tamil nadu
-
కేంద్రానికి సీఎం విజయ్ రిక్వెస్ట్.. ఎందుకంటే?
చెన్నై: నీట్ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజ్ఞప్తి చేశారు. నీట్-యూజీ (NEET-UG) 2026 రద్దు, పరిణామాల నేపథ్యంలో ఈ పరీక్షా విధానంలోని నిర్మాణాత్మక లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు.12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల పేపర్ లీక్ జాతీయ స్థాయి పరీక్షా విధానంలోని లోపాలను బయటపెట్టిందని.. ఇది లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. నీట్ పరీక్ష గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి, తమిళ మీడియం విద్యార్థులకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ (CBI) విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా సిబిఐ ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పరీక్షల పారదర్శకతను పునరుద్ధరించడానికి ఎన్టీఏ స్థానంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని 'ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రకారం.. సిక్కర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ద్వారా ఈ పేపర్ లీక్ మూలాలు కేరళ వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాలన్నీ సుమారు 22 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయి. -
ప్రసాదంగా నాణేలు : ఎక్కడుందీ గుడి? వీడియో వైరల్
తమిళనాడులోని ఒక ఆలయ ఉత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భక్తులు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. కానుకలు సమర్పిస్తారు ఇది కామన్. అలాగే వివిధ ఆలయాల్లో అందించే ప్రసాదాన్ని అత్యంత భక్తితో స్వీకరిస్తారు. ఇది ఇంకా సాధారణం. కానీ ఒక పూజారి భక్తులకు నాణేలను 'ప్రసాదం'గా పంపిణీ చేయడం చర్చకు దారితీసింది. దేవుడికి సమర్పించిన కానుకలనే ఇలా భక్తులకు తిరిగి పంచుతారట. దీనికి సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది.@ramdevkar07 అనే యూజర్ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి, "విరాళాలు స్వీకరించడానికి బదులుగా ప్రసాదంగా డబ్బు ఇస్తున్న తమిళనాడు ఆలయం వైరల్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, ఒక పూజారి భక్తులకు ప్రసాదంలా నాణేలను పంచుతుండటం విశేషం. డొనేషన్లు తీసుకోవడానికి బదులు డబ్బును ప్రసాదంగా ఇస్తున్న ఆలయం అంటూ ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే,ఆ పూజారి నోట్లో సిగరెట్ (చుట్ట) ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని కల్పవృక్ష స్వామి ఆలయం; ఇక్కడ భక్తులకు ఆలయ కానుకల సొమ్మునే ప్రసాదంగా అందజేస్తారు. సనాతన హిందూ ధర్మానికి జై! అంటూ మరో వీడియో కూడా ఎక్స్లో చక్కర్లు కొడుతోంది. Tamil Nadu temple goes viral for giving money as prasad instead of taking donations. pic.twitter.com/8Uud7gNVXv— ʀᴀᴍ (@ramdevkar07) May 12, 2026ఇలాంటి ఆలయం నిజంగా ఉందాతమిళనాడులోని శ్రీ వరం తారుమ్ మాలిగైపరై కరుప్పసామి ఆలయంలో ఒక ఉత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. అక్కడ భక్తులకు ఇచ్చే ఈ నాణేలను స్థానికంగా "పిడి కాసు" (Pidi Kasu) అని పిలుస్తారు. ఇది ఆ ప్రాంతంలోని కొన్ని జానపద సంప్రదాయాలలో భాగంగా ఇలా నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీ. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరుప్పసామిని గ్రామ దేవతగా, శక్తివంతమైన రక్షకుడిగా (కావల్ దైవం) కొలుస్తారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం దేశవాళీ చుట్టలు, మద్యం వంటివి నైవేద్యంగా సమర్పించడం చాలాకాలంగా వస్తున్న ఆచారం. గ్రామ సరిహద్దుల్లో ఉండే ఈ ఆలయాల్లో జరిగే ఆచారాలు కూడా భిన్నంగా ఉంటాయి.ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?నెటిజన్ల స్పందనఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గుళ్లో నోట్లో సిగరెట్ పెట్టుకోవడం ఏంటి? ఇది అసహ్యంగా ఉంది, ఇలాంటి వాటిని ఆపేయాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో రకమైన బిజినెస్ అని, పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వసూలు చేసే ఎత్తుగడ అని మరికొందరు విమర్శించారు.ये तमिलनाडु की कलूपा स्वामी मंदिर है,यहां भक्त को मंदिर के चढ़ावा पैसे भी प्रसाद रूपी दिया जाता है..जय सत्य सनातन हिंदू धर्म 🙏 ॐ#सनातन_धर्म #तमिलनाडु pic.twitter.com/disGZjbrbd— Govind Jha (@Govind_Jha24) May 13, 2026 అయితే ఇక్కడి స్థానిక సంప్రదాయాల గురించి తెలిసిన వారు మాత్రం సానుకూలంగా స్పందించారు. ఇది కరుప్పసామి ఆలయం, అక్కడ చుట్టలు సమర్పించడం ఆచారం. ఆయన గ్రామ రక్షకుడు, ఆయన ఆచారాలు ఇలాగే ఉంటాయంటూ వివరణ ఇచ్చారు. మొత్తానికి, ఈ వీడియో దక్షిణ భారత జానపద సంప్రదాయాలు ఆధునిక సామాజిక విలువల మధ్య చర్చను రేకెత్తించింది.ఇదీ చదవండి : పెళ్లైన నాలుగు రోజులకే దారుణం : బంగారు గొలుసు కోసం -
టీవీకే పార్టీకి గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క ఓటు తేడాతో నెగ్గిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి ఊరట లభించింది. ఆయన్ని బలపరీక్షలో ఓటు వేయొద్దంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.ఎన్నికల ఫలితంపై వివాదం ఉంటే ఎన్నికల పిటిషన్ (Election Petition) దాఖలు చేయడం సరైన మార్గమని హైకోర్టు చెప్పింది. అలాంటిది ఒక రిట్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకుని టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని ఫ్లోర్ టెస్ట్లో ఓటు వేయకుండా ఆపింది. ఇది దారుణం. అలాంటి ఆదేశాలివ్వడం ముమ్మాటికీ తప్పే అని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.#BREAKING #SupremeCourt stays the Madras High Court's order which stopped TVK MLA Sreenivasa Sethupathi from voting in TN Assembly floor test.#TamilNadu pic.twitter.com/ljOHA56050— Live Law (@LiveLawIndia) May 13, 2026అసలేం జరిగింది..తిరప్పత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి శ్రీనివాస సేతుపతి సమీప డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పర్ మీద ఒక్క ఓటు తేడాతో నెగ్గారు. అయితే అదే పేరుతో ఉన్న మరో నియోజకవర్గం(ఒకటి తిరప్పత్తూరు జిల్లాలో ఉంది, మరొక నియోజకవర్గం శివగంగ జిల్లాలో ఉంది) నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సు మారిపోయిందని.. ఓట్ల లెక్కింపు గందరగోళంతో శ్రీనివాస సేతుపతి నెగ్గారని.. ఆయన ఎన్నిక చెల్లదని పెరియాకరుప్పర్ హైకోర్టును ఆశ్రయించారు.శ్రీనివాస సేతుపతి(ఎడమ), పెరియా కరుప్పర్ (కుడి)శనివారం ఆయన పిటిషన్ వేస్తే.. ఆదివారం దానిని అత్యవసరంగా విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈసీ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని కోర్టులో వాదనలు వినిపించారాయన. అయితే శ్రీనివాస సేతుపతి ఎన్నికనే ఈ పిటిషన్ సవాల్ చేస్తుండడం.. ఆయన ఓటింగ్లో పాల్గొంటే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలపరీక్షలో ఓటేయొద్దని శ్రీనివాస సేతుపతికి మంగళవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హుటాహుటిన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ తీవ్రత దృష్ట్యా అత్యవసర విచారణ లిస్టింగ్కు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు. సుప్రీంలో ఇవాళ.. బుధవారం విచారణ జరిపిన కోర్టు.. శ్రీనివాస సేతుపతి తరఫున అభిషేక్ మను సింఘ్వీ, పెరియాకరుప్పర్ తరఫున మకుల్ రోహత్గీ వాదనలు వినింది. చివరకు సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. శ్రీనివాస సేతుపతికి ఊరట ఇస్తూ ఆదేశాలిచ్చింది. అదే సమయంలో డీఎంకే అభ్యర్తి వేసిన పిటిషన్ను మద్రాస్ బెంచ్ అత్యవసర విచారణ చేపట్టడాన్ని కూడా తప్పుబట్టింది. ఓటేయకుండా ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో పాటు పెరియాకరుప్పన్ వేసిన రిట్ పిటిషన్ విచారణపైన కూడా స్టే విధించింది సుప్రీం కోర్టు .సుప్రీం కోర్టు నిర్ణయంతో శ్రీనివాస సేతుపతి ఓటు హక్కు చెల్లుబాటు అవుతుంది. అయితే ఇప్పటికే బలపరీక్ష జరగడం.. అందులో విజయ్ టీవీకే సర్కార్ గెలవడంతో ఆ ఓటు అవసరం లేకుండా పోయింది. అదే సమయంలో.. డీఎంకే అభ్యర్థి పెరియాకరుప్పర్ వేసిన ఎన్నికల పిటిషన్పై మాత్రం విచారణ కొనసాగనుంది. కాబట్టి.. తుది తీర్పు వచ్చే వరకు శ్రీనివాస సేతుపతి టీవీకే ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. -
విజయ్ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సొంత పార్టీ సహా మద్దతు ఇస్తున్న నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఈ నియామకాన్ని పునరాలోచిస్తానని విజయ్ సంకేతం ఇచ్చారు. అనంతరం, ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, తమిళనాడు సీఎం విజయ్ తన కార్యాలయంలో జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్ను ప్రత్యేక అధికారి (OSD)గా నియమించడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాధన్ నియామకంపై VCK, DMDK, BJP, DMK వంటి పార్టీలు విజయ్ను ప్రశ్నించాయి. ఈ క్రమంలో శాస్త్రీయ ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాలి, జ్యోతిష్యానికి కాదు అని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో విజయ్.. వెట్రివేల్ నియామకాన్ని పునరాలోచిస్తానని సంకేతం ఇచ్చారు.ఇక, ఈరోజు అసెంబ్లీలో కూడా వెట్రివేల్ నియామకంపై విజయ్ను ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) ప్రశ్నించారు. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె.. ‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’ అంటూ చురకలు అంటించారు. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. -
ఉదయనిధికి సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చెన్నై: తమిళనాడు కొత్త అసెంబ్లీలో పొలిటికల్ పంచులు పేలడం అప్పుడే ప్రారంభమైంది. టీవీకే ప్రభుత్వ బలనిరూపణ వేళ.. ప్రతిపక్ష డీఎంకే సంచలన ఆరోపణలకు దిగింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం విజయ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ బలనిరూపణ చర్చ వేళ విమర్శలు గుప్పించారు. ‘‘65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడింది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు’’ అని ఆరోపించారాయన. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం టీవీకే తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ ప్రసంగించారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు. మున్ముందు ఆ ప్రయత్నం చేయబోం. మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. కాబట్టి వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అనేది చూడం.. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. అలాగే గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయ్ టీవీకే సర్కార్ నెగ్గింది. -
విజయ్కు షాక్.. ఉదయనిధి సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ రసవత్తరంగా మారింది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం విజయ్, టీవీకేపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారని విమర్శలు గుప్పించారు.తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ప్రభుత్వం బల పరీక్షకు ముందు సీఎం విజయ్ టార్గెట్గా ఉదయనిధి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ..‘ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైంది. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు.టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోంది. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందు సోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు.#WATCH | DMK MLAs walk out of the Tamil Nadu Assembly before the Floor test of the TVK government(video source: TN Assembly) pic.twitter.com/0oXlxMe4LM— ANI (@ANI) May 13, 2026పళని కౌంటర్.. అంతకుముందు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా టీవీకేను టార్గెట్ చేశారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. "We are not an enemy party; we wish to function as a responsible Opposition,” says AIADMK MLA Edappadi K. Palaniswami, adding that AIADMK MLAs would vote against the government in the Assembly. pic.twitter.com/elXR9fWGBR— ANI (@ANI) May 13, 2026కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. ఇక.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. -
విజయ్పై ప్రేమలతా విజయ్కాంత్ ఎదురుదాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బల నిరూపణ ఎదుర్కొంటున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్కాంత్(విజయ్కాంత్ సతీమణి) విజయ్పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదే. కానీ, యువత మీకు ఓటేసి గెలిపించారు. కానీ, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా ఎందుకు నియమించుకున్నారు?. ఈ నియామకంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. సీఎంను కలవడానికి వేరు ముఖం వేసుకుని రావొద్దు’’ అని విజయ్కు చురకలంటించారామె. ఆ వెంటనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. முதல்வர் விஜயை பார்த்து கேட்ட பிரேமலதா #premalatha pic.twitter.com/ei8tNlTIJi— Way2News Tamil (@way2news_) May 13, 2026Video Source: Way2News Tamil మరోవైపు.. బల నిరూపణ వేళ విజయ్ సర్కార్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విడుదల చిరుతైగల్ కట్చి(VCK) పార్టీ సైతం జ్యోతిష్యుడిని నమ్ముకుని పాలన చేయొద్దని విజయ్కు హితవు పలికింది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తు.. 108 సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్కు అభినందనలు తెలియజేశారు. విజయ్ తన బిడ్డలాంటోడని.. మొదటి నుంచి తన భర్త విజయ్కాంత్కు దగ్గరగా ఉండేవాడని.. ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మద్దతు ఇస్తారా? అనే అంశంపై మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఎన్డీయే కూటమిలో భాగంగా విరుదాచలం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆ పార్టీ నుంచి పోటీ నెగ్గిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు. -
బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టగా.. కాంగ్రెస్, ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ నేరుగా.. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 144 మంది విజయ్ టీవీకే సర్కార్కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ నుంచి 61 మంది వాకౌట్(డీఎంకే సభ్యులతో పాటు) చేయగా.. 22 మంది విజయ్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటేశారు. బీజేపీ, పీఎంకే సభ్యులు ఐదుగురు గైర్హాజరు అయ్యారు. బలపరీక్ష విషయంలో తటస్థంగా ఉన్నట్లు బీజేపీ తర్వాత ఓ ప్రకటన విడుదల చేసింది. విజయ్ ధన్యవాదాలుతమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ వేళ.. ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. ‘‘నాకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. సామాన్యుల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం.. .. మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు.మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని అన్నారు. అంతకు ముందు.. చర్చ సందర్బంగా ఒక్కో పార్టీ విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తూ వచ్చింది. అయితే అన్నాడీఎంకే వంతు వచ్చేసరికి హైడ్రామా మొదలైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే వేలుమణికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయితే ఒక రెబల్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఏంటని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకుని.. సంచలన ఆరోపణలకు దిగారు. ఏ పార్టీలో అయిన విబేధాలు సహజం. మా పార్టీ విషయంలో సీఎం తీరు సరికాదు. ఆయన మా రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు?. వాళ్లతో ఆయనకేం పని?. ఆయన మా తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారు. డబ్బుతో కొనాలని చూస్తున్నారు? అని పళని ఆరోపించారు. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది. చివరకు చేసేది లేక పళనిస్వామి వర్గం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ఉదయనిధి సంచలన ఆరోపణలుప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. 65 శాతం ఓటర్లు విజయ్ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారు. విజయ్కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడుతోంది. కొందరు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరం. సీఎం కన్నా ముందుసోఫాసెట్లు వెళ్తున్నాయి. ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు. ఆ సమయంలో.. ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎంకే ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేశారు. ఓటింగ్..విజయ్ సర్కార్ బలనిరూపణ కోసం ఓటింగ్ జరిగింది. టీవీకేకు బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 118. బలనిరూపణ ఓటింగ్ సందర్భంగా మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించగా.. ఒక్కొక్కరు లేచి తమ హాజరును ప్రదర్శించారు. టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంల్, వీసీకే, ఏఎంఎంకే రెబల్ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకేలో రెబల్ ఎమ్మెల్యేలు(షణ్ముగం వర్గం 25 మంది) విజయ్కు సపోర్ట్గా లేచి నిలబడ్డారు.కాంగ్రెస్, ఇతరులు ఏమన్నారంటే.. విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలి.. భరోసా కల్పించాలి. ఖర్గే, రాహుల్ ఆదేశాల మేరకు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అని కాంగ్రెస్ ప్రకటించింది. తమిళనాడులో బీజేపీ కుట్రలు చేసింది.. వాటిని అడ్డుకున్నాం. రాష్ట్రంలో గవర్నర్ పాలన రాకూడదనే మద్దతు ఇచ్చాం అని వామపక్షాలు తెలిపాయి. రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ ప్రభుత్వం రాజీ పడకూడదు. డీలిమిటేషన్పై కేంద్రంతో విజయ్ పోరాడాలి. మూఢ నమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తేవాలి. జ్యోతిష్యుడి సలహాలతో పాలించకూడదు అని వీసీకే తెలిపింది. Tamil Nadu Legislative Assembly: Confidence motion moved in support of the Council of Ministers led by Chief Minister Vijay. pic.twitter.com/uxT0BMzNoY— Vijay Fans Trends (@VijayFansTrends) May 13, 2026 -
నేడు విజయ్ సర్కార్కు బలపరీక్ష
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శాసనసభలో విజయ్ సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అయితే అధికార టీవీకేకు చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్కు దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.తమిళనాడు ఎన్నికల్లో 234 స్థానాలకుగానూ విజయ్ పార్టీ 108 సీట్లు గెలిచింది. విజయ్ రెండు చోట్లా పోటీ చేయడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కి పడిపోయింది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4, వీసీకే 2 సీట్ల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118ని టీవీకే చేరుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. ఒక ఓటు తేడాతో నెగ్గిన తిరుప్పత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్లో తేడా జరిగిందని.. శ్రీనివాస ఎన్నిక చెల్లదంటూ డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియాకరుప్పర్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ టీవీకే ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్పై విచారణ జరగనుంది. అయితే.. శ్రీనివాస్ దూరం అయిన నేపథ్యంలో టీవీకే సంకీర్ణ ప్రభుత్వ బలం 117కి పడిపోయింది. అయితే ఏఎంఎంకే పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ తన అధిష్టానాన్ని ఎదురించి మరీ విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అలాగే అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి విజయ్ (Vijay) సీవీ షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. ఇవాళ్టి బలనిరూపణ ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
లండన్: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్ వీసాపై స్కాట్లాండ్కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్ అందిపుచ్చుకుని స్కాటిష్ గ్రీన్పార్టీ తరఫున ఎడిన్బర్గ్ అండ్ లూథియన్స్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్ ఆఫ్ స్కాటిష్ పార్లమెంట్(ఎంఎస్పీ) సభ్యుడయ్యాడు. తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్కు వచ్చాడు. ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్డీ విద్యార్థులూ స్కాట్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్జెండర్ అయిన మణివణ్ణన్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనువిదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్బర్గ్, లూథియన్స్ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్లర్, మాజీ ఎంపీ రాబర్ట్ జెన్రిక్ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్కు గ్రీన్స్ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం -
విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK (అన్నాడీఎంకే) చీలిక దిశగా వెళ్తుండటంతో, ఆ పార్టీకి చెందిన రెబల్ వర్గం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉన్న తరుణంలో సీఎం విజయ్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో CV షణ్ముగం, SP వేలుమణిలతో భేటీ కావడంతో తమిళనాట రాజికీయాలు మరింత వేడెక్కాయి.ముఖ్యమంత్రి విజయ్, టీవీకే కూటమికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదనపై వ్యతిరేకత కారణంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఇది తమ ఎమ్మెల్యేలలో అత్యధికుల నిర్ణయమని షణ్ముగం మంగళవారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.కొత్త నాయకత్వంరెబల్ వర్గం తమ సొంత నాయకత్వాన్ని ఎన్నుకుంది:శాసనసభాపక్ష నేతగా ఎస్.పి. వేలుమణిని, డిప్యూటీ లీడర్గా జి. హరిని ఎన్నుకోవడం సంచలనం రేపింది.విజయ్తో అన్నాడీఎంకే రెబల్ నేతల భేటీఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, బద్ధశత్రువైన DMK (డీఎంకే) మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని షణ్ముగం తెలిపారు.డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడకే ముప్పు అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే తమ రాజకీయం ఉందని, అందుకే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకేలో మరో చీలిక తమకు ఇష్టం లేదని ఎస్.పి. వేలుమణి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామిని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే (108 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం కానుంది. -
డియర్ విజయ్ హ్యాట్సాఫ్ : హీరో విశాల్ ప్రశంసలు
తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసి, రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకున్న తాజా నిర్ణయంపై హీరో విశాల్ స్పందించారు. తన తొలి సంతకంతోనే మరో సంచలనం క్రియేట్ చేసిన సీఎం విజయ్ నిర్ణయంపై విజయ్ చిరకాల మిత్రుడు, విశాల్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై కూడా విశాల్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను (TASMAC) మూసివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరోవైపు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి, అధికారాన్ని చేపట్టడం, తొలి నిర్ణయంతోనే తనదైన ముద్ర వేయడంతో విజయ్ అభిమానులు, తమిళ ప్రజలు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు."ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హ్యాట్సాఫ్. పాఠశాలల సమీపంలోని 717 మద్యం దుకాణాలను మూసివేయడం గొప్ప నిర్ణయం. స్కూళ్ల దగ్గర మద్యం దుకాణాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఈ చర్యతో వారికి ఊరట లభిస్తుంది. వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఎంత గొప్ప చర్య," అని విజయ్కు పంపిన వీడియో సందేశంలో విశాల్ పేర్కొన్నారు. అంతేకాదు "ప్రియమైన విజయ్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ రోజు మీకు, మీ ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను," అంటూ మరో పోస్ట్లో తన సంతోషాన్ని ప్రకటించారు.చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల వద్ద మద్యం షాపుల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB— Vishal (@VishalKOfficial) May 12, 2026 కాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలను గెలుచుకుంది. అయితే పూర్తి మెజారిటీకి (118) పది సీట్లు తక్కువ కావడంతో, వారం రోజుల హైడ్రామా తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు,వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం చేసిన తరవాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర కీలక నేతలను గౌరవప్రదంగా కలుసుకోవడం కూడా నెట్టింట ఆకర్షణీయంగా మారింది. -
సీఎం విజయ్ స్పీచ్ తో దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ
-
సనాతన ధర్మంపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు. “ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్ నమస్కారం చేశారు.Udhayanidhi Stalin again says"SANATANA MUST BE ERADICATED."CM Joseph Vijay in assembly just looks on and even greets with folded hands pic.twitter.com/MNMz7PWmQL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2026ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు. 2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు. -
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్గా జేసీడీ ప్రభాకర్
చెన్నై: తమిళనాడు 17వ శాసనసభ సభాపతి (స్పీకర్)గా టీవీకే సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్పీకర్ పదవికి ప్రభాకర్ మే 11న నామినేషన్ దాఖలు చేయగా.. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.కాగా, జేసీడీ. ప్రభాకర్కు శాసనసభ నిబంధనలు, సంప్రదాయాలపై అపారమైన అనుభవం ఉంది. 2011లో విల్లివాక్కం నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా ఇది వరకు ఉన్న జేసీడీ ప్రభాకర్ ప్రస్తుతం టీవీకే తరపున థౌజండ్ లైట్స్ నుంచి గెలిచారు. సీఎం విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగం తరపున సీనియర్ నాయకుడు, థౌజండ్ లైట్స్ ఎమ్మెల్యే జే.సీ.డీ. ప్రభాకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం విజయ్, మంత్రులతో కలిసి ఆయన ఈ నామినేషన్ను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఇవాళ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది. ‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు. ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. అయితే.. టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!. -
విజయ్ తో కనిపించే ఆ వ్యక్తి ఎవరు? సోషల్ మీడియాలో హాట్ టాపిక్
-
బల పరీక్షకు ముందు టీవీకేకు షాక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో బల నిరూపణకు ముందు తమిళగ వెట్రి కగళం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్ సేతుపతి ఈ ఎన్నికల్లో టీవీకే తరఫున తిరుప్పత్తూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పన్పై ఒక్క ఓటుతో గెలిచారు. కౌంటింగ్ సమయంలో ఆ టైంలో హైడ్రామా నడిచింది. అయితే.. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపత్తూరు నియోజకవర్గం నం.185లో నమోదు కావలసిన ఓటు, పొరపాటున వెల్లూరు జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నం.50కి బదిలీ చేయబడిందని.. ఈ విషయంపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కరుప్పన్ కోర్టులో వాదించారు. ఈసీ మాత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఫిర్యాదులపై చర్య అవసరం లేదని పేర్కొంది. అలాగే, ఒక్క పోస్టల్ ఓటు కూడా ఇతర నియోజకవర్గానికి బదిలీ కాలేదని స్పష్టం చేసింది. అయితే.. కోర్టు పెరియా కరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు ఉన్నాయని గమనించింది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా ఓటు వేయడానికి వీల్లేదని శ్రీనివాస్కు తేల్చి చెప్పింది. అదే సమయంలో.. అన్ని పోస్టల్ బ్యాలెట్లను సురక్షితంగా భద్రపరచాలని, సంబంధిత వీడియో ఫుటేజ్ను కూడా కాపాడాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఓటింగ్కు శ్రీనివాస్ సేతుపతి దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు మ్యాజిక్ ఫిగర్ 118. గవర్నర్కు విజయ్ సమర్పించిన మద్దతుదారు ఎమ్మెల్యేల సంఖ్య 118. ఇందులో టీవీకే 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ పార్టీలు 4 ఉన్నాయి. బల నిరూపణకు ఒక్క ఎమ్మెల్యే దూరం అయితే ఆ ఫిగర్ 117కి పడిపోనుంది. అయితే ఏఎంఎంకే, అన్నాడీఎంకే చీలిక వర్గ ఎమ్మెల్యేల మద్దతు ప్రకటనతో గండం నుంచి విజయ్ గట్టెక్కే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. -
ఎన్డీయేకు ఝలక్.. విజయ్కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యే వర్గం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగని ఇది పార్టీని చీల్చే ప్రయత్నం ఏమాత్రం కాదని ఆ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తేల్చి చెప్పారు. సీవీ షణ్ముగంలో నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు(24 మంది అని కొన్ని తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయ్) విజయ్కు మద్దతు ప్రకటించారు. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. చెన్నైలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు నిజమేనని ఆయన అంగీకరించారు. ‘‘విజయ్ ప్రజల సీఎం. ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలని తమిళ ప్రజలు కోరుకున్నారు. ప్రజా నిర్ణయమే మాకు శిరోధార్యం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని షణ్ముగం ప్రకటించారు. అదే సమయంలో.. పార్టీ లుకలుకలను ఆయన మీడియాకు వివరించారు. డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామి కుట్ర చేశారు. ఎలాగైనా ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే స్థాపన లక్ష్యం డీఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు.. అత్యంత ప్రమాదకరం కూడా. ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమికి గుడ్బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. వరుస ఓటములకు పళనినే కారణమన్న షణ్ముగం.. ఆయన అన్ని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మాదే అసలైన అన్నాడీఎంకే కూటమి.. ఎన్డీయేతో మాకు సంబంధం లేదు.. మేం బయటకు వచ్చేశాం. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తాం అని స్పష్టం చేశారాయన. దీంతో పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది?. కూటమి విచ్ఛిన్నంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో? అనే ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 53 సీట్లు నెగ్గింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున శాసనసభా పక్షనేత, ఉప నేత ఎంపికలోనూ ఈ వర్గపోరు మరింత ఉధృతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే పోరు ముదిరి బయటకు వచ్చి ప్రకటన చేసింది. రేపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొనుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన బూస్ట్ కానుంది. -
లిక్కర్ షాపులపై విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కీలక హామీల ఫైల్స్పై ఆయన సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మహిళల భద్రతకు సంబంధించిన టీం పర్యవేక్షణ తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆయన నిర్ణయించారు. తాజాగా మద్యం దుకాణాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది విజయ్ సర్కార్.టాస్మాక్(Tamil Nadu State Marketing Corporation Limited) పరిధిలోని 717 మద్యం దుకాణాలు మూసేయాలని టీవీకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకుగానూ రెండు వారాల గడువు విధించింది. ఇవి ఆలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉండడమే కారణమని తెలుస్తోంది. మూసివేయబడే దుకాణాలు: 717276 – ఆధ్యాత్మిక స్థలాల దగ్గర186 – విద్యాసంస్థల దగ్గర255 – బస్స్టాండ్ల దగ్గరకాలపరిమితి: రెండు వారాల్లో ఈ దుకాణాలను మూసివేయాలని ఆదేశం.Tamil Nadu Chief Minister C. Joseph Vijay has ordered the closure of 717 government-run TASMAC liquor retail outlets located within a 500-meter radius of places of worship, educational institutions, and bus stations, within two weeks. pic.twitter.com/1eSSG18V2k— ANI (@ANI) May 12, 2026టాస్మాక్ అనేది తమిళనాడు ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వహణను ఇదే చూసుకుంటోంది. అంటే అక్కడ ప్రైవేట్ షాపులు ఉండవన్నమాట. ప్రస్తుతం దీని పరిధిలో 4,765 దుకాణాలు (-717) ఉన్నాయి. విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిర్ణయంపై మహిళలు, తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కావొచ్చంటున్నారు. అయితే, TASMAC ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడనుంది.తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గి విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ, వీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారాయన. -
విజయ్ ఎఫెక్ట్తో పళని విలవిల
ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. తప్పు చేయను, తప్పు చేయనివ్వను అంటూ సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు విజయ్ ప్రకటించారు. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామని డీఎంకే ఎంకే స్టాలిన్ హుందాగా ప్రకటించుకున్నారు. ఇంకోవైపు.. విజయ్ దెబ్బకు మరో విపక్షం అన్నాడీఎంకే మాత్రం వర్గపోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. టీవీకేకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటునకు నాలుగు రోజుల హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్లో విజయ్ను దెబ్బ తీయాలని పళనిస్వామి తీవ్రంగా ప్రయత్నించినట్లు ఊహాగానాలు వినిపించాయి. కేవలం 47 మంది స్థానాలు నెగ్గిన అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం బద్ధశత్రువు డీఎంకే మద్దతు తీసుకోనుందనే ప్రచారం ఉవ్వెత్తున సాగింది. చివరకు ఆ ఎపిసోడ్ తుస్సుమంది. గ్రూపు రాజకీయాలతో.. అదీ విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలోనే మొదలైన సంక్షోభంతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నాడీఎంకేలో వర్గపోరు మునుపెన్నడూ లేనంత తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల్లో వరుస పరాజయాల కారణంగా పళనిస్వామి నాయకత్వంపై ఆ పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఆయన డీఎంకేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారని.. మరో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం దీనిని వ్యతిరేకించిందని.. అదే సమయంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చర్చలు జరిపిందని జోరుగా ప్రచారం నడిచింది. పళనిస్వామి ఎమ్మెల్యేల మద్దతు కోసం వారిని పుదుచ్చేరి రిసార్ట్కి తరలించినా ఈ విభేదాలు చల్లారలేదు. చివరకు తన నివాసంలో కూర్చోబెట్టి బుజ్జగించినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ‘‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి..’’ అని తెగేసి చెప్పినట్లు సమాచారం. అటుపై మే 10 రాత్రి జరిగిన మరో సమావేశం తీవ్ర వాగ్వాదాలతో ముగియడంతో.. షణ్ముగం వర్గం విడిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.తాజాగా.. సోమవారం తమిళనాడు కొత్త అసెంబ్లీ సమావేశమైంది. దీనికి పళనిస్వామి నేతృత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు, అలాగే షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా శాసనసభకు వచ్చి ప్రమాణం చేసి వెళ్లిపోయారు. పళని స్వామిని శాసనసభా పక్ష నేతగా గుర్తించాలని ఆయన మద్దతుదారులు.. లేదు ఎస్పీ వేలుమణిని గుర్తించాలని షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి విడిగా లేఖలు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎంపికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుతో అన్నాడీఎంకేలో మొదలైన విభేదాలు.. మరింత ముదిరి ఇంకో మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఇవాళ జరగబోయే స్పీకర్ ఎన్నికలో షణ్ముగం వర్గం టీవీకేకు మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది జరిగితే, పళనిస్వామికి సొంత పార్టీలోనే షాక్ తప్పదు.విజయ్ ప్రభావం అన్నాడీఎంకేలోని అంతర్గత సమీకరణాలను గణనీయంగా మార్చేస్తోంది. పళనిస్వామి తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం ఆయనను విలవిలాడే స్థితిలోకి నెట్టింది. మొత్తం మీద, అన్నాడీఎంకేలోని ఈ చీలిక పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. అయితే.. ఈ పరిణామాలతో సైలెంట్గా లాభపడేది టీవీకే, బీజేపీ అనే విశ్లేషణ నడుస్తోంది. అసెంబ్లీలో విజయ్ టీవీకే బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ఆ సమయంలో టీవీకేకు మద్దతు ప్రకటిస్తే పెనుసంచలనమే కానుంది. అయితే.. బయట మద్దతు తీసుకోవచ్చని.. మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ విబేధాలను అన్నాడీఎంకే కూటమి పార్టీ బీజేపీ తమ వ్యూహంలో భాగంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. బలహీనమైన అన్నాడీఎంకే ద్వారా టీవీకేపై ప్రభావం చూపించే ప్రయత్నం చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.షణ్ముగం వర్గం బలపడితే, పళనిస్వామి నాయకత్వం కూలిపోవడం ఖాయం. ఇక స్పీకర్ ఎన్నికలో టీవీకే పార్టీ అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు పొందితే, ఆ ప్రభావం తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. -
హీరోయిన్ త్రిషకు షాకింగ్ కౌంటర్ : డా.శివరంజని పోస్ట్ వైరల్
అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మధ్య ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో హాజరైన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో, కొప్పున మల్లెలతో కనిపించడమే కాదు, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో భావోద్వేగానికి లోనవుతున్న వీడియో సంచలనం రేపింది. ఆ తరువాత తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అంటూ ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో విజయ్-త్రిష మధ్య ప్రేమానుబంధంపై రకరకాల వాదనలు, పుకార్లు హాట్ టాపిక్గా మారాయి.అయితే చిన్నపిల్లల వైద్యురాలు, ఓఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం చేసిన హైదరాబాద్కు చెందిన డా. శివరంజని ఇన్స్టా పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా త్రిష పోస్ట్కు కౌంటర్గా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది. ‘ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. ద్రోహం. విచ్ఛిన్నమైన కుటుంబాల నిశ్శబ్దం బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు’ అని అర్థం వచ్చే పిక్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. View this post on Instagram A post shared by Dr Sivaranjani Santosh (@drsivaranjanionline) నెటిజనుల స్పందనవావ్..ఎంత అద్భుతమైన సమాధానం, వావ్. మీపై గౌరవం పదివేల రెట్లు పెరిగింది అంటూ ఆమెను కొనియాడగా, మహిళలు ఆమెనే ఎందుకు నిందిస్తున్నారు, దీనికి ఆ వ్యక్తి ( విజయ్) బాధ్యుడు కాదా? నిజం ఏమిటంటే, ప్రతీ వివాహం శాశ్వతంగా నిలవాలని లేదు. కొన్నిసార్లు విడిపోవడమేమంచిది. ఆరోగ్యకరం కూడా. అందుకే చాలా జంటలు సమాజం కారణంగా కలిసి జీవిస్తాయి. వారు తమలో నింపుకున్న ద్వేషం చాలా లోతుగా పాతుకుపోయి, చాలాసార్లు దానిని పిల్లలకు కూడా అందిస్తారు అని మరొకరు కమెంట్ చేశారు.చిన్నప్పుడు నేను దీనిని అనుభవించాను. అది నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది! ఈ విషయాన్ని గట్టిగా చెప్పినందుకు ధన్యవాదాలు అని మరొకరు సమాధానం ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను‘ప్రతి ఒక్కరూ వివాహేతర సంబంధాన్ని సాధారణీకరించి, దాన్ని గొప్పగా కీర్తిస్తుండటం అత్యంత అసహ్య కరమైన విషయం. పిల్లలు మోయబోయే బాధ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు తమ తల్లికి చాలా గట్టిగా అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లూ భార్య వెన్నెముకలా నిలబడింది, అకస్మాత్తుగా మరో స్త్రీ వచ్చింది. ఇది ఇద్దరి వ్యక్తుల తప్పే. అతను ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ తన పిల్లల ముందు ఓడిపోయాడు.ఆమెను వేడుకకు తీసుకువచ్చి, పిల్లలను, భార్యను అవమానించడం అత్యంత ఘోరమైన విషయం.’ ఇది మరో స్పందన.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?ఒక పిల్లల వైద్యురాలిగా, విడిపోయిన లేదా, విచ్ఛిన్నమైన కుటంబాలలోని పిల్లలు అనుభవించే మానసిక క్షోభ, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆమె వ్యాఖ్యలు చేశారని, పిల్లలపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం అంటున్నారు మరికొందరు. ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే? -
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అగ్రనటుడు విజయ్ ఆదివారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపులో మేనిఫెస్టోలో కీలక మూడు హామీల అమలును ప్రకటించారు. తొలి సంతకాన్ని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన దస్త్రాలపైనా సంతకాలు పెట్టారు. ఇక.. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే టీంను తన పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నట్లు విజయ్ ఇవాళ చెప్పారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన కాసేపటికే వరుస సమావేశాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యరుస్తూ ప్రతిపక్ష నేతల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యారు. స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారని టీవీకే వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోస్టాలిన్తో విజయ్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైకో నివాసానికి వెళ్తారని సమాచారం. డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకే నాలుగు స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు నెగ్గలేకపోయింది. వీళ్లతో పాటు పలువురు నేతలను కలుస్తారని తెలుస్తోంది. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలను కలుస్తారా? ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పళని ఇంటికి వెళ్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇక.. తమిళనాడులో కొత్త అసెంబ్లీ ఇవాళ కొలువు దీరింది. నూతనంగా ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో శాసన సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ని డీఎంకే ప్రకటించింది. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 13న టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నీ సజావుగా సాగితే.. 17న అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. -
విజయ్కు భారీ గుడ్న్యూస్..
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేలో విజయ్కి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఏఐఏడీఎంకేలో అశాంతి సంకేతాలు తీవ్రమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతగా అంటే.. పార్టీ ఓటమికి పళనిస్వామిని బాధ్యుడిని చేసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో, అన్నాడీఎంకేలో అంతర్గత పోరు పీక్ స్టేజ్కు చేరుకుంది.కాగా, అన్నాడీఎంకేలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు వేలుమణి వర్గం బలంగా ఎదుగుతోంది. పార్టీలో పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా వేలుమణి–శణ్ముగం వర్గానికి మద్దతు భారీగా పెరిగింది. ఎన్నికల్లో గెలిచిన 47 మందిలో 36 మంది ఎమ్మెల్యేలు వీరితోనే ఉన్నారు. కాగా, వీరంతా టీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ముందు నుంచే అనుకూలంగా ఉన్నారు. ఈ వర్గం ఫ్లోర్ టెస్ట్లో కూడా టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు.. పళనిస్వామి నాయకత్వాన్ని సవాలు చేస్తూ అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ కొత్త నేతగా వేలుమణిని ఎన్నుకోవాలని చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇది పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా వేర్వేరుగా వచ్చి అసెంబ్లీలో ప్రమాణం చేయడం గమనార్హం. A split in AIADMK again..🔥🔥🔥- Edappadi Palaniswami resigns as AIADMK General Secretary.- SP Velumani takes over AIADMK.- CV Shanmugam directly alleges that Edappadi is not even qualified to form an alliance.. pic.twitter.com/8Kvop8IGBj— Muthukumar Subbaiah (@smkumarlakshmi) May 9, 2026ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం సీవీ షణ్ముగంతో పొత్తులో ఉన్న ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు కలిసి.. ఆయన నాయకత్వాన్ని ఇకపై అంగీకరించడానికి సిద్ధంగా లేమని ఈపీఎస్కు తెలియజేశారు. వరుసగా నాలుగు ఎన్నికల ఓటముల తర్వాత ఈపీఎస్ వర్గానికి, షణ్ముగంతో ఉన్న నాయకులకు మధ్య విభేదాలు పెరిగాయి. ఓటములు అన్నాడీఎంకేలో నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నాయకత్వం రాజకీయ వ్యూహంపై అంతర్గత ఆగ్రహాన్ని తీవ్రతరం చేశాయని వర్గాలు తెలిపాయి.అన్నాడీఎంకే పరిస్థితి ఇలా..అన్నాడీఎంకే వరుసగా ఎదుర్కొన్న ఓటములు పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.నాయకత్వ సంక్షోభం: ఈపీఎస్ నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా, వేలుమణి–శణ్ముగం వర్గం బలపడుతోంది.పార్టీ విభజన: రెండు వర్గాల మధ్య విభేదాలు పెరిగితే, పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది.డీఎంకేతో చర్చలు: డీఎంకేతో బ్యాక్చానల్ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు, పార్టీ అంతర్గత అసంతృప్తిని మరింత పెంచాయి.టీవీకే ప్రభావం..విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతోంది.విజయం: 108 స్థానాలు గెలిచి భారీ మెజారిటీ సాధించింది.పొత్తు: అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం టీవీకేకు మద్దతు ఇస్తే, టీవీకే బలం మరింత పెరుగుతుంది. ఇది డీఎంకేకు సైతం ఎదురుదెబ్బ. -
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి విజయ్తో పాటు పళనిస్వామి, ఉదయ్నిధి స్టాలిన్ తదితరుంతా ప్రమాణం చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒకస్థానం వదులుకోవాల్సిన పరిస్థితుల్లో.. ఆయన తిరుచ్చికి రాజీనామా చేశారు. ముందుగా పెరంబూర్ ఎమ్మెల్యేగా విజయ్, ఆ తర్వాత టీవీకే సభ్యులు.. ఆ తర్వాత మిగతా పార్టీల సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణం చేయించారు. #WATCH | Chennai: Tamil Nadu Chief Minister C Joseph Vijay takes oath as Member of the Legislative Assembly (MLA) of the Perambur constituency(Source: TNDIPR) pic.twitter.com/nJR6RyIcUA— ANI (@ANI) May 11, 2026రేపు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే ఈ నెల 13న అసెంబ్లీలో టీవీకే బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.కూటమిలో లుకలుకలు?టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలైనట్లు సమాచారం అందుతోంది. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందేమాతరం పూర్తిగా ఆలపించడంపైనా వీసీకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ మెప్పు పొందేందుకు టీవీకే ప్రయత్నించిందని.. ఈ తీరు సరికాదని మండిపడింది.డీఎంకే ఫైర్సీఎం విజయ్పై ప్రతిపక్ష డీఎంకే భగ్గుమంది. గత డీఎంకే సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసిందని.. శ్వేత పత్రం విడుదల చేస్తామని విజయ్ ప్రకటించారు. అయితే అబద్ధ ప్రచారాలు ఆపాలంటూ తమిళనాడు కొత్త సీఎంకు డీఎంకే చురకలంటించింది. తమిళనాడు రాజకీయ చరిత్ర నేర్చుకోవాలంటూ సూచించింది.ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధిప్రతిపక్ష పార్టీ నేతగా మాజీ మంత్రి, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ను డీఎంకే పార్టీ ఎన్నుకుంది. ఇందుకుగానూ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్కు ఉదయనిధి కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీకి వెళ్లే ముందు నూతన ఎమ్మెల్యేలతో స్టాలిన్ కార్యాలయానికి వెళ్లిన ఉదయనిధి.. శాలువా కప్పి పుష్పగుచ్చం సమర్పించారు.#WATCH | Chennai, Tamil Nadu: DMK MLA Udhayanidhi Stalin met party chief MK Stalin, earlier today Udhayanidhi Stalin tweeted, "This morning, before heading to the Assembly, we met DMK President MK Stalin—who has given us the opportunity to serve as the Leader of the Opposition… pic.twitter.com/iudaT3h67J— ANI (@ANI) May 11, 2026 -
విజయ్కు స్టాలిన్ తొలి కౌంటర్
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు విజయ్ను మాజీ సీఎం స్టాలిన్ అభినందించిన వెంటనే కౌంటర్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ తన ప్రసంగంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ అప్పులపై విజయ్ శ్వేతపత్రం విడుదల చేస్తామని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో తమిళనాడు అప్పులపై స్టాలిన్ స్పందిస్తూ..ప్రభుత్వానికి రూ.10 లక్షల కోట్ల అప్పుంది, ఖజానా ఖాళీగా ఉందని చెప్పడాన్ని తప్పుపట్టారు. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయన్నారు. కోవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొని, నిధులకు సహకరించని బీజేపీని తట్టుకుని దీటుగా నిలబడ్డామని బదులిచ్చారు. డబ్బు పుష్కలంగా ఉందని, ప్రస్తుతం కావాల్సింది సంక్షేమ పథకాల అమలు చేయడమేనని చెప్పుకొచ్చారు. ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం అవసరం అంటూ కౌంటరిచ్చారు.ఇదిలా ఉండగా.. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలను తెరపైకి తెస్తోంది. అప్పు రూ.10 లక్షల కోట్లకు చేరుకోవడం వల్ల కొత్త ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణను పాటించడం పెద్ద సవాలు అవుతుంది. ఇది డీఎంకే చేసిన ఖర్చులపై ప్రజా చర్చను మరింత పెంచుతుంది. మరోవైపు.. డీఎంకే పాలనలో అమలు చేసిన పథకాల వల్ల అప్పు పెరిగిందని స్టాలిన్ చెబుతున్నారు. ప్రజలకు లభించిన ప్రయోజనాలను కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.విజయ్ తొలి పాలనలో ప్రాధాన్యతలుఉచిత విద్యుత్: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇది మధ్యతరగతి మరియు రైతులకు ఉపశమనం.మహిళల భద్రత: ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఇది కొత్త ప్రభుత్వానికి ప్రజా విశ్వాసాన్ని పెంచే అంశం.డ్రగ్ నియంత్రణ: యువతలో మత్తు పదార్థాల సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యేక చర్యలు.విద్య, ఆరోగ్యం, నీరు: ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రజల అంచనాలను తీర్చే ప్రయత్నం.రైతులు, మత్స్యకారులు: సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ వర్గాలను ఆకర్షించడం. -
తమిళ సీఎంగా విజయ్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ద్రవిడ పార్టీల పరిపాలనా పర్వానికి తెరదించుతూ తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ సి.జోసెఫ్ విజయ్ ఆదివారం నూతన ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. ఆత్మీయులు, కుటుంబసభ్యులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత 60 ఏళ్ల తమిళనాడు చరిత్రలో డీఎంకే, అన్నాడీఎంకే ప్రమేయం లేని ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10.15 గంటలకు అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం ఆరంభమైంది. విజయ్తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేయించారు. టీవీకేలోని 9 మంది నేతలు మంత్రులుగా ప్రమాణంచేశారు. టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సైతం భాగస్వామిగా చేరిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ, తమిళనాడులో బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, సినీ నటి త్రిష, వామపక్ష పార్టీల రాష్ట్ర ముఖ్యనేతలు ముందువరసలో కూర్చుని ప్రమాణస్వీకారాన్ని చూశారు. పలువురు ప్రముఖులు, తమిళ సినీతారలు, టీవీకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభిమానుల ‘విజిల్’ మోతలు, ‘సీఎం విజయ్’, ‘దళపతి’ నినాదాలతో ఇండోర్ స్టేడియం మార్మోగిపోయింది. విజయ్ తన మంత్రివర్గంలో యువత, అనుభవజ్ఞులకు ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా ప్రమాణంచేశాక విజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు. నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే పాలనకు సంబంధించిన నూతన శకం ఇప్పుడే ప్రారంభమైందని స్పష్టంచేశారు. తనదైన శైలిలో ప్రమాణం చేయబోయి.. విజయ్తో సీఎంగా ప్రమాణం చేయించేందుకు ఆయనను పోడియం వద్దకు గవర్నర్ ఆహ్వానించారు. ‘నేను’ అని గవర్నర్ అందివ్వగా అధికారికంగా ఇచ్చిన ప్రమాణపత్రాన్ని కాదని సొంతంగా తనదైన శైలిలో ప్రమాణంచేసేందుకు విజయ్ ప్రయ తి్నంచారు. వెంటనే గమనించిన గవర్నర్ సున్నితంగా అడ్డుకుని రాజ్యాంగంలో పేర్కొన్న శైలిలోనే ప్రమాణం చేయాలని సూచించారు. తొలి రోజే వివాదం ప్రమాణ స్వీకారోత్సవంలో గాయకులు వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడం విశేషం. సాధారణంగా అధికారిక కార్యక్రమంలో మొదటి రెండు చరణాలను ఆలపిస్తారు. అయితే, మొత్తం ఆరు చరణాలను ఆలపించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రమాణ స్వీకార వేడుకలో తమిళ తల్లి గీతం.. తమిళ్ తాయ్ వాళ్తుకు మూడో స్థానం కల్పించడాన్ని సీపీఐ, డీఎంకేలు తీవ్రంగా పరిగణించాయి. వందేమాతరం, జనగణమన అనంతరం తమిళ్ తాయ్ వాళ్తు గీతాన్ని ఆలపించారు. ప్రాధాన్యతా క్రమంలో తమిళ గీతానికి మూడోస్థానం కల్పించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీర పాండియన్, వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్తోపాటు సీపీఎం, ఐయూఎంఎల్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని, తమిళ తల్లి గీతానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్చేశారు. అధికారిక కార్యక్రమాల్లో తమిళ తల్లి గీతాన్ని మొదట ఆలపించడం సంప్రదాయమని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్.రాందాస్ గుర్తుచేశారు.వేదికపై 3 సంతకాలు ప్రజలకు ఇచ్చిన 3 వాగ్దానాల అమలుకు ప్రమాణ స్వీకార వేదికపైనే విజయ్ శ్రీకారం చుట్టారు. గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. మహిళల భద్రత కల్పించడానికి మహిళలతో ‘సింగా పెన్’ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తూ మరో ఫైల్పై సంతకం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మహమ్మారిని అరికట్టడమే లక్ష్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా దళం ఏర్పాటు కోసం మరో ఫైల్పై సంతకం చేశారు. తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, వామపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. యువత, టీనేజర్లు, చిన్నారులకు విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత సీనియర్ నేత కె.ఎ.సెంగోట్టయన్, యువనేత డాక్టర్ కె.టి.ప్రభు, మహిళా నాయకురాలు ఎస్.కీర్తన, ఆధవ్ అర్జున, ఎన్.ఆనంద్, ఆర్.నిర్మల్ కుమార్, కె.జి.అరుణ్రాజ్, ఎ.రాజ్ మోహన్, పి.వెంకటరమణన్లు ప్రమాణంచేసి మంత్రివర్గంలో చేరారు.నేనొక్కడినే పవర్ సెంటర్ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసిన విజయ్ వేదికపై తనదైన శైలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘నా గుండెల్లో నివసించే అభిమానులందరికీ వందనాలు. నేను రాజరిక కుటుంబం నుంచి రాలేదు., సినిమాల్లో రాణించాలని కష్టపడిన ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ కుమారుడిని. ఆకలి, పేదరికం అంటే నాకు బాగా తెలుసు. అందుకే ప్రజలను నా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తా. తమిళప్రజలు నన్ను సొంత బిడ్డలా, అన్నగా, తమ్ముడిగా ఆదరించి సినిమాల్లో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చా. ప్రజల ఆశీస్సులతో ఈ పదవిలోకి వచ్చా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడు ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి, మోయలేని భారాన్ని మనపై వదిలివెళ్లింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. మా ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేయదు. రహస్యంగా ఎవర్నీ కలవదు. ఏది చేసినా ప్రజల సాక్షిగా బహిరంగంగానే చేస్తాం. ప్రజల సొమ్ము నుంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోను. నేను తప్పు చేయను. ఎవరినీ చేయనివ్వను. నా ప్రభుత్వంలో అధికారులైనా, మంత్రులైనా ఎవరైనా ఒకే మాట మీద నడవాలి. ఇక్కడ పవర్ సెంటర్లు ఉండవు. అంతా నా నాయకత్వంలోనే నడుస్తుంది. నేనే ఏకైక పవర్ సెంటర్. గెలవగానే ఆటలు ఆడదాం అనుకునే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పుడే ఆ ఆలోచన మానుకోండి. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరి కోసం సమప్రాధాన్యంతో పరిపాలిస్తా. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి. నేను దేవదూతను కాదు. సాధారణమైన వ్యక్తిని. విద్యార్థుల కోసం విజయ్ మామ మంచి పనులు చేస్తాడు. భవిష్యత్తులో నాకు అడ్డంకులు సృష్టించేవారు కూడా నాకు శ్రేయోభిలాషులే’’ అని విజయ్ వ్యాఖ్యానించారు. దేవుడి పేరిట ప్రమాణం ప్రమాణ స్వీకారంలో దళపతి విజయ్ సరికొత్త ఆహార్యంతో ఆకట్టుకున్నారు. సాధారణంగా నిత్యం ధరించే తెల్లచొక్కా, ఖాకీ రంగు ప్యాంటు కాకుండా ముదురు రంగు ప్యాంటు, తెల్లచొక్కా, దానిపై నలుపురంగు సూట్ ధరించారు. విజయ్ సహా మంత్రులందరూ దేవుడి పేరిట ప్రమాణం చేయడం విశేషం. రాహుల్ గాం«దీతోపాటు కేబినెట్ సహచరులతో, పార్టీ నాయకులతో విజయ్ సెలీ్ఫలు దిగారు. గవర్నర్తో గ్రూప్ ఫొటో సందర్భంగా వేదికపై అడ్డుగా ఉన్న పెద్ద బల్లను పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ సైతం బల్లను పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. శాసనసభ తొలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణం చేస్తారు. టీవీకే ఎమ్మెల్యే కరుప్పయ్య ప్రొటెం స్పీకర్గా ఆదివారం లోక్భవన్లో ప్రమాణం చేశారు. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేగా రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్తోపాటు తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు. నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండగా, తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇకపై పెరంబూర్ ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగుతారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ పంపించారు. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారిగా సచివాలయానికి రాక ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం విజయ్ సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం సీఎం చాంబర్లో విజయ్ ఆసీనులయ్యారు. కొన్ని అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు. సీఎం హోదాలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళ భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డ్రగ్స్ కేసుల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
తిరుచిరాపల్లి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ఆదివారం తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శి డాక్టర్ కె.శ్రీనివాసన్ను మంత్రులు కేఏ సెంగొట్టైయన్, పి వెంకటరామణన్ కలిసి విజయ్కు సంబంధించిన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచారు. ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో గెలిస్తే ఒక స్థానంలో కొనసాగాలని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం పేర్కొంటోంది. దీంతో పెరంబూర్ నుంచి కొనసాగాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు.అంతకుముందు, విజయ్ తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెన్నైలోని చరిత్రాత్మక ఫోర్ట్ జార్జ్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కొత్త ప్రారంభానికి, నిజమైన లౌకిక, సామాజిక న్యాయ యుగానికి నాంది అవుతుందని చెప్పారు. సినీ జీవితాన్ని వదిలి ప్రజల రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను రాజ కుటుంబం నుంచి రాలేదని తెలిపారు.సీఎం విజయ్ సమీక్షా సమావేశంతమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు విజయ్ చెన్నైలోని సలై రోడ్డులో ఉన్న పెరియార్ స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్గా టీవీకే నాయకుడు ఎంవీ కరుప్పయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్నారు. త్వరలోనే విజయ్ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనున్నారు. -
సీఎంగా విజయ్.. తొలి రోజే సంచలన ప్రకటన
Tamil Nadu CM Oath Live.. విజయ్ ప్రమాణ స్వీకారం అప్డేట్స్.. ఇక అన్నీ మారిపోతాయి: మంత్రి కీర్తనకొత్త మంత్రి, టీవీకే నాయకురాలు ఎస్.కీర్తన (29) కీలక వ్యాఖ్యలువిజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుందివిజయ్ టీవీకే మార్పు తీసుకొచ్చిందిముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేరురాష్ట్రంలో ఇక అన్నీ మారిపోతాయిప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్నిస్తారునాకు మంత్రి పదవి రావడం పార్టీ విధానాన్ని చూపుతోందిమధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానుఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందానునాలాంటివాళ్లు క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా?విజయ్ సంచలన నిర్ణయాలు.. ఉచిత కరెంట్పై సీఎం విజయ్ తొలి సంతకం.మహిళల భద్రతపై రెండో సంతకం.తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగం.డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం. సీఎం విజయ్ కామెంట్స్..నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే.మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను.నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు.రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు.నేను మీకు హామీ ఇస్తున్నాను.అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను.ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను.నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను.తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది.నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్ సెంటర్ ఉంటుంది.సాధ్యమైనది మాత్రమే చేస్తాను.చిన్నారులకు మామగా అండగా ఉంటా.ఇది అస్థిర ప్రభుత్వం కాదు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తా.వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు.. మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు.నన్ను అవమానించేవారున్నారు.. ఇబ్బంది పెట్టేవారు వస్తారు.వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే.. విజయ్కు ప్రధాని విషెస్.. విజయ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం.సీఎం విజయ్కు ప్రధాని అభినందనలుసీఎంగా ప్రమాణం చేసిన విజయ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: మోదీ కమల్ హాసన్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఎంపీ కమల్ హాసన్ శుభాకాంక్షలు.సీఎం విజయ్కు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు.విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం వెలుగొందాలని ఎక్స్లో పోస్ట్.విజయ్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయ్కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..రాహుల్ గాంధీ సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.తమిళనాడు ముఖ్యమంత్రిగా, మీరు పేదలకు సంక్షేమం, అందరికీ న్యాయం చేస్తారని, మీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ఎత్తుకు తీసుకెళ్తారని నేను బలంగా నమ్ముతున్నాను.హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. 👉తమిళనాట విజయ్ శకం ప్రారంభంతమిళనాడు సీఎంగా విజయ్మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్విజయ్ కేబినెట్లో ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకట్రామన్..ఆర్ నిర్మల్కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభుత్వ, కీర్తన👉తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం#WATCH | Chennai: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes oath as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/8yGuYEAkfj— ANI (@ANI) May 10, 2026👉విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఆర్లేకర్👉విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా దద్దిరిల్లిన స్టేడియం #WATCH | Chennai | Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay and Lok Sabha LoP and Congress MP Rahul Gandhi at the Jawaharlal Nehru Stadium in Chennai.Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/9J8R7Zrq3H— ANI (@ANI) May 10, 2026 సీఎం ప్రమాణ స్వీకారంలో బీజేపీ నేతలు..విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ నేతలుకార్యక్రమానికి హాజరైన బీజేపీ చీఫ్ నాగేంద్రన్, తమిళిసై, అన్నామలై#WATCH | Tamil Nadu BJP president Nainar Nagenthran, and BJP leader K Annamalai at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK chief Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/HuzvvWCesA— ANI (@ANI) May 10, 2026👉నెహ్రు స్టేడియం చేరుకున్న గవర్నర్👉కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం.. నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్ ఆర్లేకర్నెహ్రు స్టేడియంకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీరాహుల్కు కాంగ్రెస్ శ్రేణుల స్వాగతం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/xgXEyzAnNs— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai | Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar leaves from Lok Bhavan. He will administer the oath of office to TVK Chief C Joseph Vijay as the Tamil Nadu Chief Minister shortly pic.twitter.com/Y9wpi6ol9r— ANI (@ANI) May 10, 2026నెహ్రు స్టేడియం చేరుకున్న త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన త్రిష. స్టేడియం వద్ద త్రిషకు స్వాగతం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/oCevs6N1Wx— ANI (@ANI) May 10, 2026విజయ్ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేవిజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్కు చోటు.మెలూరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్అయితే, నేడు చెన్నైలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు. తొమ్మిది మంత్రులు వీరే.. నేడు సీఎం సహా తొమ్మది మంది మంత్రుల ప్రమాణ స్వీకారంమంత్రి వర్గంలో కీర్తనకు చోటు. మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కురాలిగా కీర్తన రికార్డు C. Joseph Vijay, the Chief Minister-designate, has recommended a list of nine persons to be appointed as Ministers for the State of Tamil Nadu.1. N. Anand2. Aadhav Arjuna3. Dr. K.G. Arunraj,4. K.A. Sengottaiyan5. P. Venkataramanan6. R. Nirmalkumar7. Rajmohan8. Dr TK.… pic.twitter.com/0tU5Gox6zM— ANI (@ANI) May 10, 2026 స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్నెహ్రుకు స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్.విజయ్కి అధికారులు స్వాగతంకాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం. స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలి వచ్చిన అభిమానులు. #WATCH | TVK Chief C Joseph Vijay arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where he will take oath as the Chief Minister of Tamil Nadu shortly. (Source: TN DIPR) pic.twitter.com/4UvuSfAGxj— ANI (@ANI) May 10, 2026చెన్నై చేరుకున్న రాహుల్విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ.తమిళనాడు చేరుకున్న రాహుల్కాంగ్రెస్ శ్రేణుల ఆహ్వానం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives in Chennai to attend the swearing-in ceremony of TVK Chief Vijay as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/XOgPYpftwI— ANI (@ANI) May 10, 2026స్టేడియంకు బయలుదేరిన త్రిష..చెన్నైలోని తన నివాసం నుండి బయలుదేరిన నటి త్రిష కృష్ణన్విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న త్రిష.ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/vUbZ5TpLE9— ANI (@ANI) May 10, 2026 #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/M7XFTKyKSt— ANI (@ANI) May 10, 2026 విజయ్ కుటుంబ సభ్యుల ఆనందం..విజయ్ సోదరి వ్యాఖ్యలు..విజయ్ ముఖ్యమంత్రి కావడం ఎంతో ఆనందంగా ఉంది.దేవుడి దయ, అభిమానులు, ప్రజల మద్దతే విజయ్ విజయానికి కారణం. మదర్స్ డే రోజున ఇది మాకు ఎంతో ఆనందమని విజయ్ తల్లి శోభ కామెంట్స్.. #WATCH | Chennai, Tamil Nadu: Shoba Chandrasekhar, mother of TVK Chief and CM-designate, Vijay, says, "I am so happy. It is Mother's Day today, I am very happy..." pic.twitter.com/Ti4DM4iCVl— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai, Tamil Nadu: Cousin of TVK Chief and CM-designate, Vijay, says, "We are very proud. All credits to God and the people of Tamil Nadu." pic.twitter.com/oDu8OiYlqP— ANI (@ANI) May 10, 2026 స్టేడియంకు బయలుదేరిన విజయ్..నెహ్రు స్టేడియంకు బయలుదేరిన విజయ్..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..భారీ కాన్వాయ్, అభిమానులతో స్టేడియంకు బయలుదేరిన దళపతి.. ఆనందంలో విజయ్ పేరెంట్స్. #WATCH | Tamil Nadu: TVK Chief and CM-designate Vijay leaves from his residence. He will take oath as the Chief Minister of Tamil Nadu today at Jawaharlal Nehru Stadium in Chennai.(Source: TN DIPR) pic.twitter.com/Cydz5VkjfC— ANI (@ANI) May 10, 2026 కీర్తన సరికొత్త రికార్డు..టీవీకే ఎమ్మెల్యే కీర్తన(29) మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలుశివకాశి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కీర్తనముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం #WATCH | Chennai, Tamil Nadu | S Keerthana, TVK MLA-elect from the Sivakasi constituency, says, "Today is a big day for Tamil Nadu and the public of the state...This is the moment everybody has been waiting for..." https://t.co/Ndr3C8C0VK pic.twitter.com/wbw05LZjQs— ANI (@ANI) May 10, 2026పదవుల జాబితా సిద్దం!ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్దం.ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్దే పెట్టుకోనున్న విజయ్. టీవీకే పార్టీ కన్వీనర్ సెంగొట్టయన్కు ప్రజా పనులు.పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్కు మున్సిపల్ శాఖ.పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ.పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్కు విద్యుత్ శాఖ.అరుణ్ రాజ్కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ.రాజమోహన్కు ఆది ద్రావిడ సంక్షేమం.ముస్తఫాకు మైనార్టీ సంక్షేమ శాఖ. తమిళనాడు బయలుదేరిన రాహుల్ గాంధీ.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీఢిల్లీకి తమిళనాడుకు బయలుదేరిన రాహుల్ టీవీకేకు కాంగ్రెస్ మద్దుతు. #WATCH | Delhi | Leader of Opposition (LoP) Rahul Gandhi arrives at IGI Airport as he heads to Tamil Nadu He will be attending the swearing-in ceremony of Tamil Nadu CM-designate Vijay in Chennai, today. pic.twitter.com/Z5yNaTr0vw— ANI (@ANI) May 10, 2026విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..నేడు సీఎంగా విజయ్ ప్రమాణం.. విజయ్తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణంప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులకు ఆహ్వానం.చెన్నైలో ఉన్న అని దేశాల రాయబారులకు ఆహ్వానం.చెన్నైలో ప్రమాణ స్వీకారం కోసం 20 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం.ప్రమాణ స్వీకారోత్సవానికి కోలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం. అసెంబ్లీలో బల నిరూపణలకు టీవీకే మూడు రోజులు సమయం ఇచ్చిన గవర్నర్ ఆర్లేకర్. ఈనెల 13న బలనిరూపణకు అవకాశం. నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..నేడు తమిళనాడు నూతన సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారంచెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా గొప్ప సంబరంకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ దాటిన విజయ్రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో టీవీకే నేతలు, విజయ్ అభిమానులుప్రమాణ స్వీకారానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశంహాజరు కానున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.నాలుగు పార్టీల మద్దతు.. ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంనాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖకాసేపటికే ఐఎంయూఎల్ కూడా విజయ్కు మద్దతు ప్రకటనకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐఎంయూఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది.ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు.ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్, తమిళనాడు సీఎంగా విజయ్ను నియమిస్తూ లేఖ విడుదల. -
ఎట్టకేలకు 'విజిల్' మోత
సాక్షి, చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్ధ నిశ్శబ్ద వాతావరణంలో విజయ్ విజిల్ ఎట్టకేలకు గట్టిగా మోగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఐదు పార్టీలు అందించిన మద్దతుతో చివరకు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీంతో నేటి(ఆదివారం) ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 234 మంది సభ్యులున్న శాసనసభలో కనీస మెజారిటీ(118)ని మించి ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో సఫలీ కృతుడుకావడంతో విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని శనివారం తమిళనాడు లోక్భవన్ ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. మే 13వ తేదీ లేదా అంతకన్నాముందే బలనిరూపణకు సిద్ధంగా ఉండాలని అధికారిక ఉత్తర్వులో విజయ్ పార్టీకి గవర్నర్ సూచించారు. అధికారిక ఉత్తర్వు వార్త తెలిసి తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే మద్దతుదారులు పెద్దమొత్తంలో బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచి ఆనందాన్నీ పంచుకున్నారు. మద్దతుతో ముందుకు... తొలుత ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ మాత్రమే టీవీకే పార్టీకి మద్దతు పలకగా తర్వాత సీపీ(2)ఎం, సీపీఐ(2) వెంట నడిచాయి. శనివారం విదుథలై చిరుౖథెగల్ కట్చి(వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) సైతం కలిసివస్తామని హామీ ఇవ్వడంతో 107 ఎమ్మెల్యేలున్న టీవీకే పార్టీకి మొత్తం బలం ఒకేసారి 120కి పెరిగింది. వెనువెంటనే గవర్నర్కు మేజిక్ ఫిగర్ అంశాన్ని తెలియజేసేందుకు విజయ్ లోక్భవన్కు బయల్దేరగా అపాయింట్మెంట్ చివరినిమిషంలోనూ ఖరారుకాకపోవడంతో మార్గమధ్యంలోనే నిరాశగా వెనుతిరిగారు. పదేపదే తిప్పుతూ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా విజయ్ను వేధిస్తున్నారని వెంటనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ అన్నారు. నిష్క్రమించిన కొద్దిసేపటికే సాయంత్రం ఆరుగంటల తర్వాత గవర్నర్ నుంచి విజయ్కు పిలుపు వచ్చింది. ఈసారి కాంగ్రెస్ తమిళనాడు రాష్ట్ర చీఫ్ కె.సెల్వపెరుంథగై, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం, సీపీఎం ముఖ్య నేత బాలకృష్ణన్, వీసీకే ముఖ్యనేతలతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని స్పష్టంచేస్తూ జాబితాను గవర్నర్కు విజయ్ బృందం అందజేసింది. గంటకుపైగా సుదీర్ఘ భేటీ తర్వాత విజయ్ మెజార్టీని అంగీకరిస్తూ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను గవర్నర్ తొలగించారు. తమిళనాడు తదుపరి సీఎంగా మీరే ఉండాలంటూ సంబంధిత లేఖను విజయ్కు గవర్నర్ అందజేశారు. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి శ్రీకారం చుట్టినట్లయింది. విజయ్ సారథ్యంలోని ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు వీసీకే, ఐఎంయూఎల్ తెలిపాయి. కానీ తాము ఇంకా డీఎంకే సారథ్యంలోని కూటమిలోని కొనసాగుతామని, టీవీకే సర్కార్కు బయటి నుంచి మద్దతు ఇస్తామని వీసీకే ప్రకటించడం గమనార్హం. వీసీకేతో మారిన పరిణామాలు సీపీఎం, సీపీఐలు అధికారికంగా మద్దతు ఇచ్చినా, వీసీకే నేత థోల్ తిరుమావళవన్ నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. కేరళకు గవర్నర్ వెళ్లిపోతున్నట్లు సమాచారం రావడంతో మెజార్టీ నిరూపణ, ఆదివారం ప్రమాణస్వీకారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే హఠాత్తుగా వీసీకే చీఫ్ వైఖరిలో మార్పువచ్చింది. రాష్ట్రపతిపాలన వంటి ప్రమాదంలేకుండా రాష్ట్రంలో స్థిరప్రభుత్వం ఏర్పడాలనే సుదుద్దేశంతో విజయ్కు మద్దతు ఇస్తానని తిరుమావళవన్ ప్రకటించడంతో పరిణామాలువేగంగా మారాయి. రెండు స్థానాలున్న వీసీకే మద్దతుతో టీవీకే బలం మరింత పెరిగింది. తర్వాత చిట్టచివరకు ఐయూఎంఎల్ సైతం తమ ఇద్దరు ఎమ్మెల్యేలు మీతోనడుస్తారని మాట ఇవ్వడంతో టీవీకే కీలక మేజిక్ ఫిగర్ను దాటింది. తర్వాత గవర్నర్ దగ్గరకు వెళ్లడం, ఇప్పటికే టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యానని విజయ్ చెప్పడం, గవర్నర్ ఆమోదం చకచకా జరిగిపోయాయి. అయితే మంత్రివర్గ కేటాయింపులో వీసీకే గట్టిగా పట్టుబట్టవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఐదు పార్టీల మద్దతుతో ఏర్పడుతున్న ప్రభుత్వంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఏ పార్టీ నేతలకు కీలక శాఖలు అప్పగిస్తారనే ఇంకా చిక్కుముడిగానే ఉంది. ప్రమాణస్వీకారానికి రాహుల్గాంధీ రాక నేడు చెన్నైలో జరిగే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీఎంగా ప్రమాణంచేయబోతున్న విజయ్కు రాష్ట్ర కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య నేతలకు మంత్రి పదవులు! టీవీకే ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్ద అట్టిపెట్టుకుని పార్టీ కచ్చినర్ సెంగొట్టయన్కు ప్రజా పనులు, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్కు మునిసిపల్ శాఖ, పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ, పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్కు విద్యుత్, పార్టీ ముఖ్య నేత అరుణ్ రాజ్కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు శాఖ, పార్టీ కోశాధికారి వెంకటరామన్కు పాఠశాల విద్యాశాఖ, రాజ మోహన్కు ఆది ద్రావిడ సంక్షేమం, ముస్తఫాకు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే విధంగా తొలి జాబితా సిద్ధమైనట్టుగా తమిళనాడు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్కు ఒక మంత్రి పదవి అప్పగిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రోటెం స్పీకర్ నియామకం తర్వాత బల నిరూపణకు విజయ్ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది. అంతకుముందు అమ్మ మక్కల్మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ఏకైక ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ సైతం తమకు మద్దతిస్తున్నారని టీవీకే తెలిపింది. ఆయన మద్దతిచ్చే లేఖ ఫోర్జరీది అని ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ మేరకు గుండీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దినకరన్ ఆరోపణలను టీవీకే కొట్టిపారేసింది. కామరాజ్ స్వయంగా రాసిన మద్దతు లేఖ వీడియోను టీవీకే బహిర్గతంచేసింది. -
కోల్కతా టూ చెన్నయ్!
బెంగాల్ విజయంతో బీజేపీ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం పూర్తయినట్టే. జాతీయోద్యమ కాలంలో సమున్నతంగా రెపరెప లాడిన సాంస్కృతిక పతాకం బెంగాల్! ‘ఇవాళ బెంగాల్ ఏమని ఆలోచిస్తుందో రేపు మిగతా భారతదేశం అదే ఆలోచిస్తుంద’ని గోపాలకృష్ణ గోఖలే చేసిన ప్రశంస చరిత్ర ప్రసిద్ధమైనది. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం కూడా బెంగాలే. బీజేపీ తీవ్రంగా ద్వేషించే కమ్యూనిస్టు భావ జాలానికి దేశంలో ఒక దిక్సూచి మాదిరిగా దాదాపు అర్ధ శతాబ్దం పాటు బెంగాల్ నిలబడింది. అటువంటి బెంగాల్లో అఖండ విజయాన్ని సాధించినందున ఆ విజయానందం బీజేపీ శ్రేణుల్లో తొణికిసలాడుతున్నది. సువేందు అధికారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వేదికపైనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాలీ ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఎన్డీఏ దిగ్గజాలతో పాటు, ఆ కూటమికి చెందిన అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఒక జాతీయ పర్వదినంగా మార్చారు.బెంగాల్ సరే, బీజేపీది చారిత్రాత్మకమైన విజయమే. మరి ఒక్క సీటే గెలిచిన తమిళనాడులో ఏ ప్రయోజనాన్ని ఆశించి బీజేపీ హైటెన్షన్ డ్రామాను నడిపించింది? అత్యధిక సంఖ్యా బలం కలిగిన విజయ్ ఐదు రోజులపాటు గవర్నర్ కటాక్షం కోసం ఎందుకు నిరీక్షించవలసి వచ్చింది? ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పక్షం నేతను గవర్నర్ ఆహ్వానించాలనీ, శాసనసభ వేదికపై బలాన్ని నిరూపించుకునే అవకాశాన్నీయాలనీ గతంలో సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. మెజారిటీ బలపరీక్ష జరగాల్సింది శాసనసభలో తప్ప, రాజ్భవన్ (లోక్ భవన్)లో కాదని కూడా సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా, పూంఛీ కమిషన్లు కూడా ఇదే మాటను చెప్పాయి. సంప్రదాయాలు కూడా అవే సంకేతాలు ఇస్తున్నాయి. 1996లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 161 స్థానాలను గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. 140 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. లోక్సభలో మెజారిటీ సీట్ల కంటే బీజేపీకి 111 సీట్లు తక్కువున్నాయి. అయినప్పటికీ సంప్రదాయాన్ని అనుసరించి నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ బీజేపీ నేత వాజ్పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.మెజారిటీ నిరూపించుకోలేక 13 రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. దేశ ఆర్థిక గమనాన్నే ఒక మలుపు తిప్పిన పీవీ నరసింహారావు కూడా మైనారిటీ ప్రభుత్వాన్నే చాలా కాలంపాటు నడిపారు. 240 సీట్లే గెలిచిన కాంగ్రెస్ పార్టీ 1991లో పెద్ద పార్టీగా అవతరించడంతో, మెజారిటీకి 32 సీట్లు తక్కువ ఉన్న ప్పటికీ నాటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ ప్రభుత్వ ఏర్పాటుకు పి.వి. నరసింహారావును ఆహ్వానించారు. 2018లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప కూడా ఇదే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి, ప్రస్తుత తమిళనాడు తాత్కాలిక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు ఎందుకింత ధర్మం మీమాంస ఏర్పడిందో, ఎందుకు విజయ్ను పడిగాపులు పడేలా చేశారో తెలుసుకోవడం అసాధ్యమేమీ కాదు.బెంగాల్ మాదిరిగానే తమిళనాడు కూడా ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన రాష్ట్రం. వర్తమాన చరిత్రలో ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో ముందంజలో ఉన్న ఘనత దానిది. సంప్రదాయాలూ– హేతుబద్ధమైన ఆలోచనలూ సహజీవనం చేసే గతిశీలత కలిగిన ప్రాంతం. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో బీజేపీకి అడుగు మోపే అవకాశం చాలా కాలంగా చిక్కడం లేదు. జయలలిత మరణం తర్వాత ఆమె పార్టీ అన్నాడీఎంకేను లొంగదీసుకుని ఎన్డీఏ కూటమిలో చేర్చు కున్నా కూడా బీజేపీకి ఆశించిన ఫలితం రావడం లేదు. ఇప్పుడు రెండు ద్రవిడ పార్టీలను వెనక్కు నెట్టి దళపతి విజయ్ అత్యధిక స్థానాలు సాధించడంతో తమిళ రాజకీయాలు బీజేపీకి మరింత పజిల్గా మారాయి.పూర్తి మెజారిటీకి కేవలం 10 సీట్లు మాత్రమే తక్కువ గెలిచిన విజయ్, గవర్నర్ నిర్ణయం కోసం ఐదు రోజులుగా నిరీ క్షించవలసి వచ్చింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల మద్దతు తర్వాత పూర్తి మెజారిటీకి కేవలం ఒకే ఒక్క సీటు తక్కువున్నప్ప టికీ, మూడుసార్లు గవర్నర్ను విజయ్ కలిసి శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకుంటానని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు నాలుగోసారి శనివారం సాయంత్రం 121 మంది మద్దతుదారుల జాబితాతో, వివిధ పార్టీల మద్దతు లేఖలతో కలిసిన తర్వాత ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే అనుమతి లభించింది. బీజేపీ వ్యూహం ప్రకారమే గవర్నర్ ఈ నాటకాన్ని నడిపారనే అభిప్రాయం జనసామాన్యంలో సహజంగానే వ్యాపించింది. తమిళగ వెట్రి కళగం (విజయ్ పార్టీ)తో కలిసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తొలుత ఆ పార్టీ నాయకుడు పళని స్వామి ప్రయత్నాలు చేశారు. అది కుదరకపోవడంతో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాద నతో ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి స్టాలిన్ అంగీకరించలేదని తెలుస్తున్నది. బీజేపీ ఆశీస్సులు లేకుండా పళని స్వామి ఇటువంటి ప్రయత్నాలు చేస్తారని ఊహించలేము. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ సహకారం లేకుండా రాజ కీయాలు నడపడం అంత తేలిక కాదని విజయ్ గ్రహించడం కోసమే బీజేపీ ఈ సాగదీత డ్రామాను నడిపించినట్టు కూడా మరో వాదన ఉన్నది.పళని స్వామి ప్రయత్నాలేమో గానీ, ఆయన పార్టీకే ఎసరు పెట్టే పరిణామాలు శనివారం నాడు జరిగాయి. ఆయన నిర్వ హించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు గైర్హాజర య్యారు. అన్నాడీఎంకేలో మరో సీనియర్ నాయకుడు ఆర్వీ షణ్ముగం నాయకత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు సమావేశ మయ్యారనే వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీలో మెజారిటీ నిరూ పించుకునే అవకాశం విజయ్కిస్తే అన్నాడీఎంకేకు ఉన్న 47 మందిలో మెజారిటీ సభ్యులు విజయ్కు అనుకూలంగా ఓటేస్తా రనే ఆంతరంగిక సమాచారం బీజేపీకి ఉన్నందువల్లనే అటువంటి పరిస్థితి రానీయకుండానే ఈ తాత్సారాన్ని గవర్నర్ కొన సాగించారనే అభిప్రాయం ఉన్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసమే ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయబోతు న్నామనే డ్రామాను పళని స్వామి నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది.అన్నాడీఎంకేను అవమానకర పరిస్థితి నుంచి గట్టెక్కించ డానికి గవర్నర్ ద్వారా బీజేపీ సేఫ్ గేమ్ ఆడితే మరో రకమైన పాజిటివ్ గేమ్ను డీఎంకే నడిపించింది. డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టాలిన్తో మాట మాత్రమైనా చెప్పకుండానే విజయ్కు మద్దతు ప్రకటించి కూటమి ధర్మాన్ని గంగలో కలిపింది. నిజానికి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్టాలిన్ వ్యతిరేకం కాదు. పెద్ద పార్టీగా గెలిచిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని గవర్నర్కు కూడా సూచించారు. అయితే ఈ వ్యవహారాన్ని భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి స్టాలిన్ ప్రయత్నించారు. స్టాలిన్తో సంబంధం లేకుండా విజయ్కి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్తో తెగదెంపులు చేసు కున్నారు. మరోసారి మిత్రద్రోహానికి పాల్పడిన అపకీర్తిని కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకున్నది.స్టాలిన్ సలహా మేరకే సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూ ఎంఎల్ పార్టీలు ఒకరి తర్వాత మరొకరు టీవీకేకు మద్దతు ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వంలో అన్నాడీఎంకే ఏ రూపంలోనూ భాగస్వామి కాకుండా ఉండేందుకే స్టాలిన్ ఈ ఎత్తుగడను అవలంబించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోనూ వీసీకేకు కీలక పదవి లభించేలా పావులు కదిపి పరోక్షంగా తన పలుకుబడిని కొనసాగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉన్నది. వీసీకే ఉపముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నదనే వార్తలు కూడా శనివారం వెలువడ్డాయి. అయితే చివరకు బేషరతుగానే వీసీకే మద్దతు లేఖను సమర్పించింది. లోపాయికారి షరతులు ఏమైనా ఉన్నాయేమో తెలి యదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆలస్యంగానైనా విజయ్కు లైన్ క్లియర్ అయింది.ప్రస్తుతానికైతే తమిళనాడులో బీజేపీ పాచిక పారినట్టు కనిపించడం లేదు. అన్నాడీఎంకేను ముందు పెట్టుకొని వేసిన ఎత్తులు స్టాలిన్ అప్రమత్తత వల్ల ఫలించలేదు. ఇకముందు ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. పదేళ్లపాటు విరామమెరుగని పోరాటం చేసి బెంగాల్ను గెలుచుకున్న బీజేపీ తమిళనాడుపై ఆశలు వదులుకుంటుందని భావించలేము. శనివారం కోల్కతాలో జరిగిన సువేందు ప్రమాణ స్వీకార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సోమవారం నాడు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళుతున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తున్నది. సరిగ్గా వెయ్యేళ్ల కింద భారత్ పైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ భద్రపరిచిన అపార ధనరాశిని కొల్లగొట్టాడని చరిత్ర చెబుతున్నది. మహమ్మదీయ దాడులు ఈ ఆలయంపై పలుమార్లు జరిగాయని కూడా చరిత్ర లిఖించింది.మత దురహంకారాలు, విద్వేషాలు చెలరేగిన మధ్య యుగాల నాటి పరిస్థితికి సోమనాథ్ ఆలయ విధ్వంసం ఒక ప్రతీక. ఈ గజనీల లక్ష్యం కేవలం సంపద లూటీ మాత్రమే కాదనీ, ప్రజల విశ్వాసాలను దెబ్బతీయటం కూడా వాటి ధ్యేయ మనీ అల్బెరూనీ అనే పర్షియన్ పండితుడు తన రచనల్లో విశ్లే షించాడు. ఇదంతా వెయ్యేళ్లనాటి మాట. మతమౌఢ్యాలు రాజ్య మేలిన నాటి పరిస్థితి. ఈ వెయ్యేళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన దేశం లౌకిక రాజ్యాంగాన్ని రచించుకున్నది. ఈ నేపథ్యంలో సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకొని దేశవ్యాప్తంగా అన్ని మీడియా మాధ్యమాల్లో భారీ ప్రకటనలను గుప్పించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే సోమనాథ్ ఆలయానికి హిందూ సమాజంలో విశిష్ట స్థానం ఉన్నది.దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా సోమనాథ్ ప్రసిద్ధి చెందింది. బెంగాల్లో విజయం అనే ఒక చారిత్రకమైన మైలురాయిని బీజేపీ దాటిన వెంటనే సోమనాథ్ ఆలయ సందర్భం రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ జాతీయతను, మతాన్ని కలగా పులగం చేసే బీజేపీ రాజకీయ వ్యూహానికి ఉపకరించే విధంగానే ఈ సందర్భాన్ని బీజేపీ మలుచుకుంటున్నది. రాజ్యాంగ లౌకిక స్వభావాన్ని బలహీనపరచడంతో పాటు తన సైద్ధాంతిక విరో ధులైన కమ్యూనిస్టుల భావజాలాన్ని కూడా తుడిచేశామన్న ఆనందం బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 డెడ్లైన్ పెట్టి మరీ బుల్లెట్ కమ్యూనిస్టులను అణచివేశామనీ, కేరళలో ఎల్డీఎఫ్ ఓటమితో బ్యాలెట్ కమ్యూనిస్టులు కూడా అంతరించినట్టేననీ వారు భావిస్తున్నారు. ప్రధాని కూడా తన మనోగతాన్ని దాచుకోలేదు. ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు ఫలితంగానే ప్రపంచంలోనూ, దేశంలోనూ, అడవుల్లోనూ కమ్యూనిస్టులు అంతరించారని మొన్నటి విజయోత్సవ సభలో ప్రకటించారు. బహుశా ఈ సంగతి డోనాల్డ్ ట్రంప్కు తెలిసినట్టు లేదు. మమ్దానీ వంటి సోషల్ డెమోక్రాట్లను చూసి కూడా కమ్యూనిస్టులున్నారని ఆయన కంగారు పడుతున్నారు. కోల్ కతా, చెన్నయ్ నగరాల్లో శనివారం నాడు ఆవిష్కృతమైన రెండు సన్నివేశాలు బీజేపీ రాజకీయ వ్యూహానికి అద్దం పడుతున్నాయి. కోల్కతాలో అంతా అంగరంగ వైభోగం. చెన్నయ్లో విజేతకు ఆఖరి నిమిషం దాకా అంతులేని టెన్షన్. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సినిమాకు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు..!
విజయ్.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. అంటే ఇప్పుడు రియల్ హీరో. అంతుకుముందు రీల్ హీరో. సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు. ఇప్పుడు అదే ఆయన్ను సీఎం పీఠంవైపు నడిపించింది. రజినీకాంత్ లాంటి వారే రిస్క్ చేయలేని చోట.. విజయ్ ఒక అడుగు ముందుకేసి మరీ సక్సెస్ కొట్టాడు. ధైర్యమే సక్సెస్కు పునాది అనే విషయాన్ని విజయ్ నిరూపించారు. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రమే ఎప్పట్నుంచో రాజ్యమేలుతున్న చోట. ఒక గట్టిదెబ్బ కొట్టాడు. కొత్త పార్టీతో తొలి అడుగు వేసేటప్పుడు ప్రభుత్వ ఏర్పాటు వరకూ వెళ్లడం అంత చిన్న విషయం కాదు. అలాంటిది విజయ్ చేసి చూపించాడు. ఏదో 60 నుంచి 70 సీట్లు అని అంచనా వేసిన చోట విజయ్.. ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. మొత్తం 108 స్థానాల్లో విజయ్ భేరీ మోగించి తన సత్తా చూపెట్టాడు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్య్యే మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోవడంతో తీవ్ర అనిశ్చిత నెలకొంది. ఫలితంగా రెండు, మూడు సీట్లు సాధించిన పార్టీలకు డిమాండ్ పెరిగిపోయింది. దీనిపై వరుసగా ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ హైడ్రామా నడుస్తూనే ఉంది. ఒకసారి చిన్న పార్టీల మద్దతు అని, కాసేపు కాదనే డ్రామానే నడిచింది. దాంతో వరుసగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం, అక్కడ పూర్తి సభ్యుల మద్దతు లేదనడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మూడుసార్లు గవర్నర్ను విజయ్ కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడలేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు వీసీకే, ఐయూఎంలు తాము మద్దతు ఇస్తున్నట్లు లేఖలు ఇవ్వడంతో మరొకసారి గవర్నర్ను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు గవర్నర్ అపాయింట్మెంట్..అయితే నాల్గోసారి అపాయింట్మెంట్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కాసేపు గవర్నర్ అపాయింట్ ఇవ్వలేదన్నారు. ఆయన కేరళ పర్యటనకు వెళుతున్నారనేది మొదటి సారాంశం. దాంతో విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి మరింత సమయం పడుతుందా? అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నడుమ గవర్నర్ తన కేరళ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. విజయ్కు అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గవర్నర్ మనసు మార్చుకుని అపాయింట్మెంట్ ఇవ్వడంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లే. ఇన్ని టేకులు సినిమాల్లో కూడా తీసుకుని ఉండడు..తమిళనాడులో ప్రముఖ హీరోల్లో ఒకరైన విజయ్.. సినిమా చేసేటప్పుడు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా మనిషి కదా.. ఓపిక ఎక్కువే ఉంటుంది. టేకులు తీసుకోవడం విజయ్కు అలవాటే. అదే ఇప్పుడు జరుగుతుందని అనేవారు కూడా ఉన్నారు. రియల్ లైఫ్లో టేక్లు ఇలానే ఉంటాయని, ఇంత హైడ్రామా నడుమ విజయ్ కూడా మనసులో ఇదే అనుకుని ఉంటాడని అంటున్నారు. టేకాఫ్ అయ్యే ముందు ఈ టేకులను పెద్దగా పట్టించకోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.సినిమా పరంగా టేకులు అంటే ఒకే సందర్భాన్ని పదే పదే చేయడం. ఇప్పుడు అదే విజయ్ నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంది. విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నాటి నుండి ఇదే జరుగుతూ వస్తోంది. ఒకే సందర్భం.. గవర్నర్ను విజయ్ మళ్లీ మళ్లీ కలవడం. దీనికి ఎప్పటికి ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ కేరళ పర్యటన రద్దు నేపథ్యంలో ఆ టేక్కు కాస్త క్లియరెన్స్ వచ్చింది. ఫలితంగా విజయ్ సీఎం టేక్ రేపో, మాపో ఓకే అవ్చొచ్చు. -
అడుగు దూరంలో TVK విజయ్.. బిగ్ ట్వీస్ట్.. తమిళనాడు సీఎంగా VCK ఎమ్మెల్యే
-
VCKతో షరతులతో కూడిన ఒప్పందం... విజయ ప్రమాణస్వీకారానికి ఆల్ క్లియర్
-
విజయ్ వీరాభిమానుల ఆత్మహత్యాయత్నం
చెన్నై: తమిళనాడులో విజయ్ టీవీకే వందకు పైగా స్థానాలు గెలిచినా ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉండటంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. తమ నాయకుడు విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని పార్టీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయ్ సీఎం కావడంపై ఇంకా అనిశ్చిత నెలకొన్న సందర్భంలో ఇద్దరు టీవీకే కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందులో నిన్న ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయగా, నేడు(శనివారం, మే 9వ తేదీ) ఇసక్కియప్పన్ అనే పార్టీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉండటం, విజయ్ సీఎం కాలేడేమోనని మనస్తాపానికి గురై తిరునెల్వేలిలో ఇసక్కియప్పన్ ఆత్మాహుతికి ప్రయత్నించాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇసక్కియప్పన్ 4 నెలల క్రితం కూడా విజయ్ సీఎం కావాలంటూ తన చెంపలను ఇనుప చువ్వతో పొడుచుకున్నాడు. ఇదిలా ఉంచితే. నిన్న(శుక్రవారం, మే 8వ తేదీ) టీవీకే చెందిన వీరాభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేశాడు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై స్నేహితులతో వాగ్వాదం అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు 42 ఏళ్ల పార్టీ కార్యకర్త. ప్రస్తుతం చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రి(ఆర్జీజీజీహెచ్)ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు సదరు అభిమానుం. ఈ ఘటన తాంబరం సమీపంలోని సెలైర్-సెంబక్కం ప్రాంతంలో జరిగింది. మృతుడిని మారిముత్తుగా గుర్తించారు, అతను మేస్త్రీగా పనిచేస్తాడని, విజయ్కు వీరాభిమాని అని చెబుతున్నారు. -
బలనిరూపణ అసెంబ్లీలోనే..లోకభవన్లో కాదు!
-
విజయ్కు సీఎం చాన్స్ ఇవ్వాల్సిందే: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏమాత్రం మంచి చేయని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తాతయ్య గుంట గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా తాజా తమిళ రాజకీయ సంక్షోభంపైనా ఆమె స్పందించారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. కాబట్టి విజయ్కు సీఎంగా ప్రమాణం చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇవ్వాలి. తద్వారా తమిళ ప్రజల నిర్ణయాన్ని ఆయన ఆమోదించాలి అని రోజా అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి, విజయ్కు దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారామె. ‘‘జగనన్నకు, విజయ్కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు. అలాగే హామీల అమలు విషయంలోనూ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు’’ అని అన్నారామె. జగనన్న పాలనలో తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారని.. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈవీఎంల మోసంతో కూటమి ప్రభుత్వం ధికారంలోకి వచ్చిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ల బండారం బయటపడుతుందని ఆర్కే రోజా అన్నారు. -
ప్రజా తీర్పుకు తూట్లు గవర్నర్ చేసేది తప్పా..? ఒప్పా..?
-
హైదరాబాద్ కు.. తమిళ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
-
పుదుచ్చేరి రిసార్ట్ ఖాళీ.. చెన్నైకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పరుగు!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల కొనుగోళ్ల భయం పట్టుకోవడంతో అన్నాడీఎంకే అప్రమత్తమైంది. ఎవరూ చేజారిపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఇందులో భాగంగా పుదుచ్చేరిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్లో 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు బస ఏర్పాట్లుచేసింది. అయితే శనివారం ఉదయం వారిని హుటాహుటిన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.ఉత్కంఠ రేపుతున్న తరలింపుపుదుచ్చేరిలోని ఒక లగ్జరీ రిసార్ట్లో గత కొద్ది రోజులుగా బస చేస్తున్న 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆకస్మికంగా అక్కడి నుంచి బయలుదేరారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి గ్రూపులుగా రిసార్ట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ముందుస్తు జాగ్రత్తగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ వారిని అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం.గమ్యంపై గోప్యతరిసార్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేలను పలకరించే ప్రయత్నం చేశారు. ‘మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?' అని ప్రశ్నించగా.. చాలా మంది నేతలు సమాధానం దాటవేశారు. తమకు ఏమీ తెలియదంటూ చేతులతో సైగ చేస్తూ వేగంగా వెళ్లిపోయారు. అన్నాడీఎంకే అగ్రనేతలు ఎమ్మెల్యేల కదలికలపై డేగకన్ను వేశారు. సమాచారం బయటకు పొక్కకుండా పూర్తి గోప్యత పాటిస్తూ ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.చెన్నైకే మకాం మార్పు?ప్రత్యర్థి పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుంటాయన్న భయమే ఈ తాజా పరిణామాలకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ లేదా పార్టీ ఫిరాయింపులు జరగకుండా ఎమ్మెల్యేలందరినీ ఒకే గొడుగు కింద ఉంచేందుకే ఈ వ్యూహం పన్నారు. శనివారం మధ్యాహ్నానికి వీరందరినీ చెన్నైలోని మరో సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
త్రిష ఆశలు గల్లంతేనా?
తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని సంచలనానికి తెర తీసినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం టీవీకే అధినేత విజయ్కు పూటకో తలనొప్పి ఎదురవుతోంది. ఫలితాలు వెల్లడై ఐదు రోజులు గడుస్తున్నా.. సీఎంగా ప్రమాణం చేయకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పూర్తి బలం(118)తో రావాలంటూ గవర్నర్ తేల్చి చెప్పేయడంతో మద్దతు కూడగట్టే పనిలో మునిగిపోయారు. ఈలోపు.. మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. విజయ్కు గతంలో పలువురు నటీమణులతో సంబంధాలు ఉన్నట్లు ఉధృతంగా ప్రచారం జరిగింది. అయితే వాటిని ఆయనో, అవతలి తారలో కొట్టిపారేస్తూ వచ్చారు. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు.. నటి త్రిషతో ఆయన ప్రైవేట్ టిప్కు వెళ్లడం.. చిన్న ‘క్లూ’తో ఆ విషయం బయటకు రావడంతో తమిళనాట సంచలన చర్చ నడిచింది. ఈలోపు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడంతో ఆ బంధం అఫీషియల్గానే బయటపడింది. ఆపై..విజయ్తో కలిసి ఓ వివాహ వేడుకకు త్రిష హాజరు కావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడే ఆమె పుట్టినరోజు కావడం.. ఫలితాల్లో విజయ్ విక్టరీ.. ఆమె స్వయంగా ఇంటికి వెళ్లి విజయ్ను అభినందించడం.. ఇటు త్రిషకు బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో తారాలోకం విజయ్ ప్రస్తావన తేవడం.. వెనువెంట చర్చనీయాంశాలుగా మారాయి. ఒకవైపు వీళ్ల వ్యక్తిగత జీవితం గురించి చర్చ నడుస్తున్న వేళ.. అనూహ్యంగా త్రిష రాజకీయ అరంగేట్రం టాపిక్ తెరపైకి వచ్చింది.విజయ్ అత్యధిక మెజారిటీతో పెరంబూర్లో గెలిచారు. అదే సమయంలో తిరుచ్చి ఈస్ట్లోనూ విజయం సాధించారు. రెండింటిలో తిరుచ్చి ఈస్ట్కే ఆయన రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. అయితే త్రిష టీవీకేలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని.. విజయ్ ఖాళీ చేసే స్థానంలో నటి త్రిషను పోటీ చేయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రతిపాదన టీవీకే పార్టీ సమావేశంలోనూ జరిగిందని.. ఆమెకు ఏకంగా డిప్యూటీ సీఎం చేయబోతున్నారనే మరో గాలి వార్త చక్కర్లు కొట్టింది.అయితే త్రిషకు రాజకీయాలంటే ఇష్టమే. గతంలో ఏకంగా సీఎం అవ్వాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రకటించారు. అందుకు సంబంధించిన క్లిప్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు.. విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఆయనకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. వీటికి తోడు నాలుగు పదుల వయసులో ఉన్న త్రిషకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె దాదాపుగా రాజకీయాల వైపు వెళ్లవచ్చని అంతా భావించారు.కానీ, ఆమెకు నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీకి సంఖ్యా బలం తక్కువగా ఉంది. దీంతో.. చిన్న పార్టీల మద్దతు కోరారు. దళిత వాదంతో పుట్టికొచ్చిన విడుదల చిరుతైగళ్ కట్చి పార్టీ ఈ ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గింది. వామపక్షాలకు దగ్గరగా ఉండడంతో.. ఈ పార్టీ కూడా విజయ్కు షరతుల్లేకుండా బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చని అంతా భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ పెద్ద మెలికే పెట్టారు.తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, తన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, దళిత సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది వీసీకే. వీటితో పాటు విజయ్ వదిలేసే తిరుచ్చి ఈస్ట్ను కూడా తమకే వదిలేయాలని టీవీకే ముందు మొత్తం నాలుగు డిమాండ్లు ఉంచింది. వీటిలో మంత్రి పదవితో పాటు ప్రత్యేక చట్టం డిమాండ్లకు విజయ్ ఇప్పటికిప్పుడు సుముఖంగానే ఉన్నట్లు.. మిగతా రెండింటి విషయంలోనే ఆయన తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీసీకే మద్దతు టీవీకేకు ఎంతో కీలకం. ఒకవేళ.. మిగతా రెండు డిమాండ్లకు గనుక విజయ్ అంగీకరిస్తే త్రిష ఆశలు గల్లంతైనట్లేనన్న చర్చ ఇటు తమిళ రాజకీయాలు, అటు సినీ రంగంలోనూ జోరుగా నడుస్తోంది. -
కాంగ్రెస్ ఒక్కటే సరిపోదు.. డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు పొలిటికల్ యూటర్న్లు పీక్స్టేజ్కు చేరుకున్న వేళ డీఎంకే నాయకుడు ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోవడం లేదన్నారు. డీఎంకే ఒంటరిగానే ఉందన్నారు. విజయ్.. తగిన బలంతో వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను సంప్రదించాలన్నారు.డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలాంగోవన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీవీకే అధినేత విజయ్ ముందుగా ఇతర రాజకీయ పార్టీలతో ప్రయత్నించి ఆ తర్వాతే గవర్నర్ను సంప్రదించాలి. ఒకే అతిపెద్ద పార్టీగా టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో విజయ్ ఒంటరిగా వెళ్ళి ఉంటే, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఉండేవారు. కానీ వారు కాంగ్రెస్తో కలిసి వెళ్ళి, మెజారిటీని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తగిన బలం లేకుంటే గవర్నర్ ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. తమిళనాడులో డీఎంకే ఒంటరిగానే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు ఆలోచన మాకు లేదు. ఏఎంఎంకే ఎమ్మెల్యే టీవీకేకు మద్దతు ఇవ్వనప్పుడు ఆయన మద్దతు లేఖ ఎందుకు ఇవ్వాలి? ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫోర్జరీ కేసులో పోలీసులు ఏం తేల్చారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ఏఎంఎంకే సపోర్టు లెటర్ లేకుండా ఎందుకు డ్రామా చేస్తోంది. అన్నాడీఎంకే ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచింది. టీటీవీ దినకర్ అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్ చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా అన్నాడీఎంకేను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిందని మండిపడ్డారు. #WATCH | Chennai | DMK leader TKS Elangovan says, "He (TVK chief Vijay) should first try with other political parties and then approach the Governor. If AMMK MLAs are not supporting TVK, then why should he give a letter of support? Let us see what happens when the police… pic.twitter.com/IPIfw54koq— ANI (@ANI) May 9, 2026అంతకుముందు కూడా ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేకు బీజేపీ ఎలాంటి సూచనలు చేసిందో తనకు తెలియదన్నారు. ఒకవేళ అన్నాడీంఎకే గనక టీవీకేకు మద్దతు ఇవ్వకపోతే.. ఏ పార్టీకీ సరైన మద్దతు రాకపోవడంతో హంగ్ వస్తే.. మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకే ఓటమిపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో పొరపాటు జరిగిందని.. అదేమిటో తాము పరిశీలిస్తున్నామన్నారు. కేవలం అధికారంలోకి రావడం మాత్రమే డీఎంకే అజెండా కాదని, కొన్ని దశాబ్దాలుగా తమ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రమే సరిపోదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని, అందువల్ల ఆ పార్టీ మద్దతుతో సర్కార్ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. -
మరో వివాదంలో విజయ్.. అతడికేం పని?
చెన్నై: టీవీకే అధినేత విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గవర్నర్తో భేటీకి జగనాయగన్ సినిమా ప్రొడ్యుసర్ను తీసుకెళ్లడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై రాజకీయ ప్రత్యర్థులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో సినిమా ప్రొడ్యూసర్కి ఏం పని అని అంటూ ప్రశ్నిస్తున్నారు.కాగా, టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ ఆర్లేకర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి జగనాయగన్ ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ కూడా వచ్చారు. దీంతో, కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తి.. ప్రభుత్వ ఏర్పాటులో విషయంలో ఎందుకు భాగమయ్యారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. ఇదే సమయంలో విజయ్, నారాయణపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ.. ప్రభుత్వ ఏర్పాటు కోసం వామపక్షాలకు డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. ఇతర పార్టీలకు కూడా ఆయన ద్వారానే డబ్బు చేరుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రోట్కాల్కి విరుద్దంగా విజయ్.. ప్రొడ్యూసర్ను గవర్నర్ వద్దకు తీసుకెళ్లారని విమర్శించారు. చివరగా.. నారాయణపై హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యర్థులు సిద్దమైనట్టు సమాచారం. -
తమిళ రాజకీయం.. కాంగ్రెస్ హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాజకీయం తెలంగాణకు చేరుకుంది. తమిళనాడు పొలిటికల్ ట్విస్టులు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చారు. రిసార్టు రాజకీయాల్లో భాగంగా వారు ఇక్కడికి చేరుకున్నారు.తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మొదట కర్ణాటకలోని బెంగళూరుకు చేరుకున్నారు. అనంతరం, హైకమాండ్ ఆదేశాలకు మేరకు శుక్రవారం రాత్రి శంషాబాద్ చేరుకుని ఎయిర్పోర్టు సమీపంలోని ఓ హోటల్లో బస చేశారు. ఎమ్మెల్యేలతో తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి విశ్వనాథన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా తాజాగా నవోటెల్లో బస చేస్తున్నట్టు సమాచారం. తమిళనాడు పరిస్థితులు చక్కబడే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు ఇక్కడే ఉండే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం అవకాశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అయితే, వీరంతా రోడ్డు మార్గంలో చెన్నై చేరుకునేలా ఎమ్మెల్యేలకు సూచనలు అందినట్టు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కదలికలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
రాష్ట్రాలకు గవర్నర్ అవసరం లేదు
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ పదవిపై వ్యతిరేకతను డీఎంకే నాయకురాలు కనిమొళి పునరుద్ఘటించారు. ప్రస్తుతం రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నందున, గవర్నర్ పదవిని రద్దు చేయాలన్న డీఎంకే డిమాండ్ మారలేదని ఆమె నొక్కి చెప్పారు. ‘అసలు గవర్నర్ అవసరం లేదనే మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత పరిస్థితి చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాజ్యాంగ ప్రక్రియలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది’అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే బయటి నుంచి ఏఐఏడీఎంకేకు మద్దతు ఇస్తుందన్న వదంతులను ఆమె కొట్టిపారేశారు. అవన్నీ వట్టి ఊహాగానాలేనని, ప్రతి వదంతికి స్పందించలేమని అన్నారు. -
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే చాన్స్ఎనిమిది మంత్రుల పేర్ల జాబితాను గవర్నర్కు అందజేసిన విజయ్ విజయ్తో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశంరేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంనెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి కోరిన విజయ్ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్కు అందజేతప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్అందుకు గవర్నర్ సమ్మతిప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమంఈ నెల 13లోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశం తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్లుకేరళం పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్సాయంత్రం 6.30 గంటలకు విజయ్కు గవర్నర్ అపాయింట్మెంట్తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్లోక్భవన్కు వచ్చిన విజయ్ మళ్లీ వెనుదిరిగారు.కేరళంకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్విజయ్కు సమయం ఇవ్వని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్కు సమయం ఇవ్వలేదు అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు?పీవీ షణ్ముగం నేతృత్వంలో రెబల్ ఎమ్మెల్యేలుఈపీఎస్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మాసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలురాత్రి 7.10 గంటలకు కేరళ వెళ్లనున్న గవర్నర్ రాజేంద్రగవర్నర్ వెళ్లిపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యంసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలుఇప్పటికి తేలని మద్దతు లెక్కలువిజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సస్పెన్స్టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులుటీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వీసీకేకాసేపట్లో వీసీకే మీడియా సమావేశంవీసీకే అధికారిక ప్రకటన తర్వాత గవర్నర్ను కలవనున్న విజయ్తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్వీసీకే చీఫ్ తిరుమావళవన్కు ముఖ్యమంత్రి పదవి?డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్డీఎంకే ప్రతిపాదన అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలుసాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రెస్మీట్తమిళనాడు సంక్షోభంపై సుప్రీం కోర్టులో పిటిషన్టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్కు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్విజయ్ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉందికానీ, అలా చేయలేదుసుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐపీఎస్ అధికారివిచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠమ్యాజిక్ ఫిగర్ దగ్గరే ఆగి.. తమిళనాట అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకే ప్రస్తుత బలం 108-1=107 (ఒక్క స్థానంలో విజయ్ తప్పుకోవాల్సిందే)కాంగ్రెస్ 5వామపక్షాలు 4ఏఎంఎంకే 1లోక్భవన్కు నిన్న సమర్పించిన మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య 117ఏఎంఎంకే ఎమ్మెల్యే విత్డ్రా అయితే 116వీసీకే కలిస్తే .. 118 మ్యాజిక్ ఫిగర్ పూర్తిసాయంత్రం దాకా ఆగాల్సిందే!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న సస్పెన్స్ఎటూ తేల్చని విడుదలై చిరుతైగల్ కట్చి(2 సీట్లు)విజయ్ను వెయిటింగ్లో పెట్టిన వీసీకేమద్దతు ఇస్తే తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్కు ఎండ్ కార్డ్కొనసాగుతున్న వీసీకే హైలెవల్ మీటింగ్సాయంత్రం దాకా జరగనున్న చర్చలుసాయంత్రం వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియా సమావేశంకీలక ప్రకటన చేసే అవకాశం తమిళనాడు సంక్షోభంపై లెఫ్ట్ పార్టీల కీలక ప్రకటనవామపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని తమిళనాట ఆరోపణలుహార్స్ ట్రేడింగ్కు మేం వ్యతిరేకం: సీసీఐ,సీపీఎంబేరసారాలకు గవర్నరే అవకాశం ఇచ్చారు: సీసీఐ,సీపీఎంఢిల్లీ పెద్దల సూచనతోనే తమిళనాడు స్క్రీన్ప్లే నడుస్తోంది: సీసీఐ,సీపీఎంబీజేపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ నడిపిస్తోంది: సీసీఐ,సీపీఎంఅతిపెద్ద పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి : సీసీఐ,సీపీఎంకానీ, ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు : సీసీఐ,సీపీఎంఅందుకే టీవీకేకు మద్దతు ఇచ్చాం: సీసీఐ,సీపీఎంమా రెండు పార్టీలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయి : సీసీఐ,సీపీఎంఇదే విషయాన్ని డీఎంకేకు సమాచారం అందించాం : సీసీఐ,సీపీఎంఏ పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాం: సీసీఐ,సీపీఎంఆ తర్వాతే మేం మా మద్దతు లేఖను గవర్నర్కు పంపాం: సీసీఐ,సీపీఎంవీసీకే పార్టీ కొన్ని కారణాలతో ఇంకా లేఖ పంపలేదు: సీసీఐ,సీపీఎంసాయంత్రంకల్లా ఆ పార్టీ నుంచి స్పష్టత రావొచ్చు: సీసీఐ,సీపీఎంప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారనే ఆశిస్తున్నాం: సీసీఐ,సీపీఎంమద్దతిస్తారా? ప్రతిపక్షంలో కూర్చుంటారా?వీసీకే పార్టీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తుందా? లేదా? అనే చర్చచెన్నైలోని కార్యాలయంలో వీసీకే హైలెవల్ మీటింగ్ప్రతిపక్షంలో కొనసాగుతారా? అధికార పార్టీతో కలుస్తారా?బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశమూ!ఏ నిర్ణయం అనేది స్వేచ్ఛగా తీసుకోవాలని వీసీకే అధిష్టానానికి డీఎంకే అధినేత స్టాలిన్ సూచనడీఎంకే నేతృత్వం సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్లో భాగంగా పోటీ చేసి రెండు సీట్లు నెగ్గిన వీసీకేమరికాసేపట్లో స్పష్టమైన ప్రకటన వెలువడే చాన్స్వీసీకే చీఫ్ తిరుమావళవన్ నిర్ణయం ఎలా ఉండనుందో?గవర్నర్ తీరు వల్లే గందరగోళం: ముకుల్ రోహత్గీతమిళనాడు సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కీలక వ్యాఖ్యలుదేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తోందిఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభంవారంరోజులైనా ఏ విషయం తేల్చలేకపోవడం దారుణంగవర్నర్ తీరు వల్లే ఈ గందరగోళంసింగిల్ లార్జెస్ట్ పార్టీకి గవర్నర్ అవకాశం ఇవ్వాలిఅత్యధిక సీట్లు నెగ్గిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాల్సిందిఅసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాల్సిందిబలనిరూపణ లోక్భవన్లో కాదు.. అసెంబ్లీలో జరిగాలిపీపీ నరసింహారావు ప్రభుత్వం చాన్నాళ్లు మైనారిటీలో నడిచిందిగవర్నర్ ఏదీ తేల్చకపోతే.. విజయ్ కోర్టును ఆశ్రయించొచ్చుగతంలో ఇలాంటి కేసులు చాలా కోర్టుకు వచ్చాయి.. నేనూ వాదించారాష్టపతి పాలన, మరోసారి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదు.. ఇది అప్రాజాస్వామికంఅది ఏఐ వీడియోనేమో!: దినకరన్టీవీకేపై ఏఎఎంకే చీఫ్ దినకరన్ ఆగ్రహంతమ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వనేలేదని మరోసారి వ్యాఖ్యఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసిన టీవీకేఆ వీడియోపై దినకరన్ అనుమానాలుఅది అసలు వీడియో కాదు : దినకరన్అందులో లేఖ.. మా పార్టీ నోట్ప్యాడ్ వేర్వేరుగా ఉన్నాయి : దినకరన్అది ఫేక్ లెటర్ : దినకరన్మా పార్టీ లేఖను ఫోర్జరీ చేశారు: దినకరన్పూర్తి వీడియోను టీవీకే ఎందుకు రిలీజ్ చేయడం లేదు?: దినకరన్అది ఏఐ వీడియో అయ్యి ఉండొచ్చు: దినకరన్ వీసీకే ఆఫీస్ వద్ద కోలాహలంచెన్నైలోని విడుదలై చిరుతైగల్ కట్చి ఆఫీస్ వద్దకు భారీగా చేరుకుంటున్న జనంకాసేపట్లో మీడియా ముందుకు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై ఉత్కంఠమద్దతు ప్రకటిస్తే.. అనిశ్చితికి తెరపడే అవకాశంస్వయంగా వీకేసీ ఆఫీస్కు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయనున్న విజయ్దాదాపుగా మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలుఇవ్వకుంటే.. కొనసాగనున్న సస్పెన్స్వీకేసీ మద్దతు ఇస్తే.. 119కి చేరనున్న టీవీకే బలంఏఎంఎంకే మద్దతు ఉపసంహరించుకున్నా.. టీవీకే మెజారిటీ 118మ్యాజిక్ ఫిగర్ (118) కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ అన్నాడీఎంకే కీలక భేటీపళనిస్వామి ఇంట్లో సమావేశమైన అన్నాడీఎంకే నేతలుప్రభుత్వ ఏర్పాటుపై చర్చ?టీవీకే మెజారిటీ చూపించుకోలేకపోతే.. ఏం చేయాలన్నదానిపై సీనియర్లతో పళని మంతనలుఅన్నాడీఎంకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇస్తారని ప్రచారంనిన్ననేమో బద్ధశత్రువు డీఎంకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రచారంఇవాళ.. తగిన సంఖ్యా బలం లేకున్నా అన్నాడీఎంకేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం మరికాసేపట్లో కీలక ప్రకటనవిడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) మద్దతుపై ఉత్కంఠమరికాసేపట్లో మీడియా ముందుకు వీసీకే చీఫ్ తిరుమావళవన్విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టీకరణమద్దతు ఇస్తే.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ ఇవాళే సీఎంగా విజయ్ ప్రమాణం చేసే చాన్స్ఇవ్వకపోతే.. కొనసాగనున్న సస్పెన్స్దినకరన్పై డీఎంకే ఫైర్ఏఎంఎంకే అధినేత దినకరన్పై డీఎంకే ఆగ్రహంమిత్రపక్షం అన్నాడీఎంకే తరఫున ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వాన విజ్ఞప్తి గవర్నర్కు అందించిన దినకరన్ఏ ప్రతిపాదికన గవర్నర్కు ప్రభుత్వ ఏర్పాటు లేఖ అందించారని ప్రశ్నించిన డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్అన్నాడీఎంకేకు సంఖ్యా బలం ఎక్కడ ఉంది?: ఇళంగోవన్ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా.. సపోర్ట్ లెటర్ లేకుండా దినకనర్ డ్రామాలు చేస్తున్నారా?: ఇళంగోవన్త్రిషకు నిరాశ తప్పదా?తిరుచ్చి ఈస్ట్కు రాజీనామా చేయనున్న విజయ్ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందని ప్రచారండిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలుతిరుచ్చి ఈస్ట్తో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలంటున్న విడుదలై చిరుతైగల్ కట్చిఅలాగైతేనే విజయ్కు మద్దతు ఇస్తామని స్పష్టీకరణసంబంధిత కథనం: త్రిష ఆశలు గల్లంతు!116 కాదు.. 117!విజయ్ మద్దతుపై తమిళనాడు లోక్భవన్ క్లారిటీ117 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్కు లేఖ సమర్పించిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేవిజయ్ రెండు చోట్ల పోటీ చేసిన నెగ్గడంతోనే ఆ ఫిగర్ఒక సీటు మైనస్ చేసి 107 బలంగానే చూపించిన టీవీకేకాంగ్రెస్ సపోర్ట్తో 112బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీలు 4ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు కూడా చూపించిన విజయ్మొత్తం 117 మంది ఎమ్మెల్యేల సంతకాలుమెజారిటీకి తక్కువైన ఒక్క స్థానంవీసీకే పార్టీ(2) మద్దతుపై టీవీకేకు అందని లేఖఅది అంది ఉంటే.. 119కి పెరగనున్న బలంఏఎంఎంకే ఎమ్మెల్యే విషయంలో ఆ పార్టీ అధినేత దినకరన్ కిరికిరివీసీకే మద్దుతు ఇస్తే.. ఏఎంఎంకే ఎమ్మెల్యే వైదొలగినా 118 పూర్తి మెజారిటీనేడు వీసీకే ఆఫీస్కు విజయ్మద్దతుపై సాయంత్రంలోగా రానున్న స్పష్టతతమిళనాట జోరుగా క్యాంపు పాలిటిక్స్తమిళనాడులో మొదలైన నెంబర్ గేమ్మ్యాజిక్ ఫిగర్ 2 తక్కువైన టీవీకే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న అనిశ్చితిటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు ససేమీరా అంటున్న గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్రేపటితో టీవీకేకు గవర్నర్ ఇచ్చిన గడువు పూర్తి?!పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీవీకేమహాబలిపురం రిసార్ట్కే పరిమితమైన టీవీకే ఎమ్మెల్యేలుచెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపునేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిఅన్నాడీఎంకేకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే లేఖఅన్నాడీఎంకే తరఫున లేఖ సమర్పించిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్పళనిస్వామి గవర్నర్ను కలిస్తే మారనున్న నెంబర్లుకాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అన్నాడీఎంకే దృష్టికాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న ఏఐసీసీ ఇంచార్జీ గిరీష్ చోడంకర్కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసులతో బెదిరింపులు.. డబ్బు ఆశ చూపిస్తున్నారని ఆరోపణలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయం మొదలుపెట్టిన కాంగ్రెస్రాత్రికి రాత్రే బెంగళూరు.. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలింపుహైదరాబాద్లోనే తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరం మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్నిన్న విజయ్తో జన నాయగన్ ప్రొడ్యూసర్ భేటీఅనంతరం లోక్భవన్కు విజయ్, మద్దతుదారు పార్టీల నేతలతో వెళ్లిన నిర్మాత లేఖ సమర్పించే సమయంలో గవర్నర్ పక్కనే నిల్చున్న నిర్మాత వెంకట్ కే నారాయణప్రొటోకాల్కు విరుద్ధంగా తీసుకెళ్లారని విజయ్పై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలుప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్కు ఏం పని అంటూ మండిపాటుప్రొడ్యూసర్ ద్వారా వామపక్షాలకు డబ్బులు పంచి ఉంటారని ఆరోపణలువిజయ్ హార్స్ట్రేడింగ్కు పాల్పడుతున్నారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేసే అవకాశంగవర్నర్కు(శాలువా కప్పుకున్న వ్యక్తి) ఎడమ వైపు ఉంది జన నాయగన్ నిర్మాత వెంకట్ కే నారాయణఆ ఇద్దరు ముందుకు వస్తే.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కంటిన్యూవిజయ్కు మద్దతిచ్చే విషయంలో పార్టీల హైడ్రామావీసీకే తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన జ్యోతిమణి, వన్నీరసు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల నెగ్గిన విజయ్ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితిడిప్యూటీ సీఎం పోస్టుతో పాటు విజయ్ వదులుకునే తిరుచ్చి ఈస్ట్ సీటును డిమాండ్ చేస్తున్న వీసీకేవీటితో పాటు మరో రెండు డిమాండ్లుచివరి నిమిషంలో మద్దతు లేఖ ఇవ్వకుండా హ్యాండిచ్చిన వీసీకేటీవీకే మద్దతు అంశం పక్కన పెట్టి.. డీఎంకే అధినేత స్టాలిన్తో వీసీకే చీఫ్ తిరుమావళవన్ భేటీఇవాళ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే చాన్స్మద్దతు ఇస్తే సీఎంగా విజయ్కు లైన్ క్లియర్ఇవ్వకుంటే.. కొనసాగనున్న ఉత్కంఠ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది.. చిన్నతప్పిదంతో గవర్నర్ దగ్గర బుక్కైన టీవీకే అధినేత విజయ్6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తొలిసారి కలిసిన విజయ్గవర్నర్కు సమర్పించిన జాబితాలో కాంగ్రెస్ మద్దతు ఎమ్మెల్యేల పేర్లు కూడాకూటమిగా.. టీవీకేను అతిపెద్ద పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయిన విజయ్అక్కడే గవర్నర్కు దొరికిపోయిన విజయ్ఆ మరుసటి రోజే.. మరోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తినిన్న.. 116 ఎమ్మెల్యేల సంతకాలతో మూడోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తి118 ఎమ్మెల్యేల సంతకాలే కావాలని పట్టుబడుతున్న గవర్నర్మొదటిసారి..రెండో‘సారీ’..మూడోసారి 116 వర్సెస్ 116తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులుక్షణక్షణానికి మారిపోతున్న లెక్కలునెంబర్ గేమ్తో టీవీకే చీఫ్ విజయ్ సతమతంతమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకేకు ప్రస్తుత బలం 116ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్కు అవకాశం ఇవ్వాలంటున్న డీఎంకే అధినేత స్టాలిన్ఇవాళ పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక భేటీవిజయ్ చేతులెత్తేస్తే.. డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు అన్నాడీఎంకేకు బయటి నుంచి డీఎంకే మద్దతు ఇస్తుందంటూ జోరుగా ప్రచారండీఎంకే-అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన బలం 116ఇరు వైపులా.. ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు అవసరంవీసీకే పార్టీ మద్దతు ఇస్తేనే విజయ్ పార్టీకి సంపూర్ణ బలంఇదే అదనుగా టీవీకేకు డిమాండ్లు చేస్తున్న వీసీకేకీలకమైన మంత్రిత్వ శాఖ, విజయ్ ఖాళీ చేసే స్థానంలో పోటీ, మరో రెండు డిమాండ్లు చేస్తున్న వీసీకేఇవాళ తమ నిర్ణయం ప్రకటిస్తామన్న వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ఇవాళ వీసీకే మద్దతు ఇస్తే విజయ్ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ఈరోజు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠటీవీకేను టెన్షన్ పెడుతున్న పళనిస్వామిమరోవైపు.. టీవీకేకు గుబులు పుట్టిస్తున్న అన్నాడీఎంకేడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ప్రచారంమరోవైపు.. అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు లేఖ ఇచ్చిన మిత్రపక్షం ఏఎంఎంకేగవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ను శుక్రవారం సాయంత్రం కలిసిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంసీనియర్ నేతలతో భేటీ కానున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిగవర్నర్ను కలిసి టీవీకేపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న పళని!విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిందని మొన్నటిదాకా ప్రచారంతమ కూటమి ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్ ఆరోపణ.. గవర్నర్కు ఫిర్యాదుస్టాలిన్ పరోక్ష సాయం!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో తమ జోక్యం ఉండబోదన్న డీఎంకే చీఫ్ స్టాలిన్టీవీకే పార్టీకి ఎలాంటి అవాంతరం కలిగించబోమని వ్యాఖ్యప్రజా తీర్పును గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టీకరణవిజయ్ పాలనను ఆరు నెలలపాటు గమనిస్తామని.. ఆ తర్వాతే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని ప్రకటనఅన్నాడీఎంకేతో కూటమి ప్రభుత్వం ఉండబోదన్న సంకేతాలిచ్చిన స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలో తన ఒత్తిడి ఏం ఉండదని.. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని మిత్రపక్షాలకు సూచనఆ సూచన తర్వాతే విజయ్కు మద్దతు విషయంలో ముందుకు వచ్చిన వామపక్షాలువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు చోటుతమకు చోటు అక్కర్లేదని.. బయటి నుంచే మద్దతు(డీఎంకేలో కొనసాగుతూ) ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్ పార్టీలువీసీకే కూడా తమ నిర్ణయాన్ని గౌరవించిందన్న సీపీఐ, సీపీఎంలుఅయితే.. కేబినెట్ బెర్త్తో పాటు విజయ్ వదులుకునే సీటు తమకు ఇవ్వాలంటున్న వీసీకే!ఈ క్రమంలోనే మద్దతుపై ఇంకా ఏదీ తేల్చని వీసీకే చీఫ్ తిరుమావళవన్తిరుమావళవన్ ఎక్కడ?క్షణక్షణానికి మారుతున్న తమిళనాడు రాజకీయంటీవీకేను టెన్షన్ పెడుతున్న వీసీకే అధినేత తిరుమావళవన్చివరి నిమిషంలో మద్దతుపై ట్విస్ట్ ఇచ్చిన విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)డీఎంకే సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమిలో ఉన్న వీసీకేమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇవ్వమంటు వ్యాఖ్యవిజయ్ విజ్ఞప్తి మేరకు ఆలోచన చేస్తామని ప్రకటనసాయంత్రానికి సానుకూలంగా స్పందించినట్లు ప్రచారంస్టాలిన్తో భేటీ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన తిరుమావళవన్అర్ధరాత్రి వరకు నిరీక్షించిన టీవీకేవీసీకే మద్దతు లేఖపై ఉత్కంఠనేడు అధికారిక ప్రకటన వెలువడే చాన్స్విజయ్ ఉక్కిరి బిక్కిరితమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠటీవీకేకు ఇంకా పూర్తిగా దక్కని మద్దతుప్రస్తుత బలం 116గా ఉందన్న గవర్నర్ కార్యాలయంఇంకా ఇద్దరు తక్కువడీఎంకే కూటమిలోని పార్టీలకు విజ్ఞప్తి చేసిన విజయ్టీవీకే విజయ్ పార్టీ బలం (108.. ఇందులో విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి.. దీంతో 107కి పడిపోనున్న సంఖ్యడీఎంకేతో కటీఫ్ చెప్పి విజయ్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్(5)డీఎంకే కూటమిలోనే ఉంటూ బయటి నుంచి విజయ్కు మద్దతు ప్రకటించిన లెఫ్ట్ పార్టీ(4)మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ((2))అన్నాడీఎంకే కూటమిలోని ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే మద్దతు కూడా!దినకరన్కు టీవీకే కౌంటర్మా ఎమ్మెల్యే విజయ్కు మద్దతు ఇవ్వలేదు: దినకరన్తమ ఏకైక ఎమ్మెల్యే సంతకం టీవీకే ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే చీఫ్ దినకరన్ ఆరోపణచెన్నై కమిషనర్కు ఫోర్జరీ కంప్లయింట్దినకరన్కు టీవీకే స్ట్రాంగ్ కౌంటర్ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే గవర్నర్కు విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల్లో.. కామరాజ్ సంతకం కూడా!దినకరన్ ఎంట్రీతో మారిన సీన్తెరపైకి అమ్మ మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) చీఫ్ దినకరన్జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్సొంత పార్టీతో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన దినకరన్ఒక్క స్థానంలో నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థిమన్నార్గుడి నుంచి నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థి కామరాజ్మొదటి నుంచి టీవీకే విజయ్కు మద్దతు ఇస్తారనే ప్రచారంఅందుకు తగ్గట్లే గవర్నర్కు సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతులో కామరాజ్ సంతకం కూడాదినకరన్ సంచలన ఆరోపణలుతమ ఏకైక ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణనిన్న సాయంత్రం గవర్నర్ను కలిసిన దినకరన్అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలంటూ గవర్నర్కు విజ్ఞప్తితమిళ రాజకీయం.. హైదరాబాద్కు షిఫ్ట్తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠహైదరాబాద్కు మారిన తమిళనాడు రాజకీయంహైదరాబాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుతమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్లోనే ఐదుగురు ఎమ్మెల్యేల మకాంఏర్పాట్లు చూసుకోనున్న టీపీసీసీ చీఫ్తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ అవాంతరంగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ముచ్చటగా మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్మ్యాజిక్ ఫిగర్ 118టీవీకే గెలిచిన స్థానాలు 108కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. మొత్తం మ్యాజిక్ ఫిగర్ గవర్నర్కు చూపించిన విజయ్ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంవిజయ్కు సీఎం స్థాయి భద్రతను పునరుద్దరించాలని పోలీస్ శాఖను గవర్నర్ ఆదేశించినట్లు ప్రచారందీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన టీవీకేఅయితే వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల సంతకం మిస్సింగ్!116 మంది మద్దతే ఉందని ప్రకటించిన లోక్భవన్వీసీకే నిర్ణయం వెలువడేది ఇవాళేనేటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్దత -
టీవీకేకు కొత్త కష్టం.. ఫోర్జరీ కేసు నమోదు?
చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయితున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న రాజకీయ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్.. టీవీకేపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, టీవీకే విజయ్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరినా.. ఈ అంశంపై లోక్భవన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇంతలో తమ ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇచ్చినట్లు టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్కు ఇచ్చిందని దినకరన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమిళనాడు గవర్నర్కు ఒరిజినల్ కాపీ చూపించామన్న ఆయన, టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, దినకరన్కు టీవీకే కూడా కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖపై సైన్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసింది. తొలుత దీనిని దినకరన్ ఆమోదించారని.. కానీ అంతలోనే ఆయన యూటర్న్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.#WATCH | Chennai, Tamil Nadu | AMMK Party General Secretary TTV Dhinakaran visited the office of Assistant Commissioner of Police, Guindy RangeThis comes amid Dhinakaran's claim that TVK shared 'forged copy' of MLA Kamaraj's letter with the Governor and that he is filing a… pic.twitter.com/GgF0T6Eaz8— ANI (@ANI) May 8, 2026ఇదిలా ఉండగా.. ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. తమిళనాడులో అన్నాడీఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం పళనిస్వామిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏఎంఎంకే ఒక స్థానంలో గెలిచిన విషయం తెలిసిందే.కాగా, ఆ వీడియోలో దినకరన్ ఆమోదంతోనే తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు చెబుతూ కామరాజ్ లేఖను రాయడం కనిపిస్తుంది. విజయ్ పార్టీకి తాము అధికారికంగా ఎటువంటి మద్దతు ఇవ్వలేదని దినకరన్ ఖండించడంతో ఆయన తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని టీవీకే ఆరోపించింది. వాస్తవాలను దాచిపెడుతున్నారని టీవీకే మండిపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ ప్రయత్నంలో ఎవరితోనూ బేరసారాలు లేదా చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. #WATCH | TVK shares a video of AMMK MLA Kamaraj, saying "These are the video visuals of AMMK MLA Kamaraj voluntarily and happily writing a letter expressing his support for the Tamilaga Vettri Kazhagam. He had stated that he was extending support to the Tamilaga Vettri Kazhagam… pic.twitter.com/sM3xtyXx12— ANI (@ANI) May 8, 2026విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు :కాంగ్రెస్ ఎంపీఇదిలా ఉండగా, తమిళనాడులో విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజల మద్దతు కోల్పోయిన రాజకీయ శక్తులు ఇప్పుడు విజయ్ను తమిళనాడు ముఖ్యమంత్రిగా అవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ విమర్శించారు. టీవీకేకు ఇంకా మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్య చేరేందుకు చిన్న పార్టీల మద్దతు ఆలస్యమవుతోందని అంగీకరించిన ఆయన, అధికారం ప్రజల తీర్పును ఆలస్యం చేయగలదు కానీ శాశ్వతంగా అణచలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య తీర్పుకు ఇంకా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారంటూ ఎక్స్లో ప్రశ్నించారు. ప్రజల హక్కులు, న్యాయం కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.టీవీకేకు మద్దతు లేఖ పంపాం: వీసీకేఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తున్నట్లు వీసీకే వెల్లడించింది. ఈ- మెయిల్ ద్వారా తమ లేఖను పంపినట్లు తెలిపింది. ఈ మేరకు వీసీకే పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. తమ మద్దతుకు సంబంధించి అధికారిక ప్రకటన శనివారం చేస్తామని మరో ట్వీట్లో పేర్కొంది. వీసీకే, టీవీకే శ్రేణులంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. -
విజయారోహణలో ట్విస్టులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రివాజుకు భిన్నంగా ప్రధాన ద్రవిడ పార్టీలు రెండింటినీ రెండంకెలకు పరిమితం చేసి, రాజకీయ తెరపైకి విజేతగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో చివరి నిమిషంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత అనుకున్నా వీసీకే, ఐయూఎంఎల్ లేఖలు రాలేదని అంటున్నారు.దాంతో విజయ్ వరసగా మూడోరోజు గవర్నర్ని కలిసినా ఫలితం లేకపోయింది.సొంతంగా 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తామని అయిదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ప్రకటించగా, తాజాగా రెండేసి స్థానాలున్న సీపీఐ, సీపీఎంలు అంగీకారం తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 118 అవసరం కాగా, రెండుచోట్లనుంచి గెలిచిన విజయ్ ఎటూ ఒక స్థానం నుంచి తప్పుకోవాలి గనుక టీవీకే నికర బలం 107. రాజీనామా చేసే స్థానం తమకిస్తేనే లేఖ ఇస్తామని వీసీకే పట్టుబట్టగా, ఐయూఎంఎల్ అసలు లేఖే ఇవ్వలేదంటున్నారు. ఈ అంకెల ఆట ఎలావున్నా, ఆర్లేకర్ తీరు సంప్రదాయాలకు విరుద్ధం. ఈనెల 6న విజయ్ తొలిసారి గవర్నర్ను కలిసినప్పుడే ఆ వ్యవహారం ముగియాల్సి ఉండగా ఎందుకనో దీన్నింకా సాగదీస్తున్నారు.ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ‘ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్లలో కాద’ని తెలిపింది. ఉన్నవాటిలో మెజారిటీ పొందిన పక్షమేదో గమనించుకుని ఆహ్వానించటం, బల నిరూపణకు గడువీయడం తప్ప గవర్నర్కు మరే ప్రత్యామ్నాయమూ లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించటం ఎలా చూసినా ధర్మం కాదు. ఇది అనవసర అపోహలు, అనుమానాలకు తావిచ్చింది. కేంద్రం రాష్ట్రంలో అస్థిరత కోరుకుంటున్నదనీ, రాష్ట్రపతి పాలన విధిస్తారనీ వదంతులు వ్యాపించాయి. కొన్ని గంటలపాటు డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలుస్తాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అలా కలిసినా ఆ పక్షాలు విజయ్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం ఉండదు.ఈ ఊహాగానాలకు తావిచ్చేలా జాప్యం చేయటం అవసరమా? బలనిరూపణలో విఫలమైతే విజయ్ సర్కారు తప్పుకోవాల్సిరావొచ్చు. దానివల్ల కలిగే కష్టనష్టాలు ఆయన చూసుకుంటారు. ఆ పరిస్థితి ఏర్పడితే టీవీకే తర్వాత స్థానంలోవున్న పార్టీని ఆహ్వానించాలి.అంతేతప్ప లోక్భవన్లో లెక్కలు వేస్తూ కూర్చోవటం సరికాదు. విజయ్ తమ లేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ కూడా ఇవ్వటమే సమస్య తెచ్చిందని కొందరు వాదిస్తు న్నారు. ప్రజల మనోభీష్టం నెరవేర్చేందుకు సాంకేతికపరమైన అంశాలు అభ్యంతరం కావటం సరికాదు.పొరుగునున్న కర్ణాటకలో కొన్నేళ్లక్రితం బీజేపీకి తక్కువ స్థానాలొ చ్చినా మెజారిటీ స్థానాలున్నాయి గనుక దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ నిర్ణయాన్నెవరూ తప్పుబట్టలేదు. సర్కారియా కమిషన్ సైతం 1988నాటి నివేదికలో ఎన్నికల ముందు ఏర్పడిన కూటములనూ, లేనట్టయితే ఉన్న పక్షాల్లో అత్యధిక స్థానాలొ చ్చిన పార్టీనీ పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ రెండేళ్లలో విజయ్ సాధించిన రాజకీయ అనుభవం సంగతేమోగానీ... ఈ మూడు నాలుగు రోజుల్లో ఆయనకది దండిగానే దక్కింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ తీరు జుగుప్సాకరంగావుంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమికి నాయ కత్వం వహిస్తూ తన భాగస్వామ్యపక్షం తమిళనాట ఓడిపోగానే చేతులు దులుపుకొని బయటకు పోవటం ఏం నీతి? అందువల్ల విజయ్కి వీసమెత్తు ప్రయోజనం లేకపోగా, విపక్ష కూటమికి అది చేటు తెస్తుంది. కనీసం సహ భాగస్వామ్యపక్షాలు డీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎంలనైనా సంప్రదిస్తే మర్యాదగా ఉండేది.చివరకు సీపీఐ, సీపీఎం వచ్చి చేరాయిగానీ... రాజ్యాంగసంక్షో¿¶ నివారణకే ఆ పనిచేశాయి. ఆ మాత్రం వేచిచూడాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా, భవిష్యత్తు ఎన్నికలన్నిటికీ ఈ కొత్త పొత్తు వర్తిస్తుందని ప్రకటించి కాంగ్రెస్ మరింత చులకనైంది. ఒంటరిగా బరిలోదిగి తన సత్తాతో జనాభిమానం చూరగొని మెజారిటీ స్థానాలు పొందిన విజయ్కి అవకాశమీయకుండా మీనమేషాలు లెక్కించటం సరికాదు. అది అప్రజాస్వామికం. అన్ని అడ్డంకులూ తొలగి ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ప్రజాభీష్టం నెరవేరుతుందని ఆశించాలి. -
స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంశానికి సంబంధించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిందేనన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటు అనేది అత్యవసరమన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ సభ్యుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రస్తుత శాసనసభ ఇప్పటికే రద్దు చేయబడింది. గౌరవనీయ గవర్నర్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ఇటువంటి పరిస్థితులలో, ఎన్నికైన వారి కోసం ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కేవలం కాలపు అవసరం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన కర్తవ్యం కూడా.…ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు, రాజ్యాంగం ప్రకారం కొత్త పరిపాలనను ఏర్పాటు చేయడానికి గౌరవనీయ గవర్నర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ద్రవిడ మున్నేట్ర కజగం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. தமிழ்நாடு சட்டமன்றத் தேர்தல் முடிவுகள் வெளியாகி, மக்களால் தேர்வு செய்யப்பட்ட சட்டமன்ற உறுப்பினர்களின் பட்டியலைத் தேர்தல் ஆணையம் வெளியிட்டு விட்டது. ஏற்கனவே இருந்த சட்டமன்றத்தையும் கலைத்து மாண்புமிகு ஆளுநர் அவர்கள் ஆணையும் பிறப்பித்து விட்டார். இப்படியொரு நிலையில், தேர்தலில் வென்ற…— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 8, 2026 కాగా, మిత్ర పక్షాలతో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం(మే 7వ తేదీ) భేటీ అయ్యారు. సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలతో సమావేశమైన స్టాలిన్.. టీవీకేకు మద్దతు అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మిత్రపక్షాలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే నేడు(శుక్రవారం, మే 8వ తేదీ) వామపక్షాలతో పాటు వీసీకే కూడా టీవీకేకు మద్దతు తెలిపింది. దాంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ఆ పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సభ్యుల సంఖ్య 118కి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్ తమ మద్దతును ప్రకటించగా, తాజాగా వామపక్షాలు, వీసేకే నుంచి మద్దతు లభించడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలోనే విజయ్ సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. -
విజయ్ కి సంపూర్ణ మద్దతు.. చెన్నైలో TVK భారీ ఏర్పాట్లు
-
READY TO RULE 118 సీట్లతో గవర్నర్ వద్దకు TVK విజయ్..
-
సీఎంగా విజయ్ TVK కార్యకర్తల సంబరాలు
-
సంచలనం పళని స్వామి కాబోయే సీఎం...!
-
విజయ్కి, 1994 నాటి S.R.బొమ్మై కేసుకి సంబంధం ఏంటి?
తమిళనాడులోని నాటకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1994 నాటి చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ఇపుడు ప్రధాన చర్చల్లో నిలుస్తోంది. భారత రాజ్యాంగ చరిత్రలో S.R .బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పును అత్యంత కీలకమైన తీర్పుగా రాజకీయ విశ్లేషకులు ఉదహ రిస్తుంటారు. ఈ విషయాన్నే కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కూడా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టానుసారంగా బర్తరఫ్ చేసే కేంద్ర ప్రభుత్వ అధికారాలకు ఈ తీర్పు కళ్లెం వేసిన తీర్పు ఇది. రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించడానికి ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) దుర్వినియోగానికి పెద్ద అడ్డుకట్ట వేసింది. సమాఖ్యవాదం రాజ్యాంగం ప్రాథమిక లక్షణమని, రాష్ట్రపతి అధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పిన తీర్పు ఇది.అసలేంటీ కేసు, పూర్వాపరాలు 1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్.ఆర్. బొమ్మై నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ బర్తరఫ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారని, ప్రభుత్వానికి మెజారిటీ లేదని గవర్నర్ నివేదిక ఇవ్వడమే దీనికి కారణం. అయితే, తనకు మెజారిటీ ఉందో లేదో అసెంబ్లీలో నిరూపించుకుంటానని బొమ్మై కోరినప్పటికీ, గవర్నర్ అవకాశం ఇవ్వకుండానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)ను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీనిని సవాలు చేస్తూ బొమ్మై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక మార్గదర్శకాలుఈ కేసును విచారించిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రాష్ట్రాలకు అసెంబ్లీయే అసలైన వేదిక అని తేల్చి చెప్పింది. ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది గవర్నర్ బంగ్లా (రాజ్ భవన్)లో కాదు, అసెంబ్లీలోనే (Floor Test) అని కోర్టు స్పష్టం చేసింది.న్యాయ సమీక్ష (Judicial Review)రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలు విచారణ జరపవచ్చు. ఒకవేళ ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తేలితే, రద్దు చేసిన ప్రభుత్వాన్ని కోర్టు తిరిగి పునరుద్ధరించవచ్చు.కేవలం రాజకీయ విభేదాల వల్ల లేదా కేంద్రంలో వేరే పార్టీ అధికారంలో ఉందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయకూడదు.సెక్యులరిజం (Secularism) రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రాజకీయాలు చేస్తే దానిపై చర్యలు తీసుకోవచ్చని కూడా కోర్టు పేర్కొంది.తీర్పు ప్రాముఖ్యతఈ తీర్పు రాకముందు వరకు, కేంద్రంలో ఉన్న పార్టీలు, గవర్నర వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్ 356 ఉపయోగించి ఇష్టానుసారంగా రద్దు చేసేవి. కానీ బొమ్మై తీర్పు తర్వాత పరిస్థితి మారింది.రాష్ట్ర ప్రభుత్వాలకు రక్షణ పెరిగింది. గవర్నర్ల వ్యవస్థలో పారదర్శకత వచ్చింది. సమాఖ్య వ్యవస్థ (Federalism) బలోపేతం అయ్యింది.ఇపుడెందుకీ ప్రస్తావన108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వాంచినాల్సిన గవర్నర్, అందుకు బదులుగా మ్యాజిక్ ఫిగర్ 118ఎమ్మెల్యే సంతకాలతో రమ్మని కోరడం వివాదానికి దారి తీసింది. అదే తమిళనాట పెద్ద ప్రతిష్టంభనకు దారి తీసింది. ఈనేపథ్యంలోసుప్రీంతీర్పును అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పుడు, ఆ పార్టీ నాయకుడికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, గవర్నర్ ముందే నిర్ణయానికి రాకూడదని ఈ తీర్పు చెబుతోంది. ఆర్టికల్ 356 అనేది అరుదైన పరిస్థితుల్లో మాత్రమే వాడాల్సిన ఆయుధమని ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది. రాష్ట్రాలు కేవలం కేంద్రానికి అధీనంలో ఉండేవి కావని ఈ తీర్పు స్పష్టం చేసింది. రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మాత్రమే శాసనసభను రద్దు చేయవచ్చు. తమిళనాడులో టీవీకే (TVK) పార్టీ విషయంలో చిదంబరం ఈ కేసును ప్రస్తావించడానికి కారణం ఇదే. ఇదీ చదవండి: విజయ్కి ఛాన్స్ : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు -
టీవీకేతో కాంగ్రెస్ దోస్తీ.. అఖిలేష్ చురకలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే.. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ క్రమంలో మద్దుతు ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే స్నేహహస్తం అందించడం జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలను కూడా మార్చేసింది.సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్లో భాగంగా.. డీఎంకేతో జట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. డీఎంకేతో సంబంధాలు తెంచుకుని విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చింది. దీనిని డీఎంకే వెన్నుపోటుగా అభివర్ణించింది. స్టాలిన్ మూలంగానే ఆ పార్టీ ఐదు స్థానాల్లో నెగ్గిందని డీఎంకే.. ఎక్కువ సీట్లలో పోటీ చేయకుండా స్టాలిన్ అడ్డుకున్నారని కాంగ్రెస్ పరస్పరం ఆరోపించుకున్నాయి. ఈ తరుణంలో ఇండియా బ్లాక్ ముగిసినట్లేనని స్టాలిన్ సైతం వ్యాఖ్యానించారు. అయితే..ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతుండగానే ఎస్పీ అధినేత, లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎంకే స్టాలిన్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఉన్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “కష్టకాలంలోనూ ఒకరినొకరు వదిలిపెట్టేవాళ్లం కాదు మేం” అని కామెంట్ ఉంచారు. దీంతో ఇది కాంగ్రెస్ పార్టీకే ఆయన అంటించిన చురకలనే చర్చ నడుస్తోంది.हम वो नहीं जो मुश्किलों में साथ छोड़ दें। pic.twitter.com/p1EosEJtvV— Akhilesh Yadav (@yadavakhilesh) May 8, 2026ఇదిలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ ఈ మధ్యకాలంలో ఈ తరహా చేష్టలతో రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో తన దిష్టిబొమ్మను తగలబెట్టబోయి గాయపడిన బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనుపమను ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించి యూపీలో ఆరోగ్యకరమైన రాజకీయాలకు తెర తీశారు. బీజేపీని ఓడించే లక్ష్యంతో 2023లో విపక్షాలన్నీ ఇండియా కూటమి పేరుతో ఒకే వేదికపైకి వచ్చాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల్లో సీట్ల పంపకాల విషయంలో మిత్రపక్షాల మధ్య అభిప్రాయ బేధాలు.. వరుస ఓటములు.. ఆ కూటమిని బలహీనపరుస్తూ వచ్చాయి.ఇక.. తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మద్దతుదారు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని టీవీకే అధినేత విజయ్ చెబుతున్నారు. అయితే.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. పూర్తి బలం 118 ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే తాను సంతృప్తి చెందుతానని.. ఆ తర్వాత సీఎంగా ప్రమాణం చేసుకోమని విజయ్కు చెబుతున్నారు. దీంతో మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో టీవీకే తలమునకలైంది. -
విజయ్కి ఛాన్స్ : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడులో అనూహ్యం సాగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని ఆహ్వానించాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ని కోరారు. అసెంబ్లీలో 108 స్థానాలు గెలుచుకుని, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.విజయ్కు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ పూర్తి కాని నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. మరోవైపు నటుడు విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయం అనుకుంటున్న తరుణంలో గవర్నర్ నిర్ణయాలు వివాదంగా మారాయి. మొదట ప్రభుత్ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆ తరువాత శరవేగంగామారుతున్న గవర్నర్ నిర్ణయాలను ఇప్పటికే పలువురు నేతలు, రాజకీయ నిపుణులు తప్పుబట్టారు. బీజేపీ డైరెక్షన్లోనే గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పూర్తి వివరాలను సమర్పించాలని గవర్నర్ కోరడంపై టీవీకే నాయకులు కూడా మండిపడు తున్నారు.சட்டமன்றத் தேர்தலில் எந்த அரசியல் கூட்டணிக்கும் அல்லது அரசியல் கட்சிக்கும் தனிப் பெரும்பான்மை கிடைக்கவில்லை என்றால், ஆளுநரின் கடமை என்ன? சட்டமன்ற உறுப்பினர்களின் எண்ணிக்கை அடிப்படையில் முதன்மைக் கட்சியின் தலைவரை ஆட்சி அமைக்க அழைக்க வேண்டும்.இது தான் அரசியல் விதி. இது தான்…— P. Chidambaram (@PChidambaram_IN) May 8, 2026తాజాగా ఈ వివాదంపై స్పందించిన చిదంబరం కీలకవ్యాఖ్యలు చేశారు. 108 స్థానాలు గెలుచుకున్న టీవీకే అత్యంత పెద్ద పార్టీగా అవతరించింది, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, అతిపెద్ద పార్టీ నాయకుడిని (విజయ్) తొలుత ఆహ్వానించడం గవర్నర్ బాధ్యత అని చిదంబరం పేర్కొన్నారు. అంతేకాదు మెజారిటీని నిరూపించుకోవాల్సింది లోక్ భవన్లో కాదు, అసెంబ్లీ వేదికగా అని చిదంబరం స్పష్టం చేశారు. దీనిపై ఎస్.ఆర్. బొమ్మై కేసులో 1994 సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆయన ఉదహరించారు. సంఖ్యాబలం ఆధారంగా మెజారిటీ నిరూపించుకునే అవకాశం విజయ్కు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా తమిళ రాజకీయ పక్షాలు ఈ నిబంధనను నొక్కి చెప్పడాన్ని ఆయన అభినందించారు.ఇదీ చదవండి : వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్ నిర్ణయంకాగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన కనీస మెజారిటీ మార్కుకు టీవీకే కూటమి స్వల్ప దూరంలో ఉంది. కాంగ్రెస్ మద్దతోతో టీవీకే బలం ఇపుడు (టీవీకే-108, కాంగ్రెస్-5) 113 చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఈ కూటమి ఇంకా 5 స్థానాల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: హంటా వైరస్ కలకలం : బాధితుల్లో ఇద్దరు భారతీయులు -
తమిళనాడు లోక్ భవన్ వద్ద హై టెన్షన్
-
మెజారిటీకి ఇంకా 6 మంది ఎమ్మెల్యేల అవసరం
-
తమిళనాడులో రాష్ట్రపతి పాలన? లేకుంటే..
దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఒక అగ్రనటుడు పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి బలం లేకున్నా ప్రభుత్వ ఏర్పాట్లకు ప్రయత్నించడం.. మ్యాజిక్ ఫిగర్ లేదంటూ గవర్నర్ అందుకు అనుమతించకపోవడం విమర్శలకూ తావిచ్చింది. ఈ తరుణంలో తమిళనాడులో మే 10 దాటితే ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో.. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ 118.. అంటే ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. విజయ్ రెండు చోట్ల పోటీ చేసి నెగ్గడంతో.. ఇంకో సీటు అదనంగా అవసరం కానుంది. అంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సరిపోతుందన్నమాట.ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత బలనిరూపణ చేసుకుంటామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు విజయ్ రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో.. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి. కానీ, తమిళనాడు విషయంలోనే గవర్నర్ ఆర్లేకర్ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయ్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో..విజయ్కు ఇతర పార్టీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో.. తమిళనాడు 16వ అసెంబ్లీ గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు ప్రభుత్వ ఏర్పాటు అంశం కచ్చితంగా ఓ కొలిక్కి రావాలని లేదు. కాకుంటే గవర్నర్ తన విశిష్ట అధికారాల్ని (Discretionary Powers) ఉపయోగించే అవకాశమూ లేకపోలేదు. ఒకటి.. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేదాకా కొనసాగమని కోరడం.. రెండోది టీవీకేను పక్కనపెట్టి ఇతర కూటములను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం.. మూడోది రాష్ట్రపతి పాలన విధించే అవకాశం!.తమిళనాడులో గతంలో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కరుణానిధి హయాంలో 1976 జనవరి నుంచి 516 రోజులపాటు, ఎంజీఆర్ సీఎంగా ఉన్న టైంలో 1980 ఫిబ్రవరి నుంచి 113 రోజులపాటు, 1988లో ఎంజీఆర్ మరణాంతరం ఆయన సతీమణి జానకీ సీఎంగా ఉన్నప్పుడు 363 రోజులపాటు, చివరగా.. 1991లో కరుణానిధి హయాంలో 145 రోజులపాటు రాష్ట్రపతి పాలన విధించారు.రాజకీయ విశ్లేషకులు చెబుతోంది ఏంటంటే.. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాలనే కచ్చితమైన రూల్ రాజ్యాంగంలో లేదు. కాకుంటే.. మెజారిటీ నిరూపించలేకపోయినా.. ప్రభుత్వం ఏర్పడకపోయినా "రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది" అని కారణాన్ని చూపిస్తూ కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపే అవకాశం ఉంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడవడం లేదని/ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం కొనసాగడం అసాధ్యమని కేంద్రం భావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఆ అవకాశం లేకపోలేదు.సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వడం ఒక సంప్రదాయం. అయినప్పటికీ, అది రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉండదు. గవర్నర్ తన నిర్ణయాన్ని మెజారిటీ నిరూపణ ఆధారంగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా తమిళనాడు ఎపిసోడ్ నేపథ్యంలో.. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అప్పుడు గవర్నర్లు రాష్ట్రపతి పాలనకు సిఫార్సులు చేసిన సందర్భాలు ఉన్నాయి.1996లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 174 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ టైంలో మేజిక్ ఫిగర్ 213. బీజేపీకి అది సాధ్యం కాలేదు. ఏ కూటమి కూడా మెజారిటీ సాధించలేకపోవడంతో అప్పటి గవర్నర్ రాష్ట్రపతి పాలన కొనసాగించారు(ఎస్పీ-బీఎస్పీ కూటమి కూలిపోవడంతో 1995లోనే గవర్నర్ మోతీలాల్ వోరా రాష్ట్రపతి పాలన విధించారు). ఆ తర్వాత ఏడాదికి బీజేపీ-బీఎస్పీ కూటమి ఏర్పడి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కేసు.. ఇక్కడ ఒక పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందడం ముఖ్యం కాదు అని చెప్పింది. ఇక.. 2005 బీహార్ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ఒకవైపు కూటమి ప్రయత్నాలు జరుగుతుండగానే అప్పటి గవర్నర్ బూటా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదటి సమావేశం జరగకముందే ఆ అసెంబ్లీని రద్దు చేసి.. ‘‘హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది’’ అని కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరడం.. గవర్నర్ వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టడం.. అది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని.. గవర్నర్ అధికారాలను పరిమితం చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగాయి. అయితే అప్పటికే ఎన్నికల తేదీలు ప్రకటించడంతో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం ఇక్కడికే పరిమితం చేసింది.విజయ్ పార్టీ (TVK) అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ మెజారిటీకి కావలసిన 118 సీట్లు దాటలేకపోవడంతో గవర్నర్ మద్దతు లేఖలు కోరుతున్నారు. ఆయన అడిగిన దాంట్లో తప్పుందని కూడా అనలేం. 2006లో డీఎంకేకు 96 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ, మిత్రపక్షాల మద్దతు లేఖలతో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకొచ్చింది. మెజారిటీ ఉండడంతో గవర్నర్ అందుకు అనుమతించారు. ఆ తర్వాత బలనిరూపణలో ప్రభుత్వం నెగ్గింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక అత్యవసర పరిస్థితిలో మాత్రమే అమలు చేసే చర్య. ప్రస్తుత తమిళనాడు విషయంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు దారి తీసే అవకాశం కూడా. గవర్నర్ నివేదికలు, ఆర్టికల్ 356 వినియోగం.. కోర్టు సమీక్షకు లోబడి ఉండాలని గతంలో న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అలాగే ఎన్నికల ద్వారా వచ్చిన అసెంబ్లీని రద్దు చేయడం అత్యంత అసాధారణం కూడా. ఒకవేళ.. తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ గనుక ఏదైనా అసాధారణ నిర్ణయం తీసుకుంటే టీవీకే పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. -
టీవీకేపై కుట్ర.. మరో బాంబు పేల్చిన అన్నాడీఎంకే ఎంపీ
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అన్నాడీఎంకే ఎంపీ మరో బాంబు పేల్చారు. తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ తంబిదురై తమిళనాడు రాజకీయ పరిస్థితులపై తాజాగా స్పందించారు. ఎంపీ తంబిదురై మీడియాతో మాట్లాడుతూ.. తమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్ను కోరుకుంటున్నారు. అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రావాలనే ప్రజాభిప్రాయం ఉంది. తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. దైవానుగ్రహంతో తగిన సమయంలో అది జరగవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై తమిళనాడులో చర్చ మొదలైంది.ఇక, తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకే ఎంపీ ఇలా కామెంట్స్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? అనే చర్చ నడుస్తోంది.#WATCH | Chennai | AIADMK MP M Thambidurai says, "...The public sentiment is there that AIADMK has to come back to power...That may happen in the due course of time with the grace of God" pic.twitter.com/8JtjU5Jr5H— ANI (@ANI) May 8, 2026ఇదిలా ఉండగా.. తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయం కొనసాగుతోంది. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి చెన్నై చేరుకోవాలని పార్టీ చీఫ్ పళనిస్వామి సూచించారు. మరోవైపు.. వివిధ పార్టీల మద్దతు తమకు ఇవ్వాలని టీవీకే నేతలు మంతనాలు జరుపుతున్నారు. లెఫ్ట్, వీఎంసీ పార్టీల మద్దతుపై ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
గాడిదల పెంపకంలో బిజీగా పీఎంకే మాజీ ఎమ్మెల్యే
సాక్షి, చెన్నై: సేలం వెస్ట్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఓటమి పాలైన పీఎంకే రాందాసు శిబిరం నేత అరుల్ తాజాగా సామాజిక మాధ్యమంలో ఆవులు, గుర్రాలు గాడిదల పెంపకంపై దృష్టి పెట్టినట్టుగా ఫొటో పెట్టడం వైరల్గా మారింది. సేలం వెస్ట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరుల్, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో తమిళగ వెట్రి కళగం అభ్యర్థి లక్ష్మణన్ విజయం సాధించగా, అరుల్ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. కాగా ఓటమి తర్వాత తన నియోజకవర్గ ప్రజలకు దూరంగా, సొంత పనుల్లో నిమగ్నమైన అరుల్.. తన తోటలో ఆవు, గుర్రాలు, గాడిదల పెంపకంపై దృష్టి పెట్టినట్టుగా అప్పుడే పుట్టిన గాడిద పిల్లను చేతుల్లోకి తీసుకునే ఫొటోలను షేర్ చేశారు.‘తోటలో మా పని పూర్తయింది.. ఇప్పుడు పశువులను మేపుతూ బిజీగా ఉన్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గత ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన నాయకుడు, ఇప్పుడు గాడిదల కాపరిగా మారానంటూ పోస్ట్ చేయడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. -
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు వీసీకే అంగీకారం తెలిపింది. లెఫ్ట్, వీసీకే మద్దతుతో విజయ్కు పూర్తి మెజార్టీ దక్కింది. ఉదయం ఎమ్మెల్యేలతో చర్చించిన విజయ్ .. అనంతరం వీసీకేతో మద్దతు కోరగా అందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ను విజయ్ మరోసారి కలిశారు. తమకు పూర్తి సంఖ్యాబలం ఉందన్న విజయ్.. అందుకు సంబంధించిన మద్దతు పత్రాలను గవర్నర్కు సమర్పించారు. ఈ క్రమంలో మరో బిగ్ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సిందిగ్ధంలోక్భవన్ కొత్త మెలికవిజయ్కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందన్న లోక్భవన్వీసీకే, ఐయూఎంలు తమ మద్దతు లేఖలు ఇవ్వలేదన్న లోక్భవన్తద్వారా విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై టెన్షన్ వాతావారణంరేపే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారంరేపే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతితమిళనాడు గవర్నర్తో ముగిసిన టీవీకే చీఫ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ అనుమతి తమిళనాడులో కొలువు దీరనున్న విజయ్ సర్కార్గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్ మద్దతు లేఖను గవర్నర్కు అందజేత లోక్భవన్కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ లోక్భవన్కు బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన మెజార్టీ ఉందని చెప్పనున్న విజయ్ సీపీఐ,సీపీఎం,వీసీకే మద్దతుతో 118కి చేరిన సంఖ్యాబలంలోక్భవన్లో గవర్నర్ రాజేంద్రకు 118 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ ముగిసిన అనంతరం సీపీఎం,సీపీఐ,వీసీకే కార్యాలయాలకు వెళ్లనున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకై మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు చెప్పనున్న టీవీకే అధినేత విజయ్ కోసం కాన్వాయ్ సిద్ధంలోక్భవన్కు చేరుకున్న ప్రభుత్వ కాన్వాయ్మొన్న విజయ్కు కాన్వాయ్ ఇవ్వడంపై గవర్నర్ ఆగ్రహంమద్దతు లేఖ ఇచ్చాక అదే కాన్వాయ్లో వెళ్లనున్న విజయ్టీవీకేకు కాంగ్రెస్ కండీషన్మతతత్వ పార్టీతో కలొద్దని కాంగ్రెస్ షరతుతిరుచ్చి ఈస్ట్ సీటు, మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే కండీషన్టీవీకేకు బేషరతు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయంకేవలం మద్దతు మాత్రమే ఇవ్వాలని సీపీఎం నిర్ణయంటీవీకేకు వామపక్షాల మద్దతుమద్దతు లేఖను టీవీకేకు అందజేసిన వామపక్షాలువీసీకే, వామపక్షాలకు కేబినెట్ బెర్త్లువీసీకే, సీపీఎం, సీపీఐకి చెరో మంత్రి పదవి దక్కే చాన్స్కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశంటీవీకే ప్రధాన కార్యాలయం వద్ద సందడిమెజార్టీ మార్క్ దాటడంతో టీవీకే శ్రేణుల సంబరాలుచెన్నైలోని లెఫ్ట్ కార్యాలయానికి టీవీకే నేత నిర్మల్ కుమార్మద్దతు లేఖలను తీసుకోనున్న నిర్మల్కుమార్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్టీవీకే మద్దతుగా సీపీఎం, సీపీఐ, వీసీకేఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్కు చేరుకోనున్న టీవీకేకాంగ్రెస్-5, వామపక్షాలు-4, వీసీకే-2దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 118కి చేరనున్న టీవీకే సంఖ్యాబలంకాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్ మరోసారి గవర్నర్ను కలవనున్న విజయ్మరికాసేపట్లో లోక్భవన్కు వెళ్లనున్న విజయ్గవర్నర్తో భేటీకానున్న విజయ్ ఇదివరకే రెండుసార్లు గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ఇళంగోవన్ ఆసక్తికర వ్యాఖ్యలుఅన్నాడీఎంకేతో జట్టు ప్రచారంపై స్పందించిన డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్డీఎంకే.. అన్నాడీఎంకే రెండు ప్రధాన ప్రత్యర్థులుఈ రెండు కలవడం అసాధ్యంఇంక కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదిరే పని కాదులోక్భవన్.. మళ్లీ అదే ప్రకటనమ్యాజిక్ ఫిగర్తోనే ముందుకు రావాలని టీవీకే పార్టీకి లోక్భవన్ వర్గాల స్పష్టీకరణఎవరు ముందుకు వచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ సమ్మతిస్తారని వెల్లడిటీవీకే చేతులెత్తేస్తే.. డీఎంకే-అన్నాడీఎంకే కూటమికి చాన్స్?గవర్నర్ వ్యాఖ్యలు ఆ కోణంలోనే ఉన్నాయంటున్న టీవీకే-కాంగ్రెస్అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వకపోవడమేంటని సూటి ప్రశ్నలోక్భవన్ ముట్టడికి యత్నం.. పలువురు కార్యాకర్తల అరెస్ట్మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో టీవీకే ఆఖరి అస్త్రంగా.. గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లే యోచన న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన టీవీకే అధినేత విజయ్మా మద్దతుపై రేపు ప్రకటన చేస్తాం: వీసీకేవిదుతలై చిరుతైగల్ కట్చి కీలక ప్రకటనతమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన వీసీకే పార్టీప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా వీసీకేవిజయ్ పార్టీకి ప్రభుత్వ ఇచ్చే విషయంలో సస్పెన్స్ కంటిన్యూవీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్తో భేటీ అయిన టీవీకే నేత అధవ్ అర్జునఇవాళ సాయంత్రం వీసీకే పార్టీ హైలెవల్ సమావేశంమీటింగ్లో చర్చించి.. రేపు స్పష్టమైన ప్రకటన చేస్తామన్న తిరుమావళవన్ఇటు విజయ్.. అటు పళనితమిళనాడు రాజకీయాల్లో పూటకో ట్విస్టులుపార్టీ ముఖ్యనేతలతో భేటీ అయిన టీవీకే అధినేత విజయ్అటు పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సీనియర్ నేతల మీటింగ్వామపక్షాలు, వీసీకే నిర్ణయం కోసం ఇరు పార్టీలు ఎదురు చూపులుఆరుగురు సభ్యుల మద్దతు దొరికితే విజయ్ ప్రభుత్వం ఏర్పడినట్లేమద్దతు ఇవ్వకుంటే అన్నాడీఎంకే రంగంలోకి దిగే చాన్స్విజయ్కు అన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా?.. లేకుంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు సొంతంగా చేస్తుందా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకేలో విజయ్కు మద్దుతు ఇచ్చే అంశంపై చర్చ.. చీలిక కూడాడీఎంకే-అన్నాడీఎంకే కలుస్తాయంటూ రెండ్రోజులుగా ఊహాగానాలుసాయంత్రంకల్లా తమిళనాడు సస్పెన్స్కు తెర పడే చాన్స్శత్రువులు మిత్రులవుతున్నారుకాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలుడీఎంకే, అన్నాడీఎంకేలు కలుస్తున్నాయంటూ వ్యాఖ్యశత్రువులు మిత్రులవుతున్నారువిజయ్ను అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నారుడీఎంకే, అన్నాడీఎంకేలు బీజేపీకి బీ టీంలుతమిళనాడు మరో బిగ్ ట్విస్ట్!తెరపైకి సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్డీఎంకే సపోర్ట్తో రజనీకాంత్ ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు...?అన్నాడీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎం ..?రహస్యంగా పావులు కదుపుతున్న డీఎంకే అధినేత స్టాలిన్రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని అంచనాఎడపాటి పళనిస్వామిని స్పీకర్గా ఎన్నుకునే అవకాశంమొన్న స్టాలిన్ ఇంటికి రజనీకాంత్ వెళ్ళారు..నిన్న రజనీకాంత్ ఇంటికి వెళ్లిన డీఎంకే సీనియర్ నేత వేలునేడు మళ్లీ రజనీకాంత్ ను కలవనున్న ఇరు పార్టీ నేతలుటీవీకే కీలక భేటీటీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో కీలక సమావేశంసమావేశానికి హాజరైన నూతన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు.. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై చర్చదేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపుఅన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందిఅన్నాడీఎంకే ఎంపీ తంబిదురై సంచలన వ్యాఖ్యలుతమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్ను కోరుకుంటున్నారు: తంబిదురైమేం అధికారంలోకి వస్తాం: తంబిదురైచెన్నైలో ఉద్రిక్తత!తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ తీరుపై టీవీకే అసహనంప్రజలు విజయ్కు పట్టం కడితే.. సీఎం కాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలోక్భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన టీవీకే కార్యకర్తలుఅదుపులోకి తీసుకున్న పోలీసులులోక్భవన్తో పాటు చెన్నైలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణంపళని ఏం చేస్తారో?తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంనేడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో పళనిస్వామి భేటీనిన్ననే అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీఇవాళ్టి మీటింగ్పై సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికబీజేపీ పొత్తు తెంచుకుని.. విజయ్కు మద్దతు ఇద్దామంటున్న షణ్ముగం నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గంవద్దని వారిస్తున్న పళనిస్వామిఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ జరిపిన పళనిస్వామిఎన్నికల్లో 47 సీట్లు నెగ్గిన అన్నాడీఎంకేతమ పార్టీ సభ్యుల సంతకాలను గవర్నర్కు సమర్పించే అవకాశంవిజయ్కు మద్దతు ఇస్తారా? ఎవరికీ మద్దతు ఉండదని చెబుతారా? లేదంటే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలేమైనా చేస్తారా? అనే ఉత్కంఠతమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై నేడు రానున్న స్పష్టతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 112 (107+కాంగ్రెస్ 5)కీలకంగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నిర్ణయంతలో రెండేసి సీట్లు నెగ్గిన డీఎంకే కూటమి పార్టీలుస్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని కూటమి నేత స్టాలిన్ సూచనప్రభుత్వ ఏర్పాటునకు డీఎంకే అడ్డుపడబోదని స్టాలిన్ వ్యాఖ్యఇవాళ మూడు పార్టీల హైలెవల్ మీటింగ్లుమీటింగ్ల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై రానున్న స్పష్టతఇప్పటికే కమ్యూనిస్ట్ నేతలతో ఫోన్లో మాట్లాడిన విజయ్సానుకూలంగా స్పందించిన సీపీఐ!సాయంత్రం కల్లా రానున్న స్పష్టత118 మంది మద్దతుదారుల సంతకాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానని గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ స్పష్టీకరణఏం చేద్దాం?తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొందిన టీవీకే108 స్థానాలతో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేప్రభుత్వ ఏర్పాటునకు 10 సీట్ల దూరంకాంగ్రెస్ మద్దతుతో కాస్త పెరిగిన బలంఅయినా ప్రభుత్వ ఏర్పాటునకు అంగీకరించని గవర్నర్113 సరిపోదని.. 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే ముందుకు రావాలని టీవీకేకు స్పష్టీకరణరెండు రోజుల్లో.. రెండుసార్లు కలిసినా ఇదే సమాధానంన్యాయనిపుణులతో చర్చించానని.. బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయమని విజయ్కు గవర్నర్ సమాధానంనెంబర్ ముఖ్యమని.. ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తానని వ్యాఖ్యరాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న విజయ్మరోవైపు.. నెగ్గిన ఎమ్మెల్యేలతోనూ వరుస భేటీలుమద్దతు ఉంటుందా? ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా? అనే దానిపై నేడు రానున్న స్పష్టతసంబంధిత వార్త: విజయ్కి షాక్.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలునేడు లోక్భవన్ ముట్టడిటీవీకే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నోగవర్నర్ అడ్డం పడుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలువిజయ్కు తమ ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించిన కాంగ్రెస్గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీరుపై సీపీఐతో పాటు పలువురి ప్రముఖుల అసంతృప్తిగవర్నర్ తీరుకు నిరసనగా నేడు లోక్భవన్ ముట్టడికి పిలుపుచెన్నైలోని లోక్భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుఆ మూడు ముందుకు వస్తేనే.. లెఫ్ట్ పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్ర ప్రయత్నంవిజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నానికి మాత్రమే మద్దతు ఇచ్చిన సీపీఐ(2)ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తుందో లేదో లేని స్పష్టతమరోవైపు ఏ విషయం తేల్చని సీపీఎం(2)నేడు ఏ విషయం చెబుతామంటున్న వామపక్ష పార్టీలువీసీకే(2) పార్టీ నిర్ణయంపైనా ఉత్కంఠనేడు వీసీకే కీలక సమావేశం.. ఆ తర్వాతే మద్దతుపై స్పష్టత వచ్చే చాన్స్ఈ మూడు పార్టీలు మద్దతు ఇస్తే మద్దతు ఇస్తే.. విజయ్ సర్కార్కు లైన్ క్లియర్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనుతమిళ రాజకీయాలపై నటుడు విశాల్ ఆసక్తికర పోస్ట్ఆ రెండూ కలిస్తే నేను అంగీకరించనంటూ ఎక్స్లో పోస్ట్డీఎంకే-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయంటూ ఉధృతంగా జరుగుతున్న ప్రచారంప్రచారాన్ని ఇప్పటికే ఖండించిన డీఎంకేవిజయ్కు ఇప్పటికే మద్దతు ప్రకటించిన విశాల్ If it’s not #Tvk and if it’s going to be anything else but the unimaginable/shellshocking combination of DMK/AIADMK alliance to form the next government , then I as a citizen and voter foresee a disastrous and catastrophic consequential turnout amidst common public. Will not go…— Vishal (@VishalKOfficial) May 7, 2026తమిళనాడు సస్పెన్స్ కంటిన్యూస్తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయంమ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాలు తక్కువవామపక్షాలు, ఇతర చిన్న పార్టీల మద్దతు కోరిన విజయ్మద్దతుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోని డీఎంకే మిత్రపక్షాలుటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ససేమీరాతొలుత.. బలంతో వస్తే టీవీకేకే అవకాశం అంటూ గవర్నర్ వ్యాఖ్యానించినట్లు ప్రచారంకాసేపటికే.. పూర్తి మెజారిటీ వచ్చే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటునైనా అంగీకరిస్తానంటూ వ్యాఖ్యానించారని మరో ప్రచారండీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలుతమిళనాట ఏం జరుగుతుందోననే ఉత్కంఠ -
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది.ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్తో టీవీకే చీఫ్ విజయ్.. గురువారం రెండోసారి సమావేశమైన విషయం తెలిసిందే. వీరి భేటీ అనంతరం, ఆర్లేకర్ పొలిటికల్ బాంబు పేల్చారు. మెజారిటీపై తాను సంతృప్తి చెందాకే టీవీకేకు అవకాశమిస్తానని స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని టీవీకే ఏర్పాటు చేయకుండా తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వాదనను ఖండించారు. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆర్లేకర్..‘ప్రభుత్వ ఏర్పాటుకు నా వద్దకు వచ్చిన పార్టీని అందుకు కావాల్సిన మెజారిటీ చూపించాలని అడిగాను. టీవీకేనే కాదు, ఏ పార్టీ వచ్చినా అదే అడుగుతాను. తర్వాత అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవచ్చు. ప్రక్రియను నేనేమీ ఆలస్యం చేయడం లేదు. విజయ్ 118 నంబరును రాతపూర్వకంగా ఇస్తే చాలు’ అని అన్నారు.అనంతరం, ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే వచ్చి 118 మందిని చూపిస్తామంటే అంగీకరిస్తారా అని ప్రశ్నించగా.. ఎవరు మెజార్టీ చూపించినా నాకు ఓకే. అది సాధ్యమైనా సరే.. తప్పో, ఒప్పో వారికి మెజారిటీ ఉంది కాబట్టి కాదనలేను. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియ. నేను ప్రజల్ని మర్చిపోను. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇక్కడున్నాను. వెరిఫై చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా అనుమతిస్తాను? ముందు నేను సంతృప్తి చెందాకే ఆ పనిచేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం మరో పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, విజయ్ మరో 2-3 రోజుల్లో మెజారిటీ చూపించుకోలేకపోతే ఏం చేస్తారని అడగ్గా, తనకున్న అవకాశాల మేరకు తదుపరి ప్రక్రియకు వెళ్తానని చెప్పారు. తనకు సలహా బృందం ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యవహారంపై కాంగ్రెస్.. నేడు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు సిద్దమైంది. ఇందులో భాగంగా లోక్భవన్ ముట్టడికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు నిచ్చింది. అయితే, కాంగ్రెస్ నిరసనలో టీవీకే పాల్గొంటుందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ఆదేశాలతోనే గవర్నర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
పొలిటికల్ ట్విస్ట్.. విజయ్ సంచలన నిర్ణయం?
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్కు ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడే సీట్లు రాకపోవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. విజయ్కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ.. రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఇలాంటి తరుణంలో విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.తమిళనాడులో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గానీ, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే.. టీవీకే తన 107 మంది ఎమ్మెల్యేలందరితో సామూహిక రాజీనామాలను పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. ఈ మేరకు విజయ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు బయటకు వచ్చాయి. రాజకీయ ప్రతిష్టంభన మధ్య విజయ్ శిబిరంలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది సంకేతమని పలువురు చెబుతున్నారు. విజయ్ స్వయంగా అధికారికంగా ఈ హెచ్చరిక చేయనప్పటికీ, ఎన్నికల అనంతర చర్చలు అసంపూర్తిగా మిగిలిపోవడం, సంఖ్యాబలం ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటుండటంతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని ఇది ప్రతిబింబిస్తోంది. టీవీకే అధికారం చేపట్టకుండా నిరోధించే ప్రయత్నంలో, డీఎంకే తన చిరకాల ప్రత్యర్థి ఏఐఏడీఎంకేతో రహస్య చర్చలు ప్రారంభించిందన్న వార్తలు వెలువడిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.Some reports are now claiming that if DMK and AIADMK come together and form the government, TVK MLAs may resign from their seats.Honestly, that would be a very risky political move.If 100+ MLAs resign, by-elections will happen in all those constituencies. In that situation,… pic.twitter.com/84LpB5f7xc— TVK Pulse (@TVKpulse) May 7, 2026పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, అసెంబ్లీలో విజయ్ పార్టీ ఏకైక అతిపెద్ద కూటమిగా అవతరించినప్పటికీ, ఆయనను అధికారంలోకి రాకుండా నిరోధించడానికి డీఎంకే, అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు ఉందని భావిస్తున్న టీవీకే నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏ పార్టీకి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం లేనప్పటికీ, టీవీకేను అధికారానికి దూరంగా ఉంచే ప్రయత్నంగానే ఈ రెండు ప్రధాన ద్రవిడ పార్టీల ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది, ఇందులో విజయ్ గెలిచిన రెండు స్థానాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగ నియమం ప్రకారం విజయ్ ఒక సీటును ఖాళీ చేసే అవకాశం ఉన్నందున, పార్టీ వాస్తవ బలం 107 మంది ఎమ్మెల్యేలుగా ఉంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు లభించింది. దీనితో మరో ఐదుగురు సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్య 112కు చేరింది. అయితే, 234 మంది సభ్యులు కలిగిన ఈ సభలో మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్యను ఇది ఇంకా చేరుకోలేదు. ఈ నేపథ్యంలో టీవీకే.. డీఎంకే మిత్రపక్షాలైన విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK), వామపక్ష పార్టీలు మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)లను సంప్రదిస్తోంది. అయినప్పటికీ, వారి నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదు.ఈ సందర్బంగా ఐయూఎంఎల్ అధ్యక్షుడు కేఎం కాదర్ మొహిదీన్ స్పందిస్తూ.. పొత్తు కోసం టీవీకే తమను సంప్రదించిందని, అయితే తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. డీఎంకే నేతృత్వంలోని అలయన్స్ ఉన్న IUML, స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరిస్తామని అన్నారు. కాగా, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో IUML రెండు సీట్లను గెలుచుకుంది. -
TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్
-
10 సీట్లు, మూడు పార్టీలు : విజయ్ మ్యాజిక్ ఫిగర్, ట్విస్టులే ట్విస్టులు!
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. క్షణం క్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 (మెజారిటీ మార్క్) స్థానాలకు 10 సీట్ల దూరంలో ఉన్న టీవీకే అధినేత విజయ్ సీఎం పీఠం అధిరోహించాలంటే నెంబర్ గేమ్ తప్పనిసరిగా మారింది. 118 మంది శాసనసభ్యుల మద్దతు లేఖలను సమర్పించాల్సిందేనని గవర్నర్ అర్లేకర్ పట్టుబడుతున్న నేపథ్యంలో, ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ పూర్తికాని నేపథ్యంలో ఆ మూడు పార్టీల మద్దతు కీలకంగా మారనుంది.నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎందుకు దానికవసనమైన 'మ్యాజిక్ ఫిగర్' చేరుకోవడానికి మద్దతు కీలకం అనడంలో సందేహం లేదు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆపార్టీలకు విజయ్ లేఖ రాశారు కూడా. విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ చిన్న పార్టీల మద్దతు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే, విజయ్ సునాయాసంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు.విజయ్కు మద్దతిచ్చే అవకాశమున్న 3 కీలక పార్టీలు:విడుతలై చిరుతైగల్ కట్చి (VCK): డిఎంకె (DMK) కూటమిలో ఉన్న VCK కి 2 స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీ అధినేత తొల్ తిరుమావళవన్ ఇప్పటికే గవర్నర్ను కలిసి, విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. విజయ్ పంపిన మద్దతు లేఖపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.సీపీఐ (CPI): ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్నప్పటికీ, టీవీకే (TVK) కి మద్దతు ఇచ్చే విషయంపై వచ్చే 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ పేర్కొన్నారు.సీపీఐ(ఎం): ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని విజయ్ ఇప్పటికే ఈ పార్టీకి అధికారికంగా లేఖ రాశారు. శుక్రవారం జరగబోయే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మరోవైపు గతంలో డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ (5 సీట్లు), ఇప్పుడు విజయ్కు బేషరతుగా మద్దతు ప్రకటించడం టీవీకేకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా చాలా హుందాగా వ్యవహరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలైన విజయ్ను తాము అడ్డుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒకవేళ VCK, సీపీఐ, సీపీఎం పార్టీలు విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే, తాము వారిని అడ్డుకోబోమని డీఎంకే వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: నటి మాజీ భర్త ఆస్తుల కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్ట్మొత్తం 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ప్రస్తుత బలాబలాలు టీవీకే : 108డీఎంకే : 59, ఏఐడీఎంకే : 47కాంగ్రెస్: 5సీపీఐ(ఎం), సీపీఐ, బీసీకే : తలా 2 స్థానాలుబీజేపీ-1, DMDK: 1 అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం: 1 ట్విస్ట్ ఏంటంటే..ప్రస్తుత ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితుల నడుమ, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడానికి, తమ పార్టీ అధినేత తోల్ తిరుమావలవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని VCK ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్, ప్రధాన ద్రవిడ పార్టీలైన DM, AIADMKలకు విజ్ఞప్తి చేయడం మరో ట్విస్ట్. దీంతో తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఏ క్షణం, ఏం జరుగుతుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే.ఇదీ చదవండి: సెకండ్ ర్యాంక్ వచ్చిందని ఎగతాళి : 9 ఏళ్ల కూతుర్నే ..! -
విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
-
VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం
-
అలా ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో అవాంతరం ఎదురవుతోంది. మెజారిటీ బలంతో వస్తేనే అందుకు అనుమతిస్తానంటూ గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇవాళైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురు చూస్తున్న టీవీకే ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. బుధవారం లోక్భవన్లో టీవీకే అధినేత విజయ్కు చుక్కెదురైంది. ఆ పార్టీ సమర్పించిన మద్దతుదారుల లిస్ట్పై గవర్నర్ పెదవి విరిచారు. పూర్తి స్థాయి బలం లేదు కదా? అని ప్రశ్నించారు. దీంతో గురువారం ఉదయం మరోసారి లోక్భవన్కు వెళ్లి గవర్నర్తో చర్చలు జరిపారు. 113 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన సంతకాలతో పాటు 20 మంత్రుల జాబితాను సమర్పించారు. సుమారు 40 నిమిషాల పాటు ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. అయితే.. 113 మందితోనే ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారని ఆ సందర్భంలో గవర్నర్ ఆర్లేకర్, టీవీకే అధినేతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి న్యాయ నిపుణులతో చర్చించాకే నిర్ణయం చెబుతానని విజయ్ను పంపించేశారు. ఆ వెంటనే సానుకూల ప్రకటన రావొచ్చంటూ కథనాలు వెలువడ్డాయి. కానీ,లోక్భవన్ నుంచి టీవీకే పార్టీకి ఫోన్కాల్ వెళ్లింది. విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి మెజారిటీ లేకున్నా ప్రభుత్వ ఎలా ఏర్పాటు చేస్తారని.. 118 ఎమ్మెల్యేల మద్దతు సమర్పించాకే సీఎంగా ప్రమాణం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు తమిళనాడు గవర్నర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ, సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. విజయ్ పార్టీకి బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని.. తమిళనాడు గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, .. ప్రజల ఆకాంక్షలను అవమానిస్తున్నారని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ట్వీట్ చేశారు. రాజ్యంగబద్ధ హోదాలో ఉన్నవాళ్లు ప్రజా తీర్పును గౌరవించాలని..తమ విధుల్ని సరిగా నిర్వర్తించాలని హితవు పలికారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలోనని.. లోక్భవన్లో కాదని అన్నారాయన. ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికైనా విజయ్ని ఆహ్వానించాలని ఆయన అన్నారు. మరో నటుడు ప్రకాశ్రాజ్ సైతం విజయ్ మద్దతుగా పోస్ట్ చేశారు. విజయ్కు ప్రజలు పట్టం కట్టారు. బలనిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాల్సిందేనని ట్వీట్ చేశారు.తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ బలం 113కి చేరింది. ప్రభుత్వ ఏర్పాటునకు మరో ఐదు స్థానాలు అవసరం. ఈ క్రమంలో డీఎంకే కూటమి పార్టీల మద్దతును విజయ్ కోరారు. అయితే అవి విజయ్కు మద్దతు ఇచ్చే అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మరోవైపు అన్నాడీఎంకే లేదంటే దాని కూటమిలోని చిన్నపార్టీల తరఫు నుంచైనా విజయ్కు మద్దతు లభిస్తుందేమోనన్న చర్చ తమిళనాట జోరందుకుంది. -
విజయ్కు గవర్నర్ గ్రీన్సిగ్నల్
చెన్నై: తమిళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చారు. విజయ్తో భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అయితే, లోక్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత తన నిర్ణయం చెబుతానని గవర్నర్ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఒకవేళ గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈరోజే విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. గవర్నర్ గ్రీన్సిగ్నల్తో టీవీకే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే లోక్భవన్ వేదికగా గవర్నర్, విజయ్ మధ్య కీలక సమావేశం జరిగింది. 24 గంటల్లో రెండోసారి గవర్నర్ను విజయ్ కలిశారు.40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. వీరి భేటీ సందర్భంగా గవర్నర్కు విజయ్.. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను అందించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని విజయ్ చెప్పారు. 113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించారు. #WATCH | Chennai | TVK Chief Vijay leaves from Lok Bhavan after meeting Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar pic.twitter.com/ygxHkVNi4q— ANI (@ANI) May 7, 2026విజయ్కు అనుమతి ఇవ్వాలి..ఇదిలా ఉండగా.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్ను కోరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా, ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తంచేసింది. -
తమిళ రాజకీయాల్లో పళని బాంబు!
తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విజయ్ టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పచ్చ జెండా ఊపడం లేదు. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు విజయ్ లోక్భవన్లో ఉండగానే అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి అత్యవసరంగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. విజయ్ తర్వాత పళనిస్వామి తమిళనాడు గవర్నర్తో భేటీ కానున్నట్లు సమాచారం. దీంతో విజయ్ టీవీకేకు ఆయన మద్దతు ఇస్తారా? ప్రభుత్వ ఏర్పాటునకు సహకరిస్తారా? లేదంటే మరేదైనా ట్విస్ట్ ఇస్తారా? అనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతుందని ఆ పార్టీ నూతన ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్ స్వయంగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారన్నది ఆ తర్వాత తెర మీదకు వచ్చిన ప్రచారం. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి గెలిచిన ఎమ్మెల్యేలను అత్యవసరంగా చెన్నైకి పిలిపించుకున్నారు. ఆపై టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే నుంచి ఓ ప్రకటన వెలువడింది. కానీ, తెర వెనక మరో వ్యవహారం జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీతో కటీఫ్ చెప్పి.. టీవీకేకు మద్దతు ఇద్దామని అన్నాడీఎంకేలో ఓ వర్గం పళనిస్వామిపై ఒత్తిడి చేస్తోంది. ఈ డిమాండ్తో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలో టీవీకేకు మద్దతు ఇచ్చేలా ఓ వర్గం(15 నుంచి 25 దాకా ఉన్నారనే టాక్) ఏర్పాటు అయ్యిందని.. అప్రమత్తమైన పళనిస్వామి వాళ్లను మందలించారని.. మొండిపట్టుతో ఉన్న షణ్ముగం టీం పాండిచ్చేరిలోని ఓ రిసార్ట్కు తరలిపోయిందని.. పళనిస్వామి వర్గం మాత్రం చెన్నైలోనే ఉండిపోయిందని.. ప్రచారం జోరందుకుంది. ఇది అన్నాడీఎంకేలో తిరుగుబాటుకు కారణం అయ్యే అవకాశమూ లేకపోలేదు. ఈ పరిణామాల దృష్ట్యా పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఒకవేళ విజయ్కు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చినా.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ను కోరినా.. డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సంచలన ప్రకటన చేసినా.. ఇలా ఏది జరిగినా అది తమిళ రాజకీయాల్లో పళని పేల్చిన బాంబే కానుంది. -
విజయ్పై కుట్ర: పోసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదన్నారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని పోసాని ఆరోపించారు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తమిళనాడు తాజాగా రాజకీయ పరిణామాలపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఈ సందర్బంగా పోసాని మాట్లాడుతూ..‘దళపతి విజయ్ నాకు 1996 నుంచి నాకు తెలుసు. వాళ్ల నాన్నతో కూడా నాకు పరిచయం ఉంది. విజయ్ది పాకులాడే మనస్థత్వం కాదు. అతని చుట్టూ ఎన్ని గొడవలు వున్నా కూడా ఎంతో సంయమనంతో ఉన్నాడు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ని విజయ్ అసలు విమర్శించలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని టీవీకే చీఫ్ విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన తమిళనాడు గవర్నర్తో భేటీ కానున్నారు. ఆ సమావేశం అనంతరం కోర్టుకు వెళ్లే యోచనపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తగ్గాయి. దీంతో మిగతా పార్టీల నుంచి మద్దతు కూడగట్టాలని విజయ్ నిర్ణయించారు. ఈలోపు.. బలనిరూపణకు రెండు వారాల గడువు కోరుతూ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావొద్దన్న ఉద్దేశంతో సీఎంగా ప్రమాణం చేయాలని ఆయన భావించారు. ఇదే విషయాన్ని లోక్భవన్కు కబురు పంపగా.. మద్దతుదారుల లిస్ట్తో రావాలని టీవీకేకు గవర్నర్ అర్లేకర్ కబురు పంపారు. దీంతో కాంగ్రెస్ మద్దతుతో కూడిన మొత్తం జాబితాను బుధవారం సాయంత్రం గవర్నర్కు విజయ్ సమర్పించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు సరిపడా బలం లేదని.. కాబట్టి సీఎంగా ప్రమాణం చేయడానికి కుదరదని చెబుతూ విజయ్కు గవర్నర్ షాకిచ్చారు. 118 ఎమ్మెల్యేల మద్దతుతోనే రావాలంటూ స్పష్టం చేశారు. దీంతో టీవీకే వర్గాలు నిరాశకు లోనయ్యాయి. ఇవాళ మరోసారి గవర్నర్తో భేటీ కావాలని విజయ్ నిర్ణయించారు. గతంలో.. సాధారణంగా ఎన్నికల్లో అతిపెద్ద(లార్జెస్ట్) పార్టీలను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడమో.. లేదంటే ఆ పార్టీలు తాము ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ముందుకు రావడమో భారత రాజకీయాల్లో పరిపాటిగా వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాతే అవి బల నిరూపణకు వెళ్తుంటాయి. 2013లో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 సీట్లు, ఆప్కు 28 సీట్లు, కాంగ్రెస్కు 8 సీట్లు వచ్చాయి. అయితే మ్యాజిక్ ఫిగర్(36) లేకున్నా.. బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానం అందింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వెనక్కి తగ్గింది. దీంతో ఆప్ కాంగ్రెస్ సహాయంతో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2018లో కర్ణాటక ఎన్నికల తర్వాత లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. ఆ సమయంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కోర్టు తలుపు తట్టింది. దీంతో కోర్టు త్వరగా బలనిరూపణ జరపాలని గవర్నర్కు సూచింది. చివరకు మెజారిటీ నిరూపించుకోలేక యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. 2017 కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా(17) నిలిచినా అప్పటి గవర్నర్ బీజేపీ(13)ని ఆహ్వానించారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 21. బీజేపీ తన మిత్రపక్షాలతో మెజారిటీ నిరూపించుకుంది ప్రభుత్వం కొనసాగించింది. ఆ సమయంలో కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఇప్పుడు విజయ్ టీవీకే లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోవడం లేదు. ముందుగానే బలం చూపించాలనే కోరుతున్నారు. విజయ్ కోరినట్లు రెండు వారాల గడువు ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.కాబట్టి విజయ్ పార్టీ వీలైనంత త్వరగా బలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. లేకుంటే గవర్నర్ మరొకరికి అవకాశం ఇవ్వొచ్చు. ఈ మేరకు ఆయన న్యాయనిపుణులతోనూ సంప్రదింపులు జరిపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కాబట్టి గవర్నర్ గనుక ప్రభుత్వ ఏర్పాటునకు ఒప్పుకోకపోతే న్యాయస్థానం తలుపు తట్టాలని విజయ్ భావిస్తున్నారు. నేషనల్ లెవల్లోనూ..గతంలో జాతీయ స్థాయిలోనూ ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా అవతరించిన జనతా పార్టీకి ఆహ్వానం లభించింది. మోరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. 1989లో జనతా దళ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆ టైంలో ఆయనకు బయట నుంచి మద్దతు లభించింది. ఇక 1996లో లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి ఆహ్వానం లభించింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి బలనిరూపణలో విఫలమై 13 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ (INC) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి.. యూపీఏ కూటమి ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. -
శ్రీధర్ వేంబు ‘రాష్ట్రపతి’ అస్త్రం.. క్లైమాక్స్ మామూలుగా లేదుగా..
తమిళనాడు రాజకీయాలు హై-వోల్టేజ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. విజయ్ స్థాపించిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ హైడ్రామా మధ్య ‘జోహో’ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ చేసిన సంచలన డిమాండ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.అంతుచిక్కని మ్యాజిక్ ఫిగర్తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 234 స్థానాలున్న అసెంబ్లీలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, 118 మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీధర్ వేంబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇతర పార్టీల మద్దతుతో అతుకుల బొంతలా ఏర్పడే ప్రభుత్వం అస్థిరంగా ఉండే ప్రమాదం ఉందని, తమిళనాడుకు ఇంతకంటే మెరుగైన, బలమైన పాలన అవసరమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రపతి పాలన.. మళ్లీ ఎన్నికలురాష్ట్రంలో నెలకొన్న ఈ అనిశ్చితికి రాష్ట్రపతి పాలనే సరైన పరిష్కారమని శ్రీధర్ వేంబు సూచించారు. కఠినమైన నిబంధనల నడుమ మళ్లీ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ మళ్లీ ఎన్నికలు జరిగితే విజయ్ సూపర్ మెజారిటీ సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దాన్ని అడ్డుకోవాలనుకుంటే డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి పోరాడాలని, బీజేపీ కూడా ఏ ఒక్క సీటు రాకపోయినా సరే, ఒంటరిగా బరిలోకి దిగి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు.సస్పెన్స్లో గవర్నర్ నిర్ణయంమరోవైపు, అధికార పీఠం దక్కించుకునేందుకు టీవీకే ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించగా, వీసీకే, సీపీఐ, సీపీఎం (చెరో 2), పీఎంకే (4 సీట్లు), అన్నాడీఎంకే నేతలతోనూ మంతనాలు జరిపింది. బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసిన విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ చెబుతున్న మద్దతుపై గవర్నర్ ఇంకా పూర్తి నమ్మకంతో లేరని, తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టేందుకు టీవీకేకు మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: సీఎన్ఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ కన్నుమూత -
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
రేపు తమిళనాడులో కాంగ్రెస్ ధర్నా
తమిళనాడు రాజకీయానికి సంబంధించిన అప్డేట్స్.. తమిళనాడు గవర్నర్ను కలిసిన సీఎస్, డీజీపీవిజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని డీజీపీని ప్రశ్నించిన గవర్నర్ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారన్న గవర్నర్రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలుగవర్నర్ తీరుకు నిరసనగారేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నవిజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శలుగవర్నర్ తీరుకు నిరసనగా ఆందోళనకు ధర్నాకు దిగనున్న కాంగ్రెస్ శ్రేణులు రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంటీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు వేగవంతంవామపక్షాలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి టీవీకే నేత నిర్మల్ కుమార్వామ పక్షాలతో చర్చలు జరిపే బాధ్యతల్ని కుమార్కు అప్పగించిన విజయ్ రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంసమావేశం తర్వాతే విజయ్కు మద్దతు అంశంపై క్లారిటీ అప్పటి వరకు కొనసాగనున్న ఉత్కంఠలోక్భవన్ అధికారిక ప్రకటనతమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్భవన్ అధికారిక ప్రకటనగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈ రోజు చెన్నైలో విజయ్ని కలిశారుప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మద్దతు తమిళనాడు శాసనసభలో ఇంకా లభించలేదని స్పష్టంలోక్భవన్ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళనప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శననాది భరోసాటీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ భరోసా ప్రభుత్వ ఏర్పాటు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని హామీ తగిన మెజారిటీతో రావాలని సూచన 118 మంది జాబితాతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని సలహా విజయ్కి మద్దతు ఇస్తారా?డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠవామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన విజయ్మద్దతు కోరుతూ లేఖ రాసిన టీవీకే అధినేతడీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అయిన మిత్రపక్షాల నేతలువిడిగా పార్టీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తమ నిర్ణయం ఏంటన్నది రేపు భేటీల తర్వాత ప్రకటించే చాన్స్విజయ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ(2)ఏదీ తేల్చని సీపీఎం (2)మద్దతు ఇవ్వమని ఇదివరకు ప్రకటించిన వీసీకే(2)విజయ్ లేఖ నేపథ్యంలో పునరాలోచనలో వీసీకేమద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(2)తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్..విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల సంతృప్తి చెందని గవర్నర్.గవర్నర్ ఆఫీసు నుంచి టీవీకేకి ఫోన్.118 మంది మెజార్టీ ఫిగర్తో లేఖ సమర్పించాలని టీవీకేకు స్పష్టం చేసిన గవర్నర్ ఆఫీస్.కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలుసంబంధిత వార్త: 113తో ప్రభుత్వమా? అలా ఎలా?కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలుఎంపీ కమల్హాసన్ ట్వీట్.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు.లోక్భవన్ కాదు.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలి.ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలి. తమిళనాడు చర్రితలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது. என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామంటీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందనముగిసిన భేటీ.. లోక్భవన్లో గవర్నర్తో ముగిసిన విజయ్ భేటీ.24 గంటల్లో రెండోసారి గవర్నర్ను కలిసిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్.113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించిన విజయ్.కాసేపట్లో గవర్నర్ను కలవనున్న అన్నాడీఎంకే పళనిస్వామి. పళనిస్వామికి టెన్షన్!విజయ్కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఒత్తిడి.ఈపీఎస్ ఒప్పుకోకుంటే టీవీకేకి మద్దతు పలికే ఆలోచనలో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి, షణ్ముగం సంప్రదింపులు.పుదుచ్చేరి రిసార్టులో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు. లోక్భవన్లో గవర్నర్తో విజయ్ సమావేశం..ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని కోరిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉంది: విజయ్ తమిళనాడులో ట్విస్ట్ల మీద ట్విస్టులుగవర్నర్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే పళనిస్వామివిజయ్ భేటీ అనంతరం గవర్నర్ను కలవనున్న పళనిస్వామి.మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్తో పళనిస్వామి భేటీ. గవర్నర్తో పళనిస్వామి సమావేశంపై పలు రకాల ఊహాగానాలుటీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని పుదుచ్చేరిలో 25 మంది ఎమ్మెల్యేల క్యాంపుతాజా పరిణామాల నేపథ్యంలో టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు ఇచ్చే ఛాన్స్అన్నాడీఎంకే మద్దతిస్తే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విజయ్గవర్నర్, విజయ్ భేటీపై సర్వత్ర ఉత్కంఠ👉గవర్నర్ను కలిసిన విజయ్👉లోక్భవన్లో గవర్నర్తో విజయ్ భేటీ. ప్రజల అండ విజయ్కు ఉంది: ప్రకాశ్రాజ్తమిళనాడు రాజకీయాలపై స్పందించిన ప్రకాశ్రాజ్ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ ప్రకాశ్రాజ్ పోస్ట్విజయ్కు ప్రజామోదం ఉందంటూ వ్యాఖ్యలు.ప్రజలు అండగా ఉన్నారని కితాబు. గవర్నర్ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరం, ఆమోదయోగ్యం కానిది మరియు రాజ్యాంగ విరుద్ధమైనది.మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు..కానీ విజయం ప్రజల తీర్పు ద్వారా లభించింది.సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి.This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ— Prakash Raj (@prakashraaj) May 7, 2026క్షణక్షణం.. ఉత్కంఠ.. 👉లోక్భవన్కు బయలుదేరిన విజయ్👉కాసేపట్లో గవర్నర్తో కీలక భేటీ. 👉 కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్ ఆర్లేకర్. విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కాన్వాయ్ కేటాయించినట్లు వెల్లడించిన అధికారులుసుప్రీంకోర్టుకు విజయ్కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీతమిళ రాజకీయంపై ఉత్కంఠకాసేపట్లో లోక్భవన్కు విజయ్.ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్.నిన్న గవర్నర్ను కలిసిన విజయ్118 మంది సంతకాలతో రావాలన్న గవర్నర్అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవలేదనే పాయింట్ మీద కోర్టుకు వెళ్లనున్న టీవీకే.సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నట్టు సమాచారం. అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పుదుచ్చేరి రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.అన్నాడీఎంకే బలం-47టీవీకే మద్దతు ఇవ్వాలన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలింపు.టీవీకేకే మద్దతు ఇవ్వాలంటున్న ఓ వర్గం.టీవీకేకి దూరంగా ఉండాలంటున్న మరో వర్గం.చెన్నైలోనే పళనిస్వామి వర్గం.పుదుచ్చేరిలో షణ్ముగం వర్గం.పుదుచ్చేరి రిసార్టులో దాదాపు 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి ఒక్కొక్కొరుగా పార్టీ ఆఫీసుకు వస్తున్న టీవీకే ఎమ్మెల్యేలు. నేడు విజయ్ కీలక సమావేశం.. నేడు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం.రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. మళ్లీ ఎన్నికలు జరపండి: శ్రీధర్ వేంబుతమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరపాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వ్యాఖ్యలు.టీవీకే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటు కోసం తగినంత సంఖ్యా బలం లేదు.సంఖ్యలు సరిపోతున్నట్లు కనిపించడం లేదు.ఏ ప్రభుత్వం ఏర్పడినా, అది వివిధ రకాల ఆకర్షణలు, ఒత్తిళ్లతో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది.తమిళనాడు ఇంతకంటే మెరుగైన ప్రభుత్వానికి అర్హమైనది.అందుకే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి వస్తారని నేను భావిస్తున్నాను.ఒకవేళ డీఎంకే-అన్నాడీఎంకే దానిని ఆపాలనుకుంటే, వారిద్దరూ కలిసి పోరాడాలి.సున్నా సీట్లు వచ్చినా సరే, బీజేపీ ఒంటరిగా పోరాడాలి.తమిళనాడులో బీజేపీకి ఇది ఒక కొత్త ఆరంభం.ప్రజలే మళ్లీ నిర్ణయించనివ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు. The numbers don't seem to add up. Whatever government is cobbled together is likely to be unstable with various pulls and pressures. Tamil Nadu deserves better.President's rule with fresh elections may be the best course, this time with a very strict "no cash for votes"…— Sridhar Vembu (@svembu) May 7, 2026తమిళనాడులో అల్లర్లకు చాన్స్..తమిళనాడులో ఇంటెలిజెన్స్ హెచ్చరికపలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం.దీంతో, పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన సీఎస్, డీజీపీపొత్తులపై కొత్త ట్విస్ట్.. పొత్తులపై ప్రచారాన్ని ఖండించిన డీఎంకేఅవన్నీ ఫేక్ అంటూ డీఎంకే నేతలు వ్యాఖ్యలు.విజయ్ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదన్న స్టాలిన్మరోవైపు.. విజయ్కు తమ మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే.ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుపై ఉత్కంఠ.టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న లెఫ్ట్ పార్టీలు, అన్నాడీఎంకే.కాంగ్రెస్ మద్దతులో 112కు చేరిన టీవీకే బలంమరో ఆరుగురు ఎమ్మెల్యే కోసం టీవీకే ప్రయత్నాలు. రిసార్ట్ రాజకీయాలు..గత మూడు రోజులుగా మహాబలిపురంలోని రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు.మరోవైపు.. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పుదుచ్చేరిలోని రిసార్ట్కు తరలింపు.'ది షోర్ త్రిశ్వం'లో 20కి పైగా గదులను బుక్ చేసుకున్న అన్నాడీఎంకే సీవీ షణ్ముగంPuducherry: AIADMK MLAs have gathered at a private resort in Puducherry amid uncertainty over government formation in Tamil Nadu. With TVK lacking a clear majority and seeking support, political maneuvering is underway. Heavy police security has been deployed to maintain law and… pic.twitter.com/hsUdAsgbSE— IANS (@ians_india) May 6, 2026ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను టీవీకే నేతలు కలిశారు.విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది.వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్కు అందజేత.ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిఅందుకు గవర్నర్ విముఖత.118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచన.దీంతో నిరాశతో వెనుతిరిగిన విజయ్. రసవత్తరంగా తమిళ రాజకీయం..గంట గంటకూ మారుతున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలుకొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొనసాగుతున్న ఉత్కంఠ..నేడు ఏం జరగబోతోందని అనేది సస్పెన్స్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలం ఇలా.. టీవీకే - 108డీఎంకే - 59అన్నాడీఎంకే - 47కాంగ్రెస్ - 05పీఎంకే - 04ఐయూఎమ్ఎల్- 02సీపీఐ - 02సీవీకే - 02సీపీఎం - 02బీజేపీ - 01డీఎండీకే - 01అన్నామక్కల్ మున్నేట్ర కళగం - 01రెండు పార్టీల మంతనాలుతమిళనాట కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు వార్తలుఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలుకు 106 సీట్లువామపక్షాలు మిగిలిన చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నాయట!దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం. -
విజయ్కి సెక్యూరిటీ తొలగింపు
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో బలం పెంచుకునే పనిలో విజయ్ పడ్డారు. అయితే.. ఈలోపు ఆయనకు ఝలక్ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలవడంతో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరిగింది. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమై చెన్నైలోని ఆయన నివాసం ముందు భద్రతను పెంచింది. విజయ్ నివాసంతో పాటు టీవీకే కార్యాలయం, అలాగే టీవీకే ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు కనిపించారు. అయితే గవర్నర్ను కలిశాక పరిస్థితి మారిపోయింది. రాత్రి పట్టినపాకంలోని పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో విజయ్ సింగిల్ వెహికిల్లోనే ఇంటికి బయల్దేరారు. గత రెండ్రోజులుగా హడావిడి చేసిన కాన్వాయ్ కనిపించలేదు. ఆ సమయంలో ఆయన డల్గా కనిపించారు. పార్టీ శ్రేణుల వాహనాలు కూడా పెద్దగా ఆయన వెంట లేవు. கான்வாய் பாதுகாப்பு வாகனங்கள் எதுவும் இல்லாமல் சென்ற விஜய்.. பட்டினப்பாக்கம் அலுவலகத்தில் இருந்து விஜய் வீட்டிற்கு புறப்படுவதற்கு முன்பே கான்வாய் வாகனங்கள் அங்கிருந்து எடுத்துச் செல்லப்பட்டன.. pic.twitter.com/LwjOMtpgsW— Doctor Ramadoss OG (@DoctorRamadoss) May 6, 2026సీఎం హోదాలో ఇచ్చే జెడ్ఫ్లస్ సెక్యూరిటీని విజయ్కు కేటాయించింది తమిళనాడు పోలీస్ శాఖ. అయితే తాజా పరిణామాలతో ఆ భద్రతను కనీసానికి కుదించినట్లు స్పష్టమవుతోంది. అలాగే నివాసం వద్ద నుంచి కూడా సిబ్బందిని బాగా తగ్గించినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ఆర్బీ చౌదరికి నివాళులర్పించి.. ఆయన తనయుడు జీవా(కోలీవుడ్ హీరో)ను విజయ్ ఓదార్చారు. ఆ సమయంలోనూ విజయ్ వెంట పెద్దగా సెక్యూరిటీ లేదు.మరోవైపు.. గవర్నర్ విజయ్ను కలిశాక మరో పరిణామం చోటు చేసుకుంది. టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథర్వ్ అర్జున మరోసారి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని కోరారు. ముందుగా సీఎంగా విజయ్ ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత శాసనసభలో బలనిరూపణ చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. అయితే.. ముందు మ్యాజిక్ ఫిగర్ (118) చూపించాకే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తేల్చి చెప్పారు. దీంతో తమిళ రాజకీయం రసకందాయంలో పడింది. -
ఎంకే స్టాలిన్తో రజనీకాంత్ భేటీ.. ఎందుకంటే..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత.. ఎం.కే స్టాలిన్ను రజనీకాంత్ ఆయన నివాసంలో ఇవాళ(బుధవారం) కలిశారు. మర్యాద పూర్వకంగానే రజనీకాంత్.. స్టాలిన్తో భేటీ అయ్యారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్.. స్టాలిన్ కలిసి కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకోగా, డీఎంకే 59 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.స్టాలిన్ తన కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. డీఎంకే, మిత్రపక్షాలు రెండో అతిపెద్ద కూటమిగా నిలిచినందున.. కొత్త అసెంబ్లీలో అవి ప్రతిపక్ష స్థానంలో కూర్చోనున్నాయి. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.గతంలో రజనీకాంత్.. డీఎంకేకు అందించిన మద్దతు దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 1995లో రాజకీయాల్లోకి వస్తారని భావించిన సమయంలో ఆయన డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 1998 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీకి అండగా నిలిచారు. ఆ తర్వాత 2017లో రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించినప్పటికీ, 2021లో అనారోగ్య కారణాలతో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. విజయ్ విజయం తర్వాత.. ఆయనకు అభినందనలు తెలుపుతూ రజనీకాంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.కాగా, విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆయన పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఉప ఎన్నికలు జరగవచ్చు. మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకు ఇంకా 10 స్థానాల మద్దతు అవసరం. -
విజయ్ విజన్ ఉన్నోడు..వారికి పీడకలే!
టీవీకే అధినేత, కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఆయన పెట్టుబడి పెట్టే విధానం చూసి నెటిజన్లు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఆశ్చర్యపోతున్నారు. విజయ్ విజన్ ఉన్నవాడు, వారెన్ బఫెట్లాంటోడు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.27 పేజీల అఫిడవిట్లో విజయ్ ప్రకటించిన నికర ఆస్తి విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తులు రూ. 404 కోట్లు, స్థిరాస్తులు రూ. 220 కోట్లుగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు. ఇందులో ఒక సేవింగ్బ్యాంకు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉన్నట్లు, ఇతర డిపాజిట్లు, కోట్ల విలువ చేసే షేర్లను ప్రకటించారు.దీంతో విజయ్ పెట్టుబడి విధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరో అయి ఉండి కూడా, సామాన్యుడిలా బ్యాంకు డిపాజిట్లనే నమ్ముకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.జీతం తీసుకునే ఉద్యోగులు తమ పొదుపును మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో ఎస్ఐపీల రూపంలో పెట్టుబడి పెట్టాలని చెబుతున్న ఈ రోజుల్లో, విజయ్ ఆస్తులు ఫిన్ఫ్లూయెన్సర్లకు కంటగింపుగా మారాయని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. వారెన్ బఫెట్ లాగే నగదు నిల్వలు కలిగి ఉన్నందుకు, ఫన్నీగా 'దార్శనికుడు' అని కూడా కీర్తిస్తున్నారు.ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?He beats nifty returns by keeping his money in FDHe is sitting on 300cr cash Just like Warren buffet with 300 billion in cashThalapathy Vijay is visionary pic.twitter.com/eXdm0CPIQL— सौरभ (@saurabh_gunjal_) May 6, 2026ఇదీ చదవండి: సింగిల్ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్ టాపిక్గా విజయ్ ఆస్తి Vijay is a Finfluencer's nightmare! pic.twitter.com/2J2hhjbqFv— Dharmesh Ba (@dharmeshba) May 6, 2026నెటిజన్ల కామెంట్స్"మ్యూచువల్ ఫండ్స్ గురించి పాఠాలు చెప్పే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లకు విజయ్ ఒక పీడకల (Nightmare)" అని కొందరు అంటుంటే.. మరికొందరు పెట్టుబడి సలహాలు కూడా ఇచ్చారు."వంద కోట్ల రూపాయలను ఎఫ్డీలో పెట్టడం వల్ల ద్రవ్యోల్బణం (Inflation) దృష్ట్యా నష్టమే. అదే పీఎస్యూ స్టాక్స్లో పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేవి" అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. వంద కోట్లను బ్యాంకు FDలో పెట్టుబడి పెట్టారు... ఇది అతని మొత్తం ఆస్తులలో 17 శాతం. ఇంత చెత్త పెట్టుబడి సలహా ఎవరు ఇచ్చారో నాకు నిజంగా అర్థం కావడం లేదన్నారు.ఆ 100 కోట్లలో 50 శాతం అంటే 50 కోట్లను ప్రభుత్వ బాండ్లలో, డెట్ ఫండ్లలో లేదా కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకునే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు. (టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు)ముఖ్యంగా "టాప్ PSUలలో అధిక డివిడెండ్ రాబడినిచ్చే స్టాక్లలో పెట్టుబడి పెడితే, మూలధనం సేఫ్. క్రమం తప్పని ఆదాయం వచ్చేది. అలాగే మూలధన విలువ కూడా పెరుగుతుంది," అని @RakJhun అనే ఒక ఎక్స్ యూజర్ వివరించారు. "తమిళులకు బంగారం, ఆస్తుల మీద ఉన్న నమ్మకం స్టాక్ మార్కెట్ మీద ఉండదు" అని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. TVK Chief Vijay appears to be risk-averse but may be lacking proper financial advice. He has ₹213 Cr in savings bank & FDs of ₹100 Cr which yields very low interest. If he invests in high dividend yield stocks of top PSUs, capital is safe + regular income + capital appreciation pic.twitter.com/pcakqtFxG6— RJ Stocks (@RakJhun) May 5, 2026 -
ఎమ్మెల్యేగా గెలిచిన పని మనిషి
-
TVK విజయ్ కు కాంగ్రెస్ మద్దతు
-
విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే టీవీకే అధినేత విజయ్ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే వస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా.. మొత్తం ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలోనే ఈ తరహా నిర్ణయం ఇదే తొలి కావడం గమనార్హం!రేపో లేదంటే ఎల్లుండో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐదు వేల మంది హాజరయ్యేలా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని టీవీకే భావిస్తోంది. తమిళనాడు లోక్భవన్ (గవర్నర్ కార్యాలయం) ప్రకటన ప్రకారం.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ సాయంత్రం ప్రకటించబడతాయి. అయితే ఈ ఏర్పాట్లను ప్రభుత్వం కాకుండా టీవీకే పార్టీ స్వయంగా నిర్వహిస్తోందని లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి.సీఎం ప్రమాణ స్వీకార వేడుక అంటే.. ముఖ్యమైన ప్రజాస్వామ్య కార్యక్రమం. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజల ముందు రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ సమక్షంలో ఈ వేడుక జరగుతుంది. కాబట్టి ప్రజలు పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మునే ఖర్చు చేస్తారు. సాధారణ పరిపాలన శాఖ (General Administration Department) ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. టెంట్లు, స్టేజ్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, అతిథుల స్వాగతం వంటి అన్ని అంశాలకు ఖర్చు లెక్కలు ఈ శాఖే చూసుకుంటుంది. అలాగే..ఖర్చు స్థాయి కార్యక్రమం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాదాసీదా ప్రమాణ స్వీకారం రాజభవన్లో జరిగితే ఖర్చు తక్కువగా ఉంటుంది. కానీ భారీ సభలు స్టేడియం లేదంటే పెద్ద మైదానంలో నిర్వహిస్తే ఖర్చు కోట్లలోకి వెళ్తుంది. ప్రజలకు విస్తృతంగా హాజరు అవకాశం కల్పిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. వీటికి తోడు.. ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కీలకం. వేలాది పోలీసు సిబ్బంది, ఇతర దళాలు నియమించబడతాయి. వాళ్ల ప్రయాణం, భోజనం, లాజిస్టిక్స్ అన్నీ ప్రభుత్వ నిధుల నుంచే వస్తాయి. అదనంగా, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు.. పెద్ద టెంట్లు, వేదికలు, కూర్చోవడానికి సౌకర్యాలు కూడా ఖర్చులో ప్రధాన భాగం. గవర్నర్, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు.. ముఖ్య అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఆ ఖర్చు మరింత పెరిగిపోతుంది కూడా. అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో.. ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ప్రైవేట్ డొనేషన్లు లేదంటే వ్యక్తిగత నిధులు ఇందులో భాగం కావు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా.. ప్రజల పన్నుల ద్వారా సమకూరిన నిధులు ఈ వేడుకకు వినియోగించబడతాయి. అయితే విజయ్ మాత్రం ప్రభుత్వ ఖర్చు లేకుండా.. టీవీకే పార్టీ నిధులతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. ఇందుకు గవర్నర్ కూడా అంగీకరించినట్లు లోక్భవన్ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రానికి ఈ విషయం మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారాన్ని తగ్గిస్తూ, పార్టీ నిధులతోనే ఈ వేడుకను నిర్వహించాలని విజయ్ భావించడం.. ప్రజాస్వామ్యానికి, ప్రజల పన్నుల వినియోగానికి గౌరవం చూపినట్టేనన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
డీఎంకేతో కటీఫ్.. విజయ్కు మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకే పార్టీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు.. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీవీకే కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో డీఎంకే కూటమికి గుడ్బై చెప్పినట్లైంది. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తొలి నుంచి భావిస్తోంది. అయితే డీఎంకే మాత్రం అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో స్టాలిన్ నేతృత్వంలో నిన్న జరిగిన కూటమి మీటింగ్కు కాంగ్రెస్ తరఫు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. బదులుగా.. టీవీకే నేత సెంగొట్టియాన్తో ఓ హోటల్లో సమావేశమై జట్టు గురించి చర్చలు జరిపారు. ఈ పరిణామం డీఎంకేకు మంట పుట్టించింది. కాంగ్రెస్ ఐదు స్థానాలు నెగ్గిందే స్టాలిన్ వల్ల అని.. టీవీకేతో వెళ్లడం వెన్నుపోటు కిందకే వస్తుందని మండిపడింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో రాహుల్ గాంధీని తప్పు పట్టిస్తున్నారని ఆరోపించింది. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మాణిక్యం ఠాగూర్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం. ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి? అని అన్నారాయన. ఈ క్రమంలో తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వమని చెప్పారు. మరోవైపు.. కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం. సెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది. విజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి అని అన్నారు.ఇంకోవైపు డీఎంకే కూటమికి కొత్తగా నెగ్గిన ఎమ్మెల్యే రాజేష్కుమార్ చురకలంటించారు. ఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం. కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్తో ఏం గెలవలేదు. తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు. ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా అని అన్నారు. ఇండియా కూటమికి బీటలుతమిళనాడు ఎన్నికల టైంలోనే సీట్ల పంపకాల విషయంలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఇండియా కూటమి పేరుతో కాకుండా సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరుతో ఎన్నికలకు వెళ్లారు. అయితే కేవలం 28 సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజా పరిణామంతో తమిళనాడులో డీఎంకేతో దోస్తీకి కాంగ్రెస్ గుడ్బై చెప్పింది. దీంతో.. డీఎంకే నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది. -
టీవీకే ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో బిగ్ ట్విస్ట్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులోకి ఉంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించడంతో టీవీకే మరో 10 మంది బలం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పది మంది కోసం టీవీకే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, అన్నాడీఎంకే లుకలుకలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి పార్టీలో చీలికలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్.. విజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక, తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి లీమా గెలుపొందారు.అయితే, ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్కు మద్దతు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై నేడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతానికి పళనిస్వామి.. ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమై ఉన్నారు. అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. నేడు జరగబోయే సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు.. సీపీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో, వారంతా ఏ నిర్ణయం తీసుకోనున్నారనే సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే మద్దతుపై విజయ్ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో జయలలిత టైంలో పలు చేదు అనుభవాలు దృష్ట్యా విజయ్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో ఉంది. -
'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి?
సాక్షి, చెన్నై: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (TVK) చారిత్రాత్మక విజయం, పార్టీ అధినేత తరువాత కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (దళపతి విజయ్)కి సంబంధించిన ప్రతీ విషయం నెట్టింట వైరల్గా మారుతోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోయోలా కాలేజ్ కౌంటింగ్ సెంటర్ నుండి అందుకున్న MLAగా గెలిచిన ధృవీకరణ పత్రం వైరల్ అయ్యింది. ఇపుడు విజయ్ పదో తరగతి మార్కుల వివరాలు సోషల్ మీడియాలో సందడిగామారాయి. ఒక సగటు విద్యార్థిగా ప్రారంభమైన విజయ్ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించడమే కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదగడం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.మరోవైపు గురువారం ఉదయం 11.30 గంటలకు నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే ల మద్దతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ను కలిసేందుకు విజయ్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ ఇంకా రాలేదు.మనీ కంట్రోల్ నివేదిక, నెట్టింట హల్ చల్ చేస్తున్న 10వ తరగతి మార్కుల జాబితా (mark sheet) ప్రకారం చెన్నైలోని విరుగంబాక్కంలోని ఒక ప్రైమ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో విజయ్ చదువు కున్నారు. పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఆయన 1100 మార్కులకు గాను 711 సాధించారు. అంటే మార్కులు 65 శాతం మార్కులొచ్చాయన్నమాట. సబ్జెక్టుల వారీగా మార్కులుతమిళం: 200 మార్కులకు 155 (అత్యధిక మార్కులు)గణితం: 200 మార్కులకు 95.ఇంగ్లీష్: 200/133సైన్స్: 300 /206సోషల్ సైన్స్: 200/122పాఠశాల విద్య అనంతరం చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. సినిమాలపై మక్కువతో మధ్యలోనే కాలేజీ మానేసి నటన వైపు అడుగులు వేశారు. ఆ నిర్ణయమే ఆయన్ని కోలీవుడ్లో సూపర్ స్టార్గా నిలబెట్టింది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ప్రభంజనం దశాబ్దాల ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టి తమిళనాట ఘన విజయం సాధించారు. అత్యధిక మెజారీటీ సాధించిన ఏకైక పార్టీగా టీవీకే పార్టీని నిలబెట్టడం విశేషం. తిరుచిరాపల్లి ఈస్ట్ , పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్ విజయం సాధించారు. -
విజయ్ పవర్ స్ట్రోక్.. తెర వెనుక ఐదుగురు!
తమిళనాట ఎన్నికల పర్వం ముగిసింది. భారీ మెజార్టీతో టీవీకే విజయం సాధించారు. ద్రవిడ దిగ్గజ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు విజయ్ చుక్కలు చూపించి అధికారం చేజిక్కించుకున్నారు. అయితే, టీవీకే సాధించిన ఆకస్మిక విజయం వెనుక ఐదుగురు సీక్రెట్ సభ్యులు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. దీంతో, వారి గురించే ఇప్పుడు ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..తమిళనాడులో విజయ్కు ఇప్పటికే బలమైన అభిమానగనం ఉంది. అభిమానుల విధేయతను ఎన్నికల బలంగా మార్చగలిగే ఒక శక్తివంతమైన ఆన్లైన్ సైన్యం విజయ్ వద్ద అప్పటికే అందుబాటులో ఉంది. ఇక అవసరమైంది కేవలం ఒక పార్టీ నిర్మాణాన్ని రూపొందించుకోవడం మాత్రమే. అందులో భాగంగానే.. విజయ్ కోసం ఐదుగురు సభ్యుల సీక్రెట్ టీమ్.. ఎన్. ఆనంద్, అరుణ్రాజ్, CTR నిర్మల్ కుమార్, ఆధవ్ అర్జున, KA సెంగుట్టువన్ రంగంలోకి దిగారు. ఈ కీలక బృందం టీవీకే సందేశాన్ని రూపొందించడంలోనూ, క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వహించడంలోనూ కీలక పాత్ర పోషించింది. వీరందరూ కలిసి విజయ్ సినీ ప్రపంచంలో ఒక భాగంగా ఉంటూ టీవీకే విజయ రథాన్ని విజయం వైపు నడిపించారు.ఆనంద్ (Bussy ఆనంద్)ఆనంద్ 2006లో పుదుచ్చేరిలోని 'Bussy' నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి, ఈయన 'Bussy' ఆనంద్గా ప్రాచుర్యం పొందారు. విజయ్ తరపున క్షేత్రస్థాయిలో వ్యవహరించే ప్రధాన వ్యక్తి ఈయనే. విజయ్ను 'దళపతి' అని సంబోధించే ఆయన, విజయ్ అభిమాన సంఘమైన 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను నేటి టీవీకేగా తీర్చిదిద్దడంలో కేంద్ర బిందువుగా నిలిచారు. విజయ్ పార్టీ పేరును ప్రకటించి, పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన విధేయత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత, కళ్లలో నీళ్లతో, భావోద్వేగానికి లోనైన ఆనంద్.. విజయ్ పక్కన కూర్చుని కనిపించారు. 2026 ఎన్నికల్లో టీనగర్ నియోజకవర్గం నుండి ఆనంద్ విజయం సాధించారు.అరుణ్రాజ్..ఎంబీబీఎస్ పట్టా కలిగి మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరుణ్రాజ్ తన పరిపాలనా నైపుణ్యాన్ని టీవీకే పార్టీకి అందించారు. పన్ను దాడులు, విచారణలను నిర్వహించడంలో విశేష అనుభవం ఉన్న అరుణ్రాజ్.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో పాలుపంచుకోవడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొద్ది కాలంలోనే ఆయన TVK అంతర్గత కోర్ కమిటీలో ఒక కీలక సభ్యుడిగా ఎదిగారు. విజయ్ అనుసరించే స్వతంత్ర రాజకీయ వైఖరి తనను ఆకర్షించిందని అరుణ్రాజ్ గతంలో పేర్కొన్నారు. డీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించే ఆయన, 2026 ఎన్నికల్లో తిరుచెంగోడ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.CTR నిర్మల్ కుమార్నిర్మల్ కుమార్.. TVK పార్టీకి డేటా, సోషల్ మీడియా నిపుణుడిగా వ్యవహరించారు. 2025లో టీవీకేలో చేరడానికి ముందు బీజేపీలో పనిచేసి రాజకీయ మెలకువలను నేర్చుకున్నారు. వాస్తవానికి, తమిళనాడులో టీవీకే డిజిటల్ ఉనికిని పెంచడంలో నిర్మల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంగా ఆయన కాషాయ పార్టీని వీడి, అన్నాడీఎంకేలో చేరారని వార్తలు వచ్చాయి. కానీ, అన్యూహంగా ఆయన టీవీకే చేరారు. నిర్మల్.. టీవీకేలో చేరిన తర్వాత సర్వేలు, ఓటర్ల డేటా విశ్లేషణ, పోలింగ్ బూత్ స్థాయి విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించారు. టీవీకే పార్టీకి 30% ఓట్ల వాటా లభిస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. అంతిమంగా పార్టీ 35% ఓట్ల వాటాను సాధించింది. ఆయన అందించిన వ్యూహాత్మక సూచనలే విజయ్ ఎన్నికల ప్రచార నిర్ణయాలను ప్రభావితం చేశాయి. ఈ ఎన్నికల్లో ఆయన తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం నుండి విజయం సాధించారు.ఆధవ్ అర్జునఆధవ్ అర్జున భారతదేశ లాటరీ రాజుగా ప్రసిద్ధి. శాంటియాగో మార్టిన్ అల్లుడైన ఆధవ్ రాజకీయ ప్రస్థానం పలు రాజకీయ పార్టీల గుండా సాగింది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని 'Voice of Commons' అనే రాజకీయ సలహా సంస్థను స్థాపించడం ద్వారా ప్రారంభించారు. త్వరలోనే ఆయన పనితీరు డీఎంకే పార్టీ దృష్టిని ఆకర్షించింది. దాంతో 2021లో ఆయన డీఎంకేలో చేరారు. వాస్తవానికి డీఎంకే కోసం పనిచేసేలా ప్రశాంత్ కిషోర్ను ఒప్పించి తీసుకురావడంలో ఆధవ్ కీలక పాత్ర పోషించారని చెబుతారు. అయితే, డీఎంకేలో తనకు ఆశించిన కీలక పదవి లభించకపోవడంతో ఉదయనిధి స్టాలిన్తో ఆయనకు విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తిరుమావలవన్ నేతృత్వంలోని VCK పార్టీలో చేరారు, అక్కడ ఆయనకు ఉప ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. అనంతరం, టీవీకే గూటికి చేరారు. 2026 ఎన్నికల్లో ఆయన విల్లివాక్కం నుండి గెలుపొందారు.కేఏ సెంగోట్టయ్యన్సీనియర్ నాయకుడైన సెంగోట్టయ్యన్.. టీవీకేకి అత్యంత అపారమైన రాజకీయ అనుభవాన్ని అందించారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా (గోబిచెట్టిపాలయం నుండి) ఎన్నికైన ఆయన, ఎంజీ రామచంద్రన్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అలాగే, జయలలితకు గట్టి మద్దతుదారుగా ఉండేవారు. నిజానికి, జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి కే పళనిస్వామి మరియు సెంగోట్టయ్యన్ ఇద్దరూ పోటీదారులుగా ఉన్నారు. శశికళ, టీటీవీ దినకరన్, పన్నీర్సెల్వంలను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో ఈపీఎస్తో విభేదాల కారణంగా సెంగోట్టయ్యన్ అన్నాడీఎంకేను వీడారు. పార్టీ నుండి విడిపోయిన తర్వాత, ఆయన 2025లో టీవీకేలో చేరి విజయ్కు మార్గదర్శిగా మారారు. ఈ క్రమంలోనే గోబిచెట్టిపాలయంపై అతని విజయం ఆయన శాశ్వత ప్రభావాన్ని మరోసారి బలపరిచింది. -
విజయ్కు షాక్
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న విజయ్కు షాక్ తగిలింది. టీవీకేకు ఎట్టిపరిస్థితుల్లో తాము మద్దతు ఇవ్వబోమంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ప్రకటించింది. డీఎంకే నాయకత్వం తీసుకునే నిర్ణయానికి మేం కట్టుబడి ఉంటాం అని ఆ పార్టీ అధినేత ఖాదర్ మొహిదీన్ బుధవారం ప్రకటించారు.డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్(SPA) తరఫున.. రెండు స్థానాల్లో పోటీ చేసింది. చేసిన రెండు చోట్ల విజయంతో 100 పర్సంట్ స్ట్రయిక్ రేట్ సాధించింది. పాపనాశంలో A. M. షాజహాన్, వాణియంబాడిలో సయ్యద్ ఫారూఖ్ బాషాలు విజయం సాధించారు. మరోవైపు.. డీఎంకే కూటమిలోనే ఉన్న విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) కూడా విజయ్ పార్టీకి పొత్తు ఇవ్వమని స్పష్టం చేసింది.తమిళనాడులో విజయ్ టీవీకే 108 సీట్లు గెలుపొందింది. అధికారం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది మద్దతు అవసరం. అంటే.. సంకీర్ణ ప్రభుత్వం తప్పదన్నమాట. కాంగ్రెస్(5) మద్దతు దాదాపు ఖరారు కాగా.. లెఫ్ట్ పార్టీలు(4) కూడా జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మరో స్థానం తక్కువ పడుతుండడంతో ఎవరు మద్దతుకు ముందుకు వస్తారా? అనే కుతూహలం నెలకొంది. -
ఈ వెన్నుపోటు రాజకీయమేంది?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల 2026 ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీశాయి. విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కగళం 108 స్థానాలు గెలిచింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు అవసరం పడింది. ఈ నేపథ్యంలో విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.తమిళనాడు సీనియర్ నేత, విజయ్కు కుడి భుజంగా పేరున్న సెంగొటియన్ నిన్నంతా కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి రాకూడదనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఈ తరుణంలో విజయ్ ఏర్పాటు చేయబోయే సర్కార్ మద్దతు ప్రకటించాలనే యోచనతోనే హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే ఇది మిత్రపక్షం డీఎంకేతో రాజకీయ ఘర్షణలకు కారణమయ్యేలా కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరిట డీఎంకే కూటమి పోటీ చేసింది. అయితే సీట్ల పంపకాల దగ్గరి నుంచి కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో డీఎంకేకు విబేధాలు మొదలయ్యాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఐదు చోట్ల నెగ్గింది. మరిన్ని ఎక్కువ స్థానాలు కేటాయించి ఉంటే ఎక్కువ సీట్లు గెలిచి ఉండేవాళ్లమని రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్, కాంగ్రెస్ హైకమాండ్కు నివేదించింది. ఈ నేపథ్యంలో.. నిన్న ఓటమి తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ కూటమి సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ఆ పార్టీ నేతలు విడిగా సమావేశమై టీవీకేతో జట్టు కలిసే అంశంపై చర్చించారు. ఇది డీఎంకేకు మరింత కోపం తెప్పించింది. కాంగ్రెస్ వైఖరిని వెన్నుపోటుగా అభివర్నిస్తూ డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై మండిపడ్డారు. The Backstabbers.— Saravanan Annadurai (@saravofcl) May 5, 2026No. DMK does not endorse the support of INC to TVK. It was their unilateral decision. The Backstabbers. https://t.co/DPPW3caNio— Saravanan Annadurai (@saravofcl) May 6, 2026ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకే సిద్ధమైంది. హైకమాండ్ రాష్ట్ర యూనిట్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇవాళ ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. మరోవైపు.. కాంగ్రెస్తో పాటు వామపక్షాలు కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించాయి. దీంతో ఇవాళో, రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4(సీపీఐ, సీపీఎం చెరో రెండు) కలిపితే తొమ్మిది స్థానాలు అవుతాయి. మరొక స్థానం తక్కువ అయ్యింది. డీఎంకే కూటమిలోని విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) ఎట్టి పరిస్థితుల్లో విజయ్కు మద్దతు ఇవ్వమని ప్రకటించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా పొత్తునకు ససేమీరా అనేసింది. అయితే దివంగత విజయ్కాంత్ పార్టీ డీఎండీకే మద్దతు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున 1 స్థానం గెలుచుకోగా.. విజయ్ తన బిడ్డలాంటోడంటూ విజయ్కాంత్ సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడు ఫలితాలతో డీఎంకే కుదేలు అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ప్రకటిస్తే అది మరో దెబ్బ కానుంది. -
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డీఎంకే-అన్నాడీఎంకేల మధ్య పొత్తు చర్చలు నడుస్తున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47సీట్లతో మొత్తం 106సీట్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ప్రయత్నాలు ముమ్మరం 1970ల నుంచి డీఎంకే ,అన్నా డీఎంకే మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా ఒక్కటి కానున్న బద్ధ శత్రువులు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని డీఎంకే, అన్నాడీఎంకే పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలువిజయ్కు మద్దతిచ్చేందుకు వామపక్షాల నిరాకరణమద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలుకూటమిలోనే ఉంటామని ప్రకటన ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని చెప్పిన ముస్లిం లీగ్టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్రేపు విజయ్ ప్రమాణస్వీకారం అనుమానమేప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు లభించని గవర్నర్ అనుమతిమెజార్టీపై గవర్నర్ను ఒప్పించలేకపోయిన విజయ్విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలన్న గవర్నర్ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదు : టీవీకే లోక్భవన్లో జరిగిన పరిణామాలు రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చరేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న విజయ్ తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అని అడిగిన గవర్నర్ రేపు ఉదయం 6గంటల సమయానికి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పిన టీవీకే నేతలు ప్రమాణ స్వీకారానికి అడ్డులేదని చెప్పిన టీవీకే ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?లోక్భవన్కు చేరుకున్న విజయ్ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించిన గవర్నర్ ఎల్లుండి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?గవర్నర్తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారంపై క్లారిటీ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు విజయ్కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్కాంగ్రెస్తో పాటు విజయ్కు మద్దతు ఇచ్చిన సీపీఐ,సీపీఎం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్ కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో విజయ్ భేటీపార్టీ ఆఫీస్ నుంచి లోక్ భవన్కు బయల్దేరిన విజయ్ గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాలు వివరాల్ని అందిచనున్న విజయ్ అంతకంటే ముందే తమిళనాడు ఎన్నికల సంఘం గవర్నర్ ఆర్లేకర్తో భేటీ భేటీలో గెలిచిన అభ్యర్థుల జాబితా, ఫలితాల వివరాల్ని అందించిన అధికారులు విజయ్ మరో సంచలనం?సాయంత్రం లోక్భవన్కు విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందించనున్న విజయ్గవర్నర్తో భేటీ తర్వాతే ప్రమాణస్వీకారంపై రానున్న స్పష్టతరేపు లేదా ఎల్లుండి సీఎంగా విజయ్ ప్రమాణం?విజయ్ మరో సంచలన నిర్ణయంప్రమాణ స్వీకార ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కాకుండా టీవీకే తరఫున చేయాలని నిర్ణయంఖర్చంతా భరించనున్న టీవీకే పార్టీనెహ్రూ ఇండోర్ స్టేడియంలో 5 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుసాయంత్రంకల్లా రానున్న క్లారిటీ ప్రొటెం స్పీకర్ ఎవరంటే..టీవీకే నుంచే ప్రొటెం స్పీకర్9వ సారి ఎమ్మెల్యేగా నెగ్గిన సెంగొట్టియాన్అన్నాడీఎంకేలో సుదీర్ఘ కాలం ఉన్న సెంగొట్టియాన్గతేడాది విజయ్ టీవీకేలో చేరికవిజయ్కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న సెంగొట్టియాన్ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే కూటమి పార్టీలతో చర్చలు జరిపిన సెంగొట్టియాన్ఫలించిన సెంగొట్టియాన్ దౌత్యం.. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ఇతర పార్టీలుపార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ భేటీఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న విజయ్మహాబలిపురంలోని రిసార్ట్లో బస చేసిన ఎమ్మెల్యేలుప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సమయం ఉండడంతో జాగ్రత్త పడ్డ టీవీకే అధినేతమ్యాజిక్ ఫిగర్ 118.. టీవీకే బలం 123?తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే నెగ్గిన స్థానాల సంఖ్య 108రెండు చోట్ల విజయ్ గెలుపు.. ఒక చోట రాజీనామా చేస్తే 107కాంగ్రెస్ 5 (మద్దతు ప్రకటన)సీపీఐ, సీపీఎం 2+2 (చర్చలు జరగాల్సి ఉంది.. దాదాపుగా మద్దతు ఖరారైనట్లే) ఏఎంఎంకే 1 (మద్దతు ప్రకటన)వీసీకే 2 (మద్దతు ఇవ్వబోమని తొలుత ప్రకటించారు. అయితే విజయ్ లేఖ రాశారు.. ఇంకా బదులు రావాల్సి ఉంది)పీఎంకే 4 (బదులు రావాల్సి ఉంది)అంతా సవ్యంగా సాగితే.. విజయ్ పార్టీ బలం 123కి చేరే చాన్స్తమిళనాడు రాజకీయాల్లో మరో సర్ప్రైజ్?బయటకు నుంచి టీవీకేకు మద్దతు ఇచ్చే యోచనలో అన్నాడీఎంకేఇప్పటికే అన్నాడీఎంకేలో విజయ్కు మద్దతు ఇచ్చే అంశంపై ముసలంసపోర్ట్ ఇవ్వాలని ఒక వర్గం.. ఇవ్వొద్దని మరో వర్గంఅన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలిసిన టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథవ్ అర్జునాఎన్డీయే నుంచి బయటకు వచ్చి విజయ్ టీవీకేకు మద్దతు తెలిపే అవకాశంఅదే జరిగితే అమాంతం పెరగనున్న టీవీకే బలంవిజయ్కు గవర్నర్ ఆహ్వానంతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ ఆహ్వానంసాయంత్రం గవర్నర్ను కలవనున్న విజయ్మద్దతుదారుల లిస్ట్ను గవర్నర్ను అందజేయనున్న విజయ్టీవీకే బలం 108 (విజయ్ రెండు చోట్లా పోటీ.. ఒక చోట రాజీనామా చేస్తే 107)మద్దతు ప్రకటించిన కాంగ్రెస్మద్దతు ఇచ్చిన ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యేవామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశంటీవీకేకు భేషరతుగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ముగిసిన తమిళనాడు కాంగ్రెస్ నేతల భేటీటీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసిన కాంగ్రెస్తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే కూటమి తరఫున 28 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ఐదు స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్టీవీకే మద్దతు విషయంలో డీఎంకేతో విబేధాలుపరస్పర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్-డీఎంకే నేతలుఇదీ చదవండి: డీఎంకేతో కటీఫ్.. విజయ్తో దోస్తీవిజయ్కు మద్దతు.. తప్పేంటి?: కాంగ్రెస్విజయ్కు మద్దతు విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల కోసమే డీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం: మాణిక్యం ఠాగూర్ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చారు: మాణిక్యం ఠాగూర్ప్రజల తీర్పు వైపు మేముంటే తప్పేంటి?: మాణిక్యం ఠాగూర్తమిళనాడులో ఆరెస్సెస్, బీజేపీని అడుగు పెట్టనివ్వం: మాణిక్యం ఠాగూర్టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది: కార్తీ చిదంబరంపార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించాం: కార్తీ చిదంబరంసెక్యూలర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైందని కాంగ్రెస్ భావిస్తోంది: కార్తీ చిదంబరంవిజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే మంచి ఫలితాలిస్తాయి: కార్తీ చిదంబరంఎన్నికల తర్వాత పార్టీలు కలవడం సాధారణ విషయం: ఎమ్మెల్యే రాజేష్కుమార్కూటమిలో భాగంగానే మేం పోటీ చేశాం.. స్టాలిన్ ఫేస్తో ఏం గెలవలేదు: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళ ప్రజలు మాత్రం టీవీకే విజయ్ వైపు ఉన్నారు: ఎమ్మెల్యే రాజేష్కుమార్ప్రజలు ఎటుంటే అటు ఉండడం తప్పమీ కాదు కదా: ఎమ్మెల్యే రాజేష్కుమార్తమిళనాట మరో ట్విస్ట్అన్నాడీఎంకే మద్దతు కోరే యోచనలో టీవీకే విజయ్?అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఇంటికి టీవీకే కీలక నేత పళనిస్వామితో భేటీ కానున్న అథవ్ అర్జునాటీవీకేలో టాప్ 5 కీలక నేతల్లో అథవ్ అర్జునా ఒకరుఎన్నికల్లో పని చేసిన అథవ్ అర్జునా వ్యూహాలుమద్దతుపైనే చర్చిస్తారంటున్న అన్నాడీఎంకేలోని ఓ వర్గంవిజయ్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకేనంటున్న మరో వర్గంఅన్నాడీఎంకే నుంచి టీవీకేకు టచ్లో 10 మంది ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే అత్యవసర సమావేశంఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, వామపక్ష పార్టీల మద్దతు కోరుతూ విజయ్ లేఖసాయంత్రం మద్దతుదారుల లిస్ట్తో గవర్నర్ను కలవనున్న విజయ్?తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుప్రభుత్వ ఏర్పాటునకు విజయ్ ప్రయత్నాలుతమిళనాడు కాంగ్రెస్తో పాటు చిన్న పార్టీల మద్దతు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకేలకు లేఖ రాసిన విజయ్మద్దతు తెలిపేందుకు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్(5), ఏఎంఎంకే(1)మద్దతు కోసం విజయ్ వెయింటింగ్ఈలోపే.. లోక్భవన్ నుంచి టీవీకేకు కబురుసాయంత్రంలోగా మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపనున్న టీవీకేస్వయంగా వెళ్లి సమర్పించే యోచనలో విజయ్రేపు సీఎంగా ప్రమాణం చేసే చాన్స్బలనిరూపణకు ఇప్పటికే రెండు వారాల గడువు కోరిన విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారుమధ్యాహ్నాం చెన్నైకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్సాయంత్రం టీవీకే అధినేత విజయ్కు అపాయింట్మెంట్ ఖారారు చేసిన లోక్భవన్రేపు సీఎంగా విజయ్ ప్రమాణం చేసే ఛాన్స్గవర్నర్తో భేటీ తర్వాత ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్న టీవీకేఅన్నీ కుదిరితే.. రేపు నెహ్రూ స్టేడియంలో 11.30గం.కి సీఎంగా విజయ్ ప్రమాణంవిజయ్ ఒక్కడే ప్రమాణం చేసే అవకాశంబలనిరూపణకు.. గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్విజయ్కు శ్రీలంక నేతల శుభాకాంక్షలుతమిళనాట టీవీకే ప్రభంజనంతొలి ఎన్నికల్లోనే 108 సీట్లు సాధించిన విజయ్పోటీ చేసిన రెండు చోట్లా విజయ్ విక్టరీఅభినందిస్తున్న శ్రీలంక నేతలువిజయ్ గెలుపుతో ఉత్తర ప్రావిన్స్లో తమిళ యువత సంబురాలువిజయ్కు విషెస్ తెలియజేసిన ప్రతిపక్ష నేత, ఎంపీ నమల్ రాజపక్సగతంలో.. శ్రీలంక విషయంలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించిన విజయ్శ్రీలంక తమిళుల కోసం గొంతెత్తడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యఖర్గేకు విజయ్ లేఖప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ మద్దతు కోరుతూ టీవీకే లేఖఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విజయ్సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ యూనిట్కే వదిలేసిన హైకమాండ్విజయ్ను కలిసేందుకు సమయం కోరిన కాంగ్రెస్తన కేబినెట్లో రెండు మంత్రి పదవులు కాంగ్రెస్కు!వామపక్ష పార్టీలనూ మద్దతు కోరిన విజయ్ఎల్లుండి వామపక్ష పార్టీలతో విజయ్ సమావేశంపళనిస్వామికి చుక్కలుటీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో లుకలుకలుఅన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి చుక్కలు చూపిస్తున్న చీలికలుఒక వర్గం ఇద్దామని.. మరో వర్గం ఇవ్వొద్దని వాదనలువిజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి గెలుపొందిన లీమాపళనిస్వామి నేతృత్వంలో నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకేకూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చసమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతుపై ఏమాత్రం ఆసక్తిగా లేని విజయ్గతంలో జయలలిత టైంలో విజయ్కు పలు చేదు అనుభవాలు!అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారంఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమైన పళనిస్వామి47 సీట్లతో మూడో స్థానంలో ఉన్న అన్నాడీఎంకే గవర్నర్.. చెన్నైకి వస్తారా?లోక్భవన్ పిలుపు కోసం టీవీకే ఎదురు చూపులుకేరళ, తమిళనాడుకు గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ప్రస్తుతం త్రివేండ్రంలో ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు లోక్భవన్కు సమాచారం అందించిన టీవీకే వర్గాలుఇప్పటికే బలనిరూపణకు రెండు వారాల గడువు కోరిన విజయ్మద్దతుదారుల జాబితాను లోక్భవన్కు పంపాలని ఇప్పటికే గవర్నర్ సూచనపూర్తి సమాచారం ఇచ్చాకే కమ్యూనికేట్ చేస్తామంటున్న లోక్భవన్ వర్గాలుగవర్నర్ వస్తే.. వెళ్లి కలిసే యోచనలో విజయ్ఐదు కోసం..తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే ప్రయత్నాలుమేజిక్ ఫిగర్ 118టీవీకే తరఫున నెగ్గింది 108తిరుచ్చి ఈస్ట్కి రాజీనామా చేసే యోచనలో విజయ్అదే జరిగితే 108 నుంచి 107కి పడిపోనున్న టీవీకే బలంకాంగ్రెస్, ఏఎంఎంకే సపోర్ట్తో 113కి పెరగనున్న టీవీకే బలంమరో ఐదుగురి కోసం టీవీకే ప్రయత్నాలుకాంగ్రెస్ నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీకాంగ్రెస్ వైఖరిపై డీఎంకే మండిపాటుకాంగ్రెస్ ఆ ఐదు స్థానాలు నెగ్గింది స్టాలిన్ వల్లే: డీఎంకేసీట్ల పంపకం విషయంలో డీఎంకే తప్పు చేసింది.. మరిన్ని సీట్లు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు ఇచ్చేవాళ్లం: కాంగ్రెస్కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వస్తుందా? బయటి నుంచే టీవీకేకు మద్దతు ఇస్తుందా?డీఎంకే ఇందుకు ఒప్పుకుంటుందా?డీఎంకే-కాంగ్రెస్ బంధం ముగిసినట్లేనా?అదే జరిగితే.. జాతీయ రాజకీయాల్లోనూ బలహీనపడనున్న డీఎంకే!టీవీకే ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరంతమిళనాడులో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేసిన టీవీకేమహాబలిపురంలోని ఓ రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు బసడీఎంకే కూటమిలోని పార్టీలతో టీవీకే నేత సెంగొట్టాయాన్ మంతనాలుకాంగ్రెస్ మద్దతు దాదాపు ఖరారువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు రెండు మంత్రిత్వ శాఖలకు ఇచ్చే యోచనఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్కు టీవీకే గాలంమన్నార్గుడి నుంచి నెగ్గిన కామరాజ్రేపే విజయ్ ప్రమాణం?తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి టీవీకే ముహూర్తం ఫిక్స్రేపు 11.30 ని. నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణంముహూర్తం పెట్టిన రాధన్ పండిట్నాలుగేళ్ల కిందటే విజయ్ విజయాన్ని జోస్యం చెప్పిన రాధన్తమిళనాడు గవర్నర్ కోసం ఎదురు చూపులుప్రస్తుతం కేరళం త్రివేండ్రంలో ఉన్న గవర్నర్విజయ్కు మరో షాక్ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ టీవీకేకు మద్దతు నిరాకరించిన ఐయూఎంఎల్తమిళనాడు ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గిన పార్టీడీఎంకే నాయకత్వానికే కట్టుబడి ఉంటామని వ్యాఖ్యఇప్పటికే మద్దతు ఇవ్వబోమని వీసీకే పార్టీ స్పష్టీకరణపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉: సారీ.. సపోర్ట్ ఇవ్వలేం!కాంగ్రెస్ తీరుపై డీఎంకే ఫైర్విజయ్ టీవీకేకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయంతీవ్రంగా తప్పుబడుతున్న డీఎంకేసెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్గా డీఎంకే కూటమిలో కాంగ్రెస్వెన్నుపోటు కిందకే వస్తుందంటున్న డీఎంకేఇవాళ తమిళనాడు కాంగ్రెస్ సమావేశంస్టాలిన్ నేతృత్వంలో జరిగిన నిన్నటి కూటమి మీటింగ్కు కాంగ్రెస్ డుమ్మా విజయ్ మద్దతు అంశంపై విడిగా సమావేశమైన కాంగ్రెస్నేడు మరోసారి సమావేశమై మద్దతు ప్రకటన చేసే చాన్స్సంబంధిత వార్త: కాంగ్రెస్-డీఎంకే బంధం ముగిసినట్లేనా?టచ్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు?టీవీకేకు టచ్లో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుTVKకు మద్దతు ఇస్తామంటున్న పలువురు ఎమ్మెల్యేలుఅప్రమత్తమైన అన్నాడీఎంకే అధిష్టానంనేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంచెన్నైలోని AIADMK కార్యాలయంలో సమావేశంఅన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలుగెలిచిన ఎమ్మెల్యేలందరూ రావాలని పళనిస్వామి ఆదేశంఅవసరమైతే రిసార్ట్కు తరలించే యత్నంఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలుతమిళనాడులలో ఏ పార్టీకి దక్కని మెజారిటీ(118)అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే (108)ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకేమహాబలిపురం రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇతర పార్టీల ప్రయత్నాలుచెన్నైలోనే ఉన్న 59 మంది డీఎంకే, 47 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుఇవాళ అన్నాడీఎంకే కీలక సమావేశంనేడు గవర్నర్ను కలవనున్న విజయ్?నేడు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలవనున్న టీవీకే అధినేత విజయ్ప్రస్తుతం కేరళం పర్యటనలో ఉన్న గవర్నర్నేడు మధ్యాహ్నాం చెన్నైకి చేరుకునే చాన్స్సాయంత్రంలోపు అపాయింట్మెంట్ కోరిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వివరించే అవకాశంఇప్పటికే రెండు వారాల గడువు కోరుతూ లేఖరేపు సీఎంగా నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణం?ఒకటి తక్కువైంది!ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకు వచ్చిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన తమిళగ వెట్రి కగళంమ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్విజయ్ కోరితే మద్దతు అంశం పరిశీలిస్తామన్న వామపక్షాలురెండు కలిపినా.. 9 స్థానాలేప్రభుత్వ ఏర్పాటునకు మరో సీటు తక్కువ -
‘విజయ్’భేరికి కకావికలం
తమిళనాట 2026 అసెంబ్లీ ఎన్నికలు సంచలనం సృష్టించాయి. అంచనాలను తలకిందులు చేశాయి. ‘విజయ్’భేరి ముందు దిగ్గజ పార్టీలు చిత్తయ్యాయి. రాజకీయాల్లో ఉద్దండులైన సీఎం స్టాలిన్ సహా 14 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. విజయ్ ప్రభంజనం ముందు మంత్రులే కాదు, కొన్ని పార్టీల కీలక నేతలు, హేమాహేమీలు నిలువలేకపోయారు. విజయ్ టీవీకే పార్టీ తరఫున దళితులు, దివ్యాంగులు, మహిళలు సత్తాచాటి ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని మార్పు చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించి 108 స్థానాలతో అతిపెద్ద పార్టీ గా అవతరించింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీ ల ఆధిపత్యానికి గండికొట్టింది. అభివృద్ధికి చిరునామా అయిన చెన్నై కొళత్తూరులో లేని వసతులు అంటూ లేవు. పదిహేనేళ్లుగా స్టాలిన్ ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే, ఇక్కడి ఓటర్లు తాజాగా ఆయన్ని ఓడించి, టీవీకేకు చెందిన వీఎస్ బాబును అసెంబ్లీకి పంపించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కూలిన మంత్రుల కోటలు డీఎంకే ప్రభుత్వంలోని మొత్తం 34 మంది మంత్రులలో 14 మంది ఘోరంగా ఓడిపోయారు. ఏళ్ల తరబడి తమ బలాన్ని చాటుతూ కంచు కోటలుగా నియోజకవర్గాలను మలచుకున్న సీనియర్లు విజయ్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నాయకులు, మంత్రులు దురైమురుగన్(కాటా్పడి), సుబ్రమణియన్ (సైదాపేట), అన్బిల్ మహేశ్(తిరువెరంబూరు), పళణి వేల్ త్యాగరాజన్, మూర్తి, నాజర్, స్పీకర్ అప్పావు(రాధాపురం), డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి(కీల్ పెన్నాత్తూరు) తదితరులు టీవీకే అభ్యర్థుల చేతిలో ఓటమి చెందారు.వీరిలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఎం.సుబ్రమణియన్, విద్యా మంత్రిగా అన్బిల్ మహేశ్ నిత్యం ప్రజలలోనే ఉన్నారు. తమిళనాడులో వైద్యం, విద్య బలోపేతంలో వీరి పాత్ర కీలకంగా నిలిచినా, విజయ్ ధాటికి తలవంచకతప్పని పరిస్థితి నెలకొంది. ఇక రాజకీయ ఉద్దండులైన నామ్ తమిళర్ కట్చి కనీ్వనర్ సీమాన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్, సినీ దర్శకుడు సుందర్ సీ వంటి వారు కూడా టీవీకే అభ్యర్థుల చేతిలో పరాజయం చవి చూశారు. ఒక్క ఓటుతో చేజారిన మంత్రి గెలుపు శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిన పోరులో డీఎంకే సీనియర్ నేత, మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యారు. టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో మంత్రిపై గెలిచి చరిత్ర సృష్టించారు. 212 ఓట్లతో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచి్చన మంత్రికి చివరి రౌండ్ షాక్ ఇవ్వడంతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కౌంటింగ్ సమయంలో మూడు ఈవీఎంలు మొరాయించడంతో చివరకు వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడంతో ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి గెలుపొందడం విశేషం. భారీ మెజార్టీ లూ టీవీకే కైవసం ఈసారి తమిళనాడు అసెంబ్లీలో సామాన్యుల గళం మోగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన టాప్–10 అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే, అందులో 9 మంది విజయ్ పార్టీ కి చెందిన వారే ఉండటం విశేషం. అత్యధిక మెజారిటితో గెలిచిన వారిలో తొలి స్థానంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి 98,110 ఓట్ల మెజారిటీతో నిలవగా మిగిలిన 9 మంది టీవీకేకు చెందిన వారే. ఆ తర్వాతి స్థానాల్లో షోళింగనల్లూర్ నుంచి శరవణన్ (96,780), మాధవరం నుంచి విజయ్ ప్రభు (94,985) భారీ మెజారిటీతో విక్టరీ కొట్టారు. పూందమల్లి, సేలం వెస్ట్, ఆవడి వంటి నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీ సాధించారు.టీవీకే తరఫున సామాన్యులు రాజకీయ నేపథ్యం ఉన్నవారికే కాకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకూ విజయ్ టికెట్లు కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఓ ఆటో డ్రైవర్, ఓ డ్రైవర్ కుమారుడు, దివ్యాంగులు, మహిళలు గెలవడం విశేషం. టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 35 ఏళ్లలోపు వారు 22 మందికి పైగా ఉన్నారు. గెలిచిన వారిలో 26 మంది దళిత సామాజిక వర్గానికి చెందినవారు. 13 మంది మహిళలూ ఈ సారి టీవీకే తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇక పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీవీకే అభ్యర్థులు తమ డిపాజిట్లను కాపాడుకున్నారు. టీవీకే అభ్యర్థులు 67 చోట్ల ఓడినా రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకేలు మూడో స్థానానికి పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొంగు మండలం, డెల్టా, ఉత్తర తమిళనాడుల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించినా, కేరళ– తమిళనాడు సరిహద్దుల్లోని కన్యాకుమారి జిల్లాలో ఆరు స్థానాలు ఉండగా ఒక్కచోట కూడా ఖాతా తెరవక పోవడం గమనార్హం. -
ఓట్ల తేడా 17.43 లక్షలే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ మంగళవారం స్పందించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన టీవీకేకు, డీఎంకేకి పోలైన ఓట్లలో తేడా 17.43 లక్షలు మాత్రమేనన్నారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఎన్నికల్లో డీఎంకే కూటమి 74 సీట్లు గెలుచుకోగా, ఇందులో డీఎంకేకి 59 స్థానాలు దక్కాయి. సోమవారం వెలువడిన ఫలితాలపై మంగళవారం ఎంకే స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. టీవీకే, డీఎంకే కూటమికి ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమేనన్నారు. డీఎంకే కూటమికి 1.54 కోట్ల మంది ఓటేశారని ఆ ప్రకటనలో వివరించారు. తమకు పడిన ప్రతి ఓటూ తమపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అనేక పర్యాయాలు అధికారం చేపట్టిందని గుర్తు చేస్తూ ఆయన, ‘మేం చూడని విజయం లేదు, ఎదుర్కోని ఓటమి లేదు’అని పేర్కొన్నారు. ‘గెలుపోటములను సమానంగా చూస్తూ, ఆశయ సాధన దిశగా ప్రయాణాన్ని కొనసాగించేవారే పార్టీ నిజమైన కార్యకర్తలు. ఈ ఉద్యమానికి ఆధారం, పునాదులు’అని పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. స్టాలిన్ రాజీనామా..ఆమోదం తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇన్ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు పంపించారు. సీఎం స్టాలిన్, ఆయన మంత్రివర్గం రాజీనామాలను గవర్నర్ అర్లేకర్ ఆమోదించారని అనంతరం లోక్భవన్ తెలిపింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని స్టాలిన్ను గవర్నర్ కోరారని వివరించింది. ఓటర్లకు కృతజ్ఞతగా ర్యాలీ స్టాలిన్ మంగళవారం ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కూటమి పార్టీలకు చెందిన వైగో, తదితరులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలెవరూ ఈ భేటీకి రాకపోవడం గమనార్హం. సాయంత్రం ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతగా రోడ్షో చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంకే వర్గాలు, మద్దతుదారులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయ నిధి? 59 మంది సీట్లను గెల్చుకున్న డీఎంకే అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఉదయనిధిని ప్రశ్నించగా, అధిష్టానం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తెలిపారు. -
విజయ్ పొత్తు ఎవరితో?
సాక్షి, చెన్నై: ద్రవిడ రాజకీయాలను మట్టికరిపిస్తూ జనం మద్దతుతో ప్రభంజనంలా దూసుకొచ్చిన యువనేత, టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఫోన్చేసి ప్రత్యేకంగా విజయ్ను అభినందించిన నేపథ్యంలో పొత్తుకు కాంగ్రెస్ ఆసక్తి కనబరుస్తోందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. వీటిని టీవీకే పార్టీ కొట్టిపారేయలేదు. దీంతో విజయ్ ఏ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది.వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొంది. లేఖపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీవీకే పార్టీకి గవర్నర్ రెండు ఆప్షన్లు ఇచ్చే వీలుంది.అసెంబ్లీ బలనిరూపణ చేసుకోవాలని టీవీకే చీఫ్కు గవర్నర్ సమన్లు జారీచేయొచ్చు లేదా భాగస్వామ్య పార్టీల తనకుందని నిరూపించుకుంటూ అధికారిక లేఖను సమర్పించాలని కోరవచ్చు. 118 సీట్లకంటే అధిక మెజారీటి తనకుందని విజయ్ నిరూపించునే పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణం విజయ్ను గవర్నర్ ఆహ్వానించే ఆస్కారముంది. ‘‘బయటి ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరో 6 నెలల తర్వాత కూడా విజయ్ తన బలాన్ని నిరూపించుకోవాల్సిరావొచ్చు’’అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చిన్న పార్టీలు కలిసొస్తాయా? విజయ్ రెండు చోట్ల పోటీచేసిన కారణంగా ఒక స్థానంలో రాజీనామాచేయాల్సిందే. దాంతో ఇప్పుడున్న టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 108 నుంచి 107కు తగ్గుతుంది. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గంసుగమం అయితే ఈ 107లోనే ఒకరు అసెంబ్లీ స్పీకర్ అవుతారు. అప్పుడు ఆయన బలనిరూపణ వేళ ఓటు వేయడం కుదరదు. దీంతో టీవీకే బలం 106కు తగ్గుతుంది. దీంతో బలనిరూపణ వేళ సాధారణ మెజారిటీ కోసం టీవీకేకు కనీసం మరో 12 మంది సభ్యుల మద్దతు అవసరం. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే), దేశీయ మూర్పొక్కు ద్రవిడ కళగం, బీజేపీ తలో స్థానంలో గెలిచాయి. సీపీఐ(ఎం), విదుథలై చిరుతైగల్ కట్చి, సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు తలో రెండు చోట్ల గెలిచాయి. పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) నాలుగు చోట్ల, కాంగ్రెస్ ఐదు చోట్ల గెలిచింది.ఈ తొమ్మిది పార్టీల్లో కొన్నింటితో కచ్చితంగా పొత్తు పెట్టుకుని అదనంగా 12 మంది సభ్యుల మద్దతును విజయ్ సాధించాల్సిందే. నేడు గవర్నర్ అర్లేకర్ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే చీఫ్ కోరనున్నారని తెలుస్తోంది. మద్దతుగా తన కొత్త ఎమ్మెల్యేలను వెంట తీసుకెళ్లనున్నారని సమాచారం. గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. మరోవైపు పనయూర్లోని విజయ్ ఇంటి వద్ద తమిళపోలీసులు భద్రతను పెంచారు. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్లలో విజయ్ పోటీచేసి రెండుచోట్ల నెగ్గారు. అయితే తిరుచిరాపల్లి ఈస్ట్స్థానంలో విజయ్ రాజీనామా సమర్పించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. చెన్నైలోని పెరంబర్ నుంచే విజయ్ ఎమ్మెల్యే కొనసాగే ఛాన్సుంది. టీవీకే శాసన సభాపక్ష నేతగా విజయ్ విజయ్ మంగళవారం కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా విజయ్ను టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. తర్వాత పార్టీ సైద్ధాంతిక నేతలకు విజయ్ నివాళులర్పించారు. పెరియార్ ఈవీ రామస్వామి, బీఆర్ అంబేడ్కర్, కె.కామరాజ్, వేళు నచియార్, అంజలాయ్ అమ్మళ్లకు విజయ్ నివాళులర్పించారు. ‘‘234 మంది సభ్యులుండే అసెంబ్లీలో 118 మంది మద్దతుతో మేం బలనిరూపణలో విజయం సాధించబోతున్నాం’’అని సమావేశం తర్వాత టీవీకే నేత నంజిల్ సంపత్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను చెన్నై ఈసీఆర్లోని ఓ రిసార్టుకు తరలించారు. జీవితాంతం రుణపడి ఉంటా: విజయ్ సాక్షి, చెన్నై: ఎన్నికల్లో విజయం సాధించిన సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ మంగళవారం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడులోని చిన్నవారు, యువకులు, పెద్దలు అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆయన ఎక్స్లో మంగళవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనను హేళన చేసిన వారు, చులకనగా చూసిన వారికి ప్రజలే గట్టిగా ఎన్నికల ఫలితాల రూపంలో బుద్ధి చెప్పారన్నారు. విమర్శలు, ఒడిదొడుకులు ఎన్నో ఎదురైనా, ముసుగేసుకుని కొందరు విమర్శలు చేసినా, ప్రజలు ఇచ్చిన భరోసా జీవితాంతం గుర్తుండి పోతుందని, అందుకే వారికి జీవిత కాలం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. విజయ్ మా మద్దతు కోరారు: కాంగ్రెస్న్యూఢిల్లీ: తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించినప్పటికీ సాధారణ మెజార్టీ కాస్తంత దూరంలో ఆగిపోయిన టీవీకే పార్టీ భావసారూప్య పార్టీల మద్దతు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టీవీకే చీఫ్ విజయ్ తమను సంప్రదించారని కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మాట్లాడారు. ‘‘తమిళనాడులో ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ విజయ్ మమ్మల్ని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడులో అధికారం చేజిక్కించుకునేందుకు అవకాశం ఇవ్వబోం.విజయ్ అభ్యర్థన మేరకు, తమిళ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి మేం దిశానిర్దేశం చేశాం. తమిళ ఓటర్ల సెంటిమెంట్కు విలువ ఇస్తూ స్వీయనిర్ణయం తీసుకోవాలని టీఎన్పీసీసీకి సలహాలు, సూచనలు ఇచ్చాం’’అని మీడియాతో కేసీ వేణుగోపాల్ చెప్పారు. 234 సీట్లున్న తమిళనాడులో విజయ్ పార్టీ 108 చోట్ల గెలిచింది. టీవీకేకు కనీసం 12 మంది ఎమ్మెల్యేల అదనపు మద్దతు అవసరం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఐదు చోట్ల గెల్చింది. పట్టాలి మక్కల్ కట్చి మరో నాలుగోచోట్ల, సీపీఐ, సీపీఎం చెరో రెండు చోట్ల గెలిచాయి.ఈ నాలుగు పార్టీల మద్దతుతో అంటే ఈ పార్టీల 13 మంది ఎమ్మెల్యేల మద్దతులో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని వార్తలొచ్చాయి. -
స్టాలిన్ లేటెస్ట్ రోడ్ షో..
అది ఎన్నికల ప్రచారం కాదు.. విజయోత్సవ ర్యాలీ అంతకన్నా కాదు. తాను ప్రజల మనిషినే అని చెప్పుకునే ఎంకే స్టాలిన్ ర్యాలీ అది. ఆయన ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాట ఎన్నికల్లో అటు అభ్యర్థిగానూ, ఇటు పార్టీని విజయపథంలో నడిపించడంలోనూ విఫలమయ్యారు స్టాలిన్. టీవీకే విజయ్ దెబ్బతో డీఎంకే, అన్నాడీఎంకేలు ఘోరంగా చతికిలబడ్డాయి. ఇది స్టాలిన్ కలలో కూడా ఊహించి ఉండరు. కచ్చితంగా గెలుస్తామని, అటు సర్వేలు కూడా డీఎంకేకు పట్టం కట్టిన వైనం. అయితే ‘ఛేంజ్’ చేసేశారు ప్రజలు. తమ ఓటుతో విజయ్కు జైకొట్టారు. ఇదిలా ఉంచితే,. ఎవరైనా ఓడిపోతే పూర్తిగా చతికిలబడిపోయి కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం ఆవుతారు. కానీ స్టాలిన్ అలా చేయలేదు. ఓడిపోయిన రెండో రోజే రోడ్ షో పేరుతో ప్రజల ముందుకు వచ్చారు స్టాలిన్. తనను ఓడించిన కొళత్తూరు ప్రజల ముందుకే వచ్చి.. అభివాదం చేశారు. ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ) స్టాలిన్ తాను పరాజయం పాలైన కొళత్తూరులో పర్యటించారు. తాను ఓడిపోయిన చాయలు ముఖంలో కనిపిస్తున్నప్పటికీ స్టాలిన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనను ఓడించిన ప్రజలను కలవాలని ఇలా రోడ్ షోలో పాల్గొన్నారా.. లేక తనకు ఓట్లు వేసిన జనానికి ఒకసారి రోడ్ షో రూపంలో థాంక్స్ చెబుదామనుకున్నారో కానీ ‘మీతోనే ఉంటానని, మీ వాడిగానే ఉంటాననేది’ ఆయన ముఖంలో మాత్రం కనిపించింది. கொளத்தூருக்கும் எனக்குமான உறவு தேர்தல் வெற்றி, தோல்விகளைக் கடந்த உறவு.15 ஆண்டுகாலம் எனக்கு ஆதரவு நல்கியவர்கள் கொளத்தூர் தொகுதி மக்கள். அதில், 10 ஆண்டுகள் எதிர்க்கட்சி வரிசையில் இருந்தும், 5 ஆண்டுகள் ஆளும்கட்சியாகவும் என்னால் இயன்ற அனைத்துத் திட்டங்களையும் கொளத்தூருக்குக் கொண்டு… pic.twitter.com/xtXB8p6ChR— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 5, 2026 #WATCH चेन्नई: डीएमके प्रमुख और तमिलनाडु के निवर्तमान सीएम एम.के. स्टालिन कोलाथुर विधानसभा क्षेत्र पहुंचे। राज्य के पूर्व मंत्री पीके सेकर बाबू भावुक हुए। pic.twitter.com/SB6vkKYbnh— ANI_HindiNews (@AHindinews) May 5, 2026 -
థ్యాంక్యూ మోదీజీ: విజయ్
సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో విజయ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.ప్రధాని మోదీ ట్వీట్కు టీవీకే చీఫ్ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మా ఏకైక లక్క్ష్యం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాం. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. Thank you, Hon'ble @PMOIndia, for your greetings. The well-being of our people remains our only goal. Transcending politics, we shall focus on the State's progress and the welfare of people of Tamil Nadu. We look forward to the Union Government’s support in this endeavor. https://t.co/EO4h8qC0hF— TVK Vijay (@TVKVijayHQ) May 5, 2026 -
సింగిల్ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్ టాపిక్గా విజయ్ ఆస్తి
సాక్షి, చెన్నై: తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, ఆ పార్టీ వ్యవస్థాపకుడు,అధినేత సి. జోసెఫ్ విజయ్ 'జన నాయగన్' (Jana Nayagan)గా సీఎం పీఠం అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శాసనపక్ష నేతగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజయ్ ఆస్తులు, ఆర్థిక వివరాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 2026 మార్చి 30న భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 27 పేజీల అఫిడవిట్లో సమర్పించిన వివరాలు విశేషంగా నిలుస్తున్నాయి.దీని ప్రకారం విజయ్ ప్రకటించిన నికర విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ. 404 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 220 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు; ఈ ఆదాయం స్వయం ఉపాధి, అద్దె ఆదాయం , వడ్డీ ఆదాయం ద్వారా సమకూరింది.ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి నాలుగు బకాయి డిమాండ్లు పెండింగ్లో ఉండగా, వాటి మొత్తం విలువ రూ. 3 కోట్లకు పైగా ఉంది. ఒకే సేవింగ్స్ ఖాతాలో రూ. 213 కోట్లు విజయ్ పేర్కొన్న అఫిడవిట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మార్చి 27, 2026 నాటికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సాలిగ్రామం శాఖలోని ఒకే ఒక పొదుపు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉండటం. ఇది ఏదో ఒక నిర్దిష్ట పెట్టుబడి పథకం గానీ, మార్కెట్తో అనుసంధానమైన ఉత్పత్తి గానీ కాదు; కేవలం ఒక సాధారణ పొదుపు ఖాతా మాత్రమే. ఆయన ప్రకటించిన మొత్తం నికర విలువలో మూడో వంతుకు పైగా వాటా ఈ ఖాతాదే కావడం విశేషం.స్థిర డిపాజిట్లు (Fixed Deposits): నాలుగు బ్యాంకుల్లో కలిపి రూ. 100 కోట్లుAxis Bank : ఇందిరా నగర్ శాఖ : రూ. 40 కోట్లుIndian Overseas Bank, కోడంబాక్కం శాఖ : రూ. 25 కోట్లుHDFC Bank, బసంత నగర్ శా ఖ: రూ. 20 కోట్లుState Bank of India, శాస్త్రి నగర్ శాఖ : రూ. 15 కోట్లుIOB పొదుపు ఖాతాలోని నిల్వను కూడా కలిపి చూస్తే, ఆయన ప్రకటించిన సంపదలో రూ. 313 కోట్లకు పైగా మొత్తం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉంది. ఇవి ఎటువంటి మార్కెట్ రిస్క్ లేని, హామీతో కూడిన రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు.ఈక్విటీలో షేర్ల విలువ రూ. 19.37 లక్షలుస్టాక్ మార్కెట్లో ఆయన పెట్టుబడులు చాలా స్వల్పంగా ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఆర్కైవ్ చేసిన అఫిడవిట్ ప్రకారం, జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్లో రూ. 19.03 లక్షల విలువైన షేర్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో రూ. 9,600 విలువైన షేర్లు, మరియు సన్ పేపర్ మిల్ లిమిటెడ్లో రూ. 25,000 విలువైన షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీటి మొత్తం ఈక్విటీ వాటా రూ. 19.37 లక్షలు, ఇది ఆయన ప్రకటించిన నికర ఆస్తి విలువలో 0.04 శాతం కంటే తక్కువ. ఎలాంటి మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా డిబెంచర్లను ప్రకటించలేదు.స్థిరాస్తులు: విజయ్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్థిరాస్తులు విలువ రూ. 220 కోట్లు. ఇవి నాలుగు వర్గాలలో విస్తరించి ఉన్నాయి. నీలన్కరై, సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మోర్ , సమీప ప్రాంతాలలో ఉన్న నివాస ఆస్తులు, వీటి విలువ పది ఆస్తులలో సుమారుగా రూ. 115 కోట్లు.పరివక్కం, త్యాగరాయ నగర్, షోలింగనల్లూర్ మరియు కొప్పూర్లలో ఉన్న వాణిజ్య ఆస్తులు, వీటి విలువ సుమారుగా రూ. 82.8 కోట్లు. అతిపెద్ద ఏకైక వాణిజ్య ఆస్తి కొప్పూర్ గ్రామంలోని 2.30 ఎకరాల భూమి ఉంది. దీన్ని 2023లో నవంబర్ 2023లో రూ. 35.81 కోట్లకు కొనుగోలు చేశారు.పోరూర్, సాలిగ్రామం మరియు నీలన్కరైలలోని వ్యవసాయేతర భూమి విలువ రూ. 22 కోట్లు. ఒక్క ఆయన పోరూర్ ప్లాట్ మాత్రమే 33,955 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.కొడైకనాల్లోని విల్పట్టి గ్రామంలో ఉన్న 0.25 ఎకరాల చొప్పున రెండు వ్యవసాయ ప్లాట్లను 1997లో ఒక్కొక్కటి రూ. 15,000కు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఒక్కొక్కటి రూ. 10 లక్షలుగా ప్రకటించారు.ఇదీ చదవండి : విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?ఈ ఆస్తుల నుండి వచ్చే అద్దె ఆదాయాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్రియాశీల ఆదాయ వనరుగా ప్రకటించారు. విజయ్ తన వ్యక్తిగత ఆస్తులకు అతీతంగా, అధికారిక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అయిన జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా అఫిడవిట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్ : ఫ్యాషన్ వరల్డ్ షాక్! అదిరిపోయే వాహనాలు: విజయ్ గ్యారేజ్లో కొలువు దీరిని లగ్జరీ కార్ల విలువ రూ. 13.52 కోట్లకు పైమాటే.2024 Toyota Lexus 350: రూ. 3.01 కోట్లు2015 Tata Caravan: రూ. 6 కోట్లు2024 BMW i7: రూ. 2 కోట్లు2014 Toyota Vellfire: రూ. 1.63 కోట్లు2020 BMW 530: రూ. 80.54 లక్షలు2024 Maruti Swift: రూ. 5.35 లక్షలు2025 TVS XL Super: రూ. 67,400ఆభరణాలు: విజయ్ వ్యక్తిగతంగా 883 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 1.20 కోట్లు) మరియు రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులను ప్రకటించారు. ఆయన సతీమణి సంగీత, విడిగా 3,132 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 4.07 కోట్లు), 2 కిలోల వెండిని (విలువ రూ. 4.75 లక్షలు), మరియు 134.91 క్యారెట్ల వజ్రాలను (విలువ రూ. 1 కోటి) ప్రకటించారు.ఇవి కాకుండా రుణాలు ,అడ్వాన్సుల రూపంలో : రూ. 75.5 కోట్లున్నాయని ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే!సంగీత ఆస్తులు రూ. 15.76 కోట్లువిజయ్ భార్య( విడాకుల కేసు పెండింగ్లో ఉంది) సంగీత విజయ్ తన మొత్తం ఆస్తులను రూ. 15.76 కోట్లుగా విడిగా ప్రకటించారు. ఇందులో రూ. 15.51 కోట్ల చరాస్తులు (HDFC బ్యాంక్, బసంత నగర్ శాఖలో ఉన్న రూ. 10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ మరియు రూ. 43.41 లక్షల పొదుపు నిల్వతో కలిపి) , రూ. 25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా -
TVK Vijay: ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం
-
విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళనాట నటుడు, టీవీకే అధినేత విజయ్ సంచలనం విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన స్టార్ పవర్తోపాటు, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాడు. కానీ ఇంతకుముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని విజయ్ ముందు సవాళ్లు ఏంటి? పరిపాలన ఎంత విజయవంతంగా నిర్వహించగలడు? అనేది ప్రధాన చర్చ. అధికార పగ్గాలను చేపట్టిన తరువాత హామీలను నెరవేర్చడం తక్షణ ఆర్థిక సవాల్. విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలి ఏడాదిలోనే అదనంగా రూ. 42,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి.విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలంటే మొదటి ఏడాదిలోనే సుమారు రూ. 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి రూ. 1.22 లక్షల కోట్లు (GSDPలో 3శాతం) ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారనుంది.రూ. 42,000 కోట్ల అదనపు భారంమహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను విజయ్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. విజయ్ ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా? లేదా అప్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే దీనికి కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆర్థిక భారం తక్కువగానే ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.మరీ ముఖ్యంగాప్రధానంగా మహిళలకు నెలవారీ సహాయాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంపు. దీని వల్ల ఏటా అదనంగా రూ. 21,617 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల మొత్తం వ్యయం రూ. 36,029 కోట్లకు చేరుతుంది.వృద్ధాప్య పింఛన్ను రూ. 1,200 నుండి రూ. 3,000కి పెంచడం వల్ల రూ. 6,549 కోట్ల అదనపు భారం పడుతుంది. విడో పెన్షన్ల కోసం రూ. 1,829 కోట్లు, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 504 కోట్లు అదనంగా అవసరం. ఏడాదికి 6 ఉచిత LPG సిలిండర్ల హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 7,074 కోట్ల భారం పడుతుంది. ఇక రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 15,000 సాయం కింద (కేంద్రం ఇచ్చే రూ. 6,000 కాకుండా) రాష్ట్రం అదనంగా రూ. 1,941 కోట్లు భరించాలి. అలాగు కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కోసం మరో రూ. 382 కోట్లు అవసరం.పరిమిత ప్రభావంమరోవైపు కొన్ని పథకాల వల్ల ఆర్థిక భారం పరిమితంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివాహ పథకాల కింద సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 8 గ్రాముల బంగారం సహాయం అందిస్తోంది. అంటే విజయ్ ప్రకటించిన పెళ్లిచేసుకునే యువతులకు ప్రకటించిన 8 గ్రాముల బంగారం, పట్టుచీర వల్ల అదనపు ఖర్చుల భారం పెద్దగా ఉండక పోవచ్చు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకాప్రతిపాదిత నిరుద్యోగ భృతి,గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.3,000, కఠినమైన అర్హత నిబంధనలను కొనసాగిస్తే, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా భారం పడకపోవచ్చు. కఠినమైన ఆదాయ పరిమితులతో ఉన్న ప్రస్తుత పథకానికి కేవలం రూ.2.37 కోట్ల వ్యయం మాత్రమే కాగా, దీనిని విస్తరించినా కూడా వ్యయం రూ.16 కోట్లలోపే ఉండవచ్చు.తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే దేశ సగటు సామాజిక వ్యయం 42 శాతంగా ఉంటే, తమిళనాడులో ఇది 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 34 శాతానికి పడి పోయింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం తన సొంత పన్ను రాబడి వ్యయాన్ని మెరుగు పరుచుకున్నప్పటికీ, దాని కట్టుదిట్టమైన వ్యయం (వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు) 35 శాతంతో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. కాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) 2026 తమిళనాడు ఎన్నికలలో తొలిసారిగా ఘన విజయం సాధించింది. బూటకపు పార్టీ, పొలిటికల్ డ్రామా ఆడుతున్న సినిమా స్టార్ అన్న వెక్కిరింపులకు ధీటుగా రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! -
విజయ్ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీని వెనక మరో వ్యూహం ఉండొచ్చనే చర్చా జోరందుకుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్ల విక్టరీతో సంచలన విజయం నమోదు చేసింది తెలిసిందే. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీకి టీవీకే దగ్గర్లోనే ఆగిపోయింది. అయినప్పటికీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్ తమిళనాడు గవర్నర్ను కోరారు. ఆ వెంటనే.. నెగ్గిన వాళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి రప్పించిన ఆయన.. అటు నుంచి అటే పూంజేరీలోని ఓ స్టార్ హోటల్కు తరలించాలని నిర్ణయించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే వాళ్లకు బస ఏర్పాటు చేయాలని పార్టీ కీలక నేతలను ఆయన ఆదేశించారు. అయితే..విజయ్ మాస్టర్ ప్లాన్?టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఒకట్రెండు సీట్లు నెగ్గిన పార్టీలు విజయ్ పార్టీతో అధికారంలో భాగమయ్యేందుకు ముందుకు వచ్చాయి. మద్దతు అంశం పరిశీలిస్తామని బహిరంగంగా ప్రకటనలు సైతం చేస్తున్నాయి. అయితే ఆయన ఈ విషయంలో ఆచితూచీ అడుగేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే పూర్తిగా ఆయన నిర్ణయమేనని.. అందులో తమ పాత్ర ఏదీ ఉండబోదని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. రెండు వారాల గడువు కోరడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది. ఈలోపు సమీకరణాలు ఎలాగైనా మారొచ్చని ఆయన లెక్కేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పటికైనా రిస్క్ ఉండొచ్చు. అందుకే పెద్ద చేపలకే ఆయన గాలం వేసి ఉంటారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్లో డీఎంకే లేదంటే అన్నాడీఎంకే నుంచి పలువురు బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించే అవకాశం లేకపోలేదు(అసలే అన్నాడీఎంకేలో ఆ అసంతృప్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది). ఇందుకు అవకాశం ఉండడంతోనే.. డీఎంకే, అన్నాడీఎంకేలు అప్రమత్తం అయ్యాయి. ఇవాళ చెన్నైలో ఆ పార్టీలు కీలక సమావేశాలు పెట్టుకున్నాయి. ఎమ్మెల్యేలంతా చెన్నైకు తరలి రావాలని ఆదేశించాయి. అటు నుంచి అటే వాళ్లను కూడా రిసార్ట్లకు తరలించవచ్చనే చర్చా అక్కడ జోరందుకుంది. మొత్తానికి విజయ్ మాస్టర్ స్ట్రోక్కు తమిళనాట దిగ్గజ పార్టీలు విలవిలలాడిపోతున్నాయి. -
CM పదవికి స్టాలిన్ రాజీనామా.. గవర్నర్ కు లేఖ
-
ఒక్క ఓటు.. ఎంత పని చేసింది?
టీవీకే అధినేత విజయ్ ఒక పొలిటీషియన్గా కంటే నటుడిగా సందేశాత్మక చిత్రాల ద్వారానే తమిళ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తమిళన్, తుపాకీ, సర్కార్, మెర్సల్, బిగిల్ ఇలా.. ఆయన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ కనిపిస్తుంటుంది. అయితే ఇందులో మురగదాస్ డైరెక్షన్లో వచ్చిన సర్కార్లో ఓటు అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధమో అనేది చూపించారు. ఆ చిత్రంలో ఓటు హక్కు దుర్వినియోగం అయిన బాధితుడిగా కోర్టులో తన కేసు తానే వాదించుకుంటారు విజయ్. వాజ్పేయి సర్కార్ కూలిపోవడం దగ్గరి నుంచి.. ఒక్క ఓటు ప్రాధాన్యం కూడా ఆయన ఆ సీన్లో వివరిస్తారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపట్టూరు(185వ) నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే అభ్యర్థి.. మంత్రి పెరియాకరుప్పన్పై ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ విజయం ఈ ఎన్నికల ఫలితాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. అయితే.. ఈ ఒక్క చోటుకి కారణమైన వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. విజయ్ వీరాభిమాని అయిన మణికందన్ ఒమన్(మస్కట్)లో పని చేస్తున్నాడు. సుమారు 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చి టీవీకే అభ్యర్థికి ఓటేశాడు. ఈ విషయాన్నే నిన్న ఎన్నికల ఫలితం తర్వాత తన సోషల్ మీడియాలో అతను షేర్ చేసుకుని మురిసిపోయాడు. అంతేకాదు.. ఓటేయడానికి వచ్చే విషయాన్ని కూడా అతను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. అంతే.. ఒక్క ఓటు పవర్ ఏంటో తెలిసిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. Booked my flight ticket to vote for TVK. Awake and hopeful — lots of prayers that the survey turns true on May 4th— Manikandan Sivanantham (@mkxuv700) April 15, 2026 -
సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో టీవీకే ఇతర పార్టీలతో కీలక మంతనాలు జరుపుతోంది. మరోవైపు దారుణ పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. ఓటమిపై స్పందించిన స్టాలిన్.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను ఇక మీదట డీఎంకే సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఘోర ఓటమి పాలైంది. కేవలం 59 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గారు. కొలతూర్లో డీఎంకే అధినేత స్టాలిన్ సహా మంత్రులంతా దాదాపుగా ఓటమి పాలయ్యారు. చెపాక్లో డిప్యూటీ సీఎం, ఆయన తనయుడు ఉదయనిధి మాత్రం నెగ్గారు. ఇవాళ స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశం జరగనుంది. ఓటమిపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే ప్రతిపక్ష నేతగా స్టాలిన్ తనయుడు ఉదయనిధిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చదివిన కాలేజీలోనే ఎమ్మెల్యే విన్నింగ్ సర్టిఫికెట్ తీసుకున్న TVK విజయ్
-
టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నిక
తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ టీవీకే. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు అడుగు దూరంలోనే ఆగిపోయింది. సరిపడా మెజారిటీ లేకపోవడంతో.. ఏం జరగనుంది? అనే ఉత్కంఠ నెలకొంది. తమిళనాట టీవీకే విజయ్ ప్రభంజనం.. లైవ్ అప్డేట్స్టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్తమిళనాడులో కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఐదు ప్రభు త్వ ఏర్పాటుకు మద్దతు కోరిన టీవీకేఅందుకు చర్చలు జరిపి ఓకే తెలిపిన కాంగ్రెస్మోదీ ట్వీట్కు దన్యవాదాలు తెలిపిన విజయ్ఇతర పార్టీలతో టీవీకే చర్చలురేపు గవర్నర్ను కలవనున్న టీవీకే చీఫ్ విజయ్మద్దతు కోసం ఇతర పార్టీలతో టీవీకే చర్చలుతమ పార్టీ నుంచి గెలిచిన వారిని రిసార్టుకు తరలింపు7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం?టీవీకే తరఫున ఎన్నికైన నేతలతో ముగిసిన విజయ్ భేటీ ఈ నెల 7న సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం? టీవీకే శాసనసభా పక్ష నేతగా విజయ్ ఎన్నికఎన్నికైన నేతలతో చర్చించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు స్టాలిన్ రాజీనామాను ఆమోదించిన తమిళనాడు గవర్నర్ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్తెరపైకి రిసార్ట్ రాజకీయంతమిళనాడులో మరోసారి తెర మీదకు రిసార్ట్ రాజకీయంమల్లాపురంలోకి రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేల తరలింపుప్రభుత్వ ఏర్పాటునకు సమయం పట్టేలా ఉండడంతో ఈ నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే బసమరోవైపు.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్అప్రమత్తమైన డీఎంకే, అన్నాడీఎంకేవెంటనే చెన్నైకి రావాలంటూ ఇరు పార్టీల నెగ్గిన అభ్యర్థులకు పిలుపుసమావేశాల తర్వాత.. రిసార్టులకు వాళ్లనూ తరలించే చాన్స్విజయ్ విక్టరీపై ప్రేమలత విజయ్కాంత్ ఆసక్తికర వ్యాఖ్యలువిజయ్ మా బిడ్డలాంటోడుఅందుకే ఆయన్ని ఏనాడూ విమర్శించలేదుమొదటి నుంచి ఆయన కెప్టెన్(విజయ్కాంత్)తో ఉన్నారువిజయ్ చక్కగా పాలించాలితమిళనాడు ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచిన డీఎండీకేటీవీకే ఫ్లోర్ లీడర్గా విజయ్!టీవీకే ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న విజయ్ భేటీఫ్లోర్ లీడర్గా విజయ్ ఎన్నికఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన స్థానాలపై చర్చతమిళనాట ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేకీలకంగా మారిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇతర చిన్న పార్టీలువిజయ్ వదులుకునేది ఆ స్థానాన్నే?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయంపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్పెరంబూర్ (Perambur)లో 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విజయ్తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) నియోజకవర్గంలో 27,416 ఓట్ల మెజారిటీతో విజయంరెండింటిలో ఏదో ఒకదానిని వదులుకోవాల్సిన పరిస్థితితిరుచ్చి ఈస్ట్ను వదులుకునే యోచనలో విజయ్?విజయ్ వదులుకుంటే ఎవరు పోటీ చేస్తారా? అనే ఉత్కంఠటీవీకే ఆఫీస్లో విజయ్తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే108 స్థానాల్లో విజయ్ పార్టీ విక్టరీపోటీ చేసిన రెండు చోట్లా నెగ్గిన విజయ్నెగ్గిన ఎమ్మెల్యేలతో టీవీకే ఆఫీస్లో విజయ్ భేటీ (106+విజయ్+విజయ్)ప్రభుత్వ ఏర్పాటునకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభంఇవాళ అన్నాడీంకే కీలక సమావేశంతమిళనాడు ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకేనేడు పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ కీలక సమావేశంగెలిచిన ఎమ్మెల్యేలు చెన్నైకి రావాలని పళని పిలుపుటీవీకే కీలక ప్రకటనప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై వస్తున్న రూమర్లకు టీవీకే చెక్నిన్న.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న టీవీకేఇవాళ.. జట్టు కట్టవచ్చనే సంకేతాలుఏ పార్టీతో జత కట్టాలనేది అధినేత విజయే నిర్ణయిస్తారని టీవీకే కీలక నేతల వ్యాఖ్యఇప్పటికే సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలుప్రభుత్వ ఏర్పాటులో.. ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2లు కూడా కలిసొచ్చే అవకాశంకొనసాగుతున్న టీవీకే కీలక సమావేశంఎమ్మెల్యేలతో విజయ్ భేటీమరికాసేపట్లో స్పష్టత వచ్చే చాన్స్ఇప్పటికే.. ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ను రెండు వారాల గడువు కోరిన విజయ్స్టాలిన్ రాజీనామాతమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామారాజీనామా లేఖను గవర్నర్కు పంపిన డీఎంకే అధినేతఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్కు లేఖ రాసిన టీవీకే అధినేత విజయ్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరిన విజయ్ఓటమిపై స్పందిస్తూ ప్రజా తీర్పును శిరసావహిస్తానని స్టాలిన్ ప్రకటనప్రధాన ప్రతిపక్షం బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడితమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికొలతూర్లో ఓడిన ఎంకే స్టాలిన్కాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ను ఎన్నుకునే అవకాశం టీవీకే ఆఫీస్కు విజయ్టీవీకే ప్రదాన కార్యాలయానికి చేరుకున్న అధినేత విజయ్మరికాసేపట్లో గెలిచిన 108 ఎమ్మెల్యేలతో సమావేశంశాసనసభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశంప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలుకాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకునే చాన్స్?ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడుపు కోరిన విజయ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్ల దూరంవిజయ్ ఆహ్వానిస్తే మద్దతిస్తాంతమిళనాట శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలుతమిళనాడు ఎన్నికల్లో చెరో రెండు సీట్లు నెగ్గిన వామపక్ష పార్టీలుసీపీఐ రెండు, సీపీఎం 2ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యానికి లెఫ్ట్ పార్టీల ఆసక్తివిజయ్ ఆహ్వానిస్తే మద్దతు గురించి చర్చిస్తామంటున్న వామపక్షాలుఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్ సంప్రదింపులుడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ!తమిళనాట 108 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేఅధికారానికి మరో 10 సీట్ల దూరంలో విజయ్ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న చిన్నపార్టీల లెక్కలుకీలకంగా ఆ పార్టీలు?తమిళనాడు లో సంకీర్ణ ప్రభుత్వం, ఏ పార్టీ కు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వని తమిళ ప్రజలు108 అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీవీకే డీఎంకే 59, ఏ. ఐ.డి.ఏం కే 47 సీట్లు లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు గాను 10 సీట్లు దూరంలో టివికేరెండు వారాల్లో ప్రభుత్వం ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరిన విజయ్ గడువులోగా మెజారిటీ నిరూపించుకునేందుకు సిద్ధం అంటూ లేఖకీలకంగా మారిన తమిళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుతమినాడు లో కాంగ్రెస్ 5 స్థానాలు, పి.ఏం.కే 4, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలుఇవిగాక.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2, వీసీకే 2, డీఎండీకే 1, అమ్మ మక్కల్ పార్టీ 1 స్థానాలుఒకే ఒక్క స్థానంలో నెగ్గిన బీజేపీ 1కీలకంగా మారిన కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్ష పార్టీలుఏం తేలుస్తారో?టీవీకే ప్రధాన కార్యాలయం పనయూరు వద్ద విజయ్ అభిమానులు సందడితమిళనాడు నలుమూలలా నుంచి తరలి వస్తున్న టీవీకే నాయకులు, కార్యకర్తలు, విజయ్ వీరాభిమానులుఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయం కు రానున్న టివికే అధినేత విజయ్టివికే గెలుపొందిన ఎమ్మెల్యేలు తో భేటీ కానున్న విజయ్విజయ్ వెంట ఎవరెవరు?ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయంలార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకేమ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంవిజయ్ వెంట కలిసొచ్చేది ఎవరనే ఉత్కంఠఅన్నాడీఎంకేనా?.. కాంగ్రెస్సా? చిన్నపార్టీల కూటమా? అనే విశ్లేషణలునేడు గవర్నర్ను కలవనున్న విజయ్ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు కోరే అవకాశం!ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి!తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధి స్టాలిన్ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్న డీఎంకేమరికాసేపట్లో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే సమావేశంకొళత్తూర్లో ఓటమి పాలైన ఎంకే స్టాలిన్చెపాక్లో తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ విజయంప్రజా తీర్పును శిరసావహిస్తామని.. ప్రతిపక్షంగా పోరాడతామని ప్రకటించిన స్టాలిన్కాంగ్రెస్తో సెంగోట్టయన్ చర్చలు!తమిళనాట మారుతున్న రాజకీయ సమీకరణాలువిజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు?ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన హస్తం పార్టీకాంగ్రెస్తో టీవీకే నేత, మాజీ మంత్రి సెంగోటియన్ చర్చలుఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన విజయ్లోక్భవన్కు విజయ్?తమిళనాడు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన టీవీకే అధినేత విజయ్టీవీకే ప్రధాన కార్యాలయంలో నెగ్గిన ఎమ్మెల్యేలతో మీటింగ్శాసనసభ పక్ష నేతను ఎనుకోనున్న టీవీకేసమావేశం తర్వాత నేరుగా లోక్భవన్కు దళపతి?ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసే అవకాశంతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గిన టీవీకేతమిళనాడులో హంగ్మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తక్కువ!ఇప్పటికే మద్దతు కూడకట్టుకున్న విజయ్?మరికొద్ది గంటల్లో వీడనున్న ఉత్కంఠనేడు టీవీకే కీలక సమావేశంవిజయ్ నేతృత్వంలో టీవీకే కీలక సమావేశంనెగ్గిన 108 మంది ఎమ్మెల్యేలను మీటింగ్కు ఆహ్వానించిన విజయ్ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై చర్చించే అవకాశంఈ సమావేశం తర్వాతే కీలక నిర్ణయం ప్రకటించనున్న విజయ్విజయ్ నివాసం వద్ద కోలాహలంచెన్నైలోని విజయ్ నివాసం వద్ద కోలాహలంభారీగా పోలీసు భద్రత ఏర్పాటువిజయ్ నివాసం బయట భారీగా చేరిన టీవీకే శ్రేణులు, ఆయన అభిమానులుమరోవైపు.. విజయ్ ఇంటికి క్యూ కడుతున్న ప్రముఖులువిజయ్కు రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువటీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న పలు పార్టీలుమొదలైన సంప్రదింపులుతమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలుఇప్పటికే అత్యధిక సీట్లు నెగ్గిన టీవీకే పార్టీతో మొదలైన సంప్రదింపులుఅందరినీ కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు?ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుపీఎంకే నుంచి మరో నలుగురువామపక్షాల సంఖ్య 2,ఐయూఎంఎల్ 2విజయ్ ఎవరి మద్దతు తీసుకుంటాడా? అనే ఉత్కంఠఅన్నాడీఎంకే మద్దతు ఇస్తుందా? అనే చర్చమరో 10 సీట్ల దూరంలో.. ఉత్కంఠగా తమిళనాడు రాజకీయంసింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే234 స్థానాల్లో 108 స్థానాల్లో టీవీకే విజయండీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలుపుమ్యాజిక్ ఫిగర్ 118 ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మరో 10 మంది సభ్యులు అవసరంపూర్తి కథనం కోసం క్లిక్ చేయండి👉.. విజయ్ ముందు ఆరు ఆప్షన్లు! ఇవిగో..ఓటమిపై స్పందించిన స్టాలిన్ప్రజల తీర్పును శిరసావహిస్తాం: స్టాలిన్ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడతాం: స్టాలిన్ఫలితాల వేళ.. అభివాదం చేసే టైంలో భావోద్వేగానికి గురైన స్టాలిన్దాదాపుగా కంటతడి పెట్టినంత పని చేసిన డీఎంకే అధినేతకొలతూర్లో స్టాలిన్ ఓటమిస్టాలిన్ను 7 వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన టీవీకే అభ్యర్థి బాబు విక్టరీ అనంతరం ‘ఫినిష్’ సంజ్ఞతో స్టాలిన్ను ఎద్దేవా చేసిన బాబువిజయహో..మార్పు నినాదంతో.. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను చావు దెబ్బ కొట్టిన విజయ్తమిళనాట అత్యధిక సీట్లు నెగ్గిన పార్టీగా తమిళగ వెట్రి కగళండీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించిన టీవీకేతొలి ఎన్నికల్లోనే తమిళనాడులో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా రికార్డు234 స్థానాల్లో పోటీ చేసి.. 108 స్థానాల్లో నెగ్గిన టీవీకే పోటీ చేసిన రెండు చోట్ల నెగ్గిన టీవీకే అధినేత విజయ్డీఎంకే కూటమి దారుణ ఓటమిడీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఓటమిమొత్తం మంత్రులంతా ఓటమిమూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే కూటమిమ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో తమిళనాడు అసెంబ్లీలో హంగ్తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో విజయ్ -
ఆరు ఆప్షన్లు.. ఏది జరిగినా విజయ్ సర్కార్కు లైన్క్లియర్!
తమిళనాట దళపతి విజయ్ అపూర్వ విజయం గురించి దేశం మొత్తం చర్చ నడుస్తోంది. ఒక నటుడిగా రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అత్యధిక సీట్లు నెగ్గి ప్రభంజం సృష్టించారాయన. అలాగే ఒంటరి పోరుతోనే అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఫలితాల్లో హంగ్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ తమిళగ వెట్రి కగళం పార్టీ తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమి 74, అన్నాడీఎంకే కూటమి 52 సీట్లు నెగ్గింది. డీఎంకే కూటమిలో డీఎంకే 59, కాంగ్రెస్ 5, వామపక్షాలు 2, వీసీకే 2, ఇతర మిత్రపక్షాలు 4 ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకే 47, పీఎంకే 4, బీజేపీ 2 నెగ్గారు. మొత్తం 234 సీట్లు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే మరో 10 సీట్ల దూరంలో టీవీకే నిలిచింది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు ఎలా చేయనుందా? అనే చర్చ మొదలైంది. విజయ్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. మొదటి మార్గం.. ఎన్డీయే కూటమితో చేతులు కలపడం. సంఖ్యాపరంగా ఇది సులభమైనది, ఎందుకంటే రెండు పార్టీల కలయికతో మెజారిటీ వెంటనే వస్తుంది. కానీ బీజేపీతో అన్నాడీఎంకేకు ఉన్న సంబంధం విజయ్కు ఇమేజ్ సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఆయన బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించారు కాబట్టి. రెండో మార్గం.. అన్నాడీఎంకేతోనే జట్టు కట్టడం. కానీ బీజేపీని వదిలేసి!. ఇది విజయ్కు క్లీన్ రూట్ ఇస్తుంది. యాంటీ-బీజేపీ వైఖరిని కొనసాగిస్తూనే.. ఇటు అన్నాడీఎంకే బేస్ను విజయ్ పొందగలరు. అయితే, ఎన్డీయే నుంచి బయటకు రావడం అన్నాడీఎంకేకు జాతీయ స్థాయిలో ప్రభావం చూపే కఠిన నిర్ణయం అవుతుంది.మూడో మార్గం.. చిన్న పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడడం. తద్వారా విజయ్ తన స్వతంత్రతను నిలబెట్టుకుంటారు. “క్లీన్ బ్రేక్” ఇమేజ్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి ప్రభుత్వం బలహీనంగా ఉంటుంది. చిన్న పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉండి.. స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుంది.నాలుగో మార్గం.. కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వడం. కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇవ్వడం. తద్వారా విజయ్కు మెజారిటీ వస్తుంది. అలాగే బీజేపీతోనూ విజయ్కు దూరం కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి రావొచ్చు.ఐదవ మార్గం.. రెయిన్బో కూటమి. చిన్న పార్టీలతో కలసి, అన్నాడీఎంకే లేదంటే కాంగ్రెస్ బయట మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది విజయ్ స్వతంత్రతను నిలబెట్టుకునే మార్గం. కానీ ఇది కూడా సంక్లిష్టమైన కూటమి అవుతుంది, ఇలాంటి ప్రభుత్వ నిర్వహణ కష్టతరంగా మారుతుంది.ఆరో మార్గం.. డీఎంకే మద్దతు పొందడం. ఇది అక్కడి రాజకీయాల్లో కలలో కూడా జరగని పరిణామమే అవుతుంది. విజయ్ మొదటి నుంచి డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించారు. కాబట్టి డీఎంకే మద్ధతు ప్రజల్లో ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసే చాన్స్ ఉంది. అయినప్పటికీ హంగ్ అసెంబ్లీ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యమైన కలయికలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విజయ్ నేతృత్వంలో టీవీకే నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. నెగ్గిన అభ్యర్థులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారాయన. పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
అయ్యో ‘బాబు’!
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం అసలు ఫలించలేదు. పైగా ఆయన ప్రచారం చేసిన చోటల్లా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. కోయంబత్తూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నాలుగింటిలో బీజేపీ, అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతలు పోటీ చేశారు. వీరికి మద్దతుగా సీఎం చంద్రబాబు ప్రచారం చేసినా ఫలితం శూన్యం. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ గెలుపొందగా ఎన్డీఏ కూటమికి చెందిన అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా మూడోస్థానానికి పరిమితం కావడం గమనార్హం. పొల్లాచ్చిలో వి.జయరామన్ 2వ స్థానానికి పరిమితమయ్యారు. చెన్నై అన్నానగర్లో అన్నాడీఎంకే అభ్యర్థి గోకుల ఇందిర, సాత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్కు మద్దతుగా చంద్రబాబు రోడ్షోలు నిర్వహించారు. ఈ రెండుచోట్ల ఎన్డీఏ అభ్యర్థులకు ఓటమితప్పలేదు. ఇదిలా ఉంటే ఆవడిలో బీజేపీ అభ్యర్థి అశి్వన్కుమార్కు మద్దతుగా టీడీపీ కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని ప్రచారం చేసినా ప్రజలు తిరస్కరించారు. -
ఓటర్లు చాటుతున్నదేమిటి?
ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమిళ హీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. బెంగాల్లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. కేరళలో యూడీఎఫ్ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్ అయినా, బెంగాల్లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -
‘అన్నా.. గెలిచాం’.. కేకేఆర్ క్రికెటర్ పోస్టు వైరల్!
సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయినప్పటికీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ను అభినందిస్తూ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో సూపర్స్టార్ రజనీకాంత్తో పాటు విజయ్ అంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నాడు. కాగా విజయ్కి వీరాభిమాని కావడంతో ఈ కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ విజయ్కి అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా తన అభిమాన హీరోతో కలిసి దిగిన పాత ఫోటోను షేర్ చేసుకున్న వరుణ్ చక్రవర్తి ‘అన్నా.. గెలిచాం’ అంటూ ఎమోజీతో కూడిన సింబల్ను పంచుకున్నాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తి ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సీజన్లో ఏడు మ్యాచ్లాడిన వరుణ్ చక్రవర్తి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో దారుణ ప్రదర్శన కనబరిచిన కేకేఆర్ రెండో అంచె పోటీల్లో మాత్రం వరుస విజయాలతో అదరగొడుతుంది. లేట్గా ఫామ్లోకి వచ్చిన రింకూ సింగ్ తన ఫినిషింగ్ టచ్తో కేకేఆర్కు రెండు విజయాలు సాధించి పెట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలు, 5 ఓటములు, ఒక మ్యాచ్ రద్దుతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరో 5 మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో అన్నింటా గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడినా కేకేఆర్ ప్లేఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతాయి. కేకేఆర్ తమ తర్వాతి మ్యాచ్ల్లో రెండుసార్లు ఢిల్లీ క్యాపిటల్స్తో, ఆర్సీబీతో, గుజరాత్తో, ముంబైతో ఆడాల్సి ఉంది.ఇక వరుణ్ చక్రవర్తి దేశవాలీ క్రికెట్లో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తుండడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. టీమిండియా తరఫున 4 వన్డేల్లో 10 వికెట్లు, 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 91 మ్యాచ్లాడిన వరుణ్ చక్రవర్తి 110 వికెట్లు తీశాడు.చదవండి: విజయ్ గెలుపును ముందే ఊహించిన స్టార్ క్రికెటర్! -
తమిళనాడులో టీవీకే విజయ్ సంచలనం
సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకే ఘనవిజయం సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది. పార్టీ ఇప్పటికే 18 స్థానాల్లో గెలిచి, మరో 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం సమయంలో టీవీకే ఆధిక్యం తగ్గినా, కొద్ది సేపట్లోనే తిరిగి బలంగా ముందంజ వేసి డీఎంకే, ఏడీఎంకేలను దాటేసింది.టీవీకే అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేసి, రెండింటిలోనూ విజయం సాధించారు. విజయ్ పార్టీ ఈసారి ఎలాంటి కూటములు లేకుండా, ఒంటరిగా అన్ని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికలు టీవీకే, డీఎంకే, బీజేపీ మధ్య త్రిముఖ పోటీగా మారాయి.విజయ్ రాజకీయ ప్రవేశం విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెటట్రి కజగంను ప్రారంభించారు. ఎన్నికల సంఘం ఈ పార్టీని 2024 సెప్టెంబర్ 8న అధికారికంగా నమోదు చేసింది. ప్రారంభం నుంచే విజయ్ తన పార్టీని ఆధునిక ద్రావిడ సిద్ధాంతాలపై నిలబెట్టారు. దుష్ట శక్తి, అవినీతి శక్తికి ఎదురు నిలిచే ధైర్యం తన పార్టీకి మాత్రమే ఉందని ఆయన ప్రకటించారు.విజయ్ తన విజయాన్ని ఎంజీఆర్ తరహాలో రాయాలని, ఈ ఏడాదే అధికారంలోకి రావాలని సంకల్పించారు. ఆయన డీఎంకేను దుష్ట శక్తిగా, బీజేపీని సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా అభివర్ణించారు.పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. సాయంత్రం 6.00 గంటల వరకు టీవీకే 111 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 71 స్థానాల్లో, ఏడీఎంకే 52 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118. -
తమిళనాడులో ఎవరెన్ని ఓట్లు సాధించారంటే..!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల నడుమ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందా.. లేదా అనే దానిపై విపరీతమైన ఆసక్తి చోటు చేసుకుంది. ప్రధానంగా టీవీకే ఎన్ని సీట్లు సాధిస్తుందనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ వందకుపైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం. ఉదయం నుంచి 100 నుంచి 107 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కొనసాగుతోంది. అదే సమయంలో విజయ్ పార్టీ చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 చోట్ల 500 ఓట్ల మెజార్టీతో, 12 స్థానాల్లో రెండు వేల మెజార్టీతో విజయ్ పార్టీ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విజయ్ వంద సీట్ల మార్క్కు ఏమీ ఢోకా ఉండదు.. కానీ ప్రభుత్వాన్ని సింగిల్గా ఏర్పాటు చేయడం మాత్రం కష్టమవడం ఖాయం. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చినా అది ఎంతవరకూ సరిపోతుంది అనే దానిపై చర్చ నడుస్తోంది. దాంతో మరొక పెద్ద పార్టీతో టీవీకేకు పొత్తు అనివార్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉంచితే, తమిళనాడులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్ని బట్టి.. విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు 1.28 కోట్లు. దాంతో విజయ్ పార్టీ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో కొనసాగడానికి కారణమైంది. ఇక స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూడా విజయ్ పార్టీకి చాలా దగ్గరగానే వచ్చింది. డీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.17 కోట్లు, కాగా డీఎంకే ఒంటరిగా సాధించిన ఓట్లు 83 లక్షలు. ఇక మూడో స్థానంలో కొనసాగుతున్న ఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు 1.08 కోట్లు, కాగా ఒంటరిగా ఆ పార్టీ 77 లక్షలు సాధించింది. పుంజుకున్న డీఎంకే..!కౌంటింగ్ ఆరంభమైనప్పటినుంచీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ మూడో స్థానంలో కొనసాగిన డీఎంకే.. అటు తర్వాత మెల్లగా పుంజుకుంది. తొలుత 50 సీట్లనైనా డీఎంకే గెలుస్తుందా అనే దిశ నుంచి 77 సీట్ల ఆధిక్యంలోకి డీఎంకే వచ్చింది. అంటే డీఎంకే బాగా పుంజుకుని విజయ్ పార్టీ ఊపుకు కాస్త అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం ఇంకా కొంటింగ్ జరుగుతున్న క్రమంలో డీఎంకే మరిన్ని సీట్లను గెలుచుకుని విజయ్ ఆధిక్యాన్ని తగ్గించవచ్చే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారుగా డీఎంకే ఓట్ల షేర్ అంతా కూడా టీవీకే షిప్ట్ అవడమే విజయ్ అనూహ్య ఫలితాలకు కారణమైంది. విజయ్ టీవీకే పార్టీకి ఏకధాటి ఊపు ఇవ్వకుండా డీఎంకే ఎంతో కొంత మెరుగైన ఫలితాల దిశగానే ముందుకెళుతుందనే చెప్పాలి. విజయ్ పార్టీ ఒక సీటు ఆధిక్యం తగ్గుతుంటే అదే సమయంలో డీఎంకే ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. ఇది కాస్త సస్పెన్స్ను కూడా క్రియేట్ చేస్తోంది. సీఎం స్టాలిన్ కొళత్తూర్ నుంచి ఓడి పోవడం ఆ పార్టీకి కాస్త ఎదురుదెబ్బ మినహా పుంజుకున్న తీరు.. టీవీకే ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటు చేయడాన్ని క్లిష్టం చేస్తోంది. -
సీఎం స్టాలిన్ పరాజయం.. ఎవరా? టీవీకే గెలుపు గుర్రం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్కు బిగ్షాక్ తగిలింది. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం సాధించారు. తమిళనాడులోని అత్యంత కీలకమైన నియోజకవర్గాలలో కొళత్తూరు ఒకటి. ఇది సీఎం ఎంకే స్టాలిన్ కంచుకోటగా ప్రసిద్ధి చెందింది. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో (2011, 2016, 2021) ఆయన ఇక్కడ గెలుపొందారు. ఈసారి మాత్రం అంచనాలు తలకిందులయ్యాయి. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు విజయం సాధించారు. ఈ ఫలితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోటీ చేసిన తొలిసారి ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం మరో విశేషం. మధ్యాహ్నం 4.15 గంటల వరకు టీవీకే 105 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో అధికార డీఎంకే 76 స్థానాల్లో, ఏడీఎంకే 53 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 118.టీవీకే విజయానికి యువ ఓటర్ల మద్దతు, అధికార వ్యతిరేక భావజాలం, బలమైన గ్రామీణ స్థాయి ప్రచారం కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫలితం తమిళనాడులో దీర్ఘకాలిక రాజకీయ దిశలో కీలక మార్పును సూచిస్తోంది. -
LIVE : దూసుకుపోతున్న విజయ్
-
టీవీకే చీఫ్ విజయ్కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: తమిళనాడులో అనూహ్య ఫలితాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీవీకే చీఫ్ విజయ్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. సోదరుడు విజయ్కు అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజాజీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న విజయ్కు మరింత మంచి జరగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.బెంగాల్లో బీజీపీకి వైఎస్ జగన్ అభినందనలుపశ్చిమబెంగాల్లో టీఎంసీ ఓటమి పట్ల వైఎస్ జగన్ సానుభూతి తెలియజేశారు. దీదీ(మమతా బెనర్జీ) ప్రభుత్వం ఓటమి పట్ల సానుభూతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. పశ్చిమ బెంగాల్ అతిపెద్దగా పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీకి అభినందనలు తెలిపారు. అలాగే అక్కడ గెలిచిన ఇతర అభ్యర్థులకు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you. My sympathies are with Didi.…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2026 -
తమిళనాడు ఫలితాలు.. పవన్ ఫీలవుతాడా?
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళంలో యూడీఎఫ్ గెలుపు కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్లు డీఎంకేని గెలిపించ లేకపోవడం తండ్రి కొడుకుల పాలనపై ప్రజల అసమ్మతికి నిదర్శనంగా అది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్లకు ఆందోళన కలిగించే విషయం అవుతుంది. కాగా ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా విజయం వైపు దూసుకు వెళుతూండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొంత ఇబ్బందికరం అవుతుంది. ఇకపై పవన్ను అందరూ విజయ్తో పోల్చడం.. అతడి విజయం.. ఈతడి ధోరణిపై ప్రశ్నలూ తలెత్తుతాయి. తమిళ ఎన్నికల ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్కూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసినా ఎన్డీయేని గెలిపించలేకపోయారని, అదే సమయంలో కొన్ని సభల్లో జగన్ ఫొటోను ప్రదర్శించిన టీవీకే పార్టీ నేత విజయ్ గెలుపు బాటలో ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.జగన్ మాదిరిగా విజయ్ కూడా ఒంటరిగా పోటీలోకి దిగడం ఇంకో సారూప్యత. గట్టిగా కృషి చేస్తే పశ్చిమబెంగాల్లో మాదిరిగా తామూ గెలిచే అవకాశం ఉందన్న ఆశ ఈ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి కలిగిస్తాయి. అదే టైమ్ లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల ద్వారా తన వ్యూహాలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ గెలుపు అన్నది ఊహించిందే. పశ్చిమబెంగాల్ లో పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత, ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ హడావుడి తర్వాత అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.ఈ వ్యూహాలను గుర్తించి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కాని ఆ వైపు ఆలోచించి ఉంటే ఎలా ఉండేదో! కేరళంలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు ఛాన్స్ ఉందని ఊహించిన పరిణామమే. కాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే తిరిగి వస్తుందన్న అంచనాకు తగినట్లే జరిగింది. అన్నిటికన్నా సంచలనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీచేసి డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కు నెట్టేయడం. అందరి సలహాలను కాదని విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం ఒక రకంగా సాహసమే.దేశ రాజకీయాలలో బీజేపీ హవా కొనసాగే విధంగానే ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. మోడీ, అమిత్ షా ల కాంబినేషన్ కు ఇప్పట్లో తిరుగులేదన్న అభిప్రాయం కలుగుతుంది. కేరళంలో కూడా బీజేపీ తన వంతు ప్రయత్నం చేసినా, వారికి ఓట్లశాతం పెరుగుతుందే తప్ప సీట్లు పెద్దగా రావని అందరికి తెలుసు. దేశంలో ఉన్న ఏకైక వామపక్ష రాష్ట్రం కేరళంలో ఈసారి సీపీఎం ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోవడం వామపక్షవాదులకు నిరాశ కలిగిస్తుంది. అక్కడ గెలిచిన యూడీఎఫ్ వల్ల కాంగ్రెస్ ఆశలు కొద్దిగా చిగురిస్తాయి. కాని తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే పరాజయం చవిచూడడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది.పశ్చిమబెంగాల్లో మూడు టర్మ్లుగా అధికారంలో ఎన్న టీఎంసీపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప.బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఎన్నికల సంఘం తన వంతు పాత్ర పోషించడం వంటివి కూడా కలిసిరావడంతో బీజేపీ కల నిజమవుతోందని చెప్పాలి. ఎంత పోరాడినా మమత బెనర్జీ ఆమె పార్టీ చివరికి ఓడిపోక తప్పలేదు. ఏపీలో జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ సొంత అజెండా అనేది ఏదీ లేకుండా.. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.విజయ్కు ఉన్న ధైర్యం పవన్కు లేకుండా పోయిందని, సీఎంను అవుతానంటూ కాపు సామాజికవర్గాన్ని ఊరించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబుకు అతి విధేయుడుగా మారిపోవడం ఆ వర్గానికి అంతగా రుచించడం లేదు. పైగా ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లు టీడీపీని భుజాన మోస్తానని చెబుతున్న వైనం మద్దతుదారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చవు. పైకి బీజేపీని అభినందించినా, లోపల మనసులో మాత్రం బీజేపీ బెంగాల్ ఓడిపోయి ఉంటే,తమ ప్రాధాన్యత పెరిగి ఉండేదని టీడీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను మరింతగా పొగడక తప్పదని లోలోపల మథన డుతూండవచ్చు. మరో కీలకమైన అంశం ఏమిటంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిలు ఏపీలో మాదిరి రెడ్బుక్ అరాచకాలు చేయకపోయినా డీఎంకే ఓటమిపాలైంది. ఒక రకంగా ఆలోచిస్తే జనం కుటుంబ పాలనను వ్యతిరేకించారన్నమాట. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారు. పాలనా వైఫల్యంతో చంద్రబాబు ఉంటే, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ షాడో సీఎంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ అంటూ పోలీసులతో అరాచకాలు చేయిస్తున్నారు. అలాగే అత్యంత విలువైన విశాఖ భూములను తమ ఇష్టారీతిన 99 పైసలకే కట్టబెడుతున్న తీరుపై టీడీపీ వీర మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి ఎ బి వెంకటేశ్వరరావు వంటివారు మండిపడుతున్నారు.అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై అంతా విస్తుపోతున్నారు. స్టాలిన్, ఉదయనిధిలు అరాచకాలు, విపక్షంపై వేధింపులు వంటివి చేయకపోయినా ఓటమిపాలయ్యారని, అలాంటిది ఏపీలో ఇంత దారుణమైన పరిస్తితులు ఉంటే జనం సహిస్తారా అన్నది చర్చగా ఉంది. అంతేకాక వచ్చే మూడేళ్లలో తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ వంటివారిని ఇంతకాలం దూరంగా ఉంచిన నేపథ్యంలో టీడీపీని మళ్లీ నందమూరి వంశం అధీనంలోకి తీసుకురావాలని ఒక వేళ ఆయన ఆలోచన చేస్తే రాజకీయాలు ఎటు మళ్లుతాయో ఇప్పటికిప్పుడు ఊహింలేం.కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్కు ఉత్సాహం రావచ్చు.కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. కాని బెంగాల్ లో విజయంతో బీజేపీ తెలంగాణలో ఏ గేమ్ ఆడుతుందో అన్న భయం ఉండవచ్చు. తమిళనాడు ఫలితాలు మాత్రం చంద్రబాబు, లోకేశ్ లకు నిద్ర లేకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరీ అంత సీరియస్ రాజకీయాలు చేయడం లేదు కనుక, సొంత వ్యక్తిత్వంతో రాజకీయ పార్టని నడపాలన్న లక్ష్యంతో లేరు కనుక ఆయన పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. జగన్ కు మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దళపతి విజయ్ ఇంటికి చేరుకున్న హీరోయిన్
-
ఏం చేస్తాడులే అన్నారు... ఇప్పుడు చరిత్రను తిరగరాశాడు
-
ఊహించని మలుపు తమిళనాడు 'కింగ్'గా విజయ్..
-
గెలిచిన ఆనందం... TVK విజయ్ ఇంట్లో సంబరాలు..
-
విజయ్ గెలుపు వెనుక రహస్యం? టీవీకే సక్సెస్ పై అనలిస్ట్ కామెంట్స్
-
చరిత్రను తిరగరాశాడు... సీఎంగా విజయ్...
-
దూసుకుపోతున్న విజయ్
-
విజయ్ విజిల్ మోత తమిళనాడు అదుర్స్
-
DMK పార్టీ ఆఫీస్ వద్ద టెంట్లు పీకేస్తున్న కార్యకర్తలు
-
విజయ్ అనే నేను!
-
ట్రెండ్ సృష్టిస్తున్న టీవీకే
-
TVK విజయ్ ప్రభంజనం
-
ఎవరి జెండా మోయకుండా.. ఏ పొత్తు లేకుండా!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ‘విజిల్’ మోత దేశం మొత్తం మారుమోగుతోంది. విజయ్ మేనియా ధాటికి అధికార ప్రతిపక్ష పార్టీల కూటములు విలవిలలాడిపోయాయి. గత ఐదు దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను.. వాటి కూటముల్ని వెనక్కి నెట్టేసి రెండేళ్ల పసికూన పార్టీ టీవీకే అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది.తమిళనాట టీవీకే ప్రభంజనం కొనసాగుతోంది. ప్రధానంగా ఆ పార్టీ దెబ్బకు అధికార డీఎంకేకు మాస్టర్ స్ట్రోక్ తగిలింది. డీఎంకే ప్రధాన అభ్యర్థులంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. సంబురాల కోసం వేసిన టెంట్లు కూడా తీసేసి వెళ్లిపోయారంటే ఏ రేంజ్లో నైరాశ్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే రెండో స్థానానికి పరిమితమయ్యే చాన్స్ కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో ద్రవిడ సిద్ధాంతాన్ని తిరస్కరించిన తమిళ ఓటర్లు విజయ్ పార్టీ టీవీకే ఇచ్చిన ‘మార్పు’ అనే నినాదానికి పట్టం కట్టారు.తమిళనాట అగ్రనటుడిగా విజయ్ తెలుగువాళ్లకూ సుపరిచితుడే. 2009లో ఏర్పడిన తన విజయ్ మక్కల్ ఇయ్యక్కం అనే ఫ్యాన్స్ అసోషియేషన్ను.. 2014లో ఫిబ్రవరి 2వ తేదీన తమిళగ వెట్రి కగళం అనే పార్టీగా ఏర్పాటు చేశారు విజయ్. 2026 ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యమని ఆనాడే ఆయన ప్రకటించారు. జట్టుగా వచ్చే పార్టీలకు అధికారంలో వాటా సైతం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారాయన. ఈ ప్రకటనలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. రెండేళ్లలో ఈ పవర్ మ్యాజిక్ సాధ్యమయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. దానికి తగ్గట్లే తాను ఏ పార్టీ జెండా మోయబోమని.. సింహం సింగిల్గానే పోటీ చేస్తుందని ప్రకటనలు ఇచ్చుకుంటూ వచ్చారాయన. ఈ ప్రకటన రాజకీయ వర్గాలను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఒంటరి పోరుతో విజయ్ ఏం సాధించలేడని తేల్చి చెప్పాయి. అదే సమయంలో విజయ్ మీద ఆన్లైన్లో ట్రోలింగ్ కూడా పెరిగింది. ఈలోపు విజయ్ ఎన్నికల ర్యాలీలో భాగంగా కరూర్లో జరిగిన తొక్కిసలాట.. ఆపై సీబీఐ దర్యాప్తు.. దీనిని ఆసరగా చేసుకుని తమ కూటముల్లో చేరాలని జాతీయపార్టీల నుంచి ఒత్తిళ్లు.. చివరి సినిమా జన నాయగన్ రిలీజ్ ఆగిపోవడం(సెన్సార్ ఇబ్బందులు).. వ్యక్తిగత జీవితం రచ్చకెక్కడం.. ఇవన్నీ దళపతిని కుంగదీయడం ఖాయమని అంతా భావించారు. అయితే.. విజయ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొన్నారు. విమర్శలు, ఒత్తిళ్లు తాను చూసుకుంటానని.. మీరు గెలుపు మీదే దృష్టి సారించాలని కేడర్కు బలం అందించారు. యువత, మహిళలను ఎక్కువగా ఆకట్టకునేలా ఎన్నికల హామీలిచ్చారు. ఫలితంగా.. ఏ కూటమితో జట్టు కట్టకుండా.. ఒంటరిగా అన్నీ స్థానాల్లోనూ పోటీ చేసిన విజయ్కు అత్యధిక స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టారు తమిళనాడు ఓటర్లు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తమిళనాట తలకిందులైన లెక్కలు
తమిళనాడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అనూహ్యంగా టీవీకే ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. డీఎంకేను దాటి దూసుపోతుంది. తమిళనాడులో టీవీకే ముందంజ ఉండగా, రెండో స్థానంలో డీఎంకే, మూడో స్థానానికి అన్నాడీఎంకే పరిమితమైంది. తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. లీడింగ్లో టీవీకే విజయ్ పార్టీ దూసుకుపోతుంది.విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. టీవీకే విజయ్కు తమిళ ఓటర్లు జైకొట్టారు. హంగ్ వస్తే టీవీకే-అన్నాడీఎంకే జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి.మరోవైపు, ముందస్తుగా అప్రమత్తమైన విజయ్ పార్టీ.. తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరతీసిన సంగతి తెలిసిందే. మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ‘గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు’ అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
తమిళనాడులో TVK విజయ్ ముందంజ
-
మొదలైన తమిళనాడు కౌంటింగ్
-
నేడే కౌంటింగ్.. అందరి చూపు బెంగాల్ పైనే!
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నిక్షిప్తమైన ప్రజాతీర్పు సోమవారం బహిర్గతం కానుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజాతీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, సోమవారమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరికి లాభమో? పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా శ్రమించింది. ఈసారి బెంగాల్లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డుస్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూత్ల్లో శనివారం రీపోలింగ్ చేపట్టగా, 87 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గెలుపు తమదేనని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార తృణమూల్ కాంగ్రెస్దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటుచేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలే ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్కతాలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాపరింగ్కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. తమిళనాడులో విజయం విజయ్దేనా?తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పటా్నయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్పోల్స్ స్పష్టంచేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. అస్సాంలో 258 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించగా, 85.96 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం గమనార్హం. అధికార ఎన్డీయేలో బీజేపీతోపాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో రాయ్జోర్ దళ్, ఏజేపీ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఏపీహెచ్ఎల్సీ తదితర పార్టీలు ఉన్నాయి. కేరళలో వామపక్షాలకు చేదు అనుభవమే! కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్లో 79.63 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్పై యూడీఎఫ్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెల్చుకోవడం ఖాయమని ఎన్డీయే విశ్వాసం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే! కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలున్నాయి. – సాక్షి, నేషనల్æడెస్క్2 -
విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..!
చెన్నై: విమానం నుంచి దూకడం అంటే అది నిజంగా చాలా ప్రమాదకరమైన చర్య. అయినప్పటికీ, ప్రపంచంలో కొన్ని అరుదైన సంఘటనల్లో ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తెరిచి బయటకు దూకిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అస్వస్థతకు గురైన ఆ ప్రయాణికుడు.. ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందికి దూకేశాడు. ఈరోజు(ఆదివారం, మే 3వ తేదీస్త్ర తెల్లవారుజామున ఎయిర్ అరేబియా విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. ఇలా రెండుసార్లు వాంతులు చేసుకున్న తర్వాత భయపడి పోయిన సదరు ప్రయాణికుడు.. అత్యవసర ద్వారం ఓపెన్ చేసి అక్కడ నుంచి కిందకు దూకేశాడు. విమానం ల్యాండ్ అయ్యి టాక్సీవేపై కదులుతున్న సమయంలో కాబట్టి ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు విమానాశ్రయ అదికారులు తెలిపారు. ఆ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే స్వల్పంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అతనికి ప్రాథమిక చికత్స అందించారు. ఈ ఘటనతో ప్రధాన రన్వే ఒక గంట పాటు మూసేశారు. కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ప్రయాణికుడు విమానంలో రెండు సార్లు వాంతులు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇది అతని మానసిక, శారీరక స్థితి ప్రభావం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే, సాధారణంగా బలమైన లాకింగ్ సిస్టమ్ ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు ఎలా తెరవగలిగాడు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. భద్రతా లోపాలు ఉన్నాయా? అనే కోణంతో పాటు ప్రయాణికుడి మానసిక స్థితిని పరీక్షీస్తున్నారు. -
విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి
-
స్టాలిన్కు షాకిస్తూ.. విజయ్పై పొగడ్తల వర్షం!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డీఎంకే, అన్నాడీఎంకే, ఈ మధ్యలో టీవీకే.. ఎవరికి వారే అధికారం తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ముందస్తుగా క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.విజయ్ టీవీకే పార్టీపై స్టాలిన్ మిత్రుడు, ఎండీఎంకే(Marumalarchi Dravida Munnetra Kazhagam) అధినేత వైకో ప్రశంసలు గుప్పించారు. విజయ్ ఈ ఎన్నికల్లో మ్యాజిక్ చేసే అవకాశం లేకపోలేదని అన్నారాయన. ‘‘టీవీకే తమిళ రాజకీయాల్లో ఓ శక్తిగా అవతరించింది. రాబోయే రోజుల్లో ఇక్కడి రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపగలదు. ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం లేకపోలేదు’’ అని వైకో అభిప్రాయపడ్డారు.ఈ సందర్భగా విజయ్కు ఉన్న ప్రజాదరణను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. యువత, మహిళలు, ముఖ్యంగా ఫస్ట్టైమ్ ఓటర్లలో విజయ్కి అశేష అభిమానులు ఉన్నారని చెప్పారు. అదే సమయంలో.. ద్రవిడ ఉద్యమం తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత శక్తిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించారు వైకో. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్తో చేతులు కలిపి పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు సీట్లు కేటాయించగా.. అందులో మూడు సీట్లను డీఎంకే గుర్తు(ఉదయించే సూర్యుడు), మరో అభ్యర్థిని స్వంత గుర్తుతో వైకో బరిలోకి దించారు. ఇదిలా ఉంటే..ఎన్నికల అరంగేట్రంలోనే టీవీకే గణనీయమైన ప్రభావం చూపవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మిగతా సర్వేలు డబుల్ డిజిట్ రావొచ్చని అంచనా వేస్తుంటే.. యాక్సిస్ మై ఇండియా (Axis My India) ఎగ్జిట్ పోల్స్ మాత్రం 98–120 సీట్లు గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంటుందని తెలిపింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇప్పుడు అధికార మిత్రకూటమి సీనియర్ నేత వైకో ప్రశంసలు గుప్పించడంతో విజయ్ అభిమానులు ఉబ్బితబ్బిబైపోతున్నారు.ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు పోలింగ్లో 85.1% ఓటింగ్ నమోదైంది. అయితే.. యువత, కొత్త ఓటర్ల భాగస్వామ్యం పెరగడం TVKకి అనుకూలంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.తమిళనాడులో విజయ్కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ పీక్స్లో ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, యువతను ఆకర్షించే వాగ్దానాలు చేయడం ఆయనకు అదనపు బలం ఇస్తున్నాయి. విద్యార్థులకు స్టైపెండ్లు, స్టార్టప్ రుణాలు, మత్తు పదార్థాల రహిత రాష్ట్రం వంటి హామీలు ఆయన ప్రచారంలో ప్రధానంగా నిలిచాయి.డీఎంకే ఆధ్వర్యంలోని కూటమి రెండోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇదే ఖరారు చేశాయి. మరోవైపు అన్నాడీఎంకే వరుస ఓటముల తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ తన తొలి ఎన్నికలోనే అన్నాదురై, ఎంజీఆర్ల విజయదుందుభి మోగించవచ్చనే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
టీవీకే పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టిన దుండగులు
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికారం పీఠం దక్కించుకోబోతోందన్న వార్తల మధ్య . నటుడు విజయ్ పార్టీ టీవీకే ఆఫీసుకు నిప్పు పెట్టారన్న వార్త సంచలనంగా మారింది. తిరుచిలోని టీవీకే కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారని న్యూస్18 నివేదిక తెలిపింది. శ్రీరంగం నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యాలయంగా ఉపయోగిస్తున్న ఈ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం.ఈ అగ్నిప్రమాదంలో కార్యాలయం పూర్తిగా కాలిపోయిందని, ఓటర్ల జాబితాలు, పత్రాలు, బ్యానర్లు, రోజువారీ ఎన్నికల కార్య కలాపాలకు ఉపయోగించే పరికరాలు వంటి కీలకమైన ప్రచార సామగ్రి నాశనమైనట్టు తెలుస్తోంది. శ్రీరంగం నియోజకవర్గం టీవీకే అభ్యర్థి రమేష్, గుర్తు తెలియని వ్యక్తులు తన ఎన్నికల కార్యాలయానికి నిప్పు పెట్టారని, దీంతో కార్యాలయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో తగిన భద్రత కల్పించాలని కోరారు.Tamil Nadu | An election office belonging to TVK candidate Ramesh was allegedly set on fire by unidentified persons earlier today in Pettavaythalai area under Andhanallur Union, Srirangam Assembly constituency. A formal complaint has been lodged at the local police station by…— ANI (@ANI) May 1, 2026 కాగా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా జరిగి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. ఈ ఫలితాల్లో డీఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ సునామీ తథ్యమని జోస్యం చెప్పింది. -
సైన్ లాంగ్వేజ్ ఇకపై సులభం!
చెవిటి, మూగ వారి భాష సంజ్ఞలు మాత్రమే. వీటిని కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల వారు సమాజంలో అన్ని చోట్లా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికోసమే సంజ్ఞల భాషను.. మాటల్లోకి మార్చే ఏఐ మోడల్ను రూపొందించింది 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రియాంజలి గుప్తా (Priyanjali Gupta). టెన్సర్ఫ్లో పైథాన్ ను ఉపయోగించి, అమెరికన్ సైన్ లాంగ్వేజ్ని తక్షణమే ఇంగ్లీష్ పదాలుగా మార్చే సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేసింది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ సాంకేతికతలను దివ్యాంగులకు మరింత దగ్గర చేయడంలో ఇది ఒక కీలక అడుగుగా మారనుంది...తమిళనాడుకు చెందిన ప్రియాంజాలి గుప్తా వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె వెబ్క్యామ్, ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి, సంజ్ఞలను గుర్తించి.. వాటిని తక్షణమే పదాలుగా మార్చే సాఫ్ట్వేర్ను రూపొందించింది. సంజ్ఞల భాషను అందరూ అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద, కష్టమైన సమస్య అని ప్రియాంజలికి ఉన్న బలమైన నమ్మకం. ఒక చిన్న స్థాయి సాఫ్ట్వేర్ దీనిని పరిష్కరించలేదని ఆమె ఆలోచన. సైన్ లాంగ్వేజ్లో ముఖ కవళికలు, భుజాల కదలికలతోపాటు మరిన్ని అంశాలు ఉంటాయని.. వాటన్నింటినీ అర్థం చేసుకోవడానికి చాలా బాగా శిక్షణపొందిన ఒక నెట్వర్క్ అవసరమని ఆమె భావించింది. అందుకే ఏఐ సాయంతో ఆమె ఈ మోడల్ని రూపొందించింది. సుమారు 300 చిత్రాల డేటా సెట్ను మాన్యువల్గా సిద్ధం చేసి, పైథాన్ భాషలో దీని కోడింగ్ను పూర్తి చేశారు. ప్రస్తుతానికి, ఈ వినూత్న సాఫ్ట్వేర్ కేవలం అమెరికన్ సైన్ లాంగ్వేజ్ను మాత్రమే అనువదిస్తుంది. ప్రతి భాషలో సంజ్ఞలు వేర్వేరుగా ఉంటాయి. కేవలం చేతి కదలికలే కాకుండా, ముఖ కవళికలను కూడా అర్థం చేసుకునేలా దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని ప్రియాంజలి చెబుతోంది. ఆమె రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రస్తుతానికి అవును, కాదు, దయచేసి, ధన్యవాదాలు, ఐ లవ్ యు, హలో వంటి ఆరు సంజ్ఞలను విజయవంతంగా అనువదిస్తోంది. మరిన్ని డేటా సెట్లతో దీనిని పూర్తిస్థాయి మోడల్గా మార్చేందుకు ఆమె కృషి చేస్తోంది. ఈ సాఫ్ట్వేర్ చేతులు, వేళ్ల వంటి శరీర భాగాల కదలికలను విశ్లేషించడం ద్వారా సంజ్ఞలను విజయవంతంగా టెక్ట్స్గా మారుస్తుంది. ఈ ఏఐ సాఫ్ట్వేర్ వినికిడి లోపం ఉన్నవారితో అప్పటికప్పుడే కమ్యూనికేట్ చేయడానికి ఒక డైనమిక్ మార్గంగా తోడ్పడుతుంది.ప్రియాంజలి తన ఆవిష్కరణను లింక్డ్ ఇన్ వేదికగా పంచుకోగా, అది విపరీతంగా వైరలయ్యింది. దాంతో ఎన్నోవేల మందికి ఈ కొత్త సాఫ్ట్వేర్పై ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ కోడ్ అందరికీ అందుబాటులో ఉంది. అందువల్ల శాస్త్రవేత్తలు దీనిని ఇతర భాషలకు అనుగుణంగా, మరింత మెరుగ్గా మార్చవచ్చు. ఈ చిన్న ప్రయత్నం భవిష్యత్తులో దివ్యాంగుల కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నా భవిష్యత్ లక్ష్యంసాంకేతిక రంగంలో దివ్యాంగుల కోసం తగినంత సదుపాయాలు లేవని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మూగ, చెవుడు ఉన్నవారు గూగుల్, ఎకో లేదా అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్లను ఉపయోగించాలనుకుంటే పరిస్థితి ఏంటి? మన దగ్గర దానికి సరైన పరిష్కారాలు లేవు. మా అమ్మ దగ్గరికి చదువుకునేందుకు ఒక వినికిడి లోపం ఉన్న విద్యార్థిని వస్తుండేది. ఆమె తన ఆలోచనలను వ్యక్తీకరించడంలో పడుతునన ఇబ్బందిని స్వయంగా చూశాను. అందువల్ల అటువంటి వారి గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను. అందుకే ఈ చిన్న స్థాయి మోడల్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. అలా ఆ ప్రయత్నం నుంచి వచ్చిందే ఈ సైన్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్. ప్రపంచ సమస్యలను పరిష్కరించే సాంకేతికతను నిర్మించడమే నా భవిష్యత్ లక్ష్యం. – ప్రియాంజలి గుప్తా -
బెంగాల్ కిరీటం బీజేపీదే!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు నకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ‘టుడేస్ చాణక్య’ఎగ్జిట్పోల్ స్పష్టంచేసింది. బెంగాల్ అధికార కిరీటం ఈసారి బీజేపీకి దక్కడం ఖాయమని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా మెజార్టీ మార్కు 147 స్థానాలు. బీజేపీ 192కిపైగా స్థానాలు గెల్చుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టంచేసింది. చాణక్య ఎగ్జిట్పోల్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు గెల్చుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు తేలింది. ఇతరులు కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతారని చాణక్య తెలియజేసింది. ఈ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అది అతిపెద్ద మార్పు అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజల మద్దతు బలంగా ఏకీకృతం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది ఓటర్ల ప్రాధాన్యతలో నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తోంది. బెంగాల్లో ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. మమతా బెనర్జీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వివరించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు కీలకమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుందని పేర్కొన్నాయి. 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాన్నే అంచనా వేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్కు విజయం దక్కింది. ఆ పార్టీ 215 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 77 స్థానాలు మాత్రమే దక్కించుకొని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. తమిళనాట రెండో స్థానంలో విజయ్ పార్టీ తమిళనాడులో దళపతి విజయ్ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతున్నట్టు టుడేస్ చాణక్య స్పష్టంచేసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) ఈ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో దాదాపు 63 సీట్లు సాధించబోతున్నట్లు తెలియజేసింది. అధికార డీఎంకేకు 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకేకు కేవలం 45 స్థానాలు దక్కే వీలున్నట్లు వివరించింది. విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలవబోతున్నట్లు తెలిపింది. సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల్లో 29 శాతం మంది, అత్యంత వెనుకబడిన వర్గాల్లో 27 శాతం మంది, ఎస్సీలు, క్రైస్తవుల్లో 34 శాతం మంది విజయ్ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు మాత్రం అధికార డీఎంకేకు మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. యువతలో టీవీకేకు అమితాదరణ కనిపించింది. 30 ఏళ్లలోపు ఓటర్లు, ప్రధానంగా తొలిసారి ఓటు వేసినవారు, విద్యార్థులు నిరుద్యోగులు దళపతి పార్టీకి జైకొట్టారు. మరోవైపు మెజార్టీ ఎగ్జిట్పోల్స్ మళ్లీ డీఎంకే గెలుపు ఖాయమని తెలియజేశాయి. ‘యాక్సిస్ మై ఇండియా’మాత్రమే విజయ్ పార్టీ జయకేతనం ఎగురవేయబోతున్నట్లు తేల్చిచెప్పింది. కేరళలో యూడీఎఫ్కు విజయావకాశాలు కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్యగట్టి పోటీ నెలకొన్నట్లు టుడేస్ చాణక్య ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు విజయావకాశాలు ఉన్నట్లు తెలిపింది. 140 సీట్లకు గాను యూడీఎఫ్కు దాదాపు 69 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని వెల్లడించింది. 126 సీట్లకు గాను బీజేపీ 50 శాతం ఓట్లతో ఏకంగా 102 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బెంగాల్ ఎగ్జిట్పోల్స్ ప్రకటించని ‘యాక్సిస్ మై ఇండియా’ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ను ‘యాక్సిస్ మై ఇండియా’ప్రకటించలేదు. బుధవారం ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రకటించినప్పటికీ బెంగాల్ విషయం ప్రస్తావించలేదు. గురువారం ప్రకటిస్తారని భావించగా.. అది సాధ్యం కాలేదు. బెంగాల్లో భయానక వాతావరణం నెలకొందని, ఇతరులతో మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, శాంపిల్ సేకరించే పరిస్థితి కూడా లేదని ‘యాక్సిస్ మై ఇండియా’అధినేత ప్రదీప్ గుప్తా చెప్పారు. అసంపూర్ణమైన సమాచారంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు. -
టీవీకే విజయ్ కీలక సూచనలు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న కౌంటింగ్కు సంబంధించి టీవీకే అధినేత విజయ్.. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఆ రోజు జరిగే కౌంటింగ్కు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం ఆరుగంటల కల్లా ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఒకసారి లోపలికి వెళ్లిన ఏజెంట్ కడవరకూ అక్కడే ఉండాలని, అత్యంత జాగ్రత్తగా కౌంటింగ్ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుకు గురైనా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అందుకుని అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రధానంగా అభ్యర్థులు గెలిచిన తర్వాత తన వద్దకు నేరుగా రావాలన్నారు. గెలిచిన అభ్యర్థుల కోసం తాను నిరీక్షిస్తూ ఉంటానని, మధ్యలో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ పార్టీ ఆఫీస్కే రావాలన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో కీలకమైన ఫారమ్ 17C(పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల సంఖ్య, లెక్కింపులో చూపిన ఓట్లతో సరిపోతుందా లేదా అనే విషయాన్ని ధృవీకరించే పత్రం)ని అభ్యర్థులు కచ్చితంగా సరిపోల్చుకోవాలన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి మభ్య పెట్టడానికి యత్నించే వారికి చెక్ పెట్టాలన్నారు. -
విజయ్ దే గెలుపు.. 120 సీట్ల విజయం ఖాయం!
-
మహిళలంతా విజయ్ వైపే, సీఎం విజయ్..! తమిళనాడులో జెన్ Z విప్లవం
-
విజయ్.. మరో MGR! TVKకి పట్టం కట్టిన యువ ఓటర్లు
-
హాట్ న్యూస్: ఎన్డీయే కూటమితో విజయ్ పొత్తు!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ.. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే-అన్నాడీఎంకే-టీవీకే పార్టీలు ఇవాళ వరుస మీటింగ్లు పెట్టుకున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత సమీకరణాలు మారుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించిన టీవీకే అధినేత విజయ్.. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమితో పొత్తుకు చేయి చాస్తాడా? అనే చర్చ జోరుందుకుంది. తమిళనాడులో డీఎంకే పార్టీదే మళ్లీ అధికారమని ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకటి రెండు మాత్రం అన్నాడీఎంకేకు అధికారం దక్కవచ్చని చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం తప్పదని.. ఆ పార్టీ ఏకంగా అధికారం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే మిగతా సర్వేలు మాత్రం విజయ్ పార్టీ డబుల్ డిజిట్ను కైవసం చేసుకోవచ్చని అంచనా వేశాయి. ఈ తరుణంలో.. విజయ్ పార్టీలో జోష్ కనబడుతోంది. సర్వేలు అంచనా వేసినట్లు.. నిజంగానే ఫలితాల్లో టీవీకే జోరు కొనసాగుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే పొత్తుల సమీకరణాలు తెర మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేతో పవర్షేరింగ్ కోసం విజయ్ చేతులు కలపబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. తమిళ రాజకీయాల్లో విజయ్ నిర్ణయం సంచలనమనే చెప్పొచ్చు.వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలో భాగం కోరుకునే పార్టీలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో చిన్నచిన్న పార్టీల నేతలతో పాటు అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపించారు. చివరకు అధిష్టానం జోక్యంతో వాళ్లంతా మెత్తబడ్డారు. మరోవైపు టీవీకే కూడా అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలు ఏనాడూ చేసింది లేదు. అయినప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్లు విజయ్తో పొత్తు కోసం ఉవ్విళ్లూరాయి. సరిగ్గా అదే టైంలో TVK–AIADMK కలిసి పని చేస్తాయంటూ ఓ ప్రచారం ఉధృతంగా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారి తీయడంతో.. అలాంటిదేం ఉండబోదని కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అలాంటిదేం ఉండబోదని.. ఎగ్జిట్పోల్స్ తర్వాత మీడియా అత్యుత్సాహం, టీఆర్పీ మోజుతోనే కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో విజయ్ పొత్తుకు వెళ్తారా? అనేది ఇప్పటికైతే అనుమానామే. -
ఆ సినిమా సీన్ను రిపీట్ చేస్తున్న విజయ్!
కొన్ని దశాబ్దాల తమిళనాడు రాజకీయలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య ద్విముఖ పోరాటంగా కొనసాగుతూ వచ్చాయి. మధ్యలో ప్రత్యామ్నాయంగా పార్టీలు పుట్టుకొచ్చినా.. అవి దీర్ఘకాలం ప్రభావం చూపెట్టలేకపోయాయి. కానీ ఈసారి ఆ సీన్లోకి అగ్రనటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఈలోపు.. ఎగ్జిట్పోల్ ఫలితాలు ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. మెజారిటీ డీఎంకేకే తమిళ ఓటర్లు మళ్లీ పట్టం కడతారని తేల్చేశాయి. ఒకట్రెండు మాత్రం ప్రతిపక్ష అన్నాడీఎంకేకు అధికారం ఖాయమన్నాయి. అయితే ఆ సర్వేలే విజయ్ టీవీకే పార్టీ రెండంకెల ఫిగర్కు పరిమితం కావొచ్చని చెబుతూనే.. ఓటింగ్ శాతంపరంగా ఇంపాక్ట్ చూపించవచ్చని అంచనా వేశాయి. అయితే.. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం అనూహ్యంగా విజయ్ టీవీకే అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ 98-120 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సంఖ్య సాధారణ మెజారిటీకి మించి ఉండటంతో.. విజయ్ ముఖ్యమంత్రి పదవి వైపు దూసుకెళ్తున్నారని యాక్సిస్ మై ఇండియా ఛైర్పర్సన్ ప్రదీప్ గుప్తా వ్యాఖ్యానించారు.దీంతో విజయ్ అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. అయితే విజయ్ మాత్రం తొందరపాటు వద్దని.. సంయమనం పాటించాలని కేడర్కు, అభిమానులకు సూచిస్తున్నారు. పోలింగ్ తర్వాత ఇంటికే పరిమితమైన ఆయన.. ఫలితాలు దగ్గర పడుతున్నా కొద్దీ వరుసగా ప్రముఖ ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవాళ టీవీకే తరఫున పోటీ చేసిన 234 మంది అభ్యర్థులతోనూ ఆయన భేటీ కానున్నారు. మురుగదాస్ డైరెక్షన్లో విజయ్ హీరోగా సర్కార్ అనే పొలిటికల్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఓటు వాల్యూ ఏంటో చెప్పే మెసేజ్తో తెరకెక్కిందా చిత్రం. సినిమా క్లైమాక్స్లో.. తన తరఫున గెలిచిన వాళ్లతో ఓ మీటింగ్ పెట్టి సీఎం క్యాండిడేట్ను అనౌన్స్ చేస్తాడు విజయ్. ఈ నేపథ్యంలో నెట్టింట ఇవాళ్టి టీవీకే మీటింగ్పైనా అలాంటి పోలికతో చర్చ నడుస్తోంది. అయితే.. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలన్నదానిపై అభ్యర్థులకు విజయ్ దిశానిర్దేశం చేస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఈ మీటింగ్పై సెటైర్లు పేలుస్తున్నారు. టీవీకే ఇప్పటికే విజయ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం కేండిడేట్ను కొంపదీసి విజయ్ మారుస్తారా? ఏంటి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. తమిళ దర్శకనిర్మాత ఎస్ఏ చంద్రశేఖర్ తనయుడిగా వెట్రి(1984) అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా జోసెఫ్ విజయ్ వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆపై 18 ఏళ్ల వయసులో నాళఇయా తీర్పు(1992)తో హీరోగా మారాడు. రొమాంటిక్, మాస్ ఇమేజ్లతో అగ్రతారగా ఎదిగారు. ఒక పక్క మెసేజ్ ఓరియెంటల్ సినిమాలు వరుసగా తీస్తూనే.. మరోవైపు తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవతో గుర్తింపు దక్కించుకున్నారు. ఈ మధ్యలో తమిళనాడులో జరిగిన ప్రతీ పోరాటానికి, ఉద్యమానికి పార్టీలకతీతంగా ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అటుపై ఏకంగా తమిళగ వెట్రి కగళం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం దాకా.. విజయ్ అనుసరించిన వ్యూహం తమిళ ప్రజలను మరీ ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఎవరితోనూ పొత్తు ఉండదని.. ఒంటరి పోరుకే సై అంటూ హాట్ చర్చకు దారి తీశారాయన. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా.. డీఎంకేను రాజకీయ శత్రువుగా అభివర్ణించుకుంటూ మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగారు. ఒకానొక దశలో.. తమిళనాట మార్పు టీవీకేతోనే సాధ్యం అనే పిలుపుపై జోరుగా చర్చ నడిచింది. అయితే ఎంజీఆర్, జయలలితలా.. విజయ్ మరో తమిళ రాజకీయాలను శాసించే సినీ తార అవుతారా? లేదా? అనేది ఫలితాలు వెల్లడయ్యేదాకా సస్పెన్స్గానే భావించాలి. -
ఎగ్జిట్ పల్స్.. అంచనాలు తారుమారు
-
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్.. విజయ్ సీఎం అవుతాడా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవాళతో (బుధవారం)తో ముగిసింది. పలు సంస్థలు ఎగ్జిట్పోల్స్ విడుదల చేశాయి. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ ఇన్సైట్ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.మాట్రిజ్ సర్వే:DMK: 122-132ADMK: 87-100TVK: 10-12ఇతరులు 0-6ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్DMK 134-141AIDMK 84-90TVK 4-8టీవీకే విజయ్దే విజయం: యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశంరెండో స్థానంలో డీఎంకే 92-100పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేపట్టనుందని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి. డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది.మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా, పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చారు. 18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది. డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. ప్రధాన అభ్యర్థుల స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు. మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది.తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై మైలాపూర్లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటడు దివంగత విజయ్కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోంది. ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది. విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు. -
ఉద్యోగి కోసం బాస్ చేసిన పని.. నెటిజన్లు ఫిదా!
ఒక కంపెనీలో బాస్ అంటే.. కేవలం ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రమే కాదు, వారి కష్టాలను కూడా గుర్తించాలి. అవసరమైన సహాయం చేయాలి. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తులలో ఒకరు ప్రదీప్ కన్నన్. ఇంతకీ ఈయన ఎవరు?, ఈయన చేసిన సహాయం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.తమిళనాడుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కన్నన్.. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి, కొన్ని రోజులుగా ఆఫీసులో చాలా నీరసంగా ఉండటం, పనిపై ఏకాగ్రత చూపించకపోవడం వంటివి గమనించారు. అతను ఆలా ఉండటానికి కారణం ఏమిటని ఆరాతీస్తే.. భారీ ఎండల కారణంగా రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపోవడం లేదని తెలిసింది. అయితే.. ఇది ఉద్యోగి వ్యక్తిగత సమస్య అని వదిలేయకుండా, ప్రదీప్ అతనికి ఒక ఎయిర్ కూలర్ కొని ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.Our employee was struggling to sleep in this heat.Next day, we bought him an air cooler.Not posting this to brag.Posting this because many founders miss the real math:The cost of an air cooler is small.The cost of a:- tired mind- low energy, - bad work, and- feeling… pic.twitter.com/o6TQnuB9co— Pradeep Kannan (@Pradeepkannanj) April 21, 2026ఎయిర్ కూలర్ విలువ, కంపెనీ విలువతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉద్యోగి సమస్యకు స్పందించిన బాస్ అని పలువురు నెటిజన్లు 'ప్రదీప్ కన్నన్'ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.నిజానికి చాలా కంపెనీలలో ఉద్యోగులు జాబ్ వదిలేయడానికి కారణం, జీతం సరిపోకపోవడం కాదు. సంస్థలో వారికి విలువ ఇవ్వకపోవడం లేదా పట్టించుకోకపోవడం అని ప్రదీప్ పేర్కొన్నారు. మీ టీమ్ కేవలం పనిచేసే ఉద్యోగులు కాదు. వారు మీతో కలిసి వ్యాపారాన్ని నిర్మించే భాగస్వాములు అని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్ జీతం ఎంతో తెలుసా? -
పోటెత్తిన ఓటింగ్
కోల్కతా/చెన్నై: ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యానికి సంకేతంగా పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో, ఒకే విడతలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గురువారం 152 స్థానాలకు జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 92.72 శాతం, మొత్తం 234 స్థానాలకు జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 85.14 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే ద్వారా అర్హత లేని లక్షలాది ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదవడం గమనార్హం. శుక్రవారం ఉదయం కల్లా తుది గణాంకాలు రావొచ్చు. బెంగాల్లో అక్కడక్కడా హింసాకాండ చోటుచేసుకోవడం మినహా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కనిష్ట స్థాయిలో హింస జరగడం బెంగాల్ ఎన్నిక చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి, దేశ పౌరులుగా తమ విధిని నిర్వర్తించడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటువేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల ఎదుట రద్దీ తగ్గలేదు. వరుసలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక ఓటింగ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 9న జరిగిన అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 85.38 శాతం, పుదుచ్చేరిలో 89.83 శాతం నమోదయ్యింది. బెంగాల్, తమిళనాడులో ఇప్పటిదాకా 2011 నాటి ఎన్నికల ఓటింగే అత్యధికం. అప్పట్లో బెంగాల్లో 84.72 శాతం, తమిళనాడులో 78.29 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ రికార్డును ఈసారి ఓటర్లు తిరగరాశారు. రెండు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. తమిళనాడులో పురుషులు 83.57 శాతం మంది ఓటువేయగా, మహిళలు 85.76 శాతం మంది ఓటువేశారు. బెంగాల్లో పురుషులు 90.92 శాతం, మహిళలు 92.69 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్లో సరికొత్త రికార్డు సృష్టించిన రెండు రాష్ట్రాల ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో అర్హులైన ఓటర్లలో 91.78 శాతం మంది ఓటు వేశారు.పశ్చిమ బెంగాల్లో స్వల్ప హింస బెంగాల్లో తొలి విడత ఎన్నికల సందర్భంగా హింసాకాండ చోటుచేసుకుంది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. హింసాత్మక ఘటనలు ఓటర్ల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి. 2021లో 82.30 శాతం ఓటింగ్ నమోదు కాగా, గురువారం 92 శాతం దాటేసింది. బెంగాల్ ప్రజలు తమ హక్కులను కోల్పోకుండా ఉండేందుకే అధిక సంఖ్యలో ఓటు వేశారని టీఎంసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే పౌరులుగా తమ హక్కులను, పౌరసత్వాన్ని కోల్పోతామని ప్రజలు ఆందోళనకు గురయ్యారని, అందుకే ఆ ప్రమాదం తలెత్తకుండా అధిక సంఖ్యలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీర్భూమ్లోని ఖరిసోల్లో ఈవీఎంలలో టీఎంసీకి వేసిన ఓట్లను బీజేపీకి అనుకూలంగా నమోదు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో అధికారులు పోలింగ్ను తాత్కాలిక నిలిపివేశారు. స్థానికులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు రాళ్లతో దాడికి దిగారు. పారామిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. దక్షిణ దినాజ్పూర్లోని కుమార్గంజ్లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్పై దాడి జరిగిందని, అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలోని రహమత్ నగర్ సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే అగి్నమిత్ర పాల్ కారుపై రాళ్లతో దాడి చేసి వెనుక కిటికీని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. నవోడాలో ఏజేయూపీ నాయకుడు హుమాయున్ కబీర్ కాన్వాయ్పై కొందరు రాళ్లు విసిరారు. దీంతో అతడి మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య ఘర్షణచోటుచేసుకుంది. లాభ్పూర్, చంచల్. మురారైలలో హింసాత్మక, బెదిరింపు ఘటనలు జరిగాయి. వేర్వేరు పారీ్టల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. డోమ్కల్లో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకోకుండా కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి వందలాది ఫిర్యాదులు అందినట్లు తెలియజేసింది. జిల్లాల వారీగా చూస్తే ముర్షిదాబాద్, బంకూర, కూచ్ బెహార్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా కలింపాంగ్లో 81 శాతం నమోదయ్యింది. బెంగాల్ ఎన్నికలు అంటేనే హింసాకాండకు మారుపేరుగా చెబుతుంటారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది. రాష్ట్రంలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో అంతా ప్రశాంతం అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే, కొత్తగా రంగప్రవేశం దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో 85.14 శాతం మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే–బీజేపీ కూటమిని లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తీవ్రంగా పోరాడిన డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి హోరాహోరీగా పోరాడింది. విజయ్ పార్టీ తమిళగ వేట్రి కళగం(టీవీకే), తమిళ జాతీయవాది సీమాన్కు చెందిన నాన్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఎన్నికల రంగంలో గట్టి పోటీదారులుగా నిలిచాయి. డీఎంకే–కాంగ్రెస్, అన్నాడీఎంకే–బీజేపీ కూటములు తమ విజయం పట్ల ధీమాగా ఉన్నాయి. అత్యధికంగా కరూర్ స్థానంలో 91.86 శాతం, అత్యల్పంగా కన్యాకుమారిలో 75.50 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. చెదురు ముదురు ఘటనల మినహా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా, తక్షణం మరమ్మతులు చేసి ఓటింగ్ను కొనసాగించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. చెన్నైలోని మైలాపూర్లో ఓటర్లకు డీఎంకే డబ్బులు పంపిణీ చేస్తోందని బీజేపీ ముఖ్యనేతలు అన్నామలై, వనతి శ్రీనివాసన్ ఆరోపించారు. అధికార డీఎంకే పార్టీ ఉదయించే సూర్యుడి చిహ్నాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ నేత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తమ కుటుంబంతో సహా చెన్నైలో ఓటు వేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సేలం సిలువం పాళయం నెడుంకుళం పంచాయతీ పరిధిలోని యూనియన్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్లో కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత విజయ్ చెన్నై నీలాంకరై పోలింగ్ బూత్లో గట్టి భద్రత నడుమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, తమిళ సినీ నటులు రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, జ్యోతిక దంపతులు, కార్తీ, అర్జున్, విక్రమ్, ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, విశాల్, మణిరత్నం, సంగీత దర్శకుడు అనిరుద్, నటీమణులు త్రిష, కీర్తి సురేష్, రాధిక, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ ఓటింగ్ మాకే అనుకూలం: అన్నాడీఎంకే తమిళనాడులో 2021లో 73.63 శాతం ఓటింగ్ నమోదు కాగా, స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధించింది. 2011లో 78.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచింది. ఈసారి 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడాన్ని తమకు సానుకూలాంశంగా అన్నాడీఎంకే–బీజేపీ కూటమి నాయకులు భావిస్తున్నారు. తమిళనాట ఎస్ఆఐర్ ద్వారా ఓట్లను తొలగించారు. 2025 అక్టోబర్లో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 5.73 కోట్లకు తగ్గింది. 2021 ఎన్నికల సమయంలో 6.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 56 లక్షల మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. తమిళనాట ఓటింగ్ సరళి తమిళనాడులో 1957లో అత్యల్పంగా 47 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత 1960వ దశకం నుంచి నేటి వరకు సగటు ఓటింగ్ శాతం 70కి దరిదాపుల్లోనే ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులు చెదిరిపోయాయి.👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీవీకే కార్యకర్త అరెస్ట్.. పోలింగ్ కేంద్రంలో ఏం చేశాడంటే..?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో టీవీకే పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. టీవీకే గుర్తుపై ఓటు వేస్తూ వీడియో చిత్రీకరణ చేసిన ఆ కార్యకర్త.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద టీవీకే కార్యకర్త శక్తివేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఈ ఘటన జరిగింది.అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలింగ్ కేంద్రంలోకి తన మొబైల్ ఫోన్ను తీసుకెళ్లిన శక్తివేల్.. పార్టీ గుర్తు ‘ఈల’కు ఓటు వేస్తున్నట్లు వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో 'రీల్'గా షేర్ చేయడంతో.. సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చింది. ఓటు రహస్యాన్ని భంగపరిచే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, వీడియోలు తీయడం ఎన్నికల నిబంధనల ప్రకారం నేరమని భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అధికారులు పోలీసులను అప్రమత్తం చేయడంతో.. వారు బూత్కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శక్తివేల్పై ఎన్నికల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కఠిన నిఘా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4,023 మంది అభ్యర్థుల భవిష్యత్తును 5.73 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు -
తొలి గంటలోనే ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
పోలింగ్ కేంద్రం వద్ద తమిళనాడు సీఎం స్టాలిన్
-
Elections 2026: జోరుగా పోలింగ్


