Health Tips
-
హంటావైరస్ అంటే..? ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందంటే..
అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ నౌక అర్జెంటీనా నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ద్వీపాల సమూహమైన కేప్ వెర్డేకు ప్రయాణిస్తోంది. దీంతో ఆ నౌకలోని ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో బందీలుగా చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దాంతో ఒక్కసారిగా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలేంటి హంటా వైరస్, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.హంటావైరస్ అంటే..హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసి పల్మనరీ సిండ్రోమ్ వంటి పలు అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎలా వ్యాపిస్తుందంటే..వ్యాధి సోకిన ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే గాలి చొరవని ప్రదేశాల్లో నివశించే ప్రజలుకు ఈ వ్యాధి సోకే అవకాశం అని చెబుతున్నారు.మానువుల ద్వారా సంక్రమణ అనేది..అనేక వైరల్ ఇన్ఫెక్షన్ల వలె ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. చాలామటుకు ఎలుకల కారణంగా నమోదవ్వుతాయని చెబుతున్నారు. లక్షణాలు..ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయని అన్నారు. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటాయని చెప్పారు. అందువల్లే ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టతరం అని పేర్కొన్నారు వైద్యులు.తక్కువ సమయంలోనే తీవ్రతరం అవ్వొచ్చు..వ్యాధి ముదిరే కొద్దీ, దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ ముఖ్య లక్షణం.మరణాల రేటు కూడా ఎక్కువే..ఇది అత్యంత అరుదైనదే అయినా..ఈ హంటావైరస్ ఇన్ఫెక్షన్లు ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల వెంటనే వైద్య సంరక్షణ పొందడం అత్యంత కీలకం.నిర్దిష్ట నివారణ లేదుహంటావైరస్కు నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదు. తీవ్రమైన సందర్భాలలో, ఆక్సిజన్ చికిత్స, ఆస్పత్రిలో చేరడం వంటి సహాయక చికిత్సలు తరచుగా అవసరమవుతాయ్. -
చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం..! హీరో నాగార్జున సైతం
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీహబ్ సహకారంతో 'రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం' జాతీయ మిషన్ను రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ లో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా చిరు ధాన్యాల వినియోగంపై ప్రజలలో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలికి దారితీసే ఉద్యమంగా రూపుదిద్దడం లక్ష్యం. ఈ మిషన్కు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున మద్దతు తెలిపారు. ఆయన ఒక వీడియో సందేశం ద్వారా రోజు వారీ ఆహారంలో చిరు ధాన్యాలను చేర్చాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన భారత నిర్మాణానికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్డిన మిల్లెట్ మార్వెల్స్ను అభినందించారు. ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో మిల్లెట్ల వినియోగాన్ని పెంచాలని ఈ వినూత్న కార్యక్రమం పిలుపునిస్తోంది. ఇది భారతదేశ పోషకాహార రంగాన్ని మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఒక మిల్లెట్ ఆధారిత భోజనాన్ని తమ ఆహారంలో చేర్చుకోవాలని, మిల్లెట్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని, మరో ముగ్గురిని ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని ప్రతిజ్ఞ చేశారు. చైన్ పద్ధతిలో జరిగే ప్రచారం ద్వారా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించి, తరువాత అంతర్జాతీయ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్సభ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా మద్దతు తెలిపారు.మిల్లెట్ మార్వెల్స్ 'మిల్లెట్ మార్వెల్స్'ను 2020లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు, సినీ నటుడు డాక్టర్ భరత్ రెడ్డి స్థాపించారు. చిరుధాన్యాలతో తయారైన ఆహారపు ఉత్పత్తులను రుచికరంగా, అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఈ స్టార్ట్అప్ ప్రారంభమైంది. భారతీయ మార్కెట్లో మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. డాక్టర్ సంగీతా రెడ్డి (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్) కృషితో మిల్లెట్ మార్వెల్స్ ను పునరుద్ధరించారు. నూతన ఉత్సాహంతో తిరిగి అభివృద్ధి చేశారు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఇన్పేషెంట్లకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని అందించడంపై దృష్టి సారిస్తూ ఈ సంస్థను మళ్లీ బ్రాండింగ్ చేశారు. దేశంలో ఇలాంటి చర్యలు చేపట్టిన తొలి హాస్పటల్ గా అపోలో నిలిచింది. ఈ కార్యక్రమానికి రోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. అపోలో హాస్పిటల్స్ నెట్వర్క్లోని ఇతర హాస్పిటల్స్ లో కూడా విస్తరించేందుకు మిల్లెట్ మార్వెల్స్ సిద్ధమవుతోంది. -
పాలిచ్చే తల్లులూ.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలో ఎన్నో మార్పులుచోటు చేసుకుంటాయి. అవి శారీరకమైనవీ, మానసికమైనవికూడా. అయితే... ప్రసవం తర్వాత అవన్నీ వెంటనే ఒకేరోజులో సాధారణస్థితికి రావు. ప్రసవం తర్వాత ఓ మహిళమళ్లీ మామూలు స్థితికి రావాలంటే కొంత ప్రత్యేక శ్రద్ధ, మరికొన్ని బాధ్యతలు తప్పనిసరి. ఇక కాన్పు తర్వాత చాలా మంది మహిళలు తమకు పుట్టిన బిడ్డ గురించి శ్రద్ధ తీసుకుంటారు తప్ప తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కాన్పు తర్వాత మహిళలు...తమ బిడ్డ విషయంలోనే కాకుండా తన కోసం కూడా కొంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. ఆ టైమ్లో బాలింతకు వచ్చే కొన్ని సమస్యలూ... వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాలను తెలుసుకుని ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులూ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...గర్భం దాల్చినప్పుడు మామూలుగా మూడు అంగుళాల పొడవు ఉండే గర్భాశయం... దాదాపు 20 అంగుళాల పొడవుండే శిశువును తనలో ఇముడ్చుకునేంత పెద్దదిగా సాగుతుంది. కాన్పు తర్వాత అదే గర్భాశయం మెల్లమెల్లగా సైజు తగ్గుతూపోతూ ఆరువారాలకు తన మొదటి స్థితిని చేరుతుంది. కాన్పు తర్వాత వారం రోజుల వరకు బొడ్డు కింది భాగంలో గర్భాశయం గట్టిగా స్పర్శకు తెలుస్తుంటుంది. గర్భిణిగా ఉన్న సమయంలో లోపల గర్భాశయంతో పాటు బయట పొట్ట కండరాలూ బాగా సాగుతాయి. ఫలితంగా కాన్పు తర్వాత కూడా పొట్ట వదులుగా కిందికి జారినట్లుగా కనిపిస్తుండవచ్చు. నడుము కండరాలు, ప్రసవమార్గంలోని కండరాలు, ఎముకలు సాగి బలహీనంగా మారతాయి. బరువు పెరగడం వల్ల, పొట్ట మీది చర్మం సాగడం వల్ల కొందరిలో చర్మంపై తెల్లటి లేదా ఎర్రటి లేదా నల్లటి చారికలు (స్ట్రెచ్మార్క్స్) ఏర్పడవచ్చు. ఇవన్నీ కాస్మటిక్గా మహిళలకు కొంత ఇబ్బందికరంగా కనిపించవచ్చు. ఈ స్ట్రెచ్మార్క్స్ నివారణ కోసం: పొట్ట మీద, తొడల మీద ఉండే చర్మం సాగి, చిట్లడం వల్ల వచ్చే స్ట్రెచ్మార్క్స్ పూర్తిగా పోవడానికి గాని, అస్సలే రాకుండా ఉండటానికి ఎలాంటి మందులూ, క్రీములు ఉండవు. ఆలివ్ ఆయిల్, విటమిన్–ఈ, కొన్ని మాయిశ్చరైజర్స్ వంటి వాటిని గర్భవతిగా ఉన్నప్పటినుంచే పొట్ట, తొడల మీద రాసుకోవడం వల్ల చర్మం మెత్తబడి సాగడానికి వీలుగా ఉంటుంది. దురదలు రావు. కాబట్టి దీనివల్ల స్ట్రెచ్మార్క్స్ నివారణ కొంతవరకు సాధ్యమవుతుంది. ప్రసవం అయిన తర్వాత మహిళ (బాలింత)లో కొన్ని రకాల సమస్యలు / ఆరోగ్య సమస్యలు కనిపించవచ్చు. అవి... బాలింత జ్వరం : కాన్పు తర్వాత కొందరు మహిళల్లో ఒళ్లు కొంచెం వేడిగా ఉంటూ, తర్వాత మామూలుగా అవుతుంటుంది. కొంతమందిలో మాత్రం కాన్పు తర్వాత 24 గంటల నుంచి 10 రోజుల్లోపు 100 డిగ్రీల కంటే ఎక్కువగా వచ్చే జ్వరాన్ని బాలింత జ్వరం అంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. పరిష్కారం : కోల్డ్ స్పాంజింగ్తోనే చాలావరకు జ్వరం తగ్గిపోతుంది. అయితే ఏదైనా నిర్దిష్ట కారణం వల్ల జ్వరం వచ్చినట్లు డాక్టర్లు గుర్తిస్తే... ఆ కారణాన్ని బట్టి డాక్టర్లు మందులు సూచిస్తారు.బాలింత జ్వరాలకు కొన్ని కారణాలు... జననాంగాల్లో ఇన్ఫెక్షన్ : రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, కాన్పు సమయంలో తగినంత శుభ్రత పాటించకపోవడం, రోగకారకక్రిములు జననాంగంలో ప్రవేశించడం, గర్భాశయంలో ఏమైనా మాయ ముక్కలు ఉండిపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల జననాంగాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి బాలింత జ్వరం రావచ్చు. పరిష్కారం : డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడాలి. రొమ్ముల్లో ఇన్ఫెక్షన్స్ : కొత్తగా తల్లి అయిన మహిళ తన బిడ్డకు పాలు సక్రమంగా పట్టకపోవడం, నిపుల్స్ సరిగా లేకపోవడం, రొమ్ముల్ని సరిగా ఖాళీ చేయకపోవడంతో పాలు లోపలే గడ్డకట్టి రొమ్ముల్లో ఇన్పెక్షన్ రావచ్చు. రొమ్ముపై ఏవైనా పగుళ్లు ఏర్పడితే, వాటి ద్వారా తల్లి దేహంలోకి రోగక్రిములు చేరవచ్చు. అలాగే బిడ్డ నోటిలో పూత ఉన్నా రోగక్రిములు రొమ్ముల్లోకి పాకి అది తల్లిలో ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే రొమ్ముల్లో చీముగడ్డలు ఏర్పడవచ్చు. పరిష్కారం: డాక్టర్ సలహా మేరకు తగిన మందులు తీసుకుంటూ, వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటించాలి.జ్వరాలకు మరికొన్ని కారణాలు : సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వేసే కుట్లలో చీము పట్టడం మలేరియా, టైఫాయిడ్, నిమోనియా వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకే ముప్పు ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా దేహమంతటా పాకి కొంత ప్రమాదాలకు తావిచ్చే అవకాశం. పరిష్కారం : కారణాలను బట్టి తగిన మందులు ఇవ్వడం, ఆ మేరకు బాలింత తగిన జాగ్రత్తలు పాటించేలా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. నొప్పులు : కాన్పు తర్వాత కొందరిలో వెన్ను, తొడలు, పిరుదుల దగ్గర నొప్పులు రావచ్చు. కొందరిలో అవి మరీ ఎక్కువగానూ ఉండవచ్చు. గర్భాశయం బరువు మొత్తం వెన్నుపూసపై పడటం వల్లా, అలాగే కండరాలు సాగి మునపటి బలం కొద్దిగా తగ్గడం వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. కొన్నిసార్లు కాన్పుకి ఎక్కువ సమయం పట్టినా, లేదా కాన్పు కష్టంకావడంతో ఫోర్సెప్ సహాయంతో కాన్పు జరిపినప్పుడు, వెన్పుపూస కింది భాగంలోని నరాలపై ఒత్తిడి పడి కొంతమందిలో కాన్పు తర్వాత కాళ్లు కదల్చలేకపోవడం, స్పర్శ తగ్గడం వంటివీ కనిపించవచ్చు. పరిష్కారం : వీటిని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటిలో చాలావరకు డాక్టర్ల సలహాలూ, మందులతోనూ లేదా ఇవన్నీ కొద్దిపాటి ఫిజియోథెరపీతో తగ్గిపోయే సమస్యలే. మూత్రసమస్యలు : కాన్పు తర్వాత మూత్రాశయానికి చేరే నరాలు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల మూత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం వంటి సమస్య కనిపించవచ్చు.అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్) వచ్చే అవకాశాలు ఉంటాయి. కాన్పు తర్వాత ఉండే నొప్పి వల్ల కూడా మూత్ర విసర్జన పూర్తిగా సాధ్యపడకపోవచ్చు. తగినంత నీరు తాగకపోవడం వల్ల, జననాంగాల నుంచి మూత్రవ్యవస్థకూ ఇన్ఫెక్షన్ పాకవచ్చు. కొంతమందిలో కొన్ని రోజులపాటు మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోయే ముప్పు కూడా ఉంది. పరిష్కారం : ఈ సమస్యలు తగ్గడానికి పెల్విక్ఫ్లోర్ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మలబద్దకం : కాన్పు తర్వాత మహిళలకు పెద్దగా నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందిలో మలబద్దకం ఏర్పడవచ్చు. పరిష్కారం : తగినన్ని నీళ్లు తాగడం, ద్రవాహారం తీసుకోవడంతో పాటు ఆకుకూరలూ, కాయగూరలతో ఉన్న పోషకాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు చాలా కొద్దికాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం : గర్భవతిలో కాన్పు తర్వాత జరిగే రక్తస్రావాన్ని ఆపడం కోసం రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన పదార్థాలు (ఫ్యాక్టర్లు) ఎక్కువగా తయారయ్యేలా ప్రకృతి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కొంతమందిలో (బరువు ఎక్కువగా ఉన్నవారు, హైబీపీతో బాధపడేవారు, ఎక్కువ వయసున్న వారిలో) కాన్పు తర్వాత వారం నుంచి పది రోజుల వరకు ఈ పదార్థాల వల్ల రక్తం గడ్డకట్టి, ఆ గడ్డలు రక్తరాళాల ద్వారా వేరే చోట్లకు పాకి సాధారణ రక్తప్రసరణకు అడ్డుగా మారే (ఎంబాలిజమ్) ముప్పు ఉంటుంది. ఉదాహరణకు... కొందరిలో ఇలాంటి రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తే... అకస్మాత్తుగా ఊపిరి అందక ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశమూ లేకపోలేదు. ఈ కండిషన్ను ‘పల్మునరీ ఎంబాలిజమ్’ అంటారు. పరిష్కారం : కాన్పు తర్వాత ఎక్కువగా కదలకుండా పడుకుని ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్ సలహా మేరకు చురుగ్గా ఉండటం అవసరం. తీవ్రమైన రక్తస్రావం : కాన్పు తర్వాత కొంతసేపు సాధారణంగా 200 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వరకు రక్తస్రావం అవుతుండటం మామూలే. అంతకంటే ఎక్కువగా రక్తస్రావం అయితే ఆ కండిషన్ను పోస్ట్పార్టమ్ హేమరేజ్ (పీపీహెచ్) అంటారు. పీపీహెచ్ను మొదటే నియంత్రించకపోతే, దాదాపు 25 శాతం మందిలో ప్రాణాలకు ముప్పు ఉండే ప్రమాదముంటుంది. దాదాపు 90 శాతం పీపీహెచ్ కేసుల్లో గర్భాశయం ముడుచుకుపోవడం (యుటరైన్ ఎటోనీ) వల్ల బ్లీడింగ్ జరుగుతుంది. కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) చీరుకుపోవడం వల్ల, మరికొందరిలో గర్భాశయం లోపల మాయముక్కలు ఉండిపోవడం, రక్తం గూడుకట్టుకునే స్వభావంలో లోపాలు కూడా పీపీహెచ్కు కారణం కావచ్చు.పరిష్కారం : ఇలాంటి సందర్భాల్లో కారణాన్ని బట్టి చికిత్సతో పాటు... అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాల్సిన రావచ్చు. రక్తస్రావం ఎంతకీ నియంత్రణలోకి రాకపోతే కొందరిలో గర్భసంచి తొలగించాల్సిరావచ్చు. రక్తహీనత : అధిక రక్తస్రావం కావడం లేదా ముందు నుంచే రక్తహీనత ఉన్నవారిలో ఉండాల్సిన మోతాదులో రక్తం లేక΄ోవడం వల్ల నీరసం, నిస్సత్తువ, బలహీనంగా ఉండటం వంటివి కనిపించవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ సోకడం, అవి ఒకపట్టాన తగ్గకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు.పరిష్కారం : తల్లికి పాలకూర వంటి ఆకుకూరలూ, నువ్వుల వంటి వాటితో చేసిన రుచికరమైన పదార్థాలు... అంటే ఐరన్ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు పెడుతుండాలి. రక్తహీనత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సిరప్, టాబ్లెట్లు వంటివి వాడాల్సిరావచ్చు. ఫిట్స్ (హైబీపీ వల్ల) : కాన్పుకి ముందు కొంతమందిలో బీపీ పెరిగి కాన్పు తర్వాత తగ్గుతుంది. కానీ కొంతమందిలో కాన్పు తర్వాత కూడా వారం నుంచి పదిరోజుల పాటు బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పరిష్కారం : నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. మానసిక సమస్యలు : కొంతమంది బాలింతల్లో కాన్పు తర్వాత 3–5 రోజుల తర్వాత డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కండిషన్నే పోస్ట్పార్టమ్ బ్లూస్ లేదా బేబీ బ్లూస్ అంటారు. రక్తహీనత, బిడ్డ పెంపకం బాధ్యతల తాలూకు ఆందోళనా, భయం, నిద్రలేమి, కొన్ని హార్మోన్లలో మార్పులతో కనిపించే మానసిక సమస్యలూ, కుటుంబంలో ఉండే సమస్యలూ, కలహాల వంటి ఎన్నో కారణాల ఈ డిప్రెషన్ రావచ్చు. కుటుంబసభ్యుల సహకారం వల్ల కొందరిలో ఇది 2–3 రోజుల్లోనే చక్కబడుతుంది. కానీ... మరికొందరిలో పరిస్థితి మరింత తీవ్రమై సైకోసిస్ స్థితిలోకి వెళ్లే ముప్పు కూడా ఉంటుంది. పరిష్కారం : ఈ సమస్యకు మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అవసరం. బాలింత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుకాన్పు తర్వాత అటు తల్లి విషయంలోనూ, ఇటు బిడ్డ విషయంలోనూ తగిన జాగ్రతలు పాటించి, ఎలాంటి సమస్యలూ రాకుండా చూసుకోవాలి. కాన్పు జరిగిన 24 నుంచి 48 గంటల వరకు బాలింత ఆరోగ్యంతో పాటు ఆమెలో జ్వరం, బీపీ, రక్తస్రావం వంటివి ఏవైనా కనిపిస్తున్నాయా అనే విషయాన్ని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.ఆహారం : కాన్పు తర్వాత బాలింతకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. మామూలుగా కంటే రోజుకు 600 కేలరీలు అధికంగా శక్తినిచ్చే ఆహారంతోపాటు బాగా పాలుపడేలా ఉండే ఆహారం తల్లికి ఇవ్వాలి. ఇందులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు, మాంసాహారం ఇవ్వాలి. పాలు, పెరుగు, పండ్లు తీసుకోవచ్చు. ఆహారంలో ఎలాంటి పథ్యం అవసరం లేదు. అయితే కారాలు, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు. పప్పులు తినడం వల్ల చీము పడుతుందన్నది అపోహ మాత్రమే. రోజుకు కనీసం 10 గ్లాసులు (రెండు లీటర్ల) నీళ్లు తప్పనిసరిగా తాగించాలి. నీరు తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, మలబద్దకాన్ని నివారించడానికి వీలవుతుంది. నీరు తాగడం వల్ల పొట్టపెరుగుతుందని, జలుబు చేస్తుందన్నది అపోహ మాత్రమే. మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కాన్పు తర్వాత కలిగే అలసట త్వరగా తగ్గుతుంది. కుట్లు త్వరగా/తేలిగ్గా మానుతాయి. పాలు బాగా పడతాయి. (బిడ్డ... తన తల్లిపాల నుంచి ఐరన్, క్యాల్షియమ్ గ్రహిస్తుంది. కాబట్టి మొదటి మూడు నెలలు తల్లి తప్పనిసరిగా ఐరన్, క్యాల్షియమ్ మాత్రలు వాడాలి. బిడ్డకు జలుబు చేస్తుందని పండ్లు, పెరుగు, మజ్జిగ తల్లికి ఇవ్వరు. ఇది కేవలం అపోహ మాత్రమే.విశ్రాంతి : కాన్పు తర్వాత తల్లి బాగా అలసిపోతుంది. ఆ అలసటను తగ్గించడానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. శారీరక, మానసిక విశ్రాంతి ఇవ్వడం వల్ల తల్లికి పాలు బాగా పడతాయి. బిడ్డను ఉయ్యాలలో కాకుండా తల్లిపక్కనే పడుకోబెట్టడం వల్ల ఆ స్పర్శతో తల్లీబిడ్డల మధ్య బంధం పటిష్టమవుతుంది. పాలు బాగా పడతాయి.అటు ఇటు తిరగడం : సాధారణ కాన్పు తర్వాత తల్లిని కొద్ది గంటలలోపే లేచి అటు ఇటు తిరిగేలా ప్రోత్సహించడం మంచిది. ఆపరేషన్ చేసిన వాళ్ల విషయంలో... ఆమె బెడ్ మీదే ఉన్నప్పటికీ 4–6 గంటల తర్వాత నుంచి మంచంలోనే కాళ్లు అటూ–ఇటూ కదపడం, ముడుచుకోవడం–స్ట్రెచ్ చేయడం వంటివి చేయవచ్చు. ఆరోగ్యపరిస్థితిని బట్టి 12–24 గంటల తర్వాత మెల్లగా ఏదైనా ఆసరాతో లేచి తిరిగేలా చేయవచ్చు. ఇలా త్వరగా కదలడం వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పునూ... ఆ రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోకి ప్రవేశించే (ఎంబాలిజమ్) రిస్క్ను నివారించవచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత : కాన్పు తర్వాత జననాంగాలు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మల,మూత్ర విసర్జన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సాధారణ కాన్పు తర్వాత కుట్లు వేయాల్సివస్తే వాటిపై యాంటీసెప్టిక్ పౌడర్ వేసుకోవచ్చు. బట్టలు కాకుండా డయాపర్లు వాడుకోవడం మంచిది. తడిసినవాటిని తరచూ మార్చుకుంటూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. యోనిస్రావాల పరిమాణం, రంగు, వాసన అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.రొమ్ములపై శ్రద్ధ : తొమ్మిదో నెల నుంచే తల్లి తన రొమ్ములను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రొమ్ము మొనలను సాగదీస్తూ ఉండటం వల్ల కాన్పు తర్వాత బిడ్డ పాలు తాగడానికి అనువుగా మారతాయి. బిడ్డ పుట్టగానే గంటలోపే బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే పాలు మరింత త్వరగా ఊరతాయి. బిడ్డకు అత్యుత్తమ ఆహారం తల్లిపాలే. మొదటి రెండు మూడు రోజులు నీరు లాంటి ద్రవం (కొలెస్ట్రమ్) ఉత్పత్తి అవుతుంది. అయితే ఇందులో బిడ్డకు వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి అవసరమైన యాంటీబాడీస్, విటమిన్స్ ఉంటాయి. బిడ్డకు మొదటి ఆర్నెల్లూ తల్లిపాలే పట్టాలి. అవి మినహా మరేవీ ఇవ్వడం సరికాదు.వ్యాయామాలు : కొన్ని వ్యాయామాలతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవి నడుము నొప్పిని నివారిస్తాయి. ప్రారంభంలో కాళ్లు కదపడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. డాక్టర్ సలహా మేరకు ఆరు వారాల తర్వాత క్రమేపీ పొత్తికడుపు కండరాలు, పెల్విక్ఫ్లోర్ కండరాలు, నడుము కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయవచ్చు. వీటివల్ల వదులైన పొట్ట కండరాలు గట్టిపడతాయి. పొట్ట మీద బట్ట చుట్టడం వల్లనో, అబ్డామినల్ బెల్ట్ వల్లనో పొట్ట తగ్గదు. అవి కేవలం సపోర్ట్గా మాత్రమే పనికివస్తాయి. కాన్పు తర్వాత అలసట తగ్గాక మెల్లగా వాకింగ్వంటి తేలికపాటి వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు.కుటుంబ నియంత్రణ : ప్రసవం తర్వాత వెంటనే గర్భం అందకుండా డాక్టర్ సలహా మేరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం మంచిది. కాన్పు తర్వాత 2–3 నెలల నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్లో పాల్గొనడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ (పీరియడ్స్ రాకుండానే కూడా). అందువల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల అనుకోకుండా వచ్చే, అవాంఛిత గర్భాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి, కని అలసిపోయిన శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ఉన్న సమయాన్ని బిడ్డకి కేటాయించడం వల్ల బిడ్డలోనూ మంచి ఎదుగుదల, వికాసం కనిపిస్తాయి. ఇక పిల్లలు వద్దు అనుకున్న వారు శాశ్వత సంతాన నియంత్రణ పద్ధతుల కోసం డాక్టర్ను సంప్రదించవచ్చు. దాంపత్య జీవితం : బాలింతలో జరిగే మార్పులు యథాతథ స్థితికి వచ్చేందుకు, జననాంగాలు సాధారణ స్థితికి రావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. ఇతరత్రా ఏ సమస్యలూ లేకుండా ఉంటే, ప్రసవం అయ్యా ఆరు వారాల తర్వాతి నుంచి దాంపత్య జీవితం గడపవచ్చు. ఒకవేళ సిజేరియన్ అయిన వారు కుట్లలో ఎలాంటి నొప్పులు లేకపోతే 8–10 వారాల తర్వాత దాంపత్యంలో పాల్గొనవచ్చు.కుటుంబ సభ్యుల పాత్ర : కాన్పు తర్వాత బాలింతకు ఇంట్లో వాళ్ల చేయూత, మద్దతు ఎంతో అవసరం. ముఖ్యంగా భర్త పోషించాల్సిన భూమిక చాలా ప్రధానం.డాక్టర్ చెకప్ : కాన్పు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వారం తర్వాత ఒకసారి, ఆరు వారాల తర్వాత మరోసారి డాక్టర్ను సంప్రదించాలి. లేదా డాక్టర్ సూచించిన విధంగా చెక్అప్కు వెళ్లాలి. తనకు వచ్చే సందేహాలన్నింటినీ మొహమాటపడకుండా డాక్టర్ను అడిగి తీర్చుకోవాలి. కాన్పుకు ముందు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని డాక్టర్కు వివరించి, వాటి విషయంలో కాన్పు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం అవసరం.డాక్టర్ సరోజ బానోతు,కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ (చదవండి: మామిడి పండ్లను తినేముందు ఇలా చేయడం తప్పనిసరి..! హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు) -
మామిడిపండ్లను నేరుగా తినేస్తున్నారా..? హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
పండ్లలో రారాజుగా కీర్తించే మామిడపండ్లు వచ్చే కాలమే ఈ వేసవి. ఈ సమయంలో ఎటుచూసినా..ఈ పండ్ల సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఈ పండ్లను తినేమందు నీటిలో నానబెట్టడం అనేది మన పూర్వీకుల కాలం నుంచి పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతి. ఇది కేవలం మామిడి పండ్లను శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదని..అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలందించే విధానంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా నీటిలో నానబెట్టడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడటమే గాక శరీర ఉష్ణోగ్రతన నియంత్రించి, జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుందని అంటున్నారు. ఈ మామిడిలో విటమిన్లు ఏ,సీల తోపాటు, పీచుపదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి శక్తి కేంద్రం అయినప్పటికీ..పచ్చి రూపంలో కొన్ని జీవరసాయన సమ్మేళనాలు ఉంటాయి. అయితే ఈ పండు మన జీర్ణక్రియకు సురక్షితమైనదిగా ఉండాలంటే..ఈ సమ్మేళనాల ప్రభావాన్ని తగ్గించేలా నీటిలో అరగంటపాటు నానబెట్టక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా చూద్దామా..!.ఫైటిక్ ఆమ్లాన్ని తటస్థీకరించడం: మామిడి పండ్లను నానబెట్టమని సిఫార్సు చేయడానికి ప్రాథమిక శాస్త్రీయ కారణం ఫైటిక్ ఆమ్లం ఉండటమే. ఫైటిక్ ఆమ్లం అనేది వివిధ మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే ఒక సహజ పదార్ధం. ఇది ఫాస్ఫరస్ను నిల్వ చేసే రూపంగా పనిచేస్తుంది. పోషకాహార శాస్త్ర ప్రకారం..ఖనిజాల జీవ లభ్యతపై దాని ప్రభావం కారణంగా దీనిని తరచుగా "పోషక విరోధి"గా వర్గీకరిస్తారు.జీర్ణవ్యవస్థలో కాల్షియం, ఇనుము, జింక్ వంటి అవసరమైన ఖనిజాలతో బంధం ఏర్పరచుకోవడానికి ఫైటిక్ ఆమ్లానికి అధిక అనుబంధం ఉంటుంది. ఈ ఖనిజాలు ఫైటిక్ ఆమ్లంతో బంధం ఏర్పరచుకున్నప్పుడు, అవి కరగని అవక్షేపాలను ఏర్పరుస్తాయి. అయితే వీటిని మానవ శరీరంలోని చిన్న ప్రేగు గ్రహించలేదు. అందువల్ల ఈ మామిడి పండ్లను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం వల్ల, వాటిలోని అదనపు ఫైటిక్ ఆమ్లం కరిగిపోవడం లేదా విచ్ఛిన్నం కావడం జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ "యాక్టివేషన్" ప్రక్రియ కారణంగా పండులోని సూక్ష్మపోషకాల పూర్తి పోషక విలువను సులభంగా పొందగలమని చెబుతున్నారు.మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం..జీర్ణవ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ పద్ధతి చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. మామిడి పండ్లలో ఉండే అధికంగా ఉండే ఫైటిక్ యాసిడ్ ఇనుము, జింక్, కాల్షియం వంటి ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఎప్పుడైతే సుమారు 30 నిమిసాలు నానబెడతామో అప్పుడు ఈ పోషక వ్యతిరేక పదార్థ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా పండు మంచి పోషకవంతమైనదిగా, అలాగే జీర్ణవ్యవస్థకు సులభంగా జీర్ణమయ్యేదిగా మారుతుంది.ఉష్ణోత్పత్తిని తగ్గించి శరీరానికి చలువ చేసేలా..మామిడిలో కేలరీలు అధికం, సహజ చక్కెరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఇది నానబెట్టకుండా నేరుగా తీసుకుంటే జీవక్రియ వేడిని పెంచడానికి దారితీస్తుంది. శరీరంలో అంతర్గత వేడి చర్మంపై ప్రభావం చూపి దద్దుర్లు, మొటిమలు లేదా వేడి కురుపులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి పండ్ల సీజన్లో ఇవి సాధారణంగా కనిపించే సమస్యలు. ఈ వేడి కారణంగా కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అంటున్నారు. మనం ఎప్పుడైతే మామిడి పండుని నీటిలో నానబెడతామో అప్పుడు దానిలోని సహజ వేడి ఆవిరైపోతుంది. మానవ శరీర అంతర్గత వాతావరణానికి అనుగుణంగా మారిపోతుంది. అలాగే పేగులు సులభంగా జీర్ణం చేసుకోగలుగుతాయి కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.రసాయన అవశేషాల నిర్మూలనఈ మామిడి పండ్లు పండించేందుకు కృత్రిమ పురుగుల మందులు, శిలీంధ్రనాశకాలు వంటివి అధికంగా వినియోగిస్తారు రైతులు. అంతేగాక పండు ఉపరితలంపై కాల్షియం కార్బైడ్, ఆర్సెనిక్ వంటి రసాయనాలను చల్లుతారు. ఫలితంగా రవాణ సమయంలో పండు డ్రై అయిపోకుండా తేమతో ఉండేలా చేయడమేగాక, నిల్వ కాలాన్ని పొడిగిస్తాయి. అలాగే వాణిజ్య మామిడి పండ్డు అందంగా కనిపించేలా పలుచటి మైనపు పొరను పూస్తారు కూడా. అందువల్ల ఇలాంటి మామిడిపండ్లను పారే నీటి కింద త్వరగా కడగడం, 30 నిమిషాలపాటు నానబెట్టడం వంటి వాటి వల్ల ఆయా రసాయనాల అవశేషాలు సమర్థవంతంగా తొలిగిపోవడమే గాక సురక్షితమైన ఆహారంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇలా నానబెట్టడం వల్ల మామిడి కాండం వద్ద ఉండే జిగురు లేదా లేటెక్స్ అనే రసం ఘాటు తొలిగిపోతుందట. ఈ రసం గనుక నోటిలోకి వెళ్తే నోటి చుట్టూ వాపు, దురద, బొబ్బలు వంటి చర్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!) -
సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి మొత్తం 107 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఫిట్నెస్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఉండాలంటే..ఆరోగ్యపట్ల ఎలాంటి స్ప్రుహతో వ్యవహరించాలి వంటి వాటి గురించి విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ వెల్లడించారు. ఆయనతో ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవంతోపాటు..ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయంటూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అంతటి స్టార్డమ్ ఉన్నా..ఆరోగ్యం పట్ల విజయ్ వ్యవహరించే తీరు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.సెట్లో విజయ్తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ..ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్..విజయ్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే కాకుండా..తెర వెనుక కూడా చాలా నిబద్దతతో వ్యవహరించే ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయన ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండటమేగాక, అత్యంత నిలకడగా చేస్తుంటారని అన్నారు. ఆయనతో పనిచేయడం ఒక మరుపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఎంతటి బిజీ షెడ్యూల్లో గడుపుతున్నప్పటికీ..తన ఆరోగ్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఎంతటి విరామంలేని స్థితిని కూడా ఆయన చాలా చాకచక్యంగా సమతుల్యం చేసుకుంటారని, అదే ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. సమయ నిర్వహణ నుంచి శారీరక దృఢత్వం కాపాడుకోవడం, శక్తిమంతమైన ప్రదర్శనలు ఇవ్వడం వరకు ప్రతిదీ నిశబ్దమైన ఏకాగ్రతతో చేస్తారని కుమార్ తెలిపారు. ఎంతటి హడావిడి రాజకీయ ర్యాలీలలోనైనా, ఆయన తన భోజనాన్ని తానే తీసుకువెళ్లేవారని అన్నారు. బయటి ఆహారానికి చాలా దూరంగా ఉంటారని చెప్పారు. ఆయనలో సాధారణ స్థాయిని మించిన క్రమశిక్షణను స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నాడు. 51 ఏళ్ల వయసులోనూ యువ హీరోలను తలదన్నేలా ఉండే ఆయన ఫిజిక్కి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే అంటూ పొగడ్తలజల్లు కురిపించారు. అంతేగాదు విజయ్ క్షణం తీరక లేని ఒత్తిడితో కూడిన పరిస్థితిని సైక్లింగ్, జిమ్ సెషన్లు, రన్నింగ్ వంటి మార్గాలతో చిల్ అవుతారని చెప్పుకొచ్చారు. పైగా విజయ్కి ఇప్పటి వరకు మోకాలి లేదా నడుము నొప్పి వంటి సమస్యలు కూడా లేవన్నారు. ముఖ్యంగా విజయ్ వినయం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని, అదే ఆయనకు ఇంతలా ప్రజాదరణ తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని సమాన గౌరవంతో చూస్తారు, అదే అయన మార్క్ని స్పెషల్గా చూపించడమే గాక..విక్టరీకి కేరాఫ్గా నిలిచేలా చేసిందని అంటున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా అంచనాలకు అందని విజయ్ ఘన విజయం యాదృచ్ఛికంగా వచ్చిందికాదని, ఆయన అంకితభావం, ఏకాగ్రత, అభిరుచి ఫలితంగా వచ్చిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. అంతేగాదు క్రమశిక్షణ అనే పునాదిపై నిర్మించబడిన విజయంగా పేర్కొన్నారు. అలాగే ఏ రంగంలోనైనా తూచా తప్పకుండా నిలకడతో వ్యవహరిస్తే..విజయం తథ్యమని అందుకు దళపతి, తమినాడు సీఎం విజయ్నే నిదర్శనమని అన్నారు. (చదవండి: హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!
బరువు తగ్గడం ప్రస్తుత రోజుల్లో ఒక ట్రెండ్గా మారింది. అంతా శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించుకుని స్మార్ట్గా మారడంపైనే ఫోకస్ పెడుతున్నారు. అంతేగాదు ఆరోగ్యస్ప్రుహతో ఆ దిశగా పోషకాహార నిపుణులు, ఫిట్నెస్ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తున్నారు. బరువు తగ్గడం అంటే తక్కువగా తీసుకోవడం, కేలరీలు మితంగా ఉండేలా కేర్ తీసుకోవడంపై ఆధారపడి ఉంటుందనేది అందరి నమ్మకం కానీ, ఇది అందరికీ వర్తించదని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్నెస్ కోచ్ హన్నా బటన్. కొందరిలో ఈ విధానం దీర్ఘకాలిక కొవ్వు నష్టానికి దారితీస్తుందని అంటున్నారు. అలాంటివాళ్లు, జీవక్రియ , హర్మోన్ల సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా డైట్ తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. అదెలాగో సోషల్ మీడియా ఎక్స్ వేదిక వివరించారామె. ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్నెస్ కోచ్ హన్నా బటన్ తాను సాధారణంగా తినే విధానం కంటే ఎక్కువగా తింటూ కోరుకున్న విధంగా బరువు ఎలా తగ్గొచ్చో ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ఆ పోస్ట్లో మనకు స్థిరమైన కొవ్వు నష్టం జరగకుండా మంచి డైట్ని అనుసరించాలని అన్నారామె. అయితే చాలామంది నిపుణులు తక్కువ తినండి, కార్బోహైడ్రేట్లు తగ్గించండి, అలాగే ప్రతి కేలరీని లెక్కించడని సూచిస్తుంటారు. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్గా ఈ విధానం వల్ల కండరాలు కోల్పోయాను, హార్మోన్లు దెబ్బతిన్నాయ్, పైగా మరింత అధ్వాన్నంగా కనిపించానని చెప్పుకొచ్చింది. ఈ సలహా ముమ్మాటికీ తప్పు మాత్రమే కాదు హానికరం అని అంటున్నారామె.తక్కువగా తినడం వల్ల శక్తిని ఆదా చేసేందుకు జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కొవ్వు నిల్వలు, కండరాలు తగ్గిపోతాయ్, అలసిపోతారు కూడా. అలాగే మీ బరువులో ఎలాంటి మార్పు కనిపించదు కూడా. అందువల్ల ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు డైటింగ్ పద్ధతిని మార్చాలంటున్నారామె.ప్రోటీన్ ఆటను మార్చేస్తుందిఫిట్నెస్ కోచ్ హన్నా ప్రతిరోజూ శరీర బరువులో ప్రతి పౌండ్కు 0.7–1 గ్రాముల ప్రోటీన్ను లక్ష్యంగా పెట్టుకోమని సూచిస్తున్నారు. శరీరం ప్రోటీన్ను జీర్ణం చేసుకోవడం ద్వారానే దాని నుంచి వచ్చే కేలరీలలో 30% ఖర్చు చేస్తుంది. కొవ్వును తగ్గించుకుంటున్నప్పుడు ఇది లీన్ కండరాలను కాపాడుతుంది. చాలా మంది తమకు వాస్తవంగా అవసరమైన దానిలో సగం మాత్రమే తింటారు.ఎక్కువగా తింటే.. చురుకుగా జీవక్రియ..తీవ్రమైన ఆహార నియంత్రణ ఆకలికి సంకేతం, దీని ఫలితంగా కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం కొవ్వును తీవ్రంగా నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే 300-400 కేలరీల లోటు ఎల్లప్పుడూ ఉత్తమమైనది. హన్నా ప్రకారం, తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే నిలకడగా పాటించగలిగే డైట్ను ఎంచుకోవాలి.కండరాలే కొవ్వును కరిగించే చోదక శక్తిఎంత ఎక్కువ కండరాలను పెంచుకుంటే, విశ్రాంతి జీవక్రియ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కొవ్వును కరిగించడం ప్రారంభిస్తారు. ఇక్కడ కండరాలను పెంచుకోవాలంటే, తగినంత ఆహారం తీసుకుంటూ..బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా నియంత్రణ పేరుతో ఆకలితో ఉండటం అనేది కండరాలను నాశనం చేస్తుంది, పైగా జీవక్రియ మందగించి, అదనంగా కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.40 ఏళ్లు పైబడిన వారిలో హార్మోన్లు చాలా ముఖ్యందీర్ఘకాలంగా తక్కువగా తిన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకునేలా చేస్తాయి. అదే సమయంలో, నిరంతరం తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల, కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే లెప్టిన్ అనే హార్మోన్ను అణచివేస్తుంది. ఇది మీకు అంతులేని ఆకలిని కలిగించి, మిమ్మల్ని అతిగా తినేలా చేస్తుంది.తినవలసిన ఆహారంహన్నా చికెన్, చేపలు, గుడ్లు మరియు గ్రీక్ యోగర్ట్ వంటి లీన్ ప్రోటీన్ను ఎక్కువగా తినమని సిఫార్సు చేస్తుంది. కూరగాయలను ఎక్కువ పరిమాణంలో, తక్కువ కేలరీలతో తీసుకోవాలి. డైట్కు అనుగుణంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను నియంత్రిత మోతాదులో తీసుకోవాలి.ఫలితాలుతాను స్ట్రిక్ట్ డైట్ నుంచి సరైన ఆహారానికి మారిన తర్వాత, వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయని అంటోంది హన్నా. ముఖ్యంగా శరీర కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగిపోయింది, పైగా తన శక్తి, పనితీరు పుంజుకున్నాయని చెప్పుకొచ్చింది. ఆమె అత్యంత సన్నగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా తింటున్నప్పటి నుంచే, మునుపెన్నడూ లేనంత ఆరోగ్యంగా కనిపిస్తోందని చెబుతోంది."1960లలో శారీరక శ్రమ లేని వారి కోసం 1,200-కేలరీల నమూనా రూపొందించారు, కానీ ఇది అందరికీ వర్తించదని అంటోంది. సాధ్యమైనంతవరకు పనితీరును పెంచే పోషకాహార ప్రణాళిక అవసరం. ఇది సరళమైనది. ప్రభావవంతమైనది. ఎవ్వరైనా దీన్ని సరిగా అనుసరిస్తే..వాటంతటే అవే మంచి మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్మకంగా పేర్కొంటూ తన పోస్ట్ని ముగించింది హన్నా.I lost body fat by eating MORE.Not less. Not 1,200 calories. More.Here's the science to sustainable fat loss:= Thread = pic.twitter.com/GtiTLcwYJI— Hannah - Apex Fitness Advisory (@hannahapexfit) May 1, 2026 గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు) -
పని ప్రదేశం..ఆరోగ్యానికి భారం కాకూడదంటే..!
ఇవాళ పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యంకి సంబంధించిన దినోత్సవం. ప్రతి ఏటా ఏప్రిల్ 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ముఖ్యోద్దేశం పని ప్రదేశాలలో ప్రమాదాలు, వ్యాధులను నివారించి సురక్షితమైన ఆరోగ్య పని సంస్కృతిని ప్రోత్సహించడమే. దీన్ని ఉద్యోగుల శ్రేయస్సు కోసం 2003లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పనిప్రదేశాన్ని హెల్దీగా ఎలా మార్చుకోవాలో ఆరోగ్య నిపుణుల మాటల్లో తెలుసుకుందామా.పనిప్రదేశంలో చాలామంది ఉద్యోగులు బ్యాక్పెయిన్, మెడనొప్పి, ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లు కూర్చోనే భంగిమపై అవగాహన ఏర్పరుచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మానిటర్లను కంటి స్థాయిలో ఉంచడం, ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవడం, సాగదీయడం (స్ట్రెచింగ్) వంటివి చేయాలి.మోచేతులు డెస్క్ స్థాయిలో ఉండేలా కుర్చీ ఎత్తును సర్దుబాటు చేయాలి. ఇది మెడ/భుజాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. "తల ముందుకు వంగిన" భంగిమను నివారించడానికి, పాదాలు నేలపై చదునుగా ఉండేలా.. స్క్రీన్లు కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.వెన్నెముకను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండకూడదు. దాంతోపాటు ప్రతి 30–60 నిమిషాలకు ఒకసారి కదలడం వంటివి చేయాలి. కండరాలపై స్థిరమైన భారాన్ని తగ్గించడానికి, నిలబడి పనిచేసే డెస్క్లను లేదా కన్వర్టర్లను ఉపయోగించడం, తరచుగా భంగిమలను మార్చుకోవడం వంటివి చేయాలి.వీటన్నింటి తోపాటు చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిని వ్యాయామం లేదా వాకింగ్ వంటి కదలికలు అవసరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?) -
వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?
జార్ఖండ్లో జరిగిన విషాద ఘటన అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.దాంతో సమ్మర్లో ఎలాంటి చిరుతిండ్లు మంచివనే చర్చలు లేవనెత్తాయి. అందులోనూ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా అందరు మెచ్చే పానీపూరి విషయంలో మరింత కేర్ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.జార్ఖండ్ గిరిడిహ్ జిల్లాలోని లేడా బజ్తో గ్రామంలో, శనివారం సాయంత్రం ఒక వీధి వ్యాపారి అమ్మిన పానీపూరీలు తిని చాలామంది వాంతులు, నీరసం వంటి అనారోగ్యం బారిన పడ్డారు. సుమారుగా 18 మందికి పైగా ఆసుపత్రిలో చేరగా, ఏడేళ్ల చిన్నారి మరణించింది. ఒక సాధారణ వీధి ఆహారం ఇంత మందికి ప్రాణాంతకంగా ఎలా మారిందన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణంగా దానిలో ఉపయోగించే నీరేనని వైద్యులు చెబుతున్నారు. పానీపూరీ అనగానే నీరు ప్రధానం. ఈ నీరు కలుషితం కాకుండా మంచి పరిశుభ్రమైనది వాడితే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. అదే నీరు కలుషితమైతే దానిలో కోలి లేదా సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందన్నారు. వేడి వాతావరణంలో ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురవ్వుతామని అన్నారు. అలాగే అందులో ఉపయోగించే కూరలోని బంగాళదుంపలు, శనగులు తాజాగా ఉంటే పర్లేదు గానీ, అవి కూడా అసురక్షితమైనవి అయితే ఈ బ్యాక్టీరియా మరింత వేగంగా పెరుతుందన్నారు. అలాగే దుకాణం వద్ద కూడా పరిశుభ్రత అనేది అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమ్మకందారులు వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, పాత పాత్రలనే వాడటం, ఈగలు, దుమ్ముకు గురికావడం, తదితరాల వల్లే ఫుడ్పాయిజనింగ్ అయ్యి అనారోగ్యం బారిన పడతారని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు, హాని కలిగించేవి కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదు, అవి వదిలిపెట్టే విషపదార్థాలు కూడా అనారోగ్య సమస్యలు వస్తయాన్నారు. ఆ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే విషపదార్థాల కారణంగా డీహైడ్రేషన్, అవయవాలపై ఒత్తిడి, చివరికి ప్రాణాంతకంగా కూడా మారుతుందని అంటున్నారు. వేసవిలో వేడి కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల మరింత వేగవంతంగా ఉంటుందట. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగ ఫుడ్పాయిజన్ కేసులు నమోదవుతాయని అంటున్నారు నిపుణులు. దకాణాదారుడు పరిశుభ్రతను పాటిస్తూ..నాణ్యమైన పదార్థాలనే ఉపయోగిస్తే ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా తినొచ్చని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..?) -
భోజనం తర్వాత పుచ్చకాయ తినకూడదా..?
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న ఘటన తీవ్ర ఆందోళన, అనుమానాలను రేకెత్తించింది. భోజనం తర్వాత సర్వసాధారణంగా పండ్లు తీసుకుంటాం. అలా.. సమ్మర్ ఫ్రూట్గా చెప్పే పుచ్చకాయను మాత్రం అలా తీసుకోకూడదా అంటే..పోషకాహార నిపుణులు ఔననే చెబుతున్నారు. అసలు దీన్ని ఎలా తినాలి?, ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది? వంటి విషయాలు గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.!.పుచ్చకాయ పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. అయితే చాలామంది ఈ పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉందంటూ ఫిర్యాదులు చేస్తుంటారు. ఎందుకిలా అంటే..రీజన్ ఏంటంటే..సర్వసాధారణంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే భారీ భోజనం తర్వాత ఎప్పుడైతే పుచ్చకాయ తింటారో ఆ క్షణమే ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా పుచ్చకాయ వినయోగం ఆటోమేటిగ్గా పెరుగుతుంది. అందువల్ల ఇలా వేసవిలోనే ఈ సమస్య తీవ్రమవుతుందా? లేక ప్రతిసారి ఇలానే జరుగుతుందా అంటే..నిజనానికి వేసవిలో కడుపు ఉబ్బరం సర్వసాధారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అధిక వేడి కారణంగా శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇబ్బంది పడుతుండటంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని చెబుతున్నారు. తత్ఫలితంగా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ కాలంలో అధిక నీటి శాతం ఉన్న పండ్లు, తినే భోజనం రెండూ సమతుల్యంగా ఉంటే ఈ సమస్య రాదని అంటున్నారు. అంతేగాదు మనం పుచ్చకాయలను తీసుకునే విధానం కారణంగానే ఈ కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య వస్తుందని చెబుతున్నారు. అంతేగాదు అలాంటి సమయంలోనే జీర్ణవ్యస్థపై పుచ్చకాయ ప్రభావం చూపిస్తుంది. అదీగాక ఈ పుచ్చకాయలో అధికంగా ప్రక్టోజ్ ఉండటం వల్ల పెద్దప్రేగుల్లో ఇది పులిసి, గ్యాస్ ఉత్పత్తి అవ్వడానికి దారితీసి కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటివి కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదీగాక మనం తినే భోజనంతో పోలిస్తే పుచ్చకాయ వంటి పండ్లు జీర్ణాశయం గుండా వేగంగా ప్రయాణిస్తాయట. ఎప్పుడైతే ఈ రెండిటిని కలిపి తీసుకుంటామో దాని ఫలితం ఈ పుచ్చకాయ ముక్కలు జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది, దాంతో పులియబెట్టడం, గ్యాస్ ఏర్పడటం వంటివి జరుగుతాయని అన్నారు. అందువల్ల జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు సాధారణంగా భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవడమే మేలని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ సమస్యతో ఉన్నవారు కూడా భోజనం తిన్న వెంటనే లేదా పుచ్చకాయ తిన్న వెంటనే భోజనం వంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.ఎప్పుడు తింటే మంచిదంటే..వైద్యులు మెరుగైన ఫలితాలు పొందాలంటే.. పుచ్చకాయను తీసుకునే సమయం కీలకమైనదని అంటున్నారు. అది తీసుకునే ఆధారంగానే మంచి ప్రయోజనాలను పొందగలమని అన్నారు. అంటే పూర్తి స్నాక్ ఐటెంగా లేక భోజనానికి చాలా సమయం ఉందనగా తీసుకోవడం మంచిదని అన్నారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో తీసకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా వద్దనే చెబుతున్నారు వైద్యులు. సరైన సమయం ఉదయం 11 నుంచి 3 గంటల లోపు భారీ బోజనం తీసుకోక మునుపు అయితే మంచిదని చెబుతున్నారు. రాత్రి ఏడు తర్వాత తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది, పైగా రాత్రి సమయంలో తేలకపాటి ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏదైనా సరే తగిన మోతాదులో తీసుకోవడం మంచిదనేది గుర్తురెగాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్' అన్న నానుడి గుర్తించుకుని ఏదైన మితంగా సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నం కావని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?) -
వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..?
ఇంట్లో స్వయంగా వండుకునే వృద్ధుల్లో మతిమరుపు సమస్యలు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వంట చేసేటప్పుడు కూరగాయలు తరగడం, సరైన మోతాదులో ఉప్పు, కారం, మసాలాలు వేయడం, వంటకాలకు తగ్గట్టుగా కావాల్సిన పదార్థాలను సరైన సమయానికి జోడించడం వంటి మల్టీ టాస్కింగ్ ఉంటుందని.. ఇది మెదడుకు వ్యాయామంలా పనిచేసి దాన్ని చురుగ్గా ఉంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.మెరుగైన మెదడు పనితీరు..: జపాన్ జెరోంటాలాజికల్ ఎవాల్యుయేషన్ స్టడీలో పాలుపంచుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 11,000 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఎంత తరచూ వారు ఇంట్లో వంట చేస్తారు? వంట సామర్థ్యంపై వారికున్న అంచనాలు, ఎంత మందికి మతిమరుపు వచ్చింది వంటి సమాచారాన్ని సేకరించారు. ఆ వివరాలను విశ్లేషించగా ఏమాత్రం వంట చేయని వృద్ధులతో పోలిస్తే రోజూ గరిట తిప్పే వృద్ధుల్లో డిమెన్షియా వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని గుర్తించారు. వంట నైపుణ్యం మెరుగైన మెదడు పనితీరుకు సంకేతమని ఈ అధ్యయనం తేల్చింది.జీవనశైలి మార్పుల ద్వారా..: వారానికి కనీసం ఒక్కసారైనా ఇంట్లో వంట చేసే వారిలో డిమెన్షియా రిస్క్ తగ్గినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమం తప్పకుండా వంట చేసే పురుషుల్లో 23%, స్త్రీలలో 27% తక్కువ ప్రమాదం ఉండగా.. కొత్తగా వంట చేయడం ప్రారంభించిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు 67% తక్కువగా ఉన్నాయి. ‘2020 లాన్సెట్ నివేదిక ప్రకారం ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలి మార్పుల ద్వారా సుమారు 40% డిమెన్షియా కేసులను నివారించవచ్చని తేలింది. అందుకే ఇంటి వంటపై దృష్టి సారించాం’ అని అధ్యయన సహ రచయిత, టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ యుకాకో తాని చెప్పారు. అయితే వంట చేయడం ద్వారానే మతిమరుపు ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనం కచ్చితంగా నిరూపించలేదు. ఇది కేవలం ఇంటి వంటకు, మతిమరుపు ముప్పు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంటే వంట చేసే అలవాటు ఉన్న వారిలో ఈ రిస్క్ తక్కువగా ఉందని మాత్రమే గుర్తించింది. పైగా ఈ పరిశోధన కేవలం జపాన్కు చెందిన వృద్ధులపైనే నిర్వహించారు. ‘మతిమరుపు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ఖరీదైన చికిత్సల కంటే వంట చేయడం వంటి చిన్నచిన్న మార్పులు అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారాలు, మెదడు పనితీరును కాపాడుకోవడం ఈ అలవాట్ల ముఖ్య ఉద్దేశం’ అని యుకాకో తాని వివరించారు.మెదడుకు వ్యాయామం..ప్రణాళిక: ఏం వండాలి, ఎలా వండాలి అని ప్రణాళిక రచించడం.ఎంపిక: సరైన పదార్థాలను ఎంచుకోవడం.పద్ధతి: వంటకాల తయారీ పద్ధతిని పాటించడం.ప్రయోజనాలు..పోషకాహారం: మంచి డైట్ లభిస్తుంది.శారీరక శ్రమ: వంట చేసేటప్పుడు కదలడం వల్ల వ్యాయామం అవుతుంది.మానసిక శక్తి: ఆలోచించి వండటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.నేషనల్ డెస్క్(చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..) -
డయాబెటిస్ ఉంటే చేయాల్సిన వ్యాయామాలు..!
డయాబెటిస్ ఉన్నవారి చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా మరింత శక్తిని పొందేలా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్లు సరైన పద్ధతిలో వ్యాయామాలు చేయడం అత్యంత ముఖ్యం.ఎందుకంటే..ఇన్సులిన్ సమస్యను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందితక్షణ కండర శక్తిని పెంచుతుందిబరువు నియంత్రణకు సహాయపడుతుందిచేయాల్సినవి..1. ఏరోబిక్ వ్యాయామంవేగంగా నడవడంసైక్లింగ్ఈతవ్యవధి: 30–45 నిమిషాలువారానికి కనీసం 5 రోజులు2. శక్తి శిక్షణతేలికపాటి బరువులు / రెసిస్టెన్స్ బ్యాండ్లుశరీర బరువు వ్యాయామాలు (స్క్వాట్లు, వాల్ పుష్-అప్లు)వారానికి 2–3 సార్లుకండరాలను పెంచుతుందిm గ్లూకోజ్ వినియోగం మెరుగుపడుతుంది. పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయి3. ఫ్లెక్సిబిలిటీ, చలనశీలతస్ట్రెచింగ్యోగాప్రతిరోజూ (10–15 నిమిషాలు)బిగుతును తగ్గిస్తుంది, కదలికను మెరుగుపరుస్తుంది. అలాగే గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఎప్పుడు చేయాలంటే..భోజనం తర్వాత (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత)భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుందిఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా తీవ్రమైన వ్యాయామం చేయవద్దువ్యాయామానికి ముందు ..ముందుగా ఒక చిన్న స్నాక్ తీసుకోండితీవ్రమైన వ్యాయామం చేయవద్దు, జాగ్రత్తగా ఉండండివ్యాయామానికి ముందు తినదగిన స్నాక్స్ (అవసరమైతే)కొన్ని నట్స్సగం పండుపెరుగుఇది వ్యాయామం చేసేటప్పుడు చక్కెర స్థాయిలు తగ్గకుండా నివారిస్తుందితీసుకోవాల్సిన జాగ్రత్తలు..తల తిరగడంఅధికంగా చెమట పట్టడంనీరసంగుండె దడతక్షణమే వ్యాయమాలు ఆపేసి విశ్రాంతి తీసుకోవడం, అవసరమైతే చక్కెర స్థాయిలను తనిఖీ చేయడం తదితరాలు చేయాలి.వ్యాయామం తర్వాత పాటించాల్సిన చిట్కాలు:అప్పుడప్పుడు షుగర్ స్థాయిలను తనిఖీ చేసుకోవడంనీళ్ళను బాగా తాగండివ్యాయామం తర్వాత అతిగా తినడం మానుకోండిచేసే తప్పిదాలు..క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంకేవలం నడవడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకపోవడంవార్మ్-అప్ మానేయడంఅకస్మాత్తుగా వ్యాయామాన్ని అతిగా చేయడంషుగర్ తక్కువగా/ఎక్కువగా ఉన్న లక్షణాలను పట్టించుకోకపోవడంవారంలో వర్కౌట్ల ప్లాన్..సోమవారం–శుక్రవారం:30 నిమిషాల వేగవంతమైన నడక10 నిమిషాల స్ట్రెచింగ్మంగళవారం నుంచి శనివారం:15–20 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జోడించండిఆదివారం:తేలికపాటి కార్యకలాపాలు (నడక/యోగా)అప్పుడప్పుడు చేసే కఠినమైన వ్యాయామాల కంటే, క్రమం తప్పకుండా చేసే మితమైన వ్యాయామం మరింత ఉత్తమంగా పనిచేస్తుంది.చివరగా డయాబెటిస్కు వ్యాయామం అత్యంత శక్తిమంతమైన "మందులలో" ఒకటి. అయితే దానిని సరిగ్గా, క్రమం తప్పకుండా చేసినప్పుడు మాత్రమే ఫలితం అందుకోగలం అని చెబుతున్నారు నిపుణులు.డా. ఆదర్శ గౌడ, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్) సీఈవో, బెంగళూరు(చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు) -
ఇది మీ బిడ్డకు ఇస్తే విషమే
-
క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు
బరువు తగ్గడం అనేది తరుచుగా కఠినమైన డైట్లు, డిటాక్స్ పద్ధతులు, తీవ్రమైన వ్యాయామాలతో ముడిపడి ఉంటుంది. కొందరు తక్కువ వ్యవధిలో బరువు తగ్గించే షార్ట్కట్లు వెతుక్కుంటారు. కానీ ఇలాంటివి ఏవి అవసరం లేకుండానే స్థిరమైన మార్పులతో బరువు తగ్గగలరని చెబుతున్నారు పుణెకు చెందిన క్లినికల్ ఫార్మసిస్ట్ అండ్ ఆరోగ్య విద్యావేత్త డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా తన రోగులలో ఒకరు ఎలాంటి తీవ్రమైన డైట్ లేదా డిటాక్స్ కార్యక్రమాన్ని పాటించకుండా 8 కిలోలు ఎలా తగ్గగలిగారో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ పేషెంట్ రక్త పరీక్షల్లో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉంది. అతడు చాలా తక్కువగా ఫుడ్ తీసుకుంటున్నా ఇలా ఈ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం అతనిలో భయాన్ని రేకెత్తించి తన వద్దకు వచ్చినట్లు తెలిపారు. అయితే డాక్టర్ దవాయివాలా సమస్య అతను ఎంత తిన్నాడు అనే దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదని అంటున్నారు. శరీరమే దీనికి కారణం అన్నారు.అదెలా అంటే..మన శరీరమే కొంత కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఇది మన జీవనానికి ముఖ్యమైన పదార్థం. ఇది కణ త్వచాలు, హార్మోన్లు, విటమిన్ డి కొవ్వును జీర్ణం చేసే పైత్యరస ఆమ్లాలకు ఒక కీలకమైన నిర్మాణ మూలకం. శరీరం సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగినప్పుడు సాధారణంగా అదనపు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అందుకు గల కారణాలు ఏవంటే..సరిగా నిద్రపోకపోవడంవిటమిన్ డి లోపంఇన్సులిన్ నిరోధకతక్రమరహిత భోజనంకనీస శారీరక శ్రమఅందువల్ల సమస్య కొలెస్ట్రాల్ కాదు. ఇది దెబ్బతిన్న జీవనశైలి చక్రానికి సంబంధించిన ఒక లక్షణంకొలెస్ట్రాల్, బరువు తగ్గేలా ఏం చేయాలంటే..అదనపు ఫైబర్ (అవిసె, చియా, నానబెట్టిన ఓట్స్)ఒమేగా-3లుసమతుల్యమైన ఆహారం, ఏదీ మానకూడదుప్రతిరోజూ ఉదయం సూర్యరశ్మి, మెగ్నీషియంవిటమిన్ డి సప్లిమెంట్లుఈ మార్గదర్శక జీవనశైలి మార్పుల ద్వారా, రోగి మొత్తం కొలెస్ట్రాల్ 248 mg/dL నుంయి 187 mg/dLకి తగ్గింది. అతను 8 కిలోల బరువు తగ్గాడు, అతని విటమిన్ డి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. పైగా అతని నిద్ర మెరుగుపడింది, అతిగా తినడం కూడా ఆపగలిగాడు.ఇందులో ఎలాంటి తీవ్రమైన డైట్లు లేదా జిమ్మిక్కులు లేవు. కేవలం స్థిరమైన, మార్గదర్శక ప్రయత్నం మాత్రమే. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని లేదా బరువును అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నట్లయితే, పోషకాహార నిపుణులు లేదా ఫిట్స్ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు డాక్టర్ దవాయివాలా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Idris Dawaiwala | AHealthyBeat (@ahealthybeat) (చదవండి: గ్లోబల్ మైండ్సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..) -
ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!
చాలామంది మహిళలు అటుఇటుగా మధ్యవయసుకు చేరుతుండగానే కాస్త లావెక్కుతుంటారు. ఈ దశలో వాళ్లకు ఒక సందేహం కూడా వేధిస్తుంటుందీ... ‘మేమేమీ ఎక్కువగా తినడంలేదు. మా ఆహార అలవాట్లలో మార్పులూ లేవు. అయినా ఇలా ఎందుకు బరువు పెరుగుతున్నామం’టూ బాధపడుతుంటారు. ఇలా జరగడానికి కారణాలేమిటో చూద్దాం. నిజానికి మధ్యవయసుకు చేరుతూ... రుతుక్రమం ఆగిపోయేందుకు తొలి దశ అయిన పెరీ–మెనోపాజ్, రుతుస్రావం పూర్తిగా ఆగిపోయే మెనోజ్కూ దగ్గరపడుతున్న సమయంలో అప్పటివరకూ వాళ్లలో స్రవిస్తున్న ఈస్ట్రోజెన్ మోతాదుల్లో తగ్గుదల మొదలవుతుంది. ఈ ఈస్ట్రోజెన్ మోతాదుల్లో తగ్గుదల జీవక్రియలూ (మెటబాలిజమ్), కొవ్వు నిల్వలూ, ఎనర్జీ వెలువడటాలనే పలు అంశాలలో మరికొన్ని మార్పులకు కారణమవుతుంది. మెనోపాజ్ దశలో స్థూలకాయం రావడానికి కారణాలేమిటి?నిజానికి ఈస్ట్రోజెన్ అనే హార్మోన్.... ఇన్సులిన్ చేసే పనిలోనూ, అది వివిధ కణాలకు చేరే తీరుతెన్నులు, జీవక్రియల వేగం రేటు... ఈ అన్ని విషయాల్లోనూ కీలక భూమిక ΄ోషిస్తుంది. ఈస్ట్రోజెన్ క్రమబద్ధంగా వెలువడుతున్న రోజుల్లో అది దేహంలోని గ్లూకోజ్ సమంగా నిర్వహితమవుతూ, కండరాలన్నీ (మజిల్ మాస్) సమానంగా ఉండేలా చూస్తుంది. దాంతో దేహం దాదాపుగా సన్నగానే కనిపిస్తుంటుంది. కానీ ఈస్ట్రోజెన్ స్రావాలు మోతాదులు తగ్గుతున్న కొద్దీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో అది దేహంలో కొవ్వు పేరుకునే ప్రక్రియకు దారితీస్తుంది. ఈ క్రమంలో మొదట మహిళల పొట్టలో కొవ్వుపెరగడం దగ్గర్నుంచి మొదలై క్రమంగా ఒళ్లు లావెక్కడం కొనసాగుతుంది. తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం అంతే ఉన్నప్పటికీ... ఈ మధ్యవయసు దశలో మహిళలు తాము తీసుకునే ఆహారమూ, చేస్తుండే వ్యాయామంలో మార్పులు లేనప్పటికీ... జీవక్రియల్లో వచ్చిన పై మార్పు కారణంగా వాళ్ల దేహం బరువు పెరగడం మొదలువుతుంది. పెరీ–మెనోపాజ్ దశల్లో ఈస్ట్రోజెన్ హార్మోనల్ మార్పులు క్రమంగా మజిల్ మాస్ తగ్గిస్తూ పోవడంతో పాటు దేహంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతూ పోతాయి. కండరాల్లో ఏదైనా గాయమైనప్పుడు దాని నుంచి కోలుకునే వేగాన్ని కూడా తగ్గిస్తాయి. మనం చేసే రోజువారీ పనులతో కండరాల్లో అయ్యే చిన్నపాటి గాయాలు తగ్గే వేగం కూడా మందగిస్తుంది. ఇలా ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం అనే అంశం... మహిళలు తీసుకునే ఆహారాలు ఒంటికి పట్టడమూ (అబ్జార్బింగ్ ద న్యూట్రియెంట్స్), కండరాల నిర్మాణమూ, ఒత్తిడిని మేనేజ్ చేయడం (స్ట్రెస్ మేనేజ్మెంట్), నిద్ర... వీటన్నింటినీ ప్రభావితం చేస్తూ... బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒత్తిడి పెరగడంతో దేహంలో కార్టిసోల్ అనే హార్మోన్లు స్రవించడానికి కారణం కావడమూ... దాంతో నిద్ర బాగా తగ్గడం... ఇలా కంటినిండా నిద్రలేనప్పుడు రెస్టింగ్ మెటబాలిజమ్ కూడా తగ్గడం వల్ల ఒళ్లు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. అంటే... ఆహార అలవాట్లలో మార్పులు లేక΄ోయినప్పటికీ, ఇక్కడ పేర్కొన్న ఈ మార్పుల కారణంగా మధ్యవయసు రాగానే మహిళల్లో స్థూలకాయం పెరుగుతుంది. మెనోపాజ్ అనేది నివారించలేని దశ. అయితే ఈ ప్రక్రియల ద్వారా ఈస్ట్రోజెన్ తగ్గుదల వేగాన్ని నియంత్రించి, తద్వారా బరువు పెరగడాన్ని కూడా నియంత్రిస్తూ ఆరోగ్యంగా ఉండటం సాధ్యపడుతుంది. ఇక ఈస్ట్రోజెన్ తగ్గుదలతో వచ్చే పరిణామాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే... డాక్టర్ను సంప్రదించి అందుకోసం హార్మోన్ రీ–ప్లేస్మెంట్ చికిత్స (హెచ్ఆర్టీ) వంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది.ఈ సమస్యను అధిగమించడం ఎలా... ఏజింగ్ లేదా వయసు పెరుగుతుండటం వల్ల వచ్చే మార్పుల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ, అలా జరిగే తీరు మెల్లగా జరిగేలా చేయడం ద్వారా ఈ ప్రక్రియలను సాధ్యమైనంత ఆలస్యంగా జరిగేలా చేయడంతో పాటు దీనివల్ల కలిగే దుష్పరిణామాలను వీలైనంతగా నివారించవచ్చు. అందుకు ఆరోగ్యకరమైన మంచి జీవనశైలి (లైఫ్స్టైల్) బాగా ఉపయోగపడుతుంది.మంచి పోషకాహారాలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే మితిమీరిన వ్యాయామాలూ చేయకూడదు. దేహానికి మరీ శ్రమకలిగించని విధంగా కేవలం ఒళ్లు అలిసిపోయేలా మాత్రమే ఈ వ్యాయామాలు ఉండాలి. ఇందుకు వాకింగ్, ఈత వంటి వ్యాయామాలు మంచివి. ఒత్తిడిని (స్ట్రెస్ను) వీలైనంతగా తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి ప్రక్రియలను అనుసరించవచ్చు. మందకొడిగా కాకుండా ఎప్పుడూ చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కనీసం 7, 8 గంటలకు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి. రూమా సిన్హా, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. (చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!) -
బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!
శరీరం సంక్రమంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. నిజానికి శరీరం వివిధ భాగాలతో కూడిన ఒక జట్టులా పనిచేస్తుంది. ప్రతి అవయవానికి దానికంటూ ఒక పాత్ర, సొంత అవసరాలు, ఇష్టమైన పోషకాలు ఉండాయి. జీర్ణవ్యవస్థకు సహాయపడేది ఊపిరితిత్తులకు లేదా కళ్లకు సరిపడకపోవచ్చు. అందుకే తెలివిగా తినడం అంటే కేవలం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు అది బలవర్ధకమైనదై ఉండాలి కూడా అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు లాన్విత్ బాత్ర. అవయవాలు సక్రమంగా పనిచేసేలా, ఏకాగ్రత, శ్వాస బాగుండేలా ఎలాంటి పోషకాహారం తినాలో, జీవనశైలిలో అందుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పుల చోటు చేసుకోవాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు.శరీరంలోని ప్రతి భాగానికి సరైన ఆహారాలు1. ఊపిరితిత్తులు: వాపు నివారణపై (Anti-Inflammation) దృష్టి సారించండిమెరుగైన శ్వాస, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసంఅల్లం, పసుపు, సిట్రస్ పండ్లను (పుల్లని పండ్లు) ప్రత్యేకంగా సూచించారు. వీటిలో జింజెరోల్, కర్కుమిన్, విటమిన్ సీ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అందుకోసం ఉదయపు టీ లేదా జ్యూస్లో తాజా అల్లం, పసుపును చేర్చుకోండి.2 కాలేయం (Liver): విషతుల్యాల నిర్మూలనకు (Detox), కొలెస్ట్రాల్ జీవక్రియకు మద్దతునివ్వండి. శరీరం నుంచి విషతుల్యాలను తొలగించడానికి (detox) కాలేయం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. బ్రకోలి (సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉండేది), గ్రీన్ టీ, ఆలివ్ నూనె వంటి ఆహారాలు ఈ ప్రక్రియకు మద్దతునివ్వడానికి, కొవ్వు పేరుకుపోకుండా రక్షించడానికి సహాయపడతాయి. అంతేగాదు కొన్ని సులభమైన మార్పులతో, రోజువారీ ఆహారం ద్వారా వాటికి మద్దతు ఇవ్వవచ్చు.3. పేగు ఆరోగ్యం: మంచి బ్యాక్టీరియా కోసం.. ఆరోగ్యకరమైన పేగుకు ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ రెండూ అవసరం. పెరుగు మీకు సజీవ మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. అయితే అరటిపండ్లు, చియా గింజలు వాటికి ఆహారం అందించే ఫైబర్ను అందిస్తాయి.సులభమైన, జీర్ణవ్యవస్థకు మేలు చేసే చిరుతిండి కోసం పెరుగు, చియా గింజలను కలిపి ప్రయత్నించండి.4. కళ్ళు: ఒత్తిడి నుంచి రక్షణస్క్రీన్ సమయం పెరగడంతో, కంటి ఆరోగ్యం మునుపెన్నడూ లేనంతగా ముఖ్యమైంది. క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ) పుష్కలంగా ఉంటుంది, అదే సమయంలో ఉసిరి రెటీనాను రక్షించడానికి విటమిన్ సీ ని అందిస్తుంది. రోజువారీ భోజనంలో కనీసం ఒక నారింజ రంగు కూరగాయను చేర్చుకోండి.చిన్న చిన్న ఆహార ఎంపికలు శరీరంలోని వివిధ భాగాలకు వివిధ రకాలుగా సహాయపడతాయి. అందువల్ల ఏమి తింటున్నారు, ఎందుకు తింటున్నారు అనే దానిపై కాస్త శ్రద్ధ పెట్టి తీసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు పోషకాహారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే కాదు. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించాలి. (చదవండి: పాద' సేవలను గుర్తించండి!) -
'పాద' సేవలను గుర్తించండి!
పాదం ఓ సంక్లిష్టమైన అవయవం. నడక సరిగా సాగుతున్నంత సేపూ దాని గొప్పదనం తెలియదు. నిర్మాణపరంగా (అనటామికల్గా) చూస్తే అదొక అబ్బురపరచే అవయవం. పాదం ప్రాధాన్యమేమిటో తెలుసుకుందాం.పాదం గురించి తెలుసుకునే ముందు అసలు పాదం నిర్మాణాన్నీ, దాని పనితీరేమిటన్నది చూద్దాం.26 ఎముకలు / 107 లిగమెంట్లు / 19 కండరాలు మొత్తం కాలిలో 30 ఎముకలు ఉంటే... సైలెంట్గా తనపని తాను చేసుకుపోయే పాదంలో 26 ఎముకలు ఉంటాయి. అంటే కాలితో పోల్చి చూసినప్పుడు 90 శాతం ఎముకలు పాదంలోనే ఉంటాయి. ఇందులో నడవడానికి ఉపయోగపడేలా 107 లిగమెంట్లు, 19 కండరాలు కూడా ఉంటాయి. ఓ వ్యక్తి బరువు 70కిలోలు అనుకుంటే... అతడి బరువును బ్యాలెన్స్ చేసేందుకు దేహంలోని పొడవైన ఎముక ‘ఫీమర్’ తొడలో ఉంటుంది. దీన్నే తెలుగులో తొడ ఎముక అని పేరు.నడక... 70 కిలోల షాక్ తీసుకునే... సంక్లిష్ట ప్రక్రియ మనం మనకు తెలియకుండా యాంత్రికంగా నడుస్తుంటాంగానీ... నిజానికి నడక చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పాదం నేల మీద మోపగానే 70 కిలోల బరువుతో మొదటి షాక్ పాదం పైనే పడుతుంది. కానీ ఆ షాక్ను పాదానికి అంతటా సమంగా విస్తరింపజేస్తూ... ఆ షాక్ను తట్టుకునే షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది పాదం. ఇక ఆ పాదాన్ని వెనక్కుతోస్తూ తన గరిమనాభి (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) ముందుకు పడేలా చేస్తూ నడక సాగిస్తున్న వ్యక్తి కదులుతాడు. ఇలా గ్రావిటీవల్ల ముందుకుపడిపోయే లోపే... మరో కాలు ముందుకు పడి ఆ 70 కిలోల షాక్ను ఆ కాలు తీసుకుని మనిషి పడిపోవడం నుంచి ఆపుతుంది. ముందుకు పడిపోయేలా కదులుతూ... అలా పడిపోయే లోపు మరో కాలిని ఆనిస్తూ నడక సాగుతుంది. ఇలా నడక సాగించడాన్ని ‘బైపెడల్’ మూవ్మెంట్ అంటారు. రోజులో 7,500 సగటు అడుగుల నడకలో జరిగేదేమిటంటే... ఓ వ్యక్తి నడవడం మొదలుపెట్టాక ప్రతి నిమిషానికి ఉజ్జాయింపుగా 100 అడుగులు వేస్తుంటాడని అంచనా. అంటే అతడి రెండు కాళ్ల మీద ప్రతి నిమిషానికీ 70 కిలోల బరువు పడుతూ... ఒక్కో ΄ాదం మీదా ఇలా 50 సార్లు పడుతుంది. మొదట పాదం మోపగానే బరువంతా మడమలోని బంతిలాంటి ఎముకపై పడుతుంది. ఆ తర్వాత కాలివేళ్లలోని ఎముకలైన ఐదు మెటాటార్సల్స్పై పడుతుంది. వాటి సాయంతో పాదం నేలను వెనక్కుతోస్తుంది. కానీ నేల కదలదు కాబట్టి... అలా వెనక్కు నెట్టడం వల్ల ఆ వ్యక్తే ముందుకెళ్తుంటాడు. ఇలా ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తి రోజుకు 7,500 అడుగులు వేస్తాడని ఉజ్జాయింపుగా ఓ అంచనా.ఏడాదికి 27,37,500 అడుగులూ... జీవితకాలంలో 22 కోట్ల అడుగులుఈ లెక్కన అతడు ఏడాదికి 27,37,500 అడుగులూ... ఒకవేళ అతడు ఆరోగ్యకరంగా 80 ఏళ్లు బతకగలిగితే... అతడి జీవితకాలంలో మొత్తం 21,90,00,000 అడుగులు (అంటే దాదాపుగా 22 కోట్ల అడుగులు) వేస్తాడు. అలా ఓ వ్యక్తి తన జీవిత కాలంలో లక్షా అరవై వేల కిలోమీటర్ల (లక్ష మైళ్ల) దూరాన్ని నడుస్తాడని ఒక అంచనా. (పుట్టిన ఐదేళ్ల వరకు పెద్దగా నడవడు కదా అనుకుని 75 ఏళ్లకే లెక్కవేస్తే... 20,53,12,500 అడుగులు వేస్తాడు. అంటే కనీసం 20 కోట్ల అడుగులైనా వేస్తాడు. ఆ నడిచే దూరాన్ని భూమ్మీద భూమధ్య రేఖ వెంట ఇలా నడుస్తూపోతే భూమిని నాలుగుసార్లు చుట్టి వస్తాడు. ఒకవేళ భూమి నుంచి చంద్రుడివరకూ నడవగలిగేట్లయితే... భూమికీ చంద్రుడికీ మధ్యనున్న దూరం 3,84,400 కిలోమీటర్ల దూరంలో అటుఇటుగా దాదాపు నాలుగో వంతు నడుస్తాడు. ఈ లెక్కలను బట్టి చూస్తే ఓ జీవితకాలంలో పాదాలపై పడే బరువూ, భారమూ ఎంత అన్నది ఆలోచిస్తే... మన పాదాలు చేసే కష్టమెంతో అర్థమవుతుంది. గచ్చు గట్టిదనంతో మరిన్ని గాయాలు... ఒకప్పుడు మనమందరం దాదాపు పాదరక్షలేమీ లేకుండానే మట్టిపై నడిచేవాళ్లం కానీ... ఇప్పుడు సిమెంట్తో రూపొందిన కఠినమైన పేవ్మెంట్లు లేదా అలాంటి ఉపరితలాల మీద నడవాల్సి వస్తుంది. నిజానికి ఇలాంటి కఠినమైన ఉపరితలాల మీద నడిస్తే పాదాలకు నష్టం. దీనికి బదులు నడిచే సమయాల్లో మెత్తటి నేల, లేదా కాస్తంత బౌన్స్ ఇచ్చేలాంటి గడ్డి మీద నడవటం వల్ల పాదాలకు రక్షణ దొరుకుతుంది. అందుకే కఠినమైన ఉపరితలాల మీద వాకింగ్ అంతగా సిఫార్సు చేయదగినది కాదు. అయితే ఇప్పుడు చాలావరకు ప్రతిచోటా రోడ్లతో హార్డ్ సర్ఫేస్లు ఉంటున్నందున మెత్తగా ఉండే షూస్ ఎంపిక చేసుకోడం వల్ల పాదానికి తగిన రక్షణ దొరుకుతుంది. పాదాలకు వచ్చే కొన్ని సమస్యలూ... పరిష్కారాలు...ఇటీవల అందరూ షూస్ / బూట్లు తొడుగుతున్నారు. అందునా స్కూల్ పిల్లల వయసు నుంచే ఇది జరుగుతోంది. అయితే ఇలా షూస్, బూట్లతో చాలాసేపు పాదాల్ని బంధించి ఉంచడం సరికాదు. ఇది పూర్తిగా ఎదగని చిన్నారుల పాదాల ఎదుగుదలను దెబ్బతీయవచ్చు. అందుకే పాద సంరక్షణ కోసం కాస్తంత వదులుగానూ, తొడిగాక పాదం ముందర కాస్త ఖాళీ ఎక్కువగానూ ఉండేలా షూ ఎంచుకోవాలి. షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమస్యను ‘బ్యూనియన్’ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్కు చూపించాలి.. చిన్నారులు స్కూల్ నుంచి రాగానే పిల్లలు షూస్ వదిలేసి... ఫ్రీగా ఉండే చెప్పులు, స్లిప్పర్స్ వంటి వాటిని తొడగాలి. ఇక మహిళల్లో విషయానికి వస్తే... వారు ధరించే హైహీల్స్ వల్ల పాదాలకు జరిగే ప్రమాదవకాశాలు పురుషులతో పొలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. కొందరిలో బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంటుంది. ఇలా జరగకూడదంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లోంచి మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకోవాలి. ఇక డయాబెటిస్ వంటి సమస్య ఉన్నవారు పాదాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలతో పాదాలను చాలావరకు సంరక్షించుకోవచ్చు. షూ తొడిగినప్పుడు ఒకేచోట అదేపనిగా ఒత్తిడి పడుతుండటం వల్ల ఆనెకాయలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని కొందరు బ్లేడ్తో కోస్తుండటం, మరికొందరు యాసిడ్ చుక్కలతో మాడ్చటానికి ప్రయత్నిస్తుంటారు. అది సరికాదు. డాక్టర్కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి. ∙కొందరిలో పాదాలకు కాయకాచి అందులో పగుళ్లు ఏర్పడతుంటాయి. ఇలా జరిగినప్పుడు పాదాల డాక్టర్కు చూపించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి.కొందరిలో ఫంగస్ కారణంగా అథ్లెట్స్ ఫుట్ అనే సమస్య వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ పాదాలపై ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే పాదం ఎప్పుడూ తేమ, తడిలో ఉండటంతో అక్కడ ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథులు స్రావాలతో పాదం తడిసినప్పుడూ ఈ సమస్య మరింత త్వరగా రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ బేస్డ్ వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి రావచ్చు.డా. సుధీర్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్.నిర్వహణ: యాసీన్ -
ముందస్తు పరీక్షలతోనే కిడ్నీ కేన్సర్కు చెక్!
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరీక్షల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రాణాలను కాపాడుతుందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు నిరూపించారు. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకపోయినప్పటికీ, సాధారణ హెల్త్ చెకప్తో ఓ వ్యక్తికి ప్రాణాంతక కిడ్నీ కేర్ను గుర్తించి విజయవంతంగా చికిత్స అందించారు.నగరానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు (బీపీ, షుగర్ వంటివి) లేవు. ధూమపానం అలవాటు కూడా లేదు. అయితే, ఇటీవల ఆయన చేయించుకున్న సాధారణ మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా చేసిన అబ్డామినల్ అల్ట్రాసౌండ్ పరీక్షలో ఎడమ కిడ్నీలో సుమారు 8 సెంటీమీటర్ల మేర పెరిగిన గడ్డ (మాస్) బయటపడింది. వెంటనే సీటీ స్కాన్ నిర్వహించగా అది కిడ్నీ కేన్సర్గా నిర్ధారణ అయింది.AINU యూరాలజీ హెచ్ఓడి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస నారాయణం నేతృత్వంలోని బృందం ఆ రోగికి రాడికల్ నెఫ్రెక్టమీ (సర్జరీ ద్వారా కిడ్నీ తొలగింపు) నిర్వహించింది. పరీక్షల్లో అది 'క్లియర్ సెల్ రీనల్ సెల్ కార్సినోమా'గా తేలింది. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస నారాయణం మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 4.3 లక్షల కొత్త కిడ్నీ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. విచారకరమైన విషయం ఏమిటంటే.. 70 నుంచి 80 శాతం కిడ్నీ కణితులు ఎటువంటి లక్షణాలు లేకుండానే పెరుగుతాయి. మూత్రంలో రక్తం రావడం, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే అది వ్యాధి ముదిరినట్లు లెక్క. అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం" అని వివరించారు. ధూమపానం, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారికి ముప్పు ఎక్కువ. కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు.చిన్న గడ్డలను 'పార్షియల్ నెఫ్రెక్టమీ' ద్వారా కిడ్నీని కాపాడుతూనే తొలగించవచ్చు. పెద్ద గడ్డలకు మొత్తం కిడ్నీ తొలగించాల్సి ఉంటుంది. ఏడాదికి ఒకసారి కనీసం అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఇలాంటి సైలెంట్ కిల్లర్స్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా స్కానింగ్లో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే నిపుణులైన యూరాలజిస్టులను సంప్రదించాలని AINU యాజమాన్యం కోరింది. డాక్టర్ శ్రీనివాస నారాయణం,AINU సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్(చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!) -
ఆరోగ్యకరంగా భావించేవే కేన్సర్కి కారణమా..!
ఇన్నాళ్లు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఆరోగ్యానికి మంచివని చెబుతుండేవారు పోషకాహార నిపుణులు. కానీ ఇప్పుడు అవే ప్రమాదకరమైనవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఊపితిత్తుల కేన్సర్ స్మోకింగ్ చేసేవాళ్లకే వస్తుందనేది జగమెరిగిన సత్యం. కానీ చాలా కేసుల్లో ధూమపానం చేయకుండానే ఈ వ్యాధి బారినపడ్డట్లు తేలింది. అందుకు గల కారణాలు తెలిస్తే విస్తుపోవాల్సిందే.యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండే ఆహారాన్నే అధికంగా తీసుకున్న యువకులలోనే ఊపిరితిత్తుల కేన్సర్ అధికమని తేలింది. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ పద్దతలిలో పండించకపోవడమేనని చెబుతున్నారు పరిశోధకులు. ఫెర్టిలైజర్లు ఉపయోగించి పండించిన పండ్లు, కూరగాలు, తృణధాన్యాలు తీసుకువడంతో..వాటిపై పురుగుల మందులు అవశేషాలు ఉండటంతో చిన్న వయసులోనే యువత ఈ కేన్సర్బారిన పడుతున్నట్లు వెలడైంది. ఈ మేరకు అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ 2026 వార్షిక సమావేశంలో 187 మంది రోగుల ఆహార విశ్లేషణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో సుమారు 50 ఏళ్లలోపు వయసున్న రోగులకు ఊపిరితిత్తుల కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. 'హెల్తీ ఈటింగ్ ఇండెక్స్'ను ఉపయోగించి ఆయా రోగుల్లో పరీక్షించగా, వారందరి సగటు స్కోర్ 65గా ఉందని అన్నారు. సాధారణ అమెరికన్లతో పోలిస్తే ఈ యువ రోగులు ముదురు ఆకుపచ్చ కూరగాయలు, చిక్కుళ్ళు,తృణధాన్యాలను ఎక్కువగా తీసుకున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మహిళల్లో ఈ స్కోర్ మరింత అధికంగా ఉంది. పాల ఉత్పత్తులు, మాంసం, అనేక ప్రాసెస్ చేసిన ఆహారాలతో పోలిస్తే..ఆరోగ్యకరమైనవిగా పిలిచే ఈ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలలోని పురుగుల మందుల అవశేషాల వల్లే ఈ కేన్సర్ వచ్చే ప్రమాదం అధికం అని తేలింది. అంతేగాదు ఈ పురుగలమందుల ప్రభావానికి గురైన రైతుల్లో సైతం ఊపిరితిత్తల కేన్సర్ వచ్చే అవకాశం అత్యంత అధికంగా ఉందని డాక్టర్ జార్జ్ నీవా పేర్కొన్నారు. అలాగే చాలామటుకు ఊపిరితిత్తుల కేన్సర్ కేసుల్లో స్మోకింగ్ కారణం కాదని చెప్పారు. పైగా 50 ఏళ్లలోపు ధూమపానం చేయని వారిలో, ముఖ్యంగా మహిళల్లో ఈ కేన్సర్ సర్వసాధరంగా మారిందని అన్నారు. అంతేగాదు ఆయా రోగులు ఈ వ్యాధి నిర్థారణకు మందు వరకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నవారేనని చెప్పుకొచ్చారు. ఇదెంత వరకు నిజం అన్న దిశగా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు శాస్త్రవేత్తలు. కానీ ఈ పరిశోధన ఫెస్టిసైడ్స్ వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని హైలెట్ చేసింది కదూ..!.(చదవండి: వ్యాయామం లేకుండానే 12 కిలోలు..! డాక్టర్ వెల్నెస్ మంత్ర) -
జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!
సృష్టిలో ప్రతి జీవరాశి తన మనుగడను కొనసాగించడానికి శక్తి అత్యవసరం. ఈ శక్తి ప్రధానంగా ఆహారం ద్వారానే లభిస్తుంది. ముఖ్యంగా మానవాళికి అవసరమైన పోషకాలు పంటలు, పశుసంపద ద్వారా లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. పశువైద్యులు కేవలం జంతువులకు చికిత్స చేసే వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. ‘పశు వైద్యులు– ఆహార ఆరోగ్య సంరక్షకులు’ అనే థీమ్తో ఈ సంవత్సరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవటం అత్యంత సముచితం.పశు సంపద ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోషక అవసరాల నేపథ్యంలో పశు వైద్య రంగం ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. మన పూర్వీకులు పశువులను, ప్రకృతిని సమానంగా గౌరవించి, పర్యావరణహితమైన విధానాలతో వ్యవసాయం, జీవన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ సమతుల్య జీవన విధానాన్ని మళ్లీ ఆచరిస్తే, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన జీవితం అందించవచ్చు.ఆరోగ్యంపై సమగ్ర దృక్పథంపశువైద్యం కేవలం జంతువుల వైద్యంతో పరిమితం కాకుండా.. మనుషుల ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం వేర్వేరు కాదు అంతా ఒక్కటే (వన్ హెల్త్) అనే సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. ఈ మూడూ పరస్పరం అనుసంధానమైనవి. పశువైద్యులు పశువుల ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడటమే కాకుండా పరోక్షంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంగా ఉపయోగించే పశువులకు చికిత్స ఇచ్చేటప్పుడు మందుల అవశేషాలు పాలు, మాంసం, గుడ్లు వంటి ఆహార పదార్థాలలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం.సంక్రమిత వ్యాధుల నియంత్రణపశువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఉదాహరణకు: రేబీస్, బ్రూసెల్లోసిస్, టీవీ వంటివి. ప్రస్తుతం గుర్తించిన సంక్రమిత వ్యాధులలో సుమారు 60% జంతువుల ద్వారా వ్యాపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కనీసం 5 కొత్త వ్యాధులు జంతువుల నుండి మనుషులకు వస్తున్నాయని అంచనా. అరణ్య ప్రాంతాలలో మానవ జోక్యం పెరగటం ఈ వ్యాధుల వ్యాప్తికి ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో పశువైద్యులు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రపంచ ఆరోగ్యానికి అత్యంత పెద్ద సవాళ్లలో ఒకటి. అనవసరంగా, అధికంగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. ఆహారంలో అవశేషాలు చేరి ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి పశువైద్యులు బాధ్యతాయుతమైన ఔషధ వినియోగాన్ని ప్రోత్సహించాలి. పశుసంపద సుస్థిర ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తోంది. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అంచనాలప్రకారం, ప్రపంచానికి అవసరమైన ప్రోటీన్లో సుమారు 30–40% జంతువుల నుంచి లభిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం సుమారు 20% ఆహారం పశువ్యాధుల వల్ల కోల్పోతున్నాం. పశువుల విసర్జితాల పునర్వినియోగం ద్వారా సేంద్రియ వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం వర్థిల్లుతుంది. తద్వారా పర్యావరణం, పశువులు, మనుషుల మధ్య సమన్వయంతో ఆహార గొలుసును కాపాడుకోవచ్చు.14.5% వరకు పశువుల ఉద్గారాలుప్రస్తుతం పశువైద్య రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు వాతావరణ మార్పు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 14.5% హరిత గృహ ఉద్గార వాయువులు పశుసంపద నుంచి వెలువడుతున్నాయని అంచనా. దీర్ఘకాలిక సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే 10–15% వరకు పశువుల పెరుగుదల, వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది. అయితే, పశుసంపద మనకు ముఖ్యమైన ప్రోటీన్ వనరుగా కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పశువైద్యులు మీథేన్ ఉద్గారాలను తగ్గించే పద్ధతులు, సుస్థిర పశుసంవర్ధన విధానాలు, కార్బన్ క్రెడిట్ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించే విధంగా కార్బన్ మార్కెట్లో భాగస్వామ్యం కల్పించడం కూడా ఒక ముఖ్య లక్ష్యం.మీథేన్ ఉద్గారాలుప్రపంచంలో అత్యధిక పశుసంపద కలిగిన దేశం మనదే. ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం హరిత గృహ వాయువు ఉద్గారాల్లో సుమారు 14–16% వ్యవసాయం నుంచి వెలువడుతుంటే, అందులో పశుసంపద ఉద్గారాల వాటా 55–60%. పాల ఉత్పత్తిలో దేశంలోనే ముఖ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో వ్యవసాయ ఉద్గారాల్లో పశుసంపద వాటా 30–35%గా ఉంది. ముఖ్యంగా డెయిరీ రంగంలో గేదెల ద్వారా ఎక్కువ మీథేన్ వెలువడుతోందని అంచనా. నెమరు వేసేటప్పుడు జీర్ణప్రక్రియ వల్ల వెలువడే మీథేన్ పశు ఉద్గారాల్లో 85%ను ఆక్రమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే వ్యవసాయ ఉద్గారాలలో పశుసంపద ఉద్గారాల వాటా 25–30%. తెలంగాణలో గొర్రెలు, మేకల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఉద్గారాల తీరు భిన్నంగాఉంటుంది. తెలంగాణ ఎస్ఏపీసీసీ చెబుతున్న దాని ప్రకారం మీథేన్ ఉద్గారాలు పశువుల నుండే ఎక్కువ వెలువడుతున్నాయి.ముఖ్యమైన విశేషాలుప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలో పశుసంపద ఎక్కువ. కానీ తక్కువ. కానీ, ముఖ్యంగా ఒక్కో పశువు తలసరి ఉత్పాదకత తక్కువ. ప్రపంచంలోని గేదెల సంఖ్యలో 50% మన దేశంలోనే ఉంది. ఈ కారణంగా మొత్తం ఉద్గారాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి క్రమంలో వెలువడే ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. పశువైద్యులు కేవలం జంతువుల వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. పర్యావరణ సమతుల్యతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వన్ హెల్త్ దృక్పథంతో పశువైద్యులు సమగ్ర సుస్థిర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పశు వైద్యులు– ఆహార, ఆరోగ్య సంరక్షకులు’ అనటంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు. – డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు (99122 92229), అసిస్టెంట్ డైరెక్టర్(ఏహెచ్), ఏరియా వెటర్నరీ ఆసుపత్రి, జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా. saii@doctor.com(చదవండి: World Banana Day: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!) -
వ్యాయామం లేకుండానే 12 కిలోలు..! డాక్టర్ వెల్నెస్ మంత్ర
బరువు తగ్గడంలో పలువురు పలు విధానాలతో తగ్గించుకునే యత్నం చేస్తూ..ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎన్నో వెల్నెస్ మంత్రాలు పుట్టుకొస్తున్నాయి. అలా కాంకుండా వైద్యం అందించే ఓ డాక్టరే వ్యాయామం లేకుండా 12 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సర్వసాధారణంగా డాక్టర్లు ఎంతకాదన్న చిన్నపాటి వర్కౌట్లు లేదా వాకింగ్ అన్న చేస్తుంటారు. కానీ ఈ డాక్టర్ కేలరీల బేరీజు, వ్యాయమాలతో పనిలేకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఎలా తగ్గారో తెలిపారు. అంతేగాదు అందుకోసం ఎలాంటి ఫిట్నెస్ రూల్ పాటిస్తే మంచిదో కూడా సవివరంగా వివరించారు. బరువు తగ్గడానికి సంబంధించి..డైటింగ్ నుంచి వర్కౌట్ల వరకు పలు టిప్స్ ట్రెండ్ అవుతున్న తరుణంలో పూణెకు చెందిన డాక్టర్ మల్హర్ గన్లా అద్భుతమైన వెల్నెస్ మంత్ర గురించి తెలిపారు. తాను ఆ రూల్ని పాటించి ఎలా 12 కిలోలు తగ్గారో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆయన తన వెయిట్లాస్ జర్నీని రక్తపరీక్షతో ప్రారంభించినట్లు తెలిపారు. తనకు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే తనకు B12, డీ3 చాలా తక్కువగా ఉన్నాయనేది గుర్తించారు. తనకు అధికంగా ఆకలిగా ఎందుకో అనిపిస్తోంది అర్థం చేసుకోవడానికి ఈ బ్లెడ్ టెస్ట్ ఉపయోగింపడిందని చెప్పారు. ఆ వైద్యుడి మార్గదర్శకత్వంలో పోషకాహార లోపాలను సరిదిద్దుకోవడానికి సప్లిమెంట్లు, స్మూతీలు, సలాడ్లతో డైట్ని ప్రారంభించినట్లు తెలిపారు. వెయిట్లాస్ ప్లాన్..జంక్ ఫుడ్ నియంత్రణ)ఆయన పోషకాలు మెరుగుపడటం మొదలయ్యాక, ఆయన క్రమంగా ఉప్పు, చక్కెర,నూనెను మానేసినట్లు తెలిపారు. అయితే వీటన్నింటిని రాత్రికి రాత్రే మానేయలేదని, నెమ్మది నెమ్మదిగా దూరం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు బయటి భోజనంపై ఇష్టం పోవడానికి తనకు సుమారు ఒక నెల సమయం పట్టిందని కూడా అన్నారు.కార్బోహైడ్రేట్లను తగ్గించడంతర్వాత కార్బోహైడ్రేట్లను తగ్గించడం మొదలుపెట్టారు. ఆయన కార్బోహైడ్రేట్లను రోజుకు ఒక పూటకు (రాత్రి భోజనానికి) మాత్రమే పరిమితం చేశారు.అల్పాహారం: ప్రోటీన్ ఆధారితం (గుడ్ల వంటివి)మధ్యాహ్న భోజనం: పప్పు, కూర, సలాడ్ (రోటీ లేదా అన్నం వద్దు)తాను పాటించిన డైటింగ్ విధానాన్ని "23-1" రూల్గా పిలిచారు. ఈ విధానంలో శరీరం కొలెస్ట్రాల్పై ఆధారపడి పనిచేస్తుందట, అలాగే ఒక గంటపాటు కార్బోహైడ్రేట్లను తీసుకుంటుందని అన్నారు. ఆ తర్వాత తాను తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు తెలిపారు. అది కూడా స్వేచ్ఛయుతం, ఆరోగ్యప్రదంగా చేసినట్లు తెలిపారు. శరీరాన్ని కష్టపెట్టలా కాకుండా పండ్లు, ద్రవపదార్థాలపై ఆధారపడుతూ చేసినట్లు పేర్కొన్నారు. ఇది ఆయనకు మరింత బరువు తగ్గడానికి ఉపయోగపడిందన్నారు. కాలక్రమేణ తన ఆకలిలో పెద్ద మార్పును గమనించారు. దెబ్బకు తన నడుము చుట్టుకొలత సుమారు 29 అంగుళాలకు తగ్గిందని అన్నారు. ఇది సామాన్యులు సైతం సులభంగా అనుసరించగలిగేదని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వేడివేడిగా వడ్డించాలని ఎంత పనిచేశావ్ అమ్మ..!) -
కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుని స్నానం చేస్తున్నారా..? పాపం ఆ మహిళ..
చాలామంది కళ్లద్దాల కంటే కాంటాక్ట్ లెన్స్లే ధరిస్తుంటారు. ఎందుకంటే కళ్లజోడు అయితే ముఖంపై ఆనవాలు పడిపోవడం, లేది ఇబ్బందిగా ఉంటుంది. అదే కాంటక్ట్ లెన్స్లు కంఫర్ట్ తోపాటు చూపు మెరుగ్గా ఉంటుంది. అదే టైంలో ముఖానికి సరికొత్త లుక్ని అందిస్తుంది కూడా. అందుకే చాలామంది కాంటాక్ట్ లెన్స్ ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఇక్కడ ఈ యువత కూడా కాంటాక్స్ లెన్సులు ఉపయోగించేది. అయితే వాటిని ఉపయోగించే విషయంలో చూపిన చిన్న అజాగ్రత్త ఆమె కంటి చూపునే కోల్పోయే పరిస్థితికి దారితీసింది. అసలేం జరిగిందంటే.. అమెరికాకు చెందిన 20 ఏళ్ల గ్రేస్ జేమిసన్ కాంటాక్ట్ లెన్స్ ధరించే ప్రతి ఒక్కరికి ఇదొక పాఠంగా, హెచ్చరికగా ఉంటుందంటూ తన కథను షేర్ చేసుకుంది. సరదాగా సాగిన టూర్ ప్రయాణం నెలల తరబడి చీకటి, రోగ నిర్థారణతో ముగిసింది. ఆమె సరదాగా రిపబ్లిక్ పర్యటనకు వెళ్లడమే కష్టాలు తెచ్చిపెట్టింది. అమెరికాలో తన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఆ కష్టాలు పడింది. అక్కడ సరదాగా స్నాన చేస్తున్నప్పుడు కూడా కాంటాక్ట్ లెన్స్ ధరించే ఉంది. లెన్స్లు ఉపయోగించే వాళ్లు తరుచుగా చేసే పెద్ద తప్పిదమే ఇది. అలా స్నానం చేయడంతో జేమిసన్ కళ్లు అకాంతమీబా అనే సూక్ష్మజీవికి గురయ్యాయి. ఈ సూక్ష్మజీవి నీటిలో నివశిస్తుంది. అయితే నేత్ర వేద్యుడు ఆమె పరిస్థితిని తప్పుగా నిర్థారించి స్టెరాయిడ్ చుక్కల మందును సూచించాడు. ఆ మందులు తనకు సహాయపడకపోగా, ఇన్ఫెక్షన్ను మరింత తీవ్రతరం చేశాయి. కేవలం ఒక వారంలోనే అకాంతమీబా కెరటైటిస్ కారణంగా తన దృష్టిని పూర్తిగా కోల్పోయింది. ఒక్కసారిగా జేమిసన్కి జీవితం తలకిందులైనట్లుగా అనిపించింది. సరైన రోగనిర్ధారణ ఆలస్యం కారణంగా ఆ కంటి ఇన్ఫెక్షన్ తనను రెండు నెలలపాటు అంధురాలిగా గడిపేలా చేసిందని వాపోయింది. తాను ఇప్పుడు పక్కల నుంచి చూడగలను తప్ప ముందు నుంచి చూడలేనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ముందువైపు కనుపాపపై ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన మచ్చ పూర్తిగా కప్పివేయడం వల్ల చూడలేనని పేర్కొంది. అది మడ్డులాంటి తెల్లదనాన్ని మాత్రమే చూపిస్తుందని తెలిపింది. అందువల్ల దయచేసి తనలా నీటిలో ఉన్నప్పుడు కాంటాక్స్ లెన్స్లను ధరించొద్దని హెచ్చరిస్తోందామె. ప్రస్తుతం తాను కొనసాగుతున్న చికిత్సల వల్ల కొంత దృష్టిని పొందగలిగినప్పటికీ..మన కళ్లు మునపటిలా పనిచేయవని అంటోంది. తాను తన చూపుని మరింత మెరుగుపరుచుకునేలా భవిష్యత్తులో మరిన్ని శస్త్ర చికత్సలు చేయించుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. సో ఫ్రెండ్స్ స్నానం చేసేటప్పుడూ, ఈత కొట్టేటప్పుడూ, షవర్బాత్ సమయంలో కాంటాక్ట్ లెన్స్లను ధరించొద్దని అన్నారామె. ఎందుకంటే నీటిలో గనుక హానికరమైన సూక్ష్మజీవులు ఉంటే లెన్స్లకు అంటిపెట్టుకుని ఇలాంటిఇన్ఫెక్షన్ను కలిగించే అవకాశం ఉటుందని హెచ్చరిస్తోంది జేమిసన్.(చదవండి: ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్) -
ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్
బరువు తగ్గడం ఇటీవల కాలంలో ఓ క్రేజీ ట్రెండ్గా మారింది. అందులోనూ క్రాష్ డైట్లు, బరువు తగ్గే మందులు జోలి పోకుండా ఆరోగ్యకరంగా తగ్గడం అనేది అందర్నీ ఆకర్షిస్తున్న ఫిట్నెస్ మంత్రలా మారింది. పైగా అందరు ఆరోగ్య స్పృహతో బరువు తగ్గే ప్రయత్నమే చేస్తుండటం విశేషం. ఈసారి అలానే 40 ఏళ్ల తల్లి చాలా సింపుల్ డైట్ప్లాన్తో కేవలంలో ఏడు రోజుల్లో 5 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వారంలోనే ఇంతలా బరువు తగ్గేందుకు సమతుల్య ఆహారంపైనే ఆధారపడ్డానని చెబుతోందామె. మరి ఆమె ఎలాంటి డైట్ప్లాన్తో తగ్గిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.40 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి కంటెంట్ క్రియేటర్ రత్న చందు కేవలం ఏడు రోజుల్లోనే ఐదు కిలోలు బరువు తగ్గేందుకు ఆ డైట్ ప్లాన్ సహాయపడిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. తాను సమతుల్య ఆహారంపైనే ఫోకస్ పెట్టి బరువు తగ్గినట్లు వెల్లడించింది. మీ ఉదయాన్ని గోరువెచ్చని నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణంతో ప్రారంభించాలని సిఫార్సు చేశారు. ఆ తర్వాత జీలకర్ర, వాము, సోంపు గింజలతో ఇంట్లో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్ను తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల అల్పాహారానికి ముందు జీర్ణక్రియను నెమ్మదిగా యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. ఇక బ్రేక్ఫాస్ట్గా గిన్నెడు పండ్ల మిశ్రమం, నానబెట్టిన గింజలు, ఒక మిల్లెట్ దోస, బుల్లెట్ కాఫీ ఉంటాయి. ఉదయంపూట మిమ్మలని చురుకుగా ఉంచే శక్తివంతమైన ఆహారాల మిశ్రమం ఇది.ఉదయంపూట శక్తి కోసం..పాలకూర, దోసకాయ, అల్లంతో చేసిన గ్రీన్ జ్యూస్ తాగమని సూచించారు. కానీ వర్షాకాలంలో కడుపు సమస్యలను నివారించడానికి పచ్చి పదార్థాలను తినవద్దని కూడా ఆ కంటెంట్ క్రియేటర్ పేర్కొన్నారు.సమతుల్యమైన మధ్యాహ్న భోజనం ముఖ్యంమధ్యాహ్న భోజనం చాలా తేలిగ్గా ఉండాలని చెప్పారు. రోటీలు, వండిన కూరగాయలు, పప్పు, పనీర్, చోలే, గ్రీక్ యోగర్ట్, వంటి ప్రోటీన్ మూలం తీసుకునేలా చూసుకున్నట్లు తెలిపారామె. ఇందులో తగినన్ని కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్తో కూడిన శక్తిమంతమైన భోజనం.స్నాక్స్..ప్రాసెస్ చేసిన స్నాక్స్కు బదులుగా, వేయించిన శనగలు, మఖానా, వేరుశెనగలు, గ్రీన్ టీ తినమని తెలిపారు.తేలికపాటి రాత్రి భోజనం, త్వరగారాత్రి భోజనానికి కూరగాయల సూప్, కిచిడీ, లేదా పనీర్తో వేయించిన కూరగాయల వంటి వాటిని ఎంచుకున్నట్లు తెలిపింది. అయితే ఈ భోజనం తప్పకుండా సాయంత్రం ఏడు గంటలకల్లా తీసుకోవాలని అన్నారు.నిద్రపోయే ముందు అది తప్పనిసరి..పంచదార, పాలు కాకుండా ఒక కప్పు మునగ టీతో రోజును ముగించమని చెబుతోంది. ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం, యోగా వంటి వర్కౌట్లు చేయాలని నొక్కి చెప్పింది. కచ్చితంగా జంక్ఫుడ్కి మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండాలని సూచించింది. చివరగా ఇన్ఫ్లుయెన్సర్ ఒక వారంలో 5 కిలోలు తగ్గడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని చెబుతుండటం గమనార్హం. ఈ డైట్ప్లాన్ని చిన్నగా మొదలుపెడితేనే మొత్తం ఆరోగ్యంపై ప్రభావంతమైన మెరుగుదలను తప్పక చూస్తారని అంటోంది ఇద్దరు పిల్లల తల్లి రత్న చందు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ చిట్కాలను పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ratna Chandu (@glow_fit_mom)(చదవండి: ఇప్పటికీ ఆ దృశ్యం నీలినీడలా వెంటాడుతోంది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ) -
పీసీఓఎస్ ఉన్నా..బరువు తగ్గొచ్చు ఇలా..!
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తోంది. దీనికారణంగా మహిళలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటుంటారు. సంతానోత్పత్తి వయసు ఉన్న ప్రతి ఐదుగురి అమ్మాయిల్లోఓ ఒకరు ఈ సమస్య బారినపడతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి ప్రధాన కారణం జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు అని చెబుతున్నారు నిపుణులు. ఈ సమస్యను చక్కటి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో చక్కదిద్దొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నమహిళలు తీసుకోవాల్సిన ఆహారాలు గురించి వెల్లడించారు. అవేంటంటే..వాటిలో గుడ్లు మంచి ఆహారమని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండుగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. అవకాడోలు హార్మోన్ల నియంత్రణకు సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయట. అలాగే బెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా, తీపి తినాలనే కోరికను నివారించేలా తక్కువ చక్కెర, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.చియా గింజలు మెరుగైన జీర్ణక్రియకు, మంచి ఫైబర్కు ఉపయోగపడతాయని అన్నారు. అలాగే పెరుగు పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక జీవక్రియకు మద్దతిస్తుందని అన్నారు. దీంతోపాటు ఈ సమస్యను తీవ్రతరం చేసే ఆహారాలకు దూరంగా ఉండేలా కేర్ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తరచుగా శక్తిని కోల్పోయేలా చేస్తాయి. అలాగే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని చెప్పారు. కాబట్టి సాధ్యమైనంతవరకు వాటిని పరిమితం చేయాలని అన్నారు. ఆహారం తోపాటు చక్కటి జీవనశైలిని పాటించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ..సమతుల్య భోజనం చేసేలా స్థిరత్వాన్ని పాటించాలన్నారు. చిన్నచిన్నగా పాటిస్తే..మెత్తం ఆరోగ్యంలో పెద్ద మార్పులోను, మెరుగుదలను చూడగలమని అన్నారు. డాక్టర్ ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ICAR-నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్ -
ఫీటల్ మెడిసెన్: పిండ దశలో బ్రహ్మాండ వైద్యం..
కడుపులో ఉన్న బిడ్డకు వచ్చే సమస్యలను పిండదశలోనే సరిచేయగలిగేంత పరిజ్ఞానం ఇప్పుడుంది. జన్యుసమస్యల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ... ఒకప్పటితో పోలిస్తే ‘ఫీటల్ మెడిసిన్’ అనే వైద్యవిభాగంలోని పురోగతితో బిడ్డ పిండదశలో ఉన్నప్పుడు కనిపించే సమస్యలకు పరిష్కారాలు అందించగలగడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు కాబోయే తల్లిదండ్రులకు ఉండే భయాలూ, ఆందోళనలకు ఎలాంటి పరిష్కారాలు దొరుకుతున్నాయో తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం.ఒక కొత్త జీవి ఆవిర్భవించే ప్రక్రియ ఎంత సంక్లిష్టమో, ఎంతగా అబ్బురం కలిగించే అంశమో తెలుసుకోవడం ప్రతినిత్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ బిడ్డ ఉద్భవించేప్పుడు మొట్టమొదట జరిగేదే ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. పురుషుడి శుక్రకణం, అలా మహిళ అండంతో కలిసిన ఆ క్షణంలో అక్కడ ఓ అద్భుతమైన వెలుగు ఓ ఫ్లాష్లైట్లా తటాల్న వెలుగుతుందంటారు వైద్య నిపుణులు. అలా ఫ్లాష్లా వెలిగే ఆ లైట్ను ‘జింక్ స్పార్క్’ అని పిలుస్తారు. అలా మొదటి అద్భుతం నుంచి ఇక పిండం పెరుగుతుండే అనుక్షణం కడుపులోపల అబ్బురాల వరస అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.46 క్రోమోజోముల సంఖ్య కొనసాగేందుకు... స్త్రీ, పురుషులిద్దరి అండ, శుక్రకణాల్లో చెరిసగాలే...ఓ జీవి ఫలానా జీవిగానే కొనసాగేందుకు జీవిలోని క్రోమోజోముల సంఖ్య కీలకమవుతుంది. ఆ జీవిలోని క్రోమోజోముల సంఖ్యను బట్టే అది ఏ జీవి అన్నది తెలుస్తుంది. ఇలా మనిషి కణంలోని క్రోమోజోముల సంఖ్య 46. ఈ సంఖ్య అన్నది ఎన్ని తరాలు గడుస్తున్నా క్రమబద్ధంగా కొనసాగుతూ ఉండటం కోసం మహిళలోని అండం 23 క్రోమోజోములుగా, పురుషుడిలోని శుక్రకణం 23 క్రోమోజోములుగా విడిపోతాయి. మళ్లీ శుక్రకణాలూ, అండమూ మహిళలో సంయోగం చెంది, 46 క్రోమోజోములున్న ఒకే ఒక్క కణమున్న పిండం నుంచి అనేకానేక కణాలు (సెల్స్)గా విడిపోయి, ఆ కణాలు మళ్లీ అనేక రకాల కణజాలాలు(టిష్యూస్)గా, ఆ కణజాలాలన్నీ ప్రత్యేక అవయవాలుగా, ఆ అవయవాలు ఒకదానితో మరొకటి అనుసంధానితమవుతూ ప్రత్యేక వ్యవస్థలు (సిస్టమ్స్)గా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. పిండం పెరుగుదల అన్నది ఇంతటి సంక్లిష్టమైనది. ఉదాహరణకు గుండె కణాలూ, కణజాలాలూ కలిసి గుండెగా రూపొంది, రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడతాయి. అదే జీర్ణకోశం, కాలేయం, పేగులూ లాంటి కణాలు, కణజాలాలూ కలిసి జీర్ణవ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇలా మనదేహంలోని రకరకాల వ్యవస్థలన్నీ రూపుదిద్దుకుంటాయి.లోపరహితంగా జరిగే ప్రక్రియ ఇది... అయితే ఒకవేళ లోపమే జరిగితే... ఇంతటి సంక్లిష్టమైన పిండం పెరుగుదల ప్రక్రియ దాదాపు పూర్తి లోపరహితంగా జరుగుతుంటుంది. అలా లోపరహితంగా జరిగినప్పుడే ఒక ఆరోగ్యకరమైన బిడ్డ ఆవిర్భవిస్తుంది. అయితే ఈ సమయంలో ఎక్కడైనా చిన్నపాటి లోపం జరిగినప్పుడు అది పుట్టబోయే బిడ్డకు వైకల్యాన్నో, ఆరోగ్య సమస్యనో తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలను పిండ దశలో తెలుసుకోవడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. ఇందుకు ఉపయోగపడే వైద్య శాస్త్ర విభాగమే ‘ఫీటల్ మెడిసిన్’. గర్భవతికి సంబంధించిన అధ్యయనాలతో కూడిన ‘ఆబ్స్టెట్రిక్స్’కు కొనసాగింపుగా ఇటీవల ఈ ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రం కొత్తపుంతలు తొక్కుతూ చాలా చాలా వినూత్న విషయాలను తెలుసుకుంటోంది. పిండదశలో వచ్చే ఎన్నో ఎన్నో సమస్యలకు పరిష్కారాలూ కనుగొంటోంది. పుట్టుకతో రాబోయే కొన్ని సమస్యలు... ఉదాహరణకు కొన్ని గుండె సమస్యలు వస్తే... దాన్ని కడుపులోని పిండానికే శస్త్రచికిత్స చేసి మరీ చక్కదిద్దేంత పరిజ్ఞానం, నైపుణ్యం ఇప్పుడు అభివృద్ధి అయ్యాయి.కొన్ని లోపాలేమిటి... ఆ లోపాలతో వచ్చే సమస్యలేమిటి...?సాధారణంగా 90 శాతం ప్రెగ్నెన్సీలలో అంతా సజావుగా జరిగిపోయినా, కొందరిలో మాత్రం మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే ఆ బిడ్డకు పిండదశలోనే కొన్ని సమస్యలు కనిపించవచ్చు. పుట్టుకతోనే వచ్చే ఆ సమస్యలను కంజెనిటల్ సమస్యలుగా పేర్కొంటారు. అందులో కొన్నింటికి చికిత్స అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్ పాలెట్) వంటి చిన్న సమస్యలను చిన్నపాటి శస్త్రచికిత్సతో సరిదిద్దవచ్చు. మరికొన్ని పెద్ద సమస్యలను ఇలా బిడ్డ పుట్టిన వెంటనే చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డకు హెర్నియా సమస్య (కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా) ఉంటే పుట్టిన వెంటనే వెంటిలేటర్పై ఉంచి మరీ శస్త్రచికిత్స చేయాలి. కాకపోతే కాస్తంత కష్టసాధ్యమైన ఈ విషయానికి మంచి నైపుణ్యంతో కూడిన చికిత్స అవసరం. పరిష్కారం లేని సమస్యలూ ఉండవచ్చు... ఈ క్రమంలో పిండానికి ఉన్న మరికొన్ని సమస్యలు సరిదిద్దలేనంత సంక్లిష్టంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు అనెన్సెఫాలీ అనే కండిషన్లో బిడ్డలో తల సరిగా రూపొందదు. తలలోని ఎముకలు సరిగా ఏర్పడవు. ఇలాంటి సందర్భాల్లో ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే సమస్య తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన నిర్ణయమేమిటి అన్నది జన్యుపరీక్షల నిపుణుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ తర్వాత తెలిసే అవకాశాలున్నాయి. అయితే ఇది త్వరగా జరగాలి. ఎందుకంటే... ఒకవేళ బాగా ఆలస్యమైతే... పిండం బాగా పెరిగాక ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే... ఇది పెద్దప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టే అవకాశముంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఫీటల్ మెడిసిన్ విభాగంలోని డయాగ్నసిస్ (సమస్య నిర్ధారణ)పై ఆధారపడి ఉంటాయి. ఆయా సమస్యలను అనుసరించి, పిండదశలోనే చికిత్స చేయాలా లేక పుట్టిన వెన్వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉందా అన్నది నిర్ణయం తీసుకుని, ఆ ప్రకారం ప్రసవాన్నీ, అటు తర్వాత బిడ్డకు అవసరమైన చికిత్సలనూ డాక్టర్లు ప్లాన్ చేస్తుంటారు.పిండం పెరుగుదల – నిరంతర పర్యవేక్షణ...ఓ మహిళ గర్భందాల్చాక డాక్టర్లు (సాధారణంగా ఆబ్స్టెట్రీషియన్లు / గైనకాలజిస్టులు) నిర్ణీత వ్యవధుల్లో మహిళను చెకప్కు రమ్మని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిండం క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న కొద్దీ... ఏయే వారానికి లేదా ఏయే త్రైమాసికానికి (ట్రైమిస్టర్కు) ఎంత పెరగాలో, ఏయే వారాల్లో ఏయే అవయవాలు రూపుదిద్దుకోవాలన్న అంశాలను బట్టి... పిండం పెరుగుదల అన్నది ఆయా వారాల్లో అలాగే జరుగుతోందా లేదా అని డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. బిడ్డలో ఆ ఎదుగుదల అన్నది నార్మల్గానే ఉంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిందేమీ ఉండదు. అంతా సజావుగా జరిగి, నెలలు నిండాక ప్రసవం తర్వాత నార్మల్ బిడ్డ పుడతాడు.‘కలర్ డాప్లర్’ సాంకేతికతతో... కడుపులోనే బిడ్డ సమస్యలు తెలుసుకునే అవకాశం...ఒకవేళ కడుపులోని బిడ్డలో నార్మల్ పెరుగుదల కనిపించకపోయినా లేదా ఏవైనా అవంతరాలూ అవకరాలూ (అనామలీస్) కనిపిస్తుంటే... దానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరముంటుంది. దాని ప్రకారం తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ‘ఫీటల్ మెడిసిన్’ సహాయపడుతుంది. ఇప్పుడున్న అత్యాధునిక పరిజ్ఞానంతో కడుపులోని బిడ్డ బరువునూ తెలుసుకునేంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందుకు సహాయపడే అత్యాధునిక వైద్య విజ్ఞానమే ‘కలర్ డాప్లర్’ సాంకేతికత! దీని సహాయంతో బిడ్డలోని ఎదుగుదల ఏయే సమయాల్లో ఎంత ఉండాలో, ఆయా టైములో అలా కొనసాగుతోందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా బిడ్డ పుట్టబోయే సమయాన్ని కూడా దాదాపుగా సరిగానే అంచనా వేయడమూ జరుగుతుంది.డాక్టర్లు తెలుసుకునే మరికొన్ని సమస్యలూ... పరిష్కారాలు...ఓ మహిళ గర్భవతి అని తెలియగానే ప్రతి డాక్టరూ ఆమెకు తొలుత సూచించే టాబ్లెట్లు... ‘ఫోలిక్ యాసిడ్’ మాత్రలు. పాలకూరలాంటి మామూలు ఆకుకూరల్లో ఉండే ఒక రకం పోషకమే ఈ ‘ఫోలిక్ యాసిడ్’. ఈ పోషకం వల్ల పుట్టబోయే బిడ్డలో... మున్ముందు వెన్నుపాముగా రూపొందబోయే ‘న్యూరల్ ట్యూబ్’ సరిగ్గా ఏ లోపమూ లేకుండా రూపుదిద్దుకుంటుంది. ఇలా న్యూరల్ ట్యూబ్ ఏర్పడటాఇకి అవసరమైన ఆ సంకేతాన్ని తీసుకెళ్లాల్సిన ఒక ‘డీఎన్ఏ’ సరైన రీతిలో ఆ సంకేతాన్ని తీసుకెళ్లేలా ఈ పోషకం సహాయపడుతుంది. మామూలు ఆకుకూరలతోనే అందే ఈ పోషకం ఒకవేళ తగినంతగా అందకపోతే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ (లోపం) ఏర్పడేందుకు అవకాశం ఉంది. అందుకే డాక్టర్లు తల్లికాబోతోందన్న విషయం తెలియగానే ఈ లోపాన్ని ముందే నివారించేందుకు ఈ ‘ఫోలిక్ యాసిడ్’ మాత్రలను సూచిస్తుంటారు. ఒకవేళ ఆ పోషకం లోపం ఉండి... సదరు డీఎన్ఏ ఆ నిర్దిష్టమైన సంకేతాలను సరిగా అందించకపోతే... పుట్టబోయే బిడ్డలో వెన్నుపాముకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. వీటినే వైద్య పరిభాషలో ‘స్పైనా బైఫిడా’ అంటారు. ఈ సమస్య వల్ల బిడ్డ పురిటిలోనే చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బతికితే శారీరకంగానూ, మానసికంగానూ వైకల్యం వచ్చే అవకాశం ఉంది.క్రోమోజోమల్ సమస్యలు...ముందుగా చెప్పినట్టుగా ప్రతి జీవిలోని ప్రతి కణంలోనూ నిర్దిష్టంగా నిర్ణీత క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. వాటిని బట్టే అది ఏ జీవి అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మానవుల్లోని క్రోమోజోముల సంఖ్య 46 అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే... పుట్టబోయే బిడ్డలో జన్యులోపాలు ఏర్పడటాయి. దాంతో అలా జన్యులోపంతో పుట్టే బిడ్డలకు బుద్ధిమాంద్యమూ, అవయవలోపాలూ వచ్చే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ‘డౌన్స్ సిండ్రోమ్’. ఇలా డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను తెలుసుకోడానికి ‘ద కంబైన్డ్ టెస్ట్’ అనే పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో తల్లి రక్తాన్ని, పిండం విడుదల చేసే ప్రోటీన్లను కలిపి పరీక్షిస్తారు. అందుకే దీన్ని కంబైన్డ్ టెస్ట్ అని పిలుస్తారు. ఈ పరీక్షను గర్భధారణ జరిగిన 11వ వారం, 13వ వారంలో నిర్వహిస్తారు. ఈ లోపాలను తెలుసుకునేందుకు పరీక్షలు... స్పైనా బైఫిడా లాంటి లోపాలు వచ్చే మరికొన్ని అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలను తప్పనసరిగా చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ ‘ఫీటల్ మెడిసిన్’లో భాగమే. ఉదాహరణకు ఈ వెన్నుపాము సమస్య అయిన ‘స్పైనా బైఫిడా’ను నిర్ధారణ చేసేందుకు ట్రిపుల్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేస్తారు. ఇందులో ఆల్ఫా ఫీటో అనే ప్రోటీన్ను పరిశీలిస్తారు. దాంతో పాటు బీటా హెచ్సీజీ పాళ్లు, ఎస్ట్రాడోయిల్, ఇన్హిబిన్ మోతాదులను తెలుసుకుంటారు. ఈ పరీక్షను గర్భం ధరించిన 15వ వారం నుంచి 20 వ వారం మధ్యన చేస్తారు. అయితే ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చినంతనే బిడ్డకు తప్పనిసరిగా అంగవైకల్యం కలుగుతుందని చెప్పడానికి ఉండదు. కాకపోతే ఇలా ΄పాజిటివ్ ఫలితం వచ్చినప్పుడు ఆ తర్వాత గర్భం దాల్చిన 16వ వారంలో తప్పనిసరిగా సీవీఎస్ అనే పరీక్ష„ý నూ, యామ్నియోసెంటైసిస్ అనే పరీక్షలను నిర్వహించి, తొలుత కనిపించిన పాజిటివ్ ఫలితం నిజంగా వాస్తవమైనదేనా లేక తప్పుడు పాజిటివా (ఫాల్స్ పాజిటివ్నా) అన్నది నిర్ధారణ చేస్తారు.జెనెటిక్ సోనోగ్రామ్ పరీక్షలతో...పుట్టబోయే బిడ్డ అవయవ నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న సంగతి ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇందులో క్రోమోజోమల్ సమస్యలతో పాటు... బిడ్డలోని అంతర్గత అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లూ–చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ఆబ్డామినల్ అవయవాల (కడుపులోపలి భాగాల) గురించి తెలుసుకోవచ్చు.జెనెటిక్ కౌన్సెలింగ్ అంటే...ఇలా అవసరమైనప్పుడుగానీ లేదా డాక్టర్లు ఫలానా పరీక్ష చేయాలని భావించినప్పుడుగానీ... నిర్వహించే పరీక్షల్లో పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన సమస్యలున్నాయని తెలిస్తే... అప్పుడవి మున్ముందు జరగబోయే గర్బధారణల్లో (అంటే తొలిచూలు బిడ్డ తర్వాతి ప్రెగ్నెన్సీలలో) తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. దాన్ని బట్టి తల్లిదండ్రులు తమ గర్భం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఒకవేళ అలాంటి జన్యుపరమైన సమస్యలేమీ లేవని తేలితే అప్పుడు తల్లిదండ్రులు నిర్భయంగా తమ ప్రెగ్నెన్సీని కొనసాగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫీటల్ మెడిసిన్ విభాగపు నిపుణులు... తల్లిదండ్రులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ తొలిచూలు బిడ్డకు ఏవైనా క్రోమోజోమల్ సమస్యలు ఉన్నప్పుడు... ఆ తల్లిదండ్రులిద్దరూ దగ్గరి రక్తసంబంధీకులా అన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా రెండో గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. తొలిచూలు బిడ్డకు కొన్ని రక్త పరీక్షలు చేయించి వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా మలిచూలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మొదటి నాలుగు నెలల్లోనే కొన్ని పరీక్షలు చేయించాలని సూచిస్తారు. ఆ బిడ్డకు ఏవైనా సమస్యలు రాబోతున్నాయా అని పరీక్ష చేసి, ఆ పరీక్షల ఫలితాలను బట్టి కొన్ని వైకల్యాలు వచ్చే అవకాశం ముందే తెలుసుకుంటే, దానికి అనుగుణంగా తల్లిదండ్రులకు సలహాలు ఇస్తారు.ఒకవేళ దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారైతే... సాధారణంగా వారిద్దరి జన్యువులూ ఒకేలా ఉండే అవకాశాలు ఎక్కువ. అంటే ఇద్దరిలోనూ రిసెసివ్ జీన్సే ఉంటాయి. దాంతో ఆటోజోమల్ రెసెసివ్ జెనెటిక్ డిసీజెస్ అని పిలిచే జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ ఒకే తరహా లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు లేక΄ోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలెక్కువ. అందుకే రక్తసంబంధీకుల్లోనే పెళ్లిళ్లు జరిగితే జన్యుపరమైన లోపాలు వచ్చే ముప్పు (రిస్క్) ఎక్కువనీ, అందుకే వీలైనంత వరకు రక్తసంబంధీకుల్లో వివాహాలు వద్దంటూ ఆధునిక ‘ఫీటల్ మెడిసిన్’ నిపుణులు సూచిస్తుంటారు. రక్తసంబంధీకుల బిడ్డల్లోనే జన్యుసమస్యలు ఎందుకు ఎక్కువ? చాలా సందర్భాల్ల రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (కన్సాంజియస్ మ్యారేజెస్) జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని చాలా మంది చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఓ కొత్త జీవి ఆవిర్భవించడానికి తల్లికి సంబంధించిన 23 క్రోమోజోములు, తండ్రికి చెందిన 23 క్రోమోజోములు కలిసి ఒక పిండం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రోమోజోములు ‘జన్యువుల’తో రూపొందుతాయి. జన్యువులు అంటే తల్లిదండ్రుల నుంచి వివిధ అంశాలను బిడ్డలకు చేరవేసే కణంలోని లోపలి భాగాలు అని అర్థం. దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాకుండా, ఒకరికొకరు సంబంధం లేని వేర్వేరు కుటుంబాల వారైతే... అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఫలానా ఓ జన్యువు దంపతులిద్దరిలోనూ ఒకరిలో లోపంతో ఉందని అనుకుంటే ఆ జన్యువును ‘రిసెసివ్ జీన్’ అంటారు. ఉదాహరణకు తండ్రిలోని ఓ జన్యులో లోపం ఉందనుకుందాం. అప్పుడు ఆ జన్యులోపాన్ని నివారించడానికి తల్లిలో ఉండే అదే జన్యువు... లోపంతో కూడిన తండ్రి తాలూకు జన్యువును డామినేట్ చేస్తుంది. ఇలా డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్ జీన్’ అంటారు. దాంతో ఈ డామినెంట్ జీన్ కారణంగా బిడ్డకు రాబోయే ఆ లోపాన్ని అధిగమించడానికి వీలవుతుంది.ఫీటల్ థెరపీస్ అంటే...?పుట్టబోయే బిడ్డకు పిండ దశలోనే ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు మొదటే నిర్ధారణ చేస్తే... అప్పుడు ఆ బిడ్డకు పుట్టీపుట్టగానే అవసరమైన చికిత్స అందించేందకు వీలుంటుంది. (అందుకే ఇలాంటివేవైనా సమస్యలు ఉన్నట్టు పిండ దశలో ఉన్నప్పుడు చేసే వైద్య పరీక్షల్లో తెలిస్తే... అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో (టెరిషియరీ సెంటర్)లో ప్రసవం జరిగేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది). ఇక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కడుపులో ఉండగానే, ఆ పిండ దశలోనే చికిత్స చేయాల్సి రావచ్చు. ఇలా చేసే చికిత్సను ‘ఫీటల్ థెరపీ’గా పేర్కొంటున్నారు. డాక్టర్ ఎ మిత్రవింద, సీనియర్ కన్సల్టెంట్, ఫీటల్ మెడిసిన్(చదవండి: కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..) -
60లోనూ 40లా.. వృద్ధురాలి యంగ్లుక్!
వయసు పైబడిన..చిన్నవాళ్లలా యంగ్లుక్లో కనిపించాలని పరితపిస్తుంటారు చాలామంది. అయితే అందుకు తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకోరు. అలాగే శరీరానికి కావాల్సినంత వ్యాయామాలు వంటి వాటిపై దృష్టిసారించరు. యంగ్ లుక్ అటుంచి..ఆరోగ్యంగా ఉండటం కోసం అయినా చేయరు..ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు అని అంటోంది ఈ చెన్నైకి చెందిన వృద్దురాలు. 67 ఏళ్ల వయసున్న ఆమెని చూస్తే జస్ట్ 40 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ వృద్ధురాలి ఆహార్యం. మరి ఆమె చెప్పే పిట్నెస్ రహస్యలేంటో సవివరంగా చూద్దామా..!.కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఆ వృద్ధరాలి గురించి ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఆమెను ఫిట్నెస్ రొటీన్ గురించి అడగడం చూడొచ్చు.మంచి ఆరోగ్యానికి వ్యాయామమే కీలకంవయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది; ఇది సాధారణ జీవశాస్త్రం. అయితే, క్రమం తప్పని వ్యాయామంతో మన శరీరానికి శిక్షణ ఇస్తే..న క్రియాత్మక బలం, సామర్థ్యాలను నిలుపుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అంటోందామె. ఆమె ఉదయం 5:30 నుంచి 5:45 గంటల మధ్య నిద్రలేచి, ఇంటి పనులు ముగించుకుని, యోగాతో రోజుని ప్రారంభిస్తానని అంటోంది. ఇక ఉదయం 7:30 గంటలకు పార్కులో వాకింగ్ చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి కేవలం వాకింగ్ సరిపోదని అన్నారు. శక్తినిచ్చే వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే తానేమి సప్లిమెంట్లని ఉపయోగించనని అన్నారు. అల్పాహారంగా కేవలం మజ్జిగ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో మాత్రం అవసరమైన పోషకాలు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం ప్రోటీన్ కోసం చికెన్, మటన్ లేదా గుడ్లతో కూడిన చాలా మంచి భోజనం చేస్తాను. ప్రత్యేకంగా పాటించే డైట్ అంటూ ఏమి లేదని అన్నారామె. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతానని అన్నారు. భోజనం మధ్యలో ఆకలి వేస్తే నచ్చిన పండ్లను తీసుకుంటానని చెప్పారు. కానీ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటానని అన్నారు. మంగళవారం, శనివారాలు తప్పనిసరిగా ఉపవాసం ఉంటానని చెప్పారు. గృహిణిగా ఉంటూనే ఆరోగ్యం పట్ల ఇంత కేర్ తీసుకుంటున్నా ఆమె అందరికీ స్ఫూర్తి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం చేయడం తదితరాలే అత్యంత ముఖ్యమని అని చెబుతున్నారామె. ఎక్కువగా మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడితేనే ఏదైన సాధ్యమని అన్నారు. ఆడవాళ్లు, ఇంట్లో శాంతి, సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రధానమని అన్నారు. అలాగే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే విషయాలను పట్టుకుని వేలాడకుండా..జీవితంలో ఏది వచ్చినా..యథాతథంగా స్వీకరించడం అత్యంత ముఖ్యం అని అన్నారు. అప్పుడే మనం శారీరకంగా ఫిట్గా ఉండగలుగుతామని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Jhaal Muri: మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..) -
క్షణాల్లో గాఢ నిద్ర పట్టాలంటే నిద్ర మాత్రలు వద్దు.. రాత్రి బాగా నిద్రపోవడానికి ఏం చేయాలి..?
-
'లివర్' అనే నేను..! జస్ట్ ఏడంగుళాల్లో..
లివర్ చాలా కీలకం. ఇది పనిచేయకపోతే మాత్రం ఏ పరికరాలూ, ఉపకరణాలూ రక్షించలేవు. అయితే లివర్ (కాలేయం) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. లివర్ దెబ్బతిన్నప్పుడల్లా ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్ చేసుకుంటూ ఉండడంతో పాటు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేడు వరల్డ్ లివర్ డే. ఈ సందర్భంగా కాలేయం ఎంత కీలకమైనదో, ఎంతటి వైవిధ్యమైన పనులు చేస్తుందో చెప్పడంతోపాటు ఈ ఏడాది థీమ్... సాలిడ్ హ్యాబిట్స్ – స్ట్రాంగ్ లివర్ అంటే ‘దృఢమైన అలవాట్లతో – బలమైన కాలేయ రక్షణ’ పొందడం ఎలాగో తెలుసుకుందాం.లివర్ పని సైలెంట్. కానీ దాని యాక్టివిటీస్ వైబ్రెంట్. ఎందుకంటే ఓ వ్యక్తి గోల్ఫ్ ఆడాలన్నా, బాల్ కొట్టాలన్నా, కాలు కదపాలన్నా, చెయ్యి కదిలించాలన్నా, తిన్నది అరగాలన్నా, పరుగులు తీయాలన్నా అది కాలేయం చేసే జీవక్రియల వల్లనే సాధ్యమవుతుంది. వాటిలో కొన్నింటిని చూద్దాం.ఉన్నది ఏడంగుళాల స్థలంలోనే... కానీ ఎకరాల కొద్దీ కెమికల్ ఫ్యాక్టరీలంత పని... లివర్.. జస్ట్... ఏడంగుళాల విస్తీర్ణంలోనే... ఎకరాల కొద్దీ విస్తరించి ఉండే కెమికల్ ఫ్యాక్టరీలంత సంక్లిష్టమైన పనులు చేస్తుంటుంది. చాలామంది అపోహ ఏమిటంటే... లివర్ జీర్ణక్రియలకు పనికివచ్చే ఎంజైములు విడుదల చేసి... అన్నం అరుగుదలకే పరిమితమవుతుందని. కానీ పొరబాటున ఓ వ్యక్తి వేలు తెగిందనుకోండి. అతడి రక్తస్రావం ఆగడానికి అవసరమైన రక్తం గడ్డకట్టించే ‘బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ వరకు అదే ఉత్పత్తి చేస్తుంది. వ్యాధులను ఎదుర్కోవడానికి కావాల్సిన యాంటీబాడీస్ పుట్టేందుకు తోడ్పడుతుంది. టాబ్లెట్ వేసుకుంటే వచ్చే సైడ్ఎఫెక్ట్లు ఇచ్చే చిరు విషాలను విరిచేయడం దగ్గర్నుంచి... మద్యం తాగేప్పుడు పుట్టే పెను విషాలను నిర్వీర్యం చేస్తుంది. గుండెకు ఓ సేఫ్టీ వాల్వ్లా పనిచేస్తూ... హెపాటిక్ వెయిన్ ద్వారా గుండెకు వెళ్లే రక్తం వెళ్లేటప్పుడు ఆరు నుంచి పది సెకండ్ల పాటు ఆ రక్తపు వేగాన్ని తగ్గించి, ఎక్సెస్ రక్తంతో గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా కానాడుతుంది.దేహంలో తగినన్ని లవణాలు ఉంచేందుకు కిడ్నీపైనుండే అడ్రినల్ గ్రంథులు ప్రయత్నిస్తున్నప్పుడు... అవి పరిమితికి మించి ఉండకుండా చూసేది లివరే. ప్రతి ఒక్కరి ఒంట్లో ప్రతి సెకండ్కూ లక్షలాది ఎర్ర రక్తకణాలు పుడతాయీ, చనిపోతుంటాయి. వాటిని పుట్టించడం, గిట్టించడం కాలేయం పనే! ఎవరూ ఊహించడానికి కూడా వీల్లేని ఇలాంటి పనులెన్నో లివర్ చేస్తుంటుంది.ఆ శక్తే వరమూ... శాపం కూడా! కాలేయంలోని 75 శాతం పనిచేయక పోయినా అది మళ్లీ రిపేర్ చేసుకుని మామూలుగా కాగలదు. ఇంకా అంతకంటే మించితే అది ప్రమాదకరం. అంటే కాలేయం సామర్థ్యం 25 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు ప్రమాదం ఎక్కువ. లివర్లో క్యాన్సర్గడ్డ ఏదైనా వస్తే చుట్టూ చాలావరకు తొలగించాక మనిషి మళ్లీ మామూలైనొతాడు. తీసేసిన లివర్ భాగం మళ్లీ పెరుగుతుంది. కానీ అంత ఎక్కువ సామర్థ్యం ఉన్నందున ఏదైనా ప్రమాదవశాత్తూ లివర్కు సిర్రోసిస్ అనే సమస్య వచ్చి పనిచేయడం మందగిస్తుంటే, లక్షణాలేవీ కనిపించవు కాబట్టి అది ఎక్కువగా పాడయ్యేవరకూ ఆ విషయమే తెలియదు. ఇది ఒకరకంగా శాపం. లివర్లో కొవ్వుకణాలు పేరుకుపోవడం వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, బాగా మద్యం తీసుకోవడం వల్ల వచ్చే ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, సిర్రోసిస్ వంటి సమస్యలు లివర్కు వస్తుంటాయి. బాగా బరువు పెరుగుతుంటే, దాన్ని అదుపు చేసుకోవాలి. దేహంపైన రక్తనాళాలు సాలీడు ఆకృతిలో కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా నీరు పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.డాక్టర్ ఆర్.వి. రాఘవేంద్రరావు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ –లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ (చదవండి: Summer Health tips: సమ్మర్లో హైడ్రేషన్ కోసం..! కానీ ఈ పొరపాట్లు చెయ్యొద్దు..) -
సమ్మర్లో హైడ్రేషన్ కోసం..!
వైశాఖం రాకమునుపే సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడి సెగ మాములుగా లేదు. ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలు, గర్భిణిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా డీ హైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందరూ సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండటం కోసం.. నీళ్లు దగ్గర నుంచి పండ్లు, తీసుకునే ఆహారం వరకు ఈ పొరపాట్లు చేస్తుంటారని హెచ్చరిస్తున్నారు. దాంతో తీవ్ర డీహైడ్రేషన్ బారినపడి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటారుని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండకాలం హైడ్రేషన్గా ఉండటం కోసం చేయకూడని పొరపాట్లు ఏంటో ఆరోగ్య నిపుణుల మాటల్లోనే చూద్దామా..!.ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడందాహం వేసిందనో మరే కారణంగానో ఒకేసారి ఎక్కువ నీరు తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల ఎక్కువ పరిమాణాంలోని నీరు కణాలకు సమర్ధవంతంగా అందుకుండానే బయటకు వెళ్లిపోతుందట. అరలీటరు నీరు తాగితే నాడీ వ్యవస్థ కార్యచరణ మెరుగ్గా ఉంటుందట. అంతకుమించి తాగితే శరీరంలోని కణాలకు తేమ అందకుండా పోతుందని అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు.నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఎంచుకోకపోవడం..శరీరానికి తేమను అందించడానికి కేవలం నీరు మాత్రమే కాకుండా ఆహారం కూడా తోడ్పడుతుంది. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మజాతి పండ్ల వంటివి ద్రవాల శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి వేడి వాతావరణంలో తేమను నిలుపుకోవడానికి, శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుడీహైడ్రేషన్ను తీవ్రతరం చేసే పానీయాలు ..చాలామంది ఎంత ఎండకాలం అయినా.. కాఫీ, టీలు పడాల్సిందే లేదంటే కష్టం. వేసవిలో ఇవి శరీరానికి తగినంత నీరు సమర్థవంతంగా అందకుండా చేస్తుందట. అలాగే కూల్డ్రింక్లు, ఇతర పానీయాలు శరీరానికి నీరు అందుతుందన్న భావనను కలిగిస్తాయి గానీ ఇవన్నీ డీహైడ్రేషన్ను మరింత తీవ్రతరం చేస్తాయని అంటున్నారు.హైడ్రేషన్ స్థిరంగా ఉండదట..హైడ్రేషన్ అవసరాలు స్థిరంగా ఉండవని అంటున్నారు. శారీరక శ్రమ, వయస్సు, మొత్తం ఆరోగ్యం ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో శరీరం ద్రవాలను కోల్పోతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన యూరిన్ రంగు ఆధారంగా మన శరీరం హైడ్రేటెడ్గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలా అంటే..మూత్రం రంగు మరి చిక్కగా పసుపు రంగులో ఉంటే వేడి అధికంగా ఉందని, తక్కువ పసుపు రంగులో ఉంటే..తగినంతగా నీరు తీసుకోవాలని..అలా కాకుండా నీళ్లలా ప్యూర్గా ఉంటే..శరీర హైడ్రేటెడ్గా ఉందని అర్థమట.వేళకు తగిన నీరు అత్యంత ముఖ్యం..నీరు తాడం మాత్రమే చూస్తాం. ఎంత వ్యవధిలో తాగుతున్నాం అనేది ముఖ్యం. చాలా సమయం అయ్యాక తగితే..అంత ప్రభావవంతగా ఉండదు. పైగా దీని కారణంగా బయటకు వెళ్లిన వెంటనే వడదెబ్బ బారిన పడతామని అంటున్నారు. అలాగే భోజనంలో బాగా ఆయిల్తో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు. తేలికపాటి కాలనుగుణ భోజనమే మేలని చెబుతున్నారు.ఎండకు గురైన వెంటనే నీళ్లు తాగటం..తీవ్రమైన ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటినీళ్లు అస్సలు తాగకూడదల. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి, శరీర ద్రవాలు సమర్థవంతంగా శోషించబడటాన్ని నెమ్మదింపచేస్తుందట. అందుకుని నీళ్లు లేదా కొబ్బరి నీళ్లను తాగే ముందు ఎండకు గురైన శరీరం తగిన ఉష్ణోగ్రతకు స్థిరపడే వరకు ఆగి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.ఇళ్లలో, జర్నీ సమయాల్లో చేసే తప్పిదాలు..ఇంటి వద్ద, కార్యాలయాల్లో ఉన్నప్పుడూ అంతగా నీరు తీసుకోవడం మర్చిపోతుంటారట. రిలాక్స్ అయిపోయి నీడ పట్టునే ఉన్నాం కదా అని తగినంత నీరు తీసుకోరని అంటున్నారు. అందువల్ల ఇలా అస్సలు చెయ్యొదని హెచ్చరిస్తున్నారు.ఉప్పుని మరింత దూరంగా ఉంచడం..ఈ కాలంలో చెమటలు పట్టి..శరీరంలో ఎలక్ట్రోలైట్లు నష్టం ఎక్కువగా ఎదుర్కొనాల్సి ఉంటుందట. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పును పూర్తిగా మానుకోవడం వల్ల, ఖనిజాలు కోల్పోయి కొన్నిసార్లు నీరసం, తలతిరగడం వంటి సమస్యలు ఎదురవ్వుతాయని అంటున్నారు.డీహైడ్రేషన్ పెద్ద సమస్య కాదనే అభిప్రాయం..నిజానికి డీ హైడ్రేషన్ మన మానసిక స్థితి, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. అధిక వేడి పరిస్థితులు దేనిపై స్థిమ్మితంగా ఆలోచించేలా చేయనివ్వదట. అందుకే తగినంత నీరు తాగితేనే మన శరీరం యాక్టివ్గా ఉండి..ఏ పనైనా సులభంగా చేయగలుగులతామని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight loss: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..) -
వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..
ఇటీవల బరువు తగ్గడం ఆధునిక ట్రెండ్గా మారింది. అందరూ చక్కటి శరీరాకృతిలో యంగలుక్లో కనిపించడం కోసం రకరకాల డైటింగ్లు, వర్కౌట్లతో పాట్లుపడుతున్నారు. కానీ కొందరు సింపుల్ చిట్కాలతో అద్భుతంగా బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తున్నారు. బరువు తగ్గిన చాలామంది ఎంతో కొంత వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేశామని చెప్పగా ఈ పిల్లల తల్లి మాత్రం అవేమి చేయకుండానే బరువు తగ్గానంటోంది. పైగా ఆరోగ్యకరమైన రీతీలోనే తగ్గానని చెబుతుండటం విశేషం. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ముంబైకి చెందిన పిల్లల తల్లి, కంటెంట్ క్రియేటర్ సురభి పిసల్ తన వెయిట్లాస్ జర్నీని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ప్రసవానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోయానని చెప్పుకొచ్చింది. మళ్లీ తనలా మార్పు కోసం నెమ్మదిగా బరువతగ్గే యత్నం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తాను వ్యాయామాలు చేయలేదని చెబుతోంది. తన జీవనశైలికి సరిపోయే విధంగా చిన్న, చిన్న స్థిరమైన మార్పులు మాత్రమే చేశానని అంటోంది. అయితే డెలివరీ తర్వాత పరిస్థితులు కాస్త కష్టంగా ఉన్నాయని, ఏ డైట్చేసినా కడుపు ఉబ్బరం, బరువు పెరడం వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డట్లు వివరించారామె. అప్పుడే తాను ఆపిల్ సైడ్ వెనిగర్ని ఉపయోగించటం ప్రారంభించానని అన్నారు. ఇది తన జీవక్రియను మెరుగుపరిచి, ఆకలి కోరికలను నియంత్రించడానికి సహాయపడిందని అంటోంది. అది క్రమంగా తన బరువులో మార్పులకు దారితీసింది. ఇంతకుమునుపు సరిపోని బట్టలు సరిపోవడంతో మానసికంగా కాస్తం స్థైర్యం రావడం మొదలైందని తెలిపింది. కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టానన్నారు. అందుకోసం ఏ చాశారో కూడా చెప్పారు.నల్ల జీలకర్ర నూనె (ఖాళీ కడుపుతో): జీవక్రియను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానిక హెల్ప్ అవుతుందట.బుల్లెట్ప్రూఫ్ కాఫీ (బ్లాక్ కాఫీ + కొబ్బరి నూనె): ఇది తక్షణ శక్తిని అందిస్తుందట. పైగా కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్ని కరిగిస్తుందట.ఎల్డర్బెర్రీ పొడి: దీన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లను మెరుగైన రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తుందని చెప్పుకొచ్చారామె.తాను తన ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోయానని అంటోంది. నిజం చెప్పాలంటే వెయిట్లాస్ దానంతట అది జరిపోయిందని చెబుతోంది ఈ న్యూ మామ్. View this post on Instagram A post shared by Surabhi Pisal (@surabhi_littlereviews) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..) -
మజ్జిగ లేదా నిమ్మరసం చాలా.. డీహైడ్రేషన్కు అదే మేలా?
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, తీవ్రమైన వేసవికాలంతో పాటు అధిక తేమ కూడా తోడవుతోంది. వాస్తవానికి, రాబోయే కొన్నేళ్లు దేశ చరిత్రలోనే అత్యంత వేడిగా ఉండే కాలంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది, దీనివల్ల ఎక్కువ మంది డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వడగాలుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో సరైన హైడ్రేషన్ ఉత్పత్తులపై అవగాహన అవసరం అంటున్నారు వైద్య నిపుణులు.ఎలక్ట్రోలైట్ల లోపం కీలకం...అనారోగ్యం లేదా విరేచనాల సమయంలోనూ, అలాగే రోజువారీ సంరక్షణలోనూ, ఉన్నతమైన హైడ్రేషన్ ఉత్పత్తులతో శరీరానికి తగినంత నీరు అందించడంపై అవగాహనను పెరగాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో, డీహైడ్రేషన్ కు ఇప్పటికీ మజ్జిగ లేదా నిమ్మరసం వంటి ఇంటి చికిత్సలే మొదటి పరిష్కారంగా ఉన్నాయి. ఒక వ్యక్తి డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, వారు కేవలం ద్రవాలను మాత్రమే కాకుండా సోడియం, క్లోరైడ్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతారు. నిజానికి ఎలక్ట్రోలైట్లు శరీరంలోని సంకేత అణువులు. అవి నరాల ద్వారా ప్రయాణించి, కదలికలకు సహాయపడి, వ్యక్తులు చురుకుగా ఉండేలా చేస్తాయి అని అంటున్నారు హైదరాబాద్కు చెందిన వైద్యులు డా. అశుతోష్. మరి అలాంటి ఎలక్ట్రోలైట్ల లోపం కండరాల కదలికను తగ్గించి, అలసట నీరసానికి దారితీస్తుంది. మరి వీటిని పునరుద్ధరించుకోవడానికి ఏం చేయాలి?స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ పానీయాలు, గ్లూకోజ్ పౌడర్లు వివిధ ఎలక్ట్రోలైట్ ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించడంతో, హైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ విభాగం పోటాపోటీగా మారింది. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ భారతదేశ వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా హైడ్రేషన్ విభాగం విపరీతమైన వృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలో, వినియోగదారులు అనారోగ్య సమస్యలకు అతీతంగా, శక్తి క్షీణించినప్పుడు లేదా అలసిపోయినప్పుడు వేగంగా కోలుకోవడానికి అనేక రకాల ఆరోగ్యకరమైన హైడ్రేషన్ సొల్యూషన్లను కోరుకుంటున్నారు. డీహైడ్రేషన్ ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతున్నందున, విరేచనాలు రోజువారీ హైడ్రేషన్ అవసరాలను తీర్చడానికి కెన్ వ్యూ ఓఆర్ఎస్ఎల్, ఇఆర్జెఎల్ వంటి బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వడదెబ్బ, కండరాల నొప్పులు మొదలైన రోజువారీ సందర్భాలలో నీరసంగా అనిపించినప్పుడు లేదా అలసట, బలహీనత కారణంగా నిస్సత్తువగా ఉన్నప్పుడు ఇవి సహాయకారిగా పనిచేస్తున్నాయి. రోజువారీ హైడ్రేషన్ కోసం రూపొందిన ఎలక్ట్రోలైట్ డ్రింక్, మూడు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను (సోడియం, పొటాషియం, క్లోరైడ్) విటమిన్ సి లను వేగవంతమైన హైడ్రేషన్ ను అందిస్తూనే, పండ్ల రసాల తరహాలో రుచికరంగా ఉండేవి అందుబాటులో ఉన్నాయి.అయితే సరైన సందర్భాలకు సరైన హైడ్రేషన్ ద్రావణాలను ఎంచుకోవడంపై అవగాహన కల్పించడానికి కల్పించాలి. ఉదాహరణకు, విరేచనాల కోసం డబ్లు్యహెచ్ఓ ఆమోదించిన ఓఆర్ఎస్ ద్రావణాలు రోజువారీ హైడ్రేషన్ కోసం ఎలక్ట్రోలైట్ ద్రావణాలు వినియోగించాలి. ఇలాంటి అవగాహన పెంచేందుకు తెలుగు రాష్ట్రాలలో వైద్య నిపుణులు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో కెన్ వ్యూ బ్రాండ్ కలిసి పనిచేస్తోంది అని చెప్పారు సంస్థ కు చెందిన ప్రశాంత్ షిండే.ఏడాది పొడవునా...డీహైడ్రేషన్పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంపై పెరిగిన అవగాహన మహమ్మారి అనంతర ఆరోగ్యం పై దృష్టి సారించడం వంటి అంశాలన్నీ కలిసి, క్రియాశీల నివారణ సంరక్షణ వైపు మార్పును వేగవంతం చేశాయి. చాలా మంది ప్రతిరోజూ తగినంత నీరు తాగడాన్ని ఒక ఆరోగ్యకర అలవాటుగా పరిగణిస్తున్నారు. అయితే నిలకడ లేని వాతావరణ పరిస్థితులతో పాటు తీరికలేని జీవనశైలిని గడుపుతున్నందున, డీహైడ్రేషన్ కేవలం వేసవి కాలానికే పరిమితం కావడం లేదు. ఎండలో , ఏసీ ఉన్న ప్రదేశాలలో ఉన్నప్పుడు, అలాగే జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల సమయంలో కూడా సంభవించవచ్చు. వడదెబ్బ లేదా నీరసం, బలహీనత కారణంగా నిస్సత్తువగా అనిపించినప్పుడు, రోజువారీ సందర్భాలలో ఎలక్ట్రోలైట్లు నీరు తగ్గిపోయినట్లు అనిపించినప్పుడు, వాటిని తిరిగి నింపడానికి ఇఆర్జెఎల్ వంటివి సహాయపడుతుందన్నాయి.డీహైడ్రేషన్ , పిల్లలు, వృద్ధులు శారీరకంగా శ్రమతో కూడిన జీవనశైలి కలిగినవారు ఎక్కువ సమయం ఆరుబయట గడిపేవారితో సహా కొన్ని వర్గాలు డీహైడ్రేషన్ కు ఎక్కువగా గురవుతాయి. చిన్న పిల్లలు తమ దాహాన్ని సరిగ్గా చెప్పలేరు, దీనివల్ల డీహైడ్రేషన్ కు సులువుగా లోనవుతారు. వృద్ధులలో దాహానికి గురి చేసే యంత్రాంగం బలహీనంగా ఉంటుంది, వారు అనారోగ్యం వేడి సంబంధిత డీహైడ్రేషన్ రెండింటికీ గురయ్యే అవకాశం ఉంది. మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు డీహైడ్రేషన్ కు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది వారి డీహైడ్రేషన్ ను జాగ్రత్తగా పరిష్కరించడం అవసరం. ఇలాంటి వినియోగదారుల సమూహాలకు, కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి నీటితో పాటు తగినంత ఎలక్ట్రోలైట్లను తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అతిసారం అనేది ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్య, ఇది చిన్నపిల్లల మరణాలకు కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అతిసారం చికిత్సలో ఉపకరిస్తుంది.అవగాహన కార్యక్రమాలు... నిర్వహిస్తున్నాం డీహైడ్రేషన్ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి నీరు తాగితే సరిపోతుందని తరచుగా నమ్ముతారు. అయితే, శరీరంపై డీహైడ్రేషన్ మొత్తం శారీరక విధులపై ప్రభావం, ఎలక్ట్రోలైట్ పానీయాలు పోషించే కీలక పాత్రల గురించి పరిమిత అవగాహన మాత్రమే ఉంది. మా ప్రచారాల ద్వారా నీరు తాగే అలవాట్లను సరిదిద్దడం, దేశంలో డీహైడ్రేషన్ ఒక కీలకమైన ప్రజారోగ్య సమస్యగా అవగాహన కల్పించడంపై కృషి చేస్తున్నాం –ప్రశాంత్ షిండె, కెన్ వ్యూ -
చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..
ఆధునిక కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సమస్యాత్మకంగా మారింది. చాలామంది వెయిట్లాస్ అయ్యేలా సర్జరీలు, మందుల వెంట పరిగెడుతున్నారు. మరికొందరు ఆరోగ్యకరంగా తగ్గేందుకు పాట్లు పడుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఇతరులకు ప్రేరణ కలిగించేలా అద్భుతంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు కూడా. కానీ వాళ్లందరూ చెప్పేది కొద్దికిద్దిగా తింటూ ఎక్కువసార్లు తినమని, మంచి ఆహారపు అలవాట్లు తదితర టిప్స్ ఇస్తే. ఈ వ్యక్తి మాత్రం అత్యంత వింత వెయిట్లాస్ చిట్కాలు ఇచ్చాడు. అవి చూస్తే ఇవేం చిట్కాలు అనిపించినా..అంతకుమునుపు, తదుపరి పరివర్తన చూస్తే నిజంగా అవే సరైనవా? అనే ఆశ్చర్యం కలుగకమానదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామాకువార్ కపూర్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన వెయిట్లాస్ జర్నీని షేర్ చేశారు. తాను ఒకప్పుడు 142 కిలోల బరువు ఉండేవాడినని తెలిపాడు. పైగా కొన్ని రకాల వింత ఫిట్నెస్ టిప్స్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తదితరాలు తన వెయిట్లాస్ సీక్రెట్ అని చెబుతున్నాడు. వర్కౌట్లు, మంచి ఆహారపు అలవాట్లు వరకు ఓకే. కానీ ఈ వింత ఫిట్నెస్ టిప్స్ ఏంటి..?. బరువు తగ్గడానికి అవెలా ఉపయోగపడ్డాయ్?డైట్ సోడా తాగడంబరువు తగ్గే ప్రయాణంలో డైట్ కోక్, సోడా, శీతల పానీయాలు, ఇతర చక్కెర పానీయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కానీ భోజనంతో పాటు డైట్ సోడా తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుందని కువార్ నొక్కి చెప్పారు. కేలరీలు లేని, సాధారణ ఫిజీ డ్రింక్ లాగే రుచిగా ఉండే సోడాను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడంభోజనం తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం వల్ల అతిగా తినాలనే కోరికలను నివారిస్తుందట. కొలెస్ట్రాల్ తగ్గేలా ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుందట. ముందుగా ప్రోటీన్ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం వింతైన చిట్కా కాదు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లకు ఇది చాలా అవసరం. ప్లేట్లో ఎల్లప్పుడూ ముందుగాప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్లు చేర్చుకోవాలని కువార్ పేర్కొన్నారు.టీ మాక్సింగ్రోజంతా ఎక్కువగా కదలడం, ఉదాహరణకు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కాలు ఊపడం లేదా అటూ ఇటూ తిరగడం వంటివి, మనకు తెలియకుండానే అదనపు కేలరీలను ఖర్చు చేస్తాయంట. పైగా అనుకున్నదానికంటే వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయట.ఎక్కువగా నిలబడటంకువార్ ప్రకారం, మీరు స్క్రీన్ చూసే సమయంలో సగం సేపు కేవలం నిలబడటం వల్ల ఎక్కువ శక్తిని ఖర్చు అవుతుందట. జువారీ కేలరీల ఖర్చులో ఇది కూడా చిన్నగా బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట3-2-1 రూల్..3-2-1 రూల్ కువార్కు మరింత స్థిరంగా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడింది. దీని ప్రకారం నిద్రపోయే మూడు గంటల ముందు చివరి భోజనం ముగించడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడటానికి సమయం లభిస్తుంది. త్వరిత గతిన బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట. ఇక రెండు గంటలు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం,ఇక ఒక గంట స్క్రీన్టైమ్ కోసం. ఇలా ప్లాన్చేస్తే అమాంతం చాలా బరువు తగ్గుతామని చెబుతున్నాడు.మంచి అరుగుదల కోసం నడకభోజనం చేసిన వెంటనే ఐదు నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడానికి బదులుగా కండరాలకు చేరవేయడానికి సహాయపడుతుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అందరికీ ఈ టిప్స్ వర్తించవు. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!) -
చిన్నారులకు ఆ చిరుతిండ్లు వద్దు..!
ఇటీవల చిన్నపిల్లల వైద్యుల వద్ద కేసులు పెరుగుతున్నాయి. కడుపు నొప్పి, వాంతులు ఇతర అనారోగ్య కారణాలతో చిన్నారులను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. దీనికి చిన్నారులకు ఇస్తున్న ఆహారంలో మార్పులే కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు చిన్న పిల్లలు మారాం చేస్తే.. ఇంట్లో ఉండే బెల్లం లేదా తయారు చేసుకునే సాంప్రదాయ చిరుతిళ్లను ఇచ్చేవారు. వీటి వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. అయితే కాల క్రమేణ ప్రస్తుతం మార్కెట్లోకి జంక్ ఫుడ్ విస్తరించింది. చిన్నారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ప్యాకింగ్లతో పాటు వారి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలతో ఈ జంక్ ఫుడ్ ప్రభావం మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు పాకింది. వీటి వలన చిన్నారుల ఆరోగ్య, మానసిక వికాసం పూర్తిగా నాశనమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్కలి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదుగుదలకు హానికరం చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి చిన్నారులకు జంక్ ఫుడ్ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి.అవగాహన కల్పిస్తున్నాం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి జంక్ఫుడ్తో అనారోగ్య సమస్యలు జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్కే మహారాజ్, చిన్న పిల్లల వైద్యు నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రిసంప్రదాయ ఆహారంతో మేలుచిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. (చదవండి: మామ్ వెయిట్లాస్ జర్నీ..! నో క్రాష్ డైట్, నో స్ట్రిక్ట్ రూల్స్..ఏకంగా 22 కేజీలు..) -
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
బరువు పెరడం ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న తీవ్ర సమస్య. ముఖ్యంగా ముఖం, కాళ్లు చేతులలో ఫ్యాట్ పేరుకుపోయి..ఊబకాయంతో కనపించేలా చేస్తుంది ఈ అధిక బరువు. తగ్గాలన్నా ఆలోచన రావడం, దానిపై నిలకడతో సాగడంతోనే ఈ సమస్యకు చెక్పెట్టగలరు. లేదంటే తగ్గినట్లే తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంటారు. అందులోనూ మహిళలు పెళ్లి ముందు వరకు సన్నజాజిలా అందంగా కనిపించనవాళ్లు..పిల్లలు పుట్టడంతోనే ఈ సమస్య బారినపడుతుంటారు. అందుకు మాతృత్వం, ఇంటి బాధ్యతలు నడుమ తన శరీరంపై కేర్ ఉండక ఈ అధిక బరువు బారిన సునాయాసంగా పడిపోతుంటారు. అలాంటి వాళ్లు కూడా కాస్త పిల్లలు తమ పనులు చేసుకునే స్థాయికి చేరుకున్నాక..తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని వెయిట్లాస్ అయ్యి..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ మామ్ కూడా.ఆ తల్లే నూపుర్ కల్రా. చెన్నైకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆమె. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ వేదిక తన వెయిట్లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నారు. తాను 22 కేజీల వరకు అధిక బరువుని ఎలా తగ్గించుకుందో వెల్లడించారు. తాను ఎలాంటి క్రాష్ డైట్ పాటించలేదని అన్నారు.ప్రోటీన్ తప్పనిసరిగా..ఆహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు తన లైఫ్లో పెద్ద గేమ్ ఛేంజర్ అని అంటోంది. ప్రోటీన్ తృప్తికి, శక్తికి, క్రమబద్ధతకు సహాయపడుతుందట. అయితే ఏ ప్రోటీన్ మీకు సరిపోతుందనేది పోషకహార నిపుణులను సంప్రదించే పాటించమని నొక్కి చెబుతోంది.ఇంటి భోజనంఆ ఇన్ఫ్లుయెన్సర్ స్విగ్గీ, జొమాటో, డెలివరీ ఫ్లాట్ఫాంల నుంచి ఆర్డర్ చేసిన భోజనాల కంటే ఇంట్లో వండిన ఆహారాన్నే ఎంచుకన్నట్లు తెలిపింది. ఎప్పుడైనా..బరువు తగ్గాలనుకునేవారు ఇంట్లో వండిన భోజనాన్నే ప్రిఫర్ చేయడం ముఖ్యం.ఎక్కువగా నీరు తాగడం..డీహైడ్రేషన్ బారినపడటం వల్లే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. అందుకే తగినంత నీరు తాగితే తీపి పదార్థాలు, వేయించిన ఆహారాల జోలికి పోరు అని అంటోంది.అలాగని స్వీట్లకు దూరం కాలేదట..ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..నచ్చిన స్వీట్లు తినేదట. అయితే ఎంత మోతాదులో తినాలనేది నిర్ణయించుకుని మరి ప్లాన్ ప్రకారం తినేదాన్ని అంటోంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సూచనుల పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Noopur Kalra (@noopurkalra) (చదవండి: చలువ చేసే మారేడు పానకం..!) -
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..? ప్రాణాలకే ప్రమాదమా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు నగరానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వెంటనే అడ్మిట్ చేయించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీగా గుర్తించి ఆఫరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి మృత్యువాత పడింది. ట్యూబ్ పగిలిపోవడంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో తరచూ నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లి గర్భాణికి గండం తప్పనంటోంది. గర్భసంచిలో గర్భం దారి తప్పుతోంది. ఇందుకు ఇన్ఫెక్షన్లు, వరుస అబార్షన్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. అండాశయం, గర్భాశయ నాళాల్లో గర్భం(ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడుతోంది. మాతృమరణానికి దారి తీస్తోంది. ఈ విషయంలో తల్లులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాణిపాకం జిల్లాలో ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. గర్భం సరైన స్థానమైన కాకుండా గర్భాశయ నాళాలు (ఫాలోపియన్ ట్యూబ్స్), అండాశయం లేదా పొత్తికడుపులో ఏర్పడుతోంది. దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. జిల్లాలో ఒక జిల్లా ప్రభు త్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 4, సీహెచ్సీలు 8, పీహెచ్సీలు 50, ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7వేలకు పైగా గర్భణులు గుర్తిస్తుండగా.. 5వేల ప్రసవ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రతి 100 గర్భధారణల్లో కనీసం 1–2 కేసులు ఎక్టోఫిక్గా నమోదవుతున్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రారంభంలో ఇది సాధారణ గర్భంలా కనిపిస్తుంది. కడుపులో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అసాధారణ రక్తస్రావం, తల తిరగడం, బలహీనత, భుజం లేదా వెన్ను నొప్పి, చికిత్స ఆలస్యం అయితే ట్యూబ్ పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్స అవసరం, తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పదు. పెరుగుదలకు ప్రధాన కారణాలు గర్భాశయ నాళాల్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడడం.. వరుసగా అబార్షన్లు, సేఫ్టీ లేకుండా లైంగిక సంబంధాలు, గతంలో ట్యూబ్ సర్జరీలు, ఆలస్యంగా పెళ్లిళ్లు, గర్భధారణలో ఆలస్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల పెరుగుదల తదితర కారణాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకూడదు. సేఫ్ సెక్స్ పాటించాలి. వరుస అబార్షన్లను నివారించాలి. గర్భం అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్ చెకప్లు తప్పనిసరి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే! గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోíపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్ చేసినప్పుడే తెలుస్తుంది. అజాగ్రత్త వద్దు అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాని ఎక్టోఫిక్ గర్భం అంటాం. వందలో ఒకరికి జరుగుతుంది. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో అజాగ్రత్త వద్దు. వైద్యులను తక్షణమే సంప్రదించాలి. – షాలిని, గైనిక్ వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో), చిత్తూరు వైద్యులను సంప్రదించాలి నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపాదడపా రక్త స్రావం కనిపిస్తూ ఉన్నా.. పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి బలహీనత, కళ్లు తిరగడం, గర్భధారణ అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ చూస్తున్నాం. ఈ కేసుల్లో చాలా వరకు మాతృమరణాలకు దారితీస్తున్నాయి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, చిత్తూరు (చదవండి: తొలి అంధ-బధిర న్యాయవాది: చిమ్మచీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!) -
చలువ చేసే మారేడు పానకం..!
మే నెల ఇంకా రాకమునుపే ఎండలు మండిపోతున్నాయి. చైత్రంలోనే చెమటలు పట్టేలా భానుడు భగభగలాడిస్తున్నాడు. ముఖ్యంగా ఈ వేడి గాల్పులకు పెద్దలు, చిన్నారులే అల్లాడిపోతుంటారు. ఉదయం ఏడింటి కల్లా చుర్రుమంటున్న సూర్యుడి తాపానికి చిన్నారులు తాళ్లలేక వాడిపోగా, పెద్దలు నిసత్తువతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు మన పూర్వీకులు ఎన్నో గొప్ప సహజసిద్ధమైన ఔషధ పానకాలను అందించారు. ఇప్పుడు చెప్పబోయే పానకంలో అలాంటి గుణాలే ఉన్నాయి. దీని ముందు ఏ షెర్బత్లు, జ్యూస్లు నిలువలేవు. దీని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే విస్తుపోతారు. వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానం. దీన్ని ఒడియా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. అచ్చం మన ఉగాది పచ్చడిలా వాళ్లు ఈ మారేడు పానకాన్ని తయారు చేసుకుంటారు. వాళ్ల సంవత్సరాది వైశాఖ మాసంలో వస్తుంది. వాళ్లకి అప్పుడు వసంతకాలం అన్నమాట. వాళ్లు కూడా మనలా ఈ రోజు నంచే చలివేంద్రాలు ఏర్పాటు చేసి లాంఛనంగా ఈ మారేడు పానం వితరణను ఆనవాయితీగా చేస్తుంటారు. వేసవి ప్రారంభానికి గుర్తుగా ఈ పానకం తయారు చేస్తారు ఒడియా ప్రజలు. ఇదెలా తయారు చేస్తారంటే..పండిన మారేడు పండును పగలగొట్టి, లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుజ్జులో తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి (లేదా మిక్సీ పట్టి) 15-20 నిమిషాలు నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని జల్లెడ (strainer) ద్వారా వడపోసి, పీచు, గింజలను వేరు చేసి స్వచ్ఛమైన రసాన్ని తీసుకోవాలి.ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలపాలి. చివరగా చిటికెడు యాలకుల పొడి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి, చల్లటి నీరు లేదా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చ. ఈ చల్లని పానీయం వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఆరోగ్యప్రదం కూడా. ఆరోగ్య ప్రయోజనాలు..ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. మలబద్ధకాన్ని, ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. మొటిమలను నివారిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కేన్సర్ బారినపడకుండా రక్షిస్తుంది. బాడీని హైడ్రేటెడ్ ఉంచుతుందిబరువుని అదుపులో ఉంచుతుంది. అలాగే కంటి సమస్యలు, గుండె సమస్యలకు చెక్ పెడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Chef Kirti Bhoutika (@kirtibhoutika) (చదవండి: weight loss Tips: ఏడు వారాలకే జూనియర్ ఎన్టీఆర్ 9 కిలోలు..!) -
ఏడు వారాలకే జూనియర్ ఎన్టీఆర్ 9 కిలోలు..!
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం డ్రాగన్ కోసం తన ఫిజిక్ని ఎలా మార్చుకున్నారో అభిమానులతో షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపర్చారు. ఆయన శరీర ఆకృతిని చూసి..వావ్! ఎంత స్మార్ట్గా ఫిట్గా ఉన్నారు అని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. అది కూడా తక్కవ వ్యవధిలోనే ఏకంగా 9.5 కిలోలు తగ్గారు. ఈ మొత్తం ప్రక్రియకు ఆయనకు జస్ట్ ఏడు వారాలే పట్టిందట. మరి అదెలా సాధ్యమైందో, బరువు తగ్గాలనుకునేవారికి ఆయన అనుసరించి టిప్స్ హెల్ప్ అవుతాయేమో చూద్దామా..!.జూనియర్ ఎన్టీఆర్ జిమ్ సెటప్ ముందు క్లాసిక్ డబుల్ బైసెప్స్ భంగిమలో ఉన్న ఫోటోని షేర్ చేశారు. మంచి ఫిట్గా స్మార్ట్గా మారిన తన రూపాన్ని షేర్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలకు ఇది కొని తెచ్చుకున్న కండలు కాదు, స్వయం నిర్మితం అని క్యాప్షన్ జోడించారు జూనియర్ ఎన్టీఆర్. అదెలా సాధ్యమైందో ఆయన ఫిట్నెస్ ట్రైనర్ కుమార్ మన్నవ సవివరంగా వెల్లడించారు. తాను కేవలం ఎన్టీఆర్ వెయిట్లాస్ జర్నీని బరువు తగ్గడమే లక్ష్యంగా ప్రారంభించలేదని, సన్నని చురుకైన శరీరాకృతిని సాధించడంపై ఫోకస్ పెడుతూ మొదలు పెట్టామన్నారు. దీని కోసం జూనియర్ ఎన్టీఆర్ తన ఫిట్నెస్ దినచర్యను గణనీయంగా మార్చారట. భారీ కండరాల నిర్మాణ వ్యాయమాలకే పరిమితం కాకుండా, తన శిక్షణను ఫంక్షనల్ కదలికలు, కార్డియో కేంద్రీకృత వ్యాయామాల తోపాటుగా, మోస్తారు రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటివి కూడా చేశారని చెప్పారు. రోజు కార్డియో లేదా స్ట్రెంగ్త్ వ్యాయామాలను మాత్రం సుమారు 45 నుంచి 90 నిమిషాలు చేసేవారట. ఆఖరికి ఫుడ్ కూడా చాలా ప్రణాళికగా తీసుకునేవారట. సాధారణంగా కండరాల పెరుగుదలతో ముడిపడి ఉన్న ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి బదులుగా తక్కువ ప్రోటీన్ తీసుకునే పద్ధతిని ఎంచుకున్నారని ట్రైనర్ కుమార్ మన్నవ వెల్లడించారు. ఈ వ్యూహమే ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని కోల్పోవడానికి, అలాగే తన మూవీ డ్రాగన్లోని పాత్రకు అనుగుణంగా సన్నటి రూపాన్ని సాధించడానికి హెల్ప్ అయ్యిందని అన్నారు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. చాలామటుకు సెలబ్రిటీల మాదిరిగా వెయిట్లాస్ జర్నీని ప్రారంభించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) (చదవండి: జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!) -
వేసవిలో పిల్లలు హెల్దీగా ఉండాలంటే..!
అనాదిగా వేసవికీ బాల్యానికీ ఎనలేని సంబంధం ఉంది. పైగా పులి మీద పుట్రలా వేసవి సెలవులొకటి. తామూ ఒకప్పటి పిల్లలే అయినా తమ బాల్యాన్ని మరచిపోయి ఎండలో ఆడవద్దంటూ పిల్లలను గదమాయిస్తుంటారు పెద్దలు. కానీ... సూర్యుణ్ణి కంపాస్ బాక్స్లో ఉంచేసి, అది సరిపోనట్టు మళ్లీ దాన్ని స్కూల్ బ్యాగ్లో పెట్టిజిప్పు లాగేసినట్టుగా ఎండను లెక్కచేయకుండా పిల్లలంతా ఆడేస్తుంటారు. తరాలు గడుస్తున్నా ఇదో ఎప్పటికీ ఎడతెగని చైన్ రియాక్షన్. ఈ నేపథ్యంలో పిల్లలను వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహారపదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.అప్పటివరకూ ఆరుబయట హాయిగా ఒళ్లెరగకుండా ఆడుతున్న చిన్నారి ఒళ్లు వెచ్చబడుతుంది. అకస్మాత్తుగా అమ్మాయి మేను నిప్పులు చెరుగుతోందేమో అనిపిస్తుంది. తల్లీదండ్రీ నుదురు తాకి చూసి, తటాలుమని చేయి వెనక్కు లాగేసుకుంటారు ఆ ఒంటి వేడి తట్టుకోలేక. ఇది దాదాపు ప్రతి చిన్నారి బాల్యంలో ఒక్కసారైనా ఎదుర్కొనే సంఘటన. ఇది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఒక్కసారైనా చవిచూసే కాళరాత్రి. ఇలాంటి వేసవి తీవ్రత బారి నుంచి చిన్నపిల్లలను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.పిల్లలపై ఎండ దుష్ప్రభావం ఎందుకు ఎక్కువ? ఎండవేడిమి తీవ్రతకు పెద్దలూ, పిల్లలూ, వృద్ధులనే తేడా లేక΄ోయినప్పటికీ పెద్దలతో పోలిస్తే పిల్లల మీదే వేసవి ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంటుంది. దీనికి కారణం ఉంది. పిల్లలంతా ఎండల్లో విపరీతంగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి పెద్దల కంటే వాళ్లకు చెమటలు పట్టడమూ, దాంతో వాళ్లు లవణాలు ఎక్కువగా కోల్పోతుండటం వల్ల ఎండతీవ్రతకు గురవుతుంటారనేది కొందరి అపోహ. కానీ అది వాస్తవం కాదు. విషయం ఏమిటంటే... పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట గ్రంథులు తక్కువ. అందుకే చెమటలు పట్టడం పెద్దవారిలోనే ఎక్కువ. అయితే పిల్లల చర్మంపైన వేసవి తీవ్రతను చల్లబరిచేందుకు అవసరమైన ప్రక్రియ... చెమట పట్టడమనేది తక్కువ. దాంతో ఎండ వేడిమి పిల్లలపై ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలెప్పుడూ చల్లగా ఉండే నీడపట్టునే ఉండేలా చూడాలి. ఎండా, వడగాడ్పులు తగ్గాకే వాళ్లను ఆరుబయటకు వెళ్లనివ్వాలి.ఎండ తీవ్రతతో ఎదుర్కొనే ఇబ్బందులివే...మజిల్ క్రాంప్స్ : పిల్లలెప్పుడూ ఎండను లెక్క చేయక ఆడుతూ ఉంటారు. ఇక సెలవుల్లో అయితే ఆటలే ఆటలు. దాంతో వారి దేహంలోని నీరు డీ–హైడ్రేషన్ కారణంగా బయటకు వెళ్లడమూ, ఆ నీటితో పాటు లవణాలూ తగ్గడం వల్ల... ఆ లవణాల అయాన్ల రూపంలో మెదడునుంచి కండరాలకు వచ్చే ఆదేశాలకు బ్రేక్ పడుతుంది. అందుకే ఒళ్లు డీ–హైడ్రేషన్కు గురి కాగానే... కండరాలు బిగుసుకు΄ోతుంటాయి. వీటినే మజిల్క్రాంప్స్ అంటారు. ఈ మజిల్క్రాంప్స్ పిల్లలతో పాటు పెద్దలకూ వస్తుంటాయి. ఇలా జరిగిన వెంటనే... వారికి చిటికెడు ఉప్పు, కాస్తంత చక్కెర వేసిన నీటిని వెంటనే తాగించాలి. కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడం వల్ల ఈ సమస్యను తేలిగ్గానే ఎదుర్కోవచ్చు.వడదెబ్బ : మనలో జీవక్రియలన్నీ సరిగా జరగడానికి దేహ ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారెన్హీట్గా ఉంటుంది. అయితే వడదెబ్బకు గురైనవారి దేహ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాంతో దేహంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ కారణంగా దేహ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ప్రమాదకరస్థాయి అయిన 104 డిగ్రీ ఫారెన్హీట్కు చేరినప్పుడు ఆ వేడి దగ్గర మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలెక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతను మళ్లీ నార్మల్కు తీసుకురావడం అవసరం.ఒంటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్హీట్ దాటుతోందని తెలియగానే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఒకవేళ ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా లాభం ఉండదు. చిన్నారుల దుస్తులు వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.వేసవిలో కొన్ని ఆహారాల పట్ల అపోహలుగుడ్డు : గుడ్లు తినడం వల్ల అవి వేడి చేస్తాయనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో గుడ్లను తినడానికీ, పిల్లలకు ఎక్కువగా ఇవ్వడానికి వెనకాడుతుంటారు. నిజానికి ఇది పూర్తిగా అ΄ోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజలవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో ΄ాటు ఒంటి నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. అంతేకాదు... ఇందులోని లవణాల కారణంగా మజిల్క్రాంప్స్ వంటి సమస్యలూ నివారితమవుతాయి.పాలు : వేసవిలో పాలకు బదులుగా... పెరుగునూ... ఇక పెరుగుకు బదులుగా దాన్ని చిలికి మజ్జిగ రూపంలో తీసుకోవడమే మేలని చాలామంది అనుకుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ వాడటం చాలా మంచిదే అనడంలో సందేహం లేదు. అంతమాత్రాన వేసవిలో పాలు అంత మంచివి కావని అనుకోవడం ఓ దురభి్ర΄ాయం మాత్రమే. నిజానికి పాలలోనూ 90 శాతానికి పైగా ఉండేది నీళ్లే. ఈ నీటి మోతాదులతోసాటు దేహానికి శ్రమ కలగడం వల్ల కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే ఏకకాలంలో నీటినీ, ఖనిజలవణాలనూ భర్తీ చేయడం లాంటిది. అందుకే మధ్యమధ్యలో మజ్జిగ తాగిస్తున్నప్పటికీ... వేసవిలో చిన్నారులకు ప్రతి ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగిస్తుండటమూ మంచిదే.సూప్లు : వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో చాలా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే పిల్లలు కోల్పోయే లవణాలను సూప్లూ, జావ రూపంలో తీసుకోవడం వల్ల అవి చాలా వేగంగా వారి దేహానికి అందుతుంటాయి.వెజిటబుల్ సూప్స్ : అన్ని రకాల సూప్లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. ఇక మిగతావి సూప్లలో ఉపయోగించే ఆకుకూరలు, కాయగూర (వెజిటబుల్స్)ల్లోంచి సూప్లోకి లవణాలు బాగా ఊరి, తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్లు తీసుకోవడం మేలు చేసే అంశమే. టోమాటో, మొక్కజొన్న, దోసకాయ, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ / గెణుసుగడ్డ), గ్రీన్పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్రూమ్స్)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్లు తయారుచేసుకోవచ్చు. వేసవిలో ఈ సూపులన్నీ చిన్నారులకు ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూరేలా చేస్తాయి.పిల్లలకు జావ రూపంలో ఇచ్చేవి...జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. అందుకే వీటిల్లో రాగిజావ చాలా ఫేమస్. జావ/పారిజ్ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. ఆర్గానిక్గా పండించిన పట్టుతీయని వరినూక, గోధమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. అన్నట్టు పెద్దలకూ, వృద్ధులకూ మంచివే.రకరకాల పానీయాలు...అన్నిటికంటే ముఖ్యమైనది నీరు దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించిన పానియం మరొకటి లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్కు దూరంగా ఉండవచ్చు. ఇక నీటి తర్వాత ఇవ్వదగ్గ పానియాలివి...నిమ్మ : పిల్లలు వేసవిలో పానియాలను తాగేందుకు బాగా ఇష్టపడతారు. సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేసి చేసుకునే పానియం చాలా త్వరగా తయారవుతుంది. చాలా చవగ్గా కూడా. బత్తాయి : బత్తాయిరసం, ఆరెంజ్ జ్యూస్ వంటివి పిల్లలు ఇష్టంగా తాగుతారు. సర్సపారిల్లా : ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్లో లేదా ఆ వేర్ల పౌడర్లో నీళ్లు లేదా సోడా కలపాలి. ఒక టీస్పూన్ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళభరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. దాంతో ఆమ్పన్నా అనే సీజనల్ డ్రింక్ను తయారు చేసుకోవచ్చు. ఇవేకాకుండా... ఖస్ షర్బత్, ద్రాక్షాజ్యూస్, వెలగపండు షర్బత్, రోజ్ షర్బత్లూ మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్ కలవడమనే అంశం ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశమున్నందున... ఐస్ కలపకుండా తాగడమే మేలు.తీసుకోదగ్గ ఇతర పండ్లు, సలాడ్స్...పుచ్చకాయ...లో 80 శాతం కంటే ఎక్కువ నీరే ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. వెజిటబుల్ చీజ్ సలాడ్స్... తక్కువ క్యాలరీలున్న చీజ్ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.కొవ్వులు తక్కువగా ఉండే పానీయాలు... పిల్లలు చల్లగా, తియ్యగా ఉండే కూల్డ్రింక్స్, సోడా, ఐస్క్రీమ్లను ఇష్టపడుతుంటారు. వీటికి బదులుగా మజ్జిగ, లస్సీ వంటివి ఇవ్వడం మంచిది. పండ్లతో తయారయిన డెజర్ట్స్... వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్ని తీసుకోవడమే మంచిది. ఇవి ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. బెర్రీలు (స్ట్రాబెర్రీలు)... వేసవిలో ఈ బెర్రీ పళ్లను తినటం మంచిది. వీటిని పెరుగులోనూ, ఐస్క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు. కుకుంబర్... పిల్లలు పెద్దగా ఇష్టంగా తిననప్పటికీ దోస వంటివి సహజంగానే చల్లగా ఉండి చలువ చేస్తాయి. అందుకే చల్లని తాజా దోసకాయ ముక్కలను సలాడ్స్లోనూ, కూరలలోనూ వాడుతూ పిల్లలకు ఇవ్వడం మంచిది. మామిడి... ఇవి వేసవిలోనే దొరుకుతాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. వాల్నట్స్... ఆక్రోట్ల (వాల్నట్)లో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.చేపలు... వేసవిలో వేటమాంసం కంటే చేపలు మంచి ఆహారం. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు ఇవ్వడం మేలు. ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరగాయలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్పెప్పర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాల ఉత్పత్తులు... లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రోటీన్లను, క్యాల్షియమ్ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. పనీర్... ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. గ్రిల్డ్ వెజిటబుల్స్ను పనీర్తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, ఎముకల పటిష్టతకు బాగా తోడ్పడతాయి.ఇంట్లో తయారుచేసిన ఐస్క్రీమ్లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఎండ తాలూకు దుష్ప్రభావాల నివారణ ఇలా... ఎండవేళలల్లో పిల్లలు ఎండకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి.ఎండవేళల్లో ఇన్డోర్ గేమ్స్కు మాత్రమే వారిని పరిమితం చేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండేలా చూడాలి. పిల్లలు నీడలో ఉన్నా... ఒకవేళ ఆ నీడ ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్న పిల్లలకూ వడదెబ్బ తగలవచ్చు. అందుకే పిల్లలను ఒకింత చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ఆటల్లో పూర్తిగా నిమగ్నమైనొయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారిని పిలుస్తూ కాస్త కాస్త మంచినీళ్లు పట్టిస్తూ ఉండాలి. ఓఆర్ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు.కొన్ని జాగ్రత్తలు ఇవి... పిల్లలకు పల్చటి దుస్తులు వేయాలి. మందపాటి దుస్తులు తొడగకూడదు. ∙గొడుగు వాడటం మేలే అయినప్పటికీ పిల్లలు గొడుగువాడటాన్ని పెద్దగా ఇష్టపడరు. అందుకే పిల్లలకు నేరుగా ఎండ తగలకుండా క్యాప్ తొడిగిస్తుండాలి. పిల్లలకు వాడే క్యాప్ల కలర్ లేత రంగుల్లో ఉండటం మేలు. పిల్లలు ఆటల్లో పడి నీళ్లు తాగడం విస్మరిస్తుంటారు. అలా ఆడుతున్నప్పుడు వాళ్లకు గంటా, గంటన్నర వ్యవధిలో మాటిమాటికీ నీళ్లు తాగిస్తూ ఉండాలి.బయటకు వెళ్లే ముందే కనీసం రెండు మూడు గ్లాసుల మంచినీటిని తాగించాలి. ఎప్పుడూ వాటర్ బాటిల్ వెంట ఉంచుకునేలా ప్రోత్సహించాలి. నీళ్లను ప్లాస్టిక్ సీసాల్లో ఉంచడం అంత సరికాదు. బాటిల్ వేడెక్కి అందులోని నీళ్లు వేడెక్కడం వల్ల ప్లాస్టిక్ పదార్థాల నుంచి కొద్దికొద్ది మోతాదుల్లో ప్లాస్టిక్ వెలువడి నీటితోపాటు శరీరంలోకి వెళ్లే అవకాశాలెక్కువ. ఇలా ప్లాస్టిక్ అవశేషాలు శరీరంలోకి ఇంకిపోవడాన్ని ‘లీచింగ్’ అంటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాల నష్టం చేకూరుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిల్కు బదులు మంచి గాజు బాటిల్ లేదా అంత త్వరగా వేడెక్కనివ్వని ఫ్లాస్క్లు, వాటర్బాటిల్స్నే మొదటినుంచీ పిల్లలకు అలవాటు చేయాలి. ∙ఆరుబయట తిరుగుతున్నప్పటికీ వారు చెట్టు నీడలాంటి దట్టమైన నీడ ఉండే ప్రదేశాలలోనే ఆడుకునేలా చూడటం మంచిది. ∙బయటకు అనుమతించడం అనేది ఉదయం 10 గంటలకు ముందూ... సాయంత్రం 5 తర్వాతనే జరిగేలా చూడాలి. ఎందుకంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎండ వల్ల ఆరుబయట రేడియేషన్ ప్రమాదం ఎక్కువగా ఉండి పిల్లల లేత శరీరాలకు నష్టం చేస్తుంది. పిల్లలు తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోడానికి కనీస సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 20 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ‘సన్ స్క్రీన్ లోషన్స్ / క్రీమ్స్’ను ఎండలోకి వెళ్లే కనీసం 20 నిమిషాల ముందర పిల్లల చర్మంపై రాయాలి. ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంటే ప్రతి మూడు గంటలకోమారు మళ్లీ ఒకసారి ఈ క్రీమ్ రాస్తుండాలి. పిల్లలను కారులో ఉంచి షాపింగ్ చేయడం ప్రమాదకరం. అలా ఎప్పుడూ ఆగి ఉన్న కారులో పిల్లలను ఉంచి లాక్ చేయకూడదని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు ఇవ్వకూడనివి... దాహాన్ని పెంచడం, డీ–హైడ్రేషన్ కలిగించే గుణం ఉన్నందున వేసవిలో ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తగ్గించాలి. అయితే నిమ్మ వంటి షర్బత్లలో చిటికెడు వేసుకోవచ్చు. పరిమితంగా తీసుకునే ఉప్పు మజిల్క్రాంప్స్ను తగ్గిస్తుంది. ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ కూడా వీలైనంతగా తగ్గించాలి. కాఫీ, టీ, కూల్డ్రింక్స్లో కెఫిన్ మోతాదులు ఎక్కువ. వాటిని పిల్లలకు ఇవ్వడం సరికాదు. ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉంచాలి. వాటికి బదులు తాజా పండ్లముక్కలూ, ఫ్రూట్సలాడ్స్ వంటివి ఇవ్వవచ్చు. డాక్టర్ కంచన్ ఎస్ చన్నావర్కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్నిర్వహణ: యాసీన్ (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
జస్ట్ ఆరు నెలల్లో 32 కిలోలు..! యంగ్లుక్లో 48 ఏళ్ల వ్యక్తి..
బరువు పెరగడం అనేది ముమ్మాటికి అధికంగా తినడం వల్ల మాత్రమే కాదు. ఉరుకుల పరుగుల జీవన విధానానికి తోడు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాన్ని అధిగమించే క్రమంలో చెడు ఆహారపు అలవాట్లకు బానిస అవ్వడంతో అధిక బరువుకి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలానే ఇక్కడొక వ్యక్తి ఊబకాయం బారినపడి రోజువారీ పనులు చేసుకోలేక పలు అవస్థలు పడ్డాడు. కనీసం ఫ్లైట్ జర్నీ సైతం కష్టంగా మారింది. అక్కడ చైర్లు తన భారీకాయాని సరిపోక ఇబ్బందులు, వార్డ్రోబ్లో బట్టలన్నీ డబుల్ఎక్స్ఎల్ సైజులే. కనీసం తనకు నచ్చిన డ్రెస్ తనసైజులో దొరకక పడే కష్టాలతో విసుగెత్తిపోయాడు. చివరికి బరువు తగ్గి స్మార్ట్గా మారాలని గట్టిగా నిశ్చయించుకుని మరి ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా తగ్గిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా ఆరు నెలల వ్యవధిలోనే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం విశేషం. అదెలాగో ఆ వ్యక్తి మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.ఆ వ్యక్తే 48 ఏళ్ల డేవిడ్. అతడు ఆరు నెలల క్రితం సుమారు 128 కిలోల బరువు ఉండేవాడు. 48 ఏళ్ల వయసులో చాలా చురుకుగా ఉండేవాడు, చక్కగా వ్యాపారాన్ని రన్ చేసేవాడు. తన పిల్లల బాస్కెట్బాల్, సాకర్ జట్లకు కోచ్గా వ్యవహరించాడు. కానీ అతడు తన ఆరోగ్యం పట్ల చాలా చాలా ఆసంతృప్తిగా ఉన్నాడు. రోజువారీ పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నవిగా మారాయి. ప్రయాణాలకు సామాన్లు సర్దుకోవడం ఒక పెద్ద పనిగా అనిపించేది. విమాన సీట్లు చాలా అసౌకర్యంగా ఉండేవి అతడికి. ఆఖరికి సరిగ్గా సరిపోయే బట్లలు దొరకడం ఓ సవాలుగా ఉండేది. దీనికి కారణం పని ఒత్తిడి. ఆ స్ట్రెస్ కారణంగా జంక్ఫుడ్కి బానిసయ్యాడు. అది కాస్తా అతడి రూపురేఖల్ని మార్చేసేలా అధిక బరువుకి దారితీసింది. ఇకలాభం లేదు ఇలా ఉంటే..రాను రాను తన కదలికలే భారంగా మారపోతాయేమో అనేంత భయం వేసింది. దాంతో బరువు తగ్గాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఫిట్నెస్ కోచ్ కెవ్ని సంప్రదించాడు. అతడి మార్గదర్శంకలో సరైన జీవనశైలిని అవలంబించి కేవలం ఆరు నెలల్లోనే 32 కిలోలు తగ్గాడు. ఇంతకుముందు బట్టలు సర్దుకోవడం, జర్నీలకు వెళ్లడం ఎంత భారంగా ఫీలయ్యాడో..ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంగా తేలిగ్గా చేసేస్తున్నాడు. అంతేగాదు కొలరాడోకు విమాన ప్రయాణంలో సౌకర్యవంతంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు డేవిడ్. అంత సులభంగా, వేగవంతంగా బరువు ఎలా తగ్గాడో..తన వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందో అతడి ఫిట్నెస్ కోచ్ కెవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. పైగా అతడు ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో కూడా వివరించాడు.బరువు తగ్గేందుకు పాటించాల్సినవి..స్థిరంగా బరువు తగ్గాలంటే..ప్రోటీన్ల కోసం ఆహారంలో చికెన్ బ్రెస్ట్, సిర్లోయిన్ స్టీక్, సాల్మన్, గుడ్లు, టర్కీ బేకన్, రొయ్యలు, గ్రీక్ యోగర్ట్, కాటేజ్ చీజ్ తదితరాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ల కోసం తెల్లటి అన్నం, కెవ్ బ్రోకలీ, ఆస్పరాగస్, మిరపకాయలు, పాలకూర, పచ్చి బీన్స్ తదితరాలను సిఫార్సు చేస్తున్నారు. అంతేగాదు క్రియేటివ్ మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి సంప్లిమెంట్లను కూడా జోడించినట్లు తెలిపారు కోచ్ కెవ్.ఫుడ్ ప్లాన్..ప్రణాళికతో కూడిన భోజనం, అది కూడా సమతుల్యం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.భోజనం 1: ప్రోటీన్ షేక్తో గ్రీక్ యోగర్ట్, లేదా టర్కీ బేకన్తో 3 గుడ్లు, లేదా అధిక ప్రోటీన్ యోగర్ట్తో కాటేజ్ చీజ్.భోజనం 2: అన్నం, బ్రోకలీతో చికెన్, చిలగడదుంప, కూరగాయలతో మటన్, లేదా అన్నం, ఆకుకూరలతో సాల్మన్ ఉన్నాయి.భోజనం 3: బంగాళదుంపలు, ఆస్పరాగస్తో చికెన్ లేదా కాలీఫ్లవర్ రైస్ విత్ మిరపకాయలు, కూరగాయలతో రొయ్యలుతినమని కోచ్ కెవ్ సిఫార్సు చేసినట్లు తెలిపారు.మెరుగైన ఫలితాల కోసం..సత్వరమే మార్పులు పొందాలంటే సక్రమైన విధంగా దినచర్యను అనుసరించాల్సి ఉంటుంది.ఉదయం 5:30 గంటలకు నిద్రలేచి, రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి.మద్యపానానికి దూరంగా ఉండటం, రాత్రి 7 గంటల తర్వాత తినడం ఆపడంప్రతిరోజూ కనీసం 8 వేల అడుగులు నడవాలివారానికి 3–4 సార్లు 45 నిమిషాల పాటు తీవ్రమైన శక్తి శిక్షణ వ్యాయామాలు చేయడం.ఉదయం 30 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం, రెండుసార్లు బయట నడవడంప్రతిరోజూ కనీసం 150 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడంనీరు, ఎలక్ట్రోలైట్లతో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండిప్రతిరోజూ 5 గ్రాముల క్రియేటిన్, నిద్రపోయే ముందు 400mg మెగ్నీషియం తీసుకోండిఈ విధమైన దినచర్యతో ఆరు నెలల్లో 129 కిలోల నుంచి 96 కిలోలుకు చేరుకుని యువకుడి మాదిరిగా తన శరీరాకృతిని మార్చుకున్నాడు. సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా పరివర్తన వస్తుందనడానికి డేవిడ్ వెయిట్లాస్ స్టోరీనే ఉదాహరణ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. David lost 70lbs in 6 months at 48 years old.He came to us at 283 lbs.Active guy. Runs a business. Coaches his kids' basketball and soccer teams.But he wasn't where he wanted to be with his health and knew he needed to make a change.He knew what was wrong. He just… pic.twitter.com/zTiabcWAt7— Coach Kev - Belly Fat Pro (@AskCoachKev) April 10, 2026 (చదవండి: గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!) -
మంచి రక్తప్రసరణ కోసం..!
మంచి రక్త ప్రసరణకు, మానిసిక ప్రశాంతతకు యోగాలో చాలామంచి ఆసనాలు ఉన్నాయి. అవి క్రమం తప్పకుండా వేస్తుండటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా మానసికంగానూ బలోపేతం అవుతారని చెబుతున్నారు యోగా నిపుణులు. మరి అవేంటో చూద్దామా..!మరీచాసనం..చేయు విధానం.. మ్యాట్పై కూర్చొని రెండు కాళ్లను నిటారుగా చాచి దండాసనంలో ఉండాలి. ఎడమ కాలిని మడిచి, ఎడమపాదాన్ని కుడితొడపై ఉంచాలి. ∙ఎడమ మోకాలిని ఎడమచేతితో చుట్టి పట్టుకుని, రెండు చేతులను వెనుకకు తీసుకెళ్లి లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వెన్నెముకను నిటారుగా ఉంచాలి. శ్వాస వదులుతూ మెల్లగా కుడి వైపుకు తిరగాలి. ఈ స్థితిలో 10–15 సెకన్లు ఉండాలి. తర్వాత మామూలు స్థితికి వచ్చి, మరోవైపు చేయాలి.ఉపయోగాలు.. రక్త ప్రసరణ మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెన్నెముక, నడుము బలపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.జాగ్రత్తలు.. 1. వెన్ను నొప్పి లేదా డిస్క్ సమస్యలున్నవారు ఈ ఆసనం చేయకూడదు. 2. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ ఆసనం చేయకూడదు.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ ఒత్తిడి పరార్నిత్యం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి పరారవుతుంది. ద్యానం ఒత్తిడిని తగ్గించి.. ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా క్షణాల్లో దానికి పరిష్కారాన్ని వెతకగలిగే సామర్థ్యం మెరుగుపడుతుంది. కనుక ప్రతి రోజూ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ధ్యానం చేయాలన్నది నిపుణుల సూచన.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..) -
చిన్నారి కిడ్నీలో పెద్ద రాయి.. శస్త్రచికిత్స లేకుండానే..
సాధారణంగా పెద్దవారిలో కనిపించే కిడ్నీ సంబంధిత సమస్యలు ఇప్పుడు పసిపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలోని బీదర్కు చెందిన ఏడాది వయసున్న బాలుడికి శస్త్రచికిత్స లేకుండా, ఎటువంటి కోత లేకుండా కిడ్నీలోని 10 మిమీ రాయిని తొలగించి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు అద్భుత విజయాన్ని సాధించారు.బీదర్కు చెందిన ఒక ఏడాది బాలుడు విపరీతమైన ఏడుపు, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యులను సంప్రదించారు. పరీక్షల్లో బాలుడి ఎడమ కిడ్నీలో 10 మిమీ పరిమాణం ఉన్న రాయి ఉన్నట్లు తేలింది. తదుపరి చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్లోని ఏఐఎన్యూ ఆసుపత్రికి తీసుకువచ్చారు.అధునాతన చికిత్స - 'ఈఎస్డబ్ల్యూఎల్' (ESWL):బాలుడు చాలా చిన్నవాడు కావడం, సాధారణ సర్జరీ వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యాధునిక ఎక్స్ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ESWL) పద్ధతిని ఎంచుకుంది.కోత లేని వైద్యం: ఈ పద్ధతిలో ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కేవలం 'లిథోట్రిప్టర్' యంత్రాన్ని ఉపయోగించి హై-ఎనర్జీ షాక్ వేవ్స్ ద్వారా రాయిని ఇసుక రేణువులంత చిన్న ముక్కలుగా పొడి చేశారు.సురక్షితం: అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఉపయోగించడం వల్ల బాలుడికి రేడియేషన్ ముప్పు కలగకుండా జాగ్రత్త పడ్డారు.వేగవంతంగా కోలుకోవడం: చికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే బాలుడు మామూలు స్థితికి వచ్చి పాలు తాగడం ప్రారంభించాడు. అదే రోజు డిశ్చార్జ్ కూడా చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ మాట్లాడుతూ.. "పిల్లల విషయంలో సర్జరీ వల్ల కలిగే గాయాన్ని తగ్గించడమే మా ప్రాధాన్యత. ఈ ఆధునిక పద్ధతి వల్ల ఒక్క రక్తపు చుక్క కూడా చిందకుండా, అత్యంత సురక్షితంగా రాయిని తొలగించగలిగాము," అని తెలిపారు.ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున సి. మాట్లాడుతూ.. "ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చిన్నారుల్లో కూడా కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయి. చిన్నపిల్లల్లో ఎండోస్కోపీ, లేజర్ వంటి పద్ధతులు వారి శరీర నిర్మాణానికి ఇబ్బంది కలిగించవచ్చు. అటువంటి సమయాల్లో ఈఎస్డబ్ల్యూఎల్ అత్యంత ప్రభావవంతమైన మార్గం," అని పేర్కొన్నారు. కాగా, నెల రోజుల తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలుడి కిడ్నీలో రాయి పూర్తిగా తొలగిపోయిందని, అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృవీకరించారు. డాక్టర్ మల్లికార్జున సి, యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్దేశ్పాండ్య హేమేష్, ESWL టెక్నీషియన్ (చదవండి: ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?) -
ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?
గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మైఖేల్ పాట్రిక్ 35 ఏళ్ల వయసులో నాడీ సంబంధిత వ్యాధి మోటార్ న్యూరాన్ వ్యాధితో మృతి చెందారు. ఏప్రిల్ 9, 2026న, అతను మరణించినట్లు ఆయన భార్య నవోమి షీహాన్ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. ఆయన గత రాత్రి నార్తర్న్ ఐర్లాండ్ హాస్పిస్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపింది. ఆయనకు ఫిబ్రవరి 1, 2023న అతనికి మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు, అక్కడ అద్భుతమైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. నయం చేయలేని ఈ వ్యాధి కారణంగా ఆయన తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు. ఒక్కసారిగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నటుడిని పొట్టనబెట్టుకున్న మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే..?, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే ..పేరు సూచించినట్లుగా, మోటార్ న్యూరాన్ వ్యాధి (MND) అనేది న్యూరాన్లు, చలనశీలతకు సంబంధించిన ఒక వ్యాధి. క్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, MND అనేది మోటార్ న్యూరాన్లను నాశనం చేసే నరాల సంబంధిత రుగ్మతల సమూహాన్ని సూచిస్తుంది. ఈ న్యూరాన్లు మింగడం, మాట్లాడటం, నడవడం, శ్వాస తీసుకోవడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాయి.సింపుల్గా చెప్పాలంటే.. మెదడులోని న్యూరాన్ల (ఎగువ మోటార్ న్యూరాన్లు) నుంచి వచ్చే సందేశాలు సాధారణంగా వెన్నుపాములోని న్యూరాన్లకు (దిగువ మోటార్ న్యూరాన్లు) ప్రసారం చేయబడతాయి. అక్కడి నుంచి, సందేశాలు శరీరంలోని కండరాలకు చేరి, అవి పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. కండరాలు దిగువ మోటార్ న్యూరాన్ల నుంచి సందేశాలను అందుకోలేనప్పుడు, అవి బలహీనపడి కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా, దిగువ మోటార్ న్యూరాన్లు ఎగువ మోటార్ న్యూరాన్ల నుంచి సంకేతాలను అందుకోలేనప్పుడు, కండరాలు బిగుసుకుపోతాయి, దీనివల్ల స్వచ్ఛంద కదలికలు నెమ్మది నెమ్మదిగా కష్టంగా మారతాయి.కాలక్రమేణా, రోగి నడిచే సామర్థ్యాన్ని లేదా శరీర కదలికలను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. మోటార్ న్యూరాన్ వ్యాధులకు ప్రస్తుతం ఎలాంటి నివారణ లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అంతకంతకు తీవ్రమయ్యే వ్యాధి కాబట్టి, కాలక్రమేణా దీని తీవ్రత పెరుగుతుంది.అయితే, కొన్ని చికిత్సలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై ప్రభావాన్ని తగ్గించగలవు, కానీ మోటార్ న్యూరాన్లు వారాలు, నెలల తరబడి క్షీణిస్తూనే ఉంటాయి, చివరికి రోగిని అంగవైకల్యానికి గురిచేసి, మరణానికి దారితీస్తాయి.మోటార్ న్యూరాన్ వ్యాధుల లక్షణాలుMND లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అవి క్రమంగా పెరగవచ్చు. మాటలు తడబడటంకాళ్ళలో బలహీనతకండరాలు అదరడంబరువు తగ్గడంపట్టు బలహీనపడటంఅసంకల్పితంగా ఏడవడం లేదా నవ్వడం వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందినిద్రకు భంగం కలగడంఊపిరి ఆడకపోవడంగందరగోళంపదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్ రావడంఉదయం పూట తలనొప్పిఅలసటవాస్తవానికి ఈ వ్యాధికి కచ్చితమైన లక్షణం అంటూ ఉండదని చెబుతున్నారు నిపుణులు. కాలక్రమేణా మోటార్ న్యూరాన్లు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయని పరిశోధనల్లో వెల్లడైందని చెబుతున్నారు నిపుణులు. MND వంశపారంపర్యంగా రావచ్చు, అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించవచ్చు. ఒకే ఒక్క జన్యు మార్పు కూడా ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావడానికి కారణం కావచ్చు.MND సాధారణంగా 60 మరియు 70 ఏళ్ల వయస్సు గల వారిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్కోసారి ఇది పెద్దలు పిల్లలను కూడా ప్రభావితం చేయగలదు. ఒక వ్యక్తికి దగ్గరి బంధువుకు ఈ వ్యాధి లేదా ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా అనే సంబంధిత రుగ్మత ఉంటే, ఆ వ్యక్తికి MND వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.(చదవండి: నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..) -
మధుమేహం, అధిక బరువు : బ్రయాన్ జాన్సన్ చిట్కా
యాంటీ-ఏజింగ్ ఇన్ఫ్లుయెన్సర్ బ్రయాన్ జాన్సన్ గుర్తున్నాడా? మరణాన్ని జయించాలని చూస్తున్న అమెరికా టెక్ వ్యాపారవేత్త బ్రయాన్ మరో సరికొత్త చిట్కాను పంచుకున్నాడు. భోజనం తర్వాత 30 నిమిషాల నడక కంటే 10 స్క్వాట్లు చేయడం మేలంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ కోసం భోజనం తర్వాత నడవడం చాలా మంచిదని పలువురు వైద్యులు, నిపుణులు చెబుతున్న మాట. అయితే అనేక ప్రయోగాలు, మందులు, ఆహార అలవాట్లతో యువకుడిగా మారిన బ్రయాన్ జాన్సన్ వాకింగ్ కంటే 10 స్క్వాట్లు ఉత్తమమని చెబుతున్నాడు. స్క్వాట్లతో చాలా తక్కువ టైంలోనే చక్కటి జీవక్రియ ప్రయోజనాలను అందిస్తుందని జాన్సన్ వాదన."30 నిమిషాల నడక కంటే రక్తంలో చక్కెర నియంత్రణ కోసం, ప్రతి 45 నిమిషాలకు 10 స్క్వాట్లు చేయడం అనేది, కేవలం 30 నిమిషాల నడక కంటే 14 శాతం ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది," అని జాన్సన్ పేర్కొన్నాడు.. "అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో, మధ్యమధ్యలో కూర్చోవడం వల్ల కండరాల కదలిక పెరిగి గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుంది" అనే శీర్షికతో ఉన్న 2024 అధ్యయనాన్ని ఆయన ఉటంకించం గమనార్హం. శరీరంలో క్వాడ్స్ (తొడ కండరాలు), గ్లూట్స్ (పిరుదుల కండరాలు) అతిపెద్ద 'గ్లూకోజ్ స్పాంజ్లు' అని, స్క్వాట్లు చేయడం వల్ల అవి సమర్థవంతంగా ఉత్తేజితమవుతాయని జాన్సన్ వివరించారు. (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!)10 squats beats a 30 min walk.For blood sugar control after a meal, doing 10 squats every 45 minutes outperforms a dedicated 30 min walk by 14%.The mechanism: your quadriceps and glutes are the largest glucose sponge in your body. Activating them repeatedly clears more… pic.twitter.com/OMmfVGqRUY— Bryan Johnson (@bryan_johnson) April 9, 2026 క్వాడ్రిసెప్స్, గ్లూట్స్ శరీరంలో అతిపెద్ద గ్లూకోజ్ స్పాంజ్లు. వీటిని తరచుగా ఉత్తేజపరచడం ద్వారా ఒకేసారి చేసే ప్రయత్నంలో కంటే ఎక్కువ గ్లూకోజ్ తొలగించబడుతుంది. 30 నిమిషాల నడక తప్పు కాదు, కానీ అది అంత సమర్థవంతమైనది కాదని బ్రయాన్ తెలిపాడు. అంతేకాదులో పనిలో లేదా కార్యాలయంలో ఎక్కువ గంటలు కూర్చునే అలవాటును విడనాడటం వల్ల ఈ 14 శాతం ప్రయోజనం లభించిందని జాన్సన్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఖచ్చితంగా చెప్పాలంటే, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఒకేసారి నడవడంతో పోలిస్తే, అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో చిన్నపాటి నడక లేదా స్క్వాటింగ్ విరామాలు గ్లైసెమిక్ నియంత్రణను సమర్థవంతంగా మెరుగుపరుస్తాయని 2024 అధ్యయనం వెల్లడించింది. ఆ 14 శాతం ప్రయోజనం ప్రతి 45 నిమిషాలకు కూర్చోవడాన్ని విరామం ఇవ్వడం వల్ల వచ్చింది, అంతేగానీ ప్రత్యేకంగా స్క్వాట్స్ చేయడం వల్ల కాదు. ప్రతి 45 నిమిషాలకు కొద్దిసేపు నడవడం కూడా స్క్వాట్స్తో సమానంగా పని చేస్తుందని ఈ స్టడీ తెలిపింది.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, ఈ విధానంపై దాదాపు అందరూ సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భోజనం తర్వాత నడవడానికి తగినంత సమయం లేని వారు ఇప్పుడు కేవలం స్క్వాట్స్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సోషల్ మీడియా వినియోగదారులు సూచించారు."చాలా సులభం, అయినా అద్భుతంగా ప్రభావవంతమైనది," అని ఒకరు,"భోజనం చేసిన వెంటనే నడవడానికి సమయం లేకపోతే, ఇది మంచి పద్ధతు అని మరొకరు వ్యాఖ్యనించారు. "అవును, నిజమే. రోజుకు ఒకసారి 30 నిమిషాలు నడిచి, మిగిలిన 8 గంటలు కూర్చోవడం మీ జీవక్రియను పూర్తిగా కాపాడదు. దానికి బదులుగా, భోజనం తర్వాత ప్రతి గంటకు మీ కుర్చీలోంచి లేచి 10 స్క్వాట్స్ చేయడం రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కమెంట్ చేశారు. -
పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..
ఈ ఏజ్లో అంత కష్టతరమైన వ్యాయామాలు మావల్ల కాదు అనే వాళ్లకు ఈ బామ్మే ఆదర్శం. చేయాలనే గట్టి సంకల్పం ఉంటే వయసు అనేది పెద్ద సమ్య కాదని ఈ బామ్మని చూస్తే తెలుస్తుంది. పెద్ద వయసువారైన సులభంగా క్లిష్టమైన వ్యాయమాలు చేయాలంటే కేవలం ఓపిక, నిలకడే అత్యంత కీలకం అని ఈ సూపర్ బామ్మని చూస్తే అర్థమవుతోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియో క్లిప్లో కనిపిస్తున్న మహిళ పేరు అమృత్ కౌర్. 75 ఏళ్ల వయసులో మరింత బలంగా ఉండేందుకు చిన్నపాటి కదలికల కోసం వ్యాయమాలు చేస్తూ కనిపిస్తుంటుందామె. ముఖ్యంగా ఆ వృద్ధాప్య వయసులో పుష్ అప్లు చేసేందుకు పడ్డ శ్రమ చూస్తే..నోరెళ్ల బెట్టడం ఖాయం. మొదట కొన్నింటి సాయంతో పుష్ అప్లు చేస్తుంటుంది. ఆ తర్వాత మోకాళ్లు, చిన్న పరికరాల సాయంతో పుష్ అప్లు చేస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వేటి సాయం లేకుండా సునాయాసంగా పుష్ అప్లు చేస్తుంటుంద. నిలకడతో చేస్తూ ఉంటే..ఎంత కష్టమైన వ్యాయామాలైన ఈజీగా చేసేయొచ్చని ఈ బామ్మని చూస్తే అర్థమవుతుంది. ఈ బామ్మ జస్ట్ 12 వారాల్లో పుష్ అప్లో పట్టు సాధించింది. రోజు జిమ్కి వచ్చేవారు సైతం సిగ్గుపడేలా ఎంత అద్భుతంగా చేసిందో చూస్తే మాటలు రావు. నెటిజన్లు ఇకపై ఎలాంటి సాకులు చెప్పకండి ఈ బామ్మని చూసి స్ఫూర్తి పొందండి, అమ్మో బామ్మ నువ్వు చాలా గ్రేట్ అని రకరకాలు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Amrit Kaur | Strong at 75 ❤️ (@getfitwithdadi) (చదవండి: ఆ రైడ్కి ఐదు స్టార్లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్..) -
కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలు కలిపి తీసుకోవచ్చా..?
సమ్మర్ మొదలైపోయింది. బయట వేడి ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. అదీగాక ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ సైతం ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని ముందుగానే హెచ్చరించింది కూడా. అప్పుడే మే నెల రాక మునుపే సూర్యడి భగభగలు మాములుగా లేవు. ఈ సమయంలో అధికంగా తీసుకోవాల్సింది నీరు. ముఖ్యంగా శరీరం హైడ్రేషన్గా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఎక్కువ మంది కొబ్బరి నీళ్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలాగే సబ్జా నీళ్లు కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు ఈ రెండిటిని కలిపి తీసుకుంటారు. అసలు ఇలా కలిపి తీసుకోవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా..అంటే..వేసవిలో చాలామంది డీహైడ్రేషన్కి గురై మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అందుకు కొబ్బరి నీళ్లు, సబ్జా రెండూ సమర్ధవంతంగా పనిచేస్తాయి. అసలు వేసవిలోనే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎందుకు అధికంగా ఉంటుందంటే..రికార్డు స్థాయిలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు శరీర సాధారణ పనితీరుపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీనిని 'హీట్ స్ట్రెస్' లేదా వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అధికంగా నీరు కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ సంభవించవచ్చు. మూత్రం కూడా చిక్కగా మారుతుంది, దాని రంగును బట్టి శరీరం ఎంత డీహైడ్రేషన్కు గురైందో తెలుస్తుంది. అలాంటి టైంలో మన తీసుకునే ఆహారం శరీరానికి వేడిచేసేవి అయితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో తగినంత నీరు తీసుకోవడంపై చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాదు శరీరంలో ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు, విటమిన్లు సమతుల్యంగా ఉండేలా చేసుకోవడానికి, వివిధ వనరుల ద్వారా నీటిని తీసుకోవడం అత్యంత అవసరం.కొబ్బరి నీరు: ప్రకృతి అందించే సహజసిద్ధమైన ఔషధం.. కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లు, యు పొటాషియంను అందించే ఒక సహజ జల వనరుగా పేర్కొంటారు. అంతేకాకుండా, దీనికి నిర్విషీకరణ, బాక్టీరియా నిరోధక, పునరుజ్జీవనం, జీర్ణక్రియ, మూత్రవిసర్జన వంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మూత్రపిండాల నుంచి లవణాలను బయటకు పంపడానికి తగినంత నీరు అందనప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి, కాబట్టి ఇది వాటిని నివారించగలదు. తరుచుగా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల మూత్రం పలుచబడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.కొబ్బరి నీరు జీర్ణాశయ సంబంధిత సమస్యలు, రక్త విరేచనాలపై సానుకూల చికిత్సా ప్రభావాలను కలిగి ఉంటుంది. పిల్లలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.సబ్జా గింజలు:సబ్జా గింజల్లోని నీటిని శోషించుకునే లక్షణం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫార్మా ఇన్నోవేషన్ జర్నల్ ప్రకారం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఖనిజాలను కలిగి ఉండే పోషక ప్రొఫైల్, మూత్ర సంబంధిత ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మూత్రపిండాల పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.కొబ్బరి నీరు సబ్జా గింజల కలయికకొబ్బరి నీరు, సబ్జా గింజల సరైన కలయిక మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని ఆయర్వేదం చెబుతోంది. ఇంటర్నేషనల్ బ్రాజ్ జె యూరల్లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మీ మూత్రంలో ఉప్పు స్ఫటికాలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది కానీ సబ్జా గింజలు మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయనేందుకు ఆధారాలు లేవు అని పేర్కొంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొబ్బరి నీళ్ళు లేదా తులసి గింజల వంటి సహజసిద్ధమైన హైడ్రేటింగ్ వనరులను సురక్షితంగా తీసుకోవడానికి వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు అనుగుణంగా సురక్షితమైన విధంగా ఎలా తీసుకోవాలో సూచిస్తారని చెబుతున్నారు. అంతేగాదు లోబీపీతో బాధపడేవారు సబ్జాగింజలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..) -
హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..
దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మొదలైంది. పద్నాలుగేళ్ల బాలికలు మొదలుకొని దేశంలో దాదాపు కోటీ పదిహేను లక్షల మంది యువతులకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క సింగిల్డోస్ (మోతాదు)తో మహిళల్లో సర్వైకల్ కేన్సర్ను సమర్థంగా నివారించే (93% నుంచి 100% వరకు రక్షణ కల్పించే) ఈ వ్యాక్సిన్ను ఇవ్వడం మొదలుపెట్టారు. మన దేశంలో విస్తృతంగా మొదలైన ఈ మహిళా ఆరోగ్య సంరక్షణ చర్య ద్వారా అంతర్జాతీయంగా కేన్సర్ నివారణ చర్యలు తీసుకున్న 160 దేశాల్లో మన దేశం కూడా ఒకటి కానుంది. ఈ నేపథ్యంలో ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి అవగాహన కోసం...హ్యూమన్ పాపిలోమా వైరస్ మహిళలను ప్రభావితం ఏలా చేస్తుందంటే... ఇది (హెచ్పీవీ) మహిళల్లో సర్వైకల్ కేన్సర్కు దారితీస్తుంది. సెక్స్ ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్పీవీ వైరస్ను కలిగి ఉంటారు. అయితే హెచ్పీవీ ఉండటం వల్లనే తప్పక అది సర్వైకల్ కేన్సర్కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే అది కేన్సర్ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్లో పాల్గొనేవారికీ హెచ్పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా స్త్రీలలో అందునా గ్రామీణ మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సర్విక్స్ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. ఈ భాగం మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అలా అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన వల్ల కేన్సర్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫాక్టర్ హెచ్పీవీ వైరస్... హెచ్పీవీ వైరస్ సోకడం సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. మామూలుగానైతే చాలామందిలో హెచ్పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్కేన్సర్కు దారితీసే అవకాశాలు పెరుగుతాయి. హెచ్పీవీ వైరస్తో పాటు పొగతాగే అలవాటు ఉండటం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటి అంశాలు కూడా సర్వైకల్ కేన్సర్కు దారితీసే రిస్క్ఫ్యాక్టర్లలో కొన్ని.నివారణ ఎలా? నివారణకు తొలుత తోడ్పడే పరీక్ష పాప్స్మియర్ అనే వైద్యపరీక్ష. సర్వైకల్ కేన్సర్ నిర్ధారణలో పాప్స్మియర్ అనే వైద్యపరీక్షది చాలా కీలక భూమిక. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, తమ లైంగిక జీవితం ప్రారంభమయ్యాక మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవడం అవసరం. అంటే చిన్న వయసు బాలికలు తప్ప మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. సర్వైకల్ కేన్సర్ రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దాన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–కేన్సరస్ దశ’ ఉండటం మరో అడ్వాంటేజ్. అంటే అసలు కేన్సర్ రావడానికి పదేళ్ల ముందే దీన్ని కనుగొనే అవకాశమున్నందున... అది కేన్సర్గా పరిణమించకముందే అంటే ‘ప్రీ–కేన్సర్’ దశలోనే నయం చేసుకోవచ్చు. పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం కూడా ఎక్కువే. హెచ్పీవీ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలంటే... గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే కేన్సర్లను నివారించే ఈ వ్యాక్సిన్ను ఎప్పుడు ఇవ్వవచ్చనే విషయంలో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు మేరకు.. పదకొండేళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. తొమ్మిదేళ్లు నిండిన బాలికలు మొదలుకొని 26 ఏళ్ల వరకు మహిళలందరికీ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. అయితే మహిళలకు వాళ్ల వివాహానికి ముందే అంటే... వాళ్లు తమ లైంగిక జీవితాన్ని మొదలు పెట్టకమునుపే దీన్ని ఇప్పించడం అవసరం. వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో 99% మందికి ఈ కేన్సర్ వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి సర్వైకల్ కేన్సర్ ముప్పు తాలూకు ఆందోళన లేకుండా వారు జీవితాంతం నిశ్చింతగా ఉండే నిర్భయత ఈ వ్యాక్సిన్ తీసుకున్న మహిళలకు ఉంటుంది.హెచ్పీవీ వ్యాక్సిన్తో ఇతరత్రా ప్రయోజనాలివే... హెచ్పీవీ వ్యాప్తినిఅరికట్టడంయోని దగ్గర వచ్చే పులిపిరుల(జెనిటల్ వార్ట్స్) సమస్య నుంచి రక్షణ గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణయోని క్యాన్సర్ వంటి మరికొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి నివారణ దీర్ఘకాలిక రక్షణను అందిస్తుందిమహిళా సమూహాలకు సంయుక్త రక్షణ (హెర్డ్ ఇమ్యూనిటీ) కలగడంచికిత్స తర్వాత మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు బాగా తగ్గడంతద్వారా జనాభాలోని అందరికీ / ప్రజారోగ్య సంరక్షణకు తోడ్పడటండాక్టర్ సాయిలక్ష్మి డయానా, సీనియర్ కన్సల్టెంట్, గైనిక్ ఆంకాలజిస్ట్ – యాసీన్చదవండి: ‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే.. -
‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే..
మెనోపాజ్ తర్వాత మహిళల్లో సాధారణంగా కనిపించే పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత కారణంగా కనిపించే ప్రోలాప్స్ సమస్యను చాలా మంది సహజంగా తీసుకుంటూ మౌనంగా భరిస్తుంటారు. కానీ ఈ సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా ఉపశమనం పొందవచ్చని కిమ్స్ కడల్స్ సికింద్రబాద్కు చెందిన కన్సల్టెంట్ యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ తెలిపారు. తాజాగా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మళ్లీ వచ్చిన వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్ కేసును విజయవంతంగా చికిత్స చేశామని వివరించారు.65 ఏళ్ల మహిళకు గతంలో గర్భాశయ గడ్డల కారణంగా హిస్టరెక్టమీ చేయబడింది. అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత యోనిలో బయటకు బల్జ్లా కనిపించడం ప్రారంభమై, రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2023లో ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, 2024లో మరోసారి మెష్తో అబ్డొమినల్ సర్జరీ చేశారు. అయినప్పటికీ నాలుగు నెలల్లోనే సమస్య మళ్లీ తలెత్తింది.ఈ నేపథ్యంలో ఆమె మమల్ని సంప్రదించగా కేసును సమగ్రంగా పరిశీలించి, మొదట వజైనల్ పెస్సరీ ద్వారా కన్సర్వేటివ్ చికిత్సను సూచించగా, రోగి ఏడాది పాటు ఆ విధానాన్ని అనుసరించారు.తరువాత శాశ్వత పరిష్కారం కోసం రోగి ముందుకు రావడంతో వజైనల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాం. ఇందులో యాంటీరియర్ వజైనల్ వాల్ రిపేర్, యూటెరోసాక్రల్ లిగమెంట్ సస్పెన్షన్ ద్వారా బలమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు హై పెరినియోరాఫీ కూడా చేశాం. ఈ శస్త్రచికిత్సతో రోగి త్వరగా కోలుకుని, సమస్య నుంచి గణనీయమైన ఉపశమనం పొందింది. ఈ సందర్భంగా డా. బిందు ప్రియ మాట్లాడుతూ, ప్రతి రోగికి చికిత్సను వ్యక్తిగతంగా ప్రణాళిక చేయడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రోలాప్స్ తీవ్రత, గత శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తామని తెలిపారు. పెల్విక్ ప్రోలాప్స్, మూత్రం అదుపు లేకపోవడం వంటి సమస్యలు వయస్సు కారణంగా రావడం సహజమే అయినప్పటికీ, అవి తప్పనిసరిగా భరించాల్సినవికాదు. సిగ్గు, అపోహల కారణంగా ఆలస్యం చేయకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే జీవన నాణ్యత మెరుగుపడుతుందని సూచించారు. మహిళలు నిర్భయంగా తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించేలా అవగాహన పెంపొందించడం సమాజ బాధ్యత అని డా. బిందు ప్రియ, డా. సాయి స్నేహిత పేర్కొన్నారు.యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ, సికింద్రాబాద్(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!
ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు బాధనే కాదు త్రుటిలో పెను ప్రాణాంతక ప్రమాదాల నుంచి రక్షిస్తాయి కూడా. ఒక్కోసారి విత్కర పరిస్థితి కూడా వరంగా మారిపోతుంది. అందుకు నిదర్శనమే ఈ మహిళ కథ. ఆ రోజు ఆమెకు ఆ యాక్సిడెంట్ జరగకపోతే..ప్రాణాలతో ఉండేది కాదు. ఇదేంటి అనుకోకండి ఈ కథ వింటే ఏం జరిగినా మన మంచికే అనే పెద్దల మాట తలపుకు వస్తుంది. అమెరికాలోని ఓవెన్స్ క్రాస్ రోడ్స్కు చెందిన 31 ఏళ్ల మెలిస్సా ఆడమ్స్ తన పెళ్లికి ఒక రోజు ముందు రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. రిహార్సల్ డిన్నర్ నుంచి ఇంటికి వస్తుండగా సిగ్నల్ వద్ద ఉన్న ఆమె కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఢీ కొట్టారు. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్సి చేసే నిమిత్తం వైద్యులు సీటీ స్కాన్ చేయగా..ఆమె ప్రాణాంతక కేన్సర్ వాధి బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. అది నాలుగో స్టేజ్లో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. ఒక్క క్షణంలో జీవితం తలకిందులైనట్లు అనిపించిందామెకు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ తమ పెళ్లిని వాయిదా వేసుకోకూడదని ఆమె, తన భాగస్వామి తీర్మానించుకున్నట్లు ఆడమ్స్ పేర్కొంది. ఈ దురదృష్టకర ఘటన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన రోజుని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఇలా చేసినట్లు తెలిపింది. తర్వాత వైద్యులు ఆమె శరీరంలోని మొత్తం 18 గడ్డలను గుర్తించి, ఆమెకు ఫోలిక్యులర్ డెండ్రిటిక్ సెల్ సార్కోమా (FDCS) అనే అత్యంత అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆ గడ్డలు ఆమె శరీరంలోని గుండె దగ్గర నుంచి పొత్తికడుపు, ఛాతీతో సహా పలుచోట్ల ఉన్నట్లు తెలిపారు. అనేక ఆస్పత్రులు, ఆంకాలజీ క్లినిక్లను సందర్శించిన తర్వాత చివరకు ఏప్రిల్ 1, బుధవారం నాడు చికిత్సను ప్రారంభించారు. సుమారు 19-20 వారాలు వేచి ఉన్న తర్వాత కీమోథెరపీని ప్రారంభించడంతో తనకు ఉపశమనం, ఆశ కలిగిందని అన్నారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు కోసం గోఫండ్ సాయం తీసుకున్నట్లు తెలిపింది. నిజానికి తనకు అప్పటికే కొన్ని ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నాయని, నడుము నొప్పితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మొదటి నుంచి ఆసమస్యలు ఉండటంతో అందువల్ల ఇలా అనుకున్నాననే గానీ ఇలా ప్రాణాంతక కేన్సర్ బారిన పడతానని ఊహించలేదని కన్నీటిపర్యంతమైంది. తాను గత కొంతకాలంగా శరీరం అంతా పలు నొప్పులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది. కణుతులు అవయవాలపై ఒత్తిడి తేవడం వల్లనేనని ఇప్పుడు అర్థమవుతోందని అంటోంది. వ్యాధి నిర్థారణ తర్వాత తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలంటూ ఇతరులకు సూచనలందిస్తోంది. అస్సలు తనకు గనుక ఆ కారు ప్రమాదం జరిగి ఉండకపోతే..తన అనారోగ్యాన్ని గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని అని అంటోందామె.అలాగే తనలాంటి లక్షణాలు ఉన్నా లేక శరీరం ముందుగా ఇచ్చే సంకేతాలనుక్ క్షణ్ణంగా అర్థంచేసుకోమని సూచిస్తోంది. తనలా నిర్లక్ష్యంగా ఉండొద్దని హితవు పలుకుతోంది. ఇక ఆడమ్స్ పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
పంటి సంరక్షణే.. ఆరోగ్యానికి రక్ష..!
పంటి రక్ష ప్రాణాలకు రక్ష అన్నా పర్వాలేదు. ఎందుకంటే నోరు అనే సింహద్వారానికి పళ్లు ద్వార పాలకులు.వాటిని దాటి ఏదీ రాలేదు. కానీ నోటి ఆరోగ్యం దెబ్బతింటే అది గొంతు ఇన్ఫెక్షన్లనూ, దీర్ఘకాలంలో అక్కడి నుంచి గుండెనూ దెబ్బతీసే ముప్పు లేకపోలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడమే. మనకు తెలియకుండా...మన రోజువారీ అలవాట్లలో భాగంగా చాలా పనులు చేస్తుంటాం.ఉదాహరణకు పంటికి లుంగజుట్టుకు పోయే చాక్లెట్లు తింటుంటాం. కూల్ వాటర్ తాగుతూ పంటి కిందికి ‘ఐస్’వస్తే నమిలేస్తుంటాం. ఇలా మనం చాలా తేలిగ్గా తీసుకుని చేసే కొన్ని పనులు పంటి ఆరోగ్యాన్నీ... దీర్ఘకాలంలో ఒంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమిటో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం ఎలాగో, తద్వారా పంటి, ఒంటి ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం...ఇప్పటి తరం పిల్లల దూకుడు గురించి చెప్పడానికి చాలానే ఉంటుంది. నేటి యువతలో నలుగురు కలిసి ఎక్కడో పిక్నిక్కు అంటూ కూల్డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఓపెనర్ దొరకకపోతే పళ్లతోనే బాటిల్ మూతలను ఓపెన్ చేసే నైపుణ్యం ఇప్పటి యువకుల సొంతం. అలాగే చాలామంది తమకు తెలియకుండానే పంటిని దెబ్బతీసే పనులు చాలానే చేస్తుంటారు. ఉదాహరణకు రాస్తూ రాస్తూ ఏదో ఆలోచిస్తూ పెన్ను చివరను నోట్లో పెట్టుకుని తేలిగ్గా కొరుకుతూ ఉండవచ్చు. అలాగే పొద్దున్నే బ్రష్ నోట్లో వేసుకుని నలుగురు కలిసి మాట్లాడుకునే టైమ్లో బ్రషింగ్కు బదులు బ్రష్ను నములుతూ ఉండిపోయే పల్లెల్లోని రచ్చబండ బ్యాచ్కు కొదవే లేదు. చల్లటి నీళ్లనో లేదా ‘ఛిల్ల్’టి డ్రింక్స్ తాగుతూ ఆ నీళ్లకు పళ్లు అదేపనిగా తాకుతూ ఉండేలా తాగేవారికి లోటు లేదు. మనం అంతగా పట్టించుకోకుండా చేసే ఇలాంటి చాలా పనులు పళ్లకు హాని చేయవచ్చు. నోరు అనేది దేహానికి సింహద్వారం అని చెప్పుకున్నాం కదా. మరి ఆ నోట్లోకి హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరాక అవి గొంతులోకి... అక్కడ్నుంచి దేహంలోకీ పోతూ... మొత్తం ఒంటికే చేటు తెచ్చే ముప్పు ఎప్పుడూ ΄పొంచే ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని చెడ్డ అలవాట్లను చిన్నారులు, యువత దృష్టికి తెచ్చి... వాటిని మాన్పించేలా చేయడమే ఈ కథనం ఉద్దేశం. టైటానిక్కు ఐస్బర్గ్ లాంటిదే... పంటికి ‘ఐస్’ వాటర్...మంచి టేస్టీ బిర్యానీతో పాటు చల్లటి కూల్డ్రింక్ తాగుతుండటం చాలామందికి అలవాటు. అంతేకాదు... ఇటీవలి ఫాస్ట్ ఫుడ్స్ అయిన బర్గర్, పిజ్జాలతో పాటు కోలా క్రిండ్స్ తీసుకోవడం ఇంకొందరికి పరిపాటి. ఒకవేళ వాళ్లు తీసుకోకపోయినప్పటికీ... ఇలాంటి ఫాస్ట్ఫుడ్స్తో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్గా కూల్డ్రింక్స్ చాలా మాల్స్లో దొరుకుతూ ఉండటం మామూలే. అందునా ఆ డ్రింక్స్లో ఐస్ క్యూబ్స్ వేసి మరీ ఇస్తుంటారు. కొందరు నోట్లోకి వచ్చిన ఆ ఐస్ ముక్కను ఉమ్మేస్తే బాగుండదనుకుని నుములుతూ ఉండటమూ మామూలే. ఇక రకరకాల ఫ్లేవర్స్లో దొరికే ‘ఐస్’ఫ్రూట్స్ తినే చిన్నారులు ఒక దశవరకూ వాటిని చప్పరించాక... ఇక ఓపిక తగ్గిపోయి... వాటిని నమిలి మింగేస్తుంటారు. మరికొందరు బాక్సింగ్, కిక్బాక్సింగ్, ఫుట్బాల్ ప్లేయర్స్ తమ పళ్ల రక్షణ కోసం ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి ఐస్ ముక్కల కారణంగా చాలామంది పళ్లు దెబ్బతింటాయి. తొలిదశలో కాస్తంత భరించేలా ఉన్న అవే ఐస్ ముక్కలు... పంటి ఎనామిల్ దెబ్బతిన్న తర్వాత జిల్లంటూ బాధించేవరకూ పరిస్థితి వెళ్తుంది. ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ నోట్లోకి తీసుకోవడం కారణంగా నోట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారిపోవడం వల్ల ఎనామిల్లో పగుళ్లు (క్రాక్స్) వచ్చే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం: పెద్దవాళ్లు ఐస్ ముక్కలతో కూడిన డ్రింక్స్ తీసుకుంటున్నా... లేదా చిన్నారులు ఐస్ఫ్రూట్లూ, ఐస్క్యాండీ తింటున్నా వీలైనంతవరకు ఐస్ను నమలకూడదు. అసలు పంటికి ఐస్ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక బాక్సింగ్, కిక్బాక్సింగ్ వంటి ఆటగాళ్లు ఐస్కు బదులు పళ్ల రక్షణ కోసం మౌత్గార్డ్నే వాడటం మేలు.పళ్లను ఓపెనర్గా వాడటం సరికాదు... పిక్నిక్లకు వెళ్లేప్పుడు ఆర్భాటంగా కూల్డ్రింక్స్ తీసుకెళ్లే యువకుల్లో చాలామంది ఓపెనర్ను తీసుకెళ్లడం మరచిపోయి, సీసా మూతలు తీయడానికి పళ్లను వాడుతుంటారు. బట్టలు కుట్టే టైలర్లలో కొందరు దారం ఎక్కించే ముందర సూదిని పంటితో పట్టుకోవడమూ అక్కడక్కడా కనిపించే దృశ్యమే. అంతేకాదు వాళ్లలో కొందరు దారాన్ని పంటితోనే తెంపుతుంటారు. షాంపూ షాచేలను చింపడానికి కొందరు పళ్లనే ఉపయోగిస్తుంటారు.పరిష్కారం: పంటి రక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మన పళ్లు ఓపెనర్లు కాదు. అలాగే కత్తెరకు బదులుగా పళ్లను వాడటమూ సరికాదు. ఈ పనులు చేసే చాలామందిలో పళ్ల ఎనామిల్ దెబ్బతినే ప్రమాదముంది. పంటి తాలూకు చిన్న ముక్క ఊడిపోయే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి పనులతో పళ్లు త్వరగా దెబ్బతింటారు. అందుకే సీసా మూతలు తీయడానికి ఓపెనర్నే వాడాలి. షాంపూ షాచేలు చింపాలంటే కత్తెరనే వాడాలి. అంతేతప్ప పళ్లను వాడకూడదని గుర్తుంచుకోవాలి.పండ్లరసాల్లోని చక్కెర పళ్లకు ముప్పు... పండ్లరసాలు ఆరోగ్యానికి చాలామంచివంటూ చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అనీ, స్పోర్ట్స్ డ్రింక్స్ అనీ తాగేస్తూ తమకు ఆరోగ్యంతో కూడిన శక్తి సమకూరుతోందంటూ ఆనందిస్తుంటారు. నిజానికి ఫ్రూట్ జ్యూసుల్లో, స్పోర్ట్స్ డ్రింక్స్లో ఉండే చక్కెరతో పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... లైమ్జ్యూస్ల వంటి పుల్లటి పండ్లరసాల్లోనియాసిడ్ వల్ల పళ్లు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది. పరిష్కారం: చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే పండ్లరసాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాంటి పానీయాలు తాగేటప్పుడు ఆ ద్రవం వీలైనంతవరకు పంటికి తగలకుండా తాగడం మేలు. ఇక తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్ లేదా పండ్లరసాలు తాగాక నోరు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు.పండ్లూ... పళ్లు... ప్రాధాన్యం దేనికి... ఏ సీజన్లో దొరికే మంచి తాజాపండ్లను ఆయా సీజన్లలో తినడం మంచి అలవాటే. అది ఆరోగ్యానికి మేలు చేసే అంశమే. కాకపోతే మరీ చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే పండ్లనూ, పులుపు మోతాదు కాస్తంత ఎక్కువగా ఉండే బత్తాయి, ద్రాక్ష, ఆరెంజ్ జ్యూస్లను వీలైనంత మేరకు పళ్లకు తగలకుండా తీసుకోవడం మేలు. ఎందుకంటే పుల్లటి పండ్లలో ఉండే ఆ పులుపులో ఉండే ఆమ్ల గుణం పంటిని దెబ్బతీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది.పరిష్కారం: పండ్లను ఫ్రూట్జ్యూస్లుగా తాగడం కంటే వాటిని కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... ఆ పానీయంలో చక్కెర కలుపుకోవడం తగదు. ఇక జ్యూస్ రూపంలో తాగినప్పటికీ... వెంటనే నోరు కడుక్కోవడం మరచిపోవద్దు.కరకరలాడే చిప్స్తో కిరికిరి... చిప్స్ కరకరలాడుతూ నాలుకకు రుచిగా ఉండవచ్చు. కానీ పళ్లకు అంత మంచివి కాదు. పైగా కరకరలాడే పదార్థాలు పళ్లకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. అంతేకాదు చిప్స్ లాంటి చిరుతిండ్లలో స్టార్చ్ కూడా ఎక్కువ. ఈ స్టార్చ్ లాలాజలం తగలగానే దాదాపు చక్కెరలా మారిపోయి పంటిని దెబ్బతీసే ముప్పు మరీ ఎక్కువ. అందుకే చిప్స్ లాంటివి తిన్న 20 నిమిషాల తర్వాత అవి పంటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి. అంతేకాదు... పంటి మధ్యన చిక్కుకునే చిప్స్ తాలూకు చిన్న చిన్న ముక్కలతో దంత క్షయం ముప్పు మరింత పెరుగుతుంది. ఇక మరికొందరు పిల్లలూ, ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఓ చిరుతిండిని నములుతూ ఉంటారు. దాంతో చిరుతిండిలో ఉండే పిండిపదార్థాలూ, చక్కెర వంటి పంటికి ముప్పు తెచ్చే అంశాలు పళ్లను దెబ్బతీస్తాయి.పరిష్కారం: వీలైతే తరచూ చిరుతిండ్లు తినే అలవాటుకు దూరంగా ఉండటం మేలు. లేదంటే చిరుతిండి తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చిరుతిండ్లకు బదులుగా క్యారట్ వంటిని నములుతూ ఉండటం మంచిది. ఇక చిప్స్ లాంటి చిరుతిండ్లను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ తప్పక తినాల్సివచ్చినప్పుడు తిన్నవెంటనే నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం (దారంతో పళ్ల మధ్య చేరే చిన్న చిన్న ముక్కలను శుభ్రపరచుకోవడం) తప్పనిసరి.కాఫ్ సిరప్తోనూ దంతక్షయం...చాలామంది కాఫ్ సిరప్ అనేది దగ్గు తగ్గేలా చేసే ఓ మందు అనుకుంటారు గానీ అందులో ఔషధంతో పాటు చక్కెర మోతాదులూ ఉంటాయి. ఆ చక్కెర పంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి. పరిష్కారం: దగ్గు మందును వీలైనంత మేరకు పలువరసకు తగలకుండా గొంతులో పోసుకోవడం మేలు. అలాగే దగ్గు మందు తాగిన వెంటనే నోరు కడుక్కోవడం మరచిసెవద్దు.తప్పుడు బ్రష్షింగ్ సరికాదు... చాలామంది బ్రష్ చేసుకోడానికి నోట్లో బ్రష్ పెట్టుకుంటారు గానీ... ఆ ప్రక్రియను వేగంగా ముగించకుండా అదేపనిగా నములుతుంటారు. ఇక కొందరు తప్పుడు పద్ధతుల్లో బ్రష్షింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు నోరు శుభ్రంగా ఉండాలనే తపనతో విపరీతంగా బ్రష్ చేసుకుంటారు. ఈ అన్ని చర్యలతోనూ పళ్లు త్వరగా అరిగిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్ను ఎంచుకోవాలి. పంటి మీద ఎక్కువ ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్బ్రష్ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్గా) కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. ఈ సమయంలో చిగుర్లకూ మాలిష్ జరుగుతుండేలా బ్రష్ కదలికలు (స్ట్రోక్స్) ఉండాలి. బ్రషింగ్ పూర్తయ్యాక వేలిచివరతో చిగుర్లను మాలిష్ చేస్తున్నట్లుగా సున్నాలు చుడుతున్నట్లుగా కదిలించాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా బ్రష్ను మార్చడం మేలు. ఒకవేళ జ్వరం రావడం లేదా ఆరోగ్యం చెడిపోవడం జరిగితే... కోలుకున్న వెంటనే బ్రష్ను మార్చడం మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం చెడిపోయినప్పుడు బ్రష్ మార్చడానికి మూడు నెలలు ఆగడం అనే నిబంధన పనికిరాదు.ఆ జబ్బుతో పంటికి ముప్పు... కొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు కారణంగా పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజువారీ ఒత్తిడుల కారణంగా తమకు తెలియకుండానే నిద్రలో పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఇక మరీ గట్టి పదార్థాలను అదేపనిగా నమలడం కూడా పంటి అరుగుదలను వేగవంతం చేస్తుంది.పరిష్కారం: నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, ఆ అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.ఎంత తక్కువ అయినా ముప్పే... గుండెపోటు నివారణకు తోడ్పడుతుందంటూ కొందరు రెడ్వైన్ తాగుతుంటారు. మిగతా ఆల్కహాలిక్ డ్రింక్స్తో ΄ోలిస్తే రెడ్వైన్ ఆరోగ్యకరమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి రెడ్వైన్లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్ను దెబ్బతీస్తాయి. దాంతో పళ్లు మెరుపును కోల్పోతాయి. అంతేకాదు... ఎంత తక్కువ మోతాదులోనైనా ఆల్కహాల్ ఒంటికి ముప్పు తెచ్చే అంశమే!పరిష్కారం: అది ఎంతటి ఖరీదైన లేదా నాణ్యమైన రెడ్వైన్ అయినప్పటికీ అది మద్యమే తప్ప ఆరోగ్యప్రదాయిని కానే కాదు. అదీ ఒకరకమైన మద్యమే కాబట్టి ఆ అలవాటును మానుకోవడమే మేలు.గోళ్లు కొరికే అలవాటు... పళ్లకు చేటు... కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ చెడ్డ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.పరిష్కారం: గోళ్లు కట్ చేసుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి వాటితో ఆ దురలవాటుకు దూరం కావాలి. పళ్లు కుట్టుకోవడం ఓ బ్యాడ్ హ్యాబిట్... చాలామంది ఏదైనా తినగానే టూత్పిక్స్తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరిగే ముప్పు ఉంటుంది. ఫలితంగా పళ్ల మధ్య మరింత ఆహారం చిక్కుకుని, బ్యాక్టీరియా పెరగడం, దాంతో పళ్లు మరింత వదులు కావడం వంటి ముప్పు ఉంటుంది.పరిష్కారం: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి.చివరగా... ఇక్కడ పేర్కొన్న చెడు అలవాట్లను వదులుకుంటే అవి చాలావరకు నోటికీ, పలువరసకు, పంటి చిగుర్లకు మాత్రమే కాదు... మొత్తం దేహానికే మంచి చేస్తాయని, ఓవరాల్ ఆరోగ్యానికీ మంచిదని గుర్తుంచుకోవవడం మేలు.‘టీత్’కు ముప్పు తెచ్చిపెట్టే టీలు... కాఫీలుకొందరు కాఫీలు, టీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇక తమ పనిలో ఒత్తిడిని అధిగమించడానికి టీ, కాఫీలను అలవాటు చేసుకుంటుంటారు. కొంతలో కొంత టీ వల్ల అంతగా ముప్పు ఉండదేమోగానీ... కాఫీలో ఉండే అసిడిక్ గుణం వల్ల పలువరస పచ్చగా మారే ముప్పు ఉంటుంది. టీ కూడా మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే అదీ తెల్లటి పలువరస రంగుమారేలా చేస్తుంటుంది. అంతేకాదు... బాగా వేడివేడిగా ఉండే టీ, కాఫీలలోని ఉష్ణోగ్రత వల్ల పంటి ఎనామిల్ దెబ్బతీనే అవకాశమూ ఉంటుంది. అందుకే చాలాకాలం పాటు టీ, కాఫీలు మితిమీరి తాగుతుండే కొందరిలో పంటి మెరుపు తగ్గే ముప్పు కూడా ఉంటుంది. ఇక కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పళ్లమధ్య క్యావీటీలూ, పిప్పిపళ్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే. పరిష్కారం: కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇప్పటికే ఈ అలవాట్ల కారణంగా పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్ చేయించుకోవడం ద్వారా వాటిని మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.పాన్లూ, జర్దా / ఖైనీలు వద్దు... చాలామంది అదేపనిగా పాన్ తింటూ ఉంటారు. అందులో వక్కలను నములుతూ ఉంటారు. ఇక అందులో జర్దా, ఖైనీ వంటి పొగాకు ఉత్పాదనలు నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఇందులో పాన్లోని కఠినమైన వక్కలను తినడం ఒక ప్రమాదమైతే... ఇక నోటి ద్వారా పొగాకును తీసుకోవడం పంటికీ, ఒంటికీ... ఈ రెంటికీ చాలా ప్రమాదం. ఇక పాన్ తినేవారి నోట్లో పళ్లు ఎర్రగా, చాలాకాలం నుంచి అదే అలవాటు ఉన్నవారిలో నల్లబారి ఉండటం చూస్తుంటాం. పరిష్కారం: పాన్ తినే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానివేయడం తప్పనిసరి. లేదంటే పళ్లకే కాదు మొత్తం దేహానికే ఈ అలవాటు చేటు తెచ్చిపెట్టవచ్చు. పాన్పరాగ్లూ, జర్దా వంటి పొగాకు ఉత్పాదనల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ.సిగరెట్లతో వచ్చే ముప్పు ఎన్నో రెట్లు... సిగరెట్ అలవాటు అనేది కేవలం పళ్లను మాత్రమే దెబ్బతీయదు. అది పూర్తిగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ, గుండెనూ... ఒక్కోసారి పూర్తిగా శరీర ఆరోగ్యానికి ముప్పుగ పరిణమించవచ్చు. సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు అది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు... నోటి దుర్వాసనతో నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడగిగే సోషలైజింగ్కూ పరిమితులు విధిస్తుంది. పొగాకు వల్ల పంటి చిగుర్లకూ ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... నోటి క్యాన్సర్లూ, పెదవుల, నాలుక, గొంతు క్యాన్సర్ల (హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల) ముప్పును తెచ్చిపెడుతుంది. పరిష్కారం: సిగరెట్లతో / పొగతాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు తప్పాలంటే తప్పక పొగతాగే అలవాటును వదిలివేయాల్సిందే. అప్పటికీ ఆ అలవాటును వదలలేకపోతే డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు చ్యూయింగ్ గమ్స్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా కొద్దికాలం కోసమే.పెన్సిల్ను కొరకవద్దు... కొందరు ఏదైనా రాస్తూ రాస్తూ ఉండి మధ్యమధ్యన ఏదో ఆలోచిస్తూ పెన్సిల్ను గానీ లేదా పెన్ క్యాప్ను గానీ పళ్ల మధ్య పెట్టుకొని కొరుకుతుంటారు. పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి. ఈ లెడ్పాయిజన్ చిగుర్ల రంగును నల్లగా మారుస్తుంది. పైగా లెడ్ పాయిజన్ మేనికి కూడా ప్రమాదకరమే. పరిష్కారం: రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ పెట్టుకోవద్దు. మరీ తప్పనప్పుడు చ్యూయింగ్గమ్ వంటివి నములుతూ ఉండటం కాస్తంత బెటర్. అసలు నమిలే అలవాటును మానుకోవడమే ఆరోగ్యానికి మేలు.పళ్లకు చుట్టుకుపోయే చాక్లెట్లు... తియ్యటి చాక్లెట్లు అంటే పిల్లలందరికీ ఇష్టమే. పైగా కొందరు పెద్దవాళ్లు కూడా తమకు మంచి ఆరోగ్య సమకూరడానికి డార్క్ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లలో చాలావరకు పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అలా చుట్టుకుపోవడంతో అందులోని చక్కెరను చాలాసేపు పంటిని అంటిపెట్టుకునే ఉంటూ... దంతక్షయానికి దారి తీస్తుంది. అంతేకాదు.. అలా చాలాకాలం పాటు చాక్లెట్లు చుట్టుకుపోవడం, పళ్లపైన ఉండే గుంటవంటి ప్రదేశంలో ఇరుక్కుపోవడం వల్ల పళ్లమధ్య రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. చదవండి: మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..ఈ రంధ్రం లోతు పెరుగుతున్న కొద్దీ... అందులో ఆహారపదార్థాలూ, చాక్లెట్ల వంటి చుట్టుకుపోయే పదార్థాలు మరింత ఎక్కువగా ఇరుక్కుపోతూ ఆ రంధ్రాలను మరింత లోతు ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో పిప్పిపళ్లు వస్తుంటాయి. పరిష్కారం: పంటిని చుట్టుకుపోయే చాక్లెట్లు, క్యాండీలు తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం లేదా ఆ చుట్టుకుపోయిన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేలా వేలిని ఉపయోగించి నోరు కడుక్కోవాలి.పాల బాటిల్ పళ్ల మధ్య పెట్టడం సరికాదు... కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులు ఈ అలవాటును ప్రోత్సహిస్తుంటారు. నిజానికి ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్బాటిల్ కేరిస్’ అనే సమస్య వచ్చే అవకాశముంది. దాంతో చిన్నారుల్లో పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.పరిష్కారం: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వడం సరికాదు. మరీ తప్పనిసరై చిన్నారులకు పాలను పట్టించాల్సి వస్తే గ్లాసు / స్పూన్ / ఉగ్గుగిన్నెతో పాలు పట్టించాలి. పిల్లలు పాలు తాగాక పెద్దపిల్లలకు బ్రషింగ్ చేయించడమూ లేదా బ్రషింగ్కు వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించడం అవసరం.- డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్, డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ నిర్వహణ యాసీన్ -
స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?!
మొబైల్, లేదా బుల్లితెర వ్యసనం (స్క్రీన్ అడిక్షన్) మీ మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా, పబ్జీ గేమ్ వ్యసనానికి గురై, తిరిగి బయటకు వచ్చిన ఒక యువకుడి స్ఫూర్తిగాధ మీకోసంస్క్రీన్ అడిక్షన్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఆయుర్వేద సూచనలు"నేను 24 గంటలు నిరంతరాయంగా పబ్జీ గేమ్ ఆడేవాడిని. కాలేజీ చదువున మధ్యలో వదిలేశాను. ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోయేవాడిని," అని 25 ఏళ్ల చెన్నారెడ్డి చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన పగలు సౌరశక్తి టెక్నీషియన్గా పని చేస్తూ, యోగా బోధిస్తున్నాడు. మరి ఆయనలో మార్పు ఎలా వచ్చింది?స్టాన్ఫర్డ్ లైఫ్స్టైల్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం, రోజుకు రెండు గంటలకుపైగా కాలక్షేపం కోసం మొబైల్ చూసే 18–25 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల్లో మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ మందం తగ్గిపోతుంది. మెదడులోని ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, జ్ఞాపకశక్తి, సమస్యల పరిష్కారం వంటి ముఖ్యమైన పనులకు బాధ్యత వహిస్తుందని మనం గుర్తించాలి.రోజుకు ఐదు గంటలకంటే ఎక్కువ స్క్రీన్ ముందు గడిపే పెద్దవారికి చిత్తభ్రమ, పక్షవాతం, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్ఫోన్ వ్యసనం మెదడులోని గ్రే మ్యాటర్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది—ఇది కదలికల నుంచి భావోద్వేగాల వరకు అన్నింటిని నియంత్రిస్తుంది. స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అణచి, సహజ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తుంది.ఇది మనసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది - ఆందోళన, నిరాశ, నలుగురితో కలవకపోవటం వంటివి పెరుగుతాయి. డా. మణికంటన్ చెప్పినట్లుగా, “ఇప్పుడైనా ఒక అడుగు వెనక్కి వేసి, మన స్క్రీన్ అలవాట్లను నిజాయితీగా పరిశీలించాల్సిన సమయం వచ్చింది.”స్క్రీన్ అలవాటును తగ్గించడానికి ఆయుర్వేద సూచనలుస్క్రీన్ వినియోగం ఎక్కువగా ఉందని గుర్తించినవారికి డా. మణికంటన్ కొన్ని ప్రాయోగిక సూచనలు అందిస్తున్నారు:మీ ఇంట్లో కొన్ని ప్రాంతాలను బుల్లితెరకు, ఫోన్లకు నిషేధిత ప్రాంతాలుగా ఏర్పరచండి: ఇంట్లో భోజనపు టేబుల్, పడకగది వంటి ప్రదేశాలలో ఇవి లేకుండా చేయటం అనేది మన మనస్సును వర్తమానంలోకి తెస్తుంది.ఫోన్ లేదా టీవీ ఎంతసేపు చూడాలనే టైమ్ టేబుల్ ముందే వేసుకోండి: అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉపయోగించండి. ఇది అలవాటుపై నియంత్రణ పెంచుతుంది.ఎంతసేపు వాటిని వినియోగిస్తున్నారనేది గమనించుకోండి: దానికోసం మొబైల్లోనే అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఎంతసేపు ఉపయోగిస్తున్నారో గమనించండి. ఇది మార్పుకు ప్రేరణ ఇస్తుంది.సరైన శ్వాసకు గల శక్తి: కేవలం గాలి పీల్చుకోవటం కాదు, ప్రాణశక్తిని పెంపొందించుకోవటంచెన్నా రెడ్డి కథ, స్క్రీన్ వ్యసనంలో చిక్కుకున్న యువతకు ఆశ చూపుతుంది. 24 గంటల పాటు గేమింగ్, కోపం, చదువు మధ్యలో ఆగిపోవడం—ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 2023 జనవరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించే యువనాయకత్వ శిక్షణ కార్యక్రమంలో చేరాడు.అక్కడ ఆయన సుదర్శన్ క్రియ అనే శక్తివంతమైన శ్వాసక్రియ సాధన నేర్చుకున్నాడు. ఈ సాధనాన్ని ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, మానవతా నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ పరిచయం చేశారు. ఇది శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, మనస్సులోని పాత అలవాట్లను విడిపిస్తుంది.కొద్ది రోజుల్లోనే చెన్నా రెడ్డి కోపం తగ్గిపోయింది, స్క్రీన్పై ఉన్న ఆకర్షణ క్రమంగా తగ్గింది, మనస్సులో ప్రశాంతత ఏర్పడింది. తరువాత ఆయన తన చదువును 70% మార్కులతో పూర్తి చేసి, యోగా ఉపాధ్యాయుడిగా మారి, సౌరశక్తి రంగంలో కెరీర్ నిర్మించుకున్నాడు.అధికంగా స్క్రీన్ వినియోగిస్తే, దాని ఫలితంగా చాలా సార్లు ఒత్తిడి లేదా ఆందోళన కలుగుతాయి. సుదర్శన క్రియ మన నాడీ వ్యవస్థను సమతుల్యం చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది డోపమైన్ ఆధారిత అలవాట్లను కూడా నియంత్రిస్తుంది. స్క్రీన్ వ్యసనం కూడా ఇతర వ్యసనాల్లాగే ఉంటుంది; ఈ సాధన వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.ఆయుర్వేద సహాయంనస్య చికిత్స: ముక్కులో ఔషధ తైలాన్ని వేసే విధానం. ఉదయం కొన్ని చుక్కలు ‘అణు తైలం’ ఉపయోగించడం మెదడుకు పోషణనిచ్చి, డిజిటల్ అలసటను తగ్గిస్తుంది.మేధ్య రసాయన: బ్రాహ్మి, అశ్వగంధ, శంఖపుష్పి వంటి మూలికలతో చేసిన ఈ ఔషధం ఏకాగ్రతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.జీవనశైలిలో మార్పులుప్రతి ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయండి.స్క్రీన్కు బదులుగా పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పెయింటింగ్, నడక, ఇరుగుపొరుగువారితో మాట్లాడటాన్ని అలవాటు చేసుకోండి.ఇవి మెదడుకు సహజ ఆనందాన్ని ఇస్తాయి. క్రమంగా స్క్రీన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.డా. నిషా మణికంటన్, BAMS, MD (AM)ఆయుర్వేద వైద్యురాలు రచయిత సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అంతర్జాతీయ డైరెక్టర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్(చదవండి: -
ప్రోస్టేట్ కేన్సర్ రోగుల్లో సరికొత్త ఆశాకిరణం
ఒక వ్యక్తికి ప్రోస్టేట్ కేన్సర్ వ్యాపించిందని చెప్పినప్పుడు, అతని మొదటి ప్రశ్న సాధారణంగా సమయం గురించి ఉంటుంది. “నేను ఇంకా ఎంతకాలం జీవిస్తాను?” అనేది. ఇన్నేళ్లుగా, అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ చికిత్స ప్రధానంగా జీవన కాలాన్ని ఎంతవరకు పెంచగలదో అనే కోణంలో చర్చించలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ సంభాషణ విస్తరించింది, ఆశాజనకంగా మారింది. ఇప్పుడులక్ష్యం కేవలం జీవితం పొడిగించడం మాత్రమే కాదు, ఆ సమయంలో శక్తి, స్వతంత్రత, రోజువారీ జీవనవిధానాన్ని కాపాడడం కూడా.భారతదేశంలో ప్రోస్టేట్ కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 37,948 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో గణనీయమైన శాతం కేసులు అధునాతన దశలోనే గుర్తించబడుతున్నాయి, అంటే కేన్సర్ ఇప్పటికే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ఉంటుంది. కాలక్రమేణా, చాలామందిలో “కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్” అభివృద్ధి చెందుతుంది, అంటే సాధారణ హార్మోన్ చికిత్సకు స్పందించకుండా వ్యాధి ముందుకు సాగుతుంది.ప్రోస్టేట్ కేన్సర్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ కేన్సర్ కణాలు ప్రధానంగా టెస్టోస్టెరోన్ అనే పురుష హార్మోన్పై ఆధారపడి పెరుగుతాయి. అందుకే, ఆండ్రోజెన్ డిప్రైవేషన్ థెరపీ (ADT) — అంటే శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిని తగ్గించే చికిత్స — ఇప్పటివరకు ప్రధాన చికిత్సగా ఉపయోగించబడింది. ఇది కేన్సర్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, లక్షణాలను నియంత్రిస్తుంది.అయితే, కొన్ని సందర్భాల్లో టెస్టోస్టెరోన్ స్థాయులు తగ్గినా కూడా కేన్సర్ కణాలు “ఆండ్రోజెన్ రిసెప్టర్పాథ్వే”ను సక్రియం చేసి పెరుగుతూనే ఉంటాయి. ఆండ్రోజెన్ రిసెప్టర్ అనేది కణంలో ఉండే ఒక ప్రోటీన్, ఇది హార్మోన్ సంకేతాలను స్వీకరించి కణానికి పెరగమని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వ్యాధి కొనసాగితే దాన్ని కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్ అంటారు.గత దశాబ్దంలో చికిత్సలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం హార్మోన్ స్థాయులనుతగ్గించడం కాకుండా, ఇప్పుడు “ఆండ్రోజెన్ రిసెప్టర్ పాథ్వే ఇన్హిబిటర్స్” అనే కొత్త ఔషధాలు ఉపయోగిస్తున్నారు. ఇవి కేన్సర్ కణాల్లో జరిగే పెరుగుదల సంకేతాలను నేరుగా అడ్డుకుంటాయి. ఇవిADT తో కలిపి ఉపయోగించినప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెటాస్టాటిక్ హార్మోన్ సెన్సిటివ్ ప్రోస్టేట్ కేన్సర్ పై నిర్వహించిన క్లినికల్ అధ్యయనాలు చూపుతున్నాయి.ఈ రెండు చికిత్సల కలయిక వ్యాధి పురోగతిని గణనీయంగా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా, కాస్ట్రేషన్ రెసిస్టెంట్ దశకు చేరే సమయాన్ని కూడా వాయిదా వేస్తుంది. ముఖ్యంగా ఎముకలకు వ్యాపించినప్పుడు వచ్చే నొప్పి కూడా ఆలస్యంగా వస్తుంది.ఇవి చాలా ముఖ్యమైన ఫలితాలు. ఎందుకంటే వ్యాధి పురోగతిని ఆలస్యం చేయడం అంటే లక్షణాలను నియంత్రిస్తూ, రోజువారీ జీవనాన్ని సజావుగా కొనసాగించే సమయం ఎక్కువగా లభించడం. చాలామందికి ఇది చలనశీలతను కాపాడుకోవడం, కుటుంబంతో సమయం గడపడం, సాధారణ కార్యకలాపాలను కొనసాగించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.ఈ కొత్త చికిత్సల మరొక ముఖ్యమైన అంశం వాటి సహన శక్తి (tolerability). అధునాతన కేన్సర్చికిత్సలో తరచుగా కనిపించే అలసట వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న రోగులకు, ముఖ్యంగా డయాబెటిస్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఈ సమతుల్యత చాలా ముఖ్యం. కెమోథెరపీ అవసరం లేకుండా మంచి ఫలితాలను ఇస్తున్న ఈ కలయిక చికిత్సలు, తీవ్రమైన చికిత్సలకు అనుకూలం కానీ రోగులకు ఒక మంచి ప్రత్యామ్నాయం.భారతదేశం గ్లోబల్ క్లినికల్ రీసెర్చ్లో పాల్గొనడం కూడా పెరుగుతోంది. అంతర్జాతీయ పరిశోధనల్లో భారతీయ రోగుల భాగస్వామ్యం, చికిత్సల ప్రభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతోంది. ప్రాక్టీస్లో ఆధారిత చికిత్సలను అమలు చేయడానికి దోహదం చేస్తోంది.అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ ఒక తీవ్రమైన నిర్ధారణ అయినప్పటికీ, ఇప్పుడు దీనిని ఒక దీర్ఘకాలిక వ్యాధిగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చికిత్స లక్ష్యం—రోజువారీ జీవనంపై కనిష్ట ప్రభావంతో వ్యాధిని నియంత్రించడం. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న పురుషులు, వారి కుటుంబాల కోసం, వైద్యుడితో సమాచార ఆధారిత, ముందస్తు చర్చ చాలా ముఖ్యమైనది. అందుబాటులో ఉన్న చికిత్సలను అర్థం చేసుకోవడంద్వారా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సను రూపొందించుకోవచ్చు. చికిత్స క్లినికల్ ఆధారాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలకు అనుసంధానమైనప్పుడు, జీవితం కేవలం పొడిగించడమే కాకుండా, దాన్ని మెరుగైన విధంగా గడపడం కూడా సాధ్యమవుతుంది.డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్రెనోవా సౌమ్య కేన్సర్ సెంటర్, కర్కాణా, హైదరాబాద్(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..) -
ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..
20, 30 లేదా 40 ఏళ్ల వయసులో ఉండి వ్యాయామం చేయాలంటే రకరకాల సాకులు చెబుతూ స్కిప్ చేస్తుంటారు. కొన్ని రోజులు మొక్కుబడిగా చేసి..మళ్లీ యథావిధిగా మానేస్తుంటారు. అలాంటివాళ్లు ఈ 90 ఏళ్ల వృద్ధుడిని చూస్తే కచ్చితంగా కనువిప్పి కలుగుతుంది, దృక్పథం కూడా మార్చుకోవచ్చని చెబుతున్నారు ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్. తేలికపాటి వ్యాయామాలు చేసే వయసులో యువకులకు పోటీ ఇచ్చేలా ఆయన చేసే స్ట్రెంగ్త్ వ్యాయామాలు చూస్తే కచ్చితంగా విస్తుపోతారు. ఇంతకీ ఎవరా తాతగారు..?, అతని ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ అయిన జెన్నిఫర్ మార్టిన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన గురించి చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో చాలామంది మంచం నుంచి లేవడానికి ఇబ్బంది పడే తొమ్మిది పదుల వయసులో స్వతంత్రంగా బతకాలనే ఆశయం, కఠోర శ్రమ ఫలితమే అతడి స్ట్రాంగ్ ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతోందామె. ఆమె వయసు పైబడటం సమస్య కాదని అంటోంది, బలం కోల్పోవడమే సమస్య. దీర్ఘాయువుకి కండరాలే కీలకం. ఆ విషయంలోనే ఈ తాతాగారు చాలా కేర్ఫుల్గా ఉంటారు. సవంత్సరాల తరబడి చేసిని నిరంతర వర్కౌట్లు..ఆయన్ని ఇంతలా బలంగా ఫిట్గా ఉండేలా చేశాయి. నిజానికి ఆయనకు 90 ఏళ్లు అంటే ఎవ్వరు నమ్మలేరు.పైగా ఆయన ఫిట్నెస్ దినచర్యలో ఏ యువకుడికైన గట్టి పోటీ ఇచ్చేలా చేయగలరు కూడా. ఆయన ఒంటరిగానే జిమ్కి వెళ్తారని, వారంలో మూడు రోజులు జిమ్కి కేటాయిస్తారని చెబుతోంది. ఆయన ఫుల్లింగ్ వ్యాయామాల దగ్గర నుంచి ట్రెడ్మిల్పై పరుగెత్తడం, క్లైంబింగ్ వర్కౌట్లను ఆస్వాదించడం వరకు అన్నింటిని చేస్తారు. మెషీన్లు, డంబెల్స్ను ఉపయోగించి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి కూడా చేస్తారాయన. ఈ వ్యాయామ దినచర్య కేవలం దీర్ఘాయువు కోసం కాదని, తుంటి మార్పిడి శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడిందని చెప్పుకొచ్చింది. శస్త్రచికిత్సకు ముందే ఆ వ్యక్తి శారీరకంగా చురుకుగా ఉంటూ, వ్యాయామం చేస్తుండటం వల్ల, ఇతర రోగుల కంటే వేగంగా కోలుకోగలిగారని చెప్పుకొచ్చింది. నెటిజన్లు సైతం ఆయన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను చూసి..ఆ వయసుల పట్టుదలను అభినందించడమే గాక..ఇది నిజంగా అద్భుతం అని కొనియాడారు. View this post on Instagram A post shared by JEN | Personal Trainer | Functional Movement & Longevity (@jennifermartinnn) (చదవండి: నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్లో..!) -
ఊబకాయం నుంచి స్మార్ట్గా..! ఏకంగా 204 కిలోల నుంచి 92 కిలోలకు..
కొందరు సుమోలు మాదిరిగా భారీ శరీరంతో ఉంటారు. వాళ్లు వెయిట్లాస్ అవ్వడం చాలాకష్టం. బరువు తగ్గే సర్జరీలు, ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కాస్త బరువు తగ్గగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఊబకాయులు బరువు తగ్గడం అంత సులభం కాదు. పైగా ఆ క్రమంలో చాలా నరకం చవి చూడాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళ బరువు తగ్గాలనే కోరిక బలంగా ఉంటే..పట్టుదలతో ఇట్టే ఆ సమస్యను జయించొచ్చు అని నిరూపించిందామె.ఆ మహిళ అమెరికాలోని కొలరాడోకు చెందిన కంటెంట్ క్రియేటర్ అనా అలోన్సో. తన శరీర బరువులో సగానికి పైగా బరువు తగ్గిన జర్నీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నిజానికి ఆమె బరువు 204 కిలోలు. పట్టుదల, మానసిక స్థైర్యంతో బరువు తగ్గడానికి స్థిరంగా కట్టుబడి మరి స్మార్ట్గా మారింది ఆ పిల్లల తల్లి. ఒకప్పుడు అధిక బరువుతో..చిన్నపాటి కదలికలకే అల్లడిపోయే సవాళ్లను ఎదుర్కొంది. నిరంతర ఆయాసంతో బయటకు అడుగుపెట్టాలంటేనే ఇబ్బంది పడేది. ముఖ్యంగా తన రూపం కారణంగా నలుగురిలోకి రావడానికి చాలా ఇబ్బందిపడేది. తాను ఎలాగైన చురుకైన తల్లిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్న ఆరాటం ఆమెను బరువు తగ్గేందుకు పురికొల్పొంది. ముఖ్యంగా బరువు తగ్గి మంచి శరీరాకృతితో ఆత్మగౌరవంతో ఉండాలనే ఆకాంక్షతో చాలా పట్టుదలతో నిలకడగా బరువు తగ్గేందుకు ఉపక్రమించానని చెప్పుకొచ్చింది అనా.శారీరక పరివర్తన ఎలా సాధించిందంటే..మొదట్లో చిన్న పాటి కదలికలు కూడా కష్టమైందామెకు. సాధార వ్యాయామాలకే అలిసిపోయేది. అయితే అసౌకర్యాన్ని భరిస్తూ ముందుకు సాగింది. అయితే నిలకడగా చేయడం ప్రతీది మార్చేసింది. కాలక్రమేణ బరువులు ఎత్తడం, స్క్వాట్స్ చేయడం, బహిరంగ పోటీల్లో పాల్గొనేంత వరకు పురోగతి సాధించింది. ఆమె పరివర్తన మొత్తం రాత్రికి రాత్రే జరగలేదు. మంచి జీవనశైలిని అవలంభిస్తూ..క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ..తగ్గడం సాధ్యమే అని నిరూపించింది. ఎలా విజయవంతమైందంటే..ఆరోగ్యకరమైన బరువు తగ్గడం కోసం అనా అనుసరించిన ముఖ్యమైన సూత్రాలేంటంటే..క్రమం తప్పని వ్యాయామాలు కాలక్రమేణ బలాన్ని పెంచుకోవడానికి, కొవ్వును కరిగించుకోవడానికి, ఓర్పును మెరుగుపరుచుకోవడానికి సహయాపడ్డాయి. మొదట్లో ఎక్కువ దూరం వాకింగ్ చేసేది. ఆ తర్వాత రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేసేలా జిమ్లో చేరింది. అక్కడ బరువైన బార్బెల్స్, స్క్వాట్స్ వంటివి చేసింది.జీవనశైలిలో మార్పులుతీవ్రమైన డైటింగ్కు బదులుగాచ నిలకడైన అలవాట్లపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యంఒక్కోసారి వద్దు అనుకునే టైంలో భావోద్వేగంగా బలంగా ఉండటం ఎలాగో తెలుసుకుంది. ఎందుకు ఈ లక్ష్యం అనేది మననం చేసుకుంటూ..నిలకడగా చేస్తుండేది. ఆ తర్వాత సమర్థవంతంగా బరువు తగ్గినా.. ఎక్సెస్ స్కిన్తో కొంచెం ఇబ్బంది పడింది. కానీ ప్రతిపని సునాయాసంగా చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. ఇక్కడ అనా కథ ఎందరికో స్ఫూర్తి. ఆమె వెయిట్లాస్ స్టోరీ ఆరోగ్యం అనేది మనస్తత్వంతో గాఢంగా ముడిపడి ఉంటుందనే విషయాన్ని నొక్కి చెబుతోంది. నిరంతర కృషి, మానసిక బలం స్థిరమైన అలవాట్లతో, అత్యంత సవాలుతో కూడిన వెయిట్లాస్ జర్నీ అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది అనేందుకు అనానే ఉదాహరణ. గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ana Alonso (@ana.fitness.vsg) (చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..! తండ్రిగా, హీరోగా ఎలా బ్యాలెన్స్ చేశారంటే..) -
వ్యాయామాలు తప్పనిసరా..? చేయాల్సిందేనా..
వ్యాయామం అంటే కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది సరికాదు. వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, టైప్–2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యాయామం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. అందువల్ల బద్ధకించకుండా బాధ్యతగా చేసే పనిగా గుర్తించాలి.ముందుగా ప్లాన్ చేసుకోకపోతే వ్యాయామం అనేది ఎప్పటికీ చేయలేము. పిల్లలు నిద్రలేవక ముందే, లేదంటే వారి మధ్యాహ్నం నిద్ర సమయంలో ఒక 20 నుంచి 30 నిమిషాలు ప్లాన్చేసుకోవాలి. ఉదయాన్నే ‘ఏం బట్టలు వేసుకోవాలి? బాటిల్ ఎక్కడ ఉంది?’ అనే గందరగోళం లేకుండా, ముందు రోజే మీ వర్కవుట్ దుస్తులను, వాటర్ బాటిల్ను సిద్ధం చేసుకోండి. ఇది మీ మెదడుపై నిర్ణయాల భారాన్ని తగ్గిస్తుంది.చిన్నపాటి వర్కవుట్లు చాలు..జిమ్లో గంటల తరబడి గడపాల్సిన అవసరం లేదు. పుష్–అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటివి ఎక్కడైనా చేయవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం ఉండేలా చూసుకోండి.పిల్లలతో కలిసి..పిల్లల పనులు చేయాలనే సాకుతో చాలామంది వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటారు. నిజానికి పిల్లల పనులు కానీ, పిల్లలు కానీ మీ ఫిట్నెస్కు అడ్డంకి కానే కాదు, వారితో కలిసే వ్యాయామం చేయండి. వారితో కలిసి డ్యాన్స్ చేయడం లేదా పార్కులో ఆడుకోవడం ద్వారా వారికి కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడతాయి. చురుకైన తల్లిదండ్రులను చూసి పెరిగే పిల్లలు భవిష్యత్తులో కూడా యాక్టివ్గా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయిక్రమం తప్పకుండా..ఒక్కోసారి చాలా బిజీగా ఉండవచ్చు. అటువంటప్పుడు కనీసం 10 నిమిషాల స్ట్రెచింగ్ లేదా యోగా చేయండి. అన్నీ చేయాలి లేదా ఏదీ చేయకూడదు అనే ధోరణి కంటే, కొద్దిగానైనా క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం.వారానికి రెండుసార్లు..మహిళలకు కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది, కండరాల పటుత్వాన్ని కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే గాయాలను నివారించడానికి ఇది అవసరం. వారానికి కనీసం రెండుసార్లు దీనిని ప్రయత్నించండి.(చదవండి: -
తెల్లటివి కంటే గోధుమ రంగు గుడ్లు మంచివా..?
కోడిగుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారం ఇదే. అయితే, కోడిగుడ్ల వినియోగంపై సమాజంలో ఎన్నో రకాల అ΄ోహలు ఉన్నాయి. అనవసరమైన భయాలను పెట్టుకోకుండా గుడ్లను ఆహారంలో చేర్చుకుందాం.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందుదాం. అందుకోసం అపోహలను తొలగించుకుందాం.నమ్మకాలు కోడిగుడ్డులో తెల్లసొన మాత్రమే తినాలి, పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని వదిలేయాలి.తెల్లటి గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యానికి మంచివి.గుడ్లు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, గుండె జబ్బులు వస్తాయి.నిజాలుపచ్చసొనలోనే శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజ లవణాలు నిండి ఉంటాయి. తెల్ల గుడ్లు, గోధుమ రంగు గుడ్లు రెండూ సమానమైన ΄ోషక విలువలను కలిగి ఉంటాయి.గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు పైగా ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.రోజుకు రెండు కంటే ఎక్కువ గుడ్లు తినడం ఆరోగ్యానికి హానికరం.ఆరోగ్యంగా ఉన్నవారు రెండు కన్నా ఎక్కువ గుడ్లను తిన్నా ఏమీ కాదు. అది వారి ఇష్టం. అంతే! .(చదవండి: జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!) -
ఆంతరంగిక ప్రశాంతత
ఆధ్యాత్మికత (Spirituality) అంటే కేవలం పూజలు, పునస్కారాలు అనుకుంటారు. కానీ సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోణంలో స్పిరిచువాలిటీ అంటే—మీ అంతరంగంతో మీరు కనెక్ట్ అవ్వడం. బయట ప్రపంచంలో మీరు ఎంత సక్సెస్ సాధించినా, లోపల ప్రశాంతత లేకపోతే ఆ వ్యక్తిత్వం వెలిగిపోదు. ఆంతరంగిక ప్రశాంతత మీ పర్సనాలిటీని ఎలా ఒక 'స్థితప్రజ్ఞుడి'లా మారుస్తుందో ఈ ఆర్టికల్లో చూద్దాం.పర్సనాలిటీ అనేది ప్రపంచం చూసే 'బయటి కవచం' అయితే, స్పిరిచువాలిటీ అనేది ఆ కవచం లోపల వెలిగే 'దీపం'. ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి పర్సనాలిటీలో ఒక రకమైన నిలకడ (Stability), కరుణ (Compassion), స్పష్టత (Clarity) ఉంటాయి. ఇది మిమ్మల్ని కేవలం ఒక 'సక్సెస్ఫుల్ మ్యాన్' నుండి ఒక 'వైజ్ మ్యాన్' (Wise Man) గా మారుస్తుంది.అంతర్గత నియంత్రణ (Locus of Control)స్పిరిచువల్ పర్సనాలిటీ ఉన్నవారికి తమ సంతోషం కోసం బయటి వ్యక్తుల మీద లేదా పరిస్థితుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ‘‘నా ప్రశాంతత నా చేతుల్లోనే ఉంది. ఎవరో నన్ను విమర్శించినా, నా ప్లాన్ ఫెయిల్ అయినా నా 'కోర్' (Core) కదలదు’’ అనుకుంటారు. దీన్నే Internal Locus అంటారు. దీనివల్ల మీరు ఒత్తిడిలో కూడా అద్భుతంగా పనిచేయగలరు. మీ పర్సనాలిటీకి ఇది ఒక 'బుల్లెట్ ప్రూఫ్' కవచంలా పనిచేస్తుంది.Ego vs SoulEgo-Driven Personality: "నేను గెలవాలి, నేను అందరికంటే గొప్పగా కనిపించాలి" అనుకుంటారు. ఇది ఎప్పుడూ భయం మరియు అసూయతో నిండి ఉంటుంది.Soul-Driven Personality: "నేను నా ధర్మాన్ని (Purpose) నెరవేర్చాలి, అందరికీ మేలు చేయాలి" అనుకుంటారు. ఇందులో ప్రశాంతత మరియు నిస్వార్థం ఉంటాయి.ఎప్పుడైతే మీ పర్సనాలిటీ ఈగో నుండి సోల్ వైపు ప్రయాణిస్తుందో, మీ కరిష్మా వెయ్యి రెట్లు పెరుగుతుంది. మనుషులు మిమ్మల్ని చూసి గౌరవించడం కాదు, మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతారు.మోటివేషన్ మాయ vs ఆంతరంగిక ప్రశాంతతమోటివేషన్ "బయట గెలువు, ప్రపంచాన్ని జయించు" అని మిమ్మల్ని నిరంతరం ఉరుకులు పెట్టిస్తుంది. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది (Burnout).స్పిరిచువాలిటీ (Mindfulness)... "లోపల ప్రశాంతంగా ఉండు, అప్పుడు ప్రపంచం నీ వెనుక వస్తుంది" అని చెప్తుంది. ఇది మీకు 'శాశ్వతమైన శక్తిని' (Enduring Power) ఇస్తుంది.ఆంతరంగిక ప్రశాంతతను ఎలా సాధించాలి?Step 1: Break External Validation"నలుగురు ఏమనుకుంటారు?" అనే ఆలోచనను 'Break' చేయండి. మీ విలువలకు విరుద్ధంగా ఏ పని చేయకండి. మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోగలిగితే, అదే అతిపెద్ద ప్రశాంతత. పాత మొహమాటాలను వదిలేయండి.Step 2: Build Solitudeప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు మీతో మీరు గడపడం 'Build' చేయండి. అది మెడిటేషన్ కావచ్చు, లేదా ఒక డైరీ రాయడం కావచ్చు. మీ లోపల జరుగుతున్న సంభాషణను గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినడం మొదలుపెడితే, మీ నిర్ణయాల్లో తప్పులు జరగవు.Step 3: Universal Compassionమీ ప్రశాంతత కేవలం మీకే పరిమితం కాకుండా, మీ చుట్టూ ఉన్నవారికి కూడా అందాలి. ఒక చిన్న చిరునవ్వుతో, ఒక ఓదార్పు మాటతో మీరు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలి. మీరు ఒక 'ప్రేరణ'గా (Inspiration) మారడమే 'Beyond' స్టేజ్.మీ లోపల ఏముంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు భయం వేస్తోందా లేక ప్రశాంతంగా అనిపిస్తోందా?2. మీ సంతోషం వేరే ఎవరి చేతుల్లోనైనా ఉందా?3. మీరు చేసే పని వల్ల మీ ఆత్మ తృప్తి పొందుతోందా?ప్రశాంతతే అసలైన సంపద!ప్రపంచాన్ని గెలిచి మిమ్మల్ని మీరు ఓడిపోతే అది విజయం కాదు. మిమ్మల్ని మీరు గెలిచి ప్రపంచానికి సేవ చేస్తేనే అది పరిపూర్ణమైన వ్యక్తిత్వం. ఆంతరంగిక ప్రశాంతత ఉన్న వ్యక్తి యుద్ధ భూమిలో కూడా ప్రశాంతంగా ఉండగలడు. అదే 'జీనియస్' లక్షణం."Peace comes from within. Do not seek it without."Gowthama Buddha సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: లక్ష్యంతో మారే పర్సనాలిటీ!) -
జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!
వెయిట్లాస్ అనగానే కఠినమైన ఆహారాలు, ఇష్టమైన ఫుడ్ని వదులుకోవడం, తీవ్రమైన వ్యాయామాలు గంటలు తరబడి చేయడం అని భావిస్తుంటారు చాలామంది. కానీ అవేమి కానేకాదు అని కొందరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే గాక, చాలా సింపుల్ లైఫ్స్టైల్స్తో కిలోల కొద్ది బరువు తగ్గి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ ముంబైకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్. ఇంతకీ ఆమె బరువు తగ్గడం కోసం ఎలాంటి మార్పులు జోడించిందంటే..కంటెంట్ క్రియేటర్ మల్లికా ఫతేపురియా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సరికొత్త వెయిట్లాస్ జర్నీని పంచుకున్నారు. ఒకప్పుడు తాను 90 కిలోల బరువు ఉండేదాన్ని అని , ప్రస్తుతం 55 కిలోలకు చేరి సుమారు 35 కేజీ బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అయితే తన వెయిట్లాస్ జర్నీలో ఏం చేసింది అనేదానికంటే..ఏం మానేశాను, వేటికి దూరంగా ఉన్నాను అనేదే ఎక్కువగా ఉంటుందని అంటోందామె.బరువు తగ్గడం కోసం..డైట్లు చేయడం:తాను కఠినమైన డైట్లు పాటించిన ప్రతిసారీ కొంత బరువు తగ్గినట్లు తగ్గి..మళ్ళీ యథావిధి బరువుకి వచ్చేసేదాన్ని అని కంటెంట్ క్రియేటర్ పంచుకున్నారు. బరువు తగ్గడాన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా చూడటం మానేసి, తాను పాటించగలిగే అలవాట్లపై దృష్టి పెట్టడంతో ఆమె జీవితంలో అనూహ్య మలుపు వచ్చింది.కార్బోహైడ్రేట్లను తగ్గించడంరొట్టె, అన్నం, లేదా పాస్తా వంటి ఆహారాలను పూర్తిగా మానేయడానికి బదులుగా, తక్కువ మొత్తంలో తీసుకునేలా కేర్ తీసుకున్నానని అంటోంది. ఆమె ప్రకారం, అసలు సమస్య ఈ ఆహారాలు కాదని.. సమతుల్యంగా తినడంలోనే సమస్య అంతా ఉందని అంటున్నారు.విసుగు పుట్టించే భోజనాన్ని బలవంతంగా తినడం..కఠినమైన ఆహార డైట్లు శిక్షలా మారాక..బరువు తగ్గడం కంటే..సమస్యే అధికంగా మారే అవకాశాలే ఎక్కువని అంటోంది. అందుకే ఆస్వాదించకలిగేలా భోజనాన్ని ఆరోగ్యమైన విధంగా తీసుకుంటే..ఏదో కోల్పోయానన్న భావన దరిచేరదు. హెల్దీగా, ఆనందంగా బరువు తగ్గుతాం అని అంటోంది.అతిగా వ్యాయామం చేయడంతీవ్రమైన రోజువారీ వ్యాయామాలు అవసరమని తాను భావించేదాన్ని అని మల్లిక చెప్పారు. కానీ కాలక్రమేణా, నడవడం, శక్తి శిక్షణ, క్రమం తప్పకుండా చురుకుగా ఉండటం వంటి సాధారణ విషయాలు చాలా బాగా పనిచేస్తాయని గ్రహించానని అంటున్నారామె. అంతేగాదు బరువు తగ్గడం అంటే మంచి ఆహారాన్ని వదులుకోవడం లేదా మిమ్మల్ని బాధకు గురిచేసుకోవడం వంటివి కానేకాదు అని అంటోంది. నిలకడతో సమతుల్యానికి పీటవేస్తే చాలు బరువు తగ్గడం సులభం అని అంటోంది మల్లికా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mallika Fatehpuria (@mallikafatehpuria) (చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..
ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ కెనడియన్ పాప్ గాయని సెలిన్ డియోన్ తన గాత్ర నైపుణ్యం, ఉద్వేగభరితమైన మ్యూజిక్ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. 'టైటానిక్' చిత్రంలోని 'మై హార్ట్ విల్ గో ఆన్' పాటతో పాటు 90ల నాటి అనేక అంతర్జాతీయ హిట్లకు ప్రసిద్ధి చెందింది. అంత ప్రసిద్ధి గాంచిన గాయని 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' అనే అరుదైన వ్యాధి బారినపడింది. దాంతో సంగీతానికి గత కొంతకాలంగా పూర్తిగా విరామం ఇచ్చేశారామె. మళ్లీ ఇన్నేళ్లకు తన 58వ పుట్టిన రోజు నేపథ్యంలో మ్యూజిక్ లైవ్ షోలలో పాల్గొననుట్లు అభిమానులతో పంచుకుంది. సెలిన్ని కెరీర్కి దూరమయ్యేలా చేసిన అరుదైన 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' వ్యాధి అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..గాయని సెలిన్ డియోన్కు డిసెంబర్ 2022లో స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో ఆమె గతకొలంగా లైవ్షోలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె లైవ్షో వేదికపైకి తిరిగి రావడానికి సంసిద్ధంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లా డిఫెన్స్ ఎరీనాలో 10 రాత్రుల పాటు ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇలా మళ్లీ పూర్తి స్థాయిలో కోలుకుని యథావిధిగా తన కెరీర్ని కొనసాగిచడాన్ని తన జీవితంలోని అత్యుత్తమమైన బహుమతిగా అభివర్ణించింది. మార్చి 2020లో అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన చివరి లైవ్ షో అనంతరం డియోన్ మళ్లీ తొలిసారిగా వేదికపైకి పునరాగమనం చేయనుండటం విశేషం. ఇక డియోన్ ఈ అరుదైన వ్యాది తన గొంతు కదలికలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. తన అభిమానులు, శ్రేయాభిలాషుల మద్దతతులో పూర్తి స్థాయిలో కోలుకున్నానని, అందుకు అందరికి కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న అరుదైన వ్యాధి 'స్టిఫ్-పర్సన్ సిండ్రోమ్'అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అంటే ?స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ (SPS) అనేది ఒక అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ రుగ్మత. ఇది మొండెం, పొత్తికడుపులో కండరాల బిగుతుకు కారణమవుతుంది. కాలక్రమేణ ఈ పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా. దీని కారణంగా సంబంధిత రోగులు కాళ్లు, ఇంతర కండరాల్లో బిగువు, ఒక విధమైన నొప్పులను అనుభవిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు సాధారణ కదలికలు కష్టతరమవుతాయట. ముఖ్యంగా నడవడం కష్టంగా మారిపోతుందట.లక్షణాలు దీనిలో రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి:కండరాల బిగుతుఈ వ్యాధిలో కనిపించే తొలి సంకేతం ఇదే. ముఖ్యంగా మొండెం భాగంలో - అంటే పొట్ట, ఛాతీ, వీపులో మొదలవుతుంది. ఇది నిరంతర బిగుతుగా లేదా నొప్పితో కూడిన బాధగా అనిపిస్తుందట. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఈ బిగుతు రావచ్చు, పోవచ్చు. ఇది తీవ్రమవుతున్న కొద్దీ, చేతులు, కాళ్ళను కూడా ప్రభావితం చేయవచ్చు.కండరాల నొప్పులు (స్పాజమ్స్)ఇవి ఆకస్మికంగా, బాధాకరంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఒక భాగాన్ని లేదా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ నొప్పులు కొన్ని సెకన్లు, నిమిషాలు లేదా కొన్నిసార్లు గంటల పాటు కూడా ఉండవచ్చు.లక్షణాలను ప్రేరేపించే అంశాలుబిగ్గరగా లేదా ఊహించని శబ్దాలుశారీరక స్పర్శఉష్ణోగ్రతలో మార్పులు (ముఖ్యంగా చలి)ఒత్తిడితో కూడిన పరిస్థితులుమొత్తం మీద, ఈ పరిస్థితి కాలక్రమేణా కదలికలను కష్టతరం చేస్తుంది, మంచానికే పరిమితమయ్యేలా చేస్తుంది కూడా.కారణాలు :ఇది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి (Autoimmune disorder), అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున స్వంత నాడీ కణాలపై దాడి చేస్తుంది.చాలా మంది రోగులలో గ్లుటామిక్ యాసిడ్ డెకార్బాక్సిలేస్ (GAD) యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి.నిర్ధారణఈ వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్షలు (GAD యాంటీబాడీ టెస్ట్), EMG (Electromyography) ఉపయోగిస్తారు. చికిత్స, నిర్వహణ:దీనికి కచ్చితమైన చికిత్స లేనప్పటికీ, లక్షణాలను నిర్వహించవచ్చు. ముందుగా కండరాలను సడలించడానికి డయాజెపామ్ (Valium) లేదా బాక్లోఫెన్ (Baclofen) వంటి మందులు ఉపయోగిస్తారు.ఇమ్యునోథెరపీ: IVIG (Intravenous Immunoglobulin) చికిత్స తరచుగా మొదటి ప్రాముఖ్యతగా చేస్తుంటారు వైద్యులు. వాటితోపాటు ఫిజియోథెరపీ, ఇతర వ్యాయామాలు కదలికను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నిజానికి ఈ వ్యాధి స్త్రీలలో, ముఖ్యంగా 40-50 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు చల్లుతారో తెలుసా..!) -
పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు వేయాలంటే..?
సమ్మర్ అనగానే అందరికి గుర్తొచ్చేది పుచ్చకాయ. వేసవి దాహార్తిని చల్లార్చేది పుచ్చకాయ ఒక్కటే. అది తినగానే తక్షణ శక్తి, దాహం తీరుతుంది కూడా. అలాంచి పుచ్చకాయను తినేముందు చిటికెడు ఉప్పు ఎందుకు జల్లుతారో తెలుసా!. అలా తింటేనే మంచిదా అంటే..సాధారణంగా చాలామంది పుచ్చకాయను అలానే తినేస్తారు. కొందరు మాత్రం తప్పనిసరిగా చిటికెడు ఉప్పు జల్లుకునే తింటుంటారు. ఇలా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!.సహజమైన తీపి..చిటికెడు ఉప్పు పుచ్చకాయ రుచిని మరింత తీపిగా చేస్తుంది. రుచి గ్రాహకాలు రుచిని గ్రహించే విధానాన్ని ఉప్పు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇలా మరింత తీపిగా అనిపిస్తుందట. అలాగే ఉప్పులో ఉండే క్లోరైడ్ అయాన్లు తీపి రుచి గ్రాహకాలతో చర్య జరిపి తక్కువ గాఢతలో తీపిని గ్రహించే శక్తినిపెంచి, చేదుని తగ్గిస్తాయి. అంటే ఉప్పు పండులోని సహజ చక్కెరలను ఉత్తేజపరిచి వాటి ప్రభావాన్ని పెంచుతుంది, మరింత రుచికరంగా ఉంటుంది కూడా.కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది. .పుచకాయలో సహజంగా నీటి శాతం ఎక్కువ. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. చిటికెడు ఉప్పు కలపడంతో శరీరానికి తగిని సోడియం అంది, ద్రవాలను నిలుపుకోవడానికి హైడ్రేషన్కు హెల్ప్ అవుతుంది. ఇది ప్లాస్మా పరిమాణాన్ని నిర్వహించడంలో అలాగే శరీరం తీసుకున్న నీటిని త్వరగా బయటకు పంపకుండా నిలుపుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వేడికి గురైన వెంటనే లేదా అధిక శ్రమ తర్వాత నీరు, సోడియం కలియిక నీరు రీహైడ్రేషన్కి ప్రభావవంతంగా ఉంటుందట.రుచి సమతుల్యతను మెరుగుపరుస్తుందికొన్నిసార్లు పుచ్చకాయ రుచి చప్పగా లేదా మరీ నీళ్ళగా అనిపించవచ్చు. చిటికెడు ఉప్పు రుచిని సమతుల్యం చేయడం తోపాటు ప్రతి ముక్కను మరింత రుచికరంగా మారుస్తుంది.జీర్ణక్రియకు సహాయపడుతుంది..తక్కువ పరిమాణంలో జీర్ణరసాలను ప్రేరేపించడంలో ఉప్పు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సాధారణంగా పుచ్చకాయ చాలా సులభంగా జీర్ణమవుతుంది, ఈ చిన్న చేర్పు మొత్తం తినే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా భోజనం తర్వాత లేదా స్నాక్గా తీసుకున్నప్పుడు.శ్రద్ధగా తినేలా చేస్తుంది.. పుచ్చకాయకు ఉప్పు కలపడం వల్ల తినే వేగాన్ని తగ్గిస్తుంది. ఒక గిన్నెను త్వరగా పూర్తి చేయడానికి బదులుగా, ప్రతి ముక్కను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతారు. ఇది పరిమాణ నియంత్రణకు సహాయపడటం తోపాటు సంతృప్తికరంగా అనిపించేలా చేస్తుంది. కాబట్టి, పుచ్చకాయకు చిటికెడు ఉప్పు కలపడం వల్ల పండు పోషక విలువలు పెద్దగా మారవు, కానీ అది తినే అనుభవాన్ని ఆనందదాయకంగా, సమతుల్యంగా చేస్తుంది. ఇక్కడ చిటికెడు ఉప్పు చాలు. ఎక్కువైతే పండు సహజ రుచిని డామినేట్ చేసి, సోడియం తీసుకోవడం అధికమయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైతే అదనపు రుచి కోసం నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపునులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చాయ్వాలాగా 103 ఏళ్ల బామ్మ..!) -
'ఫ్లవర్ అనుకుంటివా.. ఫుడ్'..!
సరదాగా చెప్పాలంటే...‘‘తినదగు నిపుణులు చెప్పిన తినినంతనే వేగిరపడక పోషక విలువలు తెలుసుకోదగన్...ఇలా నిజము దెలుసుకుని ‘పువ్వులనూ తినెడివాడే మనుజుడు మహిలో...’’ అంటే కాస్త వినోదంగానో, వెటకారంగానో ఉండవచ్చు. ఇక అచ్చతెలుగులో పువ్వుల్నీ తినవచ్చంటే కూడా కొద్దిగా ఇబ్బందిబ్బందిగానే అనిపించవచ్చుగానీ...నిజానికి పువ్వుల్లోనూ ఎన్నో పోషకవిలువలూ, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలంటాయంటున్నారు ఆహార నిపుణులు. ‘‘మొక్కమొక్కకో పువ్వు... మనుషులందరికీ హెల్తు’’ అంటూ పువ్వులోని పోషక విలువలనూ ప్రయోజనాలనూ చెబుతున్న ఆ న్యూట్రిషనిస్టుల మాటలేమిటో తెలుసుకుందాం... కాలీఫ్లవర్లాంటి పువ్వులను కూరలకోసమే ఉపయోగిస్తామంటే సరే. అయితేమామూలుగానైతే కొన్ని పువ్వులూ తినడానికి పనికివస్తాయంటే వెంటనే నమ్మలేని పరిస్థితి. అయినప్పటికీ అది వాస్తవం. అలాంటి కొన్ని పువ్వులూ వాటి పోషక విలువలేమిటో చూద్దాం...అరటిపువ్వుఅరటికాయను ‘కూర అరటి’గా పిలుస్తూ... కూర చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ అరటి పువ్వు (మొవ్వ)ను కూడా కూరగా వండటం ఓ సంప్రదాయంలా పాటించే కుటుంబాలు చాలా ఎక్కువే ఉన్నాయి. అరటి పువ్వు పోషక విలువలు ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటాయి. అరటిపువ్వులోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. అరటిపువ్వు నుంచి సేకరించిన పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా అరటిపువ్వు ఫ్రీరాడికల్స్ను హరిస్తుంది. దాంతో క్యాన్సర్ నివారణా సాధ్యమవుతుంది. అంతేకాదు... ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వయసుపైబడే ప్రక్రియనూ ఆలస్యం చేసి ఏజింగ్ ప్రక్రియను మందకొడిగా జరిగేలా చేస్తాయి. అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనత దూరం చేస్తుంది. ముఖ్యంగా ఇది మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక స్త్రీలలో రుతు సమస్యల నివారణకు అరటిపువ్వుల కూర బాగా మేలు చేస్తుంది. అరటిపువ్వుతో అనేక రుతుబాధలు దూరమవుతాయి. పీరియడ్స్ టైమ్లో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారి΄ోవడం, కడుపునొప్పి వంటి అనేక లక్షణాలతో వ్యక్తమయ్యే పీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) తగ్గుతుంది. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల యాంగై్జటీ తగ్గడంతో మూడ్స్ బాగుపడతాయి. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బాగా పాలు పడేలా చేస్తుంది అరటిపువ్వు.గుమ్మడి పూలుఇటీవల కొందరు గుమ్మడిపూలను కొన్ని రకాల కూరగాయలతో కలిపి స్టఫ్ చేయడం, ఫ్రై చేయడంతోపాటు కూరగా వండటం పరిపాటి అయ్యింది. గుమ్మడి పూల పోషక విలువలుఇందులో విటమిన్లు ఏ, సీ లతోపాటు క్యాల్షియమ్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతున్నాయి. ఇక పీచుపదార్థాలూ (డయటరీ ఫైబర్) కూడా చాలా ఎక్కువ. అందుకే వీటిని ఆహారంగా తీసుకునేవారిలో ఆకలి త్వరగా తీరడం వల్ల స్థూలకాయం నివారితమవుతుంది. ఫలితంగా డయాబెటిస్, హైబీపీలు నివారితం కావడంతోపాటు డయటరీ ఫైబర్ వల్ల జీర్ణాశయ ఆరోగ్యం బాగుండటమూ, మలబద్ధకం వంటివి దూరం కావడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలూ చేకూరతాయి.ఆవపూలుకాస్తంత ఆవాల రుచితోనే ఉంటూ కొన్ని రకాల క్రిస్పీ వంటకాల్లోనూ, మరికొన్ని ఫ్రైలతోపాటు రుచి పెంపొందించడం కోసం, అలాగే కొన్ని రకాల వడల్లాంటి (ఫ్రిట్టర్) రూపంలో చేసే వంటకాల్లో ఆవపూలను ఒక రకమైన మంచి రుచి (ఫ్లేవర్) కోసం ఉపయోగించడమనేది పశ్చిమ బెంగాల్తోపాటు అక్కడి చాలా ప్రాంతాల్లో వాడుకగా ఉంది. కూర (సబ్జీ)గా వండటం కూడా మామూలే. ఆవ పూల పోషక విలువలుఆవపూలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి అనేక రకాల క్యాన్సర్లనుంచి కాపాడుతుంటాయి. అయితే వీటిల్లో యాంటీ సెప్టిక్ గుణాల వల్ల గాయాలను త్వరగా మాన్పివేస్తాయి. ఇందులోని విటమిన్ సి కూడా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది.మునగ పూలుమామూలుగానైతే మునక్కాడలని పిలిచే ఆ ములక్కాయలను కూర వండుకు తినేయడం చాలా సాధారణం. ఇటీవల కొందరు మునగాకును కూరగా వాడుతున్న సంగతీ తెలుసు. అయితే మునగాకుకు దీటుగా దాని పూలూ ఆహారంగా వాడుకునేవారూ ఉన్నారు. ఎందుకంటే సూపర్ ఫుడ్ అనే మాట నిజంగా మునగకే నప్పుతుంది. ఇందుకు కారణమూ ఉంది. మునగ పూల పోషక విలువలుమునగ పూలను ఆహారంగా తీసుకుంటే ఇందులో విటమిన్లు ఏ, సీ, ఈ...లతో పాటు పొటాషియమ్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నారింజతో ΄ోలిస్తే ఇందులో విటమిన్ సీ 7 రెట్లు ఎక్కువ. ఇక క్యాల్షియమ్ మోతాదులు చాలా చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో అనేక క్యాన్సర్ల నుంచి నివారణ. ఇందులోని పీచు మోతాదుల వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియను క్రమబద్దీకరించి, బరువును తగ్గిస్తుంది.మందారపువ్వుచాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగడం గానీ లేదా ఆకర్షణీయమైన ఎరుపు రంగులో ఉండే మందారపువ్వులను పానియాల రూపంలో చేసుకుని తాగడం చాలా చోట్ల సంప్రదాయంగా కొనసాగే ప్రక్రియే. మందారలో పోషక విలువలుమందారపువ్వులో చాలా శక్తిమంతమైన విటమిన్–సి ఉంటుంది. దీంతో మంచి వ్యాధినిరోధకత సమకూరడమే కాకుండా చాలా రకాల గుండెజబ్బులూ నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. కొద్దిగా మాత్రమే పులుపుగానూ, కాస్తంత ఘాటుగానూ ఉండే దీని రుచి (ఫ్లేవర్) కారణంగా దీన్ని తేనీటి రూపంలో తాగడం చాలా చోట్ల జరిగేదే. దీనిలోని పోషకగుణాల కారణంగా జీర్ణశక్తి మెరుగుపడుతుది. ఈ పూలతో చేసే పదార్థాలు రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. శరీర జీవక్రియలు క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్తోపాటు ఉండే విటమిన్ సి వల్ల కాలేయ క్యాన్సర్తో పాటు అనేక క్యాన్సర్లు నివారితమవుతాయి. మందరపూలతో కాచిన టీతో రక్తపోటు, యాంగై్జటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ మందార చాయ్ను పరిమితంగా తాగితేనే మేలన్నది న్యూట్రిషన్ నిపుణుల మాట.బంతి / చేమంతి పూలుఇంగ్లిష్లో మేరీగోల్డ్ గా పిలిచే ఈ బంతి / చేమంతిలోని అనేక రకాల పూల రేకులను అనేక వంటకాల్లో వాడతారు. వీటిని ఎండబెట్టి పానీయాలుగా, కుంకుమపువ్వు (శాఫ్రాన్) తరహాలో గార్నిషింగ్ కోసం వాడుతుంటారు. ఇందులోనూ కాస్తంత పులుపు, వగరు, కారం కలగలసిన రుచి (సిట్రసీ, స్పైసీ, బిట్టర్–ట్యాంజీ ఫ్లేవర్) ఉండటం వల్ల దీన్ని అనేక వంటకాల్లో ఒక దినుసుగా ఉపయోగించడం కూడా పరిపాటి. ఇలా వంటల కోసం ఉపయోగించే మేరీగోల్డ్ మొక్కలపై ఎలాంటి రసాయన ఎరువులూ వేయకుండా పెంచుతుంటారు. దీని పూల రేకలను పైన అలంకరణగా (సీజనింగ్గా) వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో పసుపు పచ్చ రంగునిచ్చేందుకు కలరెంట్గా కూడా వాడతారు. కుంకుమపువ్వుకు ప్రత్యామ్నాయంగా వాడటమూ కొన్ని చోట్ల వాడుకలో ఉంది. దీని పూల రేకలను ఎండబెట్టి టీ రూపంలో వాడతారు. (ఇక మెడిసిన్ విలువలు ఉండటంతో క్యాలండ్యులా నుంచి తీసిన నూనెను చర్మంపైన గాయాలు మానేయందుకు పైపూత మందుగానూ ఉపయోగిస్తారు. బంతి / చేమంతులలోని పోషక విలువలుబంతి / చేమంతి (మేరీగోల్డ్) పూలలోని జీవరసాయనాలు తెల్లదోమ (వైట్ ఫ్లై) వంటి పరాన్నజీవులను దూరంగా ఉంచే గుణం ఉండటం వల్ల పూలతోటలలో కొన్ని రకాల పరాన్నజీవులనూ, తెగుళ్లను దూరంగా ఉంచేందుకూ ఈ మొక్కలను పెంచుతుంటారు. అంతేకాదు... ఈ ప్రజాతికి చెందిన క్యాలెండ్యులా వంటి పూలలో యాంటీ ఆక్సిడెంట్స్తోపాటు ల్యూటిన్, బీటా ల్యూటిన్, ఫ్లేవోగ్జాంథిన్ వంటి కెరటనాయిడ్స్తోపాటు ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని ఓలియోనిక్ యాసిడ్, క్యాలెండిక్ యాసి వంటి ఫ్యాటీ యాసిడ్స్తోపాటు విటమిన్–సి ఉండటం వల్ల తన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణంతో గాయాలను త్వరగా మాని΄ోయేలా చేయడం, నొప్పులను తగ్గించడం వంటి ప్రయోజనాలనిస్తాయి. అందుకే దీన్ని ఓ ఔషధమొక్కగానూ, దీని పువ్వును ఔషధాల్లోనూ ఉపయోగిస్తుంటారు.గులాబీ మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే మన దగ్గర కూడా పాన్లో వేసే గుల్ఖంద్ అనే స్వీటెనర్ను గులాబీ పూల రేకలతోనే తయారు చేస్తారని ప్రతీతి. ఇక రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం అనేది చాలా చోట్ల ఉన్న ఒక సంప్రదాయం. ఆరోగ్యానికి మంచిదంటూ కొందరు ఈ పూల రేకులను అలాగే తినేస్తుంటారు కూడా. గులాబీపూలలోని పోషక విలువలు : ఈ పూల రేకుల్లో ఫీనాలిక్స్ అనే పోషకాలు ఉన్నాయి. వాటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం వల్ల అవి గాయం వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో కాచే టీతో గుండెజబ్బు ముప్పు, క్యాన్సర్, డయాబెటిస్లనూ రిస్క్ తగ్గుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. కేవలం. రోజా అన్నది పూలలో రాజా వంటిది అనే ప్రతీతి దీని తాలూకు గాయాలు మాన్పే శక్తికీ వర్తిస్తుంది. ఇందుకే హీలింగ్ గుణంలో కూడా ఇది కింగ్ అంటూ దీనికి ఓ ప్రశస్తి ఉంది. దీన్ని టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్గా పరిమితంగా ఉపయోగించడమే మంచిదనేది న్యూట్రిషనిస్టుల సలహా.తామరపువ్వులు (కమలం పువ్వులు)దీని గింజలను ‘మఖానా’ గింజలనీ, దీని పూలను ‘ఫూల్ మఖానా’ అంటూ పిలుస్తూ, ఈ పూలనూ ఆహారంగా తీసుకోవడం చాలా చోట్ల వాడుకలో ఉంది. తామరపూలతో చాలా మంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే ఆసియా ఖండంలోని చాలా ప్రాంతాల్లో అనేక మంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. ఇటు మఖానా గింజలనూ, అటు ఫూల్ మఖానాను కూరలలో (కర్రీ), కొన్ని రకాల స్వీట్లలో, కొన్ని సందర్భాల్లో మసాలా దినుసుల మాదిరిగా కూడా వాడతారు. తామరపూల పోషక విలువలుతామరపూలలో విటమిన్ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్లో అనేక పోషకాలతోపాటు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ సి వల్ల చాలా శక్తిమంతమైన వ్యాధి నిరోధక వ్యవస్థ రూపొందుతుంది. ఫలితంగా అనేక రకాల క్యాన్సర్లను ఈ పూలు నివారిస్తాయి. ఈ పూలలోని విటమిన్ బి కాంప్లెక్స్ అలాగే విటమిన్–సి కలగలసి దేహంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా నిలుస్తాయి. వీటలోని క్యాల్షియమ్ వల్ల ఎముకలు బలంగా మారతాయి. రక్తపోటు (హైబీపీ)ని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెగ్నీషియమ్, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజలవణాల వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుంది.మొగలి పువ్వు (ఫ్రాగ్రెన్స్ స్క్రూపైన్ / కేవ్డా) మనదేశంలోని అనేక ్ర΄ాంతాల్లోని ప్రజలతో ΄ాటు దక్షిణ ఆసియాలోని అనేక మంది మొగలి పువ్వును వంటలో ఉపయోగిస్తుంటారు. దీన్ని రుచిని ఇచ్చే పదార్థంగా (ఫ్లేవరింగ్ ఏజెంట్గా) వాడుతుంటారు. దక్షిణ భారతదేశంలో మొగలిపూలతో కూర వండుకోవడమూ చాలా చోట్ల వాడకులో ఉన్న సంప్రదాయమే. ఇక రసగుల్లా, రస్మలాయ్ వంటి పాయసాల్లోనూ, కొన్ని రకాల పానీయాల్లో కొంత తియ్యటి రుచి / వాసన ఇచ్చేందుకు ఫ్లేవరింగ్ ఏజెంట్గా చాలా చోట్ల వాడుతుంటారు. దీన్ని ఔషధ మొక్కగానూ, దీని పువ్వును ఔషధాల్లోనూ వాడటమూ చాలా సాధారణంగా జరుగుతుండేదే. మొగలిపువ్వులోని పోషక విలువలుఈ పూలలో విటమిన్–సి వంటివీ అలాగే, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ వంటి విటమిన్–బి కాంప్లెక్స్లోని విటమిన్లతోపాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇక గాయాలను మాన్పించే, నొప్పులను తగ్గించే యాంటీసెప్టిక్, యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలూ ఈ పూలలో ఉంటాయి. ఇక ఇదొక ఔషధ మొక్క కూడా కావడం వల్ల దీనిలోంచి తీసే నూనెలను పైపూత మందుగా ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పులలో వాడుతుంటారు. దాదాపుగా అందరికీ తెలిసిన తినే పూలుపొద్దుతిరుగుడు పువ్వు (సన్ఫ్లవర్)దీని గింజల నుంచి తీసిన నూనెలో వంటల్లో విరివిగా వాడతారన్న విషయం తెలిసిదే. అయితే దీని ఆకులూ, వేళ్లతో పాటు పూల రేకులను సైతం కొన్ని రకాల సలాడ్స్లోనూ, వేయించిన పూలరేకులను కొన్ని ఫ్రై వంటకాల్లో, శ్నాక్స్లో క్రంచీగానూ వాడుతుంటారు. పూర్తిగా వికసించకముందే మొగ్గగా ఉన్నప్పుడే కోసిన పూలను పేలాల్లా (కార్న్లా) వేపి / వేగించి తినడంతో పాటు కొన్ని సలాడ్స్లో కలిపి వడ్డిస్తారు. పొద్దుతిరుగుడు పువ్వు పోషక విలువలు : ఈ పూలను పవర్΄్యాక్డ్ పవర్హౌజ్గా పరగణించడం పరిపాటి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, కొవ్వులూ, పీచు (ఎడిబుల్ ఫైబర్), విటమిన్–ఈ వంటి విటమిన్లు, కాపర్, సెలేనియమ్, మ్యాంగనీస్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు (మినరల్స్) పుష్కలంగా ఉంటాయి. విటమిన్–ఈ అనేది చాలా శక్తిమంతమైన ఆంటీ ఆక్సిడెంట్ కావడంతో చాలా రకాల వ్యాధుల నుంచి క్యాన్సర్లనుంచి కా΄ాడుతుంది. ్ర΄ోటీన్ల కారణంగా కండరాలు శక్తిమంతం కావడంతో ΄ాటు కండరాల రిపేర్లకు ఇది సహాయపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడానికి సెలేనియమ్ ఉపయోగపడుతుంది.కాలీఫ్లవర్ గోబీ పువ్వు అని తెలుగులోనూ ఫూల్ గోబీ అని హిందీలోనూ పిలుచుకునే ఈ పువ్వు కూరలా అందరూ వండుకోడానికి ఉపయోగించేదే. గోబీ పకోడీలంటూ శ్నాక్స్ రూపంలోనూ తింటుంటారు. కాలీఫ్లవర్ పోషక విలువలు : ఈ పువ్వు క్యాన్సర్ను నివారిస్తుంది. కాలీఫ్లవర్లోని సల్ఫోరఫేన్ వంటి వృక్షరసాయనాలు (ఫైటో కెమికల్స్) క్యాన్సర్లతో పోరాడతాయి. సల్ఫోరఫేన్ అనే ΄ోషకం ఆటిజమ్ను నివారించడంలో కూడా తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలీఫ్లవర్లోని ఇండోల్–3–కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుందని తేలింది. ఇది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు సమర్థంగా ఉపయోగపడుతుంది. దేహంలోని కణాలు క్యాన్సరస్గా మారి΄ోతున్న సందర్భాల్లో ఆ కణాల్లోనే అంతర్గతంగా క్యాన్సర్ తాలూకు విషాలను (సైటోటాక్సిన్స్)ను ఉత్పన్నమయ్యేలా పుట్టించి ఆ క్యాన్సర్లను ఈ పువ్వు నివారిస్తుంది. కుంకుమపువ్వుకుంకుమపువ్వును చరిత్రపూర్వ యుగాల నుంచీ అనాదిగా మనమంతా ఓ సుగంధద్రవ్యంగా వాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిర్యానీలోనూ, కశ్మీరీ వంటకాల్లోనూ ఈ పువ్వును ఉపయోగిస్తుంటారు.కుంకుమపువ్వు పోషక విలువలు : కుంకుమపువ్వులో యాంటీసెప్టిక్, యాంటీడిప్రెసెంట్ గుణాలున్నాయి. క్యాన్సర్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. కుంకుమ పువ్వు వాడటం వల్ల కడుపులోని బిడ్డ మంచి రంగుతో పుడుతుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఇది చాలావరకు అ΄ోహ మాత్రమే. అయితే కుంకుమపువ్వును ఒక హెర్బ్గా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే మాత్రం దానితో చాలా రకాల న్యూట్రిటివ్ ప్రయోజనాలు ఒనగూరతాయి. కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్ త్వరత్వరగా మారి΄ోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాల్లో తేలింది. ఇందులో బీ–కాంప్లెక్స్ విటమిన్కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజం. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడమే సురక్షితం.అపోహే కానీ... ప్రయోజనమూ ఉంది ఇలా... కుంకుమపువ్వు కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనేది శాస్త్రీయంగా నిర్ధారణ కాని అ΄ోహ మాత్రమే అయినప్పటికీ పాలలో చాలా పరిమితమైన మోతాదులో తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు సంపూర్ణాహారమైన పాలను గర్భవతులు తాగడం వాళ్లకు చాలా మేలుచేసే అంశం. అయితే గర్భధారణ సమయంలోని మొదటి మూడు నెలల పాటు తమ వేవిళ్లు, వికారం కారణంగా గర్భవతులు పాలు తాగడానికి అంతగా ఇష్టపడరు. అయితే కుంకుమపువ్వు కలిపిన పాలు మరింత రుచికరంగా, సుగంధభరితంగా ఉంటాయి. అందునా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. ఇక కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటలకు మరింత రుచిని ఆపాదిస్తారు. కుంకుమపువ్వు గురించి ఓ హెచ్చరిక కుంకుమపువ్వునువాడే గర్భవతులగుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పాలలో దీన్ని చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. ఈ కారణంగా మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే దాంతో గర్భస్రావమూ అయ్యే ముప్పు కూడా ఉంటుందని తెలుసుకుని చిటికెడంటే చిటికెడే వాడటమే శ్రేయస్కరం.బ్రాకలీ / బ్రోకలీఒకప్పుడు అందరికీ అంతగా తెలియని బ్రాకలీ అనే ఈ పువ్వు ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద మాల్స్లోనూ లభ్యమవుతోంది. బ్రాకలీ అనేది నిజానికి ఇటాలియన్ పేరు. ఇటాలియన్ భాషలో ‘బ్రకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్ క్రెస్ట్ ఆఫ్ క్యాబేజీ) అని అర్థం. బ్రాకలీ పోషక విలువలు : ఇందులో విటమిన్ ఏ మోతాదులు చాలా ఎక్కువ. ఒంటి నిగారింపుకూ, మంచి కనుచూపుకూ ‘విటమిన్–ఏ’ బాగా ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులోని పోషకాలు శరీరంలో దేహంలోని అనేక రకాల విషాలనూ వాటి ప్రభావాలను తొలగించే ‘డీ–టాక్సిఫైయర్స్’గా ఉపయోగపడతాయి. డాక్టర్ హరిత శ్యామ్, సీనియర్ డైటీషియన్నిర్వహణ యాసీన్ (చదవండి: హీరో వరుణ్ ధావన్ కుమార్తెకు డీడీహెచ్..? ఎందువల్ల వస్తుందంటే..) -
ఆ వ్యాయామ మెషీన్తో 113 కిలోల నుంచి 90కిలోలు..!
కొందరికి బరువు తగ్గడం అంత సులభం కాదు. తగ్గినట్టు తగ్గి అమాంతం యథావిధిగా బరువు పెరిగిపోతుంటారు. సర్జరీలు వంటివి కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. శరీరాన్ని కష్టపెట్టడానికి, చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనురించడంలో విఫలమయ్యే వారి పరిస్థితి వెయిట్లాస్ విషయంలో దాదాపు ఇలానే ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ 68 ఏళ్ల అమెరికన్ వ్యక్తి. అతడి కథ వింటే..ఆరోగ్యం విషయంలో ఎలా ఉండకూడదో కనువిప్పు కలుగుతుంది.అమెరికాకు చెందిన అల్ ఎస్పోసిటో 46 ఏళ్ల వయసులో సుమారు 226 కిలోల బరువు ఉండేవాడు. తన రూపాన్ని చూసి ఆయనే ఇబ్బంది పడేవాడు. తగ్గాలని స్వల్పకాలిక ప్రయోజనాలిచ్చే డైట్లు ప్రయత్నిస్తుండేవాడు. అవేమి వర్కౌట్ అవ్వకపోయేసరికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీని ఎంచుకున్నారు. ఆ శస్త్రచికిత్సకు ముందే పలువురు కోల్పోయిన బరువులో 20% మళ్లీ పెరుగుతావని చెప్పారు కూడా. అలాగే అల్ ఎస్పోసిటో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత సుమారు 91 కిలోలు తగ్గాడు. అయితే మళ్లీ ఇదివరకు చెడు ఆహారపు అలవాట్లతో మళ్లీ బరువు పెరిగిపోయాడు. కనీసం వ్యాయమం చేసేందుకు ప్రయత్నించకపోవడంతో సుమారు 154 కిలోలకు వచ్చేశాడు. అధిక బరువు కారణంగా కుడి మోకాలిలో తీవ్రమైన నొప్పి మొదలైంది. వైద్యులు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స సిఫార్సు చేశారు.అయితే ఆపరేషన్కు అతడి శరీరం సహకరించలేదు. దాంతో అల్ బరువు తగ్గక తప్పలేదు. ఆ నేపథ్యంలో మెడిటేరియన్ డైట్ని అనుసరించి రోజుల తరబడి వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులను జీవితంలో చేర్చుకున్నాడు. అలా అల్ సుమారు 129 కిలోలకు చేరుకున్నాడు. ఆ తర్వాత కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. చివరగా, ఫిబ్రవరి 2025లో ఫిజికల్ థెరపీ పూర్తి చేసుకున్న తర్వాత, అతను తన బరువు తగ్గే ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు.అయితే బరువు తగ్గడంలో రోయింగ్ మెషీన్ బాగా హెల్ప్ అవుతుందని సన్నిహితులు సూచించడంతో ఆ మెషీన్ని కొని తెచ్చుకుని వర్కౌట్లు చేయడం ప్రారంభించాడు. రోయింగ్ మెషీన్పై వర్కౌట్లు చేసేటప్పటకీ అతడి బరువు 113 కిలోలు. ఇవాళ అనూహ్యంగా 90 కిలోల బరువు తగ్గడం విశేషం. మొదట్లో 20 నిమిషాల కంటే తక్కువ నిడివిగల చిన్న సెషన్లతో ప్రారంభించి క్రమంగా క్రమంగా ఎక్కువ సేపు చేసే వర్కౌట్లకు పెంచుకుంటూ, చివరికి రోజుకు 90 నిమిషాల వరకు రోయింగ్ చేశాడు. అంతేగాదు స్థిరమైన భోజన సమయాలను పాటిస్తూ..రాత్రి ఎనిమిది తర్వాత ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అలాగే చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ ఫుడ్ విషయంలో మంచి కేర్ తీసుకుంటూ బరువుని అదుపులో ఉంచాడు అల్. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. (చదవండి: సద్గురు పేరెంటింగ్ సలహా..! నటి అలియా భట్ రియాక్షన్..) -
బిడ్డకు సరిపడా పాలు పడేలా ఇలా చేయండి..!
కొత్తగా తల్లి అయిన మహిళల్లో తమకు పాలు పడకపోవడం అన్నది వారిలోని అ΄ోహ మాత్రమే. దాదాపుగా 90% నుంచి 95% మహిళల్లో తమ చిన్నారులకు కావాల్సినన్ని పాలు సమకూరుతాయి. అయితే అప్పుడే పుట్టిన బిడ్డ తాలూకు ఆకలి తీరుతెన్నులు తెలియకపోవడం లేదా బిడ్డను తమ నిపుల్ వరకు తీసుకెళ్లి బిడ్డను రొమ్ము పట్టించడం వంటి అంశాలపై కొత్త తల్లులకు అవగాహన లేకపోవడం లేదా పాలు పట్టడంలో బేబీ పొజిషన్స్ సరిగా కుదరక΄ోవడంతో బిడ్డ పాలు తాగక ఏడుస్తుండటంతో తమ పాలు బిడ్డకు సరిపోవడం లేదేమోనంటూ చాలామంది కొత్తగా తల్లులైన మహిళలు అపోహ పడుతుంటారు. ఈలోపు బాటిల్ ఫీడింగ్తో పాలు పడుతుంటే తల్లి మాత్రమే కాకుండా ఎవరైనా తేలిగ్గా పట్టగలగడంతో పాటు తల్లిపాలతో పోలిస్తే కాస్త రుచిగానూ, బాటిల్తో తాగడానికి సులువుగానూ ఉండటంతో బిడ్డ పోత పాలకు తేలిగ్గా అలవాటు పడతారు. దాంతో చాలామంది తల్లులు తమ బేబీకి సరిపడినన్ని పాలు పడటం లేదేమోననే అపోహలో ఉండిపోతారు. నిజానికి ఈ అపోహలన్నీ తొలగించుకుని తల్లిపాలు పట్టడమే మేలు.ఎన్నో వ్యాక్సిన్ల పెట్టుఈ తల్లిపాలుతల్లులు ముందునుంచే తమ బిడ్డకు వీలైనంత మేర తల్లిపాలకు అలవాటు చేయడమే మంచిది. ప్రసవం అయిన తర్వాత పూర్తిస్థాయిలో పాలు ఊరడానికి ఒకటి రెండు రోజులు పట్టవచ్చు. అయితే కొత్తగా తల్లి అయిన వాళ్లలో కొంతమేరకు నీళ్లలా పలుచగా ఉండే పాలను ముర్రుపాలు అంటారు. నిజానికి ఈ ముర్రుపాలు ఎన్నెన్నో వ్యాక్సిన్ల కంటే ప్రభావవంతమైనవి. అయితే ఇవి రెండుమూడు చుక్కల పరిమాణంలోనే వస్తున్నాయంటూ కొందరు తల్లులు వీటిని బిడ్డకు అంతగా పట్టించరు. కానీ వీటిని తప్పక బిడ్డకు తాగించాలి. ఈ పాలలో బిడ్డకు సుదీర్ఘకాలం ΄పాటు మేలు చేసే చాలా అంశాలు ఉంటాయి.కొంతమేర మానసికమైన అంశాల ప్రభావం కూడా... పాలు ఊరడంలో కొంతమేర మానసిక అంశాలూ దోహదపడతాయని చెప్పవచ్చు. తల్లిలో సమృద్ధిగా పాలు పడటానికి ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కారణమవుతుంది. ఇది మెదడు నుంచి వచ్చే సంకేతాల మేరకు విడుదల అవుతుంది. కొత్త తల్లి ఏ మాత్రం మానసిక ఒత్తిడి లేకుండా రిలాక్స్డ్గా ఉండి, ప్రశాంతంగా కూర్చుని... నా బిడ్డకు సరిపడినన్ని పాలు నా దగ్గర ఉన్నాయనే భావనతో పాలు పడితే... తల్లి దగ్గర బిడ్డకు అవసరమైనన్ని పాలు సమృద్ధిగా ఉంటాయి. కేవలం ఒక శాతం నుంచి 5% తల్లుల్లోనే పాలు ఊరడానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. అందుకే ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే ల్యాక్టేషన్ నిపుణులు లేదా తమ డాక్టర్ను సంప్రదించడం అవసరం. పై నుంచి పాలు పట్టడం తప్పనిసరి అయితే ఉగ్గుగిన్నెతోనే... బిడ్డకు సరిపడా పాలు ఇవ్వలేని సందర్భంలో కొంతమంది పాత తల్లుల సలహా మేరకు బిడ్డకు బాటిల్ ఫీడింగ్ ఇస్తుంటారు. పైపోత పాలు కొంత రుచికరంగా ఉండటంతో పాటు బాటిల్ ఫీడింగ్ తేలిగ్గా ఉండటంతో బిడ్డ ఆ పాలకు అవవాటు పడి తల్లిపాలను అంతగా ఇష్టపడకపోవచ్చు. అలా రెండుమూడు రోజుల పాటు బిడ్డకు పోతపాలో లేదా ఫార్మూలా పాలో తాగించాలంటే కేవలం ఉగ్గుగిన్నెతోనే పట్టించడం మంచిది. దాంతో భవిష్యత్తులో తల్లి నుంచి పాలు తాగే విషయంలో అయోమయపడకుండా మళ్లీ బిడ్డ సౌకర్యంగా పాలు తాగగలడు. బిడ్డ ఎంతగా పాలు తాగుతుంటే తల్లిలో అంతగా పాలు ఊరుతూ ఉంటాయి.బిడ్డకు సరిపడా పాలు ఊరాలంటే... ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో బిడ్డకు సరిపోయినంతగా పాలు పడకపోతే వారిలో స్వభావికంగానే (నేచురల్గానే) పాలు సమృద్ధిగా పడేందుకు ఈ కింద పేర్కొన్న మార్గాలను అనుసరించవచ్చు. ఆ తల్లి తన ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలతో పాటు పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు... ఆహారంలో నువ్వులు, వెల్లుల్లి, బెల్లం, పాలు, కోడిగుడ్లు, కొబ్బరి, కొబ్బరి నీళ్లతో పాటు మంచినీళ్లూ ఎక్కువగా తీసుకోవడం వల్ల తల్లికి స్వాభావికంగానే బాగా పాలు పడే అవకాశం ఉంటుంది.అవి అపోహలు మాత్రమే సిజేరియన్ ప్రక్రియ ద్వారా కాన్పు అయిన చాలామంది తల్లులు తమకు సర్జరీ అయినచోట కుట్లలో చీము వస్తుందేమో అన్న ఆందోళనతో పప్పులు తీసుకోరు. నిజానికి పప్పుల్లో ఉండేది ప్రోటీన్లు అయినందున పప్పుతో చీము పట్టదు. అలాగే ఒంటికి నీరు పడుతుందనే అపోహతో తగినన్ని ద్రవపదార్థాలూ, ద్రవాహారాలు తీసుకోరు. బిడ్డకు జలుబు చేస్తుందనే తప్పుడు అభిప్రాయంతో పండ్లను తీసుకోరు. నిజానికి పండ్లలో తల్లీబిడ్డలలో తగినన్ని విటమిన్లు, ఖనిజలవణాలను భర్తీ చేయడంతో పాటు వాళ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యం ఉంటుంది. అందుకే ఈ తరహా అ΄ోహల జోలికి పోకుండా బాలింతకు మంచి పోషకాహారంతో పాటు, పండ్లరసాలతో చేసే ద్రవాహారాలు, నీళ్లు, పండ్లు ఇస్తూ ఉండటం అవసరం. ఇక మరికొంత మంది తల్లులు తమ బిడ్డకు పాలు సరిపోవడం లేదనే అ΄ోహతో పోతపాలు పడుతుంటారు. బిడ్డ పాలు తాగిన తర్వాత రెండు నుంచి మూడు గంటల సేపు హాయిగా నిద్రపోవడంతో పాటు... రోజు మొత్తంలో ఆరుసార్ల కంటే ఎక్కువ సార్లు పక్కతడుపుతూ, వయసుకు తగినట్లు బరువు పెరుగుతుంటే మాత్రం ఆ బిడ్డకు తల్లి పాలు సరిపోతున్నాయని అనుకోవచ్చు. ఇక్కడ పేర్కొన్న సూచనలు పాటించాక కూడా ఇంకా పాలు సరిపోకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్లు, పాలలో కలిపే పొడులు వాడాల్సి రావచ్చు. డాక్టర్ పృథ్వీ పేరం, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిట్రీషియన్ – గైనకాలజిస్ట్నిర్వహణ: యాసీన్ (చదవండి: నో స్ట్రెస్..! రోగాల బారినడకుండా..) -
నో స్ట్రెస్..! రోగాల బారినడకుండా..
ప్రతి ఒక్కరి జీవితకాలంలో ఎంతో కొంత ఒత్తిడి (స్ట్రెస్)ఉంటుంది. అయితే కొందరిలో ఇది చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి అన్నది మెదడు, మానసిక ఆరోగ్యంపై మాత్రమే కాదు... దేహం తాలూకు భౌతిక సమస్యల రూపంలోనూ వ్యక్తమవుతుంటాయి. ఒత్తిడికి కారణాలు, దీని దుష్ప్రభావాలు, వీటిని అధిగమించడం ఎలా అనే పలు అంశాలను వివరించేందుకే ఈ కథనం.ఒత్తిడి పెరగడానికి పలు అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు పేదరికం, ప్రేమించేవారికి దూరం కావడం సామాజికంగా ఒంటరికావడం, ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం, కుటుంబంలో ఎవరినైనా కోల్పోవడం... ఇలా ఎన్నో కారణాలు ఒత్తిడి పెరగడానికి కారణమవుతాయి.ఒత్తిడి (స్ట్రెస్)లో రకాలు : ఈ స్ట్రెస్ను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి...మేలు చేసే ఒత్తిడి : దీన్ని ఇంగ్లిష్లో ‘గుడ్ స్ట్రెస్’ అని చెప్పవచ్చు. అయితే ఒత్తిడిలోనూ మంచి ఒత్తిడి ఉంటుందా అనే సందేహం రావచ్చు. కొన్ని సందర్భాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పుడు ఆ పని త్వరగా లేదా అనుకున్న విధంగా విజయవంతంగా ముగుస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఒక పనిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు అది ఆ టైమ్లోపు ముగుస్తుందా లేదా అన్న ఒత్తిడిలో పని చేయడం వల్ల నిర్ణీత గడువులో పని బాగా పూర్తయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేలు చేసే ఒత్తిడిని ‘మంచి ఒత్తిడి’ లేదా ఇంగ్లిష్లో ‘యూస్ట్రెస్’ అంటారు. భరించగలిగేంత ఒత్తిడి : దీనితో సమస్య అవుతుంది గానీ... కొంత ప్రయత్నంతో దీన్ని భరించవచ్చు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో దీన్ని అధిగమించవచ్చు. అందుకే దీన్ని భరించగలిగే ఒత్తిడి (టాలరబుల్ స్ట్రెస్)గా పేర్కొంటారు. హానికరంగా పరిణమించే ఒత్తిడి : ఇది తీవ్రమైన ఒత్తిడి చాలాకాలం పాటు కొనసాగుతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యంపైనా, దేహంపైనా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని హానికరమైన ఒత్తిడి లేదా ‘టాక్సిక్ స్ట్రెస్’గా చెబుతారు. ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు అది కొద్ది సేపటికోసమే అయితే దేహం దాన్ని ఎలాగోలా తట్టుకుని తన జీవక్రియల వ్యవస్థలను (బయలాజికల్ సిస్టమ్స్ను) మళ్లీ మామూలు స్థితికి తెచ్చుకోగలుగుతుంది. ఉదాహరణకు మనం ఒక పామును చూశామనుకోండి. ఒళ్లు ఝల్లుమంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. స్నేక్ రెస్క్వువర్స్ వచ్చి దాన్ని పట్టుకుని వెళ్లిన తర్వాత ఝల్లుమన్న ఒళ్లు, ఒత్తిడి మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తాయి. కానీ ఏదైనా ఒత్తిడి అదే పనిగా చాలా సుదీర్ఘకాలం΄ాటు అదే స్థితిలో కొనసాగుతూ ఉంటే ఆ ఒత్తిడి తాలూకు దుష్ప్రభావాలు అనేక రకాలుగా బయటపడతాయి. ఉదాహరణకు కుంగుబాటు (డిప్రెషన్), ఉద్విగ్నత (యాంగై్జటీ), గుండెజబ్బులు (కార్డియోవాస్కులార్ డిసీజెస్), డయాబెటిస్, హైబీపీ లాంటి దేహ జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్ డిజార్డర్స్) వంటి రూపంలో బయటపడవచ్చు.మెదడుపై ఒత్తిడి ప్రభావం మెదడుపై పలురకాలుగా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు... హిప్పోక్యాంపస్పై : ఇది మెదడులో మూడ్స్ను, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే భాగాలు. స్ట్రెస్ తాలూకు ప్రతికూల ప్రభావాలు హి΄్పోక్యాంపస్పై పడితే అది మూడ్స్నూ, మన జ్ఞాపకశక్తిని ప్రభావితం చేయవచ్చు. అమిగ్దలా : ఇది మెదడులో ఉద్విగ్నతను (యాంగై్జటీని) కలగజేసే ప్రాంతం. కాబట్టి అదేపనిగా యాంగై్జటీ కొనసాగే ప్రమాదం ఉంటుంది. ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ : మెదడులోని ఈ భాగం మనం నిర్ణయాలు తీసుకునే ప్రాంతం. అంతేకాదు... ఇది భావోద్వేగాలను నియంత్రించే భాగం కూడా కావడంతో ఆ మేరకు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే మెదడులో ఆలోచనలూ, అన్ని రకాల కార్యకలాపాలకు కేంద్రాలైన మెదడు కణాల (న్యూరాన్ల) ఆకృతి మారడం, వాటి పనితీరుపై దుష్ప్రభావలు పడటంతోపాటు రకరకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.ఒత్తిడి... న్యూరో కెమికల్స్ భూమిక(రోల్ ఆఫ్ న్యూరోకెమికల్స్)ఒత్తిడి సమయంలో కొన్ని రకాల న్యూరోకెమికల్స్ విడుదల అవుతాయి. వీటినే స్ట్రెస్ కెమికల్స్ అంటారు. ఉదాహరణకు కార్టిసాల్ లాంటి గ్లూకోకార్టికాయిడ్స్, గ్లుటామేట్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లు వంటివి. దీర్ఘకాలం ఒత్తిడి కొనసాగితే ఇవి మెదడులో అనేక మార్పులు తెస్తాయి. అంతేకాదు దీర్ఘకాలంపాటు ఒత్తిడి కొనసాగితే అది దేహం తాలూకు జీవక్రియల మీదా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి.ఒత్తిడి నివారణ పద్ధతులు /చికిత్సకొన్ని జీవనశైలిని మెరుగుచేసుకునే ప్రక్రియల ద్వారా ఒత్తిడిని చాలావరకు అధిగమించవచ్చు. ఉదాహరణకు... మంచి పోషకాహారం, కంటి నిండా నిద్ర కుటుంబం, స్నేహితులను సన్నిహిత సంబంధాలు (మంచి సోషల్ స΄ోర్ట్ సిస్టమ్) ఆహ్లాదకరమైన సంగీతం వినడం లేద ఇష్టమైన హాబీలను పెంపొందించుకోవడం ∙రోజూ తేలికపాటి వ్యాయామం, ధ్యానం వంటి ప్రక్రియలతో చాలావరకు ఒత్తిడిని అధిగమించవచ్చు. అయితే దీర్ఘకాలిక ఒత్తిడిని అధిగమించడానికి సైకియాట్రిస్ట్లను సంప్రదించి కొన్ని మందులు, ఒత్తిడికి కారణమైన అంశాలను బట్టి కౌన్సెలింగ్ అవసరమవుతాయి. డాక్టర్ ప్రవీణ్ ఎస్ గోపన్, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ నిర్వహణ: యాసీన్ (చదవండి: కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..) -
బరువు తగ్గి పీసీఓఎస్ని తిప్పికొట్టింది..! అలాగే ఆ సమస్యలు..
బరువు తగ్గడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చొ తెలిస్తే విస్తుపోతారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే ఎంత మెరుగైన మార్పులు సొంతం చేసుకోవచ్చో అనేందుకు ఈ మహిళే ఉదాహరణ. తాను వెయిట్లాస్తో ఎన్ని లాభాలు పొందిందో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడమే కాదు..బాడీ మార్పుల తాలుకా ఫోటోలను కూడా షేర్ చేసుకుందామె.ఆ మహిళే దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త నికితా ఫుల్వానీ. చాలామంది బరువు తగ్గడాన్ని రూపానికి సంబందించిదిగా భావిస్తారు.కానీ ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే హార్మోన్ల సమతుల్యత నుంచి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానిపై ప్రభావం ఉంటుందని చెబుతుంది. తాను బరువు తగ్గడం వల్ల ముందుగా తన నెలసరి సమస్యలను పరిష్కారమయ్యాయని, ఆ తర్వాత తన చర్మం నిగారింపు సంతరించుకోవడం మొదలైందని చెబుతోంది. అలాగే ముఖంపై రోమాలు కూడా తగ్గాయని చెప్పుకొచ్చింది. తాను ఎక్కువగా నీరు తాగడం, మంచి ఆహారపు అలవాట్లతో అధిక బరువుని సునాయాసంగా తగ్గించుకున్నట్లు వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యలు ఎలా తగ్గాయో కూడా వివరించింది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం నిగారింపు సంతరించకుందని, అలాగే శరీరం యాక్టివ్గా మారిందని అంటోంది. అలాగే చర్మంపై ఇదివరకు ఉన్న మచ్చలు కూడా తగ్గాయని, మేకప్ లేకుండా సౌకర్యవంతంగా ఉండగలుగుతున్నానని అంటోంది. అధిక చక్కెర తీసుకోవడంతో నోటి చుట్టూ, మెడ చుట్టూ నలుపు ఎక్కువగా ఉండేదని పేర్కొంది. అయితే ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన పదార్థాలకు, చక్కెరకు దూరంగా ఉందో ఆ సమస్య చాలమటుకు తగ్గిందని అంటోంది. అలాగే పాదాల సైజు నుంచి మణికట్టు సైజు అన్నింటిలో శరీర మార్పుని చవిచూశానంటోంది. కానీ బరువు తగ్గితే శరీరం ఎంతగా రూపాంతరం చెందుతుందో, మనలో ఎంతటి అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయో స్పష్టంగా తెలిసిందని అంటోంది. ప్రస్తుతం తనను చూస్తే..జస్ట్ 25 లేదా 27 ఏళ్లు అని మాత్రమే అనుకుంటారని అంటోంది. కచ్చితంగా బరువు తగ్గితే అక్షరాల యవ్వనంగా మారిపోతామని, మన చర్మకాంతి పెరుగుతుందని చెబుతోంది ఫుల్వానీ. మన జీవనశైలి బాగుంటే అందం, ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయని చెబుతోంది. View this post on Instagram A post shared by Nikita Phulwani (@niggiphulwani) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొలి ట్రాన్స్జెండర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్..!) -
ఐరన్ అప్తో.. ప్రపంచ రికార్డు
ఐరన్ డెఫిషియెన్సీ(ఐడిఏ)పై అవగాహన పెంచే క్రమంలో అంతర్జాతీయ పోషకాహార సంస్థ దానోన్ ఇండియా నిర్వహించిన కార్యక్రమం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఈ విషయాన్ని భాగ్యనగరంలోని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగరంతో పాటు దేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య నిపుణులు రక్తహీనతను ఎదుర్కొనే విషయంలో పాలుపంచుకుంటామని ప్రమాణం చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వెల్లడించారు. 2025 నవంబర్లో ప్రారంభించిన ‘ఐరన్ అప్’ కార్యక్రమం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించారు. ఈ కాంపెయిన్లో భాగంగా వైద్యులు అవగాహన పెంపు, సమయానుకూల నిర్ధారణ, పోషకాహార ప్రాముఖ్యతపై కృషి చేయాలని సంకల్పించారు. పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్లు సహా అనేక మంది వైద్య నిపుణులు కార్యక్రమంలో భాగమయ్యారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువుల్లో రక్తహీనతను తగ్గించేందుకు డానోన్ ‘స్వస్థ మాత స్వస్థ బాలక్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని బీహార్లో అమలు చేస్తోంది. ఈ సందర్భంగా డానోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ ప్రియాంక వర్మ మాట్లాడుతూ.. ‘ఈ గుర్తింపు వైద్య సమాజం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి మార్పు సాధ్యమో చూపిస్తుంది అని తెలిపారు. -
'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై హంజా అలీ మజారిగా నటించిన రణవీర్ సింగ్ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్ ఫిజిక్ పరంగా చాలా కేర్ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్నెస్ కోచ్. అంత తక్కువ వ్యవధిలో రణవీర్ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు. ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్నెస్ కోచ్ ముస్తఫా రణవీర్ సింగ్ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. నిజానికి షూటింగ్ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్సింగ్ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం 600-700 కేలరీలు ప్రోటీన్ షేక్ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్ షేక్లు, 240 గ్రాముల ప్రోటీన్ కోసం చికెన్, మటన్ ఎక్కువుగా తీసుకునేవాడట. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్ షెడ్యూల్ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం ప్రయత్నిస్తాడని అన్నారు. తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్నెస్ కోచ్కి ట్రైనింగ్ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్ ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్ సింగ్, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..
కొన్ని వెయిట్లాస్ స్టోరీలు వెనుక ఎడతెగని ఎగతాళి, విమర్శలు, కంటిమీద కునుకు పట్టని బాధరకమైన వేదన ఉంటుంది. వాటిన్నంటి తట్టుకుని బరువు తగ్గి చూపించడమే కాకుండా ఆ క్రమంలో తామేంటో చూపించి విజేతలుగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ అరుణాచల్ప్రదేశ్కు చెందిన మహిళ. ఎవరామె..? ఏమా కథ సవివరంగా చూద్దామా..!.అరుణాచల్ప్రదేశ్కి చెందిన ఐదుగురు పిల్లల తల్లి అయిన అమోమ్ సోకి యెకర్ ఒకప్పుడు అధిక బరువుతో ఉండేది. ఈ 39 ఏళ్ల వ్యాపారవేత్త 130 కిలోల అధిక బరువుతో ఇబ్బందిపడుతుండేది. ఆమె ఆకారం, బరువు చూసి సన్నిహితులే ఎగతాళి చేస్తూ ఇబ్బందిపెడుతుండేవారు. అంత బరువుతో కనీసం బయటకు అడుగుపెట్టడానికి కూడా ఇబ్బంది పడేది. సదా నిరాశనిస్ప్రుహలతో నిరుత్సాహంగా ఉండేదామె. కనీసం స్నేహితులను కూడా కలవలేకపోయేది. పైగా లోలోన అభద్రతా భావంతో కుమిలిపోతూ ఉండేది. కానీ ఏదో విధంగా ఈ అధిక బరువుని తగ్గించుకోవాలి, తానేంటోప్రూవ్ చేసుకోవాలన్న ఆరాటం మాత్రం యెకర్కి అపారంగా ఉండేది. అదే ఆమెను..స్లిమ్గా మారేందుకు ఉపక్రమించేలా చేసింది. అచంచలమైన దృఢసంకల్పంతో బరువు తగ్గే ప్రయత్రాలు చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్నగా మొదలు పెట్టి ప్రభావవంతంగా ఉండేలా చేసుకుంది. అలా తగ్గుతూనే మోడల్గా ప్రయత్నిస్తుంటే..నువ్వా మోడల్గానా అంటూ ఛీత్కారాలు, అవమానాలు ఎక్కువయ్యాయి. బాగా నాజూకుగా మారితే ఒక్కసారైనా అరుణాచల్ అందాలపోటీల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తన కోరికను వ్యక్తం చేయగా..ఒక్కసారిగా అందరూ నోఛాన్స్ అనేశారు. పైగా ఆమె కారణంగా ఆ అందాల పోటీలను సైతం తిట్టిపోశారు. ఇక ఈ మాటలు వింటూ డిప్రెషన్లోకి వెళ్లకూడదని, కేవలం వాళ్లు అనే మాటలు మూగబోయేలా తాను స్లిమ్గా మారాలన్నేదే లక్ష్యంగా పెట్టుకుని మరి ఏకంగా 130 కిలోల నుచి 67 కిలోలకు చేరుకుంది. అనుకున్నట్లుగానే అరుణాచల్ప్రదేశ్ అందాల పోటీల్లో పాల్గొని, మిసెస్ అరుణాచల్ 2026గా కిరీటాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం మిసెస్ ఇండియాగా టైటిల్ దక్కించుకోవడమే తన లక్ష్యం అని చెబుతోంది యోకర్. ఫిట్నెస్ జర్నీ మొదలైందిలా..తాను స్వతహాగా బాగా తిండిబోతునని, అదే తన ఊబకాయానికి ప్రధాన కారణమని చెబుతోంది. తాను ఈ వెయిట్లాస్ జర్నీని..ప్రభావవంతమైన చిన్న అలవాట్లను జీవనశైలిలో జోడించి సన్నగా మారినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు యోగ, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలకు దూరంగా ఉంటూ బరువు తగ్గినట్లు తెలిపింది. తాను టీని పూర్తిగా మానేశానని, శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారడంతోనే ఇంతలా స్లిమ్గా మారానని సంతోషంగా చెబుతోందామె. సత్వర ఫలితాల కోసం వెంపర్లాడకుండా..స్థిరమైన ఆరోగ్యకరమైన జీవినశైలిని అవర్చుకోవడంతో బరువు తగ్గానని అంటోంది. చిన్న అలవాట్లే చాలా ప్రభావవంతంగా ఉంటాయని చెబుతోంది. ఐదుగురు పిల్లల తల్లివి, బాగా ఏజ్డ్గా కనిపిస్తున్నావ్.. అన్న మాటలు చెవికెక్కించుకోలేదని..తనలాంటి వాళ్లు ఏం చేయగలరో చూపించడంపైనే ఫోకస్ పెట్టా, స్ఫూర్తిగా నిలిచానని సంతోషంగా చెబుతోంది. అంతేగాదు మన కథను మనమే తిరగరాయాలని,..అప్పుడే లైఫ్ అనుహ్యమైన టర్న్ తీసుకుని విజేతలుగా నిలుస్తామని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అమోమ్ సోకి యెకర్. View this post on Instagram A post shared by Leyu Abom Soki Yekar (@abomsokiyekar) (చదవండి: దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్) -
దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్
భారత్లో ఫిట్నెస్ అందరికీ అందుబాటులో ఉండేలా అవగాహన కల్పిచే వ్యక్తుల్లో ప్రముఖులు మిలింద్ సోమన్. ఆయన 90వ దశకపు పాప్ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి నుంచి..ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్కు పోస్టర్ బాయ్గా మారే వరకు సోమన్ ప్రయాణం..కండరాల నిర్మాణం కంటే..క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చేసే మారథాన్లు, లాంగ్ వాక్లు అన్ని ఆర్భాటానికి తావివ్వకుండా చెప్పులు కూడా లేకుండా నిశబ్దంగా సాగుతాయి. అలాంటి సోమన్ దంపతులు హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలంటే ఆహరంతో కాకుండా, కదలికలతో బంధాన్ని ఏర్పాటు చేసుకోండి అని పిలుపునిస్తూ..పలు ఆసక్తికర ఫిట్నెస్ సలహాలు ఇచ్చారు. అవేంటంటే..సోమన్ దృష్టిలో, ఫిట్నెస్ అంటే ఒకేసారి చేసే వ్యాయామాలు లేదా ఒకే రకమైన దినచర్యలు కాదని అంటారు. ఇది ఉమ్మడి లక్ష్యానికి సంబంధించినదిగా చేసుకుంటే దంపతులు ఇరువురు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. జంటలు కలసి వ్యాయామాలకు సంబంధించి..సింపుల్ వాటిని ఎంచుకుంటూ సాగితే..వారి మధ్య బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. అంతేగాదు జీవితం నుంచి ఇరువురు ఏం ఆశిస్తున్నారో ఇద్దరికీ స్పష్టత వస్తుంది. ఇక్కడ సోమన్ తాను ఎక్కువసేపు శ్రమించే కార్యకలాపాలవైపు మొగ్గు చూపితే..ఆమె యోగా ద్వారా ప్రశాంతతను తీసుకువస్తుందట. ఈ వైరుధ్యం వారిని విభజించకుండా, ఇద్దరి విధానాలను మరింతగా బలపరించిందని చెబుతున్నారు సోమన్. ప్రతిసారి ఒకే వర్కౌట్లని చేయడం కాదు, ఆరోగ్యంగా ఉండటానికి ఒకరి విధానాన్ని మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) జంక్ ఫుడ్ డేట్స్కు అతీతంగాచాలామటుకు దంపతులు భోజనానికి బయట ప్రాధాన్యత ఇస్తారు. అర్థారాత్రి వరకు చిరుతిండ్లు తినడం, వారాంతపు విలాసాలతో బిజీగా ఉంటారు. అయితే దంపతులు ఈ అలవాట్లను శారీరక కార్యకలాపాలతో భర్తీ చేస్తే..ఇద్దరి ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుతుందని పిలుపునిస్తున్నారు. అవి సరదా సరదాగా సాగే విహారయాత్రలు, వాకింగ్, ఈత కొట్టడం, తదితర మార్గాల్లో కొత్తదనంతో కూడిన వ్యాయామ కదలికలను అన్వేషించాలి. ఇవి శారీరక మానిసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే మంచి అలవాట్లకు మారతాయట. ఈ జీవనశైలితో జంటలు మరింత బలంగా, సంతోషంగా, పైగా ఒకరికొకరు అనేలా అనుబంధంగా ఉంటారని బలంగా నమ్ముతానని చెబుతున్నారు సోమన్. సోమన్ ఫిట్నెస్..తరచుగా ఫిట్నెస్ ఐకాన్గా పిలిచే సోమన్ దినచర్య ఎంతమాత్రం కఠినంగా ఉండదు. ఆయన జిమ్కి వెళ్లరు, పర్సనల్ ట్రైనర్ కూడా లేరు. కానీ కొన్ని వారాలు లేదా మూడు, నాలుగుసార్లు పరుగెట్టడం, మరికొన్ని వారాలు అస్సలు పరిగెత్తకుండా ఉంటారు. తీవ్రత వ్యాయామాల కంటే..నిలకడకు ప్రాధాన్యత ఇస్తారు సోమన్. ఎక్కువగా పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటి ప్రాథమిక వ్యాయామాలు చేస్తుంటారు. ప్రయాణిస్తున్నప్పుడూ కూడా కదలకలు ఉండేలా చూసుకుంటారాయన.ఫిట్నెస్ ప్రయాణంపై మహిళలకు సూచనలు..బిజీగా ఉండే పట్టణ జీవనశైలిలో ఉన్న మహిళలకు సోమన్ ఆచరణాత్మకమైన సలహాలందించారు. అవేంటంటే..మూడు కిలోల మీటర్ల దూరం నుంచి క్రమంగా ఐదు లేదా పది కిలోమీటర్లకు నడక పెంచడం. అలాగే అతివేగంగా వ్యాయామాలు చేయొద్దని సూచించారు. అన్నింటికంటే నిలకడను నేర్చుకోమని చెబుతున్నారు. తాను తొమ్మిదేళ్ల వయసులో జాతీయ స్థాయి ఈతగాడిగా లైఫ్ని ప్రారంభించి..కదలికల చుట్టూ కేంద్రీకృతమైన జీవితానికి పునాది వేశానని చెబుతున్నారు. ఆయన క్రీడాకారుడి నుంచి సూపర్మోడల్గా, చివరికి ఫిట్నెస్ కోసం బహిరంగంగా ప్రచారం చేసే వ్యక్తిగా మారడం వరకు చూస్తే..అదంగా అసాధారణంగా కనిపిస్తుందని అన్నారు. సోమన్ దార్శనికతను ప్రతిబింబించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పింకాథాన్ మాత్రమే. కేవలం మహిళల కోసం ఒక పరుగు పోటీగా ప్రారంభమైన ఇది, క్రమంగా మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకోవడం విశేషం.మొదటిసారి పరుగెత్తేవారి నుంచి దృష్టి లోపం ఉన్నవారి వరకు, పసిపిల్లలతో పరుగెత్తే తల్లుల నుంచి చీరలు కట్టుకున్న అమ్మమ్మల వరకు, ఫిట్నెస్ ఎవరి కోసం అనే మూస ధోరణులను పింకాథాన్ నిరంతరం సవాలు చేస్తూ వస్తోంది.దాని ఎదుగుదల కూడా అంతే స్పష్టంగా ఉంది. వివిధ నగరాల్లో పాల్గొనేవారి సంఖ్య పెరగడంతో, వేలాది మంది మహిళలు ఇందులో చేరడంతో, ఈ కార్యక్రమం కేవలం ఒక మారథాన్ స్థాయిని దాటిపోయింది. ఇది ఇప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే ఒక సమాజంగా మారింది. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) (చదవండి: పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!) -
పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!
మొదట్లో ఒకప్పుడు కొందరు మహిళలకు దేవుళ్లు పూనడం లేదా శివమూగడం అంటూ జరుగుతుంటేది. ఒక ఆసక్తికరమైన అబ్జర్వేషన్ ఏమిటంటే... ఇది చాలావరకు ఆర్థికంగా దిగువ మధ్యతరగతి వారిలోనూ, పేద వర్గాల్లోనే కనిపిస్తుండటం చాలా సాధారణం. నిజానికి ఇదొక రకమైన మానసిక రుగ్మత. ఇలాంటి మానసిక రుగ్మతల్లో పేషెంట్... ‘నేను’ లేదా ‘తాను’ అనే భావన నుంచి విడిపోయి... మరేదో స్థితిని సంగ్రహిస్తాడు.అంటే మరో స్థితిని ΄పొందుతాడు కాబట్టి ఇంగ్లిష్లో దాన్ని పొజెసివ్ స్టేట్ అంటారు. అప్పట్లో అంటే... శాస్త్రీయ అవగాహన అంతగా లేని రోజుల్లో ఇలా జరగడాన్ని... అంటే తాను అన్న భావన నుంచి దూరం జరిగే వ్యాధులన్నింటినీ కలుపుకొని ‘హిస్టీరియా’గా వ్యవహరించారు. నిజానికి హిస్టెరస్ అంటే గర్భసంచి (యుటెరస్) అని అర్థం. యుటెరస్ శరీరంలోని ఇతర భాగాలకు తిరుగాడుతూ... పాకడం వల్ల వచ్చే వ్యాధిగా పరిగణించి అప్పట్లో దీన్ని ‘హిస్టీరియా’ అంటూ వ్యవహరించేవారు. మహిళల్లో ఈ తరహా జబ్బులు ఎక్కువ కాబట్టి హిస్టీరియా అనేవారు. అయితే వైద్య విజ్ఞానశాస్త్రం బాగా అభివృద్ధి చెంది కారణం తెలిసిన తర్వాత ఆ హిస్టీరియా అనే మాటను వాడకంలోంచి తొలగించారు. అయితే మానసిక విజ్ఞానశాస్త్రం బాగా పెరగడంతో పాటు తన స్థితి నుంచి తాను విడిపోయే పరిస్థితికి (డిసోసియేషన్కు) శాస్త్రీయమైన కారణాలు తెలిశాక... ఈ తరహా మానసిక రుగ్మతలను డిసోసియేషన్ / కన్వర్షన్ డిజార్డర్స్గా చెబుతున్నారు. వీటిల్లో అనేక రకాలుంటాయి. అవేమిటో చూద్దాం...ఓ ఊళ్లోని ఓ పేదింటి అందమైన అమ్మాయిని అక్కడి ఓ రాజకీయ నాయకుడూ... ఊరికి పెద్ద అయిన ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. అతడేమో ఆర్థికంగా, సామాజికంగా చాలా పవర్ఫుల్. కానీ ఈ అమ్మాయి ఓ అమాయకపు దిగువ ఆర్థికస్థాయికి చెందిన పేద పిల్ల. ఆ పవర్ఫుల్ వ్యక్తిని ఎదిరించగలిగే బలంగాని, మానసిక స్థైర్యంగాని ఆ అమ్మాయికి లేవు. అయితే ఆ పవర్ఫుల్ వ్యక్తి వేధింపులను ఆమోదించి, అతడికి లొంగిపోవడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మెదడు ఓ మాయ చేస్తుంది. తనను తాను రక్షించుకునేందుకు ఆ అమ్మాయికి తెలియకుండానే ఓ ఎత్తుగడ వేస్తుంది. అకస్మాత్తుగా ఆ అమ్మాయికి గ్రామదేవత పూనుతుంది. దాంతో ఆమె గొంతు (స్వరం), మాట, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. మెదడు చేసే ఈ పనులు ‘సబ్–కాన్షియస్’ స్పృహతో జరగడం వల్ల బాహ్య స్పృహకు అవి జరుగుతున్న విషయమే తెలియదు. అయితే ఆ అమ్మాయి... తన చుట్టూ ఉన్న ప్రకృతి సంబంధమైన అంశాలను (నేచర్ను) అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ‘పొజెస్’ చేసుకుంటుంది. అలా తననుంచి తాను ‘విడిపోయి’ అంటే ‘డిసోసియేట్’ అయి... గ్రామదేవత తాలూకు స్థితిని ‘పొజెస్’ చేసుకుని... అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల నుంచి వచ్చే వేధింపుల నుంచి తనను తాను కాపాడుకోడానికి తనకు తెలియకుండానే ఈ పనులు చేస్తుంది. ఇప్పుడు గ్రామదేవత పూనాక ఆ అమ్మాయి స్థితి చాలా బలంగా మారిపోతుంది. ఊరిపెద్ద ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా... సామాజికంగా, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడా అమ్మాయిని తాత్కాలికంగా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ స్థితిలో ఆ అమ్మాయి అక్కడివారి పూజలందుకుంటూ ఉంది. ఆమెకు కావాల్సిన పనులను ఊరి ప్రజలద్వారా చేయించుకుంటూ ఉంది. ఆమె నుంచి వచ్చే మాటను గ్రామదేవత మాటలుగా ఎంచి, ఊరిజనమంతా వాటిని పాటిస్తుంటారు.నిజానికి ఆమె కోరని మరికొన్ని కోరికలనూ గ్రామస్తులు తీరుస్తుంటారు. దాంతో ఆమె మెదడుకు ఇదొక అలవాటుగా మారుతుంది. సమస్యలు కలిగినప్పుడల్లా ఆమె ఇతరులను పొసెస్ చేసుకుంటుంది. అంటే గ్రామదేవత తనను పూనడాన్ని ఆహ్వానిస్తుంది. పూనకం (పొసెషన్)లోకి వెళ్తుంది. ఇలా కేవలం గ్రామదేవతలే కాకుండా కొన్ని సందర్భాల్లో చనిపోయిన వేరే మనిషి గానీ, దెయ్యాలూ, భూతాలు కూడా పూనడం అనే ప్రక్రియ చోటు చేసుకుంటుంది. సామాన్య జనం దీన్ని పూనడం అంటారుగానీ మానసిక వైద్య శాస్త్రంలో దీన్ని డిసోసియేషన్ డిజార్డర్ అని చెప్పవచ్చు.డిసోసియేషన్ అంటే...? డిసోసియేషన్ (dissociation) అంటే ఏమిటో తెలుసుకునే ముందు అసలు ‘నేను’ అంటే ఏమిటో, ఆ ‘నేను’ అనే భావన ఎలా కలుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి తన మనసులో ఏర్పడే ఆలోచనలూ, భావోద్వేగాలూ... ఇవన్నీ తనవిగా గుర్తించడాన్ని ఇంగ్లిష్లో ‘ఐ’ అండ్ ‘మైన్’ అనీ, అదే తెలుగులో చె΄్పాలంటే ‘నేను’ / ‘నా ఆలోచనలు’’ అని చెప్పవచ్చు. అందరిలో ఉండే ఆ ‘నేను’ అనే ఫీలింగ్ కొంతమందిలో ఒక్కోసారి కొంత వ్యవధి పాటు తొలగిపోతుంది. ఆ సమయంలో ఆ నేను... నేను కానేమో అనే భావన కలుగుతుంది. అలా జరిగే మానసిక స్థితిని ‘డీ–పర్సనలైజేషన్’ అంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో... అంటే... బాగా తీవ్రంగా, తాను తట్టుకోలేనంతగా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు గానీ లేదా తన ప్రాణాలకే ముప్పు ఏర్పడినప్పుడు గానీ కొందరు తన సొంత భావోద్వేగాల నుంచి తామే విడిపోతారు. ఇలా తన సొంత ఫీలింగ్స్ను తనవి కావన్నంతగా విడివడే కండిషన్ను ‘డిసోసియేషన్ ఆఫ్ అఫెక్ట్స్’ అనవచ్చు. తన భావోద్వేగాల తీవ్రత కారణంగా అతడి మనసు ఏమాత్రం పనిచేయని పరిస్థితుల్లో ఇలా ఓ వ్యక్తి తననుంచి తాను విడిపోవడం జరుగుతుంది.డీసోసియేషన్ కలిగే పరిస్థితులివి... తట్టుకోలేనంత ఒత్తిడి తీవ్రమైన అలసట చాలా తీవ్రమైన డిప్రెషన్ పసితనంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న పరిస్థితుల్లో ఉండటం... వంటి పైన పేర్కొన్న పరిస్థితుల్లో ఓ వ్యక్తికి తనదైన దృఢమైన, సమన్వయంతో కూడిన ‘నేను’ అనే భావన బలంగా ఏర్పడదు. ఇంగ్లిష్లో చెప్పాలంటే స్టేబుల్, ఇంటిగ్రేటెడ్ ‘సెల్ఫ్ ఫీలింగ్’ ఏర్పడదు. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి తేలిగ్గా డిసోసియేషన్కు లోనవుతాడు. అప్పుడు ఒకే వ్యక్తిలో అనేక వ్యక్తిత్వాలు (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్) కూడా ఏర్పడవచ్చు. ఉదాహరణకు ‘అపరిచితుడు’ సినిమాలోని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఓ వ్యక్తి తననుంచి విడివడి వేరే వ్యక్తిని లేదా వేరే వ్యక్తుల ప్రవర్తనలనూ, పర్సనాలిటీలను ΄పొజెస్ చేసుకోవడమే అని చెప్పవచ్చు.‘నేను’ లేదా ‘నా’ అనే భావన లేకపోవడం ఎలా జరుగుతుందంటే... ఒక వ్యక్తి తన శరీరాన్ని తనదిగా గుర్తించగలగడానికి చూపు, వినికిడి, స్పర్శ వంటి జ్ఞానేంద్రియాలూ ఉపయోగపడుతుంటాయి. తాను ఉన్న తన స్థితికి సంబంధించిన ఉనికి తెలుసుకునేందుకు ఒక నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అది లేకపోతే ఒక వ్యక్తికి ‘నా’ అనే భావన ఉండదు. దీనికి సంబంధించి మరింత అర్థమయ్యేలా తెలుసుకోవడం కోసం ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మన దేహంలోని ఒక భాగానికి మత్తు (లోకల్ అనస్థీషియా) ఇచ్చామనుకోండి. అలా ఇచ్చాక అక్కడ చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తున్నప్పటికీ... అక్కడేం జరుగుతోందో మనక తెలియదు. ఒకవేళ అలా శస్త్రచికిత్స చేస్తున్న విషయం గనక మనం మన కళ్లతో చూడకపోతే అది మన శరీరానికి సంబంధించిందన్న భావన కూడా మనకు కలగక΄ోవచ్చు. ఉదాహరణకు మన పంటికి ఏదైనా చికిత్స చేయించుకుంటున్నప్పుడు అక్కడ లోకల్ అనస్థీషియా ఇచ్చాక పన్నుకు డ్రిల్లింగ్ జరుగుతున్నప్పటికీ మనకు అక్కడ ఏమవుతోందో అన్నది తెలియనే తెలియదు.మరికొన్ని ఉదాహరణలివి... కొందరు పీర్ల గుండం దగ్గరా లేదా తమ మొక్కుబడులలో భాగంగా నిప్పులు తొక్కుతూ చేసే మరికొన్ని ప్రత్యేక ప్రార్థనల్లో నిప్పుల మీద బాధే తెలియకుండా నడుస్తుంటారు. తీవ్రమైన భక్తి ఆవేశాలకూ, భక్తిభావనలకు లోనైనప్పుడు ఆ తన్మయత్వం తారస్థాయిలో ఉన్నప్పుడు బాధ అనే భావనే రాదు. ఈ తరహా డిసోసియేషన్ను ‘సెన్సరీ డిసోసియేషన్’ అంటే జ్ఞానేంద్రియాలకు... ప్రధానంగా స్పర్శజ్ఞానానికి సంబంధించిన డిసోసియేషన్గా చెప్పవచ్చు. ఏదైనా తట్టుకోలేనంత తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు అది మన మెదడుపై ఒక షాక్లాంటి ప్రభావం చూపవచ్చు. అంతటి ప్రభావం కారణంగా మెదడు మొద్దుబారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే కొందరికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగి తీవ్రమైన గాయాలు అయినప్పటికీ ఆ షాక్ కారణంగా చాలాసేపటి వరకు వానికి నొప్పి కలగకపోవడాన్ని చూస్తుంటాం. ఇది కూడా డిసోసియేషన్ కారణంగా జరిగే పరిణామమే. ఏదైనా ఒక సబ్జెక్ట్లో అత్యంత ఆసక్తితో అందులో మునిగిపోయినప్పుడు ఓ విద్యార్థిలోగానీ లేదా ఏదైనా అత్యంత ఆసక్తికరమైన పుస్తకం చదువుతున్నప్పుడూ ఎవరైనా వ్యక్తిగానీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలియనంతగా అందులో పూర్తిగా లీనమైపోయినపోవచ్చు. అది కూడా డిసోసియేషన్కు ఓ తార్కాణమే. మనసు నిండా తీవ్రమైన భక్తిభావనను నిండిపోయినప్పుడు తనలోకి దైవం వచ్చినట్లుగా కొందరు అనుభూతి చెందవచ్చు. ఇలాంటి భావనలకు లోనుకోవడం కూడా ఒక రకంగా ‘డిసోసియేషన్’యే అని చెప్పవచ్చు. ఈ స్థితినే ‘పొసెషన్’ అంటారు. కాకపోతే ఇది పూర్తిగా సంస్కృతి ఆమోదించిన అంశం కావడంతో... అంతటి భక్తి భావన అన్నది ఆ వ్యక్తికి గానీ, లేదా ఇతరులకు గానీ ఇబ్బంది కలగజేయనంతవరకు దాన్ని వ్యాధిగా పెద్దగా పరిగణించరు. డిసోసియేషన్ ఆమ్నీషియా : ఏదైనా షాకింగ్ సంఘటనతో లేదా బలమైన కారణంతో మనసుకు తీవ్రమైన గాయం కలిగినా లేదా అలాంటి గాయాల్ని కలిగిస్తున్న పరిస్థితులనూ / సంఘటనలనూ మరచిపోవడం జరుగుతుంది. ఇలా తమకు తీవ్రంగా ఇబ్బంది కలిగించే వాటిని మరచిపోవడాన్ని ‘డిసోసియేషన్ ఆమ్నీషియా’ అంటారు. ఈ కండిషన్లో కలిగే మరచిపోవడం అన్నది సాధారణ మరపు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. డిసోసియేటివ్ ఫ్యూగ్ (దేశ దిమ్మరి) : ఒక వ్యక్తి తన నివాస స్థలం నుంచి లేదా తాను పని ప్రదేశం నుంచి అకస్మాత్తుగా ప్రయాణం మొదలుపెట్టవచ్చు. అతడు ఈ ప్రయాణంలో తన సెల్ఫ్కేర్ (శుభ్రత, ఆహారం, నిద్ర వంటి) అంశాల విషయంలో మామూలుగా ఉన్నా... తాను తిరిగి వెనకకు వచ్చాక తాను ఎక్కడెక్కడికి వెళ్లిందీ, ఏం చేసిందీ పాక్షికంగానో లేదా మొత్తంగానో మరచిపోవచ్చు. ఇలాంటి డిసోసియేషన్లో కనిపించే లక్షణాలకు ఎలాంటి నరాల వ్యాధులూ కారణంగా కనిపించవు. ట్రాన్స్ అండ్ పొసెషన్ స్టేట్ మధ్య తేడా... ట్రాన్స్ : తాను అనే తన సొంత భావనను అంటే తానెవరు అనే ఫీలింగ్ను... ఇంగ్లిష్లో చెప్పాలంటే తన ఐడెంటిటీని కోల్పోయే లేదా పూర్తిగా మరచిపోయే స్థితిని ‘ట్రాన్స్’ అంటారు. తన చుట్టూ జరుగుతున్న వాటిని ఏమాత్రం గుర్తించలేకపోవడమో లేదా కొన్నింటిని మాత్రమే గుర్తించగలిగడం లాంటి స్థితిని ‘ట్రాన్స్’గా చెప్పవచ్చు. ఆ స్థితిలో తన భాష, కదలికలు, శారీరకంగా తాను కనబరిచే సాధారణ పోష్చర్స్... ఇవన్నీ చాలావరకు తగ్గిపోతాయి. ఈ స్థితిలో పొడిపొడిగా కేవలం రెండు మూడు మాటలు మాట్లాడుతుంటారు. పొసెషన్ కండిషన్: ఒక వ్యక్తి శరీరంలోకి మరొకరు చేరినట్లుగా ప్రవర్తించే కండిషన్ను ‘పొసెషన్’ అంటారనీ, దానికి అపరిచితుడు సినిమా లాంటి ఉదాహరణలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం ఏ గ్రామదేవత మాత్రమే కాకుండా... ఒక వ్యక్తిలో మరొక వ్యక్తి ప్రవేశించినట్లుగా ఉండటం... అలాగే మరికొందరిలో దెయ్యం / భూతం / ఏదో శక్తి ఆవహించినట్లుగా భావించడం కూడా పొసెషన్ స్టేట్గానే చెప్పవచ్చు. ఈ పరిస్థితి కారణంగా తనకు గానీ... అతడి వల్ల ఇతరకులకు గానీ ఇబ్బందిగా లేనంతవరకు దాన్ని వ్యాధిగా పరిగణించరు. ఒకవేళ అలాంటి పొజెషన్ స్టేట్ వల్ల అది ప్రమాదకరంగా పరిణమించినప్పుడే దాన్ని వ్యాధిగా గుర్తిస్తారు. ఒక ప్రాంతంలో సెషన్ సంస్కృతిలో ఇమిడిపోయి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో మాత్రం ఆ ప్రవర్తనను వ్యాధిగా గుర్తించడం అంతగా జరగదు. దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం దాన్ని వ్యాధిగా భావించి తగిన చికిత్స అందించాలి. డిసోసియేషన్తో కలిగే సమస్యలు డిసోసియేటివ్ కన్వల్షన్స్ : శరీరంలో ఫిట్స్ వచ్చిప్పుడు దేహంలో ఎలాంటి కదలికలు సంభవిస్తాయో డిసోసియేటివ్ కన్వల్షన్లో అలాంటి కదలికలు కనిపిస్తాయి. ఈ కండిషన్లో ఉన్నవారు కిందపడిపోయినప్పటికీ సాధారణంగా ఎలాంటి గాయం కాకపోవచ్చు. అయితే మూర్ఛ వ్యాధి ఉన్నవారిలోలా నాలుక కొరకడం, మూత్రవిసర్జన చేయడం మాత్రం ఉండకపోవచ్చు లేదా చాలా అరుదుగా మాత్రమే ఇలా జరగవచ్చు. డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్స్ : తనలో ఎలాంటి శారీరక సమస్యా లేకపోయినప్పటికీ... నరాలకు సంబంధించిన ఎలాంటి లోపాలూ లేకపోయినప్పటికీ... వీళ్లలో మాటపడిపోవడం (మ్యూటిజం), ఒళ్లు తూలడం, అడుగులు సరిగా పడకపోవడం, నడవలేకపోవడం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ‘డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్’ (dissociative motor disorder) కావచ్చు. డిసోసియేటివ్ అనస్థీషియా / సెన్సరీ లాస్: ఏ కారణమూ లేకుండా... ఒక వ్యక్తి శరీరంలోని ఒక భాగంగానీ లేదా మొత్తం శరీరంలోగానీ ఎలాంటి స్పర్శా లేకపోడంతో పాటు వారిని తాకినా, గిచ్చినా, మంటకు ఎక్స్పోజ్ చేసినా వారికి ఎలాంటి స్పర్శ జ్ఞానం కలగకపోవడాన్ని డిసోసియేటివ్ అనస్థీషియా / సెన్సరీ లాస్గా పేర్కొనవచ్చు. అయితే ఇలా కొందరిలో వారు తమ చూపు, వాసన చూసే శక్తి, వినికిడి శక్తిని కూడా కోల్పోవడం జరగవచ్చు. చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!యుద్ధఖైదీలకు చేసే ‘బ్రెయిన్ వాష్’ ప్రక్రియను కూడా ఒక రకమైన డిసోసియేషన్గా చెప్పవచ్చు. కొందరికి... వారు తమ శరీరం నుంచి విడిపోయి, తమ శరీరాన్ని బయటి నుంచి చూసుకున్న భావన కలుగుతుంది. ఇలాంటి అనుభూతి ‘నియర్డెత్’ అనుభవాల్లోనూ కలుగుతుంది. ఇవి కూడా డిసోసియేషన్ వల్ల కలిగే అనుభూతులే అని చెప్పవచ్చు. కన్వర్షన్ డిజార్డర్స్ :తీవ్రమైన మానసిక సంఘర్షన కలిగి, దాన్ని వ్యక్తీకరించలేనప్పుడు మన మెదడు మనకు తెలియకుడానే వాటిని శారీరక లక్షణాలుగా మార్చుకొని వ్యక్తీకరిస్తుంది. ఇలా మానసిక అంశాలను శారీరక లక్షణాలుగా మార్చుకుని బయటపెట్టడాన్ని ‘కన్వర్షన్ డిజార్డర్’ (conversion disorder) అంటారు.చికిత్సఏ కారణాల వల్ల డిసోసియేషన్ లేదా కన్వర్షన్స్ జరుగుతోందో గుర్తించి ఆ కారణాలను దూరం చేసి ఈ లక్షణాలు తమంతట తామే తగ్గిపోతాయి. అలాగే ఈ తరహా పేషెంట్స్లో వారు కోల్పోయిన లేదా ఛిద్రమైన వాళ్ల ‘సెల్ఫ్’ను పునరుద్ధరించడం ద్వారా ఈ జబ్బులకు సమర్థమైన చికిత్స అందించవచ్చు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా, ఇగో స్ట్రెంగ్త్ను బలపరచడం / పెంచడం ద్వారా ఈ జబ్బులను పరిష్కరించవచ్చు. ఇందులో భాగంగా తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలిగేలా వాళ్లలో కొన్ని నైపుణ్యాలనూ (స్కిల్స్), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను పెంచడం కూడా ఈ జబ్బులకు చికిత్సలో ఓ ప్రధానమైన భాగం. అవసరాన్ని బట్టి కొన్ని మందులు ఇవ్వాల్సి రావచ్చు. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వంటివీ అందించాల్సి రావచ్చు.- డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై హెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ -
విమర్శలను మెట్లుగా ఎలా మార్చుకోవాలి?
మనం ఎదుగుతున్న కొద్దీ, మన చుట్టూ ఉండేవారు మనల్ని గమనించడం మొదలుపెడతారు. మీరు ఒక లీడర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నప్పుడు మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు—విమర్శ. చాలామంది విమర్శ రాగానే కుంగిపోతారు లేదా ఎదురుదాడి చేస్తారు. కానీ ఒక 'జీనియస్' వ్యక్తిత్వానికి విమర్శ అనేది ఒక 'చెత్త' కాదు, అది ఒక 'ఎరువు' (Fertilizer). ప్రపంచంలో ఏమీ చేయని వాడిని ఎవరూ విమర్శించరు. మీరు విమర్శలు ఎదుర్కొంటున్నారంటే, మీరు ఏదో ఒకటి చేస్తున్నారు అని అర్థం. విమర్శ అనేది మీ పని తీరుపై లేదా మీ ప్రవర్తనపై ఇతరులు ఇచ్చే ఒక 'ఫీడ్బ్యాక్'. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే మీ Professional Maturity ని నిర్ణయిస్తుంది.ఏది తీసుకోవాలి? ఏది వదలాలి?విమర్శలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు.నిర్మాణాత్మక విమర్శ (Constructive Criticism): ఇది మీ పనిని మెరుగుపరచడానికి ఉద్దేశించినది. ఇందులో లాజిక్ ఉంటుంది, మీ తప్పు ఎక్కడ ఉందో స్పష్టంగా చెప్తుంది. ఇది మీకు ఒక 'గురువు' లాంటిది.విధ్వంసకర విమర్శ (Destructive Criticism): ఇది కేవలం మిమ్మల్ని మానసికగా దెబ్బతీయడానికి, మీ పరువు తీయడానికి చేసేది. ఇందులో అసూయ, ద్వేషం ఉంటాయి. దీన్ని మీరు ఒక 'నాయిస్' (Noise) లాగా వదిలేయాలి.ది సైకాలజీ ఆఫ్ రియాక్షన్...ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మన మెదడులోని Amygdala వెంటనే "ప్రమాదం!" అని సిగ్నల్ ఇస్తుంది. అందుకే మనకు వెంటనే కోపం లేదా బాధ కలుగుతుంది.Stoic Approach: విమర్శ రాగానే స్పందించకండి. "ఈ మాటలో నిజం ఉందా?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజం ఉంటే సరిదిద్దుకోండి, అబద్ధం అయితే నవ్వి ఊరుకోండి. ఎదుటివారి మాటలకు మీ ప్రశాంతతను తాకట్టు పెట్టకండి.మోటివేషన్ మాయ vs రియల్ గ్రోత్మోటివేషన్ "నిన్ను విమర్శించే వాళ్ళ నోళ్ళు మూయించు, నువ్వు ఎవరో నిరూపించుకో" అని ఆవేశాన్ని నూరిపోస్తుంది. ఇది మీలో అహంకారాన్ని (Ego) పెంచుతుంది.సైకాలజీ "విమర్శను ఒక డేటా పాయింట్లా చూడు. నీ పర్సనాలిటీలో నీకు తెలియని 'Blind Spots' ని విమర్శకులు చూపిస్తారు" అని చెప్తుంది. విమర్శకుడు మీ ఉచిత సలహాదారు అని భావించండి.విమర్శను మెట్టుగా మార్చే ఫార్ములాGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, విమర్శను డీల్ చేసే విధానం.Step 1: Break Emotional Defense విమర్శ వినగానే "నన్నే అంటావా?" అనే ఆ అహాన్ని 'Break' చేయండి. వెంటనే సమాధానం ఇవ్వాలనే ఆత్రుతను ఆపండి. ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండటం వల్ల మీరు ఆ విమర్శను లాజికల్గా విశ్లేషించగలరు.Step 2: Build Filtering Process వచ్చిన విమర్శ నుండి 'విషయాన్ని' (Content) తీసుకోండి, 'విషాన్ని' (Tone) వదిలేయండి. మీ పనిని మెరుగుపరిచే పాయింట్ ఏమైనా ఉందా? అని వెతకండి. ఉంటే, దాన్ని మీ పనిలో ఇంప్లిమెంట్ చేసి మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. Step 3: Graceful Acceptanceమిమ్మల్ని విమర్శించిన వ్యక్తికి "థాంక్యూ, నీ ఫీడ్బ్యాక్ వల్ల నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను" అని చెప్పండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ కరిష్మాను వంద రెట్లు పెంచుతుంది. విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించే స్థాయికి వెళ్లడమే 'Beyond' స్టేజ్.విమర్శను ఎలా చూస్తున్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఎవరైనా విమర్శించారా? ఆ సమయంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు?ఆ విమర్శలో కనీసం 1% అయినా నిజం ఉందా?ఆ విమర్శ మిమ్మల్ని మంచి వ్యక్తిగా మార్చిందా లేక కోపిష్టిగా మార్చిందా?విమర్శకులు మీ ఎదుగుదలకి కావాలి!బ్రో, ఒక శిల్పం అందంగా మారాలంటే దానికి ఉలి దెబ్బలు తగలాలి. విమర్శలు ఆ ఉలి దెబ్బల వంటివి. మీరు ఎంత గొప్పగా విమర్శలను స్వీకరిస్తారో, అంత అందమైన వ్యక్తిత్వంగా మీరు రూపొందుతారు. విమర్శకులని శత్రువులుగా చూడకండి, వారిని మీ క్వాలిటీ చెకర్స్ లాగా చూడండి."To avoid criticism, do nothing, say nothing, and be nothing.-Aristotleసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: నాయకుడిలా ఆలోచించడం ఎలా..?) -
ఆరోగ్య సారథులు 'చిరుధాన్యాలు'
ప్రస్తుతం బియ్యం, గోధుమలే అధికంగా వాడుతున్నాం గానీ ఒకప్పుడు చిరుధాన్యాలదే రాజ్యం. ఏవో రెండు, మూడు కాదు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెలు, సామలు, ఊదల వంటి ఆరేడు రకాల చిరుధాన్యాలు తినేవారు. అయితే నలబైల్లో వచ్చిన క్షామం, పెరుగుతున్న జనాభా అవసరాలు తిండి గింజల తీరుతెన్నులను పూర్తిగా మార్చేశాయి. శాస్త్రీయ పరిశోధనలు.. హరిత విప్లవం పుణ్యమాని గోధుమ, వరి దిగుబడి గణనీయంగా పెరిగింది. దాంతో మన ఆహారపు అలవాట్లు సమూలంగా మారిపోయాయి. ముఖ్యంగా చిరుధాన్యాల వాడకం బాగా తగ్గిపోయింది. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? పోషకాలు అందుతున్నాయా, లేదా? అనే విచక్షణే లేకుండా పోయింది. మరోవైపు శారీరక శ్రమ కూడా తగ్గిపోయింది. ఫలితంగా జీవనశైలితో ముడిపడిన ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కేన్సర్లు వంటి సమస్యలు గణనీయంగా పెరిగాయి. వీటితో సంభవించే మరణాలూ ఎక్కువవుతూ వస్తున్నాయి. ఇవన్నీ మన ఆహార అలవాట్లను ఒక్కసారి సమీక్షించుకోవాలనీ, చిరుధాన్యాలకు పట్టం కట్టాలనీ నిర్దేశిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఆహారమూ సంపూర్ణంగా ఉండాలి. వాటిల్లో సింహభాగం ధాన్యాలదే. అలాంటి చిరుధాన్యాల వల్ల శరీరానికి అందే పోషకాలు ఏంటో సవివరంగా చూద్దామా..!.చిరుధాన్యాల్లో పోషకాలు పెద్దమొత్తంలో ఉండటమే కాదు. వీటిల్లోని కొన్ని సంయోజ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి వరి, గోధుమ వంటి పెద్ద ధాన్యాలు.. రాగులు, కొర్రలు, సామల వంటి చిన్న ధాన్యాలు రెండింటిలోనూ పిండి పదార్థాలు, మాంస కృత్తులు, కొవ్వు, కేలరీలన్నీ కొద్ది గొప్ప తేడాలతో దాదాపు సమానంగానే ఉంటాయి. అయితే ఇవి మెరుగైనవి కావటమే విశేషం. వరి, రాగులు, సామల్లో 7% మాంసకృత్తులుంటే.. గోధుమ, జొన్న, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెల్లో 10-12% వరకు ఉంటాయి. పిండి పదార్థమైతే- వరిలో 77%, గోధుమల్లో 64% వరకు.. చిరుధాన్యాల్లో 60-70% వరకు ఉంటుంది. కొన్ని చిరుధాన్యాల్లో 50-55 శాతమే ఉంటుంది. వీటి నుంచి 330-345 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. బియ్యం, గోధుమల్లో 2% కొవ్వు ఉంటుంది. చిరుధాన్యాల్లో ఇది ఎక్కువ. అత్యధికంగా సజ్జలతో 5% వరకు కొవ్వు లభిస్తుంది. జొన్న, కొర్రలు, వరిగెల్లో 3 నుంచి 3.5% ఉంటుంది. ఈ కొవ్వు హాని చేసేది కాదు. మంచి శక్తిని ప్రసాదిస్తుంది. వీటిల్లో విటమిన్ ఈ కూడా ఎక్కువే. ఖనిజ లవణాల విషయంలో చిరుధాన్యాలదే పైచేయి. రాగుల్లో పాలతో సమానంగా 344 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, జబ్బులతో బాధపడేవారికి ఇదెంతో మేలు చేస్తుంది. బియ్యం, గోధుమల్లో ఐరన్ అంతగా ఉండదు. చిరుధాన్యాల్లో ఇది మంచి పాళ్లలో లభిస్తుంది. ముఖ్యంగా సజ్జల్లో 8 మి.గ్రా., సామల్లో 9.3 మి.గ్రా ఐరన్ ఉంటుంది. రాగులు, జొన్నల్లో సుమారు 4 మి.గ్రా. ఉంటుంది. రక్తహీనత తగ్గటానికిది ఎంతో అవసరం. జీవక్రియల్లో పాలు పంచుకునే మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటివీ వీటిల్లో ఎక్కువే. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కావటానికి మెగ్నీషియం.. ఎదుగుదలకు జింక్ తోడ్పడుతుంది. అయితే బియ్యం, గోధుమల్లో కన్నా చిరుధాన్యాల్లో థయమిన్ తక్కువగా ఉంటుంది. నైసిస్, పెరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్ వంటివి మాత్రం బాగానే ఉంటాయి. కొన్నింటిలో విటమిన్ ఏ, బీటా కెరటిన్లు కూడా ఉంటాయి.డాక్టర్ బీ గోపిచంద్, హెచ్ఓడీ, డీన్ మిజోరం యూనివర్సిటీ(చదవండి: బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్చేస్తే..) -
ప్రెగ్నెన్సీ టైంలో శరీరమంతా దురదలు వస్తాయా..?
నేను ఎనిమిదో నెల గర్భిణిని. రెండు రోజులుగా శరీరం అంతా కొద్దిగా దురదగా ఉంటోంది. ఇది ఏమైనా సమస్యా? ఏమి చేయాలి?– రమ్య, గుంటూరు.సాధారణంగా 30 నుంచి 32 వారాల గర్భధారణలో, ముఖ్యంగా మొదటి గర్భం సమయంలో, కొంతమందికి శరీరం మీద దురదలు రావచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా కొన్ని వివరాలు తెలుసుకోవడం అవసరం. దురదలు శరీరం అంతా ఉన్నాయా లేక అరికాళ్లు, అరిచేతుల్లో మాత్రమే ఉన్నాయా అని తెలుసుకోవాలి. అలాగే పగలు ఎక్కువగా ఉంటాయా, రాత్రి ఎక్కువగా ఉంటాయా అన్నది చూడాలి. కొంతమందికి దురదలు ఎక్కువగా ఉండి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇవి మైల్డ్గా ఉన్నాయా లేక తీవ్రమైనవా అన్నది అంచనా వేయాలి. ఇలాంటి సందర్భంలో తల్లి ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షిస్తారు. రక్తపోటు వంటి ముఖ్యమైన అంశాలను పరీక్షిస్తారు. అలాగే బిడ్డ బాగున్నాడా లేదా అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి, డాప్లర్ పరీక్ష ద్వారా బిడ్డ బరువు, గర్భంలో ఉన్న ఉమ్మనీరు పరిమాణం, బిడ్డకు రక్తప్రవాహం ఎలా ఉందో పరీక్షిస్తారు. దురదలు తేలికగా ఉంటే సాధారణంగా యాంటీహిస్టమిన్ మందు, చర్మానికి రాసుకునే లోషన్ లేదా మాయిశ్చరైజర్ ఇచ్చి రెండు రోజులు పరిశీలిస్తారు. చాలాసార్లు ఇవి తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది. అయితే దురదలు ఎక్కువగా ఉన్నా లేదా మందులతో రెండు రోజులలో తగ్గకపోవడం జరిగినా పరీక్షలు చేయాలి. ముఖ్యంగా సీరమ్ బైల్ యాసిడ్స్, లివర్ ఫంక్షన్ టెస్టులు చేసి ఆబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ అనే సమస్య ఉందా లేదా చూడాలి. ఈ పరిస్థితిలో బైల్ యాసిడ్స్ పెరగడం వల్ల గర్భిణికి ఎక్కువగా దురదలు రావచ్చు. అలా ఉంటే దానికి ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స తీసుకుంటే దురదలు తగ్గి బిడ్డ ఎదుగుదల కూడా సాధారణంగా కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భధారణ కాలంలో, ముఖ్యంగా 38 వారాల వరకు లివర్ ఫంక్షన్ టెస్టులు, బైల్ యాసిడ్స్ పరీక్షలు తరచూ చేయించు కోవాలి. సాధారణంగా 38 వారాలు వచ్చిన తర్వాత డెలివరీ చేయడం సురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే ఆబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ ఉన్నప్పుడు 38 వారాల కల్లా డెలివరీ చేస్తే తల్లీబిడ్డలు ఇద్దరికీ మంచిది.నాకు నలభై నాలుగు సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాకుండా శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. అయితే, గత నాలుగు నుంచి ఆరు నెలలుగా నెలసరిలో చాలా ఎక్కువగా రక్తస్రావం అవుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఏమి చేయాలి?– లక్ష్మీ దేవి, కర్నూలు.ఇలాంటి సమస్యతో వచ్చినప్పుడు ముందుగా రోగి డీటెయిల్డ్ హిస్టరీ తెలుసుకోవాలి. సైకిల్ రెగ్యులర్గా ఉన్నా రక్తస్రావం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే ఉందా, లేక ఏడు రోజులు లేదా పది రోజులకంటే ఎక్కువ కొనసాగుతుందా అన్నది తెలుసుకోవాలి. అలాగే రోజుకు ఎన్ని ప్యాడ్లు మార్చాల్సి వస్తోంది, రాత్రిపూట కూడా లేచి మార్చాల్సి వస్తుందా, గడ్డలు పడుతున్నాయా, కడుపునొప్పి ఉందా వంటి వివరాలు కూడా తెలుసుకోవాలి. నలభై నాలుగు ఏళ్ల వయసు పెరిమెనోపాజ్ దశకు దగ్గరగా ఉండే వయసు కాబట్టి ఇలాంటి బ్లీడింగ్ ఎందుకు అవుతోంది అన్నది పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. అందుకోసం హిమోగ్లోబిన్ , సీబీపీ, థైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, అలాగే మధుమేహానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. అదనంగా అల్ట్రాసౌండ్ స్కాన్ తప్పనిసరిగా చేస్తారు. స్కాన్లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయా, ఒవేరియన్ సిస్టులు ఉన్నాయా, లేదా ఎడినోమయోసిస్ వంటి సమస్యలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు. ఇవి లేకపోయినా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే గర్భసంచి పొర మందం, అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉందో చూస్తారు. ప్రాథమికంగా రక్తస్రావం తగ్గించడానికి నాన్ హార్మోనల్ మందులు ఇస్తారు. హార్మోనల్ చికిత్స ప్రారంభించే ముందు బ్లీడింగ్కి కారణమేమిటో కచ్చితంగా తెలుసుకోవాలి. ఫైబ్రాయిడ్లు లేదా ఇతర సమస్యలు లేకపోయినా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే హిస్ట్రోస్కోపీ గైడెడ్ ఎండోమెట్రియల్ బయోప్సీ చేస్తారు. హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచి లోపల పరిస్థితిని నేరుగా చూసి, అక్కడి నుంచి చిన్న టిష్యూ నమూనా తీసి పరీక్షకు పంపడం. దీనివల్ల హార్మోన్ మార్పులు ఉన్నాయా లేదా కేన్సర్కు సంబంధించిన మార్పులు ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, నాన్ హార్మోనల్ మందులతో సమస్య తగ్గకపోతే హార్మోనల్ చికిత్స ఇవ్వచ్చు. ఇది మాత్రల రూపంలో ఇవ్వొచ్చు. మరో విధానం గర్భసంచి లోపల పెట్టే ప్రత్యేక పరికరం. ఇది కాపర్ టీ లాంటిదే కానీ ఇందులో హార్మో నెమ్మదిగా విడుదల అవుతుంది. దీనిని పెట్టిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దీని వల్ల నెలసరి క్రమంగా రావడం, రక్తస్రావం తగ్గడం, రోజువారీ జీవన నాణ్యత మెరుగుపడడం సాధ్యమవుతుంది. ∙డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ (చదవండి: పక్షవాతానికి వార్నింగ్ బెల్..!) -
పక్షవాతానికి వార్నింగ్ బెల్..!
పక్షవాతం అనే సమస్య అకస్మాత్తుగా వైకల్యం తెచ్చిపెట్టి మరొకరిపై ఆధారపడేలా చేస్తుంది. ఒకసారి పక్షవాతానికి గురైతే చాలాకాలం మరొకరిపై ఆధారపడాల్సి రావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఆ బాధ తప్పకపోచ్చు. అయితే అంతటి తీవ్రమైన పక్షవాతం కూడా తాను వచ్చే ముందర కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుంది. వాటిని తెలుసుకుని ముందే జాగ్రత్త పడితే ఆ ముప్పు తప్పుతుంది. ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ (టీఐఏ) అనేవే ఆ వార్నింగ్ సిగ్నల్స్. ప్రమాద ఘంటికలను మోగించే ఆ హెచ్చరిక ఏమిటో చూద్దాం...ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (సంక్షిప్తంగా ‘టీఐఏ’)ను పక్షవాతానికి (బ్రెయిన్ స్ట్రోక్కు) ముందస్తు సూచనగా పరిగణించవచ్చు. పక్షవాతంలో ఉండే లక్షణాలే ‘టీఐఏ’లోనూ కనిపిస్తయి. కాకపోతే అవి తాత్కాలికంగా కనిపించి తగ్గిపోతాయి. కానీ పక్షవాతంలో అలా కాదు. ఆ లక్షణాలు అలాగే ఉండిపోతాయి. ఈ నేపథ్యంలో ‘టీఐఏ’ను ఓ ముందస్తు హెచ్చరికలా పరిగణించి, జాగ్రత్తపడితే భవిష్యత్తులో వచ్చే వైకల్యపు ముప్పు చాలావరకు నివారించవచ్చు. అయితే టీఐఏ ఒకసారి కనిపించిందంటే అది మళ్లీ వచ్చేందుకు (రికరెన్స్కు) అవకాశం ఎక్కువ. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎందుకు వచ్చిందో తెలుసుకుని, పక్షవాతానికి వాడే మందుల్ని జీవితాంతం వాడాలి. పక్షవాతమే వచ్చినంత జాగ్రత్తగా ఉండాలి. టీఐఏ లక్షణాలు: ముఖంలోని ఓ పక్కభాగంలో అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం ఒకవైపు చేయి లేదా కాలూ బలహీనపడటం లేదా తాత్కాలికంగా పడిపోవడం మాట ముద్దముద్దగా రావడం లేదా మాట పడిపోవడం నిలకడగా నిలవలేకపోవడం (బ్యాలెన్స్ తప్పడం) అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లు కనిపించకపోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్లో ఈ లక్షణాలన్నీ సాధారణంగా కాసేపే ఉండవచ్చు. ఇవన్నీ గంటలోపే తగ్గిపోతాయి. అయితే పక్షవాతం వచ్చినప్పుడు అవే లక్షణాలు చాలాకాలం పాటు లేదా జీవితాంతం ఉండిపోతాయి. అందుకే టీఐఏ హెచ్చరికలను సీరియస్గా తీసుకుని, డాక్టర్ను సంప్రదించి వారు సూచించిన మందులు, సలహాలు పాటించాలి. అంతేకాకుండా... తగిన జీవనశైలి మార్పులతో (లైఫ్స్టైల్ మాడిఫికేషన్స్తో) భవిష్యత్తులో రాబోయే పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్కు కారణాలు... 1) మెదడుకు రక్తాన్ని సప్లై చేసే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు సన్నబడటం. 2) గుండెలో లేదా మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, అవి రక్తప్రవాహంలో కొట్టుకు΄ోయి మెదడులోని రక్తసరఫరాకు అడ్డుపడటం. టీఐయే / పక్షవాతం ముప్పు ఎవరెవరిలో... రక్తంలో కొవ్వులు ఎక్కువగా ఉన్నవారిలో అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉన్నవారిలో పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో నిద్రలో గురకపెట్టే వారిలో (స్లీప్ ఆప్నియా), నిర్ధారణ: టీఐఏ లక్షణాల ఆధారంగా దాన్ని నిర్ధారణ చేయడం తేలికే. సాధారణంగా ఎమ్మారై బ్రెయిన్, కెరోటిడ్ డాప్లర్ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్ కోయాగ్యులేషన్ పారామీటర్స్ వంటి పరీక్షలతో టీఐఏని నిర్ధారణ చేస్తారు. చికిత్స: రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్ వంటి మందులను సూచిస్తారు. రక్తనాళాలు సన్నబారడం 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే స్టెంటింగ్ లేదా ఎండరాక్టమీ వంటి ప్రక్రియలు చేయాల్సిరావచ్చు.డా. రంజిత్, సీనియర్ న్యూరాలజిస్ట్ (చదవండి: 'మత్తు'కు మందు ఇలా..!) -
'మత్తు'కు మందు ఇలా..!
ఇటీవల డ్రగ్స్ అనే మహమ్మారి సెలిబ్రిటీల వేడుకల్లో కనిపించడం పరిపాటిగా మారింది. ఇక చిన్నపిల్లలూ, టీనేజ్ బాలల్లో ఈ అలవాటు పెరుగుతుండటం చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతంలో టీనేజ్ పిల్లలు కొంత పెద్దయ్యాక మద్యం అలవాటుకు దగ్గరవుతుంటేనే ఎంతో ఆందోళనగా ఉండేది. అలాంటిది ఇప్పుడు పెద్ద నగరాల్లోని కొన్ని పబ్స్లో, పార్టీలలో, న్యూ ఇయర్ వేడుకల్లాంటి సోషల్ ఈవెంట్స్లో డ్రగ్స్ కనిపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు... పెద్ద పెద్ద హోదాల్లో, పదవుల్లో ఉన్నవాళ్ల పార్టీల్లోనూ డ్రగ్స్ కనిపించడం బెంబేలెత్తిస్తోంది. డ్రగ్స్ మహమ్మారి పొంచి ఉన్న ప్రస్తుత నేపథ్యంలో... తమ టీనేజ్ పిల్లలూ, కుటుంబ సభ్యుల్లోని యువత ఇలా డ్రగ్స్కు అలవాటు పడటాన్ని తల్లిదండ్రులు గుర్తించడం ఎంతో అవసరం. డ్రగ్స్ అలవాటు, దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయో తెలపడం, దానికి కావాల్సిన చికిత్స ప్రక్రియలను సూచించడం కోసమే ఈ కథనం...ఈమధ్య కాలంలో కొన్ని స్కూల్ ప్రాంగణాలలో హైస్కూల్ స్థాయికి వచ్చిన పిల్లలు సైతం డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. విశ్లేషకుల పరిశీలనల్లో డ్రగ్స్కు అలవాటు పడటం 14 నుంచి 18 ఏళ్ల పిల్లల్లో ఎక్కువని తెలుస్తోంది. అనేక అంశాలు ఇందుకు కారణమవుతున్నా ఈ కింది వాటిని ప్రధానమైనవిగా పరిగణించవచ్చు. అవి... పాశ్చాత్య ధోరణుల్లోని పెడపోకడలను మన పిల్లలూ అనుసరించడం / అనుకరించడం సెలిబ్రిటీలు కుటుంబాల్లో లేదా బాగా ధనవంతుల ఫ్యామిలీలలో పిల్లలపై పేరెంట్స్ పర్యవేక్షణ తక్కువగా ఉండటం స్నేహితులూ, తోటివారు చేస్తున్న పనులు చూసి... వాటిలో ఏదైనా ఆనందాన్ని తాము మిస్ అవుతున్నామన్న భావనతో వాళ్లను అనుకరించడం (పియర్ ప్రెషర్స్)ఆర్థికంగా మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం తోపాటు కొత్తగా టీన్స్లో ఉండే సహజ ఉత్సాహంతో జీవితాన్ని ఎడ్వెంచరస్గా, ఎక్సయిటింగ్గా ఉండేలా చేసుకోవాలనే తాపత్రయంతో ఈ పెడదారులు తొక్కడం మానసిక ఒత్తిడులనుంచి చాలా త్వరితంగా బయటపడాలన్న ఆకాంక్ష. డ్రగ్స్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు... ఈలోకంలోని చాలామందిలో ఒక అ΄ోహ ఉంటుంది. తమపై తమకు నియంత్రణ ఎక్కువ అనీ, తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఓ అలవాటు మానుకోగలమనే అపోహ ఉండటం చాలా సహజం. కానీ డ్రగ్స్ విషయంలో అలా కాదు. అవి మనిషిని బానిసగా మార్చేస్తాయి. అందుకే డ్రగ్స్ను మొదలుపెట్టి వదిలించుకోడానికి ప్రయత్నించడం కంటే ముందునుంచే దూరంగా ఉండటం మేలుడ్రగ్స్ తాలూకు దుష్పరిణామాలు చాలా దీర్ఘకాలం ఉపయోగించాక కనిపిస్తాయని అనుకోవడం సాధారణం. కానీ చాలా సందర్భాల్లో ఆరోగ్యంపై చూపే ఆ దుష్ప్రభావాలు తొలిసారే కనిపించవచ్చు. పార్టీ స్పైకింగ్ అంటే... : కొత్త అమ్మాయిలకూ లేదా అప్పటివరకూ ఎప్పుడూ మత్తుమందుల జోలికి వెళ్లని అబ్బాయిలకు డ్రగ్స్ అలవాటు చేయడం కోసం... వాళ్లకు తెలియకుండానే మత్తు ఇవ్వడాన్ని ‘పార్టీ స్పైకింగ్’గా చెబుతారు.సహజంగా అలవాటుగా మారే డ్రగ్స్ ఇవి... యాంఫిటమైన్స్, మెటా యాంఫిటమైన్స్ కొకైన్ బార్బిట్యురేట్స్, మిథాజోలిన్, క్వినాజోలిన్ వంటి నిద్ర మాత్రలు (క్రాష్). కెన్నాబిస్ (గంజాయి)నల్లమందు వంటి మాదకద్రవ్యాలు, పొగాకులో ఉండే నికోటిన్ ఆల్కహాల్ (కాకపోతే నికోటిన్, ఆల్కహాల్ను పూర్తిగా డ్రగ్స్ కేటగిరీలో చెప్పలేకపోయినప్పటికీ... తమను బానిసగా మార్చుకునే సామర్థ్యం వీటికీ ఉంది).మళ్లీ మళ్లీ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుందంటే... సాధారణంగా మళ్లీ మళ్లీ తీసుకోవాలనే కోరికతో డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం అన్నది రెండు రకాలుగా జరుగుతుంది. 1) శారీరక లక్షణాలతో : తొలుత అంతులేని ఉత్సహం, ఎక్సైట్మెంట్, ధైర్యం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలనూ, హాయి భావనను కలగజేసే ఈ డ్రగ్స్... వాటిని తీసుకోనప్పుడు దేహంలో శారీరకంగా కొన్ని తీవ్రమైన మార్పులు జరుగుతున్న అనుభూతిని కలగజేస్తాయి. అవేమిటంటే... డ్రగ్స్కు అలవాటు పడ్డ శరీరం వాటిని తీసుకోనప్పుడు దేహమంతా వణుకు, విపరీతంగా చెమటలు పట్టడం, స్థిరంగా స్థిమితంగా ఉండలేక΄ోవడం, గుండె దడ, కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2) మానసికమైన భ్రాంతులతో : డ్రగ్స్ తీసుకోవడం అలవాటయ్యాక ఎప్పుడైనా తీసుకోనప్పుడు... కొందరిలో కొన్ని రకాల భ్రాంతులు కనిపించవచ్చు. అంటే లేని శబ్దాలు వినిపించడం, వాస్తవం కాని దృశ్యాలు కనిపించడం వంటివి. ఒక్కోసారి డ్రగ్స్కు అలవాటు పడ్డవారు తమనెవరో బాధపెడుతున్నట్లు భ్రాంతి చెందడమూ జరగవచ్చు. దాంతో మానసికంగా డ్రగ్కోసం పరితపించడం జరుగుతుంది.సామాజికంగా జరిగే నష్టాలు డ్రగ్స్ తీసుకున్న వారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వేగంగా వాహనాలు నడపటం, సెక్స్లో వికృతంగా ప్రవర్తించడం వంటి పనులకు పాల్పడవచ్చు. కొందరు దొంగతనాలూ, హత్యల వంటి నేరాలకూ పాల్పడవచ్చు. చదువు దెబ్బతినవచ్చు. గుర్తించడం ఎలా... పిల్లలు నలుగురితోనూ, కుటుంబసభ్యులతో కలవకుండా... తాము ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడటం గతంలో ఎన్నడూ చూడని విధంగా తీవ్రంగా ప్రవర్తించడంమాటలలో, చేతలలో నిర్లక్ష్యం, ఎవరినీ లెక్కచేయక΄ోవడం వ్యక్తిగత పరిశుభ్రత అంతగా పాటించక΄ోవడం ∙డ్రగ్స్కు అలవాటైన వారి చెమటనుంచి ఒక రకం వాసన వస్తుండటం స్కూల్లో, కాలేజీలో స్కోర్ తగ్గడం... వంటి మార్పులు కనిపిస్తుంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను డాక్టర్కు లేదా సైకియాట్రిస్ట్కు చూపించాలి.డాక్టర్ శివ అనూప్ యెల్లా, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ (చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!) -
9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!
చాలామటుకు 9 టు 5 ఉద్యోగాల చేసే వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందట. పగలు అంత ఆపీస్లోనే గడిచిపోవడంతో వ్యక్తిగతంగా సమయం కేటాయించుకునే వీలు అస్సలు ఉండు. అందులోనూ ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేంత అవకాశం అస్సలు ఉండదు. అలాంటప్పుడు అధిక బరువు సంబంధిత అనారోగ్య సమస్యల బారిన ఇట్టే పడుతుంటారు. అలాంటివాళ్లు ఫిట్గా ఉండాలంటే ఈ ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు ప్రసిద్ధిగాంచిన విద్యుత్ జమ్మాల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మరి అవేంటో చూద్దామా..!.టాటాప్లే ఫిట్నెస్లో ‘ఫిట్ అండ్ ఫేమస్’తో జరిగిన సంభాషణలో ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు విద్యుత్ జమ్వాల్ ఇలా చెప్పుకొచ్చారు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేస్తానని, దొరకనప్పుడు అస్సలు బాధపడని అన్నారు. కానీ ఆఫీస్కి వెళ్లేవారు, క్రమబద్ధమైన జీవితం గడిపేవారు ముఖ్యంగా 9-5 ఉద్యోగాలు చేసేవారు నెలకు ఐదు కిలోలు తగ్గాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. అందుకోసం కనీసం పదికిలోమీటర్లు లేదా కనీసం ఒక కిలోమీటరైనా నడవాలని చెప్పారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా టైమ్టైబుల్ పెట్టుకోవడం, దాన్ని అలవాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. అలా చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడరని అన్నారు.వాకింగ్ ఒక్కటి చాలా..!?దీర్ఘకాలిక ఆరోగ్యానికి నడక ఒక అద్బుతమైన పునాది. దీనివల్ల హృదయ సంబంధ ఆరోగ్యం, బరువు నియంత్రణ, మెరుగైన జీవనశైలి, వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సంపూర్ణ ఫిట్నెస్ కోసం వాకింగ్ మాత్రమే సరిపోదు. బల శిక్షణ, ఫ్లెక్సిబిలిటీ వ్యాయమాలు కూడా తోడవ్వాలి అని చెబుతున్నారు. కేవలం నడకపైనే ఆధారపడితే కష్టమని అన్నారు. దీర్ఘకాలికా ఆరోగ్యం కోసం శరీరానికి తగినంత కదలిక ఉండాలని, నడవడంలో కూడా కొంగొత్త వాటిని జోడించి వాక్ చేయడం మరింత మంచిదని అన్నారు. కండరాలను పెంచుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు రెసిస్టెన్స్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. దినచర్యలో యోగా, స్ట్రెచింగ్ను నేర్చుకుంటే మరింత మంచిదని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) (చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!) -
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు రొమ్ము కేన్సర్..
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు తొలిదశ రొమ్ము కేన్సర్తో బాధపడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. అంతేగాదు వేల్స్ని ఒక విశ్వసనీయ సలహాదారుగా ప్రశంసించారు కూడా. ఆమె సాధ్యమైనంత తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె ఒక అద్భుతమైన చీఫ్ ఆఫ్ స్టాఫ్, అలాగే నాకు తెలిసిన అత్యంత బలమైన వ్యక్తులలో ఒకరామె. దురదృష్టవశాత్తు వేల్స్కి తొలిదశ రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు. ఆమె సత్వరమే ఈ సవాలుని స్వీకరించి ధైర్యంగా పోరాడాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. ఆమెకు కోలుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఆమె వెంట అద్భుతమైన వైద్య బృందం ఉందని, చికిత్స సమయంలో, ఆమె దాదాపు పూర్తి సమయం వైట్ హౌస్లోనే గడుపుతారని పోస్ట్లో వెల్లడించారు ట్రంప్. ఈ నేపథ్యంలో తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే..?, ఇతర భాగాలకు వ్యాపించకముందే ముందుగా ఎలా గుర్తిస్తారు, ఎలాంటి చికిత్స అందిస్తారు, తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే ఏమిటి?తొలిదశ రొమ్ము కేన్సర్లో సాధారణంగా స్టేజ్ 0, స్టేజ్ I, కొన్ని స్టేజ్ II కేన్సర్లు ఉంటాయి. ఈ దశలో, కణితి రొమ్ముకే పరిమితమై ఉంటుంది లేదా సమీపంలోని శోషరస కణుపులకు చాలా తక్కువగా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ కేన్సర్ ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నందున, తర్వాతి దశలతో పోలిస్తే సత్వరమే చికిత్స తీసుకుని సులభంగా కోలుకోగలుగుతారు సదరు రోగులుఅంతేగాదు 'ది బ్రెస్ట్' అనే జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, స్టేజ్ I రొమ్ము కేన్సర్కు ఐదేళ్ల మనుగడ రేటు దాదాపు 90% కాగా, స్టేజ్ IVకు ఇది సుమారు 26% మాత్రమేనని తెలుస్తోంది. ఇక్కడ వైల్స్ విషయంలో "తొలిదశ" అనేది ఆమె సాధ్యమైనంత తొందరగానే ఈ సమస్య నుంచి బయటపడతారనేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ రొమ్ము కేన్సర్ను ముందుగానే గుర్తించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలను హైటెల్ చేసింది. ఈ దశలో మనుగడ రేట్లను గణనీయంగా మెరుగుపరుస్తుంది. చాలా సందర్భాలలో, తొలిదశ రొమ్ము కేన్సర్కు చికిత్స తీసుకుంటూనే రోజువారీ పనులను కొనసాగించొచ్చు కూడా. ఇక్కడ వైల్స్ కూడా ఆ నేపథ్యంలోనే చికిత్స పొందుతూనే పని కొనసాగించాలని నిర్ణయించుకున్నారామె. కానీ ఈ తొలి దశలలో, రొమ్ము కేన్సర్ని అంత సులభంగా గర్తించకపోవచ్చు. అయితే, అది ఇచ్చే హెచ్చరిక సంకేతాలను విస్మరించకూడదు:అవేంటంటే..రొమ్ములో లేదా చంకలో గడ్డరొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పులుచర్మంపై గుంటలు పడటం లేదా ముడతలు పడటంతల్లిపాలు కాకుండా చనుమొన నుంచి ఇతర స్రావాలు రావడంచనుమొన చుట్టూ చర్మం ఎర్రబడటం లేదా పొలుసులుగా మారడంనిరంతర రొమ్ము నొప్పిఅన్ని గడ్డలూ కేన్సర్ గడ్డలు కావని గమనించడం ముఖ్యం, కానీ ఏదైనా అసాధారణ మార్పును వెంటనే ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.ఈ కేన్సర్ ఎవరిలో అధికం అంటే..వయస్సు: వయసు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుందికుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము కేన్సర్ ఉండటం ప్రమాదాన్ని పెంచుతుందిజన్యు మార్పులు: BRCA1 మరియు BRCA2 వంటి వారసత్వంగా వచ్చే మార్పులుహార్మోన్ల కారకాలు: చిన్న వయసులోనే రుతుస్రావం ప్రారంభం కావడం లేదా ఆలస్యంగా మెనోపాజ్ రావడంజీవనశైలి కారకాలు: ఊబకాయం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడంఅయితే, రొమ్ము కేన్సర్తో బాధపడుతున్న చాలా మందికి ముందుగా ఎలాంటి స్పష్టమైన ప్రమాద కారకాలు కనిపించకపోవచ్చు. అందుకే క్రమం తప్పని స్క్రీనింగ్ చాలా కీలకం.ఎలా నిర్ధారిస్తారంటే?ఒక అధ్యయనం ప్రకారం, స్క్రీనింగ్ పరీక్షల్లో మహిళల్లో మామోగ్రఫీ అనే సాధనం మరణాల రేటును 20% వరకు తగ్గించగలదు. వాస్తవానికి సాధారణ స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే ప్రారంభ దశ రొమ్ము కేన్సర్ను చాలామటుకు సులభంగా గుర్తిస్తారు. అత్యంత సాధారణ పద్ధతులు:మామోగ్రఫీ: రొమ్ము ఎక్స్-రే, ఇది చిన్న కణితులను గుర్తించగలదుఅల్ట్రాసౌండ్: ఘన గడ్డలు, ద్రవంతో నిండిన తిత్తుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుందిబయాప్సీ: కేన్సర్ను నిర్ధారించడానికి కణజాల నమూనాను తీసుకుంటారు40 ఏళ్లు పైబడిన మహిళలకు లేదా అధిక ప్రమాదం ఉన్నవారికి క్రమమైన స్క్రీనింగ్ చాలా ముఖ్యం.చికిత్సా పద్ధతులుప్రారంభ దశ రొమ్ము కేన్సర్కు చికిత్స అనేది కణితి పరిమాణం, రకం, అది వ్యాపించిందా లేదా అనే దానితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ చికిత్సా విధానాలు:శస్త్రచికిత్స: కణితిని తొలగించడం (లంపెక్టమీ) లేదా మొత్తం రొమ్మును తొలగించడం (మాస్టెక్టమీ)రేడియోథెరపీ: శస్త్రచికిత్స తర్వాత మిగిలిపోయిన కేన్సర్ కణాలను నాశనం చేయడానికి తరచుగా ఉపయోగిస్తారుహార్మోన్ థెరపీ: హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్గా ఉండే కేన్సర్ల కోసంకీమోథెరపీ: కొన్ని సందర్భాల్లో, కేన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికిటార్గెటెడ్ థెరపీ: నిర్దిష్ట కేన్సర్ కణ లక్షణాలపై దృష్టి పెడుతుందివైద్యులు సాధారణంగా ప్రతి వ్యక్తికి అనుగుణంగా చికిత్సా ప్రణాళికలను రూపొందిస్తారు. తద్వారా కొద్దిపాటి దుష్ప్రభావాలతో సులభంగా ఈ కేన్సర్ బారి నుంచి బయటపడేలా చేస్తారు. ఏదిఏమైనా ఈ రొమ్ము కేన్సర్ని ముందుగా గుర్తించడమనేది చాలా శక్తిమంతమైనది. ఎందుకంటే ఈ దశలో చికిత్స అందించడం సులభం అవుతుంది. కొద్దిపాటి చికిత్సతోనే తొందరగా బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్కట్) -
ఫైనాన్షియల్ పర్సనాలిటీ అంటే..?
డబ్బు కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది మీ 'పర్సనాలిటీకి అద్దం'. మీరు డబ్బును ఎలా చూస్తున్నారు? భద్రత కోసం చూస్తున్నారా? లేక హోదా కోసం చూస్తున్నారా? మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా, మీ డబ్బు ఖర్చు చేసే విధానం మీలోని భయాలను, ఆశలను బయటపెడుతుంది. సైకాలజీ ప్రకారం, మన ఫైనాన్షియల్ నిర్ణయాలు మన బాల్యంలో ఏర్పడిన నమ్మకాలపై (Money Beliefs) ఆధారపడి ఉంటాయి.1. నాలుగు రకాల ఫైనాన్షియల్ పర్సనాలిటీలుసైకాలజీ ప్రకారం, మనుషులను డబ్బును ఖర్చు చేసే తీరు బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు. The Spender (ఖర్చు చేసేవాడు): వీరు డబ్బును 'సంతోషం' కోసం ఖర్చు చేస్తారు. ఎవరైనా ఏమనుకుంటారో అని, లేదా ఇన్స్టంట్ హ్యాపీనెస్ కోసం ఖర్చు చేస్తారు. ఇది వారిలోని 'అభద్రతా భావం' (Insecurity) ను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం.The Saver (దాచుకునేవాడు): వీరు డబ్బును 'భద్రత'గా భావిస్తారు. ప్రతి రూపాయిని దాచుకోవడం వీరి పర్సనాలిటీ. ఇది వారిలోని 'భవిష్యత్తు భయం' (Fear of the future) ను ప్రతిబింబిస్తుంది. The Avoider (తప్పించుకునేవాడు): వీరు తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూడ్డానికి కూడా భయపడతారు. డబ్బు విషయంలో ఒక రకమైన 'నిరాసక్తత'ను ప్రదర్శిస్తారు. ఇది వారి 'అసమర్థత' (Feeling of helplessness) ని సూచిస్తుంది. The Investor/Planner: వీరు డబ్బును ఒక 'సాధనం'లా వాడతారు. వీరిలో ప్లానింగ్, క్రమశిక్షణ ఉంటాయి. వీరు తమ వ్యక్తిత్వాన్ని 'రిస్క్ అండ్ రివార్డ్' తో బ్యాలెన్స్ చేసుకుంటారు.2. మనీ ట్రాప్స్: పర్సనాలిటీని ఎలా దెబ్బతీస్తాయి?Status Spending: మనకు నచ్చని వస్తువులను, మనకు ఇష్టం లేని వ్యక్తులను మెప్పించడానికి కొనడం. ఇది మీ 'ఆత్మవిశ్వాసం' లేకపోవడానికి సంకేతం.Impulse Buying: ఎమోషనల్ గా ఉన్నప్పుడు (కోపం లేదా బాధ) ఖర్చు చేయడం. ఇది మీ 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్' లోపం.3. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ డబ్బుని మీ పర్సనాలిటీని పెంచే ఆయుధంగా ఎలా మార్చుకోవాలి?Step 1: డబ్బుతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ని బ్రేక్ చేయండిమీరు ఎందుకు ఖర్చు చేస్తున్నారో గమనించండి. అది మీ అవసరమా? లేక మీలోని ఏదో వెలితిని నింపుకోవడానికా? మీరు 'Spender' అయితే, మీలోని 'Insecurity' ని 'Break' చేయండి. 'Saver' అయితే, మీలోని 'భయాన్ని' బ్రేక్ చేయండి.Step 2: వాల్యూ బేస్డ్ స్పెండింగ్మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీ Values ని ప్రతిబింబించాలి. మీరు చదువుకోవడానికి, ఆరోగ్యం కోసం, మంచి సంబంధాల కోసం ఖర్చు చేస్తున్నారా? అయితే అది మీ పర్సనాలిటీని Build చేసుకోవడం. అనవసరమైన వాటిని కట్ చేయండి.Step 3: ఆర్థిక స్వేచ్ఛడబ్బు కోసమే బ్రతకడం కాదు, డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. మీ ఆర్థిక క్రమశిక్షణే మీ పర్సనాలిటీకి ఒక 'స్టేటస్'ను ఇస్తుంది. ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్నప్పుడు, మీరు ప్రపంచాన్ని మరింత ధైర్యంగా ప్రభావితం చేయగలరు. ఇదే 'Beyond' స్టేజ్.4. మీ ఫైనాన్షియల్ అద్దంఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీ గత నెల ఖర్చులలో ఎన్ని 'అవసరం' కోసం, ఎన్ని 'హోదా' కోసం?మీరు ఎందుకు దాచుకుంటున్నారు? (భయం కోసమా? లక్ష్యం కోసమా?)మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకి, మీ వ్యక్తిత్వానికి సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా?డబ్బు - మీ పర్సనాలిటీకి మందు!బ్రో, డబ్బు లేకపోవడం వల్ల వచ్చేది పేదరికం, కానీ డబ్బుని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల వచ్చేది 'పర్సనాలిటీ క్రైసిస్'. క్రమశిక్షణతో కూడిన ఖర్చు, మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తుంది."Wealth is not about having a lot of money; it's about having a lot of options." Naval Ravikanthసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా?) -
అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్కట్
వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియా వేదికగా 45 ఏళ్ల వయసులో 13% శరీర కొవ్వుని ఎలా తగ్గించుకున్నారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ఎలాంటి స్టెరాయిడ్లు, షార్ట్కట్లు, ఏఐ సలహాలు తీసుకోలేదని చెప్పారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీర కొవ్వు సాధారణంగా పెరుగుతుంది. బరువు స్థిరంగా ఉన్నా కొలెస్టాల్ స్థాయిలు పెరుగుతాయట. పైగా వయసుతోపాటు కండర ద్రవ్యరాశిని కోల్పోతామట. దాంతో చర్మం కింద, పొత్తుకడుపు వంటి అంతర్గత అవయవాలలోకి కొవ్వు విసరల్ ఫ్యాట్గా స్టోర్ అవుతుందని చెబుతున్నారు. ఇది టైప్2, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. పైగా రానురాను బరువు తగ్గడం కష్టంగా మారిపోతుందట. పురుషులలో సుమారు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ..టెస్టోస్టెరాన్ క్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతో కండరాలను నిర్మించడం, కొవ్వు పంపిణీ చేయడంలో సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు అంకుర్ వారికూ. అందుకే తాను 3టీ ఫార్ములాతో ఆరోగ్యకరమైన రీతీలో కొలెస్ట్రాల్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏంటా ఫార్ములా..? ఎలా అనుసరించాలంటే..T3 ఫార్ములా:T1 - ట్రాక్ వారానికి సుమారు 0.5 కిలోల బరువు తగ్గడానికి, రోజుకు 300 నుండి 500 కేలరీల స్వల్ప లోటు ఆరోగ్యకరమైనదట. డైట ప్లాన్..ఉదయం 9:30 - 1 స్కూప్ వే ప్రోటీన్, క్రియేటిన్, 1 వాల్నట్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 5-6 ఎండుద్రాక్షలుఉదయం 11 గంటలకు - 200 గ్రాముల పనీర్/టోఫు/టెంపే, లేదా దాల్ చిల్లా, అప్పుడప్పుడు గుడ్లు.మధ్యాహ్నం 1 గంటకు - పండ్లుసాయంత్రం 4 గంటలకు - 2 రోటీలు (ఎమ్మర్ గోధుమ/జొన్న/సోయా బీన్) + కూర + పప్పు + తక్కువ కొవ్వు గల పెరుగుసాయంత్రం 6:30 గంటలకు - పెరుగుతో 1 స్కూప్ వే ప్రోటీన్అయితే తనకు ఇష్టమైన చోలే భటూరేని మాత్రం వదిలేయలేదట. అలాగే మిఠాయిని కూడా తిన్నట్లు తెలిపారు. అయితే కేలరీలు బ్యాలెన్స్గా ఉండేలా కేర్ తీసుకున్నారట.T2 - శిక్షణగుండె ఆరోగ్యానికి కార్డియో మంచిదే అయినప్పటికీ, వృద్ధులలో దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అత్యంత ప్రభావవంతమైన సాధనం.ఎందుకంటే ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఒకేసారి ఎక్కువ కండర సమూహాలను ఉత్తేజపరచడానికి, సిట్-టు-స్టాండ్స్ లేదా మోడిఫైడ్ ప్లాంక్స్ వంటి బహుళ కీళ్లను ఉపయోగించే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.వ్యాయామ దినచర్య:టెన్నిస్ - వారానికి 6 రోజులు, 1 గంట (కార్డియో పూర్తయింది)వెయిట్స్ - వారానికి 6 రోజులు, 45 నిమిషాలుప్రతి రోజు: 2 వ్యాయామాలు x 3 శరీర భాగాలకు సంబంధించిన వర్కౌట్లు = 6 వ్యాయామాలు10-12 సార్లు పునరావృతం చేస్తూ మొత్త మూడు సెట్లు చేయాలి.T3 - రూపాంతరంమార్పులను నమోదు చేయడానికి రోజువారీ బరువును, వారపు కొలతలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే తన ఫోటోలను తన ట్రైనర్కు పంపిచినట్లు చెప్పారు.చాలామటుకు అదే డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలిపారు.సెలవులకు టూర్కి వెళ్లేముందు లేదా బ్రేక్ తీసుకోవాలనుకుంటే.. మరింతగా ఈ దినచర్యను వేగవంతం చేసినట్లు తెలిపారు. శరీరంలోని కొవ్వును తగ్గించడం అంటే మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇక్కడ కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వుని తగ్గించుకుంటే..మొత్తం జీవన నాణ్యతనే మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పుకొచ్చారు అంకుర్ వారికూ.మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక, వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు శారీరక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వును కోల్పోవడం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య జీవసంబంధమైన సూచికలను నెమ్మదింపజేస్తుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చిం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను పంపించడం ఉత్తమం. (చదవండి: వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు') -
వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు'
ఒకప్పుడు ‘సక్సెస్’ అంటే మంచి జాబ్, భారీ ప్యాకేజ్, లగ్జరీ లైఫ్.. అని భావించిన నగర జీవనం క్రమంగా మారుతోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రజలు ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ వైపు మళ్లుతున్నారు. ఒత్తిడి, జీవనశైలి వ్యాధుల మధ్య ఇరుక్కున్న అర్బన్ జనరేషన్ ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదనే ధోరణికి వచ్చేసింది. ఈ మార్పే వెల్నెస్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోస్తోంది. వెల్నెస్ అనగానే కేవలం యోగా క్లాస్/ డైట్ మాత్రమే కాదు.., మానసిక ప్రశాంతత, శారీరక చురుకుదనం, భావోద్వేగ సమతుల్యత.. ఇవన్నీ కలిసిన సమగ్ర జీవన విధానమే నేటి వెల్నెస్ అని లైఫ్స్టైల్ కోచ్ డా.శ్రీ సోహం చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పంచుకున్న ఆలోచనలు ఆయన మాటల్లోనే.. కాలుష్యంతో నిండిన నగర జీవితానికి కొద్దిసేపైనా బ్రేక్ ఇవ్వాలనే తపన యువతలో పెరుగుతోంది. ఆరోగ్యం కోసం ప్రజలు తిరిగి మూలాల వైపు అడుగేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలన్న ఆలోచన కూడా వెల్నెస్ ట్రెండ్గా మారింది. ఇప్పటికే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో చిన్న గెస్ట్హౌస్లు, నేచర్ గార్డెన్లు, వీకెండ్ రిట్రీట్స్ పెరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో సరైన గైడెన్స్ ఉంటే శరీరం–మనసు రెంటిలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయి. కార్పొరేట్ కల్చర్లోనూ వెల్నెస్ కీలకాంశంగా మారుతోంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు అనేక కంపెనీలు యోగా, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్స్ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాయి. ‘సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఉద్యోగుల పనితీరు సహజంగానే పెరుగుతుంది. కొన్ని సంస్థల హెచ్ఆర్ విభాగం దీనిపై ఆలోచన చేయాల్సి ఉంది. కాన్షియస్.. మ్యాడ్ నెస్.. హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్ సిటీ. రుచికరమైన ఆహారానికి తగ్గట్టుగా సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సోమ్నియా, పీసీఓడీ, థైరాయిడ్, షుగర్, బీపీ వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇన్ఫెరి్టలిటీ సమస్యలు, ఐవీఎఫ్ క్లినిక్స్ పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. తినడం తప్పు కాదు.. కానీ మనం ఏమి తింటున్నామో తెలుసుకుని తినాలి.. అప్పుడప్పుడు ఉపవాసం బాడీని డీటాక్స్ చేస్తుంది. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఉన్నా.. ‘స్టాప్ లెర్నింగ్, స్టార్ట్ అన్లెర్నింగ్’ అనే భావన ఆకర్షణగా మారుతోంది. సమస్యల నుంచి పారిపోకుండా.. జీవితంలోని ప్రతి క్షణాన్ని అవగాహనతో అనుభవించాలనే ఆలోచన ‘కాన్సియస్ మ్యాడ్ నెస్’ కాన్సెప్ట్కు బలం ఇస్తోంది. ఈ ఆలోచనలతో ఈ నెల 21న గండిపేటలోని ఆయర్వన్ వాటర్ సైడ్లో యోగా, మెడిటేషన్, భజన్ జ్యూమింగ్ ఎక్స్పీరియన్స్ అందించనున్నాం. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్ లైఫ్స్టైల్లో వెల్నెస్ కేవలం ట్రెండ్ కాదు.. అవసరంగా మారబోతోంది. సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకునే దిశగా యువత అడుగులు వేస్తోంది. స్ట్రెస్ నుంచి స్ట్రెంగ్త్కి ప్రయాణమే నేటి హైదరాబాద్ కొత్త లైఫ్స్టైల్. -
అదే అసలైన కాన్ఫిడెన్స్..!
కాన్ఫిడెన్స్ అంటే ఎదుటివారిని డామినేట్ చేయడం లేదా గట్టిగా అరవడమని చాలామంది అనుకుంటుంటారు. కానీ సైకాలజీలో కాన్ఫిడెన్స్ అంటే "నేను గొప్పవాడిని" అని అరుచుకోవడం కాదు, "నేను దేనినైనా ఎదుర్కోగలను" అని మనసులో ఉండే 'Self-Efficacy' (ఆత్మసామర్థ్యం). దీనికి గర్వానికి (Arrogance) మధ్య ఉన్న తేడాను గుర్తించడమే అసలైన వ్యక్తిత్వ వికాసం. అసలైన కాన్ఫిడెన్స్ ఒక 'నిశ్శబ్ద బలం' (Silent Strength).1. Albert Bandura సిద్ధాంతంకాన్ఫిడెన్స్ అనేది ఒక పుట్టినప్పుడు వచ్చే లక్షణం కాదు. ఆల్బర్ట్ బాండూరా అనే సైకాలజిస్ట్ దీనిని 'Self-Efficacy' అని పిలిచారు. దీనికి నాలుగు మూలస్తంభాలు ఉన్నాయి.Mastery Experiences: మీరు ఒక పనిని పదే పదే చేసి, అందులో నైపుణ్యం సంపాదించినప్పుడు వచ్చే నమ్మకం.Vicarious Experiences: మీలాంటి వారే ఒక పనిని సాధించడం చూసి, "అతనే సాధించగలిగినప్పుడు నేను ఎందుకు సాధించలేను?" అని అనుకోవడం.Social Persuasion: మీపై నమ్మకం ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహించడం.Physiological States: మీ శరీరంలోని ఒత్తిడిని, ఉత్సాహాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది.2. గర్వానికి, కాన్ఫిడెన్స్ కి తేడా ఏంటి?Arrogance (గర్వం): "నేను అందరికంటే తోపు, నేను ఎప్పుడూ తప్పు చేయను." ఇది భయాన్ని దాచుకోవడానికి వేసే ముసుగు.Confidence (ఆత్మవిశ్వాసం): "నేను తప్పు చేయవచ్చు, కానీ ఆ తప్పు నుండి నేర్చుకుని మళ్ళీ లేవగలను." ఇది వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం.కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలుసు, అందుకే అతను ఇతరుల విమర్శలకు భయపడడు. గర్వం ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలిస్తే భయం, అందుకే అతను ఇతరుల మీద అరుస్తాడు.3. నిజమైన కాన్ఫిడెన్స్మోటివేషన్ ట్రైనర్లు "నువ్వు అద్దంలో చూసి నిన్ను నువ్వు పొగుడుకో, నువ్వు గెలుస్తావు" అని చెప్తారు. ఇది కేవలం పైన పూసే రంగు. కానీ సైకాలజీ ప్రకారం కాన్ఫిడెన్స్ రావాలంటే 'కాంపిటెన్స్' (నైపుణ్యం) ఉండాలి (Competence-based Confidence). మీరు ఒక పనిని కష్టపడి నేర్చుకుని, అందులో ప్రావీణ్యం సంపాదిస్తే.. ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ పుడుతుంది.4. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం మూడు అంచెల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పొందాలో చూద్దాం.Step 1: అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండిముందుగా I am not enough అనే అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండి. మీరు ఎవరితోనూ పోటీ పడనవసరం లేదు, మీ నిన్నటి వెర్షన్ తో మాత్రమే పోటీ పడండి.Step 2: చిన్న చిన్న విజయాలుఒక రోజులో మీరు అనుకున్న పనిని పూర్తి చేయండి. ఆ చిన్న 'విజయం' మీ సబ్-కాన్షియస్ మైండ్కి మీరు నమ్మదగ్గ వ్యక్తి అని చెప్తుంది. ఇలా రోజురోజుకూ మీ కాన్ఫిడెన్స్ మజిల్ని Build చేయండి.Step 3: నిశ్శబ్ద విజేతమీరు స్టేజ్ ఎక్కనవసరం లేదు, అరవనవసరం లేదు.. మీ నడకలో, మీ కళ్ళలో, మీ మాటల్లో ఆ బలం కనిపిస్తుంది. ఎదుటివారికి మీరు ఒక 'ముప్పు'గా కాకుండా, ఒక 'ప్రేరణ'గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు ఎప్పుడు, ఏ పని చేస్తున్నప్పుడు ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఫీలవుతారు? మీలో ఉన్న ఒక బలహీనతను మీరు గర్వంగా ఒప్పుకోగలరా?ఇతరుల విమర్శలు మిమ్మల్ని ఇంకా కదిలిస్తున్నాయా?కాన్ఫిడెన్స్ ఒక ప్రయాణం!బ్రో, కాన్ఫిడెన్స్ అనేది ఒక రోజులో రాదు. ఇది ఒక ప్రయాణం. మీ నైపుణ్యాలను పెంచుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ గాయాలను హీల్ చేసుకోండి.. అప్పుడు కాన్ఫిడెన్స్ దానంతట అదే ఒక నీడలా మిమ్మల్ని అనుసరిస్తుంది."Confidence is silent. Insecurities are loud."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..) -
చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!
మహిళలకు అది బయటకు చెప్పుకోలేని ఓ సమస్య. ఎవరితోనూ పంచుకోలేని ఓ పెను ఇబ్బంది. ఇప్పటి తరానికి ఒక తరం ముందున్న వారు కావడంతో వీళ్లంతా ఓపెన్గా చర్చించాలంటే కొంతైనా అసౌకర్యంగా, ఇంకాస్త బిడియంగా ఫీలయ్యే ఈ సమస్య పేరు ‘జెనైటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’. సంక్షిప్తంగా దీన్ని ‘జీఎస్ఎమ్’గా పేర్కొంటారు. సమస్య ఎప్పటినుంచో ఉన్నదే అయినప్పటికీ... ఇటీవల ఆధునిక జీవనశైలితో వచ్చే హార్మోన్ల అసమతౌల్యపు సమస్యలు ఎక్కువ కావడంతో ఇంతకుముందు కంటే ఇప్పుడు మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం పీరియడ్స్ ఆగిపోయిన ముందు తరానికే కాకుండా అండాశయాలు తొలగించుకున్న ఈతరం వారినీ వేధిస్తూ ఇటీవల ఈ కేసులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. జస్ట్... ఒక్కసారి తమ బిడియం వీడి... గైనకాలజిస్టులనూ, యూరో గైనకాలజిస్టులను సంప్రదిస్తే నూరుశాతం తగ్గి΄ోయే ఈ సమస్య ఇది. మరెవరితోనో అంత ఓపెన్గా మాట్లాడే అవకాశం లేకపోయినా మహిళలు చదువుకొని తెలుసుకోగలిగే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మెనోపాజ్ తర్వాత దాదాపు 40 నుంచి 60 శాతం మహిళల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు మనదేశంలో ప్రతి ఇద్దరు మహిలల్లో ఒకరికి తప్పక ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంటే మెనోపాజ్ వచ్చివారిలో 50% మంది జీఎస్ఎమ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక మెనోపాజ్ నుంచి కాలం గడుస్తున్నకొద్దీ జీఎస్ఎమ్ బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం మహిళలకు తమ చివరి పీరియడ్ నుంచి కేవలం ఐదేళ్ల వ్యవధిలోపే ఆ సంఖ్య 65% చేరుకుంటోంది. ఇక పూర్తిగా మోనోపాజ్ వచ్చిన వాళ్లలో చూస్తే వారిలో ఐదేళ్లలోపే 74% మందిలో జీఎస్ఎమ్ కనిపిస్తోంది. పేరును బట్టి కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కనిపిస్తుందా అంటే అది కూడా అపోహే. ఈతరం మహిళల్లోనూ... అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కాకుండా ఏదైనా మెడికల్ కారణాల వల్ల అండాశయాలు తొలగించుకున్నవారిలో లేదా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారిలోనూ కనిపించే సమస్య ఇది.తొలుత శారీరకమైన సమస్యే... కానీ తర్వాత మానసికంగా కూడా... సాధారణంగా ఇది శారీరకంగా ఇబ్బంది పెట్టే సమస్యే అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మహిళను కుంగదీస్తుంది. చికిత్స తీసుకోకపోవడం వల్ల భర్త నుంచి దూరం జరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య ఏడబాటు, బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో సామాజికంగా నలుగురికీ దూరం అవ్వడం, ప్రయాణాలకు దూరంగా ఉండటం, ఏ పనిలోనూ ఆసక్తిలేకపోవడం వంటి కారణాలతో సమాజం నుంచి దూరంగా జరుగుతూ కుంగుబాటుకూ (డిప్రెషన్కూ) లోనయ్యే అవకాశాలు లేక΄ోలేదు.గుర్తించడమెలా (డయాగ్నసిస్) జీఎస్ఎమ్కు ఎలాంటి నిర్దిష్టమైన వైద్య పరీక్ష ఉండదు. కానీ మహిళలు తమ బిడియం విడిచి డాక్టర్ను సంప్రదిస్తే తేలిగ్గా తెలుసుకోగల వైద్య సమస్య ఇది. పైగా వైద్య చికిత్సతో నూటికి నూరు΄ాళ్లు నయం చేయగల (ట్రీటబుల్) సమస్య ఇది. చేయాల్సిందల్లా మహిళలు ఈ సమస్యనలా భరిస్తూ ఉండేందుకు బదులు డాక్టర్ దగ్గర చెప్పుకుంటే చాలు.చికిత్స ఈ సమస్యకు చికిత్స అన్నది అందరికీ ఒకేరకంగా కాకుండా వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొందరిలో ఇన్ఫెక్షన్ / ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్తో పాటు జీవనశైలి మార్పులు సూచించడం, పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే వర్కవుట్స్ సూచించడం వంటివి. అలాగే సమస్య తీవ్రతను బట్టి పూతమందులుగా ఇచ్చే మాయిశ్చరైజర్లు, ల్యూబ్రికెంట్లతో పాటు సిస్టమేటిక్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీగా హార్మోన్లు ఇవ్వడంలాంటి వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ ఇస్తూ సలహా సూచనలందిస్తూ పేషెంట్లలో ధైర్యం, స్థైర్యం పాదుగొలిపేలా మాట్లాడటమూ అవసరమవుతుంది.సమస్య ఎందుకొస్తుందంటే... సాధారణంగా మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్... వారి ప్రైవేట్ పార్ట్స్ను తేమగా ఉంచుతుంది. కానీ మెనోపాజ్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ పొడిబారిపోవడం (ఇలా పొడిబారడం వల్ల ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి), సాగే గుణం తగ్గడంతో కండరాలు స్టిఫ్గా మారడంతో మూత్రవిసర్జనలో నొప్పి, మంట, తీవ్రమైన అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.డాక్టర్ సిందూరి గోరంట్ల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!
బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్లాస్ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్ ప్రాక్టీషనర్ డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్లాస్ కోసం వచ్చారని అన్నారు. సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి వాపు, ఎల్డీఎల్ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్డైట్ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.రెండుపూటలా తినడం..ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వండినిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించారుతరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండిబర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.రోజుకు 30-40 నిమిషాలు నడవండినిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.స్థిరంగా ఉండండిబరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్లాస్ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్. 2.5 months.One couple.Simple home-cooked food.✅ Results:• Weight ↓ 7 kg (both)• HbA1c improved• LDL cholesterol ↓• Waist ↓ ~3 inches• Constipation resolved• Energy levels ↑No crash diets.No supplements.Just disciplined nutrition. pic.twitter.com/d2302h5Iti— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) March 9, 2026 (చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..) -
109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్ డాక్టర్..!
సుదీర్ఘ పనిగంటలు, ఒత్తిడి, వర్కౌట్ల లేమి తదితరాల వల్ల బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు స్థిరమైన అలవాట్లతోనే బరువుకి చెక్పెట్టగలరు. శాశ్వత ఫలితాలు కావాలనుకుంటే క్రమశిక్షణతో కూడిన స్థిరత్వం అత్యంత ప్రధానం అని చెబుతున్నారు నిపుణుల. ఇక్కడ వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఈ డయాబెటిస్ డాక్టర్ కూడా..సుదీర్ఘ పనిగంటలతో బిజీగా ఉంటూ..వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుక్నుఆడు. ఎందరో రోగులకు బరువు తగ్గడంపై శిక్షణ ఇస్తూ..వారికి ఆరోగ్య సూచనలిచ్చే వ్యక్తి వ్యక్తిగత హెల్త్, జీవనశైలి సవ్యంగా లేదు. ఫలితంగా ఊబకాయం బారినపడి ఇబ్బందిపడ్డాడు. విచిత్నం ఏంటంటే తన క్లినికల్ అనుభవంతో సాధ్యమైనంత తొందరగానే ఆ సమస్య నుంచి బయటపడి వెయిట్లాస్ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడు ఈ అధిక బరువుని ఎలా జయించాడంటే..ఆ డాక్టరే న్యూఢిల్లీ చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్మోహన్ అరోరా. వృత్తిరీత్యా అత్యంత బిజీగా ఉండటం, లేట్నైట్ మీటింగ్స్ తదితరాల కారణంగా సరైన ఆహారపు అలవాట్లు ఉండేవి కావు. మద్యం సేవించడం, బయట తినడం, తీపి పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. శారీరక శ్రమ అన్నదే అతని దైనందిన జీవితంలో దాదాపుగా లేదని చెప్పొచ్చు. దాంతో అతడు దాదాపు 109 కిలోల బరువుకి చేరుకున్నాడు. అది ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసింది కూడా. దాంతో అరోరా ఎలాగైనా స్లిమ్గా మారాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. అయితే వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతుల జోలికిపోకుండా..వ్యాయామం, సక్రమమైన జీవినశైలిపై దృష్టి పెట్టాడు. ఈ పద్ధతులు అతడి బాడీలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడమే గాక, కండర ద్రవ్యరాశిని రక్షించడం, తగినంత నిద్ర పోవడం వంటి అలవాట్లతో మెరుగైన ఫలితాలు అందుకున్నారు. ప్రభావవంతమైన మార్పుతో కొద్దికాలంలోనే స్లిమ్గా మారిపోయాడు. అలా 72 కిలోల ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాడు. ఇలా బరువు తగ్గడంతో ఏ పనైనా సునాయాసంగా చేసేలా యాక్టివ్గా మారింది శరీరం. ఈ వెయిట్లాస్ జర్నీలో కడరాలు కోల్పోకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకున్నానని, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరిచానని అన్నారు. అన్నీట్లకంటే ఏ మార్పు అయినా స్వీకరించేందుకు ముందుకు వచ్చినప్పడూ..స్థిరత్వంతో కూడిన సహనం, క్రమశిక్షణ చాలా అవసరమని, అప్పుడే అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోగలమంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు అరోరా. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!) -
వెల్నెస్ డ్రింక్స్ మంచివేనా?
ఇటీవల కొన్ని పోషకాహార పదార్థాలూ, ఖనిజ లవణాలతో కూడిన పదార్థాలు చేర్చిన పానీయాలు చాలా ఎక్కువ ్రపాచుర్యం పొందుతున్నాయి . వీటినే వెల్నెస్ డ్రింక్స్గా పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్యం కోసం వీటిని తీసుకోవాలంటూ కొంతమంది ఆహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు కూడా. అయితే కొందరు మాత్రం వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వెల్నెస్ డ్రింక్స్ తీసుకోవడం ఏ మేరకు ప్రయోజనం... ఎంత వరకు సహాయపడతాయనే అంశాలను పరిశీలిద్దాం...మాక్టెయిల్స్ పేరిట మంచి రుచికరమైన పానీయాలు ఎప్పటినుంచో ఉన్నవే. కాకపోతే ఇటీవల వెల్నెస్ డ్రింక్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్లో ఈ వెల్నెస్ డ్రింక్స్ అవి తయారు చేసే పద్ధతులను పెడుతూ, వాటిని తీసుకుంటే ఆరోగ్యమూ, వ్యాధినిరోధక శక్తి సమకూరతాయంటూ చెబుతున్నారు. వాటి తాలూకు ఉపయోగాలూ, పరిమితులు చూద్దాం...వీటిల్లో ఏముంటాయంటే... మామూలు మాక్టెయిల్స్లో సాధారణ సోడా డ్రింక్స్తో పాటు అనేక రకాల రుచికరమైన ఎసెన్స్లను కలిపి తయారు చేస్తారు. ఒకటికంటే ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టే మాక్టెయిల్స్ అని పిలుస్తారు. అయితే వీటిల్లో ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్లు, ఖనిజలవణాలూ, యాంటీ ఆక్సిడెంట్స్,ప్రోబయాటిక్స్, కొబ్బరినీళ్లు, గ్రీన్ టీ...లతో పాటు... పసుపు, అల్లం, కొలాజెన్, అడాప్టోజెన్స్ సమృద్ధిగా ఉండే పదార్థాలు వాడతారు. అడాప్టోజెన్స్ అంటే మొక్కల నుంచి లభ్యమయ్యే మెడిసినల్ విలువలుండే రకరకాల పదార్థాలు. వీటిని తీసుకోగానే ఒక ఆనందకరమైన భావన (యుఫోరియా ఫీలింగ్) కలుగుతుంది. ఉదాహరణకు... కొబ్బరినీరు తీసుకోగానే కలిగిన మంచి ఫీలింగ్స్ లాంటివి. అల్లం వాడగానే గొంతులోని శ్లేష్మం వదిలిపోయిన భావనల్లాంటివి.ప్రధానంగా మెగ్నీషియమ్ డ్రింక్స్... ఈ వెల్నెస్ డ్రింక్స్లో ప్రధానంగా మెగ్నీషియమ్తో చేసినవి ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే మెగ్నీషియమ్ లవణాలు మెదడును ప్రశాంతంగా ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ అయిన ‘గాబా’ (గాబా అమైనో బ్యూటెరిక్ యాసిడ్కు సంక్షిప్త రూపం)ను క్రియాశీలం చేయడం ద్వారా మెదడును... తద్వారా మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. దాంతో దేహం ‘రెస్ట్ అండ్ రిపేర్’ మోడ్లోకి వెళ్తుందన్నది నిపుణుల మాట. ఇలా మెగ్నీషియమ్ ప్రధానంగా ఉండేవాటిల్లో కొన్ని...∙మెగ్నిషియమ్ గ్లైసినేట్ ప్రధానంగా ఉన్నవి మంచి నిద్రపట్టడానికీ, యంగై్జటీ తగ్గడానికీ ∙మెగ్నీషియమ్ టారేట్ ఉన్నవి నరాల వ్యవస్థను ఎగై్జట్ కాకుండా కామ్గా ఉంచడానికీ ∙మెగ్నీషియమ్ సిట్రేట్ ఉన్నవి బాగా నిద్రపట్టడంతో పాటు తేలిగ్గా విరేచనమయ్యేలా చేసి మలబద్ధకం తొలగించడానికి ఉపయోగపడతాయి.ఏయే పదార్థాలతో తయారు చేస్తారంటే... సాధారణంగా పింక్ రంగులో చాలా కలర్ఫుల్గా ఉండే ఈ డ్రింక్స్లో టార్ట్ చెర్రీ జ్యూస్, మాగ్నీషియం ΄÷డి, స్పార్క్లింగ్ వాటర్తో తయారు చేస్తారు. వీటిల్లో మెగ్నీషియమ్ ఖనిజాలే కాకుండా అరటిపండ్లు, కివీ పండ్లు, అవకాడో పండ్లు, ఆకుకూరలలో పాలకూర (స్పినాచ్) వంటివీ ఉపయోగిస్తారు. పాలు కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు పాలలో ఉండే ‘ట్రి΄÷్టఫాన్’ అనే అమైనో యాసిడ్ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే మెదడు రసాయనాన్ని స్రవింపజేసి హాయిగొలిపే నిద్రను ఇస్తుంది. అలాగే పండ్లతో కూడిన ఈ వెల్నెస్ డ్రింక్స్లో స్వాభావికంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ ఉండటంతో ఆరోగ్య నిర్వహణకు బాగానే తోడ్పతాయి.ఆహార నిపుణులఅభిప్రాయాల మేరకు... ప్రయోజనాలేమిటంటే... మెగ్నీషియమ్ లవణాలూ, ఖనిజాలూ, విటమిన్ బి–12, ఐరన్ వంటి పోషకాలూ, ఆహారంలో లభ్యమయ్యే పీచు (ఫైబర్)లు స్వాభావికమైన పదార్థాలతోనే సమకూరడం వల్ల ఈ పోషకాలన్నీ సప్లిమెంట్లలా మనకు మామూలుగా దొరుకుతాయి. దాంతో ఆ ఆహార లోపాలేవైనా (విటమిన్ / మినరల్ డెఫిషియెన్సీస్) ఉంటే అవి నేచురల్గానే భర్తీ అవుతాయి. ఇకప్రోబయాటిక్స్ వంటి వాటివల్ల జీర్ణకోశ ఆరోగ్యం (గట్–హెల్త్) మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పానీయాలతో దేహంలోని సెల్ రిపేర్స్ జరుగుతుంటాయి. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసేవారికీ, సరైన నిద్రలేనివారికి ఇవి కొంతవరకు తోడ్పడతాయి.పరిమితులేమిటంటే... ఈ వెల్నెస్ డ్రింక్స్ అన్నవి మామూలుగా పోషకలోపాలు ఉన్నవారికి ఇచ్చే ‘న్యూట్రస్యూటికల్ మెడిసిన్స్’ లాంటివే. అంటే విటమిన్ సప్లిమెంట్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ, కంటినిండా నిద్రపోతూ, సరైన వ్యాయామం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇవి అదనంగా సమకూరుతూ దేహ ఆరోగ్యాన్ని కొంతమేరకు బూస్ట్ చేయడానికి పనికి వస్తాయి. అంతే తప్ప... మిగతా పోషకాహారాలకూ, వ్యాయామలేమికీ ఇవి ప్రత్యామ్నాయంగా గానీ లేదా కొన్ని ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాలుగా పనిచేయవు. కాకపోతే వీటివల్ల నష్టమేదీ లేనందున అదనంగా తీసుకోవడంలో తప్పేమీ ఉండదు. వెల్నెస్ డ్రింక్స్ అనేవి ఆరోగ్యకరమైన జీవనశైలికి కొంతమేరకు తోడ్పడవచ్చు గానీ అవి మాత్రమే మన ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చివేయలేవని గుర్తించాలం’’టూ ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.నిర్వహణ: యాసీన్ -
ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!
భారతదేశంలో గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్లో గట్టి ప్రభావం చూపిన కొద్దిమంది వ్యక్తులలో మిలింద్ సోమన్ ఒకరు. సాధారణంగా ప్రతీ ఒక్కరూ రిటైర్ మెంట్ తీసుకునే 60 సంవత్సరాల వయస్సులో ఆయన యువ తరానికి గొప్ప ప్రేరణగా మారాడు. కానీ, సోమన్ తనను తాను ప్రేరణగా భావించుకోడు, అది మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నదని గమనించడంలోనే తేడా ఉందని అంటాడు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించలేదని ఆయన అంటున్నాడు. అయితే కొందరైనా ప్రేరణ పొందినందుకు తనకు సంతోషంగా ఉందన్నాడు. మిళింద్ సోమన్ 1990లలో సూపర్ మోడల్గా నిలిచాడు. ఆ తర్వాత జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్లలో నటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీటికి అదనంగా, అతను రన్నింగ్ ట్రాక్పై తనకు సాటిలేని స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు సుదూర ప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అసాధ్యమైన పరిస్థితులను పరుగుతో కవర్ చేశాడు.మనం మహిళలకు మాత్రమే ఒక ప్రత్యేక ఫిట్నెస్ ఈవెంట్ను సృష్టిస్తే? ఈ ప్రశ్నకు సమాధానంగా గత 2012లో, సోమన్ ఆయన భార్య అంకితా కోన్వర్లు కలిసి పింక్థాన్ను స్థాపించారు ఇప్పుడు ఆ ఈవెంట్ భారతదేశంలోనే అతిపెద్ద మహిళల పరుగు కార్యక్రమంగా అవతరించింది. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు అనుభవాలు పంచుకున్నారు.చాలా మంది కండలు తిరిగిన శరీరం అనుకుంటారని అయితే తన దృష్టిలో ఫిట్నెస్ అంటే అది ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అని ఆయన పేర్కొంటాడు. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, జీవితం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఇది సిక్స్ ప్యాక్స్ లేదా బైసెప్స్ గురించి అవి అందించే లుక్స్ గురించి కాదు. ఇది మన శరీరపు పనితీరు గురించి అని విశ్లేషిస్తున్నాడు.తాను దాదాపు 25 సంవత్సరాల క్రితమే పరుగు ప్రారంభించానని, కొంత కాలం తర్వాత చాలా మంది పరుగు ప్రారంభించారని, అలాగే కేవలం ముంబైలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గమనించానన్నాడు. అయితే మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి ఉండడం లేని పరిస్థితిలో.. మనం మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్ను సృష్టించాలని ఆలోచించానన్నాడు. అయితే వారు స్పందిస్తారా?అని తొలిదశలో సందేహించానన్నాడు. ఎందుకంటే చాలా మంది మహిళలు ఇప్పటికీ వ్యాయామం క్రీడలు అంటే పురుషుల కోసమే అని భావిస్తున్నారని..అయితే మేం ధైర్యంగా ముందడుగు వేశామన్నాడు. చీర ధరించి పరుగులు తీయడం, చీర ధరించి సైక్లింగ్ చేయడం, యోగా నడక...వంటివన్నీమేళవించి.. ఈ కార్యక్రమం తన కోసం కాదని ఏ మహిళా భావించకుండా దీనిలో భాగం చేశామని వివరించాడు. మహిళలు ఎవరికోసమో లేదా బయటి దానికోసమో కాదు, తమ కోసం తాము పరుగు తీయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning)(చదవండి: ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
యాపిల్ వాచ్లను ఇష్టపడని వారుండదరు. ఇవి మన ఆరోగ్యం, జిమ్కి సంబంధించి కేలరీల ఖర్చు, ఆరోగ్య సమాచారం వరకు అన్ని అందించే ఆధునిక పరికరం. చెప్పాలంటే గడియారానికి మించినది. మన బాడీలోని అతిముఖ్యమైన పార్ట్లా బాగమైపోయింది. కానీ ఈ యాపిల్ వాచ్లను ఆ విధంగా అస్సలు చూడొద్దని అంటున్నారు అమెరికా ఆరోగ్య నిపుణులు. మిమ్మల్ని ఆరోగ్యపరంగా అలర్ట్ చేసే గొప్ప సాధనమే అయినా..కేర్ఫుల్గా ఉండకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఎందువల్ల ఇలా అంటున్నారంటే..జేబులో ఉండే స్మార్ట్ఫోన్ లేదా డెస్క్పై ఉపయోగించే ల్యాప్టాప్లా కాకుండా..స్మార్ట్వాచ్ చాలా ప్రత్యేకమైనది. ఇది 24/7 మన సంరక్షణ కోసం రూపొందించిన సాధనంగా అందరికీ అత్యంత ప్రీతీపాత్రమైనది. ఈ వాచ్లపై ఉండే మక్కువతో దాని భద్రత గురించి పెద్దగా అస్సలు పట్టించుకోరు కూడా. కానీ ఈ పరికరం గంటల తరబడి రేడియోఫ్రీక్వెన్సీ(RF) సంకేతాలను నేరుగా మన కణజాలంలోకి పంపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఫ్రీక్వెన్సీలను గ్రేడ్ 2B కార్సినోజెన్లుగా పేర్కొంది. ఆయా సంస్థలు ఈ వాచ్లో ఉద్గారాలు పరిమితుల్లో ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. దీని పరిమితులు మనం నిద్రిస్తున్నపుడూ కూడా చేతికే ధరించేంత సురక్షితంగా రూపొందించింది మాత్రం కాదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇది కేవలం రేడియేషన్ మాత్రమే కాదు..దాని చుట్టూ ఉండే హై-ఎండ్ 'ఫ్లోరోఎలాస్టోమర్' బ్యాండ్లు తరుచుగా PFAS లేదా ఎక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రకారం, ఫ్లోరినేటెడ్ సింథటిక్ రబ్బరుతో తయారు చేసిన ఖరీదైన రిస్ట్బ్యాండ్లు ముఖ్యంగా అధిక స్థాయిలో రసాయనాలు ఉంటాయని 2024 జరిపిన అధ్యయనాల్లో తేలింది. దీనిలో PFAS సమస్య ఉందనేది వాస్తవమే అని నిరూపితమైంది. అందువల్ల దీన్ని గనుక దీర్ఘకాలంపాటు మణికట్టు వద్ద ధరిస్తే..ఈ రసాయనాలు చర్మం, రక్తప్రవాహంలోకి చొచ్చుకుపోతాయని అంటున్నారు నిపుణులు. ఈ PFAS విచ్ఛిన్నం కానందున, అవి కాలక్రమేణా అవయవాలలో పేరుకుపోతాయి. అవి కాస్తా కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడిని కలుగజేసి అనారోగ్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంతేగాదు హార్మోన్లు ఇన్బ్యాలెన్సింగ్కి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు పరీక్షించిన 22 ప్రముఖ బ్యాండ్లలో 15 ఈ విషపదార్థాలను కలిగి ఉన్నాయని, అందులోనూ అధిక ధర కలిగిన ప్రీమియం బ్యాండ్లలో ఈ సమస్య మరింత ఎక్కువని అంటున్నారు.ఇది అవగాహన..సంరక్షణ కోసమే..ఇది లేనిపోని భయాలు కలుగజేసందుకు కాదని అవగాహన కల్పించేందుకేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఆపిల్ వాచ్ శక్తిమంతమైన సాధనమే కానీ..దాన్ని మన శరీరంలోని సహజ భాగంగా పరిగణించొద్దని హెచ్చరిస్తున్నారు. సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే.. సాంకేతిక ప్రయోజనాలు పొందేలా సురక్షితంగా ఎలా ఉపయోగిస్తే మంచిదంటే..సింథటిక్ ఫ్లోరోఎలాస్టోమర్ బ్యాండ్లను సేంద్రీయ తోలు, స్టెయిన్లెస్ స్టీల్ లేదా జనపనార వంటి సహజ పదార్థాలతో ఉపయోగించేందుకు ప్రయత్నించండివర్కింగ్ టైంలో లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాచ్ను తీసివేయండిపడుకునే ముందు వాచ్ ధరించడం మానేయండి. నిద్ర అంటే శరీరం నిర్విషీకరణపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ సమయంలో ఇతర రసాయనాలకు గురికావడం వల్ల సహజమైన నిద్ర ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Zib - Ayus Wellness - Health Optimisation | Mindset | Longevity (@ayuswellnessuk) (చదవండి: జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర) -
జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర
దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య అధిక బరువు అందర్నీ వేధిస్తున్న సమస్యగా మారింది. గంటల తరబడి కూర్చొని చేసే డెస్క్ ఉద్యోగాలు, కదలికలు లేకపోవడం, వీటికి తోడు జంక్ ఫుడ్ ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయి. దీన్ని తగ్గించుకోవాలని ఎంతో ప్రయాసపడి కఠిన డైట్లు అనసరించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా ఈ మిరాకిల్ పద్ధతిని అనుసరించి త్వరితగతిన బరువు తగ్గొచ్చని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ జెసికా ఆర్ట్వానీ. అదెలాగో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తాను ఆ పద్ధతిలోనే దాదాపు 26 కిలోలు బరువు తగ్గినట్లు తెలిపారు కూడా. మరి ఆ మిరాకిల్ టెక్నిక్ గురించి సవివరంగా తెలుసుకుందామా..!.చాలామంది బరువు తగ్గేందుకు షార్ట్కట్లు, తీవ్రమైన దినచర్యలు అనుసరిస్తుంంటారు. నిజానికి బరువు తగ్గడం అనేది సాధారణంగా స్థిరంగా చేసే చిన్న అలవాట్ల వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. గతేడాది నుంచి తాను చిన్ని చిన్న సాధారణ అలవాట్లపై దృష్టిపెట్టి 26 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. తనకు ఈ 26 కిలోలు బరువు తగ్గడానికి ఆ ఐదు సాధారణ అలవాట్లు హెల్ప్ అయ్యాయని చెబుతోంంది. త్వరితగతిన బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఓ అద్భుతమైన పద్ధతని అభివర్ణిస్తోంది. తాను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్లు, ఖరీదైన ఫిట్నెస్ ప్రోగ్రామ్లు పాటించలేదని చెబుతోంది జెసికా. తన వెయిట్లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను బరువు తగ్గడానికి స్థిరంగా ఈ ఐదు పనులు చేశానని తెలిపింది. ఎలాంటి ఫ్యాన్సీ హ్యాక్స్, షార్ట్కట్లు లేవని అంటోంది. సహాయపడిన ఆ ఐదు అలవాట్లు..వీలైనంత ఎక్కువగా నడవడం: నడక తన దినచర్యలో అతిపెద్ద మార్పులలో ఒకటి. సాధ్యమైనప్పుడల్లా తన రోజులో కదలికను ఒక భాగంగా చేసుకున్నానని జెసికా చెప్పింది. ఆమె మార్నింగ్ వాకింగ్, భోజనం తర్వాత రాత్రి తప్పనిసరిగా కొద్దిసేపు నడక చేసినానని వివరించారామె.ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తగ్గించడం: ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తొలగించానని తెలిపింది. అంటే అప్పుడప్పుడూ కనీసం దాని జోలికి పోలేదని, పూర్తిగా దూరం పెట్టానని చెప్పుకొచ్చింది. ఎక్కువ నీరు త్రాగడం: ఆమె దృష్టి సారించిన మరో అలవాటు హైడ్రేషన్. కానీ తగినంత నీరు త్రాగడం చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. ఇది చాలా శక్తిమంతమైన మార్పుకి నాంది అని అంటోంది. ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం: ప్రోటీన్ తన భోజనంలో కీలక పాత్ర పోషించిందని చెబుతోంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి పైగా అనవసరమైన చిరుతిండిని తగ్గిస్తాయి. ఇక్కడ ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినందించి, ఆకలి కోరికలను నియంత్రిస్తుంది.ఒక సవాలు పెట్టుకోవడం: తాను అనుకున్నట్లుగా అన్ని పాటించానా లేదా అనే సెల్ఫ్ చెకింగ్ లేదా జవాబుదారితనం తనకు బరువు తగ్గాలనే ఆకాంక్షను రెట్టింపు చేసేదట. దాంతో చాలా కేర్ఫుల్గా ఉండటమే గాక తనను తాను ప్రశ్నించుకునేటప్పడూ..దోషిలా ఉండకూదన్న భయం సదా వెయిట్లాస్ అయ్యేందుకు ప్రేరేపించేదట.ఇక్కడ జెసికా వెయిట్లాస్ జర్నీలో ..బరువు తగ్గాలంటే తీవ్రమైన మార్పులు, అతి వర్కౌట్లు అవసరం లేదు. కేవలం చిన్న అలవాట్లే స్థిరంగా.. కంటిన్యూటీ మిస్ కాకుండా చేస్తే చాలు బరువు తగ్గడం చాలా సులభమని తెలుస్తోంది కదూ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
ఆ నిర్ణయం ఆ జంటను హెల్దీగా మార్చింది..! ఏం చేశారంటే..
ఆరోగ్యం, వ్యాయామాలు సామాన్యుల వల్ల ఎక్కడవుతుంది అన్నమాటలు ఎన్నోసార్లు విని ఉంటారు. బాగా డబ్బున్నవాళ్లకు, యువతకు మాత్రమే సాధ్యం అనేది చాలామంది భావన. వాళ్లకు ఏ బాధ్యతలు, బరువులు అంతగా ఉండవు కాబట్టి హాయిగా చేయగలరని అనుకుంటుంటారు. కానీ ఈ మధ్యతరగతి జంట గురించి విన్నాక ఆ అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. 50లలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మేల్కొని విజయం సాధించడమే గాక..ఇతరులకు స్వచ్ఛందంగా ఆరోగ్యస్పృహ కలిగిస్తున్నారు. మరి ఆ జంట ఫిట్నెస్ ప్రయాణం ఎలా సాగిందంటే..చాలామందికి ఫిట్నెస్ అనేది యువతకు చెందినదిగా అనిపిస్తుంది. పెద్దలకు సుదీర్ఘ పనిదినాలు, కుటుంబ బాధ్యతలు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేలా చేస్తాయి. కనీసం శరీరం చెప్పే సంకేతాలను కూడా పట్టించుకోరు. తమ ఆరోగ్యం కంటే..కుటుంబ బరువు బాధ్యతలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలానే భావించారు డెహ్రాడూన్కు చెందిన తారా థాపా ఆయన భార్య సుశీలా. తార ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ రిపేర్ షాపుని నడుపుతుండగా, సుశీల బీమా సలహాదారుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరి ఫోకస్ కుటుంబ బాధ్యతలపైనే ఉంది. తమ ఇద్దరు కుమారులను పెంచడం, ఓ చక్కటి ఇంటిని నిర్మించుకోవడం ఇవే తమ ఆశయలు, జీవితం అన్నట్లుగా బతికారిద్దురు. అనుకున్నట్లుగా కుమారులు చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ఒకరు సోలార్ పర్మిట్ డిజైనర్గా, మరొకరు కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్నారు. కానీ అప్పటికే ఆ జంటను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తారాకి తీవ్రమైన వెన్నునొప్పి, సుశీల నిరంతర అలసట, పునరావృతమయ్యే మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డారు ఇద్దరూ. అప్పుడే ఇరువురికి తమ శారీరక పరిమితులను అంగీకరిస్తూ ఆగిపోకూడదని అనిపించింది. ఆ అనారోగ్య సమస్యలను సవాలు చేసేలా.. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. 2017లో, తార ఫిట్నెస్పై తీవ్రంగా దృష్టి పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసి భార్య సుశీల రెండేళ్ల తర్వాత 2019లో ఆయన బాటలోనే నడిచింది. అలా ఈ జంట రోజు సూర్యోదయానికి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. ఉదయం ఐదు గంటలకల్లా..వ్యాయామాలు చేయడానికి, వాకింగ్కి రెడి అయిపోతారు. కొండలలో నివసించడం వల్ల వారు ప్రకృతిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మారింది. తరచుగా డెహ్రాడూన్ చుట్టూ ఉన్న పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేస్తూ సెలవులను ఆస్వాదిస్తుంటారు. భోజనంలో కూడా పప్పులు, కూరగాయలు, కాలనుగుణ పండ్లను భాగం చేసుకునేవారు. పండుగల సమయంలో కూడా, వారు అతిగా తినడం కంటే సమతుల్యతపే పాటిస్తూ.. మితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయాణం తమ సొంత ఇంటిని దాటి ప్రేరేపించడం మొదలైంది. మూడేళ్ల క్రితం సుశీల పింక్ పాంథర్ అనే మహిళా సమూహాన్ని ప్రారంభించారు. ఈ బృందంలో మహిళలు సౌకర్యవంతమైన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి ఫిట్నెస్ను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు తమ ఇళ్లను వదిలి వెళ్ళడానికి కూడా సంకోచించిన చాలా మంది సభ్యులు ఇప్పుడు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుండటం విశేషం. అంతేగాదు ఈ జంట తమ ఫిట్నెస్ ప్రయాణాన్ని ఆన్లైన్లో పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి కథ చాలమందికి కనెక్ట్ అయ్యి..ఎందరినో ప్రేరేపించింది. ఈ జంట వ్యక్తిగత వృద్ధి వాయిదాగా మారకూడదని, వయసు ఎప్పుడూ సాకుగా మారకూడదని తమ చేతలతో చెప్పకనే చెప్పారు కదూ. నెటిజన్లు సైతం చాలా స్ఫూర్తిదాయకం అని ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికే. అనుసరించే ముందు వ్యక్తిగత సమస్యలను పరిగణనలోనికి తీసుకోవాలి, అలాగే వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!) -
పాత ఆలోచనా విధానాన్ని కూల్చేయండి
ఇప్పటివరకు మనల్ని మనం గమనించాం, మన లోపాలను గుర్తించాం, మన మెదడు మనకు చెప్పే అబద్ధాలను పట్టుకున్నాం. ఇప్పుడు ఆ పాత పునాదిని పూర్తిగా కూల్చివేసి (Break), కొత్తదానికి సిద్ధమయ్యే సమయం. ఎందుకంటే, పాత భవనం మీద కొత్త ఇల్లు కట్టలేం కదా! మన పాత పర్సనాలిటీని ఎలా 'బ్రేక్' చేయాలో చూద్దాం.పర్సనాలిటీ డెవలప్మెంట్లో 'బ్రేక్' చేయడం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కాదు, మనల్ని మనం పరిమితం చేస్తున్న ఆ పాత 'ఐడెంటిటీ' (Identity) ని వదిలించుకోవడం. దీనినే సైకాలజీలో 'De-conditioning' అంటారు. మీరు ఇన్నాళ్లూ నమ్మిన 'నేను' అనే వ్యక్తి, కేవలం పరిస్థితులు సృష్టించిన ప్రతిబింబం మాత్రమే. ఆ ప్రతిబింబాన్ని ఇప్పుడు తుడిచేయాలి.1. పాత పునాది ఎందుకు కూలిపోవాలి?చాలామంది తమ పాత అలవాట్లను, పాత భయాలను ఎందుకు వదలలేకపోతారంటే, అవి వారికి సుపరిచితమైనవి. అవి మనకు కష్టం కలిగించినా, అవి మనకు తెలిసినవి కాబట్టి వాటిని వదలడానికి భయపడతాం.పాత ఆలోచనలు = మీ గతం.కొత్త పర్సనాలిటీ = మీ భవిష్యత్తు.ఈ రెండింటికీ మధ్య ఒక గ్యాప్ ఉంటుంది, అదే 'The Void' (శూన్యం). ఈ శూన్యంలోకి వెళ్లడానికి చాలామంది భయపడతారు. కానీ, ఆ శూన్యమే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది!2. కూల్చివేతకు కావాల్సిన మూడు ఆయుధాలుమీ పాత ఐడెంటిటీని బ్రేక్ చేయడానికి మీకు మూడు ముఖ్యమైన ఆయుధాలు కావాలి.Radical Honesty: మీకు మీరు అబద్ధం చెప్పుకోవడం మానేయాలి. "నాకు కోపం రాదు" అని అబద్ధం చెప్పే బదులు, "నేను అతిగా రియాక్ట్ అవుతున్నాను, అది నా బలహీనత" అని ఒప్పుకోవాలి. నిజం మాట్లాడటం మొదలుపెడితే, పాత అబద్ధపు గోడలు దానంతట అదే కూలిపోతాయి.Detachment: మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు మాత్రమే మీరు కాదు. కోపం వచ్చినప్పుడు "నేను కోపంగా ఉన్నాను" అనడం కంటే, "నాలో కోపం అనే భావం కలుగుతోంది" అని అనండి. ఆ ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు వేరు (Detach) చేసుకున్నప్పుడే మీరు వాటిని బ్రేక్ చేయగలరు.Destruction of Comfort Zone: ప్రతిరోజూ మీకు భయం కలిగించే చిన్న పనిని చేయండి. మీ పాత వ్యక్తిత్వం ఎక్కడైతే ఆగిపోతుందో, అక్కడ మీరు అడుగు వేయండి.3. మార్కెట్ మోటివేషన్ vs రియల్ సైకాలజీమార్కెట్ "నేను గెలుస్తాను, నేను తోపు" అని అరుస్తూ గోడలను బద్దలు కొట్టమంటుంది. ఇది తాత్కాలిక జోష్.సైకాలజీ (CBT & Mindfulness) గోడలను కొట్టడం కాదు, ఆ గోడలు అసలు ఎందుకు కట్టామో (పాస్ట్ ట్రామాస్) అర్థం చేసుకుని, వాటిని ఇటుక ఇటుకగా విడదీయమంటుంది. అప్పుడే మళ్ళీ ఆ గోడలు కట్టే అవకాశం ఉండదు.4. మీ నూతన నిర్మాణానికి సిద్ధం!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ కూల్చివేత ప్రక్రియ ఎలా ఉండాలి?Step 1: Break (అహాన్ని వదిలేయడం)మీరు ఇన్నాళ్లు కాపాడుకున్న ఆ 'ఇమేజ్'ని వదిలేయండి. "నేను అంటే ఇలాగే ఉంటాను" అనే ఫిక్స్డ్ మైండ్సెట్ను వదిలేయండి. మీ పాత ఐడెంటిటీని 'డీ-కన్స్ట్రక్ట్' (Deconstruct) చేయండి. ఇది నొప్పిగా ఉంటుంది, కానీ ఇది అవసరం.Step 2: Build (నిశ్శబ్దం)పాత పర్సనాలిటీ కూలిపోయిన తర్వాత, కొత్తది కట్టే ముందు కొద్ది రోజులు 'నిశ్శబ్దం'గా ఉండండి. ఏ ప్లాన్లు లేని, ఏ లేబుల్స్ లేని ఒక శూన్య స్థితిలో ఉండండి. అక్కడే మీ అసలైన పర్పస్ (Purpose) పుడుతుంది.Step 3: Beyond (కొత్త ప్రతిబింబం)ఇప్పుడు మీరు కొత్త ఇటుకలతో, కొత్త ఆలోచనలతో మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. ఈసారి ఇది మీ ఛాయిస్, సమాజం వేసిన అచ్చు కాదు. ఇదే మీరు 'Beyond' స్టేజ్లోకి వెళ్ళే మార్గం.5. మీ పాత వ్యక్తిత్వానికి వీడ్కోలు!ఈ రోజు ఒక చిన్న విచారణ చేయండి.* మీ పాత ఐడెంటిటీలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టిన ఒక లక్షణం ఏది?* ఆ లక్షణాన్ని వదిలేస్తే, మీరు పోగొట్టుకునేది ఏంటి? (బహుశా అది ఒక భద్రత కావచ్చు).* ఆ భద్రతను వదిలి, కొత్తగా మారుతానని మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి.కూల్చండి.. అప్పుడే నిర్మించగలరు!బ్రో, పాత గోడలను కూల్చడం బాధాకరమే కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ గోడల వల్ల మీరు ఇప్పటివరకు ఎంతో పరిమితంగా బతికారు. ఇప్పుడు ఆ పరిమితులు లేవు. మీరు గాలిలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు."Sometimes, you have to break yourself to become whole."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..
కొందరు వయసు గడుస్తున్న కొద్దీ.. వృద్ధుల్లా కనిపించరు. యంగ్లుక్లో యువకుల మాదిరిగా ప్రకాశవంతంగాకనిపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. అస్సలు అదెలా సాధ్యం అనిపిస్తుంది కూడా. వయసు రీత్యా అంత ఏజ్ ఉన్నా కూడా.. ఏ మాత్రం వృద్ధాప్య ఛాయలు కనుచూపు మేరలో కూడా కానరావు. ఇక్కడ ఈ మోడల్ కూడా అదే కోవకు చెందినవాడు. ఎవరతను అంటే..సింగపూర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, మోడల్ చువాండో టాన్కి మార్చి 03, 2026న అధికారికంగా 60 ఏళ్లు నిండాయి. కానీ దశాబ్దాలుగా టీనేజ్ యువకుడిలా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అతడి యంగ్లుక్ అందర్నీ విస్మయపరుస్తుంటుంది. కనీసం మచ్చుకైనా వృద్ధాప్య ఛాయలు ఎక్కడ కానరావు. అంతలా మెయింటైన్ చేస్తున్నా అతడి గ్లామర్ రహస్యం ఏంటో తెలసుకోవాలన్న కుతుహలం అందరిలోనే రేకెత్తిస్తుంటుంది. మరి అంతలా యవ్వనంగా కనిపించాలంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసా..!?.లైఫ్స్టైల్ ఎలా ఉంటుందంటే..ఎలాంటి బ్యూటీ చికిత్సలు తీసుకోడు. దీర్ఘకాలిక క్రమశిక్షణయుత జీవనమే మేలుబ్రేక్ఫాస్ట్: గుడ్లు, తేనె, అవకాడోతో ప్రోటీన్ షేక్స్ లేదా ఓట్మీల్ అల్పాహారాన్ని తీసుకుంటానని తెలిపాడు. లంచ్ లేదా డిన్నర్:భోజనంలో సాధారణంగా ఉడకబెట్టిన లేదా కాల్చిన చికెన్ లేదా చేప, రసం విత్ రైస్ ఉంటాయి. తప్పనిసరిగా వర్కౌట్లు. ఇవి కేలరీలు బర్న్ చేయడానికి సమతుల్యతను బ్యాలెన్స్ చేసేలా డైట్ అత్యంత ముఖ్యమని చెబుతున్నాడు. పగటిపూట చేసే కార్యకలాపాలు ఆ రోజుల్లో మీరు బర్న్ చేసే కేలరీలకు సమానంగా ఉండాలని చెబుతున్నాడు. నాణ్యమైన నిద్ర తప్పనిసరి. ఒత్తిడిలేని సానుకూల మనస్తత్వం అత్యంత ముఖ్యం. ఆరోగ్యమైన వృద్ధాప్యానికి ఇవి అత్యంత కీలకమని చెబుతున్నాడు టాన్. అయితే తాను మద్యం, కాఫీ, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడట. వారానికి మూడు నుంచి ఐదు సార్లు బల శిక్షణ, కార్డియో వ్యాయామాలు, ఈత తదితరాలు ఉంటాయట. కాగా, టాన్ ఇటీవల కొద్దికొద్దిగా వృద్ధాప్యంలో దరిచేరే కొద్దిపాటి శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. సహజంగా కాలంతో వచ్చే వృద్ధాప్యాన్ని ఆపలేమని, కాకపోతే దాన్ని హెల్దీగా మార్చుకుంటే..ఆరోగ్యకరమైన వార్దక్య జీవితాన్ని గడపొచ్చని టాన్ చెబతున్నాడు. అంతేగాదు అతడి పోస్ట్ల్లో సైతం ఆసక్తికరమైన సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటాడు. వాటిని చూస్తే అవగతమవుతోంది ఫిట్నెస్ పట్ల ఎంత కేర్గా ఉంటాడనేది. కాగా, టాన్ తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. సమయాన్ని నిజమైన సంపదగా పేర్కొన్నాడు. ప్రతి సూర్యోదయం చూసేలా, అనుభవించేలా చేస్తున్నందుకు, ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నందకు సదా కృతజ్ఞుడును. ప్రతి రోజు ప్రకృతిలో గడపడం, సూర్యకాంతిలో గడపడం మిస్ చేసుకోవద్దు అని రాసుకొచ్చాడు పోస్ట్లో. సింపుల్గా చెప్పాలంటే సమయం, ఆరోగ్యం అత్యంత విలువైనవని, వాటిని నిర్లక్ష్యం చేస్తే.. అన్ని దూరమైపోతాయని చెప్పకనే చెప్పాడు టాన్. View this post on Instagram A post shared by CHUANDO TAN 陈传多 (@chuando_chuandoandfrey) (చదవండి: ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!) -
జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!
శీతాకాలం కంటే వేసవికాలంలో బరువు తగ్గడం చాలా సులభం. అందులోనూ ప్రస్తుతం చలికాలం ముగిసి.. వేసవికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ఇన్నాళ్లు చలికి భయపడి ముసుగుతన్ని పడుకున్న వాళ్లంతా ఒక్కసారిగా ఈ మండే ఎండల్లో అయినా కొలెస్ట్రాల్ తగ్గించుకుని బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివాళ్లు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ డాన్ గో నెట్టింట షేర్ చేసిన పదహారు రూల్స్ తప్పక ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన వేసవి సమీపించగానే చాలామంది వెయిట్లాస్కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెయిట్లాస్ టిప్స్ షేర్ చేశారు ఫిట్నెస్ కోచ్ డాన్గో. ఆరోగ్యప్రదంగా తక్కువ టైంలో కిలోల కొద్ది బరువు తగ్గి.. మెరుగైన ఫలితాలు సత్వరమే అందుకోవాలంటే ఈ పదహారు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.నిద్రకు కొన్ని గంటల ముందు తినకపోవడం..నిద్రవేళకు కనీసం మూడు నుంచి ఐదు గంటలు ముందు తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తీసుకోవడంలో కేర్.. శరీర బరువుని 12తో గుణించగా వచ్చిన మొత్తంని మీ రోజువారీ కేలరీలుగా కేటాయించండి. ఈ అసాధారణ సూత్రాన్ని తప్పక అనుసరించమని కోరారు ఫిట్నెస్ కోచ్.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం..రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ అవనసం. శరీర బరవుని ఏడుతో గుణిస్తే వచ్చిన మొత్తం మీర రోజువారిగా తీసుకోవాల్సిన ప్రోటీన్గా గుర్తించండి. ఈ విధానం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించుకుంటూ..కండరాలను నిర్మించడానికి, నిర్వహించొచ్చని చెబుతున్నారు. అందుకు ఈ మాత్రం ప్రోటీన్ తప్పనిసరి అని అన్నారు.ఆహారంలో జోడించాల్సిన ఆహారాలురోజువారీ ఆహారంలో ఏం చేర్చుకోవాలంటే..గ్రీకు పెరుగునీరు, కాఫీ, టీలీన్ గ్రౌండ్ బీఫ్ (వీలైతే అదనపు లీన్)చికెన్ బ్రెస్ట్ టర్కీ (గ్రౌండ్ లేదా బ్రెస్ట్)కొవ్వు చేపగుడ్లు, గుడ్డులోని తెల్లసొనకాటేజ్ చీజ్లీఫీ గ్రీన్స్బంగాళాదుంపలుషెల్ఫిష్బీన్స్, కాయధాన్యాలుబెర్రీలుఆపిల్, నారింజ, కివి, ద్రాక్షపండు వంటి అధిక ఫైబర్ పండ్లుఆకుపచ్చ క్రూసిఫెరస్ కూరగాయలుకాలీఫ్లవర్, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, మిరియాలు, ఆస్పరాగస్, దోసకాయలు వంటి ఇతర అధిక-పరిమాణ కూరగాయలురోజుకు రెండు పూటల భోజనం..ఫిట్నెస్ కోచ్ రోజుకు రెండు పూటలా భోజనం తీసుకునేలా చూసుకోమని సూచించారు.భోజన షెడ్యూల్లో తీసుకోవాల్సిన కేర్..ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన భోజన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంటుంది:పడుకునే ముందు 3 నుంచి 5 గంటల ముందు చివరి భోజనంనిద్రలేచిన 1 నుంచి 2 గంటల ముందు మొదటి భోజనంరెండవ భోజనం మధ్యలో ఉండాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలి అనేది ఇక్కడ ఉంది:గ్రీకు పెరుగు - ప్రేగులకు మంచిదిప్రోటీన్ పౌడర్ - ఆకలిని నియంత్రిస్తుంది, కండరాలను మెరుగుపరుస్తుందిబ్లూబెర్రీస్ - ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.హైడ్రేటెట్గా ఉండండిశరీరానికి తగిప హైడ్రేషన్ కూడా అవసరం. దీని కోసం, ఫిట్నెస్ కోచ్ ఉదయం 500 మి.లీ నీరు, అలాగే భోజనానికి ముందు తర్వాత త్రాగాలని సూచిస్తున్నారు. అయితే, పడుకునే రెండు గంటల ముందు నీరు త్రాగడం మానేయాలని చెబుతున్నారు.శక్తిమంతమైన వ్యాయామాలు..ఆహారంతో పాటు, ఒక రోజు విశ్రాంతితో వారానికి మూడు సార్లు కాస్త ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అవసరైమతే కాస్త అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు మరింతగా చేసేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.శరీరాన్ని కదిలిస్తూ ఉండండిశక్తి శిక్షణ తర్వాత, శరీరానికి సరైన కదలిక కూడా అవసరం. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు వేయండి" అని ఫిట్నెస్కోచ్ సిఫార్సు చేస్తున్నారు. డెస్క్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ప్రణాలికకు అంతరాయం కలగకుండా..డెస్క్ కింద ట్రెడ్మిల్ తీసుకోవడం, వాక్ చేస్తూ మీటింగ్లు ప్లాన్ చేయడం వంటివి చేయాలి.నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండిచక్కటి సౌకర్యవంతమైన బెడ్రూమ్లో నిద్రపోవాలి. బెడ్రూమ్ చూడగానే నిద్ర వచ్చేలా ఆహ్లాదంగా ఉంచుకోవాలి.స్థిరమైన నిద్ర దినచర్య..మంచి నిద్ర తోపాటు ఇవి కూడా ఉండాలి.ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని పొందండిముఖ్యంగా వారాంతాల్లో ఒకే సమయంలో నిద్రపోండి, మేల్కొనండిశరీరాన్ని చల్లబరచడానికి వేడి స్నానం లేదా స్నానం చేయండిమంచానికి ఒక గంట ముందు స్క్రీన్లను చూడటం మానుకోండిసూర్యుడు అస్తమించేటప్పుడు మసకబారిన లైట్లు లేదా ఎరుపు రంగు ప్రకాశించే బల్బులను ఉపయోగించండిపురోగతిని ట్రాక్ చేయండివార గడిచినప్పుడల్లా..బరువు, శరీరం కొలతల్లో వచ్చిన మార్పులు గమనించాలి. అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటుండాలి. అలాగే ఆ మార్పులను ఫోటోలు తీస్తూ..గమనించుకోవాలన్నారు.పరివర్తనను గుర్తించి..మెయింటైయిన్ చేయాలి..కేవలం ట్రాక్ చేయడమే కాకుండా, బాడీలోని మార్పులను గమనిస్తూ..ఆ దిశగా ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకుంటుండాలి. ఈ సమయంలో ఆల్కహాల్ను నివారించండిమెరుగైన ఫలితాలు అందుకుంటున్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.నిరాశను దరిచేరనివ్వకుండా యాక్టివ్గా ఉండటం..అద్దంలో మార్పులు చూస్తూ..మరింత ఆత్మవిశ్వాసంతో డైట్ని, రూల్స్నిన స్థిరత్వంతో పాటించాలి. ఇలా చేస్తే..ఈ సమ్మర్లో సత్వరమే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు డాన్గో. అంతేగాదు నియమానుసారంగా సూచించిన ఈ రూల్స్ అన్నింటిని క్రమం తప్పకుండా ఫాలో అయితే ఈజీగా 14 కిలోలు తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Dan Go | High Performance Health Coach (@coachdango)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..) -
ఆరోగ్యం.. ఒక డైనమిక్ ప్రయాణం
స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి. ఈ మూడు దశల్లో హార్మోన్ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.టీనేజ్ దశలో...యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా వేయించాలి. సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.పునరుత్పాదక వయస్సులో...20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్ చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్ఫాక్స్, హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ ప్లానింగ్కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి. యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.మెనోపాజ్ దశలో...నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్ అంటారు. ఈ దశలో హార్మోన్ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్ చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలి.మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!) -
నడక చాలు...జిమ్కు వీడ్కోలు...!
‘‘నడక చాలు, మీకు జిమ్ అవసరం లేదు’’ అని ఎవరైనా చెప్పడం మనలో చాలా మంది విని ఉండొచ్చు. సాధారణంగా జిమ్కు వెళ్లలేకపోతున్న వారికి ఇది ఓదార్పుగా అనిపించవచ్చు. జిమ్కు డుమ్మా కొట్టడం దానికి బదులుగా నడకను ఎంచుకోవడం అంటే అది అంత సులువైన విషయం కాదు అలాగని అసాధ్యం కూడా కాదు. జిమ్ మానడం వల్ల కలిగే నష్టాలను నడకతో భర్తీ చేయడం సాధ్యమే అంటున్నారు వ్యాయామ నిపుణులు. వారు చెబుతున్న ప్రకారం...అలా చేస్తే లాభం లేదు...కారు దిగి ఆఫీసు వరకు నడవడం, షాపింగ్ మాల్లో తిరగడం, ఫోన్లో మాట్లాడుతూనో, చాట్ చేస్తూనో నడవడం, పార్క్లో రిలాక్స్డ్గా నెమ్మదిగా వాక్ చేయడం... వంటి వాటివల్ల జిమ్ సెషన్ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అవి వ్యక్తి శరీరంపై నిర్మాణాత్మక ఒత్తిడిని కలిగించవు. కార్డియో పేరిట ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్...వగైరాలు జిమ్లో అందుబాటులో ఉంటాయి. అటువంటి వ్యాయామాలతో కూడిన జిమ్ సెషన్ వదిలేస్తూ, ఆ నష్టం భర్తీ కావాలంటే ఏదో ఒక పని మీద కాకుండా నడవడం అనే పని మీద బయటకు వెళ్లాలి. అప్పుడే మన చేతులు సరిగ్గా కదులుతాయి. చూపు ముందుకు ఉంటుంది. ఒక్కో అడుగు సాధారణం కంటే ఎక్కువ దూరం పడుతుంటుంది. ఇలా నడిస్తే...భళా...స్మార్ట్వాచ్ లేదా ఫోన్ ఉంటే, ఒక సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. స్థిరమైన రీతిలో గంటకు 5 కి.మీ వేగంతో 30 నిమిషాల పాటు నిర్విరామంగా నడవాలి. అంటే దాని ద్వారా మనం 2.50 కి.మీ నడుస్తామన్నమాట. ఆ వేగంతో, చాలా మంది సాధారణ నడక నుంచి బయటపడి తేలికపాటి కార్డియో శైలిలోకి వెళతారు. శ్వాస కొంచెం లోతుగా మారుతుంది. కండరాలు సాధారణ ప్రయాణ వేగం కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేయడానికి తగ్గట్టుగా వేడెక్కుతాయి. అలా 30 నిమిషాలు నాన్–స్టాప్ గా నడిస్తే గుండె, ఊపిరితిత్తులు రక్త నాళాలు గట్టి ప్రభావాన్ని ఎదుర్కొంటాయి.దీనికి రోజువారీ తప్పక చేయాల్సిన అవసరం కూడా లేదు. వారంలో నాలుగు రోజులు సరిపోతుంది. ‘‘దానిని ఒకేలా పరిగణించినప్పుడు మాత్రమే. నడక ఒక వ్యాయామం అవుతుంది. తొలుత 5 నిమిషాల పాటు సున్నితమైన వేగంతో ప్రారంభించి ఆపై తగిన వేగంలో స్థిరంగా నడవడం అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా చేతులను వెనక్కి కట్టేయడం లాంటివి చేయకూడదు. చేతులను దాదాపు 90 డిగ్రీల వద్ద వంచి సహజంగా ఊగుతూ ఉండేలాచూడాలి. చదునైన నేలపై 30 నిమిషాల్లో 2.3–2.7 కి.మీ. లక్ష్యంగా పెట్టుకోవాలి. వేగాన్ని తగ్గించకుండా ఉండటానికి అవసరమయితే సంగీతం లేదా పాడ్కాస్ట్లను ఉపయోగించవచ్చు. వాక్ ముగిసే సమయంలో హృదయ స్పందన రేటు తగ్గడానికి 2–3 నిమిషాల పాటు నెమ్మదించిన నడకతో ముగించాలి.(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?) -
ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..
షిల్లాంగ్లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ఇద్దరు అగ్నివీర్ శిక్షణార్థులు అనుమానిత మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ బారినపడి గంటల వ్యవధిలోనే మరణించారు. ఒక్కసారిగా అస్సాం రెజిమెంటల్ సెంటర్ ఉలక్కిపడింది. సత్వరమై సైనిక సౌకర్యంలో చుట్టుపక్కల కాంటాక్ట్ ట్రేసింగ్, ఆయా వ్యక్తులతో టచ్లో ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచడం తదితరాలతో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా సత్వరమే అన్ని చర్యలు చేపట్టింది. కేవలం ఆర్మీ శిక్షణా కేంద్రంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా గట్టి నిఘా ఉంచినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇంతకీ అసలేంటి మెనింగోకాకల్ వ్యాధి ..? ఎందువల్ల వస్తుందంటే..?మెనింగోకాకల్ వ్యాధి అంటే ..?మెనింజైటిస్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాల వాపుకు కారణమవుతుంది. ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్యానికి ఒక తీవ్రమైన ముప్పుగా అభివర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఇది అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవుల వల్ల సంభవిస్తుందని WHO పేర్కొంది. అయితే ఇది అంటువ్యాధి లాంటిదేనా..? కాదా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు.బాక్టీరియల్ మెనింజైటిస్ అత్యంత తీవ్రమైన రకం మెనింజైటిస్ అని WHO చెబుతోంది. దీని కారణంగా రోగికి తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. మెనింగోకోకస్ అనేది నీసేరియా మెనింగిటిడిస్ అనే బాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియల్ మెనింజైటిస్.వ్యాధి లక్షణాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం మెనింగోకాకల్ వ్యాధి యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:ప్రకాశవంతమైన కాంతి వల్ల ఇబ్బంది పడటంవిరేచనాలుజ్వరంతలనొప్పివాంతులుముదురు రంగులోకి మారినట్లు కనిపించే చర్మ దద్దుర్లుగట్టి మెడగందరగోళం,చిరాకుచాలా నిద్రమత్తుగా అనిపించడంనడవడానికి లేదా నిటారుగా ఉండటానికి ఇబ్బందివిపరీతమైన మంటలు, నొప్పులుకీళ్లు, కండరాల నొప్పిఆకలి లేకపోవడంఎవరికీ ఈ ప్రమాదం అధికం అంటే..ఈ ఇన్ఫెక్షన్ ఏ వ్యక్తినైనా ప్రభావితం చేయవచ్చు, అయితే, కొంతమందికి ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, టీనేజర్ లేదా చిన్న వయస్సులో ఉన్నవారుప్లీహ గాయం లేదా ప్లీహము లేకపోవడంసికిల్ సెల్ వ్యాధి ఉన్నవాళ్లకుకాంప్లిమెంట్ ఇన్హిబిటర్ మందులు తీసుకునేవాళ్లుమెనింగోకాకల్ వ్యాధి సాధారణంగా ఉండే ప్రాంతాలను సందర్శించడం వల్లదీనికారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..బాధిత వ్యక్తులు వెంటనే వైద్య చికిత్స పొందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, చికిత్స పొందినప్పటికీ ప్రజలు చనిపోవచ్చు. ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలు..మెదడు దెబ్బతినడంమూత్రపిండాల నష్టంఅవయవాలు కోల్పోవడంనరాల దెబ్బతినడంపూర్తిగా వినికిడి లోపంనివారణ చర్యలువ్యాక్సిన్లు సాధారణ రకాల బాక్టీరియల్ మెనింజైటిస్ నుంచి ఉత్తమ రక్షణను అందిస్తాయని WHO చెబుతోంది. మెనింగోకాకస్, న్యుమోకాకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి (Hib) వల్ల కలిగే మెనింగోకాకల్ వ్యాధిని టీకాలు నిరోధించగలవు. ఇతర నివారణ చర్యలు..11-12 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ కంజుగేట్ (MenACWY) వంటి టీకాలు వేయించడం.16 ఏళ్ల లోపు వాళ్లకు బూస్టర్డోస్లు వేయించడం. అలాగే సెరోగ్రూప్ B నుంచి అదనపు రక్షణ కోసం సిఫార్సు చేసిన MenB టీకాలు వేయించడం. టీకాలు సాధారణ జాతులను (A, C, W, Y, B) లక్ష్యంగా చేసుకుంటాయి. టీనేజ్ పిల్లలు, టీనేజర్లు, HIV లేదా అస్ప్లెనియా వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉన్నవారికి ఈ టీకాలు వేయించడం మంచిది.పరిశుభ్రత పద్ధతులు: ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత లేదా తినడానికి ముందు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోండి. కడగని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండండి. పానీయాలు, ఆహారం, పాత్రలు, లిప్స్టిక్లు లేదా సిగరెట్లను పంచుకోవద్దు, దగ్గు/తుమ్ము వచ్చినప్పుడు చేతులు లేదా జేబురుమాల్ అడ్డుపెట్టుకోవడం. ఈ చర్యలు తీసుకుంటే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియాను కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా దద్దుర్లు, మెడనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం సహాయం తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!) -
రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!
ఒకప్పుడు పిల్లలు ‘పెద్దయ్యాక కలెక్టర్ అవుతాను’ అనేవారు, కానీ నేడు ‘ఇన్ఫ్లూయెన్సర్ అవుతాను’ అంటున్నారు. చదువును పక్కన పెట్టి, గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తూ, నిరంతరం రీల్స్ షూటింగులతో బిజీగా ఉంటున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కేవలం అలవాటు కాదు, ఒక తీవ్రమైన మానసిక పరిణామం. చేతిలో స్మార్ట్ఫోన్, కళ్ళల్లో రీల్స్ కలలు ఉన్న టీనేజర్లను సరిదిద్దడం నేటి తరం తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద సవాలు.మెదడులో డోపమైన్ యుద్ధంటీనేజర్ల మెదడులో ‘ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్’ (నిర్ణయాలు తీసుకునే భాగం) పూర్తిగా అభివృద్ధి చెందదు. కాని, ఆనందాన్ని వెతికే ‘రివార్డ్ సిస్టమ్’ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా వీడియో గేమ్స్ ‘వేరియబుల్ రివార్డ్స్’ సూత్రంపై పనిచేస్తాయి. స్వైప్ చేసిన ప్రతిసారి, తర్వాతి వీడియోలో ఏముందో తెలియని ఆ కుతూహలం మెదడులో డోపమైన్ను విడుదల చేస్తుంది. చదువులో ఫలితం రావడానికి ఏడాది పడుతుంది కాని, రీల్కు లైక్స్ రావడానికి సెకన్లు చాలు. అందుకే ఈ ‘తక్షణ తృప్తి’ కోసం మళ్లీ మళ్లీ రీల్స్ చూస్తుంటారు, చేస్తుంటారు. చదువు వర్సెస్ వైరల్ ఫేమ్చాలామంది టీనేజర్లు చదువు మానేసి రీల్స్ చేయడం వెనుక ‘గుర్తింపు కాంక్ష’ ఉంటుంది. కాని, పదివేల మంది ఫాలోవర్లు ఉండటం వల్ల జీవితం సెటిల్ అయిపోదు. సోషల్ మీడియా అల్గారిథమ్స్ మారగానే ఆ గుర్తింపు కనుమరుగవుతుంది.నిరంతరం షూటింగులు, ఎడిటింగ్ ఆలోచనలతో ఉండటం వల్ల మెదడు ‘హైపర్–యాక్టివ్’ స్థితిలో ఉంటుంది. ఫలితంగా, నిశ్శబ్దంగా కూర్చుని చదువుకోవడం వారికి అసాధ్యంగా మారుతుంది.చదువును నిర్లక్ష్యం చేస్తూ, కేవలం ‘వైరల్’ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న టీనేజర్లను డీల్ చేయడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలు. వారిని మొండితనం వైపు నెట్టకుండా, తిరిగి పుస్తకాల వైపు మళ్లించడానికి ఉపయోగపడే ఐదు కౌన్సెలింగ్ చిట్కాలు మీకోసం.1. ‘వై నాట్’కి బదులుగా ‘హౌ’పిల్లలు రీల్స్ చేస్తామంటే ‘వద్దు, చేయకూడదు’ అని మొండిగా చెప్పకండి. అది వారిని తిరుగుబాటు వైపు నెడుతుంది. ‘నువ్వు కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకోవడం మంచిదే కాని, ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్ కావాలంటే నీకు కమ్యూనికేషన్ స్కిల్స్, స్క్రిప్ట్ రైటింగ్, అనలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. అవి నీకు చదువు ద్వారానే వస్తాయి’ అని వారితో ఒక ప్రొఫెషనల్లాగా మాట్లాడండి. చదువును వారి ఎదుగుదలకు ఒక అడ్డంకిగా కాకుండా, ఒక సాధనంగా చూపించండి.2. ‘ఇన్స్టంట్ ఫేమ్’ వర్సెస్ ‘లాంగ్ టర్మ్ సెక్యూరిటీ’ టీనేజర్లకు భవిష్యత్తు గురించి స్పష్టత ఉండదు. అందుకే క్లాసులో వచ్చే మొదటి ర్యాంక్ కంటే రీల్స్కు వచ్చే లైక్స్ ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. ‘ఈ రోజు వైరల్ అయిన వీడియో రేపు ఉండదు. కాని, నువ్వు సంపాదించే డిగ్రీ లేదా నైపుణ్యం జీవితాంతం నీకు అన్నం పెడుతుంది’ అని సోషల్ మీడియా వెనుక ఉన్న ‘షెల్ఫ్ లైఫ్’ గురించి వివరించండి. ముఖ్యంగా ఫేడౌట్ అయిపోయిన పాత ఇన్ఫ్లూయెన్సర్ల ఉదాహరణలు చెప్పండి.3. ‘ప్రొడక్షన్ టైమ్’ ఫిక్స్ చేయండిపిల్లలు చదువు మధ్యలో రీల్స్ షూటింగ్ చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. వారానికి ఒక రోజు, రెండు గంటలు మాత్రమే షూటింగ్ సమయంగా కేటాయించండి. మిగిలిన ఆరు రోజులు చదువుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ‘నీ చదువు గ్రాఫ్ పడిపోతే, ఈ షూటింగ్ టైమ్ రద్దవుతుంది’ అనే పాజిటివ్ కండిషన్ పెట్టండి.4. అకడమిక్ రివార్డ్ సిస్టమ్వారికి నచ్చిన రీల్స్ చేసే హక్కును వారు ‘సంపాదించుకోవాలి’. ఉదాహరణకు ఒక చాప్టర్ పూర్తి చేస్తే 15 నిమిషాల ఎడిటింగ్ టైమ్. వీక్లీ టెస్ట్లో మంచి మార్కులు వస్తే, ఒక కొత్త రీల్ షూట్ చేసుకునే అవకాశం. ఇలా చేయడం వల్ల వారు చదువును ఒక శిక్షలా కాకుండా, తమకు నచ్చిన పనిని చేయడానికి ఒక మార్గంగా చూస్తారు.5. డిజిటల్ ఐడెంటిటీని గౌరవించండిపిల్లలకు గుర్తింపు కావాలి. ఇంట్లో ఆ గుర్తింపు దొరకనప్పుడు వారు బయట ప్రపంచాన్ని ఆశ్రయిస్తారు. అందుకే రీల్స్ చేస్తారు. ఆ విషయాన్ని గుర్తించండి. వారిని ఒక ‘క్రియేటర్’గా గౌరవిస్తూనే, ఒక ‘స్టూడెంట్’గా బాధ్యతలను గుర్తు చేయండి.నైవర్ మైండ్..!ప్రతిరోజూ మన మెదడులో దాదాపు 50 వేల నుంచి 70 వేల ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. వీటిలో సుమారు 60 నుంచి 70 శాతం ప్రతికూలమైన ఆలోచనలే! కాబట్టి పరీక్షల సమయంలో తలెత్తే ప్రతికూల ఆలోచనలను పెద్దగా పట్టించుకోకండి. సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: ముసుగు వెయ్యొద్దు మనసు మీద..! లోపాలను దాచొద్దు..) -
తీవ్రమైన మోకాలి నొప్పిని వ్యాయామాలతో జయించింది..!
హాంకాంగ్కు చెందని కవితా బిశ్వాస్ టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తుండేవారు. పూర్తికాల ఉద్యోగం తోపాటు యోగా, నృత్య సాధనతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవతం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఆకస్మత్తుగా నలభైల మధ్యలో మోకాలి నొప్పి బారిన పడింది దాంతో ఆమె లైఫ్ఎంతో ఘెరంగా మారిపోయిందంటే..మళ్లీ నడుస్తానన్న ఆశ ఆవిరైపోయింది. కానీ ఆమె ఆ సమస్యను ఎలాంటి మోకాలి ఆపరేషన్ చేయించుకోకుండానే జయించింది. పట్టుదలతో అనారోగ్య సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే..ఏ సమస్య అయినే ఇట్టే మాయం అయిపోతుందనడానికి ఆమె ఉదంతమే ఉదాహరణ. హాంకాంగ్ పాఠశాలలో టీచర్గా సాగిస్తున్న కవితా బిశ్వాస్ జీవితాన్ని మోకాలి నొప్పి..ఆమె జీవితాన్ని చాలా దుర్భరంగా మార్చేసింది. భరించలేని నొప్పి, నడక కష్టమై ఎక్కడకు వెళ్లలేని పరిస్థితికి తీసుకొచ్చేసింది. కనీసం ఓ పదినిమిషాలు నడవాలంటే ప్రాణమే పోయేంత పరిస్థితి. చివరికి కర్ర సాయం లేకుండా నాలుగు అడుగులు కూడా వేయలేని దారుణమైన పరిస్థితికి చేరిపోయింది. ఆఖరికి ఎయిర్పోర్ట్లో సైతం వీల్చైర్ ఆధారం తీసుకోవాల్సి వచ్చిందామెకు. ఆమె ట్రీట్మెంట్ కోసం భారత్కు వచ్చారు. ఇక్కడి వైద్యులు మోకాలి లిగమెంట్ దెబ్బతిందని, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స తప్పదని చెప్పారు. అయితే ఆమె వయసు ఈ చికిత్సకు అర్హమైనది కాకపోవడంతో..మందులు, వ్యాయామాలను కొనసాగించి చూడమని సూచించారు. దాంతో తిరిగి హాంకాంగ్ వచ్చేశారు. ఇక ఎప్పటిలా తనకు తానుగా స్కూల్కి, నృత్యసాధన సాధ్యం కాదని అర్థమైపోయింది కవితకి దాంతో ఫిజియోథెరపీ తీసుకోవాలని డిసైడ్ అయ్యారామె. ఓపక్కన చికిత్స తీసుకుంటూనే..చిన్నగా నడవడం, వ్యాయామాలు చేయడం వంటివి చేసింది. మోకాలి వంచలేదని తెలుసు కానీ..వర్కౌట్లు చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా అయిపోతుందని అలానే బాధనంతటిని పట్టి బిగువున అదిమపట్టి చేస్తుండేది. గోడ ఆధారిత వ్యాయామాలు, రెసిస్టెన్స్ బ్యాండ్లు సాయంతో కండరాలు బలోపేతం చేసే కొద్దిపాటి వ్యాయామాలు చేస్తుండేది. అలాగే ఆహారంలో మార్పులు చేసుకుని 92 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకుది. సుమారు 18 నెలల తర్వాత, కర్ర సాయం లేకుండా తనంతట తానుగ నడవగలిగింది. అంతేగాదు సుమారు 45 నిమిషాల వరకు నడవగలగడంతో..మళ్లీ నా స్వతంత్ర వచ్చింది అంటూ సంబరపడిందామె. ఇక్కడ కవిత తన నొప్పి, వాపులకు అనుగుణంగా వ్యాయామాలు చేసుకునేలా సర్దుబాటు చేసుకుంది. అలా ఈ సమస్య నుంచి బయపటపడే ప్రయత్నం చేసింది. అంతేగాదు ఈ మహిళ అనుభవం..మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ను నిర్వహించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తేటతెల్లం అయ్యింది. మూడేళ్ల క్రితం కవిత ఎయిర్పోర్టుకి వీల్చైర్పై వస్తే..ఇపుడు ఆమె ధీమాగా నడుచుకుంటూ వెళ్లింది. ఆ మహిళ స్టోరీ..ఏ అనారోగ్య సమస్య అయినా..ధైర్యంగా ఉండి వైద్యనిపుణుల సాయం తీసుకుంటే..సులభంగా బయటపడొచ్చని చెప్పకనే చెబుతోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నయనేంద్రియానం కార్నియా ప్రధానం..!) -
మందిరా బేడి ఫిట్నెస్ మంత్ర..! 30 ఏళ్ల వయసులో కంటే ఇప్పుడే..
ఫ్యాషన్ డిజైనర్, నటి, టీవీ వ్యాఖ్యాత మందిర బేడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఆమె హవా మాములుగా లేదు. ఆమె స్వరం, నటనతో వేలాది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ మందిరా బేడి. ఐదు పదుల వయసులోనూ యువ హీరోయిన్ మాదిరి ఆహార్యంతో..ఆకర్షణీయమైన లుక్తో అలరిస్తుంటుందామె. ఇంతలా హెల్దీగా, యంగ్గా ఉండటానికి గల రీజన్ గురించి హెర్బాలైఫ్ పాడ్కాస్ట్ వెల్లడిస్తూ..తన బ్యూటీసీక్రెట్ని షేర్ చేసుకున్నారామె.మరి అవేంటో తెలుసుకుందామా..!.మందిరా తన వయసు గురించి చెప్పడానికి అస్సలు భయపడనని, కానీ ఆహార్యం పరంగా యంగ్గానే కనిపిస్తానని అన్నారామె. అందరు కదలిక ఓ మెడిసిన్, వ్యాయామం ఓ ఔషధ అని అంటుండటం వినేదాన్ని. కానీ అది తన విషయంలో నిజమైందని అంటోందామె. వ్యాయామం ఒక్కటే ప్రజలను అనారోగ్యం బారినపడకుండా చేస్తుందని, అదొక సప్లిమెంట్గా అభివర్ణించింది. అన్ని సమస్యలకు వ్యాయామం అద్భుతమైన నివారిని అని నమ్మకంగా చెబుతోందామె. అంతేగాదు 50లలో అధిక బరువు శిక్షణ తప్పనిసరి అని అంటోందామె. ఎందుకంటే..ఆ సమయంలో వృద్ధాప్యం మనలోకి ఎంటర్ అవుతుంటుంది. కాబట్టి ఆ టైంలో ఫిట్నెస్ చాలా ముఖ్యం, అదీగాక శారీరక క్షీణతకు దారితీసే సమయం కూడా అదే. అందువల్ల బలశిక్షణ శరీరానికి ఎంతో అవసరమని అన్నారు. ఇది మనకు శక్తిమంతమైన మార్పుతో పాటు, మన కండరాలను బలోపేతం చేస్తాయని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్లు శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యద్భుతమైనవని అన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతాయని అన్నారు. అయితే దీన్ని తీవ్రంగా భయపెట్టేలా చెయ్యొద్దని చెప్పారామె. ఇష్టంతో..స్వాంతన చేకూరేలే చేయాలి. అప్పుడే వృద్ధాప్యాన్ని ధీమాగా తిప్పికొట్టగలమని అన్నారామె. అంతేగాదు ఈ ఏజ్లో నిరంతర సంరక్షణ, నిబద్దతతో చేసే రోజువారీ వ్యాయామాలు మన ఆయుష్షుకి శ్రీరామరక్ష అని చెబుతున్నారు మందిరా బేడి. View this post on Instagram A post shared by Herbalife India Official (@herbalifeindiaofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
ఆరు నెలల్లో 12 కిలోలు బరువు తగ్గిన మహిళ..!
బరువు తగ్గడం అంత ఈజీ కాకపోయినా..అసాధ్యం మాత్రం కాదు. అదనపు బరువుని తగ్గించుకోవడానికి ఇక్కడొక మహిళ అనుసరించిన విధానం..అందర్నీ కదిలిస్తోంది, ప్రేరేపిస్తోంది కూడా. కేవలం ఆరు నెలల్లోనే మంచి ఫలితాన్ని అందుకుంది. పైగా అందుకోసం ఆమె ఎంతలా కష్టపడిందో తెలిస్తే..విస్తుపోతారు. మంచి శీరారకృతి, ఆరోగ్యకరమైన బరువు కోసం ఆ మాత్రం డెడికేషన్ ఉండాల్సిందే మరి. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గడం కోసం ఏం అనుసరించిందంటే..దుబాయ్కి చెందిన షెర్రీ పీటర్ అనే మహిళ తాను ఆరు నెలల్లో 12 కిలోలుకు పైగా బరువు తగ్గానని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. అంతేగాదు ఆగస్టు 2025 vs ఫిబ్రవరి 2026 కల్లా 12 కిలోలు తగ్గి..స్లిమ్గా మారాను అని పోస్ట్లో తెలిపింది. మంచి శరీరాకృతి కోసం అనుసరించిన వెయిట్లాస్ వ్యూహం గురించి పేర్కొన్నారామె.ప్రతిరోజూ పదివేల అడుగులురోజువారీగా పదివేల అడుగుల వాకింగ్. ఇది బరువు తగ్గడానికి ఒక ప్రభావవంతమైన వ్యూహం. దీనివల్ల రోజుకు దాదాపు 300–500 అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. తాను దీన్ని ఒక ఏడాది నుంచి పాటిస్తున్నానని చెప్పారు. జిమ్కి వెళ్లడానికంటే మందు నుంచి ప్రారంభించానని చెప్పారు. వారంలో నాలుగు రోజులు..బరువులు ఎత్తడం, పైలేట్స్ వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్ను వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు కేటాయించానని తెలిపింది. వాటిలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జీవక్రియను పెంచగా, పైలేట్స్ కోర్ బలాన్ని పెంపొందిస్తాయి. ఎమ్స్కల్ప్ట్ నియో వారానికి రెండుసార్లుఎమ్స్కల్ప్ట్ నియో అనే మిషన్ సాయంంతో శరీర ఆకృతి చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఏకకాలంలో కొవ్వును కరిగింఇచ 30 నిమిషాల సెషన్లలో కండరాలను నిర్మిస్తుంది. ఇది ఉదరం, పిరుదులు, చేతులు, తొడలపై ప్రభావవంతంగా ఉంటుంది.ఆహారంసమర్థవంతమైన బరువు తగ్గడంలో అధిక ఫైబర్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి సారించడం అత్యంత కీలకం. అలాగే హైడ్రేటెడ్గా ఉంటూనే చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ వినియోగాన్ని కూడా పరిమితం చేయాలి. అదనంగా తినాలనిపించినప్పుడల్లా.. తీసుకున్న గ్రీన్ టీ కాస్త భావోద్వేగ మద్దతుగా మారిందని షెర్రీ చెప్పింది.మద్యం మానేయడంక్యాలరీ తీసుకోవడం తగ్గించడానికి ఆల్కహాల్ తగ్గించడం అనేది చాలా ప్రభావవంతమైన మార్గం. సాధారణంగా ప్రతి పెగ్ ఆల్కహాల్ వంద కేలరీనలు పెంచుతుంది. అందుకే పూర్తిగా మానేసి పైలేట్స్, జిమ్, వాకింగ్లపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారామె.సింపుల్గా చెప్పాలంటే..ఎక్కువ నడవడం, తక్కువ తినడం బరువు తగ్గడానికి సరళమైన మార్గం అని అందరికీ తెలుసు. కానీ ఇలా షెర్రీ లాంటి మహిళల అనుభవపూర్వకమైన వెయిట్లస్ స్టోరీలు..ఇలాంటి వాటిని అనుసరించేలా చేయడంలో ప్రేరణటీ ఉంటాయి కదూ..!. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.august 2025 vs february 202612kgs down and in the best shape of my life pic.twitter.com/ZLMHIIr4H3— deSherry (@Sherrypeter) February 20, 2026 (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..! ఆయిల్ మసాజ్లు, ఇంట్లో తయారు చేసే..) -
డెంటల్ యాబ్సెస్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
ఎప్పుడైనా మీ పంటిచిగురు దగ్గర తెల్లగా... చిన్న ఉండలాంటి సంచిలో కాస్త చీము నిండినట్టుగా చిన్న తిత్తి మాదిరిగా కనిపించిందా? కొద్దిగా వాచినట్టుగా, నొప్పిగా, బాధగా ఏదో చిగుర్లకు వచ్చిన సమస్యగా అనిపించిందా? దాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అంటే నోటి పుండు. ఒక్కసారి అది బాగా పొడుస్తున్నట్టుగా తీవ్రమైన నొప్పి రావచ్చు. జ్వరం కూడా కనిపించవచ్చు. కారణం అదో బ్యాక్టీరియల్ సమస్య. ఈ డెంటల్ యాబ్సెస్ అంటే ఏమిటీ, అదెందుకు వస్తుంది, చికిత్స ఏమిటన్న అనేక విషయాలను తెలుసుకుందాం...పంటి చిగురుకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్నిండా చీము చేరడం వల్ల వచ్చే సమస్యే ‘పంటి యాబ్సెస్’. నిజానికి పంటిచిగురు దగ్గర చీము చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తెల్లరక్తకణాలు రంగంలోకి దిగడం తెలిసిందే. ఇలా యుద్ధానికి సన్నద్ధమైన ఈ తెల్లరక్తకణాలు... బ్యాక్టీరియాతో జరిగిన పోరాటంలో నశించాక... ఆ తెల్లరక్తకణాల తాలూకు మృతకణాలన్నీ చీము రూపంలో అక్కడ ఓ తిత్తి (పాకెట్)లాగా ఉండి΄ోతాయి. దాంతో నోరు తెరచి చూసుకున్నప్పుడు ఓ తెల్లటి చీము ఉండ కనిపిస్తుంది.తగ్గినట్టు ఉన్నా ఉపేక్షించడం సరికాదు... పంటి చిగురు దగ్గర కనిపించిన ఆ ఇన్ఫెక్షన్ చిగురుకు పాకే అవకాశముంది. అంతేకాదు... అది పంటిని వదులు చేసేందుకూ ఛాన్స్ ఉంది. ఒక్కోసారి ఆ గడ్డ చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి కాస్తా అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. మొదట ఉన్న తీవ్రమైన నొప్పి అకస్మాత్తుగా లేకుండా పోయి, నొప్పి లేదంటే సమస్య తగ్గిపోయిందని కాదు. సాధారణంగా డెంటల్ యాబ్సెస్ అన్నది దానంతట తగ్గి΄ోవడం కాస్త అరుదే. అందుకే అలా పంటి చిరుగురు ప్రాంతంలో తెల్లటి చీము ఉండ కనిపించిందంటే తప్పక చికిత్స తీసుకోవడం అవసరం. ఇతర అవయవాలకూ పాకవచ్చుడెంటల్ యాబ్సెస్కు తగిన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఒక్కోసారి ఆ సూక్ష్మజీవులు రక్తప్రవాహంలో కలిసి ఇతరచోట్లకూ పాకే అవకాశముంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ దవడకూ, తలకూ, మెడకు కూడా పాకితే ఆ ప్రాంతాల్లోనూ తీవ్రమైన నొప్పి రావచ్చు. ఒక్కోసారి భరించలేనంత నొప్పిగా కూడా ఉండవచ్చు. లక్షణాలుసాధారణంగా నోట్లో పేరుకు΄ోయే బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువ. దీన్నే ఓరల్ బ్యాక్టీరియా, ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. వీటిలో చాలావరకు నిరపాయకరమైనవే ఎక్కువ. అయితే హానికరమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నోరు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదంచేసే భాగం అయినందున అవి వేగంగా పెరుగుతాయి. పలువరసలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే అక్కడ బ్యాక్టీరియా విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దాంతో చీముగడ్డ (పస్ పాకెట్) ఏర్పడటంతో మరికొన్ని లక్షణాలూ కనిపిస్తుంటాయి. అవి... ∙ మాటిమాటికీ పొడిచినట్లుగా తీవ్రమైన నొప్పి ∙ చల్లటి లేదా వేడి ప్రదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లుమనడం. ∙ఏదైనా వస్తువు నమలగానే పొడుచుకువచ్చినట్టుగా నొప్పి కలగడం. గొంతులోని గ్రంథులు వాచడం. నోటిలో దుర్వాసన వస్తున్న భావన లేదా దుర్వాసన రావడం. ఏదైనా తినేపదార్థం నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపించడం. (ఇలా అనిపిస్తుందంటే అది చీముగడ్డ పగిలినందుకు సూచన. అయితే అప్పటికీ ఇన్ఫెక్షన్ మాత్రం శరీరంలోనే ఉంటుంది. కాబట్టి అది శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకే అవకాశమున్నందున... అలా జరగడం మరింత ప్రమాదానికి దారితీసే ముప్పున్నందున... తప్పనిసరిగా డెంటల్ డాక్టర్ను కలిసి తగిన సూచనలూ, చికిత్స తీసుకోవాలి. నివారణప్రతిరోజూ క్రమంతప్పకుండా ఉదయం, రాత్రి బ్రషింగ్ చేసుకోవడం. ∙బ్రషింగ్ కోసం మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్నే వాడంటం. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు గుండ్రంగా బ్రష్ చేసుకోవడం. పంటికి బయటివైపే కాకుండా లోపలి వైపునా బ్రష్ చేసుకోవడంతో పాటు నమిలే ప్రదేశాలల్లో... అంటే పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ చక్కగా బ్రష్ చేసుకోవడం. బ్రషింగ్ టైమ్ రెండు లేదా మూడు నిమిషాలకు మించకుండా చూసుకోవడం. నాలుకపైనున్న బక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేసుకోవడం. చిగుర్ల ఆరోగ్యం కోసం బ్రషింగ్ తర్వాత చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసుకోవడం. ప్రతి ఆర్నెల్లకోసారి క్రమంతప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం. చికిత్సపంటి యాబ్సెస్కు డాక్టర్లు సాధారణ యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తారు. మరీఅవసరమైన వారికి ఆ చీముపాకెట్ను తొలగించడంతోటు రూట్కెనాల్ అవసరం పడవచ్చు. డాక్టర్ ప్రత్యూష, సీనియర్ కన్సల్టెంట్ డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ (చదవండి: అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!) -
బెల్లీఫ్యాట్ తగ్గేందుకు 5:1:1 రూల్ అంటే..!
కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గిస్తే బరువు తగ్గి స్లిమ్గా అవుతామన్నది చాలామందిలో ఉండే అభిప్రాయం. అయితే మనం తీసుకునే కార్బోహైడ్రేట్లకు తగినట్లుగా పీచు, ప్రోటీన్లను చేర్చాలి. ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లు : 1 గ్రాము పీచు (ఫైబర్) : 1 గ్రాము ప్రోటీన్ అంటూ 5:1:1 నిష్పత్తిలో తీసుకుంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకోవడం తగ్గడంతో పొట్ట అలాగే దేహం బరువు పెరగక వ్యక్తులు స్లిమ్గా ఉంటారన్నది న్యూట్రిషనిస్టుల మాట.తెల్ల బ్రెడ్డు, పేస్ట్రీలు, మైదా, ఇన్స్టాంట్ నూడుల్స్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో కేవలం పిండిపదార్థాలు మాత్రమే ఉంటాయి. వాటిలో పీచుపదార్థాలుగానీ లేదా ప్రోటీన్గానీ ఉండక΄ోవడంతో అవి తిన్నవెంటనే రక్తంలోకి చక్కెర విడుదలవుతుంది. వినియోగం కాని చక్కెర కొవ్వుగా మారి బరువు పెరుగుతారన్నది చాలామందికి తెలిసిన విషయమే. 5:1:1 రూల్ అంటే... ఐదు (5 ) గ్రాముల కార్బోహైడ్రేట్ ఉండే ఆహారాన్ని తీసుకుంటే... దానికి అనుగుణంగా –1 గ్రాము పీచు పదార్థం అలాగే – 1 గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. దాంతో పిండిపదార్థంవల్ల పెరగాల్సిన కొవ్వు పెరగకుండా ఈ పీచు, అలాగే ప్రోటీన్లు అడ్డుపడతాయి. 5:1:1 నిష్పత్తికి అర్థమిదే. ఈ నిష్పత్తిలోని 1 గ్రాముల పీచు, 1 గ్రాము ప్రోటీన్తో ఏయే ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం. 1 గ్రాము పీచుతో... పీచు (ఫైబర్) జీర్ణక్రియను మెల్లగా జరిగేలా చూస్తుంది. దాంతో చక్కెరలు వెంటనే రక్తంలో పెరగకుండా మెల్లమెల్లగా ఇంకుతుంటాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర మోతాదులు అకస్మాత్తుగా పెరగవు (స్పైక్ అవ్వవు). ఒకేసారి చక్కెరలు రక్తంలో విడుదల కావు కాబట్టి దాన్ని అదుపు చేయాల్సిన ఇన్సులిన్ కూడా అకస్మాత్తుగా విడుదల కావాల్సిన అవసరం లేదు. అందువల్ల అది నెమ్మదిగా తగిన మోతాదులోనే విడుదలవుతూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక పీచు వల్ల కడుపు నిండుగా ఉన్న భావనతో వెంటనే ఆకలిగా అనిపించదు. అంతేకాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ బాగుంటుంది. జీర్ణవ్యవస్థలో ఉండాల్సిన మేలు చేసే మంచి బ్యాక్టీరియా (గట్ బ్యాక్టీరియా) పెరగడంతో వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. దాంతో అంత తేలిగ్గా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఇక పీచు (ఫైబర్) అన్నది కొవ్వులను సమీకరించి వ్యర్థాల రూపంలో వెళ్లకుండా మలం నుంచి వేరు చేస్తుంది. 1 గ్రాము ప్రోటీన్తో ప్రోటీన్ వల్ల కూడా చక్కెరలు తక్షణం పెరగక΄ోగా... కండరాల బలం కూడా సమంగా నిర్వహితమవుతుంది. ్ర΄ోటీన్ తిన్న తర్వాత వెంటనే ఆకలిగా అనిపించదవు. దాంతో మితిమీరు తినడం (ఓవర్ ఈటింగ్) తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం బాగా తగ్గుతుంది. ఇక ్ర΄ోటీన్ వల్ల కండరాల రిపేర్లు జరుగుతుండటం, దేహానికి అవసరమైన శక్తి అందుతుంది. మరి... ప్రోటీన్లూ, పీచు... ఈ రెండూ పుష్కలంగా ఉండే ఆహారాలేమిటంటే... దాదాపు చాలారకాల పప్పుదినుసులు / కాయధాన్యాలు (లెంటిల్స్) లోప్రోటీన్ తోపాటు పీచుపదార్థాలూ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కందులు, శనగలు, చిక్కుళ్లలో 40 నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్లతోపాటు ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. పొట్టుతీయని ధాన్యాలలో కార్బోహైడ్రేట్లతో పాటు కొంత ప్రోటీన్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ముడిబియ్యం, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అరికలు, సామలు, ఊదలు, క్వినోవా. అన్నిరకాల తాజా పండ్లలో స్వాభావికమైన చక్కెరతో పాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, తేమ (మాయిశ్చర్) లకు అదనంగా పీచుపదార్థాలూ (ఫైబర్) ఉంటాయి. వీలైనంతవరకు పండ్ల రసాలను కాకుండా పండ్లు తీసుకోవడం మేలు. దూరం ఉంచాల్సినవి... బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు, కేకులు, డోనట్స్, పిజ్జా, బర్గర్, నూడుల్స్, బేకరీ పదార్థాలు, చిప్స్ వంటి కరకరలాడే (క్రిస్పీ) వేపుళ్లకు వీలైనంత దూరం ఉండాలి. అలాగే ప్యాకేజ్డ్ జ్యూస్లు, జామ్, స్వీట్లకు కూడా దూరంగా ఉండటం మేలు.5:1:1 అనే ఈ నిబంధనను వీలైనంతగా పాటిస్తూ ఉంటే... బరువు పెరగక΄ోవడం, కడుపు చుట్టూ అనవసరమైన కొవ్వు పేరుకుని పొట్టరావడం వీలైనంతగా తగ్గుతుంది. దాంతో ఊబకాయంతో వచ్చే అనేక అనర్థాలు అంటే... డయాబెటిస్, హైబీపీ, ఫ్యాటీలివర్ గుండెజబ్బులు... వీటన్నింటినీ నివారించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. డాక్టర్ శ్రీలత సీనియర్ క్లినికల్ డైటీషియన్ అండ్ న్యూట్రీషనిస్ట్ (చదవండి: Actress Sneha and Prasanna: మైండ్ఫుల్ పేరెంటింగ్ మంత్ర!) -
అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!
మహమ్మారి కేన్సర్ ఎంతటి బలవంతుడినైన బలహీనుడిగా మార్చేస్తుంది. అంతలా మానసికంగా, శారీరకంగా ఢీలా పడేలా చేసే వ్యాధిని..19 ఏళ్ల అమ్మాయి అలుపెరగని పోరాటం చేసి..మట్టికరిపించింది. ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తిగా నిలవడమే గాక..ప్లీజ్ పోరాడండి అని ధైర్యం చెబుతోంది. యువ కేన్సర్ వారియర్ అని అందరిచేత ప్రశంసలందుకుంటోంది. ఆ అమ్మాయే 19 ఏళ్ల లకితా ఫిద్రా..కెన్యాకు చెందిన ఆమెకు ఐదేళ్ల వయసులో ఉండగా తండ్రి కేన్సర్తో మరణించాడు. ఒంటరి తల్లి పెంపకంలో సాగుతున్న ఆమె జీవితం సరిగ్గా పదేళ్ల వయసులో ఊహించని మలుపు తిరిగింది. ఒకరోజు ఆటలు ఆడుకుంటుండగా, సడెన్గా కుడిమోకాలులో విపరీతమైన నొప్పి..అల్లాడిపోతోంది. తీరా వైద్యుల వద్దకు తీసుకువెళ్తే..వాళ్లు నార్మల్ సమస్యగానే భావించి చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడైతే ఆమె కుటుంబ చరిత్రలో తండ్రి అత్త సార్కోమా కేన్సర్ బాధితులని తెలిసిందో..వెంటనే అనుమానంతో డాక్లర్లు వైద్య పరీక్షలు చేయగా..తీవ్రమైన ఆస్టియోసార్కోమా కేన్సర్ నిర్థారణ అయ్యింది. స్కానింగ్లో ఆమె కుడి తొడ ఎముకలో ఈ కేన్సర్ కణితిని గుర్తించారు. దాంతో వైద్యులు కీమోథెరపీ చేయించి, లింబ్ సాల్వేజ్ సర్జరీ చేశారు. ఈ ప్రక్రియలో మోకాలి కీలును టైటానియం ఇంప్లాంట్తో భర్తీ చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు హాయిగా స్కూల్కి వెళ్లి..యథావిధిగా చదువుకోడం ప్రారంభించింది. మళ్లీ ఆ మహమ్మారి 2020లో దాడి చేసింది. ఈసారి ఆమె కాలుని పూర్తిగా తొలగించక తప్పలేదు. అదే ఏడాది అదనపు కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి జరిగాయి. ఆమె సొంత స్టెమ్ సెల్స్ ఉపయోగించి మొట్టమొదిటి మార్పిడి చేశారు. దాదాపు వందరోజులపైనే ఆస్ప్రత్రిలో చికిత్స పొందింది. అక్కడితో ఆ కేన్సర్ విజృంభణ ఆగలేదు. ముచ్చటగా మూడోసారి 2022లో, ఆమెకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందింది. ఇది అతి తీవ్రమైన ఎముక మజ్జ రుగ్మత.ఇది మళ్లీ దాడిచేసే అరుదైన కేన్సర్వ్యాధి. అయితే ఈసారి ఆమెకు అండగా తల్లి నిలబడింది. తల్లి ఎముకమజ్జ మార్పిడితో లకితాకి చికిత్స అందించారు. ఈప్రక్రియ విజయవంతమైంది. ఇక్కడ లకితా మూడోసారి ఎదుర్కొన్న తీవ్రమైన ఎముకమజ్జ మార్పడి..బహుళ కేన్సర్లకు దారితీసే జీవితకాల ప్రమాదం. కానీ ఆమె జన్యువులు దూకుడు లేకుండా చికిత్సా వ్యూహానికి అనుమతించి..తగ్గుముఖం పట్టడం విశేషం. అయితే ఆమెకు సదా వైద్యు పర్యవేక్షణ తప్పనిసరి. కనీసం రెండు మూడేళ్ల కొకసారి కేన్సర్ పరీక్షలు చేయిచుకోక తప్పదు. ఇన్ని కష్టాల మధ్య చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ఇప్పుడు సైకాలజీ, సామాజిక శాస్త్రం, సాహిత్యం ఏ లెవెల్ను చదువుతోంది. పైగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉంది. తాను పరుగెత్తలేకపోయినా, జిమ్నాస్టిక్స్ చేయలేకపోతేనేం..డ్యాన్స్ చేయగలను, పేయింటింగ్ వేయగలను అంటోంది. పునరావృతమయ్యే బోన్ కేన్సర్, లి-ఫ్రామిని సిండ్రోమ్పై ధైర్యంగా పోరాడిని ధీరురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కేన్సర్ బాధితుల్లో స్థైర్యాన్ని నింపేలా గొప్ప సందేశాన్ని కూడా అందిస్తుంటుంది. మీరు కేన్సర్ రోగిగా ఆస్పత్రల్లో గడపడం కష్టమే అయినపపటికీ తెలియన ధైర్యంతో సాగుతారు. ఆ వ్యాధని చూసి భయపడినప్పటికీ స్ట్రాంగ్గా మారతారు. అప్పుడు తెలుస్తుంది మీరు రోగి కాదు..హీరో అనే సందేశాలతో వాళ్లను వీరోచితంగా కేన్సర్పై పోరాడేలా చేస్తుంది లకితా. (చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!) -
నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!
మనం ఒక భవనాన్ని చూసినప్పుడు దాని రంగులు, కిటికీలు కనిపిస్తాయి కానీ, భూమి లోపల ఉన్న పునాది కనిపించదు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. మీరు ఈరోజు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, లేదా ఎంత భయపడుతున్నా.. దాని వెనుక మీ జీవితంలోని మొదటి 2,000 రోజులు (మొదటి ఐదేళ్లు) ఉన్నాయి.సైకాలజీలో ఒక ప్రసిద్ధ మాట ఉంది: "Give me a child until he is seven, and I will show you the man." అంటే, ఏడేళ్ల లోపు ఒక బిడ్డను నాకు ఇస్తే, అతను భవిష్యత్తులో ఎలాంటి వాడో నేను చెప్పగలను అని. ఎలిజబెత్ హర్లాక్ ఈ కాలాన్ని 'పునాది దశ' (Foundational Stage) అని పిలిచారు.నమ్మకం vs అపనమ్మకం (Trust vs Mistrust): పుట్టిన మొదటి ఏడాది బిడ్డ పుట్టిన మొదటి ఏడాదిలో నేర్చుకునే అత్యంత ముఖ్యమైన విషయం "ప్రపంచం సురక్షితమైనదా? కాదా?".సురక్షితమైన పునాది: బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి వెంటనే పాలు పట్టడం, దగ్గరకు తీసుకోవడం, ప్రేమగా నిమరడం చేస్తే.. ఆ బిడ్డ సబ్-కాన్షియస్ మైండ్లో "ఈ ప్రపంచం నమ్మదగినది. ఇక్కడ నా అవసరాలు తీరుతాయి" అనే నమ్మకం కలుగుతుంది. ఇది భవిష్యత్తులో ఆ వ్యక్తి ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి పునాది అవుతుంది.అభద్రతా భావం: అదే బిడ్డను పట్టించుకోకపోతే, ఆకలితో ఏడుస్తున్నా నిర్లక్ష్యం చేస్తే.. "ఎవరినీ నమ్మలేం, నా గురించి ఎవరూ పట్టించుకోరు" అనే అభద్రతా భావం మొదలవుతుంది. పెద్దయ్యాక ఇలాంటి వారు ఎవరినీ త్వరగా నమ్మలేరు (Trust issues).స్వయంప్రతిపత్తి (Autonomy): 2 నుండి 3 ఏళ్లుఈ దశలో బిడ్డ తన కాళ్లపై తాను నడవడం, తన చేత్తో తాను తినడం నేర్చుకుంటాడు. అంటే తనకంటూ ఒక 'ఇచ్ఛ' (Will) ఉందని గుర్తించే సమయం.పర్యవేక్షణ vs అణచివేత: బిడ్డ తనంతట తాను ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు (ఉదాహరణకు: గ్లాసుతో నీళ్లు తాగడం), తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం (Self-confidence) పెరుగుతుంది."వద్దు.. నువ్వు వొంపేస్తావు, నీకు రాదు" అని ప్రతిదానికీ అరిస్తే.. వారిలో సందేహం (Doubt), సిగ్గు (Shame) మొదలవుతాయి. "నేను ఏదీ సరిగ్గా చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-ఇమేజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది.చొరవ (Initiative): 4 నుండి 5 ఏళ్లుఈ వయస్సులో పిల్లలు చాలా ప్రశ్నలు వేస్తారు. ప్రతిదీ తెలుసుకోవాలని కుతూహల పడతారు. ప్రపంచాన్ని ఒక 'ప్లే గ్రౌండ్' లా చూస్తారు.సృజనాత్మకత: పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్తూ, వారి ఆటలను ప్రోత్సహిస్తే వారిలో నాయకత్వ లక్షణాలు (Leadership), సృజనాత్మకత (Creativity) పెరుగుతాయి.అపరాధభావం (Guilt): వారి ప్రశ్నలను విసుక్కుంటే, వారి ఆటలను అల్లరిగా భావించి శిక్షిస్తే.. "నేను ఏదో తప్పు చేస్తున్నాను" అనే గిల్ట్ ఫీలింగ్ వారిలో నాటుకుపోతుంది. పెద్దయ్యాక వీరు ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా భయపడతారు.సో-కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్లు ఇచ్చే చిట్కాలు (ఉదాహరణకు: అద్దం ముందు నిలబడి గట్టిగా అరవడం) ఈ లోతైన పునాది గోడలను మార్చలేవు.ఎందుకంటే...మీరు 30 ఏళ్ల వయస్సులో "నేను కాన్ఫిడెంట్గా ఉండాలి" అని అనుకుంటున్నారు. కానీ మీ సబ్-కాన్షియస్ మైండ్లో 3 ఏళ్ల వయస్సులో పడ్డ "నువ్వు ఏదీ సరిగ్గా చేయలేవు" అనే ముద్ర అలాగే ఉంది. పైన మీరు ఎన్ని కోట్లు వేసుకున్నా, లోపల ఆ చిన్న పిల్లాడు ఇంకా భయపడుతూనే ఉంటాడు.Real Personality Development అంటే.. ఆ చిన్ననాటి ముద్రలను గుర్తించి, వాటిని రీ-ప్రోగ్రామ్ చేయడం, మీ ఇన్నర్ చైల్డ్ ను హీల్ చేయడం. కేవలం బాడీ లాంగ్వేజ్ మార్చడం కాదు.ఇదే నిజమైన వ్యక్తిత్వ వికాసం: Genius Matrix WayStep 1: Break (విశ్లేషించడం)మీరు ఇప్పుడు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా (ఉదాహరణకు: స్టేజ్ ఫియర్, రిలేషన్షిప్ సమస్యలు), దానికి మూలాలు మీ మొదటి ఐదేళ్లలో ఎక్కడ ఉన్నాయో వెతకండి."నన్ను చిన్నప్పుడు అతిగా కంట్రోల్ చేశారా?""నా అవసరాలను నా తల్లిదండ్రులు గుర్తించారా?"ఈ విశ్లేషణే మీ పాత వ్యక్తిత్వాన్ని 'బ్రేక్' చేస్తుంది.Step 2: Build (తిరిగి నిర్మించడం)మీ చిన్నతనంలో మీకు దక్కని ప్రోత్సాహాన్ని ఇప్పుడు మీరు మీకు ఇచ్చుకోవాలి. దీనినే 'Reparenting yourself' అంటారు. మీ అంతరాత్మతో మీరు మాట్లాడే తీరును మార్చుకోవాలి."నీకు చేతకాదు" అనే మాటను "నువ్వు నేర్చుకోగలవు" అనే మాటతో రీప్లేస్ చేయాలి.Step 3: Beyond (పరిమితులకు ఆవల)ఒక్కసారి మీ మూలాలు మీకు అర్థమైతే, పాత గాయాలు మీ వ్యక్తిత్వాన్ని శాసించవు. మీరు ఒక స్వేచ్ఛా జీవిగా మారుతారు. ఎదుటివారి సర్టిఫికేట్లతో సంబంధం లేకుండా మీ లెగసీని మీరు నిర్మించుకుంటారు.మొదటి ఐదేళ్లు మీ వ్యక్తిత్వానికి పునాది వేశాయి. అది మీ తప్పు కాదు. కానీ 25 లేదా 30 ఏళ్ల వయస్సులో కూడా అదే పాత భయాలతో బ్రతకడం మీ బాధ్యతారాహిత్యం అవుతుంది. మిమ్మల్ని మీరు రీ-డిజైన్ చేసుకోగలరు!ఎలిజబెత్ హర్లాక్ చెప్పినట్లు, వ్యక్తిత్వం అనేది 'డైనమిక్'. అంటే దాన్ని మార్చుకోవచ్చు. మీ పునాది గోడల్లో పగుళ్లు ఉన్నాయని తెలిస్తే, వాటిని సిమెంట్ వేసి పూడ్చవచ్చు. ఆ పునాదిని అర్థం చేసుకోవడమే Real Personality Development.Self-Reflection: ఈరోజు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీ ఐదేళ్ల వయస్సును గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరు ఎలా ఉండేవారు? మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎలా చూసేవారు? ఆ జ్ఞాపకాల్లోనే మీ వ్యక్తిత్వ రహస్యం దాగి ఉంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The DNA of You: 'పర్సనాలిటీ'కి పునాది ఎక్కడ పడుతుందంటే..!) -
గుండెపోటు మరోసారి రాకూడదంటే..!
గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా. అందువల్ల గుండె పోటు నుంచి బయటపడ్డ రోగులు..మరోసారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొద్ది మోతాదులో వ్యాయామాలు చేయడంవేళకు భోజనం చేయాలిఅధిక కేలరీలు, కొలస్ట్రాల్తో కూడిన భోజనం నివారించాలి.డైట్ ఎలా ఉండాలంటే..1. తృణధాన్యాలు - ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్లు, గోధుమలు తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.2. తాజా కూరగాయలు, పండ్లు - ఆకుకూరలు, టమోటాలు, క్యారెట్లు, బెర్రీలు, ఆపిల్స్, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి ధమనుల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.3. ఆరోగ్యకరమైన కొవ్వులు మితంగా - నట్స్, ఆలివ్ నూనె, ఆవాల నూనె, కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఇవి మంచి HDL కొలెస్ట్రాల్ను అందించి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తాయి. 4. ప్రోటీన్ కంటెంట్ కోసం - పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు, చేపలు, స్కిన్లెస్ చికెన్. సాల్మన్ వంటి కొవ్వు చేపలు గుండెకు రక్షణ కల్పించే ఒమేగా-3 కొవ్వులను అందిస్తాయి.5. ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.రోగులు ఖచ్చితంగా నివారించాల్సినవి..1. అధిక ఉప్పు: ప్యాక్ చేసిన స్నాక్ ఫుడ్స్, ఊరగాయలు, పాపడ్లు, సాస్లు, తినడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు తదితరాలు సోడియం ప్రధానంగా ఉండే ఆహారాలు. ఇవి రక్తపోటును పెంచి, గుండెపై భారం పడేలా చేస్తాయి.2. డీప్-ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్స్, నామ్కీన్లు, వేయించిన రుచికరమైన స్నాక్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి.3. శుద్ధి చేసిన చక్కెరలు, చక్కెర పానీయాలు - స్వీట్లు, డెజర్ట్లు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్లు, తదితరాలు అధిక బరువుకి, గుండె జబ్బులకు కారణమవుతాయి.4. మటన్ వంటి ఎర్రటి మాంసం వినియోగాన్ని తగ్గించాలి5. ఆల్కహాల్ - మద్యం వినియోగాన్ని నివారించాలి లేదా పరిమితం చేయాలి. ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది,పైగా గుండెకు నేరుగా విషపూరితమైనది కూడా.గుండె ఆరోగ్యం బాగుండాలంటే..కొద్దిపాటి వ్యాయామాలు, మందులు, ఒత్తిడి నిర్వహణ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు.డాక్టర్ గిరీష్ గాడ్బోల్, డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్,ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ -
ఆ తాతగారి లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..!
ఇటీవలకాలంలో అందరిలో ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. మంచి ఆహారపు అలవాట్లు,వర్కౌట్లతో హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ప్రోటీన్ పౌడర్లు, జిమ్లు వంటి వాటితో ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఈ తాత అంతలా ఆరోగ్యం కోసం ఏమాత్రం ఖర్చు చేయకుండానే..చాలా చురుకుగా, దీర్ఘాయువుతో ఉండటం విశేషం. ఈ ఏజ్లో కూడా అన్ని పనులు తానే చాలా యాక్టివ్గా చేసుకుంటున్న తీరుకి ఫిదా అవ్వాల్సిందే. మరి అతడి ఆరోగ్య రహస్యం ఏంటో చూద్దామా..ఆ తాత గారి గురించి ఆయన మనవరాలు కంటెంట్ క్రియేటర్ 28 ఏళ్ల సింధూ ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట సంచలనంగా మారడమే కాదు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తన తాతగారికి దగ్గర దగ్గర 95 ఏళ్ల ఉంటాయని, ఆయన రిటైర్డ్ అనస్థీషియాలజిస్ట్ అని వీడియోలో వివరిస్తోంది సింధు. ఆమె తన తాతగారి రోజు ఉదయం 5.30 గంటలకు యోగాతో ప్రారంభమవుతుందని, పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలకు పైనే అవుతున్నా..ల్యాప్టాప్లో వైద్య సాహిత్యం గురించి చదవడం, కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. వీటి అన్నింటి తోపాటు అప్పుడప్పుడు షాపింగ్ ట్రిప్పులు, రోజువారీ పూజ, ధ్యానం, యాప్లు లేకుండా సాధన చేయడం తదితరాలు ఉన్నాయి. ఇవేగాక తన వంటను తానే చేసుకుంటారని, "మినీ ఇడ్లీలు" వండటంలో మంచి నిపుణుడని చమత్కరిస్తోంది. ఆయన రిటైర్ అయ్యాక కూడా వైద్యవృత్తిపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ వాటికి సంబంధించినవి చదవడం, ఆర్టికల్స్ రాయడం వంటివి చేస్తుంటారని చెబుతోంది. ఆయన తమిళనాడులోని మధురైలో చాలా ఏళ్లుగా అనస్థీషియాలజిస్ట్గా పనిచేసినట్లు పేర్కొంది. తన తాతగారి రోజువారీ దినచర్య దీర్ఘకాల ఆరోగ్యానికి ఖరీదైన ధోరణులతో పనిలేదని నిరూపించింది. ఇప్పటికీ ఆయన హ్యాపీగా వాక్ చేస్తారు, వంటకూడా చేసుకుంటారు, కొత్తకొత్త నైపుణ్యాలను నేర్చుకుంటుంటారు. పైగా ఆయన ఎలాంటి జిమ్ సభ్యుత్వం లేకుండా, కనీసం సప్లిమెంట్లపై ఆధారపడకుండా.. జస్ట్ శ్రద్ధ అనే రెండు అక్షరాల పదంపై ఫోకస్ పెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడని సింధు చెపుకొచ్చింది. దక్షిణాసియా హిందూ సంప్రదాయల్లో వందల ఏళ్ల నుంచి రోజువారీ కదలికలు, భావోద్వేగాలపై నియంత్రణ, మానసిక స్పష్టత తదితరాలు ఉన్నాయి. అయితే వాటిని కంటిన్యూ చేసేలా జీవన విధానంలో భాగమైతే తన తాతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చని అంటోంది. చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే మనస్తత్వం ఉన్నవారికి ఎదురే ఉండదని, అది వారికి బలోపేతంగా ఉండేలా సామర్థ్యాన్ని అందిస్తుందని అంటోంది. View this post on Instagram A post shared by Sindhu 👩🏽🍳 (@sindhusfoodforthought) (చదవండి: అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్!) -
కిరణ్ రావుకు చికున్గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..
బాలీవుడ్ చిత్ర నిర్మాత కిరణ్ రావు ఇటీవల సోషల్ మీడియా పోస్ట్లో తనకు చికున్గున్యా వచ్చినట్లు తెలిపారు. దాని కారణంగా కనీసం పుస్తకం కూడా పట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆ వ్యాధి తన కీళ్లను ఎంతలా బలహీనపరిచిందో వివరించారామె. అసలు ఈ వ్యాధి అంతలా కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా అంటే..ఆల్ఫావైరస్ అనే దోమ జాతి కారణంగా RNA వైరస్ అయిన చికున్గున్యా మానవ శరీరం లక్ష్యంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో జ్వరం తగ్గుతుందేమో కానీ..దాని తాలుకా ఇబ్బందులు శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి, ఎదుర్కొంటాం కూడా అంటున్నారు నిపుణులు. అసలు 'చికున్గున్యా' అంటేనే వంగి ఉండే భంగిమ అని అర్థం. అంటే మన కీళ్లను, కండరాలపై ప్రభావం చూపి..కదపలేని పరిస్థితికి తీసుకువస్తాయి.కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..ఏడిస్ ఈజిప్టి లేదా ఏడిస్ ఆల్బోపిక్టస్ వంటి జాతి దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందట. ఆ దోమకాటు కారణంగా ఈ చికున్గున్యా వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించి కీళ్లలోని బంధన కణజాలం సైనోవియల్ ఫైబ్రోబ్లాస్ట్లకు వ్యాపిస్తుంది. దాంతో మనకు శరీరమంతా విపరీతమైన నొప్పులు..నడవాలన్న వణుకు పుట్టడం వంటి సమస్యలు వస్తాయట. ఇది మన రోగ నిరోధక వ్యవస్థపై త్రీవంగా దాడి చేస్తుందట. ఫలితంగా శరీరంలో పలుచోట్ల వాపులు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ వైరస్ చాలా దూకుడుగా ఉంటుందని, ఒక్కోసారి దీర్ఘకాలిక కీళ్ల వ్యాధిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. కొందరిలో రుమటాయడ్ ఆర్థరైటిస్ బారిన పడేలా చేస్తుందట. అంతేగాదు కొంతమందికి కోలుకున్నాక కూడా పూర్తిస్థాయిలో కదలికలను తిరిగి పొందలేరట. అలాంటి వారికి ఫిజియోథెరపీ అవసరం ఏర్పడుతుందని చెబుతున్నారు. నిరంతర కీళ్లనొప్పి ఈ వ్యాధి ముఖ్య లక్షణంగా చెబుతున్నారు నిపుణులు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. అంటే పూలకుండీలు, ఇంటి బయట ఉండే కంటైనర్లు లేదా డ్రమ్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలనిపగటి పూట కుట్టే దోమల వల్ల వస్తుంది కాబట్టి..పొడవాటి చేతులు ఉన్న బట్టలు ధరించాలి. దోమల కుట్టకుండా లోషన్లు వంటివి రాసుకోవడం చేయాలి. అవసరమైతే దోమతెరలు తదితరాలను వాడటంఅలాగే ఇంట్లో ఎవ్వరికైనా చికున్గున్యా వస్తే..తక్షణమే దోమల రాకుండా తగిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి.చివరగా ఈవ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఓపికతో తగిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. దీనికి నిర్ధిష్ట నివారిణి గానీ, టీకా వంటివి లేవని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. త్వరితగతిన కోలుకోవాలంటే మాత్రం..జ్వరం తగ్గేలా మందులు తీసుకుంటూ..వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు పుష్కలంగా తీసుకోవాలి. అలాగే కీళ్లు మరి బిగిసుపోకుండా ఉండేలా సాగదీయడం, ఫిజియోథెరపీ వంటివి తీసుకోవడం వంటివి చేయాని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..) -
‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
కంటతడిపై ‘కన్నే’యండి!కొందరిలో కళ్లనిండా నీళ్లు ఉండటం... కళ్లు చెమ్మగిల్లినట్టుగా ఉండటం కనిపిస్తుండేదే. ఇందుకు చాలా అంశాలు కారణమవుతాయి. ఇలా కళ్లలో నీరు ఉన్నట్లు కనిపిస్తుండటం, చెమ్మగిల్లుతూ ఉండటానికికారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలు...కళ్లలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్తో కళ్లుమండుతూ ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి అంశాలతో అలర్జీ వల్ల కళ్లకలక (కంజంక్టివైటిస్) వంటి ఇన్ఫెక్షన్లతో కళ్లలో నీళ్లూరేందుకు ఉండే డక్ట్స్ మూసుకుపోవడంతో కన్నీళ్లు బలవంతంగా రావడానికి ప్రయత్నించడం ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ ఉన్నవాళ్లలో. ఇక్కడ ఒక సందేహం కలగడం సాధారణం. అంటే డ్రై ఐస్ సిండ్రోమ్లో కళ్లు పొడిబారాలి కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ సిండ్రోమ్లో కళ్లుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీన్నే ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కళ్లలో నీరు ఎక్కువగా ఊరుతుంది.నివారణ, చికిత్స...∙చిన్నపిల్లల కళ్లల్లో ఇలా నీరూరుతున్నప్పుడు లేదా కళ్లలోకి దుమ్మువెళ్లినప్పుడు పాతకాలపు పెద్దవాళ్లు ఓ మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను ఉండగా చేసి, దానిపై నోటితో గాలి ఊది దాన్ని కొద్దిగా వెచ్చబడేలా చేసి కంటిపై అద్దడం అన్నది కాస్తంత మధ్యవయస్కులకూ, పెద్దవాళ్లకు తెలిసిందే. అలా కాస్తంత గోరువెచ్చని ఆవిరితో గుడ్డను ఉండగా చేసి కళ్లపై అద్దడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది అలర్జీ వల్ల ఇలా జరిగినప్పుడు డాక్టర్ల సూచన మేరకు యాంటిహిస్టమైన్చుక్కల మందు వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగితే డాక్టర్లు యాంటీబయాటిక్ చుక్కల మందును సూచిస్తారు మాటిమాటికీ కళ్లను తాకకుండా ఉండాలి ∙ఇంతకు మించి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కళ్ల డాక్టర్ను సంప్రదించాలి.ఉబ్బు కళ్లు...కొందరిలో ఉబ్బుకళ్లు కనిపిస్తుంటాయి. పొద్దున్నే నిద్రలేవగానే కొద్దిసేపటి వరకు ఉబ్బుకళ్లు కనిపించడం మామూలే. కానీ కొందరిలో ఇవి చాలాసేపు అలాగే ఉండి΄ోతాయి. ఈ సమస్యను ఇంగ్లిష్లో ‘పఫ్ఫీ ఐస్’ అంటుంటారు. సాధారణంగా చాలామందిలో ఇది తాత్కాలిక సమస్యే. కళ్లు బాగా అలసి΄ోవడం (ఫెటీగ్) వల్ల కూడా ఇలా జరగవచ్చు.కారణాలు...∙రాత్రి ఎక్కువసేపు నిద్ర΄ోకుండా ఉండటం లేదా నిద్రలేమి కారణంగా ∙క్రితం రాత్రి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కొందరిలో ఉప్పుకారాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ∙ఇక చాలామందిలో ఇలా కళ్లు ఉబ్బినట్టుగా ఉండటం లేదా కళ్ల కింద చర్మం జారినట్టుగా ఉండటమన్నది వయసు పెరుగుతుండటం (ఏజింగ్) వల్ల జరగవచ్చు ∙మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలోనూ, రక్తంలో ్ర΄ోటీన్ తక్కువగా ఉండటం వల్ల, అలాగే రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లలోనూ ఇలా ఉబ్బుకళ్లు కనిపిస్తాయి.నివారణ / చికిత్స...మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై అద్దడం (కోల్డ్ కంప్రెస్)ఆహారంలో ఉప్పుకారాల మోతాదును తగ్గించడం కంటినిండా గాఢంగా నిద్ర΄ోవడం.డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు ఈ సూచనలు పాటించండికళ్ల జాగ్రత్తల్లో 20 – 20 – 20 అనేది ఓ మంచి సూచన. అంటే... ప్రతి 20 నిమిషాలకోసారి మనం దృష్టిని కేంద్రీకరించి ఉన్న అంశంపైనుంచి (కంప్యూటర్ / ఫోన్) దృష్టి మరల్చి 20 ఫీట్ల దూరంలో ఉన్న మరో వస్తువును 20 సెకన్ల పాటు చూస్తుండటం. ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నా లేదా వృత్తిరీత్యా కంప్యూటర్ స్క్రీన్ గానీ, టీవీ స్క్రీన్నుగానీ తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా చేయడం మంచిది. టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఇలా ఏదైనప్పటికీ ఆ స్క్రీన్ టైమ్ను గణనీయంగా తగ్గించడం ∙తరచూ కన్రెప్పలను కదిలిస్తూ / మూస్తూ ఉండాలి. (అంటే బ్లింకింగ్ చేస్తూ ఉండాలి). ఫలితంగా కన్నీరు కంటిపైన సమంగా అలముకుని కంటిని పొడిబారకుండా కాపాడుతుంది ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ చాలాసేపు నడుస్తుంటే అక్కడి వాతావరణంలోని గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇలా చాలాసేపు ఏసీలో ఉన్నవారు కాసేపు మామూలు వాతావరణంలోనూ కిసేపు గడపాలి కళ్లజోడు తాలూకు గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్సులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. పవర్ మారిందని తెలుసుకోగానే తగిన పవర్ ఉన్న అద్దాలను మార్చుకోవాలి. ఈ కొద్ది΄ాటి జాగ్రత్తల తర్వాత కూడా కంటికి సంబంధించిన అసౌకర్యం తగ్గక΄ోతే వెంటనే కంటి డాక్టర్ను తప్పక సంప్రదించాలి. నిర్వహణ యాసీన్ (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..
వెయిట్లాస్ జర్నీలో అనేది శారీరక, భావోద్వేగ ఇబ్బందులతో ముడిపడి ఉన్న అంశం అని అంటోంది ఓ డాక్టర్. తాను ప్రెగ్నెన్సీ అనతరం ఎంతలా బరువు పెరిగిందో సవివరంగా తెలిపింది. ఆ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఎంతలా శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కుందో తెలిపింది. ఆఖరికి వెయిట్లాస్ మందులు సైతం పెద్దగా ఫలితం ఇవ్వకపోగా..చివరికి దుష్ప్రభావాల బారినపడి ఎంతలా ఇబ్బందిపడిందో పేర్కొంది. అయితే బరువు తగ్గాలంటే అచంచలమైన ఓపిక, స్థిరత్వం అత్యంత ముఖ్యమని అంటున్నారామె. అలా అన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ..ఒకటిన్న ఏడాదిలోపు చాలా బరువు తగ్గగలిగానని అంటోంది. ఎవరా డాక్టర్..? ఆమె వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..చెన్నైకి చెందిన వైద్యురాలు ప్రీతి మృణాళిని తన వెయిట్లాస్ జర్నీ గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన లాపరోస్కోపిక్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళినికి వైద్యురాలిగా 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె ప్రసవం తర్వాత తన బాడీ ఎలా మారిపోయిందో వివరించారు. 2021లో గర్భందాల్చినప్పుడు తన బరువు 78 కిలోలని పేర్కొంది. అయితే 2022లో ప్రసవం అనంతరం 79 కిలోలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులోనూ సీ సెక్షన్ కారణంగా ఒక నెలపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడంతో విపరీతమైన ఆకలి విపరీతంగే వేసేదని, దాంతో 92 కిలోలు దాక పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఉయం మేల్కొని వ్యాయామాలు చేస్తూ ఉండేదాన్ని..అయితే బరువులో మార్పు లేకపోగా..మరింత అధికమైంది. ఈ అధిక బరువు తన రూపంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని అంటోంది. అప్పుడే జీఎల్పీ 1 అనే బరువు తగ్గించే మందులను వాడినట్లు తెలిపారు. దాంతో మార్పు కనబడటం మొదలైది కానీ ఒక కిలోనే తగ్గానని అన్నారు. అయితే ఈ డ్రగ్ కారణంగా జుట్టు రాలిపోవడం, నోరు పొడిబారడం, వ్యాయమం సమయలో కండరాల అలసట తదితర సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే చాలా ఓపికతో తన జీవనశైలిని మార్చుకుని..బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టి సుమారు 14 కిలోలు తగ్గినట్టు తెలిపారు. సమారు ఏడాదిన్నరకి మంచి ఫలితాన్ని అందుకోగలిగానని అన్నారు. డాక్టర్ మృణాలిని చెబుతోంది ఒకటే..బరువు తగ్గడంలో కావాల్సింది, ఓపిక, భావోద్వేగాన్ని నియంత్రించేలా స్థిరతత్వం అత్యంత ప్రధానమని అంటోంది. కాగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..జీఎల్పీ 1 మందులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కడుపు నిండిపోయిన అనుభూతిని, జీర్ణక్రియను నెమ్మదింపచేసేలా సహజ హర్మోన్లా అనుకరించే మందు. కానీ ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో సలహాలు సూచనలతో వాడాల్సి ఉందనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
కంటెంట్ క్రియేటర్, కమెడియన్, బాలీవుడ్ నటి ఐశ్వర్య మోహన్ రాజ్ స్లిమ్గా మారిన సంగతి తెలిసిందే. అంతేగాదు తన వెయిట్లాస్ సీక్రెట్ని కూడా చాలా నిజాయితీగా బయటపెట్టారామె. తాను వెయిట్లాస్ డ్రగ్ మౌంజారోని వాడనని దానివల్ల 22 కిలోలు వరకు బరువు తగ్గానని నర్మగర్భంగా చెప్పారామె. అయితే అలా చెప్పినందుకు పలువురు విమర్శించారు కూడా. కానీ బాలీవుడ్ నటి సోహ అలీఖాన్ వంటి పలువురు ప్రముఖులు ఆమె నిజాయితీని ప్రశంసించారు. మరి ఇంతకీ ఇలాంటి బరువు తగ్గించే మందులు ఆరోగ్యానికి సురక్షితమేనా..? దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..అయితే కమెడియన్ ఐశ్వర్య మోహన్ రాజ్ బరువు తగ్గేందుకు మౌంజారోలాంటివి హెల్ప్ అవుతాయి గానీ వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలిపినప్పటికీ..చాలామంది ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మందులు ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయనేది వారందరి వాదన. ఈ నేపథ్యంలో సోహా అలీ ఖాన్ తన తాజా పాడ్కాస్ట్లో ఎండోక్రినాలజీ అండ్ డయాబెటాలజీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అంబ్రిష్ మిథల్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జూహి అగర్వాల్తో చర్చించి మరి ఎలాంటి వాళ్లు బరువు తగ్గించే మందులు తీసుకోవచ్చు?ఎవరికి మంచిది కాదు తదితరాలను అడిగి అందరి అనుమానాలను పటాపంచలు చేశారామె. వాళ్లంతా ఏచెబుతున్నారంటే..ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్, డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిక్ , ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులు బరువు తగ్గించే మందులను సిఫారసు చేస్తారని చెప్పారు. వాటి సాయంతో బరువు తగ్గితే సదరు రోగి పరిస్థితి మెరుగుపడుతుంది..తదనుగుణంగా అప్పటి నుంచి జీవనశైలిలో మార్పులు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెప్పారు. View this post on Instagram A post shared by Soha (@sakpataudi) బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) 27 లేదా 30 ఉంటే వాళ్లు వైద్యుల సూచన మేరకు నిరభ్యంతరంగా ఈ బరువు తగ్గించే మందులు వాడొచ్చని అన్నారు. ఇంతకుమునుపు వెయిట్లాస్ డ్రగ్స్ అత్యంత ఖరీదుగా ఉండేవి. ఇప్పుడు నెలకు తక్కువ మోతాదు అయితే రూ. 12000లని, అదే ఎక్కువ మోతాదు అయితే నెలకు రూ. 22,000 దాక ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఎవరికి మంచిది కాదంటే..థైరాయిడ్ కేన్సర్ చరితర ఉన్న వ్యక్తులుప్యాంక్రియాటైటిస్ చరిత్రజీర్ణశయాంతర సమస్యలుమధుమేహం కారణంగా కంటివ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తదితరులకు ఈ మందులు సరిపడవని చెప్పారు. ఏమందులైనా..నిపుణలు పర్యవేక్షణలో సలహాలు సూచనలతో ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. ప్రస్తుతం కాలంలో అధిక బరువు సమస్యతోనే అనారోగ్యం బారిన పడుతున్న వారెందరికో ఈ మందులు వరంగా మారాయని అంటున్నారు వైద్యనిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!) -
ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్..! సురక్షితమేనా..?
కొన్నికేన్సర్లు.. సులభంగా టెస్ట్లు చేయించుకోలేం. అలాంటి వాటిల్లో ఒకటి ఈ గర్భాశయ కేన్సర్. ఇది కాస్త గోపత్యకు సంబంధించినవి కావడంతో మహిళలు క్లినిక్లను సందర్శించడంలో జాప్యం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వైద్యశాస్త్రం సాంకేతిక సాయంతో మరింత పురోగతిని అందించేలా మహిళలే స్వీయంగా చేసుకునే వెసులబాటు అందించింది. అంటే ఇంట్లోనే సులభంగా గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్(HPV స్వీయ-నమూనా అని కూడా పిలుస్తారు) చేసుకోవచ్చు అన్నమాట. ఇది భవిష్యత్తు కాలంలో మంచి గేమ్ ఛేంజర్గా ఉద్భవించనుంది. అచ్చం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ మాదిరిగానే ఇంట్లోనే గర్భాశయం ఆరోగ్యం కోసం మనమే స్వయంగా చేసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. అసలేంటి టెస్ట్? ఎలా చేయాలి?, సురక్షితమేనా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే..గర్భాశయం నుంచి కణాలను సేకరించడానికి వైద్యుడు స్పెక్యులమ్ను ఉపయోగించే సాంప్రదాయ పాప్ స్మియర్ మాదిరిగా కాకుండా, ఇంట్లోనే నిర్వహించే స్వీయ-నమూనా కిట్ ఇది. ఇందులో 95% కచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు నిపుణులుఎలా చేయాలంటే..కిట్: స్టెరైల్ స్వాబ్ (పొడవైన Q-టిప్ లాగా) లేదా ప్రత్యేకమైన బ్రష్ను కలిగి ఉన్న చిన్న ప్యాకేజీని అందుకుంటారు.బాత్రూమ్ లేదా గదిలో ఆ స్వాబ్ను యోనిలోకి చొప్పించి కొన్ని సెకన్ల పాటు తిప్పాలి. అది గర్భాశయాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ స్వాబ్ HPV DNA కలిగి ఉన్న యోని గోడల నుంచి కణాలు, ద్రవాలను తీసుకుంటుంది. ఆ స్వాబ్ను ప్రిజర్వేటివ్ ట్యూబ్లో ఉంచి, దానిని సమీపంలోని ల్యాబ్కు పంపించాలి. ఫలితం: పరీక్షలో నెగిటివ్ వస్తే..గర్భాశయ కేన్సర్వచ్చే ప్రమాదం చాలా తక్కువని, ఒకవేళ పాజిటివ్ అయితే ..ప్రమాదకర హెచ్పీవి శరీరంలో ఉందని అర్థం. అలాంటప్పుడు తదుపరి పాప్ స్మియర్ లేదా కోల్పోస్కోపీ కోసం గైనకాలజిస్ట్ను సందర్శించాలి.ఇక్కడ మహిళలకు ఓ వైద్యుడి మాదిరిగా చేసుకోగలమా అనే సందేహం రావడం సహజం. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), జేసీఓ గ్లోబల్ ఆంకాలజీ ఈ స్వీయ నమునా చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ముందుగా ఈ గర్భాశయ కేన్సర్ని గుర్తించడంలో సాంప్రదాయ పాప్ స్మియర్ల కంటే HPV DNA పరీక్షలు చాలా సులభంగా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించగలిగేవని పేర్కొంది. ఈ హెచ్పీవీ కిట్ల సాయంతో మహిళలు స్వయంగా సేకరించిన నమునాలు, వైద్యులు సేకరించిన వాటివలే ఉంటాయని హామి ఇచ్చింది కూడా. ఇది ప్రారంభ స్కీనింగ్ వైద్య పరీక్షగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కేన్సర్ని మందస్తు దశలోనే గుర్తించడానికి హెల్ప్ అయ్యే సాధనమే తప్ప కేన్సర్ని నిర్థారించేది మాత్రం కాదు.ఎందుకు అత్యంత ముఖ్యమైనదంటే..భారతదేశంలో, గర్భాశయ కేన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ కేన్సర్గా మారింది. ప్రతి ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది దాక మహిళలు ఈ వ్యాధి కారణాంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని నివారించేందుకు ఇంట్లేనే నిర్వహించుకునే ఈ సులభమైన స్క్రీనింగ్ పరీక్ష అత్యంత ప్రధానమైనదిగా మారింది.ఏవిధంగా అంటే..?ఈ టెస్ట్ నిమిత్తం చాలామంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతారు. ఆ అసౌకర్యాన్ని ఈ పరీక్ష తొలగిస్తుంది. అదీగాక గ్రామీణ మహిళలకు, అత్యంత బిజీగా ఉండే పట్టణ మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా వైద్య ఖర్చులను తగ్గిస్తుంది. పైగా ఈ పరీక్షలో ఎలాంటి నొప్పి ఉండదు, ఐదు నిమిషాల కంటే తక్కువ సమయమే పడుతుంది.నిజానికి ఈ కిట్లు ఆరోగ్యకరమైన భవిష్యత్తుగా వారధిగా పనిచేస్తాయి. పైగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వాళ్లు కనీసం మూడేళ్ల కొకసారైనా ఈ పరీక్షను చేసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్) -
పక్షవాతంతో మంచానికే పరిమితం..కానీ ఆయుర్వేదం నడిచేలా చేసింది..!
అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే తమిళ నటుడు అరవింద్ స్వామి నటన పరంగానే కాదు గ్లామరస్ పరంగా ఆయనకు సాటిలేరెవ్వరూ. బాంబే, రోజా మూవీలో వేలాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అరవింద్స్వామి. అలాంటి ఆయన కెరీర్పీక్లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలే ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరవవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాను ఎందుకు సినీ ఫీల్డ్కి ఎందుకు దూరంగా ఉన్నారో వెల్లడించారు. అనారోగ్యం బారిన పడటం ఒక కారణమైతే, అధిక బరువు మరో కారణమంటూ..తాను ఎదుర్కొన్య ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడ్డారంటే..అరవింద్ స్వామికి 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు ఎంతగానో నొప్పితో విలవిలలాడాడు. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన అది వద్దనుకుని కేరళకు చెందని ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంత ఇంత కాదని, ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయానని అన్నారు. కానీ ఆయుర్వేదం తనను మూడు రోజుల్లో తిరిగి నడిచేలా చేసిందన్నారు. అది నాకు చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తనకు పనిచేసింది కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని సూచించడం లేదు. అలాగే గుడ్డిగా కూడా ఫాలో కావొద్దన్నారు. వైద్యుల సూచనల మేరకు, ఆరోగ్య పరిస్థితి రీత్యా సరైన నిర్ణయం తీసుకోండని అన్నారు. ఇక్క నొప్పి, కదలలేని పరిస్థితి కంటే..మానసికంగా స్థైర్యంగా ఉండటం అత్యంత ప్రధానమని అన్నారు. ఆ పరిస్థితిలో నాకే ఇలా అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదన్నారు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే..ఫజిల్స్, చదరంగం వంటి ఆటలతో బిజీ అయిపోయినట్లు తెలిపారు. అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక మళ్లీ సినీ రంగంవైపుకి రావాలని అస్సలు అనుకోలేదు, సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఎందుకంటే ఆ టైంలో చాలా మందులు వాడటంతో విపరీతం బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి అదోలా తయారయ్యానని, దాంతో సినిమాల ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి. ఎంత టెక్నాలజీ అభివృద్ది చెంది..ఆధునాత వైద్యం చెంతకు చేరినా..ఏళ్లనాటి పురాతన ఆయుర్వేదమే అత్యుతమమని పలు ఉదంతాల్లో నిరూపితమైంది కూడా.(చదవండి: అమెరికా కోడలు..ఇండియా అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..) -
Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!
బరువు తగ్గడం అన్నది చాలామందికి అతిపెద్ద సమస్య. కానీ కొందరికి చాలా సింపుల్. అదికూడా నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండానే వెయిట్లాస్ అవుతారు. అలాగని, అధిక వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేయరు. సాధారణంగా రోజువారీగా చేసే సింపుల్ వ్యాయామాలు..కాస్త తెలిగా మంచి ఆహారం తీసుకుంటూ తగ్గుతారు. ఇక్కడ ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా..తగిన ప్రోటీన్లు, విటమిన్లు అందేలా జాగ్రత్త వహిస్తే..ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గేలా మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడొక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అదే నిరూపించాడు. రోజువారీ ఆహారాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని..అవలీలగా 35 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు బరువు తగ్గాలంటే ఈ ఏడు చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలని అంటున్నాడు. అవేంటో చూద్దామా..!ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అన్ష్ త్రిపాఠి కొలెస్ట్రాల్ తగ్గించే వాస్తవిక ఆహార నియమాలను షేర్ చేసుకున్నాడు. తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. బరువు తగ్గడంలో కన్ఫ్యూజన్కి గురికావొద్దని అంటున్నాడు. మన స్వచ్ఛమైన భారతీయ ఆహారంతోనే కొవ్వుని కరిగించేలా తీసుకుంటే చాలని చెబుతున్నాడు. ప్రధాన నియమం..కొలెస్ట్రాల్ని తగ్గించే ఆహారాలే మన భోజనపు ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ వేటిలో ఉంది..? తగినన్ని కూరగాయలు తింటున్నామా?.. నూనె దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్ వరకు అన్ని నియంత్రణలో ఉన్నాయా..? అని గమనించాలి. ఇక్కడ ఏది మిస్ అవ్వకూడదు. ఆహారంలో ఉండాల్సినవి..తప్పనిసరిగా సగం కూరగాయల్లో 1/4 వంతు ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలి.ప్రోటీన్ తప్పనిసరి..ఆహారంలో కొవ్వు నష్టాన్ని ప్రోటీన్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ తక్కువగా ఉంటే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. .కూరగాయలు తప్పనిసరి..ఆరోగ్యకరమైన ఆహారంలో అతి ముఖ్యమైన భాగం. ప్లేట్లో వండిన లేదా పచ్చిగా ఉన్న భోజనానికి కనీసం రెండు వేర్వేరు కూరగాయలు ఉండాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయికార్బోహైడ్రేట్ నియంత్రణ నియమంమన ఆహారంలో కార్బోహైడ్రేట్లను జోడించాలి కానీ మితంగా ఉండాలి. భోజనంలో 1 రోటీ లేదా 1 కప్పు బియ్యం ఉండేలా కేర్ తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాటి స్థానంలో పోహా లేదా ఉప్మాతో కూడా మార్చుకోవచ్చు. కొవ్వు/నూనె నియమండైట్ విషయంలో చాలామంది ఫెయిలైదే ఇక్కడే అని అంటున్నాడు. మన భోజనంలో రెండు నుంచి మూడు స్పూన్లకు మించి నూనె ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి.గుర్తించుకోవాల్సిన విషయాలుశాఖాహారుల కోసం, కొవ్వు తగ్గింపు ప్లేట్లో సగం ప్లేట్ సబ్జీ, 1 కటోరి పప్పు/పనీర్/టోఫు, 1 రోటీ లేదా చిన్న మొత్తం రైస్ ఉండాలి. శాఖాహారులకు కొవ్వు నష్టం కష్టంగా అనిపించిందంటే..ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువగా ఉందని అర్థం.అలాగే నాన్-వెజ్ ప్లేట్లో చికెన్/చేప/గుడ్లు ప్రధానంగా ఉంటాయి. ప్లేట్లో సగానికిపైగా కూరగాయలు ఉండాలి. సమతుల్యతను కాపాడుకోవడానికి కార్బ్ భాగం చిన్నగా ఉండాలి. భాగాలను నియంత్రించినప్పుడు మాత్రమే మాంసాహార ప్లేట్ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.అల్పాహారం ప్లేట్లలో తక్కువ కార్బోహైడ్రేట్లతో ప్రోటీన్ ఉండాలి, ద్రవ కేలరీలు ఉండకూడదు. అయితే డిన్నర్ లేదా లంచ్ ప్లేట్లో ప్రోటీన్ క్వాండిటీ తక్కువగా ఉంటే..ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండవచ్చు.చక్కెర పానీయాలు నివారించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలను ఇతరులతో షేర్ చేసుకోండి. ఇలా గనుక ఆహారంలో మార్పులు చేసుకుని తూచా తప్పకుండా ఫాలో అయితే..ఇట్టే బరువు తగ్గుతారంటూ తన పోస్ట్ని ముగించాడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ త్రిపాఠి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!) -
ఫ్యాటీలివర్తో బీకేర్ఫుల్..!
ఆల్కహాల్తో ఫ్యాటీలివర్ ముప్పు ఉందన్న విషయం తెలిసిందే. అయితే నిత్యం తాగేవారిలోనే ఈ ఫ్యాటీ లివర్ ముప్పు ఎక్కువ అనే అ΄ోహ గతంలో ఉండేది. తాజా తార్కాణాలూ, అనేక అధ్యయనాల ప్రకారం ఎప్పుడో ఒకసారి (అకేషనల్గా) తాగేవారికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని తెలుస్తోంది. దీనికి తోడు మగవాళ్లకు దీటుగా తాము ఆల్కహాల్కు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న మహిళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువ అంటూ పేర్కొంటున్నారు అధ్యయనవేత్తలు. సోషల్ డ్రింకింగ్, వీకెండ్ కాక్టెయిల్ పార్టీస్ అంటూనో లేదా ఇంట్లోనైనా ఎప్పుడో ఒకసారి అంటూ తాగేవారికి సైతం ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దాం...చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. అదేమిటంటే... చాలా కొద్దిమోతాదులో అంటే ప్రతిరోజూ 30 మి.లీ.కు మించకుండా ఆల్కహాల్... అందులోనూ రెడ్వైన్ తీసుకునేవారిలో గుండెజబ్బులు నివారితమవుతాయనీ, రక్తనాళాల్లోని కొవ్వు కొట్టుకు΄ోతుందనీ, అంత తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే అది ఫ్యాటీలివర్కు దారితీయదనీ... ఇలాంటి అ΄ోహలు ఎక్కువే ఉన్నాయి. అవన్నీ వాస్తవం కాదంటూ ఇటీవలి అనేక అధ్యయనాల్లో తేలింది. ఆల్కహాల్ ఎంత తక్కువ మోతాదులో తాగినా... అది కూడా చాలా అడపాదడపా(అకేషనల్గా) తీసుకున్నప్పటికీ ఫ్యాటీలివర్ ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఇటీవలే మన దేశంలోని మహిళలూ ఆల్కహాల్కు దగ్గరవుతున్న నేపథ్యంలో వాళ్లలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్యాటీలివర్ అంటే?మన రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తి కోసం రక్తంలోని చక్కెర ఉపయోగపడుతుంది. అటు తర్వాత మిగతా చక్కెర కొవ్వురూపంలో కాలేయంలో నిల్వ అవుతుంటుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం కంటే మన రోజువారీ కార్యకలాపాలు తగ్గుతూ పోతున్న కొద్దీ ఈ కొవ్వు నిల్వలు అలా పేరుకుపోతూ ఉండటంతో పాటు కాలేయ కణాలూ కొవ్వు కణాల్లా మారుతూ ఉంటాయి. ఇలా కాలేయ కణాల్లో కొవ్వు మోతాదులు పెరుగుతూ పోవడాన్ని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతాయి. అందులో మొదటిది ఆల్కహాల్ వినియోగం. రెండోది ఆల్కహాల్ కాకుండా ఇతరత్రా అంశాలు ఫ్యాటీలివర్కు కారణం కావడం. ఈ కారణాలను బట్టి ఫ్యాటీలివర్లోని రకాలివి... ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఏఎఫ్ఎల్డీ) : ఆల్కహాల్ వినియోగం వల్ల కాలేయంలో కొవ్వు చేరి ‘ఫ్యాటీలివర్’కు దారితీయడం. నాన్ ఆల్కహాలివ్ ఫ్యాటీలివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ) : దీనికి ఆల్కహాలిక్ ప్రధాన కారణం కాదు. అయితే జీవక్రియల తేడా కారణంగా వచ్చే వ్యాధులు (మెటబాలిక్ సిండ్రోమ్స్), స్థూలకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి కారణాల వల్ల ఈ ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది.నిర్ధారణ బాధితుల స్థూలకాయం, పొట్ట (సెంట్రల్ ఒబేసిటీ) చూసి డాక్టర్లు పరిస్థితిని కొంత తెలుసుకోగలరు. కొన్ని రక్తపరీక్షలు, వాటితోపాటు డయాబెటిస్, కొలెస్ట్రాల్ మోతాదులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు పెరిగాయా అన్నది చూడాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్లో ఫ్యాటీలివర్ కండిషన్ బయటపడుతుంది. కొందరిలో లివర్ బయాప్సీ (అంటే కాలేయం తాలూకు చిన్న ముక్కను సేకరించి చేసే) పరీక్ష అవసరం. లివర్ బయాప్సీతో ఎన్ఏఎఫ్ఎల్డీలో అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ (ఎన్ఏఎఎఫ్ఎల్) కండిషనా, లేక నాన్ ఆల్కహాలిక్ స్టియటో–హెపాటిక్ (నాశ్) కండిషనా అన్నది నిర్ధారణ చేయవచ్చు. ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్’ అనే వైద్యపరీక్ష ద్వారా లివర్లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయా, తగ్గాయా కూడా తెలుసుకోవచ్చు. మహిళల్లో మరింత ఎక్కువ ముప్పు ఎందుకంటే... ఆల్కహాలిక్ ఫాటీలివర్ ముప్పు మహిళల్లో మరింత ఎక్కువ. ఎందుకంటే వీళ్లలో పురుషులతో ΄ోలిస్తే వాళ్ల కాలేయం సైజు తక్కువ. అలాగే వాళ్ల ఒంట్లోని నీటి మోతాదులు కూడా తక్కువే. ఇక మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ కారణంగా ఆల్కహాల్ వాళ్ల రక్తంలో చాలా ఎక్కువగా గాఢతతో చాలాసేపు ఉంటుంది. అలా అరుదుగానే అప్పుడప్పుడూ తాగినా ఆ ఇంటర్మిట్టెంట్ ఆల్కహాల్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం, కొవ్వులు పేరుకుపోవడంతో పాటు ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కూడా పెరుగుతుందని ఈ అంశాలన్నీ మహిళల్లో ఫ్యాటీలివర్ను పెంచడంతోపాటు లివర్ ఫైబ్రోసిస్ ముప్పునూ చాలా ఎక్కువగా పెంచేస్తాయి. అందుకే 20 – 35 ఏళ్లున్న మహిళల్లో వాళ్ల ఆల్కహాల్ తీసుకునే మోతాదు ఎంత తక్కువైనప్పటికీ లివర్ ఫైబ్రోసిస్ రేటు చాలా పెరిగి΄ోతోంది. అందుకే పురుషులూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లలో ΄ోలిస్తే మహిళలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్ దుష్ప్రభావాలు మహిళల్లో కేవలం కాలేయాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ల రుతుక్రమం దెబ్బతినడం, హార్మోనల్ బ్యాలెన్స్ అతలా కుతలం కావడం, సంతానలేమి వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చు.లక్షణాలు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో పొట్ట బాగా పెరిగిపోతుంటుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఇలా కొద్దిమేరకు లక్షణాలు కనిపించవచ్చేమోగానీ...నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో చాలావరకు లక్షణాలు కనిపించవు.అయితే కొన్ని అంశాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ను సూచిస్తాయి. ఉదాహరణకు వీళ్లలోనూ పొట్ట బాగా పెరిగి, సెంట్రల్ ఒబేసిటీతో ముందుకు వచ్చి కనిపిస్తుంది. ∙ కొద్దిమందిలో కుడివైపు పొట్ట పైభాగంలో (ఉరఃపంజరం / రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. క్రమంగా కాలేయం పెరుగుతుండటం వల్ల ఇలా జరుగుతుంటుంది. నివారణ / చికిత్సఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయడం. డైట్ : ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం. ఇందులో చక్కెర, కొవ్వుల మోతాదులను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం, షుగర్–స్వీటెన్డ్ డ్రింక్స్ వంటి కూల్డ్రింక్స్ దూరంగా ఉండటం. అలాగే పొట్టుతో ఉండే ధాన్యాలూ (హోల్గ్రెయిన్స్), తాజా పండ్లు, కూరగాయల వంటి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. వ్యాయామం : రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. దేహానికి వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామాన్ని ఇవ్వడం. నివారణ నియమాలు పాటించడంతో పాటు ఫ్యాటీ లివర్ దశను బట్టి డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలతోపాటు క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు (అల్ట్రా సౌండ్, మెటబాలిక్ మార్కర్ పరీక్షలు) చేయించుకుంటూ ఉండటం. చివరగా... సోషల్ డ్రింకింగ్ లేదా వీకెండ్ పార్టీస్ అంటూ పార్టీ కల్చర్ పేరిట పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దేహానికి అత్యంత కీలకమైన భాగమైన కాలేయంపై పడే దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్కహాల్కు దూరంగా ఉండటం, ఈ అవగాహనను అందరిలోనూ కల్పించడం అన్నది ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతైన అవసరమని గుర్తించాలి. డాక్టర్ పవన్ కె. అడ్డాల, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!) -
సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు ..!
వెయిట్లాస్ కోసం ఎన్నో రకాల డైట్లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్నెస్కోచ్ కాగివన్ ప్రభాహరణ్. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్ప్యాక్ శరీరంతో స్మార్ట్గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్లాస్ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరించాడు.తమిళులు చాలామంది సిక్స్ ప్యాక్ కోసం డైట్ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్ ప్యాక్ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్లాస్ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్గా తింటే చాలట. వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు. ఆ మూడు తప్పనిసరి..సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్నెస్ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్లాస్కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్లాస్ అవుతామని చెబుతున్నాడు కాగివన్ View this post on Instagram A post shared by Kagivan Prabaharan | Tamil Transformation Coach (@kagsfit) (చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!) -
శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!
వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటాన్ని ‘టాక్సిక్ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్ యాంగ్’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చె΄్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది. అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.హద్దుల్లేని ఆశావాదంఒక విద్యార్థి యావరేజ్ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే ΄ాజిటివ్ యాటిట్యూడ్ నూరి΄ోసినా, ఆ ΄ాజిటివ్ యాటిట్యూడ్తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆరు రుచులు... అన్ని భావాలుఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్ బారిన పడుతున్నారంటున్నారు.పాజిటివ్గా ఆలోచించడం తప్పా?ఇదంతా విన్నాక ‘పాజిటివ్గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆనందం శాశ్వతం కాదు...పాజిటివ్ థింకింగ్లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్ థింకింగ్ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకు΄ోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. నిర్వహణ: యాసీన్(చదవండి: ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు..! హెచ్చరిస్తున్న అధ్యయనాలు) -
50 తర్వాత ఇంట్లోనే చేసే వెయిట్లాస్ వ్యాయామాలు..!
50 ఏళ్లు దాటాక ఇదివరకటిలా అధిక ప్రభావ వ్యాయామాలు చేయడం కష్టం. మోకాలి నొప్పి, గాయం వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. పైగా ఒంట్లో మునుపటి ఎనర్జీ ఉండదు. అందువల్ల ప్రజలు సులభమైన తక్కువ ప్రభావ వ్యాయామాలు ఎంచుకుంటే మంచిది. అలాగే ఓ వయసు వచ్చాక బరువు తగ్గించే వ్యాయామాలకు శరీరం కూడా సహకరించదు. అలాంటప్పుడు ఇంట్లో సులభంగా చేసే ఈ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తే మంచిదని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అవేంటో చూద్దామా..!.మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉపయోగకరంగా ఉండే ఈ వ్యాయామాలు 80,90 లేదా వంద కిలోలు బరువుతో ఉండే వాళ్లకు అత్యంత ఉపయుక్తమైనవి. చాలా తేలిగ్గా చేసుకునేవి.మడమ నుంచి తుంటి వరకు నిలబడటం..ఒక కాలు వంచి తుంటికి తాకే ప్రయత్నం చేయాలి. అలాగే చేతులు నిటారుగా ఉంచాలి. ఈ వ్యాయామం మోకాళ్లను సురక్షితంగా ఉంచుతూ తొడలు, పిరుదులను సక్రియం చేయడానికి హెల్ప్ అవుతుంది.తక్కువ-ప్రభావ జంపింగ్ జాక్ఇది మోకాలికి అనుకూలమైన వెర్షన్. పక్కపక్కలకు కాళ్లను కదుపుతూ చాలా తక్కువ మోతాదులో జంప్ చేయడం. ఇది హృదయ స్పందన రేటుని సున్నితంగా పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. కీళ్లపై ఒత్తిడి పడకుండా సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.ఒక వైపు నుంచి ఒక వైపుకి..నియంత్రిత పద్ధతిలో ఒక వైపు నుంచి ఒక వైపు నడక. చాలా ఈజీగా చేసే వ్యాయామం. ఇది తుంటి కండరాలను బలోపేతం చేయడానికి, స్థిరత్వాన్నిఇ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ మూడింటిని 20 సార్లు చేసి, ఐదు సెట్లు పునరావృతం చేస్తే చాలని అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. స్థిరత్వంపై దృష్టి పెడుతూ..తేలికైన ఈ కదలికలు బాడీని ఫిట్గా ఉంచడంలో చాలా హెల్ప్ అవుతాయి. ఇలా ప్రతీరోజు చేయడం వల్ల బరువు తగ్గడమే గాక, మోకాళ్ల గాయాలు గానీ, సమస్యలు ఎదురవ్వవని అంటున్నారు. View this post on Instagram A post shared by Nehafun&fitness🤸♂️🧘♀️ (@nehafunandfitness) (చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!) -
తస్మాత్ జాగ్రత్త..! అన్నివేళలా "మంచి" ఆరోగ్యానికి చేటు..!
కొందరు అమ్మాయిలు ఎవర్ని నొప్పించకుండా అందరి దృష్టిలో మంచి అనిపించుకునేలా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకోసం తమను తాము మార్చుకోవడం, సర్దుబాటు చేసుకోవడం చేస్తుంటారు. అది ఓ మోస్తారు స్థాయిలో ఉంటే పర్లదు. తనను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేలా పరిస్థితులు ఉన్నప్పుడూ కూడా..మంచి వ్యక్తిలా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ధోరణిలో ఉంటే మాత్రం అంతరంగికి ప్రశాంతత కనుమరుగవ్వుతుంది. అదికాస్త శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి భారీ మూల్యం చెల్లించేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే సాధ్యమైనంత వరకు అన్నివేళలా మంచి అమ్మాయిలా ఉండటం సురక్షితం కాదని నొక్కి చెబుతున్నారు. ఎప్పుడు మంచిగా ఉండటం కోపానికి మించి ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్ పూర్ణిమ. అంతేగాదు ఆమె దీన్ని "గుడ్ గర్ల్ సిండ్రోమ్"గా పిలిచారు. మంచి అమ్మాయిగా ఉండండి కానీ..మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా మాత్రం కాదు. లేదంటే అది ఒక విధమైన ఒత్తిడికి గురిచేసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే..దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కార్టిసాల్ఎప్పటికీ ఇతరులను సంతోషపెట్టాలని అనుకుంటే..సదా నాడీ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అది ఒక అలవాటులా మారి నో చెప్పడం, హద్దులు నిర్ణయించడం అసురక్షితంగా మారి..అభద్రతాభావంలోకి నెట్టేస్తుంది. దాంతో ఒత్తిడి బారినపడి శరీరంలో కార్టిసాల్ స్టాయిలను పెంచేస్తుంది. ఫలితంగా నిద్ర లేమి, అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొంటారు.థైరాయిడ్ అసమతుల్యతఇలా మంచి అనిపించుకునే ధోరణి భావోద్వేగాలను అణిచేస్తుంది. అంటే కోపాన్ని అణిచేసి, గొతు పెగలనీయకుండా చేస్తుంది. దాంతో థైరాయిడ్ బారిన పడతామని అంటున్నారు.జీర్ణ సమస్యలుమన భావాలు ఎప్పుడైతే వ్యక్తీకరించలేకపోతే..జీర్ణక్రియపై ప్రభావం చూపి.. ఉబ్బరం, ఆమ్లత్వం IBS లాంటి లక్షణాలు సాధారణం. భావోద్వేగాలు ప్రాసెస్ చేయబడనప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుందట. అదీగాక అధ్యయనం ప్రకారం, ఒత్తిడి శరీరం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది లేదా పాజ్ చేయమని సూచిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ దెబ్బతిని..తిన్నది ఒంటబట్టలేని సమస్యను ఎదుర్కొంటారట.హార్మోన్ల అసమతుల్యత, అలసటఇక్కడ "మంచిగా" ఉండటం చాలా శక్తిని ఖర్చు చేస్తుంది. అంటే ఇక్కడ శరీరం ప్రతిసారి మనుగడ అనే మోడ్లోనే ఉండాలి. దాంతో హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి..వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది. నిరంతరం అలసటకు గురవ్వుతారట.ఆందోళన, భావోద్వేగ అలసటఎల్లప్పుడూ మంచిగా ఉండటం వల్ల విశ్రాంతి లేదా ప్రామాణికతకు చోటు ఉండదు. ఆందోళన పెరుగుతుంది. భావోద్వేగ అలసట ఒక వ్యసనంగా మారుతుంది. నిజానికి బయటకు ప్రశాంతంగా కనిపించిన..లోలోపల కుంగిపోయి అలసిపోతారట.దీనికి వైద్యం మిమ్మల్ని మార్చుకోవాలనే సంకల్పానికి పునాది వేయడమే అని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్. ఇది నిజాయితీగా వ్యవహరించటంతో మొదలైన "మంచి" మిమిల్ని అన్నిరకాలుగా ముంచేయడం ప్రారంభిస్తుందన్నది గ్రహించాలి. అసురక్షితమైన స్థితికి తీసుకువచ్చే మంచిని వదులుకోవడమే అన్ని వేళల మంచిదని అంటోందామె. దాంతోపాటు శరీరం మాట వినాలి. మనకు అనుకూలంగా సాధ్యమైనదే అయితే.. దానికే సుముఖత వ్యక్తం చేయాలి. సాధ్యమైనంత వరకు కొన్నింటికి "నో" అని ఎంత మేర చెప్పగలుగుతామో అప్పుడు మనం మానసికంగా, శారీరకంగా సురక్షితంగా, స్ట్రాంగ్గా ఉండగలుగుతారని అన్నారు. అతి సర్వత్ర వజ్రయేత్ అనిపెద్దలు చెప్పిన నానుడిలా అతి మంచి పనికిరాదని గుర్తెరగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Poornima Peri (@poorniimahormonecoach) (చదవండి: మెట్లపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్..) -
70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు
ఓ వృద్ధ మహిళ దీర్ఘకాలికంగా విపరీతమైన తలతిరగడం సమస్యతో బాధపడుతోంది. ఎన్నో ఆస్ప్రతులు, పలు స్కానింగ్ పరీక్షలు చేసినా..ఎందువల్ల ఈ సమస్య అనేది ఎవ్వరు చెప్పలేకపోయారు. వెద్యులకే అంతుపట్టని మిస్టరీ వైద్య సమస్యలా మారింది ఆమె బాధ. అయితే చివరికి న్యూరాలజిస్ట్లు ఎందువల్ల ఆమెకు ఈ సమస్య వచ్చిందో తెలిసి విస్తుపోయారు. పైగా ఆ వైద్యుడు ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 70 ఏళ్ల మహిళకు విపరీతమైన తలతిరడం సమస్యతో బాధపడుతుంది. ఒంటిరిగా వెళ్లాలన్నా..కాసేపు నుంచొన్న పడిపోతానేమో అనే భయంతో విలవిలలాడింది. ఆ సమస్యతో తాళ్లలేక పలు ఆస్పత్రులు సందర్శించినా..ఎలాంటి సమస్యల లేదని తేల్చి చెప్పారు. ఎమ్మారై నుంచి ప్రతి స్కాన్లో రిపోర్టు నార్మల్గానే రావడంతో వైద్యలు సైతం ఇదొక అంతుపట్టని మిస్టరీ సమస్యగా పేర్కొన్నారు. బ్రెయిన్లో కణితి లేక స్ట్రోక్ వల్ల వస్తుందేమోనని బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్లు చేసినా..ఫలితం శూన్యం. దాంతో చివరికి ఆమె న్యూరోలజిస్ట్ని సంప్రదించగా..ఆయన ఆమె సమస్యను క్షణ్ణంగా పరిశీలించారు. ఆయన ఆమె ఎదుర్కొంటుంది సాధారణ తలతిరుగుడు సమస్య కాదని గుర్తించారు. దాంతో ఆమెను లేచి నిలబడి ఉండమని చెప్పినప్పుడూ..కొంచెం సేపు నుంచోలేకపోవడం గమనించారు. ఆ తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు గురించి విచారించగా..అసలు సమస్య ఎక్కడ ఉందో ఆయన గుర్తించి సవివరంగా చెప్పారు. పైగా ఇలాంటి సమస్యను చాలామది ఫేస్ చేస్తున్నారని. అయితే వాళ్లే తేలిగ్గా తీసుకోవడంతోనే వెలుగులోకి రాలేదన్నారు. ఎందువల్ల అంటే..ఆ మహిళ దీర్ఘకాలం పాటు పూర్తిగా శాకాహారం, పాల ఉత్పత్తులను నివారించడంతోనే పోషకాహారం లోపం ఏర్పడి.. నరాలు, కీళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఆమె నుంచొన్నప్పుడు కాలి వేళ్ల స్పర్శను అనుభూతి పొందలేకపోయిందని చెప్పారు. కాలి చీలమండలం దాక ఎలాంటి సెన్సేషన్ లేకపోవడం గుర్తించారు వైద్యులు. నిలబడుతున్నప్పుడూ ఆ మహిళ బ్యాలెన్స్ చేసుకోలేనట్టుగా ఊగిపోవడం గమనించారు. అది సాధారణ తలతిరగడం సమస్య కిందకు రాదని అన్నారు న్యూరాలజిస్ట్ వైద్యులు. కఠిన శాకాహారిగా తక్కువ పాల ఉత్పత్తులు తీసుకోవడంతో వచ్చిన సమస్యగా వెల్లడించారు. అంతేగాదు దీన్ని బీ12 లోపంగా పేర్కొన్నారాయన. బీ12 లోపం అంటే..నరాలను రక్షించే మైలిన్ తొడుగును నిర్వహించడానికి బీ12 చాలా అవసరం. అది లేకపోతే మెదడుకి సంకేతాలు పంపే పెద్ద ఫైబర్ నరాలు పనిచేయడం మానేస్తాయి. సదరు మహిళకు శరీరంలో బీ12 స్థాయిలు 153 pg/mL ఉన్నాయి . అంటే సాధారణ మనిషికి ఉండాల్సిన దానికంటే అత్యంత తక్కువ. దాంతో వైద్యులు ఆమెకు కండరాల ద్వారా బీ12 ఇంజెక్షన్లు అందించినట్లు తెలిపారు. దాంతో ఆమెకు కొన్ని వారాల్లోనే నడక బ్యాలెన్స్ అయ్యిందని, అలాగే పడిపోతాననే భయం మాయమైందని చెప్పారు. ఆమెకు ఇదివరకటిలా గోడలను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యను రోగ నిర్థారణ స్కాన్లతో గుర్తించలేమని చెప్పారు. అంతేగాదు పాల ఉత్పత్తులు, లేదా సప్లిమెంట్లు లేకుండా దీర్ఘకాలం పాటు శాకాహారం తీసుకుంటే బీ12 విటమిన్ లోపం వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇలాంటి సమస్యని(బీ12 లోపం) ముందుగా గుర్తిస్తేనే నయం చేయగలమని లేదంటే శాశ్వత వైకల్యాన్ని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు న్యూరాలజిస్ట్లు.When the Brain Was Blamed; but the Nerves Told the TruthShe was 70, soft-spoken, and deeply worried.For six weeks, she had been feeling dizzy and unsteady, especially while walking. She described it as “the ground moving under my feet.” At times, she felt she might fall if… pic.twitter.com/do925kj2OZ— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) February 4, 2026 (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..) -
'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్ శిక్షణ..
బరువు తగ్గించే జైలు గురించి విన్నారా..?. ఔను మీరు వింటుంది నిజమే..!. నిర్బంధంలో ఉంచి స్లిమ్గా మార్చే జైలు ఇది. ఇక్కడకు వస్తే..సులభంగా వెయిట్లాస్ అవ్వొచ్చట. అంతేకాదండోయ్ అందుకోసం ఎంత చెల్లించాలో తెలిస్తే విస్తుపోతారు. ఖైదీల్లా బరువు తగ్గడం కోసం జైలు ఏంటి అనుకోకండి..అక్కడ ఉండే కఠినమైన ఆహార నియమాలు, వర్కౌట్లు తప్పించుకోకుండా ఉండేందుకు అచ్చం జైలు మాదిరి వాతావరణంతో ఉంటుంది ఆ ప్రదేశం. మరి అదెక్కడ ఉంది..?. ఎలా సన్నగా అయ్యేలా చేస్తారు అంటే..బరువు తగ్గించే జైలు చైనాలో ఉంది. దీని గురించి ఒక ఆస్ట్రేలియాన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్లో డాక్యుమెంట్ చేసి మరి వీడియో షేర్ చేశారు. తాను అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదులుకుని మరి ఇక్కడకు వెళ్లినట్లు వెల్లడించాడు కూడా. దీన్ని ఫ్యాట్ ప్రిజన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో రకాలుగా డైట్లు, వర్కౌట్లు చేసినా..పెద్దగా ప్రయోజనం పొందలేని వాళ్లంతా వస్తారట. శిక్షణ ఎలా ఉంటుందంటే..అక్కడ వాళ్లకు రోజు ఉదయం 7.30 గంటలకు అలారం మోగడంతో ప్రారంభమవుతుందట. ఉదయం 8 కల్లా అదనపు బరువుని చెక్ చేయడం కోసం క్యూలైన్ ఉంటుంది. తర్వాత 9.20 నుంచి 10.30 వరకు ఏరోబిక్ క్లాస్ ఉంటుంది. దీని తర్వాత ఉదయం 11.15 గంటలకు రోజులో తొలి భోజనం మొదలవుతుంది. అందులో అల్పాహారంగా నాలుగు గుడ్లు, ఒక బ్రెడ్ స్లైస్, టమాట, కొన్ని దోసకాయ ముక్కలు మాత్రమే ఇస్తారు. ఈ సెషన్ తర్వాత కార్డియో వ్యాయామాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2.50 నుంచి 4 గంటల మధ్య వెయిట్ లిఫ్టింగ్ సెషన్ మొదలవుతుంది. ఇక లంచ్కి బ్రేజ్డ్ డక్, తామర కాడలు, వేయించిన కూరగాయలు, కొన్ని క్యారెట్లు, అరటిపండ్లు ఉంటాయి. దీని తర్వతా రెండు గంటల పాలు హై ఇంటెన్సివ్ శిక్షణ, స్పిన్ క్లాస్లు ఉంటాయి. ఇక రాత్రి భోజనంలో పుచ్చకాయ, కూరగాయ ముక్కలు మాత్రమే ఇస్తారు. దీని తర్వాత మరోసారి బరువు చెక్చేసే ప్రక్రియ అనంతరం నిద్రకు ఉపక్రమిస్తారు. అంటే ఈ జైలులో రోజుకి సుమారు 12 గంటల వ్యాయామాలు ఉంటాయని చెబుతున్నాడు ఇన్ఫ్టుయెన్సర్. View this post on Instagram A post shared by eggeats 🐣 I show you the real side of Asia ✨ (@eggeats) ఈ జైలులో ఉండి ఒక మహిళ నాలుగు వారాల వ్యవధిలోనే ఆరు కిలోల బరువు తగ్గినట్లు తెలిపాడు. అంటే ఆమె 85.6 కిలోల బరువు ఉండగా..ఇక్కడకు వచ్చాక 79.6 కిలోలకు వచ్చింది. అంతేగాదు మన వ్లాగర్ సైతం అంతకుమునుపుకి ఇక్కడకు వచ్చాక చాలా పరివర్తన వచ్చాడు. అంతలా బరువు తగ్గ్గిన అతడి పరివర్తనను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు కూడా. ఇదిలా ఉండగా, చైనాలో లాట్జైళ్లు ఇంటెన్సివ్, రెసిడెన్షియల్, మిలటరీ తరహా బరువు తగ్గించే బ్యూట్ క్యాంపులు చాలానే ఉన్నాయట. ఎందుకంటే అక్కడ రోజురోజుకి పెరుగుతున్న ఊబకాయ సంక్షోభం నేపథ్యంలో ఇలాంటివి అత్యంత ప్రజాదరణ పొందుతుండటం విశేషం. View this post on Instagram A post shared by eggeats 🐣 I show you the real side of Asia ✨ (@eggeats) జైళ్లుగా ఎందుకు పిలుస్తారంటే..నేరస్తుల నిర్బంధ కేంద్రాలు కాకపోయినా..అక్కడ ఉండే సౌకర్యాలు జైళ్లను తలిపించేలా ఉంటాయి. పైగా చుట్టూ ఉండే వాతావరణం సైతం జైలు మాదిరిగా ఉంటుంది. అంటే ఎత్తైన కాంక్రీట్ గోడలు, ముళ్ల కంచెలతో లాక్ చేసిన గేట్లు వంటి గట్టి పకడ్బంది ఉంటుంది. దీంతోపాటు ఎక్కడకక్కడ గట్టి నిషా ఉంటుంది. ఇక్కడకు వచ్చే వాళ్లంతా సాంప్రదాయ ఆహారాలు తీసుకున్నా.. బరువు తగ్గని వాళ్లు కాబట్టి నిర్వాహకులు అంతలా వాళ్లని పర్యవేక్షిస్తారు. ఇక్కడ వాళ్లకు 14 నుంచి 28 రోజుల శిక్షణకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా 28 రోజులకు వసతి, ఆహారం, శిక్షణతో సహా రూ. 90 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు ఉమ్మడి వసతినే ఎంచుకుంటారు. ఒక్కో గదికి సుమారు ఐదుగురు వరకు ఉంటారట. ఇదంతా చూస్తుంటా..ఊబకాయంతో మనుషులు ఇంతలా ఇబ్బందులు పుడుతున్నారా..? అనిపిస్తోంది కదూ..!.(చదవండి: -
అలాంటి డైట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి..!: నటి ఊర్మిళ
ముంబై భామ ఊర్మిళ మాతోండ్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్, టాలీవుడ్లో తనదైన అభినయం, అందంతో విమర్శకులు ప్రశంలందుకున్న ప్రముఖ నటిగా పేరుతెచ్చుకున్నారు. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోనివిధంగా గ్లామరస్గా కనిపిస్తుంటారామె. నాజుకైన దేహంతో పదహారణాల అమ్మాయిల కనిపిస్తుంటుంది. ఇవాళ ఫిబ్రవరి 4తో 52వ పుట్టిరోజులోకి అడుగుపెడుతున్న అలనాటి ముద్దుగుమ్మ ఈతరం యువతరానికి హెల్దీగా ఉండటంపై సలహాలు సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దామా..!.ముఖ్యంగా 2008లో సైజ్ జీరో ఫ్యాషన్ క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. ఆ టైంలో యువత ఆ ట్రెండ్తో ఉర్రూతలూగుతున్నప్పుడూ కూడా నటి ఊర్మిళ యువతకు చాలా చక్కటి పిలుపునిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. నాజుకైన శరీరం కంటే..ఆరోగ్యం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుచేస్తూ ఆలోచింపచేసేలా మాట్లాడారామె. 50 ప్లస్లో కూడా ఇంతలా స్లిమ్గా బాడీ మెయింటైన్ చేస్తున్న ఊర్మిళ యువతకు ఇస్తున్న సలహా ఏంటేంటే..ఆరోగ్యం పట్ల తానెప్పుడూ ట్రెండీ పోకడల జోలికి పోనంటున్నారామె. మన పూర్వీకులు ఫాలో అయ్యే ఆరోగ్యకరమైన అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తానని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారామె. క్రాష్ డైట్లంటూ పొట్ట మాడ్చుకోనని కూడా చెప్పారు. దయచేసి యువత ట్రెండీ డైట్లు, షార్ట్కట్లో బరువు తగ్గే విధానాల జోలికిపోయి..ఆరోగ్యాన్ని చేజేతులారా పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ఇటీవల కాలంలో వెయిట్లాస్ అవ్వడం ఓ ట్రెండీగా మారింది. ముఖ్యంగా స్లిమ్గా ఉంటేనే మనుషులు అనేలా పరిస్థితి మారిపోయింది. ఇవన్నీ ఎలా ఉన్నా..ఆరోగ్యంగా ఉండటమే అన్నింట్లకంటే ముఖ్యమని నొక్కి చెప్పారు. నాజుకైన శరీరం కోసం..తాన నాజుకైన శరీరం కోసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తానే తప్ప ఆహారం మానేయడం వల్ల కాదని అన్నారు. క్రాష్ డైట్ల జోలికి పోనని కూడా అన్నారామె. దేవుడు తనకు ఇచ్చిన మంచి జీన్స్ విషయమై సదా కృతజ్ఞతలు చెబుతుంటానని అన్నారు. యువత ఎక్కువగా ఉపవాస డైట్లు పాటిస్తూ..శరీరాన్ని పాడుచేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారామె. దానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం ఆస్వాదిస్తూ..వ్యాయామాలు చేయండి చాలు అని పిలుపునిచ్చారామె. ఫిట్నెస్ సీక్రెట్..చాలామంది సెలబ్రిటీలు తమ ఫిట్నెస్కి విదేశీ సూపర్ ఫుడ్స్కి క్రెడిట్ ఇస్తే..సాంప్రదాయ భారతీయ వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారామె. తన మెరుగైన జీవక్రియకు, శక్తికి అవే మహారాష్ట్ర సంప్రదాయ ఆహారమేనని నొక్కి చెబుతారామె. ఫిట్గా ఉండాలంటే..పోషకాహారం, ఇంట్లో వండిన వంట్లకే కట్టుబడి ఉండటం అని చెబుతున్నారు. తాను ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇలా స్లిమ్గా ఉన్నానని నమ్మకంగా చెప్పారామె. కాబట్టి..ఇంకెందుకు ఆలస్యం హాయిగా నచ్చిన పోషకాహారం తింటూ..వర్కౌట్లు చేస్తూ హెల్దీగా ఉందాం మరి..!.(చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!) -
వెయిట్లాస్ డ్రగ్ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత
సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ప్రముఖులు బరువు తగ్గేందుకు వెయిట్లాస్ డ్రగ్స్ లేదా సర్జరీలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి..అక్కడ వారి ఆహార్యం, లుక్ అత్యంత ప్రధానం. అదీగాక నిధానంగా బరువు తగ్గాలనేంత వ్వవధి వారికి ఉండదు కూడా కానీ ఈ అమెరికన్ రాపర్, గాయకుడు అలా కాదు..తొందరగా బరువు తగ్గించే మందులు జోలికే పోకుండా..ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గాడు. అదీకూడా ఏకంగా 90 కిలోలు పైనే బరువు తగ్గడం విశేషం. ఎంతో ఓపికతో..ఫుడ్ ఎడిక్షన్ని దూరం చేసుకుని మరి..స్లిమ్గా మారి స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడి వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..పాటల రచయిత, గాయకుడు జెల్లీ 2026 గ్రామీ అవార్డుల ప్రెస్ ఈవెంట్లో స్మార్ట్లుక్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు అక్కడ మీడియా ఇంటర్వ్యూలో తాను ఇంతలా స్లిమ్గా మారేందుకు తన ఫుడ్ ఎడిక్షన్పై ఎంతలా పోరాటం చేశాడో బహిరంగా వెల్లడించారు. తన కొకైన్ అడిక్షన్ని దూరం చేసుకున్నట్లుగానే ఈ ఆహార వ్యసనానికి చెక్కుపెట్టగలిగానని అన్నారు. అలాగే తన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకున్నట్లు తెలిపారు.ఆహార వ్యసనానికి చెక్పెట్టడం అంటే..తినాలనే ఆలోచనను రానివ్వకుండా చేయడమేని అంటున్నాడు. అలాగే జీవనశైలిలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడం వల్ల ఈ మార్పులు సాధ్యమైనట్లు షేర్ చేసుకున్నారు. ఇంతకుమునుపు తన టూర్లన్నీ పార్టీలు, డ్రింక్, మత్తుపదార్థాల చుట్టూ తిరిగేది. ఇప్పుడు తన టూర్ సంస్కృతి మంచి ఆహారం, వ్యాయామం, భావోద్వేగ పరంగా బలంగా ఉండటం చుట్టూ ఉందని ఆనందంగా చెబుతున్నాడు జెల్లీ.బరువు తగ్గడంలో ఆ రెండే కీలకం..జెల్లీ రోల్ బరువు తగ్గించే ప్రయాణంలో నడక, పరుగు చాలా కీలకమైన ప్రభావాన్ని చూపించినట్లు పేర్కొన్నాడు. తాను 5కే రన్ కోసం శిక్షణ పొందుతున్నప్పుడు..చాలా బరువు తగ్గినట్లు పేర్కొన్నాడు. అలాగే 2024లో ఓ రన్ ఈవెంట్ కోసం సిద్దమయ్యే నేపథ్యంలో రోజుకి రెండు నుంచి మూడు మైళ్లు చోప్పున వారానికి నాలుగు నుంచి ఆరు రోజులు పరిగెత్తేవాడట. ఇలా బరువు తగ్గడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని..అందువల్ల మరింత బరువు తగ్గేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు వివరించాడు. పైగా తేలిగ్గా ఉండి, ఏ టూర్ అయినా ఇట్టే వెళ్లిపోగలం, హాయిగా ఎంజాయ్ చేయగలం అని అంటున్నాడు. View this post on Instagram A post shared by GRAMMYS (@grammys) (చదవండి: తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!? కానీ ఆ ఏజ్కి..) -
బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..!
బరువు తగ్గడం అంటే వర్కౌట్లు మీద ఫోకస్ పెడతాం. అన్నిట్లంకంటే తగ్గాలనే సంకల్పం బలంగా ఉండాలి అప్పుడే అది సాధ్యమవుతుందని అంటోంది ఫిట్నెస్ కోచ్ కేట్ డేనియల్. ఇంతకుమునుపులా ఉండాలి అన్న ఆలోచనే ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత సులభంగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది అంటోందామె. తాను మూడేళ్లలో 70 కిలోల అదనపు బరువుని తగ్గించుకున్నానని..అందుకోసం తన జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేశారో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..బేరియాట్రిక్ కోచ్ కేట్ డేనియల్ బరువు తగ్గడం అన్నది ఓర్పుతో, అంకితభావంతో సాగించాల్సిన జర్నీ అంటుందామె. ఇక్కడ ఈ ఫిట్నెస్ కోచ్ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. బేరియాట్రిక్ సర్జరీ అంటే డైటింగ్/వ్యాయామం పనిచేయనప్పుడు పొట్ట పరిమాణాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడే సురక్షితమైన చికిత్స. అది డేనియల్ లైఫ్లో ఒక భాగం మాత్రమే. కానీ బరువు తగ్గడానికి ముందు తాను టీనేజ్లో ఉన్నట్లుగా తనలా మారాలని స్ట్రాంగ్ కోరుకుంది. ఆ తర్వాత తన జీవనశైలిలో మార్పులు చేసుకున్నారు. అవేంటంటే..ఉదయాన్నే మేల్కోవడం..ఆకలి హార్మోన్ల నియంత్రించే అలవాట్ల కోసం త్వరితగతిన మేల్కోవడం మంచిదని చెబుతోంది. ఇలా తొందరగా లేవడం వల్ల చక్కగా డైట్, వర్కౌట్ల ప్లాన్ సవ్యంగా ఉంటుందన్నారామె. శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండటం..చక్కెర, శుద్ధి చేసిన పిండిలతో చేసి ఆహార పదార్థాలను దగ్గరకు రానివ్వలేదట. ఇది శరీర కొవ్వుని తగ్గించేందుకు హెల్ఫ అయ్యిందట. వారానికొకసారి నచ్చిన ఆహారం..నచ్చిన ఫుడ్ని స్వయంగా తయారు చేసుకుంటూ..హాయిగా తిన్నాను. దానివల్ల త్యాగాలు చేస్తున్నా అన్న ఫీల్ ఉండదు. పైగా కడుపు నిండుగా తినొచ్చు కూడా.తనను తాను మెరుగ్గా ఉంచుకోవడంమొదట మనల్ని మనం ప్రేమించడం, ఆహారంతో సంబంధం లేకుండా ఎంతసేపు ఉండగలం వంటి చిన్న ప్రయత్నాలను రోజు రోజుకి పెంచడం. ఆరోగ్యకరమైన రిలేషన్స్..ఎందుకంటే మనకు నచ్చిన వాళ్లు ఇచ్చిన ఆహారాలను వాళ్లపై ప్రేమతో లాగించేస్తాం. కాబట్టి..బంధాలను బరువుని పెంచేవిగా మార్చుకోవద్దు. వాళ్లని మేలు కోరే వాళ్లుగా మార్చుకోవాలట. అంటే ఆ బంధాలు మనసుకి స్వాంతన ఇవ్వాలే గానీ శరీరాన్ని భారంగా మార్చకూడదని అంటోంది. విజువలైజేషన్కోరుకున్న విధంగా స్మార్ట్గా మారినట్లు ఊహించుకోవడం. పదే పదే ఆ దృశ్యమానం..మిమ్మల్ని జాగురకతతో ఉండేలా చేస్తుంది. తినాల్సిన వాటిపై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు.చలాకీగా ఉండటం..బరువు తగ్గిన వెంటనే 20ల వ్యక్తిలా ఎలా ఉషారుగా పనిచేయగలనో భావించడం. ప్రతి కదలికలో దీన్నిగుర్తించుకోవాలి.మానసికంగా స్ట్రాంగ్ ఉండటం..బరువు తగ్గలేకపోతున్న అన్న బాధ మెదుడులోకి ఎంటర్ అవ్వకూడదు. అది మిమ్మల్ని స్మార్ట్గా ఉండనివ్వదట. నిన్ను నువ్వు స్నేహితుడిగా, కేర్టేకర్గా మార్చుకుంటూ సాగితే బరువు తగ్గడం ఇష్టమైన ఆటలా మారి..సునాయాసంగా తగ్గేలా చేస్తుంది లేదా అదుపులో ఉంచుతుంది .ఇక్కడ చెప్పినవన్ని..మాయలు మంత్రల్లాంటివి కాదని, కేవలం బరువు తగ్గేందుకు మానసికంగా మనల్ని సన్నద్ధం చేసేవి. వీటికి మంచి ఆహారపు అలవాట్లు, వర్కౌట్లు తోడైతే..బరువు తగ్గడం సులభమవుతుందని అంటోంది ఫిట్నెస్ కోచ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Kate Daniel (@bariatric_chic) (చదవండి: ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..) -
ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..
అధిక బరువు కేవలం సామాన్యులనే వేధించే సమస్య కాదు. ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు కౌన్సలింగ్ ఇచ్చి బరువు తగ్గేలా చేసే ఒబెసిటీ వైద్యులు సైతం అధిక బరువు బాధితులే. అందుకు ఉదాహరణ ఈ వైద్యుడు కెవిన్ జెండ్రూ. అందరికి ఆరోగ్యకరమై జీవిన విధానానికి కౌన్సిలింగ్ ఇచ్చే ఈ ఒబెసిటి డాక్టరే తన స్వతం జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపించడంలో విఫలమై అధిక బరువుతో బాధపడ్డాడు. అధిక పని ఒత్తిడికి ఈ వైద్యుడు సైతం సామాన్యుడిలా అధిక బరువు బారినపడ్డాడు. రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తే సరైన జీవన విధానం అవలంభించకలేక ఇబ్బందిపడ్డాడు. చివరికి ఆ ఒక్క దురదృష్టకర ఘటన అతడి జీవితాన్ని ఊహించని మలుపుతిప్పి బరువు తగ్గేందుకు దారితీయడమే కాదు..వెయిట్లాస్ అవ్వడంలో స్ఫూర్తిగా నిలిచాడు. మరి ఆ వైద్యుడి వెయిట్లాస్ జర్నీ ఎలా మొదలైందంటే..మసాచుసెట్స్కి చెందిన కెవిన్ జెండ్రూ ఒకప్పుడూ 138 కిలోల బరువు ఉండేవాడు. అతడి వృత్తి ఊబకాయంతో బాధపడే రోగులకు వైద్యం చేయడం. విచిత్రం ఏంటంటే అతడే ఓ ఒబెసిటీ రోగి..పైగా తన లైఫ్ని ఆరోగ్యప్రదంగా ఉంచుకోలేదు. కానీ రోగులకు అధిక బరువు తగ్గించుకునేలా చికిత్స, కౌన్సిలింగ్ ఇస్తుండటం విశేషం. సుదీర్ఘ గంటల పని ఒత్తిడి అతడిని తరుచుగా ఏదో ఒకటి తినేలా చిరుతిండికి బానిసగా మార్చేసింది. అది కాస్త ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలైంది. మరోవైపు అతడి తండ్రికి టెర్మినల్ మెలనోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఏం తింటున్నాడో..ఎలా ఉంటున్నాడనే దానిపై స్పృహ లేకుండా జంక్ఫుడ్ తీసుకునేవాడు. అదికూడా నిర్ణిత సమయం అంటూ లేకుండా తినాలనిపించినా..లేకపోయినా..వీలు దొరికినప్పుడల్లా తినడం ఓ అలవాటుగా మారి..విపరీతంగా బరువు పెరిగిపోయాడు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల బారినపడ్డాడు. ఊబకాయం ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన ఉన్న వైద్యుడే ఊబకాయంతో బాధపడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనడం ఒకింత సిగ్గుగా అనిపించడం మొదలైంది కెవిన్కి. ఇంతలో సోదరికి కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అవ్వడం ఒక్కసారిగా కెవిన్ ఉలిక్కిపడ్డాడు. ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి అంతే అని ఫిక్స్ అయ్యి..ఆరోగ్యకరమైన జీవన విధానంపై దృష్టిపెట్టడం ప్రారంభించాడు. తన పిల్లల కోసమైన ఆరోగ్యం ఉండాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు.ఎలా తగ్గాడంటే..సాధారణ ఆహార మార్పులు, అడపాదడపా ఉపవాసం తదితరాలను ప్రారంభించాడు. అలాగే తనకున్న వైద్య పరిజ్ఞానంతో ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్రణాళిలు ఏర్పాటు చేసుకుని మరి బరువు తగ్గేందుకు ప్రయత్నించాడు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అధిక ఫైబర్ ఉండే ఆహారం, బెర్రీలను తీసుకోవడం ప్రారంభించాడు. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, శుద్ధి చేసిన చక్కెరను నివారించాడు. అతని సాధారణ భోజనంలో గ్రిల్డ్ చికెన్, సిర్లోయిన్ స్టీక్ లేదా చేపలు, కాల్చిన నాన్-స్టార్చీ కూరగాయలు ఉంటాయి. దాంతోపాటు అవకాడో, గింజలు, ఆలివ్ నూనె, గుడ్లు, చీజ్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మైండ్పెట్టి తినడం, కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకునేవాడు. ఇక అడదడపా ఉపవాసాన్ని కూడా హెల్దీగా చేసినట్లు తెలిపాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వ్యవధిలో తక్కువ కార్బ్, చక్కెర ఉన్న ప్రోటీన్ భోజనం మాత్రమే తీసుకునేవాడు. దీనివల్ల చక్కెర స్థాయిలు సాధారణస్థితికి వచ్చి డయాబెటిస్ అదుపులోకి వచ్చింది. వర్కౌట్ల దగ్గరకు వచ్చేటప్పటికీ..రోజుకి పదివేల నుంచి పదిహైను వేల వరకు నడక వంటివి కచ్చితంగా చేసేవాడు.ఇలా ఆరోగ్యకరమైన అలవాట్లతో కేవలం 18 నెలల్లో 138 నుంచి ఏకంగా 56 కిలోలు బరువు తగ్గాడు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన బరువుతో 20లలో ఉన్న వ్యక్తిలా అన్నిపనులు సునాయాసంగా చేయగలుగుతున్నానంటూ తన వెయిట్లాస్ స్టోరీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. (చదవండి: ట్విన్స్ పేరెంట్స్ చేసిన పనికి..ఉబ్బితబ్బిబైన డాక్టర్..!) -
అడపాదడపా ఉపవాసం.. మహిళలకు చేటు!
బరువు తగ్గించే పద్దతుల్లో అడపాదడపా ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(ఐఎఫ్). బరువు తగ్గడానికి అత్యంత సులభమైన పద్ధతిగా పేర్కొంటారు. త్వరితగతిన బాడీలో మార్పులు..పైగా ఆరోగ్యకరమైన విధానమని పలువురు వెల్న్స్ నిపుణుల అభిప్రాయం. అయితే ఇది మహిళలకు ఎప్పటికీ ప్రమాదకరమని, ముఖ్యంగా పీరియడ్స్ వచ్చే మహిళలకు మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఫెర్టిలిటీ కోచింగ్ వ్యవస్థాపకురాలు ప్రీతికాసిరెడ్డి. సోషల్ మీడియా వేదికగా ఈ పద్ధతి మహిళ ఆరోగ్యానికి ఏవిధంగా చేటు చేస్తుందో తన స్వీయానుభవాన్నిషేర్ చేసుకున్నారు.విపరీతంగా ప్రజాదరణ పొందిన అడపాదడపా ఉపవాసం మహిళల ఆరోగ్యానికి చాలా వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. ఇది హర్మోన్లను ఇన్బ్యాలెన్స్ కారణమయ్యే విధానంగా అభివర్ణించారు. దీన్ని అవలంభించడంతో తనకు టీ స్థాయిలు గణనీయంగా పడిపోయాయని, జీవక్రియ నెమ్మదించిందని, కార్టిసాల్ స్థాయిలు ఉదయంపూట ఎక్కుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే నిరంతరం చలిగా అనిపించిందని, పీరియడ్స్ రావడం తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారామె. ఈ విధానం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని తేల్చి చెప్పారామె. నిజానికి ఈ విధానంలో అల్పాహారం దాటవేయాల్సి ఉంటుంది. ఇది శరీరాన్ని ఆహరం కంటే కార్టిసాల్తో నడపేలా బలవంతం చేస్తుందన్నారు. ఫలితంగా థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపడం, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం వంటి సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నారామె. బ్రేక్ఫాస్ట్ అనేది శక్తి కదలికని, అది తప్పనసరి అన్నారామె. ఇక ఈ అడపాదడపా ఉపవాసం..తప్పుదారి పట్టించే వెల్నెస్ సలహాగా అభివర్ణించారామె. అడపాదడపా ఉపవాసం అంటే..ఈ విధానంలో ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అనేదానిపై ఫోకస్ పెట్టే చేసే డైట్ విధానం. అత్యంత సాధారణ వెర్షన్ 16:8 పద్ధతి. ఇక్కడ 16 గంటలు ఉపవాసం ఉండి ఎనిమిది గంటలలోపు తినాల్సి ఉంటుంది. ఇది డైటింగ్ను సులభతరం చేస్తుందని, బరువు తగ్గడంలో సహాయపడుతుందని, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలువురు నిపుణులు వాదన. .సైన్స్ ఏం అంటుందంటే..అయితే ఈ వాదనలలో కొన్నింటిని సైన్స్ సమర్థిస్తుంది. బహుళ అధ్యయనాలు IF బరువు తగ్గడానికి, నడుము చుట్టుకొలతను తగ్గించడానికి, రక్తంలో మెరుగైన చక్కెర నియంత్రణకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే..నొయిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ డీన్ డాక్టర్ సుప్రియా అవస్థి మాట్లాడుతూ, అడపాదడపా ఉపవాసం మహిళలందరికీ మంచిది కాదని చెప్పలేం కానీ ఇది అందరికీ సురక్షితమైనది కాదని అన్నారు. అయితే మహిళలు తమ ఆరోగ్యానికి సరిపడితే ఈ పద్ధతి పాటించొచ్చని, అయితే చాలామటుకు మహిళల్లో ఈ విధానం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండాలంటే కష్టమని, అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు.Intermittent fasting was one of the worst things I did for my hormones (7 years ago).My free T3 levels dropped significantly when I did it, which means my metabolism slowed to a crawl. I was cold all the time. My cortisol levels were elevated in the morning. My periods were…— Preethi Kasireddy (@iam_preethi) January 26, 2026 (చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?) -
యాలకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా..!?
యాలకులను సువాసన కోసం వాడే వంట దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. తిన్న ఆహారం త్వరగా అరగడానికి యాలకులు బాగా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి వాటిని తగ్గిస్తాయి. భోజనానంతరం ఒక యాలక్కాయను నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి, నోరు తాజాగా ఉంటుంది.తల తిరుగుతున్నప్పుడు యాలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది.యాలకులు రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతాయి.గొంతు నొప్పి, దగ్గు ఉన్నపుడు యాలకులతో చేసిన కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది. -
మానసిక సమస్యలు మహిళల్లోనే అధికం..!
‘మనసే అందాల బృందావనం’ అనేది కవి మాట.అయితే ఆ బృందావన అందాలు, ప్రశాంతతకు చాలామంది మహిళలు దూరం అవుతున్నారు. వ్యక్తిగత సమస్యల నుంచి పని ప్రదేశాలలో ఒత్తిడి వరకు.... రకరకాల కారణాలు మహిళల్లో మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.మన దేశంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా డిప్రెషన్తో బాధ పడుతున్నారు. దాదాపు 40 శాతం మంది మహిళలు కుంగుబాటు(డిప్రెషన్) సమస్యను ఎదుర్కొంటున్నారు.భారతదేశంలో 1.3 మిలియన్ల మంది మహిళలపై సర్వే నిర్వహించి, వారి మానసిక ఆరోగ్య సమస్యలపై ‘అన్వీలింగ్ ది సైలెంట్ స్ట్రగుల్’ పేరుతో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నివేదిక విడుదల చేసింది.47 శాతం మంది మహిళలు నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమి వారి ఐక్యూని, జ్ఞాపకశక్తిని (కాగ్నెటివ్ హెల్త్) ప్రభావితం చేస్తోంది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం...కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులలో 42 శాతం మందిలో కుంగుబాటు, ఆందోళన లక్షణాలు కనిపించాయి.80 శాతం మంది మహిళలు ప్రసూతి సెలవులు, కెరీర్ పురోగతికి సంబంధించి వివక్ష ఎదుర్కొంటున్నారు.దాదాపు 38 శాతం మంది మహిళలు కెరీర్, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన విషయాలలో ఆందోళన చెందుతున్నారు.ప్రతి ఇద్దరు భారతీయ మహిళలలో ఒకరు దీర్ఘకాలిక ఒత్తిడితో బాధ పడుతున్నారు.ఆహార సంబంధిత రుగ్మతలు(ఈటింగ్ డిజార్డర్స్) కేసులలో 63.3 శాతం మహిళలు ఉండగా, 36.7 శాతం మంది పురుషులు ఉన్నారు.భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళలలో 18–38 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా ఉంటున్నారు.‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ నివేదిక ప్రకారం నిరాశ, నిస్పృహలకు సంబంధించిన రుగ్మతలు 29.8 శాతం, ఆందోళనకు సంబంధించిన రుగ్మతలు 27.9 శాతం పెరిగాయి.(చదవండి: అధిక ఆదాయం.. కానీ ఆనందం నిల్..!) -
'డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్'..! జస్ట్ 60 రోజుల్లో దాదాపు 15 కిలోల బరువు
బరువు తగ్గడం ఇటీవల ట్రెండీగా మారింది. స్మార్ట్గా వయసు తక్కువగా కనిపిస్తే ఏదో ఘనకార్యం సాధించిన ఫీలింగ్ చాలామందిలో. ఆ క్రమంలో ఆరోగ్యకరమైన పద్ధతుల వైపుకి కాకుండా షార్ట్కట్ల జోలికి వెళ్లి అనారోగ్యం పాలు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఎలాగైతేనేం వెయిట్లాస్ అయ్యితే చాలు అనుకునేవాళ్లు ఉన్నారు. ఆ వింత ధోరణిలోంచి పుట్టుకొచ్చిందే ఈ డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్. దెయ్యం పేరుతో పిలిచే ఈ డైట్ప్లాన్ ఆరోగ్యానికి అసలు మంచిదేనా..? ఎవ్వరైనా పాటించారా..అంటే..చైనాలోని హాంగ్జౌకు చెందిన 26 ఏళ్ల జియావోయు అనే మహిళ తన ప్రాణ స్నేహితురాలి వివాహం సమయానికి తగ్గడానికి ఈ డెవిల్ వెయిట్లాస్ ప్లాన్ ప్రయత్నించింది. జస్ట్ రెండు నెలల్లో దాదాపు 15 కిలోలు తగ్గాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రయత్నించింది. అయితే ప్రీడయాబెటిస్ బారినపడి ఇబ్బందులు కొనితెచ్చుకుంది. నిజానికి ఈ డైట్ వల్ల పోషకాహార లోపం, హర్మోన్ల అమసతుల్యత, పిత్తాశయ రాళ్లు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవ్వుతాయినేది ఆరోగ్య నిపుణుల వాదన. ఇక్కడ ఈ చైనా మహిళ జియావోయు ఈ వెయిట్లాస్ ప్లాన్తో తన స్నేహితురాలి వివాహానికి సరిగ్గా 50 కిలోల బరువు లక్ష్యానికి చేరుకుంది. అయితే తర్వితగతిన అలసట, తీవ్ర దాహం, ఆకలి, తలతిరగడం, గుండె దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆ వెయిట్లాస్ ప్లాన్లో భాగంగా చేసిన ఉపవాసల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని పరీక్షల్లో తేలింది. అధిక తీవ్రత వ్యాయామాలు చేస్తూ..పూర్తిగా కార్బోహైడ్రేట్లను తొలగించిది. దాంతో ఇన్సులిన్పై ఎఫెక్ట్పడి ప్రీ డయాబెటిస్ని ఎదుర్కొనక తప్పలేదామెకు. త్వరితగతిన బరువు తగ్గే వెయిట్లాస్ ప్లాన్ కండరాలు నష్టం, డీ హైడ్రషన్కి దారితీసి..చివరికి జీవక్రియను పూర్తిగా దెబ్బతీసింది. దెబ్బతో ఆ మహిళ వెంటనే ఆ డైట్ ప్లాన్కి స్వస్తి చెప్పి..తన జీవనశైలిలో మంచి మార్పులు చేసుకుంది. సమతుల్య ఆహారాన్ని స్వీకరించి, పరిమిత అధిక తీవ్రత వ్యాయామాలు లేదా ఏరోబిక్ వ్యాయమలు చేయడం ప్రారంభించింది. ఈ మార్పులతో ఆమె మూడు నెలల్లో 52.5 కిలోలు తగ్గింది. ఈ విధానంతో ఆమె మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు రావడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. 'డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్' అంటే..ఇది సరైన డైట్ ప్లాన్ మాత్రం కాదు. స్వీయంగా రూపొందించిన డైట్ ప్లాన్. తీవ్రమైన వ్యాయామాలు, డైట్, పరిమిత కేలరీలతో కూడిన డైట్. అలాగే వేగంగా బరువు తగ్గడమే ధ్యేయంగా రూపొందించిన అనారోగ్యకరమైన డైట్. ఇందులో ప్రధానమైన ఆహారాన్ని నివారించి, తీవ్రమైన వ్యాయమాలు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటంటారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి వాటి వల్ల బరువు తగ్గడం ఎలా ఉన్నా..జీవక్రియ నష్టం వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమే ఎక్కుగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: భారతీయ అవుట్ఫిట్లో ఈయూ చీఫ్ ఉర్సులా ..!) -
ఒత్తిడికి మూలం డబ్బేనా..!?
ఇన్నాళ్లు పని ఒత్తిడి, ఎగ్జామ్ భయం, కెరీర్ భయం వాటివల్ల ఒత్తిడికిలోనై అనారోగ్యం పాలవ్వుతున్నాం అనుకున్నాం. కానీ మంచి ఉన్నత పొజిషన్లలలో ఉన్నవాళ్లు సైతం ఒత్తిడి లేదా ఆందోళనల బాధితులే. ఎందుకంటే మనందరం 'సమయం' అంటే 'డబ్బు' అనే భావనతో కూడిన విధానంలో బతుకుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే..యావత్తు ప్రపంచం కూడా స్టాక్ మార్కెట్ వార్తలతోనే మేల్కొంటోంది. అస్థిర మార్కెట్లు, త్రైమాసిక లక్ష్యాలు, క్లయింట్ అంచనాలు..తదితర ఒత్తిళ్లను ఆహ్వానించే వాళ్లం అని చొప్పొచ్చు. ఆ ఆలోచన తీరు మనల్ని ఏ స్థాయిలో ఒత్తిడి అనే గందరగోళంలో కొట్టుకుపోయేలా ..ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు ఈ ఒత్తిడి ఎంత భయంకరమైనదో..రోజువారి జీవిత పోరాటంలో అది మనల్ని ఎంతలా చిత్తుచేసి..అనారోగ్యం పాలు చేస్తుందో కళ్లకుకట్టినట్లుగా వివరించారు ఆరోగ్య నిపుణులు. దాన్ని అధిగమించేలే మన ధోరణి మారకపోతే అంతేసంగతులు అని గట్టిగా హెచ్చరిస్తున్నారు కూడా. సాధారణ వ్యక్తులు కంటే ఆర్థిక రంగంలో ఉన్న నిపుణులే ఒత్తిడి బాధితులుగా మారుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఫైనాన్స్, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి ఫైనాన్స్ నిపుణులకు రోజు టెన్షన్తో ప్రారంభం..ముగింపు ఉంటుందట. ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో దీర్ఘకాలికి ఒత్తిడి శరీరంలోని కార్డిసాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇది బ్రెయిన్ నుంచి, జీవక్రియ, సంతానోత్పత్తి తదితర అన్నిటిని ప్రభావితం చేసి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఈ కార్డిసాల్ స్థాయిల్లోని హెచ్చు తగ్గులు..మహిళలు, పురుషల్లోని, ఈస్ట్రోజెన్-టెస్టోస్టెరాన్ సమతుల్యతకు అంతరాయం ఏర్పరుస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్సులిన్, ధైరాయిడ్ హార్మోన్లపై దుష్ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. దాంతో మహిళలు, పురుషులు పునరుత్పత్తి సమస్యలు, అధిక బరువు, నిద్రలేమి, చెడు కొలెస్ట్రాల్, త్వరితగతిన అలసిపోవడం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పదని చెబుతున్నారు. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అన్నారు. ఒక్కోసారి అతిగా తినడం లేదా ఆకలిని కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఏవిధంగా చిత్తు చేస్తోందంటే..సాధారణంగా ఈ అధిక ఒత్తిడి నిద్రలేమికి దారితీస్తుంది. ఈ నిద్రలేమి అనేది సంతానోత్పత్తి సమస్యలను తీవ్రతరం చేసే కీలక అంశం. ఈ నిద్రలేమి మెలటోనిన్ సాధారణ ఉత్పత్తిని దెబ్బతీసి పునరుత్పత్తికి సంబంధించిన హర్మోన్లను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి తగిని నిద్ర బాడీకి మంచి రీచార్జ్లా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచిస్తునన్నారు నిపుణులు. ముఖ్యంగా డిజిటల్ డిటాక్స్, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు, సూర్యకాంతికి బహిర్గతం అవ్వడం, ప్రతి 20 నిమిషాలకు కదలికలు, మంచి నిద్ర తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు కార్టిసాల్ స్థాయిలు ఆటోమేటిగ్గా తగ్గి హర్మోన్ల బ్యాలెన్స్కు మద్దతిస్తుంది, ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. నిజానికి ఆర్థిక ప్రపంచం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం..నిరంతర వృద్ధి..పతనం అనేవి ఒక చక్రంలా సాగుతుంటుంది. కానీ ఆరోగ్య విషయంలో అలా కాదు. ఒక్కసారి పాడైతే బాగుచేసుకోవడం అంత సులభం కాదు..ఆ నష్టాన్ని అంత వేగంగా పూడ్చుకోలేమనేది గుర్తెరగాలి అని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అందువల్ల ఆరోగ్యమే అసలైన సంపద అనేది అస్సలు మరువ్వద్దు అని హితవు పలుకుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మోదీ మెచ్చిన 'కిచెన్'..! అక్కడ అంతా ఒకేసారి..) -
మెనోపాజ్ టైంలో 'బ్రెయిన్ఫాగ్' వస్తుందా..?
ఒక వయసు వచ్చాక మహిళల్లో గర్భధారణలు పూర్తిగా ఆగిపోవడానికి చిహ్నంగా రుతుక్రమం ఆగడమన్నది చాలా సాధారణం. ఇలా పీరియడ్స్ రావడం ఆగిపోవడాన్ని డాక్టర్లు ‘మెనోపాజ్’గా చెబుతుంటారు. హార్మోన్ల మార్పులతో ఇలా మెనోపాజ్ ఆగడానికి ముందుగా మహిళల్లో చాలా రకాల ప్రతికూల లక్షణాలు కనిపిస్తుంటాయి. అందులో ఒంటి నుంచి వేడి ఆవిర్లు వస్తుండే హాల్ ఫ్లషెస్, మూడ్స్ త్వరగా మారిపోతూ ఉండటం (మూడ్ స్వింగ్స్), పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే ముందు క్రమబద్ధంగా రాకపోవడం (ఇర్రెగ్యులర్ పీరియడ్స్)... ఇవన్నీ సాధారణం. అయితే వీటితోపాటు ‘బ్రెయిన్ ఫాగ్’ అనే లక్షణం కూడా చాలా నిశ్శబ్దంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు... ఈ లక్షణాన్ని మెనోపాజ్కు సంబంధించినది కాకపోవచ్చంటూ కొందరు అయోమయానికి గురికావడం కూడా సహజమంటున్నారు. మెనోపాజ్కు ముందర నిశ్శబ్దంగా వచ్చే ఈ ‘బ్రెయిన్ఫాగ్’ వివరాలేమిటో సవివరంగా చూద్దాం.!.నిజానికి బ్రెయిన్ ఫాగ్ అనేది గతంలో కరోనా వైరస్ విజృంభించాక... కోవిడ్–19 తాలూకు అనంతర దీర్ఘకాలిక దుష్ప్రభావాలలో ఒకటిగా చెబుతూ వెలుగులోకి వచ్చింది. ఈ ‘బ్రెయిన్ ఫాగ్’ దశలో మెదడు అయోమయానికి గురికావడం, మనసుకు మబ్బులు పట్టినట్లుగా మందకొడిగా ఉండి΄ోవడం, ఆలోచనల్లో స్పష్టత లేకుండా ఉండటం, ఏదీ స్పష్టంగా అనిపించక΄ోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణంలో మంచు బాగా కమ్మినప్పుడు చూడటానికి ఎదుటి దృశ్యం గోచరించడంలో ఉండే అస్పష్టతలాగానే... మనసుకు లేదా మెదడుకు అదే మంచు ఆవరిస్తే ఆలోచనల్లో, భావాల్లో ఎలాంటి అయోమయంగా / అస్పష్టతతో ఉంటాయో తెలియజెప్పేందుకే ఈ బ్రెయిన్ ఫాగ్ అనే పదం ఉపకరిస్తుంది. ఎందుకిలా జరుగుతుందంటే... రుతుస్రావం ఆగి΄ోయే ముందుగా మహిళల్లో స్రవించే చాలా రకాల హార్మోన్లు... వీటిల్లోనూ మరీ ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ్ర΄ోజెస్టరాన్ వంటివి బాగా తగ్గడంతో హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడుతుంది. ఇవి కేవలం ప్రత్యుత్పత్తి కోసమే కాకుండా మెదడు సరిగా పనిచేయడంలో కూడా బాగా ఉపకరిస్తుంటాయి. ఉదాహరణకు ఈస్ట్రోజెన్ అన్న హార్మోన్ మెదడులోని నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్ నెరపుతుంటుంది. అలాగే మెదడులో స్రవించే రసాయనాలైన సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిట్టర్లు తమ బాధ్యతలను నెరవేర్చడంలోనూ ఈస్ట్రోజెన్ తగిన భూమికను పోషిస్తుంది. ఈ హార్మోన్ తగ్గడంతో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు ఆగడం ఎలాగూ జరిగేదే అయినా దాంతోపాటు మెదడులోని కార్యకలా΄ాలూ ప్రభావితమవుతాయి. దాంతో మెదడు ఆకృతిలో కూడా కొంతలో కొంత మార్పు తప్పనిసరిగా వస్తుంటుందని ఆధునిక శాస్త్రపరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు ఫ్రంటల్ కార్టెక్స్, హిపోక్యాంపస్ వంటివి ఉన్న చోటు నుంచి కాస్తంత పక్కకు జరగడం వంటివి. ఈ కారణంగా కొందరు మహిళల్లో వారి జ్ఞాపకశక్తిపైనా అలాగే మూడ్స్లో మార్పుల పైనా ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. నిద్రపైనా దుష్ప్రభావాలు... ఈ బ్రెయిన్ఫాగ్ తాలూకు దుష్ప్రభావాలు మెనోపాజ్ వచ్చిన మహిళల నిద్రపైనా పడతాయి. దాంతో వాళ్లు తరచూ నిద్రాభంగానికి గురవుతుండటం జరుగుతుంది (ఒంట్లోంచి ఆవిరులు వస్తుండే హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు తీవ్రంగా చెమటలు పట్టే నైట్ స్వెట్టింగ్ వంటి లక్షణాలు కూడా మహిళల్లో నిద్రలేమి కారణమవుతుంటాయి). ఈ నిద్రలేమి తిరిగి మళ్లీ మెదడును మందకొడిగా చేయడానికి కారణమవుతుంటుంది. చికిత్స...బ్రెయిన్ఫాగ్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్న మహిళలకు వాళ్లలో తగ్గిన హార్మోన్లను భర్తీ చేసే ‘హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ’తో లక్షణాలు అదుపులోకి వస్తాయి. అయితే వాళ్ల సమస్యలకు ఇతరత్రా వేరే కారణాలేవీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) ఇస్తారు. బ్రెయిన్ఫాగ్లో కనిపించే లక్షణాలు...∙దేనిపైనా ఏకాగ్రత నిలవకపోవడం లేదా ఏదైనా విషయంపై దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది కలగడం. మనుషుల, ప్రదేశాల పేర్లూ, కొన్ని పదాలు ఠక్కుమని స్ఫురించక΄ోవడం లేదా మరచిపోవడం. మనం చేయాల్సిన పనులు, తదుపరి షెడ్యూల్స్ మరచిపోతూ ఉండటం. తీవ్రమైన నిస్సత్తువ లేదా బాగా మందకొడిగా అనిపించడం. సాఫీగా ఆలోచింకలేకపోవడం, మునపటిలా కాకుండా ఏదైనా ఆలోచనల్లో స్పష్టత వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందిపడాల్సి రావడం. అధిగమించడం ఎలా...మెనోపాజ్లో కనిపించే ఈ బ్రెయిన్ఫాగ్ను అధిగమించడానికి మంచి జీవనశైలి బాగా ఉపయోగపడుతుంది. కంటినిండా నిద్ర΄ోవడం, మంచి గాఢమైన, నాణ్యమైన నిద్రతోనూ, అన్ని రకాల పోషకాలతో కూడిన మంచి సమతులాహారంతోనూ, క్రమంతప్పకుండా చేసే వ్యాయామాలతో పాటు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా కాలం గడుపుతూ, తమను తాము బిజీగా పెట్టుకుంటూ నిత్యం మంచి పుస్తకాలు చదవడం, గళ్లనుడికట్టు లేదా క్లిష్టమైన పజిల్స్ సాధించడం లాంటి ‘మెంటల్ ఎంగేజ్మెంట్’ కార్యకలాపాలతో గడపడం వల్ల ఈ తరహా బ్రెయిన్ఫాగ్ లక్షణాలు చాలావరకు తగ్గుతాయి.మతిమరపు వస్తుందా అన్నంత ఆందోళన... బ్రెయిన్ఫాగ్ తాలూకు ఈ లక్షణాలతో మెనోపాజ్ దశలో మహిళలకు తమకు మతిమరపు గానీ లేదా అలై్జమర్స్గానీ వస్తున్నాయా అంటూ తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. అయితే అదృష్టవశాత్తూ ఇవేవీ అలై్జమర్స్లాంటి తీవ్రమైన మతిమరపులాంటి సమస్యలను తెచ్చిపెట్టవన్నది వైద్య నిపుణుల మాట. అంతేకాదు... బ్రెయిన్ఫాగ్తో కనిపించే ఈ లక్షణాన్నీ చాలావరకు తాత్కాలికమేనంటున్నారు. (చదవండి: అమ్మ పాలతో అదనంగా...కాంప్లిమెంటరీ ఫుడ్గా..!) -
అమ్మ పాలతో అదనంగా...కాంప్లిమెంటరీ ఫుడ్గా..!
చిన్నారులకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఇతర ఆహారాలేవీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్నెల్ల వయసు దాటాకే చిన్నపిల్లలకు ఘనాహారం ఇవ్వడం మంచిదని అనేక అధ్యయనాలూ, నిపుణులూ సిఫార్సు చేస్తున్నారు. ఆర్నెల్లు దాటాక పిల్లలకు క్రమంగా ఘనాహారానికి మార్చే ప్రక్రియలో తల్లిపాలతోపాటు కొద్దికొద్దిగా ఆహారాన్ని ఇచ్చే క్రమంలో వారికి పెట్టే మెత్తటి గుజ్జులాంటి ఫుడ్ను ‘కాంప్లిమెంటరీ ఫుడ్’గా చెప్పవచ్చు. అది ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. కాంప్లిమెంటరీ ఆహారం గురించి ఇటీవల మార్కెట్లో యాడ్స్ ద్వారా ప్రచారాలూ, వాణిజ్యపరమైన హడావుడి ఎక్కువగా ఉంటున్నాయి. తమ కంపెనీ ఆహారం వల్ల ఎదిగే పిల్లలకు మంచి పౌష్టికత లభిస్తుందంటూ ఈ తరహా అడ్వరై్టజ్మెంట్స్లో చెబుతుంటారు. నిజానికి కాంప్లిమెంటరీ ఆహారం అంటే... తల్లిపాలతోపాటు ఆర్నెల్ల వయసు నుంచి పిల్లలకు అదనంగా ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం అని చెప్పవచ్చు. కాబట్టి కాంప్లిమెంటరీ ఆహారమనగానే అదేదో తప్పనిసరిగా మార్కెట్లో కొని చిన్నారులకు తినిపించాల్సిన ఆహారమంటూ పొరబడాల్సిన / అపోహపడాల్సిన అవసరం లేదు. ఘనాహారంలో ఇవ్వాల్సిన న్యూట్రిషన్ ఇలా... ఘనాహారంలో భాగంగా పిల్లలకు మెత్తగా ఉడికించిన అన్నం (రైస్), పప్పులు (దాల్), అరటిపండు గుజ్జుగా చిదిమి ఇవ్వాలి. ఆలూ వంటి ఉడకబెట్టిన కూరగాయలూ మెత్తగా చిదిమి పెట్టవచ్చు. ఘనాహారం మొదలుపెట్టిన నాటి నుంచి చిన్నారులకు కాచి చల్లార్చిన నీళ్లు పడుతూ ఉండాలి. అంతేతప్ప వాణిజ్య ప్రయోజనాలతో మార్కెట్లో లభ్యమయ్యే ఆహారాన్నే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ మోతాదులోనంటే... పైన చెప్పిన ఆహారాన్ని ఆర్నెల్ల వయసు నుంచి రోజూ 150 ఎమ్ఎల్ పరిమాణంలో రెండు నుంచి మూడు సార్లు తినిపించవచ్చు. పాలు ఎక్కువగా పట్టని పిల్లలకు రోజూ 3 నుంచి 5 సార్లు కూడా తినిపించవచ్చు. ఇక ఎనిమిది/తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు పైన పేర్కొన్న ఆహారమేగాక... మెత్తగా చిదిమిన ఇడ్లీ లేదా రోటీ కాస్తంత గట్టిగా వండిన పప్పుతో ఇవ్వవచ్చు. ఇక రవ్వతో కాస్తంత జావలా వండిన ఆహారం (పారిడ్జ్), సపోటా, బొప్పాయి వంటి పండ్లను చిదిమి ఆహారంగా ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ ఆహారం కిందికే వస్తాయి. కాంప్లిమెంటరీ ఆహారం ఎలా ఉండాలంటే...పిల్లల కడుపుకు నప్పేదీ, సరైనది, మృదువుగా ఉండేది, తేలిగ్గా జీర్ణమయ్యేది, స్థానిక సంస్కృతి ఆమోదించేది, తేలిగ్గా వండగలిగేది, తల్లిదండ్రుల ఆర్థిక స్థోమతను బట్టి వారు భరించగలిగేంత (అఫర్డ్ చేయగలిగేంత) చవకగా దొరికేదని అధ్యయనాల నిర్వచనం. ఇప్పుడంటే దీన్ని ‘కాంప్లిమెంటరీ ఆహారం’గా చెబుతున్నారు గానీ... గతంలో ఘనాహారాన్ని మొదలుపెట్టే ప్రక్రియను ఇంగ్లిష్లో ‘వీనింగ్’ అనేవారు. అయితే ఈ ప్రక్రియను వీనింగ్ అనడం అంత సమంజసం కాదని నిపుణులు అభిప్రాయం. నిజానికి వీనింగ్ అంటే పాలు పట్టడాన్ని క్రమంగా ఆపేస్తూ్త ఘనాహారానికి మళ్లడం అని అర్థం. కానీ పిల్లలకు రెండేళ్లు నిండేవరకు తల్లిపాలు పట్టడాన్ని కొనసాగిస్తూనే ఈ ఘనాహారాన్ని అనుబంధంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుబంధ ఆహారం (కాంప్లిమెంటరీ ఫుడ్) అంటున్నారు. ఇక కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో కాస్తంత త్వరగా అంటే... మూడు లేదా నాలుగు నెలల వయసప్పటి నుంచే ఘనాహారాన్ని మొదలుపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా మొదలుపెట్టిన పిల్లల్లో కొందరికి ఆహారం గొంతులో ఇరుక్కోవడం (చోకింగ్), నీళ్లవిరేచనాలు (డయేరియా), అలర్జీల వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అనుబంధ ఆహారాన్ని ఆలస్యం ఇవ్వడం మొదలుపెడితే అది వాళ్ల పెరుగుదలపై దుష్ప్రభావం చూవచ్చు. అందుకే సరైన సమయంలో పిల్లలకు ఘనాహారం / అనుబంధ ఆహారం మొదలుపెట్టడం అన్నది ముఖ్యం. అయితే... ఘనాహారం ఇస్తున్నప్పటికీ పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. అది భవిష్యత్తులో వాళ్లను ఎన్నో జబ్బుల నుంచి దూరం చేస్తూ... ఆ పిల్లలకు పెద్దవయసు వచ్చాక కూడా రక్షణ ఇస్తూనే ఉంటుంది. హరిత శ్యామ్ .బి సీనియర్ డైటీషియన్(చదవండి: 'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..!) -
పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గాలంటే...!
సాధారణ వ్యక్తులకు బరువు తగ్గడమే కష్టమైన టాస్క్ అనుకుంటే..అందులోనూ ఇలా పెరిమెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మూడ్ స్వింగ్స్ సవ్యంగా ఉండవు. హర్మోన్ల మార్పులతో ఒక రకమైన చికాకు, ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు. దాంతో కొందరికి విపరీతమైన ఆకలి వేసేస్తుంటుంది కూడా. అందువల్ల ఆ టైంలో బరువుని అదుపులో ఉంచడం అనేది మాములు విషయం మాత్రం కాదు. అయితే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తూ వెయిట్లాస్ అవ్వొచ్చని చెబుతోంది స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన ఈ ఇన్ఫ్లుయొన్సర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గడం ఎలాగో అందుకు హెల్ప్ అయ్యే చిట్కాల గురించి షేర్ చేసుకున్నారు ఫోటోగ్రాఫర్ . ఆమె ఆ సమయంలోనే తాను ఆరు నెలల్లో 11 కిలోలు వరకు తగ్గానని చెప్పుకొచ్చారామె. ఈ సీక్రెట్ ఏంటో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసుకున్నారామె. మొదట్లో పెరిమెనోపాజ్లో ఉన్నప్పుడు బరువు తగ్గాను అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డా..కానీ ఇప్పుడు గట్టిగా అరిచి చెబుతా. ఎందుకంటే..ఆ సమయంలో తన శరీరం చాలా లావుగా అసహస్యంగా ఉండటంతో..తనను తాను గుర్తించడం మానేసిన దారుణమైన పరిస్థితని చెప్పుకొచ్చారామె. అయితే లాక్డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు బరువుని అదుపులో ఉంచేలా చక్కటి ఆహారాన్ని తీసుకుని సత్ఫలితాలు పొందానని ఆనందంగా వెల్లడించారామె. భవిష్యత్తులో 50 ఏళ్లు నిండిన నా ఆహార సంబంధాన్ని ఆరోగ్యప్రదంగానే ఉంచుకుంటానంటోంది. తాను ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం, బరువులు ఎత్తడం, చిరుతిళ్లకు దూరంగా ఉండటం అలవాట్లను తన డైట్లో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆ సమయంలో బరువు తగ్గాలంటే మన జీవనశైలి ఎలా ఉండాలో కూడా వివరించిందామె. బరువులు ఎత్తడం..కండర ద్రవ్యరాశికి, జీవక్రియలు మెరుగుపడేందుకు వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తడం వంటివి చేసేదాన్ని అని తెలిపారామె.వాకింగ్అడుగుల సంఖ్యను రోజు రోజుకి పెంచుతూ అలా పదివేల అడుగులు వేసేలా సెట్ చేసుకున్నారట ఆమె. దీంతోపాటు వారానికి రెండుసార్లు యోగా సెషన్లకు హాజరయ్యేదాన్ని అని తెలిపింది.ప్రోటీన్కి ప్రాధాన్యత..ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇచ్చే ఆరోగ్యకరమైన ప్రోటీన్లను ఎంపిక చేసుకుని మరి తినేదాన్ని అని చెప్పారు.చిరుతిళ్లుకు చెక్..సంతృప్తిగా తినడం ప్రారంభించడంతో..చిరుతిళ్ల జోలికి వెళ్లిపనే తప్పిందని చెప్పింది. తన అల్పాహారంలో అదనపు కేలరీల ప్రధాన మూలం తన బరువు పెరిగేందుకు కారణమని భావించే వాటికి దూరంగా ఉన్నానని వివరించింది.సహజసిద్ధమైన వాటిని తీసుకుంటూ.. ఫిట్నెస్ యాప్తో తన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం ప్రారంబించారమె. అలాగే వెయిట్లాస్ ప్రక్రియలో ఇతరులు సహాయం తీసుకుంటూ మనలో మార్పులు వచ్చాయో లేదా అడగి తెలుసుకోవడం తదితరాలను చేయాలని చెప్పొకొచ్చింది ఫోటోగ్రాఫర్ కింబర్లీ ఎస్పినెల్. View this post on Instagram A post shared by Kimberly Espinel (@thelittleplantation) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: పోగొట్టుకున్న రూ. 30 కోట్లు తిరిగి సంపాదించా..! కానీ అతి విలువైన..) -
రూ. 30 కోట్ల సంపద కంటే అతి విలువైనది పోగొట్టుకున్నా..!
జీవితంలో ఏం పోగొట్టుకున్నా..ఏదో ఒక సమయానికి తిరిగి దాన్ని సంపాదించుకోగలం. కానీ పాడైన ఆరోగ్యాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి పూడ్చలేని నష్టం వాటిల్లచ్చు కూడా. అందుకే భూమ్మీద నూకలు ఉంటే ఏమైనా చేయగలం..అదే పోతే ఎన్ని ఉన్నా..నిరూపయోగమే అని మన పెద్దలు ఊరికే అనలేదు కాబోలు. ఇప్పుడు ఆ విషయాన్ని ఓ వ్యవస్థాపకుడు నెట్టింట షేర్చేస్తూ..తాను కూడా అదే తప్పిదం చేశానంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడుని వెళ్లదీసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రతిఒక్కర్నీ ఆలోచించేలా చేయడమే గాక 'ఆరోగ్యమే అన్నికంటే ముఖ్యం' అనే విషయాన్ని అందరికి గర్తు చేసేలా అమితంగా ఆకర్షిస్తోంది. ముంబైకి చెందిన వ్యవస్థాపకుడు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశాడు. తాను వ్యాపార సంస్థలో సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టపోయానని చెప్పారు. దానిఫలితం తన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని నిజాయితీగా వివరించారు. తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ..బరువు పెరుగుతూనే వస్తున్నానని వాపోయారు. వ్యాపారం నష్టం తట్టుకోవడం సులువే..ఎప్పటికైన పోగొట్టుకున్నది సంపాదించేయొచ్చు. కానీ పాడైన ఆరోగ్యం బాగవ్వడం దాదాపు అసాధ్యం అని బాధగా చెప్పుకొచ్చారు. అంతేగాదు వ్యాపార నష్టం ఎప్పటికీ వ్యక్తిగత నష్టానికి దారితీయకూడదని గట్టిగా హెచ్చరించారు కూడా. తాను వ్యాపారంలో కేవలం రూ. 30 కోట్లే పోగొట్టుకున్నానని, దానికంటే విలువైన ఆరోగ్యంకోల్పోయానని ఆవేదనగా చెప్పుకొచ్చారు ఎవర్స్టోన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ దేశాయ్. కాగా, 2017లో దేశాయ్ భారతీయ స్పోర్ట్స్ బ్రాండ్ని దేశాయ్ D: FYని ప్రారంభించారు. అయితే ఈ వెంచర్ భారీ నష్టాలను చవిచూసింది. కేవలం 30 నెలల్లో ఆయన దాచుకున్న పొదుపు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. అయితే అంతా తాను 30 కోట్లు ఎలా కోల్పోయానో ఆరా తీశారే గానీ..ఈ 30 నెలలలో ఎంత టెన్షన్, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాననేది అడగలేదని అన్నారు. నిద్రలేమి అదిక బరువుకి దారితీస్తుంది..ఆ టైంలో ఒత్తిడితో రాత్రి ఆరుగంటల కంటే తక్కువ సమయం నిద్రపోయానని, తనకు తెలియికుండానే చాలా ఒత్తిడిని అనుభవించానని అన్నారు దేశాయ్. వారానికి నాలుగుసార్లు వాకింగ్, జాగింగ్ వంటివి అన్ని చేసినా..తన శరీరంలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. ఎంత కష్టపడి వర్కౌట్లు చేసినా..నాణ్యమైన నిద్ర మాత్రం తిరిగి పొందలేకపోయానన్నారు. అలాగే ఒత్తిడిని కూడా దూరం చేసుకోలేకపోయానని చెప్పారు. ఒత్తిడి, నిద్రలేమి శరీరాన్ని చిత్తు చేస్తాయ్..తన పోస్ట్లో ఒత్తిడి, నిద్ర లేమి ఏవిధంగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయో వివరించారు. ఆరుగంటల కంటే తక్కువ నిద్ర లేమి ఇన్సులిన్ని ప్రభావితం చేసి, టెస్టోస్టిరాన్ను దెబ్బతీస్తుంది.ఎక్కువైన కార్టిసాల్ (ఒత్తిడి ) క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ కొవ్వు తగ్గడాన్ని నిరోధిస్తుందిఎంతలా ప్రయత్నించినా నిద్ర లేమిని తరిమికొట్టలేరుచివరగా ఆయన తాను కోల్పోయిన సంపదను తిరిగి పొందగలిగినప్పటికీ..ఆరోగ్యపరంగా పూర్తిస్థాయిలో కోలుకోలేదని అన్నారు. అంతేగాదు. తాను సుమారు ఏడేళ్లలోనే కోల్పోయినదంతా సంపాదించానని, కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందలేకపోయానని అన్నారు. అలాగే దేశాయ్ తన పోస్ట్ని ముగిస్తూ..తన తోటి వ్యవస్థాపకులందర్నీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి అని పిలుపునివ్వడం విశేషం. View this post on Instagram A post shared by Prashant Desai (@itsprashantdesai) (చదవండి: మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..) -
లంగ్ కేన్సర్ని ముందుగా గుర్తించగలమా..?
గత ఆర్థిక సంవత్సరం ఊపిరితిత్తుల కేన్సర్కి సంబంధించి ఆరోగ్య బీమా క్లెయిమ్లు రెట్టింపయ్యాయి, చికిత్స వ్యయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా గుర్తించడం, నివారించడం, ఆర్థికంగా సన్నద్ధంగా ఉండటానికి సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల కేన్సర్ ప్రజలపై చూపుతున్న ప్రభావం గురించి టాటా ఏఐజీకి వచ్చిన క్లెయిమ్స్ గణాంకాల్లో కీలకాంశాలు వెల్లడయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఊపిరితిత్తుల కేన్సర్ సంబంధిత బీమా క్లెయిమ్ల సంఖ్య, అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే రెట్టింపయ్యింది. దీనితో పాటు ఆసుపత్రిలో చికిత్స వ్యయాలు 27 శాతం మేర పెరిగాయి. చికిత్స మరింత ఖరీదైనదిగా మారడాన్ని, కేన్సర్ బాధితుల కుటుంబాలకు ఆర్థికంగా పెనుభారం అవుతున్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది.“ఊపిరితిత్తుల కేన్సర్ అనేది ప్రస్తుతం అరుదైన ముప్పుగా ఉండటం లేదు. వైద్యంపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండివిడ్యువల్ క్లెయిమ్లు లక్షల స్థాయిలో, కొన్ని సందర్భాల్లో రూ. 50 లక్షలకు పైగా కూడా వస్తుండటాన్ని మేము చూస్తున్నాం. స్టాండర్డ్గా ఉండే రూ. 5 లక్షలో లేదా రూ. 10 లక్షల పాలసీల్లాంటివి, కుటుంబాలకు ఎంతో అవసరమైన సందర్భాల్లో సరిపోని పరిస్థితి నెలకొనవచ్చు. బీమా ఉంటే సరిపోదు. వైద్యానికి సంబంధించి నేటి వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించే విధంగా సరైన కవరేజీ ఉండాలి. ఎలాంటి ముందస్తు హెచ్చరికా లేకుండా దాడి చేసే ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొనేలా ఆర్థికంగా సర్వసన్నద్ధంగా ఉండే క్రమంలో బీమాను పునఃమదింపు చేసుకునేందుకు, అప్గ్రేడ్ అయ్యేందుకు ఇది సరైన సమయం” అని టాటా ఏఐజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & నేషనల్ హెడ్ – కన్జూమర్ క్లెయిమ్స్ రుద్రరాజు రాజగోపాల్ తెలిపారు.వచ్చిన వాటిలో 64 శాతం క్లెయిమ్లు 50 ఏళ్ల పైబడిన వారికి చెందినవని డేటాలో వెల్లడైంది. ఈ వ్యాధి, పెద్దవారిలోనే ఎక్కువగా ఉంటోందనే విషయాన్ని ఇది తెలియజేస్తోంది. మరింత సంక్లిష్టమైన కేసుల్లో సగటు క్లెయిమ్ పే అవుట్ రూ. 3 లక్షలు పైగా ఉండగా, అత్యధిక ఇండివిడ్యువల్ క్లెయిమ్ ఏకంగా రూ. 58 లక్షలుగా నమోదైంది. గత మూడేళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలకు చెల్లించిన మొత్తం రెట్టింపు స్థాయికి మించింది. మహారాష్ట్ర (23.9%), గుజరాత్ (17%), ఢిల్లీ (12.3%) నుంచి క్లెయిమ్లు అత్యధికంగా వచ్చాయి. బహుశా ఆయా రాష్ట్రాల్లో వాయు కాలుష్యం అత్యధికంగా ఉండటం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు, డయాగ్నోస్టిక్స్ ఉండటం ఇందుకు కారణం అయి ఉండొచ్చు.ఊపిరితిత్తుల క్యాన్సర్ కారకాలకు సంబంధించి అత్యధికంగా దాదాపు 85 శాతం కేసుల్లో స్మోకింగ్ ప్రధానమైనదిగా ఉంటున్నప్పటికీ, అదొక్కటే కారణం కాదు. వాయు కాలుష్యానికి, సెకండ్-హ్యాండ్ స్మోక్కి, నిర్దిష్ట పనిప్రదేశాల్లో రసాయనాలకి ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా రిస్కులు పెరుగుతాయి. నగరాల్లో జీవించే వారు, దుమ్మూ ధూళితో కూడుకున్న ప్రదేశాల్లో పని చేసేవారు లేదా స్మోక్ చేసే కుటుంబ సభ్యులు ఉన్న వారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ చరిత్ర, సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, కదలకుండా ఒకే చోట కూర్చుని ఉండే జీవన విధానాలు కూడా ఇందుకు దారి తీయొచ్చు.అందుకే హెచ్చరిక సంకేతాలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మీ వయస్సు 40 పైగా ఉండి, స్మోకింగ్ అలవాటు ఉన్నా లేదా గతంలో స్మోక్ చేసినా, లేదా కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నా, ఈ కింది లక్షణాలు కనిపిస్తే డాక్టరును సంప్రదించడం శ్రేయస్కరం:దగ్గు ఆగకుండా రావడం, తీవ్రత పెరగడంచాతీలో నొప్పి లేదా అసౌకర్యందగ్గినప్పుడు రక్తం రావడంచిన్న పని చేసినా ఊపిరి తీసుకోవడం కష్టం కావడంకారణం లేకుండా అలసిపోవడం లేదా బరువు తగ్గిపోవడంతరచుగా లేదా పదే పదే ఛాతీ సంబంధ అంటువ్యాధులు వస్తుండటంరిస్కు ఎక్కువగా ఉండే వారికి ఏటా తక్కువ డోస్లో సీటీ స్కాన్ల్లాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు, మెరుగైన చికిత్స ఫలితాలు సాధించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అన్ని రకాల కేసులను నివారించలేకపోయినప్పటికీ, ఆరోగ్యకరమైన అలవాట్లు, రిస్కులను కొంత తగ్గించగలవు. స్మోకింగ్ మానివేయడం, కాలుష్యం ఉండే ప్రాంతాలకు ఎక్స్పోజర్ని తగ్గించుకోవడం, సమతుల్యమైన డైట్ తీసుకోవడం, శారీరకంగా యాక్టివ్గా ఉండటం, తరచుగా హెల్త్ చెకప్లు చేయించుకోవడంలాంటి పనులు చిన్నవే అయిననప్పటికీ సమర్ధవంతంగా ఉపయోగపడతాయి.(చదవండి: లంగ్ కేన్సర్ని ముందుగా గుర్తించగలమా..?) -
కొంపముంచిన వెయిట్లాస్ టిప్..! పాపం ఆ విద్యార్థిని..
ఇటీవల కాలంలో అందర్నీ వేధించే సమస్య అధిక బరువు. అందులోనూ సోషల్ మీడియా పుణ్యమా అని ఇది తింటే బరువు తగ్గుతారు, ఈ జ్యూస్ తాగితే సన్నజాజిలా నాజుగ్గా అయిపోతారంటూ..యూట్యూబ్ వీడియోలు ఎంతలా ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయో తెలిసిందే. అయితే ఏ చిట్కా లేదా హెల్త్ టిప్స్ అనేవి మన శరీరానికి ఎంత వరకు సరిపడుతుందనేది వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్యనిపుణులని సంప్రదించడం అనేది అత్యంత ప్రధానం. గుడ్డిగా ఏది పడితే అది ఫాలో అయితే..ప్రాణాలకే ప్రమాదం అనేందుకు ఈఉదంతమే నిదర్శనం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఏఐ, సోషల్మీడియా సాయం తీసుకునేవాళ్లకు ఈ ఘటన ఓ కనువిప్పు కూడా. అసలేం జరిగిందంటే.. తమిళనాడు సెల్లూరులోని మీనాంబాల్పురం, కామరాజ్ క్రాస్ స్ట్రీట్కు చెందిన దినసరి కూలీ వేల్ మురుగన్ (51), విజయలక్ష్మీ దంపతుల కుమార్తె కలైయరసి(19) నరిమేడులోని ఒక ప్రముఖ ప్రైవేట్ మహిళా కళాశాలలో చదువుతోంది. కొద్దిగా అధిక బరువుతో ఉండటంతో ఆమె తరుచుగా బరువు తగ్గే చిట్కాలను యూట్యూబ్లలో చూస్తుండేది. గతవారం ఆమె కొవ్వుని తగ్గించి..శరీరాన్ని సన్నగా మార్చే..వెంకారాం(బొరాక్స్) అనే టైటిల్తో ఉన్న వీడియోని ఓ యూట్యూబ్ ఛానెల్లో చూసింది. జనవరి 16న, థెర్ముట్టి, కీళమాసి వీధి సమీపంలోని ఒక ఆయుర్వేద మందుల దుకాణంలో ఆ పదార్థాన్ని కొనుగోలు చేసిందామె. జనవరి 17న వీడియోలో చెప్పిన విధంగా సేవించింది. వెంటనే వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. తక్షణమే ఆమె తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆ లక్షణాలు తగ్గుముఖం పట్టక పోగా..మళ్లీ తిరగబెట్టాయి..దాంతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేసింది. అయినా పరిస్థితి చక్కపడక పోగా..తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడుతోందంటూ తండ్రిని పట్టుకుని భోరున విలపించింది. రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు మరింత తీవ్రమవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు తరలిస్తుండగా..మార్గ మధ్యలోనే తుదిశ్వాస విడిచింది. వైద్యులు సైతం అప్పటికే చనిపోయిందని దృవీకరించారు. ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన తదనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సదరు యూట్యూబ్ ఛానెల్పై చర్యలు తీసుకునేలా దర్యాప్తు ప్రారంభించారు.(చదవండి: ఎనిమిది నెలల్లో 31 కిలోల బరువు..! ఆ సాకులకు స్వస్తి చెప్పాల్సిందే..!) -
తొందరగా బరువు తగ్గాలంటే..! ఏం చేయాలి? ఏం చేయకూడదు?
బరువు తగ్గడానికి కొవ్వు కరిగించే మందులు, ఇంజెక్షన్లపై ఆధారపడుకుండా అత్యంత సహజసిద్ధంగా బరువు తగ్గాలంటే చాలా ఓపిక, స్ట్రాంగ్ మైండ్సైట్ చాలా ముఖ్యం. అలా నిలకడగా ప్రయత్నానికి బ్రేక్ ఇవ్వని వారే అద్భుతాలు సృష్టిస్తారు..మంచి ఫలితాలను అందుకుంటారు. అందుకు ఉదాహరణే ఈ ఫిట్నెస్ ట్రైనర్ టార్న్ కౌర్. ఆమె కేవలం ఎనిమిది నెలల్లోనే 31 కిలోలు తగ్గి శెభాష్ అనిపించుకుంది. అందుకు ఉపకరించిన మూడు వాస్తవిక త్యాగాల గురించి ఇస్టాగ్రామ్లో వివరిస్తూ..పోస్టు పెట్టారామె. మరి బరువు తగ్గేందుకు ఆమె వ్యక్తిగతంగా చేసిన ఆ మూడు మార్పులేంటి? అంతలా ఎలా బరువు తగ్గారామె అంటే..ఆమె చేసుకున్న వ్యక్తిగత మార్పులు..పక్కా ప్లానింగ్..బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ప్రతిసారి నూటికినూరు శాతం పర్ఫెక్షన్ ఉండాలనుకునేది. అలా అనుకున్న ప్రతిసారి తన డైట్ మళ్లీ మొదటకు రావడం..జరుగుతుండేది. ముఖ్యంగా నిద్ర తర్వాత ప్లానింగ్ స్కిప్ అవ్వతూ ఇబ్బంది పడేది. అందుకే పరిపూర్ణ కంటే..సవ్యంగా అనుకున్నది ప్రతి రోజు జరిగేలా ప్లాన్ ఉంటే సరి అని డిసైడ్ అయ్యింది.నిర్విరామంగా, స్థిరంగా..అస్తామాను బరవు తగ్గాలి అంటూ పరిష్కారాల కోసం ప్రయత్నించడం అనేవి వృధా ప్రయాసేనని అంటోందామె. దానికంటే..రోజువారి ఆరోగ్యకరమైన అలవాట్లు క్రమం తప్రకుండా చేసేలా చూసుకోవడం బెటర్. ముఖ్యంగా నిలకడ(స్థిరత్వానికి) ప్రాముఖ్యత ఇస్తేనే..మంచి ఫలితాలు సొంతం అవుతాయి.సాకులుసమయం లేదనే మాటకు ఆస్కారం ఇవ్వకూడదంటోంది. సెలవులు, వివాహాలు, సుదీర్ఘ ప్రయాణ రోజులు, తల్లిదండ్రుల బాధ్యతలు, పని ఒత్తిళ్లు, ఇలా ఎన్ని ఉన్నా..బరువు తగ్గాడానికి బ్రేక్ ఇవ్వకూడదని, సమయం లేదనే మాట ఉండకుండా ఉండేలా కేర్ తీసుకోవాలంటోంది. ఎందుకంటే ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్న చాలామంది బరువు తగ్గుతున్నప్పుడూ మనమెందుకు తగ్గం అనేది విశ్లేషించుకుంటే..పరిష్కారం ఆటోమేటిగ్గా దొరుకుతుందంటోంది. View this post on Instagram A post shared by Tarn Kaur | Online Coach 🏋🏼♀️💕 (@weightlosswithtarn) ఇక ఇక్కడ ఫిట్నెస్ ట్రైనర్ తన బరువ తగ్గే జర్నీలో డైట్లో మార్పులు చేసుకున్నా మొత్తం 20 ఆహారాల జాబితాను కూడా షేర్ చేశారు. అవేంటో చూద్దామా..!1. మిల్కీ షుగర్ చాయ్ బదులు - బ్లాక్ కాఫీ2. ప్యాక్ చేసిన జ్యూస్లు - ఎలక్ట్రోలైట్స్ కోసం దోస, కీర జ్యూస్లు లేదా కొబ్బరి నీళ్లు3. రాత్రిపూట తెల్ల బియ్యం - క్వినోవా/కాలీఫ్లవర్ బియ్యం4. మైక్రోవేవ్ పాప్కార్న్ - ఎయిర్-పాప్డ్ పాప్కార్న్5. చీజ్ క్రాకర్స్ - కాల్చిన చిక్పీస్6. క్రీమీ పాస్తా - హోల్వీట్ నూడుల్స్ + పాలకూర సాస్7. షుగర్ తృణధాన్యాలు - దాల్చిన చెక్క, ఆపిల్ & తేనెతో రాత్రిపూట ఓట్స్8. క్రిస్ప్స్ ప్యాకెట్లు - వెజ్జీ స్టిక్స్ + గ్రీక్ పెరుగు డిప్9. మిల్క్ చాక్లెట్ - డార్క్ చాక్లెట్ స్క్వేర్10. షుగర్ బిస్కెట్లు - బాదం పిండి కుకీలు11. బిస్కెట్లు - వేరుశెనగ వెన్న మరియు తేనెతో రైస్ క్రాకర్స్12. వేయించిన స్నాక్స్ - బేక్డ్ వెజ్జీ చిప్స్13. ఐస్ క్రీం - గ్రీక్ పెరుగు + ఫ్రోజెన్ బెర్రీస్14. షుగర్ సాస్లు - ఇంట్లో తయారుచేసిన టమోటా/పెస్టో సాస్15. వైట్ బ్రెడ్ - హోల్గ్రెయిన్ లేదా సీడ్ బ్రెడ్16. షుగర్ డ్రింక్స్ - మెరిసే నీరు + నిమ్మకాయ17. సూపర్ మార్కెట్ మఫిన్లు - ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్ అరటిపండు/ఓట్ మఫిన్లు18. చాక్ బార్లు - నట్ + డార్క్ చాక్లెట్ బైట్స్19. హెవీ సలాడ్ డ్రెస్సింగ్లు - ఆలివ్ ఆయిల్ + బాల్సమిక్ వెనిగర్20. ఫాస్ట్ ఫుడ్ బర్గర్లు - ఇంట్లో తయారుచేసిన టర్కీ/వెజ్జీ బర్గర్లు View this post on Instagram A post shared by Tarn Kaur | Online Coach 🏋🏼♀️💕 (@weightlosswithtarn)బరువు తగ్గడానికి 8 'విచిత్రమైన' అలవాట్లుటెంప్ట్ చేసే ఆహారాలు కంట పడకుండా ఉండేలా చేసుకోవడం లేదా దూరంగా ఉండేలా నోటిని అదుపులో ఉంచుకోవడం. భోజనం తర్వాత ఏమైనా తినాలనిపిస్తే..పుదీనా లేదా ఆరోగ్యకరమైన హెల్దీ ఆకులను తినేలా మెదడుని పాజ్ చేయడంముందుగానే ఇంత తినాలనేలా ప్లాన్ చేసుకోవడంఆహారం సరిపోయిన సంతృప్తిని అందివ్వకపోతే..ఆ కోరికను స్కిప్ చేసి..ఏదైనా పనిలో లీనమవ్వడంఅలాగే కడుపు నిండింది అని బిగ్గరగా చెబుతూ మన మైండ్ని కంట్రోల్ చేయడంరెస్టారెంట్లలో బ్రెడ్ వంటి వాటి జోలికి పోకుండా ఉండటం.ఫిట్గా ఉండే మోడ్రన్ దుస్తులు ధరించాలనే విషయాన్ని గుర్తించుకుంటూ..తక్కువగా తినడం తనను ఏదో రకంగా తినాలనిపించేలా చేసే ఆకర్షణీయమైన వంటకాలన్నింటిని చెత్తబుట్టలో వేసేయడం తదితరాలతో ఫిట్నెస్ ట్రైనర్ టార్న్ కౌర్ విజయవంతంగా బరువు తగ్గారామె. ఈమె వెయిట్లాస్ జర్నీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే..ఇక్కడ మనం బరువు తగ్గాలనే విషయంపై గట్టి ఫోకస్ తోపాటు ఆ దిశగా మనం తినే ఆహారం, వర్కౌట్లు ఉండేలా కేర్ తీసుకోవడమే గాక నిలకడతో చేయాలి. అప్పుడే సత్ఫలితాలు పొందగలం అని చెబుతున్నారు నిపుణులుగమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: 73 ఏళ్ల తాత గారి సిక్స్ప్యాక్ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..) -
73 ఏళ్ల తాత గారి సిక్స్ప్యాక్ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..
జస్ట్ ఆరు పదుల వయసు దాటగానే ముఖంలో ముడతలు..చర్మం వదులుగా వచ్చేసి..ముసలి రూపు వచ్చేస్తుంటుంది. ఒకవేళ ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ఆస్వాదించేవారు కూడా ఓ మోస్తారు వర్కౌట్లు, చిన్న పాటి వాకింగ్ వంటివి చేస్తూ ఆరోగ్యంగా ఉండటం చూశాం. కానీ ఇతడని చూస్తే..నోరెళ్లబెట్టేస్తాం. బాడీ ఏమో 25 ఏళ్ల యువకుడిలా చాకులా ఉంటుంది. వయసు చూస్తే వామ్మో అనేస్తాం. ఇది నిజమేనా అనే సందేహం కూడా వచ్చేస్తుంది ఆ తాతగారి ఫిజిక్ని చూస్తే. అంత అద్భుతమైన దేహ ధారుడ్యంతో..ముఖ్యంగా సిక్స్ ప్యాక్స్తో నవ మన్మధుడిలా ముగ్ధమనోహరంగా ఉంటాడు. మరి అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి?, ప్రోటీన్ సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటాడా అంటే..?సాధారణంగా డెభైల వయసులో కండరాలు దృఢంగా ఉండటం అంత సులభం కాదు. ముఖ్యంగా చర్మం ఎంత వదులుగా మారిపోతుందో తెలిసిందే. అలాంటిది ఆ తాతగారి ఉక్కులాంటి శరీరాన్ని చూసి షాకవ్వుతాడు. అంతలా ఉండటానికి ఎంతలా వర్కౌట్లు చేస్తాడో తలుచుకుంటూనే భయమేస్తుందంటూ..నేరుగా ఆయన్నే అడుగుతాడు ఫిట్నెస్ కోచ్ లాంగోవ్స్కీ. చక్కటి పోషకాహారం, స్మార్ట్ వ్యాయామాలు మయసుని దిక్కారిస్తాయని నిరూపించాడు ఈ 73 ఏళ్ల వ్యక్తి. అందుకు తనకు ఉపకరించిన హెల్త్ సీక్రెట్ గురించి కూడా ఫిట్నెస్ కోచ్ స్కీతో పంచుకుంటాడు కూడా. ఇంత స్ట్రాంగ్ బాడీ మెయింటైన్ చేసేందుకు జిమ్లో ఎంతలా కష్టపడుతుంటారని అడుగుతాడు. అందుకు ఆ తాతగారు గట్టిగా నవ్వేసి..తేలికపాటి వ్యాయామాలే చేస్తాను, కానీ కష్టపడకుండా తేలిగ్గా చేస్తానని సమాధానమిచ్చారు. మరి ఎలాంటి పుడ్ తీసుకుంటారు అని ఫిట్నెస్ కోచ్ స్కీ అడగగా..మంచి ప్రోటీన్, కొల్లాజెన్, క్రియేటిన్ మాత్రమే తీసుకుంటానని అన్నారు. ఉపవాసం ఉంటే తప్ప..ప్రతిరోజు వైన్ పడాల్సిందేనని అన్నారు. రోజుకి రెండు గ్లాస్ల వైన్ హాంఫట్ చేస్తారట ఈ తాతయ్య. ఆ తర్వాత కోచ్ ఎన్ని పుషఅప్లు చేయగలరు? అని కుతుహలంగా అడుగుతాడు..దానికి ఆయన దాదాపు 30 వరకు చేయగలనని నమ్మకంగా చెప్పారు. అంతేకాదండోయ్ ఆ ఫిట్నెస్ కోచ్ ముందే ఏకంగా 36 పుష్ అప్లు చేసి చూపించాడు కూడా. తన శరీర కొవ్వు శాతం కూడా 8.5% అని వెల్లడించాడు. పైగా క్రమశిక్షణతో కూడిన మంచి పోషకాహారం, కొంచెం వైన్ని సేవిస్తూ..డెభైలలో కూడా ఫిట్గా ఉండటం ఈజీనే అని నిరూపించాడమే కాదు వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని తన ఆహార్యంతో గొంతెత్తి చెప్పకనే చెప్పాడు ఈ తాతయ్య. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by ʙᴏᴅʏ ʙʏ ᴍᴀʀᴋ™ (@bodybymark) (చదవండి: థాంక్యూ అమెరికా..కానీ భారత్ అంటే ప్రేమ..! వైరల్గా భారత సంతతి వ్యక్తి పోస్ట్) -
జస్ట్ 90 రోజుల్లో 12 కిలోల బరువు..! వెయిట్లాస్ ప్లాన్ ఎలా ఉండాలంటే..
బరువు తగ్గే జర్నీ నిబద్ధతతో కూడిన స్థిర ప్రయాణం. దీనికి ఎలాంటి షార్ట్కట్లు ఉండవు. కేవలం సరైన ఆహారం, చక్కటి వ్యాయామాల కలయికతోటే బరువు తగ్గడం అనేది సాధ్యం. చాలామంది ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్పే మాట ఇది. అదే నిజం అని నిరూపితమైంది కృష్ణ ఇంగ్లే రోగి విషయంలో. ఎన్నో ఏళ్లుగా అధిక బరువుతో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డ ఈ వ్యక్తి..జస్ట్ 90 రోజుల్లో ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడు. తనకు అదేలా సాధ్యమైందో కూడా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. మరి అతడి వెయిట్లాస్ సీక్రెట్ ఏంటో సవివరంగా చూద్దామా..!.మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన కృష్ణ ఇంగ్లే ఎక్స్లో తాను అధిక బరువు సంబధిత సమస్యలతో బాధపడుతున్నానని, వెయిట్లాస్ కోసం యూట్యూబ్లో అనేక వీడియోలతో సహా ఏఐ హెల్ప్ కూడా తీసుకున్నట్లు తెలిపాడు. అయితే అవేమి తన బరువుని తగ్గించలేకపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. ఏ చిట్కాలు, సూచనలు పనిచేయకపోవడంతో..కొల్హాపూర్కు చెందిన డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ను సంప్రదించినట్లు తెలిపాడు. ఆయన మంచి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార ప్రణాళికను సూచించారు. అదే సమయంలో భోజనంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకున్నారు. ప్రతి రోజు కనీసం 90 నుంచి 120 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకున్నాడు. స్వీట్స్కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. వారానికి ఒకసారి మాత్రమే 10 నుంచి 12 గ్రాముల చక్కెరను పెరుగులో కలుపుకుని తినేవాడు. అలాగే కృష్ణ రోజుకు రెండు పూటలా భోజనం చేయడం, భోజనం తర్వాత 10 నిమిషాల నడక తప్పనిసరిగా పాటించేవాడు. అయితే పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం చేసేలా చూసుకున్నాడు. అంతేకాకుండా వారానికి కనీసం నాలుగు రోజులు బీచ్లో 4 నుంచి 5 కిలోమీటర్లు నడిచేవాడు. ఈ విధమైన ప్రణాళికతో అంతకుమునుపు ఉన్న అధిక బరువు సంబంధిత సమస్యలన్నీ తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా తీవ్రమైన ఎసిడిటీ సమస్య చాలమటుకు నార్మల్ అయ్యింది. అలా కృష్ణ 78 నుంచి 80 కిలోల బరువుకి చేరుకోగానే మొత్తం అనారోగ్య సమస్యలన్నీ చాలావరకు క్యూర్ అయ్యాయని పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాదు తాను డైట్లో ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో కూడా తెలిపాడు. కృష్ణ తన భోజనంలో గుడ్లు, చికెన్, పెరుగు, పప్పులు, సోయా చంక్స్ వాటితోపాటు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు, పండ్లు, సలాడ్లు ఉండేలా చూసుకునేవాడనని వివరించాడు. ఇక కృష్ణ విషయంలో బరువు తగ్గడంలో కీలకంగా మారినవి ఏంటో డాక్టర్ సాయాజరివు గైక్వాడ్ ఇలా పంచుకున్నారు.బాగా నిద్రపోవడంఆకలిని అదుపులో ఉంచుకోవడంమనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం తదితరాలే బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యాయని అన్నారు. అందువల్లే ఎసిడిటీ సమస్య తగ్గి, అతనిలో శక్తి స్థాయిలు మెరుగుపడ్డాయని అన్నారు. చివరగా ఆయన.. శరీరానికి పోషణవంతమైన ఆహారాన్ని అందేలా దినచర్యలో భాగం చేసుకోవడం అనేది స్థిరంగా ఉంటే..బరువు తగ్గడం అత్యంత సహజసిద్ధంగానే జరుగుతుందని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.A follower DM’d me this 👇 (shared with identity hidden)“Your posts changed my mindset about diet.”84–85 kg → 72–73 kg in 90 days.No extremes.Just clarity and consistency. 🙏 pic.twitter.com/7XFgOdP98y— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) January 17, 2026 (చదవండి: Republic Day 2026: గణతంత్ర వేడుకల ఆహ్వాన పత్రిక స్పెషాల్టీ ఇదే..! అష్టలక్ష్మి రాష్ట్రాల..) -
ప్రపంచ స్థాయి ‘మదర్ అండ్ చైల్డ్ కేర్ యూనిట్ ఎం’బ్రేస్
మూడు దశాబ్దాలకు పైగా వైద్యరంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న కామినేని ఆస్పత్రి.. మహిళలు, పిల్లల సంరక్షణ కోసం నిరంతర ఆధునిక వైద్యం అందేలా రూపొందించిన ప్రపంచ స్థాయి సమగ్ర మదర్ అండ్ చైల్డ్ కేర్ యూనిట్, ఎం’బ్రేస్ ను శుక్రవారం ప్రారంభించింది. తల్లులు, పిల్లలు, మొత్తం కుటుంబాలకు సంపూర్ణమైన, నిరంతర వైద్యం అందించేందుకు ఈ అత్యాధునిక విభాగాన్ని ఆస్పత్రిలో రూపొందించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, వివిధ విభాగాల నిపుణుల అనుభవం, మానవీయ సంరక్షణను ఏకీకృతం చేస్తూ, మదర్ & చైల్డ్ ఆరోగ్య అవసరాలను తీర్చుతూ ఎం’బ్రేస్ పని చేస్తుంది.మదర్ & చైల్డ్ కేర్ కేవలం వైద్య చికిత్సలకే పరిమితం కాదని అందరూ అవగాహన చేసుకుంటున్న ప్రస్తుత సమయంలో ఎం’బ్రేస్ అందుబాటులో కి వచ్చింది. గర్భధారణ, ప్రసవానికి సంబంధించిన వైద్య సంరక్షణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, భావోద్వేగ, మానసిక, పోషక, అభివృద్ధి అవసరాలు తరుచుగా వేర్వేరుగా తీరుస్తున్నారు. ఈ లోటును పూరిస్తూ, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ నుంచి గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువు నుంచి పిల్లల అభివృద్ధి వరకు మదర్& చైల్డ్ కు కుటుంబాల సమక్షంలో సమగ్ర సంరక్షణను ఎం’బ్రేస్ అందిస్తుంది.ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి సీఈవో డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ, “ఎం’బ్రేస్ ద్వారా మదర్ & చైల్డ్ ఆరోగ్య సంరక్షణను అత్యాధునిక వైద్య విధానంతో కొత్త దిశలో సేవలందిస్తున్నాం. కుటుంబాన్ని సంరక్షణ కేంద్రంగా ఉంచి, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, భావోద్వేగ, పోషక అవసరాలను కూడా సమగ్రంగా చూసుకోవడమే మా లక్ష్యం. ఆధునిక ఐసీయూలు, కార్డియాక్ సపోర్ట్ వ్యవస్థ, 24/7 బ్లడ్ బ్యాంక్ సేవలతో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నాం ” అని తెలిపారు.'హై రిస్క్ ప్రెగ్నెన్సీలను కాపాడే నమ్మకమైన కేంద్రంగా కామినేని ఆస్పత్రికి మంచి పేరు, అనుభవం ఉండడంతో అత్యాధునిక ఎం’బ్రేస్ విభాగాన్ని ప్రారంభించాం. ఆస్పత్రిలో మోడ్రన్ క్రిటికల్ కేర్, ఆధునిక కార్డియాక్ సిస్టమ్స్, రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సలు, 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వివిధ విభాగాల పర్యవేక్షణలో మదర్ & చైల్డ్ ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడం, తల్లులకు నమ్మకంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వాతావరణాన్ని కల్పించడం, అలాగే కుటుంబాలను మదర్& చైల్డ్ సంరక్షణలో క్రియాశీల భాగస్వాములుగా మార్చడంలో ఎం’బ్రేస్ యూనిట్ పని చేస్తోంది.' అని సీఈఓ డాక్టర్ గాయత్రి కామినేని వివరించారు.అనంతరం ఎం'బ్రేస్ గురించి కార్యక్రమ ముఖ్యఅతిథి, ప్రముఖ నటి భూమిక చావ్లా మాట్లాడుతూ.. “ ప్రెగ్నెన్సీ అనేది సంరక్షణ, అవగాహన, కుటుంబ సభ్యుల నిరంతర మద్దతు అవసరమైన ప్రక్రియ. వైద్య చికిత్సతో పాటు తల్లుల భావోద్వేగ, మానసిక శ్రేయస్సును గుర్తించే ఎం’బ్రేస్ ఒక చక్కని అధునాతన ఆలోచనాత్మక ప్రయత్నం. ఇది కామినేని ఆసుపత్రిలో అనేక కుటుంబాల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువస్తుందని నమ్ముతున్నాను” అని చెప్పారు.ఇప్పటికే ప్రజలకు నమ్మకమైన ఆరోగ్య భాగస్వామిగా రూపొందిన ఎం’బ్రేస్, ఇంటికి దగ్గరలోనే నాణ్యమైన అత్యాధునిక వైద్య సేవలను అందిస్తుంది. సంతానోత్పత్తి చికిత్స, గర్భధారణకు ముందు, తర్వాత సంరక్షణ, నవజాత శిశువులు, పిల్లలకు ప్రత్యేక సంరక్షణ (ఎన్ఐసీటీయూ సపోర్ట్ సహా).తల్లులు కుటుంబాల భావోద్వేగ, మానసిక ఆరోగ్యానికి కౌన్సెలింగ్. తల్లులు, పిల్లలకు వ్యక్తిగత డైట్ సలహాలు. పాలిచ్చే విధానంలో సహాయం గైడెన్స్ అందించడం ద్వారా కుటుంబాలు అనేక ఆస్పత్రుల మధ్య తిరగాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.ఎం' బ్రేస్ యూనిట్ టీమ్లో అనుభవజ్ఞులైన ఆబ్స్టెట్రిషియన్స్ & గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, నియోనాటాలజిస్టులు, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు, మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, లాక్టేషన్ కన్సల్టెంట్స్, శిక్షణ పొందిన నర్సులు, మిడ్వైవ్స్, చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్టులతో కూడిన బలమైన బృందం ఉంటుంది.ఈ సమన్వయ విధానం ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన నిరంతర సంరక్షణతో పాటు అవసరమైనప్పుడు అత్యవసర, కార్డియాక్, రక్త మార్పిడి సేవలను వెంటనే అందిస్తోంది.(చదవండి: అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..) -
పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..
ఆరోగ్య స్పృహ బాగా ఉన్నవాళ్లు కూడా పండుగ సమయంలో ఫుడ్ విషయంలో తమ నియంత్రణలను కాస్త సడలించుకోవడం, పండుగ వంటల్నిఇ ఆస్వాదించడం సాధారణమే. ఇక భోజన ప్రియులైతే చెప్పనే అక్కర్లేదు. పైగా సంక్రాంతి అంటే 3రోజుల పాటు కొనసాగే పండుగ...పిండింటలకూ కొదవలేని పండుగ. అందుకే ఈ పండుగ సీజన్ తర్వాత,కొంచెం నిస్సత్తువగా అనిపించడం, ఉబ్బరం, తక్కువ శక్తి, నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పండుగ తర్వాత ఆహార విహారాల్లో కొన్ని మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు.రీహైడ్రేట్, టాక్సిక్స్ బయటకు...పండుగల సమయంలో, మనం తరచుగా అదనపు చక్కెర, నూనె పదార్ధాలు అలవాటున్నవాళ్లు ఆల్కహాల్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ డీహైడ్రేషన్, అలసటలతో బాధపెడతాయి. కాబట్టి పండగ తర్వాత రోజుల్ని ఒక సాధారణ దినచర్యతో ప్రారంభించాలి. పుష్కలంగా నీరు త్రాగాలి. ఉదర వ్యవస్థను ఫ్లష్ చేసి హైడ్రేటెడ్గా ఉంచడానికి కనీసం 8–10 గ్లాసుల నీటిని లక్ష్యంగా పెట్టుకోవాలి. నీటిలో నిమ్మకాయ లేదా దోసకాయ ముక్కలను జోడించడం వల్ల మరింత రిఫ్రెష్గా ఉంటుంది తేలికపాటి డిటాక్స్ ఇస్తుంది. అల్లం, పుదీనా లేదా సోంపు వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి శరీరాన్ని లైట్గా మారుస్తాయి.సమతుల ఆహారం వైపు తిప్పు చూపు...పండుగలు అంటే స్వీట్లు, వేయించిన వంటలతో భారీ భోజనం. ఇక ఇప్పుడు భోజనంలో సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టాలి. జీర్ణక్రియను నియంత్రించడంలో ఉబ్బరం తొలగించడంలో ఫైబర్–రిచ్ ఫుడ్స్, తృణæధాన్యాలు, ఓట్స్ తాజా పండ్లు సహాయపడతాయి.బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను వంటలో చేర్చాలి. పండుగ తర్వాత పెరిగే ఫ్రీ రాడికల్స్ను ఎదుర్కోవడానికి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.కాయధాన్యాలు, పప్పు, కాటేజ్ చీజ్ గుడ్లు వంటి సాధారణ ప్రోటీన్లు కడుపు నిండినట్టు తృప్తికరమైన స్థితిలో ఉంచుతాయి, ఆయిల్ ఫుడ్స్ పట్ల ఇష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.గింజలు, విత్తనాలు తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన నూనెలు (ఆలివ్ లేదా కొబ్బరి నూనె వంటివి) చేర్చాలి.తేలికపాటి ఉపవాసం జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడానికి సులభమైన మార్గం. పూర్తి రోజు చేయలేకపోతే కనీసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే తినడం వంటి పద్ధతిని అనుసరించాలి. తద్వారా రాత్రిపూట 14 గంటల ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. ఈ విధానం శరీరపు పండుగ ఓవర్లోడ్ను ప్రాసెస్ చేయడానికి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది శక్తి స్థాయిలను రీసెట్ చేస్తుంది.పండుగ తర్వాత అలసటతో వ్యాయామాన్ని ఆపేయాలని అనుకోవచ్చు, కానీ సున్నితమైన కదలికలు అయినా తప్పనిసరి. దశలవారీగా 20–30 నిమిషాల నడక రక్త ప్రసరణను పెంచుతుంది, మరింత శక్తినిచ్చేలా చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. తేలికపాటి యోగా భంగిమలు, లోతైన శ్వాసపై దృష్టి సారించి చేసే స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఉబ్బరాన్ని కండరాల బిగుతు ను తగ్గిస్తాయి మానసిక స్పష్టతను మెరుగుపరుస్తాయి.పండుగ రోజుల రాత్రులు, తెల్లవారుఝాములు నిద్ర షెడ్యూల్లను దెబ్బతీస్తాయి. ఆరోగ్యం కోలుకోవడానికి ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడానికి మేల్కొలపడానికి ప్రయత్నించాలి. అలాగే నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్ వీక్షణను నివారించి బదులుగా, పుస్తకం చదవడం మంచిది. ప్రశాంతమైన సంగీతాన్ని వినడం కూడా మంచిదే. నిద్ర పోయే గది పూర్తి నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు ధ్యానం లేదా లోతైన శ్వాస మనస్సును ప్రశాంతపరుస్తుంది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.కొన్ని ఆయుర్వేద చిట్కాలు...డిటాక్స్ వాటర్: ఒక టీస్పూన్ పసుపు లేదా చిటికెడు దాల్చిన చెక్క కలిపిన గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి. రెండు సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి పేరుకున్న చెడు టాక్సిన్స్ను తొలగించడానికి సహాయపడతాయి.భోజనానికి చిటికెడు ఆసాఫోటిడా (హింగ్) జోడించడం లేదా సోంపు లేదా అజ్వైన్ నీటిని త్రాగడం అనేవి జీర్ణక్రియను సులభతరం చేయడానికి ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి.త్రిఫల పౌడర్: పడుకునే ముందు గోరువెచ్చని నీటితో ఒక టీస్పూన్ త్రిఫల పౌడర్ తీసుకోండి. ఈ ఆయుర్వేద మిశ్రమం ప్రేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.జీలకర్ర, కొత్తిమీర, సోంపు నీరు: ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర, కొత్తిమీర, సోంపు గింజలను ఉడకబెట్టండి. జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఉబ్బరం తగ్గించడానికి రోజంతా త్రాగండి.ఒక టీస్పూన్ పసుపు చిటికెడు నల్ల మిరియాలు కలిపిన గోరువెచ్చని పాలు టర్మరిక్ లాట్టే (గోల్డెన్ మిల్క్)ఉపశమనం కలిగించేవి శోథ నిరోధకమైనవి. రోజును ప్రారంభించడానికి వెచ్చని నీటిలో నిమ్మరసం, తురిమిన అల్లం తేనె కలిపితే... ఇది జీర్ణక్రియను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.(చదవండి: పొంగల్వేళ అద్భుతమైన సాంప్రదాయ పులినృత్యం..!) -
ఇదేం విడ్డూరం..! డైరీ రాస్తూ..86 కిలోలు బరువు తగ్గిందా!?
బరువు తగ్గించే చిట్కాలు..సింపుల్ రెమిడీస్ వంటివి ఎన్నో చూశాం. పలానా వ్యాయామం, డైట్ అంటూ ఏవేవో కొంగొత్త విధానాలతో బరువు తగ్గిన ఉదంతాలు చూశాం. కొందరు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటూ..కార్డియాక్ వర్కౌట్లు, వాకింగ్లు, స్కిప్పింగ్లు అంటూ ఎంతో శ్రమ పడి తగ్గగా.. మరికొందరు సైక్లింగ్తో కుస్తీలు పడ్డారు. ఒక్కోక్కరూ ఒక్కోదారిలో వెళ్లి బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఈ మహిళ ఇంతలా కష్టపడకుండా అందరు సులభంగా చేసే, చాలా తేలికైన అలవాటుతో ఇట్టే బరువు తగ్గింది. అది కూడా ఏకంగా 86 కిలోలు బరువు తగ్గడం అంటే మాటలు కాదు కదా..!. అలా అని షార్ట్కట్లు, ఏవేవో మందులు, ఇంజెక్షన్లు తీసుకోలేదు సుమీ..!. మరి ఆమె ఎలా అంతలా బరువు తగ్గింది..?, ఏంటా హాబీ..? అంటే..బరువు తగ్గించే జర్నీలో అందరికీ అతిపెద్ద టాస్క్ వ్యాయామం, వర్కౌట్లు. కానీ ఈ అమెరికా మహిళ కామ్ ఆ పాట్లు ఏం పడకుండా చాలా స్మార్ట్గా చిన్న చిన్న అలవాట్లతో మైండ్ని సెట్ చేసుకుంటూ సులభంగా బరువు తగ్గి అద్భుతం చేసింది. తాను ఎలాంటి ఫిట్నెస్ ట్రైనర్, స్నేహితులు, బంధువుల సహాయం తీసుకోకుండా కేవలం ఆ చిన్న అలవాటుతో బరువు తగ్గించుకున్నానంటోంది. తాను చెప్పబోయే అలవాటు వినడానికి హాస్యస్పదంగా, నమ్మశక్యంగా అనిపించకపోయినా..అద్భుతం చేసిందనేది నమ్మక తప్పని వాస్తవం అని అంటోందామె. కామ్ తనకు ఉన్న డైరీ రాసే అలవాటే అద్భుతంగా బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యిందట. అలా ఏకంగా 86 కిలోలు పైనే బరువు తగ్గానని చెబుతోంది. ఆ డైరీలో తన వెయిట్లాస్ జర్నీని ఎందుకు ప్రారంభించింది.. ఆ టైంలో తాను ఎలా ఉండేది వంటి పోటోలతో సహా పొందుపరిచింది. వాటిని చూసుకుంటూ..తన శరీర పరివర్తనలో మార్పులకు శ్రీకారం చుట్టిందట. ఎందుకంటే ఆ డైరీ ఓపెన్ చేయగానే తన దినచర్య సరిగా ఉందా, ఆహారం మితంగా తిన్నానా లేదా అని తరచి.. తరచి.. చూసుకోవడమే కాకుండా జవాబుదారీగా ఉండాలే చేస్తుందట. ఆ క్రమంలో తనకు స్ఫూర్తిని కలిగించే సూక్తులు, మార్గదర్శకులు తదితరాలన్నింటి గురించి రాసేదట. అంతేగాదు ఒకరకంగా ఏం తిన్నాను, ఏం వ్యాయామాలు చేశాను అన్నది రాస్తున్నప్పుడూ..అబ్బా ఇది చేయలేకపోయాను..ఇంకా బాగా చేయాలి అనే ఫీడ్ బ్యాక్ ఇస్తుంటుందట ఆ అలవాటు. దాంతో బరువు తగ్గాలనే ఆలోచన బలంగా మదిలో నాటుకుని..అన్నింటిపై సరైన ఫోకస్ పెడతామట. ఫలితంగా బరువు తగ్గడం సులభం అవుతుందని అంటోందామె. నిజంగా హెల్ప్ అవుతుందా అంటే..?బరువు తగ్గించే జర్నీలో డైరీ రాసే అలవాటు పెద్ద పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సైతం చెబుతుండటం విశేషం. హార్వర్డ్ నివేదిక ప్రకారం, దాదాపు 1,700 మంది రోజువారి ఆహార రికార్డులను తమ డైరీలో ట్రాక్ చేయగా..వారంతా రెండు రెట్లు బరువు తగ్గారట. అలాగే మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రచురించిన 2012 జర్నల్ సైతం ఇలా డైరీ రాసే వ్యక్తులు అధిక మొత్తంలో బరువు తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది. ఇలా మనం తినేవాటిని వ్రాయడం, ప్రాముఖ్యతను హైలెట్ చేయడం వల్ల తమ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయనేది తరచి చూసుకునే అవకాశం వస్తుందట..దాంతో బరువు తగ్గుతారట. ఇలా ఎంత ఎక్కువగా తాము తినే ప్రతి ఆహారం గురించి నమోదు చేసే అలవాటు ఉంటే అంత అధిక మొత్తం లో బరువు తగ్గుతారని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరి వెయిట్లాస్ జర్నీలో మంచి ఫలితాలు అందుకునేందుకు డైరీ రాసే అలవాటుని సత్వరమే ప్రారంభిద్దామా మరి..(చదవండి: Beauty Tips: శీతాకాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం.. ఈ ఆరు సూప్లు..!) -
దేవుడంటే భక్తి.. అయినా ఎందుకిలా..?
నాకు మొదటినుంచి దేవుడంటే విపరీతమైన భయభక్తులు. తరచు గుళ్లకు వెళుతుంటాను. రోజూ పూజ చేస్తుంటాను. అయితే గత రెండేళ్లుగా దేవుళ్లపైన విపరీతమైన చెడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుడిని బూతుమాటలు తిట్టినట్లు, దేవుడి పటాలను అగౌరవపరచినట్టు... ఇలా రాయడానికి వీలులేని చెడ్డ తలంపులు వస్తున్నాయి. దాంతోటే ‘ఇది చాలా తప్పు, నాలాంటి భక్తుడికి ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి...’ అని మాన సికంగా చాలా మధన పడుతున్నాను. ఈ ఆలోచనల మూలాన దేవుడు నన్ను శపిస్తాడేమోననే భయంతో సరైన తిండి, నిద్రలతోపాటు మనశ్శాంతికి కూడా దూరం అయియాను. ఏ పనిమీదా ధ్యాస పెట్టలేకపోతున్నాను. నాకీ బాధనుంచి విముక్తి కలిగే మార్గం చెప్పగలరు. – రఘురామ్, నల్గొండఎంత వద్దనుకున్నా మనసులో ఇలా మాటిమాటికీ చెడు తలంపులు వచ్చి, మనసును బాధించే ఇలాంటి ఆలోచనలను అబ్సెషన్స్ అంటారు. ఆ చెడు తలంపులనుంచి బయటపడేందుకు మాటిమాటికీ లెంపలేసుకోవడం, దండాలు పెడుతూ ఉండటాన్ని కంపల్షన్స్ అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన మానసిక రుగ్మత. దీనిని ఓసీడీ అంటారు. మన మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేకమైన రసాయన పదార్థం సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరిలో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు, ధోరణులు కలుగుతాయి. ఇవి రాకూడదని ప్రయత్నించినకొద్దీ మరింత ఎక్కువగా మనసులోకి చొచ్చుకొచ్చి విపరీతమైన మానసిక సంఘర్షణకు గురిచేస్తాయి. ఈ ఆలోచనలకు మూలకారణమైన మీ మెదడులోని రసాయన చర్యను సరిచేయడం ద్వారా ఈ అబ్సెషన్స్ను పూర్తిగా అదుపు చేయవచ్చు. ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో ఈ ఓసీడీ జబ్బును పూర్తిగా తగ్గించేందుకు మంచి మందులు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే మానసిక చికిత్స అద్భుతంగా పని చేస్తాయి. మందులతోపాటు థాట్ స్టాపింగ్, ఎక్స్పోజర్ రెస్పాన్స్ అండ్ ప్రివెన్షన్ అనే మానసిక చికిత్స ద్వారా దేవుడిపైన మీకు కలిగే చెడు ఆలోచనలనుంచి విముక్తి కలిగించవచ్చు. ఓసీడీ జబ్బును తగ్గించేందుకు వీటికితోడు ఇటీవలే వచ్చిన ఆర్.టి.ఎం.ఎస్. అనే అత్యాధునిక పరికరాన్ని వాడుతున్నాము. మీరు వెంటనే మీకు అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టును కలిసి చికిత్స తీసుకోండి. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.co) -
సత్తు ప్లస్ దాల్చిన చెక్క నీటితో బెల్లీఫ్యాట్ మాయం..!
చాలామందికి బానపొట్ట పెద్దగా ఉండి ఏ డ్రెస్ లేదా చీర కట్టుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది. ఓపట్టాన తగ్గదు కూడా. బొడ్డుకొవ్వుతో ఉండే ఇబ్బంది అంత ఇంత కాదు. అలాంటి మొండి బొడ్డుకొవ్వుని ఈ పానీయం సులభంగా కరింగించేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది. మరి ఆ పానీయం ఏంటో పోషకాహార నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.అతిగా తినడం లేదా క్రమరహిత దినచర్యల కారణంగా అధికబరువు, బెల్లీఫ్యాట్ వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటాం. అలాంటి వారు దాల్చిన చెక్క పొడిని, సత్తు నీటికి జత చేసి తీసుకుంటే అద్భుత ఫలితం ఉంటుదని చెబుతున్నారు నిపుణులు. సత్తులో పుష్కలమైన ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. జీర్ణక్రియకు మద్దతిస్తుంది. పేగు ఆర్యోగం, రక్తంలోని చక్కెర నియంత్రణకు మద్దతిస్తుంది. ఇది బరువు తగ్గడానికే కాకుండా బొడ్డు కొవ్వుని కరిగించడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పానీయం మలబద్ధకాన్ని తగ్గించగలదని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఆకలి బాధను అదుపులో ఉంచగలదు, శక్తిస్థాయిలను పెంచుతుంది. మెక్కల ఆధారిత ప్రోటీన్, ఖనిజాలతో నిండి ఉన్న సత్తు శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది సంక్లిష్ట పదార్థాల మిశ్రమం కాబట్టి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. అలాగే దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను సులభంగా బయటకి పంపించగలదు. తయారీ విధానం.. సత్తు: 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీరు: 1 గ్లాసుదాల్చిన చెక్క పొడి: చిటికెడునిమ్మరసం: కొన్ని చక్కలుచేయు విధానం: సత్తుని గోరువెచ్చని నీటిలో బాగా కలిపి, దానిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి, నిమ్మచుక్కలు వేసి తాజాగా కలుపుకుని తాగితే సరి. అయితే దీనికి చక్కెర వంటి స్వీట్ని జోడించకపోవడమే మంచిది. ప్రయోజనాలు..ఈ పానీయంలో ఉండే అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను నెమ్మదించి, సంతృప్తిని ప్రోత్సహిస్తుంది. ఇది మొత్తం కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే బొడ్డు చుట్టూ కొవ్వు నిల్వకు దోహదపడే చక్కెర స్పైక్లను నివారిస్తుంది.పైగా రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని సమర్థవంతంగా నిర్వహిస్తుంది.ఎవరికి మంచిది కాదంటే..కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఎందుకంటే సత్తులో అధికంగా ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ఇది తీసుకుంటే మూత్రపిండాలపై మరింత భారం పడుతుంది. కొన్ని రకాల పిండుల మిశ్రమం అయిన ఈ సత్తు కొందరికి ఆయా పప్పులు వల్ల ఎలర్జీ ఉంటే వారికి కూడా మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా ఉండేలా చేస్తుంది కాబట్టి కొందరిలో ఇది హైపోగ్లైసీమియాకు గురయ్యేలా చేసే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది కాస్త అసౌకర్యాన్ని కలిగించవచ్చు. చివరగా ఈ పానీయం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిచినప్పటికీ..దానికి మన ఆరోగ్యకరమైన జీవనశైలి తోడైతేనే మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతామని అంటున్నారు నిపుణులు. ఇది ఒక్కటే బొడ్డుకొవ్వుని మాయం చేస్తుందనే అపోహలో ఉండొద్దని హచ్చరిస్తున్నారు నిపుణులు. దీనితోపాటు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, అధిక శుద్ధి చేసిన చక్కెర పదార్థాలను నివారించడం, తగినంత ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం వంటివి చేయాలి. అలాగే తేలికపాటి వ్యాయమాలు కూడా జోడిస్తే..మరిన్ని ప్రయోజనాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు. అలాగే భోజనం చేసిన వెంటనే కాస్త నాలుగు అడుగులు వేయమని సూచిస్తున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..) -
నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..
ఏ డైట్ అయినా హెల్దీగా ఉండేందుకు బరువు తగ్గడం కోసం లేదా అదుపులో ఉంచుకునేందుకు. చెప్పాలంటే స్లిమ్గా..చూడచక్కని ఆకర్ణణీయమైన లుక్ కోసం అంతలా డైట్పై ఫోకస్ పెడుతుంటారు. అయితే మన హాలీవుడ్ ఐకాన్, మాజీ బాడీబిల్డింగ్ ఛాంపియన్ మాత్రం కొత్త ఏడాదిలో సరికొత్త క్రాష్ డైట్ని ఫాలో అవుతున్నాననంటూ తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. అయితే ఇదేమి త్వరితగతిన బరువు తగ్గి..స్లిమ్గా మారే డైట్ మాత్రం కాదట. ఎందుకోసమో వింటే షాక్ అవుతారు. అందుకోసం ఇలాంటి డైట్లు కూడా ఉంటాయా? అని విస్తుపోవడం మాత్రం ఖాయం.78 ఏళ్ల హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఆస్ట్రియన్-అమెరికన్ చలనచిత్ర నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, మాజీ బాడీబిల్డర్. అంతేకాకుండా ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగెర్ రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) రాజకీయ నాయకుడు. ఆయన 2003, 2011ల మధ్య కాలిఫోర్నియాకు 38వ గవర్నర్గా కూడా పనిచేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా టైమ్ మ్యాగ్జైన్లో చోటు సైతం దక్కించుకున్నారు. అలాంటి వ్యక్తి ఈ కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన క్రాష్ డైట్ ప్రారంభిస్తానంటూ చేసిన పోస్ట్ అదర్ని విస్తుపోయేలా చేయడమే కాకుండా అమితంగా ఆకర్షించింది. అసలేంటి ఈ డైట్ అంటే..ఆర్నాల్డ్ ప్రకారం క్రాష్డైట్ బరువు తగ్గడం కోసం కాదట..ప్రతికూలతలను తొలగించే లక్ష్యంతో మానసిక రీసెట్ కోసం అనుసరించే డైట్ అని పోస్ట్లో పేర్కొన్నారు. సాధారణంగా క్రాష్ డైట్ అనగానే..త్వరితిగతిన మార్పులు, ఫలితాన్ని అందుకునేవి అనే అందరూ భావిస్తారు. కానీ ఇది అందుకు విరుద్ధం. అయితే తాను చెప్పే డైట్ బాడీ కోసం కాదని, మెదడు కోసమని చెప్పుకొచ్చారు. ఈ డైట్ ప్రకారం..ఒక వారం పాటు ప్రతికూలత ఆలోచనలు, విషపూరితమైన ఆలోచనలు, ఇతరుల పట్ల విమర్శనాత్మక ధోరణి వంటి ఏమి లేకుండా వ్యవహరించడం. ఇది ఒక్కసారి ప్రయత్నిస్తే..మానసిక శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుందని అన్నారు. నిజానికి ప్రతికూలత అనేది భావోద్వేగపరంగా శరీరానికి చాలా హానికరమని నొక్కి చెప్పారు. నెగిటివిటీ అనేది మనల్ని అక్షరాల చంపేస్తుందని హెచ్చరించారు.నటుడు ఆర్నా ల్డ్సందేశం ఒకరకంగా ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసినా..ప్రేరణగా నిలిచింది. అంతేగాదు డైట్లు అనేవి కేవలం శారీరక అనుకూలత కోసమే కాదు, మానసిక ఆరోగ్యం కోసం ఏర్పరచుకోవచ్చు అని సరికొత్త ఆలోచనకు నాంది పలికారు ఆర్నాల్డ్. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం ఏంటంటే మానసిక-శారీరక శ్రేయస్సు కోసం ఇలాంటి "జీరో నెగటివిటీ డైట్" తప్పక తీసుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. అంతేగాదు ఆశావాదులే ఎక్కువకాలం జీవిస్తారని పలు అధ్యయనాల్లో కూడా నిరూపితమైందని గుర్తు చేశారు. అందువల్ల మనం నిరాశవాదం, విమర్శలు, కోపాన్ని త్యజిద్దాం అని ప్రజలను కోరారు. అందుకోసం మన రోజులో ఇవి లేకుండా ఉండే క్రాష్ డైట్ని జీవితంలో భాగం చేసుకుందామని అన్నారు. ఈ డైట్లో ఏం చేయాలంటే..ప్రతి రోజు మూడు పూటలా కనీసం ఓ పదినిమిషాలు సోషల్ మీడియాను చూడకుండా ఉండటం. ఉద్యోగ దరఖాస్తులుపై మనసు లగ్నం చేయడం లేదా చేయవలసిన ముఖ్యమైన పనులపై ఫోకస్ పెట్టడంరోజు మనకు ఎదురయ్యే సవాళ్లకు కృతజ్ఞత చెప్పడం. ఎందుకంటే అవి మనలోని అంతర్గత శక్తిని బహిర్గతం చేస్తాయి. చివరగా ఆర్నాల్డ్ ప్రతికూలతలను తగ్గించుకోవడం అనేది మనల్ని మనం ఉద్ధిరించడానికే కాదు..జీవితాన్ని మారుస్తుంది, కాపాడుతుంది కూడా. (చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా) -
కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్గా మార్చేద్దాం ఇలా..!
పేరుకు న్యూ ఇయరే గానీ తెల్లారిలేస్తే మళ్లీ అదే తిండి. అవే సరదాలు. అవే సినిమాలు. అందుకే దాదాపుగా అందరికీ తెలిసినవే అయినా అవే ఆరోగ్య సూత్రాల్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అవే జాగ్రత్తల్ని చెబుతూ హెచ్చరిస్తున్నారు. కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా ఎప్పట్లాగే రెజల్యూషన్స్ తీసుకుంటూ మనం మాత్రం మళ్లీ వాటిని మరుసటి ఏడాదికి వాయిదా వేయడం లేదా? కాకపోతే ఒకసారి చెబితే కొందరైనా సీరియస్గా తీసుకుని ఆచరిస్తారనీ, దాంతో వాళ్లు ఆరోగ్యంగా, ఫిట్గా, ఆయుర్దాయం మరింతగా పెంచుకుని హెల్దీగా మారకపోతారా... కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్గా మార్చుకోకపోతారా అనే ఆకాంక్షతో ప్రముఖ హాస్పిటళ్లకు చెందిన పెద్ద డాక్టర్లంతా మరోమారు మనకు సుద్దులు చెబుతున్నారు. కొందరైనా ఆచరించి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటే... ఈ ఏడాదికి ఈ ఆరోగ్యవచనాల లక్ష్యాలూ, ప్రయోజనాలూ నెరవేరినట్టే! ఐదు ప్రముఖ హాస్పిటల్స్ నుంచి ఐదుగురు పెద్ద డాక్టర్లతో కొత్త ఏడాదిని హెల్దీగా మార్చుకునేందుకు సూచనలతో ప్రత్యేక కథనం...ఆహార పరమైన సూచనలు...వేళకు తినండి. ఆహారం తక్కువ మోతాదుల్లో తీసుకుంటూ రోజులో ఎక్కువసార్లు తినండి. దీనివల్ల జీర్ణవ్యవస్థపై భారం పడదు. దాంతో అది చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి భోజనం మితంగా ఉండాలి. ఓ ఆంగ్ల నానుడి ప్రకారం ఉదయం భోజనం రాజభోజనంలా, మధ్యానం మధ్యస్తంగా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండాలన్నది ఒక సూక్తి. తినే సమయంలో మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ)ని పరిగణనలోకి తీసుకోండి. బీఎమ్ఐ అంటే ఒకరి బరువు డివైడెడ్ బై వాళ్ల ఎత్తు స్క్వేర్ అని అర్థం. అంటే ఒక వ్యక్తి బరువు 80 కిలోలు అనుకుందాం. అతడి ఎత్తు 1.8 మీటర్లు అయితే 80 డివైడెడ్ బై 1.8 స్క్వేర్. ఫలితంగా దాదాపు 24.69గా వచ్చే ఆ విలువను బీఎమ్ఐ పట్టికతో సరి΄ోల్చుకుని ఎవరికి వారు తాము ఏ స్థూలకాయం పరిధిలో ఉన్నరన్నది తెలుసుకోవచ్చు. ఒకవేళ తమ బీఎమ్ఐ ప్రకారం ఎక్కువ ఊబకాయ పరిధిలోకి వచ్చేవారు బరువు తగ్గాలనుకున్నవారు డాక్టర్ సలహా మేరకు ఎలాంటి జీవనశైలి నియమాలు పాటించాలో, బరువు తగ్గడానికి ఏయే ఆరోగ్యకరమైన పద్ధతులు అవలంబించాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అదనపు బరువు ఉన్నవారు తమ కండరాలను (మజిల్ మాస్ను) కాకుండా అదనపు కొవ్వును మాత్రమే కరిగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శాకాహారం తీసుకునేవారు అన్ని రకాల తాజా ఆకుకూరలూ, కాయగూరల వెరైటీలు తీసుకోవాలి. అదే మాంసాహారం తినేవారైతే రెడ్మీట్కు బదులు... ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు తీసుకోవడం మంచిది. వాటితోపాటు తాజా పండ్లూ తీసుకోవాలి.డాక్టర్ సోనిక రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ఒత్తిడి నియంత్రణ కోసం... తీవ్రమైన ఒత్తిడితో పోలిస్తే పరిమితమైన ఒత్తిడి వల్ల పనులు సమయానికి పూర్తయ్యేలా చేయడం వల్ల కాస్తంత ప్రయోజనం ఉంటుంది. కానీ మితిమీరిన ఒత్తిడి ఆరోగ్యానికి ఎప్పటికీ హానిచేసేదే. మానసిక ఒత్తిడి పురుషుల కంటే మహిళలకే ప్రమాదకరం. ఒత్తిడి విషయానికి వస్తే పని ప్రదేశంలో ఒత్తిడి ఎదురైనప్పుడు మనం తప్ప ఇతరులైతే అంత పర్ఫెక్ట్గా చేయలేరనే భావనను వదిలిపెట్టి కొలీగ్స్తో పని షేర్ చేసుకుని ఓ టీమ్వర్క్లా చేసే పని ఒత్తిడిని తగ్గిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. పెంపుడు జంతువులో ఆడుకునేవారికీ, అక్వేరియమ్లో చేపలను చూస్తూ ఉండేవారికి, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తుండేవారికి ఒత్తిడి తగ్గి, గుండెజబ్బులూ నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ప్రకృతిసిద్ధమైన నీటి ప్రవాహం వంటి ధ్వనులూ... సంగీతం వంటివి ఒత్తిడిని తగ్గించే స్వాభావికమైన మందులు అనుకోవచ్చు. కోపం, విచారం వంటి ఫీలింగ్స్ను అణిచేయకుండా ఇతరులను ఆటంకపరచని రీతిలో వ్యక్తం చేయడమే మంచిది. మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఒప్పుకోవడం మంచిది. ఈగో కారణంగా ఒప్పుకోలేక΄ోతే అది మరింత ఒత్తిడి పెంచుతుంది. ఇంకా హాని చేస్తుంది. చక్కటి హాస్యంతో కూడిన సినిమాలు చూస్తూ, ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉండేవారికి రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులు రావడం తక్కువ. తమ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కారణంగా ఇలాంటివారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన హాస్యానురక్తిని పెంచుకోండి.డాక్టర్ మంజుల రావు, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్చెడు అలవాట్లకు దూరంగా...సిగరెట్, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సిగరెట్ పొగలో కనీసం 6000 హానికరమైన వ్యర్థ పదార్థాలుంటాయి. అందులో క్యాన్సర్కు కారణమయ్యేవి కనీసం 60 పదార్థాలుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్ల వ్యవధిలో ఒకరు సిగరెట్ కారణంగానే ్ర΄ాణాలు వదులుతున్నారని అంచనా. గుండెకు సంబంధించిన వ్యాధులతో చని΄ోయేవారిని పరిశీలించినప్పుడు వారిలో కనీసం 40 శాతం మంది తమ పొగతాగే అలవాటు కారణంగా తమ గుండెకు చేటు తెచ్చుకున్నవారేనని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే ఊపిరితిత్తులు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు వచ్చినవారిలో దాదాపు 80 శాతం మంది తమ పొగతాగడం అలవాటు కారణంగా ప్రాణాంతకమైన ఆ జబ్బును తమ చేజేతులారా తెచ్చుకున్నవారే. పొగతాగే అలవాటు వల్ల రక్త΄ోటు పెరుగుతుంది. అది గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ సిగరెట్ పొగవల్ల దేహంలో పేరుకునే కార్బన్ మోనాక్సైడ్ వల్ల దేహం తనకు ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్ను అంతగా తీసుకోలేక΄ోవడం, ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం జరుగుతాయి.ఇవన్నీ ఆరోగ్యానికి చేటు చేసే పరిణామాలే. పరిమితంగా రెడ్ వైన్ వంటి మద్యం తీసుకుంటే అది గుండెకు మేలు చేస్తుందనీ, రెండు పెగ్గులకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే మాటలన్నీ కేవలం అ΄ోహ మాత్రమే. ఎంత పరిమితంగా తీసుకున్నా మద్యం చేసే చేటు మాత్రం అపరిమితం. కాలేయం మొదలుకొని, రక్తనాళాలూ, రక్తప్రసరణ వ్యవస్థ, గుండె, కిడ్నీలు... అన్నిటికంటే ముఖ్యంగా కీలకమైన మెదడు... ఇలా దేహంలోని అన్ని అవయవాలనూ, సంబంధిత వ్యవస్థలను మద్యం దెబ్బతీస్తుంది. పైన పేర్కొన్న కారణాల నేపథ్యంలో పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ అలవాట్లు ఉన్నవారు క్రమక్రమంగా కాదు... తక్షణం వాటిని మానేయాలి. మంచి ఆరోగ్యం కోసం ఇలా మానేయడం అవసరం కూడా.డాక్టర్ పి. కిరణ్మయి, సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజీ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ వ్యాయామం తప్పనిసరి... ఒకేచోట కదలకుండా చాలాసేపు కుదురుగా కూర్చొని ఉండటం గానీ, ఏ పనీ చేకుండా బద్ధకంగా కాలం గడపడం గానీ దేహానికి చేటు చేస్తాయని చాలా అధ్యయనాల్లో తేలిన విషయమే. పొగతాగే అలవాటు వల్ల దేహానికీ, దేహంలోని అవయవాలూ, వాటి వ్యవస్థలకు ఎలాంటి హాని చేకూరుతుందో, శారీరక శ్రమలేకుండా ఉండటం, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా అలాంటి అనర్థాలే వస్తాయంటూ అనేక అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం... క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల గుండె బలంగా తయారవుతుంది. దాంతో రక్తపోటు అదుపులో ఉండటం, రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో ప్రతి కణానికీ తగినంత ఆహారం, ఆక్సిజన్ అందడం, గుండె కొట్టుకునే లయ (రిథమ్) క్రమం తప్పకుండా కొనసాగడం, ఎముకలకు తగిన న్యూట్రిషన్ అందడం, కండరాలు బలిష్టంగా ఉండటం, వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో కొలాజెన్ తగ్గడం వల్ల చర్మం వదులవుతూ వృద్ధాప్యం తాలూకు చిహ్నాలు కనిపించడంవంటి ఏజింగ్ అనర్థాలు నివారితమై చాలాకాలం పాటు యౌవనంగా ఉండటం వంటి అనేక ప్రయోజనాలూ చేకూరతాయి. నడక లేదా ఇతరత్రా తేలికపాటి వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గడం, నిద్రలేమి వంటివి నివారితం కావడం, ఫలితంగా మంచి గాఢమైన నిద్రపట్టడం, రోజంతా ఉల్లాసంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతుంది. వ్యాయామం చేయడం అన్నది బోరుగా అనిపిస్తే ఆరుబయట ఉల్లాసంగా ఆటలాడటం, ఈదడం, ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుకుండా నడవడం వంటి ప్రక్రియల ద్వారా దేహానికి వ్యాయామాన్ని సమకూర్చడం చాలా ఆహ్లాదకరమైన, సంతోషదాయకమైన మార్గాలు. దేహానికి ఆహారం ఎంత అవసరమయో, వ్యాయామమూ అంతే అవసరమని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అందుకే జిమ్లో చేరేందుకూ.. కుదరక΄ోతే కనీసం ఆటలాడేందుకైనా షూలేస్లు కట్టుకోవడం మొదలుపెట్టండి.డాక్టర్ ఆరతీ బెల్లారీ,సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్రిలాక్సేషన్, విశ్రాంతి, నిద్ర విషయంలో... రోజంతా పని చేస్తూనే ఉండకుండా, మధ్యమధ్య చిన్న చిన్న విరామాలు తీసుకోవడం అవసరం.ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక అలసట తగ్గి, పని మీద ఏకాగ్రత, సామర్థ్యం మెరుగవుతాయి.వారంలో కనీసం ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ముఖ్యం. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో సమయం గడపడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతిలో నడక, తోటలో గడపడం, పనుల్లో బాగా బిజీగా ఉండేవారు... ఒకవేళ వాళ్లు మంచి యుక్తవయసులో ఉన్న యువత అయితే ట్రెక్కింగ్ లేదా హైకింగ్ వంటివి తమ ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వీళ్లంతా ఒక స్నేహబృందంగా ఏర్పడి వెళ్లడం ఒత్తిడిని తగ్గించి మంచి ప్రయోజనాన్నిస్తుంది. శరీరానికి తగినంత నిద్ర తప్పనిసరి. ఎలాంటి అంతరాయం లేని 6 నుంచి 8 గంటల రాత్రి నిద్ర అవసరం. నిద్ర అనేది శరీరంలో, మెదడులో, కండరాల్లో పునరుత్తేజం తెచ్చే సహజ ప్రక్రియ.నిద్రలోనే మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. తగినంత నిద్రలేక΄ోతే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఉంటాయని ఎన్నో అధ్యయనాలలో తేలింది. తగిన నిద్ర వలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం మెరుగవుతాయి.తక్కువగా నిద్ర ΄ోయేవారిలో రక్త΄ోటు, షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు, మైగ్రేన్ వంటి ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి.ప్రతిరోజూ రాత్రిఒకే సమయానికి పడుకోవడం (సాధారణంగా రాత్రి 9 తర్వాత), ఉదయం ఒకే సమయానికి (సాధారణంగా ఉదయం 6 గంటలకు) నిద్రలేవడం చాలా ముఖ్యం. దీనివల్ల మన శరీర గడియారం (సర్కేడియన్ రిథమ్) సరిగ్గా పనిచేస్తుంది, నిద్ర నాణ్యత మెరుగవుతుంది.చాలా తక్కువ నిద్ర (నాలుగు గంటల వ్యవధి కంటే తక్కువ నిద్రించడం) కూడా మంచిది కాదు, అలాగే అవసరానికి మించిన నిద్ర (ఎనిమిది గంటల కంటే ఎక్కువగా నిద్ర΄ోవడం) కూడా సమస్యలకు సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అధిక నిద్రకు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సంబంధం ఉండవచ్చు.ప్రతి వ్యక్తికి అవసరమైన నిద్ర కొంత భిన్నంగా ఉండవచ్చు. అయితే సాధారణంగా పెద్దలలో రోజుకు 7–9 గంటల నిద్ర ఆరోగ్యానికి అవసరమని నిద్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ శరీరం సూచించే అవసరాన్ని గమనిస్తూ, క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడమే మంచి ఆరోగ్యానికి మార్గం. డాక్టర్ ఎల్.సునందిని, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ (చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా) -
2025కి గుడ్బై.. 2026కి హెల్తీ వెల్కమ్
2025కు గుడ్బై పలికేశారా? కొత్త ఏడాదికి స్వాగతం అనేస్తున్నారా?. ఓకే.. గుడ్. 2026లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారా?.. అయితే ఈ ఈజీ టిప్స్ మీకోసమే. 2025లో శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలివి! ఆలస్యమెందుకు?.. చదివేయండి.. తెలివిగా తినండి.. గుండె ఆరోగ్యంతోపాటు మన జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు, నిద్ర, మూడ్ సమస్యలు అధిగమించేందుకు, రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం కొంచెం తెలివిగా తినాలని, తాగాలని 2025లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ తినడం ఎలా ఉండాలంటే.. ➡️వారంలో ఒకటి నుంచి ఆరు వరకూ కోడిగుడ్లు తినడం గుండెజబ్బులతో చచ్చిపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికీ కూడా ఇది వర్తిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగని అతిగా తినడం మంచిది కాదు.➡️అధిక రక్తపోటు నుంచి తప్పించుకునేందుకు ఉప్పు తినడం తగ్గించడం కాకుండా.. ఆహారంలో మరింత పొటాషియం ఉండేలా చూసుకోవడం మేలు. అరటిపండ్లు, ఆప్రికాట్స్, చిలగడదుంపల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.పొటాషియం అధికంగా ఉండేవి.. • అరటిపండ్లు• ఆప్రికాట్స్ (జారదాలు)• చిలగడదుంపలు (Sweet potatoes)• పాలకూర, గోంగూర, కూరగాయలు• బీన్స్, పప్పులు• కొబ్బరి నీరు• కలబంద (Avocado)గమనిక.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక పొటాషియం తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు. కాబట్టి, నిపుణుల సలహా తీసుకుని ఆహారంలో పొటాషియం బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి➡️రోజంతా కూర్చునే ఉంటున్నారా? అయితే మీ రక్తనాళాలను కాపాడుకోవాలంటే... కోకోలోని ఫ్లేవనాల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి ‘సిట్టింగ్ డిసీజ్’తో వచ్చే సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం.. రోజుకు కోకో పౌడర్ లేదా డార్క్ చాక్లెట్ (70% పైగా కోకో ఉన్నది) తీసుకోవడం రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్లేవనాల్స్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్తనాళాలను సడలిస్తాయి. దీని వల్ల రక్తప్రవాహం పెరుగుతుంది, గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది.ఎలా తీసుకోవాలంటే.. డార్క్ చాక్లెట్ (చక్కెర తక్కువగా ఉండే)కోకో పౌడర్ (unsweetened)కాకా నిబ్స్కోకో డ్రింక్స్ (చక్కెర లేకుండా)అధిక చక్కెర, పాలు కలిపిన చాక్లెట్ తీసుకుంటే ప్రయోజనం తగ్గిపోతుంది.మితంగా తీసుకోవాలి (రోజుకు 10–20 గ్రాముల డార్క్ చాక్లెట్ సరిపోతుంది).కొన్ని రకాల కొవ్వులు కేన్సర్ కణితులతో మన రోగ నిరోధక వ్యవస్థ పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అయితే మొక్కల ఆధారిత కొవ్వులు (plant-based fats) అలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. మంచి కొవ్వులు• ఆలివ్ ఆయిల్• కొబ్బరి నూనె• పామ్ ఆయిల్ (మితంగా)• అవకాడో, డ్రైఫ్రూట్స్👆 ఇవి ఇమ్యూన్ సిస్టమ్ను దెబ్బతీయవు. కొన్ని సందర్భాల్లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రభావం చూపుతాయి.➡️మలబద్ధకాన్ని తొలగించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు ఉపయోగపడతాయి. అయితే కీవీ పండ్లు ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.➡️ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు, శాఖాహార ప్రధానమైన మెడిటరేనియన్ ఆహారం ఐబీఎస్ (ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్) సమస్యను తగ్గిస్తుంది.➡️అరటి పండు స్మూతీల్లో వాడే పదార్థాల్లోని మంచి పోషకాలు సరిగ్గా జీర్ణం కానివ్వదు. అరటిలో సహజంగా ఉన్న పోషకాలు, ఇతర పదార్థాల కలయిక వల్ల శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు. కాబట్టి.. అరటితో పాలు / బాదం పాలు(ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి), పీనట్ బట్టర్ / బాదం బట్టర్ (ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అందిస్తుంది), ఓట్స్ (ఫైబర్, శక్తినిస్తుంది), కాకా పొడి (unsweetened cocoa) యాంటీఆక్సిడెంట్లు, చియా సీడ్స్ / ఫ్లాక్స్ సీడ్స్ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు), బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ) (విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు), తేనె / ఖర్జూరం (సహజమైన తీపి) అందిస్తాయి. అలాగే.. అరటితో కలపకూడనివి కొన్ని ఉన్నాయి. సిట్రస్ ఫలాలు (కమలపండు, మొసంబి, నిమ్మ) వీటివల్ల ఆమ్లత్వం(యాసిడిటీ) పెరిగి అరటిలోని పోషకాలు శోషణ తగ్గుతుంది. అధిక చక్కెర / ఐస్క్రీమ్ వల్ల ఫైబర్ దక్కకపోగా.. విటమిన్ ప్రయోజనం తగ్గిపోతుంది.ప్రాసెస్డ్ ప్రోటీన్ పౌడర్ల వల్ల కొన్ని సందర్భాల్లో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చాక్లెట్ సిరప్ (అధిక చక్కెర) సహజంగానే పోషకాలను తగ్గిస్తుంది. కాఫీ / టీ పొడి చేరిస్తే.. ఐరన్, కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. ➡️చక్కెరల కంటే కృత్రిమ చక్కెరలతో కూడిన పానీయాలు మధుమేహం వచ్చే అవకాశాలను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఆ రకమైన పానీయాలు తీసుకోకపోవడం మేలు.పునరుత్తేజానికి వ్యాయామం..సరైన నిద్ర + సరైన వ్యాయామం= ఆరోగ్యం. అయితే హై-ఇంపాక్ట్ వ్యాయామాలు (జంపింగ్, రన్నింగ్) కీళ్ల సమస్యలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి నడక, సైక్లింగ్, ఈత వంటివి మేలు. సుఖ నిద్రతో మన వ్యాయామ అలవాట్లు మెరుగవుతాయి. అయితే.. సాయంత్రాలు వ్యాయామం చేయడం అంత మంచిదేం కాదు. హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలగొచ్చు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే వ్యాయామం ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి.. నిద్రకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ సాయంత్రమే చేసే వీలుంటే గనుక.. తేలికపాటి వ్యాయాయాలు (నడక, యోగా, స్ట్రెచింగ్) చేసుకోవచ్చు. ఇవి నిద్రకు ఆటంకం కలిగించవు.మానసిక సంతోషానికి.. జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లు మన మానసిక ఆరోగ్యంపై, పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తాజా పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి.క్రియాటిన్ సాధారణంగా కండరాల శక్తి పెంపు కోసం ఉపయోగించే పోషక పదార్థం. కానీ, ఇది మెదడు శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ (మనోవ్యాకులత) చికిత్సలో సహాయక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అదెలాగంటే.. క్రియాటిన్ తీసుకోవడం వల్ల మెదడు కణాలు శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటాయి, ఫలితంగా మూడ్ స్థిరంగా ఉండేలా చేసి చికిత్సలో మెరుగైన ఫలితాన్ని చూపిస్తుంది. తిట్టుకోవడం.. పనితీరు పెంపుతిట్టుకోవడం అనేది.. ప్రతికూలంగా భావించే అంశమే. కానీ.. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే తీవ్ర ఒత్తిడి లేదంటే కష్టమైన పనిలో మనల్ని మనం కాస్త ఘాటు పదాలతో తిట్టుకోవడం వల్ల శరీరం ఎక్కువ శక్తి ఇస్తుంది. ఇది నొప్పి తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి.. పనితీరు మెరుగుపరుస్తుంది. క్రీడల్లో, కఠినమైన వ్యాయామాల్లో ఇది సహజ రీతిలో కనిపించే అంశమే.ఉదయాన్నే కాఫీ.. మూడ్ మెరుగుదలకాఫీలోని కెఫిన్ మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాల స్థాయిని పెంచుతుంది. ఫలితంగా, రోజంతా ఉత్సాహం, ఏకాగ్రత, మూడ్ మెరుగుపడతాయి. ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల పనితీరు పెరిగి, జీవనశైలి ఉల్లాసంగా ఉంటుంది. ఇది మేం చెబుతున్నమాట కాదు.. పరిశోధనల్లో తేలిన అంశమే. -
మైగ్రేన్ తలనొప్పి ఎందుకొస్తుందంటే..!
మైగ్రేన్తో బాధపడేవారికి పనిదినాన్ని కోల్పోవడం లేదా అనారోగ్య సెలవు తీసుకోవడం సాధారణ అనుభవమే. అయితే, ఇది ఉత్పాదకత తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసు గల వారిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. క్రమరహిత పనివేళలు లేదా సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు సరైన భంగిమలో కూర్చోవడంలో పొరపాట్లు, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్కు కారణాలు. ఈ సవాళ్లను గుర్తించి పరిష్కరించడం అత్యవసరం అని అంటున్నారు యశోదా హాస్పిటల్స్ డాక్టర్ జయదీప్ రే చౌదరి.మైగ్రేన్ సమయంలో ఏం జరుగుతుందంటే..ప్రపంచవ్యాప్తంగా, మైగ్రేన్ను కేవలం తలనొప్పిగా కాకుండా, ఒక నర సంబంధ వ్యాధిగా గుర్తిస్తున్నారు. గణాంకాల ప్రకారం, ప్రతి నలుగురిలో ఒకరు మైగ్రేన్తో బాధపడుతుండగా, భారతదేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారని అంచనా. ది లాన్సెట్ (2019) నివేదిక ప్రకారం, మైగ్రేన్లు ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధికంగా అంగవైకల్యాన్ని కలిగించే నర సంబంధ వ్యాధిగా పేర్కొంది.చాలా మంది రోగులు మైగ్రేన్తో జీవితాంతం పోరాడాల్సి వస్తుంది. దీనివల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన ప్రభావాలు ఎదురవుతాయి. మైగ్రేన్ సమయంలో, మెదడు తన చుట్టూ ఉన్న రక్షణ పొరలైన మెనింజెస్కు సంకేతాలను పంపుతుంది. దీనికి ప్రతిస్పందనగా, CGRP (కాల్సిటోనిన్ జన్యు-సంబంధిత పెప్టైడ్) వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఈ CGRP నిర్దిష్ట గ్రాహకాలతో బంధించబడినప్పుడు, మెనింజెస్లోని రక్తనాళాలు విస్తరించి వాపుకు గురవుతాయి.ఈ నాళాల విస్తరణ, క్రిమిరహిత వాపు కలయిక మైగ్రేన్ లక్షణ నొప్పిని ఉత్పత్తి చేస్తుంది. నొప్పి సంకేతం అప్పుడు మెదడులోకి తిరిగి ప్రయాణిస్తుంది, అక్కడ అది ప్రాసెస్ చేయబడుతుంది, ఫలితంగా వికారం, కాంతికి సున్నితత్వం (ఫోటోఫోబియా), ధ్వనికి సున్నితత్వం (ఫోనోఫోబియా) వంటి లక్షణాలు ఏర్పడతాయి. పరిష్కారం ఎలాగంటే..యశోదా హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జయదీప్ రే చౌదరి, ఈ సమస్యను ఇలా పరిష్కారిస్తామని చెప్పుకొచ్చారు. లక్ష్యం కేవలం నొప్పిని లేదా ఒక్కో ఎపిసోడ్ను నియంత్రించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి నిజమైన విముక్తిని సాధించడం. ఇందుకు మైగ్రేన్ వచ్చే పౌనఃపున్యాన్ని తగ్గించడం, దాని వ్యవధిని కుదించడం మరియు రోజువారీ జీవితంపై పడే ప్రభావాన్ని తగ్గించడం అవసరం. అలా చేయడం ద్వారా ప్రజలు తమ జీవన నాణ్యతను తిరిగి పొందగలుగుతారు, పనికి పూర్తి స్థాయిలో తిరిగి చేరగలుగుతారు. మైగ్రేన్ నుంచి స్వేచ్ఛను పొందడమే మా తుది ఆశయం.”పని రోజుల్లో మైగ్రేన్ ప్రభావంభారతదేశంలో మైగ్రేన్లు ఉత్పాదకతపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. మైగ్రేన్తో బాధపడే వ్యక్తులు నెలకు సగటున 5.9 పనిదినాలను కోల్పోతున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా ఇబ్బందులు పెరగడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారమైన ప్రభావం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆదాయ నష్టం, జీవన నాణ్యతతో బాధపడుతున్నారు. మైగ్రేన్ కారణంగా వారు ముఖ్యమైన పని, వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు కాలేకపోతున్నారు, చివరి నిమిషంలో ప్లాన్లను రద్దు చేయాల్సి వస్తోంది లేదా శరీరం సహకరించకపోయినా పని చేయాల్సి వస్తోంది. దీని కారణంగా భారతదేశంలో ఒక్క వ్యక్తికి సంవత్సరానికి సగటు ఆర్థిక నష్టం రూ. 8,731గా అంచనా. అంటే దేశానికి మొత్తం ఆర్థిక నష్టం సుమారు రూ. 18,674 కోట్లకు పైగా నష్టంగా అంచనా.ఇది శారీరక నొప్పిని మించి, మైగ్రేన్లు తరచుగా ఏకాగ్రత లోపానికి, పని వేగం తగ్గడానికి, పనితీరు మందగించడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇవి వ్యక్తులను తమ వృత్తి ఎంపికలు, కెరీర్ మార్గాలను మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితికి కూడా నెట్టేస్తాయి.ఈ సమస్య నుంచి బయటపడాలంటే..మైగ్రేన్ సంరక్షణకు సమగ్ర దృక్పథం అవసరం. రోగులు సూచించిన మందులు, వైద్య సలహాలను క్రమబద్ధంగా అనుసరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ జోక్యాలు దీర్ఘకాలిక వ్యాధి భారాన్ని గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చికిత్స ప్రారంభ సమయం, సాధ్యమైన దుష్ప్రభావాలు, చికిత్సకు కట్టుబడి ఉండటం వంటి అంశాలపై వైద్యులు, న్యూరాలజిస్టులతో జరిగే స్పష్టమైన, నిరంతర కమ్యూనికేషన్ నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది.తలనొప్పి ప్రారంభమైన వెంటనే మైగ్రేన్ మందులు తీసుకుంటే అవి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే, నిర్మాణాత్మక పని విరామాలు తీసుకోవడం, సరిపడా నీరు త్రాగడం, ఆరోగ్యకరమైన నిద్రా సమయాలను పాటించడం, స్క్రీన్ సమయం-తో పాటు స్క్రీన్ కాంతిని సమర్థంగా నిర్వహించడం వంటి జీవనశైలి చర్యలు మైగ్రేన్ దాడుల తరచుదనాన్ని గణనీయంగా తగ్గించగలవు. తలనొప్పి డైరీలో లక్షణాలు, ట్రిగ్గర్లను నమోదు చేయడం ప్రారంభ దశలోనే జోక్యం చేసుకోవడానికి, అలాగే వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించి నివారించడానికి ఒక ఉపయోగకరమైన అభ్యాసంగా పనిచేస్తుంది.ఇంటర్నేషనల్ హెడకే సొసైటీ తన క్లినికల్ థెరపీ దృక్కోణంలో ‘మైగ్రేన్ ఫ్రీడమ్’ అనే కొత్త లక్ష్యాన్ని ప్రతిపాదించింది. ఇకపై చికిత్స లక్ష్యం కేవలం నొప్పిని తగ్గించడం లేదా ఒక్కో ఎపిసోడ్ను నివారించడం మాత్రమే కాదు, మైగ్రేన్ నుంచి సంపూర్ణ విముక్తిని సాధించడమే. ఈ దృక్కోణం వ్యక్తులు తమ సాధారణ పనితీరును తిరిగి పొందేందుకు, వేగంగా పనికి పునరాగమనం చేసేందుకు, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుచుకునేందుకు సహాయపడటంపై దృష్టి సారిస్తుంది. సరైన ఔషధ చికిత్స, వ్యక్తిగత ట్రిగ్గర్లను గుర్తించడం, లక్ష్యిత జీవనశైలి సర్దుబాట్ల సమన్వయంతో, ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. మనస్సు స్పష్టంగా, పనిదినాలు ఉత్పాదకంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది.--డాక్టర్ జయదీప్ రే చౌదరి, న్యూరాలజిస్ట్, యశోదా హాస్పిటల్స్(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
'అరటికాండంతో పప్పు' రెసిపీ ..ఆరోగ్యానికి ఎంతో మేలు..!
ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది టాలీవుడ్ హీరోహియిన్ సమీరా రెడ్డి ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫిట్నెస్ టిప్స్ షేర్ చేసుకుంటుంటారు. హెల్దీగా ఉండే రెసిపీలు, బరువు తగ్గించే వర్కౌట్లను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంటారామె. ఈసారి అలానే ఆరోగ్యకరమైన రెసిపీతో ముందుకొచ్చారు. తాను చేసే రెసిపి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో వివరిస్తూ..ఆ కర్రీ తయార చేసే విధానాన్ని తెలియజేశారామె. ఇంతకీ ఏంటా హెల్దీ రెసిపీ అంటే..సమీరా రెడ్డి కడుపుకి మేలు చేసే అరటికాండం పప్పు కూర తయారీ విధానాన్ని పంచుకున్నారు. అందుకోసం ఏమేమి పదార్థాలు కావాలంటే..అరటి కాండం-1(శుభ్రం చేసి, సన్నగా తరిగి నానబెట్టింది)కంది పప్పు లేదా పెసర పప్పు: ¼ కప్పుకరివేపాకు 1పసుపు టీ స్పూన్ఆవాలు టీ స్పూన్తాజా కొబ్బరి పేస్ట్-1కాశ్మీరీ మిరపకాయ-1జీలకర్ర- 1 టీస్పూన్ఉప్పు రుచికి సరిపడాతయారీ విధానం: ముందుగా అరటికాండం, పప్పు, పసుపు, ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించాలి. మొత్తం 6 విజల్స్ వచ్చాక కొబ్బరి పచ్చిమిర్చి,జీలకర్ర కలిపిని పేస్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, కాశ్మీరీ మిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పుకొచ్చారు. అంతేగాదు దీన్నితినడం వల్ల కలిగే లాభాలు కూడా వివరించారు. అవేంటంటే..ఇందులో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలసటను తగ్గించడంలో హెల్ప్ అవుతుందిహార్మోన్ల సమతుల్యతకు మద్దతిస్తుందిప్రేగు ఆరోగ్యం, డిటాక్స్ కోసం అద్భుతమైనదికడుపు ఉబ్బరం, నీరు నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుందిబరువు నిర్వహణకు సహాయపడుతుందిరుతుక్రమ ఆరోగ్యానికి మంచిదిరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందిజీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. అలాగే పోస్ట్ చివరలో సమీరా ఉడికించిన తర్వాత ఆ అరటికాండం పోగులను తీసివేయాలని, అవి తినకూడదని, జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుందని హెచ్చిరించారు. అలాగే ఇలాగే ఇలా తొలగించడం వల్ల కూర మృదువుగా, మెత్తగా ఉండి సులభంగా తినేయగలుగుతామని కూడా అన్నారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) (చదవండి: తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..! ఆ తర్వాత..) -
కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గాలంటే..!
బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు, వ్యాయామాల తోపాటు..డిటాక్స్ డ్రింక్లు తోడైతే మరింత త్వరితగతిన బరువు తగ్గుతాం. ఇవి మన ఇంట్లోదొరికే వాటితోనే సులభంగా తయరు చేసుకోవచ్చు కడా. కఠినమైన డైట్, వర్కౌట్ల కంటే..ఇలాంటి సింపుల్ చిట్కాలతో మరింత సులభంగా బరువు తగ్గిపోగలమని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. తేలిక పాటి వర్కౌట్లు, చక్కటి ఆరోగ్యకరమైన డైట్ తోపాటు ఇలాంటి కొలెస్ట్రాల్ని తగ్గించే అద్భతమైన పానీయాలు త్వరితగతిన వెయిట్లాస్ అవ్వడంలో బాగా హెల్ప్అవుతాయట. నిశబ్దంగా వొంట్లో కొవ్వుని తగ్గించే ఆ గట్ రీసెంట్ డ్రింక్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఫిట్నెస్ కోచ్ నేహా పరిహార్ కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గారట. అందుకు ఈ గట్ రీసెట్ డ్రింక్ బాగా హెల్ప్ అయ్యిందట. ఇది మన ఇంట్లో దొరికే దేశీ వస్తువులతో తయారు చేసే సాధారణ దేశీ మిశ్రమ టానిక్గా చెబుతున్నారు నేహా. అందుకు కావాలసినవి:అజ్వైన్ (వాము): 1 టేబుల్ స్పూన్ సోంపు : 2 టేబుల్ స్పూన్లు మెంతి గింజలు (మెంతి గింజలు): 1 టేబుల్ స్పూన్ తాజాగా తురిమిన అల్లం: 1 టేబుల్ స్పూన్ నీరు: 2.5 లీటర్లతయారీ విధానం:నీటిలో వాము, సొంపు, మెంతి గింజలు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మంటను కాస్త తగ్గించిన అప్పుడే తురిమిన తాజా అల్లం వేసి కొద్దిసేపు మరగనివ్వండి. ఆ తర్వాత వడకట్టి దానికి కొంచెం నిమ్మకాయ రసం జోడించి సేవించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా 14 రోజుల చేసి చూస్తే..తప్పక మంచి ఫలితాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ నేహా.కలిగే లాభాలు..నేహా ప్రకారం,కొలెస్ట్రాల్ని ఎలా కరిగిస్తుందంటే..జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందిఅదనపు నీటి నిలుపుదలను బయటకు పంపిచేయడంలో సహాయపడుతుందిఇన్సులిన్ పనితీరు మెరుగవుతుంది. జీవక్రియ పనితీరుని మెరుగ్గా ఉంచుతుందిపేగు మంటను శాంతపరుస్తుందిచెడుకొలెస్ట్రాల్ని బయటకు పంపించేస్తుందిచివరగా ఈ పానీయం బరువు తగ్గేలా చేయదు, మన శరీర వ్యవస్థకు మద్దతు ఇచ్చి..ఆయా వ్యవస్థల పనితీరుని సమర్థవంతంగా ఉంచి..బరువుతగ్గేందుకు దారితీస్తుందని చెబుతోంది నేహా. దీంతోపాటు సమతుల్య భోజనం, తేలికపాటి వ్యాయామాలు, వేళ్లకు నిద్ర తోడైతే బరువు తగ్గడం మరింత సులభమని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ నేహా. ఈ చిన్నపాటి సాధారణ మార్పులు చోటుచేసుకుంటే సత్ఫలితాలను త్వరితగతిన పొందుగలమని చెప్పుకొచ్చింది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సూచనలు సలహాలు పాటించటం ఉత్తమం. View this post on Instagram A post shared by Neha Parihar (@growithneha) (చదవండి: సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..! అంత ఖరీదా..?) -
ఈ ఏడాది హెల్త్కేర్ ట్రెండ్స్ ఇవి..!
వైద్యరంగంలో ఏడాదికేడాదీ చాలా అభివృద్ధులను నమోదు చేస్తోంది. కొత్త కొత్త సాంకేతిక పరిణామాలను, సరికొత్త చికిత్స ప్రక్రియలను రూపొందించుకుంటోంది. కొన్ని పరిణామాలైతే మొత్తం హెల్త్ కేర్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక జబ్బుకు అందరికీ ఒకే రకరమైన స్టాండర్డ్ చికిత్స నుంచి... మెల్లగా ఆయా వ్యక్తుల తాలూకు జన్యుస్వభావాలను బట్టి వ్యక్తిగతమైన (పర్సనలైజ్డ్) చికిత్స వరకు ఇలా రకరకాల మార్పులను నమోదు చేసుకుంటోంది. కొద్దిరోజుల్లోనే 2025 వెళ్లిపోయి... మనమంతా 2026లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది హెల్త్ కేర్ రంగంలో నమోదైన కొన్ని మార్పులను పరిశీలిద్దాం...పర్సనల్ కేర్ కొల్హాపూర్ టు హిందుస్థాన్ యూనిలీవర్ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లగ్జరీ హౌజ్కు నాయకత్వం వహించడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. ఆ ఘనత సాధించి సత్తా చాటిన మహిళ...లీనా నాయర్. కొల్హాపూర్ నుండి లగ్జరీ హౌజ్ ‘చానల్’ నాయకత్వ బా«ధ్యతల వరకు లీనా నాయర్ ప్రయాణం స్ఫూర్తిదాయకమైనది. ఇంజినీర్ నుండి హెచ్ఆర్ ప్రొషనల్గా మారింది. హిందుస్థాన్ యూనిలీవర్లో ఎన్నో అడ్డంకులు బద్దలు కొట్టి ఆ ప్రసిద్ధ సంస్థలో మొదటి మహిళా చీఫ్ హ్యుమన్ రిసోర్స్ ఆఫీసర్ అయింది. ‘ఛానల్’ గ్లోబల్ సీయివోగా లీనా నాయర్ 36,000 మంది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తోంది. తన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా ఈ సంవత్సరం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(సిబిఇ) అవార్డ్ అందుకుంది.కోట్లాది హృదయాలను గెలిచిన... హార్ట్ ల్యాంప్తన కథల సంకలనం ‘హార్ట్ ల్యాంప్’తో ఈ సంవత్సరానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది బాను ముస్తాక్. ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి కన్నడ రచయిత్రిగా చరిత్ర సృష్టించింది. 1990–2023 మధ్య ముస్తాక్ రాసిన ఈ కథలు దక్షిణ భారత ముస్లింల కష్టాలను హృద్యంగా ఆవిష్కరిస్తాయి. ప్రాంతీయ కథలకు విశ్వజనీనత ఉంటుంది’ అనే ముస్తాక్ నమ్మకాన్ని ‘హార్ట్ ల్యాంప్’ నిజం చేసింది.ముస్తాక్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఎనిమిదేళ్ల వయసులో ఆమెను ఒక కాన్వెంట్ స్కూల్లో చేర్పించాడు. అక్కడ బోధనా మాధ్యమం రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ. కన్నడ భాషలో అనర్ఘళంగా మాట్లాడడానికి ముస్తాక్ చాలా కష్టపడింది. ఆ అపరిచిత భాషనే తన సాహిత్య వ్యక్తీకరణగా చేసుకుంది.అత్యంత నిశితమైన వైద్య చికిత్సలు (ప్రెసిషన్ మెడిసిన్)...ఒక జబ్బుకు అందరికీ టోకుగా ఒకేలాంటి చికిత్స అందించడానికి బదులుగా ఆయా వ్యక్తి భౌలిక, మానసిక, జన్యుపరమైన స్వరూప స్వభావాలను బట్టి అతడికి మాత్రమే ఉద్దేశించిన చికిత్స అందించడాన్ని పర్సనలైజ్డ్ మెడిసిన్గా చెప్పవచ్చు. అది ఆ వ్యక్తి జబ్బును బట్టి, దాని తీవ్రత ను బట్టి అలాగే అతడి జెనెటిక్స్, అతడుండే వాతావరణం (ఎన్విరాన్మెంట్), అతడి జీవనశైలి... ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తికే పూర్తిగా సరిపడేలా చికిత్స అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్నే అత్యంత నిశితమైన వైద్య చికిత్స అంటూ ద రాయల్ సొసైటీ ఆఫ్ థాయిల్యాండ్ పేర్కొంటోంది. ఈ రంగంలో ఈ ఏడాది గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది.టెలీహెల్త్...నిజానికి టెలీహెల్త్ అనే కాన్సెప్ట్ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే మునుపు దీని పరిధి చాలా తక్కువ. ఉదాహరణకు హైదరాబాద్లో అత్యంత నిపుణులైన, అనుభవజ్ఞులైన వైద్యులు ఉండవచ్చు. కానీ ఎక్కడో అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ఓ పల్లెలో ఒక తీవ్రమైన జబ్బు ఉన్న వ్యక్తికి అతడి సేవలు అవసరం. కేవలం టెలీహెల్త్ అనే కాన్సప్ట్లో మునుపు కేవలం బాధితులను టీవీ ద్వారా / తమ మొబైల్ ఫోన్లద్వారా లేదా పర్సనల్ కంప్యూటర్లకు అమర్చిన కెమెరాల ద్వారా చూడటం, వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సకు అవసరమైన మందులను సూచించడం మాత్రమే జరిగేది. కోవిడ్–19 నేపథ్యంలో నేరుగా బాధితులను తాకడానికీ / లేదా వాళ్లను తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో ఈ తరహా టెలీమెడిసిన్ చికిత్సలు ఊపందుకున్నాయి. అటు తర్వాత ఇలా రిమోట్గా ఉన్నవారికి సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు... పెద్ద పెద్ద నగరాల్లోని నిపుణులైన సర్జన్లు ఎక్కడో సుదూరంగా ఉన్న చిన్న పట్టణాల్లోని పేషెంట్లకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్జరీలు విజయవంతంగా చేయడం సాధ్యమైంది. అందునా ఇటీవల భారతదేశంలో రోబోటిక్ సర్జరీ సహాయాలతో ఇలాంటి సర్జరీలు చేయడం మొదలైంది. ఇదెంత వరప్రదయని అంటే... ఏవైనా కారణాల వల్ల ఒక చిన్న పట్టణంలోకి పేషెంట్ను సుదూరంలోని పెద్ద నగరానికి తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో నగరాల్లోని అత్యంత నిపుణులైన డాక్టర్లూ తమ శస్త్రచికిత్స నైపుణ్యాలను అంతదూరంలోని పేషెంట్లకు అందజేయడానికి ఇప్పుడు వీలవుతోంది.ఉంగరాల్లాంటి ఉపకరణాలతో స్వీయ పరిశీలన...స్మార్ట్ వాచీల సహాయంతో తమ గుండె స్పందనలూ, రక్త΄ోటూ, ఎంతసేపు నిద్ర΄ోయామనే సమాచారం, తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ మేరకు నిద్రలోపించిందీ లేదా ఎక్కువ సేపు నిద్ర΄ోయారా అన్న విషయాలూ... ఇలాంటి స్వీయ ఆరోగ్య విషయాలను తెలుసుకునే ‘ఫిట్నెస్ ట్రాకర్లు’ వచ్చాయి. ఈ ఏడాది ఇది మరింత ముందుకు వెళ్లి... చిన్న ఉంగరంలాంటిది తొడగడం ద్వారా తమ రక్తంలోని చక్కెర మోతాదులు మొదలుకొని అనేక విషయాల్లో ఆరోగ్యసమాచారాలు తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యపడుతోంది. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ ఆరోగ్యస్పృహ బాగా పెరిగిన ఈ రోజుల్లో ట్రెండీగా ఉన్న ఈ ఉంగరాలను తొడగడం మామూలైంది. ఇవి... ఒకపక్క ఫ్యాషనబుల్గా ఉండటంతో పాటు ఇటు ఆరోగ్య సమాచారాలూ తెలుస్తుండటంతో ΄ాటు ఇంచుమించూ బంగారు ఉంగరం ధరతో సమానంగా ఉండటంతో ఇటీవల వీటిని ధరించి తమ ఆరోగ్య సమాచారాన్ని తామే తెలుసుకోవడం, అవసరమైనప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం వంటి సౌకర్యం ఉండటంతో వీటికి ప్రాచుర్యమూ పెరుగుతోంది.కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్తో వ్యాధి నిర్ధారణలు, చికిత్సలు...ఒక డాక్టర్ తన జీవితకాలంలో ఓ లక్ష కేసులు చూడగలడని అనుకుందాం. అంటే ఒక లక్షమంది పేషెంట్లను చూసిన చరిత్ర / దాఖలాను బట్టి అతడి అనుభవం ఆధారపడి ఉంటుంది. అయితే ఇలాంటి లక్షమంది అనుభవజ్ఞులైన డాక్టర్ల అనుభవాలన్నీ క్రోడీకరించి... ఆ అనుభవ సారాన్ని కృత్రిమమేధస్సుకు ఆపాదిస్తే? అలాగే ఆ అనుభవసారంతో విశ్లేషించాల్సిన విషయాలను ఓ యంత్రానికి (మెషిన్ లెర్నింగ్) నేర్పితే? ఇందువల్ల కోటానుకోట్ల కేసులను చూసిన అనుభవం ఒక యంత్రంలో నిక్షిప్తమై ఉంటుందనీ, దానివల్ల చాలా సంక్లిష్టమైన కేసులనూ సులువుగా విశ్లేషించగలగడం వల్ల పేషెంట్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందంటూ కొన్ని ప్రయోగ ఫలితాలు చెబుతున్నాయి. అయితే దీనికి చాలా పరిమితులు ఉంటాయనీ, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ఎప్పటికీ మానవ మేధస్సు తాలూకు విశ్లేషణలను సాధించలేదనేది చాలామంది అనుభవజ్ఞులైన డాక్టర్ల మాట. అయినప్పటికీ చాలాకేసుల్లో ఇప్పుడు పేషెంట్ తాలూకు ఆరోగ్య చర్రిత, రకరకాల రక్తపరీక్షలూ, మెడికల్ ఇమేజింగ్ పరిశీలనల ఆధారంగా రోగుల పరిస్థితిపై ఇప్పుడు ఏఐ, మెషిన్ లెర్నింగ్తో విశ్లేషణలు జరిపాక దాన్ని నిపుణులైన డాక్టర్లు తమ అనుభవంతో సరిపోల్చుకుని (కో రిలేట్ చేసుకుని) అత్యంత నిశితంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స ప్రక్రియల నిర్ధారణ జరుపుతున్నారు.హోలిస్టిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ అప్రోచ్... ఒక వ్యక్తికి గుండె జబ్బు వచ్చిందనుకుందాం. అది కేవలం గుండెకు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. ఇటు రక్తప్రసరణ వ్యవస్థలోనూ, అటు ఊపిరితిత్తుల విషయంలోనూ... ఈ రెండే కాకుండా బ్రెయిన్కు సరఫరా అయ్యే రక్తం కారణంగా మెదడును ఇలా రకరకాల వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చు. అందుకే ఇటీవల వైద్య చికిత్సలు చేస్తున్న వివిధ ఆరోగ్య వ్యవస్థలకు సంబంధించిన నిపుణులు... అంటే కార్డియాలజీ, పల్మునాలజీ, న్యూరాలజీ... ఇలాంటి నిపుణలంతా సంయుక్తంగా తాము నిర్వహించాల్సిన చికిత్సలను సమన్వయ పరచాల్సి ఉంటుంది. ఇలా వివిధ ఆరోగ్య వ్యవస్థలకే కాకుండా ఇటు శరీరక ఆరోగ్యం, అటు మానసిక ఆరోగ్యం, మరో వైపున ఆధ్యాత్మిక ఆరోగ్యం... ఇలా అన్ని రకాలుగా పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటేనే ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చె΄్పాలనేది డబ్ల్యూహెచ్ఓ నిర్వచనం. అందువల్ల ఓ వ్యక్తి తాలూకు పూర్తి ఆరోగ్య పరిస్థితిని నిర్వహితమయ్యేలా చూడటమనే అంశం కూడా ఈ ఏడాది ప్రయత్నాల్లో ఒకటి.అడ్వాన్స్డ్ జీనోమిక్ రీసెర్చ్...ఒక వ్యక్తి తాలూకు జన్యుపరమైన అనారోగ్యాలకు అతడి జన్యువులు కూడా కారణమవుతాయి. కొందరిలో ఈ జన్యువుల్లో ఏదైనా తేడాలుంటే... చికిత్సకు సాధ్యం కాని సమస్యలూ, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలూ (కంజెనిటల్ డిసీజెస్), వైకల్యాలూ రావచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలకు చెడి΄ోయిన ఓ జన్యువు కారణమైనప్పుడు... నేరుగా ఆ జన్యువుకే చికిత్స అందించడం ద్వారా ఆ వైకల్యాన్ని తప్పించడం / నివారించడమనే అంశంపైన చికిత్స అందించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. ముందుగా పేర్కొన్న టోకు చికిత్స కాకుండా... వ్యక్తిగత (పర్సనలైజ్డ్) చికిత్సకూ ఈ అడ్వాన్స్డ్ జీనోమిక్ చికిత్సలు తోడ్పడతాయి. ఈ రంగంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి విజయవంతమైతే గతంలో నిర్వహణ (మేనేజ్మెంట్) తప్ప చికిత్స లేని చాలా జబ్బులకు విజయవంతమైన పూర్తి చికిత్స అందే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఈ అంశంపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. పురోగతి కూడా చాలావరకు కనిపించింది.నైతికాంశాలు, సదస్సులు...ఈ ఏడాది చోటు చేసుకున్న విప్లవాత్మకమైన పరిశోధనలూ, వైద్య చికిత్సలో, అందులోని పురోగతితో వాస్తవంగా పేషెంట్ ఎలాంటి చికిత్సలు ఎంతవరకు అవసరమో అంతే అందేలా, పేషెంట్ తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా... అలాగే అతడు సమాచార లోపానికీ, ఆర్థికంగా దోపిడికి గురికాకుండా చూసే నైతికాంశాలపై అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహితమయ్యాయి. ఈ పురోగతి పేషెంట్కు భారం కాకుండా చూసేందుకు అవసరమైన చర్యలను ప్రస్తావిస్తూ... ఆ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా నైతికవేత్తలు అనేకానేక ప్రస్తావనలూ, ప్రతిపాదనలూ తీసుకువస్తున్నారు. స్థూలంగా... ఈ ఏడాది 2025లో వైద్యరంగంలో చోటుచేసుకున్న పురోగతి, ఇంకా ఓ అసిధారావ్రతంలా కొనసాగుతున్న పరిశోధనల , సంక్షిప్త వివరాలివి.డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: 91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..) -
ధురంధర్ మూవీ క్రేజ్తో వైరల్గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకారణంగా నెట్టింట దూద్ సోడా అనే పానీయం తెగ వైరల్గా మారింది. అసలేంటి పానీయం తాగొచ్చా, ఆరోగ్యానికి మంచిదేనా అంటే..ధురంధర్ సినిమాలో నటుడు గౌరవ్ గేరా ఒక భారతీయ గూఢచారిగా, మొహమ్మద్ ఆలం అనే సోడా విక్రేత వేషంలో కనిపిస్తారు. "డార్లింగ్ డార్లింగ్ దిల్ క్యూ తోడా.. పీలో పీలో ఆలం సోడా" అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఇప్పుడు వైరల్ కావడంతో పాటు, ఈ దూద్ పానీయం పై అందరి దృష్టి పడేలా చేసింది. ఒకరకంగా మరుగున పడిపోతున్నకొన్ని రుచులు మళ్లీ గుర్తుకుతెచ్చేలా ముందుకు తీసుకు వస్తాయి ఈ సినిమాలు. దూద్ సోడా అంటే..దూద్ సోడా అనేది పాకిస్తానీకి చెందిన ప్రసిద్ధ పానీయం . లాహోర్, కరాచీ వంటి నగరాల్లో రోజువారీ ఇష్టమైన పానీయం ఇది. చల్లటి పాలు, సోడా, తగినంత చక్కెర కలిపి దీనిని తయారు చేస్తారు. రుచి కోసం కొందరు ఇందులో రోజ్ ఎసెన్స్ లేదా జాజికాయ పొడిని కూడా జోడిస్తుంటారు. పాకిస్తానీ ఆహార సంస్కృతిలో ఒక జ్ఞాపకశక్తినిచ్చే, రిఫ్రెషింగ్ డ్రింక్గా పరిగణిస్తారు.తయారీ..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ 'సాహిలోజీ' ఇటీవల లాహోర్లో ఈ పానీయాన్ని ఎలా తయారు చేస్తారో వివరిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. "ముందుగా ఒక గ్లాసులో కొద్దిగా చక్కెర వేసి, ఆపై వేడి వేడి పాలను పోస్తారు. పాకిస్థాన్లో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ పాలను చల్లబరుస్తారు. ఆ తర్వాత, ఎరుపు రంగులో ఉండే కోకాకోలాను ఆ పాల మిశ్రమంలో కలుపుతారు. చివరగా సాంప్రదాయ పద్ధతిలో సోడాను బాగా మిక్స్ చేస్తే నోరూరించే దూద్ సోడా సిద్ధమవుతుంది" అని వీడియోలో ఆయన వివరించారు .చాలా మంది 1:1 లేదా 1.5:1 పాలు-సోడా నిష్పత్తిని ఉపయోగిస్తారు. ఇది పానీయాన్ని క్రీమీగా ఉంచుతుంది. అయితే ఎక్కువమంది ఈ పానీయాన్ని రూహ్ అఫ్జా, రోజ్ సిరప్, తులసి గింజలు లేదా ఏలకులు వంటి రుచులను కూడా జోడించి సేవిస్తారు.బ్రిటిష్ కాలం నాటిది..బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ రాకముందే, ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో దూద్ సోడాకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇది బ్రిటీష్ కాలం నాటిది. ఉత్తర భారతదేశంలో దీన్ని తయారు చేసేవారు కూడా. అప్పట్లో స్థానిక హకీంలు నిర్వహించే సోడా ఫౌంటైన్లలో రోజ్, ఖుస్, నిమ్మకాయతో పాటు ఈ పాల సోడాను కూడా ప్రయోగాత్మకంగా తయారు చేసేవారు.వాస్తవానికి ఈ పానీయం విక్టోరియన్ ఇంగ్లాండ్లో పుట్టి, బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా భారతదేశానికి చేరుకుంది. 1947 దేశ విభజన తర్వాత, పాకిస్థాన్లో ఇఫ్తార్ సమయంలో తాగే ప్రధాన పానీయంగా ఇది మారిపోయింది. అక్కడ దీనిని 'రూహ్ అఫ్జా'తో కలిపి ఎక్కువగా తీసుకుంటారు. అటు భారతదేశంలో పంజాబ్, పాత ఢిల్లీ, అమృత్సర్ వంటి ప్రాంతాల్లో ఈ పానీయం నేటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఎవరికి మంచిదకాదంటే..ఈ పానీయం కడుపులోకి వెళ్లగానే చాలామందికి కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగే అవకాశాల ఉంటాయి. ఒక్కోసారి గుండెల్లో మంట, అరుగుదలలో సమస్యలు వస్తుంటాయి. ఇందులో సోడా ఉపయోగించడం వల్ల ప్రేగులపై కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పాలు తేలికపాటి ఆమ్లతను ఉపశమనం చేసినా..ఇందులో ఉపయోగించే సోడా వల్ల జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.లాక్టోస్ పడనివారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నావారునివారించడమే ఉత్తమం అని చెబుతున్నారు. అతిగా తాగితే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera)(చదవండి: హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!) -
హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
వారణాసి’మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు హీరో మహేశ్ బాబు. ఆ మూవీ కోసం ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు (Kalarippayattu) నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పెట్టిన పోస్ట్తో ఈ విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇక కలరిపయట్టు ఇటీవల చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టంతో నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం, మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు దీన్ని నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి కలరియపట్టు యుద్ధ కళ? ఇది ఫిట్నెస్కి ఎలా ఉపకరిస్తుంది సవివరంగా తెలుకుందాం.!.ఇంతకముందు ఈ కలరిపయట్టుని సైనా నెహ్వాల్ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్ నటి పరిణితిచోప్రా కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు కూడా. దీన్ని సాధన చేస్తే..బాడీ ఎంతో యాక్టివ్గా ఉన్నట్లు ఉంటుందని చెప్పుకొచ్చారామె. కలరిపయట్టు అంటే.కళరిపయట్టు లేదా కళరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. దీన్ని కేరళ, తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఉండే మలయాళీలు తప్పక ప్రదర్శిస్తారట. కలరిపయట్టు శిక్షణలోని వేగవంతమైన కదలికలు ప్రతిచర్యలు, కంటి-చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అంతేగాదు మన శరీరం, మనస్సును అప్రమత్తంగా, చురుకుగా ఉంచుతాయి.ఎలా శిక్షణ ఇస్తారంటే..కలరి'గా పిలిచే ఒక ప్రత్యేక శిక్షణా స్థలంలో ఈ యుద్ధ కళ నేర్పుతారు. పోటీ పడుతున్న ప్రత్యర్థి కలరి అభ్యాసకుడికి కొత్త పోరాట కదలికలను నేర్పిస్తుంటాడు. శిక్షణ పొందే వ్యక్తి ఈ కొత్త విధానాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రతిఘటించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీన్ని తమిళ రాజ్యాలతో యుద్ధాల చేసే సమయంలో మళయాళులు దీన్ని ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు..కలరిపయట్టు శిక్షణలో బలం, ఓర్పు ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. ఇది శరరీ ధృడ్వత్వాన్ని పెంచుతుంది. హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఇందులో వుండే వేగవంతమైన ఏరోబిక్ కదలికలు, శక్తివంతమైన దాడులు హృదయ స్పందన రేటును పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉంటుందిప్రాథమిక మోటారు వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్తో బాధపడేవారికి, నరాల సమస్యలతో బాధపడేవారికి కలరిపయట్టుని నిపుణుల సమక్షంలో తర్ఫీదు పొందితే మంచి ఫలితం ఉంటుందట. అలా పలువురి విషయంలో నిరూపితమైందట కూడా. అంతేగాదు ఈ ప్రాచీన యుద్ధ విద్య పనిలో ఏకాగ్రత, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందట. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలరియపట్టుని నేర్చుకుని..ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. View this post on Instagram A post shared by kalari Hyderabad (@a_martialarts_space) (చదవండి: పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..!భారత్ ఆరోగ్య సంరక్షణపై ఎన్నారై ప్రశంసల జల్లు) -
ఇయర్ఫోన్ వాడకం ఇంత పరేషాన్ చేస్తుందా..?
హెడ్ఫోన్ ధరించడం కొందరికి ఫ్యాషన్ అయితే మరికొందరు ఏకాగ్రత, పనితీరు కోసం ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చుట్టూ గందరగోళంగా ఉంటే..ఈ హెడ్ఫోన్లు ఎంతో హెల్ప్ అవుతాయి. అదీగాక సౌకర్యవంతమైన స్థాయిలో వాల్యూమ్ని ఎడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవే హెడ్ఫోన్లు సుదీర్ఘకాలం లేదా గంటల తరబడి ఉపయోగిస్తే..చాలా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు ..ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి హెగ్డే. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.వినికిడి నష్టం (NIHL)అధిక వాల్యూమ్లో ఎక్కువ సేపు హెడ్ఫోన్స్ పెట్టుకుని వింటే వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది పరిశోధనలు చెబుతున్నాయి. గంటల తరబడి వినయోగించకపోవటమే మేలని చెబుతున్నారు.టిన్నిటస్ఇలా ఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవులో వింత వింత శబ్దాలు వినిపించే టిన్నిటిస్ లక్షణాలు ఎదుర్కొనాల్సి వస్తుందట.అలసటకు గురవ్వడంఎక్కువసేపు హెడ్ఫోన్ ఉపయోగించడం వల్ల చెవి, మెదడు అలసటకు గురై..దృష్టి కేంద్రీకరించడం, లేదా ప్రసంగించడంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందట. ఇది వైద్య పరమైన రుగ్మత కానప్పటికీ..ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుందంటున్నారు.మిగతా శబ్దాలపై అవగాహన లోపం..అదేపనిగా హెడ్ఫోన్స్ ఉపయోగించటం వల్ల ఆ శబ్దాలకే అలవాటుపడి చుట్టుపక్కల పరిసరాల శబ్దాలను గ్రహించలేని పరిస్థితి ఎదురవ్వుతుందని ఆడియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మతిమరుపు వచ్చే అవకాశంఅతిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారిలో శ్రద్ధ లోపించి..జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలిందని హెచ్చరిస్తున్నారు.సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే..ఇయర్ ఫోన్ని సురక్షితమైన పద్ధతిలో వాడుకుంటూ..వినికిడి, జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యల బారిన పడకూడదంటే ఈ సింపుల్ చిట్కాలు అనుసరిస్తే చాలట.తక్కువ వాల్యూమ్తో వినడం.తప్పనిసరి అయితే తప్ప.. హెడ్ఫోన్ వినియోగాన్ని పరిమితంగా ఉపయోగించేలా చూడటం. సరైన హెడ్ఫోన్స్ని ఉపయోగించి..వాల్యూమ్ నేరుగా చెవిలోకి చొచ్చుకుపోనివ్వని సురక్షితమైనవి వాడటం మేలుఅంతేగాదు వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో లేదో గమనించుకోవడంచివరగా ఏ వస్తువైనా సరైన మార్గంలో పరిమితంగా వినియోగిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు..పైగా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని బేషుగ్గా లీడ్ చేయగలుగుతామని చెబుతున్నారు ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయి. --డాక్టర్ జ్యోతిర్మయ్ ఎస్ హెగ్డే, ఈఎన్టి స్పెషలిస్ట్, ఆస్టర్ వైట్ఫీల్డ్ ఆస్పత్రి (చదవండి: Travel Trends 2026: కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?)


