-
తమిళనాడు ఎంపీ మృతి
చెన్నై: తమిళనాడు ఎంపీ ఎం.సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.నాగపట్నం ప్రస్తుత ఎంపీగా ఉన్న 67 ఏళ్ల ఎం. సెల్వరాజ్కి గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. రైతు, సామాజిక కార్యకర్త అయిన సెల్వరాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో అత్యంత సీనియర్ నేత. నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు. 1989, 1996, 1998, 2019లో ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు.ఎంపీ ఎం.సెల్వరాజ్ మృతికి సీపీఐ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయనను ఆదర్శప్రాయమైన నేతగా అభివర్ణించింది. తిరువారూర్ జిల్లాలోని సీతమల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది. కాగా ఈసారి నాగపట్నం నియోజకవర్గం నుంచి వి.సెల్వరాజ్ను సీపీఐ బరిలోకి దింపింది. -
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
చెన్నై: భారతదేశంలో ప్రధాన బాణసంచా తయారీ కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శివకాశీ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.విరుదునగర్ జిల్లా శివకాశీలోని చెంగమాల పట్టిలో శరవణన్ అనే వ్యక్తికి చెందిన 'శ్రీ సుదర్శన్' క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచాలో మందు నింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5 మంది మహిళలతో సహా 8 మంది మరణించారు. మరో 12మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి బాణాసంచా ఫ్యాక్టరీలోని 6కు పైగా గదులు కూలిపోయాయి.ప్రమాదంలో గాయపడిన వారి చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్నిమాపక శాఖ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. అయితే ఈ పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం ఏమిటనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.#WATCH | Explosion occurs in a firecracker manufacturing unit in Tamil Nadu's Virudhunagar; details awaited pic.twitter.com/cALcg6A9Ow— ANI (@ANI) February 17, 2024 -
దివ్యాంగులకు పరీక్షా కాలంలో పలికే చేయి
పరీక్షల సీజన్ వస్తే రమా పద్మనాభన్ ఇంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోదు. పెళ్లిళ్లు, ప్రయాణాలు అసలే ఉండవు. ఆమె తనకు వచ్చే కాల్స్ను అటెండ్ చేసే పనిలో ఉంటుంది. ‘అక్కా.. ఈ ఎగ్జామ్ రాయాలి’ ‘ఆంటీ... ఈ డేట్న ఎంట్రన్స్ ఉంది’ ఇలా దివ్యాంగులు ఆమెకు కాల్స్ చేస్తుంటారు. వారి కోసం ఆమె పరీక్ష హాల్కు వెళ్లి వారి ఆన్సర్స్ను రాసి పెడుతుంటుంది. ‘ఇది గొప్ప తృప్తినిచ్చే సేవ’ అంటోందామె.చదువుకునే రోజుల్లో ఎవరైనా పరీక్షలు రాయవచ్చు. చదువు అయిపోయాక ఏవైనా కోర్సులు సరదాగా చదివితే పరీక్షలు రాయవచ్చు. కాని రమా పద్మనాభన్ అలా కాదు. ఆమె ప్రతి ఆరు నెలలకు విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా 50 పరీక్షలు రాస్తుంది. అంటే రాసి పెడుతుంది. గత పదకొండేళ్లుగా ఆమె అలా చేస్తూనే ఉంది. దివ్యాంగులకు పరీక్షలు రాసి పెట్టే స్క్రయిబ్గా ఆమెకు కోయంబత్తూరులో ఉండే పేరు అలాంటిది.గృహిణిగా ఉంటూ...కోయంబత్తూరుకు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ‘గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్’లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చదివింది. భర్త ఫైనాన్షియల్ సెక్టార్లో పని చేస్తాడు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. గృహిణిగా పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతున్న రమా పద్మనాభన్ జీవితం 2013లో మారింది. ‘ఆ రోజు నేను యోగా క్లాసుకు బయలుదేరాను. నా స్నేహితురాలి నుంచి ‘ఒక అంధ విద్యార్థికి పరీక్ష రాసి పెడతావా?’ అనే విన్నపం వచ్చింది. అలా రాయగలనా అనుకున్నాను. పరీక్ష కేంద్రం దగ్గరే కనుక ట్రై చేద్దామనిపించింది. వెళ్లి రాసి పెట్టాను.పరీక్ష ముగిశాక ఆ అంధ విద్యార్థి ముఖంలో కనిపించిన కృతజ్ఞత నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చింది. ఆ తర్వాత నాకు కాల్స్ రావడం మొదలైంది. కోయంబత్తూరులో లూయిస్ బ్రెయిలీ అకాడెమీ ఉంది. వాళ్లు కాల్ చేస్తూనే ఉంటారు. వీరు కాకుండా దివ్యాంగులు, ఆటిజమ్ విద్యార్థులు... వీరు పెన్ పట్టి పరీక్ష రాయడం కష్టం. వారికి పరీక్షలు రాసి పెడుతుంటాను’ అని తెలిపింది రమా పద్మనాభన్.అంతా ఉచితమేదివ్యాంగులకు, అంధులకు పరీక్షలు రాసేందుకు రమ ఎటువంటి రుసుమూ తీసుకోదు. పరీక్షా కేంద్రానికి కూడా సొంత ఖర్చులతోనే వెళ్లి వస్తుంది. ‘అయితే అందుకు నా భర్తను అభినందించాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టి వేరొకరి పరీక్షలు ఎందుకు రాస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు’ అంటుంది రమ. ‘అంధ విద్యార్థులు తమకు పరీక్షలు రాసి పెట్టే వారు లేరని తెలిస్తే చాలా టెన్షన్ పడతారు. ఆబ్సెంట్ అయితే పరీక్ష పోతుంది. అందుకే వారికి స్క్రయిబ్లు కావాలి. వారు చెబుతుంటే జవాబులు సరిగ్గా రాయగలగాలి. నేను ఆటిజమ్ విద్యార్థులకు రాసి పెట్టేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటాను. వారు సమాధానాలు కంటిన్యూస్గా చెప్పడంలో ఇబ్బంది పడతారు. ప్రోత్సహిస్తూ రాబట్టాలి. అదే కాదు హైస్కూల్ పాఠాల దగ్గరి నుంచి ఇంజినీరింగ్ పాఠాల వరకూ అవగాహన ఉండాలి. అందుకే ఆ పాఠాలు కూడా తెలుసుకుంటూ ఉంటాను. స్క్రయిబ్గా నేను మారేటప్పటికి నా పిల్లలు చిన్నవాళ్లు. నా చిన్నకొడుకుకైతే ఐదారేళ్లవాడు. ఇంటిదగ్గర వాణ్ణి ఒక్కణ్ణే వదిలి తాళం వేసుకుని పరీక్ష రాసి పెట్టిన సందర్భాలున్నాయి’ అని తెలిపిందామె.కొనసాగే అనుబంధం‘నేను రాసిన పరీక్షలతో కోర్సులు పాసై ఉద్యోగాలు పొందిన దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా నా కాంటాక్ట్లో ఉంటారు. తమ జీవితంలో సాధిస్తున్న ప్రగతిని తెలియజేస్తుంటారు. అదంతా వింటుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. జీవితానికి ఒక అర్థం దొరికినట్టు ఉంటుంది. నా పెద్దకొడుకు సీనియర్ ఇంటర్కు వచ్చాడు. వాణ్ణి వీలున్నప్పుడల్లా స్క్రయిబ్గా పని చేయడానికి పంపుతున్నా. వాడు ఆ పని చేస్తున్నందుకు ఎంత సంతోష పడుతున్నాడో చెప్పలేను’ అని ముగించింది రమా పద్మనాభన్. -
ఏడాది చివరి నాటికి 7,030 కొత్త బస్సులు
● త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులు సాక్షి చైన్నె: ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ 7,030 కొత్త బస్సులను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ రవాణా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఎనిమిది ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన 20,260 బస్సులు ద్వారా 10,128 మార్గాల్లో పబ్లిక్ బస్సులు నడుపుతోంది. రోజుకు 18,728 బస్సులు, అలాగే సాధారణ ప్రజల అవసరాల మేరకు వారాంతాల్లో మరిన్ని ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రోజుకు 1.78 కోట్ల మంది ప్రయాణికులకు లబ్ధి పొందుతున్నారు. ఇందులో మహిళల ప్రయోజనం కోసం ఉచితంగా నడపే 7,179 బస్సుల్లో రోజుకు 51.47 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు.2014 ఏప్రిల్ 24 నాటి ఆదేశాల మేరకు అన్ని బస్సులను తనిఖీ చేసి, మరమ్మతులు చేయించాలని, ప్రస్తుతం అన్ని బస్సులను యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేసి, మరమ్మతులు చేస్తున్నారు. కోవిడ్ –19 మహమ్మారి 2020 –21, 22 మధ్యకాలంలో రవాణా సంస్థల్లో ఎలాంటి ఆదాయం లేకపోవడం, తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయలేపోయింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 2022– 23లో వెయ్యి కొత్త బస్సులు, 2023–24లో వెయ్యి కొత్త బస్సులు, 2004లో 3 వేల బస్సులు, ఎస్ఏటీపీ పథకం కింద 16 బస్సులను అందజేయనుందని వెల్లడించింది. అలాగే చైన్నె టోటల్ కాస్ట్ కాంట్రాక్ట్ కింద వెయ్యి విద్యుత్ బస్సులను నడపాలని ప్రణాళికను సిద్ధం చేసింది. మొదటి దశలో 500 విద్యుత్ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 7,030 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. -
తమిళనాడులో భారీ పేలుడు
చెన్నై: తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా, 12 మందికి గాయాలైనట్లు సమాచారం. విరుదునగర్ జిల్లా కారియాపట్టీలోని ఓ క్వారీలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.Tamil Nadu | At least three people died in an explosion that occurred in a stone quarry near the Kariapatti area of Virudhunagar district, this morning. Rescue operation is underway: Virudhunagar Fire and Rescue Department,— ANI (@ANI) May 1, 2024 -
Lok Sabha Elections 2024: తమిళనాడు లోక్సభ ఎన్నికలు.. ఓటేసిన స్టార్స్ (ఫోటోలు)
-
ముగిసిన లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
Lok Election 2024 First Phase Polling Updates లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో ఉన్నవారికి ఓటు వేసే చాన్స్ తొలి విడతలో భాగంగా దేశ వ్యాప్తంగా 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది 5 గంటల వరకు అందిన వివరాల ప్రకారం సగటున 60 శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతాలు అండమాన్ -నికోబార్ -56.87 శాతం అరుణాచల్ ప్రదేశ్ -63.27 శాతం అస్సాం -70.77 శాతం చత్తీస్ ఘడ్ -63.41శాతం జమ్మూ- కాశ్మీర్ -65.08 శాతం లక్షద్వీప్ -59.02 శాతం మధ్యప్రదేశ్ -63.25 శాతం మహారాష్ట్ర -54.85శాతం మణిపూర్ -67.66 శాతం మేఘాలయ -69.91 శాతం మిజోరాం -52.73 శాతం నాగాలాండ్ -55.79 శాతం పుదుచ్ఛేరి -72.84 శాతం రాజస్థాన్ -50.27 శాతం సిక్కిం -68.06శాతం తమిళనాడు -62.02 శాతం త్రిపుర -76.10శాతం ఉత్తరప్రదేశ్ -53.56 శాతం ఉత్తరాఖండ్ - 57.54 శాతం పశ్చిమబెంగాల్ -77.57 శాతం బిహార్ -46.32 శాతం మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతాలు అండమాన్ -నికోబార్ -45.48శాతం అరుణాచల్ ప్రదేశ్ -55.05 శాతం అస్సాం -60.70 శాతం చత్తీస్ ఘడ్ -58.14శాతం జమ్మూ- కాశ్మీర్ -57.07 శాతం లక్షద్వీప్ -43.98 శాతం మధ్యప్రదేశ్ -53.40 శాతం మహారాష్ట్ర -44.12శాతం మణిపూర్ -63.03 శాతం మేఘాలయ -61.95 శాతం మిజోరాం -49.77 శాతం నాగాలాండ్ -51.73 శాతం పుదుచ్ఛేరి -58.86 శాతం రాజస్థాన్ -41.51 శాతం సిక్కిం -52.72శాతం తమిళనాడు -51.10 శాతం త్రిపుర -68.35శాతం ఉత్తరప్రదేశ్ -47.44 శాతం ఉత్తరాఖండ్ -45.62 శాతం పశ్చిమబెంగాల్ -66.34 శాతం బిహార్ -39.73 శాతం మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ శాతాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు- 35. 70 శాతం అరుణాచల్ ప్రదేశ్- 35.75 శాతం అస్సాం- 45.12 శాతం బిహార్- 32.41శాతం చత్తీస్ఘడ్- 42.41శాతం జమ్ము అండ్ కశ్మీర్- 43.11 శాతం లక్ష్యదీప్- 29.91 శాతం మధ్యప్రదేశ్- 44.43 శాతం మహారాష్ట్ర - 32.36 శాతం మణిపూర్- 46.92శాతం మేఘాలయ- 48.91 శాతం మిజోరం- 37.43 శాతం నాగాలాండ్- 39.66 శాతం పుదుచ్చేరి- 44.95 శాతం రాజస్థాన్- 33. 73శాతం సిక్కిం- 36.82 శాతం తమిళానాడు- 39. 51శాతం త్రిపుర- 53.04 శాతం ఉత్తరప్రదేశ్ 36. 96శాతం ఉత్తరఖండ్- 37. 33 శాతం తమిళనాడు ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు విజయ్ తమిళనాడులో లోక్సభ తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది నటుడు, తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని నీలంకరైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు #WATCH | Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam president Vijay casts his vote at a polling booth in Neelankarai, Chennai#LokSabhaElections2024 pic.twitter.com/rTtu4tGZJy — ANI (@ANI) April 19, 2024 మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు మణిపూర్లో లోక్సభ ఎన్నికల తొలి విడతలో భాగంగా ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది మణిపూర్లోని మొయిరాంగ్ సెగ్మెంట్లోని థమన్పోక్పిలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో పోలింగ్ కేంద్ర వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లలో ఈ కాల్పులు భయాందోళనకు గురి చేశాయి కాల్పుల శబ్దం మధ్య పోలింగ్ బూత్ నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసిన వీడియో వైరల్గా మారింది ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ ఉదయం11 గంటల వరకు 102 సీట్లలో 24 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్ అధికారులు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది లోక్సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతాలు అండమాన్ అండ్ నికోబార్ దీవులు- 21.82 శాతం అరుణాచల్ ప్రదేశ్- 18.26 శాతం అస్సాం- 27. 22 శాతం బిహార్- 20. 42 శాతం చత్తీస్ఘడ్- 28. 12 శాతం జమ్ము అండ్ కశ్మీర్- 22.60 శాతం లక్ష్యదీప్- 16.33 శాతం మధ్యప్రదేశ్ 30.46 శాతం మహారాష్ట్ర 19. 17 శాతం మణిపూర్- 27. 64 శాతం మేఘాలయ- 31.65 శాతం మిజోరం- 26. 23 శాతం నాగాలాండ్- 22. 50 శాతం పుదుచ్చేరి- 27. 63 శాతం రాజస్థాన్- 22. 51 శాతం సిక్కిం- 21.20 శాతం తమిళానాడు- 23. 72 శాతం త్రిపుర- 33.28 శాతం ఉత్తరప్రదేశ్ 25.20 శాతం ఉత్తరఖండ్- 24.83 శాతం #LokSabhaElections2024📷 | Voter turnout till 11 am for phase 1 of polling: Lakshadweep records the lowest - 16.33% Tripura records the highest - 33.28% pic.twitter.com/tgkI2p7ATU — ANI (@ANI) April 19, 2024 ఓటేసిన మేఘాలయ సీఎం మేఘాలయలో పోలింగ్ కొనసాగుతోంది ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పశ్చిమ గారో హిల్స్లోని తురాలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు #WATCH | Meghalaya CM Conrad Sangma casts his vote at a polling booth in Tura, West Garo Hills#LokSabhaElections2024 pic.twitter.com/qyXK0MVPkb — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వినియోగించుకున్న జ్యోతి అమ్గే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు నాగ్పూర్లో ఓటు వేసిన జ్యోతి అమ్గే #WATCH | Maharashtra: World's smallest living woman, Jyoti Amge cast her vote at a polling booth in Nagpur today. #LokSabhaElections2024 pic.twitter.com/AIFDXnvuvk — ANI (@ANI) April 19, 2024 ఓటేసిన సిక్కిం సీఎం సిక్కింలో లోక్సభ పోలింగ్ కొనసాగుతోంది గ్యాంగ్టక్ పోలింగ్ కేంద్రంలో సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు #WATCH | Sikkim CM Prem Singh Tamang casts his vote for #LokSabhaElections2024 and state Assembly Elections 2024 at a polling station in Gangtok pic.twitter.com/XY6agVbGTr — ANI (@ANI) April 19, 2024 తమిళనాడులో మందకోడిగా సాగుతున్న పోలింగ్ ఉదయం నుంచే ఎండ పెరగటంతో బయటకు రాని జనం ఉదయం 9 గంటలకు వరకు 12. 55 శాతం పోలింగ్ నమోదు ఓటు వేసిన త్రిపుర సీఎం అగర్తలా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన సీఎం మాణిక్ షాహా కొనసాగుతున్న పోలింగ్ #WATCH | Tripura CM Manik Saha casts his vote at a polling booth in Agartala #LokSabhaElections2024 pic.twitter.com/g7ztewDNxT — ANI (@ANI) April 19, 2024 తమిళనాడు ఓటు వేసిన కమల్ హాసన్ నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు కోయంబేడులో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Tamil Nadu: Actor and MNM chief Kamal Haasan arrives at a polling booth in Koyambedu, Chennai to cast his vote. Makkal Needhi Maiam (MNM) is not contesting the #LokSabhaElections2024, the party supported and campaigned for DMK. pic.twitter.com/q1bizg3Wey — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వినియోగించుకున్న బాబారాందేవ్, బాలకృష్ణ ఉత్తరఖండ్ హరిద్వార్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Uttarakhand: Yog guru Baba Ramdev and Patanjali Ayurved's Managing Director Acharya Balkrishna cast their votes at a polling booth in Haridwar#LokSabhaElections2024 pic.twitter.com/6fho7bk5t9 — ANI (@ANI) April 19, 2024 ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతాలు తమిళనాడు- 8. 21 శాతం త్రిపుర- 15, 21 శాతం ఉత్తర ప్రదేశ్- 12. 66 శాతం ఉత్తరఖండ్- 10. 54 శాతం పశ్చిమబెంగాల్- 15. 09 శాతం లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది #LokSabhaElections2024 | Voter turnout till 9 am for phase 1 of polling: Lakshadweep records the lowest - 5.59% Tripura records the highest - 15.21% pic.twitter.com/Y5ekbBDCrU — ANI (@ANI) April 19, 2024 ఉత్తరఖండ్ ఓటు వేసిన ఉత్తరఖండ్ సీఎం ఉత్తరఖండ్లో పోలింగ్ కొనసాగుతోంది ఉత్తరఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హక్కు వినియోగించుకున్నారు #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami along with his mother and wife cast his vote for the first phase of #LokSabhaElections2024 at a polling station in Khatima. pic.twitter.com/kd4ZC1uyTJ — ANI (@ANI) April 19, 2024 మిజోరం ఓటు వేసిన మిజోరం గవర్నర్ మిజోరం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐజ్వాల్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Mizoram Governor Dr Hari Babu Kambhampati casts his vote at a polling booth in Aizawl#LokSabhaElections2024 pic.twitter.com/GYkykdPz8n — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన అన్నామలై కోయంబత్తూర్ బీజేపీ అభ్యర్థి అన్నామలై ఓటు హక్కు వినియోగించకున్నారు. తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది తమిళనాడు మొత్తం 39 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరుగుతోంది "DMK, AIADMK has spent 1000 crores in Coimbatore": BJP's Annamalai alleges after casting his vote Read @ANI Story | https://t.co/pE64lzIK5U#LokSabhaElection2024 #TamilNadu #KAnnamalai #Votingday #BJP pic.twitter.com/Mie4ulXT79 — ANI Digital (@ani_digital) April 19, 2024 కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఊపందుకున్న పోలింగ్ ప్రక్రియ ఎండాకాలం కావడంతో ఉదయాన్నే ఓటింగ్ వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు సీఎం తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో సీఎం స్టాలిన్ ఓటు వేశారు #WATCH | Tamil Nadu CM and DMK chief MK Stalin casts his vote at a polling booth in Chennai.#LokSabhaElections2024 pic.twitter.com/IGyEcGD34I — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన రాజస్తాన్ సీఎం రాజస్తాన్లో పోలింగ్ కొనసాగుతోంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు రాజస్తాన్ సీఎం భజనలాల్ శర్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు #WATCH | Rajasthan CM Bhajanlal Sharma casts his vote for the first phase of #LokSabhaElections2024, in Jaipur, Rajasthan. pic.twitter.com/kTjB47fk2Y — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో రజినీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu.#LokSabhaElections2024 pic.twitter.com/kdgb3ewP8p — ANI (@ANI) April 19, 2024 #WATCH | Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu. #LokSabhaElections2024 pic.twitter.com/6Ukwayi5sv — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన మాజీ సీఎం కమల్ నాథ్ మధ్యప్రదేశ్: మాజీ సీఎం కమల్నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమల్ నాథ్ కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ చింద్వారా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చింద్వారాలో పోలింగ్ కొనాసాగుతోంది #WATCH | Chhindwara | Congress leader & former Madhya Pradesh CM Kamal Nath says, "I have full faith in the people of Chhindwara. I have full hope that they will stand by the truth." His son and Congress leader Nakul Nath is contesting from the Chhindwara Lok Sabha seat… pic.twitter.com/2La3i41ZoI — ANI (@ANI) April 19, 2024 #WATCH | Chhindwara | Congress leader & former Madhya Pradesh CM Kamal Nath shows his inked finger after casting his vote in the first phase of #LokSabhaElections2024📷 His son and Congress leader Nakul Nath is contesting from the Chhindwara Lok Sabha seat pic.twitter.com/XpDqSqr7oG — ANI (@ANI) April 19, 2024 మేఘాలయ వెస్ట్ గారో హిల్స్లోని తురాలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలో నిల్చున్నారు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాని వచ్చారు #WATCH | #LokSabhaElections2024 | People queue up outside a polling station in Tura, West Garo Hills Meghalaya CM Conrad Sangma is also present here to cast his vote. pic.twitter.com/laVAKteCoe — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వినియోగించుకున్న సినీ హీరో అజిత్ తమిళనాడు: సినీ హీరో అజిత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు తిరువాన్మియూర్ పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Tamil Nadu: Ajith Kumar arrives at a polling Booth in Thiruvanmiyur to cast his vote in the first phase of #LokSabhaElections2024 pic.twitter.com/WW3vcvbMEn — ANI (@ANI) April 19, 2024 లోక్సభ ఎన్నిక తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలతోపాటు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లుర్లు భారీగా ఓటు వేయడానికి తరలివస్తున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది ఓటు వేసిన తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు( చెన్నై): చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి తమిళిసై తన ఓటు హక్కు వినియోగించుకున్నారు చెన్నైలో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Tamil Nadu: BJP's South Chennai candidate Tamilisai Soundarajan arrives at a polling booth in Saligramam, Chennai to cast her vote.#LokSabhaElections2024 pic.twitter.com/9PGQiaH23d — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోదీ 2024 లోక్సభ ఎన్నికలు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ స్థానాల్లో ఓటు హక్కు ఉన్న ఓటర్లు.. రికార్డు స్థాయిలో తమ వినియోగించుకోవాలని కోరుతున్నాను PM Narendra Modi says, "The 2024 Lok Sabha elections commence today! As 102 seats across 21 States and UTs go to the polls, I urge all those voting in these seats to exercise their franchise in record numbers..."#LokSabhaElections2024 pic.twitter.com/7rJrJRTvgt — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన పళనిస్వామి మాజీ సీఎం ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి ఓటు వేశారు సేలంలో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Former Tamil Nadu CM and AIADMK leader Edappadi K Palaniswami casts his vote at a polling booth in Salem. #LokSabhaElections2024 pic.twitter.com/NT6zdXtFiE — ANI (@ANI) April 19, 2024 ఓటు వేసిన కాంగ్రెస్ నేత పి. చిదంబరం తమిళనాడు: కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం శివగంగ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Tamil Nadu: Congress leader P Chidambaram casts his vote at a polling booth in Sivaganga.#LokSabhaElections2024 pic.twitter.com/9Aq8IfY5cT — ANI (@ANI) April 19, 2024 ఉత్తరఖండ్: ఉత్తరఖండ్ చీఫ్ ఎన్నికల అధికారి బీవీఆర్సీసీ పురుషోత్తం ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్తరఖండ్లో లోక్సభ తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది Uttarakhand Chief Electoral Officer BVRCC Purushottam cast his vote at booth number 141 in Dehradun.#LokSabhaElections2024 pic.twitter.com/32SYUpTdI8 — ANI (@ANI) April 19, 2024 ఓటు హక్కు వేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మహారాష్ట్ర( నాగ్పూర్) ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది #WATCH | Nagpur, Maharashtra: RSS chief Mohan Bhagwat shows his inked finger after casting his vote in the first phase of #LokSabhaElections2024 pic.twitter.com/rqZ2Fn0ZU1 — ANI (@ANI) April 19, 2024 లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూలైన్లో నిల్చున్నారు పోలీసులు అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేశారు పోలింగ్ సిబ్బంది ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నేడే లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ తొలి దశలో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం, మహారాష్ట్రల్లో 5, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3,ఉత్తరాఖండ్లోని 5, అరుణాచల్ప్రదేశ్లోని 2, మేఘాలయలో 2, అండమాన్ నికోబార్లో 1, మిజోరాంలో 1, పుదుచ్చేరిలో 1, సిక్కింలో1, లక్షద్వీప్లోని 1 సీటు, మణిపూర్లో 3, జమ్మూ-కశ్మీర్, ఛత్తీస్గఢ్, త్రిపురలో ఒక్కో సీటుకి పోలింగ్ 2019 ఎన్నికల్లో తొలి దశలో పోలింగ్ జరిగిన 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీయే 41 స్థానాలు గెలుపు #WATCH | #LokSabhaElection2024 | Tamil Nadu: Polling preparations underway at polling booth number 134 in Sivaganga district All 39 Lok Sabha seats in Tamil Nadu are going to polls today, in the first phase of the 2024 general elections. pic.twitter.com/EkLf5SPXPb — ANI (@ANI) April 19, 2024 తొలిదశ బరిలో ప్రముఖులు: కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, డీఎంకే నేత ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం. జూన్ 4న ఎన్నికల ఫలితాలు #WATCH | #LokSabhaElection2024 | People queue up outside a polling station in Soreng, Sikkim. Sikkim is represented by a single seat in the Lok Sabha, pic.twitter.com/69lLuyznaR — ANI (@ANI) April 19, 2024 సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన లోక్సభ ఎన్నికల తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటితోపాటే అరుణాచల్ ప్రదేశ్లోని మొత్తం 60, సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. స్థానిక పరిస్థితులను బట్టి పోలింగ్ వేళల్లో మార్పులుచేర్చే అవకాశముంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్కుమార్ సుఖ్బీర్సింగ్ సంధూ పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్కుమార్ విజ్ఞప్తి చేశారు. తొలి దశలో బరిలో నిల్చిన నేతలు.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ(నాగ్పూర్ నియోజకవర్గం), కిరెన్ రిజిజు(అరుణాచల్ వెస్ట్), సంజీవ్ భలియా(ముజఫర్నగర్), జితేంద్ర సింగ్(ఉధమ్పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్(బికనీర్), ఎల్.మురుగన్(నీలగిరి), శర్బానంద సోనోవాల్(దిబ్రూగఢ్), భూపేంద్ర యాదవ్(అల్వార్) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్కుమార్ దేవ్, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్ కె.అన్నామలై, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్ ప్రసాద, నితిన్ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వం, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ పోటీచేస్తున్న స్థానాల్లోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. Polling team proceeding to Gate and Gasheng village under Payum circle in Siang District- Arunachal Pradesh, Dated 17th, April 2024.@ceoarunachal 🙌🤝#Elections2024 #IVoteForSure #ChunavKaParv #DeshKaGarv #saathchalenge #YouAreTheOne pic.twitter.com/hZ0YQ6sycr — Election Commission of India (@ECISVEEP) April 18, 2024 భారీగా ఏర్పాట్లు తొలి దఫా పోలింగ్ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్లర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు సమకూర్చారు. తప్పకుండా ఓటేయాలి: సీఈసీ రాజీవ్ ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోసందేశం విడుదలచేశారు. ‘‘ భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి అత్యంత రమణీయమైన భావన. ఇందులో ఓటింగ్కు మించింది లేదు. భారతీయ ఓటర్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ఎండ వేడిమినీ అధిగమిస్తుంది. ఎన్నికలు మీవి. ఎవరిని ఎన్నుకోవాలనేది మీ ఇష్టం. మీ ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ కుటుంబం, పిల్లలు, పల్లె, గ్రామం.. అంతెందుకు దేశం కోసం మీరు వేస్తున్న ఓటు ఇది’ అని రాజీవ్ వ్యాఖ్యానించారు. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాడు ఈ 102 సీట్లలో 45 చోట్ల యూపీఏ గెలుపు 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ గెలిచినవే 39 ఉన్నాయి. సమస్యాత్మక బస్తర్లోనూ.. మావోల దాడులు, పోలీసు బలగాల ఎదురుకాల్పుల మోతలతో దద్దరిల్లే ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోనూ శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. బస్తర్లోని కాంకేర్ జిల్లాలో ఈనెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మరణించిన నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్లో 61 పోలింగ్బూత్లు సున్నితమైన ప్రాంతాల్లో, 196 బూత్లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. బస్తర్ నుంచి కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేశ్ కశ్యప్ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూత్లలో పోలింగ్ను మధ్యా హ్నం మూడు గంటలవరకే అనుమతిస్తారు. 191 ‘సంఘ్వారీ’ బూత్లను మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. 42 ‘ఆదర్శ్’, 8 ‘దివ్యాంగ్జన్’, 36 యువ బూత్లనూ ఏర్పాటుచేశారు. -
Lok sabha elections 2024: ఆ ఏడు స్థానాల్లోబిగ్ ఫైట్
లోక్సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకూ శుక్రవారం తొలి దశలోనే ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ ద్రవిడనాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ద్విముఖ పోటీయే రివాజు. ఈసారి అన్నాడీఎంకే బలహీనపడిపోగా దాని స్థానాన్ని క్రమంగా బీజేపీ చేజిక్కించుకుంటున్నట్టు కని్పస్తోంది. డీఎంకేకు కమళదళం గట్టి పోటీ ఇస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సొంతంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంతేగాక చాలా స్థానాల్లో డీఎంకే భాగ్యరేఖలను బీజేపీ మార్చేసేలా కని్పస్తోందని సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఏకంగా 38 సీట్లు కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు బాగా తగ్గుతాయని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో బీజేపీకి తమిళనాట సానుకూల వాతావరణం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా రెండంకెలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు హాట్ సీట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారింది... కోయంబత్తూర్ బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శాఖలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత సీఎం కె.కామరాజ్ పేరిట 24 గంటలూ మొబైల్ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీల్లో మరొకటి. ఇక్కడ 1999లో బీజేపీ తరఫున సి.పి.రాధాకృష్ణన్ విజయం సాధించారు. తర్వాత డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం గెలుస్తూ వస్తున్నాయి. 2014లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి.నాగరాజన్ నెగ్గారు. అయితే గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలున్నాయి. డీఎంకే నుంచి పి.రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీలో ఉన్నారు. తూత్తుకుడి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే తరఫున సిట్టింగ్ ఎంపీ, దివంగత సీఎం కరుణానిధి కూతురు, సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) నుంచి విజయశీలన్, అన్నాడీఎంకే నుంచి ఆర్.శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3.47 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం. అయితే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత. పుత్తూర్ బోన్ అండ్ జాయింట్ సెంటర్ అధినేత. చారిత్రకంగా ఇక్కడి నుంచి డీఎంకే లేదంటే అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలన్ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసొస్తోంది. ఈసారి సౌత్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్ 2019 తూత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం! చెన్నై సౌత్ ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ హుటాహుటిన రాజీనామా చేసి చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నేతగానే గాక డాక్టర్గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె చిరపరిచితులే. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండడం ఆమెకు మరింత కలిసొచ్చే అంశం. 2019లో ఇక్కడ డీఎంకే తరఫున తమిళాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగపాండియన్ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో డీఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. నీలగిరీస్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. డీఎంకే నేత ఎ.రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. 2009, 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షల ఓట్లు (54.2 శాతం) సొంతం చేసుకున్నారు! అయితే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2జీ కుంభకోణం ఆరోపణల దెబ్బకు 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్.మురుగన్ను బరిలో దింపింది. ఈ నియోజకవర్గంలో బడగాస్ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదన్నది విశ్లేషకుల అంచనా. కృష్ణగిరి ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయిన ఆమె నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కె.గోపీనాథ్, అన్నాడీఎంకే నుంచి వి.జయప్రకాశ్, బీజేపీ నుంచి సి.నరసింహన్ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఎ.చెల్లకుమార్ ఘన విజయం సాధించారు. 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడిచింది. తర్వాత ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే పోటీ ఉండేది. ఈ విడత కాంగ్రెస్ సిటింగ్ ఎంపీని మార్చడం, వీరప్పన్ కుమార్తె బరిలో ఉండటం పోటీపై ఆసక్తిని పెంచింది. రామనాథపురం ఏకంగా మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా (రెండుసార్లు జయలలిత న్యాయ సమస్యల్లో చిక్కినప్పుడు, మూడోసారి ఆమె మరణానంతరం) పనిచేసిన ఒ.పన్నీర్సెల్వం రాజకీయ భవిష్యత్ ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నాడీఎంకే ఆయన్ను బయటకు పంపేసింది. దాంతో ఓపీఎస్ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి కుల సమీకరణాలు కూడా ఓపీఎస్కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కె.నవాన్ ఖని (ఐయూఎంఎల్) ఓపీఎస్కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్య్సకారుల సమస్య ఇక్కడ ప్రధానాంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తుండడం ఓపీఎస్కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. తేని జయలలిత తర్వాత అన్నాడీఎంకే సారథి కావాలన్న శశికళ కల కూడా నెరవేరకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్ తేని లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓపీఎస్ దన్నుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికీ బీజేపీ మద్దతిస్తోంది. పైగా తేని సిట్టింగ్ ఎంపీ పి.రవీంద్రనాథ్ పన్నీర్సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకరన్ విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. దీనికి తోడు ఓపీఎస్ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: జాతీయ పార్టిలకు... ద్రవిడ స్వప్నం!
దక్షిణాదిన జాతీయ పార్టిలకు కొరకరాని కొయ్యగా నిలుస్తున్న రాష్ట్రాల్లో ప్రధానమైనది తమిళనాడు! 50 ఏళ్లకు పైగా ఇక్కడ ప్రాంతీయ పార్టిలదే హవా. తమిళులు కూడా సినీ గ్లామర్, ప్రాంతీయ సమస్యలు, అంశాలకే ప్రాధాన్యమిస్తారు. కానీ 39 లోక్సభ స్థానాలతో సీట్లపరంగా దేశంలో ఐదో అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడును పక్కనపెట్టే పరిస్థితి లేదు. దాంతో కాంగ్రెస్, బీజేపీ ఇక్కడి ప్రాంతీయ పార్టితో పొత్తులు పెట్టుకోక తప్పడం లేదు. ఈసారి మాత్రం రాష్ట్రంలో బీజేపీ గట్టిగా ఉనికిని చాటే ప్రయత్నాల్లో ఉంది... ఇండియా కూటమిదే హవా? ఒకప్పుడు కరుణానిధి డీఎంకే, జయలలిత అన్నాడీఎంకేలకు కంచుకోటైన నిలిచిన తమిళనాట వారి తదనంతరం పరిస్థితులు మారుతున్నాయి. అన్నాడీఎంకే వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీ బలహీనపడటంతో ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేసి ఈ కీలక దక్షిణాది రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కూడా ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పాలక డీఎంకేతో జట్టుకట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన యూపీఏ కూటమి ఎన్డీఏను మట్టికరిపించింది. ఏకంగా 38 సీట్లను ఎగరేసుకుపోయింది. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే 23 స్థానాల్లో పోటీ చేసి 23 సీట్లు చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 9 స్థానాలకు 8 దక్కించుకుంది. సీపీఐ, సీపీఎం చెరో రెండు, ఇతర చిన్న పార్టీలు ఒక్కో సీటు గెలుచుకున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలో 37 స్థానాలు కొల్లగొట్టిన అన్నాడీఎంకే 2019లో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి బొక్కబోర్లా పడింది. 21 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలుచు కుంది. బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ (ఎం) ఖాతా కూడా తెరవలేదు. ఈసారి ఇండియా కూటమి నుంచి డీఎంకే 21, కాంగ్రెస్ 9, సీపీఐ, సీపీఎం, వీసీకే రెండేసి స్థానాల్లో, ఎండీఎంకే, ఐయూఎంఎల్ చెరో చోట పోటీ చేస్తున్నాయి. ఒక స్వతంత్రుడు డీఎంకే మద్దతుతో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అవినీతి వర్సిటీకి చాన్సలర్ మోదీ దేశంలో అత్యంత అవినీతిమయమైన పార్టీ బీజేపీయే. అవినీతి పేరుతో యూనివర్సిటీ పెడితే దానికి మోదీయే చాన్సలర్ అవుతారు. ఆ అర్హతలన్నీ ఆయనకే ఉన్నాయి. – చెన్నై రోడ్షోలో సీఎం స్టాలిన్ బీజేపీ పాగా వేసేనా? ద్రవిడ రాజ్యంలో పాగా వేయాలని తహతహలాడుతున్న కమలనాథులకు అన్నాడీఎంకే దూరమవడంతో ఈసారి ఆదిలోనే షాక్ తగిలింది. దాంతో చిన్నాచితకా పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ (ఎం)కు 3, ఎస్.రాందాస్కు చెందిన పట్టాలి మక్కల్ కచి్చకి 10, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)కు 2 సీట్లు కేటాయించింది. మరో 4 చోట్ల కూటమిలోని ఇతర పక్షాలు కమలం గుర్తుపై పోటీ చేయనున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్సెల్వంకు బీజేపీ మొండిచేయి చూపింది. ప్రధాని మోదీ తమిళనాట సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. అయోధ్య, డీఎంకే అవినీతి, కుటుంబ పాలనను ప్రచారా్రస్తాలుగా మలచడంతో పాటు తమిళ భాషకు పెద్దపీట వేస్తామంటూ పదేపదే ప్రకటిస్తున్నారు. దివంగత విజయకాంత్ పార్టీ డీఎండీకే (5 సీట్లు), మరో రెండు పార్టిలతో (చెరో సీటు) అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తోంది. 32 చోట్ల ఆ పార్టీ బరిలో ఉంది. అన్నామలై... బీజేపీ తురుపుముక్క బీజేపీకి తమిళనాట ఎట్టకేలకు కె.అన్నామలై రూపంలో ఫైర్బ్రాండ్ నాయకుడు దొరికారు. 2021లో 36 ఏళ్ల అతి చిన్న వయసులో పార్టీ పగ్గాలు అందుకుని శరవేగంగా కీలక నేతగా ఎదిగారు. ‘సింగమ్ అన్న’గా పేరొందిన ఈ మాజీ ఐపీఎస్ మొత్తం పాదయాత్రతో క్రేజ్ సంపాదించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టడంతో పాటు హిందుత్వ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దూకుడు, వాగ్ధాటితో బీజేపీకి జోష్ తెచ్చారు. కోయబత్తూరు నుంచి బరిలో ఉన్నారు. రాజధానిని నాగపూర్కు ఎలా మారుస్తారు? అర్థంపర్థముందా? కమల్ పిచ్చాసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకుంటే మంచిది. డీఎంకే ప్రాపకం, రాజ్యసభ స్థానం కోసమే ఆయన పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు – కోయంబత్తూరు ర్యాలీలో అన్నామలై ఐదుగురు ‘సినీ’ సీఎంలు తమిళ రాజకీయాలకు, సినిమాలకు బ్రిటిష్ కాలం నుండీ విడదీయరాని బంధం! నాటి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నుండి తాజాగా విజయ్ దాకా వెండితెరపై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచి్చనవారే. సినీ పరిశ్రమ నుంచి తమిళనాట ఐదుగురు ముఖ్యమంత్రులయ్యారు. ద్రవిడ సిద్ధాంతాలను సినిమాల్లో చొప్పించిన వారిలో రాష్ట్ర తొలి ద్రవిడ సీఎం సీఎన్ అన్నాదురై ముందుంటారు. ఇక కవిగా, స్క్రీన్ప్లే, సంభాషణ రచయితగా పేరొందిన ఎం.కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడైన తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ కూడా ముఖ్యమంత్రులయ్యారు. ఎంజీఆర్ మరణానంతరం అతి స్వల్పకాలం పాటు సీఎంగా చేసిన ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సినీ నటే. అనంతరం ఎంజీఆర్ వారసురాలైన స్టార్ హీరోయిన్ జయలలిత సీఎంగా చెరగని ముద్ర వేశారు. తర్వాతి తరంలో విజయకాంత్ (ఎండీఎంకే), కమల్హాసన్ (మక్కల్ నీది మయం) పార్టిలు పెట్టినా రాణించలేదు. కమల్ ఈసారి ఇండియా కూటమికి మద్దతు తెలిపారు. సూపర్స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టినంత పని చేసి చివరికి విరమించుకున్నారు. తాజాగా సూపర్స్టార్ విజయ్ కూడా తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. హీరో విశాల్ కూడా పార్టీ పెడతానని ప్రకటించారు. ఇండియా కూటమికే సర్వేల మొగ్గు తమిళనాట ఇండియా కూటమి మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని, నాలుగైదు స్థానాలూ వస్తాయని మరో సర్వే అంటోంది. అవినీతికి మారుపేరు డీఎంకే. దానిపై తొలి కాపీరైట్ ఆ పార్టిదే. అదో ఫ్యామిలీ కంపెనీ. రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది. భాష, కులం, మతం, విశ్వాసం అంటూ విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే వంటి కుటుంబ పార్టిలు అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నాయి. కచ్చతీవు దీవిని 1974లో శ్రీలంకకు ధారాదత్తం చేసింది ఈ రెండు పార్టిలే. – వెల్లూరు సభలో ప్రధాని మోదీ ఎన్డీఏ ఈసారి అధికారంలోకి వస్తే దేశ రాజధానిని నాగపూర్కు మార్చేస్తుంది. త్రివర్ణ పతాకాన్ని కూడా కాషాయ జెండాగా మర్చాలని చూస్తున్నారు. గుజరాత్ మోడల్ కంటే ద్రవిడ మోడల్ చాలా గొప్పది. మేం దాన్నే అనుసరిస్తాం. – డీఎంకే తరఫున ప్రచారంలో కమల్ హాసన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Crime: రూ. 900 కోట్ల బంగారం స్వాధీనం
చెన్నై: ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1,025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం గుర్తించారు. స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీశారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీప మన్నూర్లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు తెలిసింది. 400 కిలోలకు ఆధారాలు ఉన్నాయని మిగిలినదానికి లేనట్లు తెలిసింది. అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులను సంప్రదించారు. వీటి మొత్తం విలువ రూ.900 కోట్లు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే.. ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ పంచాయితీ ప్రెసిడెంట్ ఇంటి నుంచి కోటి రూపాయాల్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎట్టారై గ్రామం పంచాయితీ ప్రెసిడెంట్ దివ్య అన్బరసన్ నుంచి ఈ సొమ్మును రికవరీ చేశారు. ఆమె అన్నాడీఎంకేకు చెందిన నేత. -
త్వరలో రాజకీయ పార్టీ: హీరో విశాల్
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు తమిళ నటుడు విశాల్ ప్రకటించారు. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ త్వరలో రాజకీయాల్లోకి వస్తా. 2026లో పార్టీ తరఫున నేను కూడా బరిలో దిగుతా. పార్టీ ఏర్పాటు, ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. ఈసారి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ 100 శాతం జరగాలని ఆశిస్తున్నా’’ అని విశాల్ చెప్పారు. -
కాల్చిన మునక్కాయల కూర
మునక్కాయలను ఇష్టపడని వారు ముల్లోకాల్లో వెదికినా దొరకరు. సాంబారులో ఎన్ని కూరగాయలు వేసినా మునగ వేస్తేనే గౌరవం. మునగను రకరకాలుగా వండటం చూశాం. కాని పల్లె వంటల్లో ప్రసిద్ధం అయిన ఈశ్వరి అవ్వ మునక్కాయలను కాల్చి చేసిన కూరను అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. పొగడ్తలతో ఆమెను ముంచెత్తుతున్నారు. తమిళనాడుకు చెందిన ఈశ్వరి అవ్వకు ‘కంట్రీ ఫుడ్ కుకింగ్’ అనే యూ ట్యూబ్ చానల్ ఉంది. సబ్స్క్రయిబర్స్ ఎంతమందో తెలుసా? పది లక్షల మంది. తమిళనాడు గ్రామీణ వంటలను ప్రయోగ వంటలను అద్భుతంగా చేయడంతో ఈశ్వరి అవ్వకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. పచ్చి బొ΄్పాయి పచ్చడి, ఆరిటాకుల హల్వా ఇలాంటి వాటితో ΄ాటు నల్ల మాంసం కూర, అరటికాయతో వెజ్ ఫిష్ ఫ్రై లాంటివి నోరూరిస్తాయి. తాజాగా అవ్వ కాల్చిన మునక్కాయల కూర చేసి నెటిజెన్ల మెచ్చుకోలు పొందింది. మునక్కాడలను మంట మీద కాల్చి వాటిని కడిగి, చీరి, లోపల గుజ్జును వొలిచి పక్కన పెట్టుకుందామె. తర్వాత చట్టిలో నూనె ΄ోసి జిలుకర, వెల్లుల్లి, టొమాటో, ఉల్లి΄ాయలు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి, ఆఖరున మునగగుజ్జును వేసి దోరగా వేయిస్తే మంచి ఫ్రై కూరలా తయారయ్యింది. దానిని తెల్లన్నంతో తింటూ మనకు వీడియో కనిపిస్తుంది అవ్వ. ఈ రెసిపీని చూసి నెటిజన్లు చాలా కొత్తగా ఉందంటున్నారు. మేమూ ట్రై చేస్తామని బజారుకు మునక్కాయల కోసం వెళుతున్నారు. -
Rahul Gandhi: సీఎం స్టాలిన్ను సర్ప్రైజ్ చేసిన రాహుల్
చెన్నై: దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారమే కనిపిస్తోంది. దీంతో, నేతలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇండియా కూటమి ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తమిళనాడుకు వచ్చారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులో కూటమి మీటింగ్కు వెళ్లాల్సి ఉండగా.. రాహుల్ ఆశ్చర్యకంగా సింగనల్లూరులోని ఒక స్వీట్ షాప్లోకి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేశారు. రాహుల్ ఆ షాప్లోకి వెళ్లడంతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం.. అక్కడే స్వీట్స్ తిన్న రాహుల్ దుకాణదారుడు, అక్కడ పనిచేసే వారితో మాట్లాడి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో రాహుల్ ఒక కిలో మైసూర్పాక్ కొనుగోలు చేశారు. #RahulGandhi = Wholesome😍🥹🫶✨#RahulGandhiHopeOfIndia #RahulGandhiVoiceOfIndia pic.twitter.com/WYIdihesuw — Kanimozhi Manoharan (@Kaniiii___) April 12, 2024 అయితే, తాను కొనుగోలు చేసిన స్వీట్స్ ప్యాకెట్ ఎవరి కోసమా అని కాంగ్రెస్ నేతలు ఆలోచన పడ్డారు. అనంతరం, కూటమి తలపెట్టిన సభ వద్దకు వెళ్లిన రాహుల్.. ఆ మైసూర్పాక్ స్వీట్ ప్యాకెట్ను తమిళనాడు సీఎం స్టాలిన్కు అందించారు. ఈ సందర్బంగా తన కోసం స్వీట్స్ తేవడంతో స్టాలిన్ ఒకింత ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఒక్క ఫోన్ కాల్.. భారీగా దొరికిన నగదు
చెన్నై, సాక్షి: తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రూ. 1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో లోక్సభకు పోలింగ్కు ముందు ఒకే ఇంట్లో అదీ కూడా ఓ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారని, ఒక బ్యాగ్లో నింపిన మొత్తం రూ.1 కోటి కరెన్సీ నోట్లు దొరికాయని జిల్లా కలెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్లోని ఎలక్షన్ కంట్రోల్ రూంకి ఫోన్ కాల్ వచ్చిందని, ఫలితంగా నగదు రికవరీ అయ్యిందని ఆయన చెప్పారు. ఓ ఇంట్లో కరెన్సీ నోట్లు భద్రపర్చినట్లు సమాచారం అందడంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గ్రామానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో ఎవరు ఉంచారు.. ఎన్నికలలో ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును సిద్ధం చేశారా అనే కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
Tamilnadu : ధర్మపురిలో తెలుగు ఓటరు కీలకం
సాక్షి, చైన్నె: పర్యాటకంగానే కాకుండా మామిడి ఉత్పత్తికి ధర్మపురి ప్రసిద్ధి చెందింది. కావేరి నదీ తీరంలోని తీర్థాదీశ్వర ఆలయంలో రాముడు, హనుమంతుడు పూజలు చేసినట్టుగా ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఈ ఆలయంలోని స్వామి వారికి అభిషేకం నిర్వహించడం కోసం రాముడు ఓ జలపాతాన్ని ఇక్కడ సృష్టించినట్టుగా, దీనిని నేడు హనుమంత తీర్థంగా పేర్కొంటుంటారు. భారత నయాగారాగా పిలవబడే ‘హొగ్నేకల్’ జలపాతం కూడా ఇక్కడే ఉంది. ఈ ధర్మపురిలో లోక్ సభ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు చెమటోడ్చుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏకంగా 20శాతం ఓటర్లు తెలుగు మాట్లాడే వారు కావడంతో ఇక్కడి ఎన్నికపై ఆసక్తి నెలకొంది. డీఎంకే డిపాజిట్ గల్లంతు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే హవా కొనసాగింది. అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. ధర్మపురిలో ఆపార్టీ నేతృత్వంలోని కూటమికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఒక్కటంటే ఒక్క సీటు ఇక్కడ గెలువలేదు. ఈ లోక్సభ పరిధిలో పాలక్కోడు, పెన్నాగరం, ధర్మపురి, పాపిరెడ్డి పట్టి, హారూర్, మెట్టూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మేట్టూరు నియోజకవర్గం సేలం జిల్లాలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో పాలక్కోడు నుంచి అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ అన్బళగన్ ఐదోసారిగా గెలిచారు. అలాగే, అదే పార్టీకి చెందిన గోవిందస్వామి పాపిరెడ్డిపట్టి నుంచి, వి.సంపత్కుమార్ హారూర్ నుంచి రెండుసార్లు గెలిచారు. మూడు స్థానాలను అన్నాడీఎంకే కై వసం చేసుకోగా, మిగిలిన మూడు స్థానాలలో పెన్నాగరం నుంచి పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి, ధర్మపురి నుంచి పార్టీకి చెందిన ఎస్పీ వెంకటేశ్వరన్, మేట్టూరు నుంచి పి.సదాశివం విజయఢంకా మోగించారు. అన్నాడీఎంకే, పీఎంకే అభ్యర్థుల ముందు డీఎంకే కూటమి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇందుకు డీఎంకే సిట్టింగ్ ఎంపీ డాక్టర్ ఎస్ సెంథిల్కుమార్ పనితీరు కారణంగా ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. చేజారకుండా జాగ్రత్తగా.. అసెంబ్లీ ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైనా లోక్సభ ఎన్నికలలో తమ పట్టు చేజారకుండా జాగ్రత్తగా వ్యూహాలకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పదునుపెట్టారు. ఇక్కడ ఇప్పటి వరకు డీఎంకే 3 సార్లు, ఆ కూటమిలోని కాంగ్రెస్ మరో మూడుసార్లు గెలిచాయి. తమకు బలం ఉన్న చోట డిపాజిట్లు గల్లంతు కావడం ఆ కూటమిని జీర్ణించుకోలేకుండా చేసింది. దీంతో ఈసారి సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి స్థానిక నేతగా ఉన్న ఎ.మణిని పోటీలో పెట్టారు. ఈయన గెలుపు లక్ష్యంగా సీఎం స్టాలిన్, యువజన నేత, మంత్రి ఉదయనిధిస్టాలిన్ ధర్మపురిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో కోల్పోయిన ఓట్లను, పట్టును తిరిగి సొంతం చేసుకునేందుకు డీఎంకే కూటమిలోని పార్టీలు తీవ్రంగా కుస్తీలు పడుతున్నాయి. పట్టు బిగిస్తామంటోన్న పీఎంకే.. ప్రస్తుతం డీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని తమ ఖాతాలోకి వేసుకుని తీరుతామన్న ధీమాను పీఎంకే, అన్నాడీఎంకేలు వేర్వేరుగా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు పీఎంకే నాలుగు సార్లు గెలిచింది. 2014లో ఆపార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలలో 70 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. గతంలో కంటే తమకు బలం పెరగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వ్యూహాత్మకంగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన వారసుడు, పార్టీ అధ్యక్షుడు అన్బుమణి అడుగులు వేశారు. తొలుత ఓ అభ్యర్థిని ప్రకటించినా, హఠాత్తుగా అతడ్ని మార్చి తన కోడలు సౌమ్య అన్బుమణిని అభ్యర్థిగా రాందాసు ప్రకటించారు. గతంలో అన్బుమణి ఎంపీగా ఉన్న సమయంల, ఆ తర్వాత కానీయండి తన నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ ద్వారా సౌమ్య అన్బుమణి ఇక్కడి ప్రజలకే కాదు, తన సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణస్వామి కుమార్తెగా, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణిగా ప్రచారంలో సౌమ్య అన్బుమణి ముందంజలో ఉన్నారు. పీఎంకే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పట్టు బిగించే విధంగా ముందుకు సాగుతున్నారు. పాగా వేస్తామంటున్న అన్నాడీఎంకే.. ఈ లోక్సభ నియోజకవర్గంలోని ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్థానికంగా బలం కలిగిన నేతలు. ఇందులో ఒకరు ఐదుసార్లు, మరో ఇద్దరు రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై ఉన్నారు. తమకు బలం ఉన్న నేపథ్యంలో ఈసారి తప్పకుండా పాగా వేస్తామన్న ధీమాను వ్యక్తం కేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డాక్టర్ అశోకన్ను గెలిపించేందుకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటనలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఒకే సామాజిక వర్గ అభ్యర్థుల మధ్య జరుగుతున్న ఈ రసవత్తర సమరంలో తాము సైతం అంటూ నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా డాక్టర్ అభినయ పొన్నివలవన్ సైతం ఓట్ల చీలికతో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ ధర్మపురి లోక్సభను మళ్లీ కై వసం చేసుకోవడంమే లక్ష్యంగా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. తమ గుప్పెట్లో నుంచి చేజారిన ఈ స్థానంపై పట్టుకు పీఎంకే తీవ్ర కుస్తీలు పడుతోంది. ఇక్కడ తమకు సైతం బలం ఉండడంతో పాగా వేసి తీరుతామన్న ధీమాను అన్నాడీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రేసులో తామూ ఉన్నామన్నట్టు నామ్ తమిళర్ కట్చి ప్రచారంలో ఉంది. వన్నియర్ సామాజిక వర్గం, తెలుగు మాట్లాడే వారే న్యాయనిర్ణేతలుగా ఉన్న ఈ లోక్సభలో ఓటరు నాడి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ఓటరు ఎటో.. ఈ నియోజకవర్గంలో 15,12,732 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉంటే, ఈ నియోజకవర్గంలో మాత్రమే పురుషులు ఓట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఓటర్లలో వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ 50 శాతం, తెలుగు మాట్లాడే వారి సంఖ్య 20%, ఇతర సామాజిక వర్గాలు 30 శాతం మేరకు ఉన్నాయి. ఈ ఓటరు నాడి ఎటో అనేది అంతు చిక్కని పరిస్థితి. 2019 లోక్సభ ఎన్నికలలో డీఎంకేను ఆదరించిన ఓటర్లు, 2021 అసెంబ్లీ ఎన్నికలలో తిరస్కరించడం గమనార్హం. తాజాగా ఓటరు నాడి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. వన్నియర్ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ చెల్లా చెదురయ్యే అవకాశాల నేపథ్యంలో తెలుగు మాట్లాడే వారు, ఇతర సామాజిక వర్గాల ఓట్లే గెలుపు గుర్రాన్ని ఎంపిక చేయనున్నాయి. దీంతో ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో నువ్వా..నేనా అంటూ అభ్యర్థులు ఉరకలు, పరుగులు తీస్తున్నారు. -
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదు..
చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అయితే అవరంపాళ్యంలో రాత్రి పది గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ దాఖలైన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 143, 341 290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై తీవ్రవాదాన్ని, అల్లర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అహంకారం గురించి మాట్లాడే ప్రధాని అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలని సెటౌర్లు వేశారు. అయితే డీఎంకే ఆరోపణలపై స్పందించన అన్నామలై ధీటుగా బదులిచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు నాకు ఉంది. ఏ ఎన్నికల సంఘం దీన్ని ఆపుతుందని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉంటే దానిని తనకు చూపించాలని అన్నారు. కాగా కోయంబత్తూరులో బీజేపీ తరపున అన్నామలై ఎంపీగా పోటీచేస్తుండగా. అధికార డీఎంకే గణపతి రాజ్కుమార్ను, అన్నాడీఎంకే సింగై రామచంద్రన్ను బరిలోకి దింపింది. అయితే కోయంబత్తూరు అన్నాడీఎంకే కంచుకోట అయినప్పటికీ.. 2019 ఎన్నికల్లో సీపీఎం ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 38 చోట్ల డీఎంకే కూటమి విజయ బావుటాను ఎగరవేసింది. చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
Nara Lokesh: కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తాడా
కూట్లో రాయి తీయలేనివాడు... ఆంటే తింటున్న అన్నంలో చిన్న రాయిని తీయాలని లోకేష్ ఏకంగా ఏట్లోని అంటే నదిలోని రాయిని తీస్తాడా అనే సందేహం క్యాడరుకు వస్తోంది. మూడుశాఖలకు మంత్రిగా పని చేసి మంగళగిరిలోనే ఓడిపోయినా లోకేష్ పక్క రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేస్తారా? అంత ధైర్యం దేనికి అనే పంచులు పేలుతున్నాయి. వాస్తవానికి లోకేష్ యువగళం పేరిట భారీగా పాదయాత్ర చేసినా పార్టీకి కానీ ఆయనకు కానీ పెద్ద మైలేజి రాలేదు. దేంతోబాటు అయన తిండి యావ. తింగరి మాటలు కలిసి అయన ప్రతిష్టను మరింతగా దిగజార్చాయి. దీంతో ఆయన్ను మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి తిప్పాలన్న చంద్రబాబు ఆలోచనలకూ పార్టీ నాయకులు గండి కొట్టారు. లోకేష్ను మళ్ళీ తమ నియోజకవర్గాలకు పంపించవద్దని, తామే ఏదోలా ప్రచారాన్ని పూర్తిచేసుకుంటామని చంద్రబాబుకు చెప్పడంతో అయన తన కొడుకు కాళ్లకు బంధనాలు వేసి అమరావతి మినహా ఇంకెక్కడికీ వెళ్లోద్దని సూచించారు. అంటే లోకేష్కు ప్రస్తుతం అమరావతిలో గెలుపే పెద్ద టాస్క్ అన్నమాట. చదవండి: సీఎంగా మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం: మంత్రి బొత్స ఇదిలా ఉండగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో సైతం గెలిపించేందుకు యాతనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నపుడే బీజేపీ.. టీడీపీ మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో ఎక్కడబడితే అక్కడ టీడీపీ బీజేపీ క్యాడర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు లోకేష్ ఏకంగా తమిళనాడు వెళ్లి అక్కడ బీజేపీకోసం ప్రచారం చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీశాఖ చెబుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరులో లోకేష్ రోడ్డు షో.. ప్రచారం.. సభలో సైతం మాట్లాడతారని బీజేపీచెబుతోంది. కోయంబత్తూరు ఆ చుట్టుపక్కల తెలుగువాళ్లు. ముఖ్యంగా లోకేష్ సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఓట్లు ఉండడంతో ఆ ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు బీజేపీ శాఖ ట్విట్టట్లో పెట్టిన ఈ పోస్టు చూసి ఆంధ్రాలో అప్పుడే పంచులు పేలుతున్నాయి. నీ మంగళగిరిలోనే నువ్వు గెలుస్తావో లేదో నీకే తెలీదు.. అలాంటిది నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్లి అక్కడేం సాధిస్తావు పప్పూ అంటూ సెటైర్లు వేస్తున్నారు, వాస్తవానికి లోకేష్ ఈసారి కూడా మంగళగిరిలో గట్టిగా కష్టపడితే తప్ప గెలుస్తారో లేదో తెలియని పరిస్థితి అలాంటపుడు అయన ఇక్కడ వదిలేసి పక్కరాష్ట్రానికి ఎందుకు వెళ్లడం అనే ప్రశ్నలు.. వస్తున్నాయి. - సిమ్మాదిరప్పన్న -
అవినీతి యూనివర్సిటి ఛాన్సలర్ మోదీ : సీఎం స్టాలిన్
చెన్నై: డీఎంకేని అవినీతి పార్టీ అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి అనే ఓ యూనివర్సిటీ ఉంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాన్సలర్ అవుతారని అని సెటైర్లు వేశారు. ‘అవినీతి పేరుతో ఓ విశ్వవిద్యాలయం స్థాపిస్తే.. ఆ యూనివర్సిటీకి ప్రధాన మంత్రి మోదీ ఛాన్సలర్ అవుతారు. ఛాన్సలర్ కావడానికి ప్రధాని మోదీకి అన్ని అర్హతలు ఉన్నాయి. బీజేపీనే దేశంలో అతిపెద్ద అవినీతీ పార్టీ. దానికి ఉదాహారణ.. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం. అది ఒక్కటే కాదు.. పీఎం కేర్స్ ఫండ్, కేసుల్లో ఇరుకున్న ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరిన తర్వాత విచారణ ఉండకపోవటం. అసలు అవినీతితో కూడిన పార్టీ బీజేపీ’ అని సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ఇక.. బుధవారం తమిళనాడులోని వెల్లూరులో బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అధికార డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే అవినీతి పార్టీ అని మండిపడ్డారు. ‘అవినీతికి మొదటి కాపీ రైట్ డీఎంకేకు చెందుతుంది. ఎంకే స్టాలిన్ కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంది. తమిళనాడు ప్రజలను అవినీతి కుటుంబ పాలన కొనసాగించే డీఎంకే తమ ట్రాప్లో పడిపోయారు. డీఎంకే పార్టీ తమిళ సంస్కృతి, సాంప్రదాయానికి వ్యవతిరేకంగా ఉంది. సీఎం స్టాలిన్ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నారు’ అని మోదీ విమర్శలు చేశారు. -
విషవాయువు సోకి
అన్నానగర్: మనలి ప్రైవేటు ఫ్యాక్టరీలో మంగళవారం ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా విషవాయువు సోకి ఇద్దరు కార్మికులు మరణించారు. మనలి సా తంగాడు పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేసే ప్రైవేట్ పారిశ్రామికవాడ ఉంది. ఈ పారిశ్రామికవాడలో జెయింట్ ట్యాంక్లోని పెట్రోలు వ్యర్థాల ట్యాంక్ను శుభ్రప రిచే పనిని మంగళవారం మధ్యాహ్నం కొందరు కాంట్రాక్టు కార్మికులు చేపట్టారు. ట్యాంక్ లోపల దిగి శుభ్రం చేసే పనిలో నిమగ్నమైన కార్మికులు తి రువొత్తియూర్కి చెందిన దీనదయాళన్ (41), సత్యమూర్తి నగర్కు చెందిన బజ్నాథ్ ఠాగూర్ (59)కి ఒక్కసారిగా విషవాయువు సోకింది. దీంతో వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని తోటి కార్మికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం మాధవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తర లించారు. ఈ ఘటనపై సాత్తాంగాడు పోలీస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
PM Narendra Modi: అవినీతికి మారుపేరు డీఎంకే
వెల్లూరు: తమిళనాడులో అధికార డీఎంకేపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతికి మారుపేరుగా మారిపోయిందని, రాష్ట్రాభివృద్ధిని ఏమా త్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం తమిళనాడులోని వెల్లూరు, మెట్టుపాళ్యంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే ముమ్మాటికీ కుటుంబ పారీ్టలేనని అన్నారు. అవినీతిపై మొదటి పేటెంట్ హక్కు డీఎంకేకు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా లూటీ చేస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కంపెనీ అయిన డీఎంకే పాతకాలపు ఆలోచనా ధోరణితో రాష్ట్రంలో యువత ఎదుగుదలను అడ్డుకుంటోందని విమర్శించారు. భాష, కులం, మతం, విశ్వాసం పేరిట ప్రజల్లో విభజనను సృష్టిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో దేశం ముందడుగు వేస్తుండగా, పెట్టుబడులను అడ్డుకొనేవారితో డీఎంకే అంటకాగుతోందని ఆరోపించారు. కచ్చతీవు అప్పగింత వల్ల లాభపడిందెవరు? తమిళనాడులో డీఎంకే తరహాలోనే దేశంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష, విభజన అనే ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని బాగస్వామ్యపక్షాలకు బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అవినీతిపరులను కాపాడాలని కాంగ్రెస్, డీఎంకే ఆరాటపడుతున్నాయని విమర్శించారు. వారసత్వ పార్టీలకు సొంత కుటుంబ సభ్యులు, వారసులు తప్ప ఇతరుల సంక్షేమం పట్టదని అన్నారు. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును తాము రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దింపితే వారసత్వ పారీ్టలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. మన దేశంలో అందర్భాగమైన కచ్చతీవును 1974లో అన్యాయంగా శ్రీలంకకు అప్పగించారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నాయని వివరించారు. కచ్చతీవు అప్పగింతపై ఏ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు ఉన్నాయి.. నాగపూర్: ఆరి్టకల్ 370 రద్దుతో తనకు అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు లభిస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు, దూషణలతో తనకు మేలు జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు మరిన్ని పెరుగుతాయని అన్నారు. ఆయన బుధవారం మహారాష్ట్రలో నాగపూర్ జిల్లాలోని కన్హాన్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్యం ఉండబోవంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. -
టీ కప్పులో తుపాను వివాదం
తమిళనాడులో లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా కచ్చతీవు వివాదం వార్తల్లో ఉంటుంది. పరిమిత రాజకీయ జీవితకాలం ఉన్న ఈ అంశాన్ని భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సమస్యగా పొడిగించాలని కోరుకునేవారు గమనించాల్సింది, నాయకుల మధ్య వ్యక్తిగత సమీకరణాలు విధాన మార్గదర్శ కాలుగా పనిచేశాయి. దానివల్ల వివాదాలు సామరస్యంగా పరిష్కారమయ్యాయి. కాబట్టి గత నిర్ణయాల పట్ల అర్థంలేని వివాదాలు ప్రయోజనం చేకూర్చవు. ఇంకా ముఖ్యంగా, ‘వియన్నా కన్వెన్షన్ ప్రకారం భారతదేశం ఏకపక్షంగా (కచ్చతీవు) ఒప్పందాన్ని రద్దు చేయలేదు. దేశం ఎదుగుతున్న శక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నప్పుడు ఒడంబడిక రద్దు అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను కోల్పోయేలా చేస్తుంది.’ ఒక వారం క్రితం భారత ఎన్నికల వేదికపై కచ్చతీవు వివాదం విరుచుకుపడినప్పుడు, 1994 జనవరిలో విదేశాంగ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జేఎన్ దీక్షిత్తో మూడు దశాబ్దాల క్రితం గడిపిన సాయంత్రాల వైపు నా మనస్సు మళ్లింది. కొలంబోలో ఉన్న సమయంలో ‘వైస్రాయ్’ నామ కరణం పొందిన దీక్షిత్ 1985 నుండి 1989 వరకు భారత హైకమిషనర్గా, ఒక రకంగా మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఆయన సహ చరులు చాలామంది, విదేశీ వ్యవహారాల రహస్యాలను తాము చని పోయేంతవరకు దాచిపెడుతున్న సమయంలో, దౌత్యంపై జాతీయ మీడియాలో రాజకీయ కాలమ్ను ప్రారంభించిన మొదటి భారతీయ విదేశాంగ కార్యదర్శి జేఎన్ దీక్షిత్. నేను దీక్షిత్తో గురుగావ్లో గడిపాను. శ్రీలంకలో తాను పని చేసిన సంవత్సరాల గురించి ఆయన ఒక పుస్తకం రాయాలను కున్నారు. ఆయన పదవీకాలం భారత్, శ్రీలంక సంబంధాలలో అక్ష రాలా అత్యంత విస్ఫోటనా కాలం. ఇది జనావాసాలు లేని కచ్చతీవు ద్వీపంపై ప్రస్తుత టీకప్పులో తుపాను లాంటిది కాదు. అవి ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలలో వేగవంతమైన హెచ్చు తగ్గులతో కూడి, శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఎదుర్కొంటున్న దురదృష్టకరమైన సంవత్సరాలు. విదేశీ సంబంధాలలో ఇటు వంటి అస్థిరత చివరికి రెండేళ్ల వ్యవధిలోనే భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస విషాద హత్యలకు దారితీసింది. దీక్షిత్కు జనాల కోసం రాయడం గురించి సందేహాలున్నాయి. రచయితగా మారే క్రమంలో నాలాంటి చాలామంది జర్నలిస్టులను ఆయన రప్పించుకున్నారు. ‘అసైన్ మెంట్ కొలంబో’ శీర్షికతో శ్రీలంకపై రాస్తున్నానంటూ దీక్షిత్ వెల్లడించిన పుస్తకం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. అధికారిక రహస్యాల చట్టంలోని నిబంధనలలో చిక్కుకోకుండా ఉండేందుకు ఆయన దానిని జ్ఞాపకాల నుండి మాత్రమే రాయాలనుకున్నారు. ఈలోగా, అంతగా వివాదాస్పదం కాని మరో మూడు పుస్తకాలను ప్రచురించారు. ఒక సాయంత్రం, శ్రీలంక సందర్శనకు విచ్చేసిన ఉన్నత స్థాయి భారతీయ ప్రతినిధి బృందానికి తాను ఏర్పాటు చేసిన రిసెప్షన్ గురించి ఆయన నాకు చెప్పారు. హైకమిషనర్ ప్రత్యేక అతిథిగా ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి సిరిమావో బండారు నాయకే ఆ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరైన వారి మానసిక స్థితి ఉల్లాసంగా ఉంది. కొంచెం మత్తులో ఉన్న భారతీయ సందర్శకులలో ఒకరు, సిరిమావో బండారునాయకే అధికారంలో ఉన్నప్పుడు ద్వీపంలో అంతర్యుద్ధం చెలరేగి ఉండినట్లయితే, ఎల్టీటీఈ అగ్రనేత వేలుపిళ్లై ప్రభాకరన్ విషయంలో ఆమె ఏమి చేసి ఉండే వారంటూ చికాకు కలిగించే ప్రశ్నను అడిగారు. ఒక్క క్షణం కూడా సంకోచించకుండా, బండారునాయకే ఇలా తిప్పికొట్టారు: ‘నేను న్యూఢిల్లీలో ఉన్న మా సోదరికి ఫోన్చేసి, ఈ ప్రభాకరన్ అనే వ్యక్తినీ, లంక తమిళ సమస్యకు అతని రకమైన పరిష్కారాన్నీ నేను క్రమబద్ధీ కరించేటప్పుడు ఈ అంశంపై దృష్టిసారించకుండా వేరే వైపు చూడ మని అడిగి ఉంటాను.’ ఆ ‘సోదరి’ మరెవరో కాదు, ఇందిరా గాంధీ. అనూహ్యంగా, శ్రీలంక జాతి కలహాల సమయంలో కొలంబోలో భారతదేశ మొదటి కార్యదర్శిగా ఉన్న నిరుపమారావు ఆ సమయంలో తన ప్రాణాలకు ముప్పు కలిగే స్థితిలో ఉన్నారు. ఏప్రిల్ 1న కచ్చతీవు వివాదం చెలరేగిన కొన్ని గంటల్లోనే తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంటులో నిరుపమ వ్యాఖ్యానిస్తూ, తనను 1983లో ఉన్నట్లుండి శ్రీలంక నుండి స్వదేశం పంపించి వేశారని రాశారు. ‘1974 ఒప్పందం ముగింపులో ఇందిరా గాంధీ, సిరిమావో బండారునాయకే మధ్య వ్యక్తిగత సమీకరణం నిర్ణయాత్మక పాత్ర పోషించింది’ అని రాశారు. కచ్చతీవు చర్చల విషయంలో తనను రక్షించాల్సిందిగా ఇందిరకు బండారునాయకే వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారనీ, లేకుంటే ఆమెకు రాజ కీయంగా విపత్తు తప్పేది కాదనీ నిరుపమ చెప్పారు. దశాబ్దాల తర్వాత పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో దీక్షిత్ దీన్నే చెప్పారు. తరు వాత నిరుపమారావు 2004 నుండి 2006 వరకు కొలంబోలో హై కమిషనర్గా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పార్థ ఘోష్ ఇలా రాశారు: ‘బండారునాయకే దుఃస్థితిని ఇందిరా గాంధీ స్పష్టంగా గ్రహించారు. భారత ప్రతినిధి బృందం ప్రతిస్పందించకముందే పరిస్థితిని తారుమారు చేశారు. ఇందిర ప్రదర్శించిన ఈ ఔదార్యపు సంకేతాన్ని బండారునాయకే 1990 చివరిలో ఎంతో కృత జ్ఞతతో గుర్తు చేసుకున్నారు.’ ఘోష్ ఆ సంవత్సరాన్ని 2000 అని పేర్కొని ఉండాలి, అంటే బండారునాయకే ప్రధానమంత్రిగా తన చివరి పదవీకాలం పూర్తయ్యే వరకు అన్నమాట. ఒక దశాబ్దం పాటు శ్రీలంక ఏకైక మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ఆమె కుమార్తె చంద్రికా కుమారతుంగ కూడా భారత్ 1974లో ప్రదర్శించిన ఈ స్నేహ పూర్వకమైన సంకేతాన్ని మరచిపోలేదు. కొలంబోలో తనకంటే ముందే పనిచేసిన దీక్షిత్, నిరుపమా రావు కాలం నుండి కచ్చతీవు విషయంలో పెద్దగా మార్పు రాలేదనే వాస్త వాన్ని అమృత్సర్ నుండి బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తరణ్జిత్ సింగ్ సంధూ కూడా ధృవీకరించగలరు. సం«ధూ 2000 నుండి 2004 వరకు శ్రీలంకలో భారత రాయబార కార్యాలయంలో కౌన్సెలర్గానూ, హైకమిషనర్గానూ పనిచేశారు. 2017లో సంధు భారత హైకమిషన్ లో బాధ్యతలు స్వీకరించి నప్పుడు, శ్రీలంక బీజింగ్ అందాలకు పడిపోయింది. భారత ప్రభావ పరిధిలో ఉండటం మానేసింది. అధ్యక్షుడిగా మహింద రాజపక్స చైనా అనుకూల విధానాలను కలిగి ఉన్నప్పటికీ, తరణ్జీత్ సింగ్ సంధూ, ప్రతిపక్ష నాయకుడిగా రాజపక్సను ఒకసారి కాదు రెండుసార్లు భారత్ను సందర్శించేలా చేసే ఆహ్వానం కోసం పట్టుబట్టారు. ఆ రెండు సార్లలో మొదటి సందర్శన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహింద రాజపక్స మధ్య ఏర్పడిన బంధం... శ్రీలంక కీల కమైన రాజకీయవేత్తను భారత మద్దతుదారుగా మార్చింది. రెండేళ్ల తర్వాత, మహింద ప్రధాని అయినప్పుడు, భారత్ లెక్కించినట్లుగానే, ఆయన తొలి బాహ్య సదస్సు మోదీతోనే వర్చువల్గా జరిగింది. మహింద సోదరుడు గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన మొదటి పర్యటన కోసం భారత్నే ఎంచుకున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులో ఓటింగ్ జరిగేదాకా పరిమిత రాజకీయ జీవితకాలమే ఉన్నప్పటికీ, కచ్చతీవు వివాదాన్ని ద్వైపాక్షిక సమస్యగా పొడిగించాలని కోరుకునే వారందరూ నేర్చుకోవలసిన ఒక పాఠం ఉంది. రాజపక్స కుటుంబం రాజకీయ అరణ్యంలో ఉన్నప్పటికీ భారత్–శ్రీలంక సంబంధాలు ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కంటే మెరుగైన మిత్రుడు భారత్కు దొరకరు. ప్రస్తుత ప్రధాని దినేశ్ గుణవర్దన విషయంలోనూ ఇది నిజం. యూఎస్లో తన క్లాస్మేట్ అయిన జయ ప్రకాశ్ నారాయణ్ ప్రభావంతో భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు దినేశ్ తండ్రి ఫిలిప్ గుణవర్దనను బ్రిటిష్వాళ్లు బొంబాయిలో బంధించారని కొద్దిమంది భారతీయులకే తెలుసు. విదేశాంగ కార్యదర్శిగానూ పనిచేసిన నిరుపమారావు ప్రకారం, ‘వియన్నా కన్వెన్షన్ ప్రకారం భారతదేశం ఏకపక్షంగా (కచ్చతీవు) ఒప్పందాన్ని రద్దు చేయలేదు. దేశం ఎదుగుతున్న శక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నప్పుడు ఒడంబడిక రద్దు అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను కోల్పోయేలా చేస్తుంది.’ కేపీ నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రధాని ఈ గ్యారంటీలు ఇవ్వగలరా? మోదీకి స్టాలిన్ సవాల్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి రగులులోంది. ప్రచారంలో తమదైన శైలిలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో ఒకరిపైనొకరు విరుచుపడుతున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారంపై విచారణ చేస్తామని మోదీ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైనా ఆక్రమించిన భారత్లోని భూగాలను తిరిగి వెనక్కి రప్పించాలని, కులగణనతోపాటు ఇతర విషాయాల్లో మోదీ గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ‘మోదీ గ్యారంటీ’ పేరుతో ఎన్నికల హామీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఏఏకు చేసిన సవరణలను వెనక్కితీసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల నిధులను తక్షణమే విడుదల చేయాలని సవాల్ విసిరారు. గ్యారంటీ కార్డుతో వస్తున్న ప్రధాని ఈ గ్యారంటీలను ఇవ్వగలరా అని నిలదీశారు. చదవండి: తెలంగాణ ‘చిన్నమ్మ’ కుమార్తె.. బన్సూరి స్వరాజ్ కంటికి గాయం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, ప్రతి ఏడాది రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలపై కూడా ప్రధాని హామీ ఇవ్వాలని మోదీ గ్యారంటీల జాబితాలో పొందుపరచాలని స్టాలిన్ కోరారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, గిట్టబాటు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కూడా మోదీని డిమాండ్ చేశారు. సైన్యంలో అగ్నిపథ్ పధకాన్ని రద్దు చేయాలని తెలిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాని మోదీ విస్తృత పర్యటనలపై కూడా స్టాలిన్ మండిపడ్డారు. సీజన్లో వచ్చే వలస పక్షుల మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రధాని తమిళనాడు చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. గ్యారంటీ కార్డుతో తిరుగుతున్న మోదీ.. పైన పేర్కొన్న గ్యాంరటీలు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇవ్వకుంటే ఈ వారంటీలన్నీ మేడ్ ఇన్ బీజేపీ వాషింగ్ మేషీన్ అని బట్టబయలవుతుందని డీఎంకే అధినేత తన సోషల్ మీడియా పోస్ట్లో విరుచుకుపడ్డారు. -
ఘోర ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. అయిదుగురి మృతి
చెన్నై: తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. విరుధ్ నగర్-మధురై జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన ఎస్యూవీ కారు తొలుత నెమ్మదిగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం ఎడమ వైపున్న డివైడర్ను బలంగా ఢీకొట్టి గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టింది. దెబ్బకు ఏకారు కంగా నాలుగు లేన్ల హైవేకు అవతలి వైపు సర్వీస్ లైన్లో ఎగిరిపడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం దాటికి సంఘటనా స్థలంలో భారీగా దుమ్ము పేరుకుపోయింది. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా ముధురైలోని విల్లుపురానికి చెందినవారుగా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Tamil Nadu: Five people, including four members of the same family from Madurai's Villapuram, were killed when a speeding SUV collided with a moped at Sivarakottai near Tirumangalam on the Virudhunagar-Madurai highway: Madurai district SP Arvind (CCTV footage source:… pic.twitter.com/kFCzEvttJW — ANI (@ANI) April 10, 2024 -
తమిళనాట మోదీ సంచలన ప్రకటన.. డిఫెన్స్లో డీఎంకే!
సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో ప్రజలకు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. శ్రీలంకలో అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా భారత్కు తీసుకువస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ప్రధాని మోదీ తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలూరులో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ఈరోజు దేశం మొత్తం కాంగ్రెస్, డీఎంకే పార్టీల మరో కపట నాటకం గురించి చర్చిస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే కచ్చాతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారు. ఎవరి ప్రయోజనం కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: Addressing a public rally in Vellore, PM Narendra Modi says, "Today the whole country is discussing another hypocrisy of Congress and the DMK party. When Congress was in government, these people gave Kachchatheevu Island to Sri Lanka. In which cabinet was… pic.twitter.com/Gr004Zxmea — ANI (@ANI) April 10, 2024 కచ్చాతీవు ద్వీపం వద్దకు వెళ్లిన వేలాది మంది తమిళనాడు మృత్స్యకారులను శ్రీలంక కోస్టల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్పై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా వెనక్కి తీసుకువస్తుంది. అదొక్కటే కాదు మరణ శిక్షలు విధింపబడిన వారిని కూడా సజీవంగా వెనక్కి తీసుకువస్తున్నాం. వారిని వారి వారి కుటుంబాలకు అప్పగించే బాధ్యత బీజేపీది అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి. డీఎంకేది విభజన రాజకీయం. తమిళులను చీకట్లో ఉంచేసింది. అవినీతి చేయడానికి డీఎంకే కాపీరైట్ తీసుకుంది. కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంటోంది. తమిళనాడులో బీజేపీ చరిత్ర సృష్టించబోతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ గెలవబోతోంది అంటూ కామెంట్స్ చేశారు. -
అన్నామలై Vs కమల్: తమిళనాట రసవత్తర రాజకీయం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, తాజాగా అన్నామలై, కమల్ హాసన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో అన్నామలై.. కమల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. దేశ రాజధాని మార్పు అంటూ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి. వారి మెదడుకు సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షలు చేయాలి. మానసిక వైద్యుడి వద్దకు వెళ్లి కమల్ సలహాలు తీసుకుకోవాలి. దేశ రాజధానిని నాగ్పూర్కు ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. అయితే, చెన్నైని దేశానికి వేసవి లేదా శీతాకాల రాజధానిగా చేయాలని కమల్ పేర్కొన్నట్లయితే నేను దానిని అంగీకరిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో డీఎంకే నుంచి రాజ్యసభ ఎంపీ కావాలనే ఉద్దేశ్యంతోనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, అన్నామలై వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Kamal Haasan: If BJP wins elections, they will change India's capital to Nagpur. Annamalai: Kamal Haasan should get his brain checked. pic.twitter.com/uGHpXGKpzC — Megh Updates 🚨™ (@MeghUpdates) April 9, 2024 కాగా, ఎన్నికల సందర్భంగా డీఎంకే-ఎంఎన్ఎం కూటమిలో భాగంగా కమల్ హసన్.. అభ్యర్థి కళానిధి వీరాస్వా మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే నాగ్పూర్ను భారత్కు కొత్త రాజధానిగా చేస్తుందన్నారు. బీజేపీ నేతలు, ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జాతీయ జెండాను కూడా త్రివర్ణ పతాకం నుంచి ఒకే రంగు ఉన్న జెండా(బీజేపీ జెండా)కు మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదే సమయంలో గుజరాత్ మోడల్పై కూడా కమల్ విమర్శలు చేశారు. ప్రజలు ఎప్పుడూ గుజరాత్ మోడల్ను కోరుకోలేదు. గొప్పదని చెప్పలేదు. గుజరాత్ మోడల్ కన్నా ద్రవిడ మోడల్ ఎంతో గొప్పది. ఆ మోడల్నే మేము అనుసరిస్తాము. బీజేపీ నేతలు ద్రవిడ మోడల్ను విస్మరిస్తున్నారు అని కామెంట్స్ చేశారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement