్తాం. రాబోయే పార్లమెంటరీ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం.. తమిళనాడు ప్రజా ప్రతినిధులకు సమాధానం చెప్పాలి’’ అంటూ స్టాలిన్ డిమాండ్ చేశారు. மிகப்பெரிய ஜனநாயக நாடு என்று பெருமையாகச் சொல்லிக்கொண்டே, தமிழ்நாட்டு மக்களின் குரலை ஒன்றிய பா.ஜ.க. அரசு புறக்கணிப்பது சரியா?தமிழ்நாட்டின் கோரிக்கைகளை - தேவைகளைக் கடிதங்களாக, நேரில் மனுக்களாக, சட்டமன்றத் தீர்மானங்களாக எடுத்துச் சொல்லியும் காதில் வாங்காமல் இருப்பது நியாயமல்ல!… pic.twitter.com/xCC8BcOZNB— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) November 29, 2025 -
దూసుకొస్తున్న ‘దిత్వా’.. తమిళనాట కుండపోత వానలు
విశాఖ: దిత్వా తుపాన్ దూసుకొస్తుంది. దిత్వా తుపాను కారణంగా తమిళనాడులో కుండపోత వానలు కురుస్తున్నారు. నాగపట్టిణం, కరైకల్, రామనాధపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరొకవైపు ఏపీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధిక కుండపోత వానలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు సహా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరికలు పంపింది. గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. VIDEO | Tamil Nadu: With Cyclone Ditwah approaching he coastal areas, Nagapattinam has receiving continuous rainfall leading to waterlogging in several low lying areas. #CycloneDitwah (Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/I0rXDVXA3A— Press Trust of India (@PTI_News) November 29, 2025 VIDEO | Strong winds lashed several parts of Tamil Nadu on Friday, as Cyclone Ditwah which is likely to bring heavy rainfall in the state, intensified over the southwest Bay of Bengal and the Sri Lankan coast. With the storm moving towards Puducherry, north Tamil Nadu and south… pic.twitter.com/80dhP4BV4I— Press Trust of India (@PTI_News) November 28, 2025దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలం అవుతుంది. శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించగా, మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో అధికారిక నివేదికల ప్రకారం 123 మంది మృతి చెందారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తులకు ప్రభావితమయ్యారు. తుఫాను కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి.In Sri Lanka, flooding has wreaked havoc. So far, 47 people have been reported dead from the #floods and landslides and 21 are missing. Relief and rescue operations are underway...#SriLanka #SriLankafloods #SriLankarains #SrilankaWeather #srilankanews #FloodSL #floodrelief pic.twitter.com/PIlM4GOwO2— Galgotias Times (@galgotiastimes) November 28, 2025 శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్లో నదుల నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పెరగడంతో సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరిట తక్షణమే సాయం అందించింది.దీనిలో భాగంగా వరద-నిర్వాసితులకు అత్యవసర సహాయ సామగ్రిని తీసుకువెళుతున్న భారత వైమానిక దళానికి చెందిన సీ130 విమానం శనివారం తెల్లవారుజామున కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో అవసరమైన ఆహారం, శానిటరీ సామాగ్రిని తరలించారు. సముద్ర మార్గం ద్వారా కూడా ‘ఆపరేషన్ సాగర్ బంధు’ ప్రారంభమైంది. తొలి విడత సహాయ సామగ్రిని భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా ఇప్పటికే తరలించారు. -
డిప్యూటీ సీఎం బర్త్డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు
తమిళనాడు మంత్రి పెరియా కరుప్పన్ చిక్కుల్లో పడ్డారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో(డిసెంబర్ 27న ఆయన బర్త్డే) అశ్లీల నృత్యాల్ని ప్రొత్సహించారాయన. పొట్టి దుస్తుల్లో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తుంటే సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఆయన జాలీగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో దుమారం రేగుతోంది. వీడియోలో మంత్రి పెరియా కరుప్పన్.. ముందువరుసలో జిల్లా స్థాయి పార్టీ నాయకులతో కలిసి కూర్చుని ప్రదర్శనను చూస్తున్నట్లు కనిపించారు. ఆ డ్యాన్సర్లను చూస్తూ మీసాలను మెలేశారాయన. ఆ తర్వాత ఆయన వేదికపై ఉన్న కళాకారులను దిగమని సంకేతాలు చేస్తూ.. తన దగ్గరగా నృత్యం చేయమని సూచిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో వాళ్లు ఆయన దగ్గరకు వచ్చి స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రి తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి.. డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఇలాంటి నృత్యాలను ప్రొత్సహించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మహిళలకు గౌరవం ఇచ్చే తీరు ఇదేనా? అని బీజేపీ నిలదీస్తోంది. అర్థనగ్నంగా ఉన్న మహిళలను తమ వద్దకు పిలిపించుకుని ఇలా మురిసిపోయే నేతలకు.. తమ భద్రత గురించి మహిళలు ఎలా చెప్పుకోగలరు? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరుప్పున్ చరిత్ర గురించి పాపం వాళ్లకు తెలియదేమో. ఇది పగటిపూట జరిగిందని అదృష్టం, లేకపోతే ఏమి జరిగేదో ఊహించలేం అంటూ అన్నాడీఎంకే ఘాటు చురకలు అంటించింది. పలువురు నెటిజన్లు సైతం ఈ వీడియోపై మండిపడుతున్నారు. గతంలో ఓ మహిళతో ఆయన్న సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజా ఘటన నేపథ్యంలో ఆ వీడియోను పలువురు తెరపైకి తెచ్చారు. ఈ ఘటనపై డీఎంకే పార్టీ, ఉదయ్నిధి ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదు. மீசையை முறுக்கிக்கொண்டே ஆட்டத்தை ரசிக்கும் அமைச்சர் பெரிய கருப்பன்... வைரல் வீடியோவ முழுசா பாருங்க.... pic.twitter.com/D1sHnbpmd8— Kathir News (@KathirNews) November 26, 2025 -
అన్నాడీఎంకేకు షాక్.. టీవీకే విజయ్తో ఆ ఎమ్మెల్యే భేటీ
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్ తగిలింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్తో ఎమ్మెల్యే సెంగొట్టయన్ భేటీ అయ్యారు. కొంతకాలంగా పళనిస్వామితో సెంగొట్టయన్కు విభేదాలు నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్యేని పళనిస్వామి సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెంగొట్టయన్ త్వరలోనే టీవీకేలోకి చేరతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.జయలలిత మృతి తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ఏఐఏడీఎంకే తిరిగి బలపడాలంటే శశికళ, పన్నీర్ సెల్వం, టి.టి.వి. దినకరన్లను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ ఇటీవల సెంగొట్టయ్యన్ బహిరంగంగానే తన వాదనలను వినిపించారు. ఎంజీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఏఐఏడీఎంకేలో ఉన్న సెంగొట్టయ్యన్.. పార్టీ ప్రచార రూపకల్పన చేసిన కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందారు.జయలిత పర్యటనలు, సభలు, సమావేశాలు, కేడర్ మొబిలైజేషన్ వంటి అంశాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీవీకేలోకి చేరబోతున్నారా? అంటూ మీడియా వేసిన ప్రశ్నకు ‘ఒక రోజు వేచి చూడండి’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. 2026 ఎన్నికలకు ముందు పార్టీని బలపర్చేందుకు విజయ్, సెంగొట్టయ్యన్కు కీలక పదవి ఇవ్వవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.సెంగొట్టయన్ ఇటీవల.. పార్టీ బహిష్కృత నేతలు పన్నీరు, సెల్వం, టీటీవీ దినకరన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళతో ఆయన భేటీ కావడం చర్చకు దారి తీసింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగిస్తూ ఇక అన్నాడీఎంకే వర్గాలు ఎవ్వరూ ఆయనతో సంప్రదింపు జరకూడదని పళణి స్వామి ఆదేశించారు.అన్నాడీఎంకేలో ఏకాధిపత్యం సాగుతుందని సెంగొట్టయన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. అందరూ సమష్టిగా ముందుకెళ్దామని పిలుపు నిస్తే, పార్టీ పదవి నుంచి తప్పించారని, ఇప్పుడేమో పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. తనను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్టు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నిబంధనల మేరకు తొలగింపు జరగ లేదని, ఇది చట్ట విరుద్ధం అని వ్యాఖ్యలు చేశారు.అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీని నడిపించాలని చిన్నమ్మ శశికళ తనకు ఆదేశాలు ఇచ్చారని, అయితే పళణి స్వామి పేరును ప్రతిపాదించింది తానే అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళణి స్వామి చేపట్టినానంతరంపార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోకూడా గెలవ లేదని, అంతా పతనమే అంటూ సెంగొట్టయన్ ధ్వజమెత్తారు. -
S.I.Rను ఆపలేం, కానీ..: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను నిలిపివేయాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతున్నందున నిలుపుదల చేయలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశాశారు. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆయన ఆదేశించారు.పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా.. ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయి ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో.. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను వివరణ కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎస్ఐఆర్ విషయంలో కేరళ ప్రభుత్వం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ వేరుగా పిటిషన్లో ఇప్పటికే(నవంబర్ 21వ తేదీన) సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వేసిన మరో పిటిషన్పైనే ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 9-11 తేదీల మధ్యలో కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది.తమిళనాడు నుంచి ఎస్ఐఆర్కు అన్నాడీఎంకే మద్దతుగా అప్లికేషన్ను సమర్పించింది. అధికార డీఎంకే సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. పుదుచ్చేరి నుంచి ప్రతిపక్ష నేత ఆర్ శివ వేరుగా పిటిషన్ వేశారు. అలాగే.. పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కమిటీ పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్పై విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. అదే తేదీన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉందని విషయం ధర్మాసనం దృష్టికి వెళ్లగా.. అవసరమైతే ఆ గడువును(డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ) పొడిగించవచ్చని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.‘‘అవసరమని తేలితే ఎన్నికల సంఘాన్ని తేదీ పొడిగించమని ఆదేశించవచ్చు. ఆ తేదీ(డిసెంబర్ 9) కారణంగా కోర్టుకు అధికారమే లేదని చెప్పలేం. కోర్టు ఎప్పుడైనా తేదీ పొడిగించమని చెప్పగలదు’’ అని అన్నారాయన. ఎస్ఐఆర్ ఉద్దేశ్యంఎస్ఐఆర్ అనేది ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక సవరణ ప్రక్రియ. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇది వివాదాస్పదమై, సుప్రీం కోర్టుకు చేరింది. దీని ఉద్దేశం.. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడంకొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడంమరణించిన లేదా అర్హత కోల్పోయిన వారిని తొలగించడంస్థానిక ఎన్నికలు లేదా ముఖ్యమైన ఎన్నికల ముందు జాబితా ఖచ్చితత్వం పెంచడం ఎస్ఐఆర్ ప్రక్రియలో.. డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ.. ప్రస్తుత ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం.అభ్యంతరాలు/సవరణలు స్వీకరణ.. ప్రజలు తమ పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం వంటి అంశాలను తెలియజేయవచ్చు.ఫీల్డ్ వెరిఫికేషన్.. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారు.ఫైనల్ రోల్స్ ప్రచురణ – సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు -
టాయిలెట్లో వీడియో రికార్డింగ్.. వ్యక్తి అరెస్టు
చెన్నై: బాత్రూం, టాయిలెట్లో సెల్ఫోన్ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళల వీడియోలను తీసిన టీ దుకాణం యజమానిని అరెస్టు చేశారు. వివరాలు.. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని రాసిపురం సమీపం ఆండకలూర్ గేట్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కాంప్లెక్స్లో ఒక టీ దుకాణం ఉంది. ఐదు రూపాయలకే టీ అమ్ముతూండటంతో ఈ దుకాణం దగ్గర రద్దీ ఎక్కువ. వెన్నండూరుకు చెందిన నాగరాజ్ (27) ఇక్కడ టీ చేస్తూంటాడు.నాగరాజ్ టాయిలెట్కు వెళ్లి తన సెల్ఫోన్ వీడియో ఆన్ చేసి వచ్చాడు. ఆ తర్వాత టాయిలెట్కు వెళ్లిన ఒక మహిళ దృశ్యాలు ఆ వీడియో రికార్డ్ అయిందని తెలుసుకుని దిగ్భ్రాంతి చెంది కేకలు వేసింది. అక్కడున్న వారు వెళ్లి తనిఖీ చేసి సెల్ఫోన్ తీసుకున్నారు. వారు ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సెల్ ఫోన్ను స్వాదీనం చేసుకున్న నాగరాజ్పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ లో అనేక అశ్లీల చిత్రాలు ఉన్నట్లు తేలింది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
తమిళనాడు టెంకాసి జిల్లాలో ఈరోజు (సోమవారం) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మదురై నుంచి శేంకొట్టైకి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, టెంకాసి నుంచి కోవిల్పట్టి వైపు వెళ్తున్న మరో బస్సు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి.రెండు బస్సులు ఢీకొన్న తీవ్రత కారణంగా ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు భారీ రక్షణ చర్యలు చేపట్టారు.ప్రాథమిక దర్యాప్తులో మదురై-శేంకొట్టై మార్గంలో వెళ్లిన ‘కీసర్’ అనే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. డ్రైవర్ అత్యధిక వేగంతో నడపడం వల్ల ప్రమాదం జరిగిందని సమాచారం.ప్రమాదంలో గాయపడిన 28 మంది సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించి పంపే బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదం తెలిపే అంశంపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల నడుమ తలెత్తిన పెను సంక్షోభానికి అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు సామరస్యపూర్వకంగా తెరదించింది. ‘‘ఈ విషయంలో సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానమూ వారికి ఎలాంటి గడువూ విధించజాలదు. అలా చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇది కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలను న్యాయవ్యవస్థ తన గుప్పెట పట్టడమే అవుతుంది. దీన్ని రాజ్యాంగం ఏ రూపంలోనూ అనుమతించలేదు’’ అని తేల్చిచెప్పింది. అంతేగాక సదరు బిల్లులకు ఆమోదం తెలపడం, రిజర్వులో ఉంచడంపై న్యాయ సమీక్ష కూడా కుదరదని స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు మూడు నెలల గడువు విధిస్తూ ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో సంచలన తీర్పు వెలువరించడం, అది రెండు కీలక వ్యవస్థల నడుమ సంక్షోభానికి దారితీయడం తెలిసిందే. మూడు నెలల్లోపు నిర్ణయం వెలువరించని పక్షంలో సదరు బిల్లులకు ఆమోదం లభించినట్టే భావించాలని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ రెండు అంశాలూ చెల్లుబాటు కాబోవని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ అంశంపై గురువారం ఈ మేరకు ఏకగ్రీవంగా 111 పేజీల తుది తీర్పు వెలువరించింది. ‘‘రాష్ట్రపతి, గవర్నర్లకు ఇది కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడమే అవుతుంది. అది రాజ్యాంగ విరుద్ధం’’అని వ్యాఖ్యానించింది. 142వ అధికరణంలోని ప్రత్యేక అధికారాలను వినియోగించుకుంటూ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పును కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే బిల్లులకు ఆమోదాన్ని గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో పెట్టడం మాత్రం ఎంతమాత్రమూ సబబు కాదని సీజేఐ ధర్మాసనం ఈ సందర్భంగా విస్పష్టంగా పేర్కొంది. ‘‘రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా అంతులేని జాప్యం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోబోవు. వాటిపై పరిమిత న్యాయసమీక్ష జరపవచ్చు’’అని పేర్కొంది. అయితే, ‘‘అప్పుడు కూడా వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించాలే తప్ప రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించడానికి వీల్లేదు’’అని స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్ర మంత్రిమండలి సలహాకు గవర్నర్ కట్టుబడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో విచక్షణ మేరకు వ్యవహరించే అధికారం రాజ్యాంగమే కల్పించింది’’అని కూడా గుర్తు చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్షం ఈ తీర్పుపై వెలిబుచ్చారు. చరిత్రాత్మక తీర్పు వెలువరించినందుకు రాష్ట్రపతి తరఫున సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. దీనిపై డీఎంకే సర్కారు స్పందించలేదు. ఆపితే తిప్పి పంపాల్సిందే.. ఏ నిర్ణయమూ తీసుకోకుండా గవర్నర్లు సుదీర్ఘకాలం పాటు బిల్లులను పెండింగ్లో పెట్టడం కుదరదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అది సబబు కూడా కాదని పేర్కొంది. ‘‘ఏ బిల్లునైనా ఆపితే దాన్ని కచ్చితంగా అసెంబ్లీకి వెనక్కి పంపాల్సిందే. రాజ్యాంగంలోని 200 అధికరణ ప్రకారం బిల్లుల విషయంలో గవర్నర్ల ముందున్నది మూడు దారులు. వాటిని ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం, లేదా పునఃసమీక్ష నిమిత్తం అసెంబ్లీకి తిప్పి పంపడం’’అని సీజేఐ పేర్కొన్నారు. వాటిని ఆమోదించకుండా గవర్నర్ తన వద్దే అట్టిపెట్టుకోవచ్చన్న కేంద్రం వాదనను తోసిపుచ్చారు. ‘‘అలా చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆపేయాలనుకున్న బిల్లులను అసెంబ్లీకి పంపడం ఆప్షన్కాదు, నిబంధన’అని చెప్పారు. న్యాయమూర్తి పేరు లేదు! రాజ్యాంగ ధర్మాసనం తరఫున తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును అందులో పేర్కొనకపోవడం విశేషం. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. 2019లో రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసుపై కూడా ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆ తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును కూడా అందులో పేర్కొనలేదు. ఇదీ నేపథ్యం...! అసెంబ్లీ పంపే బిల్లుల ఆమోదంలో గవర్నర్ల మితిమీరిన జాప్యం కొన్నేళ్లుగా వివాదాలకు దారితీస్తూ వస్తోంది. ముఖ్యంగా విపక్షాల పాలనలో ఉన్న తమిళనాడు, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ సమస్య తరచూ తలెత్తుతోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుకు కారణంగా నిలిచిన కేసు కూడా బిల్లుల ఆమోదం విషయమై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఎన్.రవి మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించినదే. అసెంబ్లీ ఆమోదించి పంపిన 10 బిల్లులను ఆమోదించకుండా ఆయన సుదీర్ఘంగా జాప్యం చేయడాన్ని సవాలు చేస్తూ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో, చట్టసభలు ఆమోదించి పంపే బిల్లులపై గవర్నర్లతో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోగా ఏ నిర్ణయమూ తీసుకోవాలంటూ జస్టిస్ జేబీ పార్డీవాలా ద్విసభ్య ధర్మాసనం గత ఏప్రిల్ 8న సంచలన తీర్పు వెలువరించింది. అది తీవ్ర కలకలానికి దారితీసింది. ఆ తీర్పు ఆధారంగా గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన అపీళ్లను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరిచడంతో కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయి. దాంతో నేరుగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని కోర్టులు ఇలా గడువులు పెట్టవచ్చా అంటూ నేరుగా సుప్రీంకోర్టునే నిలదీశారు. ఈ విషయమై పలు సందేహాలు లేవనెత్తుతూ 14 ప్రశ్నలు సంధించి వాటికి బదులు కోరారు. 143(1)వ అధికరణం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేషాధికారాలను ఉపయోగించుకుంటూ ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఆమె లేఖ రాశారు. దాంతో దీనిపై విచారణకు సీజేఐ సారథ్యంలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. గడువును వ్యతిరేకిస్తూ కేంద్రం, సమరి్థస్తూ తమిళనాడు సహా కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు వాదనలు విని్పంచాయి. అనంతరం గత సెపె్టంబర్ 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రపతి వేసిన 14 ప్రశ్నల్లో పదకొండింటిపై తాజా తీర్పులో తమ అభిప్రాయం వెలిబుచి్చంది. మిగతా మూడింటినీ ఈ అంశంతో సంబంధం లేనివిగా పేర్కొంది. ‘‘గవర్నర్లు బిల్లుపై తమ నిర్ణయాన్ని రిజర్వు చేసిన ప్రతిసారీ రాష్ట్రపతి ఇలా 143వ అధికరణ కింద సుప్రీంకోర్టు అభిప్రాయం కోరాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంది. -
తమిళనాడులో కలకలం.. సీఎం సహా ముగ్గురి ఇళ్లకు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడులో సీఎం స్టాలిన్ సహా పలువురు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేశారు. అనంతరం, అది ఫేక్ బెదిరింపు మొయిల్ అని పోలీసులు నిర్ధారించారు.వివరాల ప్రకారం.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసానికి ఆదివారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం నివాసం సహా నాలుగు ప్రదేశాలలో భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కొన్ని గంటల పాటు సోదాలు జరిగాయి. తనిఖీ సమయంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది ఫేక్ మొయిల్ అని నిర్దారించారు. కాగా, బెదిరింపు పంపిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు.మరోవైపు.. ఇటీవలి కాలంలో తమిళనాడు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. కొందరు ఆకతాయిలు ఇలా ఫేక్ కాల్స్, ఫేక్ మొయిల్స్ పెట్టి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత వారం కూడా చెన్నైలోని ఇంజంబక్కంలోని అజిత్ కుమార్ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి నుండి బాంబు బెదిరింపు వచ్చింది. అంతకుముందు.. నటుడు అరుణ్ విజయ్, ఇళయరాజా స్టూడియోకు సైతం ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి.Bomb threat to Tamil Nadu Chief Minister MK Stalin and actors Ajith Kumar, Khushbu Sundar. India Today's @PramodMadhav6 with more details#TamilNadu #Bombthreat #TheBurningQuestion @anchorAnjaliP pic.twitter.com/bpuxQqwHSJ— IndiaToday (@IndiaToday) November 17, 2025 -
హారర్ సఫారీ!.. చిరుత భయంకర దాడి
సాధారణంగా సఫారీ అంటే అద్భుతమైన అనుభూతి.. కానీ, బెంగళూరులోని బన్నేరుఘట్ట జాతీయ పార్కుకు వెళ్లిన ఒక చెన్నై మహిళకు మాత్రం అది భయంకరమైన పీడకలగా మిగిలిపోయింది. అడవి జంతువుల్ని చూసేందుకు ఆమె ఉత్సాహంగా సఫారీ బస్సులో ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ఓ చిరుత ఒక్కసారిగా బస్సుపైకి దూకి, రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాలీలోంచి ఆమె చేతిపై పంజా విసిరింది..బస్సుపైకి దూకిన చిరుత.. చెన్నైకి చెందిన 56 ఏళ్ల వహితా భాను అనే మహిళ గురువారం మధ్యాహ్నం 1 గంట స మయంలో బన్నేరుఘట్ట జాతీయ పార్కులో చిరుత సఫారీ ట్రిప్లో పాల్గొన్నారు. ఆమె కదలికలను గమనిస్తున్న చిరుత ఒక్కసారిగా బస్సు పైకప్పు పైకి లంఘించింది. అద్దం పక్కనే ఉన్న జాలీ ద్వారా లోపలికి పంజా విసిరి మహిళను గాయపరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. బస్సుపైకి చిరుత ఎక్కి, కిటికీ గుండా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. చిరుత పంజా దాడి లో వహితా భాను చేతికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జిగానిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.A 50-year-old woman from Chennai suffered injuries to her hand after a leopard at Bannerghatta Biological Park leapt onto a safari bus and clawed her. She was immediately rushed to a hospital in Jigani and is currently stable.Following the incident, the park authorities have… pic.twitter.com/QStkaAVBxK— India Today NE (@IndiaTodayNE) November 14, 2025 భద్రత ప్రశ్నార్థకం సాధారణంగా, జంతువులు, సందర్శకుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నివారించడానికి సఫారీ బస్సులకు కిటికీలు, ఇతర రంధ్రాలపై లోహపు వైర్ మెష్ (జాలీ) అమర్చుతారు. అయితే, ఈ చిరుత ఆ జాలీలోని చిన్న ఖాళీ గుండా లోపలికి పంజా విసిరి మహిళను రక్కగలిగింది. ‘మహిళ చేతికి గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు’.. అని ఒక అధికారి వెల్లడించారు.తాత్కాలికంగా సఫారీ నిలిపివేత గతంలో కూడా చిరుత దాడి జరిగిన నేపథ్యంలో.. బస్సుల భద్రతను పూర్తిగా అంచనా వేసే వరకు, నాన్–ఏసీ బస్సు సఫారీని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘సమస్య పరిష్కారమయ్యే వరకు వాహనాల పూర్తి భద్రతను అంచనా వేస్తాం. సందర్శకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’.. అని పేర్కొన్నారు. బన్నేరుఘట్ట జాతీయ పార్కులో జరిగిన ఈ ఘటన సఫారీ వాహనాల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కనీస రక్షణ ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం చిన్న లోపం ఉన్నా.. ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఈ సంఘటన రుజువు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తమిళనాడుపై ఆంధ్ర పైచేయి
సాక్షి, విశాఖపట్నం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో పటిష్టమైన తమిళనాడు జట్టుపై తమ అజేయ రికార్డును ఆంధ్ర జట్టు నిలబెట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమిళనాడుతో జరిగిన జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్లో ఆంధ్ర జట్టుకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. రంజీ ట్రోఫీలో ఆంధ్ర, తమిళనాడు జట్లు ఎనిమిదిసార్లు ముఖా ముఖిగా తలపడ్డాయి. నాలుగు మ్యాచ్ల్లో ఆంధ్ర నెగ్గగా... మరో నాలుగు మ్యాచ్లు ‘డ్రా’గా ముగి శాయి. తమిళనాడుతో పోరులో మొదట ఆంధ్ర బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు సత్తా చాటారు. సోమవారం ఆటలో 7 వికెట్లు పడగొట్టిన ఆంధ్ర... బ్యాటింగ్లో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడే రోజుల్లో మ్యాచ్ను ముగించింది. ఓవర్నైట్ స్కోరు 102/3తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన తమిళనాడు 70.3 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. సౌరభ్ (4/46), విజయ్ (2/16), పృథీ్వరాజ్ (2/31) తమిళ నాడును దెబ్బ కొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 5 పరుగుల ఆధిక్యం ఉన్న తమిళనాడు జట్టు... ఆంధ్ర ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆంధ్ర 41.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అభిõÙక్ రెడ్డి (70; 11 ఫోర్లు), కరణ్ షిండే (51; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఆంధ్ర స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయినా... అశ్విన్ హెబ్బర్ (21 నాటౌట్; 2 ఫోర్లు), సత్యనారాయణ రాజు (20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు. ఈ నెల 16 నుంచి జంషెడ్పూర్లో జరిగే తదుపరి మ్యాచ్లో జార్ఖండ్తో ఆంధ్ర ఆడుతుంది. -
షేక్ రషీద్ 87 నాటౌట్
సాక్షి, విశాఖపట్నం: తొలి రోజు తమిళనాడును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆంధ్ర జట్టు రెండో రోజు బ్యాటింగ్లో తడబడింది. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని నెలకొల్పాల్సిన చోట అనూహ్యంగా వెనుకబడింది. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఓవర్నైట్ స్కోరు 20/1తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆంధ్ర 49 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా తమిళనాడుకు 5 పరుగుల అతి స్వల్ప ఆధిక్యం లభించింది. ఆట మొదటి బంతికే అభిషేక్ (3)ను అవుట్ చేసిన సందీప్ వారియర్ ఆ తర్వాత కూడా ఆంధ్రను వణికించాడు. స్వల్ప వ్యవధిలో మరో ఓవర్నైట్ బ్యాటర్ త్రిపురణ విజయ్ (3)ని త్రిలోక్ నాగ్ క్లీన్»ౌల్డ్ చేశాడు. అలా జట్టు స్కోరు 30 పరుగులకు ముందే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. సందీప్ వారియర్ ధాటికి కెప్టెన్ రికీ భుయ్ (4), సోను యాదవ్ పేస్కు కరణ్ షిండే (9) నిలువలేకపోయారు. ఇలాంటి తరుణంలో 63 పరుగులకే సగం (5) వికెట్లను కోల్పోయిన ఆంధ్రను షేక్ రషీద్ (150 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. కానీ అవతలి వైపు అశ్విన్ (13), రాజు (1), పృథ్వీరాజ్ (0), సాయితేజ (2)ల నుంచి సహకారం లభించలేదు. ఒక్క సౌరభ్ కుమార్ (30; 3 ఫోర్లు) అండతోనే రషీద్ ఆమాత్రం స్కోరును చేసి పెట్టాడు. సందీప్ 4, త్రిలోక్ నాగ్, సోను యాదవ్, సాయికిషోర్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తమిళనాడు ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఓపెనర్లు విమల్ (20), జగదీశన్ (0)లను ఆంధ్ర»ౌలర్లు కట్టడి చేయగా... బాలసుబ్రహ్మణ్యం సచిన్ (51; 8 ఫోర్లు) రాణించాడు. ప్రదోశ్ రంజన్ (26 బ్యాటింగ్; 3 ఫోర్లు), సాయి కిషోర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పృథీ్వరాజ్, రాజు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం తమిళనాడు 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
హత్య కేసులో ట్విస్ట్.. వాట్సాప్లో పర్సనల్ ఫోటోలు, వీడియోలు..
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో ప్రేమలో పడ్డ ఓ తల్లి.. తన బిడ్డను అత్యంత అమానుషంగా హత మార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు మహిళల సంబంధం గురించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన సురేష్, వేదవతి(పేరు మార్చడం జరిగింది)కి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఐదు నెలల బాబు ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితం ఆ పసివాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తల్లి మాత్రం.. పాలు ఇస్తుండగా ఊపిరాడక పిల్లాడు చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కుటుంబ సభ్యులు కూడా ఆమె మాటను నమ్మి.. బాబుది సహజ మరణమని నమ్మి అంత్యక్రియలు నిర్వహించారు.ఫొటోలు, వీడియోలు.. ఇదిలా ఉండగా.. బాబు చనిపోయిన తర్వాత భార్య ప్రవర్తనలో మార్పును సురేష్ గమనించాడు. ఈ క్రమంలో ఆమె ఫోన్ చెక్ చేయగా, అందులో ఉన్న ఫొటోలు చూసి షాక్ అయ్యాడు. ఆమె మరో మహిళ అయిన సుమిత్రతో ప్రేమలో ఉందని, వీరిద్దరి మధ్య స్వలింగ సంబంధం కొనసాగుతోందని సురేష్ గుర్తించాడు. వారిద్దరికి సంబంధించిన వీడియోలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, తన కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు.భర్త సురేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరినీ తమదైన శైలిలో విచారించారు. దీంతో, ఇద్దరి మధ్య ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. అయితే, అంతకుముందు సురేష్, తన భార్యకు మధ్య గొడవలు జరిగాయి. అనంతరం, ఆమె కొంతకాలం తన పుట్టింట్లో ఉంది. కుటుంబ పెద్దల పంచాయతీ తర్వాత తిరిగి భర్త ఇంటికి వచ్చింది. కానీ, రెండు రోజుల క్రితం భర్త, కుటుంబ సభ్యులు బయట ఉన్న సమయంలో భారతి తన పసివాడికి ఊపిరాడకుండా చేసి చంపినట్లు విచారణలో వెల్లడైంది. ఇది సుమిత్ర సూచన మేరకే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్
సమాజంలో, ముఖ్యంగా సినీ సమాజంలో నటీ మణులు, హీరోయిన్లపై, శరీరాలపై అవమానకర (Bodyshaming) వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ (Gouri Kishan) శరీరాన్ని అవమానించేలా ఒక ప్రెస్మీట్లో అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలల్ని రగిలించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్టు ‘మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు?’ అని అడిగిన ప్రశ్నకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది. నటిగా నా నటన గురించి అడిగాలి, సినిమా గురించి అడగాలి కానీ, నా శరీర బరువు గురించి అడగడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ప్రశ్న ఒక పురుష నటుడి బరువు గురించి అడుగుతారా అని కూడా ఆమె ప్రశ్నించింది. పైగా బరువు గురించి అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ వాదించడం దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, ఇది జర్నలిజం కాదు. వేధింపులతో సమానమని పేర్కొంది. జర్నలిస్టులు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్ అయ్యింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద నటికి మద్దతుగా నిలిచారు. మహిళలపై ఆబ్జెక్టిఫికేషన్, బాడీ షేమింగ్కు అడ్డుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. గౌరీ కిషన్ తన రాబోయే చిత్రం 'అదర్స్' కోసం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగికత గురించి చర్చకు దారితీసింది. గౌరీ స్పందనతో అక్కడే వున్న ఆదిత్య మాధవన్ మౌనం కూడా ఈ చర్చకు ఆజ్యం పోసింది.క్షమాపణలు కోరిన హీరోఅయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరీ సహనటుడు, నటుడు ఆదిత్య మాధవన్ దీనిపై స్పందిస్తూ అందరికీ క్షమాపణలు చెప్పారు. తన మౌనం బాడీ షేమ్ చేయడాన్ని ఆమోదించినట్టుకాదనీ, కానీ ఆ సందర్భంలో స్తంభించి పోవడంతో తన నోట మాట రాలేదంటూ చెప్పుకొచ్చాడు. అయినా తాను జోక్యం చేసుకుని ఉండి ఉంటే బాగుండు అన్నారు.చిన్మయి స్పందనగాయని చిన్మయి శ్రీపాద ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు."గౌరీ అద్భుతమైన పని చేసింది. అగౌరవకరమైన, అనవసరమైన ప్రశ్న అడిగిన క్షణం, అరుపులు, ఎదురుదెబ్బలు వినిపిస్తాయి. ఇంత చిన్న వయస్సులో ఇంత ధైర్యంగా నిలబడినందుకు చాలా గర్వంగా ఉంది. ఏ పురుష నటుడిని కూడా బరువు గురించి అడగరు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.అటు పలువురు మహిళా జర్నలిస్టులు, పలువురు నెటిజన్లు గౌరీ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. హీరో, దర్శకుడు అక్కడే ఉండి కూడా మౌనంగా ఉండటం ఇద్దరికీ సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాగా బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌరీ కిషన్ తనదైన నటన, ప్రతిభతో హీరోయిన్గా రాణిస్తోంది తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.Thank you @Chinmayi Women like you inspire us to stand our ground. Your support means a lot to me, thank you. https://t.co/SbfN3eCyEp— Gouri G Kishan (@Gourayy) November 6, 2025 -
తమిళనాట ఎస్ఐఆర్పై సుప్రీంకు డీఎంకే
న్యూఢిల్లీ: తమిళనాడులో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేప ట్టాలంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) తీసుకు న్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అధి కార డీఎంకే సోమవారం సుప్రీంకోర్టును ఆశ్ర యించింది. ఈసీ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, ఏకపక్షం, ప్రజాస్వామ్య హక్కు లకు భంగకరమని పేర్కొంది. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి ఈ పిటిషన్ వేశారు. తమిళ నాడులో ఎస్ఐఆర్ చేపట్టేందుకు అక్టోబర్ 27న ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించడమేనన్నారు. ఎస్ఐఆర్తో అసలైన ఓటర్ల పేర్లను సైతం సరైన పత్రాలు లేవనే సాకుతో తొలగించే ప్రమాదముందన్నారు. పిటిషన్పై ఈ వారంలోనే అత్యు న్నత న్యాయస్థానం విచారణ చేపట్టే అవకా శముంది. -
250 మెగావాట్స్ పవర్ ప్లాంట్ సొంతం చేసుకున్న ఎంఈఐఎల్
తమిళనాడులో నేవేలి వద్ద 250 మెగావాట్ల లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొనుగోలు చేసింది. అబుదాబి కేంద్రంగా ఉన్న సంస్థ నుంచి వందశాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎంఈఐఎల్ గురువారం ప్రకటించింది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఎంఈ ఐఎల్ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈఐఎల్ ఎనర్జీ) తమిళనాడులోని నేవేలిలో ఉన్న టిఏక్యూఏ నేవెలీ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (టిఏక్యూఏ నేవెలీ) సంస్థను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ పిజెఎస్సి (టిఏక్యూఏ) నుంచి 100 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది.ఈ స్వాధీన ప్రక్రియ ఎంఈఐఎల్ గ్రూప్ వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు. ఒక పెద్ద ఈపీసి కాంట్రాక్టర్ నుంచి అంతర్గతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యాజమాన్యం, నిర్వహణలో నిమగ్నమైన సమగ్ర ఇన్ఫ్రా డెవలపర్గా మారే దిశలో కీలకమైన అడుగుగా ఎంఈఐఎల్ చేసిన ఈ కొనుగోలు నిలుస్తోంది.టిఏక్యూఏ నేవెలీ 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన లిగ్నైట్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని తమిళనాడులోని నేవెలీ ప్రాంతంలో నిర్వహిస్తోంది. ఈ విద్యుత్ కేంద్రానికి ఆ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిరంతర, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించడంలో ఈ యూనిట్ స్థిరమైన పనితీరు రికార్డును ఇప్పటికే నెలకొల్పింది.ప్రస్తుతం ఇంధన రంగంలో 5.2 గిగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యాన్ని ఎంఈఐఎల్ కలిగి ఉంది. తమిళనాడు ప్లాంట్ కొనుగోలు ద్వారా ఈ రంగంలో తన స్థానాన్ని సంస్థ మరింత బలపరుచుకుంటోంది. అలాగే, దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు స్థిరమైన, భారీ స్థాయిలో పనిచేసే ఉత్పత్తి ఆస్తుల పోర్ట్ఫోలియోను నిర్మించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.టిఏక్యూఏ నేవెలీని తన ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి ఆపరేషన్లలో సులభంగా సమన్వయం చేయడాన్ని ఎంఈఐఎల్ ఎనర్జీ ప్రాధాన్యంగా తీసుకుంటోంది. దీని ద్వారా ఆపరేషనల్ ఎక్సలెన్స్, సమర్థవంతమైన ఆస్తి నిర్వహణ తదితరాలకు సంస్థ కట్టుబడింది.ఈ సందర్భంగా ఎంఈఐఎల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సలిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ''ఉన్నత నాణ్యత గల విద్యుత్ ఉత్పత్తి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఈపీసీ రంగంలో మా అత్యుత్తమ నైపుణ్యాన్ని మౌలిక సదుపాయాల యాజమాన్యంతో కలిపి వ్యూహాత్మక మార్పు సాధించడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుంది. మా ప్రధాన దృష్టి, దేశీయ ఇంధన భద్రతను పెంపొందించే, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించే, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధికి మద్దతు ఇచ్చే వ్యూహాత్మక పెట్టుబడులపై కొనసాగుతుంది. థర్మల్, హైడ్రో, పునరుత్పాదక శక్తి రంగాలను సమన్వయం చేసే సమతులిత, స్థిరమైన విద్యుత్ ఉత్పత్తి పోర్ట్ఫోలియో నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాము'' అని అన్నారు. టిఏక్యూఏ నేవెలీ స్వాధీనం మా ఆర్గానిక్, ఇనార్గానిక్ వృద్ధి వ్యూహాలకు అనుగుణంగా ఉంది. భారత విద్యుత్ రంగంపై మాకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది అని అన్నారు.ఎంఈఐఎల్ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక శక్తి, మౌళిక సదుపాయాలు, తయారీ, నీటి నిర్వహణ తదితర రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్తులో భారత ఇంధన స్వావలంబన, ఆర్థిక స్థిరత్వంకు తోడ్పడే అవకాశాలను పరిశీలించి ముందుకు సాగుతోంది. -
కర్నూలు ఘటన: ‘ఈ దుఖం నాతోనే ఉండిపోవాలి’
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో కరిగి ముద్దగా మారిన మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏమని చెప్పాలి.. వారికి ఈ శరీరాన్ని ఎలా చూపాలి.. చూపితే వారు తట్టుకోగలరా.. ఇంతటి దుఃఖం మాతోనే ముగిసిపోనీ.. కర్నూలులోనే కుమారునికి అంత్యక్రియలు చేస్తాం’ అని ఆ తండ్రి బోరున విలపిస్తూ భావోద్వేగంతో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు.వీరిలో తమిళనాడులోని ధర్మపురం జిల్లా పాలక్కాడ్ తాలూకా మాదగేరి గ్రామానికి చెందిన రాజన్ మారప్పన్ కుమారుడు ప్రశాంత్ (29) కూడా ఉన్నాడు. ఇతను హైదరాబాద్లో చిప్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. అతడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. స్వస్థలానికి వెళ్లి భార్యాపిల్లలను చూసేందుకు గురువారం రాత్రి హైదరాబాద్లో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు కర్నూలు దాటగానే మంటల్లో కాలిపోయింది. ఇందులో ప్రశాంత్ సజీవదహనయ్యారు. సోమవారం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహానికి కూడా కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కర్నూలు నుంచి 800 కి.మీ. దూరంలో ఉన్న మాదగేరికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని.. మరణించి ఇప్పటికే మూడు రోజుల సమయం దాటిందని, ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లేలోపు ఐదు రోజులు పూర్తవుతుందని తండ్రి రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కాలిపోయిన మాంసం ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించి వారిని మరింత క్షోభకు గురిచేయలేమని, కేవలం అస్థికలు మాత్రమే తీసుకెళ్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సద్గురుదత్త కృపాలయం గ్యాస్ క్రిమేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి అస్థికల్ని అందజేశారు. వాటిని ప్రశాంత్ తండ్రి రాజన్ మారప్పన్తో పాటు సోదరుడు మణి, స్నేహితులు తీసుకెళ్లారు. -
కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ ఓదార్పు
తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కరూర్ బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో వాళ్లను పరామర్శించి.. ఓదార్చి.. పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కరూర్ తొక్కిసలాటకు నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తైంది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు టీవీకే తరఫున పరిహారం కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కరూర్ వెళ్లేందుకు ఆయనకు పోలీసుల నుంచి అనుమతి లభించడం లేదు. దీంతో.. దీంతో బాధిత కుటుంబాలనే మహాబలిపురంలోని ఓ రిసార్ట్కు రప్పించారు. బాధిత కుటుంబాల కోసం రిసార్ట్లో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసింది. వాళ్లందరినీ విడివిడిగా కలిసి విజయ్ పరిహారం అందిస్తున్నారు. కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది (Karur Stampede). ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అటుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణ కమిటీ ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించేవరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. -
28న కోవైకు ఉపరాష్ట్రపతి
●పలు కార్యక్రమాలకు ఏర్పాట్లు సాక్షి, చైన్నె: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈనెల 28వ తేదీన కోయంబత్తూరుకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఇటీవల ఉప రాష్ట్రపతి పదవిని అధిరోహించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఇంత వరకు తమిళనాడుకు రాలేదు. గత నెలాఖరులోరావాల్సి ఉండగా, కరూర్ విషాద ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. ఈ పరిస్థితులలో ఆయన ఈనెల 28వ తేదీన కోయంబత్తూరుకు రానున్నారు. ఉప రాష్ట్రపతిగా ప్రపథమంగా తమిళనాడుకు వస్తున్న సీపీ రాధాకృష్ణన్కు కోయంబత్తూరు విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికేందుకు బీజేపీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. కోయంబత్తూరులో పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కోయంబత్తూరు కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించనున్నారు. కోయంబత్తూరులోఉదయం నుంచిసాయంత్రం వరకు జరిగే కార్యక్రమాల తర్వాత ఆయన తిరుప్పూర్కు బయలుదేరి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. కోయంబత్తూరులో ఆయన పర్యటించే ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.వర్షం దెబ్బ..పెరిగిన కూరగాయల ధరలుకొరుక్కుపేట: తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చైన్నెలో కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోయంబేడు మార్కెట్కు వచ్చే కూరగాయల లోడ్లు తక్కువగా రావటంతో కూరగాయలు ధరలు అమాంతంగా పెరిగి పోయాయి. ఇప్పటి వరకు కిలో రూ.20 ఉన్న టమాటా ప్రస్తుతం రూ.60కి పెరిగింది. బీనన్స్ రూ.80, శనగలు రూ.60, క్యారెట్లు–రూ.50 పలికినట్లు తెలిపారు. ఇక బయటి మార్కెట్లోని దుకాణాల్లో టమాటాలు కిలో రూ.70 వరకు, బీనన్స్, మునగకాయలు కిలో రూ.120 వరకు అమ్ముడవుతున్నాయని వెల్లడించారు.బడులకు బెదిరింపులుసాక్షి,చైన్నె : చైన్నె శివారులోని పలు పాఠశాలలకు గురువారం వచ్చిన బాంబు బెదిరింపుతో పోలీసులు ఉరకలు తీశారు. దీపావళి సెలవుల అనంతరం బుధవారం బడులు తెరచుకోవాల్సి ఉండగా, వర్షం కారణంగా వాయిదా పడింది. వర్షం తెరపించడంతో గురువారం యథాప్రకారం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితులలో ఉదయాన్నే చైన్నె శివారులోని నొలంబూరు, తిరుమలిసై, పూందమల్లి, పరిసరాలో ఏడు పాఠశాలలకు ఒకటి తర్వాత మరొకటి అంటూవచ్చిన బెదిరింపు కాల్స్తో పోలీసులు, బాంబు, డాగ్స్క్వాడ్లు ఉరకలు తీశాయి. ఆ పరిసరాలలో తీవ్రంగా సోదాలు నిర్వహించినానంతరం ఇది బూచీ అని నిర్ధారించారు. ఇటీవల కాలంగా చైన్నె, శివారులలో బాంబు బెదిరింపు ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. -
ఉదయ్నిధి దీపావళి శుభాకాంక్షలు.. భగ్గుమన్న బీజేపీ
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ్నిధి స్టాలిన్ దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పడం.. రాజకీయంగా దుమారాన్ని రేపింది. నమ్మకం ఉన్నవారికే.. అంటూ చేసిన కామెంట్పై బీజేపీ భగ్గుమంది. ఇది హిందువులపై వివక్షేనంటూ తీవ్రస్థాయిలో ఆ పార్టీ నేతలు విరుచుకుపడతున్నారు.తాజాగా ఉదయ్నిధి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘వేదికపైకి వచ్చినప్పుడు కొందరు నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసం కొందరు సంకోచించారు. ‘చెబితే వీడు ఎక్కడ కోపపడతాడేమో?’ అని అనుకుని ఉండొచ్చు. అందుకే నమ్మకం ఉన్నవారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలపై(Udhayanidhi Stalin Diwali wish) బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ‘‘వాళ్లు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా హిందువులే. అందుకే మేం అందరికీ శుభాకాంక్షలు చెబుతాం" అంటూ ఉదయ్నిధి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇతర మతాల విషయంలో ఇలా ఎందుకు చేయబోరని.. ఆయన వ్యాఖ్యలు హిందువులపై వివక్ష చూపుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన నమ్మకం ‘‘ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు" అనే వ్యాఖ్యపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ANS ప్రసాద్ స్పందిస్తూ.. హిందూ పండుగలపై డీఎంకే ప్రభుత్వం కనీస గౌరవం ప్రదర్శించబోదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడిని సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. అయినప్పటికీ ఎందుకనో డీఎంకే ప్రభుత్వం హిందూ మతంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోంది. ఆ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’’ అని ప్రసాద్ విమర్శించారు. ఇదిలా ఉంటే.. డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక అసమానతలకు మూలం అంటూనే.. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి. ఇది డెంగీ, మలేరియా లాంటి వ్యాధిలా ఉంది అంటూ విమర్శించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడగా.. దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదు కావడంతో కోర్టుల్లో విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: తమిళనాడు ఎలక్షన్స్.. వార్నీ.. అప్పుడే తొలి జాబితా రిలీజ్ -
తమిళనాడులో కుండపోత వర్షం.. చెన్నై పరిస్థితి దారుణం..
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై విమానాశ్రయంలో రన్వేపైకి నీళ్లు చేరడంతో ఎక్కడికక్కడే విమానాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఆదివారం రాత్రి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో, నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తూర్పు తీర రోడ్డు (ECR) వెంబడి ఉన్న వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, నీలంకరై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు మోకాలి లోతు నీటితో ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.మరోవైపు.. భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీశారు. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందించాలని ఆదేశించారు. Heavy rain @aaichnairport. The runways are water-logged. @NewIndianXpress @ChennaiRains @praddy06 @IMDWeather #Chennaiairport #TamilNadu #ChennaiRains pic.twitter.com/lxlx6bdLYe— S V Krishna Chaitanya (@Krish_TNIE) October 20, 2025భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా ప్రకారం.. చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుచ్చేరి, కారైకల్, పరిసర జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 22 వరకు తమిళనాడు తీరప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.@ChennaiRains @RainStorm_TN Heavy rains with gusty wind at Thoraipakkam #wetdiwali pic.twitter.com/rMl98JVZwV— Lakshmanan S (@Laxman190566) October 20, 2025కొండ ప్రాంతాలైన నీలగిరి, కల్లార్, కూనూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో నీలగిరి మౌంటైన్ రైల్వే (NMR)లో రైలు సర్వీసులు రద్దు చేసింది. చెట్లు కూలిపోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగిందని దక్షిణ రైల్వే తెలిపింది. అక్టోబర్ 19న మెట్టుపాళయం–ఉదగమండలం (రైలు నం. 56136 మరియు 06171), ఉదగమండలం–మెట్టుపాళయం (రైలు నం. 56137) సహా మూడు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. Heavy rain on the bypass road in Chinnamanur, Theni districtand drizzling continues @ChennaiRains @MasRainman @RainStorm_TN @kalyanasundarsv @praddy06 pic.twitter.com/tudC0r5Gbn— Michael 🌿 (@michaelraj_GD) October 19, 2025 -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్కు అదిరిపోయే గుడ్న్యూస్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. -
కామితార్థ ప్రదాయిని కామాక్షీదేవి
కంచి (Kanchi) అనగానే మనకు కామాక్షిదేవి పేరే గుర్తుకు వస్తుంది. ఆ నగరాన్ని స్మరిస్తేనే మోక్షం లభిస్తుంది. అందరూ దర్శించే కామాక్షీదేవి ఆలయానికి వెనుకవైపు ఒక ఆలయం ఉంది. అదే ఆదికామాక్షీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని కాళీకొట్టమ్ (కాళీ కోష్టమ్) అనే పేరుతో కూడా పిలుస్తారు. ఒకానొక సమయంలో పార్వతీదేవి ఇక్కడ కాళీరూపంలో వెలసిందట. నాటినుండీ ఆమెకు ఆ పేరు ప్రసిద్ధమైంది.కంచి కామాక్షిదేవి ఆలయం కంటే ఇది ప్రాచీనమైనదని చెబుతారు. కామాక్షీదేవికి ముందు భాగంలో శక్తి లింగం ఒకటుంది. అమ్మవారి ముఖం లింగంపై ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరలింగంగా పూజలందుకుంటోంది. కల్యాణం కాని వారు ఈ శక్తి లింగాన్ని పూజిస్తే తప్పక కల్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపచేశారట.గర్భగుడిలో ఆదికామాక్షీదేవి పద్మాసనంలో కూర్చుని అభయముద్రను, పానపాత్రను, పాశాంకుశాలనూ నాలుగు చేతులతో ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి పీఠానికి కింది భాగంలో మూడు శిరస్సులు దర్శనమిస్తాయి. వాటి వెనుక ఒక పౌరాణిక గాథ ఉంది.శిల్పకుశలురైన ధర్మపాలుడు, ఇంద్రసేనుడు, భద్రసేనుడు అనే ముగ్గురు కాంచీపురంలో తమ శిల్పాలను ప్రదర్శించడానికి వస్తారు. వారి శిల్పకళకు అచ్చెరువొందిన కంచిరాజు వారికి ఒక మాట ఇచ్చి తప్పుతాడు. దాంతో రాజుకు శిల్ప సోదరులకు యుద్ధం జరుగుతుంది. భీకరమైన ఈ యుద్ధాన్ని నివారించేందుకు కామాక్షీదేవి ప్రత్యక్షమై రాజుకు, ఆ శిల్పులకు సంధి చేస్తుంది. శిల్పులకు తన పాదసన్నిధిలో స్థానం కల్పించి అనుగ్రహిస్తుంది. ఈ కథ ధర్మపాలవిజయం పేరిట ప్రసిద్ధి పొందింది. సకలశుభాలనూ, సకల సిద్ధులనూ అనుగ్రహించే ఆదికామాక్షీదేవిని దర్శించి అభీష్టసిద్ధిని పొందండి.చదవండి: పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
Tamil Nadu: హిందీ హోర్డింగులు, సినిమాలపై నిషేధం!
చెన్నై: త్రిభాషా సూత్రంపై తమిళనాట కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు నడుంబిగించింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి.న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశంఇండియా టుడే వెల్లడించిన వివరాల ప్రకారం తమిళానాడు అంతటా హిందీ బోర్డులు, హోర్డింగ్లు, హిందీ సినిమాలు, హిందీ పాటల ప్రదర్శనను త్వరలో నిలిపివేయనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిని చూస్తుంటే త్రిభాషా సూత్రం అమలుపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య నెలకొన్న విభేదాలు మరింత తీవ్రం అయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే లక్ష్యంతో అసెంబ్లీలో ఒక బిల్లును త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం రూపకల్పనలోని న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు న్యాయ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా..ఈ బిల్లును భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకేతో సహా అనేక రాజకీయ పార్టీలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే డీఎంకే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నదని సమాచారం. హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా శాసనసభ ఇటీవల ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.తమిళ భాషను కాపాడటమే లక్ష్యంగా..ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతూ, రాష్ట్రపతికి పార్లమెంటరీ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళం సహా ఇతర రాష్ట్రాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అప్పట్లో ప్రధాని నెహ్రూ ఇచ్చిన హామీ ప్రకారం హిందీయేతర రాష్ట్రాలు కోరుకునేంత వరకు ఆంగ్లం అధికారిక భాషగా కొనసాగుతుందని తెలిపారన్నారు. ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపాదిత బిల్లులోని వివరాల ప్రకారం బహిరంగ ప్రదర్శనలలో అంటే హోర్డింగులు, బోర్డులు, వినోద ప్రదర్శనలు, సినిమాలు పాటలు ఈ తరహా మాధ్యమాలలో హిందీ వాడకాన్ని నిషేధించనున్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని, తమిళ భాష గుర్తింపును కాపాడటమే లక్ష్యంగా బిల్లును రూపొందించనట్లు అధికారులు తెలిపారు. -
కరూర్ తొక్కిసలాట ఘటనపై దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ
-
ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో చెప్పలేం. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలంటారు పెద్దోళ్లు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. బైకులు, కార్లలో పిల్లలను ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇదిలావుంచితే కారులో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని ఆలత్తూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కారులో హఠాత్తుగా ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఆరేళ్ల పిల్లాడు చనిపోయాడు.వివరాల్లోకి వెళ్తే.. కల్పకం (Kalpakkam) సమీపంలోని పుదుపట్టిణం గ్రామానిక చెందిన వీరముత్తు, తన భార్య, కుమారుడు, మరో ఇద్దరితో కలిసి సోమవారం రాత్రి రెంటల్ కారులో చెన్నైకి బయలు దేరారు. విఘ్నేష్(26) అనే డ్రైవర్ కారు నడుపుతున్నాడు. వీరముత్తు తన ఆరేళ్ల కొడుకు కవిన్ను ఒళ్లో పెట్టుకుని ముందు సీట్లో కూర్చుకున్నాడు.తిరుపోరూర్ సమీపంలోని ఆలత్తూర్ (Alathur) పెట్రోల్ బంక్ వద్ద వీరికి కారుకు ప్రమాదం సంభవించింది. ముందెళున్న కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారులోని ఎయిర్బ్యాగ్ (airbag) కవిన్ ముఖంపై వేగంగా తెరుచుకోవడంతో అతడు కుప్పకూలిపోయాడు. బాలుడిని వెంటనే తిరుపోరూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పాడు. కుమారుడి ఆకస్మిక మరణంతో వీరముత్తు, అతడి భార్య హతాశులయ్యారు.ముందు వెళ్లిన కారు ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా సడన్గా కుడివైపు తిరగడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న వ్యక్తిని తిరుపోరూర్ సమీపం పయ్యనూర్ గ్రామానికి చెందిన సురేష్ (48)గా గుర్తించారు. అతడు కారులో పయ్యనూర్ నుంచి తిరుపోరూర్ వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపి బాలుడి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో సురేష్పై తిరుపోరూర్ (Thiruporur) పోలీసులు కేసు నమోదు చేశారు.నివేదిక వచ్చాకే..బాలుడి మృతదేహానికి చెంగల్పట్టు మెడికల్ కాలేజీలో పోస్ట్మార్టం నిర్వహించారు. కవిన్ మరణానికి గల వాస్తవ కారణాలు పోస్ట్మార్టం నివేదిక వచ్చాక వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. అతడి ఒంటిపై కనిపించే గాయాలేవీ లేవన్నారు. షాక్, అంతర్గత రక్తస్రావం కారణంగా మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్ -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
ఇండోనేషియా భామతో తమిళ యువకుడి పెళ్లి
అన్నానగర్: తమిళనాడలోని తిరువారూర్ జిల్లాలోని ముత్తు పెట్టి సమీపంలోని కరయంగడు గ్రామానికి చెందిన సోమసుందరం. ఇతని భార్య వాసుకి, వీరి కుమారుడు యోగాదాస్ (30), ఇతను గత పదేళ్లుగా సింగపూర్లోని ఒక ప్రైవేట్ కంపె నీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇండోనేషియాలోని అమానుషన్ బరాతకు చెందిన డేని యల్ టీపు-మాతా నియోసన్ థామ్పటి కుమార్తె డయానా టీపు(26) ఒకే కంపెనీలో పనిచేస్తోంది. ఈమె యోగాదాను గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలని ఈ జంట. నిర్ణయించుకున్నారు. తమిళనాడు ఆలయంలో వివాహ వేడుకను నిర్వహించాలని యోగాదాస్ నిర్ణయించుకుని, వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించి, బంధువులు, స్నేహితులు, గ్రామ స్తులందరికీ పంచిపెట్టారు. అనుకున్న ప్రకారం ఆదివారం అక్కడి కరై ముత్తు మారియమ్మన్ ఆలయంలో చాలా సరళంగా వివాహం జరిగింది. పట్టు చీర ధరించిన తమిళ మహిళలా కనిపించే డయానా టీషునకు యోగాదాస్ తాళి కట్టాడు. ఈ వేడుకలో బంధువులు, గ్రామ స్తులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! -
కలెక్టర్, ఎమ్మెల్యేతో యువతి వాగ్వాదం
తమిళనాడు: 30 సంవత్సరాలుగా తమ ఆదీనంలోని భూమిని 60 సంవత్సరాల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరిట పట్టా ఇవ్వడాన్ని తప్పుబడుతూ యువతి చంటి పాపతో వచ్చి కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్తో వాగ్వాదానికి దిగిన సంఘటన కలెక్టర్ కార్యాలయంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా విడయూర్ గ్రామానికి చెందిన గోవిందరాజ్కు అదే ప్రాంతంలో 30 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. సంబంధిత పొలంలో గోవిందరాజ్ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గోవిందరాజ్ పొలానికి సమీపంలోనే కుళ్లప్పరెడ్డి కుమారుడు ఏలుమలై, గోవిందరాజ్ సోదరుడు నాగరత్నంకు చెందిన వ్యవసాయ పొలం ఉంది. కుళ్లప్పరెడ్డి సుమారు 60 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల క్రితం గోవిందరాజ్ అ«దీనంలోని వ్యవసాయ పొలాన్ని కుళ్లప్పరెడ్డి పేరిట పట్టాను నాగరత్నం మార్చినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గోవిందరాజ్ కుమార్తె అనిత పట్టా మారి్పడిపై గత రెండు సంవత్సరాలుగా వినతిపత్రాలు ఇస్తోంది. అయితే ఇంత వరకు ఫలితం లేదు. దీంతో సోమవారం ఉదయం గ్రీవెన్స్డేలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రతాప్, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ను కలిసి వినతి పత్రం సమరి్పంచారు. ఈ వినతి పత్రంపై తక్షణం విచారణ చేయాలని కలెక్టర్‡ ఆర్డీఓ రవిచంద్రన్ను ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాలపై యువతి వాగ్వాదానికి దిగింది. ఇప్పటి వరకు 9 సార్లు వినతి పత్రం ఇచ్చామని, వినతి పత్రం ఇచ్చిన ప్రతి సారీ విచారణ అంటూనే కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించింది. న్యాయం జరిగేది ఎప్పుడూ అంటూ గట్టిగా కేకలు వేయడంతో గ్రీవెన్స్ హాలు నిశ్శబ్దంగా మారిపోయింది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పడంతో కలెక్టర్ యువతిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను పిలిపించి యువతిని బయటకు పంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. -
రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 14వేల ఉద్యోగాలు..
తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ తమిళనాడులో రూ.15,000 కోట్ల తాజా పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్మెంట్తో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా ఉద్యోగ కల్పన జరగనుందని కంపెనీ తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 14,000 ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ అంచనా వేస్తుంది.ఫాక్స్కాన్ చేయబోయే పెట్టుబడి విలువ ఆధారిత ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆర్ అండ్ డీ ఇంటిగ్రేషన్, ఏఐ నేతృత్వంలోని అధునాతన టెక్ కార్యకలాపాలు, బ్యాటరీ టెక్నాలజీలు వంటి అత్యాధునిక రంగాలపై కేంద్రీకృతమై ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిపై దృష్టి పెట్టడం ద్వారా కంపెనీ ఉత్పాదకత, ఆవిష్కరణల్లో ముందంజలో ఉండాలని చూస్తోంది.ఆమోదాలు వేగవంతం చేయడానికి..ఈ పెట్టుబడి ప్రకటనలో అత్యంత ముఖ్యమైన అంశం ‘గైడెన్స్ తమిళనాడు’. ఇది భారతదేశంలోని మొదటి ఫాక్స్కాన్ డెస్క్ అవుతుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలను వేగవంతం చేయడానికి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులను సమన్వయం చేయడానికి ఈ డెస్క్ను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు పరిశ్రమల శాఖ ఈ ప్రాజెక్ట్కు పూర్తి మద్దతు ఇస్తుంది. సింగిల్ విండో ఫెసిలిటేషన్ ద్వారా ఆమోదాలను వేగవంతం చేస్తుంది. టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు, ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేషన్ మెకానిజమ్ల ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చడంలో కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ఫాక్స్కాన్ కంపెనీ ఇండియాలో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తోంది.ఇదీ చదవండి: ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు! -
కరూర్ తొక్కిసలాటపై సీబీ‘ఐ’
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని కరూర్ పెను విషాద తొక్కిసలాట ఘటన కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై సీబీఐ జరిపే దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించడం విశేషం. కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు తమిళనాడు కేడర్కు చెందిన ఐపీఎస్లు ఉంటారని ధర్మాసనం తెలిపింది. తమిళనాడులో గత నెల 27వ తేదీన కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ ప్రచార సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట పెను విషాదానికి దారి తీసింది. ఈ కేసును ఐజీ అష్రా కార్గ్ నేతృత్వంలోని సిట్ విచారిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టీవీకే సుప్రీంను కోరింది. కాగా, బీజేపీసహా కొందరు బాధితులు సీబీఐ విచారణను కోరుతూ పిటిషన్ను దాఖలు చేశారు. వీరి పిటిషన్లను విన్న జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు సిట్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా, ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ అరుణా జగదీషన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ యథావిధిగా కొనసాగుతుందని, దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్ చేయలేదని ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో పాటు వాదనలు వినిపించిన న్యాయవాది, డీఎంకే ఎంపీ విల్సన్ తెలిపారు. కాగా, బాధితులుగా పేర్కొంటూ బాధితులు కానివారు సైతం కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారన్న విషయాన్ని న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకునిరావడంతో ఈ అంశంపై విచారణ జరుపుతామని బెంచ్ పేర్కొన్నట్లు విల్సన్ తెలియజేయడం గమనార్హం. ఇదీ చదవండి: 'మీరేం ఒంటరి కాదు..' విజయ్కు బీజేపీ సపోర్ట్!! -
‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు ఎఫెక్ట్.. తమిళనాడులో ఈడీ సోదాలు
చెన్నై: మధ్యప్రదేశ్ ‘కోల్డ్రిఫ్’(Coldrif Syrup) దగ్గు మందు కారణంగా 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును తయారు చేస్తున్న తమిళనాడులోని(Tamil Nadu) శ్రీసన్ ఫార్మా(Sreesan Pharma) సంస్థపై ఈడీ ఫోకస్ పెట్టింది. తాజాగా చెన్నైలో(Chennai) శ్రీసన్ ఫార్మాకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఈడీ(Enforcement Directorate) అధికారులు తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. చిన్నారుల మరణాలకు కారణమైన ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారుచేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids In Tamilnadu) అధికారులు సోమవారం శ్రేసన్ ఫార్మాతో సంబంధమున్న చెన్నైలో ఏడు ప్రదేశాల్లో సోదాలు, తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దగ్గు మందు తయారుచేసిన శ్రేసన్ ఫార్మా యూనిట్ యజమాని రంగనాథన్(73)ను ఇటీవల అరెస్టు చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.#Coldrif #CoughSyrupDeaths pic.twitter.com/zzVw4roe8J— NDTV (@ndtv) October 13, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్లో చిన్నారుల మరణాల నేపథ్యంలో శ్రేసస్ ఫార్మా కంపెనీలో తనిఖీ చేయగా.. సిరప్లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండగా దగ్గు, జలుబు, జ్వరాలతో వెళ్లిన చిన్నారులకు వైద్యులు కోల్డ్రిఫ్ సిరప్ను సూచించగా అందులోని విషపదార్థం వల్ల పిల్లల కిడ్నీలు విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్రిఫ్ను నిషేధించాయి.ఇదిలా ఉండగా.. ఔషధ తయారీ సంస్థగా ఈ కంపెనీ కేంద్ర పోర్టల్లో రిజిస్టర్ కాలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ఇచ్చే గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (GMP) సర్టిఫికెట్ లేకుండానే దశాబ్దాల పాటు ఫార్మా సంస్థ నడిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలిపారు. దీంతో, ఫార్మా కంపెనీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
కుటుంబాన్ని చిదిమేసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ!
సాక్షి, చెన్నై: ఇన్స్టాగ్రామ్ ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇందులో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. తన ముగ్గురు పిల్లల్ని గొంతు కోసి చంపేసి ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లా పట్టుకోట్టైలో శనివారం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలోని కోయిల్ సముద్రం గ్రామానికి చెందిన వినోద్ కుమార్ (38), నిత్య (35)కు పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.తొలుత వినోద్ కుమార్ సొంతంగా వ్యాపారం చేయగా.. నష్టాలు రావడంతో ఫొటోగ్రాఫర్గా మారి ఆపై ఓ హోటల్లో పనికిచేరాడు. ఈ దంపతులకు కుమార్తెలు ఓవియ(11), కీర్తి(8), కుమారుడు ఈశ్వర్(5) ఉన్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో ఆ కుటుంబానికి సమస్యలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నిత్య ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది.వాటికి ఆకర్షితుడైన మన్నార్గుడికి చెందిన ఓ యువకుడు ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆమె ఆర్థిక కష్టాలను గుర్తించి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులను కొనిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ సన్నిహితంగా మెలగుతుండటాన్ని గుర్తించిన వినోద్కుమార్.. నిత్యను మందలించాడు. దీంతో తనకు విలాసవంతమైన జీవితం కావాలంటూ ఆ యువకుడితో నిత్య ఇటీవల వెళ్లిపోయింది.ఉన్మాదిగా మారి...ఆమెను బతిమిలాడినా తిరిగి రాకపోవడంతో విజయ్కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఓవియ బడి మానేసి తన చెల్లి, తమ్ముడి లాలన చూసుకునేది. క్రమంగా వినోద్కుమార్ మానసికంగా కుంగిపోతూ ఉన్మాదిగా మారాడు. శుక్రవారం రాత్రి పకోడీని తన తమ్ముడు, చెల్లికి ఓవియ తినిపిస్తుండగా, మద్యం మత్తులో వచ్చిన వినోద్కుమార్ ఓవియ, ఈశ్వర్ను బయటకు పంపించాడు.మరో కుమార్తె కీర్తిని తన ఒడిలో పెట్టుకుని లాలిస్తూ, క్షణాల్లో కత్తితో ఆమె గొంతు కోసేశాడు. కీర్తి పెడుతున్న కేకలతో ఓవియ, ఈశ్వర్ ఇంట్లోకి పరుగులు తీశారు. క్షణాల్లో మిగిలిన ఇద్దరినీ గొంతుకోసి చంపేశాడు. రక్తపు మడుగులో మరణించిన పిల్లలను చూసి ఏడుస్తూ, తన భార్యకు గుణపాఠం చెప్పేశానంటూ తాను పనిచేస్తున్న హోటల్కు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి మదుక్కూర్ పోలీసు స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. -
‘ఖబడ్దార్..’ విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నై: తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఇంటికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో నీలగిరిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయగా.. కాల్ చేసిన ఆగంతకుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు. చెన్నై పోలీసులకు కాల్ చేసిన సదరు వ్యక్తి.. భవిష్యత్తులో విజయ్ గనుక పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇంటిని బాంబుతో పేల్చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఆ కాల్ కోయంబత్తూరు నుంచి వచ్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో నిర్వహించిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఘటన తర్వాత విజయ్ కనీసం బాధితులను పరామర్శించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆపై దాడులు జరిగే అవకాశం ఉండడంతో.. విజయ్ ఇంటికి పోలీసు భద్రతను పెంచారు.ఈ ఘటనపై నమోదైన కేసులో టీవీకే నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయగా, మద్రాస్ హైకోర్టు సిట్ ఏర్పాటునకు ఆదేశించింది. అయితే టీవీకే మాత్రం ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. కరూర్ ఘటన నేపథ్యంలో రాజకీయ సభలకు, ర్యాలీలకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో తమిళనాడు ప్రభుత్వం ఉంది. ఆ మార్గదర్శకాలను జారీ చేసే దాకా.. తమిళనాడులో ఏ పార్టీకి ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వబోమని ఇప్పటికే మద్రాస్ హైకోర్టుకు స్పష్టం చేసింది కూడా. ఇదిలా ఉంటే.. తమిళనాడు (Tamil Nadu)లో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. గతకొంతకాలంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ తారలు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్భవన్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు జరిపి.. ఆ బెదిరింపులు ఉత్తవేనని తేల్చాయి. ఇదీ చదవండి: కరూర్ బాధితులకు విజయ్ పరామర్శ -
తమిళనాట ప్లాన్ ‘బీ’.. కొత్త పొ(ఎ)త్తులు ఫలించేనా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారాల్లో.. అక్కడి పార్టీలు తలమునకలై పోయాయి. అయితే కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార డీఎంకేను కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్లాన్ బీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.ఎన్డీయే కూటమిలో(TN NDA Alliance) భాగంగా.. ప్రతిపక్ష అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి నిష్క్రమించిన తర్వాత.. మరికొందరు కూడా ఆ బాటలోనే గుడ్బై చెప్పేస్తున్నారు.ఈ క్రమంలో బీజేపీ కొత్తు పొ(ఎ)త్తులకు తెర తీసింది. డీఎంకే వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడం లక్ష్యంతో.. ఎన్డీయేను బలపర్చాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి.. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ జయ్ పాండా, కో-ఇన్చార్జ్ మురళీధర్ మొహోల్ ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు, అన్నాడీఎంకే నాయకులతో వ్యూహాత్మక చర్చలు జరిపారు.ఇందులో ప్రధానంగా.. విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) గురించే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. టీవీకే పార్టీకి 20% ఓటు షేర్ కలిగి ఉందట. ఇందులో.. 60 శాతం NDA వ్యతిరేక ఓట్లే ఉన్నాయని ఓ అంచనాకి వచ్చింది. ఈ క్రమంలో.. విజయ్ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహం అమలు చేస్తోంది. తాజాగా కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. జరిగిన దానికి ప్రభుత్వ బాధ్యత కూడా ఉందని, ఏకపక్షంగా టీవీకేను లక్ష్యంగా చేసుకుంటే తమ మద్దతు ఉంటుందని బీజేపీ అగ్రనేత ఒకరు విజయ్కు హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు మొన్నీమధ్యే కథనాలు ఇచ్చాయి. ఈ క్రమంలో.. విజయ్ అభిమాన గణాన్ని ఆకర్షించడంతో పాటు మరో ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోందన్న విశ్లేషణ తమిళనాట జోరుగా సాగుతోంది. కరూర్ ఘటనకు ముందు దాకా.. ఏ కూటమిలో టీవీకే భాగంకాదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, అయితే అధికారం కోసం కదిలొచ్చే పార్టీలను స్వాగతిస్తామని టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. దీంతో.. తమిళనాట చిన్నపార్టీలన్నీ టీవీకే వైపు ఒక్కసారిగా తిరిగాయి. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికకళ వర్గం, టీవీకే దినకరన్ వర్గం సహా పలు పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం.. విజయ్కి మద్దతు ఇచ్చేందుకేనని చర్చా జరిగింది. అంతెందుకు.. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న పట్టాలి మక్కల్ కచ్చి(PMK)లోనూ అంతర్గత విభేదాలు తలెత్తి.. ఆ పార్టీ సీనియర్ నేత రామదాస్ తనయుడు ఏ రామదాస్.. టీవీకేలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. నవంబర్ లేదా డిసెంబర్లోపు ఆయా వర్గాలు విజయ్ కూటమికి మద్దతు ఇచ్చే ప్రకటనలు చేస్తాయని దాదాపు ఖరారైంది. అయితే.. ఈలోపు కరూర్ ఘటనతో టీవీకే పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో విజయ్కు మద్దతు ప్రకటించడం మంచిది కాదనే పునరాలోచనలో ఉన్న ఆ వర్గాలకు బీజేపీ గాలం వేస్తోందని తెలుస్తోంది. తద్వారా ఓట్ల చీలికను నివారించడమే కాకుండా.. ఎన్డీయే కూటమిని బలపర్చుకునే యోచనలో బీజేపీ ఉంది. అయితే.. ఈ విషయంలో అన్నాడీఎంకే నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం లేకపోలేదు. బహిష్కృత నేతలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునేది లేదని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి.. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జరిగిన భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోయే డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలోపు పళనిని ఒప్పించే బాధ్యతలను ఎన్నికల ఇంచార్జిలకు బీజేపీ అప్పగించినట్లు తమిళ వెబ్సైట్లు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: అమిత్ షాపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు -
కల్తీ దగ్గు మందు కేసులో కీలక పరిణామం
చెన్నై: కల్తీ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 మంది చిన్నారుల మరణాలకు కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ ఫార్మాసూటికల్స్ కంపెనీ యాజమాని జి.రంగనాథన్(73)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జి. రంగనాథన్(G Ranganathan) మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఫార్మసీ గ్రాడ్యుయేట్. గత 40 ఏళ్లుగా ఔషధ తయారీ రంగంలో ఉన్నారు. 80వ దశకంలో ప్రోనిట్(Pronit) అనే పోషక సిరప్ను తయారు చేసి చెన్నైలో ప్రసిద్ధి పొందారు. ఆ తర్వాత లిక్విడ్ నాసల్ ప్రొడక్ట్స్(ముక్కు డ్రాప్స్), చిన్న స్థాయి తయారీ యూనిట్లను చెన్నై పరిసరాల్లో స్థాపించారు. శ్రేసన్తో పాటు సీగో ల్యాబస్, ఇవెన్ హెల్త్కేర్ సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు ఔషధ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశకుడిగా నిలిచారు కూడా. అయితే మధ్యప్రదేశ్ చిన్నారుల మరణాల నేపథ్యంలో.. శ్రేసన్ సంస్థపై కేసు నమోదు అయ్యింది. కోడంబాక్కంలోని రంగనాథన్ కార్యాలయాన్ని సైతం అధికారులు సీజ్ చేశారు. ఆయన అరెస్టును పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే..తమిళనాడు కాంచీపురం శ్రేసన్ ఫార్మాసూటికల్స్ యూనిట్ నుంచి మే నెలలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ (Cough Syrup) బ్యాచ్ను పలు రాష్ట్రాలకు పంపింది. ఈ క్రమంలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కలిపి 20 మంది చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలో కోల్డ్రిఫ్ను నిషేధించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. మరణాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేసింది. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే.. కోల్డ్రిఫ్లో డైఈథిలీన్ గ్లైకాల్ (DEG) అనే పదార్థం మోతాదుకు మించి(500 రేట్లు) 48.6% స్థాయిలో ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఇదే పిల్లల్లో కిడ్నీలను కరాబు చేసి.. వాళ్ల మరణాలకు దారి తీసింది. తమిళనాడు ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ట్మెంట్ తనిఖీల అనంతరం తీవ్ర ఉల్లంఘనలను గుర్తించి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న శ్రేసన్ యూనిట్ను మూసేసింది. 2011లో ఏర్పాటైన ఈ యూనిట్.. ఆ తర్వాతి కాలంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదు. అలాగే అక్కడి అపరిశ్రుభ వాతావరణం, నిబంధనలకు పాటించకుండా కెమికల్స్ కొనుగోలు నేపథ్యంతో ఉత్పత్తి లైసెన్స్నూ రద్దు చేసింది. ఈ క్రమంలో క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం.ఇదీ చదవండి: కోల్డ్రిఫ్.. తయారీ.. యాక్ ఛీ! -
లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో ఈడీ సోదాలు
కోచి: భూటాన్ నుంచి లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో మాలీవుడ్కు చెందిన ప్రముఖ నటుల కార్యాలయాలు, ఇళ్లల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కేరళ, తమిళనాడుల్లో ఏకకాలంలో 17 చోట్ల ఈ సోదాలు జరిగాయి. ప్రముఖ మాలీవుడ్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలకల్ తోపాటు పలువురు లగ్జరీ వాహనాల యజమానుల ఇళ్లు, ఆటో వర్క్షాప్లు, వ్యాపారుల ఆస్తుల్లో ఈ సోదాలు నిర్వ హించారు. కేరళలోని ఎర్నాకులం, త్రి స్సూరు, కోజికోడ్, మలప్పురం, కొట్టా యం, తమిళనాడులోని కోయంబత్తూ రు, చెన్నై తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చెన్నైలో మాలీవుడ్ సూపర్స్టార్ మమ్ముట్టికి చెందిన ఓ ప్రాపర్టీలో కూడా సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్ అన్న విషయం తెలిసిందే. ఏమిటి కేసు?భూటాన్లో ఖరీదైన లగ్జరీ కార్లను సెకండ్హ్యాండ్లో కొందరు స్మగ్లర్లు తక్కువ ధరకు కొని, వాటిని అక్రమంగా భారత్కు తీసుకొచ్చి.. ఇక్కడే తయారైనట్లు పత్రాలు సృష్టించి అధిక ధరకు విక్రయించారు. ఈ క్రమంలో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)తోపాటు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)ను ఉల్లంఘించారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఇలా అక్రమంగా దిగుమతి చేసుకున్న కార్లను మాలీవుడ్ నటులు కొన్నట్లు ఈడీ విచారణలో తేలటంతో సోదాలు నిర్వహించింది. ఈ అంశంలో పీఎంఎల్ఏ కింద ఈడీ త్వరలో కేసు నమోదుచేసి మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. కోయంబత్తూర్కు చెందిన స్మగ్లింగ్ ముఠా తీసుకొచ్చిన కార్లలో ఒకదానికి దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేయగా, దానిని కస్టమ్స్ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆయన కేరళ హైకోర్టుకు వెళ్లటంతో కారు కోసం అర్జీ పెట్టుకుంటే వారంలోగా పరిశీలించాలని కస్టమ్స్ విభాగాన్ని కోర్టు మంగళవారం ఆదేశించింది. -
కరూర్ విషాద ఘటన.. విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి, చైన్నె: తమిళనాడులో(Tamil Nadu) కరూర్ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరవైపు.. టీవీకే అధినేత విజయ్(TVK Vijay).. పలువురు బాధితులను పరామర్శించినట్టు సమాచారం. వీడియోలో వారిని పలకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాధితులను కలిసేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.వివరాల ప్రకారం.. కరూర్(Karur Stampade) బాధితులల్లోని పలువురికి టీవీకే నేత విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించినట్టు తెలిసింది. త్వరలో నేరుగా వచ్చి కలుస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీకి సంబంధిత స్థానిక నేతల ద్వారా సేకరించిన నెంబర్ల ఆధారంగా బాధితులకు విజయ్ వీడియో కాల్ చేసి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరూర్ బాధితులను కలిసేందుకు విజయ్.. రాష్ట్ర డీజీపీ(Tamil Nadu DGP) కోరినట్టు సమాచారం. ఈ మేరకు తమిళనాడు డీజీపీకి విజయ్ ఈమెయిల్ పంపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, విజయ్ మెయిల్కు డీజీపీ ఎలాంటి సమాచారం ఇచ్చారు అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గత నెల 27వ తేదీన కరూర్లో టీవీకే విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెనువిషాద ఘటనలో 41 మంది మరణించారు. వీరికి విజయ్ పార్టీ తరపున తలా 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు బాధితులను కలుస్తూ తమ సానుభూతి తెలియజేసే పనిలో పడ్డారు. ముఖ్య నేతలందరూ కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ కరూర్ నుంచి చైన్నెకు వచ్చేయడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. కరూర్కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును సైతం విజయ్ ఆశ్రయించి ఉన్నారు.అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ సైతం ఈ కేసుపై విచారణను వేగవంతం చేసింది. మూడో రోజుగా ఈ బృందం తాంథోని మలైలోని అతిథి గృహంలో తిష్ట వేసి, పోలీసులు సమర్పించిన నివేదిక, లభించిన సీసీ ఫుటేజీలతో పాటూ బాధితుల నుంచి సేకరించిన సమాచారాలను సమగ్రంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది. -
కరూర్ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు విజయ్ పరామర్శ
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలను విజయ్ ఇవాళ (మంగళవారం అక్టోబర్ 7) వీడియో కాల్లో పరామర్శించారు. వారిని ఓదార్చిన విజయ్.. త్వరలో కరూర్లో పర్యటిస్తానని తెలిపారు."నేను మీతో ఉన్నాను, మీకు అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అయితే, వీడియో కాల్ సమయంలో ఫోటోలు తీసుకోవద్దని.. రికార్డ్ చేయవద్దని ఆయన బృందం కోరింది. ప్రతి వీడియో కాల్ సుమారు 20 నిమిషాల పాటు సాగిందని సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే పార్టీకి చెందిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, మొదట వ్యతిరేకించిన కోర్టు.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, టీవీకే పార్టీకి 10 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ సుమారు 30 వేల మందికి పైగా హాజరయ్యారు. భారీగా జనం హాజరవుతారని అధికారులు ముందుగా అంచనా వేయలేకపోయారు. -
‘మరీ ఇంత దిగజారిపోవాలా కమల్?’
తమిళ అగ్రనటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధినేత కమల్ హాసన్పై బీజేపీ నేత అన్నామలై(Annamalai Slams Kamal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్ ఘటనలో స్టాలిన్ ప్రభుత్వంపై కమల్ హాసన్ ప్రశంసలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ.. మరీ డీఎంకేకు తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ అన్నామలై మండిపడ్డారు.సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో జరిగిన విజయ్ టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ బాధితులను డీఎంకే నేతలతో కలిసి రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పరామర్శించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై, పోలీసులపై ఆయన ప్రశంసలు గుప్పించాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ అన్నామలై భగ్గుమన్నారు.రాజ్యసభ సీటు కోసం తన అంతరాత్మను అమ్మేసుకున్నారంటూ అన్నామలై, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్పై మండిపడ్డారు. ‘‘కరూర్ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వానిది ఎలాంటి తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా?. ఆయన మరీ ఇంత దిగజారాలా?. అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలేం పట్టించుకునే పరిస్థితిలో లేరు’’ అని అన్నామలై అన్నారు. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)ఇదిలా ఉంటే.. కరూర్ బాధితులను పరామర్శించిన అనంతరం కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ విషాదంపై విచారణ జరుగుతున్న దశలో రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదు. దీనిని మానవీయ కోణంలోనే చూడాలి. ప్రభుత్వం ప్రజల పక్షాల నిలబడాలి. సీఎం స్టాలిన్ నాయకత్వ లక్షణం కనబరిచారు. పోలీసులు, అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు అని అన్నారు. అదే సమయంలో ‘‘క్షమాపణ చెప్పి.. తప్పు ఒప్పుకోవాల్సిన సమయం ఇది’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీవీకే విజయ్ను ఉద్దేశించినవేనన్న కామెంట్(Kamal Blames Vijay on Karur Incident) బలంగా వినిపిస్తోందక్కడ. ఇదీ చదవండి: విజయ్కు సపోర్ట్గా బీజేపీ, ఆ పార్టీ కూడా! -
వామ్మో దగ్గు మందు!
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కోల్డ్రిఫ్ కేసులో ఇప్పుడు సంచలన విషయం ఒకటి బయటపడింది. చిన్నారుల మరణాలు, అస్వస్థత నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ యూనిట్ను అప్రమత్తం చేసింది. ఆ విభాగం కాంచీపురంలోని కోల్డ్రిఫ్ దగ్గు మందు(Coldrif Syrup) తయారైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్లో(Sresan Pharmaceuticals) అక్టోబర్ 1, 2 తేదీల్లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో 16 మంది చిన్నారుల మరణానికి కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ తయారీని చూసి అధికారులు సైతం విస్తోపోయారట!. ఎన్డీటీవీ ఇచ్చిన కథనం ప్రకారం.. తయారీ కేంద్రంలో కనిపించిన దృశ్యాలు ఇలా ఉన్నాయి. ఆ యూనిట్లో గ్యాస్ స్టవ్లపైనే రసాయనాలను వేడి చేస్తున్నారు. తుప్పుపట్టిన పరికరాలు, మురికి పట్టిన పైపులు. గ్లౌజులు, మాస్కులు లేకుండా సిబ్బంది పదార్థాలను మిక్స్ చేస్తున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. అక్కడున్న కార్మికుల్లో దాదాపుగా అనుభవం లేనివారే ఉన్నారు. వీటికి తోడు.. స్వచ్ఛత పరీక్షలు జరపకుండానే సిరప్ల కోసం నీటిని ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లు, హెచ్ఈపీఏ(HEPA) వ్యవస్థ(అత్యంత సూక్ష్మ ధూళి, బ్యాక్టీరియా, వైరస్ను 99.97% వరకు తొలగించగలిగే శుద్ధి వ్యవస్థ)లు లేకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచిందట. అలాగే.. చెన్నైలోని రెండు ప్రముఖ కంపెనీల నుంచి కెమికల్స్ను నగదు రహిత లావాదేవీల ద్వారా ఇండస్ట్రీయల గ్రేడ్ కెమికల్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. ప్రొపైలీన్ గ్లైకోల్ లాంటి కీలక పదార్థాన్ని ఫార్మాస్యూటికల్ ప్రమాణాలు లేని పెయింట్ పరిశ్రమ డీలర్ల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అన్నింటికి మించి.. డైఈథిలీన్ గ్లైకాల్(Diethylene glycol)ను టెస్టింగ్ ప్రక్రియతో సంబంధం లేకుండా సిరప్లలో కలిపారు.SR-13 డేంజర్ బ్యాచ్.. కోల్డ్రిఫ్ కఫ్ సిరప్.. SR-13 బ్యాచ్ ఈ యూనిట్లోనే ఈ ఏడాదిలోనే తయారయ్యాయి. రెండేళ్ల కాలపరిమితితో ఈ సిరప్లు.. మే నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పుదుచ్చేరి మార్కెట్లోకి వెళ్లాయి. అయితే.. ఇందులో డైఈథిలీన్ గ్లైకాల్ 48.6% ఉన్నట్లు బయోప్సీ నివేదికలు వెల్లడించాయి. ఇది అనుమతించిన పరిమితికి 500 రెట్లు ఎక్కువ. ఈ పదార్థం.. కిడ్నీ, కాలేయం, నర్వస్ సిస్టమ్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే ఆగస్టు–సెప్టెంబర్ మధ్య చింద్వారా జిల్లాలో చిన్నారులు మరణించారని తెలుస్తోంది. ఫార్మాకోవిజిలెన్స్ లేకపోవడం, అనుభవం లేని సిబ్బంది, నీటి స్వచ్ఛత పరీక్షలు లేకపోవడం, వెంటిలేషన్,, పెస్ట్కంట్రోల్ లేకపోవడం.. ఇలా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ 39 క్రిటికల్, 325 మేజర్ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్ఏర్పాటు చేసింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, మరోవైపు.. శ్రేసన్ కంపెనీ స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్, స్టాక్ ఫ్రీజ్, లైసెన్స్ సస్పెన్షన్ విధించారు.మధ్యప్రదేశ్ ప్రభుత్వం: ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్ సస్పెండ్ చేసింది. డ్రగ్ కంట్రోలర్ దినేష్ మౌర్యను ట్రాన్స్ఫర్ చేసింది. సిరప్ను రిఫర్ చేసి ఇద్దరు పిల్లల మరణానికి కారణం అయ్యాడంటూ ఓ డాక్టర్ను అరెస్ట్ చేసింది. అయితే.. ఇది కేవలం ఆ సంస్థ నిర్లక్ష్య ధోరణి మాత్రమే కాదు.. రసాయనాల కొనుగోలు నుంచి, తయారీ, పంపిణీ వరకు మొత్తం వ్యవస్థ వైఫల్యం అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఎన్డీటీవీ వద్ద వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: సిరప్తో చనిపోతే.. డాక్టర్ తప్పెలా అవుతుంది? -
డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీకి(Senthil Balaji) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) చుక్కెదురైంది. క్యాష్ ఫర్ లాండ్ కుంభకోణం కేసు పెండింగ్లో ఉన్నందున తనను తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవాలా వద్దా అనే విషయంలో గత ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిష్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.మంత్రి పదవి(DMK Minister Post) గురించిన ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో లేనే లేదని స్పష్టం చేసింది. ‘మేం ఆ ఉత్తర్వును మళ్లీ చదవం. మీరు మంత్రిగా(Tamil Nadu) మారడానికి దానిని మేం చదవలేం. అయితే, మీరు మంత్రి పదవిని చేపట్టినా లేదా మరే ఇతర అధికార పదవిని నిర్వహించినా రాష్ట్ర వాతావరణం ప్రభావితమైతే, న్యాయం జరిగేలా అప్పుడే చూస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది.మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని పదవికి రాజీనామా చేయాలంటూ ఇచ్చిన తీర్పుపై మళ్లీ స్పష్టత కోరడమెందుకంటూ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ను ప్రశ్నించింది. బెయిల్ వచ్చిన కొన్ని రోజుల్లోనే తిరిగి మంత్రి పదవిని చేపట్టిన సెంథిల్ బాలాజీ, కేసుల విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నందునే జైలుకు వెళ్లడం మంచిదంటూ అప్పటి ధర్మాసనం వ్యాఖ్యానించి ఉంటుందని పేర్కొంది. -
చెన్నై జూలో సింహం మిస్సింగ్ కలకలం!
చెన్నై వాండలూర్ జూలో ఓ సింహం కనిపించకుండా పోవడంతో అధికారులు హడలిపోయారు. రాత్రికి రాత్రే దాని ఆచూకీ కనిపెట్టేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరాఖరికి దాని ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఈ ఘటన.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్.. దక్షిణ భారత దేశంలో ఉన్న అతిపెద్ద జూ పార్కుల్లో ఒకటి. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆ జూలో హైడ్రామా నడిచింది. ఎప్పటిలాగే సింహాలన్నీ సాయంత్రం కాగానే ఎన్క్లోజర్లోకి చేరుకోగా.. శేర్యార్ అనే సింహం మాత్రం తిరిగి రాలేదు(Lion Missing Zoo). దీంతో సిబ్బంది కంగారపడిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.అంతా కలిసి ఐదు బృందాలుగా విడిపోయి సింహం కోసం జూ అంతా గాలించారు. రాత్రి పూట పని చేయగలిగే థర్మల్ డ్రోన్ల, ట్రాప్ కెమెరాల సహకారం తీసుకున్నారు. అయితే కొన్నిగంటల తర్వాత అది సఫారీలో ఓ చోట ప్రశాంతంగా కూర్చు ఉండిపోవడం గమనించారు. బౌండరీ వాల్, చెయిన్-లింక్ మెష్ ఫెన్సింగ్ ఉన్న సఫారీని నుంచి అది తప్పించుకునే అవకాశం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐదేళ్ల వయసున్న శేర్యార్ను 2023లో బెంగళూరులోని బన్నెరఘట్ట జూలాజికల్(Bannerghatta national park) పార్క్ నుంచి తీసుకొచ్చారు. లయన్ సఫారీ అలవాటు చేయడానికి మిగతా వాటితో పాటే దానిని రెగ్యులర్గా బయటకు వదులుతున్నారట. అయితే ఈ వయసులో సింహాలకు ఇలాంట ప్రవర్తన సహజమేనని అధికారులు తెలిపారు. ఈ లయన్ మిస్సింగ్ ఘటనతోనే.. అక్టోబర్ 5న జరగాల్సిన వైల్డ్ ట్రెయిల్ రన్ కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: కేరళ అసెంబ్లీని కుదిపేసిన ‘శబరిమలై’ వివాదం -
దగ్గు మందు డేంజర్ బెల్స్! అసలేం జరిగిందంటే..
దగ్గు సిరప్ తాగి చిన్నారులు (Cough Syrup Deaths) చనిపోవడం.. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన కథనాల నేపథ్యంతో పిల్లలకు దగ్గు మందు వాడే విషయంలో తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. శని, ఆదివారాల్లో కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మధ్యప్రదేశ్కు చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. అలాగే మరణాలకు కారణంగా భావిస్తున్న సిరప్ ఉత్పత్తిదారుపైనా కేసు నమోదు అయ్యింది. మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలో పలువురు చిన్నారులు కోల్డ్రిఫ్ (ColdriF) అనే దగ్గు సిరప్ తీసుకున్న కారణంగా చనిపోయారు. ఇటు రాజస్థాన్లోనూ మూడు మరణాలు సంభవించాయి. ఈ ఘటనల నేపథ్యంలో బేతుల్ జిల్లాలో పేరెంట్స్కు ఈ సిరప్ను ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఇక్కడే ఇద్దరు చిన్నారులు(ఒకరు నాలుగన్నరేళ్లు, ఒకరు రెండున్నరేళ్లు) సిరప్ కారణంగానే మరణించినట్లు సమాచారం అందుతోంది. వీరిద్దరూ ప్రవీణ్ వద్దే వైద్యం తీసుకోవడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ మరణాల సంఖ్య 14కి చేరినట్లయ్యింది. సిరప్ తీసుకున్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. తీవ్ర జ్వరం, పొట్ట ఉబ్బిపోయి.. మూత్రపిండాలు(కిడ్నీ) ఫెయిల్ అయ్యి మరణిస్తున్నారు. ఈ తరహా లక్షణాలతో ఎనిమిది మంది చిన్నారులు నాగ్పూర్, భోపాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అక్కడి అధికారులు వెల్లడించారు. మరోవైపు చిన్నారుల ‘సిరప్’ మరణాలపై దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(SIT)ను ఏర్పాటు చేసింది.వరుస మరణాల నేపథ్యంలో.. చిన్నారులు వాడిన 19 రకాల మందుల శాంపిళ్లను సేకరించి పరీక్షించగా, 'కోల్డ్రిఫ్' అనే దగ్గు సిరప్లో(బాచ్ నంబర్ SR-13) డైఇథైలిన్ గ్లైకాల్ (DEG-48.6%) అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అక్టోబర్ 2న వెల్లడించిన నివేదికలోనూ ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీంతో కోల్డ్రిఫ్ (ColdriF) సిరప్పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నివేదిక తర్వాత.. మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా ColdriF స్టాక్లను నిషేధించి స్వాధీనం చేసుకుంది. రాజస్థాన్లో కూడా ఇలాంటి మరణాలు సంభవించడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఉత్పత్తిని ఆపేయించింది.ఇక.. తనిఖీల అనంతరం, ఆ తయారీ యూనిట్ లైసెన్సును రద్దు చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సిఫార్సు చేసింది. అంతేకాకుండా, సంబంధిత కంపెనీపై క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టైన డాక్టర్ ప్రవీణ్ సోనీతో పాటు తయారుదారీ కంపెనీ స్రేసన్ ఫార్మాస్యూటికల్స్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 (హత్యకు సమానమైన నిర్లక్ష్యంతో మృతికి కారణం), సెక్షన్ 276 (మందుల కల్తీ), మరియు డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 27A ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులు జీవిత ఖైదు శిక్షకు దారి తీసే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా పిల్లలకు వాడే దగ్గు మందుల నాణ్యత, వినియోగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలకు దగ్గు మందులను విచక్షణారహితంగా వాడొద్దని పేరెంట్స్కు, అలాగే ఈ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు దగ్గులు వాటంతట అవే తగ్గిపోతాయని, వాటికి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా, ఔషధ తయారీ కంపెనీలన్నీ సవరించిన షెడ్యూల్ 'ఎం' నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆరోగ్య కార్యదర్శి నొక్కిచెప్పారు. పిల్లల విషయంలో దగ్గు మందుల వాడకాన్ని తగ్గించేలా చూడాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన అసాధారణ సంఘటనలపై నిఘా పెంచాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి సకాలంలో నివేదికలు తెప్పించుకోవాలని ఆదేశించారు.మరోవైపు.. డాక్టర్ ప్రవీణ్ సోనీని తక్షణమే విడుదల చేసి.. ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని, లేకంఉటే నిరవధిక సమ్మె చేపడతామని చింద్వారా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. ఇంకోవైపు.. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ఆరోగ్య సంక్షోభ వేళ సీఎం మోహన్ యాదవ్ తన కుటుంబంతో కలిసి అస్సాంకు జాలీగా ట్రిప్కు వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. దగ్గుమందులు, యాంటీబయటిక్స్ ‘కల్తీ’ విషయంలో సీడీఎస్సీవో సమీక్ష చేపట్టింది. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు తమిళనాడు, యూపీ, కేరళ, మహారాష్ట్రలోనూ 19 ఔషధ తయారీ సంస్థలపై తనిఖీలు ప్రారంభించింది. -
తమిళనాడులో మరో ట్విస్ట్.. గవర్నర్కు వ్యతిరేకంగా ‘సుప్రీం’లో పిటిషన్
సాక్షి, చెన్నై: గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసింది. అందులో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్(RN Ravi) ఎడతెగని జాప్యం చేస్తూ చివరకు రాష్ట్రపతికి పంపించినట్లు ఆరోపించింది.వివరాలు ఇలా ఉన్నాయి.. రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం(MK Stalin) మధ్య వివిధ అంశాలపై నెలకొన్న వివాదాలు ఇప్పటికే సుప్రీంకోర్టు(Supreme Court) వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ‘సుప్రీం’ ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీల వ్యవహారాలకు సంబంధించిన ముసాయిదాలను ఆమోదించుకుంది. ఈ పరిస్థితుల్లో కుంభకోణంలో కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో నిర్ణయించింది.అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ ముసాయిదా రాజ్భవన్కు చేరింది. ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు రాజ్భవన్ నుంచి ఆమోదం రాలేదు. తాజాగా.. ఈ ముసాయిదాను రాష్ట్రపతికి పంపించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఈ వర్సిటీ సాధన కోసం డీఎంకే ప్రభుత్వం మళ్లీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఇది కూడా చదవండి: మీరేం ఒంటరి కాదు.. విజయ్కు దన్నుగా ఢిల్లీ పెద్దలు! -
‘మీరేం ఒంటరి కాదు..’ విజయ్కు దన్నుగా ఢిల్లీ పెద్దలు!
కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందంటూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగళం(TVK) మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం కనీస ఆహారం, మంచి నీళ్ల సదుపాయం కల్పించలేని స్థితిలో ర్యాలీని ఎందుకు నిర్వహించారని, ఘటన తర్వాత అక్కడి నుంచి ఎందుకు పారిపోయారని.. ప్రశ్నలు గుప్పిస్తూనే ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో..తమిళ రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) మనుగడపై అనిశ్చితి నెలకొంది. ఘటనకు విజయ్, టీవీకే పూర్తి బాధ్యత అంటూ అధికార డీఎంకే విమర్శలతో తిట్టిపోస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ విజయ్కు వ్యతిరేక క్యాంపెయిన్ నడుపుతూ.. ఈ వేడి చల్లారకుండా చూసుకుంటోంది. అయితే ఈ అనిశ్చితినే తమకు ఫ్లస్గా మల్చుకునేందుకు ఇటు జాతీయ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.తాజాగా బీజేపీకి చెందిన ఓ అగ్రనేత విజయ్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్కు సూచించినట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదివరకే విజయ్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలను ఆయన ఆరా తీశారు. తద్వారా పరోక్షంగా విజయ్కు సానుభూతి ప్రకటించడంతో పాటు అండగా నిలబడతామని ఈ రెండు జాతీయ పార్టీలు సంకేతాలు అందించాయనేది స్పష్టమవుతోంది(Congress BJP Backs Vijay).కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఘటన తర్వాత.. ఆగమేఘాల మీద, అదీ మునుపెన్నడూ లేని రీతిలో తమ ఎంపీలను బృందంగా తమిళనాడుకు పంపింది. ఈ బృందం కరూర్ను పరిశీలించి.. బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. టీవీకేతో పాటు డీఎంకే ప్రభుత్వం కూడా కరూర్ ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి ఇవ్వడం, సరైన భధ్రత కల్పించకపోవడం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.ఇటు కాంగ్రెస్.. డీఎంకేతో పొత్తులో కారణంగా తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అందుకే ఘటనపై అధికార, టీవీకే పార్టీల్లో ఎవరినీ నిందించడం లేదు. కేవలం సానుభూతి ప్రకటన, నష్టపరిహారం అందజేత లాంటివి మాత్రమే చేసింది. దీంతో ద్రవిడ పార్టీల డామినేషన్ను తట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.అయితే.. బీజేపీ, కాంగ్రెస్లు చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయ్కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ను ఆకర్షించే ప్రయత్నంగానే కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!.ఇప్పటికే విజయ్ తొక్కిసలాట ఘటనలో తనకు మద్దతు తెలిపిన జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సంగతేమోగానీ.. బీజేపీ+అన్నాడీఎంకే మాత్రం ఎలాగైనా విజయ్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చని, డీఎంకే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీవీకే అధినేత కూడా అందుకు ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మాత్రం విజయ్ను నమ్ముకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన చిన్న పార్టీలకు పెద్ద షాకే అని చెప్పొచ్చు.ఇదీ చదవండి: తమిళ రాజకీయాల తొక్కిసలాట -
కరూర్ తొక్కిసలాటపై హైకోర్టు ఆగ్రహం..‘విజయ్లో నాయకత్వ లక్షణాలు లేవు’
సాక్షి,చెన్నై: సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తమిళనాడు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్పై కోర్టు విమర్శలు గుప్పించింది. శుక్రవారం (సెప్టెంబర్ 03) కరూర్ తొక్కిసలాటపై విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా ‘విజయ్ మీకు నాయకత్వ లక్షణాలు లేవు.. ఉంటే ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయేవారు కాదు.‘41 మంది చనిపోతే కోర్టు కళ్లు మూసుకోదు. ఈవెంట్ నిర్వాహకులపై సానుభూతి ఎందుకు చూపించాలి?’అని ప్రశ్నించింది. బాధితుల పట్ల కనీస పచ్చాత్తాపం కూడా వ్యక్తం చేయని విజయ్ మానసిక స్థితిని ఇది ప్రతిబింబిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ ఐజీ ఆస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ విచారణకు ఆదేశించింది.ఈ సందర్భంగా టీవీకే నేతలందరూ ఘటన తర్వాత ఎక్కడికి వెళ్లారు?. బాధితులను ఎందుకు పట్టించుకోలేదు?. విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? అని మండిపడింది. అనంతరం, టీవీకే నేతల ముందస్తు బెయిల్పై తీర్పును రిజర్వ్ చేసింది. తొక్కిసలాట ఘటన కేసును సీబీఐకి అప్పగించాలని టీవీకే విజ్ఞప్తిని తోసిపుచ్చింది. pic.twitter.com/FipkqoLlmB— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025 -
కరూర్ ఘటన: విజయ్ టీవీకేపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం పార్టీపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆ పార్టీ వేసిన పిటిషన్ను కొట్టిపారేసింది. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నందున అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.‘‘ప్రారంభ దశలోనే సీబీఐకి బదిలీ చేయాలని కోరితే ఎలా?. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో సంతృప్తి కలగనప్పుడు కోర్టును ఆశ్రయించండి. అసలు పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు తాగు నీరు, ఆహారం సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు?.. దయచేసి న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దు’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ను కొట్టేసింది. మరోవైపు.. రాజకీయ ర్యాలీలు, సభల విషయంలో అనుమతులు ఎలా జారీ చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన ప్రభుత్వ లాయర్.. ఈ విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన నియమాలు ప్రభుత్వం రూపొందిస్తుందని, అప్పటిదాకా ఎలాంటి రాజకీయ ర్యాలీలకు అనుమతి ఇవ్వబోదని తెలిపారు. అలాగే.. రోడ్డుపై సభకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. దీంతో వివరణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో అంగీకరించింది. మరోవైపు.. బాధితులకు పరిహారం పెంపు పిటిషన్కు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కుట్ర కోణం ఉందని.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని టీవీకే ఓ పిటిషన్ వేసింది. అలాగే తమ కార్యదర్శులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ వేసింది. ఈ రెండింటితో పాటు కరూర్కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్, మరో నాలుగు వేర్వేరు పిటిషన్లు.. మొత్తం ఏడింటిని కలిపి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది. -
తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం.. స్టాలిన్, గవర్నర్, త్రిషా సహా..
చెన్నై: తమిళనాడులో(Tamil Nadu) మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నివాసం, గవర్నర్ ఆర్ఎన్ రవి(RN Ravi)భవనం, సినీనటి త్రిష(Trisha) నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Tamil Nadu CM MK Stalin and TN Governor gets bomb threat.@PramodMadhav6 with more details.#TamilNadu #FirstUp | @AishPaliwal pic.twitter.com/526VQAqbIT— IndiaToday (@IndiaToday) October 3, 2025 -
పండుగ పూట ఘోర ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
చెన్నై: దసరా పండుగ పూట తమిళనాడులో(Tamil nadu) విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) ముగ్గురు యువకులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు ీతీవ్రంగా గాయపడటంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. పండుగ సందర్భంగా ఐదుగురు యువకులు చెన్నై(Chennai) నుంచి మున్నార్కు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారంతా ఓ కారులో గురువారం తెల్లవారుజామున ట్రిప్కు బయలుదేరారు. కారు విల్లుపురం వద్దకు రాగానే విక్రవాండి దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం సమయంలో కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
చేటు తెచ్చిన అనుభవ రాహిత్యం
తమిళనాడులోని కరూర్ పట్టణంలో ఓ కూడలి వద్ద సెప్టెంబర్ 27 రాత్రి సంభవించిన తొక్కిసలాటలో 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయ పడిన జనం పదుల సంఖ్యలో ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు అయిన విజయ్ ర్యాలీకి 27,000 మందికి పైగా హాజరైనపుడు ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆయన రాక ఏడు గంటలు ఆలస్యమై, సభ రాత్రి 7.30 గంటలకు మొదలైంది. అప్పటి వరకు విజయ్ కోసం ఉత్సుకతతో వేచి ఉన్న అభిమానులు ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాటలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామక్కల్లో సభ ముగించుకుని కరూర్ వచ్చేందుకు విజయ్కి అన్ని గంటల సమయం ఎందుకు పట్టిందని కొందరు అంటున్నారు.పోలీసులు కేటాయించిన స్థలమే!విజయ్ కరూర్ సభకు ఎంతమంది తరలిరాగలరో అంచనా వేయడంలో పోలీసులు విఫలమయ్యారా... అన్నది సహజంగానే ఇక్కడ తలెత్తే ప్రశ్న. రాజకీయంగా తనను ఎదగనీయకుండా చేసేందుకు పోలీసులు అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయ్ చేస్తున్న ఆరోపణలతో తమిళనాడు పోలీసులు గత కొద్ది నెలలుగా ఆత్మరక్షణ ధోరణిని అనుసరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం తిరుచిరాపల్లిలో విజయ్ రోడ్ షో నిర్వహించినపుడు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో సభా నిర్వహణ కోసం కరూర్లో విజయ్ ఎంచుకున్న రెండు ప్రదేశాలకు పోలీసులు అను మతి నిరాకరించారు. అవి జన సమ్మర్ధంతో కిటకిటలాడే వాణిజ్య స్థలాలు కావడమే అందుకు కారణం. అందుకే ఆ రెండూ కాకుండా, కొద్ది రోజుల క్రితం అన్నా డి.ఎం.కె నాయకుడు ఎళప్పాడి పళని స్వామి సభ నిర్వహించిన కరూర్లోని మరో ప్రదేశాన్ని పోలీసులు విజయ్ సభకు కేటాయించారు. టీవీకే మొదట ఎంచుకున్న ఆ సభా ప్రాంతాలు రెండింటికీ ఇది కూడా దగ్గరలోదే కావడంతో పార్టీ అందుకు వెంటనే అంగీకరించింది. ఏర్పాట్లలో తడబడుతున్న టీవీకేకాగా, తాజా ఘటన రాజకీయంగా, సంస్థాగతంగా టీవీకేకు కొరవడిన సామర్థ్యాన్ని బహిర్గతం చేసింది. పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్. ఆనంద్ ఒక్కరే టీవీకేలో రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు. ఆయన గతంలో వివిధ కాంగ్రెస్ చీలిక వర్గాలలో పనిచేశారు. ఇటువంటి విషయాల్లో ఏ రాజకీయ పార్టీలోనైనా జిల్లా కార్యదర్శులు ముఖ్యపాత్ర వహిస్తారు. వారు సాధారణంగా అట్ట డుగు స్థాయి సంబంధాలు కలిగినవారై ఉంటారు. అయితే టీవీకేలో విజయ్ అభిమాన సంఘాలలోని ప్రీతిపాత్రులే ఆ భూమిక నిర్వ హిస్తున్నారు. సభలకు తగిన ఏర్పాట్లు చేయడంలో వారు తడబడు తున్నారు. తమ సభలకు సుమారు పది వేల మంది హాజరు కావచ్చని అంచనా వేస్తున్నట్లు వారు పోలీసులకు చెబుతున్న సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ఇలాంటి సభలప్పుడు సాధారణంగా పార్టీలు కొద్దిమంది కార్యకర్తలకు డబ్బు పంపిణీ చేసి ఆహారం, నీరు సమకూర్చే ఏర్పాట్లు చేస్తూంటాయి. కాగా, సభలకు హాజరైన జనాన్ని అదుపులో ఉంచి, నియంత్రించవలసిన అవస రాన్ని ఇప్పటికే అనేక తమిళ పార్టీలు గుర్తించాయి కూడా! రాజీవ్ గాంధీ హత్యోదంతంతో తమిళనాడు ఈ చేదు పాఠాన్ని నేర్చు కోవాల్సి వచ్చింది. టీవీకే తన తరహాలో నిర్వహిస్తున్న రోడ్ షోల లాంటివి మాత్రం తమిళనాడు రాజకీయాలకు కొత్త. అప్పటి ‘సినీ–నాయకులు’ వేరు!గతంలో జయలలిత, కరుణానిధి కూడా వాహనాలలో రాష్ట్ర హైవేలలో ప్రయాణించినా ముందుగా నిర్ణయించిన చోట్ల మాత్రమే వారు వాహనాలను ఆపి ప్రసంగించేవారు. కొద్ది వేల మందిని ఉద్దే శించి ప్రసంగించి మరో చోటుకు బయలుదేరేవారు. పైగా, వారు జనాలు వేచి చూసేటట్లు చేసేవారు కాదు. నిర్హేతుకమైన జాప్యాలకు అవకాశమిచ్చేవారు కాదు. మొన్నటి ఘటనలో అంబులెన్సుల రాకకు సంబంధించిన శబ్దాలు వినిపిస్తున్నా విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం కూడా ఆయన రాజకీయ అనుభవ రాహి త్యాన్ని సూచించింది. ఏం జరుగుతోందో ఎవరూ ఆయన చెవిన వేసినట్లు లేదు. పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే ఆయన అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరుచిరాపల్లిలో ప్రైవేటు విమానం ఎక్కి, రెండు గంటల్లోపల చెన్నైకి చేరుకున్నారు. ఆయనతో పాటే టీవీకే సభ్యులు కూడా సభా ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. పోలీసుల ఎఫ్.ఐ.ఆర్కు ఎక్కిన కొందరు పరారీలో ఉన్నారు. ‘‘కక్ష ఉంటే నాపై తీర్చుకోండి!’’ఈ అవకాశాన్ని అధికార డి.ఎం.కె పార్టీ సద్వినియోగం చేసుకు న్నట్లే కనిపిస్తోంది. కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన సెంథిల్ బాలాజీ ఆ సమయంలో నియోజకవర్గంలోనే ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చింది. అయితే సెంథిల్ బాలాజీ ఆస్పత్రికి చేరుకోక ముందే, కరూర్ మాజీ ఎమ్మెల్యే అన్నా డి.ఎం.కె నాయకుడు ఎం.ఆర్. విజయ్ భాస్కర్ బాధితులను పరామర్శించటం ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా శనివారం అర్ధరాత్రికల్లా కరూర్ చేరు కున్నారు. స్టాలిన్ కుమారుడు, ఆయన వారసత్వాన్ని అందుకుంటాడని భావిస్తున్న ఉదయనిధి కూడా ఆదివారం ఉదయానికల్లా కరూర్లో వాలారు. అయితే విజయ్కి మాత్రం ఈ ఘటనపై క్షమా పణ కోరుతూ బహిరంగ ప్రకటన చేయడానికి 12 గంటలకు పైగా పట్టింది. ఇక, తాజాగా నిన్న (సెప్టెంబరు 30) విడుదల చేసిన ఒక వీడియోలో, ‘‘నా జీవితంలో ఇంతటి బాధాకరమైన రోజు వస్తుందని ఊహించ లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైపోయింది. మాటలు రావటం లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి. నా అభిమా నులపై కాదు’’ అని కూడా విజయ్ ఆ వీడియోలో అన్నారు. వచ్చే ఏడాది (2026) ఎన్నికలకు సమాయత్తమవుతున్న విజయ్కి ఈ సంఘటన పెను విఘాతమేనని చెప్పాలి. ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నేతృత్వంలో ఏకసభ్య విచారణ సంఘాన్ని నియమించ డాన్ని టీవీకే, అన్నా డి.ఎం.కెలు తోసిపుచ్చాయి. సి.బి.ఐతో దర్యాప్తు జరిపించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.హీరో... నాయకుడిగా మారాలిఎం.జి. రామచంద్రన్, జయలలితలు కూడా సినీ రంగం నుంచి వచ్చినవారే అయినా, ఎమ్జీఆర్కు ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉంది. జయలలిత చాలా ఆటుపోట్లను తట్టుకుని ఎంజీఆర్ చెంత రాజకీయంగా సుశిక్షితురాలిగా మారారు. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ తనను తాను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆయనకు లక్షల మంది అభిమానులున్నమాట నిజమే. అయితే ప్రజలు ఓటు వేయాలని కోరుకునే రాజకీయ నాయకునిగా ఆయన రూపాంతరం చెందాల్సి ఉంది. ఇక ఆయన రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి తిరిగి ఎప్పుడు బయలుదేరుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. భవిష్యత్ పరిణామాలు వెండితెరపై కాక, రాజకీయ యవనికపైనే ఆవిష్కృతం కానున్నాయి. నిరుపమా సుబ్రమణియన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తులు
దేశంలో ఇంతపెద్ద రాష్ట్రాన్ని అయినా జయిస్తున్న భారతీయజనతా పార్టీకి దక్షిణాది మాత్రం కోరుకుడుపడడం లేదు.. ఇటువైపున్న ద్రావిడ రాష్ట్రాలు తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. ఏపీ.. తెలంగాణ.. పాండిచ్చేరి.. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి అంతంతమాత్రమే.. ఏదో నానా యాతనా పడి..ఏదోలా కర్ణాటకలో ఏదోలా అధికారం దక్కించుకున్నా అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతోంది తప్ప మళ్ళా అక్కడ అధికారాన్ని నిలుపుకోవడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. ఇక ప్రాంతీయపార్టీలు ఆలవాలమైన తమినాడులో అయితే దశాబ్దాలుగా పోరుతున్నా బీజేపీ అడుగుకూడా పెట్టేందుకు వీలు చిక్కడంలేదు. అక్కడ ఉంటే అన్నాడీఎంకే.. కూడా డీఎంకే.. ఇక మిగతావన్నీ చిన్నా చితకాపార్టీలు మాత్రమే.. దేశాన్ని 75 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కూడా తమిళనాట నాడు కరుణానిధి.. నేడు స్టాలిన్ చాటున మనుగడసాగించడమే తప్ప సొంతంగా అక్కడ సాధించిందేమీ లేదు.. ఇక బీజేపీ మాత్రం ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని తీవ్రంగా తాపత్రయపడుతోంది. ఆ రాష్ట్ర శాసన సభలో 234 సీట్లుండగా అక్కడ 2026 ఏప్రిల్.. మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రస్తుతానికి 46 శాతం ఓట్లు సాధించిన స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే 159 సీట్లు సాధించి అధికారంలో ఉంది.. తరువాత 74 సీట్లతో పాళనిస్వామి సారథ్యంలోనే అన్నా డీఎంకే ప్రతిపక్ష పాత్రలో ఉంది.. ఇక ఇక్కడ బీజేపీకి స్థానం తక్కువే.. కానీ ఆశ చావని బీజేపీ నేతలు దింపుడుకల్లం ఆశతో తమిళనాడువైపు చూస్తూనే ఉన్నారు..ఇదిలా ఉండగానే మొన్న సినిమా నటుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ రాజకీయ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించగా వందమందికి పైగా గాయపడ్డారు.. ఇది రాజకీయ సభలకు సంబంచింది దేశంలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెబుతున్నారు.. అయితే ఈ ప్రమాద సంఘటన తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం ఎంపీ హేమామాలిని సారధ్యంలోని ఎనిమిది మంది ఎంపీలతో ఒక కమిటీని వేసింది. తెలుగుదేశం.. శివ సేన వంటి ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకూ ఈ కమిటీలో స్థానం కల్పించిన బీజేపీ అక్కడి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ సభలో జరిగిన ప్రమాదాన్ని సైతం రాజకీయంగా ఎలా వాడుకోవాలన్నదానిగురించి బీజేపీ యోచన చేస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2. 62 శాతం ఓట్లు తెచ్చుకుని కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీకి అన్నా డీఎంకేతో వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.. ఈ విజయ్ సభ ప్రమాదాన్ని సైతం బీజేపీ రాజకీయంగా వినియోగించుకునే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ప్రాంతీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగా వాడుకుని లబ్ధిపొందుతారుతప్ప వారి యోగ క్షేమాలు.. భద్రతా ఏమాత్రం పట్టించుకోవు అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఈ ప్రమాదాన్ని సామాజిక అంశంగా మార్చుకుని రాజకీయంగా లబ్ధిపొందడానికి ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ వెతుకుతోంది.. ఇకనైనా రాష్ట్రంలో అన్నా డీఎంకేతో కలిసి అధికారంలోకి వస్తుందా చూడాలి.. సిమ్మాదిరప్పన్నఇదీ చదవండి: అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు -
భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య
తిరువొత్తియూరు: కోయంబత్తూరు పీలమేడు సమీపంలోని వి.కె.రోడ్, చేరన్ నగర్, 4వ బస్టాప్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జయపాల్(47). ఇతని భార్య వాలెంటినా(40). వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలెంటినా తన కొడుకుతో కలిసి మధురైలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సంఘటన జరిగిన రాత్రి జయపాల్ తన భార్యకు సెల్ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అప్పుడు, అతను తన భార్యతో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా వీడియో కాల్లో భార్యతో మాట్లాడుతూనే ఇంట్లో ఉన్న తన భార్య చుడీదార్ ప్యాంటు తీసుకుని ఫ్యాన్కు తగిలించి ఉరి వేసుకున్నాడు. వీడియో కాల్లో ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన అతని భార్య, వెంటనే కోయంబత్తూరులోని తమ ఇంటి సమీపంలో నివశిస్తున్న బంధువులకు ఫోన్ చేసి, తమ ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు అక్కడికి వెళ్లి జయపాల్ను రక్షించడానికి ప్రయత్నించారు. అతను ఉన్న గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి ఉరి వేసుకున్న అతన్ని కిందకు దించారు. ఆ తర్వాత అంబులెన్స్లో సింగనల్లూరు ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అతను ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే మరణించినట్లు తెలిపారు. భర్త ఉరి వేసుకుని వేలాడుతుండడం చూసిన వాలెంటీనా వెంటనే కోయంబత్తూరుకు తిరిగి వచ్చింది. ఆమె కుమారుడితో కలసి మరణించిన జయపాల్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై వాలెంటినా కోయంబత్తూరు పీళమేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41కి పెరిగిన మృతుల సంఖ్య
-
కరూర్ తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్
చెన్నై: కరూర్లో తమిళగ వెట్రికళగం(TVK) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్(Vijay) ప్రచారం తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్ జరిగింది. టీవీకే జిల్లా సెక్రటరీ మతియఝగన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, విజయ్ ప్రచారం తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది.కరూర్ ఘటన గురించి రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది. రెండోరోజూ ఆమె ఘటనా స్థలిని పరిశీలించారు. ఆ పరిసర వాసులతో మాట్లాడారు. అలాగే ఐదుగురు మరణించిన ఏలురు పుదురు, ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విశ్వనాధపురి గ్రామానికి వెళ్లి అక్కడి బాధితులతో మాట్లాడారు. మరణించిన 41 మంది కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.ఈ కమిషన్ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఈ కేసు విచారణ అధికారిగా ఇది వరకు నియమితులైన డీఎస్పీ సెల్వరాజ్ను తప్పించారు. ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్ను సోమవారం రంగంలోకి దించారు.ఘటనా స్థలంలో భద్రతా విధులలో ఉన్న మణివణ్ణన్ అనే ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే కరూర్ జిల్లా కార్యదర్శి ∙మది అళగన్, రాష్ట్ర కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్కుమార్తో పాటూ ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అలాగే తనపై దాడి చేశారంటూ అంబులెన్స్ డ్రైవర్ ఈశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో 10 మంది గుర్తు తెలియని టీవీకే వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఐదు సెక్షన్లతో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో సమగ్ర వివరాలను పొందు పరిచారు. ఇందులో పేర్కొన్న అంశాలు విజయ్ మెడకు సైతం మున్ముందు ఉచ్చు పడేనా? అన్న చర్చ ఊపందుకుంది. -
కన్నీటి మడుగైన కరూర్
ఇరుకిరుకు రోడ్లు... లక్షలాదిమంది యువత ఆరాధించే తెరవేల్పు ఆగమనం... అంచనాలకు మించి వేలాదిగా తరలివచ్చిన జనం–ఒక హృదయవిదారక ఘటన చోటు చేసు కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? చరిత్ర ప్రసిద్ధిచెందిన నగరం మాత్రమే కాదు... వర్తమానంలో వేలాది కుటుంబాలకు జీవికనిస్తున్న పరిశ్రమలకు నిలయంగా కూడా ఉన్న తమిళనాడులోని కరూర్ నగరం శనివారం జరిగిన తొక్కిసలాట ఉదంతం తర్వాత పూర్తిగా విషాదంలో కూరుకుపోయింది. ఇంతవరకూ 41 మంది చనిపోగా, దాదాపు 80 మంది వరకూ గాయాలపాలయ్యారు. మృతుల్లో 10 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉన్నారు. తల్లులు, బిడ్డలు, త్వరలో వివాహం కావలసిన రెండు జంటలు కూడా ఈ మృతుల్లో ఉండటం కలచివేసే విషయం. కొత్తగా ఏర్పాటైన తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పదివేలమంది వస్తారంటే అనుమతినిచ్చామని, కానీ అది మూడురెట్లకు పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. జనాకర్షణ గల విజయ్ వంటి నటుడి ర్యాలీకి వచ్చే జనంపై తగిన అంచనాలు లేకపోవటం సరికాదు. మతపరమైన ఉత్సవాలు, క్రీడా సంరంభాలు, రాజకీయ పక్షాల ర్యాలీలు వగైరాల్లో అసంఖ్యాకంగా జనం పాల్గొనటం ఇటీవలికాలంలో తరచు కనబడుతోంది. ఈ ఏడాదిలో ప్రయాగ్రాజ్ కుంభమేళాతో మొదలై దేశవ్యాప్తంగా ఇంతవరకూ కనీసం అయిదారు విషాద ఉదంతాలు చోటు చేసు కున్నాయి. కానీ నిర్వాహకులు, ప్రభుత్వాలు, పోలీసులు వీటి నుంచి గుణపాఠం తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఉత్పాదక నగరమైన కరూర్లో ప్రతి శనివారం వందల సంఖ్యలో వచ్చే ట్రక్కుల ద్వారా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు సరుకు బట్వాడా అవుతుంటుంది. ఇవన్నీ ఆ ఇరుకు సందుల్లో ఆగకతప్పదు. వారాంతం గనుక కార్మికులకు వేతనాలిచ్చే రోజు కూడా అదే. అందుకోసం చేనేత, దోమతెరల పరిశ్రమల్లో, బస్సు నిర్మాణాల సంస్థల్లో పని చేసేవారు దాదాపు 50,000 మంది వస్తారు. ఇంతకుమించి జనం ఏమాత్రం పెరిగినా ఆ నగరం కిక్కిరిసిపోతుంది. టీవీకే పార్టీ స్థానిక నేతలకు దీనిపై అవగాహన ఉండకపోదు. అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసులు సరేసరి. వారికి ఇది పూర్తిగా తెలిసి ఉండాలి. విజయ్ ప్రతి శని, ఆదివారాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు గనుక కరూర్కు ఆదివారం వస్తే మంచిదని సలహా ఇచ్చి ఉండాల్సింది. పైగా తమ అభిమాన నటుణ్ణి దగ్గర నుంచి చూడటం కోసం చుట్టుపక్కల నుంచి కూడా భారీయెత్తున ప్రజలు తరలి వచ్చారని చెబుతున్నారు. తొక్కిసలాటల ఉదంతాలు మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. 2022లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హ్యాలోవీన్ ఫెస్టివల్లో జరిగిన తొక్కిసలాటలో 159 మంది కన్నుమూశారు. జర్మనీలోని డోజ్బర్గ్లో 2010నాటి లవ్ పెరేడ్ ఉత్సవంలో తొక్కిసలాట కారణంగా 21మంది చనిపోయారు. అయితే ఆ ఉదంతాలను లోతుగా అధ్యయనం చేసి, ఏ లోటుపాట్ల వల్ల ఆ ఘటనలు జరిగాయో నిర్ధారించుకుని వాటిని నివారించే, నియంత్రించే వ్యవస్థల్ని రూపొందించుకుంటారు. అందువల్లే అవి పునరావృతం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. కానీ మన దేశంలో ఇందుకు విరుద్ధం. జనసమ్మర్దం ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాట ఉదంతాలు ఎందుకు చోటుచేసుకుంటాయన్న అంశంపై జర్మనీకి చెందిన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అనా సీబెన్ చేసిన పరిశోధన అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఒక స్థాయి వరకూ గుంపులోని వారు వ్యక్తులుగాసంభాషణల అవసరం లేకుండానే ఇతరుల్ని అనుసరిస్తూ పోతారు. జనసమ్మర్దం పెరి గితే, అనుకోని ఘటన సంభవించేసరికల్లా భావోద్వేగాలపాలు అధికమై విచక్షణాజ్ఞానం నశిస్తుందని, తొక్కి సలాటల్లో జరిగేది ఇదేనని ప్రొఫెసర్ అనా సీబెన్ అంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నటుడు విజయ్ కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఆప్తుల్ని కోల్పోయి విషాదంలో మునిగిన కుటుంబాలను ఇవేవీ ఊరడించలేకపోవచ్చు. ప్రభుత్వం పూనుకొని మృతుల కుటుంబాల్లో ఇంటికొకరికైనా శాశ్వత ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న ముందస్తు జాగ్రత్తలతో ఈ మాదిరి విషాద ఘటనలను నివారించవచ్చు. ప్రభుత్వాలు ఆలోచించాలి. -
టీవీకే విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు.. తమిళనాడులో కలకలం
చెన్నై: తమిళనాడులో(tamil Nadu) కరూర్(karur Incident) ఘటన తీవ్ర విషాదం నింపింది. అయితే, ఈ ఘటన అనంతరం.. టీవీకే చీఫ్, నటుడు విజయ్కి(Vijay) బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. అర్ధరాత్రి హుటాహుటినా విజయ్ ఇంటి వద్ద తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. తమిళగ వెట్రి కజగం (టీవీకే)Tamilaga Vettri Kazhagam (TVK) చీఫ్, నటుడు విజయ్ నివాసం నీలంకరైలోని ఈసీఆర్ వద్ద బాంబు అమర్చినట్లు చెన్నై పోలీసులకు సోమవారం తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చింది. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో విజయ్ నివాసం వద్ద తనిఖీలు చేపట్టారు. ఇళ్లంతా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనంతరం, బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ ఇంటి వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.Tamil Nadu | Chennai police received a phone call earlier today claiming that a bomb had been planted at the ECR, Neelankarai residence of Tamilaga Vettri Kazhagam (TVK) Chief and actor Vijay. Following the alert, police personnel rushed to the actor’s residence, and a bomb… pic.twitter.com/Fs7xceZWlI— ANI (@ANI) September 28, 2025ఇదిలా ఉండగా.. కరూర్ ఘటన నేపథ్యంలో విజయ్ నివాసం ఉన్న పనయూరు పరిసరాలలో కొన్ని సంఘాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు ఆదివారం దిగాయి. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో విజయ్ నివాసం, తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యాలయం పరిసరాలలో భద్రతను పెంచారు. విజయ్ నివాసం వద్ద కేంద్ర సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి.ఇక, కరూర్ ఘటనతో తీవ్ర మనోవేదనలో ఉన్న విజయ్ తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రతీ ఒక్కరికీ రూ.20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, తన హృదయం ముక్కలైందని, కన్నీటి వేదనలో ఉన్నానని పేర్కొంటూ, అందరినీ కలవాలని ఉన్నా, అనుమతి కోసం ఎదురు చూడాల్సి ఉందని ఉద్వేగంతో ప్రకటన విడుదల చేశారు. -
ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందా?.. టీవీకే పిటిషన్పై నేడు కోర్టు విచారణ
చెన్నై: కరూర్ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్ర అన్న అనుమానాన్ని తమిళగ వెట్రి కళగం న్యాయవాద విభాగం వ్యక్తం చేసింది. అడయార్లోని న్యాయమూర్తి దండపాణి నివాసానికి చేరుకుని కేసును సుమోటోగా స్వీకరించాలని విన్నవించారు. ఇందుకు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు.కరూర్ ఘటనతో తీవ్ర మనో వేదనలో ఉన్న విజయ్ తన ఆవేదనను ఎక్స్ పేజి ద్వారా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి తలా రూ. 2 లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, తన హృదయం ముక్కలైందని, కన్నీటీ వేదనలో ఉన్నానని పేర్కొంటూ, అందరినీ కలవాలని ఉన్నా, అనుమతి కోసం ఎదురు చూడాల్సి ఉందని ఉద్వేగంతో ప్రకటన విడుదల చేశారు.ఇంటి వద్ద భద్రత పెంపు విజయ్ నివాసం ఉన్న పనయూరు పరిసరాలలో కొన్ని సంఘాలు కరూర్ ఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు ఆదివారం దిగాయి. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో విజయ్ నివాసం, తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యాలయం పరిసరాలలో భద్రతను పెంచారు. విజయ్ నివాసం వద్ద కేంద్ర సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి.5 సెక్షన్లతో కేసు నమోదు విజయ్ పార్టీకి చెందిన కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్కుమార్తో పాటుగా ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.సెక్షన్ 105,110, 125, 223, సెక్షన్ 3 కింద నాన్ బెయిల్ బుల్ వారెంట్తో కూడిన కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేసి విచారించేందుకు కరూర్ పోలీసులు కసరత్తులు చేస్తున్నారు.కుట్ర కోణంపై అనుమానాలు విజయ్ వేలుస్వామి పురం వద్దకు వచ్చే సమయంలో వరసగా అంబులెన్స్లు రావడం, ఓ చోట లాఠీచార్జ్ జరిగినట్టు వీడియోలు వైరల్ కావడం, విజయ్ వాహనంపైకి రాళ్లు రువ్వినట్టుగా వచ్చిన సంకేతాలను తమిళ వెంట్రికళగం న్యాయవాద విభాగం తీవ్రంగా పరిగణించింది. కరూర్ ఘటన ప్రమాదంగా తెలియడం లేదని, పథకం ప్రకారం జరిగిన కుట్రగా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ న్యాయవాదుల బృందం చెన్నై అడయార్ నివాసంలో న్యాయమూర్తి దండపాణిని కలిసి అనుమానం వ్యక్తం చేశారు.కేసును సుమోటోగా స్వీకరించాలని కోరారు. కేసును సీబీఐకు లేదా ప్రత్యేక సిట్కు అప్పగించి విచారించాలని విన్నవించారు. చివరగా పిటిషన్ దాఖలు చేయాలని, సోమవారం మధ్యాహ్నం విచారిస్తానంటూ ఆయన పేర్కొనడంతో ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయడానికి న్యాయవాద విభాగం చర్యలు చేపట్టింది. కాగా, విజయ్ మనస్సు తీవ్రంగా రోదిస్తుందని.. ఆయన తీవ్ర ఉద్వేగంతో ఉన్నారని న్యాయవాద బృందం మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా భద్రతా వైఫల్యాలు, కరూర్ ఘటనను పరిగణించి ఇక విజయ్ ప్రచారాలకు నిషేధం విధించాలంటూ వేలుస్వామి పురం ఘటనలో బాధితుడైన సెంథిల్ కన్నన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.ఈ పరిణామాలతో కొద్ది రోజులు ప్రచార పర్యటనను వాయిదా వేసుకునే విధంగా విజయ్ పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా పుష్ప–2 చిత్రం విడుదల సందర్భంలో జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లుఅర్జున్ను అరెస్టు చేసినట్టుగా కాగా ఘటనలో విజయ్ను అరెస్టు చేయాలంటూ సామాజిక మాద్యమాలలో కొందరు పోస్టులు పెట్టడం గమనార్హం. అలాగే అనేక చోట్ల సేలం, ఈరోడ్లతో పాటూ పలుచోట్ల ఇదే తరహాలో పోస్టర్లు వెలిశాయి. -
ప్రమాదమా.. కుట్రా?
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ప్రచార కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ప్రమాదమా.. లేక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్ విచారణ కోరుతూ ఆ పార్టీ న్యాయవాద విభాగం మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. తొక్కిసలాట ఘటనతో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటు పలువురు మంత్రులు రాత్రికి రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదంతో పాటు ఐదుగురు ఐజీలు, డీజీఐలు ఘటనా స్థలంలో విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 14 మంది పురుషులు, 17 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో వంద మందికి పైగా చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళణిస్వామితో పాటు డీఎండీకే, బీజేపీ, తదితర పార్టీ ల నేతలంతా కరూర్కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ భద్రతా వైఫ్యలమే కారణమని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారన్న విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. విజయ్ సైతం ముందస్తు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేసుకుని ఉండాల్సిందని హితవు పలికారు. కాగా.. ఈ ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డీఎంకే ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీబీఐ దర్యాప్తునకు టీవీకే డిమాండ్ కరూర్లో బాధితుల సమాచారం, మరికొందరు వైరల్ చేస్తున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన ప్రమాదమా? లేక కుట్ర జరిగిందా..? అన్న అనుమానాలకు దారితీసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీవీకే న్యాయవాది విభాగం బృందం చెన్నైలో న్యాయమూర్తి దండపాణిని కలిసి సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. ప్రచారంలో రాళ్లు విసిరినట్టు, లాఠీచార్జ్ జరిగినట్టు వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా న్యాయమూర్తికి వివరించారు. కేసును సీబీఐ లేదా సిట్ ద్వారా విచారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్ దాఖలు చేస్తే సోమవారం మధ్యాహ్నం విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి సూచించగా.. ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాల వారికి రూ.20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తాను సైతం కరూర్ వెళ్లేందుకు సిద్ధమైనా, పోలీసుల నుంచి అనుమతి రాలేదు. కాగా.. విజయ్ ఇంటివైపు కొన్ని విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో ఆ పరిసరాలన్నీ సీఆర్పీఎఫ్ భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయ్ ప్రచారాలపై నిషేధం విధించాలని కోరుతూ సెంథిల్ కన్నన్ అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇదిలావుండగా కరూర్ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్కుమార్తో పాటు ఇతరులు అని పేర్కొంటూ మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. వేలుస్వామిపురంలో పరిశీలన, విచారణ జరిగింది. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా ఆపేశారంటూ కొందరు, ఒక్కసారిగా జనం తోసుకొచ్చారంటూ మరికొందరు, అంబులెన్స్లు వరుసగా రావడంతో వాటికి దారి ఇచ్చే సమయంలో తోపులాట జరిగిదంటూ మరికొందరు తెలిపారు. -
రాళ్లు రువ్వారు.. లాఠీఛార్జి చేశారు.. అందుకే తొక్కిసలాట జరిగింది
కరూర్ ఘటనపై తమిళగ వెట్రి కగళం(TVK) సంచలన ఆరోపణలకు దిగింది. ర్యాలీపై రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీఛార్జి చేయడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందని ఆరోపించింది. ఈ మేరకు కుట్ర కోణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ మద్రాస్ హైకోర్టును ఆదివారం ఆశ్రయించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఉదయం తన నివాసంలో న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న టీవీకే విజ్ఞప్తికి జస్టిస్ దండపాణి అంగీకారం తెలిపారు. కోర్టుకు సెలవులు ఉన్నప్పటికీ.. రేపు(సోమవారం) మధురై బెంచ్ ఈ పిటిషన్ను విచారించే అవకాశం కనిపిస్తోంది.ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే కేడర్పై(విజయ్ మినహా) కేసులు నమోదు అయ్యాయి. అలాగే తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు కూడా. అయితే.. కుట్ర కోణం ఉందన్న నేపథ్యంలో హైకోర్టే సుమోటోగా దర్యాప్తు చేపట్టాలని, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణకు ఆదేశించాలని పిటిషన్లో టీవీకే విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. కరెంట్ పోవడం, విజయ్పైకి గుర్తు తెలియని ఆగంతకులు చెప్పులు విసరడం, అదే సమయంలో తొక్కిసటాల జరగడం లాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తమ సభలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది కూడా. అయితే.. టీవీకే ఆరోపణలను ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ వెంకట్రామన్ ఖండించారు. అనుమతిచ్చిన దానికంటే జనం అత్యధికంగా వచ్చారని, విజయ్ ర్యాలీకి ఆలస్యంగా వచ్చారని, ఆ సమయంలో పోలీసులకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారని, ఇప్పుడేమో పోలీసులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ఇదిలా ఉంటే.. కరూర్ ర్యాలీలో విజయ్ పది రూపాయల మంత్రి అంటూ పరోక్షంగా సెంథిల్ బాలాజీని ఉద్దేశించి పాట అందుకున్నారు. ఆపై జోష్తో అక్కడున్నవాళ్లంతా ఆయన దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాతే పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది.ఇదిలా ఉంటే.. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు జరుపుతున్నారు. వారాంతాల్లో కీలక నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కరూర్ జిల్లా వెలుచామైపురం వద్ద జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో మరొకరు మరణించడంతో ఆ సంఖ్య 40కి చేరింది. ర్యాలీకి చాలా ఆలస్యంగా విజయ్ రాగా.. అప్పటికే తిండి, నీరు లేక నీరసించి పోయిన జనం సొమ్మసిల్లిపోవడంతో అలజడి రేగింది. ఆపై ఆంబులెన్స్ వచ్చే క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు ఎంత అదుపు చేసే ప్రయత్నం చేసినా.. పరిస్థితి చేజారిపోయింది. ఈ పరిణామంతో ర్యాలీ మధ్య నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు విజయ్. బాధితులను పరామర్శించుకుండా, మీడియాతో మాట్లాడకుండా విజయ్ వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో చెన్నైలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఒకవైపు విజయ్ మద్దతుదారులు.. మరోవైపు ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నిరసనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.వచ్చేవారం పర్యటన రద్దుతొక్కిసలాట ఘటన నేపథ్యంలో వచ్చేవారం నిర్వహించాల్సిన టీవీకే ర్యాలీని విజయ్ రద్దు చేసుకున్నారు. కరూర్ బాధితులను పరామర్శించేందుకు అనుమతించాలంటూ ఆయన పోలీసులకు లేఖ రాశారు. దీనిపై బదులు రావాల్సి ఉంది.ఇదీ చదవండి: జనాలు చస్తుంటే విజయ్ పారిపోయాడు! -
కరూర్ కన్నీరు.. హృదయవిదారక దృశ్యాలు
ఊపిరి సలపని పరిస్థితుల్లో ప్రాణాల కోసం పాకులాడిన యువత.. చేతులు జోడించి ప్రాణభిక్ష కోరుతూ ఆర్థించిన వృద్ధురాలు.. తన బిడ్డ కనిపించడం లేదంటూ ఓ తల్లి పడ్డ ఆవేదన.. ఆ పక్కనే పడి ఉన్న ఓ చిన్నారి మృతదేహం.. ఇవన్నీ ఇప్పుడు కరూర్ విషాదాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి. కరూర్ వెలుచామైపురం టీవీకే ర్యాలీలో ఘోర విషాదం.. 39 మందిని బలిగింది. అనుమతించిన దానికంటే రెట్టింపు సంఖ్యల్లో జనం హాజరు కావడం, వాళ్లను పోలీసులు అదుపు చేయలేకపోవడం, ఆంబులెన్స్లకు దారి ఇచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగిందని స్పష్టమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు టీవీకే పరిహారాలు ప్రకటించాయి. న్యాయపరమైన విచారణ జరుగుతోంది. అదే సమయంలో.. ఈ ఘటనకు సంబంధించిన ఘటన హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చెల్లా చెదురైన చెప్పులు, టీవీకే జెండాలు అక్కడి పరిస్థితి తీవ్రతను అద్ధం పడుతున్నాయి. పరామర్శకు వచ్చిన నేతలకు తన రెండేళ్ల బిడ్డ విగతజీవిగా మారిందని చూపిస్తూ ఓ తండ్రి పెట్టిన రోదన అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.So disturbing! Heart-breaking! 😢We need to get out of the hero-worshipping mentality. No celebrity is worth risking a life. #KarurStampede#VijayRally pic.twitter.com/FAlgDjKUkG— Satish Acharya (@satishacharya) September 28, 2025த. வெ. க கூட்டத்தில் போலீசார் தடியடி.. இது தான் கூட்ட நெரிசல் ஏற்பட காரணம்? #KarurStampede #Karur pic.twitter.com/2LSYLaVqdu— Karthik M (@karthikwtp) September 27, 2025உரிய பாதுகாப்பு வழங்கப்பட்டதாக தெரியவில்லை - Karur People !#TVK #JanaNayagan #KarurStampede pic.twitter.com/VkTqbB5mU5— MAHI (@MahilMass) September 28, 2025#KarurStampede 🚨 Heartbreaking Tragedy in Tamil Nadu 🚨What was meant to be a moment of hope and celebration at #TvkVijay’s rally in Karur has turned into an unimaginable nightmare.💔 31 innocent lives lost in a stampede-like situation.💔 Families who came with joy have… pic.twitter.com/y9cl6hW4RT— Akash (@AdvAkashji) September 27, 2025மீளமுடியாத துயர் 💔#JusticeForKarurRally #Karur #KarurStampedepic.twitter.com/bjvyACOnqS— Prakash (@prakashpins) September 28, 2025#KarurStampede #TVKVijayStampede #Karurpic.twitter.com/9BpJWtY2u3— Manoj Trichy (@manoj4trichy) September 28, 2025#KarurStampede#கொலைகாரன்_விஜய் pic.twitter.com/JRpXLGqDVL— த.சந்தோஷ்குமார் (@MKPSandy) September 28, 2025 -
తమిళనాడు తొక్కిసలాట ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి
-
కోర్టు మొట్టికాయలేసినా.. కరూర్ విషాదం!
కరూర్ వెలుచామైపురం తొక్కిసలాట ఘటన ఇప్పటికే 39 మంది మరణించగా.. 95 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. అయితే 51 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనకు బాధ్యుడైన టీవీకే అధినేత విజయ్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ అన్ని పార్టీల వైపు నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ దరిమిలా.. రాజకీయ పార్టీల బహిరంగ సభలపై ఈ మధ్యే తమిళనాడు ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకే లక్ష్యంగా.. తమిళగ వెట్రి కగళం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ తన ప్రచార సభలను సెప్టెంబర్ 13, 2025న తిరుచ్చిలో ప్రారంభించారు. అయితే తమ సభలకు, ర్యాలీలకు డీఎంకే ప్రభుత్వం అడ్డం పడుతోందని ఆరోపిస్తూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ పిటిషన్పై సెప్టెంబర్ 18వ తేదీన మద్రాస్ హైకోర్టులో వాదనలు జరిగాయి.‘‘తిరుచ్చిలో మా పార్టీ ప్రచార సభ అనుమతి కోరుతూ సీపీ ఆనంద్కు మా పార్టీ జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్ రిక్వెస్ట్ చేశారు. అయితే అనుమతులు ఇచ్చినప్పటికీ.. 23 కఠిన నిబంధనలు విధించారు. గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు సభకు రాకూడదని చెబుతూ అందులో పేర్కొన్నారు. దీనిని అమలు చేయడం కష్టం. ఇది అన్యాయం. ఇతర పార్టీలకు సులభంగా ఇస్తున్న పోలీసులు.. టీవీకే విషయంలోనే పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు’’ అని టీవీకే వాదించింది. దీంతో కోర్టు చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర హోం కార్యదర్శిని విచారణలో భాగంగా పిలిపించుకుంది. అయితే.. టీవీకే సభలకు అనుమతికి మించి జనాలు వస్తున్నారని, తిరుచ్చి ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రజల ఆస్తికి నష్టం కలిగించారంటూ పోలీసులు ఫొటో ఆధారాలను సమర్పించారు. దీంతో జస్టిస్ సతీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల భద్రతకు, ప్రజా ఆస్తులకు పార్టీలే బాధ్యత వహించాలి, గర్భిణులు, వికలాంగులు, వృద్ధులు సభలకు రాకుండా నేతలే సూచించాలి. ఇక నుంచి తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభలు నిర్వహించాలంటే ఒక నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. సభల సమయంలో ప్రజా/ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరిగితే, ఆ డిపాజిట్ను పరిహారంగా ఉపయోగించాలి. అలాగే.. పోలీసు యంత్రాగం కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఒకే విధమైన, చట్టబద్ధమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. సభలకు అనుమతులు ఇవ్వడంలో వివక్ష ఉండకూడదు’’ అని ఇటు ప్రభుత్వానికి, అటు టీవీకేకు మొట్టికాయలు మద్రాస్ హైకోర్టు వేసింది. ఈ క్రమంలో టీవీకేకు స్వల్ప ఊరట ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కోర్టు సూచన మేరకు సెప్టెంబర్ 24వ తేదీనే తమిళనాడు ప్రభుత్వం పొలిటికల్ ర్యాలీల మార్గదర్శకాలను సమర్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ గడువు కోరడంతో తదుపరి విచారణ వాయిదా పడింది. మధ్రాస్ హైకోర్టు రాజకీయ పార్టీల సభలపై ఆందోళనలు వ్యక్తం చేసిన కొన్ని రోజులకే కరూర్ విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.ఇదీ చదవండి: ప్రాణాలు పోతుంటే.. పారిపోయావా విజయ్? -
నా హృదయం ముక్కలైంది.. కరూర్ ఘటనపై విజయ్ పోస్ట్
-
40 మంది బలి.. తమిళనాడులో హై టెన్షన్
-
ఎటు చూసినా రోదనలే.. ప్రాణాలు తీసిన విజయ్ సభ (చిత్రాలు)
-
కరూర్ ఘటన.. టీవీకే సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట కారణంగా 39 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో విషాద ఘటనపై టీవీకే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమంటూ విమర్శించింది.కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే స్పందిస్తూ..‘తొక్కిసలాట ఘటనకు కారణంగా స్టాలిన్ ప్రభుత్వమే. మేము అడిగిన ప్రాంతంలో కాకుండా.. చిన్నపాటి రోడ్డులో సభకు అనుమతి ఇచ్చారు. సభ జరుగుతున్న సమయంలో అంబులెన్స్లు అటుగా వచ్చేలా డీఎంకే ప్లాన్ చేసింది. ఈ క్రమంలో అంబులెన్స్ కోసం దారి ఇవ్వాలని విజయ్ కోరడంతో తొక్కిసలా జరిగింది. పోలీసులతో కలిసి డీఎంకే ప్రభుత్వం విజయ్పై కుట్ర చేసింది అని ఆరోపించింది. మరోవైపు.. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణం అంటూ టీవీకే పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.He shamelessly ignored people literally dying around him and continued with this nonsense on mic.There are times when you have to stop and think what kind of demons and narcissistic animals are made Gods by us...💔#Karur #KarurStampede pic.twitter.com/10lngolUI8— Namita Balyan (@NamitaBalyan) September 27, 2025డీజీపీ కీలక వ్యాఖ్యలు..ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై తమిళనాడు లా అండ్ ఆర్డర్ డీజీపీ వెంకట్రామన్ అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..‘టీవీకే పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. కరూర్లో జరిగినది చాలా విషాదకరమైన ఘటన. వీరిలో 13 మంది పురుషులు, 16 మంది మహిళలు, ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ డేవిడ్సన్ నాయకత్వంలో ముగ్గురు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలతో సహా 2000 మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు.விஜயிடம் பேசிய போலீஸ் குறிப்பிட்ட நேரத்திற்கு செல்லாத விஜய்க்கு காவல்துறையினர் தொடர்புகொண்டு பேசியிருக்கின்றனர்.கூட்டம் அதிக அளவில் இருக்கிறது என்பதையும் தெரியப்படுத்தி,ஒத்துழைப்பு தருமாறு அறிவுறுத்தியுள்ளனர்.அதனால்தான் விஜய் காவல்துறைக்கு நன்றி சொல்லி பேசினார். #karur pic.twitter.com/6BbXGxc2Jp— Gokula Kannan R 👑 (@rg_kannan_dmk61) September 27, 2025తమిళనాడు టీవీకే పార్టీ గతంలో నిర్వహించిన సమావేశాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో, వారి అభ్యర్థన మేరకు ఇప్పుడు కరూర్లో పెద్ద స్థలాన్ని కేటాయించారు. రాష్ట్ర స్థాయిలో అదే స్థలంలో ఒక పెద్ద పార్టీ ప్రచారం చేసింది. పది వేల మంది వస్తారని భావించినప్పటికీ, 27 వేల మంది గుమిగూడారు. విజయ్ ప్రచారం చేసిన ప్రదేశంలో 500 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి కోరారు. కానీ, ఉదయం 11 గంటల నుండి గుమిగూడిన జనసమూహం రాత్రి 7:40 గంటలకు వస్తూనే ఉన్నారు. విజయ్ వస్తున్నారనే వార్తతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 27వేల మందికిపైగా ఉన్న సమూహాన్ని పోలీసులు కంట్రోల్ చేశారు. సభ జరుగుతున్న సమయంలో పోలీసులకు విజయ్ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం లేదు. కానీ, దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. దీనికి సంబంధించి కారణాల కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఏమీ మాట్లాడలేం. అయితే, ఈ ఘటనకు పోలీసులే కారణమా? అని మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు.ఏకసభ్య కమిషన్ ఏర్పాటు.. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పందించారు. కరూర్ జిల్లా కలెక్టరుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లోని క్షతగాత్రులను ఆదివారం ముఖ్యమంత్రి పరామర్శించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. -
TVK Vijay: మొన్న మధురై.. నిన్న కరూర్
తమిళనాడు కరూర్ తొక్కిసలాట(Karur Stampede) ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభకు హాజరై.. 39 మంది మృతి చెందడం, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడడం.. ఇటు రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు తొక్కిసలాట జరిగిన తర్వాత వెంటనే విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోవడం మరింత ఆగ్రహావేశాలకు కారణమౌతోంది.. కరూర్లో విజయ్ బహిరంగ సభకు(Vijay Meeting) కేవలం 10 వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. అయితే.. అంతకు రెండు రెట్లు పైనే జనాలు వచ్చారు. దీనికి తోడు అనుకున్న సమయం కంటే ఆరు గంటలు ఆలస్యంగా విజయ్ సభకు వచ్చారు. దీంతో ఆ రద్దీ మరింత ఎక్కువైంది. అప్పటికే అక్కడ గుమిగూడిన జనాల్లో చాలామంది నీరు, తిండి లేకపోవడంతో నీరసంగానే ఎదురు చూస్తూ ఉండసాగారు. ఈలోపు సాయంత్రం 7.30-7.45 సమయంలో విజయ్ ప్రచార రథం రావడం.. ఆ రోడ్డు ఇరుకుగా ఉండడంతో.. ఆ వాహనానికి దారి ఇచ్చే క్రమంలో జనాలు వెనక్కి పోవడం, జనాల్లో కొందరు ఆయన్ని దగ్గరి నుంచి చూడాలనే కుతూహలంతో తోసుకున్నారు. ఈ తోపులాటలో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసింది. ఆ అలజడిని గమనించిన విజయ్.. ‘‘పోలీస్.. ప్లీజ్ హెల్ప్, ఆంబులెన్స్’’ అంటూనే వాహనంపై ఉన్న వాటర్ బాటిళ్లను జనాల్లోకి విసిరారు. అయితే తొక్కిసలాట జరుగుతున్న గందరగోళ పరిస్థితుల నడుమే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ టీవీకే వలంటీర్లు తక్కువగా ఉండడం, ఆంబులెన్స్లకు దారి లేకపోవడంతో సకాలంలో ప్రాణాలు కాపాడలేకపోయారని తెలుస్తోంది. த. வெ. க கூட்டத்தில் போலீசார் தடியடி.. இது தான் கூட்ட நெரிசல் ஏற்பட காரணம்? #KarurStampede #Karur pic.twitter.com/2LSYLaVqdu— Karthik M (@karthikwtp) September 27, 2025కరూర్ తొక్కిసలాట ఘటనను.. తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా అభివర్ణిస్తున్నారు. 39 మంది మృతుల్లో.. పది మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండడం గమనార్హం. 95 మందిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో 58 మంది ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై రాష్ట్రపతి, దేశ ప్రధాని.. ఇతర రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మీడియాకు నో అనుమతిఇదిలా ఉంటే.. విజయ్ ఆలస్యంగా రావడమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఘటన తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. త్రిచీ ఎయిర్పోర్ట్కి వెళ్లి, అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరారు. దీంతో బాధితులను పరామర్శించకుండా, మీడియాను ఎదుర్కొనకుండా.. బాధ్యతల నుంచి విజయ్ తప్పించుకున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. திடீரென மயங்கிய தொண்டர்”என்ன ஆச்சு..என்ன ஆச்சு” பதறி BOTTLE-ஐ எறிந்த விஜய் #vijayspeech #tvk #vijay #karur #mkstalin #abpnadu pic.twitter.com/0BRXYch0LM— ABP Nadu (@abpnadu) September 27, 2025#WATCH | Karur, Tamil Nadu | Visuals from the spot where a stampede occurred yesterday, during a public event of TVK (Tamilaga Vettri Kazhagam) chief and actor Vijay. As per CM MK Stalin, so far, 39 people have lost their lives in the incident. pic.twitter.com/hswWaa9ljq— TIMES NOW (@TimesNow) September 28, 2025మరోవైపు చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద కూడా మీడియాను అనుమతించడం లేదు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దళపతి మద్దతుదారులు అక్కడికి చేరుకుని.. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ హల్ చల్ చేస్తున్నారు. ఇటు గుండె బద్దలైందంటూ.. క్షతగాత్రులు కోవాలంటూ కేవలం ట్వీట్తో విజయ్ సరిపెట్టడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. టీవీకే పార్టీ ప్రతినిధి రంజనా నాచియార్ మాట్లాడుతూ.. విజయ్ ఆస్పత్రికి వెళ్లి ఉంటే అక్కడా పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యేదని, అందుకే వెళ్లలేకపోయారని అన్నారు. తప్పంతా తమిళనాడు ప్రభుత్వం, పోలీసులదేనని ఆ పార్టీ అంటోంది.మధురై మానాడులోనూ..విజయ్ మొన్నీమధ్యే మధురైలో నిర్వహించిన టీవీకే రెండో మానాడులోనూ దాదాపు తొక్కిసలాట జరిగినంత పనైంది. ఆగస్టు 21న మధురై-తూత్తుకుడి హైవే వద్ద జరిగిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రెండవ రాష్ట్ర బహిరంగ సభ జరగ్గా.. సుమారు 4,00,000 పైగా జనం హాజరయ్యారు. సభకు భారీగా జనాలు రావడం, మంచి నీళ్లు లేక అవస్థలు పడడం, ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని కింద పడిపోయారు. ఈ ఘటనలో సుమారు 400 మంది ఊపిరాడక అస్వస్థతకు గురైనట్లు ఆ సమయంలో పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు ఈ మానాడు ఏర్పాట్ల సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు కూడా. అయితే ఈ అనుభవాల నుంచి కూడా టీవీకే కరూర్లో క్రౌడ్మేనేజ్మెంట్ను సరిగ్గా చేసుకోలేకపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. VIDEO | Karur: Tamil Nadu CM M K Stalin paid tributes to the victims of the Karur stampede and visited the hospital to meet those injured.Thirty-nine people, including eight children, lost their lives in the incident.#Karur #TamilNadu #MKStalin(Full video available on PTI… pic.twitter.com/Z0jdrliuTz— Press Trust of India (@PTI_News) September 28, 2025విజయ్ను అరెస్ట్ చేయాల్సిందే!క్షతగాత్రుల్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎక్స్లోనూ ఈ విషయాన్ని ట్వీట్ చేశారాయన. మరోవైపు.. ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని హోం మంత్రి అమిత్ షా కోరారు. కరూర్ టీవీకే కార్యదర్శిపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యూడీషియల్ కమిటీ వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని సీఎం స్టాలిన్ తెలిపారు. విజయ్ను అరెస్ట్ చేయాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే టీవీకే మాత్రం ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది. -
విజయ్ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం కరూర్లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు. -
విజయ్ సభలో తొక్కిసలాట ఘటన.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్న మోదీ.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు. The unfortunate incident during a political rally in Karur, Tamil Nadu, is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones. Wishing strength to them in this difficult time. Praying for a swift recovery to all those injured.— Narendra Modi (@narendramodi) September 27, 2025 తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఘటనపై కరూర్ కలెక్టర్తో సీఎం స్టాలిన్ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారు. కాగా, విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. విజయ్ సభలో తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కరూర్లో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. 10వేల మందికి మాత్రమే అనుమతి తీసుకున్న విజయ్ సభకు భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. -
టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. 38 మంది మృతి
కరూర్(తమిళనాడు): కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో విజయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.విజయ్ సభలో తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కరూర్లో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. 10 వేల మందితో ర్యాలీకి విజయ్ అనుమతి తీసుకున్నారు. ర్యాలీకి ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో తోపులాట జరిగింది. పరిమితికి మించి జనం రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. గతంలో మధురై తొలి సభలోనూ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఘటనపై కరూర్ కలెక్టర్తో సీఎం స్టాలిన్ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారుకాగా, మీట్ ది పీపుల్ నినాదంతో విజయ్ చేపట్టిన ప్రచార యాత్ర గురించి తెలిసిందే. ప్రతి శనివారం ఆయన రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. ఇవాళ (శనివారం, సెప్టెంబర్ 27) నామక్కల్, కరూర్లలో పర్యటించేందుకు నిర్ణయించారు. అయితే, విజయ్ ప్రచార సభకు స్థల ఎంపిక, అనుమతి వ్యవహారం వివాదానికి దారి తీసింది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్ వర్గీయులు, ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో పర్యటన సాగేనా? అన్న చర్చ జరిగింది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పర్యటన ఖరారైంది. కరూర్లో వేలుస్వామి పురంలో ప్రచార బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు.విజయ్ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతితాడేపల్లి: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం కరూర్లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు. -
కన్నీళ్లు పెట్టించిన విద్యార్థుల గాథ
‘పుట్టింది పేదరికం.. ప్రభుత్వ బడులలో చదువులు.. ప్రభుత్వం అందించిన సాయం, ప్రోత్సాహంతో జాతీయ, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులు ఒకొక్కరికి ఒక్కోగాథ. కొందరు విద్యార్థుల ప్రయాణం ఆనంద భాష్పాలకు దారి తీస్తే, మరికొందరు ప్రస్థానం కన్నీళ్లు పెట్టించాయి. అయినా, తాము సాధించామన్న విజయపు దరహాసంతో విద్యలో తమిళనాడే బెస్ట్ అని చాటే విధంగా ఉద్వేగ పూరితంగా ముందడుగు వేశారు. ఇందుకు అచ్చమైన వేదికగా విద్యలో బెస్ట్ తమిళనాడు వేడుక గురువారం నిలిచింది.సాక్షి, చైన్నె: తమిళనాడులోని విద్యార్థులు, యువతకు విద్య, క్రీడలలో రాణించే రీతిలో ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అల్పాహార పథకం, ఉన్నత విద్యా పరంగా ప్రోత్సాహంగా తమిళ్ పుదల్వన్, పుదుమై పెన్, ప్రభుత్వ బడులలోని విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలలో చదివేందుకు వీలుగా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా శిక్షణలు, నైపుణ్యాల శిక్షణ అంటూ నాన్ మొదల్వన్ వంటి పథకాలు ఎందరో జీవితాలలో వెలుగు నింపుతున్నది. ఇక, క్రీడా పరంగా తమిళనాడు జాతీయ, అంతర్జాతీయంగా క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. ఈ పథకాలన్నీ ఒకే వేదికగా తెచ్చే రీతిలో, మరింత విస్తరణ దిశగా గురువారం రాత్రి నెహ్రు ఇండోర్ స్టేడియంలో జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, విద్యా మంత్రులు కోవి చెలియన్, అన్బిల్ మహేశ్, సాంఘిక సంక్షేమ శాఖమంత్రి గీతా జీవన్తో పాటూ ఇతర మంత్రులు, కనిమొళితో పాటూ ఎంపీలు, సీఎస్ మురుగానందంతో పాటూ అధికారులు, ఎండీఎంకే నేత వైగో పాటూ డీఎంకే మిత్ర పక్ష నాయకులు, సినీ నటుడు శివకార్తికేయన్, దర్శకులు మారి సెల్వరాజ్, మిస్కిన్తో పాటూ పలువురు, క్రికెటర్ నటరాజ్ తదితరులు హాజరయ్యారు.ఉద్వేగంతో..క్రీడల పరంగా రాణిస్తున్న వారు, తాము ప్రభుత్వ బడులలో చదువుకుంటున్న సమయంలో పడ్డ కష్టాలు, కుటుంబ ఆర్థిక స్థోమత, చదువులతో పాటూ క్రీడలలో రాణించేందుకు ప్రభుత్వం అందించిన సహకారాన్ని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం గురించి వివరిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. పుదుమై పెన్ పథకం ద్వారా ఉన్నత విద్యను చదువుకుంటున్న పలువురు విద్యార్థినులు తమ కష్టాలను గుర్తు చేస్తూ కన్నీటి పర్యంతం కావడమే కాకుండా, అందర్నీ ఉద్వేగానికి గురి చేశారు. ఇదే విధంగా ఒకొక్కరిది..ఒక్కో గాథ అన్నట్టుగా ఉద్వేగ భరతంగా వేడుక సాగింది. విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్, సాంఘిక సంక్షేమ మంత్రి గీతాజీవన్తో పాటూ డిప్యూటీ సీఎం ఉదయనిధి , శివ కార్తికేయన్ల కళ్లు చెమ్మరిల్లాయి. ప్రభుత్వ శిక్షణతో ఐఐటీ, తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థలే కాదు, పలు దేశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఇంజినీర్లు, డాక్టర్లు, పరిశోధకులు, వివిధ అత్యున్నత రంగాలలో చివరి సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థులు తాము పడ్డ శ్రమ, ప్రభుత్వం అందిస్తున్న విద్యా ప్రోత్సాహాన్ని గుర్తు చేస్తూ ఆనంద భాష్పాలు వ్యక్తం చేశారు. నటుడు శివకార్తికేయన్ తన ప్రసంగంలో ఒకొక్కరి గాథను వింటుంటే తనకు స్ఫూర్తి, తనలోనూ ఓ నమ్మకం అన్నది కలుగుతోందన్నారు. జీవితంలో గెలవాలంటే చదువు ముఖ్యం అని, తాను ప్రస్తుతం సినిమాలలో ఉన్నా, ఈ ఇండ్రస్టీ బయటకు పంపిస్తే తన వద్ద ఉద్యోగం చేసుకునేందుకు రెండు డిగ్రీలు ఉన్నాయని ఉద్వేగంతో వ్యాఖ్యలు చేశారు. దర్శకులు మిస్కిన్, మారి సెల్వరాజ్, వెట్రి మారన్ల ప్రసంగాలు సైతం సందేశ పూరితంగా సాగాయి.పథకాల విస్తరణ– అవార్డులురాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలను విస్తరిస్తూ ఈ వేడుకలో చర్యలు తీసుకున్నారు. ఈసందర్భంగా విద్యా రంగానికి విశిష్ట సేవలు, సహకారం అందిస్తున్న సంస్థలు,సంఘాలు, ముఖ్యులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్లు అవార్డులతో సత్కరించారు. ఈసందర్భంగా అగరం ఫౌండేషన్ తరపున నటుడు శివకుమార్, దర్శకుడు జ్ఞానవేల్లను సత్కరిస్తూ అవార్డును అందజేశారు.శ్రమకు తగ్గ ఫలితం: సీఎంనాలుగేళ్లు పడ్డ శ్రమకు ఫలితం కంటి ముందు కనిపిస్తున్నదని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం ఇక్కడ ఒక్కో విద్యార్థి చెప్పుకున్న గాథేనని గుర్తు చేశారు. ఈ వేడుక కేవలం తమను తాము పొగడ్తలతో ముంచెత్తుకునేందుకు మాత్రం కాదని, ఒక్కో విద్యార్థి పడ్డ శ్రమ, లభించిన ప్రోత్సాహం రానున్న కాలానికి మరో విద్యార్ధికి మార్గదర్శకం కావాలన్నదే లక్ష్యం అని వివరించారు. ఇక్కడి పథకాలను పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని గుర్తుచేస్తూ, తెలంగాణలో అమలు చేస్తున్న మంచి పథకాలను ఇక్కడ అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇదే ఆరోగ్యకరమైన అభివృద్ధి రాజకీయం అని వ్యాఖ్యానించారు.ఇక్కడ విద్యార్థులను చూస్తుంటే ఆనందం కలుగతోందని, ఒక విద్యార్థి చదువుకుని పైకి వస్తే ఒక కుటుంబం ఉన్నతం అవుతుందని, ఒక రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, దేశానికి పక్కబలంగా రాష్ట్రం మారుతుందన్నారు. నెలకు వెయ్యి ఇచ్చినంత మాత్రాన మార్పు వచ్చేస్తుందా? అని ప్రశ్నించే వాళ్లకు ఇక్కడ విద్యార్థుల విజయ గాథే సమాధానం అన్నారు. యూజీ పూర్తిచేసిన వారు పీజీ చదవండి, అంతకన్నా ఎక్కువ చదవండి అండగా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ప్రపంచం చాలా పెద్దది అని, విజయాలు అన్నీ వైపులా ఉండాలని, ప్రతి విద్యార్థి చదువుకు తాను అండ అని పేర్కొంటూ, విద్యలో ఉన్నతంగా తమిళనాడును మార్చేద్దామని ధీమా వ్యక్తం చేశారు. -
సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు
కరోనా (corina) సమయంలో రాష్ట్రానికి కీలక సేవలు అందించిన ఐఏఎస్ అధికారిణి బీలా వెంకటేశన్ (Beela Venkatesan) (56) ఇక లేరు. ప్రజా సేవకు, అంకితభావానికి పేరుగాంచిన ఉన్నతాధికారిణి, తమిళనాడు ఇంధన శాఖ కార్యదర్శిగా బీలా బుధవారం (సెప్టెంబర్ 24న) అనారోగ్యంతోకన్నుమూశారు.గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతున్నారు. ఆమె మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. పాలన ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న నిబద్ధత మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆమెకు నివాళులర్పించారు,2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వెంకటేశన్ తమిళనాడులో సుపరిచితం.ఆ సమయంలో రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిగా, రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితికి సంబంధించి తన రోజువారీ మీడియా బ్రీఫింగ్ల ద్వారా కీలకమైన నవీకరణలను అందిస్తూ తమిళనాట బహుళ ప్రజాదరణ పొందారు.డాక్టర్ బీలా వెంకటేశన్ మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసి) నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశారు. వృత్తిరీత్యా వైద్యురాలైన 1997లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. మొదట బీహార్, ఆ తరువాత జార్ఖండ్లోనూ పనిచేసి అనంతరం తమిళనాడుకు బదిలీ అయ్యారు.తమిళనాడులో, ఆమె చెంగల్పట్టు సబ్-కలెక్టర్గా పనిచేశారు; ఫిషరీస్ కమిషనర్; కమీషనర్ ఫర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్; ఆరోగ్య ప్రధాన కార్యదర్శి,ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతికి కమిషనర్గా విశేష సేవలందించారు.బీలా తల్లి, నాగర్కోయిల్కు చెందిన రాణి వెంకటేశన్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే. ఆమె తండ్రి, SN వెంకటేశన్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ -
రేబిస్తో కార్మికుడి మృతి
తిరువొత్తియూరు: కుక్క కరిచి రేబీస్ వ్యాధి సోకిన కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వేలూరు జిల్లా, ఒడుగత్తూరు సమీపంలోని కత్తూరు గ్రామానికి చెందిన కరుణానిధి (45)కార్మికుడు. ఇతని భార్య సుధ (40). వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత 8వ తేదీన కరుణానిధి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వీధి కుక్క కరిచింది. చికిత్స తీసుకోకపోవడంతో కరుణానిధికి ఆరోగ్యం క్షీణించింది. కుటుంబసభ్యులు అతన్ని అనైకట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అతనికి రేబిస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కరుణానిధి మంగళవారం రాత్రి మృతిచెందాడు. వేపంగుప్పం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.లారీ ఢీకొని యువకుడి దుర్మరణంతిరువళ్లూరు: బైక్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన పట్రపెరంబదూరు సమీపంలో జరిగింది. తిరువళ్లూరు జిల్లా పెద్దమంజాకుప్పం గ్రామానికి చెందిన రామన్ కుమారుడు జయపాల్(25). ఇతను పట్రపెరందూరులోని టోల్ప్లాజాలో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బైక్లో ఇంటికి బయలుదేరాడు. పట్రపెరంబదూరు సమీపంలోని బ్రిడ్జి వద్ద వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయపాల్ను స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తును చేస్తున్నారు.యువకుడు దారుణ హత్యతిరువొత్తియూరు: రోడ్డుపై ట్రాక్టర్ నడపడడంపై రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కళ్లకురిచ్చి జిల్లా, కల్వరాయన్మలై తాలూకా, ఇన్నాడు సమీపం మేల్నిలవూరు గ్రామానికి చెందిన సుందరం కుమారుడు ఆండి (27) రైతు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతని పక్కింట్లో ఉంటున్న అళగేశన్ కుమారుడు ప్రభుదేవా. మంగళవారం రాత్రి ఆండి ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తుండగా ప్రభుదేవా ట్రాక్టర్ను పక్కకు నడపాలని చెప్పాడు. ఈవిషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రభుదేవా, తండ్రి అళగేశన్, తల్లి వైల్లెయమ్మాల్ ఆండిని తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో ప్రభుదేవా గొడ్డలి తీసుకొచ్చి ఆండి తలపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆండి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కరియాలూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురి కోసం గాలిస్తున్నారు.బాలుడు కిడ్నాప్..సురక్షితంవేలూరు: ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని గుర్తు తెలి యని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. రెండు గంటల తర్వాత బాలుడు ఆచూకీ లభ్యమైంది. సురక్షితంగా పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. వేలూరు జిల్లా గుడియాత్తం కామాక్షి అమ్మన్పేటకు చెందిన బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండంగా ఆ సమయంలో గుర్తు తెలియని వ్యకులు బాలుడిని తీసుకెళ్లారు. బాలుడి కేకలు విని తల్లిదండ్రులు వచ్చి చూడగా కిడ్నాపర్లు వెంటనే కారులో తీసుకుని పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమై అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. రెండు గంటలపాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో తిరుపత్తూరు జిల్లా మాదనూరు వద్ద బాలుడిని కిడ్నాపర్లు రోడ్డు పక్కన వదిలి వెళ్లి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడిని తీసుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.అన్నదాతల వినూత్న ఆందోళనతిరువొత్తియూరు: తిరుచ్చి కావేరీ నది ఒడ్డున రైతు సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో వినూత్న రీతిలో రైతులు ఆందోళన చేశారు. తిరుచ్చి కావేరి నదిలో జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం అధ్యక్షుడు అయ్యకన్ను నాయకత్వంలో రైతులు బుధవారం ఉదయం ఇసుకలో మెడ వరకు కూరుకుపోయి వినూత్న రీతిలో ఆందోళన చేశారు. లక్షల క్యూబిక్ల వరద నీరు కావేరి నది నుంచి వృథాగా సముద్రంలో కలుస్తోందని, కావేరి–అయ్యారు నదుల అనుసంధానం చేయాలని, సహకార బ్యాంకుల్లోని అన్ని రైతు రుణాలను రద్దు చేయాలని, 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలని, శ్రీరంగం అళగిరిపురంలోని కొల్లిడం నదిపై తెగిన ఆనకట్టను నిర్మించాలని డిమాండ్ చేశారు.ఆదిశక్తి అలంకరణలో వరాలతల్లిచౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం అమ్మవారు ఆదిశక్తి పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం పట్టుపీతాంబరాలు , పరిమళభరిత పుష్పమాలికలు , విశేషాభరణాలతో పార్వతీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. వేదపండితులు గోవర్ధనశర్మ, తదితర అర్చక బృందం అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరం, ఉభయదారులతో కలిసి హోమ పూజలు చేశారు. -
మద్యం ధరలు పెరుగుతాయా?
కొరుక్కుపేట: తమిళనాడులో లేబుల్స్, బాటిల్ మూతలు, ప్యాకింగ్ కార్టన్లు మొదలైన వాటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. దీంతో మద్యం రిటైల్ ధర పెంచాలా? వద్దా అని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వివరాలు.. తమిళనా డులో 4,829 మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి. టాస్మాక్ దుకాణాలు 43 సాధారణ రకాలు, 49 మీడియం రకాలు, 128 ప్రీమియం రకాల మద్యం, 35 రకాల బీర్, వైన్లను విక్రయిస్తాయి. టాస్మాక్ లిక్కర్ స్టోర్ తయారు చేస్తున్నారు. దీంతో పాటూ విదేశీ మద్యం కూడా ఎలైట్ టాస్మాక్ దుకాణాల ద్వారా ప్రత్యేకంగా అమ్ముడవుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై వ్యాట్ విధిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల మద్యం బాటిళ్ల మూతలు లేబుల్స్ వంటి ప్యాకేజింగ్ వస్తువులపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుండి 18 శాతానికి పెంచింది. అదనంగా, దిగుమతి చేసుకున్న సేవలపై 18 శాతం ఎకై ్సజ్ సుంకం ఉంది. దీని కారణంగా ప్రధాన మద్యం తయారీదారులకు ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఫలితంగా తయారీదారులు మద్యం బాటిళ్ల ధరలను పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, జీఎస్టీ వల్ల మద్యం ధరలు పెరగవని చెప్పారు. ఎకై ్సజ్ సుంకాలు మొదలైన వాటిపై ఆధారపడి ఈ పెరుగుదల ఉంటుందని స్పష్టం చేశారు.నటుడు రవి మోహన్కు నోటీసులుతమిళసినిమా: ప్రముఖ నటుడు రవి మోహన్ ఇంటికి ఓ ప్రైవేట్ బ్యాంక్ నిర్వాహకులు జప్తు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ఈయన భార్యతో మనస్పర్థలు, విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం వంటి విషయాలతో వార్తల్లో ఉంటున్నారు. కాగా బాబీ టచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ సంస్థలో రెండు చిత్రాల్లో నటించడానికి రూ. 12 కోట్లు పారితోషికం చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుని, రూ.5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్లు, అయితే ఆ సంస్థకీ ఒక్క చిత్రం కూడా చేయకపోవడంతో ఆ సంస్థ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించక పోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా బాబి టచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత బాలచందర్ చైన్నె హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన సంస్థ చెల్లించిన అడ్వాన్స్కు సమానంగా ఆస్తి పత్రాలను కోర్టులో సమర్పించాలని న్యాయస్థానం రవి మోహన్కు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రవి మోహన్ కోర్టు ఆదేశాలను పాటించక పోవడంతో ఆయన ఆస్తులను జప్తు చేసుకోవాల్సిందిగా బాబి టచ్ గోల్డ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే నటుడు రవి మోహన్ స్థానిక వీసీఆర్ రోడ్డులో అందమైన భవనాన్ని కొనుగోలు చేశారు. అందుకు గాను ఓప్రైవేట్ బ్యాంకులో రుణం తీసుకుని, దానికి వాయిదాలు చెల్లించకపోవడంతో ఆ బ్యాంకు అధికారులు రవి మోహన్ ఇంటిని జప్తు చేయడానికి సిద్ధం అయ్యారు. అందుకు గానూ రవి మోహన్కు జప్తు నోటీసులు అందించగా దాన్ని తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. తాను కోర్టు ద్వారానే నోటీసులు తీసుకుంటానని చెప్పడంతో బ్యాంకు అధికారులు రవి మోహన్ ఇంటికి జప్తు నోటీసులు అంటించారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.సీనియర్ ఐఏఎస్ బీలా వెంకటేష్ మృతిసాక్షి, చైన్నె : సీనియర్ ఐఏఎస్ అధికారిణి బీలా వెంకటేష్(56) అనారోగ్యంతో చైన్నెలోని ఆస్పత్రిలో బుధవారం రాత్రి మరణించారు. ఆమె మరణంతో ఐఏఎస్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. కరోనా సమయంలో ఆమె అసమాన సేవలిందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ సమయంలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఆమె విస్తృత సేవలు అందించి, అందరి మన్ననలు పొందారు. అదే సమయంలో యువ అధికారినికి లైంగిక వేదింపులు ఇచ్చిన కేసులో ఆమె భర్త, రిటైర్డ్ డీజీపీ రాజేష్ దాస్ వ్యవహారంలో తీవ్ర మనో వేదనకు లోనయ్యారు. ఆయనకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె తన పేరును కూడా మార్చుకున్నారు. ప్రస్తుతం విద్యుత్శాఖ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న ఆమె మరణించినట్లు సమాచారం.881 మంది అధ్యాపకుల నియామకంసాక్షి, చైన్నె: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 881 మంది గౌరవ అధ్యాపకులను తాత్కాలికంగా నియమించనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవిచెలియన్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 15 ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల గురించి వివరించారు. కొత్త కళాశాలలకు, ఇదివరకు ఉన్న కళాశాలల్లో ఖాళీల భర్తీ నిమిత్తం 881 మందిని నియమించనున్నామని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. -
రూ. 1.33 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం
అన్నానగర్: చైన్నె విమానాశ్రయంలో రూ.1.33 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయానికి సరైన అనుమతులు లేకుండా వచ్చే కార్గో విమానాలలో పెద్ద సంఖ్యలో విదేశీ సిగరెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు చైన్నె విమానాశ్రయ ప్రత్యేక నిఘా విభాగం అధికారులకు సోమవారం రాత్రి రహస్య సమాచారం అందింది. దీంతో విమానాశ్రయ కస్టమ్స్ విభాగం అధికారులు విదేశాల నుంచి వచ్చిన పార్శిళ్లు, కంటైనర్లను తనిఖీ చేశారు. ఆ సమయంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చైన్నెకి వచ్చే అనేక కార్గో పార్శిళ్లలో విదేశీ సిగరెట్లను రహస్యంగా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఆ సిగరెట్లపై సరైన ఆరోగ్య హెచ్చరికలు లేవు. వీటిలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ–సిగరెట్లు కూడా ఉన్నాయి. కస్టమ్స్ శాఖ నుంచి సరైన అనుమతి పొందకుండానే వాటిని అక్రమంగా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కూడా తేలింది. దీంతో 1,130 ఈ–సిగరెట్లు, 4.30 లక్షల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి అంతర్జాతీయ విలువ రూ.1.33 కోట్లుగా భావిస్తున్నారు. కాగా ఆ సిగరెట్లను విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న ప్రైవేట్ కంపెనీపై స్పెషల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు కేసు నమోదు చేశారు.27న నామక్కల్, కరూర్లో విజయ్ పర్యటనసాక్షి, చైన్నె: మీట్ దీ పీపుల్ పేరిట ఇప్పటికే తమిళగ వెట్రి కళగం నేత విజయ్ రెండు విడతల పర్యటన ముగించారు. మూడో విడతగా నామక్కల్ , కరూర్లలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు సాగిన విజయ్ పర్యటనలకు అభిమాన సందోహం నుంచి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. డీఎంకేను టార్గెట్ చేసి విజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ రావడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితులలో ఈనెల 27వ తేదీన నామక్కల్, కరూర్లలో పర్యటించేందుకు విజయ్ నిర్ణయించారు. ఉదయం నామక్కల్, సాయంత్రం కరూర్లలో పర్యటనలకు సిద్ధమయ్యారు. ఇందు కోసం అనుమతులు, ఏర్పాట్లపై ఆ జిల్లాల తమిళగ వెట్రి కళగం వర్గాలు దృష్టి పెట్టాయి. అక్టోబరు 4న వేలూరు, రాణిపేట, 11నపుదుచ్చేరి, కడలూరులలో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించారు. ఇదిలా ఉండగా, విజయ్కు వ్యతిరేకంగా వ్యాఖ్యల తూటాలను పేల్చడమే కాకుండా, ప్రజా సమస్యలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే దిశగా ముందుకెళ్తున్న నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తాజాగా మరో వినూత్న నిరసనకు సిద్ధమయ్యారు. ఇది వరకు ఆయన గొర్రెలు, ఆవులతో సమావేశాలు, ఆ తర్వాత చెట్లతో సమావేశాలు నిర్వహించారు. ఈ పరిస్థితులలో 27వ తేదీన ధర్మపురిజిల్లాలోని కొండ కోనల్లోకి వెళ్లి నిరసనకు నిర్ణయించారు.మరో బెంచ్కు దురై మురుగన్ కేసుసాక్షి, చైన్నె: డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి దురై మురుగన్పై దాఖలైన అక్రమాస్తుల కేసును మరో బెంచ్కు మారుస్తూ హైకోర్టు ఆదేశించింది. 2006–2011 కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టుగా దురై మురుగన్పై కేసు నమోదైంది. వేలూరు కోర్టులో ఈ పిటిషన్పై తొలుత విచారణ జరిగింది. 2019లో ఈ కేసును వేలూరు నుంచి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ దురై మురున్ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ కేసులో 2017లో తనను నిర్ధోషిగా విడుదల చేశారని, ఆతదుపరి కేసును చైన్నెకు బదిలీ చేయడాన్ని తన పిటిషన్లో వ్యతిరేకించారు. ఈకేసును ప్రత్యేక కోర్టు విచారించేందుకు వీలులేదని సూచించారు. మంగళవారం పిటిషన్ విచారణకు రాగా, మరో బెంచ్కు న్యాయమూర్తి సిఫారసు చేశారు. -
మీ నేత విగ్రహాల కోసం ప్రజాధనమా?
సాక్షి, ఢిల్లీ: ‘‘మీ నేతలను కీర్తించేందుకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారు’’ అంటూ.. తమిళనాడు డీఎంకే ప్రభుత్వాన్ని(DMK Government) సుప్రీం కోర్టు నిలదీసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహం(Karunanidhi Statue) ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిధులను కరుణానిధి విగ్రహం కోసం ఉపయోగించడంపై సుప్రీం కోర్టు(Supreme Court Karunanidhi Statue) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్లతోకూడిన ధర్మాసం తమిళనాడు ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ‘‘అసలు విగ్రహ ఏర్పాటునకు ప్రభుత్వ నిధులను ఎందుకు ఉపయోగించాలి?. మీ మాజీ నేతలను కీర్తించడానికి ప్రభుత్వ నిధులను ఎందుకు ఖర్చు చేయాలి?’’ అని ప్రశ్నలు గుప్పించింది. ఈ క్రమంలో.. గతంలో మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఇచ్చిన ఉత్తర్వును సమర్థిస్తూ ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసింది. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యర్థనను ఉపసంహరించుకుని మళ్లీ హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసిందితిరునల్వేలి జిల్లాలోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రధాన రహదారిలో ఉన్న పబ్లిక్ ఆర్చ్ ప్రవేశ ద్వారం వద్ద దివంగత నేత కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. అయితే.. అది ప్రభుత్వ స్థలం. పైగా గతంలో హైకోర్టు ఈ తరహా నిర్మాణాలపై కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి కోర్టుల పర్మిషన్ అవసరం పడింది. అందుకే.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహాలు, నేమ్ బోర్డులు వంటి నిర్మాణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం, పైగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని అభిప్రాయపడుతూ మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే అక్కడా డీఎంకే ప్రభుత్వానికి చుక్కెదురైంది. ‘‘ప్రభుత్వ నిధులు ప్రజల అవసరాలకు ఉపయోగించాలి.. వ్యక్తిగత కీర్తి కోసం కాదు. పబ్లిక్ ప్లేస్లో విగ్రహాలు ట్రాఫిక్, భద్రత, ప్రజా అసౌకర్యానికి దారితీయవచ్చు. ప్రజల హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’’ అని ఇటు హైకోర్టు, ఆ తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పరువు నష్టం కేసులు.. ఇక ఆ టైం వచ్చింది! -
కన్నీళ్లే..ఆయుధాలై
కడలిలో తమిళ తంబీల ఆగడాలు ఇక చెల్లవంటున్నారు జిల్లా మత్స్యకారులు. నడిసంద్రంలో సమరానికి సై అంటున్నారు. మా ప్రాంతంలోకి వచ్చి మత్స్య సంపదను దోచుకుపోవడమే కాకుండా రూ.లక్షలు విలువజేసే వలలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోం.. ఇటువైపు కన్నెత్తి చూస్తే ఎదురుదాడులు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల మత్స్యకారులు సమావేశమై సోనాబోట్ల అంతుచూడాలని నిర్ణయించుకున్నారు. చేపల వేటతో పాటు నిబంధనలు ధిక్కరించే తమిళ జాలర్లను కూడా వేటాడేస్తామంటూ కదనరంగంలోకి దిగారు. ఇప్పటికే రెండు సోనాబోట్లను స్వాదీనం చేసుకున్నారు.ఒంగోలు, టాస్్కఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లా తడ వరకూ సుమారు 281 కిలోమీటర్లు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మత్స్యకారులు ప్రాణాలు పణంగా పెట్టి చిన్న బోట్లతో వేట సాగిస్తున్నారు. మత్స్య సంపదను తెచ్చుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వీరిపై మెకనైజ్డ్ (సోనా) బోట్లతో తమిళ జాలర్లు సమూహంలా వచ్చి మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. రూ.లక్షల విలువైన వలలను ధ్వంసం చేస్తున్నారు. మత్స్య సంపదను దోచుకెళ్లిపోతున్నారు. తమిళనాడుకు చెందిన కడలూరు జాలర్లతో మన మత్స్యకారుల సమరం నిత్యకృత్యంగా మారింది. చేపల కోసం వేట చేయడం ఒక ఎత్తైతే, సముద్రంలో తమిళ జాలర్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా మారింది. చిన్న ఇంజిన్ ఉన్న బోట్లతో సముద్రంలో తీరం నుంచి 8 కి.మీ. లోపలే వేట సాగించుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్లి వేట సాగించుకోవచ్చు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన జాలర్లు ఒడ్డు నుంచి 23 కి.మీ. అవతలి జలాల్లో మాత్రమే చేపల వేట చేసుకోవాల్సి ఉంటుంది. ఒడ్డు నుంచి సముద్రంలో 8 కి.మీ. వరకు మెకనైజ్డ్ బోట్లతో చేపల వేట చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. తమిళనాడులో వేల సంఖ్యలో ఈ రకం బోట్లు ఉన్నాయి. వీటిలో కనీసం 5 నుంచి 10 మంది వరకు మత్స్యకారులు ఉంటారు. అధునాతన వలలు, మారణాయుధాలతో మన ప్రాంతం వైపు వచ్చి దాడులు చేస్తున్నారు. వీరి నుంచి రక్షించాలని అధికారులను, పాలకులను కోరుతూ వస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు..స్వీయ వేట నిషేధం..మత్స్యకారులు ఎన్నోసార్లు జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవటంతో చివరకు మత్స్యకారులు తమ సమస్యను తామే పరిష్కరించుకోవటానికి నడుం బిగించారు. చిన్నబోటుతో చేపల వేటకు వెళితే సముద్రంలో 60 నుంచి 80 వరకు సోనాబోట్లు చేపల వేట సాగిస్తూ మత్స్య సంపద కొల్లగొట్టడంతో పాటు లక్షలాది రూపాయల వలలు ధ్వంసం చేసేవని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోనాబోట్ల కట్టడికి మన జిల్లాతోపాటు, పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన మత్స్యకార కాపులు ఈ నెల 11వ తేదీన సమావేశమయ్యారు.మూడు రోజుల పాటు వేట నిషేధం అని ప్రకటించారు. 12వ తేదీ రాత్రి గతంలో తాము వేటాడి నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచిన కడలూరుకు చెందిన సోనాబోటును తీసుకుని సుమారు 80 మంది జాలర్లు కర్రలు, కేట్బాల్స్, టపాసులు తీసుకుని తీరంలో సోనాబోట్ల వేట ప్రారంభించారు. ఆంధ్రా మత్స్యకారులు తమపై దాడికి వస్తున్నారని సమాచారం రావటంతో జాగ్రత్త పడ్డ కడలూరు జాలర్లు పారిపోయారు.నిషేధకాలం పూర్తయిన తరువాత నాలుగు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేట కొనసాగించగా ఈనెల 18వ తేదీ గురువారం రాత్రి సోనాబోట్లు తీరానికి దగ్గరగా వచ్చి లక్షలాది రూపాయలు వలలు తెంచుకుని చేపల వేట సాగించారు. ఈసారి కడలూరు బోట్లను వదిలేది లేదని నిశ్చయించుకున్నారు. తిరిగి 19వ తేదీ చేపల వేట నిషేధం అని మత్స్యకార గ్రామాల్లో రెండవసారి దండోరా వేయించారు.ఏడాదిన్నరగా నిరీక్షణ..కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మత్స్యకారుల సమస్యను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి దృష్టికి తీసుకుని వెళ్లారని, సీఎం చంద్రబాబు కూడా స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్న విషయం అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అయినా సంవత్సరం దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల విజ్ఞప్తితో అద్దెకు స్పీడ్బోటు తీసుకుని కొద్దిరోజుల పాటు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం మత్స్యకారుల బాధలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో విసుగు చెందిన మత్స్యకారులు సమస్యను వారే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. సోనాబోట్లపై ఎదురుదాడి..గురువారం రాత్రి తమిళ జాలర్లు దాడులు చేయడమే కాకుండా మన ప్రాంత మత్స్యకారులను అవమానించే రీతిలో వ్యవహరించారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు సమీపంలోని కొనపూడి సముద్రతీరంలో సోనాబోట్లతో చేపల వేట సాగిస్తున్న సమాచారం అందింది. వెంటనే రెండు జిల్లాల మత్స్యకారులు అక్కడకు బయలు దేరారు. వారిని అడ్డుకున్నారు. బోటును స్వాధీనం చేసుకుని విజయం సాధించారు. ఆ బోట్లలో మారణాయుధాలతో పాటు, 15 మంది వరకూ తమిళ మత్స్యకారులు ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా గత నెలలో సైతం తమిళజాలర్లను తరిమికొట్టి ఒక సోనాబోటును స్వా«దీనం చేసుకుని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచారు. సుమారు నెల రోజులు దాటినా ఇంత వరకు తమిళనాడు మత్స్యకారులు ఎవరూ ఈ బోటు కోసం వచ్చిన దాఖలాలు లేవని తెలిసింది. తాజాగా మరో బోటును కూడా స్వా«దీనం చేసుకుని దాన్ని కూడా జువ్వలదిన్నెకు తరలించినట్టు సమాచారం. ఇకపై ఎవరు సహకరించినా, సహకరించకపోయినా వెనక్కి తగ్గేదే లేదని ఇకపై తమిళనాడు సోనాబోట్లకు చుక్కలు చూపిస్తామని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. -
TVK: విజయ్ సంచలన వ్యాఖ్యలు
కోలీవుడ్ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించారాయన. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ప్రభాకరన్ మాస్టర్ మైండ్ అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా విజయ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నాగపట్టణంలో జరిగిన టీవీకే ప్రచార సభలో విజయ్ భావోద్వేగంగా ప్రసంగించారు. ‘‘ఈళం తమిళులు మన సంతతి వాళ్లు. వాళ్లు శ్రీలంకలో ఉన్నా.. ప్రపంచంలో ఏమూల ఉన్నా సరే.. తమ నాయకుడ్ని కోల్పోయిన బాధలో ఉండి ఉంటారు. ఆయన(ప్రభాకరన్ను ఉద్దేశించి..) వాళ్లకు తల్లి లాంటి ప్రేమను పంచారు. శ్రీలంక తమిళుల కోసం మనం గొంతెత్తడం మన బాధ్యత’’ అని ప్రసంగించారు.నాగపట్టణం శ్రీలంక సమీపంలో ఉండడం.. ఈళం తమిళుల సమస్య కారణంగా మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితం కావడం వల్ల విజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో మత్స్యకారుల సమస్యలపైనా ఆయన మాట్లాడారు. ‘‘మేం డీఎంకేలా ప్రభుత్వంలా సుదీర్ఘమైన లేఖలు రాసి.. ఆపై మౌనంగా ఉండిపోం. మత్య్సకారుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ఇది టీవీకే ప్రధాన అజెండా కూడా అని అన్నారు. మత్య్సకారుల జీవితాలు ఎంత ముఖ్యమో.. ఈలమ్ తమిళుల జీవితాలు కూడా మాకు అంతే ముఖ్యం అని అన్నారాయన. అయితే శ్రీలంక తమిళులకు విజయ్ మద్దతు ప్రకటించడం ఇదేం తొలిసారి కాదు. శ్రీలంక అంతర్యుద్ధ (2008 చివరి నుంచి 2009 మే వరకు) సమయంలో ఉత్తర శ్రీలంకలోని ముల్లివాయ్క్కాల్ ప్రాంతంలో సైన్యం చేతిలో తమిళులు ఊచకోతకు గురికావడం తీవ్ర దుమారం రేపింది. దీనికి నిరసగా చెన్నైలో జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో విజయ్ పాల్గొని శ్రీలంక తమిళులకు సంఘీభావం ప్రకటించారు. అయితే ఆ సమయంలో శ్రీలంక తమిళులకు మద్దతు ఇవ్వడం అంటే ఎల్టీటీఈకి మద్దతు ఇచ్చినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ.. గతంలో కరుణానిధి సహా తమిళనాడుకు చెందిన ఏ రాజకీయ నేత కూడా నేరుగా ప్రభాకరన్పై ఈ స్థాయిలో ప్రశంసలు గుప్పించిన దాఖలాలు లేవు. ప్రభాకరన్ను తాను ఉగ్రవాదిగా చూడడని.. అయితే ఈళం తమిళుల కోసం ఎల్టీటీఈ లక్ష్యాలు గొప్పవే అయినా.. ఆచరించే పద్దతులు సరికావంటూ కరుణానిధి బహిరంగంగానే చెబుతుండేవారు. అలాంటి విజయ్ ఇప్పుడు బహిరంగంగా ప్రభాకరన్పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్విజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ స్పందిస్తూ.. ప్రభాకరన్ LTTE అధినేతగా, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి అనే విషయం గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తిని పొగడటం భారత ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే. పైగా ఎల్టీటీఈపై భారత ప్రభుత్వ నిషేధం ఉంది. అలాంటప్పుడు ఆ గ్రూప్ అధినేతను పొగడడం చట్టపరంగా, నైతికంగా అనుచితం అని మాణికం ఠాగూర్ అన్నారు.ఎల్టీటీఈ ప్రస్థానంLTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం) అనేది 1976లో స్థాపితమైన ఒక సాయుధ సంస్థ. శ్రీలంకలో స్వతంత్ర తమిళ ఈళం ప్రాంతం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసింది. ఫలితంగా ఆ సంస్థకు, సైన్యానికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో వేలాది శరణార్థులుగా భారత్కు వచ్చారు. అయితే.. ఆ సమయంలో భారత ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (IPKF) పేరిట సైన్యాన్ని శ్రీలంకకు పంపించారు. మూడేళ్లపాటు అది ఆ సాయుధ సంస్థతో యుద్ధం చేసి 1990లో భారత్కు తిరిగి వచ్చేసింది. అయితే.. ఈ చర్యను ద్రోహంగా భావించిన ఎల్టీటీఐ ప్రతీకారం కోసం ఎదురు చూసింది. 1991లో శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన రాజీవ్ గాంధీ.. మానవ బాంబు జరిపిన ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఈ ఘటన తర్వాత అప్పటి భారత ప్రభుత్వం ఎల్టీటీఈని నిషేధించింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు LTTE అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరియు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మన్ కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. రాజీవ్ గాంధీని తామే హతమార్చినట్లు ఎల్టీటీఈ ఏనాడూ అధికారికంగా ఒప్పుకోలేదు. అలాగని ఖండించనూ లేదు. చివరకు 2009లో శ్రీలంక సైన్యం చేతిలో ఎల్టీటీఈ ఓడిపోవడమే కాకుండా.. ఆ గ్రూప్ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ హతమయ్యారు. అప్పటితో LTTE అంతరించిపోయింది. -
5000 ఏళ్లనాటి ఆట తిరిగి వచ్చింది!
5000 వేల ఏళ్ల క్రితం నాటి ఆట ఒకటి తమిళనాడులో పునరాగమనం చేయడమే కాదు బాగా పాపులర్ అవుతోంది. చోళుల కాలం నాటి ఈ ఆట పేరు... ఆట్య పట్య. శారీరక దారుఢ్యం, ఐక్యతకు అద్దం పట్టే ఈ ఆటను ‘నత్రినై’ అని కూడా పిలుస్తారు. తమిళ ప్రాచీన సాహిత్యంలో ఈ ఆటకు సంబంధించిన ఎన్నో విశేషాలు కనిపిస్తాయి.పదిహేనుమందితో రెండు జట్లు ఆడే ఈ ఆట చురుకుదనం, వ్యూహం, క్రమశిక్షణకి గీటురాయిగా నిలిచింది. పెద్దల నోటి నుంచి ఆట్య పట్య గురించి విన్న యువతరం వేల ఏళ్ల నాటి ఆటకు ప్రాణం పోశారు. తమిళనాడులోని వివిధ జిల్లాలలో యువతరమే కాదు పిల్లలు కూడా ఆట్య పట్య ఆడుతున్నారు. ఈ ఆట ఎలా ఆడాలి అనేదాని గురించి యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. -
విజయ్ ఇంట్లోకి చొరబడ్డ అగంతకుడు
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ఇంట్లోకి అగంతకుడు చొరబడడం కలకలం రేపుతోంది. ఈస్ట్ కోస్ట్ రోడ్లోని నీలంకరైలో విజయ్ ఇంటి అగంతకుడు టెర్రస్పై తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది ఆయన నివాసంలో బాంబ్ స్వ్కాడ్తో తనిఖీలు చేపట్టింది. ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, 24 ఏళ్ల మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. ఈ ఘటనను సంబంధించి ఓ పోలీసు సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మానసిక ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. గట్టి భద్రతా ఏర్పాట్లను దాటి ఆ వ్యక్తి విజయ్ ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగాడన్న దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.విజయ్కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ Y-కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. విజయ్.. గత శనివారం తిరుచ్చిలో రాష్ట్రవ్యాప్తంగా తన రాజకీయ పర్యటనను ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరగడంతో ఆయన భదత్రా విషయంలో అభిమానులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. -
విషాదం: విషవాయువులకు బలైన కార్మికులు
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఓల్డ్ పోర్టు వద్ద.. బుధవారం బార్జ్ లోపల బ్యాలస్ట్ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా ముగ్గురు పారిశుధ్య కార్మికులు మరణించారు. ట్యాంక్లోని విష వాయువును పీల్చడం వల్లనే వారు చనిపోయినట్లు అధికారులు దర్యాప్తులో తెలిపారు.ఈ ఘటనలో చనిపోయిన కార్మికులు రాజస్థాన్కు చెందిన సందీప్ కుమార్ (25), తూత్తుకుడి జిల్లాలోని పున్నకాయల్కు చెందిన జెనిసన్ థామస్ (35), తిరునెల్వేలి జిల్లాలోని ఉవరికి చెందిన సిరోన్ జార్జ్ (23)గా గుర్తించారు.ట్యాంక్లో నీరు నిలిచిపోవడం వల్ల విషపూరిత వాయువు పేరుకుపోయాయి. ట్యాంక్లోని విషవాయువులను బయటకు పంపించానికి ముందే.. ముగ్గురు వ్యక్తులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే లోపలికి ప్రవేశించారని భావిస్తున్నారు. అంతే కాకుండా పని అప్పగించడానికి ముందే.. కార్మికులకు ఎటువంటి భద్రతా సామగ్రి ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.మొదటి వ్యక్తి లోపలి వెళ్లిన తరువాత ఉలుకూపలుకు లేకుండా ఉండిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన రెండో వ్యక్తి, రెండో వ్యక్తి కోసం వెళ్లిన మూడో వ్యక్తి.. ముగ్గురు ఈ విషవాయువుల ప్రభావానికి బలయ్యారని అధికారులు వెల్లడించారు. వారి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ పోలీస్ స్టేషన్కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ మదన్ నేతృత్వంలోని పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.ఈ సంఘటన తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల మత్స్యకార గ్రామాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. పున్నకాయల్, అలందలై, మనప్పాడు, ఉవరి ప్రతినిధులు బార్జ్ యజమాని, కెప్టెన్, బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్కు ఒక వినతిపత్రం సమర్పించారు. అంతే కాకుండా మృతుల కుటుంబాలు.. మృతదేహాలను స్వీకరించడానికి నిరాకరించాయి. ఒక్కొక్కరికి రూ.4 కోట్లు, మొత్తం రూ.12 కోట్లు పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. కార్మికుల రక్షణ కోసం పరికరాలను అందించడంలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని వారు ఆరోపించారు. -
సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అరవ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది డీఎంకేకు ప్రచారంగానే కాకుండా.. అటు ప్రత్యర్థి విజయ్ టీవీకే పార్టీకి కౌంటర్గానూ ఉందన్న చర్చ నడుస్తోందక్కడ. తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ట్రెండ్కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ విభాగాల క్రియేటివిటీతో ‘పొలిటికల్ డిజిటల్ వార్’ ఇప్పుడక్కడ హాట్ టాపిక్గా మారింది. మైకుల్లో మాటలు, సోషల్ మీడియాలో పోస్టులకు అదనంగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. పైగా ప్రత్యర్థులను నేరుగా విమర్శించాల్సిన అవసరం లేకుండానే ఆ సెల్ఫ్ ప్రమోషన్ వీడియోలు భలేగా ఉపయోగపడుతున్నాయి పార్టీలకు. తాజాగా.. విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను రిలీజ్ చేసింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై విజయ్పై ప్రశంసలు గుప్పించినట్లు ఉంది. అదే సమయంలో తన సొంత పార్టీ డీఎంకే విధానాలను విమర్శించినట్లుగా ఉంది. ఈ వీడియో తమిళనాట నిన్నంతా ట్రెండింగ్లో కొనసాగింది. அண்ணாவின் வழியில்... தம்பி விஜய் ஆட்சி! என்று எல்லோரும் சொல்லட்டும்."தமிழக வெற்றிக்கழகம் வெல்லட்டும்" pic.twitter.com/jyh4SoxTrz— TVK IT Wing Official (@TVKHQITWingOffl) September 15, 2025ఈ పరిణామంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్ఫేక్ వీడియోలతో విజయ్ టీవీకే పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి శరవణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ ఉపయోగించడం బాధాకరమని అన్నారాయన. ఈ క్రమంలో బీజేపీతో డీఎంకే రహస్య బంధంలో ఉందంటూ విజయ్ చేస్తున్న ఆరోపణలనూ శరవణన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగానే.. విజయ్ టీవీకే పార్టీ పెరియార్ సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించలేదు. కానీ ఆయన భావజాలం నుంచి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం వంటి అంశాలను మాత్రం తీసుకుంటానని విజయ్ బహిరంగంగానే చెప్పాడు. ఈ క్రమంలో పెరియార్ ఫొటో దీంతో తాజా ఏఐ జనరేటెడ్ వీడియోతోతద్వారా స్టాలిన్ రాజకీయ నేరేటివ్ను తిరిగి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పోనుపోను ఈ డిజిటల్ క్యాంపెయిన్ వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదు!.தந்தை பெரியார் - இனப்பகையைச் சுட்டெரிக்கும் பெருநெருப்பு! தமிழினத்தின் எழுச்சிக்கான பகுத்தறிவுப் பேரொளி!தந்தை பெரியார் என்றும் - எங்கும் நிலைத்திருப்பார்!#PeriyarForever #Periyar #SocialJusticeDay pic.twitter.com/B4RvgXCgzH— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 17, 2025 -
‘‘రజినీ సర్.. ఆయన మీలా ప్యాకేజీ స్టార్ కాదు’’
తమిళనాడు రాజకీయాల్లో మామూలుగా హీటెక్కలేదు. వచ్చే ఎన్నికల్లోనూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధిస్తుందంటూ సూపర్స్టార్ రజినీకాంత్ చేసిన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇవి మరో అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అభిమానులకు సాధారణంగానే మంట పుట్టించాయి.స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్.. ఎంకే స్టాలిన్పై రజినీ కురిపించిన ప్రశంస ఇది. ‘‘స్టాలిన్ తమిళనాట మాత్రమే కాదు భారతీయ రాజకీయాల్లో ఓ ధృవతార. కేంద్రంలోని ప్రభుత్వానికి మాత్రమే కాదు.. పాత, కొత్త ప్రత్యర్థులకు ఇప్పుడు ఆయన ఓ సవాల్గా మారారు. నా స్నేహితుడు తన మార్క్ చిరునవ్వుతోనే రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నారు’’ అంటూ ఓ ఈవెంట్లో రజినీకాంత్ వ్యాఖ్యానించారు. అయితే..అన్నింటికీ మించి.. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. ఎలాంటి తుఫానునైనా తట్టుకునే శక్తి ఉంది ఓ బలమైన కామెంట్ చేశారు. ఈ ఎఫెక్ట్తో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఊగిపోతున్నారు. అందుకు కారణం.. రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక్కరోజు ముందు విజయ్ తన రాజకీయ పార్టీకి కీలకమైన ప్రస్థానం ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి ప్రజా యాత్ర (మీట్ ది పీపుల్) ప్రారంభించారు. ఆ సభలో అలవి కాని హామీలిచ్చారంటూ డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో తాజా రజినీకాంత్ కామెంట్లు విజయ్ను ఉద్దేశించి చేసినవేనన్న చర్చ ప్రముఖంగా నడుస్తోందక్కడ.దళపతినే అంటారా?.. రజినీ కామెంట్లతో అరవ రాజకీయంలో స్టార్ వార్ మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కామెంట్లు చేసిన టైంలో మరో సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా అక్కడే నవ్వుతూ కనిపించారు. కమల్ ఇప్పటికే డీఎంకే కూటమికి మద్దతు అనే సంగతి తెలిసిందే. దీంతో.. రాజకీయంగా అడుగులు వేయలేని వాళ్లు, సొంతగా పార్టీని నడిపించుకోలేని వాళ్లు.. ఒంటరిపోరుకు సిద్ధమైన విజయ్ను విమర్శించడమా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి తోడు..మొన్నటిదాకా బీజేపీకి సపోర్ట్గా మాట్లాడిన రజినీకాంత్.. ఇప్పుడు అనూహ్యంగా డీఎంకేకు అనుకూలంగా మాట్లాడడం ఆయన డబుల్ స్టాండర్డ్కు నిదర్శనమని, రీల్లో సూపర్స్టార్ అయినప్పటికీ రియల్ లైఫ్లో రజినీకాంత్ ప్యాకేజీ స్టార్ అని, విజయ్ అలా ప్యాకేజీ స్టార్ ఏనాటికి కాబోరని తిట్టిపోస్తున్నారు.సూపర్ స్టార్ ట్యాగ్తో మొదలై..స్టార్డమ్ పెరిగిపోయే క్రమంలో.. రజనీకాంత్ అభిమానులతో విజయ్ అభిమానుల వైరం మొదలైంది. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అది మరింత ముదురుతూ వస్తోంది. గతంలో సినిమా ఈవెంట్లలోనూ స్టేజ్ మీద రజినీకాంత్ ‘‘కుక్క, కాకి’’ అంటూ ఏవో పిట్టకథలతో తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆ సమయంలో విజయ్ అభిమానులు ఆయన్ని టార్గెట్ చేసేవారు. అంతేకాదు స్వయంగా విజయ్ కూడా అంతే సెటైరిక్గా తన సినిమా ఈవెంట్లలో ఆ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.ఈ క్రమంలో.. కిందటి ఏడాది విల్లుపురంలో జరిగిన టీవీకే తొలి మహానాడు తర్వాత రజినీకాంత్ విజయ్ను ప్రశంసించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఈలోపే.. రాజకీయాల్లో తన ప్రధాన ప్రత్యర్థిగా విజయ్ ప్రకటించిన డీఎంకే, స్టాలిన్ను రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తడంతో పరిస్థితి మళ్లీ మునుపటికి వచ్చింది.రజినీ వెనకడుగులు.. 1995–1996.. రజినీకాంత్ హవా కొనసాగుతున్న రోజులు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆయన తొలిసారిగా పెదవి విప్పారు. అప్పటి జయలలిత ప్రభుత్వంపై అవినీతి విమర్శలు గుప్పిస్తూ.. డీఎంకేకు మద్దతు ప్రకటించారాయన. ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయంలో ఆయన మద్దతూ కీలకంగా మారింది. అయితే..2000 నుంచి దశాబ్దం పాటు ఆయన రాజకీయాలపై మౌనం పాటించారు. బాబా సినిమా టైంలోనూ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం విస్తృతంగా నడిచినప్పటికీ.. ఆయన కేవలం సామాజిక అంశాలపై మాత్రమే స్పందిస్తూ వచ్చారు. దీంతో రజినీ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. చివరకు..అయితే పాతికేళ్ల అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ.. 2017 డిసెంబర్ 31వ తేదీన రజినీకాంత్ నుంచి రాజకీయ పార్టీ స్థాపన ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. 2020 టైంలో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ సమయంలో తమిళనాట కోలాహాలం నడిచింది. అదే సమయంలో.. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడడం, మరోపక్క కరోనా విజృంభణతో ఆయన వెనకడుగు వేశారు. తన ఆరోగ్య కారణాల రిత్యా రాజకీయ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఆయన అభిమానులు చల్లబడ్డారు.అయితే.. అప్పటి నుంచి రాజకీయంగా మాత్రం ఆయన తన అభిప్రాయాలను స్వేచ్ఛగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో కొన్నాళ్ల కిందట ఓ ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.విజయ్ సూటిగా.. తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (Thalapathy Vijay).. గత దశాబ్ద కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు వంటి చర్యల ద్వారా రాజకీయంగా చురుకుగా ఉన్నారు. అవినీతి, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తమిళనాడుకు మౌలిక మార్పు అవసరం అని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారాయన. ఈ క్రమంలో ఆయన ఏనాడూ.. ఏ పార్టీకి మద్దతు ప్రకటించింది లేదు. అయితే.. ఆయన అభిమాన సంఘాలు(Vijay Makkal Iyakkam) మాత్రం 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో.. నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాలపై ఆయన తన సినిమాల్లో సెటైర్లు ఉండేలా చూడడంతో కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకమనే చర్చ నడిచింది. అయితే.. డీఎంకేను రాజకీయ విరోధిగా, బీజేపీని సైద్ధాంతిక విరోధిగా పేర్కొంటూ 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళగ వెట్రి కళగం (TVK) అనే పార్టీని స్థాపించారు.తాము ఏ కూటమికి చెందిన వాళ్లం కాదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం సింహం సింగిల్గానే వస్తుందని.. అధికారం కోసం జరుగుతున్న పోరులో పొత్తు కోసం కలిసొచ్చే పార్టీలకు ఆహ్వానమంటూ బహిరంగంగా చిన్నపార్టీలను ఆహ్వానించారాయన. ఏమిటీ ప్యాకేజీ గోల?!అధికార డీఎంకే కుటుంబానికి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గతకొన్నేళ్లుగా అక్కడి అగ్ర హీరోలతో బిగ్డీల్(కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు, బోనస్గా కాస్ట్లీ గిఫ్ట్లు కూడా) కుదుర్చుకుని వరుస ప్రాజెక్టులు చేస్తూ వస్తోంది. ఈ లిస్ట్లో రజినీకాంత్, కమల్హాసన్లు కూడా ఉండడం గమనార్హం. రాజకీయంగా తమ ఎదుగుదలకు ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో వాళ్లను ఇలా బుజ్జగిస్తోందని ముమ్మర ప్రచారం నడిచింది. తమిళనాట తమకు ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ మధ్యే ఎన్నికలు జరగాలని డీఎంకే తొలి నుంచి భావిస్తోంది. రజినీకాంత్ కంటే విజయ్కు తమిళనాట ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. దీంతో సొంత పార్టీ ప్రకటన కంటే ముందే ఆయన్ను తమ వైపునకు తిప్పే ప్రయత్నమూ డీఎంకే చేసింది. కానీ రాజకీయ అడుగులు వేయాలని బలంగా ఫిక్స్ అయిన విజయ్ ఆ ప్యాకేజీకి ఒప్పుకోలేదని.. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారన్నది ఆ ప్రచార సారాంశం(దీనిని విజయ్ ఫ్యాన్సే నడిపించారనే టాక్ కూడా ఉంది). ఇక.. ఏడాదిన్నర కాలంగా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తరచూ విమర్శలు గుప్పించడం.. తాజా మధురై మానాడులో అంకుల్ అని స్టాలిన్ను సంబోధిస్తూ విజయ్ విమర్శలు చేయడాన్ని డీఎంకే సీరియస్గా భావించింది. ఈ క్రమంలోనే కేసులతో ఇబ్బంది పెడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోందక్కడ. అయితే.. ఇంత సీరియస్ ఆరోపణలపై ఇటు రాజకీయంగా గానీ, అటు సినిమాలపరంగానూ ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్! -
ప్రత్యేక బస్సులో విజయ్ తమిళనాడు రాష్ట్ర పర్యటన
-
కచ్చతీవుపై ఆగని రచ్చ
భారతీయుల దృష్టంతా ఉత్తరాన చైనా లోని తియాన్జిన్పై ఉన్న సమయంలో, దక్షిణపు పొరుగు దేశం సడీచప్పుడు లేకుండా ఓ సందేశాన్ని పంపింది. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె ఇటీవల జాఫ్నా సందర్శించారు. ఒకే ఏడాదిలో దిస్సనాయకె ఆ రాష్ట్రాన్ని నాల్గవసారి సందర్శించడమే ఒక రికార్డు అనుకుంటే, ఆయన అక్కడ నుంచి నౌకా దళానికి చెందిన ఒక స్పీడు బోటులోబంజరు దీవి కచ్చతీవుకు వెళ్ళి మరో రికార్డు సృష్టించారు. శ్రీలంక అధ్యక్షుడు ఒకరు ఆ దీవిని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ద్వారా ఆయన శ్రీలంక భూభాగపు హద్దును స్పష్టంగా పేర్కొన్నట్లు అయింది. శ్రీలంకదే అని ఒప్పుకొన్నప్పటికీ...కచ్చతీవు శ్రీలంకలో భాగమే! పాక్ జలసంధిలోని ఈ చిన్న భూభాగంపై పొరుగు దేశపు క్లయిమును భారత్ అంగీకరించింది. ఆ మేరకు రెండు దేశాల మధ్య 1974లో ఒక అంగీకారం కుదిరింది. ఈ అంగీకారం 1976లో మరో అంగీకారానికి దారితీసింది. అది రెండు దేశాల మధ్య సాగర జలాల సరిహద్దును నిర్దేశించింది. అయినప్పటికీ, రామేశ్వరం–జాఫ్నాల మధ్యనున్న ఈ దీవి, భారత–శ్రీలంక సంబంధాలలో అడపాదడపా చిచ్చు రేపుతూనేఉంది. బ్రిటిష్ హయాంలోనూ, స్వాతంత్య్రానంతర కాలంలోనూ భారత్ మ్యాప్లలో దాన్ని ఒక భాగంగా ఎన్నడూ చూపలేదు. రామే శ్వరంలోని జాలర్ల కోపతాపాలను చల్లార్చేందుకు, తమిళనాడు రాజ కీయ నాయకులు మాత్రం ఆ నిర్జన దీవిని తిరిగి ‘వెనక్కి తీసు కోవడం’ గురించి తరచూ గొంతెత్తుతూ ఉంటారు. తమిళనాడు జాలర్లు చేపల వేటకు అనుసరిస్తున్న ‘బాటమ్ ట్రాలింగ్’, ‘పర్స్ సైన్’, ‘డబుల్ నెట్’ వంటి పద్ధతుల వల్ల చేపలు ఇక ఏమాత్రం లభ్యంకాని స్థితి ఏర్పడింది. శ్రీలంక వైపు వనరులు ఎక్కువ ఉండటానికి కారణం, 30 ఏళ్ళ అంతర్యుద్ధ సమయంలో, జాఫ్నా జాలర్లు దూర ప్రాంతాల్లో చేపల వేటకు సాహసించకపోవ డమే! దాంతో శ్రీలంక వైపు చేపల వేట భారతీయ జాలర్లకు ఆకర్షణీ యమైనదిగా మారింది. ఫలితంగా, వారిని శ్రీలంక నౌకా దళం అరెస్టు చేయడం, వారి బోట్లను, వలలను స్వాధీనపరచుకోవడం పరిపాటిగా మారింది. విజయ్ వ్యాఖ్యలతో మరోసారి...గంగపుత్రులకు ప్రత్యామ్నాయ జీవనోపాధులను సృష్టించవల సిందిపోయి వారి సమస్యలన్నింటికీ పరిష్కారం కచ్చతీవును స్వాధీనపరచుకోవడమే అన్న భ్రమను తమిళ నాయకులు పెంచి పోషిస్తూ వచ్చారు. ‘తమిళిగ వెట్రి కళగం’ పార్టీని ప్రారంభించిన సినీ నటుడు విజయ్ కూడా నిన్నగాక మొన్న అదే పల్లవిని అందు కున్నారు. ఇంతవరకు ఆయన నిర్వహించిన ర్యాలీలన్నింటిలోకెల్లా ఇటీవలి మదురై ర్యాలీని అతి పెద్దదిగా చెప్పాలి. రాష్ట్ర జాలర్లకు ‘చిన్న పని చేసి పెట్టండి చాలు’, ‘ఈ దీవి మనదేనని క్లయిముచేస్తే మన జాలర్లు సురక్షితంగా ఉంటారు’ అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, అదే భ్రమను కొనసాగించడంలో తాను కూడా ఒక చేయి వేశారు.కచ్చతీవును ‘తిరిగి’ తెచ్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు నాలుగు తీర్మానాలు చేసింది. శ్రీలంకతో కుదిరినఅంగీకారాన్ని ‘రాజ్యాంగ విరుద్ధమైనది’గా పేర్కొంటూ రద్దు చేయవలసిందని కోరుతున్న కేసులు కొన్ని సుప్రీం కోర్టు ముందు న్నాయి. కచ్చతీవును కాంగ్రెస్ ‘నిర్లక్ష్యపూరితం’గా శ్రీలంకకు అప్ప గించిందని 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం ద్వారా ప్రధాన మంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అగ్నికి ఆజ్యం పోశారు. కచ్చతీవును వెనక్కి తీసుకోవడం తమిళ జాలర్ల సమస్యలను పరిష్కరిస్తుందనే మాటే నిజమైతే, తమిళ చేపల బోట్లు కచ్చాతీవును దాటి, శ్రీలంక తూర్పు కోస్తా వరకు ఎందుకు వెళ్తున్నట్లు? విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్, ‘‘రాజకీయ వేదికల నుంచి చేసే ప్రసంగాలను’’ చెవికెక్కించుకోవ ద్దంటూ శ్రీలంక పౌరులను కోరారు. దిస్సనాయకెకు కలిసొచ్చింది!కచ్చతీవును సందర్శించడం స్వదేశంలో దిస్సనాయకెకు చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పార్టీకి సహాయపడటం ఖాయం. తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నాలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాన్ని ఆయన పార్టీ కొనసాగిస్తోంది. అంతర్యుద్ధ సమయంలో, తమిళ ఉగ్ర సంస్థలకు ఉదారంగా సహాయపడిన, ఆవలి వైపునున్న తమిళ సోదరులు, ఇపుడు తమకే ఎసరు పెడుతున్నారనే భావన జాఫ్నా తమిళులలో పాదుకొంది. కచ్చతీవు దీవిలో కాలు మోపడం ద్వారా, తాను శ్రీలంక తమిళ జాలర్ల పక్షాన ఉన్నానని దిస్సనాయకె చాటుకున్నట్లు అయింది. దిస్సనాయకె ప్రతిష్ఠ కొద్ది నెలలుగా మసకబారుతూ వస్తోంది. ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తామని,కఠినంగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ షరతులలో మార్పులు కోరతామని వాగ్దానం చేయడం ద్వారా ఎన్పీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, అది ఇంతవరకు ఉన్నపరిస్థితులు మరింత దిగజారకుండా మాత్రమే నిర్వహించగలుగుతోంది. ఈ నేపథ్యంలో, కచ్చతీవు భూభాగం తమదేనని దిస్సనాయకె చాటుకోవడం, ఆయన ప్రభుత్వానికి ప్రధాన అండగా ఉన్నసింహళ జాతీయులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. భారత్ పట్ల మరీ మెతకగా వ్యవహరిస్తున్నారని నిందిస్తున్న స్వదేశంలోని విమర్శకులకు కూడా దిస్సనాయకె సందేశం పంపినట్లయింది. భారతదేశంతో రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఆయన విమర్శల పాలయ్యారు. మొత్తానికి, శ్రీలంక ప్రయోజ నాలకు కట్టుబడిన వ్యక్తిగా దిస్సనాయకె తనను తాను చాటుకో గలిగారు.సముద్రంపై జీవనం సాగించేవారికి సెయింట్ ఆంటొని ఆరాధనీయుడు. ఆయన స్మారక ప్రార్థనా మందిరం కచ్చతీవులో శతాబ్దంపైగా నిలిచి ఉంది. అంతర్యుద్ధం అంతమైన తర్వాత, ప్రార్థనా మందిరం కొత్త రూపురేఖలను సంతరించుకుంది. ఇంతా చేసి, 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పు కలిగిన కచ్చతీవు పర్యాటక ప్రదేశంగా పరిణమించవచ్చు. కానీ, తమిళనాడు నుంచి సన్నాయి నొక్కులు మాత్రం ఆగకపోవచ్చు. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - నిరుపమా సుబ్రమణియన్ -
భార్య, ఆమె ప్రియుడి తలలతో జైలుకు
వేలూరు: భార్య, ఆమె ప్రియుడిని అతి దారుణంగా చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా మలై కొట్టాలంకు చెందిన కొలంజి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి(46)కి, అదే గ్రామానికి చెందిన తంగరాసు(39)తో కొంత కాలంగా సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం తెలియడంతో కొలంజి వారిని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో తంగరాసు బుధవారం అర్ధరాత్రి కొలంజి ఇంటిపైన లక్ష్మిని కలిశాడు. వారిని గమనించిన కొలంజి.. తీవ్ర ఆగ్రహావేశంతో ఇంట్లోని కత్తితో ఇద్దరి తలలను నరికాడు. వాటిని బ్యాగులో వేసుకొని గురువారం తెల్లవారుజామున బస్సులో వేలూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. వెంటనే వారు కల్లకుర్చి పోలీసులకు సమాచారమిచ్చారు. కల్లకుర్చి పోలీసులు కేసు నమోదు చేసి.. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొలంజిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!
విమర్శలు, వ్యంగ్యాస్త్రాలను(ట్రోల్స్+మీమ్స్) పట్టించుకోకుండా తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం దిశగా సినీ హీరో విజయ్ అడుగులేస్తున్నారు. మీట్ ది పీపుల్ పేరిట ఈ శనివారం నుంచి రాష్ట్ర పర్యటనలు చేపట్టనున్నారు. అయితే జనాల్లోకి వెళ్లే క్రమంలో.. తమిళనాడు డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. తన పర్యటనల రిత్యా అవసరమైన భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకే దిగారాయన. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK)కు బలమైన పునాది వేయడం మాత్రమే కాదు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో అధికార కైవసమే లక్ష్యంగా విజయ్ అడుగులేయబోతున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన తిరుచ్చి నుంచి ప్రత్యేక ప్రచార రథం బయల్దేరనుంది. అలా మొత్తం 38 జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలతో (సభలు, సమావేశాలు, ర్యాలీలు, ముఖాముఖి, రౌండ్ టేబుల్ మీటింగ్స్) నిర్వహిస్తుంది. డిసెంబర్ 20వ తేదీన మధురైలో సభ ద్వారా టీవీకే విజయ్ మీట్ ది పీపుల్ పర్యటన ముగియనుంది. అయితే.. టీవీకే చర్యలతో అధికార డీఎంకే నేతలకు నిద్రలేకుండా పోతోందని విజయ్ అంటున్నారు. టీవీకే కేడర్పై వరుసగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారాయన. ఆ పార్టీ కార్యదర్శి ఆనంద్తో పాటు తిరుచ్చి పార్టీ విభాగం నేతలపైనా తాజాగా కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ పరిణామంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకేకు అధికారంలో ఉన్నపార్టీ భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. డీఎంకే ఇప్పుడు టీవీకే గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. 24 గంటలూ అదే ఆలోచనతో ఉంటోంది. ఆ పార్టీ నేతలకు నిద్ర కరువైంది. ఈ క్రమంలోనే పోలీసులపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తోంది. కొంపదీసి.. టీవీకేకు డీఎంకే భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. తమిళనాడు రాజకీయాల్లో తారలకు ప్రజలు అధికారం కట్టబెట్టడం కొత్తేం కాదు. శివాజీ గణేషన్, విజయ్కాంత్, శరత్కుమార్, కమల్హాసన్.. ఇలా ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రజినీకాంత్ లాంటి భారీ ఫ్యాన్ఫాలోయింగ్ ఉన్న తార ఆ దిశగా అడుగు వేసినట్లే వేసి.. వెనక్కి వెళ్లిపోయారు. అయితే.. ఎంజీఆర్, జయలలిత ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్లందరితో పోల్చుకుంటే.. విజయ్కు ఇప్పుడున్న మాస్ ఫాలోయింగ్ చాలాచాలా ఎక్కువే. ఆ అభిమానాన్నే ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నారు.తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, విజయ్ చేపట్టిన “మీట్ ది పీపుల్” పర్యటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ గత ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టి, రెండు మానాడు(మహానాడు)లను విజయవంతంగా నిర్వహించారు. మదురైలో జరిగిన రెండో మహానాడులో ప్రజల మధ్యకి వస్తున్నట్టు ప్రకటించి.. రాజకీయ ప్రత్యర్థి డీఎంకే, సైద్ధాంతిక విరోధి బీజేపీ లతోనే తమ పోరాటం అని కుండబద్దలు కొట్టారు. తాను, తన టీవీకే ఏ కూటమిలో భాగం కాబోమని.. కలిసొచ్చే పార్టీలకు రేపు అధికారం గనుక దక్కితే వాటా ఇస్తామని చెప్పారు. విజయ్ ఈ ప్రకటన అక్కడి రాజకీయాల్లో అలజడి రేపింది. పలు పార్టీలోని సీనియర్ నేతలు విజయ్ ఆఫర్కు టెంప్ట్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అసంతృప్త నేతలతో పాటు ఓట్ షేరింగ్ ఉన్న పార్టీలు, కుల ఓట్లను రాబట్టే పార్టీలు సైతం విజయ్ టీవీకేతో కూటమిగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. ప్రజల సమస్యలపై నేరుగా స్పందించేందుకు, వారి అభిప్రాయాలను స్వీకరించేందుకు ఈ పర్యటనను ప్రజా ఉద్యమంగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ మీట్ ది పీపుల్పై అధికార డీఎంకే ఓ కన్నేసింది. విజయ్ పర్యటనను నిశితంగా పరిశీలించాలని, ప్రత్యర్థి వ్యూహానికి చెక్ పెట్టేలా పునరాలోచనలు చేయాలని ఆ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ సీనియర్లకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే టీవీకే కేడర్పై ఈ సమయంలోనే కేసులు నమోదు అవుతుండడంతో డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విజయ్ మాత్రం ఇలాంటివాటికి వెనకడుగు వేయబోనని అంటున్నారు. 1967లో అన్నాదురై కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొట్టినట్లు.. 1977 అన్నాడీఎంకేతో ఎంజీఆర్ డీఎంకేను గద్దె దించినట్లు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుతో అధికారం కైవసం చేసుకుని తానూ చరిత్ర సృష్టిస్తానని చెబుతున్నారు. జనంలోకి వెళ్తున్న విజయ్.. రెండు నెలలపాటు నాన్స్టాప్ పర్యటనలు చేపట్టబోతున్నారు. మొదటి విడతలో 10 జిల్లాల్లో పర్యటించేందుకు రూట్మ్యాప్ సిద్ధం చేశారు. శనివారం కీలక కార్యక్రమాలు జరుగుతాయి. ఆదివారం ఒకే ఒక్క కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యలో సెప్టెంబర్ 27, అక్టోబర్ 25వ తేదీన చెన్నైకి విజయ్ చేరుకుంటారు. పార్టీ ప్రకటన నుంచి మానాడు విజయవంతం దాకా.. విజయ్ వెంట నడిచింది యువతే. కాబట్టి యువత మద్దతుతోనే తన పర్యటనలను విజయవంతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: విజయ్ టీవీకే.. ఆ పార్టీకే ఫ్లస్ -
తమిళనాడులో షాకింగ్ ఘటన.. మహిళను చెట్టుకు కట్టేసి..
కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి.. దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో పాటు వివస్త్రను చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.‘‘నువ్వు కుక్కతో సమానం’’ అంటూ బాధితురాలిని ఓ మహిళ అసభ్యకరంగా తిడుతుండగా, మరొకరు కర్రతో దాడి చేశారు. మరొ మహిళ ఆమె జట్టుపట్టుకుని లాగుతూ.. బాధితురాలి జాకెట్ను చించివేసింది. ఒక మహిళ ఈ దాడిని వీడియో తీస్తూ.. ఇలా చేస్తే జైలుకెళ్తారంటూ హెచ్చరించినా కూడా మిగతా వారు పట్టించుకోలేదు. సమారు 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఫుటేజ్ వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు మహిళలో ఒకరు అరెస్టు కాగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.భూ వివాదం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వారిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. దాడికి కుల వివక్ష కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వారసుడొచ్చాడు.. ఎవరీ ఇన్బన్?
హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' అక్టోబర్ 1న ధియేటర్లలో విడుదల కానుంది. తమిళనాడులో ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ విడుదల చేస్తున్నట్టు ధనుష్ 'ఎక్స్'లో వెల్లడించారు. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థను ప్రస్తుతం తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ స్థాపించారు. సినిమాల నిర్మాణం, పంపిణీ చేస్తుంటుంది రెడ్ జెయింట్ మూవీస్. అయితే తాజా ప్రకటనలో ఉదయనిధి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇన్బన్ ఉదయనిధిని (Inban Udhayanidhi) సమర్పకుడిగా అందులో పేర్కొన్నారు. రెడ్ జెయింట్ మూవీస్ కొత్త సీఈవో అతడేనని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి గురించి ఆరా మొదలైంది.ఎవరీ ఇన్బన్?ఇన్బన్ ఉదయనిధి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధినేత కరుణానిధి (Karunadhini) ముని మనవడు. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు మనవడు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుమారుడు. చిన్న వయసులోనే రెడ్ జెయింట్ మూవీస్ సీఈవోగా బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. ఉదయనిధి 2002లో కిరుతిగను వివాహం చేసుకున్నారు. వారి ఇద్దరు పిల్లలు ఇన్బన్, తన్మయ. ప్రస్తుతం ఇన్బన్ వయసు 20 ఏళ్లు.రొనాల్డో ప్రేరణతో..ఫుట్బాల్ ఆటగాడైన ఇన్బన్.. భారత ఫుట్బాల్ క్లబ్ నెరోకాతో డిఫెండర్గా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రేరణతో అతడు ఫుట్బాట్ను సీరియస్గా తీసుకున్నాడు. రియల్ మాడ్రిడ్ టీమ్కు వీరాభిమాని అని టైమ్స్ ఇండియా వెల్లడించింది. 'రొనాల్డో ఆటలో దూకుడు, అకింతభావం అంటే నాకెంతో ఇష్టం. రియల్ మాడ్రిడ్ మిడ్ఫీల్డర్లు లూకా మోడ్రిక్, సెమిరో తమ జట్టు కోసం పడే శ్రమ నన్ను ఆకట్టుకుంది. రియల్ మాడ్రిడ్ (Real Madrid) మ్యాచ్లన్నీ చూస్తాను. వారి ప్రత్యర్థుల మ్యాచ్లను కూడా చూస్తాన'ని అతడో సందర్భంలో చెప్పాడు.ప్రేమించడానికి భయపడొద్దుసినిమా పరిశ్రమలో అడుగు పెట్టడానికి చాలా కాలం ముందే ఇన్బన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ యువతితో తాను కలిసివున్న ఫొటోలు 2023లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎదుర్కొన్నాడు. అయితే దీని గురించి అతడు ఎక్కడా మాట్లాడలేదు. ఇన్బన్ తల్లి కిరుతిగ ఉదయనిధి (Kiruthiga Udhayanidhi) మాత్రం ట్విటర్లో నర్మగర్భంగా స్పందించారు. 'ప్రేమించడానికి, దాన్ని వ్యక్తీకరించడానికి భయపడవద్దు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మార్గం' అంటూ ఆమె ట్వీట్ చేశారు. కొడుకును వెనుకేసుకొచ్చేలా కిరుతిగ ట్వీట్ ఉందని అప్పట్లో జనాలు అనుకున్నారు. చదవండి: ఆరాటం ముందు ఆటంకం ఎంతహీరో ధనుష్ విషెష్ఇన్బన్ తండ్రి ఉదయనిధి 2012లో 'ఒరు కల్ ఒరు కన్నడి' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తన కుమారుడికి జెయింట్ మూవీస్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఘనమైన వారసత్వాన్ని కలిగిన ఇన్బన్ ఎలా ముందుకెళతాడో చూడాలి. కాగా, కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఇన్బన్కు హీరో ధనుష్ (Hero Dhanush) శుభాకాంక్షలు తెలిపారు. రెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానంరెడ్ జెయింట్ మూవీస్ ప్రస్థానం 2008లో ప్రారంభమైంది. విజయ్- త్రిష కాంబినేషన్లో ధరణి తెరకెక్కించిన కురువి సినిమాను ప్రొడక్షన్ హౌస్ మొదట నిర్మించింది. తర్వాత ఆధవన్ (2009), మన్మధన్ అంబు (2010), 7 ఓమ్ అరివు (2011), ఒరు కల్ ఒరు కన్నాడి (2012), నీర్పరావై (2012), వణక్కం చెన్నై (2013), మనితన్ (2016), మామన్నన్ (2023) సినిమాలను నిర్మించింది. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన కాదలిక్క నేరమిల్లై, కమల్ హాసన్-మణిరత్నంల థగ్ లైఫ్ సినిమాలను ఈ ఏడాది విడుదల చేసింది. ఇడ్లీ కడై సినిమాను అక్టోబర్ 1న విడుదల చేయబోతోంది. IdliKadai – releasing across Tamil Nadu by @RedGiantMovies_Wishing Inban Udhayanidhi the very best on his new journey! pic.twitter.com/gFUTJgbFwm— Dhanush (@dhanushkraja) September 3, 2025 -
ఎన్డీయేకు మరో షాక్.. విజయ్తో మక్కల్ సెల్వర్ జట్టు!
అసెంబ్లీ ఎన్నికల ముందర తమిళనాడులో ఎన్డీయే కూటమికి మరో షాక్ తగిలింది. అమ్మా మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మొన్నీమధ్యే అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం(ఓపీఎస్).. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీవీవీ దినకరన్ కూడా తన మద్దతును ఉపసంహరించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024 లోక్సభ ఎన్నికల ముందర.. ఎన్టీయే కూటమితో చేతులు కలిపారు దినకరన్. అయితే అన్నాడీఎంకేతో బీజేపీ అంటకాగడం మొదలైనప్పటి నుంచి ఆయన్ని దూరం పెడుతూ వస్తోంది. అయినప్పటికీ జయలలిత అనుచరులతో సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు ఓపికగా భరిస్తూ వచ్చారు. ఈ తరుణంలో.. అనూహ్యంగా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు దినకరన్ ప్రకటించడం గమనార్హం. ‘‘ఎన్డీయే కూటమి నుంచి మేం వైదొలిగాం. డిసెంబర్లో మా తదుపరి నిర్ణయం ఏంటన్నది ప్రకటిస్తాం. అమ్మ అనుచరులు మాకు దగ్గరవుతారని ఎదురుచూశాం. కానీ, అందుకు అవకాశం లేదని తెలిసిపోయింది. అందుకే 2026 ఎన్నికల కోసం మా దారి మేం చూసుకుంటున్నాం’’ అని దినకరన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఎన్డీయే కార్యక్రమాలకు దినకరన్ కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో కూటమి నుంచి వైదొలగవచ్చనే ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ దిగ్గజ నేత మూపనార్ వర్ధంతి వేడుకలకు బీజేపీ అగ్రనేత.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి హాజరయ్యారు. ఆ సమయంలోనే 2026 ఎన్డీయే సీఎం అభ్యర్థి పళనిస్వామినినే అని బీజేపీ మాజీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ప్రకటించారు కూడా. అయితే.. బీజేపీతో పొత్తు ఉండాలంటే పళనిస్వామి, దినకరన్లను దూరం పెట్టాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి డిమాండ్ చేసినట్లు ఓ ప్రచారం జోరుగా నడిచింది. తమిళనాడు సీఎం స్టాలిన్తో మార్నింగ్ వాక్ చేసిన పన్నీర్ సెల్వం.. కాసేపటికే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ తమిళనాడు రాజకీయాలపై చర్చిస్తున్న వేళలలోనే..దినకరన్ నిష్క్రమణ ప్రకటన చేశారు. ఇప్పుడు ఇదిలా ఉంటే.. థేవర్ కమ్యూనిటీ నుంచి ఇద్దరూ బలమైన నేతలు దూరం కావడంతో దక్షిణ తమిళనాడులో ఎన్డీయే కూటమి ఓట్లపై ప్రభావం పడొచ్చనే విశ్లేషణ నడుస్తోంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రాజకీయంగా కుదేలునకు లోనవుతూ వస్తోంది. మాజీ సీఎంలు ఈపీఎస్, ఓపీఎస్ల వర్గపోరుతో పార్టీ పరువు రోడ్డు మీద పడింది. అటుపై ఈపీఎస్ వర్గానికి అధికారిక గుర్తింపు దక్కడం, ఓపీఎస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. అయినప్పటికీ ప్రతిపక్షంగా నిలబడింది. ఇంకోవైపు.. తమిళనాడులో గ్రాఫు పెంచుకుంటోందిగానీ సీట్ల సంఖ్యను మాత్రం బీజేపీ పెంచుకోలేకపోతోంది. దీంతో ఆ పార్టీతోనే జట్టుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ బలంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.టీవీవీ.. టీవీకే వైపు.. ?టీవీవీ దినకరన్.. జయలలిత నిచ్చెలి వీకే శశికళ మేనల్లుడు. గతంలో అన్నాడీఎంకే ట్రెజరర్గా, ఉప ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017లో ఆర్.కే.నగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2018లో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) అనే కొత్త పార్టీని స్థాపించారు. తమిళనాట రాజకీయాల్లో ఆయన్ని మక్కల్ సెల్వర్గా పిలుస్తుంటారు. అయితే.. ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతానికి దినకరన్ డిసెంబర్ దాకా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే.. గతకొంతకాలంగా ఆయన నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ను పొగుడుతూ వస్తున్నారు. గతంలో విజయ్కాంత్ రాజకీయాల్లో ఒక ఊపు ఎలా ఊపారో.. విజయ్ కూడా అదే తరహాలో ఊపేస్తున్నారంటూ దినకరన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. తాను ఏ కూటమిలో చేరబోనని, వచ్చే ఎన్నికల్లో డీఎంకేతోనే తమ పోటీ అని విజయ్ ఇదివరకే ప్రకటించారు. అయితే కలిసొచ్చే పార్టీలకు రేపు అధికారం దక్కితే వాటా ఇస్తానని మాత్రం స్పష్టత చెప్పారు. దీంతో.. దినకరన్ విజయ్ పార్టీతో పొత్తుకు వెళ్లవచ్చనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే పీఎంకే, వీసీకే, డీఎండీకే లాంటి పార్టీలు టీవీకేతో పొత్తుపై ఉవ్విళ్లూరుతున్నాయి. పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడం లేదంటే విజయ్ టీవీకేతోపాటు పొత్తు.. అదీ కుదరకుంటే అధికార డీఎంకేతో జట్టులాంటి ఆప్షన్స్ను పరిశీలిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5వ తేదీన జరగాల్సిన మధురై సభను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
ఎనభై రెండేళ్ల ఎనర్జీ!
సోషల్ మీడియా వేదికగా అసామాన్య సామాన్యుల గురించి పరిచయం చేస్తుంటారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన తమిళనాడులోని పొల్లాచికి చెందిన కిట్టమ్మాళ్ గురించి పోస్ట్ పెట్టారు.శక్తికి వయసు అడ్డుకాదని నిరూపించింది 82 సంవత్సరాల కిట్టమ్మాళ్. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో పాల్గొనే కిట్టమ్మాళ్ ఉత్సాహానికి కేరాఫ్ అడ్రస్.‘ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఆమె పైకెత్తేది బరువులను కాదు. మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని. కలలు కలడానికి, ఆ కలలు నెరవేర్చుకోవడానికి వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించిన మహిళ’ అంటూ కిట్టమ్మాళ్ విల్పవర్ను కొనియాడారు ఆనంద్ మహీంద్రా.కునియముత్తూరులో జరిగిన ‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా’ పోటీలో పాల్గొన్న కిట్టమ్మాళ్ 17 మంది మహిళలతో పోటీ పడింది. ఈ మహిళలందరూ 30 కంటే తక్కువ వయసు ఉన్నవారే! డెడ్లిఫ్టింగ్ 50 కేజీల విభాగంలో అయిదో స్థానంలో నిలిచింది. తన మనవళ్లు రోహిత్, రితిక్ నుంచి స్ఫూర్తి పొందిన కిట్టమ్మాళ్ బామ్మ పవర్లిఫ్టింగ్లో పవర్ చాటుతోంది.బరువులు ఎత్తడం ఆమెకు కొత్తేమీ కాదు. 25 కిలోల బియ్యం బస్తాలను అవలీలగా మోసుకెళ్లేది. ‘నేను తీసుకునే ఆహారమే నా శక్తి’ అంటున్న కిట్టమ్మాళ్ సంప్రదాయ, పోషక విలువలతో కూడిన ఆహారానికిప్రాధాన్యత ఇస్తుంది. -
రాజీ కుదిరింది.. ఎన్డీయే తమిళనాడు సీఎం అభ్యర్థిగా ఆయనే!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నన్ అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడమే కాదు.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా స్పష్టత ఇచ్చేశారు. గతంలో ఈపీఎస్ మీద అన్నామలై ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘‘పళనిస్వామి ఓ తెలివితక్కువోడు’’.. అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. దీనికి కౌంటర్గా ‘‘అన్నామలై బుద్ధిహీనుడని, ఆస్పత్రిలో చేర్పించాలి’’ అని ఈపీఎస్ వర్గం కౌంటర్ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఏ ఎన్డీయే మీటింగ్లోనూ కలిసి మెలిగినట్లు కనిపించేది కూడా కాదు. అలాంటిది.. శనివారం చెన్నైలో జరిగిన జీకే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు మాట్లాడారు అంటూ అన్నామలై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘2026లో మార్పు రావాలి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నారు’’ అని అన్నారు. దీంతో వీళ్ల రాజకీయ ఐక్యతపై చర్చకు దారి తీసింది. పళనిస్వామి (EPS), అన్నామలై మధ్య విభేదాలు తమిళనాడు ఎన్డీయే కూటమిలో రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపించాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు అన్నాడీఎంకే అవసరం ఎన్డీయేకు లేదన్నట్లుగా అన్నామలై వ్యవహరించారు. పైగా సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ వర్గం చేసిన ప్రకటనను ఖండించారు. ఈ తీరుతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే.. ఈ రాజకీయంతో ఈపీఎస్ వర్గం బలపడగా.. బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో.. అన్నామలై వైఖరినే మార్చాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం మార్చి.. ఈపీఎస్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అన్నామలై కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ EPS కు మద్దతు ప్రకటించినట్లు ఆయన మాటల్లోనే తెలుస్తోంది.వీళ్ల కలయికపై ఆదివారం అన్నామలైకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘పార్టీ చెప్పింది, ప్రధాని మోదీ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించడం కేడర్గా నా బాధ్యత. అది అర్థం చేసుకోండి’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. గత విమర్శలపై ప్రశ్నించగా.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరే. పార్టీ కేడర్గా క్రమశిక్షణ పాటించాలి కదా. ఉదాహరణకు డీఎంకే మంత్రిపై నాకు ఎంత కోపం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఇది అంతే. పార్టీ చెప్పినట్లే అన్నామలై వింటాడు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.అన్నామలై 2011 బ్యాచ్కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన పోలీసాధికారిగా సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. ‘సింగం’గా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.తాజా పరిణామం.. అన్నాడీఎంకే బీజేపీల మధ్య విభేదాలు తొలిగాయనడానికి సంకేతంగా నిలిచింది. 2026 ఎన్నికల కోసం ఈపీఎస్ నాయకత్వంలో కూటమి ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా అందిస్తోంది. -
తమిళ జాలర్ల దోపిడీ
ఇరవై ఏళ్లుగా ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల మధ్య సముద్రంపై వేట పెద్ద సమస్యగా మారింది. తరచూ ఇరురాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదుర్చినా తమిళ జాలర్లు వాటిని లెక్కచేయక హద్దులు దాటి తిరుపతి జిల్లా తీరంలో వేట సాగిస్తున్నారు. దీంతో జిల్లా మత్య్సకారులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వేట చేస్తూ మత్స్య సంపదను పొరుగు రాష్ట్రం జాలర్లు కొల్లగొడుతున్నారు. వాకాడు : ఆంధ్రా సరిహద్దుల్లో తమిళ జాలర్లు వేట చేయకూడదని రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరిగినా హద్దులు దాటి మత్స్య సంపదను తమిళ జాలర్లు దోచుకుపోతున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలలుగా తిరుపతి జిల్లా తీరం వెంట తమిళ జాలర్లు తమ స్పీడ్ బోట్లతో నిబంధనలకు విరుద్ధంగా సముద్రంపై జల్లెడ పట్టి సముద్రంలోని మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. దీంతో జిల్లాలోని 5 తీర ప్రాంత మండలాల మత్స్యకారులు విలవిలలాడుతున్నారు. స్పీడ్ బోట్లతో.. ఏటా జిల్లా మత్స్యకారులకు దక్కాల్సిన సుమారు 15 వేల టన్నుల మత్స్యసంపదను పొరుగు రాష్ట్రాల జాలర్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పెద్ద బోట్లు 250 హెచ్పీ నుంచి 500 హెచ్పీ మెకనైజ్డ్ బోట్లతో ఎంఎఫ్ఆర్ఐ యాక్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రా జలాలపై తీర ప్రాంతం దగ్గరగా వేట చేయడమే కాకుండా స్థానిక మత్స్యకారులపై దాడులు చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవల కరైకల్, కడలూరు, నాగపట్నం, పాండిచ్చేరి జిల్లాలకు చెందిన 5 స్పీడు బోట్లు వివరాలను ఆయా మత్స్యశాఖ ఉన్నత స్థాయి అధికారులకు మన జిల్లా అధికారులు తెలియజేసి వారిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేట సాధారణంగా సముద్రంపై వేట చేసే మత్స్యకారులు 4 అంగులాల పైన రంధ్రాలు కలిగిన వలలను మాత్రమే వేటకు ఉపయోగించాలి. అలా కాకుండా తమిళ జాలర్లు నిబంధనలకు విరుద్దంగా ఒక ఇంచి సైజు రంధ్రాలతో తయారు చేసిన 100 మీటర్ల వలలతో వేట చేయడంతో చిన్న చిన్న నలక చేపలతో పాటు పెద్ద చేపలు సైతం వలలో చిక్కుకుని జిల్లా మత్స్య సంపద పొరుగు రాష్టాలకు తరలిపోతోంది. వాస్తవానికి స్పీడు బోట్ల జాలర్లు సముద్రంపై అలలు లేని ప్రదేశంలో అంటే 8 నాటికల్ మైళ్ల దూరం పైన వేట సాగించాలి. అయితే అధికార నిబంధనలను భేఖాతరు చేసి 3 నాటికల్ మైళ్ల దూరంలో ఎగసిపడుతున్న అలలు సైతం లెక్క చేయకుండా వేట చేసి మత్స్య సంపదను దోచుకుపోవడంతో స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారు.రెండు నెలలుగా జీవన భృతి లేకతిరుపతి జిల్లాలో 79 కిలో మీటర్ల సముద్ర తీరం విస్తరించి ఉంది. 5 తీర ప్రాంత మండలాల్లో 38 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. అందులో దాదాపు 9 వేల మంది మత్స్యకారులు, 1200 వరకు ఇంజిన్ బోట్లు ఉన్నాయి. రెండు నెలలుగా పొరుగు రాష్ట్రాల జాలర్ల దెబ్బకు స్థానిక మత్స్యకారులు విలవిల్లాడుతున్నారు. చేపల వేటే జీవనాధారంగా జీవించే మత్స్యకారులు రెండు నెలలుగా జీవన భృతిని కోల్పోయారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి వాగులు, వంకలు, నదులపై ప్రవహించి వరద సముద్రంలో కలిసింది. ఆ మేరకు మత్స్య సంపద పుష్కలంగా దొరుకుతున్న సమయంలో తమిళనాడు, కడూరు, నాగూరు నాగపట్నం, తూత్కుడి, తదితర ప్రాంతాలకు చెందిన జాలర్లు స్పీడు బోట్లుతో మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. చర్చలు జరిగినా ఫలితం లేదు పొరుగు రాష్ట్రాలకు చెందిన జాలర్లు స్పాడు బోట్లుతో తమ పరిధిలో అక్రమంగా వేట చేయడమే కాకుండా తమపై దాడులు చేసి గాయపరుస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిగినా ఫలితం కనిపించలేదు. ఇకనైనా పొరుగు రాష్ట్రాల స్పీడు బోట్లు దాడుల నుంచి స్థానిక మత్స్యకారులను కాపాడాలి. – పోలయ్య మత్స్యకారుడు, కొండూరుపాళెంఅధికారులు చొరవ చూపాలి నిబంధనలను ఉల్లంఘించి తమిళ జాలర్లు మత్స్యసంపదను దోచుకుపోతున్నారు. దీంతో తాము రోజంతా వేట చేసినా ఒక్క చేప దొరక్క పస్తులు ఉండాల్సి వస్తోంది. అధికారులు చొరవ చూపాలి. లేకపోతే జిల్లా మత్స్యకారులకు జీవన భృతి లేకుండా పోతుంది. – మునిస్వామి, మత్స్యకారుడు, ఓడపాళెం -
షాకింగ్ సర్వే.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్!!
ఏ పార్టీతో పొత్తు ఉండదు. సింహం ఎప్పటికీ సింహమే!. సింగిల్గానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాం అంటూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మధురైలో జరిగిన టీవీకే మానాడు సూపర్ సక్సెస్ కావడంతో విజయ్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రముఖ పార్టీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. తమిళనాడులో జరిగిన ఓ సర్వే వెల్లడించిన విషయాలు టీవీకే సహా అక్కడి రాజకీయ పక్షాలకు ఝలక్ ఇచ్చాయి. తమిళనాడు లోక్సభ ఎన్నికలు జరిగితే.. డీఎంకే అత్యధిక సీట్లు కైవసనం చేసుకుంటుందని తెలిపింది. ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 3 సీట్లు దక్కవచ్చని, అదే సమయంలో విజయ్ టీవీకేకు జీరో ఎదురుకావొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తమిళనాడులో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 39 స్థానాలను కూటమిలోనే పార్టీలోనే కైవసం చేసుకున్నాయి. అయితే ఇప్పటికిప్పడు జరిగితే మాత్రం 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. సంక్షేమ పథకాలతో పాటు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం, నీట్ పోరాటాలు డీఎంకే గెలుపును ప్రభావితం చేసే అంశాలుగా పేర్కొంది.ఇక.. బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి మూడు స్థానాలు మాత్రమే దక్కవచ్చని పేర్కొంది. అయితే.. ఓటు శాతం మాత్రం 18% నుంచి 37%కి పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2024లో ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక తమిళనాడులో రాబోయే కాలంలో జరిగే ఎన్నికలకు విజయ్ టీవీకే పార్టీ అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పార్టీ ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. అయితే ఇప్పటికప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ స్థానం దక్కకపోవచ్చని(0 సీట్లు) ఆ సర్వే వెల్లడించింది. విజయ్ పార్టీ పెట్టి ఏడాది పైనే అవుతోంది. అయితే అందులో ముఖాలేవీ జనాలకు పెద్దగా తెలిసినవి కావు. జనాలకు తెలిసిన ముఖాలు టీవీకేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.. విజయ్ అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు జనాల్లోకి ఇంకా బలంగా ఆ పార్టీ చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే డీఎంకే వ్యతిరేకతను టీవీకే ఓట్ల రూపంలో మార్చుకోవాలని విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. టీవీకే పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా డీఎంకేకే లాభం కలగించవచ్చని సర్వే పేర్కొంది. తద్వారా.. టీవీకేతో ఎన్డీయే కూటమికే భారీ నష్టం కలగవచ్చని స్పష్టం చేసింది. ఇండియా టుడే సీవోటర్ Mood of the Nation ఆగస్టు 2025 పేరిట నిర్వహించిన ఈ సర్వే నిర్వహించింది. జూలై 1 నుండి ఆగస్టు 14, 2025 మధ్య 2 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపొందించబడింది. సర్వే లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో జరిగినప్పటికీ మరో ఏడేనిమిది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకూ సమీకరణాలు ఇలాగే కొనసాగితే మాత్రం.. డీఎంకే నెత్తిన విజయ్ టీవీకే పాలు పోసినట్లే అవుతుందన్న చర్చ జోరుగా నడుస్తోందక్కడ. -
అన్నామలైకు చేదు అనుభవం, అయినా సరే..!
బీజేపీ నేత, తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్కు హాజరైన ఆయన నుంచి మెడల్ స్వీకరించేందుకు ఓ యువకుడు నిరాకరించాడు. తీరా ఆ యువకుడు ఆ రాష్ట్ర మంత్రి కొడుకు కావడం గమనార్హం.తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా తనయుడు సూర్య రాజా బాలు చేసిన పని ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. మాజీ ఐపీఎస్ అన్నామలై నుంచి మెడల్ను నిరాకరించాడు. తమిళనాడు 51వ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు అన్నామలై ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతల మెడలో మెడల్స్ వేస్తుండగా.. సూర్య అందుకు ఒప్పుకోలేదు. అన్నామలై నుంచి దూరందూరంగా జరిగాడు. ఆపై అన్నామలై నుంచి చేత్తో ఆ మెడల్ను తీసుకున్నాడు.அசிங்கப்பட்டான் ஆடு மேய்ப்பன் @annamalai_k pic.twitter.com/19l5XerZfH— ஜோக்கர் ᵖʰᵒᵉⁿⁱˣ (@lahudapandi) August 25, 2025అయితే ఈ పరిణామంపై అన్నామలై ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. బాలును దగ్గరికి తీసుకుని సక్సెస్ కావాలంటూ అభినందించి ఫొటో దిగారు. ఆపై ఈ వీడియో వైరల్ అయ్యింది. ఓ ఈవెంట్కు హాజరైన మీడియా నుంచి ఆయనకు వైరల్ వీడియోపై ప్రశ్న ఎదురైంది. దానికి అన్నామలై స్పందిస్తూ.. నేత అనేవాడు ప్రజలతో ప్రేమాభిమానాలతో ఉండాలిగానీ ద్వేషంతో కాదు అని బుదులిచ్చారు. బాలుకు విజయాలు కలగాలి అంటూ మరోసారి ఆశీర్వదించారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.అన్నామలై 2011 బ్యాచ్కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. సింగంగా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఈమధ్యే ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అయినప్పటికీ నిత్యం ఆయన స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో కనిపిస్తున్నారు.మొన్నీమధ్యే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి ఇదే తరహా అనుభవం ఎదురైంది. తిరునెల్వేలిలో ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆయన హాజరు కాగా.. ఆయన నుంచి కాకుండా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నుంచి ఓ యువతి పట్టా అందుకుంది. డీఎంకే నేత ఎం రాజన్ తనయ జీన్ జోసెఫ్గా తేలింది. గవర్నర్ తమిళ భాషకు, తమిళనాడుకు వ్యతిరేకి అని.. పైగా వైస్ చాన్సలర్ తమిళనాడుకు ఎంతో చేశారని.. అందుకే ఆయన నుంచి పట్టా తీసుకున్నానని జీన్ తెలిపింది. -
కందిరీగను మింగి బాలిక మృతి
తమిళనాడు: మురుకులు తింటూ ప్రమాదవశాత్తు కందిరీగను మింగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దిండుగల్ జిల్లాకు చెందిన కార్తీక్ తామరపాక్కంలోని శక్తి నగర్లో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కుగశ్రీతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాలిక శనివారం సాయంత్రం ఇంటి వద్ద మురుకులు తింటూ కందీరీగను మింగినట్టు తెలుస్తోంది. అయితే మురుకులు గొంతులో చిక్కుకున్నట్టు భావించిన తల్లిదండ్రులు చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ బాలికకు ఎక్స్రే తీయగా, గొంతులో కందిరీగ ఉన్నట్టు గుర్తించి షాక్కు గురయ్యారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందింది. అనంతరం బాలిక మృతదేహానికి పంచనామా నిర్వహించి గొంతులో చిక్కుకున్న కందిరీగను బయటకు తీశారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
అన్నానగర్: పుదుక్కోట్టైలోని పూంచోలై నగర్ ప్రాంతానికి దక్షిణ మూర్తి (70 ), ఇతను రిటైర్డ్ పోలీసు అధికారి. దేవరాజ్ (58) అదే ప్రాంత నివాసి. ఇద్దరూ రామేశ్వరం వెళ్లారు. సోమవారం ఇద్దరూ పుదుక్కోట్టై వెళ్లడానికి కారులో బయలుదేరారు. దక్షిణమూర్తి కారు నడుపుతున్నాడు. రామనాథపురం జిల్లాలోని ఆర్.ఎస్. మంగళం సమీపంలోని కలకుడి బైపాస్ రోడ్డు వద్దకు చేరుకుంటుండగా, కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి అక్కడి ఫ్లైఓవర్ రిటైనింగ్ వాల్ ను ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు శిథిలాలలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిద్దరూ ఆసుపత్రికి తరలిస్తుండగా విషాదకరంగా మరణించారు. మృతుడు దక్షిణామూర్తి కుమారుడు మధన్. ఇతను నూడుల్స్ చిత్రానికి దర్శకత్వం వహించి నటించడం గమనార్హం. అన్నానగర్: చైన్నెలోని ముగప్పేర్లోని ఓ ప్రైవేట్ సంగీత పాఠశాల ప్రాంగణంలో, ఇళయరాజా సంగీతంలో సాధించిన వివిధ విజయాలను చూసి గర్వపడేలా, సంగీత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహా 1000 మందికి పైగా కలిసి ‘ది మ్యూజిక్’ పేరుతో ఇళయరాజా రూపంలో నిలబడి రికార్డు సృష్ట్టించారు. ఇది యూనికో రికార్డ్ పుస్తకంలో ప్రపంచ రికార్డుగా గుర్తించబడింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ను ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్ రాజ్కుమార్ అందజేశారు. పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వేలూరు: సోమవారం ఉదయం కలెక్టరేట్లో డీఆర్ఓ మాలతి అధ్యక్షతన ప్రజా విన్నపాల దినోత్సవం జరిగింది. ఇందులో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించారు. దీంతో జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా అనకట్టు నియోజక వర్గం పదుపట్టుపాళ్యం గ్రామానికి చెందిన సంగీత ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తన భర్తకు సొంతమైన ఆస్తులతో పాటు వ్యవసాయ భూమిని అతని సోదరులు అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకాలు చేసుకొని తనకు ఆస్తులు లేకుండా చేశారని ఆరోపించారు. అదేవిధంగా వినతులను స్వీకరించిన డీఆర్ఓ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వినతి పత్రాలను స్వీకరించి వికలాంగులకు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అక్కడిక్కడే అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుత్తణి: తిరువళ్లూరు జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆవడిలోని బెటాలియన్ మైదానంలో విద్యార్థులకు అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. ఇందులో తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగ ప్రభుత్వ మహోన్నత పాఠశాల ప్లస్టూ విద్యార్థిని గోమతి పాల్గొని, రన్నింగ్ రేస్ పోటీల్లో 3000 మీటర్లు, 800 మీటర్ల విభాగంలో జిల్లా స్థాయిలో టాపర్గా విజయం సాధించింది. ఆమెను జిల్లా మంత్రి నాసర్ సన్మానించి, సర్టిఫికెట్లు అందజేశారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు నిర్వహించనున్న అథ్లెటిక్ పోటీల్లో పాల్గొననున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని గోమతిని ఆ పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
‘నీ క్యారెక్టర్ బాగోలేదు.. నిన్ను పెళ్లి చేసుకోలేను’
తిరువొత్తియూరు(తమిళనాడు): చెన్నై వేప్పేరిలోని ఈ.వి.కె.సంపత్ రోడ్డులో కమిషనర్ కార్యాలయం పక్కన ఉన్న అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న యువకుడు దర్శన్(26). ఇతను చెన్నై ప్యారిస్లో హార్డ్వేర్ డీలర్షిప్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రేమ ఇతనికి, రాయపురం పుదుమనైకుప్పం కల్మండపం రోడ్డు ప్రాంతంలో నివశిస్తున్న 25 ఏళ్ల హర్షిదా అనే యువతికి పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోకుండానే ఇద్దరూ గత 1 1/2 సంవత్సరాలుగా భార్యాభర్తల్లా కాపురం ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తర్వాత అన్నానగర్లోని ఒక హోటల్లో ఇరు కుటుంబాల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది. హర్షిదా దివ్యాంగురాలు. చిన్నప్పటి నుంచి ఎడమ కాలు బలహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇరు కుటుంబాలు నిశ్చితార్థం, పెళ్లి ఏర్పాట్లు చేశాయి. గత ఫిబ్రవరి 12న నిశ్చితార్థం ముగిసిన తర్వాత దర్శన్, హాసిద ఎప్పటిలాగే మాట్లాడుకుంటూ కలిసి తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఒక వారం క్రితం దర్శన్ హర్షిదకు ఫోన్ చేసి ‘నీ క్యారెక్టర్ బాగోలేదు. నువ్వు నాకు వద్దు. నిన్ను పెళ్లి చేసుకోలేను’ అని చెప్పాడు. ఇది విని దిగ్భ్రాంతి చెందిన హర్షిద తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ విషయంపై తన తల్లిదండ్రులకు చెప్పిన హర్షిద, తాను దర్శన్తోనే కలిసి జీవించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయమై శనివారం రాత్రి 9 గంటలకు వేప్పేరిలోని ఒక అపార్ట్మెంట్లో 7వ అంతస్తులో ఉన్న దర్శన్ ఇంట్లో ఇరు కుటుంబాలు చర్చలు జరిపాయి. దర్శన్, హర్షిద ఇద్దరూ విడిగా ఒక గదిలోకి వెళ్లి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో హర్షిత, దర్శన్తో నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను వద్దు అనకు అని బ్రతిమిలాడింది. కాని దర్శన్ మనసు మార్చుకోకుండా కలిసి జీవించాలని నేను కోరుకోవడం లేదు. మనం ఇద్దరం విడిపోదామని చెప్పి, పెళ్లి చేసుకోనని కచ్చితంగా చెప్పినట్టు తెలిసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన హర్షిద ఇక బ్రతికి ఉండటంలో అర్థం లేదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో హర్షిత మిద్దె పైకి వేగంగా పరిగెత్తి కిందకు దూకింది. రేకుల షెడ్డుపై పడింది. 7వ అంతస్తు బాల్కనీలో ఎండ పడకుండా వేసిన రేకుల షెడ్డుపై హర్షిత పడింది. దానిపై కూర్చున్నట్లే ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దీనికి దర్శన్ సమాధానమిస్తూ ఇందులో తన తప్పు ఏమీ లేదని చెప్పి, మళ్లీ పెళ్లికి నిరాకరించినట్లు మాట్లాడాడు. దీంతో మరింత మనస్తాపం చెందిన హర్షిత, రేకుల షెడ్డు నుండి మళ్లీ కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమె శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై వేప్పేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరి పొట్టు.. ఇసుక రట్టు!
సాక్షి టాస్క్ ఫోర్స్ : చిత్తూరు జిల్లా పాలంతోపు వద్ద శనివారం ఓ లారీ రోడ్డు పక్కకు వాలిపోయి ఇరుక్కుపోయింది. అక్కడకు వెళ్లిన స్థానికులు ఆ వాహనం నుంచి ఇసుక రాలుతుండటంతో మీడియా, పోలీసులకు సమాచారం అందించారు. పొక్లెయిన్ రాకపోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు లారీ అక్కడే నిలిచిపోయింది. అదే ప్రాంతానికి పది అడుగుల దూరంలో.. ఐదు రోజుల క్రితం గూడూరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీ కూరుకుపోవడంతో రాత్రికి రాత్రే జేసీబీ రప్పించి గుట్టుగా తరలించారు. » చిత్తూరు మండలం అనంతాపురం గ్రావిటా ఫ్యాక్టరీ వద్ద గురువారం ఓ లారీ టైర్ పేలడంతో నిలిచిపోయింది. ఆగిన లారీ నుంచి ఇసుక, నీళ్లు కారడంతో అనుమానించిన స్థానికులు టార్పాలిన్ తొలగించి పరిశీలించగా వరి పొట్టు గోతాల కింద దాచిన ఇసుక బయటపడింది. » వరిపొట్టు చాటున ఇసుక దందా జోరుగా సాగుతోంది. తిరుపతి జిల్లా గూడూరు నుంచి చిత్తూరు మీదుగా తమిళనాడుకు యథేచ్ఛగా తరలిపోతోంది. రోజూ దాదాపు 20 లారీల్లో సరిహద్దులు దాటుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. నెల్లూరు, తిరుపతికి చెందిన టీడీపీ నేతల కనుసన్నల్లో పుష్ప సినిమా తరహాలో లారీల నంబర్ ప్లేట్లు మార్చి తప్పుడు పత్రాలతో అక్రమ ఇసుకను చేరవేస్తున్నారు. గూడూరులో డంప్.. తిరుపతి జిల్లా గూడూరు వద్ద స్వర్ణముఖి నది, నెల్లూరులోని పెన్నానది కేంద్రంగా ఇసుక దందా నడుస్తోంది. పొక్లెయిన్లతో తోడేసిన ఇసుకను గూడూరులోని నిర్మానుష్య ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అనంతరం లారీల్లో ఇసుక నింపి పైన వరి పొట్టు గోతాలను అమర్చి అనుమానం రాకుండా టార్పాలిన్ పట్టాలు కడుతున్నారు. ఇలా విలువైన ఇసుక తమిళనాడులోని చెన్నై దాకా అక్రమంగా తరలిపోతోంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం, చిత్తూరు మండలం తిరుత్తణి రోడ్డు, జీడీ నెల్లూరులోని తూగుండ్రం రోడ్డు మీదుగా రోజూ 20 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఒక్కో లారీ ఇసుకను రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల దాకా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన వ్యక్తులతో చేతులు కలిపి ఈ దందా సాగిస్తున్నారు.దారి తప్పిన నిఘా... కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక దందాకు హద్దులు చెరిగిపోయాయి. నదులు, కాలువలు, వాగులు వంకలను కొల్లగొట్టేస్తున్నారు. తమిళనాడుతోపాటు కర్ణాటకకు సైతం లారీల్లో టన్నులు టన్నులు తరలిపోతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారు. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో రెండు జిల్లాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. ఒకవేళ స్థానికుల ఫిర్యాదుతో తప్పనిసరై పట్టుకున్నా నామమాత్రంగా జరిమానా విధించి వదిలేయాలనే ఒప్పందంతో ఇసుక దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
సింహం ఎప్పుడూ సింహమే
సాక్షి, చెన్నై: సింహం ఎప్పటికీ సింహంగానే ఉంటుందని నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ, డీఎంకేలతో ఎన్నికల పొత్తు పెట్టుకోబోమని, ఆ రెండు పార్టీలు తమకు బద్ధ శత్రువులని విమర్శించారు. ఆత్మగౌరవంతోనే ముందుకు సాగుతామన్నారు. తమిళనాడులోని మదురైలో గురువారం జరిగిన పార్టీ రెండో మహాసభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మద్దతు కూడగట్టుకోవడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సభలో ఆయన ప్రసంగించారు. తమ రాజకీయ శత్రువు డీఎంకే కాగా, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని పేర్కొన్నారు. టీవీకే ఎవరికీ భయపడదు, మాఫియా వ్యాపారాలు చేయదు అని వ్యాఖ్యానించారు. తమిళనాడు బలం మొత్తం మనతోనే ఉంది. ఫాసిస్ట్ బీజేపీ, విషపూరిత డీఎంకేకి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ‘సింహం ఎప్పుడూ ప్రత్యేకమే. దాని గర్జన 8 కిలోమీటర్ల మేర ప్రతిధ్వనిస్తుంది. వేటకు మాత్రమే బయటకు వస్తుంది. అడవిలో నక్కలు చాలానే ఉంటాయి. సింహం మాత్రం ఒక్కటే. అదే అడవికి రాజు. ఇదే మా స్పష్టమైన ప్రకటన’అని విజయ్ పేర్కొన్నారు.మిస్టర్ పీఎం మోదీజీ.. సీఎం స్టాలిన్ అంకుల్!మిస్టర్ నరేంద్ర దామోదర దాస్ మోదీ జీ అంటూ అని సంబోధించిన విజయ్..తమిళనాడు ప్రజల ఆకాంక్షలను బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. అరెస్టయిన తమిళ జాలర్లను విడిపించాలి..కచ్ఛతీవును తిరిగి స్వాధీనం చేసుకోవాలి, నీట్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్లు వినిపించారు. బీజేపీది బానిసల కూటమి అని విమర్శలు ఎక్కుబెట్టారు. ఆర్ఎస్ఎస్కు బీజేపీ బానిస అని, బీజేపీకి అనేక రాష్ట్ర పార్టీలు బానిసలుగా మారి మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆ బానిసలలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ టీవీకే ఉండబోదని స్పష్టం చేశారు. అదేవిధంగా, మైడియర్ అంకుల్ అంటూ సీఎం స్టాలిన్ను ఉద్దేశించి విమర్శలను ఎక్కుపెట్టారు. మహిళలకు నెలకు రూ.వెయ్యి ఇస్తే సరిపోతుందా? వాళ్ల రోదనలు వినిపించడం లేదా? పరంధుర్ ఎయిర్పోర్టుతో భూములు కోల్పోయిన రైతులు, మత్స్యకారుల ఆవేదన ఆలకించారా? మనస్సాక్షి ఉంటే సమాధానం ఇవ్వండని సవాల్ విసిరారు. మైడియర్ అంకుల్ వినిపిస్తుందా ప్రజా గళం? త్వరలో ప్రజల్లోకి వెళ్తున్నా. మనస్సు విప్పి మాట్లాడుతా..ఇక తమరికి నిద్ర కరువైనట్టే అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలలో తానే అభ్యర్థి అని, తనను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియో
అంతా పెళ్లి రిసెప్షన్ వేడుకల్లోఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆనందంగా నృత్యం చేస్తున్న మహిళ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం అయ్యే లోపే అంతులేని విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మామల్లపురం మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పలు మీడియా నివేదికల ప్రకారం తమిళనాడులోని జరిగిన వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు కాంచీపురం నివాసితులు జీవా , ఆమె భర్త జ్ఞానం. తమ స్నేహితుడి కొడుకు వివాహ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా, ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు వేల్మురుగన్ పాల్గొన్న సంగీత కచేరీని నిర్వహించారు. ఈ సమయంలో, వేల్మురుగన్ ప్రేక్షకులను వేదికపైకి వచ్చి నృత్యం చేయమని ఆహ్వానించారు. అలా జీవా కూడా ఆమె వేదిక పైకి వెళ్లి నృత్యం చేయడం ప్రారంభించింది. అంతలోనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెకు వేదిక వద్దనే ప్రథమ చికిత్స అందించారు. అయినా స్పందించచకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. జీవా కుప్పకూలిపోయే ముందు నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.Woman dies after collapsing while dancing on stage at wedding event in Mamallapuram, in Tamil Nadu’s Chengalpattu district.#TamilNadu #Tragedy #ITVideo #SoSouth #Chengalpattu @PramodMadhav6 pic.twitter.com/18SkHkx4X2— IndiaToday (@IndiaToday) August 20, 2025 -
తన భర్త సంసారానికి పనికిరాడని..!
చెన్నై: చెన్నై, ఆలందూర్లో పిల్లలు లేరనే విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెన్నై ఆలందూరుకు చెందిన కోటేశ్వరి (30)కి, తిరుచ్చి జిల్లా కూవియలూరుకు చెందిన వినోద్కు రెండేళ్ల క్రితం పెళ్లయింది. గత రెండేళ్లుగా పిల్లలు లేకపోవడంతో కోటేశ్వరి వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందింది. అయితే వైద్య నివేదికలో కోటేశ్వరికి ఎలాంటి లోపాలు లేవని తేలింది. దీంతో కోటేశ్వరి తన భర్త వినోద్ను వైద్య చికిత్సకు రమ్మని పిలిచినప్పుడు, అతను రాలేదు. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీనితో మనస్తాపం చెందిన కోటేశ్వరి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోని బాత్రూంలో దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
అర్ధరాత్రి నగ్నంగా పుర్రెలతో పూజలు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని పూసికల్మేడు గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు పరుశురామన్ ఇతను అదే గ్రామంలోని రాజాత్తి ఇంటి సమీపంలో ఆదివారం అర్థరాత్రి పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పరుశరామన్ ఇంటి సమీపంలో నివశిస్తున్న కుమరన్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో దీపం వెలుగుతుందని దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ సమయంలో పరుశురామన్ నగ్నంగా నిలుచుకొని పూజలు చేస్తున్నాడు. వీటిని గమనించి అవాక్కైన కుమరన్ వీటిని నిలదీశాడు. దీంతో ఇద్దరి మద్య వాగ్వాదం ఏర్పడింది. ఇద్దరు ఘర్షణ పడటంతో స్థానికులు గమనించి అక్కడకు వచ్చారు. వెంటనే ఇరు వర్గాల వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కుమరన్ ఇంటికి వెల్లి నిద్రించాడు. ఆ సమయంలో పరుశురామన్ తన అనుచరులతో వచ్చి కుమరన్ తలపై రాతిని వేసి హత్య చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. కుమరన్కు తీవ్ర గాయాలు కావడంతో అతని బార్య జయలక్ష్మి వెంటనే కేకలు వేసింది. వెంటనే స్థానికులు గమనించి కుమరన్ను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభ్తుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు జయలక్ష్మి నాట్రంబల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి పరుశురామన్, అతని సోదరుడు శాంతకుమరన్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత
చెన్నై: నాగాలాండ్ గవర్నర, బీజేపీ మాజీ ఎంపీ ఎల్ గణేశన్(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 15వ తేదీ) సాయంత్రం చెన్నై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8వ తేదీన తలకు తగిలిన గాయంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. కన్నుమూశారు. అప్పట్నుంచి స్పృహకోల్పోయిన గణేషన్.. తిరిగి కోలుకోలేదు. ఆయన అంత్యక్రియలు టీ నగర్లోని ఆయన ఇంటి వద్ద నిర్వహించనున్నారు. గణేశన్ భౌతికాయాన్ని రాజకీయ నాయకులు, బంధువులు సందర్శనార్థం రేపు(శనివారం, ఆగస్టు 16వ తేదీ) ఆయన ఇంటివద్ద ఉంచనున్నారు.1945, ఫిబ్రవరి 16వ తేదీన తంజావూర్లో ఆయన జన్మించారు. ఆయన యువకుడిగా ఉండగానే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన లా గణేషన్.. తండ్రి, అన్నల బాటలోనే నడిచారు. అలా 1970లో ఫుల్టైమ్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఎంపికయ్యారు.1991లో బీజేపీలో చేరిన ఆయన.. తమిళనాడు రాష్ట్ర యూనిట్కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించబడ్డారు. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలలో ఆయన కీలక పాత్ర వహించారు. ఆపై 10 ఏళ్ల తర్వాత గణేశన్ బీజేపీ జాతీయ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీకి జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన సేవలందించారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. 2021, ఆగస్టు 27వ తేదీన మణిపూర్ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న లా గణేశన్... 2023, ఫిబ్రవరి 19వ తేదీ వరకూ పని చేశారు. అదే సమయంలో జూలై 2022 నుంచి నవంబర్ వరకూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ గవర్నర్గా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే గాయంతో ఆస్పత్రి పాలైన ఆయన... 2025, ఆగస్టు 15వ తేదీన మృతిచెందారు. -
ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి కోసం శ్రీలంక యువతి సాహసం
అన్నానగర్: ప్రేమించిన యువకుడి కోసం ఓ యువతి ఏకంగా దేశం దాటి వచ్చిన ఉదంతమిది. ప్రియుడి కోసం ప్రియురాలు తన దగ్గరున్న నగలు అమ్ముకుని మరీ శ్రీలంక నుంచి నకిలీ పడవలో భారత్కు వచ్చిన ఘటన బుధవారం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో జరిగింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. అరిచలమునై బీచు బుధవారం ఉదయం ఓ యువతి శరణార్థిగా వచ్చిందని కోస్టల్ పోలీసులకు సమాచారం అందింది.ఆ మహిళను కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. పోలీసుల కథనం మేరకు.. శ్రీలంకలోని మన్నార్కు చెందిన విదుర్షియ (25) తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా పళనిలో ఒక శరణార్థి శిబిరంలో తన తల్లి, తండ్రితో కలిసి నివసించేది. ఆ సమయంలో ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. గత ఏప్రిల్లో ఆమె శ్రీలంకకు వెళ్లగా, తిరిగి అక్కడి నుంచి భారత్కు రావడానికి వీసా పొందలేకపోయింది.అయితే ఆమె తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి నకిలీ పడవలో రావాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆ మహిళ తన నగలను అమ్మి వచ్చిన నగదుతో తలైమన్నార్ బీచ్ నుంచి ఓ ప్లాస్టిక్ పడవ ఎక్కి అరిచల్ మునైకి చేరుకుంది. దర్యాప్తు అనంతరం ఆ యువతిని మండపం శరణార్థి శిబిరానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. -
బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి
తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar) బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ట్రాన్స్జెండర్ కార్యకర్త, నామిస్ సౌత్ క్వీన్ ఇండియా అధ్యక్షురాలు నమిత మారిముత్తు కూడా పార్టీలో చేరారు. వారిద్దరిని తమిళనాడు బీజేపీ సాదరంగా ఆహ్వానించింది. కస్తూరి, నమితా మారిముత్తు నేటి నుంచి అధికారికంగా బీజేపీతో రాజకీయ ప్రయాణంలో చేరడం స్వాగతించదగిన పరిణామం అంటూ నైనార్ నాగేంద్రన్ పేర్కొన్నారు. సినీ నటి కస్తూరికి ఫైర్ బ్రాండ్గా పేరుంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలో ఆమెకు గుర్తింపు ఉంది. -
నీట్లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య
అన్నానగర్: చైన్నెలోని కొడుంగైయూర్ నారాయణసామి గార్డెన్ స్ట్రీట్లో నివసిస్తున్న హరీష్ కుమార్. ఇతను టి. నగర్ లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సంజి శ్రీ డాక్టర్ కావడానికి చదువుతోంది. ఆమెను చూసి, రెండవ కుమార్తె మదన శ్రీ కూడా డాక్టర్ కావడానికి చదవాలనుకుంది. దీని కోసం ఆమె నీట్ పరీక్ష రాసింది. గత జూన్లో ఫలితాలు ప్రకటించినప్పుడు, ఆమె తక్కువ మార్కులతో పరీక్షలో ఫెయిల్ అయింది. దీని కారణంగా గత 2 నెలలుగా తీవ్ర బాధలో ఉన్న మదన శ్రీ వెంటనే దుఃఖంలో మునిగిపోయింది. ఈ స్థితిలో మదన శ్రీ సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఇంటి పై అంతస్తులోని గదికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీని పై సమాచారం అందుకున్న కొడుంగైయూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. నీట్ పరీక్షల కారణంగా చైన్నెలో విద్యార్థినుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. కొడుంగైయూర్ లో సోమవారం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం విద్యావేత్తలు, తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది.రాహుల్ గాంధీ అరెస్ట్ను ఖండిస్తూ..కాంగ్రెస్ నాయకుల నిరసనకొరుక్కుపేట: బిహార్లో ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టడానికి వ్యతిరేకంగా దేశ ఢిల్లీ రాజధానిలో ప్రతిపక్ష ఇండియా కూటమికి పార్టీల నాయకులు నిరసన చేపట్టారు. ఆ సమయంలో, పోలీసులకు, పార్లమెంటు సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. దీని కారణంగా, రాహుల్ గాంధీ సహా తమిళనాడు ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వివిధ ప్రదేశాలలో నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ పెరంబూరు–మాధవరం హైవేలోని మూడు విగ్రహాల దగ్గర మంగళవారం ఉదయం ఉత్తర చైన్నె పశ్చిమ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఢిల్లీబాబు నేతృత్వంలో నిరంతర నిరాహార దీక్ష జరిగింది. కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహకులు, జిల్లా కార్యనిర్వాహకులు, సర్కిల్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది. ప్రజల సహకారంతో త్వరలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉత్తర చైన్నె పశ్చిమ జిల్లా అధ్యక్షుడు ఢిల్లీబాబు అన్నారు.రూ. 7 కోట్ల విలువైన హైగ్రేడ్ గంజాయి, 28 డ్రోన్లు సీజ్అన్నానగర్: సింగపూర్ నుంచి కోయంబత్తూరుకు విమానంలో హైగ్రేడ్ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు మంగళవారం కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ సమయంలో అనుమానం వచ్చిన ఇద్దరు వ్యక్తులను ప్రత్యేక గదికి తీసుకెళ్లి తనిఖీ చేశారు. వారు 6.7 కిలోల హైగ్రేడ్ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. దీని విలువ రూ. 7 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. అధికారులు నిందితులను విచారించారు. వారు కేరళలోని కొట్టాయంకు చెందిన బహద్ మోన్ ముజీబ్, సుహైల్ వాళమత్ ఉబైదుల్లాగా గుర్తించారు. వారిపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే పుదుక్కోట్టైకి చెందిన తమిళరసి జయమాణికం, పాండి దురై సుబ్బయ్య అదే విమానంలో కస్టమ్స్ సుంకం చెల్లించకుండా 28 డ్రోన్లను అక్రమంగా రవాణా చేశారని కూడా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్ల విలువ రూ. 18.67 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒకే విమానంలో వరుసగా హైగ్రేడ్ గంజాయి, డ్రోన్లను స్వాధీనం చేసుకున్న ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. -
300 లీటర్ల అమ్మపాలు దానం చేసిన అమృతమూర్తి
పుట్టే బిడ్డకు రోగ నిరోధక శక్తినిచ్చేది తల్లి పాలు. ఇదే పోషకాహారం కూడా. అందాన్ని కాపాడుకునేందుకు కొద్దిమంది తల్లులు బిడ్డలకుపాలు ఇవ్వడం మానేసిన ఈ రోజులలో తిరుచ్చికి చెందిన బృంద నెలల తక్కువతో పుట్టే బిడ్డలకు అమృత మూర్తి అయ్యారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రభుత్వ మహాత్మా గాంధి స్మారక ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పాల బ్యాంక్కు 300.17 లీటర్లపాలను దానం చేసి రికార్డులోకి ఎక్కారు. తిరుచ్చి కాట్టూరుకు చెందిన సెల్వ బృంద (34) ఇద్దరు బిడ్డల తల్లి.తల్లి పాలు పిల్లలకు శ్రేయస్కరం అని చాటే విధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది బృంద. పసి బిడ్డల పాలిట అమృత మూర్తిగా ఉన్న సెల్వ బృంద దాన గుణానికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఆమెకు ‘అమృతం ఫౌండేషన్’ అండగా నిలిచింది. ‘సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు, వ్యక్తిగత కారణాల వల్ల తల్లులుపాలను దానం చేయడానికి ముందుకు రావడం లేదు. తొలి నాళ్లలో నన్ను చాలా మంది తక్కువగా అంచనా వేశారు. నిరాశపరిచే మాటలు వినిపించేవి. అయినా వెనక్కి తగ్గలేదు. తల్లిపాల దానంపై అవగాహన విస్తృతం కావాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలి’ అంటుంది సెల్వ బృంద.– అస్మతీన్ మైదీన్, సాక్షి–చెన్నై ఇవీ చదవండి: సారా టెండూల్కర్ కొత్త చాలెంజ్ క్రియేటివ్ వీడియో వైరల్‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు -
ఇక నుంచి రాష్ట్ర విద్యా విధానం
చెన్నై: జాతీయ విద్యా విధానా(ఎన్ఈపీ)నికి ప్రత్యామ్నాయంగా తమిళనాడు రాష్ట్ర విద్యా విధానా(ఎస్ఈపీ)న్ని తీసుకొచ్చింది. దీనిని సీఎం స్టాలిన్ శుక్రవారం ఆవిష్కరించారు. కొత్తూరుపురంలోని అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం ఆది నుంచి వ్యతిరేకిస్తోంది. అందుకు గాను కేంద్రం సమగ్ర శిక్ష నిధులను రాష్ట్రానికి నిలిపేసింది. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ ఉద్రిక్తతల సమయంలోనే రాష్ట్ర విద్యా విధానాన్ని విడుదల చేసింది. కొత్త విధానాన్ని రూపొందించడానికి 2022లో రిటైర్డ్ జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ గతేడాది జూలైలో సీఎం స్టాలిన్కు తన సిఫార్సులను సమర్పించింది. వాటిని ప్రభుత్వం శుక్రవారం ఆవిష్కరించింది. ఎస్ఈపీ ప్రకారం.. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు బదులుగా 11, 12వ తరగతుల్లోని ఏకీకృత మార్కుల ఆధారంగా డిగ్రీ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల ప్రవేశం కల్పిస్తారు. 3,5, 8 తరగతుల్లో పబ్లిక్ పరీక్షల విధానాన్ని కూడా ఎస్ఈపీ వ్యతిరేకించింది. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనివల్ల డ్రాపౌట్లు పెరుగుతాయని, విద్యను వ్యాపారీకరించడమేనని తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలకు గణనీయమైన పెట్టుబడులతో పాటు.. కృత్రిమ మేధ, ఆంగ్ల భాషలకు పెద్ద ఎత్తున ప్రోతాహాన్ని అందించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు.. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి తిరిగి తీసుకు రావాలని కమిటీ సిఫార్సు చేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర బోర్డుతో సహా అన్ని బోర్డుల్లో విద్యార్థులు తమిళం చదువుతారని విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ విమర్శించారు. ఇది రాష్ట్ర అహంకార విధానంగా అభివర్ణించారు. -
సీఎంల పేర్లు, ఫొటోలను పథకాలకు ఉపయోగించుకోవచ్చు
న్యూఢిల్లీ: తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నుంచి భారీ ఊరట లభించింది. మీకు అండగా స్టాలిన్( విత్ యూ స్టాలిన్) పేరిట తమిళనాట డీఎంకే సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకం పేరులో ముఖ్యమంత్రి(స్టాలిన్), ఇతర మంత్రుల పేర్లు ఉండటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సంక్షేమ పథకంలో స్టాలిన్ పేరు ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వు వచ్చింది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్చేయగా బుధవారం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ షణ్ముగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దురుద్దేశంతో పిటిషన్ వేశారని మండిపడుతూ షణ్ముగంపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ‘‘పిటిషనర్ షణ్ముగం అత్యుత్సాహాన్ని మేం ఏమాత్రం ప్రోత్సహించట్లేము. ఆయన కేవలం ఒకే ఒక్క రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని పిటిషన్ వేశారు. రాజకీయ పారీ్టలు ప్రభుత్వ నిధులను నాయకుల పేర్లతో వృథాగా ఖర్చుచేస్తున్నారన్న స్పృహ ఆయనకు నిజంగా ఉంటే ఆయన దేశంలో ఇలాంటి అన్ని రాజకీయ పారీ్టలు అమలు చేస్తున్న అన్నీ పథకాలను ఆయన సవాల్చేయాలి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇలా ముఖ్యమంత్రుల పేర్లను ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఉపయోగిస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లతో పథకాలు ఉండొద్దనే న్యాయబద్ధమైన నిషేధాజ్ఞలు లేవు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ రాజకీయ యుద్ధాలను ఎన్నికల్లో తేల్చుకోవాలి. రాజకీయ యుద్ధాల కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దు’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ‘‘షణ్ముగం వేసిన పిటిషన్ న్యాయబద్ధంగా లేదు. చట్టప్రకారం లేదు. అందుకే ఆయనకు అనుకూలంగా గతంలో వచి్చన తీర్పును పక్కనబెడుతున్నాం. ఈమేరకు హైకోర్టు తీర్పును పక్కనబెట్టేందుకు ఉద్దేశించిన స్పెషల్ లీవ్ పిటిషన్ను అనుమతిస్తున్నాం’’ అని కోర్టు తెలిపింది. -
భారత్లో వియత్నాం కంపెనీ: 3000 ఉద్యోగాలు..
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ఇండియావైపు చూస్తున్నాయి. ఇటీవలే టెస్లా దేశీయ విఫణిలో తన మొదటి కారును లాంచ్ చేసింది. ఇప్పుడు వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ (VinFast) తమిళనాడులోని ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ సంస్థ భారతదేశంలో తన ఉనికిని మరింత విస్తరించడానికి సన్నద్ధమవుతోంది.తూత్తుకుడిలోని విన్ఫాస్ట్ కర్మాగారం ప్రారంభంలో సంవత్సరానికి 50,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. అయితే ఈ ప్లాంట్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచి ఏడాదికి 1,50,000 కార్లకు తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో ఓడరేవులు ఉండడం వల్ల.. ఎగుమతికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఎగుమతులకు కేంద్రంగా చేసుకోవడానికి కంపెనీ ఆలోచిస్తోంది. అంతే కాకుండా.. ఈ కర్మాగారం ద్వారా సుమారు 3,000 కంటే ఎక్కువ మంది స్థానికులకు ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది.విన్ఫాస్ట్ తమిళనాడును ఎంచుకోవడానికంటే ముందు భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో 15 ప్రదేశాలను పరిశీలించినట్లు కంపెనీ తెలిపింది. తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతులకు కూడా ఈ రాష్ట్రం అనుకూలంగా ఉండటం చేత సంస్థ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. -
ఎన్నికల ఎఫెక్ట్.. ‘తమిళనాట 6.5 లక్షల కొత్త ఓటర్లు’
ఢిల్లీ: ఓటర్ లిస్టు విషయంలో ఎన్నికల సంఘంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మరో బాంబు పేల్చారు. తమిళనాడులో ఏకంగా 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని చెప్పుకొచ్చారు. దీంతో ఓటర్ లిస్ట్పై కొత్త చర్చ మొదలైంది.బీహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా ఓటర్ల సంఖ్య పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. తాజాగా చిదంబరం ట్విట్టర్ వేదికగా.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతోంది. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉండగా.. తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇది ఆందోళనకరమైన చర్య. చట్టవిరుద్ధమైనది. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులు అని పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించినట్లు అవుతుంది. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఓట్ల పెంపుదల జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. ఈ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిందే’ అని పిలుపునిచ్చారు.The SIR exercise is getting curiouser and curiouserWhile 65 lakh voters are in danger of being disenfranchised in Bihar, reports of "adding" 6.5 lakh persons as voters in Tamil Nadu is alarming and patently illegalCalling them "permanently migrated" is an insult to the…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025ప్రతి భారతీయుడికి శాశ్వత నివాసం ఉన్న ఏ రాష్ట్రంలోనైనా నివసించడానికి, పని చేయడానికి హక్కు ఉంది. అది స్పష్టంగా సరైనది. బీహార్ ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న లక్షల మంది వ్యక్తులు రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు. కాబట్టి వారిని మినహాయించాలని ఎన్నికల సంఘం ఎలా నిర్ణయానికి వచ్చింది?. ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు అని నిర్ధారణకు రాక ముందే, ప్రతి కేసుపై సమగ్ర విచారణ నిర్వహించకూడదా?. సామూహిక ఓటుహక్కుల తొలగింపు అనేది తీవ్రమైన సమస్య, అందుకే సుప్రీంకోర్టు పిటిషన్లను విచారిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిదంబరం తన పోస్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. Every Indian has a right to live and work in any state where he has a permanent home. That is obvious and rightHow did the ECI come to the conclusion that several lakh persons, whose names are in the current electoral rolls of Bihar, must be excluded because they had…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025 -
తల్లీకూతుళ్లు.. ఒకేసారి మెడిసిన్
చదువుకు వయసేమిటి? కష్టమైన మెడిసిన్ సీటు సాధించడంలోమనకు తక్కువేమిటి అనుకున్నారు 49 ఏళ్ల అముదవల్లి. తమిళనాడుకు చెందిన ఈ ఫిజియోథెరపిస్ట్ తన కుమార్తె సంయుక్తతో కలిసి నీట్ 2025 రాశారు. ఇద్దరికీ ర్యాంకు వచ్చింది. బుధవారం కౌన్సిలింగ్లో ఆమెకు సీటు ఖరారైంది. కూతురుతోపాటు మెడిసిన్ చదవబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందామె. పెళ్లి వల్ల చదువు ఆగిపోయిన తల్లులు అముదవల్లిని చూసి స్ఫూర్తి పొందాలి.‘వివాహం విద్యానాశాయ’... పెళ్లికాగానే చదువు అటకెక్కుతుందని, బాధ్యతలు తలకెక్కుతాయని పెద్దలంటారు. అదంతా అప్పటి మాట. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా విద్యను వృద్ధి చేయవచ్చు అని నిరూపించారు 49 ఏళ్ల అముదవల్లి. కూతురితో కలిసి, నీట్ పరీక్ష రాసిన ఆమె ఉత్తీర్ణత సాధించి చాలామంది అమ్మలకు స్ఫూర్తిగా నిలిచారు. ఒకేసారి తల్లీకూతుళ్లు నీట్ పరీక్ష రాయడం, ఇద్దరూ పాసవడం దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు.ఎప్పటి నుంచో కలతమిళనాడు తె¯Œ కాశికి చెందిన అముదవల్లి వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్. భర్త లాయర్. మరో ఏడాదిలో ఆమె 50 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. ఇన్నేళ్లు గడిచినా ఆమె మనసులో ఒక కోరిక మాత్రం తీరలేదు. అదే డాక్టర్ అవ్వడం. తెల్లకోటు వేసుకొని, చేతిలో స్టెతస్కోప్ పట్టుకొని, రోగుల్ని నవ్వుతూ పలకరించి, చల్లటి చికిత్స అందించే వైద్యురాలు కావాలన్నది ఆమె కల. కానీ ఆమె ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించ లేదు. దీంతో ఫిజియోథెరపీ కోర్సు చేసి, అందులోనే కొనసాగారు. ఆశ్చర్యంగా కూతురు సంయుక్త తనకు డాక్టర్ కావాలని ఉందని చెప్పినప్పుడు అముదవల్లి ఎంతో సంతోషపడ్డాను. తను నెరవేర్చుకోలేకపోయిన కోరిక కూతురు సాధించబోతోందని ఆనందపడ్డారు. అంతేనా? తన కూతురితోపాటు తను మాత్రం ఎందుకు సాధించకూడదు? ఆ వయసులో తనకు అడ్డుపడ్డ ఇబ్బందులు ఇవాళ లేవుగా? అందుకే కూతురుతోపాటు తనూ నీట్ పరీక్ష రాయాలని అనుకున్నారు.కష్టమైన లక్ష్యందేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఆపై మెడికల్ సీటు పొందడం అంత సులభమైన విషయాలు కావు. చాలా శ్రమించాలి. గంటల తరబడి చదవాలి. రోజుల తరబడి చదువుకు అంకితమవ్వాలి. ఇంత చేసినా పాసవుతామన్న నమ్మకం లేదు. అయితే అముదవల్లికి కూతురు సంయుక్త తోడుగా నిలిచింది. స్ఫూర్తి నింపింది. తనతోపాటు తల్లి కూడా నీట్ పరీక్ష రాయడాన్ని ప్రోత్సహించింది. ఇద్దరూ కలిసి పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికి అముదవల్లి చదువు మానేసి చాలా ఏళ్లయ్యింది. కొత్త సిలబస్, సరికొత్త అంశాలు. అవన్నీ మళ్లీ చదవడం, వాటిని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం కష్టమైన పనులు. అయినా ఆమె విసుగు లేకుండా రోజూ సాధన చేసేవారు. తనకొచ్చే సందేహాలను కూతురిని అడిగి సమాధానాలు తెలుసుకునేవారు. ‘నేను చదివినప్పటికీ, ఇప్పటికీ సిలబస్లో చాలా మార్పులొచ్చాయి. కొన్ని విషయాలు నాకు పూర్తిగా కొత్త. అయినా నా కూతురి సాయంతో వాటిని చదివి, అర్థం చేసుకున్నాను. ఇద్దరం కలిసి వాటిని చర్చించి, చదువుకునేవాళ్లం. ఈ విషయంలో మా అమ్మాయే నాకు స్ఫూర్తి’ అని సంతోషంగా వివరిస్తున్నారు అముదవల్లి. సంయుక్త కోచింగ్ సెంటర్కి వెళ్లి, అక్కడ శిక్షణ పొంది ఇంటికొచ్చి, ఆ పాఠాలు తల్లికి చెప్పేది. దీనివల్ల ఆ విషయాలు తనకూ బాగా తెలియడంతోపాటు తల్లికీ ఉపయోగకరంగా మారింది. ‘మనం చదువుకున్నది మరొకరికి నేర్పితే, అది మనకు బాగా గుర్తుంటుంది. నేను నేర్చుకున్న టాపిక్స్ మా అమ్మకు నేర్పడం చాలా మంచిదైంది’ అంటోంది సంయుక్త.సాధించిన ద్వయంఅముదవల్లి, సంయుక్త నీట్– 2025 పరీక్ష రాశారు. అముదవల్లి 147 మార్కులు సాధించగా, సంయుక్త 450 మార్కులు సాధించింది. జూలై 30న చెన్నైలో నీట్ కౌన్సిలింగ్కి ఇద్దరూ హాజరయ్యారు. దివ్యాంగుల కోటాలో అముదవల్లికి విరుదనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ రాగా, సంయుక్తకు ఇంకా కళాశాలను అలాట్ చేయలేదు. ‘మా అమ్మతో కలిసి ఒకే కాలేజీ చదవాలని నాకు లేదు. ఆమె ప్రిపేర్ అవుతున్నప్పుడు అదొక్కటే నేను పెట్టిన షరతు’ అని నవ్వింది సంయుక్త. ఇన్నేళ్ల తర్వాత తన తల్లి తన ఆశయాన్ని సాధించి, అనేకమందికి స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందని అంటోంది.నేను చదివినప్పటికీ, ఇప్పటికీ సిలబస్లో చాలా మార్పులొచ్చాయి. అయినా నా కూతురి సాయంతో వాటిని చదివి, అర్థం చేసుకున్నాను. ఇద్దరం కలిసి వాటిని చర్చించి, చదువుకునేవాళ్లం. ఈ విషయంలో మా అమ్మాయే నాకు స్ఫూర్తి.– అముదవల్లి -
మార్నింగ్ వాక్.. మధ్యాహ్నానికి ఎన్టీయేతో కటీఫ్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ(జులై 31, 2025) కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం (OPS) ఎన్డీయే కూటమికి గుడ్బై చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసిన ఫొటో ఒకటి వైరల్ అయిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్తో మార్నింగ్ వాక్లో కనిపించిన ఓపీఎస్.. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే ఆయన వర్గం నుంచి కీలక ప్రకటన వెలువడింది. తమ వర్గం ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకుందని, ఇక ఆ కూటమితో కలిసి నడిచేది లేదని మాజీ మంత్రి, ఓపీఎస్ నమ్మిన బంటు పానుర్తి రామచంద్రన్ గురువారం మధ్యాహ్నాం ప్రకటించారు. ఆ సమయంలో ఓపీఎస్ పక్కనే ఉండడం గమనార్హం. అయితే.. భవిష్యత్తులో ఏ పార్టీతో కలిసి నడుస్తారనేదానిపై ఆయన వర్గం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ పొత్తు అనుకోవడం లేదు.ఎన్నికలు సమీపించే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని ప్రకటించారాయన.అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న పన్నీర్ సెల్వం.. ఎడప్పాడి కె పళని స్వామితో పొరపచ్చాలతో సొంత వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమదే అసలైన అన్నాడీఎంకే వర్గంగా ప్రకటించుకున్న పళనిస్వామి.. ఓపీఎస్ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బహిష్కృత నేతగానే ఓపీఎస్ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన వర్గాన్ని సైతం బీజేపీ దగ్గరకు తీసుకుంది. అయితే.. ఈ మధ్య జరిగిన పరిణామాలతో నొచ్చుకున్న ఆయన ఎన్టీయేకు కటీఫ్ చెప్పారు.కారణం అదే..గంగైకొండ చోళపురం పర్యటనలో ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీకి ఓపీఎస్ ప్రయత్నించారు. అయితే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. తనకు ఆ మాత్రం ప్రాధాన్యం లేదా? రగిలిపోయారాయన. ఆ వెంటనే.. సర్వ శిక్షా అభియాన్ నిధుల జాప్యంపై ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు కూడా. ఇలా వరుస పరిణామాల తర్వాతే ఆయన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ఆయన మద్ధతు ఇస్తారంటూ గత రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈలోపే ఆయన డీఎంకే అధినేతతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పుడు. విజయ్ పార్టీనా? స్టాలిన్ డీఎంకేనా? అనే ఛాయిస్ను బట్టి ఓపీఎస్ను అన్నాడీఎంకే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.బలం పెంచుకునే యోచనలో ఓపీఎస్ ఓపీఎస్ వర్గంలో దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన బలమైన నేతలే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆ వర్గంలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వీళ్లలో వీసీ ఆరుకుట్టి ఇప్పటికే పళనిస్వామి వర్గం వైపుళ్లిపోయారు. ఓపీఎస్ కొడుకు రవీంద్రనాథ్ కూడా విజయ్ టీవీకేతో టచ్లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన మరికొందరిని ఆ పార్టీలోకి తీసుకెళ్తారని ఊహాగానాలు వినవస్తున్నాయి. అదే సమయంలో.. మాజీ సీఎం జయలలితకు సన్నిహితురాలైన శశికళతో పాటు టీటీవీ దినకరన్ను తన వర్గంలోకి చేర్చుకోవాలని ఓపీఎస్ ఉవ్విళ్లూరుతున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన మదురైలో మహానాడు నిర్వహించి తన బలం నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. సొంత పార్టీ ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
న్యాయవ్యవస్థను మోసం చేస్తోంది
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై ఉన్న ‘క్యాష్ ఫర్ జాబ్స్’ఆరోపణల కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యమయ్యేలా చేస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే ఈ కేసులో నిందితులంటూ 2,300 మంది పేర్లను చేర్చిందని ఆరోపించింది. ఈ ప్రయత్నం న్యాయవ్యవస్థను మోసం చేయడమేనని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం అభివరి్ణంచింది. బాలాజీపై ఉన్న కేసుల పూర్తి వివరాలను తమ ఎదుట ఉంచాలని, బుధవారం విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ మొత్తం వ్యవహారంలో మంత్రితోపాటు మధ్యవర్తులుగా వ్యవహరించిందెవరు? మంత్రి సిఫారసులకు అనుకూలంగా పనులు చేసిన అధికారులెవరు? ఉద్యోగాల ఎంపిక కమిటీ సభ్యులెవరు? నియామక ఉత్తర్వులు వెలువరించిన అధికారులెవరు? వంటి వివరాలను తెలపాలని ధర్మాసనం కోరింది. బాలాజీ జీవిత కాలంలో కూడా విచారణ పూర్తి కాకుండా చేయడమే ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోందని పేర్కొంది. మాజీ మంత్రి, ఆయన అనుచరులు ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించమని బలవంతం చేసిన పేదలను లంచం ఇచ్చేవారిగా, ఈ కుంభకోణం కేసులో నిందితులుగా చేర్చారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘క్యాష్ ఫర్ జాబ్స్’కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టుకొట్టివేయడంతో వై.బాలాజీ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టింది. ఏఐఏడీఎంకే హయాంలో 2011–2015 మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన సెంథిల్ బాలాజీ ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో తమిళనాడు పోలీసులు 2018లో మూడు కేసులు నమోదు చేశారు. దీనిపై 2021 ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి, 2023 జూన్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసింది. 2024 ఫిబ్రవరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 15 నెలలపాటు జైలులో ఉన్న బాలాజీకి సుప్రీంకోర్టు 2024 సెపె్టంబర్లో బెయిలిచ్చింది. అదే నెలలో బాలాజీ మళ్లీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, బెయిల్ కావాలో పదవి కావాలో తేల్చుకోవాలని కొరడా ఝళిపించడంతో గతేడాది ఫిబ్రవరిలో పదవి నుంచి వైదొలిగారు. -
ఒంటరిగా వస్తేనే అంగీకరిస్తా..!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి జీవించాలని ఆశ పడి బిడ్డను హత్య చేశానని మహిళ వాంగ్మూలం ఇచ్చింది. కోయంబత్తూర్, ఇరుకూరుకు చెందిన తమిళరసి (30). ఈమె భర్త రఘుపతి. వారికి అపర్ణశ్రీ(4) కుమార్తె ఉంది. రఘుపతి కొన్ని నెలల క్రితం భార్య నుంచి విడిపోయాడు. దీని తరువాత, తమిళరసి తన బిడ్డ అపర్ణశ్రీతో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె కట్టడ నిర్మాణ పనులకు వెళుతుంటుంది .ఆ సమయంలో కట్టడ కారి్మకుడు ధర్మపురి జిల్లాకు చెందిన వసంత్ అనే వ్యక్తితో తమిళఅరసికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బిడ్డను గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు తమిళరసిని అరెస్టు చేసి విచారణ జరిపారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ‘నా భర్త విడిపోయిన తర్వాత, వసంత్తో సంబంధం ఏర్పడింది. వసంత్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇందుకు బిడ్డ ఉంటే తాను అంగీకరించనని, ఒంటరిగా వస్తే తాను అంగీకరిస్తానని చెప్పాడు. పిల్లవాడిని హత్య చేయడం తప్ప తనకు వేరే మార్గం లేదని నిందితురాలు తెలిపింది. బిడ్డ హత్యకు ప్రేరేపించినందుకు వసంత్ను ఆదివారం అరెస్టు చేశారు. -
గబ్బిలాలతో చిల్లీ చికెన్!!
ఫాస్ట్ఫుడ్ ప్రియులకు వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. మీరు ముక్కు తుడుచుకుంటూ, లొట్టలేసుకుంటూ తిన్నది ‘చిల్లీ చికెన్’ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే.. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్కు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి.తమిళనాడు సేలం జిల్లా డేనిష్ పేట అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పేర్లను కమల్, సెల్వంగా చెప్పిన నిందితులు.. విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలను తెలియజేశారు. కొన్ని నెలలుగా గబ్బిలాలను వేటాడుతున్న వీళ్లిద్దరూ.. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్కు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. కొన్ని హోటల్స్కు చిల్లీ చికెన్ తదితర ఐటెమ్స్ను వీళ్లే స్వయంగా గబ్బిలాల మాంసంతో వండించి నేరుగా చేరవేస్తున్నారట. తమ కంటే ముందు కొంతమంది.. కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నారంటూ మరో బాంబ్ పేల్చారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశారు. సేలం, కమల్ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్సెంటర్లపై పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇంతకాలం పిల్లి, కుక్క, ఎలుకల మాంసాన్ని ఇలా తరలించడం చూశాం. ఇప్పుడు ఏకంగా గబ్బిలాల మాంసాన్ని చేరవేస్తుండడం ఇప్పుడు కలవరపాటుకు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. -
‘సిందూర్’తో సత్తా చాటాం
గంగైకొండ చోళపురం: భారతదేశ శక్తి సామర్థ్యాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు, మన శత్రువులకు సురక్షిత స్థానం అంటూ ఎక్కడా లేదన్న నిజాన్ని నిరూపించామని చెప్పారు. మన సార్వభౌమత్వంపై దాడి జరిగితే ప్రతిస్పందన ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ దేశ ప్రజలకు నూతన ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని స్పష్టంచేశారు. ఆదివారం తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో చొళరాజు రాజేంద్ర చోళ–1 జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘ఆది తిరువత్తిరై’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. రాజరాజ చోళ, ఆయన కుమారుడు రాజేంద్ర చోళ–1 చక్రవర్తుల పేర్లు మన దేశ గుర్తింపునకు పర్యాయపదాలు అని కొనియాడారు. వారు మనందరికీ గర్వకారణమని చెప్పారు. తమిళనాడులో భారీ ఎత్తున వారి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మన చరిత్రకు అవి దర్పణాలు అవుతాయని నరేంద్ర మోదీ అన్నారు. సాధారణంగా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు యూకేలోని మాగ్నాకార్టా గురించి మాట్లాడుతుంటారని, నిజానికి వెయ్యి సంవత్సరాల క్రితమే చోళుల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉందని గుర్తుచేశారు. బృహదీశ్వర ఆలయంలో పూజలు గంగైకొండ చోళపురంలో చోళ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ సంప్రదాయ వస్త్రాలు ధరించి, పవిత్ర జలంలో కూడిన కలశం చేతబూని ఆలయంలోకి ప్రవేశించారు. గర్భాలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన చేశారు. అనంతరం భారత పురావస్తు సర్వే విభాగం నిర్వహించిన ప్రదర్శనను తిలకించారు. అంతకముందు గంగైకొండ చోళపురంలో ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. రహదారికి ఇరువైపులా జనం బారులు తీరి ఆయనకు స్వాగతం పలికారు. 3 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీల జెండాలు రెపరెపలాడాయి. ప్రధానితో పళని స్వామి భేటీ తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో శనివారం రాత్రి ఏఐఏడీఎంకే ప్రధా న కార్యదర్శి, తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి సమావేశమయ్యారు. తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్లో ఈ భేటీ జరిగింది. తమిళనాడులో బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొత్తు కుదిరిన తర్వాత మోదీ, పళనిస్వామి కలుసుకోవడం ఇదే మొదటిసారి. రాబోయే అసెంబ్లీ ఎ న్నికలపై వారు చర్చించుకున్నట్లు సమాచారందివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గొప్ప దార్శనికుడిగా, శాస్త్రవేత్తగా, గురువుగా, దేశభక్తుడిగా కలాం చిరస్మరణీయులు అని మోదీ కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి చేసుకొనే దిశగా కలాం ఆలోచనలు, ఆశయాలు యువతకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. కలాంకు మోదీ నివాళులు -
ఎఫ్టీఏతో బహుళ ప్రయోజనాలు
సాక్షి, చెన్నై: యునైటెడ్ కింగ్డమ్(యూకే)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చుకోవడం చరిత్రాత్మకమని, దీనివల్ల మన దేశానికి బహుళ ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ పట్ల ప్రపంచదేశాలకు పెరుగుతున్న విశ్వాసానికి, గౌరవానికి ఈ ఒప్పందమే ఒక నిదర్శనమని వివరించారు. ఎఫ్టీఏతో వికసిత్ భారత్, వికసిత్ తమిళనాడుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. ప్రధాని మోదీ శనివారం తమిళనాడులోని తూత్తుకుడిలో పర్యటించారు. ఎయిర్పోర్ట్, రహదారులు, రైల్వే, విద్యుత్కు సంబంధించిన రూ.4,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. తమిళనాడు సంప్రదాయ వ్రస్తాలు ధరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి సంబంధించిన 99 శాతం ఉత్పత్తులపై బ్రిటన్లో ఇక పన్నులు ఉండవని అన్నారు. ఇండియా ఉత్పత్తుల ధరలు తగ్గితే సహజంగానే డిమాండ్ పెరుగుతుందని, దానివల్ల మన దేశంలో వాటి ఉత్పత్తిని పెంచాల్సి వస్తుందని వెల్లడించారు. ఫలితంగా మన యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల లభిస్తాయని, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, స్టార్టప్లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. విదేశీ పర్యటన ముగించుకొని నేరుగా తమిళనాడులో అడుగుపెట్టడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా మౌలిక సదుపాయాలు, ఇంధనం చాలా ముఖ్యమని చెప్పారు. గత 11 ఏళ్లుగా ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. మన ఆయుధాలతో ఉగ్రవాదుల భరతం పట్టాం ‘మేక్ ఇన్ ఇండియా’ఆయుధాలు ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించాయని, శత్రు శిబిరాలను ధ్వంసం చేశాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మన స్వదేశీ ఆయుధాలతో ఉగ్రవాదుల భరతం పట్టామని, వారికి నిద్రలేకుండా చేశామని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో వంతెనలు, సొరంగాలు నిర్మించామని, దీనివల్ల వేలాది ఉద్యోగాల సృష్టి జరిగిందని, యువత లబ్ధి పొందారని స్పష్టంచేశారు. చెన్నైలోని ప్రఖ్యాత వళ్లువర్ కోట్టం రథం నమూనాను తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ప్రధాని మోదీకి బహూకరించారు. -
బస్సులో అసభ్య ప్రవర్తన
తమిళనాడు: మద్యం మత్తులో ఓ యువతి ఎదుట నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ను బస్సులోని ప్రయాణికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం రాత్రి కలకలం రేపింది. తిరువళ్లూరు బస్టాండు నుంచి శ్రీపెరంబదూరుకు బుధవారం రాత్రి పది గంటలకు ప్రభుత్వ బస్సు సుమారు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు కామరాజర్ విగ్రహం వద్ద వచ్చిన క్రమంలో అప్పటికే మద్యం మత్తులో వున్న వ్యక్తి నగ్నంగా మారి యువతి ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు నగ్నంగా ఉన్న వ్యక్తిని చూసి షాక్కు గురి కావడంతో పాటూ అతడ్ని చితకబాది దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు చేపట్టిన విచారణలో మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి శ్రీపెరంబదూరుకు చెందిన మదియగళన్గా గుర్తించారు. ఇతను అరక్కోణంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్గా పని చేస్తున్నట్టు నిర్ధారించారు. కాగా బస్సులో నగ్నంగా మారి యువత ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యుడి వ్యవహార శైలి స్థానికంగా కలకలం రేపింది. కాగా నిందితుడిని పోలీసు స్టేషన్కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం..!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో కలిసి భార్య.. భర్తను హత్య చేయించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మూడేళ్ల కుమార్తె చెప్పిన సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ చెన్నైలో ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు. ఈ నెల 21న ఇంటికొచ్చిన భారత్ సరకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్లాడు. తిరిగొస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరిమట్టలు అడ్డుగా ఉండటంతో వాటిని దాటే యత్నంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో భారత్పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. బాధితుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానం కలిగింది.భారత్ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. మూడేళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. తన ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి చంపి పారిపోయాడని తెలిపాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వెంటనే నందినితోపాటు సంజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వల్ప అనారోగ్యంతో సోమవారం(జూలై 21) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మార్నింగ్ వాక్ సమ యంలో తల తిరిగినట్లుగా అనిపించిందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీఎం స్టాలిన కు అవసరమైన పరీక్షలు చేశామని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ బీజీ వెల్లడించారు. సీఎం కోలుకుంటున్నారని ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి మీడియాకు ఆస్పత్రి వద్ద తెలిపారు. గత రెండు మూడు నెలలుగా బిజీ షెడ్యూల్ ఉన్నందునే, ఆ ప్రభావం ఆయనపై పడిందన్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారన్నారు. -
కళ్లముందే మరొకరితో ప్రియురాలి తప్పు..!
సాక్షి, చెన్నై : తనను ప్రేమించి పెళ్లికి సిద్ధపడ్డ ప్రియురాలు మరొకరితో మాట్లాతోందనే విషయాన్ని జీర్ణించుకోలేక ఓ ప్రియుడు ఉన్మాది మారాడు. ప్రియురాల్ని కత్తితో పొడిచి చంపేశాడు. నాగపట్నంకు చెందిన దినేష్ (27), సౌందర్య(25) శ్రీపెరంబదూరు సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు మేవలూరు కుప్పంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నట్టు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ ఇంటి యజమానికి తెలియజేసి అద్దెకు ఇళ్లు తీసుకున్నారు. పెళ్లి కాకుండానే ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్న సమాచారం నాగపట్నంలోని తల్లిదండ్రులకు చేరింది. దీంతో ఇద్దరికి పెళ్లి చేయడానికి నిర్ణయించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో తనతో పనిచేస్తున్న ఓ యువకుడితో సౌందర్య మరింత చనువుగా ఉండటం దినేష్ దృష్టికి చేరింది. ఈ విషయంగా ఆమెను మందలించాడు. అయినా, సౌందర్య అతడితో సన్నిహితంగా ఉండటం మొదలెట్టడంతో గొడవలు జరుగుతూ వచ్చాయి. శనివారం రాత్రి ఆ యువకుడితో సౌందర్య ఉండటాన్ని చూసిన దినేష్ ఉన్మాదిగా మారాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం కోపంతో ఇంటికి వెళ్లి పోయాడు. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సౌందర్య స్నేహితులు ఆదివారం ఉదయాన్నే ఆమె ఇంటి వద్దకు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి దినేష్ ,సౌందర్య మధ్య ఇంట్లో గొడవ జరిగడంతో కోపోద్రిక్తుడై ఆమెను కత్తితో పొడిచి చంపేసినట్టు తేలింది. పరారీలో ఉన్న దినేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సౌందర్య మృత దేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. -
బరితెగించిన మానవ మృగం! తప్పించుకుని మరో బాలికను రక్షించి..
పట్టపగలే ఓ మానవ మృగం రెచ్చిపోయింది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లి కాటేసింది. చిన్నారి పారిపోయేందుకు ప్రయత్నించగా.. తీవ్రంగా గాయపరిచింది. అయినా ఆ చిన్నారిని వణికిపోలేదు. ధైర్యం తెచ్చుకుని.. ఎలాగోలా తప్పించుకుంది. అదే దారి వెంట వస్తున్న మరో చిన్నారిని ఆ కిరాతకుడి బారిన పడకుండా రక్షించగలిగింది. తమిళనాడులో హృదయవిదారకమైన ఘటన జరిగింది. తిరువళ్లూరులో పదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఓ వ్యక్తి ఆ చిన్నారిని వెంబడించి మరీ ఎత్తుకెళ్లి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర కలకలం రేపిన ఈ పోక్సో కేసులో అనుమానితుడి ఫొటోలను, ఓ వీడియోను జిల్లా పోలీసులు విడుదల చేశారు. అతనికి సంబంధించిన సమాచారం అందించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జులై 12వ తేదీ జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. పదేళ్ల చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి ఒంటరిగా వెళ్తోంది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి సమీపంలోని మామిడి తోటల్లో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అతను మళ్లీ లాక్కెళ్లి కొట్టాడు. అయితే, ఈలోపు ఆ వ్యక్తికి ఫోన్ కాల్ రావడంతో అతని దృష్టి మరలింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి చిన్నారి తప్పించుకుంది. కాస్త ముందుగా వెళ్లగా అదే దారిలో కిడ్నాప్ వైపు వెళ్తూ మరో చిన్నారి కనిపించింది. బాధిత చిన్నారి ఆ బాలిక వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. అటు వెళ్లొద్దంటూ అక్కడి నుంచి ఊరిలోకి తీసుకెళ్లింది. ఆపై ఇంటికి చేరి అమ్మమ్మకు జరిగినదాన్ని వివరించింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాట దుమారం రేపుతోంది. పౌర సంఘాలతో పాటు విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. డీఎంకే పాలనలో మహిళలకే కాదు.. చిన్నారులకూ రక్షణ లేకుండా పోతోందంటున్నాయి. అన్నామలై వర్సిటీ ఘటన, కదిలే రైలులో గర్బిణిపై జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంకోవైపు తిరువళ్లూరు ఘటనలో నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రన్నింగ్ ట్రైన్లో వచ్చిన నిందితుడు.. బాలికను వెంబడించాడని, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదు అయ్యాయని అన్నారు. అతని ఫోన్ రింగ్ టోన్ హిందీ పాట ఉందని బాధిత బాలిక చెప్పిన ఆచూకీతో ఉత్తరాధి నుంచి వచ్చిన వలస కూలీ అయి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.The suspect in the photos/video is involved in a heinous crime of sexually assaulting a child. It is requested to communicate any information pertaining to him on 9952060948 pic.twitter.com/QBCdi5mQ2K— Thiruvallur District Police (@TNTVLRPOLICE) July 20, 2025 -
కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు కన్నుమూత
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు, సీఎం స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు(77) శనివారం కన్నుమూశారు. నటుడు, నేపథ్య గాయకుడు అయిన ముత్తు వయో సంబంధ సమస్యలతో చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి విషయం తెల్సిన వెంటనే ముత్తు నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. మాజీ గవర్నర్ తమిళిసై సహా పలువురు నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. శనివారం సాయంత్రం బీసెంట్ నగర్లోని విద్యుత్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలకు స్టాలిన్ సోదరి, ఎంపీ కనిమొళి, సోదరులు అళగిరి తదితరులు హాజరయ్యారు. కరుణానిధికి ముగ్గురు భార్యలు కాగా, మొదట భార్య పద్మావతికి పుట్టిన కుమారుడే ముత్తు. -
మూడు దశాబ్దాల తర్వాత ఉగ్రమూకల అరెస్టుపై బీజేపీ హర్షం
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి మూడు దశాబ్దాలుగా చిక్కకుండా తిరుగుతున్న ముగ్గురు టెర్రరిస్టులను ఏటీఎస్( యాంటీ టెర్రరిజం స్వ్కాడ్) అదుపులోకి తీసుకోవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. సదీఖ్ అలీ అలియాస్ టైలర్ రాజా, మహ్మద్ అలీ మన్సూర్, అబుబాకర్ సిద్ధిఖిలను ఏటీస్ బృందం అదుపులోకి తీసుకోవడాన్ని ప్రత్యేకంగా అభినందించారాయన. ఇది తమిళనాడు ఏటీఎస్ పోలీసుల ఘనత అంటూ ఆయన కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గుర్ని మూడు దశాబ్దాల తర్వాత పట్టుకోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మేరకు అన్నామలై ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. After three decades, the Tamil Nadu Anti-Terrorism Squad has successfully arrested three long-absconding terrorists, Sadiq Ali (also known as Tailor Raja), Mohammed Ali Mansoor, and Abubacker Siddique, linked to a series of targeted terror attacks across Tamil Nadu.These… pic.twitter.com/ODNkJ5HqwW— K.Annamalai (@annamalai_k) July 14, 20251998లో కోయాంబత్తూర్లో జరిగిన ఉగ్రదాడిలో 59 మంది ప్రాణాలు కోల్పోగా, మరొకవైపు 1993లో చెన్నై ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో జరిగిన బాంబు దాడి జరిగింది. ఇక 1995లో నాగూర్లో హిందూ మున్నాని నాయకుడు ముతుకృష్ణన్ భార్యను పొట్టనపెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు. రామాయణం పుస్తకంలో బాంబు దాచి ముతుకృష్ణన్ భార్యను హత్య చేశారు. ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ వీరిపై ఏటీఎస్ నిఘా వేసి ఉంచింది. తప్పుడు ఐడెంటీ కార్డులతో ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎన్నుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్న వీరిని ఎట్టకేలకు ఏటీఎస్ బృందం పట్టుకుంది.


