breaking news
Health Tips
-
తల్లిపాల నిర్వహణలో... స్మార్ట్ పరికరాలు
బిడ్డ పుట్టడానికి ముందే తల్లిపాలు పట్టే పరికరాలను సిద్ధం చేసుకోవడం వల్ల ప్రసవానంతర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు అనేది నిపుణుల సూచన. ఫలితంగా తల్లి ప్రసవానంతరం కలిగే వివిధ రకాల ఒత్తిడులను తగ్గించుకునే వీలుంది.తల్లిపాల పరికరాలు రోజువారీ సవాళ్లలో కొన్నింటిని సులభతరం చేసినా, సరైన సహకారం అందినప్పుడే వాటిని బాగా వినియోగించుకోగలరు. చనుబాలు పట్టించే నిపుణుల గైడెన్స్తో పాటు బాధ్యతలను పంచుకునే భాగస్వామి మద్దతు అవసరం. ‘బిడ్డలకు పాలిచ్చే పనులను సులువు చేయడానికి తల్లులు బ్రెస్ట్ పంపులు (51 శాతం), నర్సింగ్ బ్రాలు (37 శాతం), నర్సింగ్ దిండ్లు (31శాతం) వంటి సాధనాలను ఉపయోగిస్తున్నారని నివేదికలు చూపుతున్నాయి. నవతరం అమ్మలకు వచ్చిన అనుకూల ఉత్పత్తుల గురించి...ఫీడింగ్ మానిటర్స్: శిశువు పాలు మింగే శబ్దాలను గుర్తించడానికి, ఎన్ని పాలు తాగిందో లెక్కించడానికి, ఏఐ–ఆధారిత సెన్సార్లు కూడా వచ్చాయి.రియల్–టైమ్ బ్రెస్ట్ ఫీడింగ్ వేరబుల్: ఇది రొమ్ము చుట్టూ చుట్టుకునే ఒక మృదువైన, అనువైన పరికరం. ఇది బయోఇంపిడెన్ ్సను ఉపయోగించి, శిశువు ఎన్ని పాలు తాగిందో అనే దానిపై క్లినికల్–గ్రేడ్, లైవ్ డేటాను మొబైల్ స్క్రీన్ లపై అందిస్తుంది. లాక్టేషన్ ప్యాడ్ డ్రగ్ ట్రాకర్లు: ఇవి మైక్రోఫ్లూయిడిక్ ఛానెల్స్, లేజర్–ప్రేరిత గ్రాఫేన్ సెన్సార్లతో పొందుపరిచిన మోడర్న్ వేరబుల్ ప్యాడ్స్. తల్లి తీసుకునే మందులు (ఎసిటమినోఫెన్ వంటివి) నేరుగా తల్లిపాలలోకి చేరే రేటును ట్రాక్ చేసి, కొలుస్తాయి.ఇన్ఫాంట్ స్మార్ట్ బాటిల్స్: ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి, సింక్రొనైజ్డ్ యాప్ల ద్వారా శిశువు బరువు పెరుగుదలను ట్రాక్ చేయడానికి బయోఫీడ్బ్యాక్ డేటాను అందిస్తాయి.ఇతర అనుకూలమైన పరికరాలు...ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్స్: వీటిని నర్సింగ్ బ్రా లోపల సెట్ చేసుకోవచ్చు. పాలు ఎక్కువైనప్పుడు ఈ పరికరం ద్వారా పాలు తీసి, స్టోరేజ్ చేయవచ్చు.నర్సింగ్ కవర్స్: తల్లిపాలు పట్టే సమయంలో మెడ భాగం నుంచి నడుము కిందవరకు ఆ్రపాన్ తరహాలో ఉండే కాటన్ కవర్ పూర్తిగా కప్పి ఉంచుతుంది. బిడ్డ పాలు తాగుతుండగా తల్లి నేరుగా చూసే అవకాశమూ ఉంటుంది. బయట పాలు పట్టడం అనే ఇబ్బందిని ఈ కవర్ దూరం చేస్తుంది.బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్: పాలిచ్చే సమయంలో బిడ్డను పిల్లోపైన పడుకోబెట్టడానికి., కదలకుండా ఉండటానికి.. వీటిని ఉపయోగిస్తుంటారు. పాలు తాగే సమయంలో తల్లికి–బిడ్డకు ఈ పిల్లో అనువుగా ఉంటుంది.నర్సింగ్ ప్యాడ్స్: లీక్ ప్రూఫ్స్, స్కిన్ ఫ్రెండ్లీవి లభిస్తున్నాయి. వాపు, నొప్పి ఉన్న రొమ్ము చర్మానికి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే చల్లని జెల్ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి.బ్రెస్ట్ మిల్క్ కంటెయినర్స్, స్టోరేజీ కప్స్: రొమ్ము నుంచి తీసిన పాలను కంటెయినర్లలో భద్రపరచేవి. సెన్సార్ స్టోరేజీ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి బిడ్డకు తగినంత ఉష్ణోగ్రతలలో పాలు ఉండేలా నిల్వ చేస్తాయి. ఓవెన్ లేదా స్టవ్ ఉపయోగించకుండా ఫ్రీజర్లో భద్రపరిచిన పాలను కరిగించే స్మార్ట్ బాటిల్ వార్మర్స్ అందుబాటులో ఉన్నాయి.సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్: మొదటిసారి బిడ్డకు పాలు పట్టే సమయంలో, ఆ తర్వాత చనుమొనలు చిట్లడం, నొప్పి సమస్యలు ఉంటాయి. ఇలాంటప్పుడు సిలికాన్ నిపుల్ ప్రొటెక్టర్స్ బాగా ఉపయోగపడతాయి.బ్రెస్ట్ నిపుల్ క్రీమ్: ప్రసవం తర్వాత ΄÷డిబారిన, చిట్లిన, నొప్పిగా ఉన్న చనుమొనల సమస్యను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. -
‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది
కొంతమందికి కొన్ని సంఖ్యలపై ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. అవి తమ జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తాయని భావిస్తుంటారు. ఏడు అనేది అపశకునం అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్మకం. అయితే.. ఇక్కడో వ్యక్తి లక్కీ నంబర్ ‘7’. చిన్నప్పటి నుంచి తనకు అదృష్ట సంఖ్యగా భావిస్తూ వచ్చాడు. అదే అతన్ని..చివరకు కోటీశ్వరుడిని కూడా చేసింది.అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం బిస్కో పట్టణానికి చెందిన టోమస్ మునోజ్కు లాటరీలో ఏకంగా 10 లక్షల డాలర్లు (సుమారు రూ.9.5 కోట్లు) జాక్పాట్గా తగిలింది. నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ కొత్తగా ప్రారంభించిన ట్రిపుల్ రెడ్ 777 జాక్పాట్ స్క్రాచ్-ఆఫ్ గేమ్లో ఆయన ఈ భారీ బహుమతిని గెలుచుకున్నారు. కాండర్లోని ఓ దుకాణంలో 10 డాలర్ల విలువైన ట్రిపుల్ రెడ్ 777 జాక్పాట్ టికెట్ కనిపించగానే దాన్ని కొనాలని మునోజ్ నిర్ణయించుకున్నారు. కారణం.. ఆ టికెట్పై ఉన్న మూడు ‘7’లే.“ఏడు నా అదృష్ట సంఖ్య. నేను 1977లో 7వ తేదీన పుట్టాను” అని మునోజ్ తెలిపారు. తన జీవితంలో 7 నంబర్కు ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. టికెట్ను దుకాణంలోనే స్క్రాచ్ చేసిన మునోజ్.. భారీ బహుమతి గెలిచిన విషయం తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. “నా శరీరం మొత్తం రకరకాల భావోద్వేగాలతో నిండిపోయింది” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.లాటరీ సంస్థ నుంచి బహుమతి తీసుకునే సమయంలో మునోజ్కు రెండు అవకాశాలు ఇచ్చారు. 20 ఏళ్ల పాటు ఏడాదికి 50 వేల డాలర్ల చొప్పున తీసుకోవడం లేదా ఒకేసారి నగదు తీసుకోవడం. ఆయన రెండో ఎంపికను ఎంచుకున్నారు. ఒకేసారి 6 లక్షల డాలర్లు తీసుకున్నారు. పన్నులు మినహాయించిన తర్వాత ఆయనకు 3,96,060 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లకు పైగా) అందాయి.ఈ డబ్బును పెట్టుబడులు పెట్టడంతో పాటు, తనకు ఇష్టమైన పాతకాలపు కార్ల పునరుద్ధరణ (క్లాసిక్ కార్ రీస్టోరేషన్) పనులకు ఉపయోగించనున్నట్లు మునోజ్ తెలిపారు.ఇక ట్రిపుల్ రెడ్ 777 జాక్పాట్ గేమ్లో మొత్తం మూడు మిలియన్ డాలర్ల బహుమతులు ఉండగా.. అందులో మరో రెండు మిలియన్ డాలర్ల బహుమతులు ఇంకా గెలుచుకోవాల్సి ఉంది. అదృష్ట సంఖ్యలపై నమ్మకం ఉండటం ఒకవైపు అయితే.. అదే సంఖ్యతో జీవితాన్ని మార్చే అవకాశం రావడం మాత్రం మునోజ్ విషయంలో అరుదైన యాదృచ్ఛికంగా మారింది. ‘7’ అతడికి కేవలం సంఖ్య కాదు.. అదృష్టాన్ని తెచ్చిన గుర్తుగా నిలిచిపోయింది.(చదవండి: థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ ..) -
ఆ కారణంగానే గజినీ నటుడు ప్రదీప్ రావత్ ప్రాణం..వృద్ధాప్యంలో ఆ సమస్య తప్పదా?
గజని పలు బ్లాక్బస్టర్ మూవీలలో విలన్గా తన మార్కుతో మెప్పించి ప్రశంసలందుకున్న నటుడు ప్రదీప్ రావత్ కేన్సర్ చికిత్స పొందుతూ మరణించారు. మంచి నటుడి పేరుతెచ్చుకున్న రావత్ 74 ఏళ్ల వయసులో కేన్సర్ కారణంగా మృతి చెందినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక్కడ ఈ నటుడి మరణంగా కీలకమైన ఆరోగ్య ప్రశ్నను లేవనెత్తింది. కేవలం వయసు పెరగడం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా?, తప్పనిసరిగా వృద్ధాప్యంలో కేన్సర్ వస్తుందా అంటే..వయసు పెరగడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం కచ్చితంగా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగని వృద్ధాప్యంలో కేన్సర్ అనివార్యమని చెప్పలేమని అన్నారు. జీవితాంతం మన శరీరంలోని కణాలు నిరంతరం విభజన చెందుతూ, తమను తాము బాగు చేసుకుంటాయని చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ మన కణాలకు జన్యుపరమైన హాని జరగడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. మన శరీరం దెబ్బతిన్న DNAను రోజూ బాగు చేసుకున్నప్పటికీ, ఈ ప్రక్రియలు చివరికి వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అదే సమయంలో అదే సమయంలో, మన రోగనిరోధక వ్యవస్థ అసాధారణ కణాలు కేన్సర్గా మారకముందే వాటిని గుర్తించి నాశనం చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా దశాబ్దాలుగా ఈ జన్యుపరమైన మార్పులు పేరుకుపోవడంతో, అసాధారణ కణాలు వృద్ధి చెంది కేన్సర్గా మారే అవకాశాలు క్రమంగా పెరుగుతాయని అంటున్నారు. అలాగే ఒక వయసు గల ప్రతి ఒక్కరికీ కేన్సర్ వచ్చే ప్రమాదం ఒకేలా ఉంటుందని అపోహ పడుతుంటారు. జీవసంబంధమైన వృద్ధాప్యం, కాలక్రమేణా వచ్చే వృద్ధాప్యానికి భిన్నంగా ఉంటుందని నొక్కి చెబుతున్నారు. జీవనశైలి, కుటుంబ చరిత్ర, శారీరక శ్రమ స్థాయి, నిద్ర నాణ్యత, సాధారణ జీవక్రియ ఆరోగ్యంపై ఆధారపడి, 74 ఏళ్ల వయస్సు గల ఏ ఇద్దరు వ్యక్తులకు కేన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ..క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారికి ఈ సమస్య తక్కువ. అలాకాకుండా అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఉంటే కచ్చితం ఈ కేన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువని చెబుతున్నారు. వృద్ధుల్లో ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడానికి రీజన్..వృద్ధులలో కేన్సర్ ఆలస్యంగా నిర్ధారణ కావడానికి గల అతిపెద్ద కారణాలలో ఒకటి, లక్షణాలను తరచుగా వృద్ధాప్యంలో సాధారణమైనవిగా కొట్టిపారేయడమేనని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నిరంతరం బరువు తగ్గడం, అసాధారణమైన అలసట, మూత్రంలో లేదా మలంలో రక్తం, తగ్గని గడ్డ, మింగడంలో ఇబ్బంది, లేదా మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే దగ్గు వంటి లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇవే కాకుండా కనిపించే ఇతర లక్షణాలు..మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులుకారణం తెలియని రక్తస్రావంచర్మంపై కొత్త మార్పులునిరంతరం గొంతు బొంగురుపోవడంఆకలి లేకపోవడంరాత్రిపూట చెమటలు పట్టడంఈ లక్షణాలు ఎల్లప్పుడూ కేన్సర్ను సూచించనప్పటికీ, ఈ లక్షణాలతో ముందస్తు వైద్య పరీక్షల్లో ఆ వ్యాధిని ముందుగా గుర్తించి సులభంగా బయటపడగలుగుతారని అంటున్నారు. చాలా కేన్సర్లు ప్రారంభ దశలో గుర్తిస్తే..సులభంగా చికిత్స చేయవచ్చు. ముఖ్యంగా స్క్రీనింగ్ వంటి వైద్య పరీక్షలను, సకాలంలో చేస్తే.. లక్షణాలు కనిపించకముందే కొన్ని రకాల కేన్సర్లను ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు.అలాగే చాలామంది డెబ్బై, ఎనభై ఏళ్ల వరకు జీవిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ కేన్సర్ సర్వసాధారణం అయినప్పటికీ..వృద్ధాప్యాన్ని అనివార్య పరిణామంగా పరిగణించకూడదని నిపుణులు నొక్కి చెబుతున్నారు. అందుకే మంచి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేలా కేర్ తీసుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ ..) -
99 కేజీల నుంచి 59 కేజీలకు..! ఆ ఐదు ఫుడ్స్తోనే..
బరువు తగ్గడం అనేది తెలివిగా డైట్ లేదా వ్యాయామాలు చేస్తూ.. సునాయాసంగా తగ్గే ప్రక్రియని పలువురు నిరూపిస్తున్నారు. అందుకు ఫ్యాన్సీ డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదని ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటే చాలని అంటున్నారు. మంచి పలితాలు అనేవి ప్రతిరోజు పాటించగల సాధారణ అలవాట్లుగా మంచి ఆహారపు అలవాట్లను భాగం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాచీ కూడా అలానే అనుసరించి జస్ట్ మూడేళ్లలో అమాంతం 40 కేజీలు తగ్గింది. అంతేగాదు అంతలా బరువు తగ్గడానికి ఉపకరించిన ఆహారాలను కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఇంతకీ అవేంటో చూద్దామా..!.నిజానికి సాచీ 99 కేజీల పైనే బరువు ఉండేది. జస్ట్ ఆ ఐదు భోజనాలతో ఏకంగా 40 కేజీలపైనే బరువు తగ్గింది. తనకు వెయిట్లాస్ జర్నీలో ఉపకరించిన ఆ ఐదు ఆహారాల వివరాలు..వాటిని నిలకడగా అనుసరిస్తే కలిగే లాభాలు గురించి షేర్ చేసుకున్నారామె.అవేంటంటే..పాలక్ పనీర్ బౌల్ఈ భోజనంలో 200 గ్రాముల పాలక్ పనీర్, 150 గ్రాముల వండిన అన్నం, 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్, ఒక ఉడికించిన బీట్రూట్ ఉంటాయి. ఇది ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఫైబర్ల సమతుల్య కలయిక. పెరుగు అదనపు ప్రోటీన్ను అందిస్తుంది, బీట్రూట్ ఫైబర్,సహజమైన తీపిని ఇస్తుంది.గుడ్లతో రొయ్యల ఫ్రైడ్ రైస్సాచి 200 గ్రాముల రొయ్యల ఫ్రైడ్ రైస్ను, ఉల్లిపాయ,క్యాప్సికమ్తో వండిన ఒక పూర్తి గుడ్డు, రెండు గుడ్డు తెల్లసొనలు, తరిగిన దోసకాయతో కలిపి తీసుకుంది. ఈ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పైగా ఇందులో కడుపు నిండినట్లు అనిపించడానికి ఇందులో కూరగాయలు కూడా ఉంటాయి.గుడ్లు, పుట్టగొడుగులు, క్రాకర్లుఈ ప్లేట్లో రెండు గుడ్లు, పుట్టగొడుగుల వేపుడు, 100 గ్రాముల గ్రీక్ పెరుగు, ఉడికించిన ఒక బీట్రూట్, మూడు వాసా క్రాకర్లు ఉంటాయి. ఇది ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన ఒక సాధారణ భోజనం. ఇది కూడా ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది.ఎయిర్-ఫ్రైడ్ చికెన్ ప్లేట్ఆమె ప్లాన్లోని మరొక ఇష్టమైన వంటకంలో 100 గ్రాముల ఎయిర్-ఫ్రైడ్ మసాలా చికెన్, 150 గ్రాముల అన్నం, 100 గ్రాముల గ్రీక్ పెరుగు, సైడ్గా తాజా క్యారెట్, దోసకాయ సలాడ్ ఉంటాయి. ఇది లీన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, తాజా కూరగాయల మిశ్రమం.గ్రీన్ చట్నీ చికెన్ మీల్ఈ చివరి ప్లేట్లో ఎయిర్-ఫ్రైడ్ చేసిన రెండు గ్రీన్ చట్నీ చికెన్ లెగ్స్, 150 గ్రాముల పాలక్ పనీర్, 120 గ్రాముల అన్నం, ఒక ఉడికించిన బీట్రూట్ ఉంటాయి. ఇది ప్రోటీన్ను ఆకుకూరలతో నియంత్రిత పరిమాణంలో అన్నంతో మిళితం చేస్తుంది.సాచీ డైట్ విధానాన్ని చూస్తే..ఆమె ఎక్కడా..అన్నం తినడం మానలేదు లేదా తనకు ఇష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయలేదు. దానికి బదులుగా, ఆమె తగినంత ప్రోటీన్, కూరగాయలు, నియంత్రిత పరిమాణాలతో కూడిన సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టింది. అలాగే ఆమెలో ఈ మార్పు రాత్రికి రాత్రే జరగలేదు. అందుకోసం ఆమెకి మూడేళ్లు పట్టింది. తక్షణ ఫలితాలనిచ్చే డైట్ల కంటే చిన్నగా, నిలకడైన అలవాట్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని సాచీ వెయిట్లాస్ జర్నీ నిరూపించింది. View this post on Instagram A post shared by Saachi | Fat Loss. Real Talk. Pilates. (@saachi.pai)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Weight Loss: జస్ట్ మూడేళ్లలో 47 కేజీలు..! ఆ ఐదింటితోనే బరువు మాయం..) -
జస్ట్ మూడేళ్లలో 47 కేజీలు..!ఆ ఐదింటితోనే బరువు మాయం..
బరువు తగ్గడం అనేది కాలంతో చేసే పరుగులాంటిది. కేవలం నిలకడైన మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు, ఓర్పు, సహనం, పట్టుదలతోనే సాధ్యమవుతుంది. అదే నిరూపించింది ఈ మహిళ. ఏకంగా వంద కేజీలపైనే బరువు ఉన్న ఈ మహిళ అద్భుతంగా వెయిట్లాస్ అయ్యి స్ఫూర్తిగా నిలిచింది. ఏకంగా 47 కేజీలపైనే బరువు తగ్గడం విశేషం.హేలీ అనే మహిళా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మూడేళ్లలో ఈ ఫలితాన్ని అందుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మొదట తాను 116 కేజీలపైనే అధిక బరువుతో ఇబ్బంది పడ్డట్లు తెలిపింది. మూడేళ్ల పాటు నిలకడగా చక్కటి జీవనశైలి మార్పులను అనుసరించి బరువు తగ్గినట్లు తెలిపారు. అందుకోసం అనుసరించిన ఐదు ముఖ్యమైన ఆహారపు మార్పులు గురించి పంచుకున్నారు. బరువు తగ్గడం కోసం..వాకింగ్..దీన్ని చాలా తేలిగ్గ చూస్తుంటాం. కానీ తాజా గాలిలో జస్ట్ ఓ 30-45 నిమిషాలు నడవడం మన ఆలోచనలను మార్చి అద్భుతమైన మార్పుని తీసుకొస్తుందని అన్నారు.తగినంత నీరు తాగడంక్రమం తప్పకుండా తగినంత నీరు త్రాగడం ఆహార కోరికలను నియంత్రిస్తుందని అన్నారు. అలాగే తన పనులకు అవసరమైన శక్తి అంతా తిరిగి లభిస్తుందని చెప్పుకొచ్చింది. నీటి తోపాటు ప్రతిరోజూ ఒక గ్లాసు ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలని కూడా సూచించారామె.ప్రోటీన్ తీసుకోవడంప్రతిరోజూ కనీసం వంద గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని అన్నారు. దీనివల్ల కడుపు నిండిన అనుభూతి తోపాటు కండరాలను కోల్పోమని అన్నారు. కొవ్వుని కరిగించడం సులభమవుతుందని అన్నారు.ఉదయపు అలవాట్లుఉదయం నిద్రలేచిన తర్వాత వ్యాయామం లేదా ధ్యానం చేయాలని, అలాగే కనీసం 30 నిమిషాల పాటు ఫోన్లకు దూరంగా ఉండాలని ఆ మహిళ సూచించారు. ఇలా రెండు వారాలు పాటించి చూస్తే ఒత్తిడి మాయం అయ్యి మంచి నిద్ర పడుతుందని అన్నారు. అలాగే మానసిక స్పష్టత, ఏకాగ్రత, ప్రశాంతత తదితరాల్లో మెరుగుదలను చూస్తారని చెబుతోంది.ఫైబర్ వినియోగంఎక్కువ ఫైబర్ ఉన్న మూడు రకాల కూరగాయలను తినమని సూచిస్తోంది. ఇది కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణం చేసి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడే కాకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుందని అంటోంది. చివరగా శరీరం చెప్పే మాట వింటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని సాకులకు తావివ్వకుండా అనుసరిస్తే బరువు తగ్గడం సులభమని చెబుతోందామె.ఆమె సిఫార్సు చేశారు, ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణం చేయడానికి, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి మరియు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో రన్నింగ్, నో కార్డియో..! జస్ట్ 20 నిమిషాల నడకతో 24 కిలోలు..) -
పుచ్చకాయలో దాగిన ఆరోగ్య రహస్యాలు..
పుచ్చకాయకు దాదాపు నాలుగువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు ఎడారి దారుల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తప్పనిసరిగా వెంట తీసుకుపోయేవారు.ఆఫ్రికాలో మొదలైన పుచ్చకాయ ప్రస్థానం దాదాపు ప్రపంచమంతటా పాకింది. పుచ్చకాయ ఏడాది పొడవునా పండుతుంది. వేసవి ప్రారంభం నుంచి వేసవి ముగిసే లోపు అత్యధికంగా పండుతుంది.పుచ్చకాయలో అత్యధిక శాతం నీరు ఉంటుంది. వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనం కోసం బాగా పనికొస్తుంది. పుచ్చకాయలో అనేక విలువైన పోషకాలు కూడా ఉంటాయి. రుచులకు మెచ్చుకాయ అయిన పుచ్చకాయ విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం... -
అది అంత ప్రమాదమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!
మా ఏడేళ్ల బాబుకు తరచు దగ్గు వస్తోంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. పిల్లికూతలు కూడా వినిపిస్తున్నాయి. డాక్టర్ ఇన్ హేలర్ వాడమన్నారు. కానీ ఇంట్లో వాళ్లు ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం అదే వాడాల్సి వస్తుందని భయపెడుతున్నారు. నిజంగానే ఇన్ హేలర్ అంత ప్రమాదకరమా? అది అలవాటు అవుతుందా?– సుమలత, విజయవాడ.ఇది మీ ఒక్కరి సందేహం కాదు. పిల్లలకు దగ్గు, వీజింగ్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు ప్రతి పేరెంట్ అడిగే మొదటి ప్రశ్న ఇదే. నిజానికి ఇన్ హేలర్ వల్ల పిల్లలకు ప్రమాదం ఉండదు. కాని, సరైన సమయంలో ఇన్హేలర్ను ఆలస్యం చేయడమే అసలు ప్రమాదం. సమయానికి సరైన చికిత్స అందకపోతే ఊపిరితిత్తుల్లో వాపు పెరిగి, శ్వాస సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. భయంతో చికిత్సను వాయిదా వేయడం కంటే, సరైన నిర్ధారణ చేయించుకుని వైద్యుడి సూచన మేరకు చికిత్స ప్రారంభించడం మంచిది. అందుకే ఇప్పుడు ఇన్ హేలర్, ఉబ్బసం, అలాగే ఆధునిక లంగ్ ఆసిలోమెట్రీ పరీక్షల గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం.ఇన్ హేలర్ అంటే స్టెరాయిడ్స్ మందా? అది ప్రమాదకరమా?కాదు. ఇది చాలామందిలో ఉన్న అపోహ మాత్రమే. ఇన్ హేలర్లోని మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. అందుకే చాలా తక్కువ మోతాదులోనే మంచి ఫలితం ఇస్తుంది. శ్వాసనాళాల్లోని వాపు తగ్గి, పిల్లికూతలు, రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతాయి. పిల్లలు మళ్లీ హాయిగా పరుగులు తీస్తూ ఆటలు ఆడగలుగుతారు. వైద్యుడి సూచన మేరకు వాడితే ఇన్ హేలర్ పూర్తిగా సురక్షితమైన చికిత్స.ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం వాడాలా?అసలు కాదు. ఇన్ హేలర్ అలవాటు చేసే మందు కాదు. అవసరమైనంత కాలం మాత్రమే వాడాల్సిన చికిత్స. పిల్లల ఆరోగ్యం మెరుగైతే వైద్యుడు మోతాదును క్రమంగా తగ్గిస్తారు. చాలామంది పిల్లల్లో పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితి వేరు కాబట్టి, చికిత్స వ్యవధి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది.వీజింగ్ ఉన్న ప్రతి చిన్నారికీ ఇన్ హేలర్ అవసరమా?అన్ని వీజింగ్లూ ఆస్తమా కావు. వైరస్ ఇన్ ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర శ్వాస సమస్యల వల్ల కూడా వీజింగ్ రావచ్చు. అందుకే కారణం తెలుసుకోకుండా ఇన్ హేలర్ ప్రారంభించకూడదు. ముందుగా సరైన పరీక్షలు చేసి సమస్యను నిర్ధారించడం చాలా ముఖ్యం.లంగ్ ఆసిలోమెట్రీ పరీక్ష అంటే ఏమిటి?పిల్లల ఊపిరితిత్తుల పనితీరును సులభంగా అంచనా వేసే ఆధునిక పరీక్షే లంగ్ ఆసిలోమెట్రీ. ఇందులో సూదులు ఉండవు, నొప్పి ఉండదు, బలంగా ఊదాల్సిన అవసరమూ లేదు. మూడేళ్ల నుంచి చిన్నారులకు కూడా ఈ పరీక్ష చేయవచ్చు. కొద్ది నిమిషాల్లో పూర్తయ్యే ఈ పరీక్ష ద్వారా ఉబ్బసం ఉందా, చిన్న శ్వాసనాళాల్లో వాపు ఉందా, ఇన్ హేలర్ అవసరమా, ఇస్తున్న చికిత్స సరిగా పనిచేస్తోందా వంటి విషయాలను వైద్యుడు కచ్చితంగా గుర్తించగలుగుతారు. దీంతో అవసరమైన పిల్లలకు మాత్రమే సరైన చికిత్స అందించి, అనవసరంగా ఇన్ హేలర్ వాడాల్సిన పరిస్థితిని నివారించవచ్చు.ప్రతి దగ్గుకూ ఇన్ హేలర్ అవసరమా?లేదు. దగ్గు రావడానికి వైరస్ ఇన్ఫెక్షన్లు, ముక్కు అలర్జీ, సైనస్ సమస్యలు, కడుపులోని ఆమ్లం పైకి రావడం, అడినాయిడ్ సమస్యలు, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు ఉంటాయి. పిల్లవాడు బాగున్నాక కూడా పరీక్ష అవసరమా?అవసరం ఉండొచ్చు. బయటకు దగ్గు, దమ్ము తగ్గిపోయినా ఊపిరితిత్తుల్లో స్వల్ప వాపు కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిని ఈ పరీక్ష ద్వారా గుర్తించి చికిత్స కొనసాగించాలా, తగ్గించాలా లేదా పూర్తిగా ఆపాలా అనే విషయాన్ని వైద్యుడు నిర్ణయిస్తారు.వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు పిల్లలకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తే, పెదాలు లేదా గోళ్లు నీలిరంగులోకి మారితే, పిల్లలు మాట్లాడలేకపోయినా, తినలేకపోయినా, ఇన్ హేలర్ వాడిన తర్వాత కూడా ఉపశమనం లేకపోయినా, తరచు వీజింగ్ వస్తున్నా లేదా రాత్రిపూట దగ్గు వల్ల నిద్రపట్టకపోయినా వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇన్ హేలర్ అనేది భయపడాల్సిన చికిత్స కాదు. సరైన సమయంలో ప్రారంభిస్తే అది పిల్లల ఊపిరితిత్తులను రక్షించే నమ్మకమైన మిత్రుడు. అవసరం లేనప్పుడు వాడకూడదు. అవసరమైనప్పుడు మాత్రం ఆలస్యం చేయకూడదు.- డా. కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్మేనిమాట..నమలడానికి పని ఇస్తే మెదడు మేల్కొంటుంది! గట్టిగా ఉండే పండ్లు, కూరగాయలు నమలడం వల్ల దవడలకే కాదు, మెదడుకూ మేలు జరుగుతుంది. నమిలే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి, అప్రమత్తత మెరుగుపడుతుంది. అంటే... ఒక యాపిల్ తినడం కూడా మెదడుకు చిన్న మేల్కొలుపే! -
ఐదు పదుల వయసులోనూ యంగ్గా నటి శోభనా..! ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..
"యమునా తటిలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధా.."అన్న పాట రాగానే అలనాటి అందాల నటి శోభనా(actress Shobana) టక్కున గుర్తొస్తారు. ఆమె తన కళ్లతో అభినయం పలికించగల గొప్ప నటి. 90ల టైంలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన నటి. అంతేగాదు మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. కొంతకాలం సినిమాలకు దూరమై..నాట్యానికి జీవితానని అంకితం చేశారామె. మళ్లీ ఇటీవల కల్కి మూవితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత నితేష్ తివారీ ప్రతిష్టాత్మక పౌరాణిక ఇతిహాసం 'రామాయణం'లో కనిపించనున్నారు. అందులో రావణుడిగా నటిస్తున్న యశ్ తల్లి కైకేసి పాత్రను పోషించనుందామె. అలాగే ఆమె చెన్నైలో నృత్య అకాడమీ 'కళాతర్పణ'ను కూడా నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె 54 ఏళ్లు. ఈ వయసులోనూ అంతే గ్లామర్గా పిట్గా ఉంటారు శోభనా. తను ఇంతలా ఎనర్జిటిక్గా, హెల్దీగా ఉండటానికి కారణం ఏమిటో ఒక ఇంటర్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించారు. మరి ఆమె అనుసరించే ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆమె భారత్లోనూ విదేశాల్లోనే నృత్య ప్రదర్శనలిస్తుంటారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో తప్పకుండా ప్రదర్శనలిస్తుంటారామె. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఫిట్గా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తానని చెప్పారామె. అలాగే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానన్నారు. ఆమె ప్రోటీన్ షేక్లు, డైటింగ్ రెండిటిని పాటిస్తానని చెప్పారు. ఈ విధానం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారని అన్నారు. అలా ఎందుకంటే తన ఆకలి ఎక్కువగా ఉంటుందని అందుకని ఇలా చేస్తానని అన్నారామె. తన బిజీ షెడ్యూల్కి అనుగుణంగానే ఆహారపు అలవాట్లు రూపొందించుకుంటానని తెలిపారామె. వేదికపై శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు కొనసాగిస్తున్నందున సమతుల్యమైన ఆహారమే తీసుకోవాలని చెప్పారు. అయితే తాను ఏడాదంతా ఒకేరకమైన డైట్ ప్లాన్ని పాటించనని చెప్పారామె. తన శరీరానికి అనుగుణంగా దినచర్యను మార్చుకుంటూ..బరువుని అదుపులో ఉంచడంపై అటెన్షన్ పెడతానని అన్నారామె. ఒక్కోసారి మూడు రోజుల డైట్ని పాటిస్తే..మరికొన్నిసార్లు ఏకంగా ఏడుసార్లు డైట్ పాటిస్తానని చెప్పారు. ఒక్కోసారి క్రాష్ డైట్ కూడా పాటిస్తానని ధీమాగా వెల్లడించారు. తను ప్రతిసారా కఠినమైన భోజన ప్రణాళిక అనుసరించకుండా అవసరమైనప్పుడల్లా షెడ్యూల్ని సర్దుబాటు చేసుకుంటానని తెలిపింది అందాల శోభన. దూరంగా ఉంచే ఆహారాలు..అధిక కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులకు చాలా దూరంగా ఉంటానని అన్నారు. పిజ్జా, బర్గర్లు, పాస్తా, బ్రెడ్, శాండ్విచ్లు, నూనెలో అధికంగా వేయించిన ఆహారాలకు బహుదూరంగా ఉంటానని చెప్పారామె. థాయి వంటకాలు, కొన్ని రకాల డెజర్ట్లంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. కాగా ఇక్కడ అందాల నటి శోభన కూడా తన శరీరం మాట వింటూ అందుకు అనుగుణంగా డైట్ని అనుసరిస్తున్నట్లు నొక్కి చెప్పారు. ఏ డైట్ అయినా గుడ్డిగా కాకుండా శరీరానికి పడేది..అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అని చెప్పకనే చెబుతోంది కదా ఈ నటి డైట్.(చదవండి: ఒంటరిగా ఫ్లైట్ జర్నీ..ఆ మహిళను ఎంతలా మార్చిందంటే?) -
హ్మ్..! చెప్పులు బయట!! పెద్దల హెచ్చరికలో పరమార్థం ఏంటంటే?
కొంతమంది బయట వాడే చెప్పులు, షూ లను ఇంట్లో కూడా వాడేస్తుంటారు. వారు ఇది పాదాల శుభ్రతకు సంబంధించిన అంశంగా భావించినప్పటికీ, ఇది ఆరోగ్యానికి సంబంధించిన అంశం కూడా. ఎందుకంటే మీరు షూలను, చెప్పులను మాత్రమే ఇంటిలోకి తీసుకెళ్లరు.. వాటితో పాటుగా లక్షలాది క్రిములను, బ్యాక్టీరియాను కూడా వెంట తీసుకెళ్తుంటారు.బూట్ల అడుగుభాగంలో ఈ.కోలై, సి.డిఫిసిల్, స్టెఫిలోకోకస్ వంటి ప్రమాదకర బాక్టీరియాలు అధిక మొత్తంలో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇవి కడుపునొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో ఇది మరింత ప్రమాదకరం. వారు తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే కీళ్ల నొప్పులు, పాదాల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నేలపై నడవడం వల్ల సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇండోర్ స్లిప్పర్స్ ఉపయోగించాలి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బయట వాడకూడదు. ఇంటిగుమ్మం వద్దే షూలను వదిలేయడం అనేది ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు.. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఒక సులభమైన అలవాటు. -
ప్లీజ్ పసిపిల్లలు ఏడవగానే అలా చేయొద్దు..!
ఎక్కువ మంది పేరెంట్స్ శిశువులు ఏడువగానే వెంటనే వారిని కంట్రోల్ చేయడానికి ప్యాసిఫైయర్ నోట్లో పెట్టేస్తుంటారు. దీంతో వెంటనే శిశువులు ఏడుపు మానేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో శిశువుకి, తల్లికి ఉపశమనం కలిగించినప్పటికీ.. అదే పనిగా ఉపయోగించడం మాత్రం అంతమంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాసిఫైయర్ నిత్యం సకింగ్ చేయడం వల్ల పిల్లల్లో దంతాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. పసివయసులో ఉపయోగిస్తే పెద్దగా సమస్య ఉండకపోయినా, 18 నెలల వయస్సు దాటిన తర్వాత కూడా వాడితే పళ్ల అమరిక దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్యాసిఫైయర్ను ఎక్కువగా ఉపయోగిస్తే చెవి ఇన్ఫెక్షన్లతోపాటు సకింగ్ వల్ల చెవి సంబంధిత నాళాలపై ఒత్తిడి పడుతుంది. రాత్రి వేళల్లో ప్యాసిఫైయర్ ఊడిపోగానే పిల్లలు ఏడుస్తుంటారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రుల నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సివచ్చినపుడు ఎప్పుడూ సింగిల్ పీస్వే ఎంచుకోవాలి. వాటిపై తేనె లేదా తియ్యటి పదార్థాలను రాయకూడదు. అలాగే వీటిని క్రమం తప్పకుండా స్టెరిలైజ్ చేస్తుండాలి. పగుళ్లు వస్తే వెంటనే మార్చేయాలి.ఇది ఒక ఆప్షనే కానీ తప్పనిసరి అవసరం కాదు. తల్లి పాలు ఇవ్వడం బాగా అలవాటైన తర్వాత అవసరమైతేనే ఉపయోగించాలి. పిల్లలు దీనిని సకింగ్ చేయడానికి ఇష్టపడకపోతే బలవంతంగా అలవాటు చేయడానికి ప్రయత్నించొద్దు. 12 నెలల వయస్సు దాటిన తర్వాత దీని వాడకాన్ని క్రమంగా తగ్గించడం శ్రేయస్కరం. (చదవండి: అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..) -
అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..
బరువు తగ్గడంలో సత్వర ఫలితాలు కోసం క్రాష్ డైట్లు జోలికిపోకుడండా పలువురు క్రమశిక్షణతో కూడిన జీవినశైలితో అమాంతం స్మార్ట్గా మారి ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరు స్ట్రిక్ట్ డైట్ల జోలికపోకుండా చేస్తే..కొందరు కఠినమైన డైట్లతో కడుపు నిండిన అనుభూతికి ప్రాధాన్యత ఇస్తూ కిలోల కొద్దీ బరువు తగ్గి చూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వాడు ఈ వ్యాపారవేత్త. జస్ట్ నెల రోజుల్లోనే 22 కేజీల పైనే బరువు తగ్గడం విశేషం. ఆ వెయిట్లాస్ జర్నీలో హెల్ప్ అయిన ఆహార పదార్థాల గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఆయనే కేరళకు చెందిన వ్యాపారవేత్త డాక్టర్ షిబిన్ మాథ్యు. ఒకప్పుడు దాదాపు 110 కేజీల బరువు ఉండేవారు. కఠినమైన దినచర్య, పటిష్టమైన ఆహార ప్రణాళిక, జీవనశైలి మార్పులు చక్కటి పరివర్తనకు దారితీస్తాయని అన్నారు. క్రమశిక్షణ సవ్యంగా ఉంటే దాని ఫలితమే చెబుతుందని అంటున్నారు. సరైన ఆహార ప్రణాళిక, చక్కటి జీవనశైలి మార్పులు మంచి రూపుకి దారితీస్తుందని నమ్మకంగా చెప్పారు. తనకు బరువు తగ్గడంలో సహాయపడిన రోజువారి అధిక ప్రోటీన్ ఆహారం గురించి ఇలా చెప్పుకొచ్చారు. బరువు తగ్గడానికి రోజువారీ ఆహారంఆయన తన రోజును ఒక కప్పు కాఫీ, రెండు గుడ్లు, మిరప నూనెతో కలిపిన రెండు స్కూప్ల అధిక ప్రోటీన్ పెరుగుతో ప్రారంభిస్తారు. ఈ భోజనం కడుపు నిండిన అనుభూతిని కలిగించి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది. అధిక ప్రోటీన్ ఆహారాలు, కెఫిన్, కారమైన కొవ్వులను మిళితం చేస్తుంది. ఈ అల్పాహారం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, ఉదయం పూట వచ్చే నీరసాన్ని నివారిస్తుంది.మధ్యాహ్న భోజనానికి, మాథ్యూ ఎక్కువగా ఒక చికెన్ బ్రెస్ట్తో పాటు ఒక గుడ్డు, ఒక స్కూప్ అధిక ప్రోటీన్ ఉన్న పెరుగు తీసుకునేవాడు. సలాడ్ల కోసం, అతను తాజా దోసకాయలను ఎంచుకున్నాడు. ఈ కలయిక కడుపు నిండుగా ఉంచడానికి అవసరమైన లీన్ ప్రోటీన్ను అందిస్తుంది.బరువు తగ్గడానికి సహాయపడటానికి, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక నీటి శాతం ఉన్న తక్కువ కేలరీల కూరగాయలు కూడా ఉంటాయి. శాకాహారులైతే గుడ్లకు బదులుగా అర కప్పు గట్టిగా, ముక్కలుగా చేసి, పెనంపై వేయించిన టోఫును, చికెన్కు బదులుగా మసాలాలతో కాల్చిన టెంపే లేదా సీటాన్ను తీసుకోవడం మంచిదని సూచించారు.మధ్యాహ్న భోజనం తర్వాత అతను సాధారణంగా తక్కువ మోతాదులో ఆహారం తీసుకునేవాడినని అన్నారు. రాత్రి పడుకునే ముందు, అతను ఒక కప్పు కాఫీ.ఒక ఆపిల్కు మాత్రమే పరిమితమైనట్లు తెలిపారు.తన కఠినమైన డైట్ దినచర్య గురించి వివరిస్తూ అతను ఇలా అన్నాడు, కఠినమైన ఆహార లోటు, అధిక ప్రోటీన్ తోపాటు సాకులకు తావివక్కపోతే..కచ్చితంగా బరువు తగ్గుతారు. నిర్దిష్ట లక్ష్యాల కోసం తీవ్రమైన ఆహార కోత తప్పనిసరని అంటున్నారు.అలాగే ఏ డైట్ రొటీన్ను గుడ్డిగా అనుసరించవద్దని, తమ శరీరం చెప్పేది వినాలని హెచ్చిరిస్తున్నారు. అంతేగాదు ఇలాంటి తీవ్రమైన ఆహార నియమాన్ని ప్రారంభించే ముందు నిపుణులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు కూడా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Shibin Mathew (@mathewdotin) (చదవండి: Ravi Kishan Weight Loss: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్లాస్ జర్నీ..! ఓమాడ్తో ఏకంగా 18 కేజీలు..) -
జంక్ ఫుడ్ చిన్నారుల ఆరోగ్యంపై ఇంతలా ప్రభావం చూపిస్తుందా?
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వే, పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జంక్ ఫుడ్ వినియోగం విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, వారి విద్యా పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడైంది.సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల 13,274 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం జరిగింది. సర్వే ఫలితాల ప్రకారం, వీరిలో 93 శాతం మంది విద్యార్థులు వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ను తింటున్నారు. ఈ గణాంకాలు ఆరోగ్య నిపుణులను కలవరపరుస్తున్నాయి.జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందంటే..ఏకాగ్రత: జంక్ ఫుడ్లో చక్కెర అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు వేగంగా పెరిగి, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. దీని ఫలితంగా విద్యార్థుల దృష్టి పదేపదే మళ్లుతుంది, చదువుపై దీర్ఘకాలం ఏకాగ్రత నిలపడం కష్టమవుతుంది.జ్ఞాపకశక్తి: కొవ్వు మరియు అదనపు చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనం పేర్కొంది. దీని వల్ల విద్యార్థులు సమాచారాన్ని గుర్తుంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడం కష్టమవుతుంది.శారీరక ఆరోగ్యం: విద్యార్థుల్లో అలసత్వం పెరుగుతోందని సర్వే వెల్లడించింది. పోషకాహార లోపం వల్ల టైప్-2 మధుమేహం, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా చిన్నారుల్లో కనిపిస్తున్నాయి. అలాగే, ఫైబర్ లోపం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతోంది.మానసిక ఆరోగ్యం: జంక్ ఫుడ్లోని కృత్రిమ రంగులు, అదనపు చక్కెర కారణంగా విద్యార్థుల్లో హైపర్యాక్టివిటీ, చిరాకు, తరచుగా మానసిక కల్లోలం వంటి లక్షణాలు పెరుగుతున్నట్లు ఆధారాలు లభించాయి. బరువు పెరగడం, తదనుగుణ ఆరోగ్య సమస్యల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతోంది.68 శాతం మంది విద్యార్థులు ఇలాంటి ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారని సర్వే తెలిపింది. ఇది ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారం పిల్లల నిత్య జీవితంలో ఎంతగా భాగమైపోయిందో స్పష్టం చేస్తోంది.ఈ ఫలితాలను తీవ్రంగా పరిగణించాలని ఆరోగ్య నిపుణులు తల్లిదండ్రులను, పాఠశాలలను, విధాన నిర్ణేతలను కోరుతున్నారు. పాఠశాల క్యాంటీన్లలో అమ్మే ఆహారంపై నిఘా పెంచాలని, పోషకాహార లేబుళ్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలని వారు సూచిస్తున్నారు. పిల్లలు ఏమి తింటున్నారు అనేది వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపైనే కాక, పాఠశాలలో వారి పనితీరు, రోజువారీ మానసిక స్థితిపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఈ నివేదిక గుర్తు చేస్తోంది.(చదవండి: తాత గారు వేళకు మందులు వేసుకోవాలని..! టీనేజ్ యువకుడి అద్భుత ఆవిష్కరణ..) -
తాతయ్య వేళకు మందులు వేసుకునేలా..మనవడి అద్భుత ఆవిష్కరణ!
మన అవసరాలు, ఇబ్బందులే ఒక్కోసారి ఆవిష్కరణకు దారితీస్తాయి. ఒక్కోసారి మన ప్రియమైన వాళ్ల కోసం కొంగొత్త ఆవిష్కరణలకు నాందిపలుకుతాయి. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి అన్ని తానై పెంచిన తాత బాగోగులు కోసం ఈ మనవడు ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. షాంఘైకి చెందిన 18 ఏళ్ల విద్యార్థి మాకై తన తాత వేళకు మందులు వేసుకునేలా గుర్తు చేయడానికి సహాయపడేలా ఓ యాప్ని రూపొందించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. తన తాతగారిపై ఉన్న అపారమైన ప్రేమ ఈ యాప్ రూపకల్పనకు దారితీసిందని చెబుతుండటం విశేషం. ఇటీవలే సెకండరీ స్కూల్ పూర్తి చేసిన మా కై, జూన్లో చైనా జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అయిన గావోకావోను రాశాడు.జూలై మధ్యలో షాంఘైలో జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC)కు హాజరైనప్పుడు షాంఘై మార్నింగ్ పోస్ట్ అతడిని ఇంటర్వ్యూ చేయడంతో ఈ కథ వెలుగులోకి వచ్చింది. బీజింగ్కు చెందిన ఏఐ కంపెనీ మోడల్బెస్ట్ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) అయిన మినీసీపీఎం (MiniCPM)ను ఉపయోగించి తాను ఈ యాప్ను రూపొందించినట్లు మా వివరించాడు. ఆ కాన్ఫెరెన్స్లో కంపెనీకి చెందిన కొంతమంది నిపుణులు వస్తారని తెలిసి, వారిని ప్రశ్నలు అడగడానికి వచ్చానని అతను చెప్పాడు. తాతగారి కోసం రూపొందించిన యాప్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఇందులో కేవలం కొన్ని లైన్ల కోడ్ మాత్రమే ఉందని వెల్లడించాడు. తాను రూపొందించిన యాప్ మందులు వేసుకోవాలని గుర్తు చేయడమే కాకుండా, యూజర్ ప్యాకేజింగ్ ఫోటోని అప్లోడ్ చేసినట్లయితే..మందుల గడువు ముగిసిందో లేదో కూడా ఈ యాప్ తనిఖీ చేయగలదుని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మందుల గడువు ముగిసినట్లయితే వేసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తుందని తెలిపాడు. చిన్ననాటి నుంచి అన్నీ తానై తాతగారే పెంచారని, ఆయనతో ఉన్న అనుబంధం మాటలకందనిదని పంచుకున్నాడు. ప్రస్తుతం 70 ఏల్ల వయసులో ఉన్న ఆయనకు కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించాడు. తాను కాలేజ్కి వెళ్లిపోయినా..ఆయన వేళకు మందులు వేసుకోవాలనే ఆరోగ్య సంరక్షణ నిమిత్తమే ఈ యాప్ని రూపొందించానని అన్నాడు. తన తాతగారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటం వల్ల మందులు వేసుకోవడం మర్చిపోతారేమో లేదా వాటిని తికమక పడతారేమో అని ఆందోళనతోనే ఇలా యాప్ని ఆవిష్కరించినట్లు వెల్లడించాడు. పొరపాటున గడువు మందులు తీసుకుంటే పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన, భయమే ఈ యాప్ని రూపొందించడానికి కారణమని చెప్పాడు. కాగా, తాను వచ్చే నెల సెప్టెంబర్లో మరో నగరంలోని విశ్వవిద్యాలయలంకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఇష్టమనేది అవతలి వాడి బాధ్యత, సంరక్షణను హ్యాండిల్ చేయడమని తన జీవనశైలితో చాటి చెప్పాడు కదూ..!.(చదవండి: ‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్లాస్ జర్నీ..! ఓమాడ్తో ఏకంగా 18 కేజీలు..) -
మెలనోమా హెచ్చరిక సంకేతాలు: పుట్టుమచ్చలు డేంజరా?
శరీరంపై పుట్టుమచ్చలు (Moles) ఉండటం సాధారణ విషయం. వీటిలో చాలా వరకు జీవితాంతం ఎలాంటి సమస్య కలిగించవు. అయితే ఒక పుట్టుమచ్చ ఆకారం, రంగు లేదా ఆకృతిలో మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవి మెలనోమా అనే తీవ్రమైన స్కిన్ కేన్సర్కు ప్రారంభ సంకేతాలు కావచ్చు. క్లీవ్ల్యాండ్ క్లినిక్, బ్రిటన్ NHS సూచనల ప్రకారం, ప్రతి మారిన పుట్టుమచ్చ కేన్సర్ కాదు, కానీ సకాలంలో పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.ప్రతి పుట్టుమచ్చ స్కిన్ కేన్సర్ సంకేతమేనా?క్లీవ్ల్యాండ్ క్లినిక్, NHS ప్రకారం, చాలా పుట్టుమచ్చలు పూర్తిగా సాధారణమైనవి, జీవితాంతం ఎలాంటి సమస్యా కలిగించవు. అయితే కొన్ని సందర్భాల్లో చర్మానికి రంగునిచ్చే కణాలైన మెలనోసైట్లలో అసాధారణ మార్పులు జరిగి మెలనోమా అభివృద్ధి చెందవచ్చు. ఇతర స్కిన్ కేన్సర్లతో పోలిస్తే మెలనోమా తక్కువగా కనిపించినా, ఇది శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని త్వరగా గుర్తించడం చాలా అవసరం.ఏ మార్పులపై వెంటనే దృష్టి పెట్టాలి?అనుమానాస్పద పుట్టుమచ్చలను గుర్తించడానికి వైద్యులు "ABCDE రూల్"ను ఉపయోగిస్తారు:A – Asymmetry (అసమాన ఆకారం): పుట్టుమచ్చలో ఒక భాగం మరో భాగం కంటే భిన్నంగా కనిపించడం.B – Border (అనియమిత అంచులు): అంచులు అస్పష్టంగా, కోతల్లా లేదా అసమానంగా ఉండటం.C – Color (రంగులో మార్పు): ఒకే పుట్టుమచ్చలో నలుపు, గోధుమ, ఎరుపు, తెలుపు లేదా నీలం వంటి అనేక రంగులు కనిపించడం.D – Diameter (పరిమాణం): పుట్టుమచ్చ దాదాపు 6 మిల్లీమీటర్ల కంటే పెద్దగా ఉండటం లేదా వేగంగా పెరగడం.E – Evolving (నిరంతర మార్పు): కాలక్రమేణా ఆకారం, రంగు, ఎత్తు లేదా అనుభూతిలో మార్పు రావడం, లేదా దురద, నొప్పి, రక్తస్రావం మొదలవడం.మెలనోమా ప్రమాదం ఎవరిలో ఎక్కువ?WHO, NHS, క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం, ఈ కారణాలు మెలనోమా ప్రమాదాన్ని పెంచవచ్చు:సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాలకు దీర్ఘకాలం గురికావడంపదేపదే సన్బర్న్లు కావడం, ముఖ్యంగా బాల్యం లేదా కౌమార దశలోశరీరంపై చాలా ఎక్కువ లేదా అసాధారణ ఆకారంలో పుట్టుమచ్చలు ఉండటంకుటుంబంలో స్కిన్ క్యాన్సర్ చరిత్ర ఉండటంటానింగ్ బెడ్లను ఉపయోగించడంఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?కింది మార్పులు కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు:పాత పుట్టుమచ్చ ఆకారం, రంగు లేదా ఆకృతి మారడం30 ఏళ్ల వయసు తర్వాత కొత్త పుట్టుమచ్చ కనిపించడంపుట్టుమచ్చ నుంచి రక్తస్రావం, పొక్కు ఏర్పడటం లేదా నిరంతర దురదపుట్టుమచ్చ చుట్టూ నొప్పి, వాపు లేదా ఎరుపు రంగు రావడంశరీరంలోని మిగతా పుట్టుమచ్చలకు పూర్తిగా భిన్నంగా కనిపించే పుట్టుమచ్చ ("Ugly Duckling Sign")చాలా పుట్టుమచ్చలు హానికరం కానప్పటికీ, అసాధారణ మార్పులు కనిపించినప్పుడు సకాలంలో వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు, ఎందుకంటే మెలనోమాను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స మరింత ప్రభావవంతంగా ఉంటుంది.(చదవండి: మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్లాస్ జర్నీ..! ఓమాడ్తో ఏకంగా 18 కేజీలు..) -
‘మద్దాలి శివారెడ్డి’గా అలరించిన రవికిషన్ వెయిట్లాస్ జర్నీ..!
‘రేసుగుర్రం’ మూవీలో ‘మద్దాలి శివారెడ్డి’గా తన విలనిజంతో అలరించిన తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రవి కిషన్. భోజపురి సూపర్ స్టార్ అయిన ఆయన.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా ప్రజా నాయకుడిగా మన్ననలను అందుకుంటున్నారు. అలాంటి ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ 57 ఏళ్ల వయసులో చక్కటి ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తన వెయిట్లాస్ జర్నీ గురించి వెల్లడించారు. తను కావాలంటే బరువు పెరగగలను, అదుపులోనూ ఉంచుకోగలనని అన్నారు. అయితే బరువు తగ్గడం కోసం కఠిన ఆహార నియమాలతో పనిలేదని చెబుతున్నారు. స్థిరమైన జీవనశైలి మార్పులతోనే సులభంగా బరువు తగ్గొచ్చని అంటున్నారు. మరి అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా చూద్దామా.!.రవికిషన్ తాను వెయిట్లాస్ జర్నీలో తక్షణ పరిష్కారాల కంటే పౌష్టికరమైన భోజనం, క్రమం తప్పని వ్యాయామం, క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. తాను ఒకప్పుడు సుమారు 90 కేజీల దాక బరువు ఉండేవాడినని, ప్రస్తుతం 72 కేజీల వరకు తగ్గానని అన్నారు. కండరాలు పెంచుకుంటూ, సన్నబడుతున్నానని అన్నారు. రాజకీయ విధులు, గోరఖపూర్ నియోజకవర్గ పర్యటనలు కారణంగా కొంత బరువు పెరిగానని అన్నారు. దాంతో తను పండ్లతో కూడిన ఆహారం తింటూ స్లిమ్గా అయ్యానని అన్నారు. తినే విధానం మార్చుకుంటూ సుమారు 18 కేజీలు దాక తగ్గినట్లు వెల్లడించారు. వెండి తెరపై వచ్చే పాత్రల కారణంగానే ఫిట్గా మారాల్సి వచ్చిందన్నారు. తాను "'లాపటా లేడీస్' కోసం బరువు పెరగాల్సి వచ్చిందన్నారు. మళ్లా 'మిర్జాపూర్: ది మూవీ'లో సన్నగా కనిపించగా, 'నాగ్జిల్లా'లో నేను సూపర్-ఫిట్ బాడీతో ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే 50 ఏళ్ల వయసులో మాత్రం..ఇదంతా అంత సులభం కాదని అన్నారు. అయితే ఆహారపు అలవాట్లలో మార్పులతో దాన్ని ఈజీగా సాధించొచ్చని అన్నారు. మనం తినేది సుమారు 70-80% అని, మిగిలిందంతా వ్యాయామమేనని అన్నారు. ఇక తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ..కేవలం పండ్లకే పరిమతం కానని చెప్పారు. 'వన్ మీల్ ఏ డే' అనే ఓమాడ్ టెక్నిక్ని ఫాలో అవుతానని అన్నారు. అంటే..ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోవడం, మధ్యంతర ఉపవాసం లేదా కేవలం పండ్లు మాత్రమే తినడం. రవి కిషన్ అలాంటి డైట్ని చేయగలిగే శక్తి ఆ మహాదేవుడు తనకిచ్చిన వరంగా అభివర్ణించారు. అయితే రాజకీయ బాధ్యతలను నిర్వర్తించడానికి దానిలో కొద్దిగా మార్పులు చేస్తుంటానని అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే రోజుల్లో..తన డైట్ విధానం మారిపోతుందట. ఆ రోజుల్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, సలాడ్ తీసుకుంటానని అన్నారు. అవసరం అనుకుంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, నెయ్యి కూడా తీసుకుంటానని అన్నారు. తనకు ఇష్టమైన పండ్ల గురించి మాట్లాడుతూ..తన భోజనంలో తప్పనిసరిగా అవకాడో, కివీ, ఆపిల్, అరటిపండ్లు, నారింజ, తాజా పండ్ల రసాలు ఉంటాయని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, కండరాల ఆరోగ్యానికి క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలని రవి కిషన్ నొక్కి చెప్పారు.(చదవండి: కేలరీల లోటు పద్ధతితో ఏకంగా 26 కిలోలు..! ఎలా చేయాలంటే..) -
కేలరీల లోటు పద్ధతితో ఏకంగా 26 కిలోలు..! ఎలా చేయాలంటే..
బరువు తగ్గడం తరుచుగా సవాలుగా అనిపించొచ్చు. విపరీతమైన ఆకలి కోరికలు, స్థిరత్వం లేని పురోగతి చాలామందిని వెయిట్లాస్ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గేలా నిరుత్సాహపరుస్తుంది. అలాంటి వారికీ ఈ మహిళ పాటించిన టెక్నిక్ హెల్ప్ అవ్వొచ్చు. ఆరోగ్యకరమైన అవాట్లతోటే స్థిరంగా బరువు తగ్గింది. తిరిగి పెరగకుండా మెయింటైన్ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. అదెలాగో సవివరంగా ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.ఆ మహిళా కంటెంట్ క్రియేటర్ అందుకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. కేలరీల వినయోగంలో అటెన్షన్తో వ్యవహరించి సుమారు 26 కిలోలు వరకు తగ్గినట్లు తెలిపింది. కేలరీల లోటు అనే భావనను అర్థం చేసుకోవడమే తన ఫిట్నెస్ ప్రయాణంలో ఒక ఒకకొత్త మలుపు అని చెబుతోంది. శ్వాస తీసుకోవడం, ఆలోచించడం, కదలడం, శారీరక ప్రక్రియలను నిర్వహించడం వంటి ప్రాథమిక విధులను నిర్వర్తించడానికి ప్రతి వ్యక్తి శరీరానికి నిర్దిష్ట సంఖ్యలో కేలరీలు అవసరం. ఆ సంఖ్యను మెయింటెనెన్స్ కేలరీలు అంటారు. దానిపై అటెన్షన్ ఉంచితే బరువు తగ్గడం సులభం అని అంటున్నారు. మనం ఖర్చు చేసే కేలరీల కంటే అతిగా తింటే బరువు పెరగడానికే దారితీస్తుందని అన్నారు. అదే సమయంలో మెయింటెనెన్స్ కంటే తక్కువగా తినడం క్యాలరీల లోటును సృష్టిస్తుంది. ఇది కాలక్రమేణా బరువు తగ్గడానికి దారితీస్తుందని వెల్లడించింది. తాను సుమారు రెండువేల కేలరీలతో ప్రారంభించి, రోజుకు సుమారు 1,450 కేలరీలకు చేరుకుని ప్రతి వారం 100 నుంచి 150 కేలరీల చొప్పున ఆహారం తీసుకోవడాన్ని తగ్గించుకున్నానని అన్నారు. ఆమె ఈ లోటును 12 వారాల పాటు కొనసాగించి, ఆ తర్వాత మళ్లీ దాన్ని రిపీట్ చేస్తూ బరువు తగ్గుతూ వచ్చానని అన్నారు. ఇది ఎలాంటి తీవ్రమైన డైటింగ్ పద్ధతులను పాటించకుండా 26 కిలోల బరువు తగ్గడానికి దారితీస్తుందని అన్నారు.కేలరీల లోటుని ఎలా లెక్కించాలి..ఉచిత ఆన్లైన్ TDEE (మొత్తం రోజువారీ శక్తి వ్యయం) కాలిక్యులేటర్ను ఉపయోగించి, మీ వయసు, ఎత్తు, బరువు ఆదారంగా అనుసరించాల్సిన కేలరీల వివరణ ఇస్తుంది. చిన్నగా కేలరీల లోటు మొదలుపెట్టి దాదాపు వంద నుంచి 300 దాక కేలరీలు తగ్గించండి. అలాగే ప్రతివారం పురోగతని చెక్చేయండి. ఒకవేళ ఫలితం కనిపించకపోతే కేలరీల లోటుని కొద్దిగా తగ్గించి, శారీరక శ్రమను పెంచాలని చెప్పుకొచ్చింది. చివరగా ఆమె వెయిట్లాస్ జర్నీతో కేలరీల లోటుని సరైన విధంగా నిర్వహిస్తే స్థిరంగా బరువు తగ్గడం అనేది అత్యంత సులువైన మార్గమని చెబుతోందామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ritm | Desi Fat Loss (@ritmsfitness) (చదవండి: ఎవరీ మిరాండా గిబ్సన్? ఏకంగా 449 రోజులు..) -
ప్లీజ్ శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు..! పాపం ఆ 26 ఏళ్ల మహిళ..
గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్పై అవగాహన కల్పిస్తున్న టెక్సాస్కు చెందిన 26 ఏళ్ల మహిళ చివరి సందేశం నెట్టింట వైరల్గా మారింది. ఆమె కన్నీటి కథ నెటిజన్లను కదిలించింది. అంతేగాదు తనలా మరెవ్వరూ అలాంటి అనారోగ్య సమస్య బారిన పడకూడదని చివరి క్షణాల వరకు పడిన తపన ప్రతిఒక్కర్ని కదిలిస్తోంది. అంతేగాదు ప్రజలదర్నీ శరీరం విషయంలో బీకేర్ఫుల్గా ఉండమని కోరుతూ పంపిన సందేశం ఆ వ్యాధిపై అందరికీ అవగాహన ఉండాలనే విషయాన్ని నొక్కి చెప్పింది. ఇంతకీ ఎవరా మహిళ?, ఏ వ్యాధి గురించి ఇంతలా ఆమె మాట్లాడారు అంటే..గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్పై అవగాహన కల్పిస్తోంది టెక్సాస్కు చెందిన 26 ఏళ్ల మహిళ అలోండ్రా సియెర్రా. ఆమె తన మరణానికి ముందు వరకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అంతేగాదు వ్యాధిని ముందుగా గుర్తిస్తే..ఎంత బిగ్ రిలీఫ్ ఉంటుందో వివరించింది. అది మన మనుగడకు ఎంత కీలకమో కూడా నొక్కి చెప్పింది. సియెర్రా కేవలం 19 ఏళ్ల వయసులో నుదిటిపై మచ్చ ఏర్పడటం గమనించింది. కాలక్రమేణా, అది లేత రంగు నుంచి ముదురు రంగులోకి మారింది. కానీ అది కేన్సర్ కాగలదని ఎప్పుడూ ఊహించలేదు. ముఖ్యంగా మెలనోమా వచ్చే అవకాశం ఉందని కలలో కూడా ఊహించలేదని అంటోంది. కానీ ఈ ఏడాది చివరి నాటికి ఈ చికిత్స తను తీసుకున్నప్పటికీ.. విజయవంతం కాలేదని తెలిపింది. అంతేగాదు తనలా మరెవ్వరు ఈ వ్యాధి బారినపడకూడదనే ఉద్దేశ్యంతో గత నాలుగేళ్లుగా సూర్యరశ్మి నుంచి రక్షణ, క్రమం తప్పని చర్మ పరీక్షల ప్రాముఖ్యత గురించి సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తోంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రోత్సహిస్తోంది కూడా. అలాగే కృత్రిమ యూవీ మూలాలతో ఉన్న ప్రమాదాల గురించి కూడా మాట్లాడారామె. అలాగే ఇలాంటి వాటిన బారినపడకుండా తీసుకోవాల్సిన చర్చలు, ముందస్తు పరీక్షల గురించి కూడా అవగాహన కల్పించే యత్నం చేసింది. అంతేగాదు తగ మే నెలలో మెలనోమా అవగాహన మాసం పురస్కరించుకుని పంచుకున్న వీడియో ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది. ఆ వీడియోలో సియెర్రా.. "నివారణ అనేది మనుగడకు సంబంధించిన విషయంగా అభివర్ణించింది. ఈ నెల వేడుకలకు ప్రతీక అయితే ఎంత బాగుండును, కానీ బదులుగా మనుగడకు ప్రతీకగా నిలుస్తోంది. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం ఇదే నా వాస్తవికత. చాలామందికి మే 1వ తేదీ, మెలనోమా అవగాహన మాసం ప్రారంభం. అలాగే మరో నెల మాత్రమే. నాకు మాత్రం, ఇది నివారణ, ఇది ప్రచారం. ఇది జీవితం, ఇది మనుగడ అని భావోద్వేగంగా మాట్లాడింది వీడియోలో". తన పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్నా..తానెలాగో ఈ వ్యాధిని ముందుగా గుర్తించలేకపోయానని..కనీసం ఇతరులకకైన సహాయపడాలని..ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని వయసుల వారు తన చర్మాన్ని జాగ్రత్తగా గమనించాలని చెప్పింది. పుట్టుమచ్చ రంగు, ఆకారం, పరిమాణంలోని తేడాలను నిర్లక్ష్యం చేయొద్దని కోరిందామె. ఒకవేళ ఆలస్యం చేస్తే..తల నుంచి చెవుల వెనుక వరకు..అలాగే రొమ్ము, పాదాలు, జననాంగాల వరకు ఎలా వ్యాపిస్తుందో వివరిస్తూ..తన సంభాషణను ముగించింది. కానీ అదే ఆమె చివరి వీడియోగా మిగిలింది. ఎందుకంటే..స్టేజ్ 4 మెలనోమా కేన్సర్తో సుదీర్ఘ పోరాటం చేసి ఈ నెల జూలె 17న మరణించింది. మందుగా ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటే..ఈ మెలనోమాను ముందుగా గుర్తించే హెచ్చరిక సంకేతాల కోసం చర్మవ్యాధినిపుణులు ABCDE అనే నియమాన్ని అనుసరించమని సూచిస్తున్నారు. A - అసమానతB – అంచులలో క్రమరాహిత్యంC - రంగులో వైవిధ్యంD - 6 మి.మీ కంటే పెద్ద వ్యాసంE – పరిమాణం, ఆకారం లేదా రంగులో మార్పులుకాగా సియెర్రా..అధునాతన కేన్సర్తో పోరాడుతున్నప్పటికీ, జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను జరుపుకుంది. ఆమె 2024లో కళాశాల నుంచి పట్టభద్రురాలైంది, అదే ఏడాది ఆ వ్యాధి తన శరీరం అంతటా వ్యాపించిందని తెలుసుకుంది. ఈ ఏడాది మార్చిలో, రేడియేషన్ చికిత్స పూర్తి చేసిన కొద్ది రోజులకే, ఆమె అమెరికా పౌరసత్వం పొంది మరో కలను నెరవేర్చుకుంది. అంతేగాదు తన కథ ద్వారా, ఇతరులు కూడా తమ చర్మంలో అనుమానాస్పద మార్పులను ముందుగానే గుర్తించి, ఆలస్యం కాకముందే వైద్య సలహా తీసుకోవాలని సియెర్రా ఆశించింది. చివరి వరకు ఆమె ఆ లక్ష్యం కోసమే పోరాడిందని కన్నీటి పర్యంతమైంది ఆమె కుటుంబం. View this post on Instagram A post shared by Alondra Sierra (@alondrasierrat)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలను వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హీర్ అజిత్ డైట్ సీక్రెట్..! ఆఖరికి పోషకాహార నిపుణుల సైతం..) -
హీర్ అజిత్ డైట్ సీక్రెట్..! ఆఖరికి పోషకాహార నిపుణుల సైతం..
తమిళ నటుడు అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన సినిమాలతో వైవిధ్యభరితమైన నటనతో మెప్పిస్తుంటాడు ఈ సూపర్ స్టార్. ప్రముఖ హీరోయిన్ షాలిని పెళ్లాడిని ఆయన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటారనేది.. పలు ఇంటర్వ్యూల్లో అజిత్ చెప్పిన మాటలే నిదర్శనం. ఆఖరికి ఇటీవల పద్మభూషణ్ అవార్డుని గెలుచుకున్నప్పుడూ కూడా ఆ క్రెడిట్ మొత్తాన్ని భార్యకే ఇచ్చేశారు. ఫ్యామిలీకి, కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఆయన డైట్ విషయంలో ఎంత కేర్గా ఉంటారో తెలిస్తే విస్తుపోతారు. అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆయన వ్యక్తిగత పోషకాహార నిపుణురాలు దివ్య కె పురుషోత్తం అరవింద్ సురేష్ పాడ్కాస్ట్లో పంచుకున్నారు. అవేంటంటే..తాను చాలామంది సెలబ్రిటీలో పనిచేశాను కానీ అజిత్ ఫ్యామిలీ ఆహారం విషయంలో పాటించే క్రమశిక్షణను చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటానని అన్నారు దివ్య. అది కేవలం అజిత్ సార్లోనే కాదు మేడమ్ షాలిని కూడా ఆహారం విషయంలో చాలా కేర్గా ఉంటారని చెప్పారు. తను నోట్లో పెట్టుకునే ప్రతి ఆహారానికి, తన పిల్లలకు, ఇంట్లో పనిచేసే వాళ్లకు కూడా మంచి ఆహారమే ఉండేలా చూస్తారు. శుభ్రంగా, ఆరోగ్యకరమైనది, పోషకాలతో కూడినదే తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజంగా ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం అని అన్నారామె. నిపుణులు ఏం అంటున్నారంటే..ఇంతలా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమేనని, ముఖ్యంగా మితంగా తినడం మంచిదని అన్నారు. ఇలా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు. ఇలాంటి శ్రద్ధ ఫలితం అధిక జంక్ ఫుడ్, చక్కెర, నూనె పదార్థాలకు దూరంగా ఉండగలుగుతారని అన్నారు. శ్రద్ధగా ఉండటం మంచిదే కానీ ప్రతి ముద్దను తనిఖీ చేసేంత అతి వద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంట్లో వండిన తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి తప్ప..అందుకోసం ఆందోళనల, ఒత్తిడి వద్దన్నారు. క్లీన్ ఈటింగ్కి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు ఆరోగ్య నిపుణులు.“క్లీన్ ఈటింగ్” అంటే ..క్లీన్ ఈటింగ్ అనే భావనను తరచుగా ఖరీదైనదిగా లేదా పరిమితమైనదిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. “క్లీన్ ఈటింగ్ అంటే పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, ఇంట్లో వండిన తాజా భోజనం వంటి సహజమైన ఆహారాన్ని తినడం. ఇది ఏమి ఠినమైన డైటింగ్ కూడా కాదు. కేవంల ఎక్కువగా ప్రాసెస్ చేసే జంక్ఫుడ్కి దూరంగా ఉండటం లాంటిది. ఇంట్లో క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తే..పిల్లలు కూడా ఆటోమేటిగ్గా ఆ అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. View this post on Instagram A post shared by Love Theory Media ™️ (@lovetheorymedia) (చదవండి: మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా) -
కంగనా రనౌత్ వైరల్ కేన్సర్ స్టోరీ..నిజంగానే అధిక ప్రోటీన్ ప్రమాదకరమా?
50 ఏళ్లు లోపు వారిలో పెరుగుతున్న కేన్సర్ కేసుల గురించి నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పెద్ద దుమారం రేపి.. వివిధ చర్చలకు దారితీసింది. ఆమె ఆ పోస్ట్లో ప్రోటీన్ సప్లిమెంట్ల పట్ల పెరుగుతున్న ప్రజాదరణ గురించి మాట్లాడారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్రోటీన్ షేక్లకు దూరంగా ఉండాలని అన్నారు. అవి కేన్సర్ వంటి ఆరోగ్య ప్రమాదాలను మరింత పెంచేస్తాయని నొక్కి చెప్పారు. దాంతో ఒక్కసారిగా శరీరానికి అవసరమైన దానికంటే అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే చాలా ప్రమాదకరమా అని చర్చలు మొదలయ్యాయి నెట్టింట. నిజంగా ఇది ఎంతవరకు సమంజసం అంటే..కండరాల మరమ్మత్తు, కణజాల నిర్వహణ, హార్మోన్ల ఉత్పత్తి, రోగనిరోధక పనితీరుకు ప్రోటీన్ ఒక ముఖ్యమైన స్థూల పోషకం. ఇది గుడ్లు, చేపలు, చికెన్, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, బీన్స్, నట్స్, విత్తనాలలో సహజంగా లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది కండరాల పునరుద్ధరణకు, నిర్వహణకు తోడ్పడుతుంది. అలాగని అధికంగా తీసుకోవడం మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏదైన సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెబుతున్నారు.ప్రోటీన్ షేక్ల వల్ల కేన్సర్ వస్తుందా అంటే..ప్రోటీన్ షేక్ల వల్లనే కేన్సర్ వస్తుందనడానికి ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు. దీన్ని ఒక నిర్దిష్ట ఆహారానికి లేదా సప్లిమెంట్కు ముడిపెట్టలేమని అన్నారు. అయితే కొన్ని ప్రోటీన్ షేక్లు, బార్లు, ఇతర ఫిట్నెస్ ఉత్పత్తులలో అదనపు చక్కెరలు, అధిక కేలరీలు లేదా అధికంగా ప్రాసెస్ చేయబడిన పదార్థాలు ఉంటాయి. అందువల్ల అలాంటివి నిత్యం తీసుకుంటే బరువుని అదుపులో ఉంచుకోవడం కష్టతరమవుతుంది.ఎవరికీ మంచిది కాదంటే..ప్రోటీన్ను సరైన మోతాదులో తీసుకున్నప్పుడు ఆరోగ్యవంతులకు సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, కొన్ని వైద్య పరిస్థితులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచే కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులు వైద్య పర్యవేక్షణలో ప్రోటీన్ తీసుకోవడాన్ని మార్చుకోవలసి ఉంటుంది. ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు కూడా తమ ఆహారంలో ముఖ్యమైన మార్పుల గురించి వైద్యులను సంప్రదించాలి.ఎంత ప్రోటీన్ అవసరం?ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ప్రోటీన్ అవసరాలు గణనీయంగా మారుతూ ఉంటాయి. ఈ క్రింది అంశాలు:వయస్సుశరీర బరువుశారీరక శ్రమవ్యాయామ తీవ్రతఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలుగర్భధారణ స్థితిఫిట్నెస్ లక్ష్యాలుతదితరాలు వ్యక్తిగత ప్రోటీన్ అవసరాలను ప్రభావితం చేయగలవు. శారీరకంగా చురుకుగా ఉండే లేదా బలం పెంచే శిక్షణ పొందుతున్న వారికి, నిశ్చల జీవనం గడిపే వ్యక్తి కంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం కావొచ్చు. కేవలం ఫిట్నెస్ ట్రెండ్లను అనుసరిస్తూ కాకుండా, నిజమైన పోషకాహార అవసరం ఉన్నప్పుడు మాత్రమే సప్లిమెంట్లను ఉపయోగించాలి అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ప్రోటీన్ సప్లిమెంట్ల కంటే ఆహారమే మేలా?చాలా మందికి, ప్రోటీన్ అవసరాలను వైవిధ్యమైన, సమతుల్యమైన ఆహారం ద్వారా పొందొచ్చు. అవేంటంటే..గుడ్లుచేపలుచికెన్పాలు, పెరుగుపనీర్పప్పు, బీన్స్సోయా, టోఫుగింజలు, విత్తనాలుసంపూర్ణ ఆహారాలు ప్రోటీన్తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. కేవలం ఆహారం ద్వారా ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడంలో ఇబ్బంది ఉన్నవారిలో, కొన్ని పరిస్థితులలో ప్రోటీన్ సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. అయితే, అవి ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయంగా కాకుండా, దానికి అనుబంధంగా ఉండాలి.కేన్సర్ ప్రమాదాన్ని పెంచేవి ఏమిటి?కేన్సర్కు ఒకే ఒక్క కారణం లేదు. ఈ వ్యాధి రావడానికి అనేక కారకాలు దోహదపడతాయి, వాటిలో కొన్నింటిని మార్చవచ్చు, మరికొన్నింటిని మార్చలేము. ముఖ్యమైన ప్రమాద కారకాలు:పొగాకు, మద్యంఅధిక శరీర బరువుశారీరక శ్రమ లేకపోవడంకుటుంబ చరిత్ర, జన్యువులుపర్యావరణ కారకాలకు గురికావడంజీవనశైలి మార్పులతో కేన్సర్ ప్రమాదానికి చెక్..ప్రతి క్యాన్సర్ను నివారించలేనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు అనేక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గించి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువగా ప్రాసెస్ చేసిన ఇతర ఆహారపదార్థాల తోపాటుసమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. క్రమం తప్పని శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం, పొగాకుకు దూరంగా ఉండటం, మద్యపానాన్ని పరిమితం చేయడం తోపాటు తప్పనిసరిగా కేన్సర్ స్క్రీనింగ్ వంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం తదితరాలతో ఆ కేన్సర్ ప్రమాదాన్ని నివారించొచ్చు. -
అరుదైన 'మెదడు'ని పోలిన తల చర్మ వ్యాధి..! చివరికి లైఫ్నే..
కొన్ని అరుదైన వ్యాధులు ఎందువల్ల వస్తాయనేది అంతుచిక్కదు. పోనీ నయం చెయ్యొచ్చ అంటే అదికూడా కష్టమే. అలాంటి వ్యాధిని నయం చేసి అతడి రూపాన్నే మార్చేసి బాధపెట్టిన మనోవ్యధకు ఉపశమనం కలిగించారు వైద్యలు. ఇంతకీ అతడికి వచ్చిన రుగ్మత ఏంటంటే..చైనాలోని హునాన్ ప్రావిన్స్కు చెందిన లీ అనే 23 ఏళ్ల యువకుడు మానవ మెదడు ఉపరితలాన్ని పోలిన లోతైన మడతల తల చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. అతుడు ఈ సమస్యను చిన్నతనంలో గమనించాడు. తన చర్మం గట్టిపడటాన్ని గమనించాడు. చూస్తుండగానే మందంగా మారి పెద్ద అసమాన మడతలు వచ్చేశాయి. అతనికి 14 ఏళ్లు వచ్చేసరికి, ఈ అసాధారణ పెరుగుదల అతని తల చర్మంలో దాదాపు సగానికి వ్యాపించి అతడి రూపురేఖల్నే మార్చింది. అది కాస్తా అతడి ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపింది. ఏళ్ల తరబడి పలు ఆస్పత్రులలో చికిత్స పొందాడు. ఫలితంగా ఆరోగ్యకరమైన తల చర్మం కణజాలం చాలా తక్కువగా మిగిలి, విపరీతమైన మచ్చలను మిగిల్చింది. పైగా పెద్దగా ఫలితం లేదు. దాంతో పలు ఆస్పత్రులను సంప్రదించగా..ఆరోగ్యకరమైన చర్మ కణజాలం లేనందున సర్జరీ ప్రమాదకరమని నిరాకరించాయి. లీ చివరకు జోంగ్నాన్ ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో డాక్టర్ జౌ బృందాన్ని సంప్రదించారు. ఆ వైద్యులు వీలైనంత ఎక్కువ ఆరోగ్యకరమైన తల చర్మాన్ని కాపాడటానికి వారు అతని ఇప్పటికే ఉన్న మచ్చల రేఖలను ఉపయోగించుకున్నారు. గతేడాది వైద్యులు అతని తల చర్మంలోని రెండు ప్రాంతాల కింద టిష్యూ ఎక్స్పాండర్లను అమర్చారు.తదుపరి 11 నెలల పాటు, వారు క్రమంగా ఎక్స్పాండర్లలోకి ద్రవాన్ని ఎక్కించి, పునర్నిర్మాణం కోసం తగినంత కణజాలాన్ని సృష్టించడానికి ఆరోగ్యకరమైన చర్మాన్ని నెమ్మదిగా సాగదీశారు. ఫలితంగా తగినంత ఆరోగ్యకరమైన తల చర్మం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత వైద్యులు అసాధారణ కణజాలాన్ని తొలగించి, ప్రభావిత ప్రాంతాన్ని బాగుచేయడానికి మూడు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం లీ తల చర్మం సాధారణంగా కనిపించడమే గాక, చర్మంపై జుట్టు సాధారణంగా పెరగగలదని వైద్యులు తెలిపారు. దీంతో ఇన్నాళ్ల నుంచి లీ అనుభవించిన మనోవ్యధకు మగింపు పలికినట్లయింది. (చదవండి: ఆ గ్రామం కనుమరుగ్వకుండా పోరాడిన ఒకేఒక్కడు..! ఇవాళ ప్రపంచమే..) -
98 కేజీల నుంచి 78 కేజీలకు..! హెల్ప్ అయిన డైట్ప్లాన్..
అధిక బరువు కొందరికీ జంక్ఫుడ్, అనారోగ్యకరమైన జీవనశైలి వంటివి ప్రధాన కారణాలు. మరికొందరు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే డెస్క్ జాబ్లు, సరైన కదలికలు లేకపోవడంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తగ్గడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినా..సక్సెస్ అయినవాళ్లు మాత్రం కొందరే. ఎందువల్ల అంటే ఇక్కడ నిలకడ, క్రమం తప్పకుండా చేయడం అనేవి అత్యంత కీలకం. ఇక్కడొక మహిళ కూడా లాక్డౌన్ కారణంగా కదలికలు లేక ఊహించిన విధంగా లావుగా అయిపోయింది. చివరికి కార్డియో వ్యాయమాలు, సరైన డైట్తో బరువు తగ్గడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది. ఆ మహిళే..ఆనంద్ భార్గవ్. తాను 2020లో ఉన్నత విద్యను అభ్యసించడానికి మెల్బోర్న్ వెళ్లింది. మునుసటి నెలలోనే లాక్డౌన్ ప్రకటించారు. ఇంటి నుంచి కాలేజ్కి హాజరవడం వంటి కారణాల వల్ల కదలికలేని జీవనశైలికి దారితీసి, గణనీయంగా బరువు పెరిగిందామె. ఫలితంగా ఊబకాయ సంబంధిత లక్షణాలను అనుభవించింది. జిమ్లో చేరి తగ్గాలని చూసినా..పెద్దగా ప్రయోజనం లేకపోగా, మరింత ఆకలికి దారితీసి నియంత్రణ కోల్పయింది. దాంతో ఆయాసం, పాదాల వాపు వంటి సమస్యలు ఎదుర్కొంది. రక్తపరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నా, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, ఒళ్లునొప్పులు వంటి ఊబకాయం సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. దాని ఫలితంగా కోపం, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువైనట్లు తెలిపింది. ఇక బరువు తగ్గగపోతే కష్టమనే పరిస్థితి ఎదురైంది ఆమెకు. దాంతో ఎలాగైన బరువు తగ్గాని డిసైడ్ అందుకోసం ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలిపింది. తనకు భారతీయ వంటకాలంటే మహా ఇష్టమని, అందుకని ఆ రుచిపోకుండా డైట్ ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించింది. తన అధిక బరువుని అమాంతం తగ్గేలా చేసిన సాధరణ డైట్ ప్లాన్ని కూడా పంచుకుంది. ఉదయం: చియా సీడ్ వాటర్, అల్లం-నిమ్మకాయ నీరు, సోంపు, వాము నీరు, గుప్పెడు నట్స్అల్పాహారం: అవకాడో టోస్ట్, పోహా, ఎయిర్-ఫ్రైడ్ బ్రెడ్ పకోరా, లేదా పీనట్ బటర్ టోస్ట్ఉదయం పూట చిరుతిండి: ఆయా కాలాల్లో లభించే పండ్లుమధ్యాహ్న భోజనం: రాజ్మా రైస్ లేదా కధి రైస్తో పాటు 100 గ్రాముల సలాడ్, 100 గ్రాముల పెరుగుసాయంత్రం చిరుతిండి: గ్రీన్ టీ లేదా కాఫీ, వేయించిన నట్స్, వేయించిన మఖానా, భేల్ లేదా ఖాఖ్రారాత్రి భోజనం: పప్పు అన్నం, రాగి లేదా బజ్రా రోటీ, కూరగాయలు, బీన్స్ లేదా పులావ్ఈ ఆహారంతో పాటు, ఆమె తగినంత నీరు తాగడంపై కూడా దృష్టి సారించింది. ఆమె ప్రతిరోజూ తప్పనిసరిగా నీరు తాగేది, దీనివల్ల బరువు పెరిగిన తర్వాత తరచుగా వచ్చే కండరాల నొప్పులను నివారించగలిగింది.ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్యను పాటించడం ద్వారా, ఆమె తన శక్తి స్థాయిలు పెరగడాన్ని గమనించడం ప్రారంభించింది. ఆమె మరింత చురుకుగా మారడమే కాకుండా, ఆదిత్య తన మొత్తం ఆరోగ్యం మెరుగుపడటాన్ని కూడా చూసింది. ఆమె గతంలో ఎదుర్కొన్న సమస్యలు వాటంతట అవే తగ్గడం ప్రారంభించాయి. క్రమంగా, ఆమె జిమ్లో చేరి, కార్డియో వ్యాయామాలు చేసి, చివరికి 20 కిలోల బరువు తగ్గింది. అలాగే ఆమె ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని కొనసాగిస్తూనే ఉండాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకుందామె.(చదవండి: అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం) -
84 కేజీల నుంచి 54 కేజీలకు..! ఈజీగా చేసే కార్డియో వ్యాయామాలివే..
బరువు తగ్గడం అంటే తక్షణ పరిష్కారాల కోసం చూడకుండా.. బదులుగా నిలకడగా చేయగలిగే అలవాట్లను అనుసరించడం అని నొక్కి చెబుతుంటారు ఫిట్నెస్ నిపుణులు. అందుకోసం సక్రమమైన జీవనశైలి, చక్కటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాల్సిందే. అలాగని కష్టతరమైనవి కాకుండా తేలిగ్గా చేసే వర్కౌట్లు, రిపిటేషన్స్ ప్రధానం అని అంటోంది ఫిట్నెస్ ఔత్సాహికురాలు అంజలి సచెన్. చేసే వ్యాయామాలు సెట్స్ వారిగా రిపిటేషన్ చేస్తే చాలు..కష్టతరమైన వాటి జోలికి పోనవసరం లేదంటోంది. అంతేగాదు తేలిగ్గా చేసే కార్డియో వ్యాయమాల వివరాలను కూడా ఆమె పంచుకున్నారు. అవేంటంటే..అంజలి సచెన్ అనే ఈ మహిళ, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే తాను 84 కేజీల నుంచి 54 కేజీలకు తగ్గినట్లు తెలిపింది. అందుకోసం ఎలాంటి కార్డియో వ్యాయామాలు చేసేదో వెల్లడించారామె. అదనపు కొవ్వుని తగ్గించుకోవడానికి సహాయపడే వ్యాయామాలు ఇవే..హై నీస్ (మోకాళ్లకు వ్యాయామం)ఆమె 20 రెప్స్తో నాలుగు సెట్లు హై నీస్ చేయడంతో ప్రారంభించారు. ఈ డైనమిక్ కార్డియో వ్యాయామంలో, మోకాళ్లను తుంటి ఎత్తుకు తీసుకువస్తూ..చేతులను పంప్ చేస్తూ ఒకే చోట పరుగెత్తాలి లేదా నడవాలి. ఇది హృదయ స్పందన రేటును పెంచడానికి, శరీర దిగువ భాగం శక్తిని పెంపొందించడానికి, కోర్ను ఉత్తేజపరచడానికి ఒక అద్భుతమైన వ్యాయామం.జంపింగ్ జాక్స్తరువాత, ఆమె జంపింగ్ జాక్స్ను 50 రెప్స్తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామంలో, ఆమె తన మోకాళ్లను కొద్దిగా వంచి గెంతింది, తన కాళ్లను బయటకు చాస్తూ, చేతులను బయటకు ఊపుతూ వాటిని ఒక వంపులో పైకి లేపింది.కిక్బ్యాక్స్ఆమె సిఫార్సు చేసిన తదుపరి వ్యాయామం కిక్బ్యాక్స్. ఉత్తమ ఫలితాల కోసం కనీసం 20 రెప్స్తో మూడు సెట్లు చేయమని ఆమె సలహా ఇచ్చింది. ఆమె తన చేతులను తుంటిపై ఉంచి నిలబడి, తన కాళ్లను వెనక్కి తన్ని, చేతులను తాకడానికి ప్రయత్నించింది.జంపింగ్ స్క్వాట్స్ఈ జంపింగ్ స్క్వాట్స్ను కూడా 12 రెప్స్తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామం ఒక ప్రామాణిక బాడీవెయిట్ స్క్వాట్ను నిలువు జంప్తో మిళితం చేస్తుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతూ కాళ్ల బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.జంపింగ్ లంజెస్సాధారణ లంజెస్ కు బదులుగా, జంపింగ్ లంజెస్లో కాళ్ళను రెండుగా చాపి నిలబడి, నిలువుగా పైకి ఎగిరి గాలిలోనే కాళ్ళ స్థానాలను మార్చుకుని, వేగంగా తిరిగి లోతైన లంజ్ భంగిమలోకి దిగాలి. ఈ వ్యాయామాన్ని 10 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆ ఇన్ఫ్లుయెన్సర్ సలహా ఇచ్చారు.మౌంటెన్ క్లైంబర్స్చివరి వ్యాయామంగా, మౌంటెన్ క్లైంబర్స్ను 15 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆమె సిఫార్సు చేశారు. ఆమె సాధారణ 'ప్లాంక్' (plank) భంగిమలోకి వచ్చి, ఒక మోకాలిని తన ఛాతీ వైపునకు లాగి, వెంటనే తిరిగి మొదటి స్థితికి తీసుకువచ్చింది. ఈ వ్యాయామం శరీర మధ్య భాగం (కోర్) బలాన్ని,భుజాల స్థిరత్వాన్ని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.చివరగా, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు కడుపు ఉబ్బరంగా కనిపించేలా చేస్తాయని ఆమె పేర్కొంది. వీటికి బదులుగా, అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, పాలకూర, అవకాడోలు, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడే ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని ఆమె సూచించింది. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్రని అనుసరించి.వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం చేయడం ఉత్తమం. (చదవండి: వర్షాకాలంలో బియ్యం పాడవ్వకూడదంటే..!) -
76 ఏళ్ల వయసులోనూ అంతే ఫిట్గా రాకేశ్ రోషన్..! ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం..
బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్ రాకేష్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తాను రాణించలేకపోయినా..కుమారుడు హృతిక్ రోషన్ని వెండితెరకు పరిచయం చేసి హీరోగా వెలుగొందేలా చేశాడు. అలాగే దర్శకుడిగా, మంచి స్క్రీన్ రైటర్గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు. ఈ వయసులో కూడా ఎంతో ఫిట్గా, స్మార్ట్గా ఉండటమే కాదు..యువ హీరోలకు తీసిపోని విధంగా గ్లామరస్గా కనిపిస్తుంటారు. ఆయన అంత ఏజ్లోనూ అంతలా ఎలా స్లిమ్గా చురుకుగా ఉన్నారు. అందుకోసం ఏం చేస్తుంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు వంటి విషయాల గురించి సవివరంగా చూద్దామా!.ప్రముఖ చిత్ర నిర్మాత రాకేశ్ రోషన్ 76 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్నెస పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి తనకు సహయపడిని అలవాట్ల గురించి తన కుమార్తె సునైనా రోషన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో జరిపిన సంభాషణలో వెల్లడించారు. అంతేగాదు తాను అనుసరించే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి గురించి కూడా చెప్పారు. వయసు పెరిగే కొద్దీ మరింతగా శిక్షణ పొందాలని, అదే మనల్ని ఫిట్గా ఉంచుతుందని అన్నారు. 65 లేదా 70 ఏళ్ల తర్వాత భుజాలు వంగిపోయి, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చిన వారిని చూశానని అన్నారు. కఠినమైన డైట్ తోపాటు క్రమం తప్పకుండా జిమ్,వెయిట్ ట్రైనింగ్ చేస్తుతంటానని అన్నారు. మంచి ఆరోగ్యానికి వ్యాయామం కంటే ఆహారమే ముఖ్యమని అన్నారు. అంతేగాదు మనం ఆరోగ్యంగా ఉండటంలో వ్యాయామం కేవలం 10% మాత్రమేనని, మిగిలిన 90% తీసుకునే ఆహారమేనని అన్నారు. గత మూడేళ్లుగా ఇలాంటి జీవనశైలిని ప్రారంభించానని, ఇది తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. తాను బాగా నిద్రపోతానని, ఉత్సాహంగా మేల్కొంటానని చెప్పారు. అది ఇవాళ తనకొక దినచర్యగా మారిందని అన్నారు. వ్యాయామం చేయాలనే మూడ్ లేని రోజుల్లో ఏం చేస్తారని కుమార్తె అడగ్గా..అలా చాలా అరుదుగా జరుగుతుందని, ఆ టైంలో కూడా తనను తాను చేసేలా ప్రేరేపించుకుంటానని అన్నారు. తనకు బద్ధకంగా అనిపించి వ్యాయామం చేయాలనిపించకపోయినా..జిమ్లోకి అడుగుపెట్టి, తనకు సాధ్యమైనంత మేరకు వర్కౌట్లు చేస్తుంటానని అన్నారు. ఆయన అనేది శిక్షణ కంటే హాజరు ముఖ్యం అనుకుంటే..కనీసం వార్మప్ వ్యాయామాలైనా చేయగలుగుతామని అన్నారు. ప్రతిరోజూ ఎలాగైతే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం చేస్తామో, వ్యాయామం కూడా మన దినచర్యలో ఒక భాగం కావాలని అన్నారు. అలా అనుకుని చేస్తే ఆరోగ్య సమస్యల బారిన పడరని, పైగా పోరాడే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. అయినా అంతర్గతంగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడు జీవితం చాలా సులభం అవుతుందని అన్నారు. ఇక కుమార్తె సునైనా రోషన్ సైతం..తండ్రి మాటలకు మద్దతిస్తూ.తాను కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోనో తన ఆరోగ్యంలో నిజంగా పెద్ద మార్పు చోటుచేసుకుందంటూ తన అనుభవాన్ని పంచుకుంది. అందువల్లే తనకు గ్రేడ్1 ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిందని పేర్కొంది. కాగా, రాకేష్ రోషన్కు 2019లో గొంతు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నారు. అప్పటి నుంచి ఈ చిత్ర నిర్మాత క్రమం తప్పని వ్యాయామం, ఆలోచనాత్మకమైన ఆహారాన్ని తన దినచర్యలో భాగంగా చేసుకుని, మరింత క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకున్నారు. View this post on Instagram A post shared by Sunaina Roshan (@roshansunaina) (చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు) -
తామర పువ్వులు తింటే.. నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా?
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ చిత్రం ఒడిస్సీ ఫస్ట్ వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకుపోతోంది. దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్ర భారత్ బాక్సాఫీస్ వద్ద రూ. 7.78 కోట్లు వసూల చేయడం విశేషం. ఆ మూవీలో జన్ వార్ తర్వాత ఒడిస్సియస్ సైన్యంతో కలిసి తన రాజ్యం ఇథాకాకు యలుదేరతాడు. పది రోజుల్లో చేరుకోవాల్సిన ప్రయాణం పదేళ్లు పడుతుంది.ఆ మధ్యలో ఓగిగియా అనే పౌరాణిక ద్వీపంలో చిక్కుకోవడంతో ఇలా జరుగుతుంది. ఆ ద్వీపంలో కాలిప్సో అనే అప్సరస అతనిపై మనుసుపడి..అక్కడే ఉంచేసుకుందామనే దురుర్దేశంతో నీలి తామరపువ్వుని తినిపించడంతో జ్ఞాపకశక్తిని కోల్పోయి ఇబ్బంది పడినట్లుగా చూపిస్తారు. మరి ఇంతకీ నిజంగా తామరపువ్వులు లేదా కలువలు తింటే నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా?, నిజంగానే నీలి తామర పువ్వులు అనారోగ్యకరమైనవా అంటే..'ది ఒడిస్సీ' (The Odyssey) అనే ప్రసిద్ధ గ్రీకు పురాణ కథలో, తామర పూలు (Lotus-eaters) తిన్నవారు తమ గతాన్ని, జ్ఞాపకాలను మర్చిపోయి హాయిగా జీవిస్తారని రాశారు. అలాగే మన భారతీయ పురాణాల్లో సైతం దీనికి అగ్రస్థానం ఇచ్చారు. దేవతలను ఈ పూలతో పూజిస్తే వారి అనుగ్రహం సులభంగా లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. రామాయణ, భారత ఇతి హాసాల్లో సైతం ఈ పువ్వుల గొప్పతనం గురించి రాసి ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన దేవతాపుష్పాలు తింటే జ్ఞాపకశక్తి పోవడం ఖాయమా? అంటే..తామర పువ్వులు, వేర్లు మరియు గింజలు జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేయవు. వాస్తవానికి, ఆసియా దేశాల సాంప్రదాయ వైద్యంలో తామర మొక్కలోని వివిధ భాగాలను నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.అయినప్పటికీ, బ్లూ లోటస్ (Blue Lotus) వంటి కొన్ని ప్రత్యేక తామర జాతులను అధికంగా తీసుకుంటే, వాటిలో ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల కొద్దిసేపు స్పృహ తప్పినట్లు, హాయిగా లేదా కొద్దిగా మత్తుగా అనిపించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయిఈజిప్షియన్ బ్లూ లోటస్, దీనిని బ్లూ వాటర్ లిల్లీ అని కూడా పిలుస్తారు, ఇందులో న్యూసిఫెరిన్ మరియు అపోర్ఫిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడులోని డోపమైన్ సెరోటోనిన్ రిసెప్టర్లతో సంకర్షణ చెందుతాయి. ఈ సమ్మేళనాలు తేలికపాటి ఉల్లాసం, విశ్రాంతి, ప్రశాంత, ఆందోళన, పారానోయా, మానియా, ఇతర న్యూరోసైకియాట్రిక్ లక్షణాల వరకు ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ, మానవులపై దాని ప్రభావంపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది. అయితే, కొన్ని మొక్కలలో నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని ఆల్కలాయిడ్లు, మరికొన్ని సమ్మేళనాలు ఉన్నాయని గుర్తించారు. తామరపువ్వు ఇలాంటి ప్రమాదం చూపించనప్పటికీ..జ్ఞాపకశక్తి లోపం, గందరగోళం, మతిభ్రమణం , బ్రాంతులకు కారణమయ్యే ఇతర మొక్కలు ఉన్నాయనేది గుర్తురెగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.(చదవండి: IVF journey.: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖలు) -
వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు
సూపర్ మోడల్, బాలీవుడ్ నటి తేజస్విని కొల్హాపూరే టెలివిజన్ సిరీస్తో కెరీర్ మొదలు పెట్టి..'తేరా జాదూ చల్ గయా మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. విలక్షణమైన నటనతో మెప్పించి విమర్శకులు ప్రశంసలందుకున్న దిగ్గజ నటి. ఆమె స్వయాన పద్మినీ కొల్హాపూరేకు సోదరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు మేనత్త. ఆమె చిత్ర నిర్మాత, నటుడు పంకజ్ సరస్వత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఒక కుమార్తె. ఆమె సిద్ధార్థ కన్నన్ పాడ్కాస్ట్ తన ఐవీఎఫ్ జర్నీ గురించి చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ ప్రక్రియ ఎంత కష్టమైందో ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేగాదు యువతకు సంతాన విషయంలో చక్కటి సందేశం కూడా ఇచ్చారామె. తన జీవితంలో చాలా కష్టమైన దశ అంటూ ఉంటే అది ఐవీఎఫ్ జర్నీనే కన్నటీపర్యంతమైంది. అది మానసికంగా, శారీరకంగా ఎంతటి ఒత్తిడికి గురిచేస్తుందో పంచుకుంది. తాను ఐదుసార్లు ఐవీఎఫ్ చేయించుకున్నానని, నిస్సంకోచంగా వెల్లడించింది. ఎందుకు ఇంత ధైర్యంగా చెబుతున్నాననంటే ఆ ప్రక్రియలో ఉండే కష్టాలపై అదరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే అంటూ తను ఎదుర్కొన్న బాధను వివరించారామె. నటిగా ఉన్నప్పడు ఇప్పటికీ తన ఆకృతిలో ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. మానసికంగా ఇప్పుడు బలంగా ఉన్నానను, కానీ ఆ సమయంలో శారీరకంగా మానసికంగా ఇంజెక్షన్ల వల్ల తన శరీరాకృతి ఘోరంగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. సుమారు వెయ్యికి పైగా ఇంజెక్షన్లు తీసుకున్నానని అన్నారు. గర్భం ధరించేంత వరకు వాటిని ఇస్తూనే ఉంటారని చెప్పారు. అలా ఐదు సార్లు ఆ ప్రక్రియ చేయించుకున్నా..సక్సెస్కాలేదని..చివరికి తన ప్రయత్నం ఫలించి నిలిచినా..రెండు సార్లు గర్భస్రావం అనంతరం..ప్రెగ్నెంట్ అయినట్లు వివరించింది. ఆ మధ్యలో పడే బాధ అలాంటి ఇలాంటిది కాదని, మానసికంగా కుంగిపోతామంటూ వేదనగా చెప్పుకొచ్చింది. కాగా తేజస్విని కొల్హాపూరే, పంకజ్ సరస్వత్లు జనవరి 30, 2015న వేదిక అనే కుమార్తె జన్మనిచ్చారు. వివాహం అయిన ఎనిమిదేళ్లకు ఆ దంపతులకు సంతానం కలిగింది.(చదవండి: ఒకేసారి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్..! కట్చేస్తే..) -
ఒకటిన్న ఏడాదిలోనే 67 కిలోలు బరువు..! జస్ట్ ఒక్క నిమిషంలోనే..
బరువు తగ్గడం అంటే కఠినమైన డైట్, కష్టతరమైన వ్యాయామాలు, అధిక సమయం జిమ్ సెషన్ అనే భావన అందరిలో ఉంటుంది. కానీ కొందరు అవేమీ అవసరం లేకుండా రోజువారీ సరదాగా చేసే వర్కౌట్లతోనే సాధ్యమని చూపిస్తారు. అయితే వాటి ఏదో ఒక్కసారి కాకుండా ఇన్నిసార్లు అని చేస్తే చాలు అధిక సంఖ్యలో కేలరీలు, కొవ్వుని తగ్గించుకోవచ్చని అంటోంది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా మిమ్మల్ని చురుకుగా ఉంచుతాయని చెబుతున్నారు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ రాజీ ఘంగాస్. ఆ వ్యాయామాలు ఒక నిమిషంలోనే గరిష్ట కేలరీలను తగ్గించగలదని అంటున్నారు. తాను సుమారు 155 కేజీల బరువు ఉండేదాన్ని అన్ని క్రమం తప్పకుండా చేసే తేలికపాటి వ్యాయామాలతోటే ఇంతలా బరువు తగ్గానంటూ తన వెయిట్లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. అంతేగాదు రోజువారి దినచర్యలో సులభంగా చేర్చుకోగలిగే ఒక ఐదు సాధారణ కదలికల వ్యాయామాలను గురించి ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకుంది. బరువు తగ్గడం అంటే కేవలం జిమ్లో గంటల తరబడి గడపడం కాదు, క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా అని అంటున్నారామె. చురుకుగా ఉంచడానికి, ఫిట్నెస్ని మెరుగుపరుచుకోవడానికి, కేలరీలను కరిగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారామె. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేలా చూసుకోవడం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి వాటితోనే స్మార్ట్గా మారిపోవచ్చిన చెబుతోంది. తాను చెప్పబోయే చిన్న పాటి వర్కౌట్లు ఎంతటి బిజీ షెడ్యూల్లో అయినా సులభంగా చేయొచ్చని చెప్పుకొచ్చింది. అలా చేసే తాను సుమారు 67 కిలోలు పైనే తగ్గినట్లు తెలిపింది. అవేంటంటే..జంపింగ్ జాక్స్: పాదాలను కలిపి, చేతులను పక్కన ఉంచి నిలబడండి. కాళ్ళను దూరంగా చాపుతూ, చేతులను తల పైకి ఎత్తుతూ గెంతండి. తిరిగి ప్రారంభ స్థానానికి గెంతి, మళ్ళీ చేయండి.ఇలా కొద్దిసేపు రిపీట్ చేయాలి.హై నీ క్లాప్: నిటారుగా నిలబడి, ఒక మోకాలిని ఛాతీ వైపుకు పైకి లేపుతూ, పైకి లేపిన మోకాలి కింద లేదా పైన చేతులతో చప్పట్లు కొట్టండి. వేగంగా రెండు కాళ్ళ మధ్య మార్చి మార్చి చేయండి.స్టాండింగ్ క్రాస్-బాడీ క్రంచ్: మీపాదాలను భుజాల వెడల్పులో ఉంచి నిలబడి, చేతులను తల వెనుక ఉంచండి. ఒక మోకాలిని పైకి లేపుతూ, దానికి ఎదురుగా ఉన్న మోచేతిని దాని వైపుకు తీసుకురండి. తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చి, రెండవ వైపున కూడా చేయండి.ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జంప్: మపాదాలను కలిపి నిలబడండి. రెండు పాదాలతో ముందుకు గెంతి, వెంటనే తిరిగి ప్రారంభ స్థానానికి గెంతండి. మెత్తగా కింద పడటానికి మోకాళ్ళను కొద్దిగా వంచి ఉంచండి.స్పాట్ జాగింగ్: ఒకే చోట నిలబడి, ముందుకు కదలకుండా జాగింగ్ చేయండి. కదలికను సున్నితంగా, స్థిరంగా ఉంచడానికి, మచేతులను సహజంగా ఊపుతూ పాదాలను సౌకర్యవంతమైన వేగంతో పైకి లేపండి.చురుకుగా ఉండటం ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉండనవసరం తన వర్కౌట్లతో చెప్పకనే చెప్పింది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ రాజీ. క్రమం తప్పకుండా చేసే కొన్ని సాధారణ కదలికలు కూడా ఫిట్నెస్ అలవాటును పెంపొందించుకోవడాన్ని సులభతరం చేస్తాయి. వ్యాయామం చేయడం కొత్తగా ప్రారంభిస్తున్నట్లయితే, నెమ్మదిగా మొదలుపెట్టి, సరైన భంగిమపై దృష్టి సారించి, శక్తి సామర్థ్యాలు మెరుగుపడే కొద్దీ రౌండ్ల సంఖ్యను పెంచుకోడం మంచిదని సూచిస్తోంది. కాబట్టి మరింత కష్టతరమైన మార్గం కాకుండా సులువుగా సునాయాసంగా చేసే వర్కౌట్లను ఎంచుకుని కిలోల కొద్దీ బరువు తగ్గేందుకు రెడీ అవుదామా మరి..!. View this post on Instagram A post shared by Rajii Ghanghas (@rajiighanghas) (చదవండి: పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..!పాపం ఆ వధువు స్నేహితురాలు..) -
నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే..
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత విద్యార్థి నిరసనలో పాల్గొంటున్నప్పుడు బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్వల్ప అనారోగ్య సమస్యకు గురైనట్లు సమాచారం. నిరసన ప్రదర్శన వీడియోలలో వాలంటీర్లు, భద్రతా సిబ్బంది ఆ 75 ఏళ్ల నటికి సహాయం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ రద్దీగా ఉన్న పరిసరాలలో మద్దతుదారులు ఆమెకు విసనకర్రతో విసురుతుండగా, ఆమె విశ్రాంతి తీసుకుంటుండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. ఆ నటి ఆరోజు అంతకుముందు నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. వాటిలో నటుడు ప్రకాశ్ రాజ్తో కలిసి ట్రక్కులో తోటి నిరసనకారులతో ప్రయాణిస్తున్న దృశ్యాలను కూడా పంచుకున్నారామె. ఈ ప్రదర్శన శాంతియుతంగా, విద్యా సంస్కరణకు మద్దతుగా జరిగిందని పునరుద్ఘాటించారు కూడా. అయితే ఆమెకు ఆ సమయంలో ఆకస్మికంగా తలతిరగడానికి గల కచ్చితమైన కారణం అధికారికంగా వెల్లడించినప్పటికీ..తరుచుగా నిర్లక్ష్యంగా చూసే ఈ ఆరోగ్య లక్షణం గురించి వెలుగులోకి వచ్చింది. ఇది చూడటానికి సాధారణ సమస్యే కానీ..ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో అసలు ఆకస్మిక తలతిరుగుడు అంటే ఏంటి? ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.ఆకస్మిక తలతిరుగుడు అంటే..తల తేలిపోతున్నట్లుగా అనిపించి, స్పృహతప్పి పడిపోవడం, సమతుల్యత కోల్పోవడం అని అంటారు. లేదా చుట్టూ ఉన్న పరిసరాలు గిరగిర తిరుగుతున్నట్లు అనిపించడం వంటి అనుభూతులను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా వృద్ధులలో అత్యంత వైద్య సంరక్షణ కోరడానికి అత్యంత సాధారణ కారణాలలో ఈ ఆరోగ్య సమస్య కూడా ఒకటి. చాలా సందర్భాలలో తల తిరగడం తాత్కాలికమే. అందుకోసం కేవలం విశ్రాంతి, తగినంత నీరు తాగడం లేదా మూల కారణానికి చికిత్స చేయడం ద్వారా తగ్గిపోతుంది. ఒక్కోసారి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా మారుతుంది. ఎందుకిలా జరుగుతుందంటే..ఎక్కువసేపు ఆరుబయట కార్యకలాపాలు చేసేటప్పుడు లేదా రద్దీగా ఉండే కార్యక్రమాలలో ఇలా జరుగుతుందిడీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం)వేడి వాతావరణం, అధికంగా చెమట పట్టడం, తగినంత ద్రవపదార్థాలు తీసుకోకపోవడం వల్ల రరక్తపోటు పడిపోయి, ఇది తల తిరగడానికి కారణమవుతుంది.ఎక్కువసేపు ఆరుబయట ఉండటం వల్ల హీట్ ఎగ్జాషన్ (వేడి అలసట) కలగవచ్చు. దీని లక్షణాలలో తల తిరగడం, అలసట, తలనొప్పి, వికారం, అధికంగా చెమట పట్టడం వంటివి ఉంటాయి.రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం - ముఖ్యంగా వేగంగా నిలబడిన తర్వాత - మెదడుకు రక్త ప్రసరణను తగ్గించి, తల తేలిపోవడానికి దారితీస్తుంది.భోజనం మానేయడం లేదా ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి, నీరసం, వణుకు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.లోపలి చెవి రుగ్మతలు కారణంగా కూడా ఇలా జరగొచ్చు.రక్తపోటు మందులు, నిద్రమందులు కొన్ని యాంటీడిప్రెసెంట్లతో సహా కొన్ని రకాల మందులు వృద్ధులలో తల తిరగడానికి కారణం కావొచ్చు. వైద్య అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు పరిగణిస్తారు..ఛాతీ నొప్పిఅకస్మాత్తుగా నీరసించడం లేదా తిమ్మిరిమాట్లాడటంలో ఇబ్బందితీవ్రమైన తలనొప్పిస్పృహ కోల్పోవడందృష్టి మసకబారడం లేదా రెండుగా కనిపించడంనిరంతర వాంతులుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిఎలా నివారించాలి?సాధారణ జీవనశైలి చర్యలు ప్రమాదాన్ని తగ్గించగలవు.ముఖ్యంగా వేడి వాతావరణంలో, తగినంత నీరు తాగండి.విరామం లేకుండా ఎక్కువసేపు నిలబడటం మానుకోండి.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, క్రమం తప్పకుండా సమతుల్య భోజనం చేయండి.కూర్చున్న లేదా పడుకున్న స్థితి నుంచి నెమ్మదిగా లేవండి.వెచ్చని వాతావరణంలో తేలికపాటి దుస్తులు ధరించండి.అత్యధిక వేడిలో నీడ లేదా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలను ఆశ్రయించండి.తల తిరగడం తరచుగా జరుగుతుంటే, వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోవాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Shabana Azmi (@azmishabana18) (చదవండి: వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లు ఎందుకు అధికం.. ? వైద్యులు ఏమంటున్నారంటే..) -
వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లు ఎందుకు అధికం.. ? వైద్యులు ఏమంటున్నారంటే..
వర్షాకాలం అంటేనే చాలు ఇన్ఫెక్షన్లు అధికమవుతాయి. అదీగాక చాలామంది పలానా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నామంటూ వాపోతారు. దాంతో ఈ కాలం వ్యాధుల కాలమా? అనే ఫీలింగ్ కలుగుతంది కూడా. అసలు ఈ కాలంలో ఎందుకిలా జరుగుతుంది? అందుకు గల కారణాల గురించి ఆరోగ్య నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.వర్షాకాలంలో అధిక తేమ, నీరు నిల్వ ఉండటం, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు బ్యాక్టీరియా, వైరస్లు, దోమలు వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల సులభంగా ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. అలాగే చాలా ప్రాంతాలు వరదల కారణంగా ముప్పుకి గురవ్వుతాయి. దీంతో నీటినిల్వలు అధికమై దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కలుషిత నీటి వల్ల తీసుకున్న ఆహారం సైతం పాయిజన్ అయ్యి, జీర్ణ సంబంధిత సమస్యలు, టైఫాయిడ్, హెపటైటిస్ఏ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికమవుతాయని అంటున్నారు. అలాగే వాతావరణంలోని అధిక తేమ ఫలితంగా శిలింధ్రాలు లేదా బ్యాక్టీరియా వృద్ధికి దారితీసి మరిన్ని చర్మవ్యాధులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. పైగా ఈ కాలంలో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలోనూ, ఇళ్లల్లోనే ఎక్కువగా ఉంటారు. ఫలితంగా ఈ వైరస్లు ఒకరి నుంచి ఒకరికి సులభంగా సంక్రమిస్తాయని అన్నారు. అందుకే ఈకాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..ఈ కాలంలో బాత్రూంలను ఉపయోగించిన తర్వాత తినడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయాలి. తాజా ఆహారాన్ని మాత్రమే తినండి, శుభ్రమైన ఫిల్టర్ చేసినా లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగండిరోడ్డు పక్కన కోసిన పండ్లు, పచ్చి సలాడ్లు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ, కావున నివారించండిపరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి సమీపంలో ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకోండికీటక నివారిణులను ఉపయోగించడం, ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో దోమల నివారణ వలలను వాడటం, పూర్తి చేతుల కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం ద్వారా కీటకాల కాటును నివారించండి.వర్షంలో బూట్లు లేదా దుస్తులు తడిస్తే, ఫంగల్ చర్మ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి పొడి బూట్లు లేదా దుస్తులు మార్చుకోండి. మధుమేహం, ఆస్తమా, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు, చిన్నపిల్లలు లేదా వృద్ధులు ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఇన్ఫెక్షన్ను నివారించడానికి తగిన శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించకపోగా, యాంటీ బయోటిక్ నిరోధకతను పెంచుతుంది. రెండు రోజుల కంటే ఎక్కువ కాలం జ్వరం, తీవ్రమైన నొప్పి, నిరంతర వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రవిసర్జన తగ్గడం, రక్తస్రావం లేదా నీరసం వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అదీగాక వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే, వైద్యులు సమస్యకు తగిని విధంగా చికిత్స అందించి ఇతర సమస్యలు తలెత్తకుండా నివారించగలరనే విషయం గుర్తించుకోండి అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: జస్ట్ రెండేళ్లలో 142 కేజీల నుంచి 80 కేజీలకు..! నిలకడగా బరువు తగ్గాలంటే..) -
గర్భంలో పడినప్పుడే..ఆయుర్ధాయం ఖరారు..!
మనిషి ఆయుర్దాయంపై ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. దాని సాయంతో వృద్ధాప్యాన్ని, పలు రోగాల బారి నుంచి మనిషిని రక్షించి.. దీర్ఘాయువుని ప్రసాదించే దిశగా ఏళ్లుగా ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దానికి ఓ మార్గం దొరికేలా సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది తాజా పరిశోధనల్లో. ఒకరకంగా ఇది మనిషి జీవితకాలంపై సరికొత్త ఆశాకిరణం అందించిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ మనిషికి దీర్ఘాయువు సాధ్యమేనా అంటే..అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం పుట్టకకు ముందు అనుభవించే వాతావరణం ఆయుర్ధాయంపై ప్రభావం చూపగలదనే విషయం నిర్థారణ అయ్యింది. అంటే గర్భధారణ సమయంలో పిండ దశలో ఉండగానే ఆయుర్థాయం నిర్ణయింపబడి ఉంటుందంట. ఆ సమయంలో ఆ పిండానికి ఆరోగ్యం నుంచి వృద్ధాప్య దశలు ఎలా ఉంటాయి..పైగా ఎంతవరకు జీవించగలడనేది కూడా నిర్థారించొచ్చని ఈ కొత్త పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన నేచర్ హెల్త్లో ప్రచురితమైంది. గర్భధారణ సమయంలో పిండ దశలో ఉన్నప్పుడే ఆ జీవి బాల్యం, జీవిత కాల ఆరోగ్యం, స్థితిస్థాపకత తదితరాలతో అతడి దీర్ఘాయువుని తెలుసుకోగలమని అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే వాటి సాయంతో అతడి ఆయువుని నిర్ణయించొచ్చని అన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు PROSPER అనే ప్రసవ పూర్వం పరిశోధనపేరుతో అధ్యయనం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. గర్భంలోని పరిస్థితులు జీవితాంతం కొనసాగే విధంగా శరీర అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని అధ్యయనంలో గుర్తించారు. జన్యువులు ముఖ్యమైనవి అయినప్పటికీ, దీర్ఘకాలిక ఆరోగ్యం, స్థితి స్థాపకతన నిర్ణయించడంలో గర్భస్థ వాతావరణం కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుందని పరిశోధనలు పేర్కొన్నాయని అన్నారు. గర్భధారణ సమయంలో తల్లి పోషణ, ఒత్తిడి స్థాయిలు, మొత్తం ఆరోగ్యం వంటి అంశాలు పుట్టుకకు మందు శరీర అవయవాలు, వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందుతాయనేదాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. అలాగని పుట్టకకు మందే భవిష్యత్తు నిర్ణయించబడిపోతుందని భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. జననం తర్వాత కూడా సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమై జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ పరిశోధన గర్భధారణ సమయంలో పరిస్థితులను మెరుగుపరిస్తే గనుక ఒక వ్యక్తి జీవితకాల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చగలదని నిరూపించిందన్నారు. ఇది ఒకరకంగా తల్లి ఆరోగ్యం, ప్రసవ పూర్వ సంరక్షణ తదితరాలపై దృష్టి పెట్టేలనే అంశం గురించి నొక్కి చెప్పిందన్నారు పరిశోధకులు.(చదవండి: ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..) -
ఆ అలవాట్లతో 15 కిలోలు బరువు..! 5 ఏళ్ల పాటు అలానే..
వెయిట్లాస్ జర్నీలో చాలామంది సునాయాసంగా బరువు తగ్గే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో విజయం సాధిస్తారు కూడా. అయితే ఆ బరువునే మెయింటైన్ చేయడం అతి పెద్ద సవాలు. మళ్లీ యథాస్థితికి రాకుండా..అంతే స్మార్ట్గా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని అంటోంది ఇషితా లంబా అనే మహిళ. చాలామంది బరువు తగ్గగలరు అంతే..కొందరే దాన్ని నిలబెట్టుకోగలరు అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో తన వెయిట్ లాస్ అనుభవాలను షేర్ చేసుకున్నారు. మరి అవేంటో చూసేద్దామా..!.తాను ఎలాంటి క్రాష్డైట్లపై ఆధారపడకుండా నిలకడగా 20 వాస్తవిక అలవాట్లను పాటించి సునాయాసంగా 15 కిలోలు వరకు బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే దాన్ని ఐదేళ్ల పాటు నిలకడగా నిలబెట్టుకున్నానని చెప్పారు. ఈ వెయిట్లాస్ జర్నీలో బరువు తగ్గడం పెద్ద సమస్య కాదని తగ్గిన బరువుని మెయింటైన్ చేయడమే అతిపెద్ద సవాలని పేర్కొంది. అందుకోసం తాను ఏం చేసిందో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అవేంటంటే..అతిగా తిన్న తర్వాత పస్తులుండాల్సిన పనిలేదు..ఒక్కోసారి ఎక్కువగా తినేస్తాం. దాంతో సాధారణంగా మరుసటి రోజు పస్తులుండే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాను అలా చేయనని, తన సాధారణ దినచర్యకు తిరిగి వచ్చేస్తానంటోంది. అంటే ఇదివరకటి సాధారణ ఆహారపు అలవాట్లను యథావిధిగా ఫాలో అయితే చాలు అని అంటోంది. అంతేగాదు తన ప్రతి భోజనం తర్వాత రెండు వేల అడుగులు వేస్తానని చెబుతోంది. కేలరీల పరిమితి కంటే ప్రోటీన్కు ప్రాముఖ్యతన ఇస్తానని నొక్కి చెప్పారు. సాధ్యమైనంత వరకు తక్కువ తినడం కంటే ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోవడంపైనే ఫోకస్ పెడతానని తెలిపింది. అంతేగాదు తన శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1.2-1.6 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని అన్నారు. బరువులు ఎత్తడం, తగినంత నీరు తీసుకోవడం..వ్యాయామం కోసం ఇషితా తాను వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తుతానని, వారానికి రెండుసార్లు కార్డియో చేస్తానని పంచుకున్నారు. దాంతోపాటు వాలుగా నడవడం, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటివి చేస్తానని అన్నారు. అలాగే రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. అలాగే రాత్రి భోజనం తర్వాత సోంపు నీరు కూడా తాగుతానని చెప్పింది. ఇఇ జీర్ణక్రియకు సహాయపడుతుందని, మంచి నిద్ర పట్టేలా చేస్తుందని వెల్లడించింది. అలాగే వ్యాయామం చేయాలని అనిపించని రోజున దానికి బదులుగా మ్యూజిక్ వింటూ వాక్ చేస్తుంటానని అన్నారామె. తాను ఇప్పటికీ పిజ్జా, డెజర్ట్లు, బర్గర్లు తింటానని, అయితే ప్రతిరోజూ కాదని చెప్పుకొచ్చింది. ఒకవేళ డ్రింక్ చేయాలనిపిస్తే ముందుగా భోజనం చేసి, చక్కెర కలిపిన వాటికి ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటానని చెప్పింది. అలాగే స్వీట్స్ తినాలనిపించినప్పుడూ ప్రోటీన్ బార్లు లేదా ఆరోగ్యకరమైన కుకీలను, ఉప్పగా తినాలనిపించినప్పుడు ఇంట్లో తయారుచేసిన వేయించిన మఖానాను తీసుకుంటానని చెప్పుకొచ్చింది. నిలకడగా దినచర్యను పాటించాలంటే..నచ్చిన ఆహారాలను తినడమే మంచిదని అంటోంది. ప్రయాణాలు చేసేటప్పడు నడుస్తానని, వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కుతానని చెప్పుకొచ్చింది. ఒక్కోసారి వ్యాయామం చేసే తీరిక దొరక్కపోతే..కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేసేలా చూస్తానని వెల్లడించింది. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదుసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటానని తెలిపింది. చివరగా బరువు తగ్గడం అంటే తీవ్రమైన డైటింగ్లు చేయడం కాదని..దీర్ఘకాలం పాటు కొనసాగించ గల అలవాట్లనే ఎంచుకుంటే ఈజీగా బరువు తగ్గగలరని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: మామ్ వెయిట్లాస్ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..) -
వయసు పైబడితే..నీళ్లు తాగేటప్పుడు జర భద్రం..!
ఒక అరవై ఏళ్లుపై బడ్డ సీనియర్ సిటిజన్ రాత్రి 11:00 గంటలకు ఒక గ్లాసు నీళ్లు తాగుతూ ఊపిరాడక అవస్థ పడ్డాడు. సకాలంలో ఆస్పత్రికి తరలించినప్పటికీ..ఆయన మరణించారు. ఇలాంటివి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకు గల కారణం, ఎలాంటి జాగ్రత్తు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఇలాంటి ఘటనలు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వయసు పైబడిన వారు జీవితంలో ఏ పని చేసినా, ముఖ్యంగా ఈ రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అవేంటంటే..పడకుండా జాగ్రత్తపడటం (Prevent Falling)గొంతుకు అడ్డం పడకుండా (దండుపోకుండా) చూసుకోవడం (Prevent Choking)60 ఏళ్లు దాటితే..ఈ అలవాట్లను అలవర్చుకోవాలి..నీళ్లు తాగేటప్పుడు:మిగతా పనులన్నీ పక్కన పెట్టి, పూర్తి శ్రద్ధతో నీటిని నెమ్మదిగా, జాగ్రత్తగా తాగాలి. వృద్ధులలో గొంతు మింగడానికి సహాయపడే కండరాలు బలహీనపడటం వల్ల గొంతుకు అడ్డం పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే నీరు, పాలు, సూప్ వంటి ద్రవపదార్థాలు గొంతుకు అడ్డం పడటం వల్ల వృద్ధులలో 'ఆస్పిరేషన్ న్యుమోనియా' (Aspiration Pneumonia) వచ్చే అవకాశం చాలా ఎక్కువ.ఇంట్లో వృద్ధులు ఉంటే గమనించాల్సిన ముఖ్య విషయాలు:స్ట్రా (Straw) ఉపయోగించండి: వీలైనంత వరకు నీళ్లు తాగడానికి స్ట్రా ఉపయోగించండి. అలాగే నీటిని మింగేటప్పుడు తల కొద్దిగా దించి (క్రిందికి వంచి) మింగాలి.చిక్కటి సూప్లు ఇవ్వండి: పల్చటి సూప్ల కంటే చిక్కటి (Thick) సూప్లు ఇవ్వడం మంచిది. పల్చటి ద్రవాలు నోట్లోకి వేగంగా ప్రవహిస్తాయి, దీనివల్ల శ్వాస తీసుకోవడంలో స్వల్ప తేడా వచ్చినా వెంటనే గొంతుకు అడ్డం పడతాయి.నోట్లో ఆహారం ఉన్నప్పుడు నీళ్లు వద్దు: నోట్లో ఘనపదార్థం (అన్నం లేదా టిఫిన్) నములుతున్నప్పుడు లేదా నోట్లో ఆహారం ఉన్నప్పుడు ద్రవపదార్థాలు తాగకూడదు. నీరు నోటిలో ఎక్కువసేపు ఉండిపోతే, అది తెలియకుండానే శ్వాసనాళంలోకి (Trachea) వెళ్లిపోయే ప్రమాదం ఉంది.మాట్లాడటం లేదా తల తిప్పడం చేయకూడదు: నోట్లో అన్నం లేదా నీళ్లు ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు, అలాగే అటు ఇటు తల తిప్పకూడదు.శారీరక బలం తక్కువగా ఉంటుంది: యువకులకు ఉన్నంత శారీరక శక్తి, తట్టుకునే సామర్థ్యం వృద్ధులకు ఉండవు.ఒకవేళ ఏదైనా ద్రవం లేదా ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి, దాన్ని బయటకు దగ్గడానికి ప్రయత్నించినప్పుడు ముఖం ఎర్రగా మారిపోతుంది. అలాగే రక్తపోటు (Blood Pressure) అకస్మాత్తుగా పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ ఊపిరి ఆడకపోవడం ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల వయసు పెరుగుతున్న కొద్దీ నీటిని నెమ్మదిగా, శ్రద్ధగా, జాగ్రత్తగా తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: Sanjay Dutt: వైరల్ ఫ్లూలా భావించి..కేన్సర్తో పోరాడా..!) -
వైరల్ ఫ్లూలా భావించి..ఆ వ్యాధిని జయించా..!: సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలక్షణమైన నటనకు పేరుగాంచిన హీరో. సంజు బాబాగా పిలిచే ఆయన తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన స్టేజ్ 4 లంగ్ కేన్సర్ని జయించిన వారియర్ కూడా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ స్వయంగా తాను ఈ కేన్సర్ని ఎలా జయించానో వెల్లడించారు. అంతేగాదు అందరూ ఇలానే పోరాడాలంటూ కేన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. సంజయ్ దత్కు 2020 ఆగస్టులో స్టేజ్ 4 ఊపిరితిత్తుల కేన్సర్ నిర్థారణ అయింది. ఆయనకు ఊపిరితిత్తుల్లో ద్రవంచ చేరడంతో శ్వాస తీసుకోవడలో చాలా ఇబ్బందిపడ్డారు. ఆయన ముంబైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2020లోనే కేన్సర్ నుంచి బయటపడ్డారు కూడా. దాంతో ఒక్కసారిగా కుటంబసభ్యులు, అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కేన్సర్ని జయించడంలో తను ఎలాంటి మానసిక ధైర్యంతో ఉన్నానో పంచుకున్నారు. తాను ఆ సమయంలో కేన్సర్ని వైరల్ ఫ్లూ వ్యాధిలా చూశానని, అన్నారు. ఎప్పుడూ మనం పోరాట యోధులుగా ఉండాలే తప్ప.. అంత సులభంగా వదిలేయకూడదని అన్నారు. అనారోగ్య సమస్య ఎలాంటిదైనా ధైర్యంగా పోరాడలని అన్నారు. కేన్సర్ బాధితులు ఎవరైనా..ఆ వ్యాధికి లొంగిపోకూడదని, బదులుగా ఇతర అనారోగ్యాల మాదరిగా చూడాలని హితవు పలికారు. నిజానికి అది కష్టమని తనకు తెలుసని..అయినప్పటికీ మనం నవ్వుతూనే పోరాడలన్నారు. కేన్సర్ నుంచి కోలుకుంటున్నప్పుడూ ఎదురయ్యే శారీరక బాధలు గురించి తనకు తెలుసన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడతారని అన్నారు. అదే సమయంలో తనకు సూదులంటే ఎంత భయమో కూడా చెప్పారు. తను యోగా లేదా ధ్యానం వంటివి చేయనని, కానీ జిమ్లో వర్కౌట్లు చేస్తానని చెప్పారు. అలాగే తను శివ భక్తుడనని, తనకు శివుడే సర్వస్వం అని చెప్పారు. చివరగా ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడాల్సిందేనని అన్నారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. పుట్టినప్పుడు మొదటగా ఆక్సిజన్ కోసం పోరాడతాం, ఆ తర్వాత ఆరోగ్యం లేదా వ్యక్తిగత సమస్యల కోసం పోరాడతామని అన్నారు. ఒక్కటి గుర్తించుకోండి సమస్యను ఎదుర్కోండి తప్ప పారిపోకండని పిలుపునిచ్చారు. ఒక్కసారిగా సమస్యను ఎదుర్కోవడం మొదలుపెడితే..ఆటోమేటిగ్గా పరిష్కరించుకోవడం ప్రారంభిస్తారని అన్నారు. అందుకే ఏ సమస్యనైనా ఎదుర్కోండి తప్ప పారిపోయే ప్రయత్నం చేయకండి దానివల్ల సమస్య మరింత ఎక్కువవుతుంతే గానీ దానికి పులిస్టాప్ పడదంటూ తన సంభాషణను ముగించారు. (చదవండి: ప్రేమ కోసం సైకిల్పై భారత్ నుంచి స్వీడన్కు..! ట్విస్ట్ ఏంటంటే..) -
మామ్ వెయిట్లాస్ స్టోరీ..! 103 కిలోలు నుంచి 71 కిలోలకు..
వెయిట్లాస్ ఒక్కోక్కరూ ఒక్కో విధానం అనుసరిస్తూ బరువు తగ్గుతారు. బరువు తగ్గించుకోవడమే కాదు దాన్ని అదుపులో ఉంచుకునేలా మెయింటైన్ చేయడమే అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి అనుగుణంగా, నిలకడైన జీవనశైలితో నిధానంగా బరువు తగ్గడం అన్ని విధాల మేలు అని అందరికీ తెలిసిందే. ఆ విధంగానే ఈ ఇన్ఫ్లుయెన్సర్ మామ్ అనుసరించి ఏకంగా 32 కిలోలు తగ్గింది. అంతేగాదు అందుకోసం తాను ఏమి అనుసరించిందో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చసుకుంది. మరి అవేంటో చూద్దామా.!.శాన్ డియాగోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్, తానియా అనే పిల్లల తల్లి వెయిట్లాస్ జర్నీ ఇది. ఆమె 103 కిలోల నుంచి 71 కిలోలకు తగ్గిన జర్నీని షేర్ చేసుకుంది. అంతలా 32 కిలోలు తగ్గడానికి సులభమైన నిలకడైన అలవాట్లే కారణమని అంటోంది. తాను ప్రధానంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేయడంపై దృష్టిసారించానని అంటోంది. మూడేళ్లలో దీన్ని సాధించానని పేర్కొంది. తాను వెయిట్ట్రైనింగ్, యోగ ద్వారా బరువు తగ్గినట్లు పోస్ట్లో తెలిపింది. ఇంట్లోనే సులభంగా బరువు తగ్గాలంటే ఐదు పనులు చేయాలని వెల్లడించింది. అవేంటంటే..ప్రోటీన్రోజుకు 3 సార్లు కనీసం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ప్రాసెస్ చేసిన ప్రోటీన్ల కంటే..సహజసిద్ధమైన వాటికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. బరువు తగ్గాలనుకుంటే రోజుకి శరీరానికి తగినంత ప్రోటీన్ మస్ట్ అని అంటోందామె.వ్యాయామంలో సౌలభ్యం..ఒక తల్లిగా, ఖచ్చితమైన' వ్యాయామ సమయం కోసం వెతకడం మానేశాను. కొన్ని రోజులు ఉదయం 5 గంటలకు, కొన్ని రోజులు నా బిడ్డ నిద్రపోతున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు, మరికొన్ని రోజులు అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి 9 గంటలకు కూడా వ్యాయామం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. తన ఉద్దేశ్యంలో క్రమంతప్పకుండా చేయగలిగే సమయమే ఉత్తమమైన వ్యాయామ సమయం అని చెబుతోందామె. కచ్చితమైన షెడ్యూల్ అంటూ టై వేస్ట చేయొద్దని హెచ్చరించింది. జీవితానుగుణంగా కదలికలు ఉండేలా చూసుకోవడమే ముఖ్యం అని అంటోందామె. బరువులు ఎత్తడంతమకు సాధ్యమైనంత బరువును ఎత్తాలి. వారానికి 3 సార్లు బరువులు ఎత్తాలి. తక్కువ బరువుతో ప్రారంభించండి, క్రమబద్ధతను పెంచుకోమని చెబుతోంది. అలాగే పూర్తి శరీర వ్యాయామాలపై దృష్టి పెట్టండి, నెమ్మదిగా బరువులను పెంచుతూ పోవాలని సూచించింది.శరీరానికి తగినంత నీరు..హైడ్రేటెడ్గా ఉన్నారని నిర్ధారించుకోండి. రీర బరువులో సగం ఔన్సుల నీటిని తాగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.ఉదాహరణకు:బరువు 120 పౌండ్లు అయితే, రోజుకు 60 ఔన్సులు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. హైడ్రేటెడ్గా ఉండటం శక్తికి, కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది, అలాగు అత్యుత్తమ పనితీరును కనబరచడానికి సహాయపడుతుంది.నిద్రవీలైనంత నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. ప్రసవానంతర దశలో ఉంటే, కొన్ని రాత్రులు పరిపూర్ణంగా ఉండకపోవచ్చని అయినప్పటికీ ఫర్వాలేదని అంటోందామె. అలాంటి తల్లులు వీలైనప్పుడల్లా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే కోలుకోవడం, కొవ్వు తగ్గడం, కండరాల నిర్మాణం, మొత్తం ఆరోగ్యం అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి.ఇలా కనీసం ఆరు నుంచి 12 వారాల పాటు ప్రయత్నించి చూస్తే..కచ్చితంగా మనలోని మార్పు మనమే స్వయంగా చూస్తామని నమ్మకంగా చెబుతోంది. అంతేగాదు ఇలా క్రమంతప్పకుండా చేస్తే..ఆలోచనా విధానంలో మార్పు తోపాటు శరీరం కూడా బలంగా మారడాన్ని చూస్తామని అంటోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by TaniaUnplugged | Yoga&More (@taniaunplugged) (చదవండి: అత్యంత క్లిష్టమైన అరుదైన కణితిని విజయవంతంగా తొలగించిన వైద్యులు) -
అత్యంత క్లిష్టమైన అరుదైన కణితిని విజయవంతంగా తొలగించిన వైద్యులు
ఎనిమిదేళ్లుగా అరుదైన కణితితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళకు కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పూర్తిస్థాయి ఉపశమనం కల్పించారు. సుమారు పది గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సలో ప్రాణాలకు అత్యంత కీలకమైన రక్తనాళాలను పునర్నిర్మిస్తూ కణితిని పూర్తిగా తొలగించారు.ఈ మేరకే వైద్యులు మాట్లాడుతూ..రోగికి ఫంక్షనింగ్ ప్యారాగాంగ్లియోమా అనే అత్యంత అరుదైన న్యూరోఎండోక్రైన్ కణితి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించాం. ఈ కణితి అధికంగా హార్మోన్లను విడుదల చేయడం వల్ల ఆమెకు బిపి అదుపులో ఉండకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు, తలతిరుగుడు వంటి సమస్యలు వేధించేవి. అదీగాక ఈ కణితి క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) వెనుక భాగంలో ఉండి కాలేయం, పేగులు, కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలైన సీలియాక్ ట్రంక్, సుపీరియర్ మెసెంటరిక్ ఆర్టరీ (ఎస్ఎంఏ), పోర్టల్ వెయిన్, అయోర్టాలకు అతుక్కుపోయి ఉంది. దీంతో శస్త్రచికిత్స చేస్తే ప్రాణాలకే ముప్పు అని ఏ వైద్యులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్ వైద్యులు దీన్ని సవాలుగా తీసుకుని పదిగంటలు శ్రమించి మరి విజయవంతంగా తొలిగించారు. ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సల్లో ఉపయోగించే అత్యాధునిక రక్తనాళాల పునర్నిర్మాణ (వాస్క్యులర్ రీకన్స్ట్రక్షన్) పద్ధతులను వినియోగిస్తూ ఈ క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఎలాంటి ప్రధాన సమస్యలు లేకుండా కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యినట్లు తెలిపారు. ఎనిమిదేళ్లుగా వేధించిన లక్షణాలన్నింటి నుంచి పూర్తిగా ఉపశమనం పొందడంతో పాటు, అధిక రక్తపోటు నియంత్రణ కోసం తీసుకుంటున్న అనేక మందులను కూడా నిలిపివేయగలిగామని కూడా తెలిపారు. కాగా, ఇలాంటి కేసుల్లో ముందస్తు ప్రణాళిక, బహుళ విభాగాల వైద్య నిపుణుల సమన్వయం, అవసరమైతే అత్యాధునిక రక్తనాళాల పునర్నిర్మాణ నైపుణ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.(చదవండి: ఆరోగ్యం క్షీణిస్తున్నా..నిరాహార దీక్షలోనే సోనమ్! అన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే..) -
8 కిలోలు తగ్గిన సోనమ్.. ఇకపైనా ఆహారం తీసుకోకుంటే జరిగేది ఇదే!
విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారంతో 17వ రోజుకు చేరుకుంది. ఆయన ‘నీట్’అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి మద్దతు ప్రకటిస్తూ, జూన్ 29న ఈ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ ఉవాసం కారణంగా..ఇప్పటికే ఆయన ఏకంగా 8.2 కిలోల బరువు తగ్గి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంతలా సుదీర్ఘ ఉపవాసం కారణంగా శరీరంలో ఏ జరుగుతుంది?, ఎదురయ్యే ఆరోగ్య ప్రమాదాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!ఇంతలా వాంగ్చుక్ సుదీర్ఘ ఉపవాసం కొనసాగిస్తే.. కలిగే వైద్యపరమైన ప్రమాదాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అంతేగాదు ఇప్పటికే ఆయన రక్తంలో గ్లూకోజ్స్థాయిలో 67 mg/dLకి పడిపోగా, ఆయన రక్తపోటు 107/70 mm Hgగా నమోదైంది. ఇలా సుదీర్ఘకాలం ఆహారం తీసుకోవపోవడం ఎలాంటి శారీరక ప్రభావాన్ని చూపిస్తుందో.. విషమిస్తున్న ఆయన ఆరోగ్యమే నిదర్శనం అంటున్నారు వైద్యులు. అదీగాక వాంగ్చుక్ తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ను దీక్ష విరమించమని కోరుతున్న అందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు వెల్లడించాయి. శాంతియుత నిరసన రూపంగా ఇలాంటి నిరాహార దీక్షలు ఎంచుకున్నప్పటికీ..దీర్ఘకాలిక ఉపవాసం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి తగినంత పోషణ లేకుండా ఎంత ఎక్కువ కాలం ఉంటే, అంతకు రెట్టింపుగా ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అంటున్నారు. అసలు అన్ని రోజులు ఆహారం తీసుకోకుంటే ఏం జరుగుతుందంటే..దీర్ఘకాలిక ఉపవాస సమయంలో ఏం జరుగుతుందంటే..శరీరం మొదట శక్తి కోసం నిల్వ ఉన్న గ్లూకోజ్పై ఆధారపడుతుంది. ఈ నిల్వలు అయిపోయిన తర్వాత, అది ఇంధనం కోసం కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అయితే, ఉపవాసం కొనసాగుతున్న కొద్దీ, శరీరం తన శక్తి అవసరాలను తీర్చడానికి కండరాల ప్రోటీన్ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కండరాలు క్షీణించి బలహీన పడటంతో వేగంగా బరువు తగ్గడం జరుగుతుంది. దీర్ఘకాలిక ఉపవాస సమయంలో, శక్తిని ఆదా చేయడానికి జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఫలితంగా ఈ లక్షణాలు అనుభవిస్తారు..అలసట, తీవ్రమైన బలహీనతతల తిరగడం, స్పృహ కోల్పోవడంఏకాగ్రత లోపంనిరంతర తలనొప్పిచిరాకు, మానసిక స్థితిలో మార్పులుకండరాల నొప్పులుడీహైడ్రేషన్ (నిర్జలీకరణం)వాంగ్చుక్ కేవలం రెండు వారాల్లో 8.2 కిలోలు బరువు తగ్గినట్లు ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. ఇంతలా తక్కువ సమయంలో గణనీయంగా బరువు తగ్గడం అనేది కొవ్వు, కండర ద్రవ్యరాశి రెండింటిలోనూ గణనీయమైన క్షీణతను సూచిస్తుంది.ప్రమాదకర స్థాయిలో గ్లూకోజ్ స్థాయిలు..వాంగ్చుక్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి 67 mg/dLగా నమోదైంది, ఇది చాలా మంది ఆరోగ్యవంతులైన పెద్దలలో ఉండే సాధారణ ఉపవాస స్థాయి కంటే తక్కువ. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం (హైపోగ్లైసీమియా) వల్ల వణుకు, చెమటలు పట్టడం, దృష్టి మసకబారడం, గందరగోళం, వేగంగా గుండె కొట్టుకోవడం, మాట్లాడటంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటివి సంభవించవచ్చు. వైద్య సహాయం లేకుండా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతూనే ఉంటే, అది వైద్య అత్యవసర పరిస్థితిగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.దీర్ఘకాలిక ఉపవాసం దాదాపు ప్రతి అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైద్య పర్యవేక్షణ లేకుండా, ఉపవాసం చాలా వారాల పాటు కొనసాగితే, ఈ సమస్యలు తీవ్రంగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇలానే నిరాహార దీక్ష కొనసాగితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలు, అసాధారణ గుండె లయల ప్రమాదాన్ని పెంచుతాయితక్కువ రక్తపోటు, దీనివల్ల తల తిరగడం, స్పృహ కోల్పోవడం కలుగుతాయికండర ద్రవ్యరాశి క్షీణించడం, గుండె కండరం బలహీనపడటంతో సహావిటమిన్, ఖనిజ లోపాలురోగనిరోధక శక్తి తగ్గడం, దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుందిడీహైడ్రేషన్ కారణంగా మూత్రపిండాల సమస్యలుదీర్ఘకాలిక జీవక్రియ మార్పుల వల్ల కాలేయంపై ఒత్తిడితప్పనిసరిగగా వైద్య పర్యవేక్షణ దీర్ఘకాలిక ఉపవాసాలు లేదా నిరాహార దీక్షలు చేసే వ్యక్తులకు క్రమం తప్పని వైద్య పర్యవేక్షణ అవసరం. ఎందుకంటే వైద్యులు సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు, హృదయ స్పందన రేటు, శరీర బరువు, శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్ స్థాయిలు, మూత్రపిండాలు, కాలేయ పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఈ పర్యవేక్షణ, ప్రమాదకరమైన మార్పులను ముందుగానే గుర్తించడానికి, తక్షణ చికిత్స అవసరమా కాదా అనే నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది.నిరాహార దీక్షలు ఒక రకమైన శాంతియుత నిరసన అయినప్పటికీ, నిశితమైన వైద్య పర్యవేక్షణ లేకుండా సుదీర్ఘకాలం పాటు ఉపవాసం ఉండకూడదని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. తీవ్రమైన బలహీనత, గందరగోళం, స్పృహ కోల్పోవడం, ఛాతీ నొప్పి, లేదా నిరంతరంగా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అనేది కోలుకోలేని సమస్యలను నివారించడానికి చాలా కీలకం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: మరణాన్ని జయించాలనుకుంటే..చివరికి ఆ వ్యాధి భారిన..!) -
మరణాన్ని జయించాలనుకుంటే..చివరికి ఆ వ్యాధి భారిన..!
ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ పారిశ్రామికవేత్త, బయోహ్యాకర్ బ్రియన్ జాన్సన్ ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ సమస్యతో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టి..దీర్ఘాయువతో ఉండాలనే ప్రాజెక్టుతో వార్తల్లో నిలిచాడు. 18 ఏళ్ల యువకుడి ఫిట్నెస్ సాధించడమే లక్ష్యంగా తనమీద ప్రయోగాలు చేసుకున్నాడు. అందుకోసం కోట్లు ఖర్చుచేశాడు. నిత్యం తన చుట్టూ వేలాది డాక్టర్లు నియమించి ప్రతి అణువణువు శోధించి ఎన్నో ప్రయోగాలకు తెర తీశాడు. చివరికి విషాదకరంగా అతడే తనను తినేసే దీర్ఘకాలిక వ్యాధి భారిన పడ్డాడు. నిజానికి ఆ వ్యాధికి శాశ్వత నివారణ లేదు కేవలం మందులు, చక్కటి ఆహారంతోనే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలేంటి వ్యాధి. ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా.!.ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో మన రోగనిరోధక వ్యవస్థ (immune system) పొరపాటున కడుపులోని ఆమ్లాలను ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది. దీనివల్ల కడుపులో నొప్పి, వికారం, విటమిన్ బి-12, ఐరన్ లోపాలు ఏర్పడతాయి.ఎందువల్ల వస్తుందంటే..ఈ పరిస్థితి వంశపారంపర్యంగా రావచ్చు లేదా టైప్ 1 డయాబెటిస్, థైరాయిడ్ (హాషిమోటోస్) వంటి ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యాధి రావడానికి ఖచ్చితమైన కారణాలు గురించి తెలియాల్సి ఉంది. కానీ వైద్యులు దీన్ని సాధారణంగా జన్యుపరమైన లోపాలు, రోగనిరోధక వ్యవస్థలో వచ్చే మార్పుల కలయిక వల్ల ఇది వస్తుందని నమ్ముతారు.లక్షణాలు..ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ కడుపు ఉబ్బరం, అజీర్తి, అలసట, రక్తహీనత (Pernicious anemia) వంటివి కాలక్రమేణా బయటపడతాయి. ప్రమాదకరమా..?ఇది నెమ్మదిగా, చాలా సంవత్సరాల పాటు సాగే దీర్ఘకాలిక ప్రక్రియ. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన నరాల బలహీనత, ఎముకలు బలహీనపడటం, తీవ్రమైన రక్తహీనతకు దారితీస్తుంది. అంతేకాకుండా, కడుపులో దీర్ఘకాలికంగా ఉండే వాపు వల్ల భవిష్యత్తులో:కడుపులో పాలిప్స్గ్యాస్ట్రిక్ న్యూరోఎండోక్రిన్ కణితులుకడుపు కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణ అవసరం.నిర్ధారణ:ఎండోస్కోపీ, బయాప్సీ: పొట్ట లోపలి భాగాన్ని పరిశీలించి, కణజాల నమూనాలను పరీక్షించడం ద్వారా నిర్ధారిస్తారు.రక్త పరీక్షలు: విటమిన్ బి12, ఐరన్, ఆటోయాంటీబాడీస్ స్థాయిలను తనిఖీ చేస్తారు.చికిత్స: ఆటోఇమ్యూన్ గ్యాస్ట్రిటిస్ను పూర్తిగా నయం చేయడానికి శాశ్వత నివారణ (Cure) లేదు, కానీ సరైన వైద్య సంరక్షణతో దీనిని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు. కడుపులో తగ్గిన పోషకాలను, ముఖ్యంగా విటమిన్ బి12 ఇంజెక్షన్లు లేదా సప్లిమెంట్ల ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోగలరని చెబుతున్నారు. అలాగే క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారి లేదా డాక్టర్ సూచించిన టైమ్లో బ్లడ్ టెస్టులు, పీరియాడిక్ ఎండోస్కోపీ చేయించుకోవాలి. దీంతో కడుపులో కేన్సర్ లేదా కణితులు వంటి ముందస్తు మార్పుల్ని త్వరగా గుర్తించి ప్రాణాపాయం తప్పించవచ్చు.కాగా బ్రయాన్ ప్రజలంతా తన అనారోగ్యాన్ని సంబరంగా జరుపుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కారు. తాను మరణ భయాలను పోగొట్టాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టుని చేపట్టి తన మీదే ప్రయోగాలు చేస్తే..దాన్ని దురుద్దేశంగా చూస్తూ తగిన శాస్తి జరిగిందని చాలామంది సంబరపడుతున్నారని అన్నారు.ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నావారిని ఈ ప్రపంచం ఇలానే చూస్తుందని, వాళ్లకు ఎదురైన ఓటమి లేదా దురదృష్టాన్ని ఇలానే చిత్రీకరిస్తుందని ఆవేదనగా చెప్పారు. తన ప్రయత్నాలు విఫలమైనా..వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఓ కొత్త మార్గాన్ని అందించింది, అలాగే రానున్న రోజుల్లో బహుశా మరణం అనివార్యం కాకపోవచ్చు అని బ్రయాన్ ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం.The world wants me to die. My incurable disease diagnosis became global news. It was omnipresent on social media and 1,900 articles were written in a matter of days. Many were saddened.However, joy dominated the commentary. People pointed to schadenfreude, the pleasure…— Bryan Johnson (@bryan_johnson) July 12, 2026 (చదవండి: వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్ డ్రైవింగ్ ..) -
ఆ డీఆర్డీఓ శాస్త్రవేత్త అడిగిన ఒకే ఒక్క ప్రశ్న..లైఫ్నే మార్చేసింది!
ఒక్కోసారి మనకు పరిచయమై వ్యక్తులు ఎంతగా ప్రభావితం చేస్తుంటారంటే..మనం విస్మరిస్తున్న వాటిని గుర్తు చేస్తారు. అంతేగాదు అన్నింటకంటే ఏది ముఖ్యమో చెప్పే శ్రేయోభిలాషులని ఆ తర్వాత గానీ తెలియదు. ఇప్పుడిదంతా ఎందుకంటే..అలాంటి అనుభవమే ఈ సీఈవోకి ఎదురైంది. లింక్డ్ఇన్లో షేర్ చేసిన పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. మనం సదా సంపాదన చుట్టూ తిరుగుతూ మర్చిపోతున్న అసలైన సంపదను గుర్తు చేసింది అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ పోస్ట్లో ఈమార్ ఇండియా సీఈవో కళ్యాణ చక్రవర్తి ఇలా రాసుకొచ్చారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కు చెందిన ఒక సీనియర్ శాస్త్రవేత్త తనను అడిగిన ఒక ప్రశ్న ఏళ్ల తరబడి తన మదిలో అలానే నిలిచిపోయిందని అన్నారు. 2014లో, ప్రయాణమంతా నిద్రపోవాలనే ఉద్దేశంతో తాను బెంగళూరు-ఢిల్లీ విమానం ఎక్కానని పంచుకున్నారు. కానీ మరుసటి రోజు కొత్తగా ప్రమాణం స్వీకారం చేసిన ప్రధానిని కలవడం కోసం వెళ్తున్న డీఆర్డీఓతో మాటలు కదిపినట్లు తెలిపారు. ఆ శాస్త్రవేత్త మొదటగా, మీరు జీవనోపాధి కోసం ఏమి చేస్తారు అని ప్రశ్నించినట్లు తెలిపారు. తాను ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లో మేనేజింగ్ పార్టనర్ అని చెప్పగా, ఎవరడిగారు దాని గురించి అని ఆయన అన్నారు. దాంతో ఆశ్చర్యపోయిన తాను ఒక్కక్షణం ఆయన అలా ఎందుకు అన్నారో ఆలోచించాను. ఆ తర్వాత ఆ శాస్త్రవేత్త తాను వృత్తి గురించి అడగలేదని అన్నారు. తాను ఆరోగ్యం, ఆనందం కోసం ఏం చేస్తుంటారని అడిగానని తాపీగా అన్నారు. దాంతో తాను గర్వంగా సాయంత్రం సమయంలో 45 నిమిషాలు వాకింగ్ చేస్తానని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. అది విని ఆయన ఆహా ఎంత సమయం వృధా చేస్తున్నారు మీరు అని తేలిగ్గా అనేశారు. ఆ తర్వాత ఆ శాస్త్రవేత్త పరుగెత్తడం వల్ల తన ఫిట్నెస్ గణనీయంగా మెరుగుపడిందన్నారు. తాను అలా 34 ఏళ్లుగా పరుగెత్తుతున్నానని, తన రోజుని ఉదయం 4.30 గంటలకు ప్రారంభింస్తానని చెప్పారు. తన దినచర్యలో వారమంతా 15 కి.మీ ఆదివారం ఒక్కరోజు 35 కి.మీ పరుగు ఉంటుందన్నారు. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా మారథాన్లు పూర్తి చేశానని అన్నారు. ఆ తర్వాత లెక్కించడమే మానేశానని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు కళ్యాన్ చక్రవర్తి. చివరగా ఆయన ఒక మంచి జత బూట్లు కొనుక్కుని పరిగెత్తడం మొదలుపెట్టు మిగతాదంతా నువ్వు పరిగెడుతూ తెలుసుకుంటావ్ అని ఆయన ఇచ్చిన సలహాని ఎప్పటికీ మర్చిపోనన్నారు. ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి ప్రశ్నను ఇంత సూటిగా అడగలేదని కూడా అన్నారు. దాంతో తాను మరసుటి రోజు నుంచి ఆయన సలహాను తూచా తప్పకుండా పాటించినట్లు తెలిపారు. మొదటి రోజు జస్ట్ 50 మీటర్లు నడిచి అలిసిపోయి వెనక్కి వచ్చేశానన్నారు. ఆ తర్వాత 100 మీటర్లు..అలా ఒక కిలోమీటరుగా మారింది. మూడు నెలల్లో వేలాది మంది ఇతర రన్నర్లతో పాటు ఎయిర్టెల్ ఢిల్లీ హాఫ్ మారథాన్ ప్రారంభ రేఖ వద్ద నిలబడ్డాను, పూర్తి చేశాను కూడా అని సగర్వంగా చెప్పారు. చివరగా ఆయన మిమ్మల్ని ఎవరూ అడగని ప్రశ్నే కొన్ని సార్లు మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రశ్నగా మారిపోతుంది అంటూ పోస్ట్ని ముగించారు. నెటిజన్లు కూడా ఇది చాలా నిజం, మనం వ్యాపారాలను నిర్మించడం, సంపాదన పోగు చేయడం వంటి వాటితో మునిగిపోతాం. మనకు కావాల్సిని అత్యంత ముఖ్యమైన ఆరోగ్యం అనే సంపదను విస్మరిస్తాం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ప్లీజ్ పట్టుచీరను ఎలా ఉతకాలో చెప్పరు..!: ఓ విదేశీ మహిళ అభ్యర్థన) -
శస్త్ర చికిత్స లేకుండా 'ఏఐ' ఎండోమెట్రియోసిస్ను నిర్థారించగలదా?
టెక్ బిలియనీర్, దీర్ఘాయువు ప్రచారకర్త బ్రయాన్ జాన్సన్ తన స్నేహితురాలు కేట్కు శస్త్ర చికిత్స చేయించుకోకుండానే ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఏళ్ల తరబడి స్కానింగ్ల తర్వాత ఏఐ సహాయక ఎంఆర్ఐ విశ్లేషణలో ఎండోమెట్రియోసిస్ని సులభంగా నిర్థారించిదని వెల్లడించారు. శస్త్ర చికిత్స లేకుండా నిర్థారించలేని ఈ సమస్యను తాము ఏఐ ఆధారిత స్కానింగ్, బహుళ రక్త పరీక్షల సాయంతో నిర్థారించామని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఎండోమెట్రియోసిస్?, ఈ సమస్యను గుర్తించడంలో ఏఐ ప్రత్యామ్నాయంగా ఉంటుందా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఎండోమెట్రియోసిస్ అంటే..ఇది మహిళల్లో కనిపించే ఒక సాధారణ మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ఇందులో, గర్భాశయం లోపలి పొరను పోలి ఉండే కణజాలం (ఎండోమెట్రియం) గర్భాశయం వెలుపల.. అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్లు, లేదా పొత్తికడుపులోని ఇతర అవయవాలపై పెరగడం ప్రారంభమవుతుంది. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల వాపు, మచ్చలు, తీవ్రమైన కటి నొప్పి కలుగుతాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీని బారిన పడుతున్నారని అంచనా. దీని కారణంగా మహిళలు ఈ కింది సమస్యలు ఎదుర్కొంటారు.లక్షణాలు..నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పిరుతుస్రావం సమయంలో లేదా సంభోగం సమయంలో విపరీతమైన నొప్పిఅధిక రక్తస్రావం (హెవీ పీరియడ్స్)వంధ్యత్వం (గర్భం దాల్చడంలో ఇబ్బందులు)దీన్ని నిర్థారించడం ఎందుకంత కష్టం అంటే..ఈ సమస్య లక్షణాలు తరచుగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), పెల్విక్ ఇన్ప్లమేటరీ డిసీజ్ లేదా అండాశయ తిత్తులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో కలిసి ఉంటాయి. ఫలితంగా, చాలా మంది మహిళలకు ఈ వ్యాధి నిర్ధారణ కావడానికి 6 నుంచి 10 ఏళ్ల వరకు వేచి ఉండాల్సి వస్తుంది.సాధారణ స్కాన్లు గుర్తించలేకపోవడానికి రీజన్..ఇక్కడ బ్రయాన్ జాన్సన్ తన గర్ల్ఫ్రెండ్ కేట్ మొదటగా ఎమ్మారై, ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ చేయించుకుందని చెప్పారు. కానీ ఈ రెండూ ఆ వ్యాధిని గుర్తించడంలో విఫలమయ్యాయని చెప్పారు. నిజానికి సాధారణ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా ఎండోమెట్రియోసిస్ గాయాలను గుర్తించడం కష్టమని వైద్యులు కూడా చెబుతున్నారు. అండాశయాలు లేదా లోతైన పెల్విక్ కణజాలాలను ప్రభావితం బాగా ప్రభావితం చేసే ముదిరిన పరిస్థితుల్లోనే సాంప్రదాయ స్కానింగ్లో దీన్ని గుర్తించగలరట. అదీగాక దశాబ్దాలుగా, ఎండోమెట్రియోసిస్ను నిర్ధారించడానికి లాపరోస్కోపీని (వైద్యులు పెల్విక్ కుహరాన్ని నేరుగా పరీక్షించడానికి వీలు కల్పించే అతి తక్కువ కోతతో చేసే శస్త్రచికిత్సా విధానం) అత్యుత్తమ ప్రమాణంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఏఐ ఆధారిత అధిక నాణ్యత ఇమేజింగ్ ఆ కోతను కూడా తగ్గించి సులభంగా ఈ సమస్యను గుర్తించడం విశేషం.కృత్రిమ మేధ (AI) రోగ నిర్ధారణను మెరుగుపరచగలదా?మహిళల ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ ఒక ఆశాజనకమైన సాధనంగా ఆవిర్భవించనుంది. పెల్విక్ MRI స్కాన్లను విశ్లేషించడానికి, రేడియాలజిస్టులు కూడా గమనించలేని సూక్ష్మమైన నమూనాలను గుర్తించడానికి AI అల్గారిథమ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. అందువల్ల ఈ సాంకేతికత లోతుగా చొచ్చుకుపోయే ఎండోమెట్రియోసిస్ను గుర్తించడంలో చక్కటి మెరుగుదలను అందిస్తుందని అంటున్నారు నిపుణులు. ఇక్కడ జాన్సన్ AI-సహాయక ఇమేజింగ్, ఎండోమెట్రియోసిస్-నిర్దిష్ట అల్ట్రాసౌండ్తో పాటు వివధ రక్త పరీక్షల ఆధారంగా ఈ సమస్యను నిర్థారించినట్లు తెలిపారు. అందువల్ల ఇది కచ్చితంగా మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని చెప్పలేమని..ఇంకా పలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని అంటున్నారు. అందువల్ల తాము ఏఐ సాధనం గైనకాలజిస్ట్ నిపుణుడికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుపెట్టుకోండని హెచ్చరిస్తున్నారు.ప్లీజ్ ఈ విషయాలన్ను విస్మరించొద్దు..అందుకనే మహిళలు ఎండోమెట్రియోసిస్ను సూచించే లక్షణాలు ఉంటే, కేవలం ప్రాథమిక స్కాన్ ఆధారంగా నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు. ఎండోమెట్రియోసిస్ విషయంలో అనుభవం ఉన్న గైనకాలజిస్ట్ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. ఇక్కడ జాన్సన్ చెబుతోంది దీర్ఘకాలిక కటి నొప్పితో బాధపడుతున్న లక్షలాది మంది మహిళలకు, ఈ ఆవిష్కరణలు ముందస్తు నిర్థారణకు, అలాగే తక్కువ బాధతోనే త్వరితగతిని వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశానికి వీలు కల్పిస్తుందనే ఆశను అందిస్తుందే తప్ప..దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: కేన్సర్తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..) -
కేన్సర్తో పోరాడుతూ షూటింగ్లో పాల్గొన్నా..! ఆ కారణంగానే ఆమె..
బాలీవుడ్ నటి, మోడల్ నఫీసా అలీ కేన్సర్ వారియర్. ఇప్పటికీ దానిపై పోరాడుతున్నారామె. నిజానికి ఇలాంటి వ్యాధి ఎంతటి వ్యక్తులనైనా కుంగదీసేస్తుంది. కానీ ఆమె ఆ మహమ్మారి విడవకుండా మరోసారి తిరగబెడుతున్నా..నవ్వుతూనే పోరాడుతోంది. పైగా ఎందుకిలానో ఆమెనే స్వయంగా వెల్లడించారు. అంతేగాదు తనకు తొలిసారి కేన్సర్ నిర్థారణ అయినప్పుడూ కూడా షూటింగ్ల్లో పాల్గొన్నానని అందుకు కారణం ఉందంటూ ఆలోచింప చేసేలా మాట్లాడారామె. ఆ ఆసక్తికర విషయాల గురించి సవివరంగా తెలుసుకుందామా. బాలీవుడ్ ప్రముఖ నటి నఫీసా అలీ జూనూన్' (1979), 'మేజర్ సాబ్' (1998), 'లైఫ్ ఇన్ ఎ మెట్రో' (2007), 'గుజారిష్' (2010), 'యమ్లా పగ్లా దీవానా' (2011) వంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో నటనకు పేరుగాంచింది. తన నటన, అభినయంతో విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ బెంగాలీ భామకు 'మ్యాక్స్, మిన్ అండ్ మ్యావ్జాకి' షూటింగ్ సమయంలోనే స్టేజ్ 3 కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపింది. అయితే ఆ టైంలో ఈ మూవీని పూర్తి చేయగలనా..ఆ పాత్రలో నటించగలనా అనే భయాలు వెంటాడుతున్న తరుణంలో ఆ చిత్రనిర్మాత పద్మకుమార్ నరసింహమూర్తి తనపై పూర్తి నమ్మకం ఉంచారని అందుకు ఆయనకు శతకోటి ధన్యవాదాలని అన్నారామె. ఆయన తనని ప్యాడీ అని ముద్దుగా పిలిచేవారని, ఆ టైంలో అంత ధైర్యంగా సినిమా చేయడానికి కారణం కూడా ఆయనే అని నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు. ఆ చ్రితం కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చేది కావడం ఒకటైతే, కేన్సర్ లాంటి వ్యాధితో పోరాడుతూ కూడా తన పనుల్లో సాగిపోవాలని భవిష్యత్తు తరాలకు కొత్త ఆశను అందించేందుకు అంటోంది నఫీసా అలీ. అంతేగాదు తన జీవితంతో ఒక సందేశాన్ని అందించాలనే పోరాటమే అత్యంత ముఖ్యమైనదని తెలుసుకున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు, అలాంటప్పడు నాకే ఇలా అనే కుంగుబాటుకు లోనవ్వాల్సిన పనిలేదు అని చెప్పేందుకని అంటోందామె. ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ దీని గురించి ఆలోచించడం ముఖ్యం. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు, నైతిక బాధ్యత గురించి ఆలోచించాలని చెబుతోంది. జీవితం ఎప్పటికీ అనూమ్యమైనదే, అందుకనే ప్రజలు సదా కరుణతో ఉండాలి, సాముహిక బాధ్యతను కలిగి ఉండాలన్నేదే నమ్ముతానని అంటోంది. ఈ రోజు ఇక్కడ ఉన్నానని, రేపు ఏం జరుగుతుందనే ఎవరికి తెలుసు కాబట్టి ఆ వ్యాధిపై ధైర్యంగా పోరాడుతూనే ఉండండి..ఆ సత్యాన్ని చెప్పేందుకే ఆ సమయంలో కూడా షూటింగ్లలో పాల్గొన్నట్లు తెలిపింది. తాను అప్పుడు స్టేజ్ 3 కేన్సర్తో పోరాడా, గెలిచా..కానీ మళ్లీ తిరగబెట్టి స్టేజ్ 4 కు చేరుకుంది అయినా..తన పోరాటం ఆపనని ధీమాగా చెబుతోందామె. ఆమె ముందు క్రీడాకారిణి..కోల్కతాలో బెంగాలీ తండ్రికి, ఆంగ్లో ఇండియన్ తల్లికి జన్మించిన నఫిసా అలీ విభిన్న సంస్కృతులు కలగలసిన కుటుంబ నుంచి వచ్చారామె. ఆమె స్విమ్మింగ్లో అర్జున అవార్డు గ్రహిత. క్రీడాకారుడైన కల్నల్ రవీందర్ సింగ్ సోధీని పెళ్లి చేసుకున్నారు. నటలోకి ప్రవేశించడానికి ముందే ఆమె నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్గా ఉండేవారు. 1976లో ఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకున్నారు. అంతేగాదు శశి కపూర్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వంఇ ప్రముఖ నటనలతో పనిచేశారు. 2004, 2009లలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేశారు. 2005లో, ఆమె చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI) ఛైర్పర్సన్గా నియమితులయ్యారు. నవంబర్ 2018లో, ఆమెకు స్టేజ్ 3 పెరిటోనియల్, ఓవేరియన్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. View this post on Instagram A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi) (చదవండి: కదులుతున్న రైలులో పూజలు..! రైల్వే ఏం చెప్పిందంటే) -
పాటలు పాడటం.. నిజంగానే ఊపిరితిత్తులకు మంచిదా?
స్నానం చేస్తూ పాటలు పాడుతున్నారా? అయితే మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తున్నట్టే! పాటలు పాడేటప్పుడు ఊపిరిని లోతుగా తీసి వదలాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అంటే... మీ బాత్రూమ్ కచేరీ కూడా ఒక చిన్న వ్యాయామమే!. అదెలాగో సవివరంగా తెలసుకుందామా..!పాటలు పాడటం అనేది కేవలం కళ మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన వ్యాయామం. క్రమం తప్పకుండా పాటలు పాడటం వల్ల డయాఫ్రాగమ్, ఇంటర్కోస్టల్ కండరాలు బలపడి, ఊపిరితిత్తుల సామర్థ్యం (lung capacity), శ్వాస నియంత్రణ మెరుగుపడతాయిశ్వాసకోశ కండరాల బలోపేతం: దీర్ఘమైన శ్వాస దశలు, నియంత్రిత శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా శ్వాస వదలడం అనేవి డయాఫ్రమ్, ఇంటర్కోస్టల్ సహాయక కండరాలను ఉత్తేజపరిచి, ఓర్పును, సామర్థ్యాన్ని పెంచుతాయి.మెరుగైన శ్వాస నియంత్రణ సామర్థ్యం: సంగీత శిక్షణ సౌకర్యవంతమైన ఉచ్ఛ్వాస సమయాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల అసలు పరిమాణం మారకపోయినా, ఇప్పటికే ఉన్న ఊపిరితిత్తుల పరిమాణాన్ని మెరుగ్గా ఉపయోగించడం ద్వారా క్రియాత్మక కీలక సామర్థ్యాన్ని పెంచుతుంది.మెరుగైన శ్వాస సామర్థ్యం: పాడటం నెమ్మదిగా, నియంత్రితంగా శ్వాస తీసుకునే విధానాలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల అనవసరమైన వేగవంతమైన, నిస్సారమైన శ్వాసలు తగ్గి, వాయు మార్పిడి ప్రక్రియ మెరుగుపడుతుంది.వాయుమార్గం తెరుచుకోవడం, శ్లేష్మం తొలగిపోవడం: ఫిజియోథెరపీ పద్ధతులతో కలిపి ఉపయోగించినప్పుడు, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో స్వర వ్యాయామాలు సున్నితమైన ఉచ్చారణ శ్లేష్మాన్ని కదిలించి, వాయుమార్గం శుభ్రపరచడాన్ని మెరుగుపరుస్తాయి.అంతేగాదు పాడటం శ్వాస, మింగడం మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఇది న్యూరోజెనిక్ డిస్ఫేజియా, కొన్ని నాడీకండర రుగ్మతలకు ఉపయోగపడుతుంది.సమూహ గానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ఆయాసం అనే భావనను తొలగిస్తుంది. టానమిక్ సమతుల్యతను (సింపథెటిక్ టోన్ను తగ్గించడం) అనుకూలంగా మార్చవచ్చు, తద్వారా పరోక్షంగా శ్వాస సరళకి ప్రయోజనం చేకూరుస్తుంది.(చదవండి: దెయ్యంపై కేసు..! జడ్జీ వేసిన ఆ ఒక్క ప్రశ్నతో..) -
వర్షాకాలంలో ఆ ఇన్ఫెక్షన్ల బారిన పడకూడదంటే..! తప్పనిసరిగా ఆ ఆహారాలు..
తొలకరి జల్లులతో హమ్మయ్యా అనేలా..భగభగ మండే ఎండల నుంచి చల్లటి ఉపశమనం కలిగించే ఆహ్లాదభరిత వాతావరణం ఇది. ఎంతో చల్లగా ఉండే ఈ సీజన్ ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండే కాలం కూడా. అందువల్లే ఈ సీజన్లో తాజాగా వండిన భోజనం, సురక్షితమైన తాగు నీటిని ఎంచుకుంటేనే కాలానుగుణ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెచ్చని ఉష్ణోగ్రతల కలయికలో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు పెరగడానికి సరైన సమయం ఇది. ఫలితంగా కడుపు ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఈ కాలంలో. అందువల్ల ఎలాంటి ఆహారం తింటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం, అందుకోసం ఏం చేయాలి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.స్ట్రీట్ ఫుడ్..వర్షాకాలంలో దూరంగా ఉండవలసిన అతిపెద్ద ఆహారాలలో వీధి ఆహారం ఒకటి. చాట్, పానీ పూరీలు, కోసిన పండ్లు, మూతపెట్టని చిరుతిళ్లు, బహిరంగ ప్రదేశాల్లో తయారు చేసే ఆహారాలు తదితరాలకు దూరంగా ఉండటం మంచిది. అమ్మకందారులు సురక్షితమైన నీటిని వినియోగించనట్లయితే..కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల తాజాగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎంచుకోవడమే సురక్షితమైందని సూచిస్తున్నారు.పచ్చి ఆకు కూరలు, సలాడ్లుపచ్చి ఆకుకూరలలో, ముఖ్యంగా వర్షాకాలంలో, మట్టితోపాటు పరాన్నజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు ఉండవచ్చు. వాటిని సరిగ్గా కడగకపోతే, అవి జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. వండటం వల్ల వ్యాధులను కలిగించే చాలా సూక్ష్మక్రిములు నశిస్తాయి కాబట్టి, సాధ్యమైనంత వరకు వండిన కూరగాయలను తినమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ సలాడ్లు తినాలనుకుంటే, వాటిని ఇంట్లో శుభ్రమైన నీటితో బాగా కడిగి తీసుకోవడం మేలు. పండ్లు, కూరగాయలను బాగా కడిగే ముందు, వాటిని కొద్దిగా వెనిగర్ కలిపిన నీటిలో నానబెట్టి తీసుకోవడం మరింత మంచిది.తాజాగా లేని సముద్రపు ఆహారంవర్షాకాలంలో సముద్రపు ఆహారాన్ని జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలా చేపలకు సంతానోత్పత్తి కాలం. దాంతో ఈ సమయంలో, కలుషితం కావడం,పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్రపు ఆహారాన్ని తినాలని ఎంచుకుంటే, అది తాజాగా, పూర్తిగా ఉడికించినదైతేనే తీసుకోవడం సురక్షితం. సరిగ్గా ఉడకని లేదా పాడైపోయిన సముద్రపు ఆహారం వల్ల ఆహార సంబంధిత అనారోగ్యాలు, కడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదం అధికంగా ఉంటుంది.మిగిలిపోయిన..పాడైపోయిన ఆహారంఎక్కువ కాలం పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచిన లేదా చాలా గంటల పాటు బయట వదిలేసిన ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఎందుకంటే తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే అది సురక్షితం కాదు. తప్పనిసరిగా ఆహారాన్ని నిల్వ చేయాల్సి వస్తే, దానిని త్వరగా రిఫ్రిజిరేటర్లో పెట్టి, తినే ముందు బాగా వేడి చేసుకోండి.వేయించిన నూనెతో కూడిన ఆహారాలువర్షాకాలంలో ప్రజలు తరుచుగా పకోడాలు, సమోసాలు, ఇతర వేయించిన చిరుతిళ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఆహారాలు బరువుగా ఉండి, జీర్ణం కావడం కష్టంగా ఉంటాయి. పైగా ఇలాంటి ఆహారాల వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం అధికంగా ఉంటుంది.చక్కెర పానీయాలు, డెజర్ట్లు, పచ్చి ఆహారాలుఅధిక చక్కెర పానీయాలు , డెజర్ట్లు వాపుకు కారణం కావచ్చు. పైగా మొత్తం రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయగలవు. వర్షాకాలంలో బయట అమ్మే పచ్చి మొలకలు,ముందుగా కోసిన పండ్లకు దూరంగా ఉండటం మంచిది.ఎందుకంటే అవి బ్యాక్టీరియా వృద్ధికి సులభంగా నిలయాలుగా మారతాయి. బదులుగా, అరటిపండ్లు దానిమ్మపండ్లు వంటి తొక్క తీయగలిగే సీజనల్ పండ్లను ఎంచుకోవడం మేలు.ఆరోగ్యకరమైన ఆహారపు చిట్కాలుతేలికగా, పోషక విలువలతో, సులభంగా జీర్ణమయ్యే, తాజాగా తయారుచేసిన ఇంట్లో వండిన భోజనంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులుబాటిల్లోని నీటిని లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగండి. అవసరమైతే..వాటర్ ప్యూరిఫైయర్ను ఉపయోగించండి లేదా క్లోరిన్ టాబ్లెట్ను కలపండి.వీధి ఆహారానికి దూరంగా ఉండి, ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి.గోధుమలు, పిండిచేసిన ధాన్యాలు సురక్షితమైనవిపండ్లు, కూరగాయలను క్షుణ్ణంగా కడగి తీసుకోవడం మేలుపచ్చి మొలకలు, కోసిన పండ్లకు దూరంగా ఉండండి: ఇవి బ్యాక్టీరియా వృద్ధికి నిలయాలుగా మారతాయిశుభ్రమైన పాత్రలు, పళ్ళాలు వాడండి: వాటిని సబ్బుతో క్షుణ్ణంగా కడగండిశరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి: పుష్కలంగా ద్రవపదార్థాలు తాగండితరచుగా చేతులు కడుక్కోండి: ముఖ్యంగా తినడానికి ముందు, వాష్రూమ్కి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా చేతులు కడుక్కుని తినడం మంచిది. గమనిక: ఇది కేవలం అగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది!) -
బిడ్డకు సరైన రీతిలో పాలు పట్టడం ఎలాగంటే..!
ఇంట్లోకి కొత్త అతిథిగా ఓ చిన్నారి రావడం ఒక సంతోషకరమైన విషయం. ఈ సంతోషంతో పాటు చాలా రకాల సందేహాలూ వస్తుంటాయి. మరీ ముఖ్యంగా కొత్తగా తల్లి అయిన మహిళను అనేక సందేహలు వెంటాడుతుంటాయి. బిడ్డకు తాను సరిగానే పాలు పడుతున్నానా, అవి బిడ్డ ఒంటికి పడుతున్నాయా... బిడ్డ ఆరోగ్యకరంగా బరువు పెరుగుతుందా లేదా అనే డౌట్స్ చాలా సహజం. కొత్త తల్లి బిడ్డకు సరిగా పాలు పడుతోందా లేదా అనే సందేహాలతో పాటు బిడ్డకు సరైన రీతిలో రొమ్ముపాలు పట్టడం ఎలాగో తెలుసుకోండి. మనదేశంలో చిన్నారులు పుట్టినప్పుడు 2.5 కిలోల నుంచి 3 కిలోల వరకు బరువుంటారు. అప్పుడే పుట్టిన బిడ్డ బరువు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదా... పేరెంట్స్ జీన్స్, తల్లి ఆహారపు అలవాట్లు, గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్యలు, తల్లి బరువు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టాక మొదటి వారంలో– పుట్టినప్పుడు ఉన్న బరువు కంటే కాస్తంత తగ్గుతారు. అంటే మొదటి వారం పదిరోజుల్లో 5 శాతం నుంచి 10 శాతం బరువు తగ్గుతారు. ఆ తర్వాత నుంచి (రెండో వారం నుంచి) మళ్లీ క్రమేణా బరువు పెరగడం మొదలవుతుంది. మొదటి మూడు నెలల్లో దాదాపు రోజుకు 20 నుంచి 30 గ్రాములూ, నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల వరకు పిల్లలు బరువు పెరుగుతారు. చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. పాపలు పుట్టిన నాటితో పోలిస్తే మొదటి ఆరు నెలలలో రెట్టింపు బరువు (డబుల్), ఏడాది నాటికి మూడు రెట్లు (ట్రిపుల్) తప్పనిసరిగా పెరగాలని లేదు. అలా పెరగడానికి, పెరగకపోవడానికి అనేక అంశాలు కారణమవుతాయి.చిన్నారులు తగినంత బరువు పెరగడం లేదంటే... పిల్లలు బరువు పెరగకుండా క్రమంగా తగ్గుతూ పోతుంటే లోపం ఎక్కడుందనేని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రధానంగా తల్లి పాలు సరిపోకపోవడమో లేదా బిడ్డ సరిగా తాగకపోవడమో లేదా చిన్నారి పూర్తిగా పాలు తాగకుండా కొద్దిగా తాగి పడుకుంటూ ఉండటమో కారణం కావచ్చు. బిడ్డ పాలు తాగేప్పుడు రెండు రకాల పాలు వస్తాయి. మొదటిది తొలిగా వచ్చే పాలు. వీటిని ఫోర్ మిల్క్ అంటారు. రెండోది మలిసారి పాలు... వీటిని హైండ్ మిల్క్ అంటారు. పాప కాసిన్ని పాలు తాగక వచ్చేవే హైండ్ మిల్క్. వాస్తవానికి ఫోర్ మిల్క్ కంటే... హైండ్ మిల్క్ చాలా బలవర్ధకమైనవి. ఇందులోని క్యాలరీలు బరువు పెరగడానికి దోహదపడతాయి. ఈ ఫోర్ మిల్క్ను ప్రసవం కాగానే స్రవించే ముర్రుపాలతో పొరబాటు పడవద్దు. ముర్రుపాలు వేరు, ఫోర్ మిల్క్ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు బిడ్డకు చాలా మంచి చేస్తాయి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. ఫోర్ మిల్క్ అంటే... ప్రతిసారీ పాలు తాగడం మొదలు పెట్టగానే మొదట స్రవించేవి. ఓ పది–పదిహేను గుటకల తర్వాత స్రవించేవి హైండ్ మిల్క్.చిన్నారి ఆరోగ్యంగా బరువు పెరగడానికి అవసరమైన జాగ్రత్తల్లో కొన్ని... పాపకు ప్రతి రెండు–మూడు గంటలకు ఓమారు పాలు తాగించడం ఓ రొమ్ము పట్టించినప్పుడు పాప ఆ రొమ్ము నుంచి పాలు పూర్తిగా తాగిందో లేదో నిర్ధారణ చేసుకోవడం. అంటే ఒక రొమ్ము నుంచి పాలు తాగాక పాపకు అదే రొమ్ము అందిస్తే ముఖం తిప్పుకోవడం, రొమ్ము అందుకోకపోవడం చేస్తుంది) ఓ రొమ్ములోని పాలు పూర్తిగా పట్టించాకే రెండో రొమ్ము కూడా అందించడం రెండు రొమ్ముల్లోని పాలు ఇవ్వాలంటూ ఒక రొమ్ములోని ΄పాలు కాసిన్ని, మరో రొమ్ములోని పాలు మరికాసిన్ని ఇవ్వవద్దుపడుకునే సమయంలో తప్పనిసరిగా పాప పక్కనే పడుకోవడం. (పాప పక్కనే ఉండటం వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ స్రవించడం పెరిగి పాలు ఎక్కువగా వస్తాయి) బిడ్డ స్పర్శ ఎప్పుడూ తల్లికి తగిలేలా (స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండేలా) చూసుకోవడం మీ పాపకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోడానికి పాప రోజులో ఎన్నిసార్లు పక్క తడుపుతోంది అన్న విషయమూ ఓ పరోక్ష సూచనే. బిడ్డ పగలు కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు పక్కతడుపుతుంటే తనకు పాలు సరిపోతున్నాయని అనుకోడానికి ఓ సూచనగా తీసుకోవచ్చు.డా. శివనారాయణ రెడ్డి వెన్నపూస, సీనియర్ నియోనేటాలజిస్ట్ – పీడియాట్రీషియన్ (చదవండి: వైద్యవృత్తిని చేపట్టిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..!) -
మోకాలు పట్టేస్తోందా?
మెనిస్కస్ అంటే... అది మోకాలి జాయింట్ దగ్గర పైన ఉండే తొడ ఎముక (ఫీమర్)కూ, కిందనుండే కాలి ఎముక (టిబియా)కూ మధ్యన ‘సి’ ఆకారంలో ఉండే కార్టిలేజ్ అని పిలిచే మృదులాస్థి. నడుస్తున్నప్పుడూ, పరుగెడుతున్నప్పుడూ... కాలితో జరుగుతున్న ప్రతి పనిలోనూ ఇది ఈ రెండు ఎముకల మధ్య ఓ కుషన్లా, షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంటుంది. కాలిపై పడే ప్రతి ఒత్తిడిని తాను తీసుకుంటూ ఉంటుంది. మోకాలి కదలికలు సాఫీగా జరిగేందుకు, కీళ్లను రక్షించేందుకు ఇది ఎంతో ముఖ్యమైన భాగం. ఏదైనా కారణాల వల్ల ఇది దెబ్బతినడాన్ని ‘మెనిస్కస్ టియర్’ అంటారు. ఇది ఏయే సందర్భాల్లో జరుగుతుంటుంది, అప్పుడు కనిపించే లక్షణాలూ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం...మోకాలి నొప్పి, వాపు, నడిచేటప్పుడు ఇబ్బంది లేదా మోకాలు ఒక్కసారిగా ‘లాక్‘ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్య అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇవి మోకాలి దగ్గరి మృదులాస్థి ‘మెనిస్కస్ టియర్’ సమస్యకు సూచనలు కావచ్చు. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొన్ని ్ర΄ాథమికమైన జాగ్రత్తలతో... శస్త్రచికిత్స అవసరం లేకుండానే కోలుకునే అవకాశం ఎక్కువ. ఆ వివరాలను తెలుసుకుందాం. మెనిస్కస్ టియర్ సమస్య ఎందుకు వస్తుందంటే..? ఆటల్లో మోకాలు ప్రమాదవశాత్తూ ఆకస్మికంగామెలితిరగడం ప్రమాదాల్లో గానీ లేదా ఇతరత్రా మోకాలి దగ్గర బలమైన దెబ్బ తగలడం వయస్సు పెరగడంతో మెనిస్కస్ అరుగుదలకు లోనై బలహీనపడడం మెట్లు ఎక్కడం లేదా బరువులు ఎత్తేటప్పుడు మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడడంప్రధాన లక్షణాలు... మోకాలి నొప్పి , వాపు మోకాలు లాక్ అయినట్లు అనిపించడం నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది మోకాలు పూర్తిగా వంచలేకపోవడం లేదా చాపలేకపోవడం కదిలించినప్పుడు ‘క్లిక్‘ లేదా ‘పాప్‘ శబ్దం వినిపించడం మోకాలిలో ఇబ్బందిగా అనిపించడంనిర్థారణ ఇలా... డాక్టర్లు చాలావరకు బాధితులు చెప్పే లక్షణాలను బట్టి శారీరకంగా (ఫిజికల్గా) పరీక్షించి... ఈ సమస్యను చాలావరకు అంచనా వేయగలుగుతారు. అవసరమైతే ఎమ్మారై స్కాన్ ద్వారా మెనిస్కస్ టియర్ను ఖచ్చితంగా నిర్ధారణ చేస్తారు. నివారణ కోసం జాగ్రత్తలివి... వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం ∙తొడ అలాగే మోకాలి కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయడం ∙అధిక బరువును నియంత్రించుకోవడం ∙ఆటల్లో స్వీయభద్రత కోసం తగిన ఉపకరణాలూ, పరికరాల ఉపయోగం ∙మోకాలి నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా తొలి దశలోనే డాక్టర్ను సంప్రదించడం. డాక్టర్ను సంప్రదించాల్సిందెప్పుడు? మోకాలి నొప్పి కొన్ని రోజుల పాటు తగ్గకపోయినా, మోకాలి దగ్గర వాపు ఎక్కువైనా, మోకాలు లాక్ అవుతున్నా లేదా నడవడం కష్టంగా ఉంటే వెంటనే ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే మోకాలి దగ్గరి కీళ్లకు మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది.చికిత్స ఇలా... మోకాలి దగ్గర అయ్యే చిన్న΄ాటి గాయాలకు ‘రైస్’ అనే తేలిగ్గా గుర్తుంచుకునే యాక్రనిమ్ సహాయంతో సులభంగా చికిత్స అందించుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు ‘ఆర్’ అంటే రెస్ట్ (విశ్రాంతి), ‘ఐ’ అంటే ఐస్ (ఐస్తో కోల్డ్ కాపడం పెట్టడం), ‘సి’ అంటే కంప్రెషన్ (అంటే ఒత్తిడి కలిగించేలా క్రేప్ బ్యాండ్ చుట్టడం), ‘ఈ’ అంటే ఎలివేషన్... అంటే మోకాలిని ఓ తలగడ సహాయంతో మిగతా దేహ భాగం కంటే కాస్త పైన ఉండేలా చూసుకోవడం ద్వారా సులభంగా చికిత్స అందించవచ్చు. తొలిదశల్లో ఇది శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎవరికి వారు ఇంట్లోనే తీసుకోగల జాగ్రత్తలుగా అనుకోవచ్చు. ఇక మెనిస్కస్ టియర్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే కొన్ని మందులు, ఫిజియోథెరపీ సహాయంతో చికిత్స అందిస్తారు. అయితే ఈ మృదులాస్థి తాలూకు టియర్ చాలా తీవ్రంగా ఉండి మోకాలు లాక్ అవుతున్నా లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే ఆర్థ్రోస్కోపీ (కీహోల్) శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అతి చిన్న కోతలతో చికిత్స చేయడం వల్ల నొప్పి తక్కువగా ఉండి, బాధితులు చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.చివరగా... మోకాలి నొప్పి, అక్కడ వాపు లేదా లాక్ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు దాన్ని చిన్న సమస్యగా పరిగణించకుండా అవి మెనిస్కస్ టియర్కు సంకేతాలుగా భావించి వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. సకాలంలో నిర్ధారణ, సరైన చికిత్స తీసుకుంటే మోకాలి పనితీరును కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో తీవ్రమైన కీళ్ల సమస్యలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ పి.ఆర్. వినయ్ కిషోర్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ -
అరుదైన ఆరోగ్య సమస్యతో పోరాడుతూ..డాక్టర్ అయ్యింది!
అందరి అమ్మాయిల్లా హాయిగా సాగిపోలేదు ఆమె జీవితం. అంతుచిక్కని అరుదైన వ్యాధితో పోరాడుతూ..మరోవైపు స్కూల్లో చీత్కారాలు సూటిపోటీ మాటలతో సాగింది ఆమె బాల్యం. ఆఖరికి కాలేజీలో సైతం అవే సమస్యలు వెంటాడాయి. విచిత్రం ఏంటంటే ఆమె ఒక పేషెంట్ కానీ డాక్టర్ కావలన్నది ఆమె కల. ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా కాలు కూడా కదపలేని ఆమె డాక్టర్ అయ్యేందుకు ఎంతలా పోరాడిందో తెలిస్తే..కన్నీళ్లు ఆగవు. ఇవాళ డాక్టర్స్ డే నేపథ్యంలో అసాధారణ ధైర్యంతో పోరాడిని ఈ యువ డాక్టర్ విజయగాథ గురించి తెలుసుకుందామా..!ఆ అమ్మాయే హినా రామ్టెకే. ఢిల్లీకి చెందిన ఆమెకు 13 ఏళ్ల వయసు వచ్చినా..చిన్నపిల్లలానే ఉండేది ఆమె రూపం. చదువులో చక్కగా రాణించేది. కానీ విపరీతమైన అలసటతో ఏదో సత్తువలేని విధంగా ఉండేది. ఏదో చిన్న అనారోగ్యం అనే అనుకుంది. శీతకాలం కూడా కావడంతో ఇలా ఉందనే అనుకున్నారు. కానీ చూస్తుండగానే ఆమె కాళ్లు చేతులు చల్లటి నీటిలో పెడితే ముదురు నీలం రంగులోకి మారిపోయాయి. దాంతో వైద్యుడిని సంప్రదించగా..ఆమె వేళ్లను గమనించి పీడియాట్రిక్ని కలవమని సూచించారు. అక్కడ రక్త పరీక్షలు చేయగా ఆమెకు అరుదైన ‘స్క్లెరోడెర్మా’ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్క్లెరోడెర్మా అనేది ఒక వ్యాధి. దీనిలో రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని సొంత కణజాలాలపై దాడి చేస్తుంది. దీనివల్ల చర్మం గట్టిపడటం అంతర్గత అవయవాలు దెబ్బతినడం జరుగుతుంది. కొంతమంది రోగులలో ఇది ఊపిరితిత్తులు, గుండె, జీర్ణవ్యవస్థ రక్తనాళాలను కూడా ప్రభావితం చేస్తుందట. 13 ఏళ్ల వయసులో ఆమెకు ఆ వ్యాధి ఏంటో తెలియలేదు. అలాగే వైద్యులకు కూడా దీని గురించి పెద్దగా తెలియదు. తన రోజులన్నీ ఆస్పత్రి సందర్శనలతో గడిచిపోయాయి. అప్పుడే తెలిసింది..హీనా ఆ వ్యాధితో జీవితాంత గడపక తప్పదని. దీనికి తోడు నుదిటిపై తెల్లటి మచ్చలు నెమ్మదిగా పెద్దదవ్వడం మొదలయ్యాయి. అలాగే స్కూల్కి వెళ్తుంటే ఆయాసం, ఊపిరాడనట్లు అనిపించేది. దాంతో కిటికీ ఉన్న బెంచ్ వద్దే కూర్చోనేది. ఆ తర్వాత చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాల్సి వచ్చింది. కానీ ఆ మచ్చలు తగ్గకపోగా..పరిమాణం పెరిగింది, మరింతగా వ్యాపించాయని చెప్పుకొచ్చింది. కాలేజ్ లైఫ్ అంటే ప్రతి అమ్మాయి ఆడుతూ తుళ్లుతూ గడపుతుంది. కానీ హీనా ఆస్పత్రి అపాయింట్మెంట్లు, ప్రపంచానికి కనపడకుండా తనలోని భాగాలను ఎలా దాచుకోవాలి అనేవాటి గురించే సతమతమవ్వాల్సి వచ్చేది. అయినా చదువుని వదల్లేదు. విజయవంతంగా ఇంటర్ పూర్తి చేసి, వైద్య ప్రవేశ పరీక్షకు సన్నద్ధమైంది. ఆ సమయంలోనే బ్రాంకియోలైటిస్ అని నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆ పరీక్ష పాసై వైద్య కోర్సులో జాయిన్ అయ్యింది. అయితే అక్కడ సీనియర్లు, మిగతా విద్యార్థులు హీనాని వింతగా చూసేవారు. కొందరు తనతో మాట్లాడవద్దని, దూరంగా ఉండమని హీనా ముఖం మీదే చెప్పేవారు. అన్ని కష్టాల మధ్య కూడా ఆమె తన ఆత్మవిశ్వాసంతో కొంతమంది స్నేహితులను సంపాదించుకుంది. అంతేగాదు అక్కడ ఆమె కాలేజీ రోజుల్లో దగ్గు ఎక్కువైంది. ముఖ్యంగా చలికాలంలో నడవడానికి, మెట్లు ఎక్కడానికి కష్టంగా ఉండేది. కనీసం పరీక్ష రాయడం కూడా కష్టమైంది. రోజువారీ పనులు కష్టమయ్యాయి. సొంతంగా తినలేకపోయేది, స్నానం చేయలేకపోయాది. అవన్నీ హీనా అమ్మే చేసేంది. పరీక్షలు రాస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగేవి హీనాకు. ఎందుకంటే..పుండ్ల కారణంగా వేళ్లలో భరించలేని నొప్పితో విలవిలలాడేది. వేసివికాలం ఆమె ప్రాణానికి హాయిగా ఉండేది. అంత కష్టంలోనూ తన అభిరుచులను వదులుకోలేదు. టేబుల్ టెన్నిస్ వంటి ఆటల్లో యూనివర్సిటీ స్థాయిలో బహుమతి గెలుచుకుంది కూడా. ఇంతలా శారీరకంగా, మానసికంగా పోరాడుతుంటే కాలేజ్ వార్షికోత్సవంలో ఆమె తోటి విద్యార్థులు తనతో చెప్పకుండానే డ్యాన్స్ పోటీ నుంచి తన పేరుని తొలగించేశారని నాటి సంఘటనను గుర్తు చేసుకుంది. అలా వైద్య కోర్సుని పూర్తి చేసి ఇంటర్న్షిప్ ప్రారంభించింది. 12 నెలల ఇంటర్న్షిప్ సమయంలో,క్లినకల్ నైపుణ్యాలను అలవోకగా నేర్చుకుంది. అయితే ఆ క్లినక్ పనులు నేర్చుకోవడానికి చాలా శ్రమ అలసట, ఆయాసంతో ఇబ్బంది పడ్డానంటూ నాటి పరిస్థితిని వివరించింది. హీనా అనుకున్నట్లుగానే ఆమె కల నెరవేరే క్షణం రానే వచ్చింది. కాలేజీ స్నాతకోత్సవంలో డాక్టర్గా పట్టా అందుకుంది సగర్వంగా. అలా హీనా తన వ్యాధి ముదిరి ఇబ్బంది పెడుతున్నా..అలు పెరగని పోరాటం చేసి డాక్టర్ అయ్యింది. తన శక్తిని హరించే వేసే వ్యాధితో పోరాడుతు డాక్టర్ అవ్వడం తన జీవితంలో అతి పెద్ద విజయం అని గర్వంగా చెబుతోందామె. ఆమెకు ఇప్పుడు 26 ఏళ్లు ఆక్సిజన్ థెరపీ ఆమె దైనందిన జీవితంలో ఒక భాగం. అయినా పోరాడుతూనే..నేర్చుకుంటూ ఉంటానని సగర్వంగా చెబుతోందామె. తాను ఎప్పుడూ..ఒక లక్ష్యంతో జీవిస్తూ ముందుకు వెళ్తానని ధీమాగా చెబుతుండటం విశేషం. (చదవండి: జేఈఈ ఫెయిల్యూర్..ఇవాళ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్) -
అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?
కొన్ని వెయిట్లాస్ స్టోరీలు స్ఫూర్తిదాయకంగా ఉన్నా..అందరికీ సరిపడవు. ఆయా వ్యక్తిగత సమస్యలు, వైద్య నిపుణుల పర్యవేక్షణ ఆధారంగా ప్రయత్నించాలే తప్ప..లేదంటే అసలుకే ప్రమాదం. ఇక్కడ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ వెయిట్లాస్ స్టోరీ అలాంటిదే. ఆయన గుండెపోటుకి గురై కోలుకున్న తర్వాతా దాదాపు 27 కేజీల బరువు తగ్గారు. ఈ అద్భుతమైన మార్పు అందరికీ స్ఫూర్తినిచ్చినప్పటికీ..ఆయన ఫాలో అయిన డైట్ మంచిదేనా అనే సందేహాలు వెల్లువెత్తాయి. మరి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. ఒక్కోసారి ఆరోగ్య సమస్యల రీత్యా క్రాష్డైట్లు ఫాలో అవ్వొచ్చా అంటే..అనురాగ్ కశ్యప్ గుండెపోటు తర్వాత చాలా తక్కువ టైంలోనే అనూహ్యంగా బరువు తగ్గారు. అది కూడా ఇంత వేగంగా అందులోనూ గుండె సంబంధిత సమస్య నుంచి కోలుకున్నాక..ఇది సరైనదేనా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. అయితే వైద్యులు అది ఆయన ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక డైట్ అని అంటున్నారు. అలాంటి క్రాష్ డైట్లు అందరికీ సరిపడవని హెచ్చరిస్తున్నారు. ఆయనకి ఉన్న రుగ్మతల దృష్ట్యా నిపుణుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలతో అనుసరించిని డైట్ అని చెప్పారు. ఇలా గుండెపోటు వచ్చిన వాళ్లందరికి ఇలాంటి క్రాష్ డైట్లు సరిపడవని హెచ్చరించారు. పైగా అది మేలు కంటే కీడే చేసే అవకాశం ఎక్కువ ఉందన్నారు. అలాగే ఇక్కడ ప్రతి రోగి కోలుకోవడం అనేది అప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మందులు, పోషకాహార స్థితి, మొత్తం గుండె పనితీరు వంటి అంశాల ఆధారపడి ఉంటుందన్నారు. ఇక్కడ కశ్యప్కు ఆస్తమా చరిత్ర, స్టెరాయిడ్ల వాడకం ఉంటం వల్ల వైద్య బృందం ఆయనకు లిక్విడ్ క్రాష్ డైట్ని సూచించిందని చెప్పారు. గుండెపోటు తర్వాత క్రాష్డైట్ ఎందుకు మంచిదికాదంటే..గుండెపోటు తర్వాత, గుండె కండరం ఇంకా కోలుకుంటూ ఉంటుంది. ఇక్కడ క్రాష్ డైట్లో కేలరీలను తీవ్రంగా పరిమితం చేస్తారు. ఫలితంగా శరీరంపై అదనపు ఒత్తిడిని తగ్గించి, సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన కేలరీల పరిమితి కండరాల క్షీణత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, అలసట, తలతిరగడం వంటి సమస్యలు కోలుకోవడంలో ఆలస్యానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని అంటుఉన్నారు.గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఎలా బరువు తగ్గాలంటే..గుండెపోటు తర్వాత వేగంగా బరువు తగ్గడానికి నిశితమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న చాలా మంది రోగులకు వారానికి సుమారు 0.5 నుంచి 1 కిలోల చొప్పున క్రమంగా బరువు తగ్గడం సురక్షితమని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని కాపాడే నిలకడైన ఆహారపు అలవాట్లతో బరువు తగ్గడం మంచిదంటున్నారు. గుండెకు మేలు చేసే ఆహారంపీచుపదార్థం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలుచేపలు, పప్పుధాన్యాలు, స్కిన్లెస్ కోడి మాంసం వంటి కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులురక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి తక్కువ ఉప్పు ఉన్న భోజనంఅలాగే ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సలహా ఇస్తే తప్ప, తీవ్రమైన ఉపవాసాలు, డిటాక్స్ ప్రణాళికలు, జీరో-కార్బ్ డైట్లను సాధారణంగా నివారించాలి.ఈ లక్షణాలు కనిపిస్తే..అకస్మాత్తుగా నీరసించడంగుండె దడనిరంతర నిర్జలీకరణంతల తిరగడం లేదా స్పృహ కోల్పోవడంమానసిక గందరగోళం లేదా అయోమయంఈ లక్షణాలను మనం అనుసరిస్తున్న ఆహార నియమం శరీరంపై అధిక ఒత్తిడిని కలిగిస్తోందనేందుకు సూచనగా గుర్తెరగాలి.అందువల్ల గుండెపోటు నుంచి కోలుకుంటున్న ఎవరైనా క్రాష్ డైట్లకు దూరంగా ఉండాలని, బదులుగా సమతుల్య పోషణ, నిలకడ అనుసరించి చక్కటి జీవనశైలిని పాటించాలని చెబుతున్నారు నిపుణులు. సాధ్యమైనంత వరకు నిలకడగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఇక్కడ గుండెను కాపాడుకోవడం అంటే త్వరగా బరువు తగ్గడం కాదు, సురక్షితంగా బరువు తగ్గడం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: ఐఐటీ డ్రాపౌట్ అయినా..మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఉద్యోగం!) -
మధుమేహం మందులకు ప్రత్యామ్నాయంగా కాకరకాయను వాడొచ్చా..!?
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ దీర్ఘకాలిక వ్యాధి డయాబెటిస్ బారిన పడుతుండటం బాధకరం. ముఖ్యంగా సరైన ఆహరపు అలవాట్లు, జీవనశైలి లేమి కారణంగానే అధిక సంఖ్యలో ఈ వ్యాధి బారినపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇదంతా ఎందుకంటే చాలామంది మధుమేహానికి కారకరకాయ విరుగడని చాలామంది ఆయా మందులు తీసుకోవడం మానేస్తుంటారు. దీనిలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉందని బలంగా విశ్వసిస్తారు చాలామంది. ఇదంత నిజమేనా అంటే..కాదనే చెబుతున్నారు ఏఐసి-ఎస్ఆర్ఎస్-ఐసిఎఆర్-ఎన్డిఆర్ఐ ఫౌండేషన్ డైరెక్టర్ ఆదర్శ గౌడ. మరి వాస్తవం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామారక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచగల సామర్థ్యం కాకరకాయకు ఉందని, ఇది గ్లూకోజ్ని ప్రాసెస్ చేసే విధానం అత్యంత విభిన్నంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు ఆదర్శగౌడ. కానీ కొన్ని అధ్యయన ఫలితాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. మరి ఏ కారణంగా కాకరకాయని షుగర్కు విరుగుడు అని ఎందుకు అంటున్నారంటే..ఇందులో ఏం ఉంటాయంటే..విటమిన్ సిపీచుపదార్థం (ఫైబర్)ఫోలేట్పొటాషియంయాంటీఆక్సిడెంట్లుఈ కాకరకాయలోని సమ్మేళనాలు గ్లూకోజ్ జీవక్రియపై ప్రభావవంతంగా పనిచేయడమే ప్రధాన కారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కలిగే లాభాలు..ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను కాపాడటంలో సహాయపడుతుందియాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం అందిస్తుందిసంపూర్ణ పోషణకు తోడ్పడుతుందితక్కువ కేలరీలుసమతుల్య భోజనంలో సులభంగా చేర్చుకోవచ్చుఎలా తీసుకోవాలంటే..సమతుల్య భోజనంలో భాగంగా, కాకరకాయను గుడ్లతో కలిపి వేయించుకుని, సూప్లలో కలుపుకుని, లేదా ఉల్లిపాయలు, వెల్లుల్లితో తేలికగా వేయించుకుని ఆస్వాదించొచ్చు.అయితే కాకరకాయ శరీరంలో ఇన్సులిన్లాగా పనిచేయదని తేల్చి చెబుతున్నారు నిపుణులు. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ మధుమేహ మందులకు ప్రత్యామ్నాయంగా వాడకూడదు.మధుమేహం ఉన్నా లేదా రక్తంలో చక్కెరను తగ్గించే మందులు వాడుతున్నా, కాకరకాయను రోజూ వాడే ముందు వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి..తీసుకోవాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: నెయిల్ ఆర్టిస్ట్గా నెలకు రూ. 10 లక్షలు..! కట్చేస్తే కొద్ది నెలల్లోనే..) -
జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు బరువు ..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..
బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ కఠినమైన ఆహార నియమాలు లేదా తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని కొందరు ఫిట్నెస్ ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. కేవలం నిలకడతో జీవనశైలి మార్పులను అనుసరిస్తే చాలంటున్నారు. తాజాగా మరో ఫిట్నెస్ నిపుణుడు అలా చేసే జస్ట్ ఆరు నెలల్లో 25 కిలోలు పైనే తగ్గి చూపించాడు. తన శరీరాకృతిని స్లిమ్గా మార్చుకోవడానికి సహాయపడిన ఆచరణాత్మక నియామాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అవేంటంటే..ఫిట్నెస్ నిపుణుడు జీషన్అలీ తాను సులభమైన జీవనశైలి మార్పులతోనే 25 కిలోలు పైనే తగ్గానని అన్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోవడమే అధికంగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుందని అన్నారు. ఫలితంగా జింక్ ఫుడ్పైకి మనసు మళ్లుతుందని అన్నారు. అందుకోసం తాను జస్ట్ మూడు నియమాలను పాటించానని అన్నారు.నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి..నీరు తాగండి..నిద్ర నీరు రహస్య ఆయుధాలని నొక్కి చెబుతున్నాడు. తాను ప్రతి రాత్రి 10:30 గంటలకల్లా పడుకునేవాడినని, రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగేవాడినని అన్నారు. ఇక్కడ ఎక్కువ నిద్ర, ఎక్కువ నీరు అంటే.. ఎక్కువ శక్తి, తక్కువ ఆకలి అని చెప్పారు. ప్రతిరోజు ఒక దినచర్యను పాటించడం..అంటే నిద్ర, జిమ్, వాకింగ్లకు సమాన ప్రాధాన్యతి ఇస్తూ చేయాలి. ముందుగా ప్లాన్ చేసుకుని అనుసరిస్తే..సవ్యంగా ఉంటుంది లేదంటే ఆ ప్లాన్ కాగితానికే పరిమితం అవుతుందని అంటున్నారు.తగినంత ప్రోటీన్ తీసుకోండి..అతని బరువు తగ్గే ప్రయాణంలో ఆకలిని నియంత్రించడంలో ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు. తాను తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ..ప్రోటీన్ మాత్రం రోజుకి 180–200 గ్రాములకు పరిమితం చేశానని అన్నారు. కండరాలను కాపాడుకోవడానికి, ఆకలి కోరికలు తగ్గించుకోవడానికి, అలాగే జీవక్రియను మెరుగ్గా ఉంచడానికి ఇది ఉపకరిస్తుందని అన్నారు. దీనివల్ల పొట్టకొవ్వు వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు. అలా 46 ఏళ్ల వయసులో 24 వారాల్లో తాను 101 కేజీల నుంచి 76 కేజీలకు తగ్గానని చెప్పారు. View this post on Instagram A post shared by Zee Ali - South Asian Health and Fitness Expert (@_zeeali1)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టైప్రైటర్'తో అద్భుతమైన చిత్రం..! ఆ క్రియేటివిటీకి మాటల్లేవ్ అంతే) -
హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..
దేహంలో ఎక్కడైనా వాపుగానీ నొప్పిగానీ వస్తే కాపడం పెట్టడం చాలా సాధారణం. ఇలా కాపడం పెట్టడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందడం ఎప్పటినుంచో అనుసరిస్తున్న ప్రక్రియ. అయితే ఏయే సందర్భాల్లో ఐస్ ప్యాక్ (ఐస్ కాపడం) పెట్టాలో... మరే సందర్భంలో వేడి కాపడం అవసరమవుతుందో చూద్దాం. ఐస్ప్యాక్ ఎప్పుడంటే... గాయం తగిలిన చోట ఐస్తో అద్దడం వల్ల ఉపశమనం కలగడం అన్నది తాజాగాయాల విషయంలోనే ఎక్కువ. దెబ్బతగిలినప్పుడు ఆ ప్రాంతం ఎర్రబడుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశం కాస్త వేడిగా అనిపిస్తుంటుంది. అప్పుడు అక్కడ ఐస్ పెట్టడం వల్ల అక్కడి (లోకల్) ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఇలా రక్తనాళాల సంకోచ–వ్యాకోచాలను ‘లూయీస్–హంటింగ్ చర్య’ అంటారు. దీనివల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచ బారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఐస్ పెట్టడం వల్ల కోల్డ్ రిసెప్టార్స్ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్కెఫలిన్స్ అనే ఉత్ప్రేరకాలు విడుదల అవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్ వల్ల నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్ కండక్షన్ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. ఐస్ప్యిక్ అన్నది కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. ఐస్ క్యూబ్స్ను నేరుగా అద్దడం కంటే... టవల్లోగాని, లేదా ఏదైనా కవర్లోగాని పెట్టి ఐస్ప్యిక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : ఆర్థరైటిస్ ఉన్నప్పుడు / వాపు, మంట వచ్చిన చోట (టెండర్పాయింట్స్లో) / తాజా గాయాలు (ఫ్రెష్ ఇంజరీస్) అయినప్పుడు. హాట్ ప్యాక్ (వేడికాపడం) ఎప్పుడంటే... సాధారణంగా దీర్ఘకాలికంగా వచ్చే నొప్పులూ, అలాగే నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు వేడికాపడం ద్వారా మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ వెచ్చదనం ప్రభావం చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ప్రభావం చూపుతుంది. వేడికాపడం వల్ల ఆ పరిసరాల్లో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. దాంతో అక్కడ జీవక్రియల వేగం (మెటబాలిక్ రేట్) కూడా పెరుగుతుంది. వేడికాపడంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల ఉపశమనం కలుగుతుంది. వేడికాపడం అన్నది కాస్త కాస్తగా కాపడం పెడుతూ 10–15 నిమిషాలు కొనసాగించాలి. వేడికాపడం బట్టను వేడి చేయడం ద్వారాగానీ, హాట్ వాటర్ బ్యాగ్తోగాని, ఎలక్ట్రిక్ హీట్ప్యాక్ పెట్టవచ్చు. ఎప్పుడెప్పుడు మంచిదంటే... : నడుమునొప్పి / ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి (మెకానికల్ బ్యాక్పెయిన్) / డిస్క్ప్లాప్స్ / సయాటికా. -
రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?
డాక్టర్ గారు, నా రెండేళ్ల బాబుకు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. చాలాసార్లు యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి వస్తోంది. అతని రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?– రమణి, నెల్లూరు. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. రెండు సంవత్సరాల వయసులో పిల్లలకు సంవత్సరానికి ఆరు నుంచి పదిసార్లు జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమే. ఇది ఇమ్యూనిటీ బలహీనంగా ఉందని అర్థం కాదు. ఈ వయసులోనే పిల్లల రోగనిరోధక వ్యవస్థ వివిధ సూక్ష్మక్రిములను ఎదుర్కొంటూ క్రమంగా బలపడుతుంది. అయితే తరచుగా యాంటీబయాటిక్స్ అవసరం అవుతున్నాయనిపిస్తే, పిల్లల వైద్యుడిని సంప్రదించి నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమా లేదా అని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే చాలా జలుబులు, వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ ఉపయోగం ఉండదు. అందుకే, వారి ఇమ్యూనిటీ పెంచే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి 7 బంగారు సూత్రాలు ఉన్నాయి.1. రంగురంగుల ఆహారంప్రతి రోజు పిల్లల ప్లేట్లో వివిధ రంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా చూడండి. పిల్లల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సమతుల్య ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బొప్పాయి, జామ, నారింజ, క్యారట్, టొమాటో, పాలకూర వంటి పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చాలి. ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందించి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.2. ప్రొటీన్ తప్పనిసరిరోగనిరోధక కణాలు, యాంటీబాడీలు తయారవ్వడానికి ప్రొటీన్ కీలకం. గుడ్లు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, చికెన్ లేదా చేపలు వంటి ప్రోటీన్ పదార్థాలు తీసుకోవడం అవసరం.3. తగినంత నిద్రనిద్రలోనే శరీరం తనను తాను పునరుద్ధరించుకుని రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకుంటుంది. అందుకే, రెండేళ్ల పిల్లలకు రోజుకు 11 నుంచి 14 గంటల నిద్ర తప్పనిసరి.4. బయట ఆడుకోవడంప్రతిరోజూ కనీసం గంటసేపు బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. సూర్యరశ్మి ద్వారా విటమిన్–డి లభించడంతో పాటు శారీరక దారుఢ్యం, ఆరోగ్యకరమైన ఎదుగుదల, మెరుగైన రోగనిరోధక శక్తి లభిస్తుంది.5. అన్ని టీకాలు సమయానికి వేయించండిటీకాలు పిల్లల శరీరానికి వివిధ వ్యాధులను ఎదుర్కోవడం నేర్పించే రక్షణ కవచంలాంటివి. అన్ని టీకాలను సమయానికి వేయించడం కూడా చాలా అవసరం. దీంతో అనేక తీవ్రమైన అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.6. జంక్ ఫుడ్కు దూరంగా ఉంచండిచాక్లెట్లు, చిప్స్, కూల్డ్రింక్స్, ప్యాకెట్ ఫుడ్స్ వంటి జంక్ ఫుడ్ను పరిమితం చేయాలి. కడుపు నిండటం ఒకటి అయితే, శరీరానికి అవసరమైన పోషకాలు అందడం మరొకటి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తుంచుకోవాలి.7. చేతుల పరిశుభ్రత అలవాటు చేయండిఅనేక ఇన్ఫెక్షన్లు చేతుల ద్వారా వ్యాపిస్తాయి. అందుకే, చిన్నప్పటి నుంచే పరిశుభ్రతను నేర్పించాలి. భోజనం ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. అయితే సంవత్సరానికి పదిసార్లకుపైగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, తరచూ న్యూమోనియా బారిన పడటం, బరువు సరిగా పెరగకపోవడం, నోటిలో పదేపదే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం లేదా తరచూ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే ప్రత్యేక ఇమ్యూనిటీ పరీక్షలు చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇమ్యూనిటీని ఒక్కసారిగా పెంచే మంత్రం లాంటి సిరప్ లేదా టానిక్ ఏదీ లేదు. సమతుల ఆహారం, తగిన నిద్ర, పూర్తి టీకాలు, శారీరక చలనం, పరిశుభ్రత వంటి ఆరోగ్యకరమైన అలవాట్లే పిల్లల రోగనిరోధక శక్తిని సహజంగా బలపరుస్తాయి. డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
మూత్రపిండం ప్రాణగండం
మన దేహంలో మూత్రపిండాలు (కిడ్నీలు) ప్రతి క్షణం మన రక్తాన్ని వడపోస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో అవి రక్తంలోని విషపదార్థాలనూ, వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో కిడ్నీలు అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తాయి. ఈ కండిషన్నే ‘అక్యూట్ కిడ్నీ ఇంజరీ’ (ఏకేఐ) అంటారు. ఇది కొంత ప్రమాదకరమైన పరిస్థితే. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో బాధితులకు తగిన చికిత్స అందక΄ోతే కొన్ని గంటలు లేదా రోజుల్లోనే ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ ఎప్పుడు ఏర్పడుతుంది, దీనికి కారణాలేమిటి, దీనికి నివారణ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.కొంతమందిలో యూరిన్ పాస్ చేస్తున్న సమయంలో మూత్రం తక్కువగా రావడం జరుగుతుండవచ్చు. అలా మూత్రం పరిమాణం తగ్గడం అంత మంచి సూచన కాదు. అలాగే దేహంలో ముఖం లేదా కాళ్లూ చేతుల్లో వాపు, తీవ్రమైన అలసట (ఫెటీగ్) వంటి లక్షణాలను చిన్న సమస్యగానే అనుకుని కొంత నిర్లక్ష్యం చేసే అవకాశమూ ఉంది. అయితే ఈ లక్షణాలన్నీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే తొలి సంకేతాలు కావచ్చు. సమయానికి చికిత్స తీసుకోక΄ోతే దేహంలో విషపదార్థాలు పేరుకు΄ోయి గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలక అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదమూ ఉంటుంది. చికిత్స ఇలా... అక్యూట్ కిడ్నీ ఇంజరీ (ఏకేఐ)కి కారణమైన సమస్యను వెంటనే గుర్తించి, దానికి తక్షణ చికిత్స అందించడమన్నది ఏకేఐ చికిత్సలో అత్యంత కీలకం. ఉదాహరణకు డీ–హైడ్రేషన్ వల్ల దేహంలో ద్రవాలు తగ్గితే వెంటనే సెలైన్ ఎక్కించడం ద్వారా శరీరంలో నీటిమోతాదు సమతుల్యంగా ఉండేలా చూడాలి. అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ముప్పు వాటిల్లినట్టు తెలిస్తే దాన్ని తగ్గించడం కోసం అవసరమైన చికిత్స ఇవ్వడం, కిడ్నీలకు హానికరమైన మందులను నిలిపివేయడం, అవసరమైతే తాత్కాలికంగా డయాలసిస్ చేయడం ద్వారా కిడ్నీలు తిరిగి కోలుకునేలా చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే... ఏకేఐలో అందుకు కారణాన్ని బట్టి తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. చివరగా... మూత్రం పరిమాణం అకస్మాత్తుగా తగ్గిపోవడం చిన్న విషయం కాదు. అది కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని దేహం ఇస్తున్న హెచ్చరిక కావచ్చు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ సమస్యను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే కిడ్నీలనూ... ఒక్కోసారి ప్రాణాలనూ కాపాడుకోవచ్చని గుర్తుంచుకోవాలి.డాక్టర్ అరుణ్కుమార్ దొనకొండ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ – కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్(చదవండి: హాట్ వర్సెస్ ఐస్ ప్యాక్: ఎలాంటప్పుడు మంచిదంటే..) -
అమ్మాయిలూ ఎల్లప్పుడూ ‘మంచి’గా వద్దు..! పరిశోధనలు సైతం..
చిన్నప్పటి నుంచి ఆడిపిల్లలకు సర్దుకుపోవడం, అందరికి చేదోడు వాదోడుగా, మంచిగా వ్యవహరించేలా పెంచుతారు. పైగా వాళ్ల భావోద్వేగాలను బయటకు వ్యక్తం చేయనివ్వరు పెద్దలు. దాని కారణంగానే మహిళలు ఆ వ్యాధి బారిన పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ కారణంగానే ఈ వ్యాధి అని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ మహిళా సంభాషణ వీడియో నెట్టిటంట తెగ వైరల్గా మారింది. ఇంతకీ ఇందులో వాస్తవమెంత? వైద్య నిపుణులు ఏమంటున్నారు?ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మహిళలకు ఆ కారణంగానే ఆటోఇమ్యూన్ వ్యాధి వస్తోందంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. అందుకు లక్షలాదిమంది మహిళలు మద్దతు తెలపడం విశేషం. ప్రతి ఒక్కరు అది వాస్తవమని, ఇప్పటికైన మనమంతా మేల్కొందాం అంటూ పిలుపునివ్వడం విశేషం. అంతేగాదు అమ్మాయిలూ సదా ‘మంచిగా’ ఉండొద్దు అది మన ఆరోగ్యానికే హానికరం అనే నినాదం మొదలైంది. ఇతరులను సంతోషపెట్టే అలవాటు మనల్ని మానసికంగా కుంగదీయడమే కాదు, చివరికీ శారీరక అనారోగ్యానికి గురిచేస్తుందని వాదన మొదలైంది నెట్టింట. ఇలా ఎందుకు అంటున్నారంటే..ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతోంది అధికంగా మహిళలే కావడంతో ఈ వాదన ఊపందుకుంది నెట్టింట. ఇటీవల ఒక ఇన్ఫ్లుయెన్సర్ హర్పిందర్ కౌర్ ఈ ట్రెండీ వాదన గురించి షేర్ చేస్తూ..'మంచి' అమ్మాయి అంటే అందరితో ఏకీభవించే, నిస్వార్థపరురాలైన సర్దుకుపోయే అమ్మాయిగా నాకు నేర్పించారు. ఇదే ఆ అనారోగ్య సమస్యకు కారణం అని అంటోందామె. ఆ కారణంగానే మహిళల్లో ఈ సమస్య ఎక్కువని. అందుకు ప్రధాన కారణాలు సాంస్కృతిక అలవాట్లు, దీర్ఘకాలిక ఒత్తిడి, వ్యక్తపరచని భావోద్వేగాలు, తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలేనని తేల్చి చెప్పింది. అంతేగాదు ఏళ్ల తరబడి చాలామంది తమ బావోద్వేగాలను అణిచివేసి, నిరంతర సంరక్షణ, ఇతరులను సంతోషపెట్టే తపనతో జీవిస్తారు. దాంతో శరీరం దీర్ఘకాలిక ఒత్తిడికి గురై చివరిక దీర్ఘాకాలిక అనారోగ్యానికి బలి అవుతోందంటూ అవేదన వ్యక్తం చేసింది. ఆఖరికి పరిశోధనలు కూడా ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది మహిళలేనని పేర్కొంది. View this post on Instagram A post shared by Harpinder Kaur Mann Yoga 🌕 (@harpindermannyoga) లూపస్, స్జోగ్రెన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు పురుషుల కంటే మహిళలల్లో ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో గణనీయంగా అధిక రేట్లలో ప్రభావం చూపుతోందని చెప్పింది. నిజానికి ఈ వైరల్ పోస్టులన్నీ మహిళలు తీవ్ర నిరాశనిస్ప్రహలకు లోనవ్వడంతోనే ఈ వ్యాధులు బాధపడుతున్నారనే విషయాన్ని వ్యక్తం చేశాయి. అలాగే ఇది ఒత్తిడి రుగ్మతలకు సంబంధించిందేనని శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా. అయితే దృఢంగా ఉన్నంత మాత్రాన ఈ సమస్యను తిప్పికొట్టగలమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఆటోఇమ్యూన్ వ్యాధికి అవే కారణమని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు కానీ మహిళలు ఏ విధంగా ఒత్తిడికి లోనవ్వుతున్నారనేది వెల్లడైందంటున్నారు నిఫుణులు. అతేగాదు అమ్మాయిలూ..వద్దు అని చెప్పడం నేర్చుకోవడం, కోపాన్ని వ్యక్తపరచగలగడం, మనకోసం మనం నిలబడటం వంటివి చేస్తే ఈ సమస్య బారిన పడమని ముక్తకంఠంతో నినదించారు. అంతేగాదు ఇలా వ్యవహరించాలంటే మనకు యోగా ఉపకరిస్తుందని, స్వతంత్రంగా, ధైర్యంగా బతకడం ఎలాగో నేర్పిస్తుందని అన్నారు. మానసిక నిపుణులు కూడా ఇవన్నీ సరైనా కారణాలే అయినా..శాస్త్రీయంగా నిర్థారించలేమని అన్నారు. View this post on Instagram A post shared by Tochi Angel (@tochithangel) (చదవండి: కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక! 94 ఏళ్ల బామ్మ విజ్ఞప్తి..) -
మామ్ వెయిట్లాస్ స్టోరీ..! జస్ట్ 11 నెలల్లో 32 కిలోలు..
ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత ఈజీ కాదు.ముఖ్యంగా సీ సెక్షన్ నుంచి కోలుకుంటున్న తల్లులకు మరింత కష్టం. నిలకడ, సులభమైన వ్యాయామాలు, శ్వాసవ్యాయమాలతో ఓ పిల్లల తల్లి సునాయాసం 32 కిలోలు పైనే తగ్గింది. అది కూడా జస్ట్ 11 నెలల్లోనే. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.కంటెంట్ క్రియేటర్ దీప్తి హర్షనా ఇద్దరు పిల్లల తల్లి. అదులోనూ సీసెక్షన్ చేయించుకుందామె. అలాంటప్పుడు పొట్ట భాగం దగ్గర నుంచి మిగతా శరీర భాగం అంతా షేప్ అవుట్గా ఉంటుంది. పైగా బరువు తగ్గడం కూడా అంత ఈజీ కాదు. అయితే ఆమెకు కూడా ఎలా తన అధిక బరువుని తగ్గించుకోవాలో తెలియలేదట. కానీ ప్రసవానంతరం బరువు తగ్గాలంటే తప్పనిసరిగా వ్యాయామాలు ముఖ్యం. అయితే ఎలా ప్రారంభించాలో తెలియలేదని, దాంతో యూట్యూబ్లో పొట్ట భాగం తగ్గాలంటే ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది అని సర్చ్ చేసి మరి ప్రారభించినట్లు తెలిపింది. తాను చేసిన వ్యాయమాలు గురించి కూడా వివరించింది.వర్కౌట్ 1: ప్రారంభకులకు అనువైన చేతి వ్యాయామాలుదీప్తి, తక్కువ పరికరాలు అవసరమయ్యే సులభమైన నిలబడి చేసే వ్యాయామాలతో ప్రారంభించాలని సిఫార్సు చేస్తోంది. ఎక్కడైనా నిలబడి, అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్ లేదా డంబెల్ ఏదైనా తీసుకుని, ప్రతి వైపు 15 సార్లు చొప్పున మూడు సెట్లు చేయాలని ఆమె సలహా ఇస్తోంది.వర్కౌట్ 2: డంబెల్ ఆర్మ్ రైజెస్5 కేజీల డంబెల్ను ఉపయోగించి, దీప్తి చేతులను బలోపేతం చేసే తేలికపాటి వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. ముందుగా 5 కేజీల డంబెల్ను పట్టుకుని, చేతులను నిటారుగా ఉంచి ప్రారంభించాలని చెప్పింది. దీన్ని ప్రతివైపు 15 సార్లు చొప్పున మూడు సార్లు చేయాలని చెప్పిందామె.వర్కౌట్ 3: స్క్వాట్స్స్క్వాట్స్ ఆమె దినచర్యలో మరొక ముఖ్యమైన వ్యాయామం. కొత్తగా చేసేవారైతే డంబెల్ లేకుండా వీటిని చేయవచ్చు. లేకపోతే, డంబెల్ పట్టుకుని సాధారణ స్క్వాట్స్ చేయాలని పేర్కొంది. ఇలా మొత్తం15 రిపిటీషన్లు చొప్పున మూడు సెట్లు చేయమని సూచిస్తుంది.వర్కౌట్ 4: స్టాండింగ్ కిక్స్అలాగే ఆమె తన దినచర్యలో స్టాండింగ్ కిక్ వ్యాయామాలను కూడా చేర్చుకుంటుంది. కేవలం తన్నడం లేదా తాకేలా చేసే వ్యాయామం. ఇక్కడ ఏది సౌకర్యంగా ఉంటే అది చేయవచ్చు. ఇక్కడ ప్రతి వ్యాయామాన్ని 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు చేయాలని ఆమె వివరించారు.వర్కౌట్ 5: తలపైన చేతులతో చప్పట్లుఇది కూడా ఒక సులభమైన కదలిక. చేతులను తల పైకి ఎత్తి, పదేపదే చప్పట్లు కొట్టాలి. ఈ వ్యాయామం చాలా సులభం. చేతులు పైకి, అదే పనిగా చప్పట్లు కొట్టాలి.వర్కౌట్ 6: వెనుకకు కాలును చాచడంతన చివరి వ్యాయామం కోసం, దీప్తి తన చేతులను తలపైన జోడించి, ఒక కాలును వెనుకకు చాచాలి. ఇక్కడ కాలును వీలైనంత వెనుకకు తీసుకువెళ్లి, ఆ తర్వాత ముందుకు తీసుకురండి. ప్రతి వైపు 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు పూర్తి చేయాలిన చెప్పిందామె.గమనిక: ప్రసవానంతర వ్యాయామ దినచర్యలను ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి, ముఖ్యంగా సి-సెక్షన్ తర్వాత, ఎందుకంటే కోలుకోవడానికి పట్టే సమయం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana) (చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!) -
అల్కా యాగ్నిక్కి అరుదైన వినికిడి సమస్య..ఎందువల్ల వస్తుందంటే..
రెండోవిడత ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దాదాపు 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకకు ప్రముఖ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్ కూడా హాజరయ్యారు. ఆమెకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్ను ప్రదానం చేశారు. ఆమెకు లభించిన ఈ గుర్తింపును చూసి యాగ్నిక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో ఆమె చాలా బలహీనంగా కనిపించారు. పైగా ఆమెను సిబ్బంది చాలా జాగ్రత్తగా తీసుకురావడం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆమె అప్పటి నుంచి ఇంకా కోలుకోలేదా అన్న అనుమానాల లేవనెత్తాయి అభిమానుల్లో. యాగ్నిక్ 2024లో తాను అరుదైన వినికిడి సమస్యతో బాధపడుతున్నట్లు ప్రకటించగానే..ఒక్కసారిగా వినికిడి ఆరోగ్యంపై చర్చలు మొదలవ్వడమే గాదు అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఇంతకీ యాగ్నిక్ ఫేస్ చేస్తున్న వినికిడి సమస్య ఏంటంటే..60 ఏళ్ల గాయని అల్కా యాగ్నిక్ అత్యంత అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్(SNHL)తో బాధపడుతోంది. ఆమె కారణంగానే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఈ సమస్యను ఏదో ఒక దశలో ఎదుర్కొంటున్నట్లు నివేదికల్లో వెల్లడైంది. అసలేంటి సమస్య అంటే..#WATCH | Delhi | Eminent playback singer Alka Yagnik conferred with Padma Bhushan by President Droupadi Murmu(Video source: Rashtrapati Bhavan) pic.twitter.com/ui2U9koEMy— ANI (@ANI) June 23, 2026సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ అంటే?లోపలి చెవి (కోక్లియా) లేదా మెదడుకు ధ్వని సంకేతాలను పంపే శ్రవణ నాడి మార్గాలకు నష్టం జరిగినప్పుడు సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (SNHL) సంభవిస్తుంది.చెవిలో గులిమి పేరుకుపోవడం లేదా ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే తాత్కాలిక వినికిడి సమస్యల వలె కాకుండా, SNHL తరచుగా శాశ్వతంగా ఉంటుంది. ఇది ఒక మనిషి వినగల, మాట్లాడగల సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇక గాయని యాగ్నిక్కిఒక ఆకస్మిక వైరల్ దాడి కారణంగా ఈ వినికిడి లోపం మొదలైందట. దీని కారణంగా ఆమె వినికిడి సామర్థ్యం ఊహించని విధంగా తీవ్రంగా క్షీణించింది.సెన్సోరిన్యూరల్ వినికిడి లోపం లక్షణాలుసెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ లక్షణాలు తీవ్రతను బట్టి మారవచ్చని అంటున్నారు వైద్యులు.ఆకస్మిక లేదా క్రమమైన వినికిడి లోపంసంభాషణలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందిచెవులలో రింగుమని శబ్దం (టిన్నిటస్)మసకగా వినిపించే శబ్దాలుశబ్దాలతో కూడిన వాతావరణంలో వినడంలో ఇబ్బందిఇతరులు అస్పష్టంగా మాట్లాడుతున్నారని అనిపించడంకొన్ని సందర్భాల్లో, వినికిడి లోపం అకస్మాత్తుగా సంభవించవచ్చు, తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు.SNHLకి కారణం..సెన్సోరిన్యూరల్ వినికిడి లోపానికి అనేక కారకాలు దోహదం చేస్తాయి, వాటిలో ఇవి ఉన్నాయి:వైరల్ ఇన్ఫెక్షన్లుకొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు వినికిడికి బాధ్యత వహించే లోపలి చెవి నిర్మాణాలను దెబ్బతీస్తాయి.పెద్ద శబ్దానికి గురికావడంపెద్ద సంగీతం, కచేరీలు, హెడ్ఫోన్లు లేదా వృత్తిపరమైన శబ్దానికి దీర్ఘకాలం పాటు గురికావడం వల్ల కోక్లియా లోపల ఉన్న సున్నితమైన హెయిర్ సెల్స్ శాశ్వతంగా దెబ్బతినవచ్చు.వయసు పైబడటంవయసు సంబంధిత వినికిడి లోపం అనేది సెన్సోరిన్యూరల్ వినికిడి లోపం (SNHL) అత్యంత సాధారణ రూపాలలో ఒకటి.కొన్ని రకాల మందులుఓటోటాక్సిక్గా పిలిచే కొన్ని రకాల మందులను దీర్ఘకాలం పాటు వాడినప్పుడు, అవి వినికిడిని దెబ్బతీయవచ్చు.వైద్య పరిస్థితులుఆటోఇమ్యూన్ రుగ్మతలు, తల గాయాలు, కణితులు, రక్తప్రసరణ సమస్యలు కూడా వినికిడిని ప్రభావితం చేయగలవు.వినికిడి ఆరోగ్యం ఎందుకు ముఖ్యం?వినికిడి లోపం కేవలం చెవులను మాత్రమే ప్రభావితం చేయదు. చికిత్స చేయని వినికిడి సమస్యలు మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, సంభాషణ, మొత్తం జీవన నాణ్యతపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వినికిడి లోపం ఉన్నవారు సామాజిక ఒంటరితనం, ఆందోళన, నిరాశ, పని ప్రదేశంలో ఉత్పాదకత తగ్గడం, సంభాషణలో ఇబ్బందులు,కొన్ని సందర్భాల్లో మతిమరుపు సంబంధిత సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ముంచికిత్స చేయవచ్చా?చికిత్స అనేది వినికిడి లోపం కారణం,తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.వినికిడి పరికరాలు (హెయిరింగ్ ఎయిడ్స్)కాక్లియర్ ఇంప్లాంట్లుసహాయక వినికిడి పరికరాలుశ్రవణ పునరావాసంఅంతర్లీన వైద్య పరిస్థితులకు చికిత్సఅకస్మాత్తుగా వినికిడి లోపం సంభవించిన సందర్భాలలో తక్షణ వైద్య మూల్యాంకనం చాలా కీలకం. ఎందుకంటే ముందస్తు జోక్యం కోలుకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని సులభమైన చర్యలను సూచించారు. అవేంటంటే..హెడ్ఫోన్ వాల్యూమ్ను 60 శాతం కంటే తక్కువగా ఉంచండిబిగ్గరగా ఉండే పరిసరాలలో ఎక్కువసేపు ఉండటాన్ని పరిమితం చేయండిఅవసరమైనప్పుడు చెవి రక్షణను ఉపయోగించండిఅకస్మాత్తుగా వినికిడిలో మార్పులు వస్తే వైద్యుడిని సంప్రదించండిక్రమం తప్పకుండా వినికిడి పరీక్షలను చేయించుకోవడం(చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!) -
తగ్గినట్టే తగ్గి..మళ్లీ యథావిధిగా! స్ట్రిక్ట్ డైటింగ్ చేసినా ఎందుకిలా అంటే..
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలామంది మొదట ధనాధన్ బరువు తగ్గిపోతారు. కానీ ఆ తర్వాత మళ్లీ యథావిధిగా బరువు పెరగకుండా కాపాడుకోవడమే అత్యంత ముఖ్యం. అయితే ఇది చాలా కష్టం. ఇక్కడొక నలభైఏళ్లు పైబడిన మహిళ ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. ఆరు నెలలపాటు క్రమశిక్షణతో కూడిన ఆహారం, రోజువారీ నడక తర్వాత దాదాపు పది కిలోల బరువుని విజయవంతంగా తగ్గించుకుంది. కానీ అదే దినచర్యను కొనసాగించినా..మరింత బరువు తగ్గకపోగా..మళ్లీ యథావిధిగా పెరుగుతున్నట్లు అనిపించిందామెకు. ఎందుకంటే ఆకలి కోరికలు పెరగడం, ఎక్కువ కేలరీలు ఖర్చు చేయలేకపోయినట్లు వాపోయింది. ఇది చాలామందికి ఎదురయ్యే పెనుసమస్యే. ఎందుకిలా అంటే..ప్రపంచవ్యాప్తంగా ఇలా డైటింగ్ చేస్తున్నా లక్షలాదిమందికి ఎదురైన అనుభవమే ఇది. మనం వెయిట్లాస్ అవ్వాలనుకున్నప్పుడు మానవశరీరం జీవశాస్త్రపరంగా సిద్దంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హార్మోనల్, న్యూరోలాజికల్, మెటబాలిక్ అనుసరణ కలయిక ద్వారా శరీరం కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అందువల్లే దీర్ఘాకాలిక బరువు నిర్వహణ సవాలుగా మారిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బరువు తగ్గినట్టే తగ్గి యథావిధిగా పెరగడాన్ని 'వెయిట్-లాస్ ప్లాటో'గా పిలుస్తారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే..శరీరం బరువు తగ్గే కొద్దీ శక్తిని ఆదా చేసి, మరింత బరువు తగ్గకుండా నిరోధించడం మొదలుపెడుతుందట. దీనిలో బ్రెయిన్ పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకుంటామో..అందుకు అనుగుణంగా మన బ్రెయిన్ కడపు నిండిన భావన, శక్తి సమతుల్యతకు సంబంధించిన సంకేతాలను శరీరానికి అందిస్తుందట. దాంతో మనం అమాంతం బరువు తగ్గుతూ వస్తూ ఉంటామని అన్నారు. అయితే..కాలక్రమేణ శరీరం ఒక ప్రాధాన్య బరువు పరిధిని ఏర్పరచుకుంటుందట. దీనిని 'సెట్ పాయింట్' అని అంటారని అన్నారు. శరీర బరువు ఈ పరిధి కంటే తక్కువకు పడిపోయినప్పుడూ..మెదడు ఆ మార్పును ఒక సంభావ్య ముప్పుగా భావించి, కోల్పోయిన బరువును తిరిగి పొందడానికి ఉద్దేశించిన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుందట. ఇక్కడ మెదడు తరుచుగా గణనీయమైన బరువు తగ్గడాన్ని ఆకలితో అలమటించే సంకేతంగా పరిగణిస్తుంది, తద్వారా కోల్పోయిన శక్తి నిల్వలను తిరిగి పొందడంలో సహాయపడటానికి రూపొందించిన యంత్రాంగాలను ప్రేరేపిస్తుంది. దాంతో కేలరీలను తక్కువగా ఖర్చు చేస్తాం. పైగా ఆకలి కోరికలు ఎక్కువవ్వడం మొదలవుతాయట. ఫలితంగా యథావిధాగా బరువు పెరుగుతామని అన్నారు. అలాగే బరువు తగ్గాక రోజువారీ శక్తి వ్యయం ఆటోమేటిగ్గా తగ్గుతుందట. దాంతో మొదట ఏ ఆహారం అయితే బరువు తగ్గడానికి సహాయపడిందో అదే మరింత బరువు తగ్గడానికి సరిపడకపోవచ్చని అన్నారు. అలాగే బరువు తగ్గాక హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు నిపుణులు. కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే కొవ్వు కణజాలం ద్వారా ఉత్పత్తి అయ్యే లెప్టిన్ అనే హార్మోన్ స్థాయిలు బరువు తగ్గిన తర్వాత తగ్గుతాయి. అదే సమయంలో, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆకలి ఎక్కువగా అనిపించి.. ఎక్కువ లాగించడం తోపాటు ఖర్చు చేసే కేలరీల సంఖ్య కూడా తగ్గిపోతుందట. ఈ జీవసంబంధమైన కలయికే ఎక్కువగా తినేలా చేయడానికి, కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి కారణమవుతుందని అన్నారు. అందువల్ల బరువు తగ్గడం అనేది మెదడు, హార్మోన్లు, జీవక్రియలు మధ్య ఉన్న సంక్లిష్టసంబంధంగా పరిగణించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ తోపాటు శరీరం సహజ నిరోధకతను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలు తమ ఫిట్నెస్ జర్నీని సహనంతో వాస్తవిక అంచనాలతో జాగురుకతతో చేపట్టాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: డెలివరి బాయ్ నుంచి ఏకంగా మెసేజింగ్ ప్లాట్ఫామ్కు గ్లోబల్ హెడ్ రేంజ్కు!) -
అతిగా పాలు తాగడం ఎముకలకు హానికరమా? వైద్యులు ఏమంటున్నారంటే..
పాలు ఆరోగ్యానికి మంచిదని, దానిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుందని విన్నాం. అయితే అతిగా తాగితే అవే పాలు హానికరమై ఎముకలు పెళుసుగా మారిపోయి విరిగిపోతాయనే అపోహ కూడా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువ అంటూ సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. కానీ ఇందులో ఏమంత వాస్తవం లేదని తేల్చి చెబుతున్నారు వైద్యులు. చాలామంది పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందని చెబుతుంటారు.. ఇది కూడా ఎంతమాత్రం నిజం కాదని అంటున్నారు ఆర్ధోపెడిక్ సర్జన్లు. అసలు ఈ అపోహ ఎందుకు వచ్చింది?, నిజంగానే పాలు అధికంగా తీసుకోకూడదా అంటే..?మాంసం, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగి దానిని తటస్థీకరించడానికి ఎముకల నుంచి కాల్షియం గ్రహించాల్సి వస్తుందని, తత్ఫలితంగా ఎముకల సంబంధిత సమస్యలు అధికమవుతాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజం కాదని పరిశోధనల్లో ఇలా జరుగుతుందని నిర్థారితం కాలేదని అన్నారు. ఆహారంలోని ప్రోటీన్ ముఖ్యం, సరైన మోతాదులో కాల్షియం తీసుకుంటే ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా ఎముకలు విరగకుండా కాపాడతాయని చెబుతున్నారు. పాలు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందనే వాదనకు శాస్త్రియ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. అలాగే ఆమ్లీకరణం సమస్య వస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. ఆస్టియోపొరోసిస్ అంటే..ఎముకల ఖనిజ సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడి, సులభంగా విరిగిపోయే పరిస్థితి. ఇది అనేక జన్యు, జీవ, జీవనశైలి కారకల వల్ల ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యం, హార్మోన్ల స్థితిలో మార్పులు, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, సరైన పోషకాహారం లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందని అన్నారు. అయితే పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్ (బలవర్ధకమైన) విటమిన్ డి ఉంటాయి. ఇవి శరీరంలో ఎముకల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కానీ అతిగా తీసుకుంటే అసమతుల్యత ఏర్పడి పోషకాహార లేమికి దారితీస్తుందే తప్ప..ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని పెంచదన్నారు. ఎప్పుడైతే పాలను ఎక్కువగా తీసుకుంటామో ఫలితంగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా పోతాయన్నారు. అలాగే అజీర్ణం, పాలు పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎముకల బలం కోసం బేషుగ్గా పాలు తీసుకోవచ్చని అన్నారు. కానీ మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని చెప్పారు. పైగా ఆస్టియోపొరోసిస్ను నివారిస్తుందన్నారు. చాలామటుకు సమతుల్యతకు పెద్దపీట వేస్తూ..అన్ని రకాల పోషకాలు అందేలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. (చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్కు బదులుగా చీర..! బ్రిటన్ పౌరురాలేనే ఐనా..) -
అలా మధుమేహాన్ని తగ్గించుకున్నా: హోంమంత్రి అమిత్షా
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. తాను మే 2020 నుంచి ఇప్పటివరకు తన జీవనశైలిలో భారీ మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. ఫలితంగా మధుమేహం సమస్య నుంచి బయటపడ్డానన్నారు. తాను గతంలో షుగర్ వ్యాధితో బాధపడ్డానని, అందుకోసం అధిక మొత్తంలో మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి విముక్తి పొందాలని అనుకున్నాని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించి..బరువు తగ్గడమే గాక మధుమేహం సమస్యను అధిగమించానన్నారు. అందుకోసం తాను ఏం చేశానో, అలాగే యువత ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటారో తదితరాల గురించి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు అమిత్షా. అవేంటంటే..అమిత్ షా ఆరోగ్య అనుభవంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో తన ఫిట్నెస్ జర్నీ గురించి గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. గతంలో తాను మధుమేహంతో బాధపడ్డానని, మే 2020లో ఎలాగైన ఈ సమస్యను అధిగమించాలనే కృతనిశ్చయంతో భారీ మార్పులు చేశానని అన్నారు. అందుకోసం తాను తగినంత నీళ్లు తాగడం, వేళకు భోజనం, క్రమం తప్పని వ్యాయామాలు చేసేలా కేర్ తీసుకున్నానన్నారు. అవి తనకెంతో మేలు చేస్తాయన్నారు. అన్నింటికంటే నిలకడగా ఆ అలవాట్లను భాగం చేసుకుంటే మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. పైగా తనకు మందులపై ఆధారపడటం నుంచి విముక్తి లభించిందని చెప్పారు. ఆ జీవనశైలి మార్పులను అవలంభించి ఇవాల్టికి ఐదేళ్లవుతుందని, పైగా 20 కిలోల బరువు కూడా తగ్గానన్నారు. ముఖ్యంగా తాను వాడే అల్లోపతి మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి బయటపడ్డానన్నారు. ఈ ప్రయోజనాలు శారీరక ఆరోగ్యానికి మించినవని అన్నారు. అంతేగాదు తన జీవనశైలిలో మార్పులు తన మానసిక చురుకుదనాన్ని, పని సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచాయన్నారు. ముఖ్యంగా పనిచేసే, ఆలోచించే విధానంలో మంచి మార్పుని తీసుకువచ్చిన చక్కటి నిర్ణయాలు తీసుకునేలా మెరుగుపరిచిందన్నారు. యువతకు సందేశం..తన అనుభవం ఫ్యాడ్ డైట్లు, తక్షణ పరిష్కారాల కంటే రోజువారి స్థిరమైన అలవాట్లు ఎంతటి గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయనేది చెబుతోందన్నారు. అందువల్ల యువత తమ ఆరోగ్యం కోసం వారే శ్రద్ధ తీసుకోవాలని కోరారు. శారీరక శ్రమకు, విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలని నొక్కి చెప్పారు. దాంతోపాటు రోజుకు రెండు గంటల వ్యాయాయమం, బ్రెయిన్కి ఆరుగంటల నిద్ర కేటాయించమని కోరారు. తగినంత నిద్ర శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మెరుగైన ఏకాగ్రత, మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి దోహదపడుతుందని చెప్పారు.#WATCH | Delhi: At the event organised by ILBS (Institute of Liver and Biliary Sciences) on World Liver Day, Union Home Minister Amit Shah says, "... I made a huge change in my life since May 2020 till today. The required amount of sleep, water and diet, and routine exercise has… pic.twitter.com/HxDZgv0YGh— ANI (@ANI) April 19, 2025 (చదవండి: weight loss: 72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..) -
72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..
వెయిట్లాస్ జర్నీలో ఒక్కోక్కరిది ఒక్కో విధానం. వారి శరీరానికి అనుగుణమైన విధంగా..భారంగా కాకుండా నిలకడగా చేసేలా హెల్దీగా అధిక బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది. తాజాగా ఆ కోవలోకి మరో ఫిట్నెస్ ట్రైనర్ చేరారు. ఆమె తాను చేస్తున్న తప్పిదాలను సరిచేసుకుంటూ బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారామె. అధిక బరువుని తగ్గించుకోవడానికి ఆంటకంగా ఉన్న అలవాట్లకు స్వస్తి పలికి మరీ ఏకంగా 23 కిలోలు తగ్గారు. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా అందుకోసం ఎలాంటి క్రాష్ డైట్లు, డిటాక్స్ టీలను తీసుకోలేదు. కేవలం తన వెయిట్లాస్ జర్నీలో చేస్తున్న తప్పులను సరిచేసుకుని మంచి ఫలితాలను అందుకున్నట్లు చెబుతోంది ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా. ఆమె ఏ అలవాట్లను వదులుకున్నారు..ఏ తప్పిదాలను పునరావృతం కానివ్వలేదంటే..అల్పాహారం మానేయడం..బరువు తగ్గాలనే ఉద్దేశంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసేదాన్ని దాంతో విపరీతమైన ఆకలితో ఉండేదాన్ని అన్నారు. ఫలితంగా జీవక్రియ మందగించేది. అదీగాక నేరుగా రాత్రిపటే తినేదాన్ని అన్నారు. దీని వల్ల తెలియకుండానే ఎక్కువ తినేయడం, బరువులో పెద్దగా మార్పులు కనిపించకపోవడం గమనించి ఆ విధానాన్ని పూర్తిగా మానేశానని చెప్పారు. ఆ తర్వాత నుంచి నిద్రలేచిని గంటలోపే తినడం మొదలు పెట్టానని అన్నారు. చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం..జ్యూస్లు, చక్కెరతో కూడిన టీ, కోల్డ్ కాఫీ వంటి ద్రవాలు ఆరోగ్యకరమైనవిగా అనిపించినా..అవి ఎంతమంది మంచివి కావని అన్నారు. అందుకు బదులుగా నీళ్లు, బ్లాక్ కాఫీ, చక్కెర లేని సాధారణ టీ తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్స్ మోతాదు మేరకే..మఖానా, డ్రై ఫ్రూట్స్, పీనట్ బటర్ వంటివి ఆరోగ్యకరమైనవే అయినా..మోతాదు మేరకు తీసుకుంటేనే మంచివని అన్నారు. ఎంత పోషకవంతమైనదైనా..కేలరీల లెక్క మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి అదనపు మోతాదులు త్వరగా కేలరీలను పెంచేస్తాయన్నారు. వెయిట్ ట్రైనింగ్ అస్సలు చేయకపోవడం..తాను బరువులు ఎత్తడం మొదలు పెట్టాకే శరీరంలో నిజమైన మార్పు రావడం కనిపించింది. ట్రెడ్మీల్ మీద గంటల తరబడి ఉండటం కంటే..ఇలాంటివి మంచివని తెలుసుకున్నానని అన్నారు. తక్కువ నిద్ర, ఎక్కువ ఒత్తిడిరాత్రిపూట ఆలస్యంగా నిత్రపోవడం, కార్డిసాల్ స్థాయిలు అధికంగా ఉండటం తదితరాల వల్ల తెలియకుండానే అధికంగా తినాలేన కోరక కలుగుతుందని అన్నారు. మంచి ఆరోగ్యానికి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరని అన్నారు. బయట తినడం మానేయడం..రెస్టారెంట్ భోజనం అప్పడప్పుడు పర్లేదనే భావన తప్పుడు ఆలోచన అని అంటోంది. ఇంటి భోజనమే మంచిదని, వెయిట్లాస్ కోసం ప్రయత్నించేవారికి ఇది అత్యంత ముఖ్యమని పేర్కొంది. చీట్ మీల్ వద్దు..పోనీలే సరదాగా పిజ్జా, కేక్ చిన్న ముక్కే కదా వంటివి వద్దు. ఏది చేసినా..పరిపూర్ణత కంటే..నిలకడగా చేయడం అనేది అత్యంత ప్రధానం అని గ్రహించండని నొక్కి చెబుతోంది. మంచి సమయం లేదా..అనుకూలమైన రోజు అంటూ గడపడం ఏ దినచర్య పాటించడానికి అయినా..క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. ఏ మార్పు చేసినా..సరైన సమయం కోసం కాకుడం వెంటనే ఆచరించడండని అన్నారు.ప్రతీరోజు ఆలోచనాత్మకంగా ఆరోగ్యదాయకమైనవి ఎంచుకుంటూ స్థిరంగా బరువు తగ్గడం కీలకం. అదే మిమ్మల్ని నాజూకుగా మారుస్తుందని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా నెట్టింట షేర్ చేశారు.గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. View this post on Instagram A post shared by Shikha Surana (@coachshikhasurana) (చదవండి: Weight Loss: 144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..) -
144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..
ఒక పారిశ్రామిక వేత్త అత్యంత అధిక బరువుతో నరకం చూశాడు. బరువు తగ్గేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. చివరికి ఒక రోజు తీవ్ర అనారోగ్యం పాలవ్వడమే మేల్కోలుపుగా మారి..అతడి వెయిట్లాస్ పరివర్తను నాంది పలకింది. అలా ఓపికతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు ప్రయత్నించి సఫలమవ్వడమే గాక తనలా ఇబ్బంది పడుతున్నవాళ్లు కూడా స్లిమ్గా మారాలని '3ఈ' ఫిట్నెస్ సెంటర్ని కూడా స్థాపించాడు. అంతేగాదు అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటూ తన వెయిట్లాస్ స్టోరీని షేర్ చేస్తూ..ఆరోగ్య స్పృహ కలిగిస్తున్నాడు.అతడే 'ADSMITH' వ్యవస్థాపకుడు నీరజ్ ఝూ. తన సంస్థ బాధ్యతలతో తలామునకలవ్వుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దాంతో అతడు ఏకంగా 144 కిలోల బరువుతో ఊబకాయంతో ఇబ్బందిపడేవాడు. అలాంటి వ్యక్తి కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 65 కిలోలు తగ్గి.. సుమారు 79 కిలోల బరువుకు చేరుకున్నాడు. అయితే దీని కోసం ఎలాంటి వెయిట్లాస్ మందులు, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్, జిమ్ వంటి వాటి జోలికి పోకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తన బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలిచాడు. అతడు తన పాత అలవాట్లకు స్వస్తి పలకాలనే దృఢమైన సంకల్పంతోనే స్లిమ్గా మారానని చెబుతున్నాడు. తాను వృత్తిపరంగా సక్సెస్ అందుకున్నా..అందుకు మూల్యం తన శరీరం చెల్లించాల్సి వచ్చిందంటాడు. తనకు ఆ అధిక బరువుతో అస్సలు నిద్ర పట్టేది కాదని, పైగా వొంట్లో అస్సలు శక్తి ఉండేది కాదని, చాలా ఆయాసంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే తాను కూడా అందరిలా బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసేవాడినని చెప్పుకొచ్చాడు. శరీరం బాగా అలిసిపోయినట్లుగా అనిపించి, మధ్యలో స్కిప్ చేసేవాడినని అన్నాడు. కానీ బయట వాళ్ల నుంచి వచ్చే ఛీత్కారాలకు భయపడి మళ్లీ బరువు తగ్గే ప్రయత్నాలు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఐసీయూ తెచ్చిన మేల్కొలుపు..ఒకరోజు తీవ్రం అనారోగ్య బారినపడి, ఆస్పత్రిలో చేరినప్పుడు నరకం చూశానని, నాటి సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు. చాలాసార్లు ఆస్పత్రిలో చేరాను కానీ ఆవేళ మాత్రం తన పరిస్థితి ఘెరంగా ఉందని, తీవ్రమైన ఎల్ఆర్టీఐ(దిగువ శ్వాసకోశ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) కారణంగా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. వైద్యులు బైపాప్ యంత్రాన్ని అమర్చారు. అది తనకు ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలనే కనువిప్పుని కలగజేసిందన్నారు. అంతేగాదు చాలా ఏళ్ల తర్వాత హాయిగా నిద్రపోయినట్లు పేర్కొన్నారు. అప్పుడే తెలిసింది ఏళ్లుగా తాను ఊపిరాడక సతమతమయ్యాననని తెలుసుకున్నానని అన్నాడు. అసలు బరువు తగ్గించుకుంటే తనకు ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని తెలిసి వచ్చిందని అంటాడు నీరజ్. అయితే అందరిలా జిమ్, ట్రైనర్ల జోలికిపోకుండా ..చాలామందిలా జిమ్లో జాయినవ్వడం, ఫిట్నెస్ ట్రైనర్లను పెట్టుకోవడం వంటివి చేయకుండా..ప్రాథమికంగా తాను చేయగలిగే వాటిపై దృష్టిపెట్టాడు. ముందు నిలకడగా వ్యాయామాలు చేసేలా చిన్నగా ప్రారంభించాడు. అలాగే ఆహారపరంగా కేలరీలోటు మంత్రని అనుసరించాడు. చిన్నగా వాకింగ్ మొదలుపెట్టి..నెమ్మదిగా అధిక దూరాలకు నడిచేలా కేర్ తీసుకున్నాడు. అలాగే పదే పదే వెయిట్ చెక్ చేయడం వంటివి కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఒత్తిడి మనల్ని ఆహారం తినేలా ప్రోత్సహిస్తుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేసినట్లు తెలిపాడు. మంచి లేదా చెడు జరిగినా కూడా..నిశబ్దంగా పరిస్థితిని అంగీకరిస్తూ..ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు. దాంతో దాదాపు 120 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చాడు నీరజ్. అయితే ఆ తర్వాత మాత్రం తన శరీరంలో అంగుళం కడా మార్పు రాకపోవడంతో షుగర్కి సంబంధించిన వాటన్నింటిని దూరం పెట్టి, అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకున్నట్లు తెలిపాడు. అలా గుడ్లు, చికెన్, చేపలు, పనీర్, గ్రీక్ యోగర్ట్, కూరగాయలు తీసుకోవడం వంటి మార్పులు చేసినట్లు తెలిపాడు. అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించి రెండు పుల్కాలు వంటివి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే బిస్కెట్లు, అధిక చక్కెర ఉండే పండ్లకు, మద్యంకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. అలా 18 నెలలు కష్టపడగా చివరకు 79 కేజీల బరువుకి చేరుకున్నట్లు తెలిపారు. తాను పూర్తిగా ఇదివరకటి నీరజ్లా రూపుదిద్దుకున్నట్లు చెప్పుకొచ్చారు ఆ మూడు సూత్రాల ఆధారంగా..అలా తనలా మరింత మంది చక్కగా స్లిమ్గా అవ్వాలనే ఉద్దేశ్యంతో 3E ఫిట్నెస్ను స్థాపించాడు. తన జీవితాన్ని మార్చిన మూడు సూత్రాలపై ఈ వెల్నెస్ ఫ్లాట్ఫామ్ని ప్రారంభించాడు. ఆ మూడు Eలు – చెప్పేది..సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసికంగా స్ట్రాంగ్గా ఉండటం. వైద్యులు సైతం ఆయన అనుసరించిన వెయిట్లాస్ జర్పీపై ప్రశంసల జల్లులు కురిపించారు. నెమ్మదిగా, స్థిరంగా బరువు తగ్గడం వల్ల శరీరం జీవక్రియ, హార్మోన్ల స్థాయి మెరుగ్గా ఉండటమే కాకుండా కండర ద్రవ్యరాశిని నిలుపుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అలాగే మళ్లీ తిరిగి బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. ఎప్పుడైనా బరువు తగ్గడం అనేది మానసిక భారంలా కాకుండా..చిన్నగా వాకింగ్, తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెడితే సునాయాసం బరువు తగ్గగలరని చెబుతున్నాడు నీరజ్. ఇక్కడ కేవలం వదులుకోకుండా నిలకడతో క్రమం తప్పకుండా చేస్తే.. తప్పక సత్ఫలితాలను అందుకోగలమని, అందుకు నిదర్శనం తానేనని చెబుతున్నాడు. -
యోగాసనం.. ఆరోగ్యశాసనం
యోగా.. ఈ పదం నేడు అంతర్జాతీయ తారకమంత్రంగా మారిపోయింది. కులమతాలకు అతీతంగా చక్కని ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా గొప్ప సాధనంగా మారింది. దేశంలో పుట్టి ఖండాతరాల్లో వ్యాపించి 2014లో అంతర్జాతీయ పేటెంట్ పొందింది భారత్. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2015 నుంచి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. చక్కటి ఆరోగ్య అలవాట్లు, సానుకూల దృక్పథంతోపాటు సామాజిక బాధ్యత కూడా మిళితమై ఉండడం మరో ప్రత్యేకత. అందుకే పేదవాడి దగ్గర్నుంచి ఉన్నత వర్గాలు, విద్యాంతులు, వైద్యులు కూడా యోగా సాధన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరులో సుమారు 40 వరకు యోగా కేంద్రాలు వారి స్థాయిలో శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని స్వల్ప ఫీజులతో ఉంటే మరికొన్ని ఏసీ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి కొంత మొత్తం తీసుకుంటున్నాయి. ఆన్లైన్ క్లాసులు కూడా చెబుతున్నారు. నా వయస్సు 52 సంవత్సరాలు. యోగా నన్ను నిత్యం నూతనంగా ఉంచుతుంది. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సులను సంధానించే గొప్ప భారతీయ జీవన విధానం. నా వృత్తికి ఏకాగ్రత చాలా అవసరం. అందుకే ప్రతి రోజూ యోగా, మెడిటేషన్ చేస్తాను. రోజూ కొద్దిసేపు యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, ఎంతో ప్రభావం చూపుతుంది. – డాక్టర్ చైతన్య, నేత్ర వైద్య నిపుణురాలు, గుంటూరు. యోగాలో వినూత్న ప్రకియ..సంప్రదాయ నృత్యాన్ని, ప్రాచీన యోగాను కలిపి నాట్య యోగామృతంలా మలిచి శిక్షణ ఇస్తున్నాను. మన సంప్రదాయాన్ని ఆరోగ్యం కోసం మిళితం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం జుంబా వంటి ఆధునిక నృత్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది అందరికీ నప్పదు. కొందరు ఇబ్బందులకు గురవడం చూస్తున్నాను. అదే యోగా అయితే అందరికీ ఉల్లాసం, ఉత్సాహంతోపాటు చక్కని ఫలితాలు సాధిస్తున్నాను. ఇది వయస్సును బట్టి కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. నా వద్ద వందల మంది శిక్షణ పొందుతున్నారు. మంచి ఫలితాలు సాధిస్తున్నాను. – విజయ గౌరి, నేషనల్ యోగా రిఫరీ, గుంటూరు పాఠశాల స్థాయి నుంచి నేర్పాలి..యోగా సాధనకు దేశం అంతర్జాతీయ వేదికైంది. అంటే దీని ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. ఈ విద్యను పాఠశాలల స్థాయి నుంచే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యానికి రాగిజావ, ఫోర్టిఫైడ్ బియ్యం, బలవర్ధకమైనా ఆహారం అందిస్తుంది. కనీసం యోగా సాధనకు గంటైనా కేటాయించాలని మనవి. నేటి యువత మొబైల్ ఫోన్లతో బిజీగా గడుపుతున్నారు. దీనివల్ల సోమరితనంతోపాటు మానసిక ఇబ్బందులు తప్పడం లేదు. యువత నిత్యం యోగా చేయడం ద్వారా చాలా రుగ్మతల నుంచి విముక్తి పొందవచ్చు. దీనికి అద్భుతమైన యోగాసనాలు ఉన్నాయి. – బి.మల్లికార్జునరావు, యోగా శిక్షకులు మీ జీవితం..మీ చేతుల్లోనే..చాలా సమస్యలు మన నిర్లక్ష్యంతోనే తెచ్చుకుంటాం. పిల్లలు, యువత మొబైల్స్కు ఎక్కువగా బానిసలై శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి అద్భుత పరిష్కారం యోగాలో ఉంది. అనుభవజ్జులైన గురువుల వద్ద తొలి దశలో శిక్షణ పొందాలి. ప్రస్తుతం సమాజంలో మధుమేహం, రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యత తరచుగా చూస్తున్నా. చాలా మంది మంచి మెడిసిన్ రాయండి అని అంటుంటారు. ముందుగా కొంత సేపు నడిచి, తర్వాత కాసేపు యోగా చేయాలి. మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే తప్పదు. జీవన శైలి మార్చుకుని యోగా సాధన చేస్తే నూటికి 90 శాతం రోగాల నుంచి బయటపడవచ్చు. – డాక్టర్ కె.సుబ్బారావు, ఎండో క్రైనాలజిస్ట్ యువతకు ఇబ్బందులు పోతాయి ప్రస్తుతం అమ్మాయిల్లో చాలా శారీరక ఇబ్బందులు ఉంటాయి. పీసీవోడీ వంటి కారణాలకు యోగాసనాల ద్వారా అద్భుత పరిష్కారం లభిస్తుంది. శరీరాన్ని నిత్యం ఉత్సాహంగా ఉంచడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూడు నెలల నుంచి గురువు వద్ద సాధన చేస్తున్నా. చిన్న సమస్యలకు మనం చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటాం. చాలా ఇబ్బందులకు యోగాలో పరిష్కారం ఉంటుంది. -
హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..
ఇవాళ ఉరుకుల పరుగుల కాలంలో యోగా మళ్లీ అందరి జీవితంలో భాగమయ్యేలా క్రేజ్ సంతరించుకుంటుంది. ఆధునికంగా జిమ్, ఏరోబిక్ వంటి ఎన్నో రకాల వర్కౌట్లు ఉన్నా ప్రముఖులు, సెలబ్రిటీల వరకు అంతా యోగాకే ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అదీగాక మరి కొద్దిరోజుల్లోనే(జూన్ 21)న యోగా దినోత్సవం పురస్కరించుకుని అమెరికన్లు అంతగా మెచ్చే హఠయోగా గురించి సవివరంగా తెలుసుకుందామా.!. గూగుల్స్ ట్రెండ్స్ డేటా ప్రకారం అమెరికన్లు ఎంత ఇష్టపడే సాధాన హఠ యోగా. ఇది శారీరక భంగిమలు, మైండ్ఫుల్నెస్తో చేసే శ్వాస పద్ధతులను మిళితం చేసే సాంప్రదాయ యోగా. ఇది శరీరం, మనస్సు మధ్య బలమైన బంధాన్ని సృష్టించడంపై దష్టిసారించడం వల్లే ప్రజలు అంతగా ఆకర్షితులవ్వుతారని చెబుతున్నారు ప్రముఖ యోగా నిపుణులు. హఠ యోగా అంటే..హఠ యోగా అత్యంత పురాతనమైన..చాలామంది ఆచరించే యోగా రూపాలలో ఒకటి. సాంప్రదాయకంగా, ఇది ఆసనాలు, శ్వాసవ్యాయామాలు, ధ్యానంతో మిళితమయ్యే యోగా ప్రక్రియ. నెమ్మదైన కదలికలతో ఆసనాల్లో ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది. ఈ పేరులోని 'హా', 'ఠ'లను సూర్యచంద్రులకు ప్రతీకలుగా చెబుతారు యోగా నిపుణులు. అందువల్ల ఇది శరీరం-మనస్సు మధ్య ఘర్షణను శాంతపరిచేలా సమతుల్యత తీసుకురావడాన్ని లక్ష్యంగా చేసుకుంటుందట. అమెరికన్లు ఇష్టపడటానికి రీజన్..ప్రారంభకులు సలుభంగా చేయగలిగేలా ఉండటం తోపాటు అధిక తీవ్రత గల ఫిట్నెస్ తరగతులకు భిన్నంగా నెమ్మదైన కదలిక, శ్వాసపై ఫోకస్ తదితరాల వల్ల ఈజీగా చేయగలమనే నమ్మకంతో ఇష్టపడుతున్నారనేది వాదన. కొందరు కఠినమైన వ్యాయమాల కంటే ఇది శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండేలా చేస్తుందని ప్రగాఢంగా విశ్వసించడం మరొక కారణం. అదీగాక ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, నిరాస నిస్ప్రుహలను ఎదుర్కొనడం అధికమవ్వడం వల్లే ఈ హఠ యోగాకి ఆదరణ పెరిగిందని అంటున్నారు యోగా నిపుణులు. కలిగే ఉపయోగాలు..ఏకాగ్రతను పెంచుతుంది. దీనిలోని శ్వాన వ్యాయామాలు భావోద్వేగ పరిస్థితులను హ్యాండిల్ చేసే శక్తిని అందించి ప్రశాంతతను చేకూరుస్తాయి. ఒత్తిడితోకూడని పనివేళలు, డిజిటల్ పరధ్యానంకు చెక్పెట్టే గొప్ప సాధనవర్తమానంలో ఉండగలిగే శక్తిని అందిస్తుంది. ఇది శరీరానికి వ్యాయమానికి మించింది కూడా. ధ్యానానిక పునాదిగా మారుతుంది. ఈ కారణాల వల్లే అమెరికన్లు హఠయోగకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు యోగా నిపుణులు. అక్కడ ఇది ఒక ఫిట్నెస్ ట్రెండ్కి మించిందని చెబుతుండటం విశేషం. యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది లింక్పై క్లిక్ చేయండి -
పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!
సాధారణంగా బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ పీసీఓఎస్ అంటే అంత సులభం కాదు బరువు తగ్గడం. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ జస్ట్ రెండు నెల్లలోనే ఏకంగా తొమ్మిది కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం తానే ఏం చేసింది? ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యిందో షేర్ చేసుకుంది. మరి అవేంటో చూద్దామా..!.పీసీఓఎస్తో బరువు తగ్గడం అనేది అసంభవం అనిపించే సవాలులా ఉంటుంది. పైగా అందరికీ ఈ సమస్య ఒకేలా ఉండదు. అలాగే అందరికీ సరిపోయే డైటింగ్, వ్యాయామాలు ఉండవు. అలాంటిది కంటెంట్ క్రియేటర్ తాన్య మాత్రం పీసీఎస్ని ఆరోగ్యవంతంగా నిర్వహించుకుంటూనే బరువు తగ్గిందామె. పైగా ఎలాంటి కఠినమైన ఆహార నియామాలు, తీవ్రమైన వ్యాయమాల జోలికి పోకుండా నిలకడగా జీవనశైలి మార్పులను పాటించానని అంటోంది. అంతేగాదు తాను ఎలా బరువు తగ్గిందో కూడా షేర్ చేసుకున్నారామె. ఆమె కేవలం రెండు నెలల్లో 75 కిలోల నుంచి 66 కిలోలు అంటే మొత్తం 9 కిలోలు తగ్గినట్లు పేర్కొంది. అయితే ఇలా పీసీఓఎస్తో బరువు తగ్గే ప్రయత్నంలో తాను ఆ ఐదు తప్పిదాలను చేయకుండా జాగ్రత్తపడ్డానని అంటోంది. అందువల్ల ఇంత సులభంగా బరువు తగ్గానని పంచుకుంది. చేయకూడని తప్పిదాలు..అల్పాహారం మానేయడంతాన్య ప్రకారం, అల్పాహారం మానేయడం తాను చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి. చాలా కాలం పాటు, తక్కువ తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతానని నమ్మేదాన్ని అంటోంది. అయితే, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంపై దృష్టి పెట్టడం ప్రారంభించాక పరిస్థితులు మారాయని వెల్లడించింది.అంతులేని కార్డియో చేయడంగంటల తరబడి కార్డియో చేయడమే బరువు తగ్గడానికి కీలకం అని చాలా మంది అనుకుంటారు. తాన్య దీనితో ఏకీభవించదు. అంతులేని కార్డియో సెషన్లతో తనను తాను బలవంతం చేసుకోవడం కంటే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, క్రమం తప్పకుండా నడవడం తనకు చాలా బాగా పనిచేశాయని ఆమె చెప్పింది.ఆహారానికి భయపడటంతాను వదిలేసిన మరో అలవాటు ఆహారాన్ని శత్రువులా చూడటం అని చెబుతోంది తాన్య. PCOS ఉన్నంత మాత్రాన పస్తులుండటం లేదా క్రాష్ డైట్లపై ఆధారపడటం కానేకాదని అంటోందామె. బదులుగా ప్రోటీన్తో కూడిన సరైన భోజనమే ఎంతో మేలు చేస్తుందని చెబుతోంది.పానీయాల ద్వారా కేలరీలు తీసుకోవడంచక్కెర పానీయాలలో దాగి ఉన్న కేలరీల గురించి కూడా తాన్య ప్రస్తావించింది. ఫ్యాన్సీ కాఫీ డ్రింక్స్ నుంచి ప్యాకేజ్డ్ జ్యూస్ల వరకు, ఈ పానీయాలు కడుపు నిండినట్లు అనిపించకుండానే అదనపు కేలరీలను చేర్చగలవు. ఇలాంటి పానీయాలు ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతాయని, PCOS ఉన్న చాలా మంది మహిళలు దీన్ని నియంత్రించడానికి ప్రయత్నించరని అన్నారామె.అనారోగ్యకరమైన అలవాట్లను తేలిగ్గా తీసుకోవడంకొందరు అనారోగ్యకరమైన అలవాట్లని తెలిసి కూడా చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. ఏదో అప్పడప్పుడూ అంటూ ఆ అలవాట్లకు దూరంగా ఉండరు. ఇక్కడ కేవలం తన రూపానికి సంబంధించి కాదు బరువు తగ్గడం, ఇది తన మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకి సంబంధించింది అని భావించి ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అంటోంది తాన్య. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ని తగ్గించుకునే యత్రం చేయాలి. ఇది కేవలం రూపం కోసం కాదు భవిష్యత్తులో ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పీసీఓఎస్ని మెరుగ్గా నిర్వహించుకోవడానికి అన్న దృక్పథంతో జాగుకరకతతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తే..సత్ఫలితాలను అందుకోగలమని అంటోంది. అందుకోసం తీవ్రమైన ఆహార నియమాలు లేదా కఠినమైన వ్యాయామాలు కంటే నిలకడగా పాటించే అలవాట్లు, సమతుల్య భోజనం, శక్తినిచ్చే శిక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి మంచి మార్పుని తీసుకొస్తాయని నమ్మకంగా చెబుతోంది కంటెంట్ క్రియేటర్ తాన్య. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Tanya (@tanyabackstage) (చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..) -
జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్!
భారత దిగ్గజ షూటర్, కోచ్ జస్పాల్ రాణా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన ప్రయాణంలో ఉండగానే.. ఆసుపత్రికి చేరుకునే ముందు కూడా ఛాతీ నొప్పి కొనసాగింది. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని స్థిరీకరించినప్పటికీ, గుండె పంపింగ్ సామార్థ్యం ఫెయిలై మృతి చెందారు. అంతేగాదు వైద్యులు ఆయన మరణం భారతదేశంలో మధ్య వయస్కులలో పెరుగుతున్న గుండె సంబంధిత మరణాలపై ఆందోళన రేకెత్తించింది. చాలామంది తేలిగ్గా కొట్టిపారేయడంతోనే ఆ టైంలో గోల్డెన్ అవర్ని పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యలను గోల్డెన్ అవర్లోనే గుర్తించి ఎలా ప్రాణాలు రక్షించుకోవాలో సవివరంగా తెలుసుకుందామా.ప్రముఖ భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా విషాద మరణం, గుండెపోటు కేవలం వృద్ధులకు, అనారోగ్యవంతులకు మాత్రమే వస్తుందనే అపోహపై చర్చలను లేవనెత్తింది. వైద్యుల ప్రకారం, రాణాకు తెలియకుండానే మూడు రోజుల పాటు గుండెపోటుతో బాధపడ్డట్టు సమాచారం. ఆ తర్వాత ఆయన వైద్య సహాయం తీసుకున్నారు. అక్కడికి రాణాకు అత్యవసర చికిత్స విజయవంతంగా అందించినప్పటికీ, ఆ ఆలస్యం చివరికి ప్రాణాంతకంగా మారింది. గుండెపోటు విషయంలో ప్రతి నిమిషం విలువైనదేనని ఆయన ఉదంతం గట్టిగా గుర్తుచేస్తుంది. సన్నగా, దృఢంగా, కండరాలతో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని హెచ్చిరిస్తున్నారు వైద్యులు. అంతేగాదు చాలామటుకు పలు కేసుల్లో 30 ఏళ్ల మగవారిలోనే ఈ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇందుకు ఆహారం, జీవనశైలి వంటివే కారణాలని చెబుతున్నారు వైద్యులు.ఇక్కడ జస్పాల్ రాణా కూడా విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడూ తీవ్రమైన ఛాతీ అసౌకర్యాన్ని అనుభవించాడు. కానీ ఆ లక్షణాలు ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ (జీర్ణకోశ సమస్య)కు సంబంధించినవిగా భావించాడు. పైగా ప్రయాణం కొనసాగించాడు. ఆ క్షణమే తక్షణ వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంది, కానీ ఆయన తీసుకోకపోవడంతో గుండె పనితీరు బలహీనమై వైఫల్యానికి దారితీసిందని చెబుతున్నారు వైద్యులు. నిజానికి రాణా మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా..ఆ తర్వాత ఆయన కార్డియాక్ రప్చర్ (గుండె పగిలిపోవడం) సంభవించిందని వైద్యులు తెలిపారు. ఇది తీవ్రమైన గుండెపోటు తర్వాత సంభవించే ఒక అరుదైన ప్రాణాంతక సమస్యగా పేర్కొన్నారు వైద్యులు.గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యం?గుండెపోటు ప్రారంభమైన తర్వాత మొదటి 60 నిమిషాలను హృద్రోగ నిపుణులు "గోల్డెన్ అవర్" అని పిలుస్తారు. ఈ సమయంలో, సత్వర చికిత్స గుండె కండరాల నష్టాన్ని గణనీయంగా తగ్గించి, మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనది. రోగులు మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చికిత్సలో జాప్యం కోలుకోలేని గుండె నష్టం, ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా కొన్ని గంటలకు మించి ఆలస్యం అయితే గుండెకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి రక్త సరఫరా నిలిచిపోతే, గుండె కండర కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. చికిత్సను ఎంత ఆలస్యం చేస్తే, గుండె వైఫల్యం, ప్రమాదకరమైన అరిథ్మియాలు, కార్డియోజెనిక్ షాక్, గుండె పగిలిపోవడం వంటి సమస్యల ప్రమాదం అంత తీవ్రంగా ఉంటుంది. అందుకే కీలకమైన ముందస్తు చికిత్స అందించడం వల్ల రోగిని అనేక సంభావ్య సమస్యల నుంచి కాపాడవచ్చు అని చెబుతున్నారు. కానీ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవ్..గుండెపోటును తరచుగా గుర్తించలేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, దాని లక్షణాలు ఎల్లప్పుడూ తీవ్రమైన ఛాతీ నొప్పిగా కనిపించవు. సాధారణ హెచ్చరిక సంకేతాలు:ఛాతీలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, బిగుతుగా ఉండటం లేదా నొప్పిచేయి, దవడ, మెడ, భుజం లేదా వీపుకు వ్యాపించే నొప్పిఆయాసంఅధికంగా చెమట పట్టడంవికారం లేదా వాంతులుతల తిరగడం లేదా అసాధారణమైన అలసటఎసిడిటీగా పొరబడే పై పొట్టలో అసౌకర్యందాదాపు మూడింట ఒక వంతు గుండెపోటులను మొదట్లో అజీర్ణం, కండరాల ఒత్తిడి లేదా అలసటగా కొట్టిపారేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.యువకుల్లోనే అధికం ఎందుకంటే..గతంలో కంటే ఇప్పుడు యువకులలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. నిశ్చల జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, పొగాకు వాడకం, సరిగా నిద్రపోకపోవడం, ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, అధిక స్క్రీన్ సమయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తదితరాలే కారణమని చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో చిన్నవయసులోనే ఈ సమస్య బారిన పడినట్లయితే అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే శారీరకంగా దృఢంగా ఉండటం, లేదా సాధారణ శరీర బరువుని కలిగి ఉండటం అనేది హృదయ సంబంధ వ్యాధుల దరిచేరవని కాదు అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.తీసుకోవాల్సిన జాగ్రత్తులు..క్రమం తప్పకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం పరీక్షలు చేయించుకోవడంధూమపానం, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడంపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడంఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పాటించడంఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం(చదవండి: ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి కేఫ్..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..) -
'30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం..
బరువు తగ్గడం కోసం జిమ్, ఇతర అధిక తీవ్రతర వర్కౌట్ల కంటే యోగా బెస్ట్ అని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందులో ఉండే కొన్ని రకాల ఆసనాలు కండరాలు, కీళ్లను బలోపేతం చేసి..అదనపు కొవ్వు తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధిగాంచింది సూర్యనమస్కారాలు. వెయిట్ ట్రైనింగ్ కోసం ప్రతి వారాంతంలో చేయగల ఒక వ్యాయామం 30-60-90-108 సూర్య నమస్కారాలు. బరువు తగ్గాలనుకునేవారందరికీ ఇది బెస్ట్ అని చెబుతోంది ప్రముఖ యోగనిపుణురాలు రూపాళ్ సిధ్. బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్తో కూడా ఇది చేయించానని అన్నారు. ఈ ముద్దుగుమ్మ కరీనా ఒకేసారి 50 సూర్య నమస్కారాలు, ఆ తర్వాత 108 రౌండ్లు చేసేదన్నారు. మరి అంతలా సూర్యనమస్కారాలు ఎలా చేయాలి..?, బరువు తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితరాల గురించి ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.యోగా నిపుణురాలు సిధ్ బరువు తగ్గాలనుకుంటే..సూర్యనమస్కారాలు ఎలా చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, వంటి వాటి గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ముందుగా చేయాల్సినవి కొన్ని..ప్రతిరోజూ 10 వేల అడుగులు వేయండివేగంగా కొవ్వు తగ్గించుకోవడానికి, జీవక్రియను పెంచేందుకు ప్రతిరోజూ 6 పూటలా చిన్న చిన్న భోజనాలు చేయండివెయిట్ ట్రైనింగ్తో కండరాలను పెంచుకోండి. బరువులు ఎత్తడం ప్రారంభించండి, కానీ క్రమంగా పెంచండిప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు త్రాగండిఉదయం పూట ముందుగా కొవ్వును కరిగించండిప్రతిరోజూ కనీసం 45 నిమిషాల యోగా/వర్కౌట్ చేయండిప్రతి భోజనం తర్వాత నడవండిచిన్న చిన్న భాగాలుగా ఆహారం తీసుకోండికనీసం 8 గంటలు నిద్రపోండి108 రౌండ్లు సూర్య నమస్కారాలు ఎలా చేయాలంటే..సూర్య నమస్కారం అనేది బలం, చలనశీలత, వశ్యత, సమతుల్యత, హృదయ సంబంధ ఓర్పుని మిళితం చేసే ఒక పూర్తి శరీరా కదలికల క్రమం. 108 రౌండ్లు పూర్తి చేయడం అనేది రోజువారీ ఫిట్నెస్ అవసరం కంటే ఎక్కువ. పైగా శారీరకంగా మానసికంగా సవాలుగా ఉంటుంది. ఇన్ని సార్లు చేయాలంటే..నెమ్మదిగా సెషన్లు పెంచడమే తెలివైన విధానం అని అంటున్నారామె. పరుగు లేదా బలవర్ధక శిక్షణ మాదిరిగానే, పునరావృతమయ్యే కదలికలకు శరీరం అలవాటు పడటానికి సమయం పడుతుంది. కొన్ని రోజుల పాటు సూర్య నమస్కారాలను 30 నుంచి 60కి, ఆపై 90కి, చివరకు 108కి పెంచాలి. దీని వల్ల కండరాల ఓర్పు, కీళ్లు తట్టుకునే శక్తి, హృదయ సంబంధ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటం తోపాటు తరుచుగా అయ్యే గాయాల ప్రమాదాలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు యోగా నిపుణులు. అయితే ఇక్కడ రౌండ్లు పెంచడం అనేది వ్యక్తిగత ఫిట్నెస్ స్థాయిలు, వయస్సు, కోలుకునే సామర్థ్యం, టెక్నిక్ నాణ్యతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.అయితే సరైన పద్ధతిలో 20–30 సూర్య నమస్కారాలు సునాయాసంగా చేసేవారికి, ప్రతి వారం మరిన్ని అదనపు రౌండ్లు జోడించొచ్చు కానీ..ప్రారంభకులు మాత్రం ఒకేసారి ఎక్కువ రౌండ్లు చేస్తే మాత్రం మణికట్టు నొప్పి, భుజం బెణకడం, నడుము నొప్పి లేదా అధిక అలసటకు దారితీయవచ్చు. ఒక సూర్యనమస్కారం భుజాలు, ఛాతీ, వీపు, కోర్, గ్లూట్స్, కాళ్లతో సహా అనేక కండర సముహాలను కదిలిస్తుంది. అలాంటిది వీటిని వందసార్లకు పైగా పునరావృతం చేస్తే..కీళ్లు, కండరాలపై గణనీయమైన భారం పడుతుందనేది గుర్తెరగాలి. కాబట్టి వీటన్నింటిన పరిగణలోని తీసుకుని యోగా నిపుణులు సమక్షంలో చేయడం ఉత్తమం. వైద్యపరంగా కూడా సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిలకడగా..చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామటుకు క్రమం తప్పకుండా చేస్తే 12–24 నాణ్యమైన రౌండ్లు మంచి ప్రయోజనాలు ఇస్తాయని నమ్మకంగా చెప్పారు.ఎవరైనా 108 చేయాలనుకుంటే..1–2 వారాలు: 24–30 రౌండ్లు3–4 వారాలు: 40–50 రౌండ్లు5–6 వారాలు: 60–75 రౌండ్లు7–8 వారాలు: 90+ రౌండ్లుఆ తర్వాత, రికవరీ టెక్నిక్ బలంగా ఉన్నప్పుడు 108 ప్రయత్నిస్తే మంచిదని అన్నారు. ఇక్కడ ఫిట్నెస్ సవాళ్లను పరీక్షలా కాకుండా, శిక్షణలా స్వీకరించాలని అన్నారు. View this post on Instagram A post shared by Rupal Sidhpura Faria | Yoga & Travel (@rupal_sidh)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే మందుకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..) -
జామ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
జామకాయలు అందరికీ సులభంగా దొరికే పండు. అలాగే ప్రతి ఇంటి పెరటిలో ఉండే మొక్క కూడా. అందుకే ఈ పండు అంటే మనకు చిన్న చూపు. జామకాయ అనగానే పైన వగరుగా ఉండే తొక్క, గింజలు పడేసి తింటుంటారు కొందరు. అంతేగాదు ఈ జామ గింజలు అరగవని, కడుపునొప్పి పట్టుకుంటుందని చెబుతుంటారు పెద్దలు. కానీ అదంతా అపోహేనని కొట్టిపారేస్తున్నారు ఐసిఎఆర్–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆదర్శ గౌడ. అంతేగాదు అరుగుదల తక్కువగా ఉండి, సున్నితమైన జీర్ణ సంబంధిత వ్యాధులుంటే వైద్యులను సంప్రదించి ఈ పండు తినడం మంచిదన్నారు. కానీ చాలామటుకు జామపండు ఆరోగ్యానికి మంచిదేనని, ముఖ్యంగా గింజలు ఎక్కువ ఉండే జామకాయలు మరింత ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అసలు ఈ జామగింజలతో కలిగే లాభాలేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!జామగింజలు తినదగినవి, వాటిల్లోని పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. పండుతో సహా వీటిని ఎప్పుడైతే తింటామో..మొతం పీచు పదార్థం శరీరానికి అందతుంది. ఫలితంగా జీవక్రియ క్రమబద్ధతకు, పేగు ఆరోగ్యానికి, కడుపు నిండిన భావన వంటి ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.కలిగే లాభాలు..జామ గింజల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, తక్కువ మొత్తంలో ఒమేగా-3, ఒమేగా -6 కొవ్వుల తోపాటు విటమిన్ ఈ, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గింజలను నలపడం లేదా నమలడం వల్ల వాటిలో దాగిఉన్న పోషకాలు నేరుగా విడుదల కావడానికి సహాయపడతాయట. తద్వారా జీర్ణక్రియ(అరుగుదల) సమయంలో అవి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల తోపాటు పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఇది మలానికి బలాన్ని చేకూర్చి జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలడానికి సహాయపడుతుందనట. అలాగే ఈ పండులో విటమిన్ సీ, లైకోపీన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయట. అందువల్ల జామ అందుబాటులో ఉన్న అత్యంత పోషక-సాంద్రత కలిగిన ఉష్ణమండల పండ్లలో ఒకటిగా పేర్కొటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గింజలు గట్టిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా పండులో ఉన్న ఈ భాగాన్ని నిరంభ్యంతరంగా తినవచ్చుని చెబుతున్నారు నిపుణులు. వీటిలో పోషక విలువలు తక్కువగానే ఉండవచ్చు, కానీ వాటిని పారేయడం వల్ల విలువైన పీచుపదార్థం, సహజంగా లభించే ఫైటోన్యూట్రియెంట్లను కోల్పోయినట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.అందుకే గింజలను ఉమ్మివేయడానికి బదులుగా, పండిన జామకాయను తినేటప్పుడు వాటిని బాగా నమలండి లేదా అదనపు పీచుపదార్థం, ప్రయోజనకరమైన కొవ్వుల కోసం పండు మొత్తాన్ని స్మూతీస్లో కలుపుకోని తినమని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..) -
90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..
బరువు తగ్గడం అనేది వివిధ రకాల డైట్లు, వర్కౌట్ల సమాహారం. అందుకు తగిన ఓపిక, నిలకడ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉండాలి. ముఖ్యంగా భారంగా కాకుండా ఇష్టంగా ఆరోగ్య కోసం అనే స్పృహతో సులభంగా బరువు తగ్గొచ్చని చాలామంది నిరూపించారు. ఆ కోవకు చెందిన వ్యక్తే బాలీవుడ్ హీర్ కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘చందు ఛాంపియన్’ కోసం ఏకంగా 18 కిలోలు ఎలాంటి మందులు వాడకుండా సహజ పద్ధతిలో తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం ఆర్యన్ ఎంతలా కష్టపడ్డాడో తెలిస్తే..స్మార్ట్గా మారాలంటే మన నుంచి కనీసం ఈ మాత్రం కష్టం ఉండక తప్పదని అంగీకరిస్తారు. మరి ఆర్యన్ ఏకంగా 90 నుంచి 72 కిలోలు బరువు తగ్గేందుకు ఏం చేశాడో సవివరంగా తెలుసుకుందామా..!.సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రలో కార్తిక్ ఒదిగిపోయారు. ఆయన ఆ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసినట్లు తన ఆకృతిని మార్చుకున్నారు. ఆర్యన్ నటనకు విమర్శకు ప్రశంసలందుకున్నప్పటికీ..ఆ సినిమాకి అయ్యిన వ్యయానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కారణాలు ఏవైనా..ఈ మూవీ ఓటమిని అంగీకరించిన ఓ క్రీడాకారుడి కథ. గాయలు, ఎదురుదెబ్బల నుంచి పతకాలు దక్కించుకున్ను శక్తిమంతమైన క్రీడాకారుడి స్టోరీ. మరి ఆ పాత్ర ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడ్ని చేసేలా ఉండాలంటే..ఆర్యన్ ఆ యోధుడి రూపంలోకి మారక తప్పదు. ఆ నేపథ్యంలోనే 90 కేజీల బరువు ఉండే ఆర్యన్ 72 కిలోలకు తగ్గేలా శిక్షణ తీసుకున్నారు. ఎలాంటి మందులు వినియోగించకుండా నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడం విశేషం. వెయిట్లాస్ కోసమే ఆర్యన్ బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం నుంచి ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వరకు ఎన్నో త్యాగాలు, ఎంతో శారీరక శ్రమ దాగి ఉంది. ఆయన ఫిట్నెస్ శిక్షణ అందించిన త్రిదేవ్ పాండే సైతం నిజమైన బాక్సర్ అనుసరించే శిక్షణా విధానాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నెలల తరబడి కఠినమైన క్రమశిక్షణ, నిరంత కృషి ఉందన్నారు. అయితే ఆయన మొదట్లో ఒక్క పుష్ అప్ కూడా చేయలేకపోయారని, కానీ క్రమంగా వీపుపై 50 నుంచి 60 కేజీల అదనపు బరువుతో వాటిని చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అతని స్కిప్పింగ్ కూడా మెరుగపడింది. ప్రాథమిక ఫుట్వర్క్తో ఇబ్బందుల నుంచి సుమారు 14 నుంచి 15 ఇతన ఆధునతాన జిమ్ వర్కౌట్లు చేసే స్థాయికి చేరుకున్నారు. అంతేగాదు అనుకున్నట్లుగానే 14 నెలల్లో 18 కేజీలు తగ్గి అద్భుతంగా కనిపించడమే కాదు, ఆ పాత్రకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలందుకున్నారు కార్తీక్ ఆర్యన్. చెయ్యాలి అని బలంగా అనుకుంటే..ఎన్ని కష్టాలకైనా ఓర్చి..అనుకున్నది సాధిస్తాం అనేందుకు హీరో కార్తీక్ ఆర్యన్నే ఉదాహరణ. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అనుసరించడం ఉత్తమం. (చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..) -
92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..
తొమ్మిది పదుల వయసులో వృద్ధాప్యాన్ని దిక్కరించేలా చురుగ్గా ఉందామె. సింపుల్గా చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తిలా ఉంది. ఆమె కండరాల శక్తి, యాక్టివిటీని చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు మించి తీవ్రమైన వ్యాయామాలు చేస్తంటుంది. పైగా 60 దాటినవారు చేయకూడని వ్యాయమాలే అయినా..ఈ బామ్మ మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తుంది. అంతేగాదు ఆమెను చూడగానే తొమ్మిది పదుల వయసు ఉన్న వ్యక్తిలా కనిపించదు..జస్ట్ 30 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఇంతలా యంగ్లుక్లో ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఆ బామ్మ పేరే ఎమ్మా మరియా మజెంగా. ఇటలీలో పాడువాలో నివశిస్తున్న రిటైర్డ్ సైన్స్ టీచరమ్మ. ఆమె ఎన్నో ప్రపంచిరికార్డులు కలిగి ఉన్న అగ్రశ్రేణి స్ప్రింటర్. పరుగు పందెంలో ఆమెకు సాటిలేరెవ్వెరూ అన్నట్లుగా ఎన్నో పతకాలు సొంతం చేసుకుందామె. వయసు పరంగా 90 ఏళ్లు పైబడిన వ్యక్తిలా ఉండదు..30 ఏళ్ల మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధాప్యాన్నే ధిక్కరించేలా హెల్దీగా ఉండే తీరు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపర్చింది. వాళ్లు సైతం ఆమె ఆరోగ్యంపై స్టడీ చేయగా..ఆమె శరీరంలోని కండరాలు..30 ఏళ్ల వ్యక్తుల మాదిరిగా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. తొంభై ఏళ్ల వయసులో కూడా ఈ రన్నింగ్ పోటీల్లో ఎలా పాల్గొనగలుగుతోందే అనే కుతూహలంతో ఆమె శరీరం తీరుపై పరిశోధన చేయగా..30 ఏళ్ల క్రీడాకారుల ఫిట్నెస్ని పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేగాదు ఆక్సిజన్ను శక్తిగా మార్చే మైటోకాండ్రియా, ఆమె కండరాలలోని 20 ఏళ్ల యువకుడిలో ఉన్నంత దృఢత్వంతో పనిచేస్తోందట. ఎమ్మా కథ వ్యాయామ దినచర్య వృద్ధాప్యాన్ని తిరగరాయగలదని చెబుతోంది. అయితే గంటల తరబడి మారథాన్ చేయదామె..కేవలం నిలకడతో తేలికపాటి వ్యాయామాలోతోనే ఈ ఫిట్నెస్ని సాధించిందామె. ఎమ్మా చేసే వ్యాయామం గంటలోపే పూర్తవ్వుతుందట. వార్మప్, తేలికపాటి జాగింగ్, లక్షిత స్ప్రింట్ల శ్రేణి, వాకింగ్, చిన్నపాటి తీవ్రత వ్యాయామాలు ఉంటాయంతే. అలాగే డైట్ పరంగా గుడ్లు, చేపలు, కూరగాయలపై దృష్టి పెడుతూ..సమతుల్యత పాటిస్తానంటోందామె.ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలుఎమ్మా జీవనశైలి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం దీర్ఘాయువు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్వకాలను అనుగుణంగా ఉంటుందట. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం డబ్ల్యూహెచ్ఓ వారమంతా 150 నుంచి 300 నిమిషాల తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను, లేదా 75 నుంచి 150 నిమిషాల అధిక-తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను సిఫార్సు చేస్తుంది. అలాగే పడిపోవడాన్ని నివారిస్తూ..ఎముకల ఆరోగ్యం కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు శక్తి శిక్షణకు ప్రాధాన్యతనిచ్చే వర్కౌట్లను సూచించింది. అలాగే వృద్ధులు తమ వ్యక్తిగత ఫిట్నెస్కు అనుగుణంగా తమ శ్రమ స్థాయిలను సర్దుబాటు చేసుకోవాలని WHO స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎమ్మా వంటి వారు అందుకు విభిన్నమని తొంభైలో కూడా యువకుల మాదిరి అధిక తీవ్రత వ్యాయమాలు చేయగలరని తెలుస్తోంది. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost) (చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..) -
కాబోయే అమ్మకు కడుపులో వికారం
గర్భధారణ తర్వాత చాలామంది మహిళల్లో వాంతులు అవుతుండటం చాలా సాధారణం. వాంతులు కావడం అనే లక్షణాన్ని బట్టి ఒక మహిళ గర్భవతి అయ్యిందనే సూచన మన చాలా సినిమాల్లో కనిపించడం సాధారణమే. గర్భవతులైన అందరిలోనూ ఇదే లక్షణం కనిపించకపోయినప్పటికీ కొందరిలో ఇలా వాంతులు కావడం చాలా సాధారణం. అలాగే గర్భధారణ జరిగిన చాలామంది మహిళల్లో వికారం (నాసియా) అనే లక్షణమూ కనిపిస్తుంది. గర్భవతుల్లో ఇలా ఎందుకు జరుగుతుందో, వికారంగా ఉండటం లేదా వాంతులు ఎక్కువగా అవుతున్న మహిళల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.గర్భవతుల్లో కనిపించే వాంతులు ఎక్కువగా కావడం, వికారంగా ఉండటాన్ని డాక్టర్లు సాధారణ పరిభాషలో ‘మార్నింగ్ సిక్నెస్’గా డాక్టర్లు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపించడానికి దేహంలో స్రవించే ఒక హార్మోన్ కారణమవుతుంది. మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్న మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... మార్నింగ్ సిక్నెస్ కారణంగా వాంతులు అవుతున్న గర్భవతులు రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. కొవ్వులు, మసాలాలూ ఎక్కువగా ఉండే హెవీ ఫుడ్ కాకుండా... ఆహారం చాలా తేలిగ్గా ఉండి, సులువుగా జీర్ణమయ్యేలాంటి బ్లాండ్ డైట్ తీసుకుంటూ ఉండటం మేలు. ద్రవాహారాలు... అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పండ్లు కూడా ఎక్కువగానే తింటూ ఉండటం మంచిది. పచ్చళ్లు, నూనెవస్తువులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వాంతులు అవుతున్నా దాన్ని విస్మరించి, ఏదో ఒకటి తింటూ ఉండండి. ఎందుకంటే... వాంతులవుతున్నందున అసలే తినకపోతే ఎసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరువాంతులు, రక్తపువాంతులు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటివారు అవసరమైనప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే కొన్ని రకాల యాంటాసిడ్ మందులు, వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన యాంటీఎమెటిక్ మందులను వాడవచ్చు. అయితే వీటిని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. చాలామందిలో మార్నింగ్ సిక్నెస్ చాలా సహజం. దాని గురించి ఆందోళన అక్కర్లేదు. అయితే అది చాలాకాలం కొనసాగుతుంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. వాంతుల కారణంగా బిడ్డకు పోషకాలు అందవా?కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు తమకు చాలా ఎక్కువగా వాంతులు అవుతున్నాయనీ, దాంతో కడుపులోని బిడ్డకు అందాల్సిన పోషకాలు అందవేమోనని ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వాంతులు అవుతున్నా బిడ్డకు అందాల్సిన పోషకాలు అందుతూనే ఉంటాయి.ఇటీవలి అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే...ఇటీవల ఓ తాజా అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... గర్భవతుల్లో వాంతులకు ప్రధానంగా గ్రోత్ డిఫరెన్సియేషన్ ఫ్యాక్టర్ –15 (జీడీఎఫ్–15) అనే అంశం కూడా ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ ఫ్యాక్టర్ వల్ల కొత్తగా గర్భధారణ జరిగిన మహిళల్లో... ఆకలి లేకపోవడం, ఏ ఆహారమూ రుచిగా అనిపించక΄ోవడం / రుచి తెలియక΄ోవడం, వికారం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయం తాజాగా వెల్లడయ్యింది. గర్భధారణ తర్వాత మహిళల్లో వాంతులు ఎందుకంటే...ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రాపిన్’ (హెచ్సీజీ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. మహిళ దేహానికి ఈ హర్మోన్ ఒక సందేశం పంపిస్తుంది. అదేమిటంటే... ‘ఈ దేహంలో గర్భధారణ ప్రక్రియ మొదలైంది. కాబట్టి నెలనెలా వచ్చే పీరియడ్స్ ప్రక్రియను ఆపేసి, ఇక గర్భధారణ ప్రక్రియ కోసం అవసరమైన ప్రొజెస్టెరాన్ను స్రవించమనీ, తద్వారా... అండం ఆశ్రయం తీసుకోవాల్సిన ‘ఎండోమెట్రియమ్–యుటెరైన్’ పొరలను మరింత మందంగా చేయడం, తద్వారా గర్భం నిలబడేలా చేయాలం’టూ ఈ హెచ్సీజీ హార్మోన్ ద్వారా దేహానికి సందేశం అందుతుంది. అయితే కొందరిలో ఈ ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాపిన్ (హెచ్సీజీ) చాలా తక్కువ మోతాదులో, మరికొందరిలో చాలా ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఆ హార్మోన్ కారణంగా గర్భవతుల్లో కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఓ మోస్తరుగా, మరికొంతమందిలో చాలా ఎక్కువగా వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. డాక్టర్ పి. స్వప్న, సీనియర్ కన్సల్టెంట్ అబ్స్టెట్రిక్స్ – గైనకాలజీ నిర్వహణ: యాసీన్(చదవండి: ఫైట్ అండ్ ప్లైట్లో గ్రాండ్ మాస్టర్) -
ఫైట్ అండ్ ప్లైట్లో గ్రాండ్ మాస్టర్
మన శరీరంలో కొన్ని అవయవాలు పరిమాణంలో చిన్నవైనా, వాటి పని మాత్రం అసాధారణంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో అడ్రినల్ గ్రంథులు ఒకటి. ప్రతి అడ్రినల్ గ్రంథి సుమారు 4–6 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఆకారంలో చిన్న త్రిభుజంలా కనిపించే ఈ గ్రంథులు ఒక్కో కిడ్నీపైన ఒక్కటి ఉంటాయి. జీవక్రియలకు అత్యవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తిమంతమైన గ్రంథులివి. ఈ అడ్రినల్ గ్రంథి చేసే అద్భుతమైన పనులేమిటో తెలుసుకుందాం.చాలా మందికి అడ్రినల్ గ్రంథుల గురించి పెద్దగా తెలియదు. కానీ ప్రతి రోజు మన శరీరంలో జరిగే అనేక ముఖ్యమైన ప్రక్రియలను ఇవే నియంత్రిస్తాయి.ఒత్తిడి సమయంలో అడ్రినల్ గ్రంథుల పాత్ర మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అడ్రినల్ గ్రంథులు వెంటనే స్పందిస్తాయి. ఈ సమయంలో అడ్రినలిన్ విడుదల అవుతుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం రక్తపోటు పెరగడం శరీరానికి తక్షణ శక్తి అందించడం మెదడు అప్రమత్తంగా మారడం జరుగుతుంది. ఇలా జరగడాన్ని వైద్యపరంగా ‘ఫైట్ లైదా ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. అంటే ప్రమాదాన్ని ఎదుర్కొని పోరాడటానికీ లేదా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది.కార్టిసోల్ అంటే ఏమిటి... ఎందుకు అవసరం?కార్టిసోల్ను చాలామంది ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. కానీ ఇది కేవలం ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ మాత్రమే కాదు. ఇది... రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ, రక్తపోటు నిర్వహణ ఇన్ఫెక్షన్లకు ప్రతిస్పందన శరీర జీవక్రియలు (మెటబాలిజం) శక్తి వినియోగం వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది.ఆల్డోస్టెరోన్ పని ఏమిటి?ఆల్డోస్టెరోన్ శరీరంలో సోడియం, పొటాషియంలతోపాటు నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. దీని ద్వారా రక్త΄ోటు నియంత్రణ జరుగుతుంది. కొంతమందిలో ఆల్డోస్టెరోన్ అధికంగా తయారవుతుంది. దీనిని ‘ప్రైమరీ హైపర్ ఆల్డోస్టెరోనిజం’ అంటారు. ఇది అధిక రక్త΄ోటుకు ఒక ముఖ్యమైన కారణం. కానీ... దీన్ని గుర్తించడం కష్టం. ముఖ్యంగా చిన్న వయసులోనే తీవ్రమైన బీపీ రావడం, మూడు నాలుగు మందులతో కూడా బీపీ నియంత్రణలోకి రాక΄ోవడం, రక్తంలో పొటాషియం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో ఈ వ్యాధిని అనుమానించాలి. సరైన పరీక్షలతో దీన్ని గుర్తించి చికిత్స చేస్తే బీపీని గణనీయంగా నియంత్రించవచ్చు.అడ్రినల్ గ్రంథి ఆరోగ్యానికి చేయాల్సిందేమిటి...?కంటినిండా నిద్ర క్రమబద్ధంగా చేసే వ్యాయామం ఒత్తిడి నియంత్రణ ధ్యానం సమతుల్య ఆహారం... ఇవి అవసరం. చివరిగా... అడ్రినల్ గ్రంథులు పరిమాణంలో చిన్నవైనా, జీవానికి అత్యంత కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తివంతమైన గ్రంథులు. శరీర సమతుల్యతను కాపాడడంలో ఇవి చేసే పని అసాధారణం. అందుకే శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించడం మంచిది.డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి,సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్, -
నేరేడు పండ్లు తింటున్నారా?
నేరేడు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఆయుర్వేద పరంగా అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు వైద్యులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే నేరేడు పండ్లు తీసుకోకూడదో తెలుసుకుందామా.!.నేరేడు పండ్లు ఇపుడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు, అందరికీ మేలు చేయకపోవచ్చు. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. అయితే, డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు వీటిని అధికంగా తీసుకుంటే, రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్ళు తిరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, కంగారు, గుండె వేగం పెరగడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పండ్లలో సహజంగానే ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రంలోని క్యాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు లేదా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు నేరేడు పండ్లను పరిమితంగానే తినాలి. నేరేడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదే. కానీ, ఒకేసారి వీటిని అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, లేదా కడుపు తిప్పడం వంటి సమస్యలు రావచ్చు. ∙ఈ పండ్లను అతిగా తింటే బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల గర్భిణులు నేరేడు పండ్లను తినే ముందు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. అలర్జీ హిస్టరీ ఉన్నవారు ఈ పండును మొదటిసారి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి నేరేడు పండ్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది. -
ఆ నటుడికి అరుదైన బ్రెస్ట్ కేన్సర్..!ఎందువల్ల వస్తుందంటే..
రొమ్ము కేన్సర్ అంటే మహిళలకే వస్తుందని అనుకుంటారు. కానీ పురుషులకు కూడా వస్తుందట. అయితే పురుషుల్లో ఇది అత్యంత అరుదు. మరి మగవాళ్లలో ఈ కేన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?, ఎందువల్ల వస్తుంది?, నివారణ చర్యలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్, టైలర్ మానేకు బ్రెస్ట్ కేన్సర్ ఉన్నట్లు వైద్యులు ఇటీవలే నిర్థారించారు. అందుకోసం కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కూడా తెలిపారు. 59 ఏళ్ల హీరో పురుషుల రొమ్ము కేన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుక్చొఆరు. అవును నాకు బ్రెస్ట్ కేన్సర్ ఉంది. ఇది చాలా అరుదైనది, పైగా ఇది 1% మంది మగవాళ్లే ఈ సమస్య బారిన పడతారట. నిజం చెప్పాలంటే మొదట బహిరంగంగా మాట్లాడాలనుకోలేదు. కానీ తర్వాత నాకు తెలిసిందేంటంటే..దీని గురించి మాట్లాడకపోవడం, దీనికోసం తెలుసుకోకపోవడం వల్లే పురుషులలో ఈ వ్యాధి చాలామటుకు లాస్ట్ స్టేజ్లో నిర్థారిస్తున్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే దీని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నా. డాక్టర్లంతా కొట్టిపారేసినా..నా భార్య ఆ గడ్డను తొలగించుకోమని ఒత్తిడి చేయడంతోనే ముందుగానే చికిత్స తీసుకుంటున్నా. ప్రతి 755 మంది పురుషులలో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము కేన్సర్ నిర్థారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీన్ని ముందుగానే గుర్తింస్తే..చికిత్స చేయడం సులభం. అందువల్ల ఇకనైనా మేల్కోవాలి, తక్షణమే స్పందించాలి అని పిలుపునిచ్చారు.పురుషుల రొమ్ము కేన్సర్ అంటేరొమ్ము కణజాలంలోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగి కణితిగా ఏర్పడినప్పుడు పురుషులలో రొమ్ము కేన్సర్ వస్తుంది. పురుషులకు రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది, అంటే అక్కడ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ ఇది మహిళలతో పోలిస్తే తక్కువ.కేన్సర్ లక్షణాలుప్రారంభ సంకేతాలను గుర్తించడం సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సకు సహాయపడుతుంది.కొన్ని సాధారణ లక్షణాలు:రొమ్ములో గడ్డ లేదా వాపురొమ్ము కణజాలం గట్టిపడటంరొమ్మును కప్పి ఉంచే చర్మంలో మార్పులు, ఎరుపు లేదా గుంటలు పడటం వంటివిచనుమొన నొప్పి లేదా సున్నితత్వంలోపలికి తిరిగిన చనుమొనచనుమొన నుండి స్రావం, కొన్నిసార్లు రక్తంతో కూడి ఉండవచ్చుచంక కింద శోషరస గ్రంథులు వాపునిరంతర పుండ్లు లేదా చనుమొనల చుట్టూ మార్పులుపురుషులు తమ ఛాతీ లేదా రొమ్ము ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ గడ్డ నొప్పిలేకుండా ఉన్నప్పటికీ, దానిని ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.పురుషులలో రొమ్ము కేన్సర్కు ప్రమాద కారకాలుఅనేక కారకాలు పురుషులలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వాటిలో ఇవి ఉన్నాయి:వయస్సు పెరగడం: చాలా కేసులు 60 ఏళ్లు పైబడిన పురుషులలో నిర్ధారణ అవుతాయి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది.కుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము క్యాన్సర్ ఉన్న పురుషులకు ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యు మార్పులు కూడా ఒక పాత్ర పోషిస్తాయి.జన్యు మార్పులు: కొన్ని జన్యువులలో, ముఖ్యంగా BRCA2 జన్యువులో మార్పులు, పురుషులలో రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.హార్మోన్ల అసమతుల్యత: ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటం రొమ్ము కేన్సర్ అభివృద్ధికి దోహదపడవచ్చు.స్థూలకాయం: శరీరంలో అధిక కొవ్వు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది, ఇది ప్రమాదాన్ని పెంచవచ్చు.కాలేయ వ్యాధి: సిర్రోసిస్ వంటి పరిస్థితులు హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి, కేన్సర్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి.రేడియేషన్ ప్రభావం: గతంలో ఛాతీ ప్రాంతానికి రేడియేషన్ చికిత్స చేయించుకోవడం వల్ల.. రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరగవచ్చు.నివారణరొమ్ము కేన్సర్ను పూర్తిగా నివారించడం ఎల్లప్పుడూ సాధ్యం కానప్పటికీ, కొన్ని జీవనశైలి ఎంపికలు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రమాదం.అధిక బరువు ఉండటం అనేది అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడతాయి.అధికంగా మద్యం సేవించడం వల్ల రొమ్ము కేన్సర్తో సహా అనేక కేన్సర్ల ప్రమాదం పెరగవచ్చు.క్రమం తప్పని శారీరక శ్రమ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న పురుషులు తమ ప్రమాదం గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులతో చర్చించాలి. కొన్ని సందర్భాల్లో, జన్యుపరమైన కౌన్సెలింగ్ సిఫార్సు చేయవచ్చు కూడా.క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు సత్వరమే సమస్యను గుర్తించడానికి సహాయపడతాయి. రొమ్ము మార్పుల గురించి అవగాహన పెంచుకోవాలి. పురుషులు తమ ఛాతీ ప్రాంతంలోని సాధారణ స్వరూపం, స్పర్శ గురించి తెలుసుకోవాలి. ఏవైనా గడ్డలు, వాపు లేదా చనుమొనలలో మార్పులను ఆలస్యం చేయకుండా వైద్యుడికి తెలియజేయడం వలన ముందుగానే ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Tyler Mane (@therealtylermane)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్) -
బ్రెయిన్ ట్యూమర్కి వైఫై, స్మార్ట్ఫోన్లే కారణమా?
గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో అంతా మొబైల్ ఫోన్లు, వైఫై రౌటర్లు, స్క్రీన్ టైం తదితరాలే అందుకు కారణమని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగావీటన్నింటికి ఒత్తిడి కూడా తోడవ్వుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే (World Brain Tumor Day) సందర్భంగా డిజిటల్ వినియోగం ఈ సమస్యకు ఎంత వరకు కారణం? శాస్త్రీయపరంగా ఇది ఎంత వరకు కరెక్ట్ వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.వై-ఫై, స్మార్ట్ఫోన్లు, ఒత్తిడి, లేదా అధిక స్క్రీన్ టైమ్ వంటివే బ్రెయిన్ ట్యూమర్కి ప్రధాన కారణమని చెప్పడానికి సరైన ఆధారాలే లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా డిజిటల్ వాడకం వల్ల రేడియేషన్ బారినపడతారనే దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. మొబైల్ ఫోన్లు మరియు వై-ఫై పరికరాల నుంచి లువడే రేడియోఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ కారణంగానే ఈ ఆందోళన వ్యక్తమైందది గానీ..ఎక్స్-రేలు లేదా అణు పదార్థాల నుంచి వెలువడే అయనీకరణ రేడియేషన్ లా కాకుండా RF రేడియేషన్ను తక్కువ-శక్తి గలదిగా, అయనీకరణం చెందనదిగా పరిగణిస్తారని అన్నారు. అందువల్లే కేన్సర్ పరిధకులు..మొబైల్ ఫోన్లు లేదా వై-ఫై సాధారణ వాడకం బ్రెయిన్ కేన్సర్కు కారణమని నిర్థారించలేమని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ వాడకం బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని ఎంత మేరకు కలిగించగలదో చేసిన అధ్యయనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయన్నారు. కొన్ని అధ్యయనాల్లో ఫోన్ని అతిగా వాడే వారిలో కొన్ని అరుదైన కణితులు పెరిగినట్లు తేలిందని..మరికొన్ని పరిశోధనల్లో సరైన ఫలితాలివ్వలేదని చెబుతున్నారు. దీనిపై మరింత దీర్ఘకాలిక పరిశోధన అవసరమని చెబుతున్నారు.అధిక స్క్రీన్ సమయం బ్రెయిన్ని దెబ్బతీస్తుందా?స్క్రీన్ సమయం బ్రెయిన్ ట్యూమర్కి కారణమని నేరుగా చెప్పలేకపోయినా.. అధికంగా వాడకం మాత్రం ఇతర మార్గాల్లో మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. ఒకవేళ స్క్రీన్ల ముందు ఎక్కువ గంటలు గడడితే మాత్రం..కంటి ఒత్తిడి, తలనొప్పులునిద్ర నాణ్యత తగ్గడంఒత్తిడి, ఆందోళన పెరగడంశారీరక శ్రమ తగ్గడంమానసిక అలసటకానీ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి, ముఖ్యంగా రాత్రి పొద్దుపోయాక పరికరాలను ఉపయోగించినప్పుడు, మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించి, నిద్ర చక్రాలను కూడా భంగపరచవచ్చు. అందుకే ఆరోగ్య నిపుణులు వినోదం కోసం చూసే స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోవాలని, క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదీఏమైనా..ఈ అధిక డిజిటల్ వినియోగం మానసిక శారీరక ఆరోగ్యంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఒత్తిడి కారణమా?కేన్సర్తో సహా అన్ని రోగాలకు ఒత్తిడే కారణమని చెబుతుంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, వాపును పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పటికీ..ఒత్తిడి మెదడు కణితులకు కారణమవుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవనే అంటున్నారు.అసలు కారణం ?చాలా సందర్భాలలో, మెదడు కణితులకు ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అనేక ప్రమాద కారకాలను గుర్తించారు. అవేంటంటే..జన్యుపరమైన పరిస్థితులు, వారసత్వంగా వచ్చే సిండ్రోమ్లుఅధిక మోతాదులో అయోనైజింగ్ రేడియేషన్కు గురికావడంవయస్సుకొన్ని రకాల కేన్సర్ల కుటుంబ చరిత్రఅరుదైన సందర్భాల్లో పర్యావరణ విషపదార్థాలుసాధ్యమైనంత వరకు మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ, క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య పోషణతో ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే రెగ్యులర్ చెకప్లతో ముందుగానేబ్రెయిన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి చేస్తే..ఈ సమస్య దరిచేరదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. -
లుక్స్, భాష పరంగా..అభద్రతా భావంతో ఉండేదాన్ని..!
కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ కేరళ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ఈ టైటిల్ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె అరుదైన రికార్డును సృష్టించారు. అయితే ఆమెను ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ గెలుపు ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా..అందుకు కజియా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారామె. మిస్ యూనివర్స్ ఇండియాకు సిద్ధమవుతున్న ఈ 19 ఏళ్ల యువతి..తన లుక్స్, సంభాషణ పరంగా అభద్రతా భావంతో ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఆత్మవిశ్వాసంగా ఉండలేకపోయాదాన్ని అని వాపోయారు. అయితే దీన్ని అధిగమించడం రాత్రికి రాత్రే జరిగిపోలేదన్నారు. ఇలా కాదు మొదట తాను కాన్ఫిడెంట్ని డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాని అన్నారామె. అందుకోసం తనపై తాను ఫోకస్ పెట్టడం ప్రారంభించానని అన్నారామె. అంటే నా సంభాషణ నైపుణ్యాలు, వ్యక్తిత్వం, రూపం ఇలా మొత్తం తనపై తాను ఎక్కువ దృష్టి పెట్టి మెరుగయ్యేలా చేసుకున్నానని అన్నారు. అయితే తనకు బాగా హెల్ప్ అయిన విషయం ఏంటంటే..సాధించే వరకు ఆపొద్దు అనే సూత్రంం. ఈ భూమ్మీద నేనే అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని అని తన బ్రెయిన్ని పూర్తిగా నమ్మించి వేదికలపైకి కాన్ఫిడెన్స్గా నడవగలిగానని అన్నారు. ఇక తనకు ఈ అందాల పోటీలపై ఆసక్తి మొదలైంది..2021లో భారతదేశం మిస్ యూనివర్స్ గెలవడాన్ని చూసిన తర్వాతేనని అన్నారామె. అంతవరకు అందాల పోటీల గురించి పెద్దగా తెలియదని అన్నారు. భారత్ ఆ పోటీల్ల గెలవడంతో తనలో ఏదో స్ఫూర్తి రగిలిందన్నారు. అదీగాక హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021ను గెలుచుకోవడంతో భారత్ 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లైందని పేర్కొంది. అంతకుముందు 1994లో సుష్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ టైటిల్ని గెలుచుకున్నారు. అయితే చాలామంది ఈ అందాల పోటీలను కేవలం శారీరక సౌందర్య ప్రదర్శనగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అయితే ఈ అందాల పోటీలు గెలిచినా, గెలవకపోయినా..మీ గొంతుని కనుగొనడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటివి ఎన్నో నేర్పిస్తుందన్నారు. పైగా ఈ జర్నీలోని ఎంతో మెరుగవుతాం అంటూ తన సంభాషణను ముగించారామె.(చదవండి: అంతా అయిపోయాక కాదు..ముందుగా తెలుసుకోవాల్సిన ఆరోగ్య పాఠాలు..!) -
ప్లీజ్ అంతా అయిపోయాక కాదు..! ముందుగానే తెలుసుకుందాం..
ఏ విషయంలోనైన అశ్రద్ధ ఉన్నా..పర్లేదు కానీ..ఆరోగ్య విషయంలో అలా కాదు. ఒక్కసారి పెద్దయ్యాక..చూద్దాంలే అనుకుంటూ..ఉంటే..కథే అడ్డం తిరుగుతుంది. మనం యంగ్ ఏజ్లో తీసుకున్న ఆహారాలు, జీవనశైలి వంటివే నాలుగుపదుల వయసులో మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వృద్ధాప్యం సమీపించే సమయానికి రకరకాల వ్యాధుల బారినపడి..ఆరోగ్యాన్ని చేజాతులారా పాడు చేసుకుంటారని అంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అంతేగాదు. ముందుగానే ఈవిషయాలు తెలిసి ఉంటే బాగుండును అనుకునే ఐదు శక్తిమంతమైన ఆరోగ్య పాఠాలపై అందరికీ అవగాహన ఉండాలంటున్నారు. అవేంటంటే..యంగ్ ఏజ్లో ఉండగా..ఆ తర్వాత అంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. నిశబ్దంగా నష్టం జరిగిపోయాక గానీ మేల్కోరని అంటున్నారామె. నిద్ర అలవాట్ల నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతిదాంట్లో కేర్ఫుల్గా ఉండాలని అంటున్నారు.తెలుసుకోవాల్సిన ఐదు శక్తిమంతమైన పాఠాలు..తన 20 ఏళ్ల వయసులో తనకు తెలిసి ఉంటే బాగుండేదని అతను భావించే ఐదు శక్తివంతమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి:జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మిగతా అన్నింటినీ నిర్ధారిస్తుంది..శక్తి, మానసిక స్థితి, చర్మం, రోగనిరోధక శక్తి, మానసిక స్పష్టత అన్నీ జీర్ణవ్యవస్థలోనే మొదలవుతాయని అంటున్నారు వైద్యులు. ఇదంతా జీర్ణవ్యవస్థలో నిశ్శబ్దంగా ఉంటుంది,నిద్ర అనేది మీరు తర్వాత భర్తీ చేసుకోగలిగేది కాదుచాలా మంది అనుకున్నట్లుగా నిద్రలేమిని పూడ్చలేము. ప్రతి రాత్రి సరిగా నిద్రపోకపోవడం కాలక్రమేణా పేరుకుపోతుంది. కోల్పోయిన నిద్రకు బ్యాంకు ఖాతా లేదు,అని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వేగవంతమైన జీవసంబంధమైన వృద్ధాప్యం, అధిక జీవక్రియ ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధనలు చెబుతున్నాయని చెబుతున్నారు.ఆహారం కంటే.. ఒత్తిడి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తుంది..దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంపై ప్రత్యక్ష జీవసంబంధమైన ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఒత్తిడి కొన్ని గంటల్లోనే జీర్ణవ్యవస్థ, శరీరాన్ని ప్రభావితం చేయగలదు. నాడీ వ్యవస్థ నియంత్రణ గురించి మంచి అవగాహన ఉండాలి.ఇష్టంగా తినే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం..ఇవాల్టి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక కాలేయం, జీవక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అంటున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి సమస్యలు అకస్మాత్తుగా రావు, దశాబ్దాల తరబడి పునరావృతమయ్యే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేవని అంటున్నారు.అత్యంత శక్తిమంతమైన పదార్థం ఫైబర్అందరు రోజుకు కేవలం పది నుంచి 15 గ్రాముల ఫైబరే తీసుకుంటున్నారు. తగినంత ఫైబర్ పెద్ద ప్రేగు కేన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!) -
బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం..! కానీ పేదవాడే..
మంచి జీతం, ఓ కారు, ఇల్లు ఉంటే..ఎవ్వరైనా ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి అనుకుంటారు. ఇన్ని సౌకర్యాలు ఉంటే మస్తు హ్యాపీగా సాగిపోతుంది జీవితం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇన్ని ఉన్నా తను పేదవాడినని చెబుతుండటం విశేషం. అంతేగాదు అనారోగ్య సమస్యలతో వైద్యుని వద్దకు వచ్చి తన పరిస్థితి వివరించడంతో డాక్టర్ సైతం విస్తుపోయాడు. చివరికి అతడి గురించి క్షుణ్ణంగా విచారించగా..అసలు విషయం తెలిసి వైద్యుడికి నోట మాట రాలేదు. అంతేగాదు చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప నిపుణులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారంటూ ఆ వ్యక్తి కేసు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సన్నీ గార్గ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్న వృత్తి నిపుణుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు లేవనెత్తాయి. ఆ డాక్డర్ 34 ఏళ్ల గుర్గావ్ నివాసి కథను పంచుకున్నారు. పైకి చూస్తే ఆ వ్యక్తి బాగా డబ్బున్న వాడిలా సక్సెస్ఫుల్ మ్యాన్లానేఉన్నాడు. అతడి జీతం కూడా ఏడాదికి రూ. 40 లక్షల జీతం, డబుల్ బెడ్రూం ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు అన్నీ ఉన్నాయని అన్నారు. అయితే అతడు మాత్రం తాను చాలా పేదవాడినని, అందుకే రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా, విపరీతమైన ఒత్తిడికి గుర్వవుతున్నా అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చారు డాక్టర్ సన్నీ. ఒక్కసారిగా విస్తుపోయిన డాక్టర్ సన్నీ అతడి విషయాన్ని కొట్టపారేయకుండా..బాగా సక్సెఫుల్ అయిన నిపుణుల్లో పెరుగుతున్న అభద్రత భావమే ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ వ్యక్తి ఆర్థికంగా విజయవంతమైనవాడే కానీ పోల్చుకోవడం అనే సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ అతడి పోల్చుకునే ధోరణి ఎలా మారిపోయిందో వివరించారు. మొదట తన సొంత ఊరి వాళ్లతో లేదా సాంప్రదాయ వృత్తుల ఉన్నవాళ్లతో పోల్చుకున్నాడు. దాన్ని అధిగమించి ఓ స్థాయికి వచ్చాక..ఇప్పుడు ఏకంగా చిన్న వయసులో కోట్లలో సంపాదిస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటూ బాధపడుతున్నాడని అన్నారు. ఆ కారణంగానే తాను పేదవాడినని పేర్కొన్నాడని అన్నారు. దీన్ని డాక్టర్ సన్నీ "ఆధునిక పేదరికం"గా అభివర్ణించారు. ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, ఆదాయం కంటే అంచనాలు వేగంగా పెరగడం, సంతృప్తి లేకపోవడమే కారణమని అన్నారు. అంతేగాదు ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మొదటి గతేడాది నేను బెటర్ అని ఎన్నిసార్లు అనుకున్నావ్ అని అడిగగా.. దానికి నో అనే సమాధానం. రెండో ప్రశ్నగా.. ఈ డబ్బంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు? తన చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండటం కోసం అని రిప్లై ఇచ్చాడు. ఇక చివరగా డబ్బు లేదా వృత్తిపరమైన పురోగతి కోసం కాకుండా చేసిన మంచి పని ఏమైనా ఉందా అని అడిగగా..నో అనే సమాధానం ఇచ్చాడని అన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి కేసులో డబ్బు కొలమానంగా మారడంతో...ప్రతి పనిలోనూ తాను మనిషిగా ఉండటం మానేసి ఒక యంత్రంగా మారిపోయాడని అన్నారు డాక్టర్ సన్నీ. అంతేగాదు ప్రజలు నిరంతరం విజయగాథలు, విలాసవంతమైన జీవనశైలులు, అసాధారణ సంపదలు ఆకర్షణగా మారి పోలిక అనే వ్యసనం బారిన పడుతున్నారని..అదే ఒత్తిడి, మానసిక సమస్యలు బారినపడటానికి ప్రధాన కారణమని చెప్పారు. నెటిజన్లు కూడా వైద్యుడి మాటకు మద్దతిస్తూ..పోలిక ఎల్లప్పుడూ మనిషి ఆనందాన్ని చంపేస్తుందని, అన్నింట్లకంటే ఆత్మసంతృప్తి అత్యంత ముఖ్యం అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Dr Sunny Garg (@drsunnygarg) (చదవండి: భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు) -
65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..
బరువు తగ్గాలంటే కఠినమైన ఆహార నియమాలు, కష్టతరమైన వ్యాయమాల క్రమం అనుకుంటారు అంతా. కానీ తెలివిగా ఎంజాయ్ చేస్తూ సులభంగా తగ్గే ప్రక్రియ అని అంటోంది ఫిట్నెస్ కమ్ యోగా కోచ్ త్రిప్తి. చాలామంది. ఇక్కడ స్మార్ట్గా ఆలోచిస్తే స్లిమ్ అవ్వడం చాలా సులవు అని చెబుతోందామె. మరి అదెలాగో త్రిప్తి మాటల్లోనే తెలుసుకుందామా.!.దుబాయ్కు చెందిన ఫిట్నెస్, స్ట్రెంత్, యోగా కోచ్ త్రిప్తి తను కేవలం ఏడు నెలల్లో 7.7 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఎక్కువ కేలరీలు ఖర్చు చేసేందుకు, పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవడానికి సహాయపడిన సులభమైన ప్రభావవంతమైన వ్యాయామాలను పంచుకున్నారామె. తాను కాంపౌండ్ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ 7.7 కిలోలు తగ్గినట్లు తెలిపారు. ఇది కొవ్వు తగ్గడాన్ని వేగవంతం చేయడంలోనూ, మొత్తం ఫిట్నెస్ను మెరుగుపరచడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్త్రిప్తి తన వర్కౌట్ను మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్తో ప్రారంభించారు. ఈ వ్యాయామం కోర్ తోపాటు శరీర దిగువ భాగాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. కొత్తగా చేసేవారికి, కేవలం శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్ చేయమని ఆమె సిఫార్సు చేశారు.కాలును పైకి లేపేటప్పుడు శ్వాసను బయటకు వదలండి, తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చేటప్పుడు శ్వాసను లోపలికి తీసుకోండి. కదలిక అంతటా మీ కోర్ను బిగుతుగా ఉంచి, నిటారుగా ఉండే భంగిమను కొనసాగించాలని చెప్పారామె. అలాగే క్రమం తప్పకుండా వర్కౌట్ చేసేవారికి లేదా జిమ్కు వెళ్లేవారికి, బరువులను జోడించి, రెప్స్ సంఖ్యను 20కి పెంచమని త్రిప్తి సూచించారు. నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించడంతరువాత, ఆమె నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించింది. ఇది కోర్, హామ్స్ట్రింగ్స్ మరియు హిప్ ఫ్లెక్సర్లను లక్ష్యంగా చేసుకునే ఒక సులభమైన వ్యాయామం. తొలిసారిగా ప్రారంభించేవారు తమ శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్తో మొదలుపెట్టవచ్చు. ఆ తర్వాత ఆమె 10 కేజీల డంబెల్ను పట్టుకొని అదే వ్యాయామాన్ని చేసింది. మరింత సవాలు కోరుకునే వారు వేగాన్ని పెంచుకోవచ్చు లేదా సరైన భంగిమను పాటిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.మోకాలిని తిప్పే వ్యాయామంఆ తర్వాత త్రిప్తి మోకాలిని తిప్పే వ్యాయామం గురించి వివరించింది. ఈ వ్యాయామం ఒబ్లిక్స్ను బలపరచడానికి, మొండెం కదలికను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ కదలికను చేయడానికి, ఒక మోకాలిని పైకి లేపి, కోర్ను బిగుతుగా ఉంచుతూ పై శరీరాన్ని దాని వైపుకు తిప్పండి. తొలిసారిగా ప్రారంభించినవారు ప్రతి వైపు 10 రెప్స్ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఈ కదలికను మరింత సవాలుగా మార్చడానికి, ఆమె డంబెల్ లేదా వెయిట్ ప్లేట్ను జోడించమని సూచించింది. అధునాతన వ్యాయామం చేసేవారు వేగంపై కాకుండా నియంత్రిత మెలికలపై దృష్టి పెడుతూ, 5-10 కేజీల బరువును పట్టుకొని ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.హై నీస్ (లేదా హై-నీ మార్చ్)ఈ వర్కౌట్లో హై నీస్ కూడా ఉంది. ఇది ఒక కార్డియో వ్యాయామం, ఇది ఓర్పును పెంచుతూనే కోర్, గ్లూట్స్, కాలి కండరాలను ఉత్తేజపరుస్తుంది. తొలిసారి ప్రారంభించేవారు సౌకర్యవంతమైన వేగంతో మోకాళ్లను నడుము ఎత్తు వరకు పైకి లేపుతూ, 10-12 సార్లు హై-నీ మార్చ్ చేయవచ్చు. తీవ్రతను పెంచడానికి, ఇంతకు ముందు వర్కౌట్ అనుభవం ఉన్నవారు ప్రతి చేతిలో తేలికపాటి డంబెల్స్ పట్టుకుని 45-60 సెకన్ల పాటు హై నీస్ చేయవచ్చు. నిటారుగా కూర్చోవడం,చేతులను పంప్ చేయడం ఈ వర్కౌట్ను మరింత మెరుగుపరుస్తాయి.ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజ్ఆమె ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజెస్ చేసింది. ఈ వ్యాయామం భుజాలు, కోర్, గ్లూట్స్, బయటి తొడలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్, స్థిరత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తొలిసారిగా ప్రారంభించేవారు కేవలం తమ శరీర బరువును ఉపయోగించి, ప్రతి వైపు 10 రెప్స్తో ప్రారంభించవచ్చు. ఈ కదలిక అంతటా కోర్ను నిమగ్నంగా ఉంచడం నిటారుగా కూర్చోవడంపై దృష్టి పెట్టాలి.వ్యాయామం చేసేటప్పుడు డంబెల్ను తలపైన పట్టుకోవాలని త్రిప్తి సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు మధ్యస్థం నుండి ఎక్కువ బరువును ఉపయోగిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ వరకు పెంచుకోవచ్చు. చివరగా ఆమె ఈ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర రోజువారీ కదలికలు కలిపి చేస్తే..బరువులో మాత్రమే కాకుండా, బలం, శక్తి, ఆత్మవిశ్వాసంలో కూడా మార్పుని గమనించగలుగుతాం అని అంటోంది త్రిప్తి. ఇక్కడ కేవలం నిలకడ, క్రమశిక్షణే మంచి ఫలితాలను తెలస్తుందని అంటున్నారామె. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారామె. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by TriptiFitFlow | Strength•Yoga•Transformation (@triptifitflow) (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
విటమిన్–సి పుల్లటి పండ్లలో కంటే వాటిల్లోనే అధికం..!
మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్–సి అత్యంత కీలకమైనది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా, చర్మ సౌందర్యానికి, కణాల మరమ్మత్తుకు ఎంతగానో సహాయపడుతుంది. అందుకని మన రోజూవారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా ఈ విటమిన్ని సులభంగా పొందవచ్చు. సిట్రస్ జాతికి చెందిన నారింజ పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విదేశీ పండైనప్పటికీ ప్రస్తుతం మన దేశంలో విరివిగా లభిస్తున్న కివీ పండులో విటమిన్–సి తోపాటు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలామంది విటమిన్–సి కేవలం పుల్లటి పండ్లలోనే ఉంటుందని భావిస్తారు. కానీ, ఎర్రటి క్యాప్సికమ్లో నారింజ కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్–సి ఉంటుంది. ప్రతిరోజూ తగిన మోతాదులో విటమిన్–సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. యాంగ్జైటీ తగ్గించే యాలక్కాయ!భోజనం ముగిసిన వెంటనే ఒక యాలక్కాయను నోట్లో వేసుకుని నమలడం మంచిది. యాలకుల్లో ఉండే సహజసిద్ధమైన నూనెలు లాలాజలాన్ని, డైజెస్టివ్ ఎంజైమ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. వీటిల్లో ఉన్న కార్మినేటివ్ గుణాలు కడుపులో గ్యాస్ తయారవ్వకుండా నిరోధిస్తాయి. ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తాయి. వీటి నుంచి వచ్చే సువాసనలో మానసిక ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది. యాంగ్జైటీ వల్ల వచ్చే జీర్ణ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!
ఈ అడవి పండుకు ఇంగ్లీష్ పేరు: వైల్డ్ జుజుబె. తెలుగు పేర్లు: గొట్టె తీగ, పిండి పరిఘము, ఆనె పరిగె, తెల్ల పరిగె. అస్సామీస్: బిధావో భోగారి, బోన్ బాగరి, బోన్ బొగోరి, డిండవో బోగన్. ఒరియా: తినకోలి. కన్నడ: కట్టిలండల్, బేలహదు, బిళీముళ్ళిహను, కనిక, కొట్ట ముల్లుహణ్ణు.గుజరాతీ: తోరన్. తమిళం: కట్టిలండల్, తోతరి, తోటన. మలయాళం: జాలి, కొట్టముళ్ళు, తొడలి, తుటరి, మలంతుటలీ. మరాఠీ: తురన్, తోరణ. హిందీ: చూర్ణ, సూరన్. సంస్కృతం: ఘంటా అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది. ఇది జిట్ట రేగు కుటుంబానికి చెందినది. దీనికి కూడా ముండ్లు కురచగా జంటగా కానీ ఒంటరిగా కానీ ఉంటాయి. తెల్ల పరిగె దాదాపు 5–7 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. మానుకు దగ్గరలో వేరే చెట్టు ఉంటే దాని సహాయంతో తీగలా కూడా పెరుగుతుంది. రేగు చెట్టులా ఇది కూడా ఆకులు రాల్చుతుంది. పండ్లు తెల్లగా ఉండి, అడుగు భాగాన కొద్ది నాటి కాషాయం రంగు ఉంటుంది. పండ్లు తెల్లగా ఉన్నందున దీనికి చెంచులు ‘తెల్ల పరిగె’ లేక ఆనె పరిగె అని పిలుస్తారు.థాయిలాండ్లో దీని ఉనికి ఎక్కువగా ఉంది. ఇండియా, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్ తదితర దేశాల్లోని ఉష్ణ మండల అడవుల్లో పెరుగుతుంటాయి. భారతదేశంలో మాత్రం ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్–నికోబార్ దీవుల్లో ఈ చెట్లు ఉన్నాయి. తెలంగాణలోని నల్లమల అడవులలో అక్కడక్కడా ఉన్నాయి. ముఖ్యంగా మల్లాపూర్, కుడిచింత బయలు మొదలగు ప్రాంతాలలో గమనించవచ్చు. అక్కడి చెంచుల అభిప్రాయం మేరకు ఈ చెట్లు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. వీటిని అభివృద్ధి పరిచే అవసరం ఎంతైనా ఉంది.ఆనె పరిగె పండు ఉపయోగాలుపండ్లు తెలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పండులో గుజ్జు కొంత వరకు పిండిగా ఉండి రుచికరంగా ఉండటం వలన చెంచులు ఈ పండ్లను బాగా ఇష్ట పడుతారు. జీవాలు వీటి ఆకులను బాగా ఇష్టపడతాయి. పంటపొలం చుట్టూ తెల్లపరిగె కొమ్మలను కంచెగా వేసుకొని పశువులు ఇతర జంతువుల నుండి పంటను కాపాడుకోవచ్చు. రాలిన పండ్లను ఉడుతలు, కుందేళ్లు ఇతర జంతువులు ఇష్టంగా తింటాయని చెంచులు అన్నారు.తెల్ల పరిగెను చెంచులు, ఇతరులు అనేక రోగాలను నయం చేయటానికి వాడుతారు. ముఖ్యంగా విరేచనాలు, అల్సర్లు, చర్మ వ్యాధులు, దగ్గు, రక్తపోటు మొదలైన వాటికి వాడతారు.ఈ పండులో ఉన్న ఔషధ, పోషక గుణాలు ఉన్నందు వల్ల పోషక లోపాలను కొంతవరకు అరికట్టవచ్చు. ఆ పండ్లలో కూడా ఇతర పంటల్లో మాదిరిగానే చక్కెర, కొవ్వు, పీచు మొదలైన పదార్ధాలు ఉంటాయి. పోషకాల విశ్లేషణ ఈ పట్టికలో పొందుపరిచాం...పండ్లు: మార్చ్ – ఏప్రిల్ నెలలోకాస్తాయి. 5–7 మీటర్ల ఎత్తు పెరుగుతుందిడాక్టర్ మొరుపోజు పద్మయ్య,విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924 (చదవండి: ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..! డైట్ ప్లాన్..) -
నటి కంగనా వెండిగ్లాసులో నీళ్లు తాగడం..! ఆరోగ్యానికి మంచిదేనా?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల భారత 'భారత్ భాగ్య విధాత' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ కనిపించారు. 40 ఏళ్ల నటి గతంలో కూడా ఇలానే ఒక సందర్భంలో తాగుతూ కనిపించడంతో విమర్శులు వెల్లువెత్తాయి కూడా. అయితే తాను ఇలా వెండిగ్లాస్లో నీళ్లు తాగడానికి రీజన్ ఏంటో వివరించారు. ఎందుకు తాగుతానంటే..తాను తాగే వెండిగ్లాస్ చాలా పాతదని, ముఖ్యంగా రాజ కుటుంబాలలో అనుసరిస్తున్న ఒక పురాతన సంప్రదాయం అని అన్నారామె. తాను ఆరోగ్యం కోసం ఇలా వెండిగ్లాస్లో తాగుతున్నట్లు తెలిపారు. అధిక పిత్తదోషం ఉన్నవారికి చల్లదనం కోసం ఇది ఎంతో మంచిదని అన్నారు. వెండికి, నీటికి ఉన్న చల్లదనాన్నిచ్చే గుణాలను గురించి కూడా నొక్కి చెప్పారామె.నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?వెండి పాత్రలో నీళ్లు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా వెండి పాత్రలో నీళ్లు తాగడం అనేది భారతీయ సంప్రదాయంలో ఆరోగ్యంలో ఒక భాగం. పైగా వెండికి సహజంగా సూక్ష్మజీవులను నిరోధించే గుణం ఉన్నందున దానికి ప్రాధాన్య ఇస్తారని అన్నారు. వెండిగిన్నెలో నిల్వ ఉన్న నీరు కొన్ని సూక్ష్మ జీవుల పెరుగుదలను నెమ్మదింప చేస్తుందన్నారు. మొత్తం ఆరోగ్య విషయానికి వస్తే ప్రయోజనాలు పరిమితంగా ఉన్నాయన్నారు. ఇలా వెండిగిన్నెలో నీరు తాగితే దానంతట అదే పోషణ, రోగనిరోధక శక్తి వస్తాయని కాదని, ఈ చిన్న మార్పు మొత్తం ఆరోగ్య మెరుగుదల అని అనుకుంటే పొరపాటే అని అన్నారు.మన ఆయుర్వేదంలోనూ, భారతీయ సాంప్రదాయంలోనూ వెండి అనేది ఆరోగ్యానికి మంచిదే . అది వాస్తవమే అయినా..మొత్తం ఆరోగ్యంకి ముడిపెట్టడం సరికాదన్నారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లలో చేర్చడం కూడా సముచితం కాదన్నారు ఆరోగ్య నిపుణుల. View this post on Instagram A post shared by Peepingmoonofficial (@peepingmoonofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: బంధనం, బాధ..భళ్లుమనేలా అద్భుతమైన కళకు ఊపిరిపోసింది..!) -
'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?
నేను బాగానే ఉన్నాను..అనేది సానుకూలమైన ధోరణి అనుకుంటాం. కానీ అది ఎంతలా మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేలా చేస్తుందో తెలిస్తే విస్తుపోతారు. నిజానికి ఈ సిండ్రోమ్తో బాధపడుతున్నామని వైద్యుల, మానసిక నిపుణులు సైతం ముందుగా గుర్తించలేరట. మనకు ఎవరైనా మీరు ఎలా ఉన్నారు? అనగానే ఐమ్ ఫైన్, థాంక్యూ అని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. కానీ ఈ సమాధానమే పెద్దయ్యాక సర్దుబాటు పద్ధతిగా మారి మానసిక క్షోభగా పరిణామం చెందుతోందని గుర్తించమని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటని విస్తుపోకండి. అసలు ఏంటి సిండ్రోమ్..బాగున్నా అన్నా ధోరణి ఇంత ప్రమాదకరంగా ఎలా మారుతుందంటే..ఈ సిండ్రోమ్ మనల్ని మభ్యపెట్టి బతికేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను విస్మరించి అంతా తన అధీనంలో ఉండాలనే ధోరణినే 'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్ అంటారట. మస్తత్వవేత్తలు ఇది ఒక రకమైన లక్షణాలను అంగీకరించకుండా.. భావోద్వేగాలను అణిచివేసే స్థితిగా చెబుతున్నారు. దీనివల్ల ఆయా వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగాలని భావించి, తమలోని ఆందోళన సంకేతాలను తక్కువగా అంచనా వేస్తారు లేదా విస్మరిస్తారని అంటున్నారు. అంతేగాదు ఈ 'నేను బాగానే ఉన్నాను' అనేది కేవలం మామూలుగా చెప్పే సమాధానం కాదు. అదొక సర్దబాటు విధానంగా మారిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యే ఇదని అంటున్నారు. అంటే వృత్తిరీత్యా సమావేశాలు, టార్గెట్లు, అదనపు వర్క్ని పరమావధిగా చూస్తూ..భోజనం మానేయడం, నిద్రలేని రాత్రలు, నిరంతర అలసట, భావోద్వేగపరమైన నీరసం వంటి హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తూ..అంతా తమ అధీనంటో ఉందన్నట్లు పనులు చేస్తుంటారని చెబుతున్నారు మానసిక నిపుణుల. ఇక్కడ జీవించడం లేదు కేవలం పోటీ పడుతున్నాం. ఫలితంగా స్వీయం సంరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామని అంటున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక ఆరోగ్య సమస్యలు గురించి ఆలోచించ్చని అనుకుంటూ..తెలియకుండానే ఆ భయానక వలయంలో కూరుకుపోతారని అంటున్నారు. అంతేగాదు దీని కారణంగా అనారోగ్య అలవాట్ల బారిన పడతారని కూడా అంటున్నారు. ఈ సిండ్రోమ్ సంకేతాలు..నిద్రలేమిఏకాగ్రత లోపంజ్ఞాపకశక్తి సమస్యలువైద్యపరంగా వివరించలేని ఆకలి లేదా బరువులో మార్పులుపనిలో ఉత్పాదకత తగ్గడంసామాజిక ఒంటరితనంఅభిరుచులపై ఆసక్తి లేకపోవడంచిరాకుఆవేశపూరిత ప్రవర్తనతరచుగా వచ్చే తలనొప్పులు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు,అలసట వంటి శారీరక అనారోగ్యాలుఈ లక్షణాలు ఒక్కోసారి ఆపీసు లేదా కార్యాలయాల్లో తమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పుడూ కూడా ఈ పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. దీనివల్ల సాధారణ పనులు కూడా చేసుకోలేని విధంగా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. నిజానికి నిరాకరణ నుంచి 'నేను బాగానే ఉన్నాను' అనే సిండ్రోమ్ వస్తుందట. మానసిక నిరాకరణ అనేది తరుచుగా భయం, సామాజిక కండిషనింగ్ నుంచి పుడుతుందని అంటున్నారు. చాలామంది తాము బలంగా ఉండాలని, సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని ఇతరులకు భారం కాకూడదని భావిస్తూ పెరుగుతారు. అది కాస్తా తమ బాధను అంగీకరించడానికి ఇబ్బందిపడే మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ మనం బాధను అంగీకరిస్తే బలహీనంగా కనిపిస్తామని సిగ్గుపడి చివరకి నిరాకరణ ధోరణి మొదలవ్వుతుందని అంటున్నారు. అందుకే భావోద్వేగాలను అణిచివేయొద్దు, బాధ, ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులను అంగీకరించి వాటి నుంచి బయటపడే మార్గం చూడండి తప్ప అణిచేసేలా బాగానే ఉన్నాను అనే మాటకు ఆస్కారం ఇవ్వకండి. ఇక్కడ బాగానే ఉన్నాను అను మాటకు కట్టుబడి ఉండేలా స్వీయ భద్రతపై దృష్టిపెట్టండి, ఆరోగ్యాన్ని పట్టించుకోండి..తర్వాత అనే మాటకు అవకాశం ఇవ్వొద్దు అని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. (చదవండి: ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..! అతడి చివరి భోజనం..) -
నాలుగు నెలల్లో 15 కిలోలు తగ్గాలంటే..! ఈ ఐదు సింపుల్ చిట్కాలతో..
బరువు తగ్గాలంటే చక్కని డైట్లు, ఫోర్స్బుల్ వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి భారం కలిగించేలా ఇలాంటి వర్కౌట్లతో బరువు తగ్గడం ఎలా ఉన్నా.. సమస్యలే ఎక్కువ. కొందరు తగ్గకపోగా..మరింత బరువు పెరుగుతారు. అలా కాకుండా శరీరానికి హాయినిచ్చేలా సులభంగా చేసే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేయడమే గాక సులభంగా బరువు తగ్గగలుగుతారని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా.!.15 కిలోల బరువును విజయవంతంగా తగ్గించుకున్న ఆమె తన వెయిట్లాస్ జర్నీని సాధారణమైన రోజువారీ జీవనశైలి అలవాట్లతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏం చేసినా..స్కిప్ చేయకుండా నిలకడగా చేస్తే తప్పక ఫలితం పొందగలమని అంటోందామె. తాను తీవ్రమైన వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ల జోలికి పోకుండా తగ్గానని చెబుతోంది. అందుకోసం ఏం చేసిందో కూడా షేర్ చేశారామె. వాకింగ్..ఇది కార్షియో వ్యాయామంలా పనిచేస్తుంది. కుదిరినప్పుడల్లా మెట్లు ఎక్కండి, లిఫ్టులు వాడండి.నీరు తాగడం..నిద్రలేవగానే నీళ్లు తాగండి, గోరువెచ్చని నీరైనా.మరే ఏవిధంగానైన నీటిని ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండేలా చేసుకోండి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల రోజంతా మన శక్తిని స్థిరంగా ఉంచుతుంది.ఫైబర్ను మర్చిపోవద్దుప్రోటీన్ ముఖ్యమే, కానీ ఫైబర్ కూడా అంతే ముఖ్యమని గుర్తించండి. అదుకోసం భోజనంలో మంచి మొత్తంలో ఫైబర్ను చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.ఇంట్లో వండిన ఆహారంప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంట్లో తయారు చేసిన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల పదర్థాఆల పరిమాణాలు, వంట పద్ధతులపై ఒక నియంత్రణ ఉంటుంది. అలాగే అధిక సోడియం, ఉప్పుని తగ్గించే వీలు కూడా ఉంటుంది.కేలరీ లోటుతినే ఆహార పరిమాణాలను అర్థం చేసుకోండి. ద్రవరూప క్యాలరీల పట్ల జాగ్రత్త వహించండి. పండ్ల రసాల కంటే ఎల్లప్పుడూ పండ్లనే తినండి. కొవ్వును తగ్గించుకోవడానికి, కొద్దిపాటి కేలరీ లోటును పాటించాల్సి ఉంటుంది.తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, ఫిట్నెస్ లక్ష్యాలను సాధించాలని చూస్తున్న వారికి, ఈ సాధారణ అలవాట్లు చాలా బాగా హెల్ప్ అవుతాయని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. (చదవండి: 76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..) -
బరువు తగ్గాలా? అలా అస్సలు చేయొద్దు: రాశీఖన్నా
మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. అందం కూడా ముఖ్యమే. అందం మనిషికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే సహజసిద్ధంగా వచ్చే సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి తపన పడుతుంటారు. సినీ తారలకు అందం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ప్రతిభను పక్కన పెడితే అందమే వారికి కీలకం. అందుకే నిత్యం శరీరానికి అవసరమైన ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, శారీరక వ్యాయామాలు చాలా అవసరం. 20 ఏళ్ల వయసులో అందంగా ఉండడం పెద్ద విషయం కాదు. అయితే 30 ఏళ్ల తరువాత ఎదురయ్యే రోగాలతో శక్తి తగ్గడం వంటి విషయాల్లో జాగ్రత్త వహించడం పెద్ద విషయం. 30 ఏళ్ల తరువాత మనం ఎలా అరోగ్యంగా ఉండాలన్న విషయాలను వైద్యులు, వ్యాయామ నిపుణులు సూచనలు చేస్తుంటారు. అదే విధంగా ఫిట్నెస్ విషయంలో సినీ ప్రముఖులు సలహాలు ఇస్తుంటారు. నిత్యం కసరత్తులు చేసే వారిలో నటి రాశీఖన్నా ఒకరు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ 35 ఏళ్ల బ్యూటీ.. హిందీ, తెలుగు, తమిళంలో నటిస్తూ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ ఢిల్లీ బ్యూటీ తమిళంలోకి 'ఇమైకా నొడిగళ్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. నటిగా పుష్కరం పూర్తి చేసుకున్న రాశీఖన్నా.. ప్రస్తుతం తమిళంలో 'రౌడీ అండ్ కో'లో నటిస్తోంది. హిందీలోనూ రెండు చిత్రాలు చేస్తున్న ఈమె.. ఇటీవల అందం, ఆరోగ్యం గురించి మాట్లాడుతూ 20 ఏళ్ల వయసులో అందానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే దాన్ని అని చెప్పుకొచ్చింది. 30 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉండడటమే ముఖ్యం అని తెలుసుకున్నానని పేర్కొంది. అందంగా ఉండడం మంచిదే కానీ, బరువు తగ్గాలనుకునే మహిళలు ప్రమాదకరమైన క్రాష్ డైట్ విధానాలను పక్కన పెట్టాలని పేర్కొంది. తమని ఇతరులతో పోల్చుకోకుండా పౌష్టికాహారం తీసుకుంటూ రూల్స్ పాటిస్తూ వ్యాయామాలు చేయాలని రాశీఖన్నా సలహా ఇచ్చింది.ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తర్వాత బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, తెలుసు కదా, ఉస్తాద్ భగత్ సింగ్ తదితర సినిమాలు చేసింది. కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉండే ఈమె.. ఇప్పుడు నాజుగ్గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?
నా వయసు ఇరవై ఐదేళ్లు. మొదటిసారి గర్భం దాల్చాను. రెండు నెలలు నిండాయి, పరీక్ష చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కానీ నా బ్లడ్ గ్రూప్ ‘బి నెగటివ్’ అని తేలింది. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అసలు ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి ఈ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ సమస్య అసలు రాకుండా ఉండటానికి ఇంకా ఎలాంటి సమయాల్లో యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందో, డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్ గురించి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారో దయచేసి వివరంగా చెప్పండి.– లక్ష్మీ ప్రసన్న, హైదరాబాద్.సాధారణంగా కాబోయే తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ (ఆర్హెచ్ నెగటివ్) ఉండి, భర్త బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా మొదటగా భర్తకు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ ఆయనది కూడా నెగటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ భర్తది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మాత్రం, ఈ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి శరీరంలో యాంటీబాడీలు తయారై బిడ్డపై ప్రభావం పడకుండా ఉండటానికి ‘ఇండైరెక్ట్ కూంబ్స్ టెస్ట్’ (ఐసీటీ) అనే రక్త పరీక్షను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒకసారి చేస్తారు. ఒకవేళ ఈ పరీక్ష ఫలితం సాధారణంగా (నెగటివ్) వస్తే తల్లి శరీరం ఇంకా సెన్సిటైజ్ అవ్వలేదని అర్థం. కాబట్టి గర్భాధారణ ఇరవై ఎనిమిదవ వారంలో మళ్ళీ ఈ పరీక్ష చేసి, అప్పుడు కూడా నెగటివ్ వస్తే తల్లికి ’యాంటీ–డి’ నివారణ ఇంజెక్షన్ ఇస్తారు. అలాగే కాన్పు అయిన తర్వాత పుట్టిన బిడ్డ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అని తేలితే డెలివరీ అయిన డెబ్బై రెండు గంటల లోపు తల్లికి మళ్ళీ యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆమెను, భవిష్యత్తులో వచ్చే గర్భాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే, ఒకవేళ ఈ ఐసీటీ పరీక్ష ఫలితం పాజిటివ్ వస్తే మాత్రం దానిని ‘ఇమ్యూనైజ్డ్ ప్రెగ్నెన్సీ’ అంటారు, అప్పుడు బిడ్డకు రక్తహీనత (ఎనీమియా) వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, స్కానింగ్ (మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్ పరీక్ష) ద్వారా బిడ్డ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే కడుపులోనే బిడ్డకు రక్తం ఎక్కించే (ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్ఫ్యూషన్) అత్యాధునిక వసతులు, నియోనేటాలజీ విభాగాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలోనే (టెర్షియరీ సెంటర్) డెలివరీ చేయించుకోవడం చాలా సురక్షితం. ప్రెగ్నెన్సీ కొనసాగుతున్న సమయంలో మొదటి మూడు నెలల కాలంలో గర్భస్రావం అయినా, మహిళలు స్వచ్ఛందంగా గర్భాన్ని తీసివేయించుకున్నా, గర్భాశయాన్ని క్లీన్ చేసే ప్రక్రియ జరిగినా, గర్భాశయం వెలుపల పిండం పెరిగే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, మధ్యమధ్యలో కొద్దిగా బ్లీడింగ్ కనిపిస్తున్నా, గర్భం చివరలో బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు తీసి పరీక్షించే ‘అమ్నియోసెంటసిస్’ లాంటి ప్రత్యేక పరీక్షలు చేసినా, లేదా నెలలు నిండకుండానే కాన్పు అయినా సరే తల్లి శరీరం సెన్సిటైజ్ అవ్వకుండా ఉండటానికి ఈ యాంటీ–డి ఇంజెక్షన్ కచ్చితంగా రక్షణగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డెలివరీ సమయంలో రక్త లభ్యత (బ్లడ్ అరేంజ్మెంట్) విషయానికి వస్తే, ’నెగటివ్’ బ్లడ్ గ్రూపులు అనేవి చాలా అరుదైనవి కావడంతో అత్యవసర సమయంలో ఇవి బయట త్వరగా దొరకవు, కాబట్టి డెలివరీ సమయంలో ఒకవేళ తల్లికి అధిక రక్తస్రావం లాంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే రక్తం కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఒక బ్లడ్ డోనర్ను సిద్ధంగా ఉంచుకోవడం, ఆసుపత్రిలో రక్తం అందుబాటులో ఉండేలా చూసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకూ ఎంతో రక్షణ ఇస్తుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉంటే నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ మరియు డెలివరీని సురక్షితంగా పూర్తి చేసుకోవచ్చు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు.డా. కప్పగంతుల అపర్ణ, సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ (చదవండి: ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్గా 94 ఏళ్ల వ్యాపారి కథ!) -
పాడు పొగతో మూడింతల సెగ
సిగరెట్ తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాంతో కలిగే నష్టం దాని పొగంత నల్లగా ఉంటుంది. స్టైల్గా రెండు వేళ్లతో పట్టుకోడానికి అనువుగా ఉండవచ్చు. కానీ దానితో వచ్చే నష్టాలు వేలు కాదు కదా... లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా సరిపోనంతగా లేదా బాగు చేయలేనంతగా భారీగా ఉంటాయి. ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా కోరవచ్చు కూడా. రెండు వేళ్లతో కలిగే మూడు చేతుల నష్టాలేమిటో చూద్దాం.ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్... నష్టాలు..సిగరెట్ లేదా పొగతాగడం అలవాటున్న వ్యక్తి... ఆ దుష్ప్రభావాల వల్ల తానే స్వయంగా నష్టపోతాడు. ఆ అలవాటుకు తన ప్రాణాన్నే పణంగా పెడతాడు. తల మీద ఉన్న వెంట్రుకలూ, తలలోని కీలక అవయవాలు మొదలుకొని కాలూ, కాలి వేలి వరకు పొగాకు వల్ల ప్రభావితం కాని అవయవమంటూ ఏదీ ఉండదు. తలలోని అవయవాలూ, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్లు మొదలుకొని ఊపిరితిత్తులూ, కడుపు... ఇలా ప్రతి అవయవమూ క్యాన్సర్తో ప్రభావితం కావడానికి కారణం... పొగాకులో దాదాపు 5000 హానికరమైన రసాయనాలు దేహానికి హాని చేస్తాయి. అంతేకాదు... దాదాపు 60 రకాల రసాయనాలైతే నేరుగా క్యాన్సర్ను కలగజేస్తాయి కాబట్టి వాటిని కార్సినోజెన్స్ అని కూడా పిలుస్తారు. ఇలా తానే స్వయంగా నష్ట΄ోతున్నందున దీన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ – అనర్థాలు...నేరుగా పొగతాగే వ్యక్తితోపాటు పక్కనే ఉండే స్నేహితులకూ, తనతోపాటు గడిపే మిత్రులతోపాటు జీవిత భాగస్వామి పొగపీల్చడాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. దీంతో వాళ్లు నేరుగా సిగరెట్ తాగక΄ోయినప్పటికీ పొగాకు దుష్ప్రభావాలకు లోనవుతారు. ప్రధానంగా జీవిత భాగస్వామీ, పిల్లలూ ఇలా ప్యాసివ్ స్మోకింగ్కు గురవుతారు. మరీ ముఖ్యంగా భర్త తాలూకు ఆ అలవాటు భార్య గర్భధారణ విషయంలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భర్త తాలూకు సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యంపై దాని ప్రభావమూ పెరుగుతుంది. భర్త పొగతాగే అలవాటుతో భార్య జీవరసాయనాల్లో మార్పు వచ్చి, అండాల సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు. సిగరెట్ పొగలో ఉన్న రసాయనాల వల్ల మహిళలకు చాలా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెలలు నిండకముందే బిడ్డపుట్టడమూ, అలా పుట్టే పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉండటమూ, ఆ పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలు పెరగడమూ జరుగుతాయి.థర్డ్ హ్యాండ్ స్మోకింగ్... దుష్ప్రభావాలు...నేరుగా సిగరెట్ కాల్చేవారిది ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. మన స్నేహితుడో లేదా కుటుంబసభ్యుడైనందువల్లనో ఆ అలవాటు ఉన్నవారి నుంచి పొగ పీల్చడాన్ని సెకండ్హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇక ఓ వ్యక్తి మూసి ఉన్న ఓ గదిలోనో లేదా లిఫ్ట్లోనో కొద్దిసేపటి కిందట సిగరెట్ కాల్చి వెళ్లిపోయినప్పటికీ... చాలాసేపటి తర్వాత ఎవరైనా ఆ గదిలోకి వెళ్తే అప్పటికీ ఆ సిగరెట్ వాసన వస్తుండటం, అక్కడ ఉన్న నుసిలాంటి ఇతరత్రా చాలా సూక్ష్మమైన వ్యర్థాలు ఆ గదిలోకి వెళ్లినవారి బట్టలకు అంటుకుపోవడం, మన బట్టల్ని వాసన చూసినవారు కూడా సిగరెట్ వాసనను పసిగట్టడం... ఇవన్నీ ‘థర్డ్ హ్యాండ్ స్మోకింగ్’ కిందకు వస్తాయి. ఈ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా గదిలో ఉండిపోయే నుసి, అతి సూక్ష్మమైన సన్నటి ధూళి కణాలు... పొగకు ఎక్స్పోజ్ అయిన బట్టలపై కొన్ని నెలలపాటు, ఆ మాటకొస్తే కొన్నేళ్ల వరకు కూడా అలాగే ఉండిపోతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా గాలి ప్రవేశించలేకుండా ఉండి, గట్టిగా మూసి ఉన్న గదుల్లో స్మోకింగ్ చేసినప్పుడు, ఇతరులు అందులోకి వెళ్లినప్పుడు ఈ థర్డ్ హ్యాండ్ దుష్ప్రభావాలు మరింత ఎక్కువకాలం కొనసాగుతుంటాయి. ఈ పరిశోధనల్లో తేలినదేమిటంటే.. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్కు గురైన 22 గంటల తర్వాత కూడా... వ్యక్తులపై ఆ దుష్ప్రభావాల ప్రభావం కనిపిస్తుందన్నది పరిశోధకుల మాట. యూఎస్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్లో సెల్బయాలజిస్ట్ ప్రూ టాల్బోట్ చెబుతున్న దాని ప్రకారం... థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ దుష్ప్రభావాలపై ఇప్పటివరకూ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదనీ, పొగతాగే అలవాటున్న వ్యక్తుల తాలూకు కార్లు వాడేవారూ, కొనేవారూ లేదా హోటళ్లలో అంతకుముందు స్మోకర్స్ ఉండి ఖాళీ చేసిన గదులు షేర్ చేసుకునేవారు, క్యాసినోలకు వెళ్లేవారందరికీ ఈ ముప్పు చాలా ఎక్కువనీ, అన్ని అవయవాలకంటే చర్మానికి నేరుగా ఈ ముప్పు ఉంటుందంటూ చెబుతున్నారు.క్యాన్సర్ను సిగరెట్ బాక్స్లో ప్యాక్ చేసి, పిల్లలకు ఇవ్వడం సబబేనా?ప్రాణాంతకమైన క్యాన్సర్ను అందమైన సిగరెట్ పెట్టెలో ప్యాక్ చేసి తీసుకెళ్లి ఇంట్లోని అమాయకమైన పిల్లలకు గిఫ్ట్గా ఇవ్వడం ఎంతవరకు సబబంటూ పరిశోధకులూ, వైద్య ప్రముఖులు పొగాకు వాడేవారిని నేరుగా ప్రశ్నిస్తున్నారు. పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్ఏను సంక్రమింపజేస్తున్నారని వాపోతున్నారు. పిల్లలకు లోపభూయిష్టమైన డీఎన్ఏ దక్కడానికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట బ్రాడ్ఫోర్ట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. తమ పొగతాగే అలవాటు కారణంగా తండ్రులు తమ పిల్లలకు దెబ్బతిన్న (డ్యామేజ్డ్) డీఎన్ఏ ను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రి తప్పిదం వల్ల పిల్లలు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని ఆ అధ్యయనం చెబుతోంది. దీనికి కారణమేమిటంటే... పురుషుల వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన ఆ డీఎన్ఏ కారణంగా పిల్లల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. పుట్టబోయే పిల్లల్లో కనిపించే రిస్క్ను తప్పించుకునేందుకు ఒక ఉపాయాన్ని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. ఈ అనర్థాలన్నిటి కంటే... స్వయానా తానూ, జీవన సహచరి అయిన తన భార్య, తమకు పుట్టే పిల్లలూ, తన తోటి స్నేహితులూ, వారితోపాటు సమస్త సమాజమంతా ఆరోగ్యంగా ఉండటానికి పొగతాగడమూ, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేయడమే మంచిదంటూ డాక్టర్లూ, వైద్య పరిశోధకులూ, ఆరోగ్యాన్ని కోరుకునే అందరూ సూచిస్తున్నారు. ఇక్కడ పొగతాగడం అంటే కేవలం సిగరెట్, బీడీ, చుట్ట అనే కాదు... జర్దా, ఖైనీ, పాన్మసాలా... ఇలా పొగాకు ఏ రూపంలో ఉన్నా అంతే ప్రమాదకారి అని గుర్తించడం అవసరం. నిర్వహణ: యాసీన్ (చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
కాలేయం ఆరోగ్యం కోసం..!
ఇటీవల కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య అధికమైంది. ఆల్కహాల్ తాగకపోయినా ఈ సమస్య బారినపడుతున్నారు చాలామంది. అసలు కాలేయం అనారోగ్యం బారిన పడకూడదంటే జీవనశైలిలో ఈ మార్పలు చోటుచేసుకుంటే చాలు అని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ. సమతుల్య ఆహారం, రోజూవారీ వ్యాయామంతో ఈ సమస్యకు చెక్కుపెట్టొచ్చని అంటున్నారు. జస్ట్ ఒక అరగంట వ్యాయామాలు, మంచి ఆహారంతోనే కాలేయాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చిన చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.ముందుగా కాలేయంపై భారాన్ని తగ్గించడని విజ్ఞప్తి చేస్తున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అనవసరమైన పెయిన్ కిల్లర్ మందులు అతిగా వాడటం, దీర్ఘకాలిక ఒత్తిడి, సరిగా నిద్రపోవకపోవడం వంటి వాటితో కాలేయంపై అతిగా భారాన్ని మోపొద్దు అంటున్నారు. అంటే సమయానికి భోజనం, నిద్ర ఉండేలా కేర్ తీసుకుంటూ ఆరోగ్యకరమైన పోషకవంతమైన ఆహారాలను తినమని సూచిస్తున్నారు. తీసుకోవాల్సినవి..కాలేయం ఆరోగ్యానికి నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందించి హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించేస్తుంది.మిల్క్ థిస్టిల్: అనేది శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో వాడుతున్న ఒక పురాతన మూలిక. దీనిలో ఉండే 'సిలిమరిన్' అనే క్రియాశీలక సమ్మేళనం కాలేయ ఆరోగ్యానికి (Liver health) అత్యంత మేలు. ఇది లివర్ వాపును తగ్గించి, విషతుల్య పదార్థాలను బయటకు పంపి కణాలను పునరుద్ధరిస్తుంది. హెపటైటిస్, కామెర్లు వంటి సమస్యల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలను తగ్గించి, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుందినిమ్మకాయ పరోక్షంగా డిటాక్స్కు మద్దతు ఇస్తుంది. ఇది విటమిన్ సిని అందిస్తుంది, ఇది యాంటీఆక్సిడెంట్ రక్షణకు సహాయపడుతుంది మరియు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందిస్తుంది, ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వ్యర్థాల విసర్జన అనేది పైత్యరస ప్రవాహం, మూత్ర విసర్జన మరియు జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది.క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవడం: దీనిలో గ్లూకోసినోలేట్లు ఉంటాయి, ఇవి సల్ఫోరాఫేన్ సంబంధిత సమ్మేళనాలుగా మారగలవు. ఇవి ఫేజ్ 2 డిటాక్స్ ఎంజైమ్ చర్యకు, యాంటీఆక్సిడెంట్ ప్రతిస్పందన మార్గాలకు మద్దతు ఇస్తాయి.క్రూసిఫెరస్ కూరగాలు అంటే..బ్రోకలీక్యాబేజీకాలీఫ్లవర్ముల్లంగిపాలకూర (కాలే)బోక్ చోయ్ఔషధాల పరంగా: గ్లూటాథయాన్ అండ్ బి విటమిన్లు ఫ్యాటీ లివర్ ఫేజ్ 2కు కీలకమైన సాధనాలు. గ్లూటాథయాన్ రియాక్టివ్ సమ్మేళనాలను బంధించి, తటస్థీకరించడంలో సహాయపడుతుంది. బి విటమిన్లు మిథైలేషన్, శక్తి జీవక్రియ డిటాక్స్ మార్గాలకు మద్దతు ఇస్తాయి.వీటితోపాటు ప్రోటీన్, గ్లైసిన్, సిస్టీన్, ఫోలేట్, బి12, బి6, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం ఉండే ఆహారాలను తీసుకోవడంపై దృఫ్టి పెట్టాలి.వెల్లుల్లి సల్ఫర్ సమ్మేళనాలను అందిస్తుంది, ఇవి డిటాక్స్ కెమిస్ట్రీకి, యాంటీఆక్సిడెంట్ రక్షణకు మద్దతు ఇస్తాయి. ఇది హృదయ సంబంధ, రోగనిరోధక మార్గాలకు కూడా మద్దతు ఇస్తుంది. ఇలా ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో మార్పులు చేర్పులు చేసుకుంటే..మంచి ఆరోగ్యం సులభంగా సొంతం చేసుకోవచ్చిన అంటున్నారు. మరిన్ని వివరాలకు ఈ కింది లింక్పై క్లిక్ చేయండి (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్
అందరికీ స్మార్ట్గా, స్లిమ్గా అవ్వాలని ఉంటుంది. కానీ తక్కువటైంలోనే తగ్గాలనేది అందరి కోరకి. కానీ ఆ క్రమంలో శరీరం కాస్త ఒత్తిడికి గురై బరువు తగ్గడం ఎలా ఉన్నా అధిక బరువు పెరిగిపోతుంటాం. అలాంటి వాళ్లు హెల్దీ కమ్ స్పీడ్గా బరువు తగ్గేందుకు ఈ 15 రూల్స్ని ఫాలో అయితే చాలని అంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. కేవలం చీటింగ్కి తావు లేకుండా క్రమశిక్షణతో కూడిని దినచర్యకు కట్టుబడి ఉంటే చాలని అంటున్నారామె. అలాంటప్పుడే ఈ 15 నియమాలు చాలా సమర్థవంతంగా ఫలితాలనిస్తాయిని చెబుతున్నాడు.క్రమబద్దమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, సరైన నిద్ర, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించే డెడికేషన్ తదితరాలు ఉంటే 30 రోజుల్లో బరువు తగ్గడం సులభమేనని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. అందుకోసం ప్లాన్ ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నియంత్రిత ఆమారం, అధిక ప్రోటీన్తో కూడినా ఆహారాలు, శారీరక శ్రమ వంటి వాటితో కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు రాషిద్. అందుకోసం స్ట్రిక్ట్గా శిక్షణను కొనసాగించాలని నొక్కి చెప్పారు. ఆ వెయిట్లాస్ ప్లాన్ ఏంటంటే..కేలరీల లోటుతో తినండినిర్వహణ స్థాయి కంటే 500-750 తక్కువ. గరోజువారీ ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోండిశరీర బరువులో ప్రతి పౌండ్కు 0.8-1 గ్రా. చాలా మందికి కనీసం 130-180 గ్రా.ప్రతి భోజనంలో 20-30 గ్రా ప్రోటీన్ తినండిప్రోటీన్కు అనుగుణంగా ప్రతి భోజనం ఉండాలివారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండివారానికి 3-5 సార్లు ఇంక్లైన్ వాక్ / స్టెయిర్మాస్టర్ చేయండి 30-45 నిమిషాలు. ఈ వారం నేను పంచుకున్న వాకింగ్ ఛాలెంజ్ లాగా.ప్రతిరోజూ పదివేల పైనే అడుగులు నడవడంఇది ఒత్తిడి లేకుండా కొవ్వును కరిగించడం.రాత్రికి 7-9 గంటలు నిద్రపోండినిద్ర లేకపోతే కొవ్వు కరగడం నెమ్మదిస్తుంది.భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండిప్రణాళిక లేకపోతే ఇష్టం వచ్చినట్లు తినడంతో ఫలితం పొందలేరు. ప్రధానంగా సంపూర్ణ ఆహారాలనే తినండి. కొవ్వు తక్కువగా ఉండే మాంసం, అన్నం, గుడ్లు, పండ్లు, ఓట్స్, ఆకుకూరలు.అధిక కేలరీలు గల పానీయాలను మానుకోండినీళ్లు, కాఫీ, కేలరీలు లేని పానీయాలు. స్మూతీలను లెక్కపెడితే ఫర్వాలేదు.ప్రాసెస్ చేసిన చక్కెరను తగ్గించండిమిఠాయిలు, పేస్ట్రీలు, చక్కెర కలిపిన తృణధాన్యాలు, లేదా జంక్ ఫుడ్ వద్దు.చివరగా 30 రోజుల పాటు చీట్ మీల్స్ వద్దుప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే బరువు చూసుకోండిమొదట్లో కాస్త కష్టంగా అనిపించినా..స్మార్ట్గా మారాలన్న లక్ష్యంపై గురిపెడితే ప్రతి శారీరక బాధ ఇష్టంగా మారుతుందని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్ . View this post on Instagram A post shared by Takai Raashid | MacroMaster® (@takai.raashid)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..
ఇటీవలకాలంలో అందరు ఆరోగ్య స్పృహతో పోషకవంతమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా భోజనం విషయంలో వైట్రైస్ కంటే బ్రౌన్రైస్ని, చపాతీలను, తాజా పండ్లు, కూరగాయలను వినయోగిస్తున్నారు. కొందరు మితంగా వైట్ రైస్ తీసుకుంటూ ఆకుకూరలు, నట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ వైట్రైస్ అసలు తినకపోవడమే మంచిదా?, బ్రౌన్ రైస్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? అంటే ఆ ఆలోచనే సరైనది కాదంటున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . బ్రౌన్ ఆరోగ్యానికి మంచిదనేది నిజమే అయినప్పటికీ పూర్తిగా వైట్ రైస్ తీసుకోకూడదని కాదు అంటున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య రీత్యా ఏది తీసుకుంటే మంచిదనేది ఆధారపడి ఉంటుందంటున్నారు. అదెలాగంటే..తెల్లబియ్యం..తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అది సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో కొంతమందికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తీవ్రమైనప్పుడు, తప్పక ఫైబర్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, తినేందుకు మృదువుగా ఉంటుంది.బ్రౌన్రైస్ఇందులో పోషకమైన మొలక, పీచుపదార్థం గల ఊక, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండోస్పెర్మ్ తదితరాలు ఉంటాయి. దీని గరుకైన ఊక ఉపరితలం కారణంగా నమలడానికి గట్టిగానూ ఉడికేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది.పోలిస్తే..సమతుల్య ఆహారంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఉంటాయి. అయితే, తెల్ల బియ్యంతో పోలిస్తే, బ్రౌన్ రైస్లో ఊక, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అనేక బి విటమిన్లు (బి1, బి3, బి6, మరియు బి9) అధిక స్థాయిలో ఉంటాయిఆరోగ్య పరంగా..ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తుంటే, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గడం, అలాగే బరువును మెరుగ్గా నియంత్రించుకోవడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తెల్ల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ± 4, ఇది అధికం. బ్రౌన్ రైస్ను మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ 68 ± 4 కారంగా ఆరోగ్యప్రదంగా పరిగణించారు నిపుణులు. అదీగాక, బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది, కానీ తెల్ల బియ్యం తినడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.ఎలా తీసుకుంటే మంచిదంటే..చాలా మంది బ్రౌన్ రైస్ మంచిదన్న ఉద్దేశ్యంతో దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీనిలోని అధిక ఫైబర్ జీర్ణం చేసుకోవడం కష్టతరం చేసి జీర్ణసంబంధిత రుగ్మతలు తీవ్రమై ప్రమాదం లేకపోలేదని అంటున్నారు ఆదర్శ గౌడ. అందువల్ల బ్రౌన్ రైస్, వైట్రైస్ రెండిటిని కలిపి ఎంచుకోమని సూచిస్తున్నారు నిపుణులు. మెరుగైన పోషకాహారం కోసం కొద్దిపాటి మార్పులతో రెండిటిని సమంగా తీసుకునే ప్రయత్నం చేయమని అంటున్నారు అప్పుడు శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు ఆదర్శ గౌడ.(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..!
నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందులోనూ బాదం పప్పులు మరింత ఆరోగ్యప్రదం కూడా. వీటిని ఎవ్వరైనా ధీమాగా తినొచ్చు. బాలింతలు, దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరికి మంచిది. అయితే వీటిని నీటిలో నానబెట్టి తింటే మరింత ప్రయోజనం పొందొచ్చని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . అధ్యయనాలు సైతం ఆ మాట నొక్కి చెబుతున్నాయి. నీటిలో నానబెట్టకుండా గట్టిగా ఉన్న బాదం పప్పులనే తింటే జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎలా ఇబ్బంది పడుతుందో కూడా వివరించారు.బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కీలక ఖనిజాలు ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి కూడా. అందువల్ల వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి లేదా కనీసం ఓ 12 గంటలైన నానబెట్టి తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఆదర్శగౌడ. ఎందుకంటే..పచ్చిగా ఉండే బాదం పప్పుల్లో ఫైటిక్ ఆమ్లం ఉంటుందట. ఇది బాదంలో సహజంగా లభించే సమ్మేళనం. ఇది బాదంలోని జింక్, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలతో బంధం ఏర్పరచుకుని కరగని సమ్మేళనాలను ఏర్పరస్తుంది. ఎప్పుడైతే నానబెట్టకుండా తింటామో..ఫలితంగా జీర్ణవ్యవస్థ గుండా శోషించబడకుండానే ప్రయాణిస్తుందట. ఎప్పుడైతే మనం బాదం పప్పులను 12 గంటల పాటు నానాబెడితే..ఫైటిక్ ఆమ్లం పరిమాణం 50 శాతం వరకు గణనీయంగా తగ్గుతుందట. తద్వారా బంధింపబడే ఉండే ఖనిజాల లభ్యత సులభం అవుతుందట. అంటే నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లంలో గట్టిగా బంధిపబడి ఉన్న కీలకమైన ఖనిజాలన్ని శరీరానికి సమృద్ధిగా అందుతాయి. ఇలా నానబెట్టడం శరీరానికి కావాల్సిన ఇనుము సులభంగా అందుతుందని పరిశోధనల్లో తేలింది. నానబెట్టడం వల్ల దానిలోని పోషకాలు, ఖనిజాలను సులభంగా శోషించుకునే శాతం మెరుగ్గా ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేగాదు నానబెట్టడం వల్ల గింజలు ఉత్తేజితమై..మెలకెత్తే ప్రక్రియను ప్రారంభించే ఎంజైములు సైతం యాక్టివ్ అవుతాయట. దీని వల్ల బి విటమిన్ పరిమాణం పెరుగుతుందట. అంటే ఇలా అన్ని గంటల పాటు నానడం వల్ల బాదం పప్పులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు నేరుగా అందేలా సులభంగా జీర్ణం అవుతుంది. పైగా మన శరీరానికి అన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. అదే అలానే బాదం పప్పులు గట్టిగానే తినేస్తే..శరీరం జీర్ణం చేసుకోవడానికి ఇబ్బందిపడటమే కాకుండా..దానిలో ఉన్న ప్రోటీన్లు మన శరీరానికి అందవని, పైగా ఇతరత్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. సుమారు 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టే సమయం పెరిగే కొద్ది ఎంజైమ్ క్రియాశీలత, పోషకాల లభ్యత క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. నానబెట్టిన తర్వాత పూర్తిగా కడగడం వల్ల ఎంజైమ్ల నిరోధకం అయిన ఫైటిక్ అమ్లం పూర్తిగా తొలిగిపోతుందని చెబుతున్నారు. కాబట్టి నానబెట్టే బాదం గింజలు తినడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.(చదవండి: ఎర్ర జామ వర్సెస్ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?) -
'పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ అంటే..?
అది కీలకమైన మెదడు కణమైనా.... లేదా కాళ్లూ చేతుల్లో ఉండే మామూలు కణమైనా... అది ఏదైనా సరే... దేహంలోని ప్రతి జీవకణానికీఆహారం, ఆక్సిజన్ అందడం అవసరం. ఒకవేళ అలా అందకపోతే... కీలకమైన మెదడూ, గుండె లాంటి వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో... మనం అంత ప్రధానం అనుకోని మిగతా కణజాలానికీ అలాంటి ప్రమాదమే జరుగుతుంది. అంటే... కాళ్లూ, చేతుల విషయంలోనూ జరుగుతుంది. అలా కణజాలానికి తగినంత ఆక్సిజన్, ఆహారం అందనందువల్ల వచ్చే అనారోగ్యం... ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’. ఈ సమస్య ఏమిటో, దానితో వాటిల్లో అనర్థాలేమిటో చూద్దాం...మన కాళ్లూ, చేతుల్లోని ప్రతి కణానికీ రక్త సరఫరా నిరంతరాయం జరుగుతూనే ఉండాలి. అలా జరిగినప్పుడే అవి సమర్థంగా తమ విధులు నిర్వహించగలుగుతాయి. ఏదైనా కారణాల వల్ల మన కాళ్లూ, చేతులకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడటంగానీ లేదా వాటిల్లో కొవ్వు పేరుకోవడంగానీ జరిగితే... నిరంతరమూ కొనసాగాల్సిన రక్తసరఫరా సాఫీగా జరగకపోవచ్చు. అలా రక్తసరఫరా జరగనందువల్ల వచ్చే ఆరోగ్య సమస్యను ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ (ప్యాడ్) అంటారు. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే ఈ వ్యాధి స్త్రీలూ, పురుషులూ అనే తేడాలేకుండా అందరిలో కనిపించే అవకాశముంది. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీస్ ఉన్నవారిలో కాళ్లలోని పిక్కలు, నడుం కింది భాగం (హిప్)లో తరచూ తీవ్రమైన నొప్పితో కూడిన తిమ్మిర్లు (క్రాంప్స్) వస్తాయి. చాలా సందర్భాల్లో నడుస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ లక్షణం... అంటే పిక్కలు పట్టేయడం ఎక్కువగా కనిపింవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా కనిపించవచ్చు. అంటే ఆ సమయంలో కాలూ, చేతిలోని సదరు భాగానికి తగినంత రక్తసరఫరా అందకపోవడం వల్లనే ఇలా తిమ్మిర్లు వచ్చే అవకాశాముంది. ఇలాంటప్పుడు ఆ భాగానికి వీలైనంత విశ్రాంతి ఇవ్వగానే ఆ నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. కొందరిలో తాత్కాలికంగా స్పర్శ తెలియకుండా పోవడం (నంబ్నెస్) లేదా సూదులతో పొట్లుగా అనిపించడం (టింజ్లింగ్). మరికొందరిలో ఒక్కోసారి ఆ కాలు లేదా చేయి బలహీనంగా మారినట్లుగా అనిపించవచ్చు. ఇంకొందరిలో విశ్రాంతిగా ఉన్నప్పుడు పాదాలకింద మంటగా ఉన్నట్లుగా లేదా పాదాలు, కాలివేళ్ల కింది భాగంలో నొప్పిగానూ, మంటగానూ ఉన్నట్లు అనిపించడం. ఇక కొందరిలో పాదాలకు లేదా కాలి కింది భాగంలో ఏదైనా పుండు వంటిది వస్తే అది ఒక పట్టాన మానకపోచ్చు.పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీస్ తర్వాతి దశలో కాలు/చేయి తాలూకు రంగు మారడం, అది చల్లబారినట్లుగా ఉండటం మామూలే. ఈ దశలో కొంతమందిలో కాలు /చేతి పైన ఉండే వెంట్రుకలన్నీ రాలిపో ఇక రక్తసరఫరాకు పూర్తిగా ఆటంకం ఏర్పడి గ్యాంగ్రీన్లా పరిణమించిన కొందరిలో... కాలు / చేయి తొలగించాల్సిన (యాంప్యుటేషన్కు వెళ్లాల్సినంత) తీవ్రమైన పరిస్థితి కూడా రావచ్చు.గుండె జబ్బులకూ/ స్ట్రోక్కూ అవకాశం:పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉందంటే అది కేవలం కాలూ, చేతికే పరిమితం అవుతుందనేందుకు వీల్లేదు. అంటే... ఎవరిలోనైనా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉందంటే ఆ వ్యక్తిలో రక్తం సాఫీగా ప్రవహించేలాంటి తత్వం (టెండెన్సీ) లేదని అర్థం. ఇది కాళ్లూ, చేతుల్లోనే ఉంటే తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ కీలకమైన అవయవాలైన గుండె లేదా మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అదెంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్నవారికి గుండెపో పక్షవాతం ముప్పుండే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ ఆరోగ్య సమస్య ఉన్నవారు తమ ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో వారు సూచించిన విధంగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నిర్థారణ: ఫిజికల్గా బయటకు కనిపించే లక్షణాలతోపాటు... ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ను నిర్ధారణ చేయడానికి ‘యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్’ (ఏబీఐ) అనే పరీక్ష తోడ్పడుతుంది. ఇందులో ఎంతమాత్రమూ నొప్పి ఉండదు. ఈ పరీక్షలో అల్ట్రా సౌండ్ తరంగాల సహాయంతో భుజాలు / పాదాలు ఉండాల్సిన రక్తపోటునుకొలుస్తారు. ఈ ఏబీఐ పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలనూ, వ్యాధి ఉందని అనుమానిస్తున్న వ్యక్తిలోని రిస్క్ ఫ్యాక్టర్లనూ సరిపోల్చి చూస్తారు. ఈ పరిశీలన తర్వాత... వ్యాధి నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా, లేదా అన్న విషయాన్ని ఫిజీషియన్ నిర్ణయిస్తారు. ఏబీఐ టెస్ట్లో... మొదట భుజం లేదా చేతిలోని రక్తపోటు (బ్లడ్ ప్రెషర్)ను... మామూలు బీపీ యంత్రంలో కొలవడంతోపాటు, డాప్లర్ అని పిలిచే ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్ స్టెతస్కోపు సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ వ్యాధినిర్థారణ కోసం శరీరంపై గాటు పెట్టకుండా కూడా నిర్ధారణ చేసే (నాన్ ఇన్వేజివ్) పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇమేజింగ్ టెక్నిక్స్ సహాయంతో ఈ నిర్ధారణ ప్రక్రియ జరుగుతుంది. ఉదాహరణకు... మాగ్నెటిక్ రిజోనెన్స్ యాంజియోగ్రఫీ (ఎమ్మార్ఏ), సీటీ యాంజియోగ్రఫీ వంటి ఇమేజింగ్ టెక్నిక్స్ వంటి పరీక్షలు ఈ వ్యాధినిర్ధారణకు తోడ్పడతాయి.ఈ వ్యాధి ఎవరెవరిలోనంటే.. వయసు యాభై ఏళ్లు పైబడ్డ ఏ వ్యక్తిలోనైనా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అయితే పెరిగే వయసు(ఏజింగ్)తోపాటు మరికొన్ని అంశాలూ ఈ వ్యాధికి కారణమవుతుంటాయి. అవి... పొగతాగే అలవాటు ఉండటం ∙వ్యాయామం చేయకపోవడం స్థూలకాయం ∙డయాబెటిస్ ∙నియంత్రణలో లేని రక్తపోటు / రక్తపోటు పెరగడం రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువగా ఉండటం ఈ లక్షణాలతో పాటు కుటుంబ సభ్యుల్లో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉండటం అనేది ఆ ముప్పును మరింత పెంచే అంశం. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులకూ ‘ప్యాడ్’ రిస్క్ ఉందనే అంశాన్ని గుర్తెరిగి... దగ్గరి కుటుంబ సభ్యులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కారణాలు...పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కు అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది... రక్తనాళాల్లోపల రక్తం ప్రవహించే పైప్ లోపలి పొర గట్టిబారడం. ఈ కండిషన్ను అథెరోస్కీఫ్లోరోసిస్ అంటారు. నునుపుగా ఉండే తలం మీద ద్రవం ఎలాంటి అంతరాయమూ లేకుండా సాఫీగా జారిపోతుంటుంది. ఒకవేళ ఆ తలం గరుగ్గానూ, గట్టిబారినట్లుగా మారడం వల్ల రక్తసరఫరా సాఫీగా జరగదు. దాంతో రక్తసరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఇలా రక్తనాళంలోని లోపలి తలం గరుగ్గా, గట్టిబారినట్లుగా మారడానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి రక్తప్రవాహం సాఫీగా వెళ్లే ఆ పైప్లోపలి తలంపై అంటుకుని అక్కడ గారలా ఏర్పడటం వల్ల రక్తప్రవాహానికి అంతరాయాలు, అడ్డంకులు ఏర్పడవచ్చు. దాంతో ఒకచోట క్రమంగా రక్తానికి ఏదైనా తట్టుకుంటూ తట్టుకుంటూ ఉండటం వల్ల క్రమంగా అక్కడ రక్తం గడ్డకట్టినట్లుగా ఓ ఉండలాగా (క్లాట్స్) ఏర్పడవచ్చు. ఇది ఒక్కోసారి రక్తనాళాన్ని బ్లాక్ చేసి రక్తసరఫరాను అపేయవచ్చు.చికిత్సపెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కు చికిత్స చేసే ముందర బాధితుల ఫిట్నెస్, వ్యాధి తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కేవలం బాధితుడి జీవనశైలిలో మార్పులు చేయడంతోనే వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశముంది.ఉదాహరణకు బాధితుడికి పొగతాగే అలవాటు ఉంటే, పూర్తిగా మానేయడం ద్వారా మున్ముందు కాలూ / చేయి కోల్పోయే పరిస్థితి తప్పిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులతో పాటు, వ్యాధి మరింత ముదరకుండా కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు మూసుకుపోయిన చోట వాటిని తెరచేందుకు అవసరమైన చికిత్స ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది.వాడాల్సిన మందులురక్తనాళాలు మూసుకుపోవడం అన్నది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల జరుగుతుంటే దేహంలో కొలెస్ట్రాల్ మోతాదులను నియంత్రించడానికి అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో కాలు /చేయి తిమ్మిర్లు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కూడా మందులు వాడాల్సి రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లో ఏర్పడ్డ రక్తపు గడ్డ (క్లాట్)ను కరిగించే మందులూ ఉపయోగించాల్సి రావచ్చు. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు బాధితులకు రక్తపోటును నియంత్రించే మందులు కూడా వాడాల్సి రావచ్చు.ఒకవేళ జీవనశైలి మార్పులూ... మందులూ సరిపోకపోతే?కొందరిలో కేవలం జీవనశైలి మార్పులతోనూ లేదా మందులు వాడటం వల్ల గాని ఈ జబ్బు అదుపులోకి రాకపోతే అప్పుడు కూడా రక్తనాళాల్లో రక్తసరఫరాను సాఫీగా జరిగేలా చూడటానికి అనేక ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... ఎక్కడైతే రక్తసరఫరాకు అడ్డంకి ఏర్పడి... తట్టుకుంటూ రక్తసరఫరా జరుగుతుంటుందో ఆ ప్రాంతాన్ని అక్కడికక్కడే తెరచి సాధారణ రక్తసరఫరాను పునరుద్ధరించవచ్చు. ఇప్పుడు ఈ ప్రక్రియను గతంలోలా సంప్రదాయిక సర్జరీ రూపంలోగాక ఎలాంటి గాటూ లేకుండానే కొన్ని ప్రక్రియల ద్వారా చేయడమిప్పుడు సాధ్యమవుతుంది.గాటు పెట్టకుండా రక్తప్రవాహాన్ని సరిచేయడం ఇలా...రక్తప్రవాహానికి అడ్డుపడ్డ క్లాట్ను తొలగించి, రక్తసరఫరాను పునరుద్ధరించడానికి ఈ కింది పద్ధతులను అవలంబిస్తారు. యాంజియోప్లాస్టీ : గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డు పడ్డప్పుడు చేసినట్లుగానే కాళ్లూ/ చేతుల తాలూకు రక్తనాళంలోనూ... అడ్డు పడ్డ ప్రాంతానికి ఒక బెలూన్ లాంటి దాన్ని పంపి... ఆ బెలూన్ను రక్తం ఆగిన చోట ఉబ్బేలా చేస్తారు. దాంతో రక్తనాళంలోని ఆ ప్రదేశంలో అడ్డు తొలగిపోయి, రక్తసరఫరా మామూలుగా అవుతుంది.అథెరెక్టమీ: ఈ ప్రక్రియలో రక్తనాళం (ధమని)లోకి ఒక క్యాథెటర్ను పంపుతారు. రక్తనాళంలోకి వెళ్లే ఒక నునుపైన పైప్ లాంటి దాన్ని క్యాథెటర్ అంటారు. దీని ద్వారా రక్తనాళం లోపలి ఉన్న గారను తొలగిస్తారు. గట్టిగా మారి ఉన్న ప్రాంతాన్ని నున్నగా అయ్యేలా చేయడం, లేదా షేవ్ చేసినట్లుగా నునుపుగా మార్చడం జరుగుతుంది.స్టెంట్ వేయడం: గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళం సన్నబడ్డప్పుడు ఆ సన్నటి ప్రాంతాన్ని మళ్లీ మామూలుగానే తెరుచుకుని ఉంచేలా చేస్తారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి పైప్ లాంటి దాన్ని వేసి తెరచి ఉండేలా చేసినట్లే (స్టెంట్ వేసినట్లే)... అచ్చం అదే తరహాలో కాలు / చేతిలోని రక్తనాళాల్లోని మూసుకుపోయి ఉన్నభాగానికి ఒక స్టెంట్ వేస్తారు. దాంతో మూసుకుపోయిన భాగం తెరచుకుంటుంది. ఫలితంగా ఎలాంటి అంతరాయం లేకుండా రక్తసరఫరా సాఫీగా జరిగిపోతుంది. స్టెంట్ గ్రాఫ్ట్స్: కొన్ని సందర్భాల్లో ఈ స్టెంట్లలో సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటిదాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కేవలం ఇలాంటి మార్గాలే కాకుండా కొన్నిసార్లు సాంప్రదాయికంగా చేసే శస్త్రచికిత్స ద్వారా రక్తనాళంలో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించాల్సి రావచ్చు. ఒక్కోసారి రక్తనాళం అంతా మూసుకుపోతే బైపాస్ కూడా చేయాల్సి రావచ్చు. వ్యాయామం లేకుండా ఉండటం వంటి బద్ధకంగా ఉండే జీవనశైలి, పొగతాగడం వంటి దురలవాట్ల కంటే మన దేహంలోని అవయవాలు విలువైనవి కాబట్టి... అలాంటి దురలవాట్లను వదులుకొని, చురుకైన జీవితం గడపడం అవసరం. దాంతో ఎవరిపైనా ఆధారపడకుండా జీవనం సాగించవచ్చు.డాక్టర్ రాజా వి కొప్పాల సీనియర్ ఇంటర్వెన్షనల్ , రేడియాలజిస్ట్నిర్వహణ: యాసీన్చదవండి: అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా 47 ఏళ్ల మామ్..! నో ఐస్ బాత్, నో క్రేజీ డిటాక్స్.. -
ఎర్ర జామ వర్సెస్ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?
సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభించే ఫ్రూట్.. జామ (Guava). ఇందులో విటమిన్ సీ తోపాటు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, సాధారణంగా మార్కెట్లలో మనకు తరచుగా రెండు రకాల జామకాయలు కనిపిస్తుంటాయి. ఒక రకానికి చెందినవి తెల్లగా ఉంటే, మరొకటి ఎర్రగా ఉంటుంది. ఈ తెల్ల జామ, ఎర్ర జామలు రెండూ పోషకాలతో నిండి ఉన్నప్పటికీ టేస్ట్, న్యూట్రిషన్ వాల్యూ, హెల్త్ బెనిఫిట్స్లో కాస్త విభిన్నంగా ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏది మంచిది, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ మాటల్లో తెలుసుకుందామా.!.ఎర్ర జామ, తెల్ల జామ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే ఎర్ర జామలో నీటి శాతం ఎక్కువ, చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. తెల్ల జామలో విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. మధుమేహం (షుగర్) ఉన్నవారికి బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర జామ కొంత మేలు చేస్తుంది. రెండింటిని పోల్చి చూస్తే..తెల్ల జామకాయతెల్ల జామ ఎక్కువ తియ్యగా, రుచిగా ఉంటుంది. దీంట్లో షుగర్, స్టార్చ్, గింజల పరిమాణం అధికంగా ఉంటుంది. ఈ తెల్ల జామలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తెల్ల జామను తింటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజేషన్ మెరుగై బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. బ్లడ్లో షుగర్ లెవల్స్ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మహిళలకు తెల్ల జామతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మ కణాలకు హైడ్రేషన్ని పెంచి తాజాగా ఉండేలా చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి ఈ వ్యాధి ముప్పుని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్త పరంగా తెల్లజామకాయ బెస్ట్ అని చెబుతున్నారు ఆదర్శ గౌడ. డయాబెటిస్ పేషెంట్లకు ఎర్రజామ మేలు..ఎర్ర జామకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తెల్ల జామతో పోలిస్తే షుగర్, స్టార్చ్, విటమిన్ C కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఈ ఎర్రజామలో గింజలు అంత ఎక్కువగా ఉండవు. లైకోపీన్ వంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, కెరోటినాయిడ్ల కారణంగా దీనిలోని గుజ్జుకి ఎరుపు రంగు వస్తుంది. ఇందులో లైకోపీన్ ఎక్కువగా ఉండటంతో గుండెకు రక్షణగా నిలుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ A, ఒమేగా-3, ఒమేగా- 6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్తో నిండి ఉండటంతో డైజేషన్ మెరుగై వెయిట్ మేనేజ్మెంట్కు తోడ్పడుతుంది. ఇందులో చక్కెర కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు మంచిది.అయితే రక్తంలో చక్కెరను తగ్గించే మందులు తీసుకుంటుంటే జామకాయను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత వెంటనే జామ పండ్లు తినకూడదు. ఎందుకంటే జామ తినడం వల్ల రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. దీంతో గాయం మానడం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు ఆదర్శ గౌడ .(చదవండి: Health Benefits of Cucumber : పరగడుపునే కీరా తినొచ్చా..!?) -
వామ్మో.. థైరాయిడ్! కీళ్ల నొప్పులు, డిప్రెషన్..
కొద్దిగా పని చేసినా నిస్సత్తువ ఆవహించడం, చిన్న విషయాలకే కోపం రావడం, ముఖం ఉబ్బుగా కనిపించడం, చర్మం పొడిబారడటం, కీళ్ల నొప్పులు వేధించడం, ఊబకాయం రావడం, అకస్మాత్తుగా సన్నబడటం వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఓసారి పరీక్షించుకోండంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ప్రతి పది మందిలో ఒకరికి థైరాయిడ్ వ్యాధి వేధిస్తోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారి శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ గ్రంథి పనిచేయకపోతే దేహంలోని ఇతర అవయవాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నేడు వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. ఈ లక్షణాలు కనిపిస్తే.. థైరాయిడ్లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్ థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. థైరాయిడ్ నోడ్యూల్స్, గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు), థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉన్నాయి. అలసట, బరువు పెరడగం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటివి హైపోౖథెరాయిడిజం లక్షణాలు, బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్ లేదా నోడ్యూల్స్ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. ఇలా కణితి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ అవసరం లేదు. క్యాన్సర్గా మారితేనే ఆపరేషన్ చేయించుకోవాలి. గడ్డలు ఏర్పడ్డ వారిలో 5 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్ కణితులు ఉంటాయి. వీరికి మాత్రమే ఆపరేషన్ చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది. కారణాలు.. థైరాయిడ్ సమస్యకు కారణాలు అనేకం. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. తద్వారా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. హైపోౖథెరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్ రుగ్మతలు, అయోడిన్ లోపం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీతో గానీ, కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథి వాపు వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం/ ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణం. అయోడిన్ లోపం గానీ, అధికంగా ఉన్నా దీని బారినపడతారు. నివారణ ఇలా.. థైరాయిడ్ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్ ఉప్పు) తీసుకోవాలి. వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోౖథెరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్ వంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, హైపర్ థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్ మందులు, రేడియో అయోడిన్ థెరపీ, శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారి శస్త్ర చికిత్స, కిమోథెరపీ గానీ రేడియేషన్ గానీ అవసరం కావచ్చు మహిళల్లోనే అధికం.. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత, రుతుక్రమం ఆగిన తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోౖథెరాయిడిజం, హైపర్ౖథెరాయిడిజం మాతా,శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జిల్లాలో థైరాయిడ్ బాధితులు అధికంగా ఉండటంతో ప్రతీ పీహెచ్సీలో థైరాయిడ్ పరీక్షలు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు.త్వరగా గుర్తిస్తే మేలు సమాజంలో 11 శాతం మందిలో హైపోౖథెరాయిడ్, రెండు శాతం మందిలో హైపర్ థైరాయిడ్ సమస్య ఉంది. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు రాకుండా చేయవచ్చు. జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ దల్లి సురేష్రెడ్డి, ఎండీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఇచ్ఛాపురంగర్భిణులు జాగ్రత్త.. థైరాయిడ్ సమస్య ఉన్న గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. పుట్టబోయే బిడ్డకు కూడా పరీక్ష చేయించాలి. థైరాయిడ్ ఉందంటే మందులు వాడాలి. లేకపోతే బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలు అధికం. – డాక్టర్ ఎ.రమ్యారెడ్డి, వైద్యాధికారి, ఈదుపురం మరిన్ని వివరాలకు ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి -
‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తాయ్ చి వాకింగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్రజలు కూడా ఈ వాకింగ్ చేసేందుకు అమితమైన ఆసక్తికనబరుస్తుండటం విశేషం. ఈ వాకింగ్ పొట్లలోని కొవ్వుని అమాంతం కరిగించేస్తుందని, బరువు తగ్గిపోతారంటూ తెగ ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు. ముఖ్యంగా పెద్దలకు, వృద్ధులకు చాలామంచిదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి తాయ్ చి వాకింగ్..?, దీని వల్ల నిజంగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.ఈ తాయ్ చి వాకింగ్ గురించి ముంబైకి చెందిన తాయ్ చి గురువు సెన్సాయి సందీప్ దేశాయ్ ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు. ఇది ఎలా చేస్తారు. దీని వల్ల కలిగే లాభలు ఏంటి వంటి వాటి గురించి తెలిపారు. తాయ్ చి వాకింగ్ అంటే..తాయ్ చి వాకింగ్ అనేది శరీరాన్ని నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కదిలించే ఒక విధమైన నడక పద్ధతి. దీనిలో సమతుల్యత, శరీర భంగిమ, సమన్వయం, కీళ్లపై అధిక భారం పడకుండా నియంత్రిత బరువు మార్పిడిపై ఫోకస్ పెడతూ చేసే వాకింగ్ అని చెప్పుకొచ్చారు సందీప్ దేశాయ్. తాయ్గా ఈ పిలిచే ఈ వర్కౌట్ యుద్ధ కళల సాధనలో ఒక భాగం అని అన్నారు. ఇది పూర్తిగా కదలికపై దృష్టి సారించే ఒక వ్యాయామం అని చెప్పారు. ఇటీవల కాలంలో దీనికి అమిత ఆదరణ పెరిగిందన్నారు. అయితే ఈ తాయ్ చి అనేది వేల సంవత్సరాల చైనా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంతర్గత యుద్ధ కళ, ఆరోగ్య వ్యాయామం కూడా. భారత్కి యోగా ఎలాగో అక్కడ చైనాలో ఈ తాయ్ చి అలా అని సందీప్ దేశాయ్ అన్నారు.ఎలా చేస్తారంటే..సరైన విధంగా నేర్చుకోవడం అనేది అత్యంత కీలకం. ఇది శరీర బరువుని మారుస్తూ జాగ్రత్తగా చేసే వ్యాయామం. ఒక కాలుపై శరీరం బరువు మోపుతూ నిదానంగా మరోక కాలు ఎత్తాలి. ఆ తర్వాత మెల్లగా గాల్లో ఉన్న ఆ పాదాన్ని మడంపై ఆనించి నెమ్మదిగా భూమిపై పూర్తిగా ఆనాలి. ఆ తర్వాత మరో కాలుని నెమ్మదిగా ఎత్తి ఈ పాదంపై శరీర బరువుని మోపాతూ.. కంటిన్యూ చేయాలి.వృద్ధులకు ఇది ఎందుకు మంచిదంటే..ఈ వాకింగ్ కాళ్లపై చాలా తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. సాధారణంగా వృద్ధులకు మోకాళ్ల నొప్పి, బిగువు లేదా నడుమునొప్పితో బాధపడేవారికి చాలా ముఖ్యం. శరీర బరువుని ఒక కాలు నుంచి మారుస్తూ తనను తాను మెరుగ్గా స్థిరపరుచుకునే ట్రైన్ చేస్తుంది. అలాగే స్లిప్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని నిటారుగా వంచడంలో ఉపకరిస్తుంది. పైగా ఇది మనస్సు, శరీరంపై ధ్యాస పెట్టి చేయాల్సిన వర్కౌట్కావడంతో ఏకాగ్రత మెరుగుపడుతుంది. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..హృదయ సంబంధ వ్యాధుల పరంగా చూస్తే, ఇది రక్త ప్రసరణ, శ్వాస, ఊపిరితిత్తుల పనితీరు తోడ్పడే తేలికపాటి ఏరోబిక్ కదలికలా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, నాడీ సంబంధిత సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఇది సమతుల్యమైన నడకను ప్రోత్సహిస్తుంది. అలాగే శరీరం-మనస్సు సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని డాక్టర్ పటేల్ నొక్కి చెప్పారు.ఇది అనారోగ్యం లేదా గాయం నుంచి కోలుకోవడాన్ని కూడా వేగవంతం చేస్తుంది. చాలా మంది అథ్లెట్లు, క్రీడాకారులు, యోగా సాధకులు, మార్షల్ ఆర్టిస్టులు మెరుగ్గా ఉండేలా, గాయాల బారి నుంచి రక్షించుకోవడానికి ఈ తాయ్ చి వాకింగ్ని చేస్తారని సెన్సాయి సందీప్ అన్నారు. అంతేగాదు శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారికి ఫిట్నెస్లోకి తిరిగి రావడానికి ఇది ఒక మంచి మార్గంగా పనిచేస్తుంది.బరువు తగ్గిస్తుందా అంటే..కేవలం ఏడు నిమిషాల తాయ్ చి మాత్రమే పొట్టలోని కొవ్వును అద్భుతంగా కరిగించకపోవచ్చు. పరుగు లేదా తీవ్రమైన కార్డియో వ్యాయామం లాగా ఇది అధిక కేలరీలను దహించే వ్యాయామం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనిని బరువు తగ్గడానికి ఒక షార్ట్కట్గా భావించడం సరైనది కాదని అంటున్నారు. కానీ పొట్టలోని కొవ్వును తగ్గించడానికి, కోర్ స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు, అధిక తీవ్రతతో కూడిన వర్కౌట్లు, నియంత్రిత కార్బోహైడ్రేట్లతో కూడిన సమతుల్యత, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కలయికతోనే బరువు తగ్గడం సాధ్యమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.తప్పక తెలుసుకోవాల్సినవి..తాయ్ చి వాకింగ్ని సరైన మార్గదర్శకత్వంలోనే చేయాలి లేదంటే కీళ అమరిక, జాయింట్ల మధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే కీళ్లవాతం లేదా వెన్నుముక సమస్యలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం. View this post on Instagram A post shared by Sensei Sandeep Desai (@taichiyogiindia)(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!) -
ఇలా చేస్తే 5 నెలల్లో 30 కిలోలు తగ్గవచ్చు !
బరువు తగ్గాలి..తగ్గాలి..అని ఊరికే జపం చేసినంత మాత్రాన సరిపోదు. దానికి నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం కృషి చేయాలి. ఒక్కోసారి ఈ ప్రయత్నాన్ని సుదీర్ఘం కాలం చేయాల్సి ఉంటుంది. తొందరపాటు అస్సలు పనికిరాదు. నాలుగు రోజు చేసి, సరైన ఫలితం రాలేదు అని నిరాశ పడి ఆ ప్రయత్నాన్ని వదిలేస్తే మరింత నిరాశ, ఒత్తిడి తప్పదు. ఇదే విషయాన్ని ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ ఆచరించి చూపించారు. పక్కా ప్లాన్తో క్రమశిక్షణతో, ఓపిగ్గా ప్రయత్నించి 30 కిలోల బరువు తగ్గారు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే చాలా మంది విఫలం కావడానికి కారణం క్రమశిక్షణ లేకపోవడం కాదు; మొదలుపెట్టడమే చాలా కఠినంగా, అతి వేగంగా మొదలుపెట్టి, శరీరం మారే లోపే అలసిపోయి ఆపేయడమే అంటారు అంచని సచన్. అంతేకాదు క్రమశిక్షణ లేకపోవడం వల్ల విఫలం కారు ప్లాన్ లేకుండా తొందర పాటుతో ఫశ్రీయిల్ అవతారు అంటారామె. చాలా కఠినంగా, వేగంగా ప్రారంభించడం వల్ల, వారి శరీరంలో మార్పు రావడానికి అవకాశం కూడా రాకముందే అలసిపోతారని వివరించారు.ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ స్వయంగా 30 కిలోల అధికబరువును తగ్గించుకుంది. ఇందుకోసం ఆమె అందరిలా కఠినమైనది కాదు. ఎలాంటి నరకం చూపించే పరుగు పందాలు, గంటల కొద్దీ జిమ్ వర్కవుట్లు ఇందులో లేవు.ఆమె 84 కేజీల నుండి 54 కేజీల దాకా, అంటే 30 కిలోగ్రాములు తగ్గింది. అంజలిబరువును ఆ స్థాయికి చేర్చిన దినచర్య సాధారణమైనది కాదు. మీరి ముఖ్యంగా వెయట్ లాస్ జర్నీలో కఠినమైన స్ప్రింట్లు లేవు. రెండు గంటల జిమ్ సెషన్లు లేవు.ఒకే ఒక సూత్రాన్ని నమ్ముకుంది. ప్రస్తుతం ఉన్న స్థితిని గౌరవిస్తూనే, పక్కా ప్లాన్, క్రమబద్ధమైన కార్డియోతో ఫలితం సాధించింది. ఇందుకోసం తాను పాటించిన ప్లాన్తో తన అభిమానులతో పంచుకున్నారు.చాలా చిన్నగా ప్రారంభించండి: అంజలి మొదటి దశలో రోజుకు కేవలం 4,000 అడుగులతో ప్రారంభించాలని చెబుతారు. ప్రతిరోజూ "కనీసం 10,000 అడుగులు నడవాలి" అనే మాటలు వినేవారికి ఇది చాలా తక్కువగా అనిపించవచ్చు. కానీ ఆమె లాజిక్ ఏంటంటే—శరీరంపై ఎక్కువ బరువు ఉన్నప్పుడు, మీ కీళ్లు , నరాలు ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాయి. కాబట్టి మొదట్లోనే ఎక్కువ భారం వేయకూడదు. క్రమంగా ఈ అడుగుల సంఖ్యను పెంచుకుంటూ పోవాలని ఆమె చెబుతారు.వేగం పెంచే ముందు బలాన్ని పెంచుకోండిఫేజ్ 2 (రెండవ దశ): రోజుకు 8,000 అడుగులు + వారానికి ఒక 'జోన్ 2 కార్డియో' సెషన్ ( ఆయాసపడకుండా, హాయిగా మాట్లాడుతూ).ఫేజ్ 3: 10,000–12,000 అడుగులు + వారానికి రెండు జోన్ 2 సెషన్లు.ఫేజ్ 4: 15,000 అడుగులు.ఫేజ్ 5 : 20,000 అడుగులు + వారానికి రెండు నుండి మూడు సెషన్లు.ఈ పద్ధతి ఎందుకు పనిచేస్తుందంటే, ఒక దశ పూర్తయ్యాకే తర్వాతి దశకు వెళ్తాం. అప్పటికే కీళ్లు బలంగా మారతాయి, అలసట నుండి శరీరం త్వరగా కోలుకుంటుంది. అంటే శరీరానికి కొన్ని రోజుల సమయం కాకుండా, కొన్ని నెలల సమయం ఇవ్వడం వల్ల అది ఎక్కువ శ్రమను తట్టుకోగలుగుతుంది.అందరూ మర్చిపోయే ముఖ్యమైన విషయంఫిట్నెస్ ప్రపంచంలో చాలా మంది దాచేసే ఒక నిజాన్ని అంజలి స్పష్టం చేశారు. "కేవలం కార్డియో చేయడం వల్లే బరువు తగ్గరు. క్యాలరీల లోటు (Calorie Deficit) వల్ల మాత్రమే బరువు తగ్గుతారు." కార్డియో అనేది ఖర్చు చేసే శక్తిని పెంచి, ఆ క్యాలరీల లోటును బ్యాలెన్స్ చేయడానికి సహాయపడే ఒక సాధనం (Tool) మాత్రమే, అదే పూర్తి పరిష్కారం కాదు అంటూ తన అనుభవాలను షేర్ చేశారు.నోట్ : కార్డియోనే సర్వస్వం అనుకునేవారు బరువు తగ్గకపోగా త్వరగా అలసిపోయి నిరాశకు గురవుతారు. కానీ ఆహారం, నిద్ర, కోలుకునే సమయంతో పాటు కార్డియోను కూడా ఒక భాగంగా చూసేవారే ఆరు నెలల తర్వాత కూడా ఆరోగ్యంగా మనగలుగుతారు. 30 కిలోల బరువు అనేది ఒకే రాత్రిలో తగ్గింది కాదు; ఓపికగా, క్రమంగా, స్థిరమైన అడుగులతో సాధించిన విజయం అనేది గుర్తించాలి. -
సంజీవనిగా పిలిచే మల్టీవిటమిన్ మొక్క గురించి తెలుసా..!
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఒకే మొక్కలో లభిస్తే.. దానిని సంజీవని అనవచ్చేమో. ‘చక్రముని ఆకు’ మొక్క అలాంటిదే అంటున్నారు ఔషధ, సుగంధ మొక్కల పరిశోధన కేంద్రం (సిమ్యాప్) శాస్త్రవేత్తలు. దీని శాస్త్రీయనామం ‘సారోపస్ ఆండ్రోజినస్’ కాగా.. మల్టీవిటమిన్ మొక్క అని కూడా పిలుస్తారు. ఇటీవల మన భాగ్యనగరం హబ్సిగూడలోని ఎన్జీఆర్ఐలో జరిగిన ప్రదర్శనలో ఈ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మొక్క వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఈ మొక్క ఆకుల్లో ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఇనుము, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పరిమితంగా, ఉడికించిన తర్వాతే తినాలి. కరివేపాకు మాదిరిగా ఆకులను వంటల్లో వేసుకోవచ్చు’’ అని పరిశోధకులు చెబుతున్నారు.ఆయుర్వేదంలో దీని ప్రత్యేకత..చక్రముని శాస్త్రీయ నామం నామసురోపస్ ఆండ్రోజినస్. ఆయుర్వేదం ప్రకారం.. ఇది ఇతర మొక్కల కంటే ఎంతో భిన్నమైనది. దీని ఆకులు స్వల్ప తీపి, వెచ్చని గుణాన్ని కలిగి ఉండి, శరీరంలోని వాత, కఫాలను సమతుల్యం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీన్ని సులభంగా చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చని చెప్పారు.ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..విటమిన్ ఏ, బీ, సీ, కాల్షియం, ఐరన్లకు దీన్ని సహజ వనరుగా చెబుతారు నిపుణులుదీని ఆకులను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, జీర్ణ ఎంజైమ్లు వేగంగా విడుదలయ్యి జీర్ణక్రియ బలపడుతుందన్నారు.రక్తహీనతతో బాధపడేవారికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.ఇది శరీరంలో విటమిన్ లోపాలను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ఊపిరితిత్తుల సమస్యలను, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది.ఇందులో కొవ్వు, కేలరీలు చాలా తక్కువ. ఇది ఆకలిని నియంత్రించడమే కాకుండా శరీరానికి పూర్తి పోషణను అందిస్తుందన్నారు.మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు.అంతేగాదండోయ్ ఈ మొక్కను హైదరాబాద్, బోడుప్పల్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) కేంద్రంలో రూ.20కే విక్రయిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యంగా తక్కువ ధరకు వెచ్చింది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుదామా..!.(చదవండి: Health Benefits of Cucumber : పరగడుపునే కీరా తినొచ్చా..!?) -
ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్కట్, నో స్ట్రిక్ట్ డైట్
బరువు తగ్గడం అనగానే కఠినమైన వ్యాయామాలు, స్ట్రిక్ట డైట్నే ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఇలా ఎప్పుడైతే శరీరాన్ని ఒకేసారి కష్టపెడతామో అదికాస్తా సహకరించడానికి బదులుగా వ్యతిరేకించడం మొదలుపెడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం దేవుడెరుగు మొత్తానికి మరిన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వుతాయని అంటోంది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. చిన్నచిన్న మార్పులే అద్భుతం చేస్తాయని..త్వరిగతిన బరువు తగ్గుతామని అంటున్నారామె. అదెలాగంటే..ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ కేవలం ఐదు నెలల్లో 30 కేజీలు తగ్గారు. అందుకోసం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. నిజానికి కఠినమైన వ్యాయామాలు, డైట్లు త్వరిగతగతిన అలిసిపోయేలా చేసి, బరువు తగ్గడాన్న మధ్యలోనే వదిలేస్తారని చెబుతోందామె. అదే చిన్నగా శరీరం అలవాటుపడేలా నెమ్మదిగా పెంచుకుంటూ పోతే అద్భుతమైన ఫలితాలు పొందుతామని అంటోంది. తానేమి కఠినమైన డైట్లు, రెండు గంటల జిమ్ సెషన్లు వంటివి చేయలేదన్నారామె. తాను అనుసరించిన విధానం అందరు చూసి నవ్వేలా, సిగ్గుపడేంతగా మొదలైందని చెబుతోంది. అంటే అంతా రోజూ పదివేల అడుగులతో దినచర్య మొదలుపెడితే, తానే కేవలం 4000 అడుగులతో తన వెయిట్లాస్ని మొదలుపెట్టానని అంటోంది. ఎందుకంటే అధిక బరువు ఉన్నవాళ్లకు ప్రారంభంలోనే అధిక వర్కౌట్లు సమస్యాత్మకమవుతాయని అంటోందామె. శరీరం మనం చేసే వ్యాయామాలకు అలవాటుపడుతుందనగా, నెమ్మదిగా, నిధానంగా వర్కౌట్లు, అడుగులు పెంచాలని సూచిస్తోంది. ఇక్కడ లక్ష్యం కేవలం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం కాదని అంటోంది. అలాగే ఆయాసం, శ్రమతో కూడిన విధంగా వర్కౌట్లు చేయొద్దని అంటున్నారు. సంతోషంగా ఎంజాయ్ చేసేలా మొదలుపెట్టండి, బాడీ అలవాటు పడుతుందనగా చిన్నగా కార్డియోసెషన్ వంటి వేగవంతమైనవి మొదలు పెట్టమని అంటోంది. అలా చేయడం వల్ల కీళ్లు మరింత బలపడతాయి, తెలియకుండానే ఆ వర్కౌట్లకు అలవాటుపడేలా కోలుకుంటారు. అదీగాక భారాన్ని తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. నెమ్మదగా దశల వారీగా సాగే ప్రక్రియని, రాత్రికి రాత్రే జరిగేది కానీ తేల్చి చెప్పారామె. కేవలం స్థిరంగా నిదానంగా, ఓపికతో చేస్తుకుంటూ వెళ్తే..అనుకున్నది సాధ్యమవుతుందని చెబుతోందామె. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_) (చదవండి: 40 డిగ్గ్రీల ఉష్ణోగ్రతల్లో సైతం ఇళ్లను కూల్గా..! ఆ ఐడియాకు ఆనంద్ మహీంద్రా ఫిదా) -
పికా అంటే..? పిల్లలకు ఇది ప్రాణాంతకమా...?
మా బాబుకు మూడు నెలలు. ఊయల నుంచి కింద పడిపోయాడు. ఐదు నిమిషాల పాటు ఏడ్చి, ఒకసారి వాంతి చేసి తర్వాత పడుకున్నాడు. డాక్టర్కు చూపించాలా? అలాగే, పిల్లలు ఇలా పడిపోతే, మొదట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సునీత, విజయవాడచిన్న పిల్లలు మంచం నుంచి, ఊయల నుంచి తల్లిదండ్రుల చేతుల నుంచి జారి కింద పడటం సాధారణంగా జరుగుతుంటుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ, నడక నేర్చుకునే సమయంలో సోఫాల మీద నుంచి పడటం, మెట్ల మీద నుంచి జారిపడటం వంటి ఘటనలు కూడా కనిపిస్తాయి. అయితే, తలకు తగిలిన గాయం తీవ్రతను బట్టి, భవిష్యత్తులో ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. గాయం తీవ్రమైతే పిల్లల ఎదుగుదల, గుర్తుపట్టడం, కంటి చూపు, మాట, నడక వంటి అంశాలపై ప్రభావం పడవచ్చు. చిన్న గాయం అయినా కూడా కొంతవరకు మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన లక్షణాలు గమనించాలి. పిల్లలు ఆపకుండా ఏడవడం ఫిట్స్ రావడం స్పృహ కోల్పోవడం చేతులు కాళ్లు సరిగా పనిచేయక పోవడం ముక్కు లేదా చెవి నుంచి రక్తం కారడం పదేపదే వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే సీటీ స్కాన్ చేసి మెదడులో ఏమైనా రక్తస్రావం లేదా ఎముక సమస్యలు ఉన్నాయా అని చూస్తారు. పరిస్థితిని బట్టి న్యూరో సర్జన్ సలహా తీసుకుని చికిత్స చేస్తారు. అయితే తలకు గాయాలు చాలా వరకు నివారించవచ్చు. తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తైన భవనాల్లో ఉంటే బాల్కనీలకు సేఫ్టీ నెట్స్ ఏర్పాటు చేయాలి. బాల్కనీలో కుర్చీలు లేదా స్టూల్స్ ఉంచకూడదు. చిన్నపిల్లలను మంచంపై ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తపడాలి. అవసరమైతే మంచం పక్కన కింద బెడ్ లేదా మృదువైన పరుపు వేసి పడుకోబెట్టడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను పూర్తిగా తగ్గించుకోవచ్చు. పిల్లల భద్రత కోసం ముందుగానే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మా బాబుకు రెండేళ్లు. ఈ మధ్య చాలా తెల్లగా కనిపిస్తున్నాడు, త్వరగా అలసిపోతున్నాడు, ఆకలి కూడా తగ్గింది. కొన్నిసార్లు మట్టి తినాలని చూస్తున్నాడు. ఇది ఏమైనా సమస్యా?– శైలజ, ఒంగోలుపిల్లల్లో సాధారణంగా తెల్లగా లేదా పాలిపోయినట్లు కనిపించడం, త్వరగా అలసిపోవడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది పిల్లలు మట్టి, సున్నం వంటి వాటిని తినాలని కూడా ప్రయత్నిస్తారు. దీన్ని పికా అంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి డాక్టర్ను చూపించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ , ఐరన్ లెవల్స్ చెక్ చేస్తారు. పిల్లల్లో ఐరన్ లోపం అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారవ్వడానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ తగ్గిపోతే రక్తహీనత వస్తుంది. దీని వల్ల పిల్లల ఎదుగుదల, బరువు పెరుగుదల, మెదడు వికాసం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో చురుకుదనం తగ్గిపోవడం, చదువుపై దృష్టి తగ్గడం, చిరాకు ఎక్కువగా ఉండడం కూడా కనిపించవచ్చు. ఐరన్ లోపం రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. పిల్లలు తల్లి పాలు సరిగా తీసుకోకపోవడం, ఆరు నెలల తర్వాత ఇచ్చే అనుబంధ ఆహారంలో ఐరన్ తక్కువగా ఉండడం, ఒక సంవత్సరం దాటిన తర్వాత కూడా ఎక్కువగా ఆవు పాలు తాగించడం వల్ల ఈ సమస్య రావచ్చు. ఎక్కువ పాలు తాగడం వల్ల శరీరం ఐరన్ను సరిగా గ్రహించలేకపోతుంది. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు రావడం వల్ల కూడా ఐరన్ లోపం కనిపించవచ్చు. ఐరన్ లోపం ఉంటే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సిరప్స్ లేదా డ్రాప్స్ ఇస్తారు. ఈ మందులు కొంతకాలం రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు రెండు మూడు వారాల్లో పిల్లలు కాస్త బాగుపడగానే మందులు ఆపేస్తారు. కానీ డాక్టర్ చెప్పిన పూర్తి కాలం వరకు వాడటం చాలా ముఖ్యం. అప్పుడే శరీరంలో ఐరన్ నిల్వలు మళ్లీ సరిగ్గా పెరుగుతాయి. ఈ సమస్య నివారణ కోసం పిల్లలకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. ఆరు నెలల తర్వాత ఆకుకూరలు, బెల్లం, గుడ్డు, పప్పులు, రాగి జావ, మాంసం వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం చాలా మంచిది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నిమ్మరసం, కమలాపండు వంటి వాటితో పాటు ఐర పుష్కలంగా ఉన్న ఆహారం ఇస్తే శరీరానికి ఐరన్ ఇంకా బాగా అందుతుంది. మీ బాబుకి రెండేళ్లు కాబట్టి, సరైన ఆహారం, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా త్వరగా కోలుకుంటాడు. కాబట్టి ఆందోళన పడకుండా ఒకసారి పిల్లల వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. (చదవండి: హంటా రాలేదు..ఆందోళన వద్దు!) -
హంటా రాలేదు.. ఆందోళన వద్దు!
ఇటీవల హంటా వైరస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. గతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ అది విదేశాల్లోనే ఉందనీ, మన దేశంలోకి ప్రవేశించలేదని అన్నప్పటికీ... క్రమంగా అది విదేశాల నుంచి వచ్చిన ఒకరిద్దరితో మొదలై క్రమంగా దేశాన్నంతా చుట్టుముట్టింది. అదేలాంటి ఆందోళనే ఇప్పుడు దేశంలోని కొంతమందిలో మొదలైంది. అయితే ఇప్పటివరకు హాంటా వైరస్మనదేశంలోకి ప్రవేశించలేదు. భారతీయులిద్దరికి వచ్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ విదేశాల్లో ఒక డచ్ క్రుయిజ్ షిప్ మీద ఉన్న ఇద్దరు క్రూ మెంబర్లలో కనిపిందన్నది మాత్రమే న్యూస్. ఈ వైరస్కు సంబంధించినంత వరకు ప్రస్తుతానికి దేశమంతా సురక్షితమే. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హాంటా వైరస్ స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ గురించి ప్రాథమిక సమాచారం కోసం ఈ కథనం.హంటావైరస్ కారణంగా వచ్చే వ్యాధులు చాలా తీవ్రమైన అనారోగ్యాలతో పాటు కొంతవరకు మరణాలకూ కారణమవుతుంది. ఈ వైరస్ కుటుంబంలోని వైరస్లు ప్రధానంగా రెండు రకాల వ్యాధులకు కారణమవుతాయన్నది వైద్యుల మాట. వ్యాప్తికి కారకాలు: ఈ వైరస్ ప్రధానంగా ఎలుకలు. ఈ (ఎలుక / రోడెంట్) జాతికి చెందిన కొన్ని రకాల మూషిక జాతుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ దానివల్ల కలిగే వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా ఎలుకల మూత్రం, విసర్జనలతో పాటు వాటి లాలాజలంతో మనుషులకు కాంటాక్ట్ సంభవించినప్పుడు మానవుల్లో ఈ వైరస్ సోకుతుంది. అరుదుగా ఎలుక కరవడం లేదా గీరడం వల్ల కూడా వ్యాపించవచ్చు. ఇక మనుషులకు సోకాక... ఇది వ్యక్తి నుంచి వ్యక్తి (పర్సన్ టు పర్సన్) వ్యాప్తి చెందే అవకాశముంది. బాధితులతో బాగా సన్నిహితంగా ఉన్నవారిలో ఇలా వ్యాప్తిచెందే అవకాశాలెక్కువ.హాంటా వైరస్తో వచ్చే వ్యాధులు... హాంటావైరస్లు రెండు ప్రధాన సిండ్రోమ్లకు కారణమవుతాయి. అవి... 1. హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్పీఎస్) 2. హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్) హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్) అనేది ప్రధానంగా యూరప్తో ΄ాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపిస్తుంది.లక్షణాలు... హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్పీఎస్) : ఈ వైరస్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. ఎలుక నుంచి వైరస్ వ్యాప్తి చెందిన ఒకటి నుంచి ఎనిమిది వారాల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలువుతాయి. హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్) : ఇది మూత్రపిండా(కిడ్నీ)లను ప్రభావితం చేసే వ్యాధి. వైరస్ సోకిన ఒకటి నుంచి రెండు వారాల్లో లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. అయితే అరుదుగా లక్షణాలు కనిపించడానికి కొందరిలో ఎనిమిది వారాలూ పట్టవచ్చు.ప్రారంభ లక్షణాలు: జ్వరం / వణుకు తీవ్రమైన తలనొప్పి వెన్నునొప్పి కడుపు నొప్పి వికారంచూపు మసకబారడం కొంతమందిలో ముఖం ఎర్రబారడం ∙కళ్లు వాచడం లేదా ఎర్రబారడంచర్మంపై దద్దుర్ల వంటివి కనిపించవచ్చు. మలి లక్షణాలు: ప్రారంభ లక్షణాలు కనిపించిన కొద్దిరోజుల్లో ఈ కింద పేర్కొన్న లక్షణాలూ కనిపిస్తాయి. బీపీ తగ్గడం / పడిపోవడం రక్తప్రసరణ తగ్గడం షాక్కు గురికావడం అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ హేమరేజ్) మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్... ఈ కారణంగా దేహంలో నీరు చేరి మనిషి ఉబ్బినట్లుగా కనిపించవచ్చు). నిర్ధారణ : ఆ ప్రాంతంలో హాంటా వైరస్ వ్యాప్తి ఉన్నప్పుడు లక్షణాలను బట్టి అవి హాంటా వైరస్ కారణంగా కావచ్చని అనుమానిస్తారు. వైరస్ సోకిన 72 గంటల లోపల హాంటావైరస్ను గుర్తించడం కష్టం. తొలి పరీక్షలో వైరస్ ఆనవాళ్లు కనిపించకపోతే, లక్షణాలు మొదలైన 72 గంటల తర్వాత మళ్లీ పరీక్ష చేస్తారు. బాధితులు పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాలు మొదలుకొని కొన్ని నెలలు పట్టవచ్చు. అయితే ప్రస్తుతానికి హాంటా వైరస్ అనేది దేశంలో లేనేలేదు కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - డాక్టర్ కె. శివరాజుసీనియర్ ఫిజీషియన్చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..? -
ప్లీజ్..వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి!
మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరానికి శక్తినిచ్చే ఆహారమే ఆరోగ్యకరమైనది. నాలుకకు రుచిగా, కంటికి ఇంపుగా కనిపించే జంక్ఫుడ్ ఎన్నటికీ అనారోగ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ద తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుందని అంటున్నారు. మనం తీసుకునే ఆహారమే ఒత్తిడి, అలసట, నిరుత్సాహం వంటి మూడ్స్కి కారణమవుతుందని గమనించారా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ఆహారం కారణంగానే..మన ఒత్తిడి, ఆందోళన బారిన పడి క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వారి మాటల్లోనే తెలుసుకుందాం.మన తీసుకునే ఆహారం కేవలం కేలరీలు మాత్రమే కాదు, శక్తి, మానసిక స్థితి, నిద్ర, ఏకాగ్రత, స్వస్థత వంటి వాటిక మూలం. నిరంతరం అలసటగా, ఉబ్బరంగా, ఆందోళన, నిరుత్సాహం, ఒత్తిడి ఎదురవ్వుతుంటే శరీరం ఆహారాన్నికాదు పోషణను కోరుకుంటుందని అర్థమట. అందుకే శుభ్రమైన ఆహరం తినమని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా హైడ్రేటెడ్గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగమని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా సహజమైన ఆహారాన్నే ఎంచుకోమని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన మనస్సు + ఆరోగ్యకరమైన శరీరం అని నొక్కి చెబుతున్నారు. దయచేసి వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి.. స్వస్థతకు ఆహారం ఇవ్వడం ప్రారంభించండి అని కోరుతున్నారు ఆరోగ్య నిపుణులు.డా. ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం నిపుణుల ఆధారంగా ఇచ్చిన కథనం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!) -
కిమ్ కర్దాషియాన్:'రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటా'
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్, మోడల్, బిలియనీర్ కిమ్ కర్దాషియాన్ రోజకు 35 సప్లిమెంట్లు తీసుకుంటుందట. వాటిని రోజుకు మూడుసార్లుగా విభజించుకుని మరి తీసుకుంటానని ఇటీవల అమీ పోలర్ పోడ్కాస్ట్లో పాల్గొన్నప్పుడు ఆమెనే స్వయంగా తెలిపింది. దీని కారణంగా 'పిల్ ఫెటీగ్' (మాత్రల అలసట)తో బాధపడుతున్నానని కూడా తెలిపింది. అయితే ఆ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోలేక కొన్నాళ్లు ఆపేసినట్లు తెలిపింది. అయితే కొద్దిరోజుల్లనే మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రతిరోజూ ఈ మందులను నేరుగా శరీరంలోకి ఎక్కించుకునేలా ఐవీ డ్రిప్ ఉంటే బాగుండును ప్రతిసారి వర్క్టైంలో గుర్తుపెట్టుకుని వేసుకోలేక అవస్థ పడుతున్నా అని బాధగా చెబుతుంది. అసలు నిజంగా ఒక మనిషి ఇన్ని సప్లిమెంట్లు తీసుకోవచ్చా? ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అంటే..సప్లిమెంట్లు అదనపు పోషణను అందించి, పోషకాహార లోపాలను భర్తీచేయడంలో సహాయపడినప్పటికీ, రోజుకు 35 సప్లిమెంట్లు అంటే.. సురక్షితం కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి తీవ్రమైన హాని అని, అవయవాలు దెబ్బతినొచ్చు లేదా జీర్ణ సమస్యలు, కణజాలంలో విషపదార్థాలు పేరుకుపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.సప్లిమెంట్లు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని నొక్కి చెబుతున్నారు. ఇవి కేవలం పోషకాహార లోపాలకు చికిత్స చేయడానికి, ఇతర వ్యాధులకు , అనారోగ్య సమస్యల నుంచి బయపడటానికి ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా శరీరం కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె లను నిల్వ చేసుకోగల సామర్థ్యం కారణంగా, వాటిని అధికంగా తీసుకుంటే చాలా ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. అంతేకాకుండా, కొన్ని సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయానికి నష్టం, మూత్రపిండాల్లో రాళ్లు, జీర్ణ సమస్యలు, నరాల దెబ్బతినడం, ఔషధాల మధ్య ప్రతిచర్యలు తదితరాలు సంభవిస్తాయని అన్నారు. ఇదేదో ట్రెండ్లా లేదా సెలబ్రిటీలు వాడుతున్నారనో అస్సలు తీసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. సప్లిమెంట్లను అధికంగా తీసుకుంటే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు1. విటమిన్ విషప్రభావం (విటమిన్ టాక్సిసిటీ)అధిక మోతాదు తీసుకోవడం వల్ల మూత్రపిండాల దెబ్బతినడం, కాలేయం దెబ్బతినడం, కడుపునొప్పి, విరేచనాలు, నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.2. ఖనిజాల అధిక భారం (మినరల్ ఓవర్లోడ్)విటమిన్ల మాదిరిగానే, ఖనిజాల అధిక భారం కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, సప్లిమెంట్ల రూపంలో తీసుకునే అదనపు ఐరన్ తీవ్రమైన జీర్ణాశయ సంబంధిత సమస్యలను కలిగించి, కాలక్రమేణా కాలేయాన్ని దెబ్బతీస్తుంది.ప్రమాదకరమైన ఔషధ రియాక్షన్ (డ్రగ్ ఇంటరాక్షన్స్)సప్లిమెంట్లు శరీరం మందులను ప్రాసెస్ చేసే విధానాన్ని మార్చగలవు. ఉదాహరణకు, విటమిన్ కె రక్తాన్ని పల్చబరిచే మందుల (బ్లడ్ థిన్నర్స్) ప్రభావాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.అధిక వినియోగంబ్రేక్ఫాస్ట్ సెరియల్స్, ఎనర్జీ బార్లు, జ్యూస్ల వంటి అనేక రోజువారీ ప్రాసెస్ చేసిన ఆహారాలలో విటమిన్లను అధికంగా కలుపుతారు. రోజువారీ మల్టీవిటమిన్ల తోపాటు నిర్దిష్ట లక్షిత సప్లిమెంట్లు తీసుకుంటే మాత్రం తెలియకుండానే అధికంగా తీసుకునే ప్రమాదం ఉంటుందటపరిగణించవలసిన భద్రతా చిట్కాలుఏ రకమైన ఆహార సప్లిమెంట్లు అయినా వాడే ముందు వైద్యుల పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో తీసుకోవాలి. అలాగే మనం వాడే సప్లిమెంట్లు మంచి నమ్మదగిన బ్రాండ్వేనా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సప్లిమెంట్ వాడుతున్నప్పుడు వికారం, కడుపు నొప్పి, కామెర్లు, గుండె దడ లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే వైద్యులను సంప్రదించి వాడొచ్చో లేదా నిర్థారించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్..! ఈ బామ్మ చేసే ఐస్క్రీమ్కి ఫిదా అవ్వాల్సిందే..) -
జూనియర్ ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కేజీలు..! ఎలా తగ్గారంటే..
మే 20న టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ చిత్ర నిర్మాతలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ను విడుదల చేశారు. ఆయన న్యూలుక్కి సంబంధించిన పోస్టర్లు అభిమానులను థ్రిల్కి గురయ్యేలా చేసింది. ఎంత స్మార్ట్ లుక్లో కనిపించారంటే మన హీరో తారక్నే కదా అనే సంభ్రమాశ్చర్యాలకు లోను చేసేలా అద్భుతమైన లుక్లో కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలోని తన పాత్రం కోసం ఆయన కేవలం నాలుగు నెలల్లో దాదాపు 15 కేజీలు తగ్గారని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. అందుకోసం ఆయన ఎంతలా కష్టపడ్డారో..ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారంటే.!ఆ మూవీలో హంతకుడు పాత్ర కోసం ఆయన్ను మరింత సన్నగా ఉంటే బాగుంటదని చెప్పానని అన్నారు దర్శకుడు ప్రశాంత్నీల్. ఆయన తన పాత్ర కోసం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా కష్టపడతారని అనుకున్నా కానీ ఇంతలా తను రూపురేఖల్ని మార్చుకుంటారని తాము ఊహించలేదన్నారు. తాను అలా స్మార్ట్గా అవ్వడంతో ఆయన భార్య, తల్లి తనపై చాలా కోపంగా ఉన్నారని కూడా చెప్పారు. అందుకోసమే ఎన్జీఆర్ నాలుగు నెలలపాటు షూటింగ్కి కూడా రాలేదన్నారు. ఒకానొక సమయంలో దాదాపు 15 కేజీలు తగ్గారు. అది చూసి మధ్యలోనే చాలు ఆపేయండని కోరినా..ఆయన ఆపలేదంటూ నాటి సంఘటనలు గుర్తు తెచ్చుకున్నారు. ఆ హీరో మరీ అంతలా కష్టపడటం కూడా చాలా బాధగా అనిపించిందన్నారు.అందుకోసం ఏం చేశారంటే..ట్రైనర్ డెక్కన్ క్రానికల్ ప్రకారం..స్మార్ట్ చురుకైన శరీరాకృతి కోసం కార్డియో- వ్యాయామాలు, రెసిస్టెన్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఉదయం 45 నుంచి 90 నిమిషాల సెషన్లు ఇవే చేసినట్లు తెలిపారు. అలాగే ఆహార పరంగా సాధారణంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించడానికి బదులుగా, తక్కువ ప్రోటీన్తో కూడిన ఆహారాన్ని ఎంచుకున్నట్లు డైట్ ట్రైనర్ కుమార్ మన్నవ తెలిపారు. ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని ఈ విధానం సులభంగా తగ్గేలా చూసి సరికొత్త లుక్తో కనిపించేలా చేసిందన్నారు. ముఖ్యంగా డ్రాగన్ పాత్రకు అనుగుణమైన ఆహార్యంతో అందర్నీ ఆశ్చర్యపరిచారని చెబుతోంది చిత్ర బృందం. తామెవ్వరూ ఇంతలా మార్చుకుంటారని గానీ, ఇంత స్పీడ్గా బరువు తగ్గి స్మార్ట్గా మారిపోతారని ఊహిచలేదని చెబుతోంది మూవీ బృందం. (చదవండి: మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!) -
మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది కాలానుగుణంగా ఉంటేనే మంచిది. అందులోనూ భగభగలాడే ఈమండుటెండల్లో వేడిని తట్టుకోవాలంటే..వంటగదిలో ఈ చిన్నమార్పులు తప్పనిసరి. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ఆహారం వేసవి వేడికి ఇబ్బందికరంగా మారిపోతుంది. అలాగని ఆరోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలా? అంటే కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతర్గత శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పకుండా ఉండేలా తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలని అంటున్నారు. మరి అవేంటో చూద్దామా.!.తీపి పదార్థాలు..తేనె, బెల్లం 'ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఇవి తీసుకుంటే శరీరంలో వేడి అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖర్జూరపు పొడి, స్టీవియా, మంక్ ఫ్రూట్ షుగర్ లేదా దాగా మిశ్రి వంటి వాటికి మారమని సూచిస్తున్నారు నిపుణులు.చిరుధాన్యాలుజొన్న, మక్కీ, రాగి, కుట్టు, బ్రౌన్ రైస్లు ఆరోగ్యకరమైనవే కానీ వేసవిలో మాత్రం అంత మంచివికావని అంటున్నారు. ఎందుకంటే వేసవిలో ఇవి జీర్ణం అవ్వడం కష్టంగా ఉంటుందట. అందుకు బదులుగా జొన్న, జౌ (బార్లీ), సమక్, కాంగ్ని, తెల్ల బియ్యం, ఓట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.పప్పుధాన్యాలుకందిపప్పు, మినపపప్పు, కుల్తీ, మోత్(మట్కీ), సోయాబీన్ తదితరాలుబరువుగా ఉండి, గ్యాస్ను ఏర్పరుస్తాయనిన్ హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటికి బదులుగా, పెసరపప్పు, మసూర్ పప్పు, లోబియా, కాబూలీ శనగలను తీసుకోండి.కూరగాయలువంకాయ, బీట్రూట్, పాలకూర వంటివి శరీరంలో వేడిని పెంచి, జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందున, వాటిని అధికంగా తీసుకోకపోవడమే మేలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా సొరకాయ, టిండా(ఇండియన్ బేబీ పంప్కిన్), కద్దు(ఆనపకాయ), పర్వాల్(దొంకాయ రకం), దోసకాయ వంటివి అధిక నీటి శాతం కలిగి ఉండటం వల్ల గొప్ప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి.పాల ఉత్పత్తులుగేదె పాలు వంటి బరువైన పదార్థాలు సహజంగానే జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అదేవిధంగా, అధికంగా ఉండే పెరుగుకు - దాని శీతలీకరణ గుణాలు ఉన్నప్పటికీ ఇది కూడా మండుటెండలకు అస్సలు మంచిది కాదు. రైతా లేదా పులచటి మజ్జిగాలో తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణుల.మసాలాలుసాధారణంగా, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పరిధిని దాటినప్పుడు, తేలికపాటి ఆహారం తీసుకోవడం, అధిక మసాలాలు ఉన్న వంటకాలకు దూరంగా ఉండటం మేలు. అయితే, ఎండు అల్లం (సౌంత్), దాల్చినచెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, మెంతి గింజలు, పిప్పలి వంటి వేడి చేసే మసాలాలు అసిడిటీని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి, వాటి వాడకాన్ని పరిమితం చేయాలని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటికి బదులుగా, రుచికోసం సోంపు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, లెమన్గ్రాస్ ఉపయోగించమని సూచిస్తున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..) -
హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..
మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట అడుగు భాగంలో ఉండే పొరల మీద అమరిపోయి ఉంటాయి.ఏవైనా కారణాల వల్ల ఈ ΄పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపల ఉండే భాగాలు... బలహీనంగా ఉన్న ఆ అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని (చర్మంలోనే) బయటకు వెళ్తాయి. ఇలా జరిగినప్పుడు పురుషుల్లోనైతే ఆ పేగులు... వృషణాల సంచిలోకి జారిపోవచ్చు. ఒకవేళ మహిళల్లోనైతే పొట్టలోని ఆ అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. పొట్టలోనివే కాదు... మరే భాగంలోనైనా... ఒక దేహభాగం మరో దేహభాగంలోకి చొచ్చుకు వెళ్లడాన్ని ‘హెర్నియా’ అంటారు. ఇందులో చాలా రకాలుంటాయి. ఈ హెర్నియాలోని రకాలు, అలా జరిగినప్పుడు చేయించాల్సిన చికిత్సల వంటి పలు అంశాలను తెలుసుకుందాం...పొత్తికడుపు పొరల్లో బాగా బలహీనంగా ఉన్నచోటి నుంచి పొత్తికడుపులోని కొన్ని భాగాలు దూసుకుపోయి చర్మం కిందికి చేరుకుంటాయి. బయటి నుంచి చూసినప్పుడు అక్కడి చర్మం భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంటుంది. సాధారణంగా పొత్తికడుపు ముందు భాగంలో చర్మం, కొవ్వు, కండరాలు వంటి పలుచోట్ల పొరలు ఉంటాయి. ఇవి పేగులతో పాటు కడుపులోని అంతర్గత భాగాలను తమ తమ స్థానాల్లో ఉండేలా చూస్తాయి. ఈ కండరాలు బలహీనంగా ఉన్న చోట్ల నుంచి కడుపులోని పేగులలో కొంత భాగం బయటకు వచ్చి చర్మం కింది నుంచి ఉబ్బు కనిపిస్తుంది. చేత్తో ముట్టుకున్నప్పుడు ఆ పేగుల భాగాలూ చేతి స్పర్శకు తెలుస్తుంటాయి. సహజంగా హెర్నియా వచ్చేందుకు అవకాశమున్న భాగాలు...కడుపులోని భాగాలు డయాఫ్రమ్ అనే భాగాన్ని దాటి ఛాతీ (లోయర్ ఛెస్ట్)లోకి. కడుపు కింది భాగాల నుంచి పొత్తికడుపు లేదా గజ్జల్లోని లోపలి భాగాల్లోకి. కడుపుకు మధ్యభాగం (మిడ్లైన్)లోకి. కడుపుపై శస్త్రచికిత్స జరిగినప్పుడు... బలహీనపడ్డ ఆ కోత భాగంలోకి.హెర్నియాల్లో రకాలివి... హెర్నియాల్లో అనేక రకాలుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి...ఇంగ్వైనల్ హెర్నియా : చాలా సాధారణంగా / ఎక్కువమందిలో కనిపించే హెర్నియా ఇది. మొత్తం హెర్నియాల్లో 75% ఇదే కనిపిస్తుంది. ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది. రెండు వైపులా కూడా రావచ్చు. సాధారణంగా ఎక్కువ బరువు ఎత్తినప్పుడు కడుపులోని పేగులు... ఇంగ్వైనల్ కెనాల్ అనే ప్యాసేజ్ ద్వారా తొడల (అప్పర్ థైస్) భాగంలోకి వెళ్తాయి.ఫీమోరల్ హెర్నియా : ఇది కాస్తంత అరుదుగానే కనిపిస్తుంది. ఇంగ్వైనల్ కెనాల్ కింద ఉండే ఫీమోరల్ కెనాల్ ద్వారా కడుపులోని భాగాలు ముఖ్యంగా కొవ్వుపొరలు తొడల (అప్పర్ థైస్) దగ్గరికి చొచ్చుకురావడం వల్ల ఈ హెర్నియా కనిపిస్తుంది. సాధారణంగా ఫీమోరల్ హెర్నియా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగ్వైనల్ హెర్నియాతో పోలిస్తే ఈ ఫీమోరల్ హెర్నియా కాస్త చిన్నదిగా ఉంటుంది. హయటల్ హెర్నియా : ఇది చాలామందిలో చాలా సాధారణంగా కనిపించే హెర్నియా. మన ఛాతీలో ఊపిరితిత్తులుండే భాగాన్నీ, కడుపులోని పేగులుండే భాగాన్ని వేరు చేస్తూ... డయాఫ్రమ్ అనే పొర ఉంటుంది. ఈ డయాఫ్రమ్ నుంచే...ఆహారాన్ని కడుపులోకి తీసుకెళ్లే అన్నవాహిక వెళ్తుంది. ఈ అన్నవాహిక కడుపులోకి వెళ్లే చోట డయాఫ్రమ్ దగ్గర బలహీనంగా ఉన్న సమయాల్లో కడుపులోని భాగాలు ఛాతీలోకి దూసుకువస్తాయి. ఈ కండిషన్నే హయటస్ / హయటల్ హెర్నియా అంటారు.కంజెనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా : హయటల్ హెర్నియాలోలాగే ఇక్కడ కూడా డయాఫ్రమ్ లోంచి ఛాతీలోకి పైకి వస్తాయి. అయితే ఇది పుట్టకతోనే (కంజెనైటల్గా) వచ్చే సమస్య. అంటే పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్నవాహిక కడుపులోకి వెళ్తే చోట డయాఫ్రమ్ పూర్తిగా ముసుకుపోయినట్టుగా అభివృద్ధి చెందకపోవడంతో కడుపులోని భాగాలు ఛాతీలోని ఊపిరితిత్తులున్న చోటికి వస్తాయి.ఇన్సిషనల్ హెర్నియా : సర్జరీ వంటివి చేస్తున్నప్పుడు... కడుపుపైన గాటు పెట్టిన చోట అక్కడి కణజాలం బలహీనం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ గాటు ఉన్న చోటి నుంచి కడుపులోని భాగాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లుగా చర్మం కింది నుంచి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. మునుపు శస్త్రచికిత్స గాయం లేదా మచ్చ ఉన్న ప్రాంతంలో... ఆ గాయం సరిగా మానకపోయినా లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ తరహా హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. సాధారణంగా సర్జరీ తర్వాత రెండేళ్లలోపు ఇది కనిపిస్తుంది.అంబిలికల్ హెర్నియా / పారా అంబిలికల్ హెర్నియా : బొడ్డు దగ్గర బలహీనంగా ఉన్న ప్రాంతంలోంచి కడుపులోని భాగాలు బయటకు రావడాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. ఇది సాధారణంగా పుట్టుకతోనే (కంజెనైటల్గా) కనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో చిన్నారికి ఏడాది వయసు వచ్చేనాటికి దానంతట అదే తగ్గిపోయే అవకాశాలెక్కువ. ఇక పారాంబిలికల్ హెర్నియా పెద్దవారిలో వస్తుంది. ఇది నాభి పైభాగంలో కనిపిస్తుంది. ఇందులోకి పేగులు చొచ్చుకుపోయి అక్కడ ఇరుక్కుపోయే ముప్పు ఉండటం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతుంది. వెంట్రల్ హెర్నియా : కడుపు కింది భాగంలో ఉండే పొరల నుంచి అవయవాలు దూసుకు రాకుండా... కడుపు ముందుభాగంలోంచే కడుపులోని అవయవాలు ముందుకు వస్తుంటే దాన్ని ‘వెంట్రల్ హెర్నియా’ అని చెప్పవచ్చు. ఒకరకంగా చె΄్పాలంట అంబిలికల్ హెర్నియా, బొడ్డు దగ్గర వచ్చే ‘ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా’ వంటి వాటిని ‘వెంట్రల్ హెర్నియా’గా చెప్పవచ్చు.హెర్నియా ఎవరెవరిలో వస్తుందంటే... హెర్నియా అన్నది పురుషుల్లోనూ, మహిళల్లోనూ... ఇలా ఇద్దరిలో వచ్చే కండిషన్. చాలామంది పురుషుల్లో వచ్చే హైడ్రోసిల్ కండిషన్ను హెర్నియాతో పోల్చుకుని... ఆ రెండో ఒకటే అని అపోహ పడుతుంటారు. కడుపు కిందిభాగంలోని పొర... వయసు పెరగడం వల్లగానీ లేదా అరుగుదల వల్లగానీ, దెబ్బతగలడం వల్లగానీ లేదా కొందరిలో సహజంగానే ΄పొట్ట అడుగుభాగంలోని కండరం బలహీనపడ్డ సమయంలో కడుపులోని భాగాలు అందులోంచి దూసుకుని కిందికి వెళ్లడాన్నే ‘హెర్నియా’ అంటారు. స్త్రీ, పురుషుల్లో హెర్నియా పలు రకాలుగా రావచ్చు. అయితే పురుషులకు ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. ఎందుకంటే పిండం శిశువుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వృషణాలు పొత్తికడుపులోంచి నుంచి స్క్రోటమ్లోకి దిగేందుకు ఒక చిన్న మార్గం ఉంటుంది. దాన్నే ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు టెస్టిస్ (బీజాలు) కూడా కడుపులోనే ఉంటాయి. మగబిడ్డ పుట్టగానే కడుపులోని ఆ టెస్టిస్ (బీజాలు) అదే మార్గం ద్వారా వృషణాల సంచిలోకి జారతాయి. మున్ముందు ఆ కెనాల్లోంచే పేగులు కూడా వృషణాల సంచిలోకి జారడం వల్ల ఇంగ్వైనల్ హెర్నియా వస్తుంది. ఇక పెద్ద వయసువారిలో ఏదైనా కారణం వల్లగానీ లేదా మలబద్దకం కారణంగా ముక్కినప్పుడు పొత్తికడుపుపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా హెర్నియా వస్తుంది. ఇదే కాకుండా పొత్తికడుపుపై ఇతరత్రా కారణాలతో ఒత్తిడి పడటం కూడా హెర్నియాకు దారితీయవచ్చు. ఇక చిన్నారుల్లో సైతం పుట్టుకతో వచ్చే హెర్నియాలూ ఉండనే ఉన్నాయి. కడుపు కండరాలపై ఒత్తిడి కారణంగా హెర్నియా రావడానికి కారణాలు... క్రానిక్ అలర్జీల వల్ల చాలాకాలం పాటు గట్టిగా దగ్గాల్సిరావడం. పురుషుల్లో చాలా ఎక్కువసేపు అదేపనిగా నిలబడే వృత్తులో ఉండటం. గర్భధారణ వల్లగానీ చాలా ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీలు రావడం వల్ల. ఎక్కువ బరువు ఉండటం (బీఎమ్ 30 కంటే ఎక్కువగా ఉండటం).బరువైన వస్తువులను అకస్మాత్తుగా ఎత్తడం లేదా ఎక్కువ ఫోర్స్తో తోయడం.మలవిసర్జన సమయంలో ముక్కుతూ చాలా ఎక్కువ ఒత్తిడితో విసర్జనకు ప్రయత్నించడం. పెల్విస్ భాగంలో అయిన సర్జరీల వల్ల. చిన్నారుల్లో కంజెనైటల్ హెర్నియాలకు కారణాలు... నెలల పూర్తిగా నిండకముందే పుట్టడం (ప్రీ–మెచ్యుర్ డెలివరీస్). కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అనే ఆరోగ్య సమస్య ఉండటం. కడుపులోని బీజాలు సంచిలోకి వెళ్లకపోవడం (అన్–డిసెండెడ్ టెస్టిస్). మూత్ర వ్యవస్థ / రీప్రొడక్టరీ సిస్టమ్లో ఏవైనా సమస్యలుండటం. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉండేవారిలో... మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్ సమస్య ఉన్నవారిలో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ.పెద్దవారిలో కనిపించే లక్షణాలుబరువైన వస్తువులు ఎత్తిన తర్వాత పొత్తికడుపు కింది భాగం (గ్రోయిన్)లో చిన్న ఉబ్బ / గడ్డలా కనిపించడం. మొదట్లో దాన్ని చేతితో లోపలికి నెట్టినప్పుడు కనిపించకుండా పోవడం తర్వాత మెల్లగా బయటకు రావడం దగ్గినప్పుడు లేదా గట్టిగా నవ్వినపుపడు ఉబ్బు బయటకు రావడం పడుకున్నప్పుడు ఉబ్బు / వాపు తగ్గిపోవడం. ఎందుకు చికిత్స అవసరమంటే...?సాధారణంగా హెర్నియా పెద్దగా నొప్పిని కలిగించదు. కానీ కొంతమందిలో నొప్పి లేదా బరువుగా అనిపించవచ్చు. కాలక్రమంలో ఉబ్బు / వాపు పెద్దదవుతుంది. పురుషుల్లో కొన్ని సందర్భాల్లో స్క్రోటమ్లోకి దిగిపోవచ్చు. ఇక పురుషుల్లోనూ, మహిళల్లోనూ కనిపించే హయటస్ హెర్నియాలో కడుపులోని యాసిడ్ పైకి తోసుకువచ్చే యాసిడ్ రిఫ్లక్స్ వంటి సందర్భాల్లో ఛాతీలో మంట, తీవ్రమైన అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించి చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కనిపించే కాంప్లికేషన్ల కారణంగా వాటిని సరిదిద్దాల్సిన అవసరం తప్పనిసరి. ఇక పెద్దవారిలో వచ్చే హెర్నియాలు సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా చికిత్స చేయడం అవసరం. ఇందుకు కారణాలు... కొన్ని సందర్భాల్లో హెర్నియా ఎటూ కదలలేకుండా ‘బిగుసుకుపోవచ్చు’. ఇలా బిగుసుకుపోవడాన్ని ‘ఇన్కార్సెరేషన్’ అంటారు. ఇలాంటి ‘ఇన్కార్సెరేటెడ్ హెర్నియా’లో నొప్పితో పాటు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఉదాహరణకు హెర్నియా కండిషన్ పెద్దపేగును బాగా బిగదీసి నొక్కుకుపోయేలా చేసినప్పుడు బయటకు వెళ్లాల్సిన గ్యాస్, విసర్జన జరగాల్సిన పదార్థాలూ అక్కడే ఆగిపోవచ్చు. ఇక కొన్నిసార్లు పేగు భాగం ఇరుక్కుపోయి ‘స్ట్రాంగ్యులేషన్’ అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు బిగదీసుకుపోయిన చోటి నుంచి కింది భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల తీవ్రమైన నొప్పితో పాటు పేగు దెబ్బతిని అక్కడి కణజాలం నశించిపోయే ప్రమాదం ఉంది. దీన్నే నెక్రోసిస్ / గ్యాంగ్రీన్గా కూడా చెబుతారు. ఇంగ్వైనల్ హెర్నియాలకంటే ఫెమోరల్ హెర్నియాల్లో ఈ ముప్పు చాలా ఎక్కువ. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి అది రవాణ సదుపాయానికి కూడా దారితీయవచ్చు. అందుకే హెర్నియా కండిషన్ను శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. నిర్ధారణ బాధితుల్లోని ఉబ్బు భాగాన్ని భౌతికంగా పరీక్షించడం (ఫిజికల్ ఎగ్జామ్) ద్వారా హెర్నియాను చాలావరకు నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలు అవసరం పడవచ్చు. హెర్నియాను ఎలా సరిచేస్తారు?హెర్నియాను చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా డాక్టర్లు సరిచేస్తారు. అయితే చిన్నపాటివీ (మైల్డ్), కొద్దిపాటి వాటికి వెంటనే శస్త్రచికిత్స అవసరం లేదు. ఇలాంటి వాటి విషయంలో డాక్టర్లు ‘వెయిట్ అండ్ వాచ్’ పద్ధతిని అనుసరిస్తారు. మరీ ప్రమాదకరం కాకుంటే తక్షణం శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని అంచనా వేస్తే తప్పక శస్త్రచికిత్స అవసరం. ఇది మందులతో తగ్గే కండిషన్ కాదు. పాతకాలంలో ‘ట్రస్’ (సపోర్ట్) పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పద్ధతిని ఎవరూ అనుసరించడం లేదు. శస్త్రచికిత్సలో రకాలుఓపెన్ సర్జరీ / హెర్నియా రిపేర్ సర్జరీ : హెర్నియాను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అంతర్గత అవయవాల్లోకి చొచ్చుకుపోయిన అవయవాలను / పేగులను లోపలికి యథాస్థానంలోకి నెట్టి, పొరలు బలహీనంగా ఉన్న చోటి నుంచి అవయవాలు మళ్లీ లోనికి జారిపోకుండా అక్కడ ‘మెష్’ (వల వంటి భాగాని అమర్చుతారు. మామూలుగానైతే 3–4 అంగుళాల కోత పెట్టి హెర్నియాను సరిచేస్తారు. సాధారణంగా స్పైనల్ అనస్థీషియా ఇస్తారు.లాపరోస్కోపిక్ హెర్నియా రిపేర్ : చిన్న చిన్న గాట్ల ద్వారా అతి చిన్న కెమెరా (లాపరోస్కోప్) సహాయంతో శస్త్రచికిత్స చేస్తారు. మెష్ను పెట్టి స్లేప్లింగ్ చేస్తూ దాన్ని స్థిరంగా ఉండేలా చూస్తారు. ఆ మెష్ కారణంగా మళ్లీ అవయవాలు లోపలికి జారవు. ఇందులో కూడా సాధారణంగా జనరల్ అనస్థీషియాతో ఇస్తారు.లాపరోస్కోపిక్ సర్జరీతో ప్రయోజనాలుచిన్న గాటు తక్కువ నొప్పి త్వరగా కోలుకోవడం త్వరగా వృత్తులకు వెళ్లగలగడం (అటెండ్ కావడం)రొబోటిక్ సర్జరీ : ఇప్పుడు రొబోటిక్స్ సహాయంతో కూడా శస్త్రచికిత్స నిర్వహించడం సాధ్యమే. దీంతో మరింత ఖచ్చితమైన రీతిలో (ప్రెసిషన్తో) శస్త్రచికిత్స చేయడం వల్ల త్వరగా కోలుకోవడం, తక్కువ నొప్పి వంటి ప్రయోజనాలన్నీ ఇందులోనూ ఉంటాయి.హెర్నియా నివారణ సాధ్యమేనా? హెర్నియాకు కారణమయ్యే కొన్ని అంశాలు మానవ నియంత్రణకు సాధ్యం కావు. అయితే కొన్ని సాధారణ అంశాలు పాటించడం ద్వారా హెర్నియాను చాలావరకు నివారించవచ్చు. అవి... బరువును అదుపులో ఉంచుకోవడం / అధిక బరువు తగ్గించడం ∙బరువైన వస్తువులను ఎత్తే సమయంలో జాగ్రత్తగా ఉండటం / అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం / బరువైన వస్తువులను తోసే విషయంలోనూ ఈ జాగ్రత్తలు అవసరంచాలాకాలం పాటు దగ్గుతూ / తుమ్ములు వస్తూ ఉండే క్రానిక్ పల్మునరీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స తీసుకుంటూ దగ్గు రాకుండా చూసుకోవడం మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవడం పురుషుల్లో ప్రొస్టేట్ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం.హెర్నియాలు వారసత్వంగా వస్తుంటాయా? కొంతవరకు అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే జన్యుపరంగానూ, వాళ్ల దేహం తాలూకు స్వభావం వల్ల కడుపు కింది భాగంలోని పొరలు బలహీనంగా ఉండటం జరగవచ్చు. ఇలాంటి కుటుంబాల్లో తర్వాతి తరాల్లోనూ హెర్నియా రావచ్చు. అంతమాత్రాన తర్వాతి తరాల్లో ఇది అందరికీ వస్తుందని కాదుగానీ... హెర్నియా వచ్చేందుకు అవకాశాలు కాస్తంత ఎక్కువ.చివరగా... ముందుగా చెప్పినట్టు మైల్డ్ కేసుల్లో డాక్టర్లు వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో హెర్నియాను గమనిస్తూ ఉన్నప్పటికీ... డాక్టర్లు సర్జరీ తప్పదని చెప్పినప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లడమే మంచిది. ఎందుకంటే హెర్నియా బిగదీసుకుపోయే ‘స్ట్రాంగ్యులేషన్’ కేసుల్లో అది మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చు. అంతేకాదు... కొన్నిసార్లు ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలెక్కువ. అందుకే డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించడం అవసరం.డాక్టర్ ఎన్. భరత్కుమార్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిర్వహణ: యాసీన్(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?) -
ఫిట్స్ (Fits) వచ్చినప్పుడు పొరపాటున కూడా ఇవి చేయకండి
-
పాటలు పాడటం ఇంత మంచిదా..? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన పెద్దలు చెబతుండటం విన్నాం. అంతెందుకు శ్రావ్యమైన సంగీతం వింటుంటే శారీరకంగా, మానసికంగా బాగుంటాం అని నిపుణులు సైతం అంటున్నమాటే. తాజాగా వినడమే కాదు పాటలు పాడితే మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందట. పైగా గట్ హెల్త్ బాగుంటుందని సాక్షాత్తు హార్వర్డ్ నిపుణులే చెబుతున్నారు. అదేవిధంగానో ఆ నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా.!.పాడటం అనేది కళాత్మక ప్రక్రియ. మరి దీనికి జీర్ణక్రియకు సంబంధం ఎలా అంటే.. పాటలు పాడినప్పుడు మనసు, పేగులు, నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఒక బృందంగా పాడుతున్నప్పుడు శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ (ఏ), కార్డిసాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించారు. పాడటం అనేది మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి, ఆందోళనతో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొందరు దీన్ని అధిగమించిగలుగుతారు అందుకు ఇదే కారణమని అంటున్నారు.పాడినప్పుడు ఏం జరుగుతుందంటే..శరీరంపై సానుకూల ప్రభావం మెదడు నుంచి మొదలై వేగస్ నాడి ప్రేరణ ద్వారా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకోసం బీథోవెన్ సంగీతాన్ని ఆలపిస్తున్న బృందంపై పరిశోధనలు చేయగా, వారందిరలోనూ పాడటం కారణంగా లాలాజలంలో ఒక కీలకమైన రోగనిరోధక యాంటీబాడీ నాటకీయంగా పెరగడం గుర్తించామని తెలిపారు. ఆ యాంటీబాడీ.. జీర్ణవ్యవస్థ లోపలి పొర, గొంతు, శ్వాస మార్గాలలో మన శరీరానికి మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఫలితంగా వ్యాధికారకాలు మనపై పట్టు సాధించే అవకాశం రాకమునుపే ఈ యాంటీబాడీ అడ్డుగోడగా మారుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే గానానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉందని చెబుతున్నారు. మెదడుకు, పేగుకి మధ్య ఉన్న ప్రధాన సమాచార ప్రసార మార్గం అయిన వేగస్ నాడి పాటను ఆలపించగానే ఉత్తేజితమవుతుందట. ఎప్పుడైతే పాట కోసం ఉదర శ్వాసను ఉపయోగిస్తామో అప్పుడు ఈ వేగస్ నాడీ తక్షణమే యాక్టివ్ అవుతుందట. దాంతో విశ్రాంతి, జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి ప్రేగులు అత్యుత్తమంగా పనిచేయడం ప్రారంభిస్తాయట. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమేగాక, ప్రేగుల లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు శరీరంలో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతకు మద్దతిస్తుందట. గానం ఎలా హెల్ప్ అవుతుందంటే..గానం విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా మనం రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోతాం. దాంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పాట పడటం కోసం ఉదర శ్వాసను వినియోగిస్తాం దాంతో శ్వాశ, నాడీవ్యవస్థ నియంత్రణ ఫలితం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీర్ణవ్యవస్థకు మెదడు నుంచి సరైన సంకేతాలు అందితేనే తన పనిని సజావుగా జరపగలదట. అందువల్లే గానం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పగలమని అన్నారు. గానం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అది సమర్థవంతంగా సంకేతాలను అందించడంతో ప్రేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు. అందరూ పాడేటప్పుడు లోతైన శ్వాసను తీసుకుంటే వేగస్ నాడీ ఉత్తేజమయ్యి..జీర్ణవ్యవస్థ బాగుండేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే మన పూర్వీకులు మన చేత నిరంతరం జపాలు, పారాయణాల పేర్లతో మంత్రాలు, భక్తిపాటలను లయబద్ధంగా ఆలపించేలా చేసేవారని అంటున్నారు. అంటే మెరుగైన ఆరోగ్యానికి చక్కటి జీవనశైలి, శ్వాస, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమనేది గుర్తురెగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం View this post on Instagram A post shared by Akanksha Pandey (@acanxa) (చదవండి: వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..) -
వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా?
గత కొన్ని రోజులుగా భారత్లో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలిసిందే. ఎండలు భగభగలాడిస్తున్నాయి. ఉదయం పది దాటితేనే సూర్ర్యు సుర్రు మంటున్నాడు. కనీసం బయటకు వెళ్లాలంటేనే వణుకుపుట్టుకొస్తుంది. అంతలా ఎండలు గజగజలాడిస్తున్నాయి. ప్రతి చోట నలభై డిగ్రీలు దాటేస్తున్నాయి. మెట్రో ప్రాంతాల్లో ఇక ఆ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అంతేగాదు ఎండల ధాటికి వడదెబ్బల బారినపడుతున్న వారు ఎక్కువే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు కొందరు వడదెబ్బ బారిన పడగానే..పారాసెటమాల్ వేసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వడదెబ్బ రెండు విధాలుగా ఉంటుందని, అందుకోసం ఎలాంటి ఆరోగ్య సంరక్షక చర్యలు తీసుకోవాలో సవివరంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45°C దాటుతుండగా, తీర ప్రాంతాలు తీవ్రమైన తేమ, భరించలేని వేడితో సతమతమవుతున్నాయి. పైగా ఆస్పత్రులలో వడదెబ్బ, వడతాపం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే..క్షణాల్లో ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు డాక్టర్ విశాల్. ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో వడదెబ్బకు, వడఘాతానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో పారాసెటమాల్ వేసుకోవడం ఎంత ప్రమాదకరం, ఎలాంటి అత్యవసర చర్యలు తీసుకుంటే మంచిది, వంటి వాటి గురించి సవివరంగా వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు దగ్గరగా ఉందని, తీరప్రాంతలైతే అంతకమించి ఉంటున్నాయి. సాధరణంగా వడదెబ్బ తగిలినప్పుడు..రోగి అలసిపోయినట్లు కనిపిస్తాడు, కానీ అతనికి చెమట పడుతూనే ఉంటుంది. ఈ సందర్భంలో, చాలా సమయం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది అని డాక్టర్ విశాల్ చెబుతున్నారు. అదే వడఘాతం అనేది ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి అని పేర్కొన్నారు. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనప్పుడు ఇది సంభవిస్తుందట. రోగి పూర్తిగా స్పృహ కోల్పోతాడు, ఆ వ్యక్తి శీతలీకరణ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. పైగా చెమట కూడ పట్టదు కాబట్టి చర్మం పొడిగా, వేడిగా ఉంటుందట. దానివల్ల, మెదడు అక్షరాలా మైక్రోవేవ్లో పెట్టినట్లుగా ఉడికిపోతుంది. దాని కారణంగా, రోగి స్పృహ కోల్పోవచ్చు, అతనికి మూర్ఛలు రావచ్చు, కోమాలోకి వెళ్ళవచ్చు, లేదా చనిపోవచ్చు కూడా అని అన్నారు.పారాసెటమాల్ వేసుకోవచ్చా..వడదెబ్బలో పారాసెటమాల్ పనిచేయదని అంటున్నారు వైద్యులు. అనారోగ్యం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పారాసెటమాల్ మెదడు థర్మోస్టాట్ను రీసెట్ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ వడదెబ్బ తగిలినప్పుడు, బయటి నుండి వచ్చే అధిక వేడి శరీర వ్యవస్థను అధిగమించినప్పుడు, శరీరాన్ని చల్లబరిచే యంత్రాంగం విఫలమవుతుంది. పైగా రోగిని చల్లటి నీటితో చల్లబర్చాలి, చంకల ప్రాంతంలో చల్లటి నీటినిపోయాలి. దాంతో వారిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే రోగికి తగినంత నీఉ, ఓఆర్ఎస్ ఇవ్వడం వంటివి చేయాలి. ఇలాంటి వాళ్లు సాధ్యమైనంతవరకు చల్లటి నీటిని తాగుతూ..ఇంటిలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ విశాల్.గమనిక: ఇది కేవలం అవగాహాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యులు లేదా నిపుణులకు సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Vishal Gabale (@health.with.vg) (చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?) -
గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దాంతో రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదకరమా? నేను ఇకపై డయాబెటిక్గా ఉండాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరు.గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తంలో షుగర్ స్థాయి పెరగవచ్చు. దీనిని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఇది గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా వస్తుంది. ఇది సాధారణంగా 24 నుంచి 28 వారాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ప్రతి గర్భిణీకి ఓజీటీటీ అనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. కొంతమంది మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గత గర్భధారణలో జెస్టేషనల్ డయాబెటిస్ ఉండటం, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండటం, 35 ఏళ్లకు పైబడిన వయస్సు, అధిక బరువు వంటి కారణాలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు తల్లి, బిడ్డకు కొన్ని సమస్యలు రావచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం, ఉమ్మనీరు ఎక్కువ కావడం, డెలివరీ సమయంలో ఇబ్బందులు, డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డకు శ్వాస సమస్యలు లేదా తక్కువ షుగర్ లెవల్స్ రావచ్చు, కానీ ఇవి సాధారణంగా చికిత్సతో నియంత్రించవచ్చు. ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరు డైట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను తరచూ చెక్ చేసుకోవాలి. డైట్తో నియంత్రణలో లేకపోతే సురక్షితమైన మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వవచ్చు. ఇవి తల్లికి, బిడ్డకు సేఫ్గా ఉంటాయి. చాలా సందర్భాల్లో డెలివరీ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గిపోతుంది. అయితే భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఎనిమిది వారాల గర్భవతిని. గతంలో ఏడు వారాలలో మిస్క్యారేజ్ అయింది. ఈ గర్భధారణలో ఇప్పటివరకు నాకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. – రూప, కర్నూలు.గర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశ చాలా కీలకం, ఎందుకంటే ఈ సమయంలో శిశువు ముఖ్యమైన అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఇదే సమయంలో మిస్క్యారేజ్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ప్రతి గర్భిణీ గమనించాల్సిన రెండు ముఖ్యమైన లక్షణాలు బ్లీడింగ్, కడుపు నొప్పి. ఫస్ట్ ట్రైమెస్టర్లో బ్లీడింగ్కు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో చాలా సందర్భాల్లో ఇది తల్లి లేదా శిశువుకు హానికరం కాకపోవచ్చు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, సెక్స్ తర్వాత రక్తస్రావం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే ముందుగా తప్పకుండా రూల్ అవుట్ చేయాల్సిన రెండు ముఖ్యమైన పరిస్థితులు మిస్క్యారేజ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీరు డాక్టర్ను కలిసినప్పుడు పూర్తి వైద్య చరిత్ర తీసుకుంటారు, శరీర పరీక్ష చేస్తారు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా శిశువు పరిస్థితిని చెక్ చేస్తారు. ఈ పరీక్షలతో బ్లీడింగ్కు గల అసలు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉండి, స్కాన్లో బిడ్డ బాగానే కనిపిస్తే, బ్లీడింగ్ పరిమాణం, కారణాన్ని బట్టి చికిత్స ఇస్తారు. ఇందులో ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మనశ్శాంతిగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే ప్రొజెస్టెరాన్ మందులు కూడా ఇస్తారు, ఇవి గర్భధారణకు మద్దతు ఇస్తాయి. గతంలో మిస్క్యారేజ్ జరిగినందుకు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భధారణ వేరు. చాలాసార్లు సరైన పర్యవేక్షణతో ఆరోగ్యంగా గర్భధారణ కొనసాగుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ కోసం ఉంచవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం, డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా మంది మహిళలు ఆరోగ్యంగా బిడ్డలను ప్రసవిస్తున్నారు.డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..? వైద్యులు ఏమంటున్నారంటే..) -
కృత్రిమ గర్భధారణకు కృత్రిమ మేధోసాయం!
కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తోడ్పడుతోంది. మునుపు దాదాపు పరిశోధనల్లో లేదా మరికొన్ని అంశాల్లో సహాయకారిగా ఉండే ఏఐ ఇప్పుడు వైద్యరంగంలోని చాలా విషయాల్లో తన సహాయం అందించడం పరిపాటి అయ్యింది. ఐవీఎఫ్ ప్రక్రియకు మరింత చేయూత ఇచ్చేందుకు అవసరమైన పరిజ్ఞానం సమకూర్చుకుంటోంది. ఆ వివరాలేమిటో చూద్దాం...పిల్లలు లేనివారు ఓ బిడ్డకోసం తాపత్రయపడటం మన సమాజంలో ఉన్నదే. ఇందుకు సహాయపడే కృత్రిమ గర్భధారణ ప్రక్రియల్లో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఒకటి.ఐవీఎఫ్ అంటే... ఐవీఎఫ్ ప్రక్రియలో మొదట మహిళ అండాశయాల నుంచి అండాలను సేకరించి వీర్యకణంతో కృత్రిమంగా ఫలదీకరణం జరిగేలా చూస్తారు. దంపతులు కలిసినప్పుడు ఏదైనా కారణాలతో మహిళలో నేచురల్గా ఫలదీకరణం జరగనప్పుడు డాక్టర్లు ఇలా బయటే ఫలదీకరణ జరిగేందుకు సహాయపడుతుండటంతో దీన్ని ‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ (ఏఆర్టీ) అంటారు. ఫలదీకరణ లోపలే జరగకపోవడానికి కారణాలంటే... మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకు΄ోవడం, ఎండోమెట్రియాసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) లేదా ఓవరీ తాలూకు సమస్యలుండటం, నిర్దిష్టంగా ఇదీ సమస్య అని తెలియని కారణాలు ఉండటం. అదే పురుషుల విషయంలో వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉండటం. ఈ సమస్యలున్నప్పుడు ఫలదీకరణ జరిగేందుకు బయటే ఐవీఎఫ్ జరిగేలా చూస్తారు.ఎలా చేస్తారంటే... సంక్లిష్టమైన ప్రక్రియ అయి ఐవీఎఫ్ను అనేక అంచెల్లో చేయాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మహిళలో అండాలు పెరిగేలా చూస్తారు. మామూలుగానైతే మహిళలో నెలకు ఒక అండమే పెరుగుతుంది. ఇలా అనేక అండాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడాన్ని ‘కంటెయిల్డ్ ఒవేరియన్ స్టిమ్యులేషన్’ అంటారు. ఇలా అండాలు పెరిగాక ఒక సూదిలాంటి పరికరంతో ‘ఫాలికిల్’ నుంచి వాటిని బయటకు తెస్తారు. అటు తర్వాత ఆ అండాలను ఓ ఇంక్యుబేటర్లోకి ప్రవేశపెడతారు. ఆపైన ఆ అండాల్లోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడాన్ని ‘ఇంట్రా సైటో΄్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఐసీఎస్ఐ) అంటారు. ఫలదీకరణం అయిన అండం ఇక ‘పిండం’ (ఎంబ్రియో)గా మారుతుంది. బయట కృత్రిమంగా ఫెర్టిలైజ్ చేశాక... ఇక ఆ పిండాన్ని (ఎంబ్రియోను) గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. తాజా పిండాన్ని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంబ్రియో’ అంటారు. కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన ఎంబ్రియోలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడితే దాన్ని ‘ఫ్రోజెన్ ట్రాన్స్ఫర్’ అని అంటారు. ఇలా మహిళలోకి ప్రవేశపెట్టిన పిండాన్ని గర్భసంచి ఆమోదించి, తనలో నేచురల్గా పెరిగేందుకు అనుమతిస్తే ఇక ఆ ప్రెగ్నెన్సీ మామూలు గర్భవతిలోలాగే పెరుగుతుంది. ఐవీఎఫ్లో జరిగేది ఇదే.ఏఐ సహాయం ఎక్కడెక్కడ...ఇప్పుడు ఐవీఎఫ్లోని అనేక దశల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) సహాయం చేస్తోంది. అదెలాగంటే... ∙హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవేవి ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించడం కృత్రిమంగా పెరిగిన అనేక అండాలలో నాణ్యమైన వాటి ఎంపిక పార్టనర్ వీర్యకణాల్లోనూ నాణ్యమైన వాటి ఎంపిక టైమ్–లాప్స్ ఎంబ్రియో ఇమేజింగ్ సిస్టమ్స్... అంటే ఇందులో పిండం (ఎంబ్రియో) డిస్టర్బ్ కాకుండా ఉండేలా చూస్తూ... కొన్ని అడ్వాన్స్డ్ కెమెరాల సహాయంతో... ఆ ప్రక్రియ ఎలాంటి అంతరాయాలూ లేకుండా జరుగుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించడం. ఈ డేటా సహాయంతో నాణ్యమైన ఎంబ్రియోను సూచించడం.భవిష్యత్తులో మరింత పురోగతి... ఏఐ పరిజ్ఞానాన్ని మరిన్ని అంశాల్లో మరింత లోతుగా ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు. వాటిలో కొన్ని... ∙గర్భధారణ ఏ మేరకు విజయవంతం కాగలదనే అంశాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ∙ల్యాబ్లలో జరిగే ప్రక్రియలు మరింత తేలిగ్గా / సులువుగా జరిగేందుకు తగిన సాంకేతికతను అభివృధ్ధి చేసుకోవడం (ఎంబ్రియాలజీ ల్యాబ్ ఆటోమేషన్) మహిళ దేహంలో జరుగుతున్న హార్మోనల్ మార్పులను పరిశీలించడం (డిజిటల్ పేషెంట్ మానిటరింగ్) ∙రోబోటిక్స్ సహాయంతో ప్రక్రియలు మరింత సునిశితంగా / ఖచ్చితత్వంతో జరిగేలా చూడటం ∙తనకు డాక్టర్ ఇచ్చిన సూచనలను మహిళ ఖచ్చితంగా పాటిస్తోందా లేదా అన్నది పరిశీలించడం (రియల్ టైమ్ అప్డేట్) ∙అండాలు/పిండాల నిల్వలో (క్రయోప్రిజర్వేషన్)లో గణనీయమైన మెరుగుదల.ఏఐ సహాయంతో ఇవీ ప్రయోజనాలు...మెరుగైన గర్భధారణ ఫలితాలు: నాణ్యమైన ఎంబ్రియో ఎంపికతో గర్భధారణకు మెరుగైన అవకాశాలు ప్రమాదాలు / ముప్పులు తగ్గడం : దేహానికి కోత / గాటు పెద్దగా లేకపోవడంతో (అతి తక్కువ ఇన్వేసివ్ పద్ధతుల వల్ల) తక్కువ నొప్పి, తక్కువ ముప్పు (రిస్క్) సునిశితత్వం / ఖచ్చితత్వం: ల్యాబ్ ప్రక్రియలన్నీ సమర్థంగా జరిగేలా చూడటం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించడం. చివరగా... ఐవీఎఫ్ అన్నది ఇప్పటికీ కొంత ఖరీదైన ప్రక్రియే. ఈ ప్రక్రియలో వేగాన్నీ, సునిశితత్వాన్ని, ఖచ్చితత్త్వాన్ని పెంచడం ద్వారా ఫలదీకరణ అవకాశాలు మరింత మెరుగుపరచడం, తద్వారా ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇలా ఏఐ సహాయంతో భవిష్యత్తులో ఐవీఎఫ్ మరింత ఫలవంతంగా రూపొందే అవకాశముంది.నిర్వహణ : యాసీన్ (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?) -
మీ ఉప్పులో అయోడిన్ ఉందా?
పాత కాలంలో గాయం అయితే దానికి అయోడిన్ పూసి కట్టు కట్టే వారు. అంతకుమించి అయోడిన్ గురించి ఎక్కువగా తెలియదు. అయోడిన్ అన్నది ఒక ఖనిజం. అది మన ఆహారంలో తప్పకుండా ఉండి తీరాలి. శరీరంలో మామూలుగా జరిగే జీవ చర్యలను, పెరుగుదలను, జీర్ణ క్రియను, గుండె కొట్టుకునే వేగాన్ని, శరీరపు ఉష్ణోగ్రతను నియంత్రించే హార్మోన్ల తయారీలో అయోడిన్కు ప్రధాన పాత్ర ఉంటుంది. అంటే మనకు అనునిత్యం ఆహారంలో అయోడిన్ తప్పకుండా ఉండి తీరాలని అర్థం.గర్భవతులకు ప్రధానంగా అయోడిన్ అవసరం ఎక్కువ. థైరాయిడ్కు సంబంధించిన హార్మోన్లు గర్భంలో పెరిగే శిశువు పెరుగుదలను, ముఖ్యంగా శిశువు మెదడు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అటువంటి స్థితిలో అయోడిన్ ఉండవలసిన స్థాయికన్నా ఏ కొంచెం తగ్గినా శిశువు తెలివితేటలు 0.3 నుంచి 13 ఐక్యూ పాయింట్ల దాకా తగ్గుతుంది. ఇక శిశువు పుట్టిన తర్వాత కూడా మెదడు పెరుగుదల థైరాయిడ్ పనితీరు విషయంగా అయోడిన్ ఎంతో అవసరం. పిల్లలలోగానీ, పెద్దలలోగానీ అయోడిన్ లోపం బలంగా ఉంటే ‘గాయిటర్’ అనే లక్షణం కనబడుతుంది. దీన్ని తెలుగులో ‘కంఠమాల’ అంటారు. గొంతు బాగా వాచి పెద్దదిగా కనిపించే ఈ సమస్యకు కారణం అయోడిన్ లోపమే. ఫలితంగా థైరాయిడ్ గ్రంథి పెద్దది అవుతుంది. ఎక్కువ అయోడిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.20వ శతాబ్దంలో ప్రపంచమంతటా తెలివితేటలు పెరగడానికి కారణం అయోడిన్ కలిపిన ఉప్పు తినడమే అన్నసంగతి పరిశోధకులు గమనించారు. సముద్రంలో పెరిగే మొక్కలు, మిగతా సముద్రం నుంచి వచ్చే తిండి పదార్థాలలో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. ఆవు పాలలో కూడా అయోడిన్ ఉంటుంది. మనదేశంలో కాకపోవచ్చు కానీ చాలా చోట్ల ఆవులకు పెట్టే తిండిలో అయోడిన్ కలుపుతారు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కొంతవరకు అయోడిన్ ఉండే వీలుంది. అవి నేల నుండి ఈ ఖనిజాన్ని గ్రహిస్తాయి. అయితే అన్నిచోట్లా ఈ పదార్థం అన్ని రకాల పంటలలో ఒకే రకంగా ఉండదు. ఒకప్పుడు స్విట్జర్లాండ్లోనూ, యూఎస్లోని మిషిగన్ ప్రాంతంలోనూ కంఠమాల వ్యాధి ఎక్కువగా కనిపించేది. భారతదేశంలో కూడా ఈ సమస్య గమనించవలసిన స్థాయిలో కనిపించేది.ఆ జాగ్రత్త ఉందా?1922 సంవత్సరంలో స్విట్జర్లాండ్ దేశంలో ఉప్పుతోబాటు అయోడిన్ కలిపి తినాలని నిర్ణయించారు. దాని తర్వాత కొంత కాలంలోనే ఆ దేశంలో గాయిటర్ వ్యాధి బాగా తగ్గినట్టు తెలిసింది. పిల్లల ఎత్తు బాగా పెరిగింది. ‘డిమిట్రా పొలిటి’ అనే ఆర్థికవేత్త తెలివి విషయంగా ఆ ప్రాంతాలలో జరిగిన మార్పు గురించి ఎంతో కృషిచేసి పత్రాలు సమర్పించారు. 1924లో మిషిగన్లో కూడా అయోడైజ్డ్ ఉప్పు వాడకం మొదలయింది. ఆ తర్వాత మరెన్నో దేశాలు అదే దారిలో నడిచాయి. మన దేశంలో మాత్రం ఆ జాగ్రత్త కనిపించలేదు. తర్వాత కాలంలో మాత్రమే అయోడైజ్డ్ ఉప్పు గురించి ప్రచారం మొదలైంది. మొత్తం మీద ప్రపంచమంతటా 20వ శతాబ్దంలో అయోడిన్ వాడకం కారణంగా ఐక్యూ స్థాయిలో పెరుగుదల కనిపించింది.అయోడిన్ ప్రకృతి సిద్ధమయిన ఖనిజ పదార్థం. కానీ అదేదో అనవసరమైనది అన్న భావం చాలామందికి ఉండటం ఆశ్చర్యకరం. యూఎస్లో జరిగిన ఇటీవల పరిశోధనల్లో సుమారు సగం మంది గర్భవతులకు తగినంత అయోడిన్ అందడం లేదని తేలింది. మనదేశంలో ఇటువంటి పరిశోధనలు జరుగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. అందరూ మరొక సారి, అయోడిన్ కలిపిన ఉప్పు గురించి ఆలోచించాలి. దాని వాడకం ద్వారా పెద్దలకు, ముఖ్యంగా గర్భవతులు, శిశువులకు మెదడు పెరుగుదల గురించి కలిగే ప్రయోజనాలను అందరికీ అందజేయాలి అంటున్నారు పరిశోధకులు.-కే.బి, గోపాలం.. వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత -
Migraine.. మాత్రలు లేకుండానే తగ్గాలంటే మ తినకూడని ఆహారాలు ఇవే!
-
బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..?
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి రక్తపోటు(బీపీ). దీనితో ముడిపడి చాలా రకాల ప్రమాదకర వ్యాధులు ఉన్నాయి. అందువల్ల వైద్యులు ప్లీజ్ బీపీని నియంత్రణలో ఉంచుకోండి, ‘ఉప్పు తక్కువ తినండి’ అని సదా చెబుతుంటారు. నిజానికి ఈ ఒక్క సాధారణ సలహా అన్ని వేళలా సముచితం కాదు. మందుల తోపాటు జీవనశైలిని ప్రభావితం చేసే ఈ 3-3-3 రూల్ని అనుసరిస్తే బీపీ దెబ్బకు నియంత్రణ ఉంటుందని నమ్మకంగా చెబుతున్న ఆరోగ్య నిపుణులు. మరి అదెలాగో సవివరంగా చూద్దామా.!.చాలామంది రోగులు ఎక్కువగా మందులపై ఆధారపడుతుంటారు. దానికంటే అర్థవంతమైన జీవన మార్పులతో ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జీవనశైలిని మంచిగా ప్రభావితం చేసే ఈ 3-3-3 రూల్ రక్తపోటుని చాలా సులభంగా నియంత్రణలో పెట్టగలదని అంటున్నారు. మరి ఈ రూల్ ఎలా సహాయపడుతుందంటే..సాధారణంగా ఉప్పు తక్కువ, వ్యాయమాలు అధికం వంటి సలహాలను రోగులు నిలకడగా పాటించాలంటే కష్టం. అలగే కేవలం ఉప్పు అధికంగా తీసుకోవడం వల్లే అధిక రక్తపోటుకి దారితీయడం లేదంటున్నారు. ఇన్సులిన్ నిరోధకత, జీవక్రియ లోపాలు వంటి కారకాలతో కూడా ముడిపడి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జీవక్రియ లోపం కారణంగా శరీరంలోని కణాలు ఇన్సులిన్కి సరిగ్గా స్పందించడం మానేస్తాయి. దాని ఫలితంగా శరీరం సోడియం నీటిని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో రక్తనాళాలు గట్టిపడి, శరీరంలోని సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ చురుకుగా మారుతుంది. అంటే అంతర్లీనంగా ఉన్న జీవక్రియ లోపానికి చికిత్స తీసుకోకుండా కేవలం ఉప్పు తగ్గస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు నిపుణులు.‘3-3-3’ రూల్ అంటే..ఇందులో మొదటిది ఆహారం, రెండోది, రోజువారీ అలవాట్లు, మూడోది ఆరగ్యో తనిఖీలుగా విభజించి ఆరోగ్యంగా ఉండేలే చేసే హెల్దీ సూత్రం ఇది.1. మొదటి ‘3’ ఆహారపు అలవాట్లు(1) కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించడం..తెల్ల రొట్టె, బిస్కెట్లు, నమ్కీన్, స్వీట్లు, చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన తృణధాన్యాలు - ఇవి రోజంతా పదేపదే ఇన్సులిన్ను పెంచుతాయి. ఇలా ఇన్సులిన్ అధికంగా ఉండటం అనేది అధిక రక్తపోటుకు దారితీసే కారణాలో ఒకటి. వీటికి దూరం చేసే ఒక్క మార్పు రక్తపోటును గణనీయంగా తగ్గించడంలో అత్యంత ప్రభావంతంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.(2) ప్రతి భోజనంలో ప్రోటీన్ తీసుకోండిప్రతి భోజనంలో గుడ్లు, పనీర్, చికెన్ లేదా చేపల నుండి 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. తగినంత ప్రోటీన్ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లపై కోరికలను తగ్గిస్తుంది, అలాగే శరీరాన్ని ఇన్సులిన్-సెన్సిటివ్గా మార్చే కండర ద్రవ్యరాశికి మద్దతు ఇస్తుంది.వాస్తవానికి చాలా మంది భారతీయ అల్పాహారాలు మరియు మధ్యాహ్న భోజనాలలో ప్రోటీన్ ప్రమాదకరంగా తక్కువగా ఉంటుంది.(3) ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడందేశీ నెయ్యి, వెన్న, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, ఇవి రక్తపోటును పెంచవు. ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది.2. రెండో ‘3’ డైలీ దినచర్య..(1) రోజువారీ అలవాట్లుకేవలం కార్డియో మాత్రమే కాకుండా, రెసిస్టెన్స్తో కదలండిఇవి వారానికి మూడు సెషన్లు, ఒక్కోసారి 30-40 నిమిషాలు చేయడం, కేవలం నడవడం కంటే రక్తనాళాలకు ఎక్కువ మేలు చేస్తుంది.(2) కూర్చోవడాన్ని తగ్గించడంఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా కూర్చోవడాన్ని సాయంత్రం నడకతో సరిచేయలేము.ప్రతి గంటకు 2-3 నిమిషాలు నిలబడి కదలండి.(3) శ్వాసపై ఫోకస్ప్రతిరోజూ 5-10 నిమిషాల పాటు నెమ్మదిగా శ్వాస తీసుకోండి.నిమిషానికి ఆరుసార్లు, ముక్కు ద్వారా గాలి లోపలికి పీల్చి, నెమ్మదిగా బయటకు వదలండి.క్రమబద్ధమైన శ్వాస సిస్టోలిక్ బీపీని తగ్గిస్తుంది.3. మూడో ‘3’ వారంతపు తనిఖీలేప్రతి వారం తనిఖీ చేయవలసిన 3 విషయాలు(1) బీపీ చెకింగ్వారానికి కనీసం రెండుసార్లు ఇంట్లోనే బీపీ చెక్ చేయడంఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత, ఒకే చేతికి, ఒకే సమయంలో కొలవండి.(2) నడుము కొలతముఖ్యంగా దక్షిణాసియా వ్యక్తుల శరీరాల BMI కంటే నడుము-ఎత్తు నిష్పత్తి జీవక్రియ ప్రమాదాన్ని స్పష్టంగా అంచనా వేస్తుంది. మీ నడుమును మీ ఎత్తులో సగం కంటే తక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.(3) మంచి నిద్ర..కనీసం ఏడు గంటలు నిద్ర ఉండేలా చేసుకోవాలి. లేదంటే నిద్రలేమితో బాధపడే వారి శరీరాలు కార్టిసాల్పై ఆధారపడి పనిచేస్తాయి, ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచి, బీపీని అధికం చేస్తాయి.ఈ ‘3-3-3’ రూల్ మందులకు ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నారు వైద్యులు. మందుల తోపాటు..జీవనశైలిలో ఈ రూల్ని అప్లై చేస్తే..సమర్థవంతంగా బీపీ నియంత్రణలో ఉండటమే గాక వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?) -
రోజుకి రెండు పెగ్గులు పడాల్సిందే..కంట్రోల్ చేయడం ఎలా?
మా నాన్న గారికి 64 ఏళ్లు. చిన్న వయసు నుంచే మందుకు బాగా అలవాటు పడ్డారు. ఆయనకు బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ మందు మానడు. ఏమంటారంటే డాక్టర్లే చెబుతారు కదా... రోజుకి రెండు పెగ్గులు తీసుకోమని అని వాదిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో మేము గమనించింది ఏమిటంటే ఆయన చెప్పే వాటిలో చాలా వరకు అబద్ధాలు ఉంటున్నాయి, కానీ ఆయనకి ఆ విషయం అర్థం కావట్లేదు. ఆయన బాగా తూలుతున్నారు. మాటిమాటికి పడిపోవడం, దెబ్బలు తగిలించుకోవడం జరుగుతోంది. మూత్రంపై అదుపు ఉండట్లేదు. గత ఆరు నెలల నుంచి నిద్ర సరిగ్గా పోవట్లేదు. ఇట్లా ఉండి కూడా మందు మాత్రం మానలేదు. మేము దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్కి, న్యూరాలజిస్ట్కి కూడా చూపించాము. వాళ్లు మందులు రాసిస్తున్నారు కానీ ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మీరు దీని గురించి ఏమైనా సలహా ఇవ్వగలరా?– రమేష్, యానాం మీ సమస్య విన్నాక చాలా బాధగా ఉంది. ముందుగా ఈ డాక్టర్లు రెండు పెగ్గుల గురించి చెప్పుకునే విషయం ఎలా వచ్చిందంటే, దీనికి ఒక ‘మెడిటెరేనియన్స్ డైట్’ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ డైట్లో ΄పాశ్చాత్యదేశాల్లో ప్రజలు ఎక్కువగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకుంటారు. అంటే తాజాపండ్లు, ఆకుకూరలు, సముద్రపు చేపలు లాంటివి. వీటిలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు కొందరు రోజుకు 30 నుంచి 60 ఎం.ఎల్. వరకు మాత్రమే వైన్ తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ కాదు. అలాగే రోజూ వ్యాయామం కూడా చేస్తుంటారు. ఈ మొత్తం జీవనశైలిని కలిపి ‘మెడిటేరియన్స్ డైట్’ అంటారు. దీనివల్ల గుండెజబ్బులు తగ్గుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కానీ మన దగ్గర చాలామంది ఈ మొత్తం విషయాన్ని పక్కన పెట్టేసి ‘‘రోజుకి రెండు పెగ్గులు మంచిదట’’ అన్న ఒక్క మాటనే పట్టుకుంటారు. దీనినే సైకాలజీలో ‘సెలక్టివ్ అబ్స్ట్రాక్షన్’ అంటారు. నిజానికి మన దగ్గర చాలామంది ఒకటి లేదా రెండు పెగ్గులతో ఆగరు. సరైన డైట్ కూడా తీసుకోరు. తాగిన తర్వాత భోజనం మానేస్తారు. దాంతో శరీరంలో విటమిన్ బీ1 లోపం వస్తుంది. అలా వచ్చినప్పుడు మొదట్లో అయోమయం, నడకలో తేడా, తూలడం లాంటివి వస్తాయి. ఇవన్నీ మీ నాన్నగారిలో కనిపిస్తున్న లక్షణాలే. ఈ దశలోనే మందు పూర్తిగా ఆపి సరైన వైద్యం తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. కానీ చాలామంది ఆల్కహాల్ తాగుతూనే ఉంటారు, మందులు సరిగా వాడరు. దానివల్ల మెదడుకి శాశ్వతంగా నష్టం కలుగుతుంది. మెదడులో జ్ఞాపకశక్తి , సమతుల్యతకి సంబంధించిన భాగాలు దెబ్బ తింటాయి. దీనివల్ల మతిమరపు వస్తుంది. గుర్తు లేక΄ోయినా, ఖాళీలను నింపడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవి కావాలనే చెప్పే అబద్ధాలు కాదు. ప్రస్తుతం దీనిని తగ్గించేందుకు ప్రత్యేకించి మందేం లేదు కానీ అధిక మోతాదులో విటమిన్లు ముఖ్యంగా విటమిన్ బీ1 ఇవ్వాలి. నిద్ర కోసం కూడా కొంతవరకు మందులు అవసరం కావచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. ఇవన్నీ చేస్తే కొంతవరకు రికవరీ కనిపిస్తుంది. ఇంటి దగ్గర ఆయన్ని ఆపడం కష్టమైతే, మంచి రీహాబిలిటేషన్ కేంద్రంలో చేర్పించండి. అక్కడ క్రమపద్ధతిలో చికిత్స ఉంటుంది కాబట్టి ఆయన బాగుపడే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.సమస్య నుంచి రిలీఫ్కని కొందరు; సంతోషాన్ని సెలబ్రేట్ చేసేందుకని కొందరు ఏదో ఒక వంకతో డ్రింక్ తీసుకోవటం తరచుగా మనందరం చూసే విషయమే! వారందరికీ తాగటం ముఖ్యం. దానికోసం ఏదో ఒక కారణం వెతుక్కుంటారు కాబట్టి ఆల్కహాల్ ఏ రూపంలోనూ తీసుకోకుండా పూర్తిగా దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com )(చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
రెండు వారాల పాటు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందంటే..
ఇటీల ఆరోగ్య స్పృహతో గ్రీన్టీ వంటివి తీసుకుంటున్నారు. అందులోనూ వర్కౌట్లు, డైట్లు పాటించేవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి రోజు గ్రీన్టీ తోనే మొదలవుతుంది. అయితే ఇలా గ్రీన్టీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఒక ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సోషల్ మీడియా వేదికగా దాని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా వివరించారు. మరి అవేంటో చూద్దామా.!గ్రీన్ టీ తాగడం అనేది ఒక సాధారణ ఆరోగ్యకరమైన విధానంగా పేర్కొనవచ్చు. దీనిలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలతో నిండిన గ్రీన్ టీతో మెరుగైన సంపూర్ణ ఆరోగ్యం ముడిపడి ఉందని చెబుతున్నారు నిపుణులు. అలాంటి గ్రీన్టీని క్రమంతప్పకుండా తీసుకుంటే.. జీవక్రియ, మెదడు పనితీరు, కాలేయ ఆరోగ్యం తదితరాలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. కేవలం 14 రోజుల్లోనే..గొప్ప మార్పులు..కేవం 14 రోజుల్లోనే ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో అర్థవంతమైన మార్పులు ఎలా సంతరించుకుంటాయో గమనించొచ్చని అన్నారు. అంతేగాదు హర్వర్డ్ అండ్ స్టాన్ఫోర్డ్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ 14 రోజుల పాటు ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే ఇలా జరుగుతుందంటూ ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన ఈ వీడియోకి ఇది ఆరోగ్యకరమైన అలవాటా? లేక అతిగా ప్రచారం చేయబడిన ట్రెండా? అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు.కలిగే ప్రయోజనాలు..ఆ వీడియోలో గ్రీన్ టీ వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే మొదటి అవయవాలలో కాలేయం ఒకటని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ టీలో EGCG వంటి కాటెచిన్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కాలేయ వాపును తగ్గించి, జీవక్రియను మెరుగుపరుస్తాయని అన్నారు. అంతేగాదు యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటం ద్వారా పనిచేస్తాయి, ఇది అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా కాఫీ వల్ల వచ్చే త్రీమైన వణుకుని నివారించి ఏకాగ్రత శక్తిని పెంచుతుందట. అంతేగాదు మెదడు చురుకుగా ఉంటుందని చెబుతున్నారు View this post on Instagram A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చెమట ఇబ్బంది పెట్టకూడదంటే..) -
మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి
-
చెమట ఇబ్బంది పెట్టకూడదంటే..
వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పట్టడం సహజమే. అయితే కొందరికి మాత్రం ఈ చెమట వల్ల చర్మంపై బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది దుర్వాసనకు దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్ హైడ్రోసిస్ సమస్య ఉన్నవారికి ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు...స్నానానికి యాంటీ బ్యాక్టీరియల్ సబ్బును వాడటం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత బాహుమూలలు, పాదాలు, చర్మం మడతలు ఉండే ప్రాంతాల్ని తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి.గాలి ఆడేలా ఉండే కాటన్ బట్టల్ని ధరించాలి. ఇవిగాక యాంటీ–పెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ వాడటం వల్ల దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను చంపి, మంచి సువాసనను ఇస్తాయి.వీటికన్నా ముఖ్యం ఏమిటంటే.. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు, కెఫీన్, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన వచ్చే ఆహార పదార్థాల్ని తగ్గించాలి.తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం సహజమైన సమతుల్యతను కలిగి ఉంటుంది. అలాగే తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే చెమట గాఢత తగ్గి, దుర్వాసన తక్కువగా వస్తుంది. -
కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?
-
కేన్సర్పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్పాండే హెల్త్ టిప్స్
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక వచ్చిందంటే ఆ క్షణమే సగం ప్రాణాలు పోతాయ్. కానీ ఇలా భయపడొద్దని చెబుతోంది బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్పాండే. తాను కేన్సర్తో పోరాడినప్పుడు అలానే చేశానంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి అదెలాగో చూద్దామా..!.'సేక్రేడ్ గేమ్స్' (2018), 'ట్రయల్ బై ఫైర్' (2023) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి రాజవ్రీ దేశ్పాండ్కు మార్చిలో గ్రేడ్1 రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తనకు ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా (NOS) నిర్ధారణ అయినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఆమె తను తీసుకుంటున్న చికిత్స, వ్యాధి నిర్ధారణ, శారీరక మానసిక ఆరోగ్యంపై ఆ వ్యాధి ఎలా ప్రభావం చూపిస్తుంది తదితరాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నారామె.పోరాడాలి..పోరాడుతూనే ఉండాలి..ఈ కేన్సర్ మహమ్మారి సోకిన తర్వాత మనం కంటకి కనిపించని భూతాలతో పోరాడుతూ ఉండాల్సి ఉంటుందన్నారామె. ఎందుకంటే నిలకడ లేని మనసులను మనల్ని ప్రలోభ పెట్టే ఇబ్బందుల్ని భూతలుగా అభివర్ణిస్తు ఇలా అన్నారామె. జీవితం అంటే అదేనని, పోరాడాలి..పోరాడుతూనే ఉండాలన్నారు. అస్సలు దీన్ని కష్టమైనదిగా భావించొద్దు. మనల్ని మనం సరిదిద్దుకునే జీవితంగా భావించండి. అప్పుడు ప్రతీది తేలికగా మారుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మెరుగ్గా ఉండేలా జీవించే ప్రయత్నం చేయండి. రోజువారీ పనుల్లో ఆనందాన్ని వెత్తుక్కోవాలి. అలాగే కేన్సర్కి వాడే మందులు ఎంత కఠినండో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. 35 ఏళ్ల తర్వాత పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ దశలో ఉన్న ప్రతి మహిళకు ఇవి ఎంత కష్టమో తనకు తెలుసని అన్నారు. ఆ చిన్ననాటి సంఘటనే నా ధైర్యం..ఈ కేన్సర్ని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని ఇచ్చిన ఆ చిన్ననాటి సంఘటనను పంచుకున్నారు. చిన్నతనంలో తనకు దెయ్యాలంటే చాలా భయంగా ఉండేదని, అప్పుడు నాన్నగారు దెయ్యాలంటే చెడ్డవాళ్లని చెప్పారు. అంతే ఆ క్షణం నుంచి అవి అంటే భయం పోయింది. అలానే ఈ కేన్సర్ని కూడా చెడ్డదిగా బావించి, పారద్రోలే ప్రయత్నం చేశానంటోంది. అంతేగాదు అందుకోసం మనసు, హృదయం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ చెడ్డవాళ్ల తలంపు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తే చాలు అంటోంది. తన ఫ్యామిలీ డాక్టర్ కూడా అదే చెప్పారని చెప్పుకొచ్చింది. ఆయన మీలో సంతోషకరమైన హార్మోన్ల తోపాటు చుట్టూ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులు ఉండాలన్నారు. దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలన్నారు. ఇలా చేస్తే ఏ మహమ్మారి మిమ్మల్ని ఏం చేయలేదన్నారు. కాగా నటి రాజశ్రీ దేశ్పాండే తన తదుపరి మరాఠీ చిత్రం 'బాప్యా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ నెల మే 15న విడుదల కానుంది. ఇందులో ఆమె ట్రాన్స్ మ్యాన్ పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్') -
ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్'
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరును అధికారికంగా పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ (PMOS)గా మార్చారు. అందరు ఈ వ్యాధిని దీర్ఘకాలిక వ్యాధిగా కాకుండా సంతానలేమి సమస్యగా పరిగణిస్తూ అపార్థం చేసుకోవడంతో ప్రపంచ వైద్య ఏకాభిప్రాయం తర్వాత ఇలా అధికారికంగా ఆ వ్యాధి పేరు మార్చారు. ప్రపంచంలోని చాలామంది మహిళల్లో కనపించే అత్యంత సాధారనమైన రుగ్మతలలో ఒకటి ఇది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు ఇలా చారిత్రాత్మకంగా కొత్తపేరు నామకరణం చేశారు. అంతర్జాతీయ ఎండోక్రైన్ అండ్ పునరుత్పత్తి ఆరోగ్య నిపుణుల నేతృత్వంలో ప్రపంచ వైద్యుల చర్చల ఫలితమే ఈ పీఎంఓస్గా పేరు మార్పు. దేని గురించి ఈ పేరు మార్పు..ఇన్నాళ్లు ఈ పీసీ ఓఎస్ అనేది అండాశయ తిత్తుల గురించే నొక్కి చెప్పలా ఉంది. నిజానికి చాలామంది మహిళలకు అండాశయ తిత్తులనేవి ఉండవు. అందువల్ల ఈ పందం "PCOS" వైద్యపరంగా తప్పుదోవ పట్టించేలా ఉందని నిపుణులు వాదించారు. పైగా జీవక్రియ, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పాత పేరు సరిగా వివరించలేకపోయిందని అన్నారు.ఈ కొత్తపేరు ఏం వివరిస్తోందంటే..పాలీఎండోక్రైన్: అనేక హార్మోన్ల వ్యవస్థలు ప్రభావితమవుతాయిమెటబాలిక్: ఈ పరిస్థితి ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదంతో దగ్గరి సంబంధం ఉందిఓవేరియన్: ఇది ఇప్పటికీ అండోత్పత్తి, రుతుస్రావం, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందిసిండ్రోమ్: ఇది ఒకదానికొకటి సంబంధించిన లక్షణాలు,ఆరోగ్య ప్రమాదాల సమూహాన్ని సూచిస్తుందిఈ పేరు మార్పు లక్ష్యం రోగ నిర్ధారణను మెరుగుపరచడం, అపవాదును తగ్గించడం, మరింత సంపూర్ణమైన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం అని ఎండోక్రైన్ సొసైటీ తెలిపింది. స్కాన్లలో అండాశయ తిత్తులు కనపడితే తప్ప తమకు PCOS ఉండదని చాలా మంది మహిళలు నమ్మడం వల్ల, పాత పేరు తరచుగా రోగ నిర్ధారణను ఆలస్యం చేసిందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.PMOS అంటే..?PMOS అనేది గతంలో PCOS అని పిలువబడిన అదే వైద్య పరిస్థితి. దీని నిర్ధారణ ప్రమాణాలు మారలేదు. ఇది ఒక హార్మోనల, జీవక్రియ రుగ్మత,లక్షణాలు:క్రమరహిత లేదా ఋతుస్రావం లేకపోవడంఅధిక ఆండ్రోజెన్ హార్మోన్లుమొటిమలు,ముఖంపై రోమాలు పెరగడంబరువు పెరగడం లేదా బరువు తగ్గడంలో ఇబ్బందిఇన్సులిన్ నిరోధకతసంతానోత్పత్తి సవాళ్లుకొంతమంది రోగులలో అనేక అపరిపక్వ అండాశయ ఫోలికల్స్ ఉండటంఈ పరిస్థితి వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలు..టైప్ 2 మధుమేహంఅధిక రక్తపోటుగుండె జబ్బులుఫ్యాటీ లివర్ వ్యాధినిద్రలేమిడిప్రెషన్, ఆందోళనప్రపంచవ్యాప్తంగా, దాదాపు ఎనిమిది మంది మహిళల్లో ఒకరు PMOSతో బాధపడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ సమస్యకు గల కారణాలు:నిశ్చల జీవనశైలిప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపెరుగుతున్న ఊబకాయంసరిగా నిద్రపోకపోవడంఒత్తిడివంశపారంపర్య కారణాలురోగ నిర్ధారణను మెరుగుపరుస్తుందిఇక ఈ కొత్త పేరు PMOS అనే పదం సంతానలేమి సమస్యల నుంచి దృష్టిని మళ్లించి, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యల కోసం ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోనేలా ప్రోత్సహిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది మహిళలు ఈ వ్యాధిని తేలికగా తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకునేవారు కాదు. ఈ పేరు మార్పుతో మహిళలంతా ఆరోగ్య స్పృహతో ఆలోచించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్గా మార్చింది..) -
మీరు రోజు టీ ఇలా తాగుతున్నారా? అయితే జాగ్రత్త!
-
నీట్గా ఉందాం..ఆ మొక్కల చిక్కులొద్దు!
మొక్కలు నేల మీదే పెరుగుతూ ఉంటాయన్నది అపోహ. కానీ అవి నేల మీదే కాదు... మానవుల చర్మం సహా అన్ని రకాల జంతువుల దేహాల మీదా, మొక్కల మీద కూడా పెరుగుతుంటాయి. మనుషుల చర్మం మీదే కాదు... వెంట్రుకల మీదా, గోళ్ల మీద కూడా పెరుగుతాయి. దీనికి తార్కాణాలను మనం చాలాసార్లు అనుభవించే ఉంటాం. కానీ అవి మన దేహం మీద పెరిగే ‘ఫంగస్’ కారణంగా అని తెలియదు. ఉదాహరణకు తప్పని పరిస్థితుల్లో తడి అండర్వేర్ తొడుక్కున్న సమయాల్లో గజ్జల్లో ఒరుసుకుపోయినట్లు కావడం, తొడలు, పిరుదులు, ప్రైవేట్ పార్ట్స్ వద్ద చర్మం నల్లబారి దురదగా అనిపించడం, గోరు మీద గోరుచుట్టు... ఇవన్నీ ఫంగస్ పెరుగుదల వల్ల కనిపించేవే. వీటినే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్ డిసీజెస్గా పేర్కొంటారు. సాధారణంగా మన దేహంలోని అనేక చోట్ల పెరిగే ఫంగల్ డిసీజెస్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం...నిజానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దేహంలో అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడైనా రావచ్చు. అందుకే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లను అబిక్విటస్ అంటారు. నిజానికి నేల (సాయిల్) మీద లేదా పండ్ల మీద కూడా కుళ్లుతున్నచోట ఇవి మొలుస్తుంటాయి. పండ్లు కుళ్లడానికి కారణం ఈ ఫంగసే. వృథా పదార్థాలన్నీ మళ్లీ ఖనిజలవణాల్లా రూపంలోకి మారిపోయి తమ మౌలికమైన అణువులుగా తనలో కలిసిపోడానికి ప్రకృతి తన కోసమే ఈ ఫంగల్ రూపాలనుసృష్టించుకుందని చెప్పవచ్చు. అలా చూసినప్పుడు ఫంగస్ జీవులు ప్రకృతికి మేలే చేస్తాయి.పూర్తిగా మొక్కలూ కావు... సూక్ష్మజీవులూ కావు... జీవశాస్త్రపరం (బయలాజికల్)గా చూసినప్పుడు మొదట్లో వాటిని మొక్కల్లోని ఒక విభాగంగా చూసేవారు. అందుకే వృక్షశాస్త్రం (బాటనీ)లోని ఒక విభాగంగానే వాటి అధ్యయనం కొనసాగేది. కానీ వాటిలోనే పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అవి పూర్తిగా మొక్కలూ కావనీ, అలాగని పూర్తిగా సూక్ష్మజీవుల కింద కూడా వాటిని పరిగణించలేమని తేలింది. దాంతో ఫంగస్లను ఇప్పటికీ వృక్షశాస్త్రవిభాగంలోనే చదువుతున్నప్పటికీ... వాటి గురించి చాలా లోతుగా, సూక్ష్మంగా అధ్యయనం చేసేవారు మాత్రం ఫంగస్లను ‘మైకాలజీ’ అనే ఓ ప్రత్యేక శాస్త్రవిభాగంగా పరిణమిస్తుంటారు.ఫంగస్ రకాలు... ఫంగస్లోని రకాలను వర్గీకరించేటప్పుడు వాటిలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు...ఆకృతిని బట్టి : వాటి ఆకారాన్నీ / ఆకృతిని బట్టి వర్గీకరణ చేస్తే... ఈస్ట్ అనీ, మౌల్డ్స్ అనీ వర్గీకరించవచ్చు, ఇందులో ఈస్ట్ అనేవి ఆహారాన్ని పులిసేలా చేస్తూ మనకు ఉపయోగపడుతుంటాయి. కానీ మౌల్డ్స్ మాత్రం ఆహారానికి బూజులా పట్టి మన ఆహారాలను తినడానికి యోగ్యం కాకుండా చేస్తాయి. (ఉదాహరణకు బ్రెడ్ను అలాగే వదిలేస్తే ఆకుపచ్చరంగులో బూజు రావడం మనకు తెలిసిందే).స్పీషీస్ (ప్రజాతులను) ఆధారంగా: ఫంగస్ ప్రజాతులను అంటే వాటి స్పీషీస్ను బట్టి చూసినప్పుడు... డెర్మటోఫైట్ స్పీషీస్, క్యాండిడా స్పీషీస్, మలేసేజియా స్పీషీస్ అనే రకాలు ఉంటాయి. మన దేహంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో చర్మంపై వచ్చేవి డర్మటోఫైట్స్ స్పీషీస్కు చెందినవనీ, ఇక గజ్జలు లేదా చర్మం ముడతల్లో వచ్చే ఎర్రటి ఇన్ఫెక్షన్ను క్యాండిడా స్పీషీస్వని చెప్పవచ్చు.ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి : చర్మంపై వాటి తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే వాటిని ఉపరితలానికే పరిమితమయ్యేవి (సూపర్ఫీషియల్), చర్మంలోపల చాలా లోతుగా ఇన్ఫెక్ట్ చేసేవి (డీప్ స్కిన్) అని వర్గీకరించవచ్చు. సాధారణంగా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ పైపైనే వస్తాయి. కానీ ఎయిడ్స్ వ్యాధి సోకినవారిలో వచ్చేవి చాలా డీప్ స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉంటాయి.ఎన్విరాన్మెంట్ను బట్టి చూస్తే : మన పర్యావరణంలో అవి పెరిగే చోటను బట్టి కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నేల మీద పెరిగేవాటిని జియోఫిలిక్ అనీ, జంతువులపై నివసించేవాటిని జూఫిలిక్ అనీ, కేవలం మానవుల దేహంపైనే పెరిగేవాటిని ‘యాంథ్రపోఫిలిక్’ అని అంటారు.సాధారణంగా అడల్ట్స్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లుటీనియా కార్పోరిస్ : ఇది టైకోఫైటాన్ రబ్రబ్ అనే పంగ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది పాదాలూ, చేతులు, మర్మావయవాలు (ప్రైవేట్ ΄పార్ట్స్) మినహా దేహంలో ఎక్కడైనా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది అన్ని వయసుల వారిలోనూ రావచ్చు. ముఖ్యంగా పాడిపశువుల, పందుల పెంపకంలో నిమగ్నమయ్యేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొందరిలో వారాలూ, నెలలూ, కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల పాటు కూడా ఏమాత్రం మానకుండా అదేపనిగా కనిపిస్తూ ఉంటుంది. చాలాసందర్భాల్లో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం దురద రావచ్చు. కొందరిలో మాత్రం చిన్నవి మొదలుకొని పెద్దగా ఉండే ఎర్రటి, గుండ్రటి, అంచులు ఉబ్బినట్టుగా కనిపించే ప్యాచ్లు రావచ్చు. ఈ గుండ్రటి అంచులు అన్ని పక్కలకూ వ్యాప్తిస్తూ... మధ్యలోని చర్మం మామూలుగా ఉండవచ్చు. ఇలా వచ్చే రింగులు ఒకదారితో మరొకటి కలిపిపోయేంతగా విస్తరిస్తూ పెద్దగా పెరగవచ్చు. కొన్నిసార్లు పగుళ్లూ, పొక్కల వంటివి (బ్లిస్టర్స్ అండ్ గ్రాన్యులోమా) వంటివీ కనిపించవచ్చు. వీటినే మాజోకాస్ గ్రాన్యులోమా అని పిలుస్తారు. కొన్నిసార్లు కొందరిలో అంతగా ప్రకాశవంతంగా లేని వెండిరంగులో ఉండే సోరియాఫార్మ్ మచ్చల వంటివీ కనిపించవచ్చు. ఇది జంతువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.టీనియా క్రూరిస్ (ధోబీస్ ఇచ్) : ఇది ప్రైవేట్ పార్ట్స్ వద్ద కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్నే సాధారణంగా అందరూ ‘ధోబీస్ ఇచ్’ లేదా ‘జాక్ ఇచ్’ అని పిలుస్తారు. ఒక్కోసారి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గడ్డ›రూపంలో వచ్చి బాధిస్తుంటుంది. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట పట్టి తడిగా, చెమ్మతో ఉండే చోట్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. సాధారణంగా బిగుతైన దుస్తులు ధరించడం వల్లా... అలాగే స్థూలకాయం కారణంగా బట్టలు బిగుతుగా ఉన్నప్పుడూ... ఇక చాలాకాలంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడుతున్నవారిలోనూ ఈ సమస్య కనిపించడానికి అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్య తరచూ వస్తూ ఉంటుంది. నెలల నుంచి ఏళ్ల తరబడి బాధిస్తూ ఉండే అవకాశాలు ఎక్కువ. గతంలో పాదాలకు ‘టీనియా పెడిస్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు మరీ మరీ ఎక్కువ. ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎర్రటి / నల్లటి మచ్చలతో... అలాగే తరచూ దురదతో చాలా అసౌకర్యానికి గురిచేస్తుంటుంది. అయితే ఇది వృషణాల సంచి చర్మంపైనా లేదా పురుషాంగం పైనా పాకడం మాత్రం చాలా చాలా అరుదు.టీనియా మ్యాన్యువమ్ : ఇది చేతులకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఒక్కోసారి కాళ్లలో కూడా రావచ్చు. చేతులపై దురద వస్తుంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన చోట... మధ్యనుండే చర్మం బాగానే కనిపిస్తున్నా అంచులు స్పష్టంగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంటుంది. అరచేతుల వెనకవైపున కనిపిస్తూ... ఒక్కోసారి అరచేతుల్లో పగుళ్లు కనిపిస్తుంటాయి. దీనికి పూత మందులు పనిచేయవు. నోటి ద్వారా (ఓరల్గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్ వంటి మందులు వాడాలి.టీనియా పెడిస్ (అథ్లెట్స్ ఫూట్) : ఆటలాడే వయసున్న పిల్లల్లోనూ, యుక్తవయసువారిలోనూ ఇది కనిపించడం వల్ల దీన్ని ‘అథ్లెట్స్ ఫూట్’ అంటారుగానీ... ఆటలకూ దీనికి సంబంధం ఉండదు. అయితే అరుదుగా కొందరిలో 50 ఏళ్ల వయసు వారిలోనూ కనిపించవచ్చు. అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. బిగుతుగా ఉండే ΄పాదరక్షలు (ఫుట్వేర్) వాడేవారిలోనూ, పాదాలకు చెమట ఎక్కువగా పట్టేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. పాదానికి వచ్చినప్పుడు చర్మం పొట్టులా రాలవచ్చు. అలాగే కొందరిలో కాలి బొటనవేలి కింద పగులులా రావచ్చు. సాధారణంగా కాలివేళ్లలో నాలుగు, ఐదో వేలి మధ్యన కనిపిస్తుండవచ్చు. ఎక్కువగా నీళ్లలో ఉండేవారిలో కనిపిస్తుంటుంది. ఇందులో రెండు రకాలుంటాయి. మడమకూ, మడమ అంచులకు మాత్రమే పరిమితైన దాన్ని ‘మోకాసిన్ టైప్’ అంటారు. ఒకవేళ పాదం / మడమ అంతటా నీటిబుడగలు, తిత్తుల రూపంలో కనిపిస్తే దాన్ని ‘బ్లూలస్ టైప్’ అంటారు. కాస్తంత వదులుగా, సౌకర్యంగా ఉండే పాదరక్షలు ధరించడం, స్నానం తర్వాత పాదాలను బెంజోల్ పెరాక్సైడ్తో శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చు. అలాగే క్లాకిమాజోల్, మైకోనజోల్, కీటోకెనజోల్, ఎకోనజోల్ వంటి పూతమందులతోనూ దీనికి చికిత్స అందించవచ్చు.క్యాండిడియాసిస్ : ఇది ఈస్ట్ తరహా ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. సాధారణంగా నోటిలోనూ లేదా ప్రైవేట్ పార్ట్స్ (మర్మావయవాల) వద్ద వస్తుంటుంది. అక్కడ నిత్యం చెమట పడుతూ తడిగా, చెమ్మగా ఉండటం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. క్యాండిడే అబ్బిలెన్స్ అనే ఒక రకం ఫంగస్... మానవుల నోటి నుంచి మలద్వారం వరకు ఉండే జీర్ణవ్యవస్థకు చెందిన మార్గం (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్)లో కాలనీలుగా ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉంటుంది. దీని లక్షణాలను బ్యాక్టిరియల్ లక్షణాలుగా పొరబడి యాంటీబయాటిక్స్ వాడేవారిలో దీని తీవ్రత మరింత పెరిగి బాధిస్తుంది. స్థూలకాయం, డయాబెటిస్, ఎయిడ్స్, చర్మం ఎక్కువగా పట్టే గుణం, ఎండోక్రైన్ సమస్యలూ, స్టెరాయిడ్స్ వాడటం, దీర్ఘకాలిక జబ్బులున్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మం ఎర్రబారడం, దోక్కుపోయినట్టుగా ఉండటం వంటి లక్షణాలతో వ్యక్తమవుతుంది. కొందరు మహిళల్లో ఇది రొమ్ముల కింది భాగంలో ఎర్రబారినట్టుగా వ్యక్తమవుతుంది.ప్రైవేట్ పార్ట్స్ వద్ద వచ్చే క్యాండిడియాసిస్ : ఇది పురుషుల్లో మర్మావవం వద్ద... అలాగే మహిళల్లో యోని వద్ద కనిపిస్తుండే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇందులో వుల్వైటిస్, వుల్వోవెజినైటిస్, బెలనైటిస్, బెలనో΄ోస్థైటిస్ వంటి రకాలు ఉంటాయి. పూతమందులతో, నోటి ద్వారా వాడే మందులతో ఈ ఇన్ఫెక్షన్ను తగ్గించవచ్చు.శోభి మచ్చలు (పిటిరియాసిస్ వెర్సికలర్) : తెలుగులో శోభిమచ్చలు అని పిలిచే ఈ తెల్లమచ్చలు / తెల్లపొడ కూడా ఒక రకం ఫంగస్ వల్లనే వస్తుంది. ఈ సమస్యలో ఎలాంటి నొప్పీ, బాధా లేకపోయినప్పటికీ కాస్తంత అసహ్యంగా కనిపిస్తూ కాస్మటిక్గా ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక్కోసారి ఒక మచ్చపైకి మరో మచ్చ పెరుగుతూ ‘మలసేజియా ఫర్ఫర్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ఎక్కువగా బాగా వేడి వాతావరణంలో ఉండేవారిలోనూ, బాగా చమటలు పడుతూ అవి త్వరగా ఆరి΄ోని పరిస్థితుల్లోనూ, జిడ్డు చర్మం ఉన్నవారిలోనూ ఈ సమస్య ఎక్కువ. అలాగే ఎయిడ్స్ వంటి జబ్బు ఉన్నవారిలో ఈ ఫంగస్ వచ్చే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో బాగా పెరుగుతుంది. కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా కనిపిస్తుంటుంది. కొందరిలో కాస్త దురదలూ కనిపించవచ్చు.కొందరిలో ఈ సమస్యతో ఒక్కోసారి చర్మం పొట్టులా, పొలుసుల్లా రాలిపోతూ ఉండవచ్చు. ఛాతీ, భుజాలూ, మెడ, వీపు, పొట్ట, అరుదుగా కొందరిలో ప్రైవేట్ పార్ట్స్, తొడల వద్ద ఈ సమస్య కనిపించవచ్చు. కర్రదీపంలో చూసినప్పుడు ఈ సమస్య ఉన్నచోట చర్మం నీలి, ఆకుపచ్చ మెరుపుతో కనిపిస్తుంది. ఈ సమస్యకు కీటకెనజోల్ షాంపూలు వాడుతూ, కీటకెనజోల్ క్రీమ్, క్లాట్రిమాజోల్ క్రీమ్ వంటి పూత మందులు వాడుతూ... నోటి ద్వారా (ఓరల్గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్ వంటి మందులు తీసుకోవడం ద్వారా చికిత్స చేయవచ్చు.వెంట్రుకల్లో వచ్చే టీనియా రకాలు టీనియా క్యాపిటిస్ : ఇది రోమం అంకురంలో వచ్చే ఇన్ఫెక్షన్. టీనియా క్యాపిటిస్ మాడు మీద వస్తే పేనుకొరుకుడులా కనిపిస్తుంది. పిల్లల్లో యుక్తవయసుకంటే ముందుగా అంటే... 6 – 10 ఏళ్లవారిలో ఎక్కువగా వస్తుంటంది. తలలో పొలుసుల మాదిరిగా కనిపిస్తాయి. వెంట్రుకలు విరిగిపెతుంటాయి. తలలో మొటిమల్లా వస్తూ కొన్నిసార్లు అక్కడ చీము వంటి స్రావం కనిపిస్తుండవచ్చు. చివరగా... అక్కడి వెంట్రుకలన్నీ గుండ్రని ఆకృతిలో రాలిపోయి మచ్చలా (స్కారింగ్ అలొపేషియాగా) కనిపిస్తుంటుంది. ఇది స్కూలు పిల్లల్లో వచ్చినప్పుడు ఒక చిన్నారి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో ఉండే స్కూళ్లలో పిల్లలను దగ్గర దగ్గరగా కూర్చోబెట్టినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. ఒక్కోసారి ఒకరు వాడిన దువ్వెనను మరొకరు వాడినప్పుడూ ఇది వ్యాప్తి చెందుతుంటుంది. ఇందులోని ఒక రకాన్ని ‘బ్లాక్ డాట్’ అంటారు. ఇందులో మాడుపైన రోమమూలంలో వెంట్రుక విరిగిపోతుంది. వెంట్రుక మూలం దగ్గర క చుక్కలాగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి ఉబ్బిన చుక్కల గుంపు అంతా ఒక ప్యాచ్లా కనిపిస్తుంటుంది.ఇక ‘గ్రే ప్యాచ్’ అనే మరోరకం మచ్చ వచ్చిన చోట కూడా వెంట్రుకలన్నీ విరిగిపోయి... అక్కడ ఓ గోధుమ రంగు ప్యాచ్లా అది కనిపిస్తుంటుంది. ఈ ప్యాచ్లో పొలుసులన్నీ కాస్తంత ఎరుపురంగుకు తిరిగి మచ్చలా కనిపిస్తాయి. ఈ సమస్యలోనూ వెంట్రుకలన్నీ విరిగి రాలిపోయి పేనుకొరుకుడు మచ్చలా కనిపిస్తాయి. కర్రమంట వెలుగులో చూస్తే ఈ మచ్చ... ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది.టీనియా బార్బే : ఇది మాత్రం గడ్డంలో వచ్చి... అక్కడ పేనుకొరుకుడులా కనిపిస్తుంది. కొన్నిసార్లు మీసంలోనూ కనిపిస్తుంది. గడ్డం లేదా మీసంలోని వెంట్రులన్నీ రాలిపోవడంతో అక్కడ పేనుకొరుకుడు మచ్చ కనిపిస్తుంది.ఆగ్మినేట్ ఫ్యాలుక్యులైటిస్ : ఇది కూడా కీకన్ లాగే ఎర్రటి మచ్చలతో కనిపించేదే అయినా... దీనిలో నొప్పి తీవ్రత తక్కువ.ఫేవస్ : ఇందులో రోమమూలంలో ఎర్రగా కనిపిస్తుంటుంది. వెంట్రుకలు ఒకదానితో మరొకటి కలిసి పోయినట్లుగా చిక్కుబడినట్టుగా అల్లుకుపోయి కనిపిస్తుంటాయి. వెంట్రుకల మొదళ్లలో మొదటి ఎరుపురంగులో కనిపించేవి కాస్తా తర్వాత ఉబ్బినట్టుగా పసుపు పొక్కుల్లా కనిపిస్తుంటాయి. రోమంతో పాటుగా అక్కడి చర్మం కూడా శిథిలమై వెంట్రుక కుప్పగా పడిపోవడం వల్ల అది పసుపు పొక్కులా కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి నుంచి దుర్వాసన కూడా రావచ్చు. ఒక్కోసారి వెంట్రుకలన్నీ రాలిపోయి పేనుకొరుకుడుగా కనిపించవచ్చు.పిల్లల్లో సమస్య నివారణ / చికిత్స...స్కూలు పిల్లల తల ఆరోగ్యంగా ఉందా లేదా అని తల్లిదండ్రులు తరచూ వాళ్ల తలలను / మాడును పరిశీలిస్తూ ఉండాలి.కీటోకొనజాల్తో పాటు సెలేనియమ్ సల్ఫైడ్ ఉన్న షాంపూలతో తల స్నానం చేయిస్తూ ఉండటం వల్ల ఫంగస్ల వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చు.పైపూత (టాపికల్ మెడిసిన్)గా రాయాల్సిన యాంటీ ఫంగల్ పూత మందులను వాడటం ద్వారా కొన్ని రకాల ఫంగస్లకు చికిత్స చేయవచ్చు.నోటి ద్వారా యాంటీ ఫంగల్ మందులు ఇవ్వడం ద్వారా చేసే చికిత్స : గ్రీసియోఫల్విన్ మందులుగా చెప్పే యాంటీ ఫంగల్ మందులతో ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించవచ్చు. ఇక వాటితో పాటు టెర్బినాఫిన్స్, ఇట్రాకెనజోల్, ఫ్లూకోనజోల్, కీటాకెనజోల్ వంటి మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ల విచక్షణ మేరకు చర్మంపైన వచ్చే ఎర్రటి మచ్చలను తగ్గించడానికి అవసరమైతే కొన్నిసార్లు కార్టికోస్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సిరావచ్చు. పరిస్థితి కాస్త తీవ్రమై... ఇన్ఫెక్షన్ గనక మొదటి దశ దాటిపోతే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకే (సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్) దశకు చేరితే అప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు.గోళ్లకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్...టీనియా అన్గ్యువమ్ : ఇది గోరు (నెయిల్ ప్లేట్)కు వచ్చే ఫంగస్. ట్రైకోఫైటాన్, రబ్రమ్, ట్రైకోఫైటాన్ మెంటారోఫైట్స్, ఎపిడర్మోఫైటాన్ ఫ్లోకసమ్ వంటి ఫంగల్ రకాల వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇందులో గోటికి ఇరువైపులా ఉండే గోరుభాగం పైకి వచ్చిన చర్మం ముడతల నుంచి వ్యాపిస్తుంది. గోరు తన పారదర్శకతను క్రమంగా కోల్పోతుంది. శిథిలం అవుతుంది. కట్ చేసినప్పుడు స్పష్టంగా తెగకుండా... పొట్టుగా రాలిపోతుంది. యుక్తవయసుదాటిన వారిలో, బలహీనమైన గోళ్లు ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలెక్కువ. ఇందులో డిస్టల్ అండ్ ల్యాటరల్ సబ్ అన్గ్యువల్ ఒనైకోమైకోసిస్, సూపర్ఫీషియల్ వైట్ ఒనైకోమైకోసిస్, ప్రాక్సిమల్ సబ్ అన్గ్యువల్ ఒనైకోమైకోసిస్ వంటి రకాలూ ఉంటాయి. త్వరగా చికిత్స తీసుకుంటే త్వరగా తగ్గే అవకాశం. పూతమందులు పనిచేయవు. ఇట్రకెనజోల్, టర్బినాఫిన్ వంటి మందులు వాడాలి. చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, ఎప్పుడూ తగిన హైజీన్ పాటిస్తూ శుభ్రంగా ఉండేవారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా తక్కువ. అందుకే ఆరోగ్యకరమైన లైఫ్స్టైలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణలో కీలక భూమిక పోషిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.డాక్టర్ విజయ గౌరి బండారు, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ -
గర్భం దాల్చిన ఐదో నెలకు బ్లడ్ కేన్సర్..!చివరికి..
గర్భం దాల్చక ముందు ఏదైన అనారోగ్యం సమస్య బారినపడితే రిస్క తక్కువగా ఉంటుంది. పైగా ఏదోరకంగా చికిత్స పొంది ఆ రోగం బారి నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యొచ్చు. అదే గర్భం దాల్చక అది కూడా క్రిటకల్ స్టేజ్లో అంటే ఏ ఐదు లేదా ఆరో నెలలో ప్రాణాంతక అనారోగ్య సమస్య బయటపడితే..ఇక ఆ బాధ మాటలకందనిది. అను క్షణం ఓ నరకం ఏ జరుగుతోందన్న టెన్షన్ వెంటాడుతూ ఉంటాయి. అలాంటి బాధనే చవిచూసింది ఈ గర్భిణి.ఈ బాధకర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన మహిళకు గర్భం దాల్చిన ఐదోనెలలో బ్లడ్ కేన్సర్ బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె అక్యూట్ లింఫోబ్లాస్లిక్ లుకేమియాదో బాధపడుతోంది. గర్భధారణ సమయంలో కేన్సర్కి చికిత్స చేయడం అంటే అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే కీమోథెరపీ వంటి ఇతర చికిత్సలు పుట్టుబోయే బిడ్డకు ప్రమాదకరంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. దాంతో ఢిల్లీ వైద్యులు సురక్షితంగా గర్భాన్ని పొడిగిస్తూనే వ్యాధిని నియంత్రించడానికి చికిత్స అందించింది. గర్భధారణ సమయంలో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అనేది అత్యంత అరుదైన ప్రమాదకరమైన పరిస్థితి. దీనికి తక్షణమే చికిత్స అవసరం. పిండం సంరక్షణ చూస్తూనే తీవ్రమైన ఈ కేన్సర్ని నియంత్రించడం అన్నది భయానక సవాలు అని చెబుతున్నారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వైద్యులు. ఎట్టకేలకు వైద్యుల ప్రయత్నం ఫలించి 32 వారాల నాలుగు రోజుల సమయంలో అత్యవసర సిజేరియన్ చేశారు. శిశువు బరువు 1.28 కిలోలు అని, ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఇక నవజాత శిశువుకు ప్రత్యేక నియోనాటల్ సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లికి ల్యుకేమియా కోసం తదుపరి చికిత్స అందిచనున్నట్లు తెలిపారు.అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అంటే..ఎముక మజ్జ (bone marrow) ను ప్రభావితం చేసే వేగవంతమైన కేన్సర్. ఇది తెల్ల రక్త కణాల (lymphocytes) అపరిపక్వ రూపాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలలో సర్వసాధారణం (ముఖ్యంగా 2-5 ఏళ్లు). అలాగే పెద్దలలో కూడా రావచ్చు.లక్షణాలు: తీవ్రమైన అలసట, జ్వరం, తరచుగా ఇన్ఫెక్షన్లు, సులభంగా గాయాలు కావడం లేదా రక్తస్రావం, ఎముకల నొప్పులు.చికిత్స: కీమోథెరపీతో చికిత్స చేస్తారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే చాలా మంది పిల్లలలో, కొంతమంది పెద్దలలో కూడా ఈ కేన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎక్కువే. (చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు) -
మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు
ప్రస్తుతం అందరిలో ఆరోగ్య స్పృహ చికిత్స నుంచి నివారణ వైపు మారుతోంది. చాలా ఏళ్లుగా ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత గానీ చికిత్స గురించి ఆలోచించేవారు కాదు. కానీ ఇప్పుడు దీర్ఘకాలిక ఆరోగ్యం అనేది రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుందనే సంగతి గుర్తిస్తున్నారు. ఆ దిశగా అవగాహన పెంచుకుంటున్నారు.. ఈ మార్పులో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది రోజువారీ జీవితంలో అత్యంత స్థిరమైన అంశాలలో ఒకటి. భారతీయ గృహాలలో, వంట చేయడం అనేది కేవలం పోషణకు సంబంధించినది మాత్రమే కాదు. ఒకరి పట్ల చూపే శ్రద్ధ, సంప్రదాయానికి సంబంధించినది. రోజూ ఉపయోగించే అన్ని పదార్థాలలో వంట నూనెకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో అవగాహన పెంచుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి జీవనశైలి సంబంధిత పరిస్థితులు సర్వసాధారణం అవుతున్నందున, ఉపయోగించే నూనెలో కొవ్వుల నాణ్యతపై దృష్టి సారిస్తున్నారు. ఆరోగ్యదాయకమైన వంట నూనెలో తక్కువ సంతృప్త కొవ్వులతో పాటు, పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFA, MUFA) మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ను సమతుల్య నిష్పత్తిలో ఉండాలని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవన్నీ రైస్ బ్రాన్ ఆయిల్లో సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. రోజువారి వంట అవసరాలకు అత్యుత్తమైనది తేల్చి చెప్పారు. -
కాఫీ వృద్ధాప్యాన్ని తగ్గించగలదా?
కాఫీ మితంగా తాగటం వల్ల ఆయుష్షు పెరుగుతుందనేది శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూ వస్తున్నదే. అయితే తాజాగా ఆ విధంగా ఆయుష్షు పెరగడానికి మూల కారణాన్ని పరిశోధకులు కనిపెట్టారు. మన శరీర కణాల్లోనే ఆ మర్మం దాగి ఉందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలోని వెటర్నరీ మెడిసిన్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ అధ్యయనంలో తేలింది.ఇంతవరకు తెలిసింది కాఫీలోని కొన్ని పదార్థాలు మన శరీరంలోని కణాలలో ఉండే ఒక నిర్దిష్ట ఎంజైమ్ను ప్రేరేపిస్తాయి. ఆ ఎంజైమ్ కణాల వయసు త్వరగా పెరగనివ్వకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు శరీరంలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపులు) నయం అవుతాయి. దాంతో హృద్రోగాలు వచ్చే ముప్పు తగ్గుతుంది. రోజుకు ఇన్ని కప్పులు అని మితంగా కాఫీ తీసుకోవడం వల్ల జీవక్రియలు మెరుగుపడి, వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిస్తాయి.ఇప్పుడు తెలుసుకున్నది మన శరీర ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని నిర్ణయించే కణ స్థాయిలోని ‘నియంత్రణ వ్యవస్థే’కాఫీ సేవించే అలవాటు ఉన్నవారిని ఆరోగ్యంగా ఉంచుతోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనినే ‘టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ’ పరిశోధకులు ‘బయోలాజికల్ స్విచ్’అంటున్నారు. మనం సేవించే కాఫీ కణాల్లోని అటువంటి ఒక స్విచ్ను ఆన్ చేయడం ద్వారా మనం వృద్ధులుగా మారటాన్నినెమ్మదింపజేస్తోందన్న మాట. ఏమిటీ ‘బయొలాజికల్ స్విచ్’? మన శరీరంలోని కణాలలో కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు లేదా అణువులు ఉంటాయి. ఇవి బయట నుండి వచ్చే సంకేతాల (ఉదా: మనం కాఫీ తాగినప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు వచ్చే సంకేతాలు) ద్వారా శరీరంలో కొన్ని రసాయన ప్రక్రియలను ‘ఆన్’లేదా ‘ఆఫ్’అయ్యేలా చేస్తాయి. వీటినే బయోలాజికల్ స్విచ్లు అంటారు. కాఫీ తాగినప్పుడు అది శరీరంలోని ఒక నిర్దిష్ట స్విచ్ను ‘ఆన్’చేస్తుంది. ఈ స్విచ్ ఆన్ అయినప్పుడు మన కణాలు తమను తాము శుభ్రం చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. మేలు చేసే కొన్ని ఎంజైమ్లు కూడా విడుదల అవుతాయి. దీనివల్ల వృద్ధాప్యం లక్షణాలు ఆలస్యమవుతాయి. అలాగే మన శరీరంలోకి ఏదైనా వైరస్ చొరబడినప్పుడు,ఒక బయోలాజికల్ స్విచ్ ‘ఆన్’అయ్యి తెల్ల రక్తకణాలను యుద్ధానికి పంపిస్తుంది. వైరస్ చనిపోయాక, ఆ స్విచ్ మళ్లీ ‘ఆఫ్’అవుతుంది. సాక్షి స్పెషల్ డెస్క్ -
టీ ఇలా చేయాలి.. అలా కాదు!
అనగనగా ఒక ఊరు.రచ్చబండ దగ్గరే రోజూ ఉదయాన్నే...జనంతో కిక్కిరిసే టీకొట్టు!కొట్టు యజమాని అనయ చేతి టీ తాగితే...గుండె గట్టిపడుతుందని కొందరు... మెదడు చురుకుగా మారుతుందని ఇంకొకరు..ఇలా అందరూ కలిసి ఆ కొట్టు.. అక్కడ దొరికే టీని వైరల్ చేసేశారు.మరి... ఇదంతా నిజమేనా? టీకి... గుండెకు లింకేమిటి?..అనయ కథతోనే ముందుకెళదాం.. టీ కొట్టు బ్రహ్మాండంగా నడుస్తూండగానే రవి అనే కొత్త కుర్రాడు పనోడిలా చేరాడక్కడ. అందరూ అక్క చేతి టీ ఆరోగ్యానికి మంచిదంటున్నారు కదా... దాన్ని మరింత స్ట్రాంగ్ చేద్దాం అనుకున్నాడీ కుర్రాడు. అక్క రెండు నిమిషాలు మాత్రమే కాస్తోంది. నేను ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ ఉడకబెడతా అని ప్రయోగం మొదలుపెట్టాడు. అలాగే ఉడికించాడు కూడా. ఈ టీ తాగినవాళ్లు.... వాసన కమ్మగా ఉందని మెచ్చుకున్నారు కానీ... కొంచెం చేదుగా ఉందని ఫిర్యాదు కూడా చేశారు. ఒకట్రెండు రోజులు అంతా బాగానే ఉండింది కానీ.. ఆ తరువాత ఊళ్లో చాలామంది నీరసంగా ఉందని, తలనొప్పి దంచేస్తోందని అనడం మొదలుపెట్టారు. ఇంకొందరు కడుపులో గడబిడగా ఉందంటే.. మరికొందరు నిద్రపట్టడం లేదని వాపోవడం మొదలుపెట్టారు. వీళ్లందరూ అనయ కొట్టులో టీ తాగే వాళ్లే. ఊళ్లో జరిగే విషయాలు తెలిసిన అనయ కించిత్ ఆశ్చర్యపోయింది. ఏమై ఉంటుందా? అని ఆలోచించింది. రవితో మాటలు కలిపింది. విషయం వెంటనే అర్థమైపోయింది..‘‘బాబూ రవి... మనం కాచే టీ మందులా పనిచేస్తుంది. కాకపోతే అది మనం దాన్ని సక్రమంగా ఎలా తయారు చేయాలో తెలిసినంత వరకే. మంచి వాసన వస్తోంది కదా అని ఎక్కువ సేపు ఉడికించావనుకో.. అంతే సంగతులు. మందు కాస్తా విషమైపోతుంది’’ అని అసలు విషయాన్ని బయటపెట్టింది...మరగిస్తే విషమే..టీని మరిగించిన కొద్దీ అందులోని పాలిఫినాల్స్ ముక్కలు ముక్కలైపోతాయి. ఫలితంగా వాటితో మనకు మంచి జరక్కపోగా... హాని జరిగే అవకాశాలు పెరిగిపోతాయి. టీని ఒకట్రెండు నిమిషాలు మాత్రమే మరిగించడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అప్పుడు రుచి, పోషకాలు రెండూ సమతౌల్యతతో ఉండి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా కాకుండా... మూడు నుంచి ఐదు నిమిషాలపాటు ఉడికించినా సరే... పాలిఫినాల్స్ తాలూకూ లాభాలు తగ్గిపోతాయి. పది నిమిషాలపాటు ఉడికిస్తే... ప్రయోజనం మరింత తగ్గిపోతుంది. ఇంతకంటే ఎక్కువ మరిగించిన టీతో మేలు జరగదు. తలనొప్పి, కడుపులో గడబిడ, నిస్సత్తువ వంటి అసౌకర్యాలు మొదలవుతాయి. అంతేకాదు... టీ ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుని తాగాలని, చల్లారిందని టీని పదే పదే ఉడికించడమూ మంచిది కాదని అనయ రవికి వివరించింది. ఉదయాన్నే తాగే టీ శరీరానికి శక్తినిచ్చి ఫోకస్న పెంచితే.. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో తాగే టీ ఒత్తిడిని దూరం చేసే మనల్ని రిఫ్రెష్ చేస్తుందని రవికి తెలిపింది. సాయంత్రం ఆరు గంటల తరువాత తాగే టీ నిద్రను పాడు చేసే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేసింది.టీ లవర్స్ మాత్రమే కాదు.. ‘‘మేము రోజూ గ్రీన్ టీ తాగుతామండి.. కానీ ఎందుకో మాకేమీ ఆరోగ్య లాభం లభించడం లేదు’’ అని చెప్పే వారు కూడా టీని ఎంత సేపు మరగిస్తున్నారో ఒకసారి గమనిస్తే మేలని అనయ సూచిస్తోంది. ‘‘అక్క చెప్పిన మాటల్లో లాజిక్కు ఉంది’’ అని తెలుసుకున్న రవి కూడా టీని రెండు కంటే ఎక్కువ నిమిషాలు మరగించకపోవడంతో ఇప్పుడు ఊళ్లో అందరూ హ్యాపి!టీని పద్ధతిగా చేస్తే... 1. శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. 2. చురుకుదనాన్ని పెంచుతుంది. 3. గుండెకు మంచిది.4. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఎక్కువగా మరిగిస్తే...1. టానిన్లు ఎక్కువవుతాయి. అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి, తలనొప్పిలాంటివి వస్తాయి.2. శరీరం ఇనుమును శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడవచ్చు.3. పొట్ట లోపలి పొరను చీకాకు పెడుతుంది. ఇది కాస్తా గ్యాస్ ఏర్పడేందుకు, అసౌకర్యానికి దారితీయవచ్చు.4. జీర్ణ సమస్యలతోపాటు కేన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది.5. మనకు మేలు చేసే ఆంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు నశించిపోతాయి.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
నిరంత అలసట, జుట్టురాలడం ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు..!
చాలామంది అలిసిపోడం, జుట్టు రాలడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కొందరిలో కీళ్ల నొప్పులు, నోటి పూతలు తరుచుగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని అస్సలు తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైకి సాధారణంగా కనిపించే ఈ లక్షణాలు ఆ వ్యాధికి సంకేతం కావొచ్చని హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి సమస్యలు ఎక్కుగా 20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళల్లోనే అధికం అని అంటున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే..బాగా అలసిపోవడం, జుట్టురాలిపోవడం, తరుచుగా నోటిపూతలు, కీళ్ల నొప్పులు..ఒక వారానికి పైగా ఉండటం, లేదా మళ్లీ మళ్లీ అదేపనిగా ఈ సమస్యలు రావడం వంటివి జరిగితే అది లూపస్ వ్యాధికి సంకేతం కావొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే యువతులలో తరుచుగా ఈ వ్యాధి నిర్ధారణ కాకుండానే ఉండిపోతోందని అంటున్నారు. ఈ సమస్య తీవ్రమైన లక్షణాలతో మొదలవుతుందని అనుకుంటారు. కానీ ఇది నిరంతర అలసట, కీళ్ల నొప్పులు, కారణం తెలియని జుట్టు రాలడం, నోటి పూతలు, స్వల్ప జ్వరం, ఎండ తగిలిన దద్దుర్లు వంటి వాటితో ప్రారంభమవుతుందని అన్నారు. ఇది రోజువారి చిన్నపాటి సమస్యలతో పోలి ఉండటంతో చాలామంది యువతులు ఈ సమస్యలను తేలిగ్గా కొట్టిపారేస్తుంటారని అంటున్నారు. ఎందుకు వస్తుందంటే..మహిళలు కెరీర్ని నిర్మించుకునే క్రమంలో గర్భధారణ ప్లాన్స్ వేసుకోవడం, లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి చేస్తుంటారు. అదీగాక కొందరు హర్మోన్ల మార్పులతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్లలో ఈ లూపస్ వ్యాధి మరింత సమస్యాత్మకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎక్స్ క్రోమోజోమ్లతో ముడిపడి ఉన్న రోగ నిరోధక సంబంధింత జన్యువుల కారణంగా పురుషుల కంటే మహిళలకు సహజంగానే బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. ఈ బలమైన రోగనిరోధక వ్యవస్థ తరచుగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడినప్పటికీ, కొన్నిసార్లు అది అతి చురుకుగా మారి పొరపాటున శరీరం సొంత కణజాలాలపై దాడి చేస్తుందట. దీన్నే లూపాస్ వ్యాధి అంటారట. ఇదొక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది చాలామటుకు ఒకే కారకం వల్ల అరుదుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. కానీ ఒక్కోసారి ఈ క్రింది వాటి కలయిక వల్ల మరింత వేగవంతమవుతుందంటుననారు.జన్యుపరమైన సున్నితత్వంహార్మోన్ల మార్పులుసూర్యరశ్మికి గురవ్వడం(ఎండకు బహర్గతమవ్వడం)ఇన్ఫెక్షన్లుమానసిక లేదా శారీరక ఒత్తిడిలక్షణాలు:నిరంతర అలసటకీళ్ల నొప్పి లేదా వాపుజుట్టు రాలడంనోటి పూతలుస్వల్ప జ్వరంఎండ తగిలిన తర్వాత చర్మంపై దద్దుర్లుకండరాల నొప్పిమెదడు మసకబారడంకారణం తెలియని బలహీనతఈ లక్షణాలు ఒత్తిడి, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత లేదా సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం వంటి వచ్చే సమస్యల్లా కనిపించడంతో చాలామంది మహిళలు తేలికగా తీసుకుంటారట. దాంతో తక్షణ వైద్య సహాయం ఆలస్యమవుతోందని చెబుతున్నారు.లూపస్ కేవలం హార్మోన్ల వల్ల వచ్చే వ్యాధి కాదు, కానీ ఈస్ట్రోజెన్ రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచుతుంది. జన్యుపరంగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నవారిలో, ఆ అదనపు రోగనిరోధక ప్రేరణ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులులూపస్ని ప్రభావితం చేసేవి..ఋతుచక్రాలు, గర్భధారణ, ప్రసవానంతర కోలుకోవడం, గర్భనిరోధకం సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు కొంతమంది రోగులలో లూపస్ తీవ్రతను ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో లూపస్పై కేర్ తీసుకుంటారట వైద్యులు. లేకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. సరైన పర్యవేక్షణ మరియు చికిత్సతో, లూపస్ ఉన్న చాలా మంది మహిళలు ఆరోగ్యకరమైన గర్భధారణను కలిగి ఉండగలరని నిపుణులు నొక్కి చెబుతున్నారు.సకాలంలో చికిత్స తీసుకోకపోతే..కీళ్ళుచర్మంమూత్రపిండాలుఊపిరితిత్తులుగుండెనాడీ వ్యవస్థ తదితరాలను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలసట, జుట్టురాలడం, కీళ్లనొప్పులు, జ్వరం వంటివి తరుచుగా వస్తే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగానే ఈ సమస్యను గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది లేదా నివారించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.మరిన్ని వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!) -
67 కిలోల నుంచి 53 కిలోలకు..! కానీ జంక్ఫుడ్కు నో చెప్పక్కర్లేదట..
బరువు తగ్గడం అనేది ఆరోగ్య స్పృహతో కూడిన ట్రెండ్గా మారింది. యువత కాదు పెద్దలు సైతం స్మార్ట్, హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చేతనైనంతలో కొద్దిపాటి వ్యాయామాలు, మితంగా భోజనం, చక్కటి జీవనశైలిని పాటించేందుకు మక్కువ చూపిస్తున్నారు. అంతేగాదు బరువు తగ్గడం భారం కాదు అనారోగ్యం బారిన నుంచే కాపాడుకునే రక్షణచర్యగా భావిస్తున్నారు. ఆ క్రమంలో చాలామంది మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ చేరిపోయారు. ఆమె కేవలం 12 కిలోలను బరువుని చాలా తేలికపాటి అలవాట్లతో తగ్గించుకుని శెభాష్ అనిపించుకున్నారు. కష్టంగా కాకుండా చిన్నచిన్నగా సాధ్యమై వాటినే ఎంచుకుని, పాటిస్తే బరువు తగ్గడం చాలా ఈజీ అని అంటున్నారామె. మరి అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.తక్షణ పరిష్కారాలపై ఆధారపడకుండా, సమతుల్య దినచర్యలు, ఆలోచనాత్మకమైన ఆహారం, శక్తి శిక్షణ, తగినంత నీరు తాగడం, నాణ్యమైన నిద్రపై దృష్టి పెట్టడమే బరువు తగ్గడానికి ఆదర్శవంతమైన మార్గం. అంతేగాదు కొలెస్ట్రాల్ని రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సాధారణ అలవాట్లతోనే తగ్గించుకోవచ్చని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సృష్టి కృష్ణన్. దీర్ఘకాలం హాయిగా చేయగలిగే చిన్నపాటి జీవనశైలి మార్పులతో 14 కిలోలకు పైగా తగ్గారామె.జంక్ ఫుడ్కు నో చెప్పకండి..వాట్ ఇదేంటి అనకండి. మనకు తినాలనిపించే వాటిని వద్దని కంట్రోల్ చేయడం వల్ల తెలియకుండానే అతిగా లాగించేస్తాం అంటోంది. అదే దాన్నే అణిచివేసే బదులు..జంక్ ఫుడ్ తినాలనిపించిన వెంటనే ఫటాఫట్ తినేయండి. ఆ తర్వాత అందుకు తగ్గట్టు వర్కౌట్లు, లేదా కేలరీ తగ్గించుకునే ప్రయత్నం చేయండని అంటోందామె.ప్రతిరోజు నడక..ప్రతిరోజూ నడవడం వల్ల కొవ్వు కరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పదివేల అడుగులు నడవాలని పెద్ద లక్ష్యాలు ఏమి అవసరం లేదు. కొన్ని రోజులు రెండు వేల అడుగులకుపైగా నడచేందుకు ప్రయత్నించండి చాలు. అది కూడా ఇష్టపూర్వకంగా చేయండని అంటోంది.రాత్రిపూట కార్బోహైడ్రేట్లు వద్దు..రాత్రి భోజనంలో అన్నం, రోటీకి బదులుగా గుడ్లు, పనీర్, పప్పు, చికెన్ తినమని ఈ ఇన్ఫ్లుయెన్సర్ సిఫార్సు చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఉదయం చాలా హాయిగా మేల్కోగలుగుతారు.నెమ్మదిగా తినండినెమ్మదిగా తినడం వల్ల మీ ప్రేగులు కడుపు నిండిన సంకేతాలను మెదడుకి అందిస్తాయి. తినడానికి 20-30 నిమిషాలు తీసుకోవడం ద్వారా జీవక్రియను సహజంగా మెరుగుపరుచుకోవచ్చు, ఆకలిని తగ్గించుకోవచ్చు. భోజనానికి ముందు నీళ్లు తాగండి..భోజనానికి సుమారు 30 నిమిషాల ముందు నీళ్ళు తాగడం వల్ల, కడుపు నిండిన భావన పెరిగి, కేలరీల వినియోగం తగ్గి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ అలవాటు కడుపు నిండిన అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తుంది.తరుచుగా బరువు చెక్చేయొద్దు..ప్రతిరోజూ బరువు చూసుకోవడం అనేది మిమ్మల్ని మరింత నిరాశపరుస్తుంటుంది. వారానికి ఒకసార లేదా అప్పుడప్పుడు చేస్తే మనసు ఉల్లాసంగా, హెల్దీగా ఉంటుంది.వేళకు నిద్రపోవడం..సరిగ్గా నిద్రపోకపోతే తినాలనే కోరికలు ఎక్కువ అవుతాయి. ఏడు గంటల నిద్ర అన్నింటిని మార్చేస్తుందని అంటోంది.చీట్ మీల్ గురించి భయపడొద్దు..కొందరు తినాలనిపించినవి తొనేసి మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం అనే మైండ్సెట్తో ఉంటుంటారు. ముందు ఆ ధోరణిని తీసేయండి. తప్పులేదు. ఒక్కోసారి జిహ్వచాపల్యం నియంత్రించడం కష్టమవ్వచ్చు. అందుకని నచ్చినవి హాయిగా తినండి. కానీ తినే ముదు కాస్త మితం అనుకోండి, ఒక వేళ్ల ఫుల్గా లాగించినా..అందుకు తగ్గట్టుగా ఆరోజు కేలరీలు తగ్గించే పనిపట్టండని అంటోందామె. ఈ చక్కటి జీవనశైలి మార్పులు ఆరోగ్య లక్ష్యాలను అంచలంచెలుగా అందుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతాయని అంటోంది. View this post on Instagram A post shared by Srishti Krishnan (@srishhhsaidwhat) గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!
చాలామంది కొన్ని రకాల ఆహారాలు తిన్న వెంటనే కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో, దేనికి సంకేతమో ఆలోచించారా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే సులభంగా ఈ సమస్యను అధిగమించొచ్చని చెబుతున్నారు. మరి అదెలాగో ఆయన మాటల్లోనే చూద్దామా..!.ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం కాకుండా ప్రేగులలోని బ్యాక్టీరియా దానిని పులియబెట్టినప్పుడు కడుపు ఉబ్బరం వస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్య వలనే గ్యాస్ ఏర్పడుతుంది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. మనం ఏం తీసుకున్నాం, అది ఎంత భాగా జీర్ణమైంది అన్న దానిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని కూడా నొక్కి చెప్పారు. ఉదాహరణకు బీన్స్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే, పప్పుధాన్యాలలో ఉండే సంక్లిష్ట చక్కెరలను విచ్ఛిన్నం చేయడానికి మీ శరీరంలో తగినంత ఆల్ఫా-గాలక్టోసిడేస్ ఎంజైమ్ లేదని అర్థం. అదే పాల ఉత్పత్తులు తిన్న తర్వాత ఇలా ఉంటే..లాక్టేస్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉందని అర్థం. అలా కాకుండా గోధుమలు తిన్న తర్వాత ఐతే గ్లూటెన్ జీర్ణక్రియకు ఆటంకం కలిగించేంతగా చిన్నప్రేగుల్లో వాపు ఉందని అర్థం. ఇలా ఆయా ఆహారాలు తిన్న వెంటనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందంటే..శరీరంలో ప్రోటీన్ను సరిగ్గా విచ్ఛిన్నం చేయడానికి కడుపులోని ఆమ్లం చాలా తక్కువగా ఉందని అర్థం. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు అల్లం తీసుకుంటే అది జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించి, కడుపు త్వరగా ఖాళీ అవ్వడానికి సహాయపడుతుందన్నారు. భోజనానికి ముందు తీసుకునే ఆపిల్ సైడర్ వెనిగర్, కడుపులో తగినంత ఆమ్ల ఉత్పత్తి లేని వారిలో ఆమ్ల స్థాయిలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. పప్పుధాన్యాలను బాగా నానబెట్టి, ఉడికించడం వల్ల, శరీరంలోకి ప్రవేశించక ముందే పులియబెట్టడానికి కారణమయ్యే సంక్లిష్ట చక్కెరలు తగ్గుతాయని అంటున్నారుఅంతేగాదు కడుపు ఉబ్బరం అనేది ఒక సందేశం, ఒక అనారోగ్య పరిస్థితి కాదు. దానిని సరిగ్గా గ్రహిస్తే, జీర్ణక్రియలో సరిగ్గా ఏమి లోపిస్తుందో అది మీకు తెలియజేస్తుంది.డా. ఆదర్శ గౌడప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ)అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ఐసిఎఆర్–జాతీయ పాడి పరిశోధనా సంస్థ, బెంగళూరు -
అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..
ఓ మహిళ అనారోగ్యంలో సైతం తన భర్త ఎలా అండగా నిలబడ్డాడో వివరిస్తూ షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసులను అమితంగా గెలుచుకుంది. నిజానికి మనకిష్టమైన వాళ్ల కోసం చాలా వాటిని షేర్ చేసుకోగలమేమో గానీ కొన్నింటిని మాత్రం షేర్ చేసుకోవడానికి చాలా పెద్ద మనసు కావాలి. అదే ఈ మహిళ వివరిస్తూ తన కథను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నమర్తా నితిన్ గోయెల్ తన వైద్య ప్రయాణంతో తనకు మద్దతుగా నిలిచి గుండు చేయించుకుంటున్న భర్త వీడియోని షేర్ చేశారు. ఆమె తాను కేన్సర్ బాధితురాలిననని, కీమో ధెరపీ కారణంగా తన జుట్టుని కోల్పోవడంతో తనకు సంఘీభావం తెలిపేలా తన భర్త గుండు చేయించుకున్న వీడియోని షేర్ చేషింది. కష్టకాలంలో సైతం తమ మధ్య బలమైన బంధం ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ భావోద్వేగం చెందింది. ఆ వీడియోలో కీమోథెరపీ తర్వాత జుట్టు రాలిపోవడంతో తాను అనుభవించిన బాధ గురించి ఆమె మాట్లాడింది. తన రెండవ కీమోథెరపీ సెషన్ తర్వాత, జుట్టు విపరీతంగా రాలిపోవడం ప్రారంభమైందని, తన తల చర్మం చాలా సున్నితంగా, బాధాకరంగా మారిందని ఆమె చెప్పింది. జుట్టు రాలినప్పుడల్లా నొప్పి మరింత తీవ్రమయ్యేదని కూడా చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని ఆయనకు చెప్పడంతో ఆ బాధను తాను కూడా పంచుకుంటానంటూ ఆమె భర్త ట్రిమ్మర్తో గుండు చేయించుకున్నారని తెలిపింది. ఆ క్రమంలో ట్రిమ్మర్ తలపైన సున్నిత చర్మానికి తగిలినప్పుడల్లా ఆయనకు గాయమవ్వడం తాను చూశానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నిజానికి కేన్సర్ చికిత్సలో భాగం జుట్టు ఊడిపోతుందని తెలుసు కానీ అందుకు తాను సిద్ధంగా లేనని వివరించింది. తన బాధను చూసే ఆమె భర్త ఇలా చేసినట్లు పేర్కొంది. నెటిజన్లే ఈ వీడియోని చూసి..భాగస్వాముల మధ్యలో ఉండాల్సిన శ్రద్ధను ఈ ఘట్టం తెలుపుతోందని, మరికొందరు..'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటే మీ దంపుతులే అంటూ ప్రశంసలు, ఆశీస్తులు అందిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Namarta Nitin Goel (@goelnamarta) (చదవండి: ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!) -
అమ్మ హెల్త్ అందరికీ హెల్త్!
అమ్మదనం గురించీ, అమ్మదనపు మంచితనం గురించి కవులూ, రచయితలూ ఎంతో చెప్పారు. అంతకంటే అపురూపంగా అద్భుతంగా చెప్పడమిక దాదాపు అసాధ్యం. కానీ వైద్యపరంగా మాత్రం ఎంతోకొంత చెప్పవచ్చు. అందుకే మాతృ దినోత్సవపు ఈ అమృత సమయాన వివిధ వయసుల్లోని మాతృమూర్తుల కోసం వాళ్ల పిల్లలూ, తల్లిగా మారిన, మారబోతున్న తమ భార్యల కోసం భర్తలూ... కాబోయే మాతృమూర్తుల తల్లిదండ్రులూ... ఇలా ఎవరి పరిధుల్లో వారు నెరవేర్చగలిగే కొన్ని బాధ్యతలూ, సూచనలు, చేయించాల్సిన వైద్యపరీక్షలూ... చికిత్సలూ... ఇవిగో... ఇవి మీకోసం.ఇక్కడ పేర్కొన్నవి మాత్రమే కాకుండా... మరికొన్ని స్పెషలైజ్డ్ పరీక్షలూ ఆయా మహిళల అవసరాల కోసం చేయించాల్సి రావచ్చు. కొన్ని ప్రామాణికమైన బేసిక్ పరీక్షలు...సీబీపీ రక్త పరీక్ష : మనదేశపు మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. దాదాపు 65 శాతం నుంచి 70 శాతం మహిళల్లో అనీమియా సమస్య ఉంటుందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఓ ఆడపిల్ల యువతిగా మారే క్రమంలో మొదలైన రుతుస్రావంలో నెలనెలా రక్తస్రావం జరుగుతుంటుంది. అందుకే మహిళల్లో ఇది సాధారణమైన సమస్య. యువతి ఆరోగ్యం బాగుండాలన్నా, భవిష్యత్తులో తల్లికాబోయే ముందరైనా రక్తహీనత లేకుండా తగినంత హీమోగ్లోబిన్ ఉండటం అవసరం. అందుకే తల్లిదండ్రులు యుక్తవయసులోని తమ పిల్లల్లోని హీమోగ్లోబిన్తో పాటు రక్తంలోని మిగతా అంశాలైన తెల్లరక్తకణాలూ... అందులోని బేసోఫిల్స్, ఈసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ వంటి వాటితో పాటు రక్తం గడ్డకట్టించే ప్లేట్లెట్స్ వంటి వివరాలు తెలుసుకుని అవి నార్మల్గా ఉన్నాయా లేదంటే అందుకు తగినట్లుగా సిరప్, టాబ్లెట్లు వాడటానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) అనే రక్తపరీక్ష మేలు చేస్తుంది. మూత్ర పరీక్ష : పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్లను తెలుసుకునేందుకు మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, కాలేయ సమస్యలు, డయాబెటిస్ తీవ్రత వంటివి తెలుసుకునేందుకు కూడా మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. బోన్డెన్సిటీ పరీక్ష : యాభై ఏళ్లు వయసు పైబడ్డ మహిళ ఎముకల్లో క్రమంగా క్యాల్షియమ్ తగ్గుతూపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే ఆరోగ్య సమస్య వస్తుంది. ముఖ్యంగా మెనో΄ాజ్ దాటాక ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుతూపోతుండటంతో ఇంచుమించు మహిళలందరిలోనూ కనిపించే సమస్య ఇది. 60 ఏళ్లు దాటిన 50% మంది మహిళల్లో 80 ఏళ్లు దాటినవారిలో 90 శాతం మందిలో కనిపిస్తుంది. బోన్డెన్సిటో మీటర్ (డెక్సా స్కాన్) ద్వారా బోన్డెన్సిటీనీ తద్వారా ఆస్టియోపోరోసిస్ను కనుక్కోవడం చాలా సులభం. దీని నివారణకు వ్యాయామం, ఆహారంలో క్యాల్షియం చాలా ముఖ్యం. పాప్ స్మియర్... మధ్యవయసుకు వస్తున్న వయసులోని మహిళలకు అంటే 30 నుంచి 35 ఏళ్ల వయసున్న వారిలో సర్వికల్ క్యాన్సర్ను తెలుసుకోడానికి ఉపకరించే పరీక్ష. ఈ సర్వైకల్ క్యాన్సర్కు ప్రీ–క్యాన్సర్ దశ సుదీర్ఘకాలం ఉంటుంది. పదేళ్ల ముందుగా కూడా దీన్ని కనుగొనేందుకు అవకాశం ఉంది. ఏ మాత్రం నొప్పి లేకుండా చేసే పరీక్ష ఇది. మామోగ్రామ్ : మహిళల్లో అత్యధికంగా కనిపించే బ్రెస్ట్క్యాన్సర్ను తెలుసుకునేందుకు చేయించే పరీక్ష ఇది. తొలిదశలోనే కనుగొంటే రొమ్మును తొలగించనవసరం లేకుండానే (మాసెక్టమీ చేయకుండానే) చికిత్స అందించవచ్చు. నలభై ఏళ్ల తర్వాత చేయించాల్సిన ఈ పరీక్షను రొమ్ములో నొప్పి, సలపరం ఉంటే తప్పక చేయించాలి. టీ3, టీ4, టీఎస్హెచ్ పరీక్ష: థైరాయిడ్ సమస్యను కనుగొనడం కోసం చేసే ఒక రకం రక్తపరీక్ష ఇది. థైరాయిడ్ గ్రంథి పనితీరు అంతగా లేని హైపోథైరాయిడిజమ్నూ, ఆ గ్రంథి అత్యంత చురుగ్గా పనిచేస్తున్న హైపర్థైరాయిడిమ్ అనే సమస్యలను తెలుసుకోడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సంబంధిత సమస్యలను తెలుసుకోవడం కోసం టీ3, టీ4, టీఎస్హెచ్ పరీక్ష చాలా ముఖ్యం.క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్: సర్విక్స్ క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే పాప్ స్మియర్, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే మామోగ్రామ్ పరీక్షలు కాకుండా... ఇతర రకాల క్యాన్సర్ల కోసం మరికొన్ని రక్తపరీక్షలూ అవసరం. ఉదాహరణకు సెర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకునే పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) పరీక్షలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును తెలుసుకునే లో–డోస్ హెలికల్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ పరీక్షలు; పెద్దపేగు, మలద్వారం వద్ద క్యాన్సర్ రిస్క్ తెలుసుకోడానికి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ (ఎఫ్ఓబీటీ) వంటివి చేయించవచ్చు. షుగర్ పరీక్ష : చక్కెర వ్యాధిని గుర్తించడానికి పరగడుపున ఫాస్టింగ్ షుగర్ టెస్ట్, ఏదైనా తిన్న గంటన్నర తర్వాత పోస్ట్ ఫుడ్ షుగర్ టెస్ట్ వంటివి మాత్రమే కాకుండా... డాక్టర్ సూచనల మేరకు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), మూడు నెలల సగటు షుగర్ తెలుసుకోడానికి హెచ్బీఏ1సీ వంటి పరీక్షలు అవసరం. మధ్య వయసు దాటాక ఈ చక్కెర పరీక్షలు చేయించడం చాలా అవసరం. ఇవే కాకుండా బీపీ రీడింగ్ మొదలుకొని... ఆయా మహిళల ఆరోగ్య అవసరాల మేరకు కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయించడం మంచిది. ఇందుకోసం ఆ తల్లుల బిడ్డలూ, భర్తలూ, పేరెంట్స్ ఇలా అందరూ పూనుకోవడం వల్ల మహిళ ఆరోగ్యం బాగుంటుంది. దాంతో సమాజంలో అందరి ఆరోగ్యమూ బాగుంటుంది.డాక్టర్ లక్ష్మీదేవి అప్పసాని,సీనియర్ కన్సల్టెంట్ అబ్స్ట్రెటీషియన్ – గైనకాలజిస్ట్డాక్టర్ చల్మేడ నివేదిత, సీనియర్ ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్(చదవండి: పీఛే చల్! ఇలా నడిచి చూశారా?) -
పీఛే చల్! ఇలా నడిచి చూశారా?
వాకింగ్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. కానీ అదే వాకింగ్ను వెనక్కి చేస్తే డబుల్ ఆరోగ్యం లభిస్తుందంటే నమ్మగలరా? నిజమే! ఫిట్నెస్ ప్రపంచంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ – ‘రెట్రో వాకింగ్’ బాగా పాపులర్ అవుతోంది. నిపుణుల ప్రకారం, ఇది సాధారణ వాకింగ్ కంటే మరింత ప్రయోజనాలు ఇచ్చే వ్యాయామం. ఇలా వెనక్కి నడిస్తే మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముందుకు నడిచేటప్పుడు ఎక్కువగా పని చేయని కాళ్ల కండరాలు కూడా వెనక్కి నడిచేటప్పుడు యాక్షన్లోకి దిగుతాయి. సాధారణ వేగంతో నడిచినా దాదాపు ‘నలభై శాతం ఎక్కువ క్యాలరీలు’ కరిగిపోతాయి. అంటే తక్కువ టైమ్లో ఎక్కువ పని చేసినట్టే! ఇంకా మెదడు సంగతి చెప్పాలంటే, వెనక్కి నడవడం కొత్త పని కాబట్టి అది ఫుల్ అలర్ట్లోకి వెళ్లి బ్యాలెన్స్, ఫోకస్, జ్ఞాపకశక్తి అన్నింటినీ మరింత పదును పెడుతుంది. కొందరికి వెన్నునొప్పి, కాళ్లు బిగపట్టడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పక గుర్తుంచుకోండి. మొదట రెండు నుంచి మూడు నిమిషాలు నెమ్మదిగా, ఖాళీ ప్రదేశంలో మాత్రమే ప్రయత్నించండి. లేదంటే వ్యాయామం కంటే ముందు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది! ∙ -
ఆరోగ్యవంతమైన సోడా..!
రంగు రంగుల చల్లని సోడా పానీయాలకు వేసవిలో గిరాకీ విపరీతంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతుంటారు. కృత్రిమ రంగులు, మితిమీరిన మోతాదులో చక్కెర కలిపి తయారుచేసే సోడా పానీయాలు ఆరోగ్యానికి హానికరమే అనడంలో ఎలాంటి సందేహాం లేదు. అయితే, జపాన్లో దొరికే ఈ సోడా పానీయం మాత్రం చాలా ఆరోగ్యకరమైనది. ఎందుకంటే, ఇది మజ్జిగతో తయారు చేసే సోడా.‘కాల్పికో సోడా’ పేరుతో 1919 నుంచి ఇది జపాన్లో అమ్ముడవుతోంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఇందులోనూ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది పొట్టకు మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి హానికర రసాయనాలు, కృత్రిమ రంగులు ఉండవు. ఒకరకంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన సోడా పానీయం అని చెప్పవచ్చు. (చదవండి: ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!) -
బేబీ బ్లూస్..! డెలివరీ తర్వాత ఇలా ఎందుకనిపిస్తోంది..
నాకు వారం రోజుల క్రితం సిజేరియన్ ద్వారా డెలివరీ అయింది. బేబీ కూడా బాగానే ఉంది, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా నాకు చాలా సాడ్ ఫీలింగ్ వస్తోంది. మాటిమాటికి కళ్లలో నీళ్లు వస్తున్నాయి, బేబీతో ఆడుకోవాలని కూడా అనిపించడం లేదు. ఒంట్లో బలహీనంగా అనిపిస్తోంది. ఇది సాధారణమేనా?– లావణ్య, కడప.డెలివరీ తర్వాత కొంతమంది మహిళల్లో ఇలా సడెన్గా సాడ్ ఫీలింగ్ రావడం, ఏడుపు రావడం, బలహీనంగా అనిపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సాధారణంగా ‘పోస్ట్పార్టమ్ బ్లూస్’ అంటారు. డెలివరీ అయిన తర్వాత మొదటి రెండు నుంచి మూడు వారాల వరకు సుమారు 70 నుంచి 80 శాతం మహిళల్లో ఈ మార్పులు కనిపించడం సాధారణమే. ఇది ఎక్కువగా జీవనశైలిలో ఒక్కసారిగా వచ్చే మార్పుల వల్ల జరుగుతుంది. డెలివరీ తర్వాత తల్లి పూర్తిగా కోలుకోకముందే ప్రతి రెండు గంటలకు లేచి బిడ్డను చూసుకోవడం, పాలివ్వడం వంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే శరీరంలో హార్మోన్ మార్పులు కూడా ఈ భావోద్వేగ మార్పులకు కారణం అవుతాయి. సాధారణంగా ఈ బేబీ బ్లూస్ రెండు వారాల లోపే తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయం, కొద్దిగా ప్రోత్సాహం, సరైన విశ్రాంతి, సపోర్ట్ ఉంటే ఎక్కువగా ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే సమస్య సద్దుమణుగుతుంది. అయితే కొంతమందిలో ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అంటారు. ఇది భారతదేశంలో దాదాపు 10 నుంచి 25 శాతం మహిళల్లో కనిపించే సమస్య. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్ మార్పులు, ముందుగా ఉన్న ఆందోళన లేదా డిప్రెషన్ సమస్యలు, డెలివరీ సమయంలో ఎదురైన ఒత్తిడి లేదా కుటుంబంలో సరైన సపోర్ట్ లేకపోవడం వంటి అంశాలు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి చాలా లో మూడ్లో ఉండటం, బిడ్డపై ఆసక్తి తగ్గడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, చిరాకు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు తల్లి ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పులను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. డాక్టర్ను సంప్రదిస్తే కొన్ని ప్రత్యేక ప్రశ్నల ద్వారా ఈ సమస్యను సులభంగా గుర్తించవచ్చు. అవసరమైతే కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మందులు కూడా ఇవ్వవచ్చు. ఈ మందులు సాధారణంగా తల్లి పాలిచ్చే సమయంలో కూడా సురక్షితంగా వాడేలా ఉంటాయి. సరైన చికిత్స, కుటుంబ సభ్యుల ప్రేమ, సహాయం, ప్రోత్సాహం ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. డా. కప్పగంతుల అపర్ణ , సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ ∙(చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే.. -
‘బేబీ రిస్ట్’ అంటే ఏంటో తెలుసా..!
నెలల పిల్లలనూ, క్యూట్గా ఉండే టాడ్లర్స్నూ గాల్లోకి ఎగరేసినట్టుగా అమాంతం ఎత్తుతుంటారు తల్లులు. చిన్నపిల్లలను ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బొటన వేలూ, చూపుడువేలు మధ్యన ఎత్తుకుని గిరగిర తిప్పుతూ ఎగరేసినట్లుగా చేసే సమయంలో చూపుడువేలూ, బొటనవేలి మధ్యనా, అలాగే మణికట్టు దగ్గర ఒత్తిడి కారణంగా టెండన్లు దెబ్బతినడం వచ్చే నొప్పిని ‘బేబీ రిస్ట్’ అంటారు. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘డి క్వెర్వెయిన్స్ టెనోసినోవైటిస్’ లేదా ‘డి క్వెర్వెయిన్స్ టెండనైటిస్’ అంటారు. ఈ నొప్పి లేదా ఇన్ఫ్లమేషన్ మరీ ఎక్కువగా ఉంటే పెయిన్కిల్లర్స్తో చికిత్స అందించవచ్చు. (చదవండి: పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..) -
రోగాలను తరిమికొట్టే ఆహారాలు ఇవే! మీ శరీరానికి ఎదురే ఉండదు!
-
పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..
కొన్ని వ్యాధులు పెళ్లికి ముందు యవ జంటలు ఈ వైద్య పరీక్షలు చేయించుకుంటే పిల్లలకు ప్రాణాంత వ్యాధులు బారినపడరు. అలాంటి వ్యాధుల్లో ఒకటే ఈ ప్రాణాంతక తలసేమియా వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఎందరో బాధితులు అను నిత్యం నరకం చూస్తుంటారు. ఎందుకంటే రేపు రోజు ఎలా ఉంటుందో తెలియని స్థితి. పైగా ప్రతి నెల రక్తం ఎక్కించుకోవాల్సిన దుస్థితి. ఇవాళ అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం ఈ సందర్భంగా ఈ వ్యాధి ఎందువల్ల వస్తుంది? నివారణ ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.తలసేమియా అంటే..తలసేమియా (Thalassemia) అనేది జన్యుపరమైన రక్తహీనత వ్యాధి, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఏర్పడక, బాధితులు ప్రతి 2-4 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. వేసవి సెలవుల్లో రక్త సేకరణ శిబిరాలు తగ్గడంతో రక్త నిల్వల కొరత ఏర్పడుతోంది. తలసేమియా మహమ్మారి చిన్నారులకు నరకం చూపిస్తోంది. ప్రభుత్వం ఈ వ్యాధికి ఉచిత చికిత్స అందుతున్నా, నిరంతర రక్త అవసరం, నిల్వల కొరతతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.నివారణ ఎలాగంటే..పెళ్లికి ముందు జంటలు 'హీమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్' పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.సమస్య ఉన్నవారు రక్తమార్పిడితో పాటు, ఐరన్ ఓవర్లోడ్ (Iron overload) తగ్గించడానికి అవసరమైన మందులు వాడాలి.తలసేమియా మేజర్ ఉన్నప్పటికీ, సరైన చికిత్స, పట్టుదలతో తిరుచ్చికి చెందిన పరమేశ్వరి వంటి వారు ఉన్నత చదువులు చదువుతూ ఇతరులకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ వ్యాధి గురించి మరింత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ కింది లింక్పై క్లిక్ చేయండి. (చదవండి: 'ఉప్పు' ఇంత ప్రాణాంతకమా..? పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
'ఉప్పు' ఇంత ప్రాణాంతకమా..?
2023లో ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల మంది కేవలం ఆహారపు అలవాట్లతో ముడిపడిన గుండె జబ్బుల వల్ల మరణించారట. 204 దేశాలకు సంబంధించి సమాచారం ఆధారంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలు ది ఇన్నోవేషన్ న్యూట్రీషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ మరణాల్లో అత్యధిక శాతం చైనా(13.6 లక్షలు), భారత్(11 లక్షలు)లో సంభవించాయి. తర్వాతి స్థానాల్లో రష్యా, అమెరికా, ఇండోనేసియా ఉన్నాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పళ్లు, తృణ ధాన్యాలు తక్కువ తీసుకోవడం వంటివాటిని వీటికి ప్రధాన కారణాలుగా పరిశోధకులు గుర్తించారు.మనమేం చేయాలి దేశపు ఆహారపు విధానాల్లో మార్పులు అత్యవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందింపజేయాలి. ముఖ్యంగా సోడియం(ఉప్పు) వినియోగాన్ని తగ్గించే విధానాలు తేవాలి. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పోషకాల వివరాలను తప్పనిసరిగా ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలి. సాక్షి, నేషనల్ డెస్క్(చదవండి: ఫైబర్ ఎందుకు అధికంగా తీసుకోవాలి? కలిగే లాభాలు..) -
ఫైబర్ ఎందుకు అధికంగా తీసుకోవాలంటే..?
చాలా మంది తమ రోజువారీ ఆహారంలో తగినంత ఫైబర్ పొందడం లేదని, దాని కారణంగా చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పోషకాహార నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ప్రతి మనిషికి రోజుకు సుమారుగా 25 నుంచి 30 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అయితే నివేదికలు కేవలం 15 నుంచి 20 గ్రాములే వినియోగిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇది వ్యాధులకు దారితీసే ప్రమాదానికి సంకేతమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. గ్రామీణ ఆహారాల్లో పప్పుధాన్యాలు, ముతక ధాన్యాలలో కనీసం ఏదో రకంగా ఫైబర్ ఉంటుంది. కానీ పట్టణ ఆహారాల్లో ఆ లోటు అధికం అని చెబుతున్నారు నిపుణులు. అసలు ఫైబర్ ఎందుకు అవసరం అంటే..మన ఆహారంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..మెరుగైన జీర్ణక్రియ, మలబద్ధకం నుంచి ఉపశమనంపేగుల ఆరోగ్యానికి మద్దతు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు పోషణరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందికడుపు నిండిన భావనను పెంచి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది.ఫైబర్ అందించే ఆహారాలుచియా గింజలు, కాయధాన్యాలు, బీన్స్, పండ్లు, తృణధాన్యాలు వంటి సాధారణ ఆహారాలు ఈ లోటును పూరించగలవు. తెల్ల బియ్యం బదులు బ్రౌన్ రైస్ తినడం లేదా హోల్-గ్రెయిన్ బ్రెడ్ ఎంచుకోవడం వంటి చిన్న, స్థిరమైన మార్పులు పెద్ద తేడాను కలిగిస్తాయని పోషకాహార నిపుణులు నొక్కి చెబుతున్నారు. భారతీయ ఆహారంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారాలుచిరుధాన్యాలు (రాగి, జొన్న, బజ్రా) – వీటిలో కరిగే, కరగని ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి.పప్పుధాన్యాలు (కందిపప్పు, పెసరపప్పు, మసూర్ పప్పు).చిక్కుడు జాతి గింజలు (రాజ్మా, శనగలు, చిక్పీస్).పండ్లు (జామకాయ, బొప్పాయి, అరటిపండు, ఆపిల్).కూరగాయలు (పాలకూర, బెండకాయ, క్యారెట్లు).తృణధాన్యాలు (బ్రౌన్ రైస్, గోధుమ చపాతీ).కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యాన్ని నివారించడానికి ఫైబర్ను క్రమంగా పెంచుకుంటూ..పుష్కలంగా నీరు త్రాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. డాక్టర్ ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్,అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ICAR–నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు(చదవండి: జస్ట్ రెండు నెలల్లో 20 కిలోలు తగ్గాలంటే..! ఆ 12 అలవాట్లు..) -
జస్ట్ రెండు నెలల్లో 20 కిలోలు తగ్గాలంటే..!
ఎలాంటి షార్ట్కట్లు లేకుండా త్వరిగతిన కిలోల కొద్ది బరువు తగ్గాలనుకునే వారికి ఈ కంటెంట్ క్రియేటర్ చెప్పే సలహాలు, సూచనలు ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఆమె తనకు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటూనే..సరైన జీవనశైలిని నిలకడగా పాటిస్తూ తగ్గానని చెబుతున్నారామె. అదెలాగో సోషల్ మీడియా వేదికగా ఆమెనే స్వయంగా వివరించారు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా..!.ఇటీవలకాలంలో అందరూ సంక్లిష్టమైన డిటాక్స్ ప్లాన్లు లేదా ఫ్యాన్సీ హెల్త్ ఫుడ్స్కు బదులుగా, చాలా మంది ఎక్కువ ప్రోటీన్ తినడం, ఎక్కువగా నడవడం, చక్కెర తగ్గించడం, నిలకడగా ఉండటం వంటి సాధారణ మార్పులపై దృష్టిసారిస్తున్నారు. బహుశా అందుకే ఈ కంటెంట్ క్రియేటర్ అంజలి సచిన్ తన వెయిట్ జర్నీ అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆమె చెప్పే ఆహారపు అలవాట్లు సైతం అందరు సులభంగా పాటించగలిగేవే కావడం విశేషం. ఆమె కేవలం రెండు నెలల్లోనే 20 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అందుకోసం ఏం చేశారో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆమె కేలరీ డెఫిసిట్ ప్రాధాన్యంగా తీసుకుని డైట్ని పాటించినట్లు పేర్కొన్నారు. అంటే శరీరం ఒక రోజులో ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువగా తీసుకోవడం. ఇక ఆమె తన దినచర్యలో అధిక ప్రోటీన, అధిక ఫైబర్ ఉన్న భోజనం, కార్బోహైడ్రేట్లు, చక్కెరను పూర్తిగా మానుకోవడం తోపాటు స్వీట్లు, శీతల పానీయాలు, చిరుతిళ్లను రాత్రిపూట తీసుకోకుండా దూరంగా ఉండటం వంటివి చేసినట్లు తెలిపారు. ఆ క్రియేటర్ క్రమం తప్పకుండా పాటించిన 12 కఠినమైన అలవాట్లు..అధిక ప్రోటీన్ + అధిక ఫైబర్ ఉన్న భోజనంతక్కువ కార్బోహైడ్రేట్ల విధానంచక్కెర వద్దు (స్వీట్లు, శీతల పానీయాలు వద్దు)తక్కువ నూనె + తక్కువ ఉప్పురోజుకు 15,000 అడుగులుఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్)వెయిట్ ట్రైనింగ్/వెయిట్లిఫ్టింగ్సమయానికి నిద్రపోవడంకొన్నిసార్లు రోజుకు ఒక పూట భోజనం (అవసరమైనప్పుడు)సాయంత్రం 6 గంటల తర్వాత డిన్నర్ వద్దుచిరుతిళ్లు తినవద్దు / అనవసరమైన చిరుతిళ్లు వద్దునెలకు 8-10 కిలోలు తగ్గాలనుకుంటే, ఈ నియమాలను క్రమశిక్షణతో పాటించండి. నిలకడ = పరివర్తన, అన్నింటకంటే ముఖ్యం అని అని అంజలి సచన్ పోస్ట్లో రాశారు. ఈ అలవాట్లతో పాటు, ఆమె శాకాహార, మాంసాహార భోజన ప్రణాళికలతో కూడిన 7-రోజుల తక్కువ కార్బోహైడ్రేట్, అధిక ప్రోటీన్ డైట్ చార్ట్ను కూడా పంచుకున్నారు.శాకాహార ప్రణాళికలో పనీర్ భుర్జీ, టోఫు, సోయా చంక్స్, మొలకలు సలాడ్, గ్రీక్ పెరుగు, మూంగ్ దాల్ చిల్లా, బెసన్ చిల్లా, రాజ్మా, వెజిటబుల్ సూప్, సలాడ్లు వంటి ఆహారాలు ఉన్నాయి. మాంసాహార వెర్షన్లో గుడ్లు, చికెన్, చేపలు, వే ప్రోటీన్తో కూడిన ఓట్స్, చికెన్ సలాడ్, ఎగ్ బుర్జీలకు ప్రాధాన్యత ఇచ్చారు.ఈ ప్లాన్లో చాలా మందికి నచ్చిన అంశం ఏమిటంటే, ఇది ఖరీదైన “డైట్” ఉత్పత్తులకు బదులుగా సాధారణ ఇంటి వంటకాలను ఉపయోగించడం. ఈ భోజనాలు సరళంగా, ప్రోటీన్కు ప్రాధాన్యతనిస్తూ, తయారుచేయడానికి సులభంగా ఉంటాయి.అదే సమయంలో, వేగంగా బరువు తగ్గడం అనేది అందరిపై ఒకే విధంగా పనిచేయకపోవచ్చని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఒక వ్యక్తి శరీరాకృతి, జీవనశైలి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆహారం, వ్యాయామ దినచర్యలను ఎల్లప్పుడూ వేరుగా ఉంటాయనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్కు ముగింపు..! ఆ కారణంతోనే..) -
ఉపవాసంతో కేన్సర్ నయం అవుతుందా?
ఫ్రెంచ్ రేడియాలజిస్ట్ పాస్కల్ ట్రోటా చాలా విస్తుపోయే విషయాన్ని వెల్లడించారు. ఆయన తనకు కేన్సర్ నిర్థారణ అయ్యి..ఆస్పత్రిలో చేరాక అక్కడ కీమోథెరపీ చేయించుకున్న చాలా మంది చనిపోవడం చూసి తీవ్ర ఆందోళన చెందినిట్లు తెలిపారు. కానీ చాలామందికి తెలియని నిజం ఏంటంటే..50% కేన్సర్ రోగులు తీవ్రమైన చికిత్సల వల్లే చనిపోతారని అన్నారు. అందువల్ల తాను కేన్సర్ అని నిర్ధారణ అయిన వెంటనే వృత్తికి పూర్తిగా దూరంగా ఉంటూ..ఉపవాసం ఉండటం ప్రారంభించానని చెప్పారు. అలా ఏకంగా 30 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపవాసం చేస్తూ..కేన్సర్ని నయం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా ఇలా కేన్సర్ బారినపడి ఇబ్బందిపడుతుంటే వారికి ఈ విషయం చెప్పండి అంటూ అవగాహన కల్పించే యత్నం చేస్తున్నారు. అంతేగాదు ఉపవాసం ప్రయోజనాలను గుర్తించే పలు దేశాలు ఫాస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో ఏఏ దేశాల్లో ఉపవాస కేంద్రాలు ఉన్నాయి, నిజంగా ఉపవాసం కేన్సర్ని కట్టడి చేయగలదా? తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఉపవాసం (Fasting) కేన్సర్ చికిత్సలో సహాయపడుతుందని, కణాల పునరుద్ధరణకు (Cellular repair) దోహదపడుతుందని పలు పరిశోధనలు సూచించాయి. కానీ ఉపవాసం మాత్రమే కేన్సర్ని పూర్తిగా తగ్గిస్తుందని తేల్చి చెప్పడానికి మరిన్ని పరిశోధనులు జరగాల్సి ఉంది. అయితే, కేన్సర్ రోగులకు ఉపవాసం వల్ల కొన్ని లాభాలు మాత్రం కచ్చితంగా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక్కడ ఉపవాసం కీమోథెరపీ మందుల ప్రభావాన్ని పెంచి, ఆరోగ్యకరమైన కణాలను రక్షిస్తూ కేన్సర్ కణాలను బలహీనపరుస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాదు ఉపవాసం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి, కేన్సర్ కణాలకు కావాల్సిన పోషకాలు అందక అవి పెరగడం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.ఇక్కడ ఉపవాసం రోగనిరోధక వ్యవస్థను (Immune system) పునరుద్ధరించి, కేన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే శరీరం పాడైపోయిన కణాలను శుభ్రం చేసి, కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుందని పలువురు నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ఉపవాసానికి అత్యంత ప్రజాదరణ పెరిగి, పలు దేశాల్లో ఉపవాస కేంద్రాలు పుట్టుకొచ్చాయి ఇలా. ఏ దేశాల్లో ఉన్నాయంటే..ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో, కోస్టారికా, స్పెయిన్, పోర్చుగల్, థాయ్లాండ్, బాలి తదితర దేశాల్లో ఉపవాస రీట్రీట్స్ నిర్వహిస్తున్నారు. వీటిని ఆరోగ్యపరమైన డిటాక్స్, బరువు తగ్గింపు, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సాధన కోసం ఏర్పాటు చేశారు.నార్త్ కరోలినా – ఐదు రోజుల జ్యూస్ క్లెన్స్, యోగా రీట్రెట్ ఉపవాసం ఈ విధానంలో యోగా, ధ్యానం తోపాటు ప్రత్యేకమైన జ్యూస్లు తీసుకుంటూ చేసే ఉపవాసం చేస్తారు. అలాగే కొద్ది మోతాదులోమొక్కల ఆధారిత ఆహారాన్ని ఇస్తారు.ఫ్లోరిడా – ఇది కూడా జ్యూస్ ఫాస్టింగ్ రీట్రీట్ కానీ 14 రాత్రలు చేస్తారు.మెక్సికో: ప్లయా డెల్ కార్మెన్ (Playa del Carmen) లో కాంబో డీప్ డెటాక్స్ థెరపీ ఇది అమెజాన్ అడవులకు చెందిన ఒక సాంప్రదాయ చికిత్స. 24 గంటలు ఉపవాసం ఉండి..అమెజాన్ జంగిల్ మెడిసిన్ని శరీరంపై అప్లై చేస్తారు. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి నిర్వీకర్షణ చేస్తుంది. కోస్టారికా: 5-రోజుల తీవ్రమైన శారీరక, భావోద్వేగ నిర్విషీకరణ (Detoxification) ప్రక్రియ. ఈ కార్యక్రమం జ్యూస్ ఫాస్టింగ్, కోలోన్ క్లెన్సింగ్, లివర్ ఫ్లష్లను సమ్మేళనం చేసి, శరీరాన్ని లోతుగా శుద్ధి చేస్తుందిస్పెయిన్: ఆల్కెమీ ఆఫ్ బ్రెత్ సంస్థ నిర్వహించే 'టస్కనీలో 7 రోజుల ఆశా బ్రెత్క్యాంప్. ఇక్కడ సుమారు 40 ఎకరాల ప్రకృతి అభయారణ్యంలో ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు, ధ్వని వైద్యం, శాకాహార భోజనాలు ఉంటాయి.పోర్చుగల్: పోర్చుగల్లోని ఆల్గార్వే (Algarve)లో 5-రాత్రుల ఫాస్టింగ్ మిమికింగ్ మెటబాలిక్ రీసెట్ రిట్రీట్ (Fasting Mimicking Metabolic Reset Retreat). ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, బరువు తగ్గడానికి, జీవక్రియను (metabolism) మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సైన్స్-ఆధారిత వెల్నెస్ ప్రోగ్రామ్.థాయ్లాండ్: 5 రోజుల అనయాత లగ్జరీ జ్యూస్ డిటాక్స్ రిట్రీట్. ఈ విధానంలో ప్రత్యేకమైన జ్యూస్లతో శరీరాన్ని శుద్ధి చేస్తారు. యోగా, ధ్యానం వంటి వెల్నెస్ ప్రోగ్రాములు కూడా ఉంటాయి. ఈ శిబిరాల్లో పాల్గొనేవారికి భావోద్వేగ, శారీరక మరియు మానసిక అలసట నుంచి విముక్తి పొందేలా పోషకమైన భోజనాన్ని తీసుకునే నిపుణులు మార్గదర్శకం అందిస్తారు.ఇండోనేషియా (బాలి): ఏడు రోజుల శారీరక, భావోద్వేగ హీలింగ్. ఈ విధానంలో సోమాటిక్ థెరపీ, యోగా వంటివి ఉంటాయినేపాల్: శ్రీ యోగా డిటాక్స్ రిట్రీట్(కాఠ్మాండు). ప్రకృతి మధ్యలో నివాసం, యోగా, డిటాక్స్ వంటివి ఉంటాయి. కంబోడియా CPC వెల్నెస్ డిటాక్స్ రీట్రీట్. హోలిస్టిక్ డిటాక్స్, రీబ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్.ఫిలిప్పీన్స్ : 'ది ఫార్మ్ ఎట్ శాన్ బెనిటో'. ఇందులో మెడికల్ + హోలిస్టిక్ థెరపీ, జ్యూస్ డిటాక్స్ వంటివి ఉంటాయి. అయితే వ్యక్తిగత ప్రోగ్రామ్ ఆధారంగా, ఆయా వ్యక్తుల ఆరోగ్య సమస్యల అనుగుణంగా థెరపీలు ఇస్తారు.భారత్లో ఉపవాస కేంద్రాలు..భారత్: సెహత్వాన్ (Sehatvan) ఫారెస్ట్ థెరపీ రిట్రీట్. 'సెహత్వాన్' అంటే అక్షరాలా "హీలింగ్ ఫారెస్ట్" (ఆరోగ్యాన్నిచ్చే అడవి) అని అర్థం. ప్రకృతి ఒడిలో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశంభారత్లో ఉపవాస (Fasting) రిట్రీట్స్ ప్రధానంగా ఋషికేశ్, కేరళ, మధ్యప్రదేశ్, జోధ్పూర్, ధర్మశాల వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి యోగా, ఆయుర్వేదం, ధ్యానం, డిటాక్స్ ప్రోగ్రామ్లతో కలిపి శరీరానికి, మనసుకు శాంతి కలిగించేలా రూపొందించారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఏ ఉపవాస రీట్రీట్స్ ఎంచుకున్న వైద్య పర్యవేక్షణ అవసరం. అలాగే నిపుణుల సమక్షంలో అందించే ఉపవాస కేంద్రాలనే ఎంచుకోవాలి. అలాగే డయాబెటిస్, హృదయ సంబంధ దీర్ఘకాలిక సమస్యలున్నవారు ఉపవాసం ప్రారంభించే ముందు వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవాలి.طبيب الأشعة الفرنسي باسكال تروتا يفجر مفاجأة من العيار الثقيل ويقول:بالنسبة لي شخصياً أنا أخصائي أشعة إذا أُصبتُ بالسرطان، فلن أعتب باب المستشفى. لقد رأيت الكثير من المرضى يموتون بسبب الآثار الجانبية للعلاج الكيميائي. وأعتقد أنكم تعرفون ذلك، لكن الجمهور لا يعرفه: 50% من مرضى… pic.twitter.com/wxHk2FUfzi— موسكو | 🇷🇺 MOSCOW NEWS (@M0SC0W0) May 6, 2026 (చదవండి: కాలేయ సమస్య? విశ్రాంతి మాత్రమే మార్గమా?) -
కాలేయ సమస్య? విశ్రాంతి మాత్రమే మార్గమా?
కాలేయ వ్యాధి నివారణకు విశ్రాంతి మాత్రమే ఏకైక మార్గం అనేది ఒక సాధారణ అపోహ. కానీ అధ్యయనాలు,ఆధారాలు అందుకు విరుద్ధంగా చెబుతున్నాయి. సిర్రోసిస్ ఉన్నవారిలో, ఏరోబిక్,స్ట్రెంగ్త్ ట్రైనింగ్లను కలిపి చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు తగ్గుతాయి జీవన నాణ్యత అవకాశాలు మెరుగుపడతాయి. ఇది వ్యాధి పురోగతికి ఒక ప్రధాన కారణమైన కండరాల క్షీణత నుంచి కూడా రక్షిస్తుంది.కాలేయ పనితీరుకు తీవ్రమైన వర్కవుట్స్ అవసరం లేదు. నడవడం, బరువులు ఎత్తడం, శరీరాన్ని సాగదీయడం చిన్నపాటి శ్రమ వంటివి అన్నీ అది కోలుకోవడానికి సహాయపడే సంకేతాలను పంపుతాయి. అయితే తీవ్రత కంటే నిలకడ ముఖ్యం. ఒక వారం పాటు మాత్రమే సాగే పరిపూర్ణ ప్రణాళిక కంటే, నెలల తరబడి పాటించగలిగే దినచర్య ఎల్లప్పుడూ ఉత్తమమైనది.ఆహారాన్ని జీర్ణం చేయడం, రక్తం వడపోతతో పాటు కాలేయం మరెన్నో పనులు చేస్తుంది. అది శరీరంలోని ఇతర భాగాల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా నిరంతరం సర్దుబాటు చేసుకుంటుంది. దానికి అత్యంత సన్నిహిత భాగస్వాములలో ఒకటైన కండరాలు క్రమం తప్పకుండా సంకోచించినప్పుడు, అవి కొన్ని సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఇవి కాలేయం కొవ్వును సరైన విధంగా నిర్వహించడానికి వాపును నియంత్రించడానికి సహాయపడతాయి. కండరాల కదలిక తగ్గినప్పుడు, ఆ మద్దతు కూడా తగ్గిపోతుంది, కాలేయంపై పనిభారం పెరిగి దాని విధుల నిర్వహణ కష్టమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ హెపటాలజిస్ట్, ‘ది లివర్ డాక్టర్గా పేరొందిన సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఒక వివరణాత్మక పోస్ట్లో తెలియజేశారు. వివిధ రకాల వ్యాయామాలు కాలేయానికి నిర్దిష్ట సంకేతాలను ఎలా పంపుతాయో, ప్రతి వ్యాయామానికి క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపితమైన ప్రయోజనాలు ఏవేం ఉంటాయో ఆయన వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం... మనం ప్రతిరోజూ కండరాలను ఉపయోగించే విధానమే, కాలక్రమేణా కాలేయం పనితీరును తీర్చిదిద్దుతుంది. కండరాలు కేవలం బలం లేదా అందం కోసం మాత్రమే కాదు. అవి జీవక్రియకు యంత్రంలా పనిచేస్తాయి. అవి సంకోచించినప్పుడు, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచే కాలేయంలో కొవ్వు నిల్వను తగ్గించే అణువులను విడుదల చేస్తాయి. ఒకే బరువు ఉన్న ఇద్దరు వ్యక్తులకు కాలేయ ఆరోగ్యం చాలా భిన్నంగా ఉంటుంది. ఇద్దరిలో బలమైన, చురుకైన కండరాలు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యకరమైన కాలేయం ఉంటుంది. రోజువారీ కదలిక పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం బాగా తగ్గుతుందని యూకేలో జరిగిన ఒక పెద్ద అధ్యయనం దృవీకరిస్తోంది.నడక: అత్యంత సులభమైన ఔషధం. వేగంగా నడవడం ఒక మంచి అలవాటు. వారానికి సుమారు 150 నిమిషాలు అలా నడిస్తే, కాలేయంలోని కొవ్వును దాదాపు మూడింట ఒక వంతు తగ్గించవచ్చుననేది ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. చిన్న మార్పులు కూడా ముఖ్యమైనవే. రోజుకు 1,000 అదనపు అడుగులు వేయడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం సుమారు 12 శాతం తగ్గుతుంది. దీనికి జిమ్ అవసరం లేదు, పరికరాలు అవసరం లేదు. కేవలం నిలకడ ఉంటే చాలు.కార్డియో...కూడా...స్థిరమైన వేగంతో జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటివి కార్డియోలో ఉంటాయి. మనం సరైన వేగంతో చేస్తున్నామా లేదా అనేది తెలుసుకునేందుకు ఓ సులభమైన పరీక్ష ఏమిటంటే... చేసే సయమంలో మాట్లాడటం సులభంగా అనిపించాలి, పాడటం మాత్రం కష్టంగా అనిపించాలి.వారానికి కొన్ని రోజులు, 30–45 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల కాలేయంలోని కొవ్వును తగ్గించి, కాలేయ ఎంజైమ్ల స్థాయిలను మెరుగుపరచవచ్చు. బరువు తగ్గకపోయినా ఈ ఆరోగ్య ప్రయోజనాలు కనిపించడం గమనార్హం. ఇది మన ఆలోచనల్ని కేవలం బరువు తగ్గడం నుంచి అత్యంత కీలకమైన జీవక్రియ ఆరోగ్యం వైపు మళ్లిస్తుంది.స్ప్రింట్ ఇంటర్వెల్స్స్ప్రింట్ ఇంటర్వెల్ శిక్షణ సెష¯Œ లు 15 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టవచ్చు. కేవలం ఆరు వారాల పాటు దీనిని చేయడం వల్ల, ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారిలో, కాలేయ కొవ్వు అంతర్గత అవయవాల కొవ్వును గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. సమయం దొరక్క ఇబ్బందిపడేవారికి, అలాగే కఠిన శ్రమను తట్టుకోగలవారికి ఇది సరిపోతుంది.హై–ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, (హెచ్ఐఐటి) అంటే చిన్న విరామాలలో తీవ్రమైన శ్రమ చేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం. సుమారు 12 వారాలలో ఈ పద్ధతి కాలేయంలోని కొవ్వును 37 శాతం వరకు తగ్గించగలదు. ఇది గుండెను కూడా బలపరుస్తుంది కార్డియోతో సమానమైన ప్రయోజనాలు, దానికి పట్టే సమయంతో పోలిస్తే దాదాపు సగం సమయంలోనే లభిస్తాయి.స్ట్రెంగ్త్ ట్రైనింగ్బరువులు ఎత్తడం లేదా బాడీవెయిట్ వ్యాయామాలు చేయడం కండరాలను పెంచుతాయి, అది నేరుగా కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.శరీర బరువు మారకపోయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కాలేయంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది కాలేయ ఎంజైమ్ల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ముఖ్యమైనది. ఇది కండరాల క్షీణతను నివారించడంలో సహాయపడుతుంది,రెండింటినీ కలపడం ఓ చక్కని విజయ సూత్రంకార్డియో స్ట్రెంగ్త్ ట్రైనింగ్లను కలపడం ఉత్తమమైన మార్గం. ఈ కలయిక, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది కాలేయం కోలుకోవడానికి మరింత బాగా తోడ్పడుతుంది. ఇది గుండె, కండరాలు కాలేయం అన్నీ కలిసి మెరుగుపడే సంపూర్ణ పరిస్థితిని శరీరంలో కల్పిస్తుంది.యోగా...సూర్య నమస్కారం మరికొన్ని యోగా పద్ధతులు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో యోగా ద్వారా కాలేయ కొవ్వును తగ్గించవచ్చు. అయితే, కేవలం తేలికపాటి స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు ఏరోబిక్ వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదు. హార్ట్ బీట్ను పెంచే కదలికలు ఎప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తాయి -
హంటావైరస్ అంటే..? ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందంటే..
అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ నౌక అర్జెంటీనా నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ద్వీపాల సమూహమైన కేప్ వెర్డేకు ప్రయాణిస్తోంది. దీంతో ఆ నౌకలోని ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో బందీలుగా చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దాంతో ఒక్కసారిగా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలేంటి హంటా వైరస్, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.హంటావైరస్ అంటే..హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసి పల్మనరీ సిండ్రోమ్ వంటి పలు అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎలా వ్యాపిస్తుందంటే..వ్యాధి సోకిన ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే గాలి చొరవని ప్రదేశాల్లో నివశించే ప్రజలుకు ఈ వ్యాధి సోకే అవకాశం అని చెబుతున్నారు.మానువుల ద్వారా సంక్రమణ అనేది..అనేక వైరల్ ఇన్ఫెక్షన్ల వలె ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. చాలామటుకు ఎలుకల కారణంగా నమోదవ్వుతాయని చెబుతున్నారు. లక్షణాలు..ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయని అన్నారు. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటాయని చెప్పారు. అందువల్లే ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టతరం అని పేర్కొన్నారు వైద్యులు.తక్కువ సమయంలోనే తీవ్రతరం అవ్వొచ్చు..వ్యాధి ముదిరే కొద్దీ, దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ ముఖ్య లక్షణం.మరణాల రేటు కూడా ఎక్కువే..ఇది అత్యంత అరుదైనదే అయినా..ఈ హంటావైరస్ ఇన్ఫెక్షన్లు ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల వెంటనే వైద్య సంరక్షణ పొందడం అత్యంత కీలకం.నిర్దిష్ట నివారణ లేదుహంటావైరస్కు నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదు. తీవ్రమైన సందర్భాలలో, ఆక్సిజన్ చికిత్స, ఆస్పత్రిలో చేరడం వంటి సహాయక చికిత్సలు తరచుగా అవసరమవుతాయ్. -
చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం..! హీరో నాగార్జున సైతం
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీహబ్ సహకారంతో 'రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం' జాతీయ మిషన్ను రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ లో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా చిరు ధాన్యాల వినియోగంపై ప్రజలలో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలికి దారితీసే ఉద్యమంగా రూపుదిద్దడం లక్ష్యం. ఈ మిషన్కు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున మద్దతు తెలిపారు. ఆయన ఒక వీడియో సందేశం ద్వారా రోజు వారీ ఆహారంలో చిరు ధాన్యాలను చేర్చాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన భారత నిర్మాణానికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్డిన మిల్లెట్ మార్వెల్స్ను అభినందించారు. ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో మిల్లెట్ల వినియోగాన్ని పెంచాలని ఈ వినూత్న కార్యక్రమం పిలుపునిస్తోంది. ఇది భారతదేశ పోషకాహార రంగాన్ని మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఒక మిల్లెట్ ఆధారిత భోజనాన్ని తమ ఆహారంలో చేర్చుకోవాలని, మిల్లెట్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని, మరో ముగ్గురిని ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని ప్రతిజ్ఞ చేశారు. చైన్ పద్ధతిలో జరిగే ప్రచారం ద్వారా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించి, తరువాత అంతర్జాతీయ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్సభ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా మద్దతు తెలిపారు.మిల్లెట్ మార్వెల్స్ 'మిల్లెట్ మార్వెల్స్'ను 2020లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు, సినీ నటుడు డాక్టర్ భరత్ రెడ్డి స్థాపించారు. చిరుధాన్యాలతో తయారైన ఆహారపు ఉత్పత్తులను రుచికరంగా, అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఈ స్టార్ట్అప్ ప్రారంభమైంది. భారతీయ మార్కెట్లో మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. డాక్టర్ సంగీతా రెడ్డి (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్) కృషితో మిల్లెట్ మార్వెల్స్ ను పునరుద్ధరించారు. నూతన ఉత్సాహంతో తిరిగి అభివృద్ధి చేశారు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఇన్పేషెంట్లకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని అందించడంపై దృష్టి సారిస్తూ ఈ సంస్థను మళ్లీ బ్రాండింగ్ చేశారు. దేశంలో ఇలాంటి చర్యలు చేపట్టిన తొలి హాస్పటల్ గా అపోలో నిలిచింది. ఈ కార్యక్రమానికి రోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. అపోలో హాస్పిటల్స్ నెట్వర్క్లోని ఇతర హాస్పిటల్స్ లో కూడా విస్తరించేందుకు మిల్లెట్ మార్వెల్స్ సిద్ధమవుతోంది. -
పాలిచ్చే తల్లులూ.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలో ఎన్నో మార్పులుచోటు చేసుకుంటాయి. అవి శారీరకమైనవీ, మానసికమైనవికూడా. అయితే... ప్రసవం తర్వాత అవన్నీ వెంటనే ఒకేరోజులో సాధారణస్థితికి రావు. ప్రసవం తర్వాత ఓ మహిళమళ్లీ మామూలు స్థితికి రావాలంటే కొంత ప్రత్యేక శ్రద్ధ, మరికొన్ని బాధ్యతలు తప్పనిసరి. ఇక కాన్పు తర్వాత చాలా మంది మహిళలు తమకు పుట్టిన బిడ్డ గురించి శ్రద్ధ తీసుకుంటారు తప్ప తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కాన్పు తర్వాత మహిళలు...తమ బిడ్డ విషయంలోనే కాకుండా తన కోసం కూడా కొంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. ఆ టైమ్లో బాలింతకు వచ్చే కొన్ని సమస్యలూ... వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాలను తెలుసుకుని ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులూ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...గర్భం దాల్చినప్పుడు మామూలుగా మూడు అంగుళాల పొడవు ఉండే గర్భాశయం... దాదాపు 20 అంగుళాల పొడవుండే శిశువును తనలో ఇముడ్చుకునేంత పెద్దదిగా సాగుతుంది. కాన్పు తర్వాత అదే గర్భాశయం మెల్లమెల్లగా సైజు తగ్గుతూపోతూ ఆరువారాలకు తన మొదటి స్థితిని చేరుతుంది. కాన్పు తర్వాత వారం రోజుల వరకు బొడ్డు కింది భాగంలో గర్భాశయం గట్టిగా స్పర్శకు తెలుస్తుంటుంది. గర్భిణిగా ఉన్న సమయంలో లోపల గర్భాశయంతో పాటు బయట పొట్ట కండరాలూ బాగా సాగుతాయి. ఫలితంగా కాన్పు తర్వాత కూడా పొట్ట వదులుగా కిందికి జారినట్లుగా కనిపిస్తుండవచ్చు. నడుము కండరాలు, ప్రసవమార్గంలోని కండరాలు, ఎముకలు సాగి బలహీనంగా మారతాయి. బరువు పెరగడం వల్ల, పొట్ట మీది చర్మం సాగడం వల్ల కొందరిలో చర్మంపై తెల్లటి లేదా ఎర్రటి లేదా నల్లటి చారికలు (స్ట్రెచ్మార్క్స్) ఏర్పడవచ్చు. ఇవన్నీ కాస్మటిక్గా మహిళలకు కొంత ఇబ్బందికరంగా కనిపించవచ్చు. ఈ స్ట్రెచ్మార్క్స్ నివారణ కోసం: పొట్ట మీద, తొడల మీద ఉండే చర్మం సాగి, చిట్లడం వల్ల వచ్చే స్ట్రెచ్మార్క్స్ పూర్తిగా పోవడానికి గాని, అస్సలే రాకుండా ఉండటానికి ఎలాంటి మందులూ, క్రీములు ఉండవు. ఆలివ్ ఆయిల్, విటమిన్–ఈ, కొన్ని మాయిశ్చరైజర్స్ వంటి వాటిని గర్భవతిగా ఉన్నప్పటినుంచే పొట్ట, తొడల మీద రాసుకోవడం వల్ల చర్మం మెత్తబడి సాగడానికి వీలుగా ఉంటుంది. దురదలు రావు. కాబట్టి దీనివల్ల స్ట్రెచ్మార్క్స్ నివారణ కొంతవరకు సాధ్యమవుతుంది. ప్రసవం అయిన తర్వాత మహిళ (బాలింత)లో కొన్ని రకాల సమస్యలు / ఆరోగ్య సమస్యలు కనిపించవచ్చు. అవి... బాలింత జ్వరం : కాన్పు తర్వాత కొందరు మహిళల్లో ఒళ్లు కొంచెం వేడిగా ఉంటూ, తర్వాత మామూలుగా అవుతుంటుంది. కొంతమందిలో మాత్రం కాన్పు తర్వాత 24 గంటల నుంచి 10 రోజుల్లోపు 100 డిగ్రీల కంటే ఎక్కువగా వచ్చే జ్వరాన్ని బాలింత జ్వరం అంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. పరిష్కారం : కోల్డ్ స్పాంజింగ్తోనే చాలావరకు జ్వరం తగ్గిపోతుంది. అయితే ఏదైనా నిర్దిష్ట కారణం వల్ల జ్వరం వచ్చినట్లు డాక్టర్లు గుర్తిస్తే... ఆ కారణాన్ని బట్టి డాక్టర్లు మందులు సూచిస్తారు.బాలింత జ్వరాలకు కొన్ని కారణాలు... జననాంగాల్లో ఇన్ఫెక్షన్ : రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, కాన్పు సమయంలో తగినంత శుభ్రత పాటించకపోవడం, రోగకారకక్రిములు జననాంగంలో ప్రవేశించడం, గర్భాశయంలో ఏమైనా మాయ ముక్కలు ఉండిపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల జననాంగాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి బాలింత జ్వరం రావచ్చు. పరిష్కారం : డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడాలి. రొమ్ముల్లో ఇన్ఫెక్షన్స్ : కొత్తగా తల్లి అయిన మహిళ తన బిడ్డకు పాలు సక్రమంగా పట్టకపోవడం, నిపుల్స్ సరిగా లేకపోవడం, రొమ్ముల్ని సరిగా ఖాళీ చేయకపోవడంతో పాలు లోపలే గడ్డకట్టి రొమ్ముల్లో ఇన్పెక్షన్ రావచ్చు. రొమ్ముపై ఏవైనా పగుళ్లు ఏర్పడితే, వాటి ద్వారా తల్లి దేహంలోకి రోగక్రిములు చేరవచ్చు. అలాగే బిడ్డ నోటిలో పూత ఉన్నా రోగక్రిములు రొమ్ముల్లోకి పాకి అది తల్లిలో ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే రొమ్ముల్లో చీముగడ్డలు ఏర్పడవచ్చు. పరిష్కారం: డాక్టర్ సలహా మేరకు తగిన మందులు తీసుకుంటూ, వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటించాలి.జ్వరాలకు మరికొన్ని కారణాలు : సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వేసే కుట్లలో చీము పట్టడం మలేరియా, టైఫాయిడ్, నిమోనియా వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకే ముప్పు ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా దేహమంతటా పాకి కొంత ప్రమాదాలకు తావిచ్చే అవకాశం. పరిష్కారం : కారణాలను బట్టి తగిన మందులు ఇవ్వడం, ఆ మేరకు బాలింత తగిన జాగ్రత్తలు పాటించేలా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. నొప్పులు : కాన్పు తర్వాత కొందరిలో వెన్ను, తొడలు, పిరుదుల దగ్గర నొప్పులు రావచ్చు. కొందరిలో అవి మరీ ఎక్కువగానూ ఉండవచ్చు. గర్భాశయం బరువు మొత్తం వెన్నుపూసపై పడటం వల్లా, అలాగే కండరాలు సాగి మునపటి బలం కొద్దిగా తగ్గడం వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. కొన్నిసార్లు కాన్పుకి ఎక్కువ సమయం పట్టినా, లేదా కాన్పు కష్టంకావడంతో ఫోర్సెప్ సహాయంతో కాన్పు జరిపినప్పుడు, వెన్పుపూస కింది భాగంలోని నరాలపై ఒత్తిడి పడి కొంతమందిలో కాన్పు తర్వాత కాళ్లు కదల్చలేకపోవడం, స్పర్శ తగ్గడం వంటివీ కనిపించవచ్చు. పరిష్కారం : వీటిని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటిలో చాలావరకు డాక్టర్ల సలహాలూ, మందులతోనూ లేదా ఇవన్నీ కొద్దిపాటి ఫిజియోథెరపీతో తగ్గిపోయే సమస్యలే. మూత్రసమస్యలు : కాన్పు తర్వాత మూత్రాశయానికి చేరే నరాలు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల మూత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం వంటి సమస్య కనిపించవచ్చు.అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్) వచ్చే అవకాశాలు ఉంటాయి. కాన్పు తర్వాత ఉండే నొప్పి వల్ల కూడా మూత్ర విసర్జన పూర్తిగా సాధ్యపడకపోవచ్చు. తగినంత నీరు తాగకపోవడం వల్ల, జననాంగాల నుంచి మూత్రవ్యవస్థకూ ఇన్ఫెక్షన్ పాకవచ్చు. కొంతమందిలో కొన్ని రోజులపాటు మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోయే ముప్పు కూడా ఉంది. పరిష్కారం : ఈ సమస్యలు తగ్గడానికి పెల్విక్ఫ్లోర్ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మలబద్దకం : కాన్పు తర్వాత మహిళలకు పెద్దగా నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందిలో మలబద్దకం ఏర్పడవచ్చు. పరిష్కారం : తగినన్ని నీళ్లు తాగడం, ద్రవాహారం తీసుకోవడంతో పాటు ఆకుకూరలూ, కాయగూరలతో ఉన్న పోషకాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు చాలా కొద్దికాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం : గర్భవతిలో కాన్పు తర్వాత జరిగే రక్తస్రావాన్ని ఆపడం కోసం రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన పదార్థాలు (ఫ్యాక్టర్లు) ఎక్కువగా తయారయ్యేలా ప్రకృతి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కొంతమందిలో (బరువు ఎక్కువగా ఉన్నవారు, హైబీపీతో బాధపడేవారు, ఎక్కువ వయసున్న వారిలో) కాన్పు తర్వాత వారం నుంచి పది రోజుల వరకు ఈ పదార్థాల వల్ల రక్తం గడ్డకట్టి, ఆ గడ్డలు రక్తరాళాల ద్వారా వేరే చోట్లకు పాకి సాధారణ రక్తప్రసరణకు అడ్డుగా మారే (ఎంబాలిజమ్) ముప్పు ఉంటుంది. ఉదాహరణకు... కొందరిలో ఇలాంటి రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తే... అకస్మాత్తుగా ఊపిరి అందక ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశమూ లేకపోలేదు. ఈ కండిషన్ను ‘పల్మునరీ ఎంబాలిజమ్’ అంటారు. పరిష్కారం : కాన్పు తర్వాత ఎక్కువగా కదలకుండా పడుకుని ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్ సలహా మేరకు చురుగ్గా ఉండటం అవసరం. తీవ్రమైన రక్తస్రావం : కాన్పు తర్వాత కొంతసేపు సాధారణంగా 200 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వరకు రక్తస్రావం అవుతుండటం మామూలే. అంతకంటే ఎక్కువగా రక్తస్రావం అయితే ఆ కండిషన్ను పోస్ట్పార్టమ్ హేమరేజ్ (పీపీహెచ్) అంటారు. పీపీహెచ్ను మొదటే నియంత్రించకపోతే, దాదాపు 25 శాతం మందిలో ప్రాణాలకు ముప్పు ఉండే ప్రమాదముంటుంది. దాదాపు 90 శాతం పీపీహెచ్ కేసుల్లో గర్భాశయం ముడుచుకుపోవడం (యుటరైన్ ఎటోనీ) వల్ల బ్లీడింగ్ జరుగుతుంది. కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) చీరుకుపోవడం వల్ల, మరికొందరిలో గర్భాశయం లోపల మాయముక్కలు ఉండిపోవడం, రక్తం గూడుకట్టుకునే స్వభావంలో లోపాలు కూడా పీపీహెచ్కు కారణం కావచ్చు.పరిష్కారం : ఇలాంటి సందర్భాల్లో కారణాన్ని బట్టి చికిత్సతో పాటు... అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాల్సిన రావచ్చు. రక్తస్రావం ఎంతకీ నియంత్రణలోకి రాకపోతే కొందరిలో గర్భసంచి తొలగించాల్సిరావచ్చు. రక్తహీనత : అధిక రక్తస్రావం కావడం లేదా ముందు నుంచే రక్తహీనత ఉన్నవారిలో ఉండాల్సిన మోతాదులో రక్తం లేక΄ోవడం వల్ల నీరసం, నిస్సత్తువ, బలహీనంగా ఉండటం వంటివి కనిపించవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ సోకడం, అవి ఒకపట్టాన తగ్గకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు.పరిష్కారం : తల్లికి పాలకూర వంటి ఆకుకూరలూ, నువ్వుల వంటి వాటితో చేసిన రుచికరమైన పదార్థాలు... అంటే ఐరన్ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు పెడుతుండాలి. రక్తహీనత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సిరప్, టాబ్లెట్లు వంటివి వాడాల్సిరావచ్చు. ఫిట్స్ (హైబీపీ వల్ల) : కాన్పుకి ముందు కొంతమందిలో బీపీ పెరిగి కాన్పు తర్వాత తగ్గుతుంది. కానీ కొంతమందిలో కాన్పు తర్వాత కూడా వారం నుంచి పదిరోజుల పాటు బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పరిష్కారం : నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. మానసిక సమస్యలు : కొంతమంది బాలింతల్లో కాన్పు తర్వాత 3–5 రోజుల తర్వాత డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కండిషన్నే పోస్ట్పార్టమ్ బ్లూస్ లేదా బేబీ బ్లూస్ అంటారు. రక్తహీనత, బిడ్డ పెంపకం బాధ్యతల తాలూకు ఆందోళనా, భయం, నిద్రలేమి, కొన్ని హార్మోన్లలో మార్పులతో కనిపించే మానసిక సమస్యలూ, కుటుంబంలో ఉండే సమస్యలూ, కలహాల వంటి ఎన్నో కారణాల ఈ డిప్రెషన్ రావచ్చు. కుటుంబసభ్యుల సహకారం వల్ల కొందరిలో ఇది 2–3 రోజుల్లోనే చక్కబడుతుంది. కానీ... మరికొందరిలో పరిస్థితి మరింత తీవ్రమై సైకోసిస్ స్థితిలోకి వెళ్లే ముప్పు కూడా ఉంటుంది. పరిష్కారం : ఈ సమస్యకు మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అవసరం. బాలింత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుకాన్పు తర్వాత అటు తల్లి విషయంలోనూ, ఇటు బిడ్డ విషయంలోనూ తగిన జాగ్రతలు పాటించి, ఎలాంటి సమస్యలూ రాకుండా చూసుకోవాలి. కాన్పు జరిగిన 24 నుంచి 48 గంటల వరకు బాలింత ఆరోగ్యంతో పాటు ఆమెలో జ్వరం, బీపీ, రక్తస్రావం వంటివి ఏవైనా కనిపిస్తున్నాయా అనే విషయాన్ని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.ఆహారం : కాన్పు తర్వాత బాలింతకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. మామూలుగా కంటే రోజుకు 600 కేలరీలు అధికంగా శక్తినిచ్చే ఆహారంతోపాటు బాగా పాలుపడేలా ఉండే ఆహారం తల్లికి ఇవ్వాలి. ఇందులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు, మాంసాహారం ఇవ్వాలి. పాలు, పెరుగు, పండ్లు తీసుకోవచ్చు. ఆహారంలో ఎలాంటి పథ్యం అవసరం లేదు. అయితే కారాలు, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు. పప్పులు తినడం వల్ల చీము పడుతుందన్నది అపోహ మాత్రమే. రోజుకు కనీసం 10 గ్లాసులు (రెండు లీటర్ల) నీళ్లు తప్పనిసరిగా తాగించాలి. నీరు తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, మలబద్దకాన్ని నివారించడానికి వీలవుతుంది. నీరు తాగడం వల్ల పొట్టపెరుగుతుందని, జలుబు చేస్తుందన్నది అపోహ మాత్రమే. మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కాన్పు తర్వాత కలిగే అలసట త్వరగా తగ్గుతుంది. కుట్లు త్వరగా/తేలిగ్గా మానుతాయి. పాలు బాగా పడతాయి. (బిడ్డ... తన తల్లిపాల నుంచి ఐరన్, క్యాల్షియమ్ గ్రహిస్తుంది. కాబట్టి మొదటి మూడు నెలలు తల్లి తప్పనిసరిగా ఐరన్, క్యాల్షియమ్ మాత్రలు వాడాలి. బిడ్డకు జలుబు చేస్తుందని పండ్లు, పెరుగు, మజ్జిగ తల్లికి ఇవ్వరు. ఇది కేవలం అపోహ మాత్రమే.విశ్రాంతి : కాన్పు తర్వాత తల్లి బాగా అలసిపోతుంది. ఆ అలసటను తగ్గించడానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. శారీరక, మానసిక విశ్రాంతి ఇవ్వడం వల్ల తల్లికి పాలు బాగా పడతాయి. బిడ్డను ఉయ్యాలలో కాకుండా తల్లిపక్కనే పడుకోబెట్టడం వల్ల ఆ స్పర్శతో తల్లీబిడ్డల మధ్య బంధం పటిష్టమవుతుంది. పాలు బాగా పడతాయి.అటు ఇటు తిరగడం : సాధారణ కాన్పు తర్వాత తల్లిని కొద్ది గంటలలోపే లేచి అటు ఇటు తిరిగేలా ప్రోత్సహించడం మంచిది. ఆపరేషన్ చేసిన వాళ్ల విషయంలో... ఆమె బెడ్ మీదే ఉన్నప్పటికీ 4–6 గంటల తర్వాత నుంచి మంచంలోనే కాళ్లు అటూ–ఇటూ కదపడం, ముడుచుకోవడం–స్ట్రెచ్ చేయడం వంటివి చేయవచ్చు. ఆరోగ్యపరిస్థితిని బట్టి 12–24 గంటల తర్వాత మెల్లగా ఏదైనా ఆసరాతో లేచి తిరిగేలా చేయవచ్చు. ఇలా త్వరగా కదలడం వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పునూ... ఆ రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోకి ప్రవేశించే (ఎంబాలిజమ్) రిస్క్ను నివారించవచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత : కాన్పు తర్వాత జననాంగాలు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మల,మూత్ర విసర్జన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సాధారణ కాన్పు తర్వాత కుట్లు వేయాల్సివస్తే వాటిపై యాంటీసెప్టిక్ పౌడర్ వేసుకోవచ్చు. బట్టలు కాకుండా డయాపర్లు వాడుకోవడం మంచిది. తడిసినవాటిని తరచూ మార్చుకుంటూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. యోనిస్రావాల పరిమాణం, రంగు, వాసన అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.రొమ్ములపై శ్రద్ధ : తొమ్మిదో నెల నుంచే తల్లి తన రొమ్ములను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రొమ్ము మొనలను సాగదీస్తూ ఉండటం వల్ల కాన్పు తర్వాత బిడ్డ పాలు తాగడానికి అనువుగా మారతాయి. బిడ్డ పుట్టగానే గంటలోపే బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే పాలు మరింత త్వరగా ఊరతాయి. బిడ్డకు అత్యుత్తమ ఆహారం తల్లిపాలే. మొదటి రెండు మూడు రోజులు నీరు లాంటి ద్రవం (కొలెస్ట్రమ్) ఉత్పత్తి అవుతుంది. అయితే ఇందులో బిడ్డకు వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి అవసరమైన యాంటీబాడీస్, విటమిన్స్ ఉంటాయి. బిడ్డకు మొదటి ఆర్నెల్లూ తల్లిపాలే పట్టాలి. అవి మినహా మరేవీ ఇవ్వడం సరికాదు.వ్యాయామాలు : కొన్ని వ్యాయామాలతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవి నడుము నొప్పిని నివారిస్తాయి. ప్రారంభంలో కాళ్లు కదపడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. డాక్టర్ సలహా మేరకు ఆరు వారాల తర్వాత క్రమేపీ పొత్తికడుపు కండరాలు, పెల్విక్ఫ్లోర్ కండరాలు, నడుము కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయవచ్చు. వీటివల్ల వదులైన పొట్ట కండరాలు గట్టిపడతాయి. పొట్ట మీద బట్ట చుట్టడం వల్లనో, అబ్డామినల్ బెల్ట్ వల్లనో పొట్ట తగ్గదు. అవి కేవలం సపోర్ట్గా మాత్రమే పనికివస్తాయి. కాన్పు తర్వాత అలసట తగ్గాక మెల్లగా వాకింగ్వంటి తేలికపాటి వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు.కుటుంబ నియంత్రణ : ప్రసవం తర్వాత వెంటనే గర్భం అందకుండా డాక్టర్ సలహా మేరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం మంచిది. కాన్పు తర్వాత 2–3 నెలల నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్లో పాల్గొనడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ (పీరియడ్స్ రాకుండానే కూడా). అందువల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల అనుకోకుండా వచ్చే, అవాంఛిత గర్భాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి, కని అలసిపోయిన శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ఉన్న సమయాన్ని బిడ్డకి కేటాయించడం వల్ల బిడ్డలోనూ మంచి ఎదుగుదల, వికాసం కనిపిస్తాయి. ఇక పిల్లలు వద్దు అనుకున్న వారు శాశ్వత సంతాన నియంత్రణ పద్ధతుల కోసం డాక్టర్ను సంప్రదించవచ్చు. దాంపత్య జీవితం : బాలింతలో జరిగే మార్పులు యథాతథ స్థితికి వచ్చేందుకు, జననాంగాలు సాధారణ స్థితికి రావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. ఇతరత్రా ఏ సమస్యలూ లేకుండా ఉంటే, ప్రసవం అయ్యా ఆరు వారాల తర్వాతి నుంచి దాంపత్య జీవితం గడపవచ్చు. ఒకవేళ సిజేరియన్ అయిన వారు కుట్లలో ఎలాంటి నొప్పులు లేకపోతే 8–10 వారాల తర్వాత దాంపత్యంలో పాల్గొనవచ్చు.కుటుంబ సభ్యుల పాత్ర : కాన్పు తర్వాత బాలింతకు ఇంట్లో వాళ్ల చేయూత, మద్దతు ఎంతో అవసరం. ముఖ్యంగా భర్త పోషించాల్సిన భూమిక చాలా ప్రధానం.డాక్టర్ చెకప్ : కాన్పు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వారం తర్వాత ఒకసారి, ఆరు వారాల తర్వాత మరోసారి డాక్టర్ను సంప్రదించాలి. లేదా డాక్టర్ సూచించిన విధంగా చెక్అప్కు వెళ్లాలి. తనకు వచ్చే సందేహాలన్నింటినీ మొహమాటపడకుండా డాక్టర్ను అడిగి తీర్చుకోవాలి. కాన్పుకు ముందు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని డాక్టర్కు వివరించి, వాటి విషయంలో కాన్పు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం అవసరం.డాక్టర్ సరోజ బానోతు,కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ (చదవండి: మామిడి పండ్లను తినేముందు ఇలా చేయడం తప్పనిసరి..! హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు) -
మామిడిపండ్లను నేరుగా తినేస్తున్నారా..? హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
పండ్లలో రారాజుగా కీర్తించే మామిడపండ్లు వచ్చే కాలమే ఈ వేసవి. ఈ సమయంలో ఎటుచూసినా..ఈ పండ్ల సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఈ పండ్లను తినేమందు నీటిలో నానబెట్టడం అనేది మన పూర్వీకుల కాలం నుంచి పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతి. ఇది కేవలం మామిడి పండ్లను శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదని..అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలందించే విధానంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా నీటిలో నానబెట్టడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడటమే గాక శరీర ఉష్ణోగ్రతన నియంత్రించి, జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుందని అంటున్నారు. ఈ మామిడిలో విటమిన్లు ఏ,సీల తోపాటు, పీచుపదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి శక్తి కేంద్రం అయినప్పటికీ..పచ్చి రూపంలో కొన్ని జీవరసాయన సమ్మేళనాలు ఉంటాయి. అయితే ఈ పండు మన జీర్ణక్రియకు సురక్షితమైనదిగా ఉండాలంటే..ఈ సమ్మేళనాల ప్రభావాన్ని తగ్గించేలా నీటిలో అరగంటపాటు నానబెట్టక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా చూద్దామా..!.ఫైటిక్ ఆమ్లాన్ని తటస్థీకరించడం: మామిడి పండ్లను నానబెట్టమని సిఫార్సు చేయడానికి ప్రాథమిక శాస్త్రీయ కారణం ఫైటిక్ ఆమ్లం ఉండటమే. ఫైటిక్ ఆమ్లం అనేది వివిధ మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే ఒక సహజ పదార్ధం. ఇది ఫాస్ఫరస్ను నిల్వ చేసే రూపంగా పనిచేస్తుంది. పోషకాహార శాస్త్ర ప్రకారం..ఖనిజాల జీవ లభ్యతపై దాని ప్రభావం కారణంగా దీనిని తరచుగా "పోషక విరోధి"గా వర్గీకరిస్తారు.జీర్ణవ్యవస్థలో కాల్షియం, ఇనుము, జింక్ వంటి అవసరమైన ఖనిజాలతో బంధం ఏర్పరచుకోవడానికి ఫైటిక్ ఆమ్లానికి అధిక అనుబంధం ఉంటుంది. ఈ ఖనిజాలు ఫైటిక్ ఆమ్లంతో బంధం ఏర్పరచుకున్నప్పుడు, అవి కరగని అవక్షేపాలను ఏర్పరుస్తాయి. అయితే వీటిని మానవ శరీరంలోని చిన్న ప్రేగు గ్రహించలేదు. అందువల్ల ఈ మామిడి పండ్లను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం వల్ల, వాటిలోని అదనపు ఫైటిక్ ఆమ్లం కరిగిపోవడం లేదా విచ్ఛిన్నం కావడం జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ "యాక్టివేషన్" ప్రక్రియ కారణంగా పండులోని సూక్ష్మపోషకాల పూర్తి పోషక విలువను సులభంగా పొందగలమని చెబుతున్నారు.మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం..జీర్ణవ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ పద్ధతి చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. మామిడి పండ్లలో ఉండే అధికంగా ఉండే ఫైటిక్ యాసిడ్ ఇనుము, జింక్, కాల్షియం వంటి ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఎప్పుడైతే సుమారు 30 నిమిసాలు నానబెడతామో అప్పుడు ఈ పోషక వ్యతిరేక పదార్థ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా పండు మంచి పోషకవంతమైనదిగా, అలాగే జీర్ణవ్యవస్థకు సులభంగా జీర్ణమయ్యేదిగా మారుతుంది.ఉష్ణోత్పత్తిని తగ్గించి శరీరానికి చలువ చేసేలా..మామిడిలో కేలరీలు అధికం, సహజ చక్కెరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఇది నానబెట్టకుండా నేరుగా తీసుకుంటే జీవక్రియ వేడిని పెంచడానికి దారితీస్తుంది. శరీరంలో అంతర్గత వేడి చర్మంపై ప్రభావం చూపి దద్దుర్లు, మొటిమలు లేదా వేడి కురుపులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి పండ్ల సీజన్లో ఇవి సాధారణంగా కనిపించే సమస్యలు. ఈ వేడి కారణంగా కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అంటున్నారు. మనం ఎప్పుడైతే మామిడి పండుని నీటిలో నానబెడతామో అప్పుడు దానిలోని సహజ వేడి ఆవిరైపోతుంది. మానవ శరీర అంతర్గత వాతావరణానికి అనుగుణంగా మారిపోతుంది. అలాగే పేగులు సులభంగా జీర్ణం చేసుకోగలుగుతాయి కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.రసాయన అవశేషాల నిర్మూలనఈ మామిడి పండ్లు పండించేందుకు కృత్రిమ పురుగుల మందులు, శిలీంధ్రనాశకాలు వంటివి అధికంగా వినియోగిస్తారు రైతులు. అంతేగాక పండు ఉపరితలంపై కాల్షియం కార్బైడ్, ఆర్సెనిక్ వంటి రసాయనాలను చల్లుతారు. ఫలితంగా రవాణ సమయంలో పండు డ్రై అయిపోకుండా తేమతో ఉండేలా చేయడమేగాక, నిల్వ కాలాన్ని పొడిగిస్తాయి. అలాగే వాణిజ్య మామిడి పండ్డు అందంగా కనిపించేలా పలుచటి మైనపు పొరను పూస్తారు కూడా. అందువల్ల ఇలాంటి మామిడిపండ్లను పారే నీటి కింద త్వరగా కడగడం, 30 నిమిషాలపాటు నానబెట్టడం వంటి వాటి వల్ల ఆయా రసాయనాల అవశేషాలు సమర్థవంతంగా తొలిగిపోవడమే గాక సురక్షితమైన ఆహారంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇలా నానబెట్టడం వల్ల మామిడి కాండం వద్ద ఉండే జిగురు లేదా లేటెక్స్ అనే రసం ఘాటు తొలిగిపోతుందట. ఈ రసం గనుక నోటిలోకి వెళ్తే నోటి చుట్టూ వాపు, దురద, బొబ్బలు వంటి చర్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!) -
సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి మొత్తం 107 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఫిట్నెస్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఉండాలంటే..ఆరోగ్యపట్ల ఎలాంటి స్ప్రుహతో వ్యవహరించాలి వంటి వాటి గురించి విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ వెల్లడించారు. ఆయనతో ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవంతోపాటు..ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయంటూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అంతటి స్టార్డమ్ ఉన్నా..ఆరోగ్యం పట్ల విజయ్ వ్యవహరించే తీరు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.సెట్లో విజయ్తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ..ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్..విజయ్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే కాకుండా..తెర వెనుక కూడా చాలా నిబద్దతతో వ్యవహరించే ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయన ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండటమేగాక, అత్యంత నిలకడగా చేస్తుంటారని అన్నారు. ఆయనతో పనిచేయడం ఒక మరుపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఎంతటి బిజీ షెడ్యూల్లో గడుపుతున్నప్పటికీ..తన ఆరోగ్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఎంతటి విరామంలేని స్థితిని కూడా ఆయన చాలా చాకచక్యంగా సమతుల్యం చేసుకుంటారని, అదే ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. సమయ నిర్వహణ నుంచి శారీరక దృఢత్వం కాపాడుకోవడం, శక్తిమంతమైన ప్రదర్శనలు ఇవ్వడం వరకు ప్రతిదీ నిశబ్దమైన ఏకాగ్రతతో చేస్తారని కుమార్ తెలిపారు. ఎంతటి హడావిడి రాజకీయ ర్యాలీలలోనైనా, ఆయన తన భోజనాన్ని తానే తీసుకువెళ్లేవారని అన్నారు. బయటి ఆహారానికి చాలా దూరంగా ఉంటారని చెప్పారు. ఆయనలో సాధారణ స్థాయిని మించిన క్రమశిక్షణను స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నాడు. 51 ఏళ్ల వయసులోనూ యువ హీరోలను తలదన్నేలా ఉండే ఆయన ఫిజిక్కి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే అంటూ పొగడ్తలజల్లు కురిపించారు. అంతేగాదు విజయ్ క్షణం తీరక లేని ఒత్తిడితో కూడిన పరిస్థితిని సైక్లింగ్, జిమ్ సెషన్లు, రన్నింగ్ వంటి మార్గాలతో చిల్ అవుతారని చెప్పుకొచ్చారు. పైగా విజయ్కి ఇప్పటి వరకు మోకాలి లేదా నడుము నొప్పి వంటి సమస్యలు కూడా లేవన్నారు. ముఖ్యంగా విజయ్ వినయం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని, అదే ఆయనకు ఇంతలా ప్రజాదరణ తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని సమాన గౌరవంతో చూస్తారు, అదే అయన మార్క్ని స్పెషల్గా చూపించడమే గాక..విక్టరీకి కేరాఫ్గా నిలిచేలా చేసిందని అంటున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా అంచనాలకు అందని విజయ్ ఘన విజయం యాదృచ్ఛికంగా వచ్చిందికాదని, ఆయన అంకితభావం, ఏకాగ్రత, అభిరుచి ఫలితంగా వచ్చిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. అంతేగాదు క్రమశిక్షణ అనే పునాదిపై నిర్మించబడిన విజయంగా పేర్కొన్నారు. అలాగే ఏ రంగంలోనైనా తూచా తప్పకుండా నిలకడతో వ్యవహరిస్తే..విజయం తథ్యమని అందుకు దళపతి, తమినాడు సీఎం విజయ్నే నిదర్శనమని అన్నారు. (చదవండి: హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!
బరువు తగ్గడం ప్రస్తుత రోజుల్లో ఒక ట్రెండ్గా మారింది. అంతా శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించుకుని స్మార్ట్గా మారడంపైనే ఫోకస్ పెడుతున్నారు. అంతేగాదు ఆరోగ్యస్ప్రుహతో ఆ దిశగా పోషకాహార నిపుణులు, ఫిట్నెస్ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తున్నారు. బరువు తగ్గడం అంటే తక్కువగా తీసుకోవడం, కేలరీలు మితంగా ఉండేలా కేర్ తీసుకోవడంపై ఆధారపడి ఉంటుందనేది అందరి నమ్మకం కానీ, ఇది అందరికీ వర్తించదని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్నెస్ కోచ్ హన్నా బటన్. కొందరిలో ఈ విధానం దీర్ఘకాలిక కొవ్వు నష్టానికి దారితీస్తుందని అంటున్నారు. అలాంటివాళ్లు, జీవక్రియ , హర్మోన్ల సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా డైట్ తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. అదెలాగో సోషల్ మీడియా ఎక్స్ వేదిక వివరించారామె. ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్నెస్ కోచ్ హన్నా బటన్ తాను సాధారణంగా తినే విధానం కంటే ఎక్కువగా తింటూ కోరుకున్న విధంగా బరువు ఎలా తగ్గొచ్చో ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ఆ పోస్ట్లో మనకు స్థిరమైన కొవ్వు నష్టం జరగకుండా మంచి డైట్ని అనుసరించాలని అన్నారామె. అయితే చాలామంది నిపుణులు తక్కువ తినండి, కార్బోహైడ్రేట్లు తగ్గించండి, అలాగే ప్రతి కేలరీని లెక్కించడని సూచిస్తుంటారు. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్గా ఈ విధానం వల్ల కండరాలు కోల్పోయాను, హార్మోన్లు దెబ్బతిన్నాయ్, పైగా మరింత అధ్వాన్నంగా కనిపించానని చెప్పుకొచ్చింది. ఈ సలహా ముమ్మాటికీ తప్పు మాత్రమే కాదు హానికరం అని అంటున్నారామె.తక్కువగా తినడం వల్ల శక్తిని ఆదా చేసేందుకు జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కొవ్వు నిల్వలు, కండరాలు తగ్గిపోతాయ్, అలసిపోతారు కూడా. అలాగే మీ బరువులో ఎలాంటి మార్పు కనిపించదు కూడా. అందువల్ల ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు డైటింగ్ పద్ధతిని మార్చాలంటున్నారామె.ప్రోటీన్ ఆటను మార్చేస్తుందిఫిట్నెస్ కోచ్ హన్నా ప్రతిరోజూ శరీర బరువులో ప్రతి పౌండ్కు 0.7–1 గ్రాముల ప్రోటీన్ను లక్ష్యంగా పెట్టుకోమని సూచిస్తున్నారు. శరీరం ప్రోటీన్ను జీర్ణం చేసుకోవడం ద్వారానే దాని నుంచి వచ్చే కేలరీలలో 30% ఖర్చు చేస్తుంది. కొవ్వును తగ్గించుకుంటున్నప్పుడు ఇది లీన్ కండరాలను కాపాడుతుంది. చాలా మంది తమకు వాస్తవంగా అవసరమైన దానిలో సగం మాత్రమే తింటారు.ఎక్కువగా తింటే.. చురుకుగా జీవక్రియ..తీవ్రమైన ఆహార నియంత్రణ ఆకలికి సంకేతం, దీని ఫలితంగా కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం కొవ్వును తీవ్రంగా నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే 300-400 కేలరీల లోటు ఎల్లప్పుడూ ఉత్తమమైనది. హన్నా ప్రకారం, తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే నిలకడగా పాటించగలిగే డైట్ను ఎంచుకోవాలి.కండరాలే కొవ్వును కరిగించే చోదక శక్తిఎంత ఎక్కువ కండరాలను పెంచుకుంటే, విశ్రాంతి జీవక్రియ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కొవ్వును కరిగించడం ప్రారంభిస్తారు. ఇక్కడ కండరాలను పెంచుకోవాలంటే, తగినంత ఆహారం తీసుకుంటూ..బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా నియంత్రణ పేరుతో ఆకలితో ఉండటం అనేది కండరాలను నాశనం చేస్తుంది, పైగా జీవక్రియ మందగించి, అదనంగా కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.40 ఏళ్లు పైబడిన వారిలో హార్మోన్లు చాలా ముఖ్యందీర్ఘకాలంగా తక్కువగా తిన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకునేలా చేస్తాయి. అదే సమయంలో, నిరంతరం తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల, కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే లెప్టిన్ అనే హార్మోన్ను అణచివేస్తుంది. ఇది మీకు అంతులేని ఆకలిని కలిగించి, మిమ్మల్ని అతిగా తినేలా చేస్తుంది.తినవలసిన ఆహారంహన్నా చికెన్, చేపలు, గుడ్లు మరియు గ్రీక్ యోగర్ట్ వంటి లీన్ ప్రోటీన్ను ఎక్కువగా తినమని సిఫార్సు చేస్తుంది. కూరగాయలను ఎక్కువ పరిమాణంలో, తక్కువ కేలరీలతో తీసుకోవాలి. డైట్కు అనుగుణంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను నియంత్రిత మోతాదులో తీసుకోవాలి.ఫలితాలుతాను స్ట్రిక్ట్ డైట్ నుంచి సరైన ఆహారానికి మారిన తర్వాత, వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయని అంటోంది హన్నా. ముఖ్యంగా శరీర కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగిపోయింది, పైగా తన శక్తి, పనితీరు పుంజుకున్నాయని చెప్పుకొచ్చింది. ఆమె అత్యంత సన్నగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా తింటున్నప్పటి నుంచే, మునుపెన్నడూ లేనంత ఆరోగ్యంగా కనిపిస్తోందని చెబుతోంది."1960లలో శారీరక శ్రమ లేని వారి కోసం 1,200-కేలరీల నమూనా రూపొందించారు, కానీ ఇది అందరికీ వర్తించదని అంటోంది. సాధ్యమైనంతవరకు పనితీరును పెంచే పోషకాహార ప్రణాళిక అవసరం. ఇది సరళమైనది. ప్రభావవంతమైనది. ఎవ్వరైనా దీన్ని సరిగా అనుసరిస్తే..వాటంతటే అవే మంచి మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్మకంగా పేర్కొంటూ తన పోస్ట్ని ముగించింది హన్నా.I lost body fat by eating MORE.Not less. Not 1,200 calories. More.Here's the science to sustainable fat loss:= Thread = pic.twitter.com/GtiTLcwYJI— Hannah - Apex Fitness Advisory (@hannahapexfit) May 1, 2026 గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు) -
పని ప్రదేశం..ఆరోగ్యానికి భారం కాకూడదంటే..!
ఇవాళ పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యంకి సంబంధించిన దినోత్సవం. ప్రతి ఏటా ఏప్రిల్ 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ముఖ్యోద్దేశం పని ప్రదేశాలలో ప్రమాదాలు, వ్యాధులను నివారించి సురక్షితమైన ఆరోగ్య పని సంస్కృతిని ప్రోత్సహించడమే. దీన్ని ఉద్యోగుల శ్రేయస్సు కోసం 2003లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పనిప్రదేశాన్ని హెల్దీగా ఎలా మార్చుకోవాలో ఆరోగ్య నిపుణుల మాటల్లో తెలుసుకుందామా.పనిప్రదేశంలో చాలామంది ఉద్యోగులు బ్యాక్పెయిన్, మెడనొప్పి, ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లు కూర్చోనే భంగిమపై అవగాహన ఏర్పరుచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మానిటర్లను కంటి స్థాయిలో ఉంచడం, ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవడం, సాగదీయడం (స్ట్రెచింగ్) వంటివి చేయాలి.మోచేతులు డెస్క్ స్థాయిలో ఉండేలా కుర్చీ ఎత్తును సర్దుబాటు చేయాలి. ఇది మెడ/భుజాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. "తల ముందుకు వంగిన" భంగిమను నివారించడానికి, పాదాలు నేలపై చదునుగా ఉండేలా.. స్క్రీన్లు కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.వెన్నెముకను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండకూడదు. దాంతోపాటు ప్రతి 30–60 నిమిషాలకు ఒకసారి కదలడం వంటివి చేయాలి. కండరాలపై స్థిరమైన భారాన్ని తగ్గించడానికి, నిలబడి పనిచేసే డెస్క్లను లేదా కన్వర్టర్లను ఉపయోగించడం, తరచుగా భంగిమలను మార్చుకోవడం వంటివి చేయాలి.వీటన్నింటి తోపాటు చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిని వ్యాయామం లేదా వాకింగ్ వంటి కదలికలు అవసరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?) -
వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?
జార్ఖండ్లో జరిగిన విషాద ఘటన అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.దాంతో సమ్మర్లో ఎలాంటి చిరుతిండ్లు మంచివనే చర్చలు లేవనెత్తాయి. అందులోనూ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా అందరు మెచ్చే పానీపూరి విషయంలో మరింత కేర్ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.జార్ఖండ్ గిరిడిహ్ జిల్లాలోని లేడా బజ్తో గ్రామంలో, శనివారం సాయంత్రం ఒక వీధి వ్యాపారి అమ్మిన పానీపూరీలు తిని చాలామంది వాంతులు, నీరసం వంటి అనారోగ్యం బారిన పడ్డారు. సుమారుగా 18 మందికి పైగా ఆసుపత్రిలో చేరగా, ఏడేళ్ల చిన్నారి మరణించింది. ఒక సాధారణ వీధి ఆహారం ఇంత మందికి ప్రాణాంతకంగా ఎలా మారిందన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణంగా దానిలో ఉపయోగించే నీరేనని వైద్యులు చెబుతున్నారు. పానీపూరీ అనగానే నీరు ప్రధానం. ఈ నీరు కలుషితం కాకుండా మంచి పరిశుభ్రమైనది వాడితే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. అదే నీరు కలుషితమైతే దానిలో కోలి లేదా సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందన్నారు. వేడి వాతావరణంలో ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురవ్వుతామని అన్నారు. అలాగే అందులో ఉపయోగించే కూరలోని బంగాళదుంపలు, శనగులు తాజాగా ఉంటే పర్లేదు గానీ, అవి కూడా అసురక్షితమైనవి అయితే ఈ బ్యాక్టీరియా మరింత వేగంగా పెరుతుందన్నారు. అలాగే దుకాణం వద్ద కూడా పరిశుభ్రత అనేది అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమ్మకందారులు వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, పాత పాత్రలనే వాడటం, ఈగలు, దుమ్ముకు గురికావడం, తదితరాల వల్లే ఫుడ్పాయిజనింగ్ అయ్యి అనారోగ్యం బారిన పడతారని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు, హాని కలిగించేవి కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదు, అవి వదిలిపెట్టే విషపదార్థాలు కూడా అనారోగ్య సమస్యలు వస్తయాన్నారు. ఆ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే విషపదార్థాల కారణంగా డీహైడ్రేషన్, అవయవాలపై ఒత్తిడి, చివరికి ప్రాణాంతకంగా కూడా మారుతుందని అంటున్నారు. వేసవిలో వేడి కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల మరింత వేగవంతంగా ఉంటుందట. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగ ఫుడ్పాయిజన్ కేసులు నమోదవుతాయని అంటున్నారు నిపుణులు. దకాణాదారుడు పరిశుభ్రతను పాటిస్తూ..నాణ్యమైన పదార్థాలనే ఉపయోగిస్తే ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా తినొచ్చని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..?) -
భోజనం తర్వాత పుచ్చకాయ తినకూడదా..?
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న ఘటన తీవ్ర ఆందోళన, అనుమానాలను రేకెత్తించింది. భోజనం తర్వాత సర్వసాధారణంగా పండ్లు తీసుకుంటాం. అలా.. సమ్మర్ ఫ్రూట్గా చెప్పే పుచ్చకాయను మాత్రం అలా తీసుకోకూడదా అంటే..పోషకాహార నిపుణులు ఔననే చెబుతున్నారు. అసలు దీన్ని ఎలా తినాలి?, ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది? వంటి విషయాలు గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.!.పుచ్చకాయ పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. అయితే చాలామంది ఈ పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉందంటూ ఫిర్యాదులు చేస్తుంటారు. ఎందుకిలా అంటే..రీజన్ ఏంటంటే..సర్వసాధారణంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే భారీ భోజనం తర్వాత ఎప్పుడైతే పుచ్చకాయ తింటారో ఆ క్షణమే ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా పుచ్చకాయ వినయోగం ఆటోమేటిగ్గా పెరుగుతుంది. అందువల్ల ఇలా వేసవిలోనే ఈ సమస్య తీవ్రమవుతుందా? లేక ప్రతిసారి ఇలానే జరుగుతుందా అంటే..నిజనానికి వేసవిలో కడుపు ఉబ్బరం సర్వసాధారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అధిక వేడి కారణంగా శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇబ్బంది పడుతుండటంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని చెబుతున్నారు. తత్ఫలితంగా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ కాలంలో అధిక నీటి శాతం ఉన్న పండ్లు, తినే భోజనం రెండూ సమతుల్యంగా ఉంటే ఈ సమస్య రాదని అంటున్నారు. అంతేగాదు మనం పుచ్చకాయలను తీసుకునే విధానం కారణంగానే ఈ కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య వస్తుందని చెబుతున్నారు. అంతేగాదు అలాంటి సమయంలోనే జీర్ణవ్యస్థపై పుచ్చకాయ ప్రభావం చూపిస్తుంది. అదీగాక ఈ పుచ్చకాయలో అధికంగా ప్రక్టోజ్ ఉండటం వల్ల పెద్దప్రేగుల్లో ఇది పులిసి, గ్యాస్ ఉత్పత్తి అవ్వడానికి దారితీసి కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటివి కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదీగాక మనం తినే భోజనంతో పోలిస్తే పుచ్చకాయ వంటి పండ్లు జీర్ణాశయం గుండా వేగంగా ప్రయాణిస్తాయట. ఎప్పుడైతే ఈ రెండిటిని కలిపి తీసుకుంటామో దాని ఫలితం ఈ పుచ్చకాయ ముక్కలు జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది, దాంతో పులియబెట్టడం, గ్యాస్ ఏర్పడటం వంటివి జరుగుతాయని అన్నారు. అందువల్ల జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు సాధారణంగా భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవడమే మేలని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ సమస్యతో ఉన్నవారు కూడా భోజనం తిన్న వెంటనే లేదా పుచ్చకాయ తిన్న వెంటనే భోజనం వంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.ఎప్పుడు తింటే మంచిదంటే..వైద్యులు మెరుగైన ఫలితాలు పొందాలంటే.. పుచ్చకాయను తీసుకునే సమయం కీలకమైనదని అంటున్నారు. అది తీసుకునే ఆధారంగానే మంచి ప్రయోజనాలను పొందగలమని అన్నారు. అంటే పూర్తి స్నాక్ ఐటెంగా లేక భోజనానికి చాలా సమయం ఉందనగా తీసుకోవడం మంచిదని అన్నారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో తీసకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా వద్దనే చెబుతున్నారు వైద్యులు. సరైన సమయం ఉదయం 11 నుంచి 3 గంటల లోపు భారీ బోజనం తీసుకోక మునుపు అయితే మంచిదని చెబుతున్నారు. రాత్రి ఏడు తర్వాత తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది, పైగా రాత్రి సమయంలో తేలకపాటి ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏదైనా సరే తగిన మోతాదులో తీసుకోవడం మంచిదనేది గుర్తురెగాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్' అన్న నానుడి గుర్తించుకుని ఏదైన మితంగా సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నం కావని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?) -
వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..?
ఇంట్లో స్వయంగా వండుకునే వృద్ధుల్లో మతిమరుపు సమస్యలు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వంట చేసేటప్పుడు కూరగాయలు తరగడం, సరైన మోతాదులో ఉప్పు, కారం, మసాలాలు వేయడం, వంటకాలకు తగ్గట్టుగా కావాల్సిన పదార్థాలను సరైన సమయానికి జోడించడం వంటి మల్టీ టాస్కింగ్ ఉంటుందని.. ఇది మెదడుకు వ్యాయామంలా పనిచేసి దాన్ని చురుగ్గా ఉంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.మెరుగైన మెదడు పనితీరు..: జపాన్ జెరోంటాలాజికల్ ఎవాల్యుయేషన్ స్టడీలో పాలుపంచుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 11,000 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఎంత తరచూ వారు ఇంట్లో వంట చేస్తారు? వంట సామర్థ్యంపై వారికున్న అంచనాలు, ఎంత మందికి మతిమరుపు వచ్చింది వంటి సమాచారాన్ని సేకరించారు. ఆ వివరాలను విశ్లేషించగా ఏమాత్రం వంట చేయని వృద్ధులతో పోలిస్తే రోజూ గరిట తిప్పే వృద్ధుల్లో డిమెన్షియా వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని గుర్తించారు. వంట నైపుణ్యం మెరుగైన మెదడు పనితీరుకు సంకేతమని ఈ అధ్యయనం తేల్చింది.జీవనశైలి మార్పుల ద్వారా..: వారానికి కనీసం ఒక్కసారైనా ఇంట్లో వంట చేసే వారిలో డిమెన్షియా రిస్క్ తగ్గినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమం తప్పకుండా వంట చేసే పురుషుల్లో 23%, స్త్రీలలో 27% తక్కువ ప్రమాదం ఉండగా.. కొత్తగా వంట చేయడం ప్రారంభించిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు 67% తక్కువగా ఉన్నాయి. ‘2020 లాన్సెట్ నివేదిక ప్రకారం ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలి మార్పుల ద్వారా సుమారు 40% డిమెన్షియా కేసులను నివారించవచ్చని తేలింది. అందుకే ఇంటి వంటపై దృష్టి సారించాం’ అని అధ్యయన సహ రచయిత, టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ యుకాకో తాని చెప్పారు. అయితే వంట చేయడం ద్వారానే మతిమరుపు ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనం కచ్చితంగా నిరూపించలేదు. ఇది కేవలం ఇంటి వంటకు, మతిమరుపు ముప్పు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంటే వంట చేసే అలవాటు ఉన్న వారిలో ఈ రిస్క్ తక్కువగా ఉందని మాత్రమే గుర్తించింది. పైగా ఈ పరిశోధన కేవలం జపాన్కు చెందిన వృద్ధులపైనే నిర్వహించారు. ‘మతిమరుపు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ఖరీదైన చికిత్సల కంటే వంట చేయడం వంటి చిన్నచిన్న మార్పులు అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారాలు, మెదడు పనితీరును కాపాడుకోవడం ఈ అలవాట్ల ముఖ్య ఉద్దేశం’ అని యుకాకో తాని వివరించారు.మెదడుకు వ్యాయామం..ప్రణాళిక: ఏం వండాలి, ఎలా వండాలి అని ప్రణాళిక రచించడం.ఎంపిక: సరైన పదార్థాలను ఎంచుకోవడం.పద్ధతి: వంటకాల తయారీ పద్ధతిని పాటించడం.ప్రయోజనాలు..పోషకాహారం: మంచి డైట్ లభిస్తుంది.శారీరక శ్రమ: వంట చేసేటప్పుడు కదలడం వల్ల వ్యాయామం అవుతుంది.మానసిక శక్తి: ఆలోచించి వండటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.నేషనల్ డెస్క్(చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..) -
డయాబెటిస్ ఉంటే చేయాల్సిన వ్యాయామాలు..!
డయాబెటిస్ ఉన్నవారి చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా మరింత శక్తిని పొందేలా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్లు సరైన పద్ధతిలో వ్యాయామాలు చేయడం అత్యంత ముఖ్యం.ఎందుకంటే..ఇన్సులిన్ సమస్యను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందితక్షణ కండర శక్తిని పెంచుతుందిబరువు నియంత్రణకు సహాయపడుతుందిచేయాల్సినవి..1. ఏరోబిక్ వ్యాయామంవేగంగా నడవడంసైక్లింగ్ఈతవ్యవధి: 30–45 నిమిషాలువారానికి కనీసం 5 రోజులు2. శక్తి శిక్షణతేలికపాటి బరువులు / రెసిస్టెన్స్ బ్యాండ్లుశరీర బరువు వ్యాయామాలు (స్క్వాట్లు, వాల్ పుష్-అప్లు)వారానికి 2–3 సార్లుకండరాలను పెంచుతుందిm గ్లూకోజ్ వినియోగం మెరుగుపడుతుంది. పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయి3. ఫ్లెక్సిబిలిటీ, చలనశీలతస్ట్రెచింగ్యోగాప్రతిరోజూ (10–15 నిమిషాలు)బిగుతును తగ్గిస్తుంది, కదలికను మెరుగుపరుస్తుంది. అలాగే గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఎప్పుడు చేయాలంటే..భోజనం తర్వాత (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత)భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుందిఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా తీవ్రమైన వ్యాయామం చేయవద్దువ్యాయామానికి ముందు ..ముందుగా ఒక చిన్న స్నాక్ తీసుకోండితీవ్రమైన వ్యాయామం చేయవద్దు, జాగ్రత్తగా ఉండండివ్యాయామానికి ముందు తినదగిన స్నాక్స్ (అవసరమైతే)కొన్ని నట్స్సగం పండుపెరుగుఇది వ్యాయామం చేసేటప్పుడు చక్కెర స్థాయిలు తగ్గకుండా నివారిస్తుందితీసుకోవాల్సిన జాగ్రత్తలు..తల తిరగడంఅధికంగా చెమట పట్టడంనీరసంగుండె దడతక్షణమే వ్యాయమాలు ఆపేసి విశ్రాంతి తీసుకోవడం, అవసరమైతే చక్కెర స్థాయిలను తనిఖీ చేయడం తదితరాలు చేయాలి.వ్యాయామం తర్వాత పాటించాల్సిన చిట్కాలు:అప్పుడప్పుడు షుగర్ స్థాయిలను తనిఖీ చేసుకోవడంనీళ్ళను బాగా తాగండివ్యాయామం తర్వాత అతిగా తినడం మానుకోండిచేసే తప్పిదాలు..క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంకేవలం నడవడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకపోవడంవార్మ్-అప్ మానేయడంఅకస్మాత్తుగా వ్యాయామాన్ని అతిగా చేయడంషుగర్ తక్కువగా/ఎక్కువగా ఉన్న లక్షణాలను పట్టించుకోకపోవడంవారంలో వర్కౌట్ల ప్లాన్..సోమవారం–శుక్రవారం:30 నిమిషాల వేగవంతమైన నడక10 నిమిషాల స్ట్రెచింగ్మంగళవారం నుంచి శనివారం:15–20 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జోడించండిఆదివారం:తేలికపాటి కార్యకలాపాలు (నడక/యోగా)అప్పుడప్పుడు చేసే కఠినమైన వ్యాయామాల కంటే, క్రమం తప్పకుండా చేసే మితమైన వ్యాయామం మరింత ఉత్తమంగా పనిచేస్తుంది.చివరగా డయాబెటిస్కు వ్యాయామం అత్యంత శక్తిమంతమైన "మందులలో" ఒకటి. అయితే దానిని సరిగ్గా, క్రమం తప్పకుండా చేసినప్పుడు మాత్రమే ఫలితం అందుకోగలం అని చెబుతున్నారు నిపుణులు.డా. ఆదర్శ గౌడ, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్) సీఈవో, బెంగళూరు(చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు) -
ఇది మీ బిడ్డకు ఇస్తే విషమే


