breaking news
Health Tips
-
ఇది నాకూ బిడ్డకూ ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదమా? ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరుగర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గర్భస్థ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) అంటారు. ఇది గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన వస్తుంది. ఎక్కువగా ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్య కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో ఓజీటీటీ పరీక్షను చేయాలని ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఇప్పుడు మీలో గర్భస్థ మధుమేహం నిర్ధారణ కావడంతో, కొంచెం ఆందోళన కలగడం సహజమే! దీనిని సరైన సమయంలో గుర్తించడం, నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. గర్భస్థ మధుమేహం నియంత్రణలో లేకపోతే తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు లేదా రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే శిశువు గర్భంలోనే బరువు ఎక్కువ కావచ్చు, ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత కొన్నిసార్లు బిడ్డకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయి లేదా స్వల్ప శ్వాస ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ సాధారణంగా సులభంగా చికిత్స చేయగలిగినవే. గర్భస్థ మధుమేహం నిర్ధారణ అయిన వెంటనే మీరు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామాలతో ఈ మధుమేహం నియంత్రణ కాకపోతే, డాక్టర్లు సురక్షితమైన మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సూచిస్తారు. ఇవి తల్లికీ, బిడ్డకీ పూర్తిగా హానికరం కాదు. సరైన నియంత్రణతో గర్భస్థ మధుమేహం సాధారణంగా ప్రసవం జరిగిన వెంటనే తగ్గిపోతుంది. కాని, కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా మందులు, ఆహార నియమాలు కొంతకాలం కొనసాగించాల్సి రావచ్చు. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రసవం తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫాలోఅప్ తప్పనిసరిగా చేయించుకోవాలి.నాకు గతంలో ఏడు వారాలలో గర్భస్రావం అయింది. ఇప్పుడు గర్భవతిని. ఈ గర్భధారణలోనూ ఇప్పటివరకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ నాకు విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. ఇది నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దయచేసి మార్గనిర్దేశం చేయండి.– రూప, కర్నూలుగర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశలో బిడ్డ ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అదే సమయంలో గర్భస్రావం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశలో రక్తస్రావం, కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ప్రతి రక్తస్రావం గర్భస్రావానికే సంకేతం కాదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, హార్మోన్ల మార్పులు, గర్భాశయంలో చిన్న మార్పుల వలన కూడా రక్తస్రావం రావచ్చు. ఇవి సాధారణంగా హానికరం కావు. కాని, రక్తస్రావం వచ్చిన ప్రతిసారీ డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ మీ వైద్య చరిత్ర తెలుసుకొని, శరీరపరీక్ష చేసి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఎక్కువగా ఆందోళన అవసరం ఉండదు. చికిత్సలో భాగంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమైనవి. కొన్నిసార్లు ప్రొజెస్టరాన్ మందులు ఇస్తారు. రక్తస్రావం అధికంగా ఉంటే ఆసుపత్రి పర్యవేక్షణ అవసరం కావచ్చు. గతంలో గర్భస్రావం అనుభవించారని, ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భస్రావం తర్వాత మళ్లీ అదే జరుగుతుందన్న నిబంధన లేదు. సమయానికి వైద్యుల సహాయం తీసుకుంటే చాలామంది మహిళలు సురక్షితంగా గర్భధారణను కొనసాగించి, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి వైద్యుల సూచనలు పాటించడం అత్యంత ముఖ్యం. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
డయాబెటిస్ స్త్రీ పురుషుల మధ్యన తేడా ఇది!
యాభై ఏళ్లలోపు పురుషుల్లో టైప్–2 డయాబెటిస్ అనేది టైప్–1 కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుంది. అదే మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్ అనేదే ఎక్కువ దుష్ప్రభావాలు చూపుతుందని తేలింది. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా పేషెంట్లపై స్వీడన్కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... కాస్తంత చిన్నవయసు పురుషుల్లో అంటే 50 ఏళ్లలోపు పురుషుల్లో టైప్–1 డయాబెటిస్ కంటే టైప్–2 డయాబెటిస్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలగజేస్తుంది. ఉదాహరణకు టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్న పురుషుల్లో 51 శాతానికి పైగా వ్యక్తుల్లో గుండెజబ్బుల (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) ముప్పు ఉంటుంది. దాంతోపాటుగా హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె΄ోటు రిస్క్ కూడా వాళ్లలో రెట్టింపు ఉంటుంది. దీనికి కారణాలు ఆ వయసులో పురుషుల్లో ఊబకాయం, హైబీపీ జబ్బులతోపాటు వారి జీవనశైలి కాస్త అస్తవ్యవస్తంగా ఉండటంతో అది టైప్–2 డయాబెటిస్ తాలూకు దుష్ప్రభావాలను మరింతగా ప్రేరేపిస్తుంది. అయితే పురుషుల వయసు పెరుగుతున్నకొద్దీ ఈ ముప్పు క్రమంగా కాస్త తగ్గుతూ పోతుంది. అంటే వాళ్ల వయసు 60కి చేరేనాటికి వాళ్లలో టైప్–1 డయాబెటిస్తో వచ్చే ముప్పు కంటే టైప్–2 డయాబెటిస్తో వచ్చే ముప్పులు కాస్త తగ్గుతాయని చెప్పవచ్చు. ఇక వాళ్ల వయసు 70కి చేరేనాటికి టైప్–1 డయాబెటిస్తో ఉన్నవారిలో వచ్చే గుండెపోట్ల కంటే టైప్–2 డయాబెటిస్తో ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ముప్పు 26 శాతం తక్కువ. ఇక మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్తో ముప్పు ఎక్కువ. అందునా అది ఏ వయసువారిలోనైనా ఎక్కువే. ఇలా టైప్–1 డయాబెటిస్తో బాధపడే యువతులూ, మహిళల్లో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు టైప్–2 డయాబెటిస్తో బాధపడే మహిళల కంటే ఎక్కువే. అదే మహిళల వయసు 50 దాటాక... టైప్–1 డయాబెటిస్ బాధపడేవాళ్లతో పోలిస్తే టైప్ – 2 డయాబెటిస్తో బాధపడేవారిలో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు 25 నుంచి 47 శాతం తక్కువ. ఇక అన్ని రకాల గుండెజబ్బుల ముప్పులనూ పరిగణనలోకి తీసుకుంటే టైప్ –2 డయాబెటిస్తో బాధపడే మహిళల్లో గుండెజబ్బులతో మృతిచెందడానికి ఉన్న అవకాశాలు టైప్ – 1 మహిళల కంటే 19 శాతం తక్కువ. దీన్ని బట్టి తేలిసేదేమిటంటే... టైప్ –1 అలాగే టైప్ –2 డయాబెటిస్ల ముప్పులు ఇటు మహిళలూ, అటు పురుషుల్లో వేర్వేరు దుష్ప్రభావాలను చూపుతుంటాయని ఈ స్వీడిష్ అధ్యయనంలో వెల్లడైంది. (చదవండి: ఈ జబ్బులకు లింగ వివక్ష?) -
ఈ జబ్బులకు లింగ వివక్ష?
అదేమిటో గానీ... కొన్ని జబ్బులు కక్ష పట్టినట్టుగా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్లపైనే తమ దుష్ప్రభావాలు ఎక్కువగా చూపిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్కు చెందిన రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ), మయోసైటిస్ వంటివి. అవి వాళ్లలోనే ఎందుకలా వస్తాయన్న విషయాన్ని అనన్య అనే ఓ అమ్మాయి వృత్తాంతంతో డాక్టర్లు వివరిస్తున్నారు. అనన్య కథేమిటో చూద్దామా!ఓ అనన్య కథ అనన్య 24 ఏళ్ల ఓ అమ్మాయి. పెదవుల మీద చెరగని చిర్నవ్వు... ఎల్లప్పుడూ చకచకా కదులుతూ ఉండే చురుకుదనం... కళ్లనిండా భవిష్యత్తు మీద ఆశ! మొన్ననే కాలేజీ చదువులు పూర్తి చేసిన ఆ అమ్మాయి ఇటీవలే ఓ ఐటీ కంపెనీలో చేరింది. అలా చదువై΄ోయిందో లేదో ఇలా ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఈమధ్య అంతగా ఉండటం లేదు. కారణం... ఆమె ఉదయాలు కష్టంగా మారాయి. వేళ్ల కణుపుల వద్ద వాపు బ్రష్ చేయనివ్వడం లేదు. ఆఫీసులో కీబోర్డు మీద టైప్ కూడా చేయనివ్వడం లేదు. మెట్లెక్కే సమయంలో మోకాళ్లలో నొప్పి. ఆమె మొదట్లో ఈ బాధను కాస్త తేలిగ్గా తీసుకుంది. సిస్టమ్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్లనో లేదా పని ఒత్తిడి కారణంగాలో ఇలా జరుగుతోందని అనుకుంది. పోనుపోనూ ఈ నొప్పి... తొలుత అసౌకర్యంగా... తర్వాత ఇబ్బందికరంగా... ఇప్పుడు బాధాకరంగా మారింది. తన రోజువారీ పనుల మీద తీవ్ర ప్రభావం చూపడం మొదలైంది. మొదట్లో కుటుంబ సభ్యులు ఆమెను తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. తనను పరీక్షించిన డాక్టర్ ఆమెను రుమటాలజిస్ట్ దగ్గరికి పంపారు. జాయింట్ల పరిశీలనా, రక్తపరీక్షలూ అయ్యాక ఆమెకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్ధారణ అయ్యింది. ఆర్థరైటిస్లో అదోరకం. అనన్య జీవితంలో అదో అతిపెద్ద షాక్!! ‘‘ఆర్థరైటిసా? ఈ వయసులోనా? సాధారణంగా అది వృద్దాప్యంలో వచ్చే వ్యాధి కదా’’ అనుకుంది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు. ‘‘నేనిక పని చేయగలనా? పెళ్లి మాటేమిటి? నేనెప్పటికీ ఈ నొప్పులతోనే బతకాలా? ఈ మందులు సురక్షితమేనా? వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఆ దుష్ప్రభావాలతో ఇక సహజీవనం తప్పదా??? ఆమె మనసులో మెదిలే అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. డాక్టర్ చెప్పినట్టుగా పురుషులతో ΄ోలిస్తే ఈ తరహా ఆర్థరైటిస్ల వ్యాప్తి, దుష్ప్రభావాలు మహిళల్లోనే ఎందుకు ఎక్కువ, వాటిని అ«ధిగమించడమెలాగో, ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. ∙∙ అసలు ఆటోఇమ్యూన్ రుమాటిక్ వ్యాధులు అంటే ఏమిటి? మన శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) ఎల్లప్పుడూ మనల్ని వైరస్లూ, బ్యాక్టీరియా బారి నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. అయితే ఈ క్రమంలో మన వ్యాధి నిరోధక కణాలు... ఒక్కోసారి తమ ఒంట్లోని సొంత కణాలనే శత్రు కణాలుగా పొరబడతాయి. వాటితో తలబడతాయి. అలా మన సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ తన సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధులనే ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్’గా చెబుతారు. ఇలా దాడి చేసే క్రమంలో అవి మన కీళ్లు (జాయింట్లు), కండరాలు (మజిల్స్), చర్మం, కొన్ని సందర్భాల్లో ఒంట్లోని కీలక అవయవాలపై తీవ్రంగా దాడి చేసి, బాధిస్తాయి. ఈ తరహా వ్యాధులు యువతులు / మహిళల్లో తమ 20 నుంచి 40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి. దాంతో వాళ్ల చదువులూ, కెరియర్, కుటుంబ జీవితంపై ప్రభావం చూపడటంతో భావోద్వేగాల పరంగా కూడా వీళ్లు ఎక్కువగా ప్రభావితమవుతుంటారు.కొన్ని ప్రధానమైన జబ్బులివి... రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ) : ఇది రెండు చేతులూ, మోకాళ్లలోని కీళ్లను (జాయింట్స్)ను ప్రభావితం చేస్తుంది. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ : మెడ, వెన్నెముకలను ప్రభావితం చేస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ : సోరియాసిస్లో లాగా జుట్టు నుంచి వెండిరంగులో ఉండే చర్మం సొలుసులు రాలడంతోపాటు కీళ్లవాపు, తీవ్రమైన కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ : చిన్నపిల్లలూ, టీనేజీలో ఉండే కౌమార వయసులో ఉండే పిల్లల్లో కనిపించే ఎముకల, కీళ్ల వ్యాధి ఇది.ఎక్కువగా మహిళల్లోనే... ఎందుకిలా? అనేక గణాంకాల నుంచి లభ్యమైన వివరాల ప్రకారం ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఇవి వాళ్లలోనే ఎక్కువగా కనిపించడానికి కారణాలు... హార్మోన్ల ప్రభావం: ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ప్రధానంగా మహిళల్లోనే ఎక్కువగా స్రవిస్తుంది. ఈ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. జన్యుపరమైన అంశాలు: మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు (జీన్స్) ఈ తరహా వ్యాధులను ప్రేరేపించడం. ఇమ్యూన్ వ్యవస్థలో తేడాలు: స్వాభావికంగా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక (ఇమ్యూన్) వ్యవస్థ చాలా బలంగా, శక్తిమంతంగా ఉంటుంది. అదే కారణం చేత... ఒకవేళ ఆ ఇమ్యూన్ వ్యవస్థ తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉండటం.ఈ జబ్బుల తాలూకు మందుల పట్ల ఉండే భయాలివి... ఈ జబ్బుల్లో సాధారణంగా కొన్నింటికి మందుల వల్ల కొన్ని రకాల భయాలూ, ఆందోళనలూ ఉంటాయి. కారణం కొన్ని సందర్భాల్లో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుండటమే. అయితే గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... ఈ సైడ్ఎఫెక్ట్స్ తాత్కాలికమే. ఈ మందులన్నీ చాలావరకు సురక్షితమే. ఇటీవల బయాలజిక్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మందులతో అంతగా ప్రభావం కనిపించనివాళ్లలో డాక్టర్లు ఈ కొత్తరకం మందులైన బయాలజిక్స్నూ వాడుతుంటారు. చికిత్స తీసుకోకపోతే... చాలా కేసుల్లో ఈ లక్షణాలు చాలామందిలో ఏదో ఒక సమయంలో కనిపించే చాలా సాధారణ లక్షణాలనే కలిగి ఉండటంతో చాలామంది మొదట్లో నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఈ తరహా వ్యాధుల్లో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదం జరుగుతుంది. కొందరిలో శాశ్వత వైకల్యమూ కలగవచ్చు. అందుకే వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధితో సాధారణ ప్రజల్లాగే జీవించడానికి... పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. పూర్తిగా మానేయడం మంచిది. యోగా, ఈత, నడక వంటి తేలికపాటి వ్యాయామాలను నిత్యం చేస్తుండటం. కీళ్ల జబ్బులు కనిపించగానే డాక్టర్లు సూచించిన సహాయక పరికరాలను వాడుతుండటం. ద్యానం, మంచి హాబీలతో, రిలాక్సేషన్ టెక్నిక్స్తో ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం. ఎముకల ఆరోగ్యం కోసం డాక్టర్లు సూచించిన విధంగా క్యాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవడం. ∙∙ చివరగా... ‘‘నేను మళ్లీ మామూలుగా జీవించడం సాధ్యమవుతుందా?’’ అడిగింది అనన్య. ‘‘పూర్తిగా సాధ్యమే. ఇది కలలకు ముగింపు కాదు. కొద్దిపాటి జాగ్రత్తలతో పూర్తిస్థాయిలో మామూలు జీవితం గడపవచ్చు. కెరియర్, పిల్లలూ, ప్రయాణాలూ... ఇవన్నీ మామూలుగానే జరుగుతాయి. కాకపోతే డాక్టర్లు సూచించిన మందులూ, జాగ్రత్తలూ పాటించాలి. ఇక ముందుగానే గుర్తించడం, అవగాహన కలిగి ఉండటం, నిరంతర పర్యవేక్షణ... ఇవీ మనకు అవసరమైన తారక మంత్రాలు’’ అంటున్న డాక్టర్ల మాటలు ఈ తరహా ఆర్థరైటిస్ వ్యాధులతో బాధపడే మహిళల జీవితాలకు ఒక మంచి భరోసా. ఈ జబ్బుల తాలూకు లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన రుమటాలజిస్టులను సంప్రదించాలి. ఎందుకంటే ఈ లక్షణాలు మామూలుగా చాలామందిలో చాలా సాధారణంగా కనిపించేవి కావడంతో సాధారణ డాక్టర్లు వెంటనే వాటిని గుర్తించలేకపోవచ్చు. దాంతో చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ దుష్ప్రభావాలూ, కీళ్లు దెబ్బతినడం కూడా పెరగడం జరగవచ్చు. రుమటాలజిస్టలను కలిస్తే వారు కొన్ని పరీక్షలు చేయిస్తారు. అవి... ఈఎస్ఆర్, సీఆర్పీ, రుమటాయిడ్ ఫ్యాక్టర్, ఏఎన్ఏ, యాంటీ సీసీపీ, కీళ్ల (జాయింట్ల) ఎక్స్–రే, అల్ట్రా సౌండ్ పరీక్షల వంటివి. వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే రుమటాలజిస్టులు డీఎమ్ఏఆర్డీ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) అని పిలిచే మెథోట్రెక్సేట్, హైడ్రాక్సీక్లోరోక్విన్, సల్ఫాసలాజీన్ వంటి మందులను సూచిస్తారు. వీటిని ఎంత త్వరగా మొదలుపెడితే... జరగబోయే నష్టాలు అంతగా నివారితమవుతాయి. చికిత్సలు మొదలయ్యాక క్రమం తప్పకుండా ఫాలో అప్లకు వెళ్తుండాలి. అప్పుడు డాక్టర్లు మందుల ప్రభావాన్ని తరచూ పరీక్షిస్తూ మోతాదులను సవరిస్తుంటారు. డాక్టర్ విజయ ప్రసన్న పరిమిసీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!) -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు తగ్గింది..! అమూల్యమైన ఆ ఏడు పాఠాలివే..
బరువు తగ్గడం అనేది అదిపెద్ద క్లిష్టమైన టాస్క్. తగ్గడం అంత ఈజీ కాదు. ఆ క్రమంలో ఒక్కోసారి తగ్గినట్లు తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అందరు ఈ వెయిట్ లాస్ జర్నీలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారని, వాటిని సర్దుబాటు చేసుకుంటే కిలోలు కొద్ది బరువు సులభంగా తగ్గిపోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమకా. తనకు స్లిమ్గా మారడంలో హెల్ప్ అయిన ఏడు జీవనశైలి పాఠాలను కూడా సోషల్మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.బరువు తగ్గాలంటే కచ్చితంగా మన జీవనశైలిలో అతిపెద్ద మార్పులు చేయక తప్పదని అంటోంది. దాంతోపాటు ఓర్పు, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత కీలకమని అంటోందామె. తాను ఆక్రమంలో ఏడు అద్భుతమైన పాఠాలను నేర్చుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల్లో అద్భుతంగా 25 కిలోలు అమాంతం తగ్గిపోయినట్లు ఇన్స్టా పోస్ట్లో తెలిపింది. నిజానికి ఎందువల్ల త్వరగా బరువు తగ్గలేకపోతున్నామనే దాని గురించి ఓపెన్గా మాట్లాడరని అంటెంది. అన్ని చేస్తున్న కొండలాంటి మన శరీరం ఏ మాత్రం మార్పు చెందని ఫీల్ కలుగుతుంటుంది. అలాంటి బరువుని తగ్గించాలంటే ఈ మార్పులు స్వాగతించండి, డైలీలైఫ్లో భాగం చేసుకోండని అంటోంది. అవేంటంటే..ఆకలి అనేది చిరుతండి లేదా మరొక ఎక్స్ట్రా ప్లేట్ ఆహారం కాదని నమ్మండి, ఆకలిగా అనిపించిన ప్రతిసారి తినేందుకు త్వరపడొద్దు. నిద్ర కూడా అత్యంత ముఖ్యమైనదని గ్రహించండని హెచ్చరిస్తోంది. నిద్ర కూడా మన బాడీకి ఒక ఆహారం లాంటిదేనని తెలుసుకోండని చెబుతోంది. తగినంత నిద్ర లేకపోతే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. స్థిరత్వం పరిపూర్ణమైన మార్పులకు మచ్చు తునక అట. దానికి ప్రాధాన్యత ఇస్తే..సకాలంలో మెరుగైన ఫలితాలు పొందడమే గాక చాలామటుకు లిమిటెడ్గా తినడాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. స్ట్రెంగ్స్ ట్రైనింగ్ కార్డియో వ్యాయామాల కంటే మెరుగ్గా పనిచేశాయాని చెబుతోంది. బరువులు ఎత్తడం, తన శరీర ఆకృతిని మార్చడంలో హెల్ప్ అయ్యిందని అంటోంది.అలాగే చక్కెర తగ్గించడం అనేది బరువు తగ్గడంలో చక్కటి గేమ ఛేంజర్ అని అంటోంది. సోడాలు, స్వీట్లు, పేస్ట్రీలకు దూరంగా ఉండటంతో.. వెంటనే బొడ్డు కొవ్వు తగ్గడం ప్రారంభించిందని అంటోంది. ఇవేగాక రాత్రిపూట తాగే హెర్బల్ పానీయాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటోంది. అవి ఆకలి కోరికలను నియంత్రిస్తాయని చెబుతోంది. ఉదా: లెమెన్ టీ, అల్లం టీ, యాపిల్ సైడ్ వెనిగర్, దాల్చిన చెక్క టీ వంటివి. వీటన్నింటి తోపాటు నియామానుసారంగా ఈ అలవాట్లను పాటించడం అనే క్రమశిక్షణ తనకు మరింత బాగా హెల్ప్ అయ్యిందని అంటోంది. అన్నింట్లకంటే బరువు తగ్గాలనే ఇంటెన్షన్తో కూడిన స్థిరత్వం కలిగిన మనసు అత్యంత ప్రధానమని, అప్పుడే సత్ఫలితాలను సులభంగా అందుకోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమాక. కాగా, నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..బరువు తగ్గడంలో సత్ఫలితాలు అందాక దాదాపు ఆశను వదిలేసుకున్నాం. మీరిచ్చిన ఉత్తమ సలహాలతో కొంగొత్త ఆశ రెకెత్తించిందంటూ పోస్టు పెట్టారు. అయితే అమాక మాత్రం మన నిర్దేశిత లక్ష్య బరుని చేరుకోవడం అనేది అంత సులభం కాదని గుర్తెరగండి. కేవలం అటెన్షన్ అనే, స్థిరత్వం అనేవే టార్గెట్ని రీచ్ అయ్యేలా బరువు తగ్గుతామని గ్రహించండని సూచిస్తోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!) -
మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!
మల్బరీ పండ్లు శాస్త్రీయంగా మోరస్ జాతికి చెందినవి, తీపి, పులుపు రుచుకలను కలిగి ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా జ్యూస్, జామ్, వైన్ ఇతర ఆహార పదార్థాలలో కలిపి ఉపయోగించవచ్చు. మల్బరీ పండ్లను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మల్బరీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, ఉబ్బరం, కడుపులో మంటలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది: మల్బరీలోని రెస్వెరాట్రాల్ అనే ముఖ్యమైన ఫ్లేవనాయిడ్ రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది రక్త నాళాలను సడలించి రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గిస్తుంది, తద్వారా స్ట్రోక్స్, గుండె΄ోటు వంటి సమస్యలను నివారిస్తుంది.మల్బరీలో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరంలోని వ్యాధులకు వ్యతిరేకంగా మంచి రక్షణను అందిస్తుంది.మల్బరీలోని విటమిన్ కె, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి అవసరం.మల్బరీ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, ఇది కంటి చూపును బలపరుస్తుంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసే వారికి కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.మల్బరీ జ్యూస్ శస్త్రచికిత్స తర్వాత రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. -
పోషకాల బ్రేక్ఫాస్ట్..!
ఒక రోజంతా శక్తిమంతంగా, ఉత్సాహంగా గడిచిందంటే వారిపై ఆ రోజు ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రభావం తప్పక ఉంటుంది. పిల్లల జ్ఞాపకశక్తికీ పోషకాలు గల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే పిల్లలు, పెద్దలు తీసుకునే బలవర్ధకమైన, సులువుగా తయారు చేసుకునే వంటకాలు ఇవి.. హెల్తీ మిక్స్ హల్వాకావల్సిన పదార్థాలుహెల్త్ మిక్స్ – కప్పు (క్యారెట్ లేదా బీట్రూట్ లేదా గుమ్మడి తురుము లేదా గోధుమ నూక); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బెల్లం లేదా కొబ్బరి చక్కెర – 1/4 కప్పు; పాలు – కప్పు; బాదం, జీడిపప్పు, చియా సీడ్స్ – టేబుల్ స్పూన్;తయారీ విధానంపాన్లో నెయ్యి వేడి చేసి, హెల్తీ మిక్స్ వేసి, బాగా వేయించాలి. పాలు పోసి, కలుపుతూ ఉండాలి.. మిశ్రమం చిక్కగా అయ్యాక, తురిమిన బెల్లం, కొబ్బరి చక్కెర ’కోకో షుగర్) వేసి బాగా కలపాలి. అన్నీ పూర్తిగా కలిసే వరకు మరో 2–3 నిమిషాలు ఉడికించాలి.తరిగిన డ్రై ఫ్రూట్స్ అలంకరించి, సర్వ్ చేయాలి. పోషకాలు: పిల్లలకు, పెద్దలకు ఇష్టమైనదే కాదు... మంచి పోషకాలు కూడా ఉండే స్వీట్ ఇది. బెల్లం లేదా కొబ్బరి చక్కెర వాడటం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. బీట్రూట్, క్యారట్, గుమ్మడిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. పాల మిశ్రమం కాబట్టి క్యాల్షియమూ అందుతుంది. చిల్లాకావల్సిన పదార్థాలు: పెసరపప్పు – కప్పు (తగినన్ని నీళ్లు ΄ోసి, రెండు గంటలసేపు నానబెట్టాలి); నీళ్లు – అర కప్పు (తగినన్ని); ఉల్లిపాయ – చిన్నది (సన్నగా తరగాలి); పచ్చి మిర్చి – సన్నగా తరగాలి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నూనె – తగినంత.తయారీ విధానంపెసరపప్పును వడకట్టి, నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని (క్యారెట్ తురుము, పాలకూర తరుగు, నానబెట్టిన ఓట్స్ కూడా కలుపుకోవచ్చు) తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. పెనం వేడి చేసి, ఒక గరిటెతో పెనం పైన పిండి పోసి, దోసెలా వెడల్పు చేయాలి. మీడియం మంట మీద రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు ఉంచాలి. కొత్తిమీర, పుదీనా చట్నీతో వేడిగా సర్వ్ చేయాలి.పోషకాలుక్యాలరీలు తక్కువగా ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ సమృద్ధిగా లభించే ఈ చిల్లా ఉదయం, సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకీ బాగుంటుంది. దీనిని రోల్ చేసి, ఉడికించిన కూరగాయలతో స్టఫ్ చేసి కూడా అందివ్వవచ్చు. హెల్తీ మిక్స్ పరాఠాకావల్సిన పదార్థాలుహెల్తీ మిక్స్ (రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు మొలకెత్తిన గింజలు, గుమ్మడి, అవిసెగింజలతో చేసిన పిండి) – కప్పు; నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గోరువెచ్చని నీళ్లు (తగినన్ని); తయారీ విధానంఒక గిన్నెలో, మిల్లెట్ మిక్స్, ఉప్పు వేయాలి. గోరువెచ్చని నీటిని క్రమంగా వేస్తూ, పిండిని మెత్తని ముద్దలా అయ్యేలా బాగా కలపాలి. చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకొని, చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. రెండు బటర్ పేపర్ షీట్ల మధ్య పిండి బాల్ ఉంచి, చపాతీ కర్రతో మెల్లగా, తేలికపాటి ఒత్తిడితో, రోల్ చేయాలి. పెనం వేడి చేసి, ప్రతి పరాఠాను సన్నని మంట మీద కొద్దిగా నెయ్యి/నూనెతో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి. చట్నీ లేదా పెరుగుతో వేడిగా వడ్డించాలి. పోషకాలు: పరాటాకు కూరగాయలను ఉడికించి, వాడుకోవచ్చు. ఏమేం దినుసులు, కూరగాయలు వాడుతున్నామో దానిని బట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. (చదవండి: కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!) -
ఆరుపదులు దాటినా ఫిట్గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్నెస్ మంత్ర.
టాలీవుడ్ కింగ్, హీరోయిన్ల మన్మథుడు హీరో నాగార్జున ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఇప్పటికీ అంతే గ్లామర్గా టోన్డ్ బాడీతో ఆకర్షణగా కనిపిస్తారు. ఆగస్టు 29 ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతలా ఫిట్గా ఉండేందుకు నాగార్జున ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు, ఆరుపదులు వయసులో కూడా అంతలా యంగ్గా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు అనుసరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నాగార్జున ఇంచుమించుగా గత 30 లేదా 35 సంవత్సరాలుగా వర్కౌట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్నడు స్కిప్ చేయలేదని ఆయన ఫిట్నెస్ ట్రైనర్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. వాటిలో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరి. అయితే అవన్ని ప్రతి ఉదయం జస్ట్ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకే చేస్తారట. అంతలా ఫిట్గా ఉండటానికి రీజన్..క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి అని చెబుతున్నారు నాగార్జున. అంతేగాదు పనిచేయకుండానైనా ఉంటాను గానీ వ్యాయామం చేయకుండా అస్సలు ఉండనని చెబుతున్నారు. మేల్కొన్న వెంటనే వ్యాయామం తన తొలి ప్రాధాన్యతని చెబుతున్నారు. కచ్చితంగా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కౌట్లనేవి తన దినచర్యలో భాగమని చెబుతున్నారు. అయితే అవి చాలా తీవ్రంగా ఉంటాయట.ఆ ఏజ్లో కూడా యంగ్గా కనిపించాలంటే..వర్కౌట్ల సమయంలో తన హృదయ స్పందన రేటును గరిష్ట రేటు 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోవడం ఎలాగై తన ట్రైనర్ నేర్పించాడని తెలిపారు నాగార్జున. అధిక జీవక్రియను నిర్వహించడానికి వర్కౌట్ల సమయంలో విశ్రాంతి , పరధ్యానం అనేవి అస్సలు పనికిరావని, పైగా మెరుగైన ఫలితాలు అందుకోలేమని చెప్పారు. చేసేపని చిన్నదైన, పెద్దదైనా ఫోకస్, స్కిప్ చేయని అంకిత భావం అంత్యంత ముఖ్యమని, అప్పుడే ఎప్పటికీ యవ్వనంగా ఉండగలమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు హీరో నాగార్జున. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) (చదవండి: ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్కి ప్రపోజ్ చేశాడు ..కట్చేస్తే..!) -
99 కిలోలు నుంచి 59 కిలోలుకు..! నో స్ట్రిక్ట్ డైట్ కానీ
ఎన్నో వెయిట్ లాస్ స్టోరీల్లో డైట్, జిమ్ వంటి వాటితో బరువు తగ్గడం చూశాం. కానీ ఈ మహిళ చివరి వరకు స్థిరంగా ఉంటూ..తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకుండానే తగ్గింది. తాను రెగ్యులర్గా తీసుకునే డైట్నే తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యింది. అది తనకు ఏవిధంగా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. కొందరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మరికొందరు ఓపికకు పెద్దపీటవేసి బరువు తగ్గడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాచిపై నెమ్మదిగా, స్థిరమైన ప్రయత్నంతో అసాధారణ ఫలితాలను అందుకుంది. ఎలాంటి షార్ట్కట్లు, తీవ్రమైన డైట్లు అనుసరించలేదు. కేవలం క్వాండిటీలో మార్పు చేసింది. తాను రోజు తినే ఆహారంలో మార్పులేమి లేవు. కేవలం తీసుకునే క్వాండిటీనే తగ్గించి తీసుకునేది. అలగే మొదట 20 నిమిషాల నడక నుంచి మొదలు పెట్టి 60 నిమిషాల వరకు నడిచేలా ప్లాన్ చేసింది. అలా పదివేల అడుగులు పైనే తీసుకుంది. ప్రోటీన్ జోడించడమే గాక అల్పాహారం తప్పనిసరి చేసుకుంది డైట్లో. అలాగే తరుచుగా బరువు తగ్గానా లేదా అని అద్దంలో చూసుకోవడం నివారించాల్సిందేనంటా. అప్పుడే బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయట. తీసుకునే ఆహారం..సాధారణంగా మొదట డబల్ఎక్స్ఎల్లో ఉన వ్యక్తి తన సైజుని ఎక్స్ఎస్ సైజుకి మార్చుకునేలా వ్యాయమాలు కూడా హెల్ప్ అయ్యాయి. మొదటి ఐదు నుంచి ఆరు నెలలు ఇంట్లో చేసే సాధారణ వ్యాయామాలు చేయగా, ఆమె స్టామినా పెరిగే కొద్దీ..భారీగా బరువులు ఎత్తేలా జిమ్కి వెళ్లటం, పైలేట్స్ వంటివి జోడించినట్లు పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్తో కలగలసిన ఈత వ్యాయామాలు తన మెరుగైన శరీరాకృతి మార్పుకి దోహదపడిందని చెప్పుకొచ్చింది. అలాగే తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకుండా చూసుకునేదట. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో గుడ్డులోని తెల్లసొనతో అవకాడో, లెట్యూసక్ష, టమాటాలు, చికెన్ రోల్ చేసుకుని తినేదట. స్పైసీ రొయ్యల న్యూడిల్స్, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, ఉల్లిపాయలు, క్యారెట్లు, బెల్పిప్పర్, క్యాబేజీ వంటి రంగురంగు కూరగాయలతో చేసిన స్పైసి రైస్ లేదా న్యూడిల్స్ తీసుకునేదట. వీటి తోపాటు ఫిష్ ఫ్రై, సలాడ్, పప్పు అన్నం, తదితరాలు తీసుకునేదట. ఇవి తనకు ఆకలిని నియంత్రించేలా చేసి, ఎక్కువగా ఆకలి వేయకుండా కపాడేదని పేర్కొంది. తాను స్థిరత్వం, సమతుల్యమైన ఆహారంతో ఇంతలా విజయవంతంగా బరువు తగ్గాగలిగానంటోందామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..) -
స్మార్ట్గా సమయాన్ని, సామర్థ్యాన్ని మింగేస్తోంది..!
నగర అధునాతన సాంకేతిక జీవనశైలిలో వేగం పెరిగిన కొద్దీ యువత ‘స్క్రీన్ టైమ్–సెంట్రిక్’ దినచర్యగా, బానిసత్వంగా మారుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజా సర్వేలు చెబుతున్న ఆందోళనకర విషయం ఏంటంటే.. నగరంతో పాటు రాష్ట్రంలోని 14 నుంచి 16 ఏళ్ల పిల్లల్లో 92 శాతం మందికి స్మార్ట్ఫోన్ వినియోగ పరిచయం ఉండటం. ఇందులో చదువుకోసం వాడుతున్నవారు 61 శాతం కాగా సోషల్ మీడియా బ్రౌజింగ్కి వెళ్తున్నవి 82.5 శాతం కావడం విశేషం. ఇది విద్యార్థుల చదువుపైనే కాకుండా దుష్పభావాలపై ఆందోళనల్ని పెంచుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో మొబైల్తో పాటు వివిధ సాంకేతిక మాధ్యమాల స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిందని సూచిస్తున్నాయి. నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్ర్యాంక్..ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోవడం ఒక్క చదువుకు మాత్రమే కాదు నిద్రపట్టలేని లక్షణాన్ని కూడా గందరగోళపరుస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల మానసిక ఆనందంపై ‘స్టూడెంట్ వెల్బీయింగ్ పల్స్’ నివేదిక చెబుతున్న తాజా వివరాల ప్రకారం.. రాత్రివేళల సోషల్ మీడియా వాడకం నిద్రను తగ్గించి, జీవన సంతృప్తిని–ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. 12వ తరగతి విద్యార్థుల్లో దాదాపు 75 శాతం మందికి స్కూల్ డేస్లో 7 గంటల కన్నా తక్కువ నిద్రే వస్తోందట. ఇది ఆందోళనను పెంచుతూ మానసిక ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్టైమ్లో ల్యాప్టైమ్, మొబైల్, ట్యాబ్స్ తదితర మాధ్యమాల్లో ‘పది నిమిషాలే’ అని మొదలయ్యే రీల్స్–బింజ్, నిద్రపోయే బెడ్ టైంకు ముందు ఆ స్క్రీన్లకు కళ్లు పెనవేసుకుని ఉండటం వల్ల నిద్రను చెడగొట్టి, మరుసటి రోజు ఫోకస్, శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. 30 నిమిషాలకంటే ఎక్కువ స్క్రీన్ చూశాక నిద్ర నాణ్యత తక్కువగా ఉందని ఈ డేటా చెబుతోంది. అలాగే 41 వేల మందిపై నిర్వహించిన ఒక సర్వేలో ‘సోషల్ స్క్రోల్’ వల్ల నిద్ర ఆలస్యమవుతుందనే విషయం కూడా బయటపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యువతలో హెల్తీ ఆన్లైన్ అలవాట్ల అవసరాన్ని స్పష్టంగా తెలిపే నివేదికను విడుదల చేసింది. పరిష్కారం ఏంటి?ఈ స్క్రీన్ టైం బానిసత్వానికి గేమింగ్ మరో పెద్ద టైమ్సింక్. మల్టీప్లేయర్/ఈ–స్పోర్ట్స్ మోడ్లో ‘నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్ ర్యాంక్’ లూప్ యువతను ముంచేస్తుంది. భారతీయ పరిశోధనల ప్రకారం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో గేమింగ్ అలవాట్లు.. ఫంక్షనాలిటీ, సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సూచిస్తున్నాయి. అదే సమయంలో కాలేజీ విద్యార్థులపై చేసిన అధ్యయనాల్లో ‘నలుగురిలో ఒక్కడికి’ స్మార్ట్ఫోన్ అడిక్షన్ లక్షణాలు కనిపించాయని నివేదికలు వెల్లడించాయి. స్క్రీన్పై గడిపే సమయం పెరిగేకొద్దీ మార్కులపై వస్తున్న ఫలితాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తక్కువ కాలంలోనే మువతలో వచ్చిన ఈ మార్పులతో పాటు డోపమైన్ హిట్స్ కోసం వేపింగ్/సబ్స్టెన్స్ ట్రయల్స్ వైపు అడుగులు కూడా ఆందోళనకరంగా మారాయి. తెలంగాణ యాంటీ–నార్కోటిక్స్ బ్యూరో ప్రణాళికలే ఈ విషయాలను చెబుతున్నాయి. హైదరాబాదు పరిసరాల్లో కుర్రాళ్లలో వీటి సరఫరా సులభంగా లభించడం వంటి కారణాలు అటు వైపు నెడుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పరిష్కార మార్గాలపై నిపుణులు, సామాజికవేత్తలు దృష్టి సారించారు. పాఠశాలలు–కాలేజీలు ‘డిజిటల్ హైజీన్, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్’ను కాంబోగా ఇవ్వాలి సూచిస్తున్నారు. విద్యార్థులకు భవిష్యత్ సలహాలకంటే ఇలాంటి అంశాలపై అవగాహన కలి్పంచడం ప్రాథమిక బాధ్యత అని విన్నవిస్తున్నారు. ఇంట్లో కూడా ‘స్క్రీన్ కర్ఫ్యూ’ (బెడ్టైమ్కు 60–90 నిమిషాల ముందు స్క్రీన్ ఆఫ్), నప్లిమిట్ (మధ్యాహ్నం 20–30 నిమిషాలకే), ‘నో ఫోన్ ఇన్ డైనింగ్ టేబుల్’, ‘రీల్స్కు రూల్ ఆఫ్ 15’ (రోజు 15 నిమిషాలకే) వంటి మైక్రో రూల్స్ అమలు చేస్తే ఫోకస్, నిద్ర, మూడ్ మెరుగుపడతాయని, నిద్ర–మానసిక అంశాలకు చెందిన ఆరోగ్య డేటా సూచిస్తోంది. నగర జీవనశైలిలో యువతను నిరీ్వర్యం చేస్తున్న ‘మూడు ఎస్’లు.. స్క్రీన్, స్క్రోల్, సబ్స్టాన్స్. చదువు/కెరీర్ లక్ష్యాలకు ‘డీప్ వర్క్ విండోలు’, ఆఫ్లైన్ హాబీలు, క్రీడలు, కమ్యూనిటీ వాలంటీరింగ్ వంటి ‘డోపమైన్ ఆల్టర్నేటివ్లు’ అవసరం. లేదంటే రాత్రి స్క్రోలు ఉదయాన్ని అలసటగా మార్చడమే కాకుండా ‘డెడ్లైన్ డిజాస్టర్’గా తిరిగి వస్తూనే ఉంటుంది. (చదవండి: బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!) -
ఊపందుకుంటున్న సోలో డేట్ కల్చర్..!
నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నే లేని మైమరపున.. ఏమో అన్నానేమో..నువ్వు విన్నావేమో..విన్న మాటేదో నిన్నడగనా.. అలా సాగిపోతున్న నాలోన.. ఇదేంటిలా కొత్త ఆలోచన.. అవును కాదు తడబాటుని.. అంతో ఇంతో గడి దాటనీ.. విడి విడిపోని పరదాని.. పలుకై రాని ప్రాణాన్ని.. అని బాణం చిత్రంలో రామజోగ్య శాస్తి రాసిన పాట మనందరికీ సుపరిచితమే.. ఇదే పాటను అనుకరిస్తూ.. పలువురు నగర వాసులు సోలో డేట్కు సై అంటున్నారు. కొందరు పర్సనల్ స్పేస్ వెతుక్కుంటూ.. లాంగ్ డ్రైవ్స్, టూర్స్కు వెళ్తున్నారు.. మరికొందరు తమకు నచి్చన ఆహారంతో.. ఇంకొందరు పుస్తకాలు, మ్యూజిక్తో సావాసం చేస్తున్నారు.. నేనూ నా నీడ.. ఇద్దరమే చాలంటూ పలువురు నగరవాసులు పాశ్చాత్య దేశాల నుంచి విస్తరిస్తున్న ట్రెండ్కు ఊతమిస్తున్నారు. ‘డేట్కి వెళదామా? అని ప్రశ్నిస్తే.. ఏ ఆన్సర్ వస్తుందో అనే ఆందోళన ఉండదు. ‘డేటింగ్’ కోసం మరొకరిని మెప్పించాలనే తాపత్రయమూ ఉండదు. నచ్చని పనులు చేయాల్సిన అవసరమూ ఉండదు.. నచి్చన పనులు మానాల్సిన అవసరం అస్సలే ఉండదు. అంత అద్భుతమైన అనుభవమా? అదెక్కడ? అది ఎలా? అనే ప్రశ్నలకు నగర యువత ఇప్పుడు కనుగొన్న సమాధానమే సోలో డేటింగ్. ‘సారీ రేపు ఎవరినీ కలవదలచుకోలేదు. ఏకాంతంగా రోజంతా గడపదలచుకున్నాను...’ ఇలాంటి మాటలు ఇప్పుడు నగరంలో తరచూ వినబడుతున్నాయి. ‘సోలో డేటింగ్’ అనే అనుభవం పట్ల ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతున్న ఆసక్తే దీనికి కారణం. అలా పుట్టింది.. పొద్దున్న లేస్తే.. ఎవరికి కాల్ చేయాలి? ఎవరిని కలవాలి? ఎవరితో చర్చించాలి.. ఏ మీటింగ్కి అటెండవ్వాలి? ఎవరికి పనులు అప్పజెప్పాలి.. ఎవరు చెప్పిన పనులు చేయాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని మెప్పించాలి?.. బయటకు వెళ్లడం మాత్రమే కాదు కమ్యూనికేషన్ పుణ్యమాని ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి.. రోజువారీ షెడ్యూల్ మొత్తం ఇలాగే మరొకరితో ముడిపడిపోతున్న నగర వాసంలో.. తనను తాను కోల్పోతున్నామనే భావన చాలా మందిలో పెరుగుతోంది. దాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనల నుంచి పుట్టిందే సోలో డేటింగ్ సంస్కృతి. ఇలా విస్తరించింది.. తొలుత అమెరికా, యూరప్ దేశాల్లో అంకురించిన సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్గా మారింది. మీ టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్లో అయితే ‘ఒంటరి డైనింగ్’ (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘సోలో ట్రావెల్ – డేటింగ్’ ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా యువత, ముఖ్యంగా హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో, వీకెండ్ సోలో డేట్స్ని ట్రెండ్గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో ‘సెల్ఫ్ కేర్’ అనే భావనకు కొత్త రూపంగా దీన్ని పేర్కొంటున్నారు. సోలో డేటింగ్.. ఇలా! ఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. సోలోగా గడపడం అంటే ఏదో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. ఒక రొమాంటిక్ పార్ట్నర్తో కలిసి వెళ్లినట్టు అలా వెళ్లినప్పుడు వారి ఆనందం కోసం మనం ఏవైతే చేస్తామో, చేద్దాం అనుకుంటామో.. అలా మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం. ఆ రోజు మొత్తం మనకు నచ్చిన పనులు చేస్తూ గడిపేయడం. మనకు నచి్చన టైమ్కి నిద్ర లేవడం మొదలుకుని ఏదైనా కాఫీ షాప్లోనో కల్చరల్ స్పేస్ లోనో కాసేపు గడపడం, సినిమానో, నాటకమో, స్టాండప్ కామెడీయో.. ఏది చూడాలనుకుంటే అది చూడటం, పార్కులో వాకింగ్ లేదా పర్వతాల్లో ట్రెక్కింగ్ ఇలా ఏదైనా సరే.. రోజంతా మనం ఎంజాయ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నవి చేస్తూ గడిపేయడం.. కొన్ని సూచనలు.. దీని వల్ల ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. దీంతో ఆనందం కోసం ఇతరులపై ఆధారపడడం తగ్గుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. రోజూ తప్పక చేసే పనులకు ఒక్కరోజు పూర్తిగా వీడ్కోలు పలకాలి. సోలో డేటింగ్ అంటే ఏదో ఒంటరిగా స్తబ్ధుగా గడిపేయడం కాదు. ప్రణాళికా బద్దంగా, రాజీ పడకుండా మనం కోరుకున్నట్టుగా ఎంజాయ్ చేయడం. ఒత్తిడి నుంచి సామాజిక బాధ్యతల నుంచి కూడా విరామం లభిస్తుంది. ఆ డేట్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు.. ఎవరు చెప్పిందీ ఫాలో అవ్వాల్సిన పని అంతకన్నా లేదు. కేవలం మనసు మాట మాత్రమే వినాలి. నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చింది ఏంటో తెలుసుకునే సెల్ఫ్ అవేర్నెస్ కలుగుతుంది.(చదవండి: వాన వెలిసినా... ముసిరే వ్యాధులు) -
బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...
అరటి పండు చిప్స్.. వీటి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓ రకంగా హాట్ చిప్స్ అనే ఒక పూర్తి స్థాయి చిరుతిళ్ల దుకాణాలు అన్ని నగరాల్లో పాగా వేయడానికి కూడా ఈ బనానా చిప్స్ పై జనంలో పెరిగిన క్రేజ్ బాటలు వేసిందని చెప్పొచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్ నుంచి రాత్రి వేళల్లో ఛీర్స్ దాకా కాస్త ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఎంచుకునే చిరు తిండి అదే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఇష్టపడే చాలా మంది పర్యాటకులు తప్పకుండా చేసే పనులలో ఒకటి అక్కడ నుంచి తాజా తాజా బనానా చిప్స్ను కొనుగోలు చేసి తమ స్వస్థలాలకు తీసుకురావడం.. ఎవరైనా సన్నిహితులు కేరళ వెళుతుంటే కూడా వచ్చేటప్పుడు బనానా చిప్స్ తీసుకురా అంటూ అభ్యర్ధించే తెలుగువారికీ కొదవలేదు.ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 మధ్య కేరళ ఆహార భద్రతా కమిషనరేట్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పదార్ధాలలో కల్తీపై తనిఖీలు నిర్వహించింది. ఆ సందర్భంగా సేకరించిన నమూనాలపై జరిపిన పరీక్షలలో, విభ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన కేరళ లో రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే ఆహారాలలో నిషేధిత రంగులు, నిల్వకారక రసాయనాలు, పురుగుమందుల మిశ్రమాలు బయటపడ్డాయి. అవి అనుమతించదగిన పరిమితి కంటే దాదాపు 3,500% వరకూ ఎక్కువగా ఉండడం అందర్నీ షాక్కి గురి చేసింది.అధికారులు తమ నివేదికను సిద్ధం చేయడానికి రాష్ట్రంలో విక్రయించే 650 పైగా ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షించారు. వారి పరిశోధన ఫలితాల ప్రకారం... స్వల్ప స్థాయిలో కూడా ఏదైనా ఆహారాన్ని విషపూరితంగా మార్చే పారిశ్రామిక రంగు అయిన రోడమైన్ బి, పామ్ షుగర్ బెల్లంలలో కనపడింది. క్యాన్సర్ కారక రసాయనమైన అమరాంత్, రోజ్బెర్రీ, బీఫ్ చిల్లి, డ్రైడ్ ప్లమ్లలో, మరొక హానికరమైన రసాయనం, ఆరెంజ్ 2, రెడ్ గ్రామ్ నిమ్మకాయ ఊరగాయలలో లభ్యమైంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన బ్రాండెడ్ మిరపకాయ పొడులలో సుడాన్ 1, 2, 3, 4 అనే పేరు కలిగిన క్యాన్సర్–సంబంధిత పదార్థాల జాడ దొరికింది.ఈ తరహా హానికారక ఉత్పత్తులు మేళవించిన వివిధ రకాల మిశ్రమాలు, ప్లం కేక్తో పాటు బనానా చిప్స్లో కూడా బయటపడడం అరటి పండు చిప్స్ ని ఇష్టంగా తినేవారిని భయాందోళనలకు గురి చేసింది. ఈ మిశ్రమం..అరటి పండు చిప్స్ తినేవారిలో కలిగించే అనారోగ్యాలు సాధారణ అజీర్ణం నుంచి ప్రాణాంతక క్యాన్సర్ల వరకూ ఉండవచ్చునని వెల్లడి కావడం మింగుడు పడని విషయంగా మారింది. ఈ నేపధ్యంలో కేరళ నుంచి తరలివచ్చే వాటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో తయారవుతున్న బనానా చిప్స్ ను వినియోగించే విషయంలో సైతం ఆరోగ్యార్ధులు ఆచితూచి వ్యవహరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా కేరళ రాష్ట్రంలో అధికారులు చేసినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారులు తినుబండారాలపై తనిఖీలు చేపట్టాలని, వారు విడుదల చేసినట్టుగానే హానికారక పదార్ధాలను కొలతలతో సహా జాబితాగా విడుదల చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?) -
రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా..?
నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఒక కుటుంబ కార్యక్రమం ఉంది. ఆ సమయానికి రుతుక్రమం రాకుండా వాయిదా వేసే మాత్రలు వాడాలని మా ఇంట్లో అందరూ చెబుతున్నారు. కాని, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో, భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోవాలని ఉంది.– ప్రియాంక, హైదరాబాద్మీ వయసు, శరీర పరిస్థితి, రుతుక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాలను ముందుగా పరిశీలించడం అవసరం. రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు సాధారణంగా అధిక మోతాదు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో సహజంగా ఏర్పడే హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి, గర్భాశయంలో ఏర్పడిన పొర ఊడిపోకుండా అడ్డుకుంటాయి. మాత్రలు వాడుతున్నంత కాలం రుతుక్రమం రాదు. కాని, ఆపిన తరువాత గర్భాశయ పొర ఒకేసారి ఊడిపోవడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరగవచ్చు. తరచుగా వాడితే రుతుక్రమం అసాధారణంగా మారడం, గర్భసంబంధిత సమస్యలు రావచ్చు. గతంలో ఇలాంటి మాత్రలు వాడిన మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆరోగ్యకరమైన అండాల లభ్యత తగ్గడం వలన గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య సర్దుకోవడానికి కొంతమందికి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు సమయం పడుతుంది. తాత్కాలిక దుష్ప్రభావాలలో మానసిక భావప్రకటన మార్పులు, అజీర్ణం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి, స్తనాల నొప్పి, బరువు పెరగడం ఉంటాయి. అధిక బరువున్నవారు వాడితే రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు వాడకూడదు. దీర్ఘకాలంగా వాడితే శాశ్వత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుతుక్రమం వాయిదా వేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కలసి, శరీర పరిస్థితి అంచనా వేయించు కోవాలి. తక్కువ మోతాదులో ఉండే మాత్రలను, కార్యక్రమానికి ఒకటి రెండు నెలల ముందు ప్రారంభిస్తే కొంత సురక్షితంగా వాడవచ్చు. భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమవుతున్న వారు అనవసరంగా ఈ మాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భంలో శిశువు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత రుతుక్రమ స్థితి ఇవన్నీ పరిశీలించి, వైద్యుని సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.నా వయసు పద్దెనిమిదేళ్లు. మొదటి నుంచే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఈ అక్టోబర్ నెలలో దసరా పండుగకు మేము ఇంట్లో దేవుడికి పెద్దగా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి, ఆ సమయంలో పీరియడ్స్ రాకుండా పోస్ట్పోన్ లేదా ప్రీపోన్ టాబ్లెట్లు వాడవచ్చా?– స్వాతి, విజయవాడమీ పీరియడ్స్ రెగ్యులర్గా లేనందున, వచ్చే నెలలో పీరియడ్స్ ఏ తేదీన వస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఆ తేదీని ముందుకు తేవడం లేదా వెనక్కు మార్చడం ఈ పరిస్థితిలో కష్టమైన పని. సాధారణంగా, పీరియడ్స్ సరిగ్గా వచ్చే వాళ్లకి, తేదీకి కొన్ని రోజులు ముందు హైడోస్ హార్మోన్ మాత్రలు ఇస్తే పీరియడ్స్ వాయిదా వేయవచ్చు. కాని, మీలా నెలసరి క్రమం తప్పి ఉన్నవాళ్లకి ఇది సురక్షితం కాదు. ఈ మాత్రలు వాడితే వికారం, వాంతులు, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, కాలేయానికి నష్టం వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. వీటిని తరచుగా వాడితే పీరియడ్స్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మీ వయసులో పీరియడ్స్ రెగ్యులర్గా కాకపోవడం సహజం. ఎందుకంటే ఈ వయసులో శరీరం ఇంకా మార్పులు పొందుతూ ఉంటుంది. చాలా అమ్మాయిల్లో ఇది ఇరవై ఏళ్ల వరకు క్రమంగా సర్దుకుంటుంది. కాని, పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకపోతే, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, తక్కువ బరువు, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. నా సలహా ఏమిటంటే, కేవలం పూజల కోసమే హార్మోన్ మందులు వాడడం కంటే, ముందుగా మీ సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే మీ సైకిల్ సరిగా వచ్చి, భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇలాంటి మందులను స్వయంగా అసలు కొనకండి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
ఆరోగ్యమే.. అందం.. ఆనందం
జీవితంలో ఎంత ఎదిగినా, ఏం సాధించినా.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఎంతో ప్రధానమైనవని, ఇంటర్నల్ వెల్నెస్, ఎక్స్టర్నల్ కేర్ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్నీ ప్రదర్శిస్తాయని ప్రముఖ సినీతార శ్రియా శరణ్ తెలిపారు. చాలా రోజుల తరువాత ఈ పాన్ ఇండియా నటి నగరంలో సందడి చేశారు. నగరంలోని కొండాపూర్ వేదికగా వెల్నెస్, చర్మ సంరక్షణ, అధునాతన సౌందర్య సేవలందించే ‘జెన్నారా క్లినిక్స్’ను శ్రియా శరణ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందమైన జీవితం, ఆరోగ్యకరమైనప్రయాణంతో పాటు తన తదుపరి సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆ రోజులు ఎంత మధురమో.. చాలా మంది నన్ను కలిసినప్పుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకేలా ఎలా ఉండగలుగుతున్నారని అడుగుతున్నారు.., దానంతటికీ కారణం ‘ఎల్లప్పుడూ నాకు మానసిక సంతోషాన్నందిస్తున్న అభిమానుల ప్రేమ, రెండోది ఆరోగ్యం పట్ల నా జాగ్రత్త. సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సంరక్షించుకోవాలి. దీని కోసం నేను సాధారణ పద్ధతులను కొనసాగిస్తాను. ఇంట్లో తయారు చేసిన ఫేస్ప్యాక్లు వాడతాను, కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ వినియోగించడంతో పాటు ఆయుర్వేదిక్ పద్ధతులను పాటిస్తాను. మన సంస్కృతిలో ఇలాంటి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి. అప్పటి రోజులు ఎంత మంచివో.., అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఎలాంటి కాలుష్యం ఉండేదికాదు. రసాయనాలు లేని ఆహారం తినేవారు. అందుకే వారి మోములో సహాజ సౌందర్యం ఉట్టిపడేది. ఆ గ్లో నాకు చాలా ఇష్టం. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో అలా బతకడం కాస్త కష్టమే కానీ ఎవరికి వారు వారి ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ఈ తరాన్ని నేను వేడుకునేది కూడా ఇదే, మైండ్ మెడిటేషన్, యోగా చేయండి. పాజిటివ్ లైఫ్ పై అవగాహన పెంచుకోండి. నాలాగే మినరల్స్, విటమిన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించండి. హైదరాబాద్లో సౌందర్య రంగం, సినిమా రంగం గ్లోబల్ స్థాయిని చేరుకుంది. మోడ్రన్ లైఫ్స్టైల్ హబ్గా మారింది. దానిని ఆస్వాదిస్తూనే విభిన్న విధాలుగా మనల్ని మనం సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఆల్ టైం ఫేవరెట్.. హైదరాబాద్ ఎప్పటికీ నా ఫేవరెట్ సిటీ. ఎన్నెన్నో మధురమైన అనుభవాలు, ఆనందాలు నగరంతో పెనవేసుకుని ఉన్నాయి. 17 ఏళ్లప్పుడు అనుకుంటా మొదటిసారి ఇక్కడికి వచ్చాను. సినీ ప్రయాణంలో భాగంగా ఈ నగరాన్ని నాకు కుటుంబంలా మార్చేసింది. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్ను కలవడానికే ఇక్కడికి వస్తుంటాను. నా తదుపరి సినిమాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను చేరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మిరాయ్ సినిమాలో నటించాను. ఇందులో నా పాత్ర అందరికీ నచ్చుతుంది. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ చంద్రయాన్. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వినూత్నమైన సబ్జెక్ట్ ఇది. ఎంతో వైవిధ్యమున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. (చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
మనసును ‘స్కాన్’ చేసి వైద్యం నడిపిద్దాం
ఓ టీనేజీ అమ్మాయి అప్పటివరకూ అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంది. కానీ అకస్మాత్తుగా కాళ్లు రెండూ చచ్చుబడ్డాయి. ఏమాత్రం కదల్లేకపోవడంతో వీల్చైర్కు పరిమితమైంది. కారణం తెలుసుకోడానికి చేయని పరీక్ష లేదూ... తీయని స్కాన్ లేదు. కానీ ఎందులోనూ ఏమీ కనిపించలేదు. ఎట్టకేలకు తెలిసిన విషయం డాక్టర్లనే అబ్బురపరచింది. ఆ మెడికల్ సీక్రెట్ ఏమిటో చూద్దాం. ఈ కథ ఓ మెడికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎంతకూ క్లూయే దొరకని పరిశోధనాత్మకమైన సస్పెన్స్ స్టోరీని గుర్తుచేస్తుంది. రియా (పేరు మార్చాం) అనే ఓ పదిహేనేళ్ల చురుకైన అమ్మాయికి అకస్మాత్తుగా ఓ క్షణాన రెండు కాళ్లూ పడిపోయాయి. ఎంతకీ చలనం కలగలేదు. దాంతో అమ్మాయి వీల్ చైర్కే పరిమితం కావాల్సివచ్చింది. రియాను హాస్పిటల్కు తరలించారు. అపరాధ పరిశోధనల్లో నేరస్తుని జాడల కోసం వెతికినట్టుగా డాక్టర్లు ఓ అమ్మాయి జబ్బుకు కారణమైన ఆ అంశం కోసం పరిశోధనలు చేశారు... చేస్తూ పోయారు. రక్తపరీక్షలు చేశారు, ఎమ్మారైలు తీశారు. వాటి ద్వారా కండరాలను పరీక్షించారు. నరాలల్లోకి పరికించి చూశారు. ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ పరీక్షలతో మెదడూ, వెన్నుముల్లోకి తరచి చూశారు. ఊహూ... కారణమెంతకూ దొరకలేదు. రియా చదువుల్లో సరస్వతి. స్కూలు వక్తృత్వపు పోటీల్లో మంచి వక్త. అంతేకాదు... మంచి మంచి పెయింటింగ్స్ కూడా వేసేది. అలాంటి అమ్మాయిని పేరు తెలియని జబ్బు హైజాక్ చేసేసింది. కాళ్లనొప్పితో ఎలాగో కుంటుతూ స్కూలు దాకా వెళ్లిన ఆ అమ్మాయి స్కూలు నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. రక్త పరీక్షలు చేశారు. ఏమీలేదు. ఇలా ఎన్ని పరీక్షలు చేసినా జబ్బు ఆచూకీ అంతు చిక్కలేదు. విటమిన్ లెవెల్స్, ఎలక్ట్రోలైట్స్ ఇలా ఎన్ని చికిత్సలు చేసినా ఫలితమూ దక్కలేదు. అప్పటివరకూ అక్షరాలా ‘తన కాళ్ల మీద తాను నిలబడ్డ’ ఆ అమ్మాయి తన స్వతంత్రతను కోల్పోయి మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో లంబార్ పంక్చర్ అనే వెన్నుముక గాటు పెట్టి అందులో నీరు తీసి చూసే చిట్టచివరి పరీక్షకు డాక్టర్లు సిఫార్సు చేశారు.రెండో ఒపీనియన్ కోసం... దేహానికి గాటు పెట్టి చేసి మరింత తీవ్రమైన పరీక్షలతో ఆమెను బాధించడానికి పూనుకునే ముందర ఎందుకోగానీ... రియా తల్లిదండ్రులు రెండో ఓపీనియన్ కోసం హైదరాబాద్లోని సుధీర్కుమార్ అనే న్యూరాలజిస్టును సంప్రదించారు. ఇతరత్రా పరీక్షలతో పాటు రిపోర్టుల్లో విటమిన్–బి12, విటమిన్ డీతోపాటు మెదడూ, వెన్నెముకా, నర్వ్ కండక్షన్ స్టడీస్... ఇలాంటివన్నీ పరిశీలిస్తున్న డాక్టర్గారికి ఎందుకో అనుమానం వచ్చి ‘హూవర్స్ సైన్’ అనే ఓ సునిశిత పరిశీలన చేశారు.ఏమిటీ హూవర్స్ సైన్ ? బాధితులను పడుకోబెట్టాక రెండు కాళ్ల మడమల కింద రెండు చేతులూ పెట్టి, బలహీనంగా ఉన్న ఓ కాలిని ప్రయత్నపూర్వకంగా ఎంతోకొంత పైకెత్తమని డాక్టర్లు అడుగుతారు. వాస్తవంగా కాళ్లలో పూర్తిగా చచ్చుబడిపోయిన వ్యక్తుల్లో ఓ కాలు కాస్త ఎత్తడానికి ప్రయత్నించినా రెండోకాలిలో ఎలాంటి చలనమూ ఉండదు. కానీ అది వాస్తవంగా చచ్చుబడిన కేసు కానప్పుడు బాధితులు ఓ కాలు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరో కాలిమీద బరువు/ఒత్తిడి పెరుగుతుంది. అంటే... కాలిని ఎత్తే ప్రయత్నంలో మరోకాలు వెనక్కెళ్తుండటంతో ఇలా జరుగుతుంది. (ఈ హూవర్స్ సైన్ (గుర్తు) అన్నది కాలు చచ్చుబడిపోయిన సందర్భంలో నిర్ధారణ కోసం చేసేది. ఇలాంటి హూవర్స్ సైన్స్ (గుర్తులు) ఊపిరితిత్తుల విషయంలో మరో రకంగా ఉంటాయి). దాంతో ఇది వాస్తవంగా కాళ్లు చచ్చుబడిపోయిన కేసు కాదనీ, ఆ కండిషన్ను అనుకరిస్తున్న (మిమిక్ చేస్తున్న కేసు) అని డాక్టర్కు అర్థమైంది. అంతా బాగున్నప్పటికీ ఆమె కాళ్లను కదలించలేకపోతోందంటే ఏదో మతలబు ఉంది.అది నటన కాదు... బాధితురాలు నటించడం లేదు... అయితే ఇక్కడ బాధితురాలు రియా నటిస్తోందని అనుకోడానికి వీల్లేదు. కాళ్లు పడిపోవడం జరగనప్పటికీ... మానసిక కారణాలతో కాళ్లను కదలించలేకపోతోంది. తన మానసిక సమస్య కారణంగా నిజంగానే ఆమె కాళ్లు కదిలించలేకపోతోంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఫంక్షనల్ న్యూరలాజికల్ డిజార్డర్ – ఎఫ్ఎన్డీ’ అంటారు. దీనికి కౌన్సెలింగ్ అవసరమని గ్రహించిన డాక్టర్ సుధీర్కుమార్ ఆమెతో ఏకాంతంగా మాట్లాడారు.అసలు కారణమిది... రియా కాస్త బొద్దుగా ఉండటంతో తోటి విద్యార్థినీ, విద్యార్థులు ఆమెను వెక్కిరిస్తుండేవాళ్లు. ఆమె బరువును చూసి గేలి చేస్తుండేవాళ్లు. దాంతో తీవ్రమైన వ్యాకులతకూ, మనఃక్లేశానికీ లోనైన ఆమె తనకు తెలియకుండానే ఇలాంటి కండిషన్కు గురైంది. అన్నీ నార్మల్గా ఉన్నా అనారోగ్యానికి గురయ్యే మానసిక సమస్య అని తేల్చారు డాక్టర్ సుధీర్కుమార్. ఇందులో నరాలకు సంబంధించిన అంశంతో పాటు మానసిక నిపుణులతో మల్టీ డిసిప్లినరీగా ప్రయత్నించాల్సిన సంక్లిష్టమైన కేసు. ఇది అర్థమయ్యాక ఆమెలో మానసిక స్థైర్యం నింపేలా అనేక స్పెషాలిటీలకు సంబంధించిన డాక్టర్లు సంయుక్తంగా చికిత్స మొదలుపెట్టారు.ఆర్నెల్ల తర్వాత... అన్ని చికిత్సలూ ఫలించడంతో రియా మామూలుగా మారింది. ఇప్పుడు తన కాళ్ల మీద తాను మళ్లీ నిలబడటంతో పాటు తన చేతుల్లోని కుంచెను కదిలించి అందమైన బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడామె టీనేజ్ లైఫ్ తాను వేస్తున్న పెయింటింగ్స్ అందంగా అందులోని కలర్సంతగా రంగులమయంగా మళ్లీ మారిపోయింది. చివరగా... అందించాల్సిన ట్రీట్మెంట్ ఒక్కటే డాక్టర్ల బాధ్యత కాదు... సంక్లిష్ట సమయాల్లో అందించాల్సినవి... చికిత్సా, మందులతో పాటు అక్కడ నిజంగా అందాల్సినదీ, అవసరమైనదేమిటంటే... చక్కటి సానుభూతీ, చిక్కటి సహానుభూతి. – యాసీన్డాక్టర్లూ... ఇది వినండిఈ కేసు ద్వారా డాక్టర్లకూ ఓ సందేశమిస్తున్నారు డాక్టర్ సుధీర్కుమార్. అదేమిటంటే... కేవలం రిపోర్టులు చూసే ఓ నిర్ధారణకు రాకండి. బాధితులు చెప్పేది పూర్తిగా సానుభూతితో, సహానుభూతితో వినండి. అప్పుడు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.ఫంక్షనల్ డిజార్డర్లలో పేషెంట్స్ చేసేది నటించడం కానే కాదు. వాళ్ల బాధలు పూర్తిగా జెన్యూన్. వాళ్లు చెప్పేది పచ్చి వాస్తవం. క్లినికల్ పరీక్షల తర్వాత కూడా ఏ కారణాలూ తెలియకపోతే... వారిని కోసి చేసే పరీక్షలకూ, పొడిచి నిర్వహించాల్సిన ప్రోసీజర్లకు వెంటనే గురిచేయకండి. కాస్త చురుగ్గా, నిశితంగా ఆలోచించి ‘హూవర్స్ సైన్స్’ లాంటి వాటి గురించి మీ పరిధి దాటి (ఔట్ ఆఫ్ ద బాక్స్) ఆలోచించేలా ప్రయత్నించండి. దాంతో పేషెంట్స్ను బాధించి చేసే ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్స్కు ముందే జబ్బు నిర్ధారణకు అవకాశం దొరుకుతుంది. ఒక వ్యక్తికి స్వస్థత చేకూర్చడం మీ ఒక్కరివల్లనే కుదరనప్పుడు టీమ్తో కలిసి... అంటే సైకాలజిస్టులూ, ఫిజీషియన్లూ, ఫిజియోథెరపిస్టుల తోపాటు అవసరమైతే టీచర్లూ, కుటుంబ సభ్యులందరూ బృందంగా టీమ్వర్క్తో తగిన చికిత్స అందించి, బాధితులు హాయిగా కోలుకునేలా చేయండి. డాక్టర్ సుధీర్కుమార్, సీనియర్ న్యూరో ఫిజీషియన్ (చదవండి: 'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.వెయిట్లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం. ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్లాస్ కోసం చాట్జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె. ఇన్స్టా పోస్ట్లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్ని ఎంచుకోండి. అందుకోసం చాట్జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.చాట్జీపీటీలో ఎలా అడగాలంటే..చాట్జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది. ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్లో రాసుకొచ్చింది సిమ్రాన్. గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Simran - Health, Wellness & Weight Loss Expert (@simvalecha) (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
82 ఏళ్ల వయసులోనూ ఫిట్గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..
‘వయసు పైబడడం అనేది సహజం... వచ్చే సమస్యలు కూడా సహజం’ అని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు కొందరు. ‘వయసు పైబడడం అనేది సహజమే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం తప్పనిసరి’ అని ముందుకు వెళ్లేవారు కొందరు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రెండో కోవకు చెందిన వ్యక్తి.తన ఆలోచనలను పర్సనల్ బ్లాగ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బిగ్ బి. 82 సంవత్సరాల అమితాబ్ తాజాగా వృద్ధాప్యానికి సంబంధించిన సవాళ్ల గురించి తన తాజా పోస్ట్లో రాశారు. ఇంట్లో ‘హ్యాండిల్ బార్స్’ అవసరం గురించి ప్రస్తావించారు.వృద్ధుల కోసం బాత్రూమ్లో, ఇంట్లోని కొన్ని చోట్ల హ్యాండిల్ బార్స్ లేదా గ్రాబ్ బార్స్ ఏర్పాటు చేస్తారు.‘మీట్–అండ్–గ్రీట్ విత్ ఫ్యాన్స్’లో భాగంగా అభిమానులను కలుసుకున్న తరువాత తన దినచర్య గురించి రాశారు బిగ్ బి.‘శరీరం క్రమేణా సమతుల్యత కోల్పోతోంది’ అని రాసిన బచ్చన్ తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. యోగా, శ్వాస వ్యాయామాలు, మొబిలిటీ వ్యాయామాల ప్రాముఖ్యత గురించి తన పోస్ట్లో నొక్కి చెప్పారు.‘82 సంవత్సరాల వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్లే సమాధానం చెబుతాయి. సందర్భానుసారంగా ఉన్నత జీవనశైలికి సంబంధించిన అలవాట్ల గుంచి ఎన్నో పోస్ట్లలో వివరించారు అమితాబ్.ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్న సూపర్ స్టార్ నిజమైన పోరాట యోధుడు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
డిజిటల్ డ్యామేజ్..! స్క్రీన్ టైం తగ్గించాల్సిందే..
ప్రస్తుత స్క్రీన్ వినియోగ దోరణులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి దాదాపు 50% మంది పిల్లలు మయోపియాకు ప్రభావితమవుతారని ఆప్తాల్మిక్ – ఫిజియోలాజికల్ ఆప్టిక్స్ అంచనా. వినోదం నుంచి విద్య వరకూ డిజిటల్ స్క్రీన్లు వినియోగించడం అనేది నగర రోజువారీ జీవితంలో భాగమవుతోంది. దీంతో చిన్నారుల్లో కంటి సంబంధిత మయోపియా నుంచి డిజిటల్ కంటి ఒత్తిడి, నిద్రలోపాలు, ప్రవర్తనా మార్పుల వరకూ పలు అనారోగ్య సమస్యలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు, క్యూరియస్ జర్నల్ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 50% కంటే ఎక్కువ మంది డిజిటల్ కంటి ఒత్తిడి లక్షణాలను కలిగి ఉన్నారు. వీటిలో అలసట, తలనొప్పి, నిద్ర ఆటంకాలు, మానసిక పరమైన ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించిన ఆందోళనలు పెంచుతున్నాయి.కఠిన పరిమితులు అవసరం.. ‘ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన స్క్రీన్ అలవాట్లను పెంపొందించడం పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకం’ అని వైద్యులు చెబుతున్నారు. ‘కఠినమైన స్క్రీన్ సమయ పరిమితిని నిర్ణయించడం అనే అంశానికి తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వగలగడం ఆరోగ్యకరమైన మార్పుకు ఒక మార్గం. విద్యావేత్తలకు స్క్రీన్లు అవసరమైనప్పుడు, 20–20–20 నియమాన్ని అనుసరించండి. ప్రతి ఇరవై నిమిషాలకు, ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. డిజిటల్ కంటి ఒత్తిడిని తగ్గించడానికి 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడండి. బ్లూ లైట్ ఫిల్టర్ మోడ్ ఉపయోగించడం కూడా కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది’ అంటూ సూచిస్తున్నారు. స్క్రీన్ టైం ప్రభావం.. ‘ఎక్కువసేపు స్క్రీన్ టైం వాడటం వల్ల పాఠశాల వయసు పిల్లలకు మయోపియా లేదా సమీప దృష్టి లోపం కలుగుతోంది. ఈ మయోపియా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల మెల్లకన్ను, పొడి కంటి వ్యాధి, కంటి డిజిటల్ ఒత్తిడి ప్రమాదం ఎక్కువవుతుంది’ అని కంటి వైద్య నిపుణులు అంటున్నారు. ‘స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి విభిన్న రకాల ముప్పును కలిగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ కారణంగా రెటీనాకు నష్టం కలిగించడం, మెలటోనిన్ను అణచివేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. తద్వారా మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుందని వివరిస్తున్నారు. (చదవండి: వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..) -
కబూతర్..! ఖానా కహానీ..
ప్రేమ చిహ్నాలుగా వర్థిల్లిన పావురాలే పలు రకాల వైరస్ వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయి. నగరాల్లోనూ వీటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలూ, ఊపిరితిత్తుల సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో వాటికి ఆహారాన్ని అందించడాన్ని ఇటీవలే ముంబయి, పుణె వంటి నగరాలు నిషేధించాయి. నగరంలో కూడా పావురాల సంఖ్య, వాటికి ఆహారం అందించే అలవాటు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో పావురాల ఫీడింగ్ అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో ముంబైలోని ఒక అపార్టుమెంట్లో చోటు చేసుకున్న పావురాల సమస్య రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. అనంతరం ఆ సమస్య ఏకంగా కోర్టు గడప కూడా తొక్కింది. అయితే ఆ స్థాయికి చేరకున్నా.. మన నగరంలోనూ నిత్యం ఇదే అంశంపై నగరవాసుల్లో వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. పావురాల వల్ల మనుషులకు కలిగే అనారోగ్యాలపై అవగాహన పెరగడమే దీనికి కారణం. నగరంలో అలవాటుగా.. హాబీగా పావురాలకు ఆహారం వేసేవారితో పాటు మతపరమైన లేదా మరే ఇతర కారణాల వల్ల కూడా నగరంలో పావురాల ఫీడింగ్ సర్వసాధారణంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో వందలాది పావురాలు గుంపులుగా వస్తాయి. ప్రతి రోజూ ఉదయం వేళల్లో ప్రజలు ఈ పావురాలకు ఆహారం ఇవ్వడం సర్వసాధారణం. ట్యాంక్ బండ్, నాంపల్లి, సికింద్రాబాద్లోని క్లాక్ టవర్.. ఇలా పలు చోట్ల పావురాల ఫీడింగ్ నిత్యం కనిపించే అంశాలు. ఇలా ఫీడింగ్ చేసేవారి కోసం గింజలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే వారు కూడా పుట్టుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఫీడింగ్ ఏ విధంగా జరుగుతుందో. అవగాహన పెరగాలి.. ‘పావురాల విసర్జన ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం తెలియక చాలా మంది పక్షులకు ఆహారం ఇస్తారు’ అని నగరానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సబా క్వాద్రి అంటున్నారు. అంతేకాదు పావురాలు, ఇతర పక్షులకు కూడా ఇది శాపంగా మారుతోంది. ‘ఇతర పక్షులను ఆకర్షించడానికి కొన్ని గింజలను బయట పెడుతాం. కానీ పావురాలు ఆ ప్రాంతాలను హైజాక్ చేసి ఇతర పక్షులకు ఉద్దేశించిన ఆహారాన్ని దక్కించుకుంటాయి’ అని సబా వెల్లడించారు. ముంబై వంటి నగరాల్లో చేసినట్లుగానే, పావురాలకు ఇష్టారాజ్యంగా ఆహారం అందించడాన్ని నివారించేందుకు జరిమానా విధించడమే మంచిదని ఆమె సూచిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో పావురాలు ఉంటున్నాయి. ‘విశ్వవిద్యాలయ వీధులను శుభ్రం చేసే స్వీపర్ల నుంచి భవనాల్లో నివసించే విద్యార్థుల వరకు, చాలా మంది పావురాల బిందువుల ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది’ అని వర్సిటీ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఉదయం వేళల్లో పావురాలకు ఆహారం ఇవ్వొద్దని చెప్పేందుకే ఓయు ప్రత్యేకంగా ఒక భద్రతా అధికారిని నియమించిందని సదరు ఉద్యోగి వివరించారు. అంతేకాక వర్సిటీ భవనాల వెలుపల పావురాలకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. విసర్జన.. విషమౌతోంది.. పావురాల ప్రభావానికి ముఖ్యంగా విసర్జనకు ఎక్కువ కాలం గురికావడం వల్ల వివిధ రకాల హానికరమైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయని, ఫలితంగా ఇన్ఫెక్షన్లు, పలు రకాల వైరస్లు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. విసర్జనాలు ఎండిపోయినప్పుడు, అవి దుమ్ము రూపంలో గాలిలోకి ఎగిరి, ఊపిరి తీసుకునే సమయంలో గాలి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను చేరతాయి. ఈ క్రమంలోనే హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్కు కారణమవుతోంది. ఇది కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్లు పెంపుడు కుక్కలు, పిల్లుల వెంట్రుకల ద్వారా వచ్చే అలెర్జీల కంటే కూడా ప్రమాదకరంగా ఉంటాయి. పావురాల విసర్జన ఊపిరితిత్తుల వాపుకు కారణమవుతాయి. ఒక్కోసారి అవయవాలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్.. ఎలా గుర్తించాలి? పావురాల విసర్జన వల్ల సోకే ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రారంభ దశలో నిరంతరం పొడి దగ్గు వస్తుంది. దీనికి యాంటీబయాటిక్స్, బ్రోంకోడైలేటర్లను ఉపయోగించినా ఉపశమనం దొరకదు. దగ్గు రెండు నుంచి మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగిన క్రమంలో తదుపరి పరీక్షల కోసం పల్మనాలజిస్ట్ను సంప్రదించాల్సి ఉంటుంది.పలు దేశాల్లోనూ.. వెనిస్ నగరంలోని చారిత్రాత్మక చతురస్రాల్లో పావురాలకు ఆహారం నిషేధించారు. ఈ ఫీడింగ్కు సింగపూర్ భారీ జరిమానాలు విధిస్తోంది. అలాగే న్యూయార్క్, లండన్ కూడా దాణా ప్రదేశాలను నియంత్రించాయి. మన దేశంలో ముంబై, థానె, పుణెలో కేసులు నమోదు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా పావురాల ఫీడింగ్ను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోనుందని తెలుస్తున్న నేపథ్యంలో మన నగర పరిస్థితి ఏమిటని పలువురు నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. -
వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..
‘కన్ను లేనిదే కలికాలమే లేద’ని సామెత. అయితే వ్యాధుల్లేకుండా కూడా ఈ కలికాలం లేదు. పైగా ఈ వ్యాధులన్నీ అంతటి కీలకమైన కంటిని దెబ్బతీసే అవకాశం లేకపపోలేదు. డయాబెటిస్, రక్తపోటు వంటివి కనిపించినప్పుడు ఇంకేవైనా అవయవాలు దెబ్బతిన్నాయో చూడటంతోపాటు డాక్టర్లు కంటి పరీక్షలూ విధిగా నిర్వహిస్తారు. అలాగే మైగ్రేన్ మొదలుకొని థైరాయిడ్, రక్తహీనత (అనీమియా) వరకు ఎన్నో రకాల వ్యాధులు కంటి చూపుపై తమ దుష్ప్రభావాన్ని చూపే అవకాశముంది. అందుకే నేరుగా కంటికి వచ్చే ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో, వాటి వల్ల కంటికి వచ్చే సమస్యలేమిటో తెలుసుకుందాం...ఎవరిలోనైనా ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో లేదా ఆ అవయవం ఏ వ్యవస్థదైతే ఆ వ్యవస్థకు మాత్రమే పరిమితమని అపోహ పడుతుంటాం. ఉదాహరణకు రక్తహీనత ఏర్పడిందంటే... అది రక్తం సరఫరా అయ్యే అన్ని అవయవాలతో పాటు కంటిపైనా తన దుష్ప్రభావాన్ని చూపవచ్చు. ఇక థైరాయిడ్కు ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్కు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. అలా కంటిపై ప్రభావం చూపేందుకు అవకాశమున్న కొన్ని ఆరోగ్య సమస్యలూ, వ్యాధులు, కండిషన్స్ తాలూకు ఉదాహరణలు... డయాబెటిస్ రక్తపోటు థైరాయిడ్రక్తహీనత (అనీమియా) ∙కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్ ∙ఆటోఇమ్యూన్ డిసీజెస్ ∙కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని ట్యూమర్లు (గడ్డలు) ∙వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల (హెరిడిటరీ) వ్యాధులు. ఇవి మాత్రమే కాదు... మనం వాడే కొన్ని రకాల మందులు, మన హార్మోన్లలో చోటుచేసుకునే అసమతౌల్యతలు... ఇవి కూడా కంటిపైన దుష్ప్రభావాలను చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులు ఉన్నవారు, కొన్ని మందులు తీసుకునేవారు విధిగా వాటి వల్ల తమ కంటిపై ఏదైనా చెడు ప్రభావాలు కనిపిస్తాయా అని తెలుసుకోవాలి. అలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలి. కొన్ని జబ్బులూ... కంటిపై అవి చూపే దుష్ప్రభావాలు...డయాబెటిస్ఈరోజుల్లో ఇంటికి ఒకరికైనా ఉండే లైఫ్స్టైల్ వ్యాధి ఇది. ఈ సమస్య వచ్చినవారిలోని కనీసం 20 శాతం మందిలో దాని దుష్ప్రభావాలు కంటిపైనా పడే అవకాశాలుంటాయి. డయాబెటిస్ వల్ల కంటికి వచ్చే వ్యాధులివే...డయాబెటిక్ రెటినోపతి : కంటివెనక ఉండే రెటీనా అనే తెరపై పడే ప్రతిబంబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనం చూడగలం. డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడంతో రెటినాకు అందాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అందకపోవడంతో రెటీనా పనితీరు క్రమక్రమంగా తగ్గే అవకాశముంటుంది. ఫలితంగా దృష్టిలోపం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే డయాబెటిస్తో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలూ, కంటి నరాలు మొద్దుబారుతున్నాయా అన్న విషయాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. గ్లకోమా : డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అనే గ్లకోమా బారిన పడే ముప్పు ఉంటుంది. గ్లకోమా ఉన్నవాళ్లలో కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరిగి మనం చూసే దృష్టి విస్తృతి (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా తగ్గి΄ోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గ్లకోమా కండిషన్ ఏమైనా వచ్చిందా అని తరచూ కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటకార్ట్ : కంట్లోని లెన్స్ తన పారదర్శకతను కోల్పోయే కండిషన్ను కాటకార్ట్ అంటారన్న విషయం తెలిసిందే. వయసు పెరగడమే (ఏజింగ్ మాత్రమే) కాకుండా డయాబెటిస్ వల్ల కూడా కాటకార్ట్ వచ్చే అవకాశమున్నందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారు క్యాటరాక్ట్కు సంబంధించిన పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్లు ముందుగానే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఆప్టిక్ న్యూరోపతీ : డయాబెటస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. అన్ని నరాలతో పాటు ఆప్టిక్ నర్వ్కు కూడా ఈ ముప్పు పొంచి ఉంటుంది. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపునిచ్చే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితమంతా చీకటయ్యే ముప్పు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, వ్యాయామం చేస్తూ రక్తంలో చక్కెర మోతాదులను ఎప్పుడూ అదుపులో పెట్టుకుంటూ ఉండటం క్రమం తప్పకుండా తమ వ్యక్తిగత వైద్యులతో పాటు కంటి డాక్టర్ ఫాలో అప్లో ఉండటం.రక్తపోటు (హైపర్టెన్షన్)రక్తపోటు ఉన్నవారిలో కొందరికి అకస్మాత్తుగా చూపు కొంత మసకబారవచ్చు. లేదా దాదాపుగా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా... రెటీనాకు సంబంధించిన ప్రధాన రక్తనాళం (సిర)లోగానీ లేదా ఇతరత్రా ఏదైనా చిన్న రక్తనాళం (బ్రాంచ్ ఆఫ్ బ్లడ్ వెసెల్)లోగానీ రక్తం గడ్డకట్టి క్లాట్ ఏర్పడి అది అడ్డుపడే ముప్పు ఉండవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి రక్తప్రవాహానికి ఆ క్లాట్ అడ్డుపడవచ్చు. ఆప్టిక్ న్యూరోపతి అనే నరాలకు సంబంధించిన సమస్య రావచ్చు.కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్లో రక్తస్రావం కావచ్చు. గ్లకోమా వచ్చే ముప్పు కూడా ఉంటుంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తుండాలి ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. డిస్లిపిడేమియారక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ వంటివి) ఉండాల్సిన మోతాదుల్లో కాకుండా హెచ్చుతగ్గులతో ఉన్నప్పుడు కంటి సమస్యలు రావచ్చు. అవి చూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... కొవ్వులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి తాము తీసుకున్న కొవ్వులు దహనమయ్యేలా (బర్న్) అయ్యేలా వ్యాయాయం చేయాలి డాక్టర్లు కొవ్వుల మోతాదులను తగ్గించే మందులు సూచిస్తే వాటిని తప్పక వాడాలి. రక్తహీనత (అనీమియా)మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే దేహంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్నూ, పోషకాలను మోసుకెళ్తుంటాయన్న విషయం తెలిసిందే. అనేక రకాల కారణాలతో కొంతమందిలో ఈ ఎర్రరక్తకణాల సంఖ్య (ఆర్బీసీ) తక్కువగా ఉండే కండిషన్ను రక్తహీనత (అనీమియా) అంటారు. మరికొందరిలో రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్ను మోసుకు΄ోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్) కంటిలోని లెన్స్ తన పారదర్శకత కోల్పోవడం నరాల సమస్య వంటివి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... అనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / ఐరన్ సప్లిమెంట్లు ఉన్న మందులు వాడటం ∙ఐరన్, ఇతరత్రా విటమిన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవడం. మైగ్రేన్ఇది ఒక రకం తలనొప్పి. తరచూ వస్తూ పోతూ... చాలా తీవ్రంగా బాధించే ఈ తలనొప్పి చాలామందిలో నుదుటికి ఒకవైపే రావచ్చు. అందుకే కొందరు దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా పిలుస్తారు. టీనేజ్ పిల్లల్లో తీవ్రంగా వచ్చి వాళ్ల చదువుపై కూడా ప్రభావం చూపే ఈ నొప్పిలో కన్ను కూడా చాలా నొప్పిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. దాంతో పాటు కంటికి సంబంధించిన ఈ కింద లక్షణాలూ కనిపిస్తాయి. అవి... చూపు సరిగా కనిపించకుండా మసకమసగ్గా కనిపించడం నుదుటి మీద ఒకవైపున లేదా ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి ఉండటం తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం. పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...కొన్ని అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసనా లేదా అగరుబత్తీల వాసనలు మైగ్రేన్ను ప్రేరేపించి వెంటనే తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఇలా మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలను ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. తమకు తలనొప్పి ఏ అంశం వల్ల వస్తుందో గుర్తించి దాని నుంచి దూరంగా ఉండటం వల్ల దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఇక మైగ్రేన్కు సంబంధించి డాక్టర్లు రెండురకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... నొప్పి తక్షణమే తగ్గేందుకు చేసే చికిత్స, రెండోది దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకు ఇచ్చే ప్రివెంటివ్ చికిత్స. ఈ రెండు రకాల ఈ మందులను బాధితులు తప్పనిసరిగా వాడాలి. గుండెజబ్బులుకొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై దుష్ప్రభావాన్ని చూపవచ్చు. గుండెజబ్బుల కారణంగా కొందరిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు... అకస్మాత్తుగా చూపు మందగించడం తాత్కాలికంగా చూపు కోల్పోవడం కంటి చూపునకు / దృష్టిజ్ఞానానికి సహాయపడే నరానికి (ఆప్టిక్ నర్వ్కు) సంబంధించిన సమస్యలు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...అసలు సమస్యకు (అండర్లైయింగ్ హార్ట్ ప్రాబ్లమ్కు) చికిత్స తీసుకోవడం వల్ల దాని కారణంగా వచ్చే కంటి సమస్యలూ తగ్గుతాయి. అలాగే తరచూ కంటి పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి. సోరియాసిస్సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. సొంత రోగ నిరోధకశక్తి బాధితులపై ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమయ్యే అవకాశాలుంటాయి. ఈ జబ్బు ఉన్నవాళ్లలో...రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరాలరా ΄÷రకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్) కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంటిలో ఉండే కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...సోరియాసిస్కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి.కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్ కొలాజెన్ అనేది శరీరంలోని ఒకరకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి మన కొలాజెన్ ప్రోటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు కనిపిస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్గా చెబుతారు. ఆ వ్యాధులేమిటంటే... సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ) ∙కీళ్లనొప్పులు (జాయింట్పెయిన్స్) రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు. ఎస్ఎల్ఈ (లూపస్) : లూపస్ అంటే వుల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్ఎల్ఈ) అని చెబుతారు. లక్షణాలు... ముక్కుపై నుంచి చెంపలపైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్లలా (ర్యాష్) వస్తుంది. సూర్యకాంతి (ఫోటోసెన్సిటివిటీతో) వల్ల ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు. పాలిపోయినట్లుగా ఉండే చర్మం ∙కొందరిలో వెంట్రుకల మూలాలు మూసుకుపోవడం (లూపస్లో ఇది ఒక రకం). దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో ర్యాష్ చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా ర్యాష్ కూడా రావచ్చు కారణం తెలియని జ్వరం ∙బరువు తగ్గడం కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు జాయింట్స్లో వాపు; రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలోలా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇది కేవలం తాత్కాలికం. కొందరు డిప్రెషన్తో ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీళ్ల సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరపాటు పడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి– లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమోనని పరీక్షించాలి. కొందరిలో ఫిట్స్ కొందరిలో జుట్టు రాలడం మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. ఇక ఈ వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్పరిణామమేమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్త΄ోటు పెరిగి (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు. కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు. వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ); రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్); స్క్లెరా పొరకు ఇన్ఫ్లమేషన్; కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు.పిల్లల్లోనూ... పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)–పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ప్రభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆర్నెల్లకు ఓమారు వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు : ప్రధానమైన సమస్యలైన సిస్టమిక్ లూపర్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ), కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా ప్రతి ఆర్నెల్లకోమారు పరీక్షలు చేయించడం అవసరం. డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!) -
నార్కోలెప్సీ: స్లీప్లోకి స్లిప్!
కొందరు ఎక్కడ ఉంటే అక్కడ నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా బస్సెక్కగానే అలా నిద్రపోతుంటారు. వాళ్లను చూసినప్పుడు కొంతమంది వాళ్లంత అదృష్టవంతులు లేరని అంటుంటారు. ఇలా పడుకోగానే అలా నిద్రపట్టేయడం మంచిదే. అయితే నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్రపట్టడానికీ... తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోవడానికీ తేడా ఉందంటున్నారు వైద్యనిపుణులు. కొందరు కూర్చుని పనిచేస్తూ చేస్తేనే... మరికొందరు కూర్చుని తింటూ తింటూ కూడా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ‘నార్కొలెప్సీ’ అనే స్లీప్ సమస్య ఉన్నవారు పట్టపగలు తాము పని చేస్తూ చేస్తూనే తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. దీన్ని ఒక రకం స్లీప్ డిజార్డర్గా పరిగణించాలి.నార్కోలెప్సీ ఎలా వస్తుందంటే...? నిద్రలో కొన్ని దశలు అంటే స్లీప్ సైకిల్స్ నడుస్తుంటాయి. మొదట ప్రాంరంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ దశలవారీగా స్లీప్సైకిల్స్ కొనసాగుతుంటాయి. వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఈ ఆర్ఈఎమ్ నిద్ర దశ సాధారణం కంటే వేగంగా వచ్చేస్తుంది. ఈ దశలో కను΄ాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.ఎందుకో ఇప్పటికీ పెద్దగా తెలియదు... ఈ సమస్య జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి కుటుంబాల్లోని పిల్లల్లో కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. అయితే నార్కొలెప్సీ ఎందుకొస్తుందనే అంశం ఇంకా నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ సమస్యతో బాధపడేవారు హెవీ మెషిన్స్, డ్రైవింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. చికిత్స... నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిసెతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. వారు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. ఇప్పటికి దీనికి పూర్తిగా చికిత్స లేక΄ోయినా నార్కోలెప్సీతో బాధపడేవారు స్లీప్ స్పెషలిస్టులను సంప్రదిస్తే... వారు కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్, యాంఫిటమైన్ మందులతో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చేలా చూస్తారు. అలాగే ఈ సమస్య తాలూకు మేనేజ్మెంట్ ఎలాగో సూచిస్తారు. డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్, పల్మునాలజిస్ట్, హైదరాబాద్ (చదవండి: -
కాలమూ కాటేస్తది..! పక్షవాతంపై సీజన్స్ ప్రభావం..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం రావడానికి మన సీజన్స్ కూడా ఓ అంశంగా ఉంటాయన్న విషయం తెలుసా? వేసవిలో ఒక రకంగా, వర్షకాలంలో మరో రకంగా, చలికాలంలో ఇంకో రకంగా ఇలా వేర్వేరు తీరుల్లోస్ట్రోక్ వచ్చేలా ఆయా కాలాలు పక్షవాతాన్ని పరోక్షంగా ట్రిగర్ చేస్తాయన్న సంగతీ మీకు తెలుసా? చాలామందికి తెలియని ఈ విషయాన్ని చూద్దాం... రండి...స్ట్రోక్ రావడానికి ఆ సీజన్ తాలూకు వాతావరణం కూడా కొంత మేర కారణమవుతుంటుంది. అలా కాలాలకూ స్ట్రోక్కూ సంబంధముంటుంది. ఆరుబయట అప్పుడుండే వాతావరణం దేహంలోపల ఉండే మెదడు స్ట్రోక్కు ఎలా కారణమవుతుందన్న కోణంలో చూసినప్పుడు... వాతావరణంలోని అప్పుడుండే ఉష్ణోగ్రత, తేమ... ఆమాటకొస్తే అప్పుడున్న వాతావరణంలోని గాలిలోని కాలుష్యాలూ (ఎయిర్ క్వాలిటీ) ఇవన్నీ స్ట్రోక్ను ప్రేరేపిస్తాయి. అదెలాగో తెలుసుకునే ముందు అసలు స్ట్రోక్ (బ్రెయిన్ స్ట్రోక్ / పక్షవాతం) అంటే ఏమిటో చూద్దాం.బ్రెయిన్ స్ట్రోక్ అంటే... అన్ని అవయవాల్లాగే మెదడుకూ ప్రతినిత్యం రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అందుతుండాలి. పైగా మెదడు కీలకమైన అవయవం కావడంతో మొత్తం దేహానికి సరఫరా అవుతుండే రక్తంలోంచి 20 శాతం మెదడుకే సప్లై అవుతుంటుంది. ఇంతటి కీలకమైన మెదడుకు ఏ కారణంగానైనా రక్తసరఫరా జరగక΄ోవడం వల్ల పక్షవాతం / స్ట్రోక్ వస్తుంది. ఇందులోనూ మళ్లీ రెండు రకాలుగా రక్తం అందకపోవడం జరుగుతుంది. అవి... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడులోని రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల అక్కడి భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగక వచ్చే స్ట్రోక్ను ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏయే భాగాలకు రక్తం అందదో ఆ సెంటర్స్ నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడులో రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తస్రావం అయి వచ్చే పక్షవాతాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏ భాగంలో రక్తస్రావం అవుతుందో ఆ భాగం నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 3) ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) : ఇది ఒక రకంగా చూస్తే ఇస్కిమిక్ అటాకే గానీ... ఇందులో తొలుత పక్షవాతం లక్షణాలు కనిపించాక మళ్లీ అవి 24 గంటలలోపు తగ్గి΄ోయి బాధితులు దాదాపుగా రికవర్ అయితే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’గా చెబుతారు. అంటే... భారీ భూకంపం రావడానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల (ట్రిమర్స్)లాగే... ఓ పెద్ద స్ట్రోక్ రావడానికి ముందస్తు సూచనగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ ఈ మినీ–స్ట్రోక్ తాలూకు చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడక΄ోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్గా పరిగణిస్తారు. ఇక స్ట్రోక్ లక్షణాలైన... దేహంలోని ఒకవైపు భాగాలు బలహీనంగా మారడం, అయోమయం, మాట్లాడటంలో ఇబ్బంది / మాట ముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు భాగంపై నియంత్రణ కోల్పోవడం వంటివి కనిపిస్తే... ఆ బాధితులను తక్షణం ఆసుపత్రికి తరలించాలి. చివరగా... వాతావరణాన్నీ అందులోని మార్పులనూ మనమెవరమూ మార్చలేమూ, నియంత్రించలేం. అయితే మన వ్యక్తిగత అలవాట్లతో మంచి జీవనశైలి మార్పులతో ఆరోగ్యంగా ఉండటం ద్వారా పక్షవాతం ముప్పును నివారించగలం. కాబట్టి మంచి జీవనశైలితో వ్యక్తిగత ఆరోగ్య నిర్వహణతో స్ట్రోక్ ముప్పును తప్పించుకోవచ్చు.వేసవిలోని వేడిమి...డీ–హైడ్రేషన్ : ఎండాకాలంలో వాతావరణంలో విపరీతమైన వేడిమి ఉంటుంది. దాంతో ఒంట్లోని నీళ్లు చెమట రూపంలో చాలా ఎక్కువగా వాతావరణంలోకి చేరుతుండటంతో దేహం డీ–హైడ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే రక్తంలోని నీటిపాళ్లు తగ్గుతాయో అప్పుడు రక్తం చిక్కబడుతుంది. చిక్కబడ్డ రక్తం కాస్తా క్లాట్స్కు కారణమవుతాయనీ, దాంతో అవి స్ట్రోక్నూ ప్రేరేపించవచ్చన్న విషయం తెలిసిందే. వడదెబ్బ (హీట్స్ట్రోక్) : వడదెబ్బ కూడా స్ట్రోక్ ముప్పును పెంచడంతోపాటు ఆ టైమ్లో కనిపించే లక్షణాలనూ కనిపించేలా చేస్తుంది. అత్యంత ఎక్కువగా అలసటకూ / నీరసానికి గురి కావడం (ఓవర్ ఎగ్జర్షన్) : వేసవిలో తక్కువగా శ్రమ చేసినప్పటికీ ఆ శ్రమ తాలూకు లక్షణాలై అలసటా, నీరసం, నిస్సత్తువగా, తీవ్రంగా చెమటలు పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఎర్రటి ఎండలో దేహానికి తీవ్రమైన శ్రమ కలిగించడం జరిగితే... ఒకవేళ బాధితుల్లో ఇంతకు మునుపే రక్త΄ోటు వంటి రిస్క్ఫ్యాక్టర్లు ఉన్నవారైతే వాళ్లలో స్ట్రోక్ ముప్పు మరింతగా పెరుగుతుంది.వర్షాకాలంలో...ఇన్ఫెక్షన్లు : నీళ్లు పెరగడం కారణంగా అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియల్ / వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా దేహంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల. రక్తపోటులో హెచ్చుతగ్గులు (బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్) : వాతావరణంలో వర్షం కురవబోయే ముందర తీవ్రమైన ఉక్కబోత లేదా వర్షం కురవగానే ఉండే చలి... ఇలా వర్షాకాలంలో వాతావరణంలోని వేడిమి అస్థిమితంగా ఉండటం వల్ల దానికి అనుగుణంగా రక్త΄ోటూ మారుతుంటుంది. ఇలా రక్త΄ోటు లోని హెచ్చుతగ్గులు (బీపీ ఫ్లక్చుయేషన్స్) స్ట్రోక్ ముప్పును పెంచుతాయి. వాతావరణంలోని అధిక తేమ, డీ హైడ్రేషన్ : మాన్సూన్ సీజన్లో వర్షం కురవబోయే ముందరి ఉక్క΄ోతతో దేహం డీ–హైడ్రేషన్కు గురికావడం... దాంతో రక్తం చిక్కబడటం వంటి అంశాలు రక్త΄ోటు ముప్పును పెంచుతాయి. ముప్పును పెంచే వ్యక్తిగత అంశాలు : నిజానికి సీజన్ల తాలూకు ఈ మార్పులన్నీ స్ట్రోక్ ముప్పును ప్రతి ఒక్కరిలోనూ సమానంగా పెంచవు. అంతకు మునుపే వ్యక్తిగతంగా రిస్క్ ఎక్కువగా ఉన్నవారిలో ఇవి స్ట్రోక్ ముప్పును పెంచుతాయి.చలికాలంలో...వాతావరణంలోని వేడిమి ఒక సెంటీగ్రేడ్ తగ్గినా... అది స్ట్రోక్ వచ్చే ముప్పును నాలుగు శాతం పెంచుతుందన్నది నిపుణులు గమనించిన అంశం. వాసోకన్స్ట్రిక్షన్ : చలికాలంలోని తీవ్రమైన చల్లదనం కారణంగా రక్తనాళాలు సన్నబారతాయి. ఇలా రక్తనాళాలు సన్నబారడాన్ని వాసోకన్స్ట్రిక్షన్ అంటారు. నాళం సన్నబారడంతో రక్తం ప్రవహించే వేగం (రక్తపోటు / బీపీ) పెరుగుతుంది. రక్తపు సాంద్రత పెరగడం : చల్లదనం కారణంగా అన్ని ద్రవాలూ చిక్కబడ్డట్టే రక్తమూ చిక్కబడుతుంది. ఇలా రక్తం చిక్కబడటం అన్నది రక్తంలో క్లాట్స్ పెరిగేలా చేసి స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. చురుకుదనం తగ్గడం : చలికాలంలో జనం వేసవిలో ఉన్నంత చురుగ్గా ఉండరు. వాళ్ల కదలికలూ మందగిస్తాయి. ఇలా చురుకుదనం తగ్గి, కదలికలు తగ్గడంతో దేహానికి అవసరమైన వ్యాయామం అందక బరువు పెరగుతారు. అంతేకాదు... చురుకుదనం తగ్గడంతో రక్తంలో (కొలెస్ట్రాల్ వంటి) కొవ్వుల మోతాదులూ పెరుగుతాయి. బరువూ, కొవ్వులూ పెరగడం స్ట్రోక్ ముప్పును పెంచుతుందన్న విషయం తెలిసిందే. డీ–హైడ్రేషన్ : చలికాలంలో నీళ్లు తాగడం తగ్గుతుంది. దాంతో రక్తంలో నీటి మోతాదులూ తగ్గడంతో రక్తం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడటమన్నది స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు : చలికాలంలో ఫ్లూ, శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగడంతో... అది స్ట్రోక్ ముప్పు కూడా పెరిగేలా చేస్తుంది. వాతావరణ కాలుష్యాలు : చలికాలంలో వాతావరణంలోకి చేరే పొగ, కాలుష్యాలన్నీ అప్పుడు కురిసే మంచు (ఫాగ్)తో కలిసి ‘స్మాగ్’ అనే మంద΄ాటి కాలుష్యాల తెరలు ఏర్పడేలా చేస్తాయి. కాలుష్యాలతో కూడిన స్మాగ్ కూడా స్ట్రోక్ ముప్పును పెంచేస్తుంది. నివారణ...ప్రతి ఒక్కరూ తగినన్ని నీళ్లూ ద్రవాహారాలు తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండటం. అన్ని సీజన్లలోనూ ఆయా సీజన్లో దొరికే పోషకాలతో కూడిన మంచి సమతులాహారం తీసుకోవడం. ఏ సీజన్లోనైనా తగినంత వ్యాయామం చేస్తూ, దేహాన్ని చురుగ్గా ఉంచడం. కంటినిండా తగినంత నిద్రపోతుండటంతోపాటు ఒత్తిడి లేకుండా చూసుకోవడం.ఒకవేళ అధికరక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉంటే... మందులతో వాటిని ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. (చదవండి: ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?) -
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..?
నాకు ఇటీవల హెపటైటిస్–బీ వచ్చిందని తెలిసింది. ఇప్పుడు నేను ఎనిమిది నెలల గర్భవతిని. మా కుటుంబంలో కొంతమందికి కూడా ఇదే వ్యాధి ఉంది. ఈ విషయం డాక్టర్కు ముందుగా చెప్పాలా? నా బిడ్డకు కూడా ఈ వ్యాధి వస్తుందా?– జ్యోతి, హైదరాబాద్ గర్భవతిగా ఉన్న మీరు ఈ హెపటైటిస్–బీ వంటి వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ఒక వైరస్ వలన కలిగే వ్యాధి. ఇది రక్తం ద్వారా వ్యాపించి, మీ లివర్ను ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో వైరస్ ఉంటే, బిడ్డ పుట్టే సమయంలో తల్లి రక్తంతో సంపర్కంలోకి వచ్చేటప్పుడు వైరస్ బిడ్డకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన విషయం. శిశువులకు వైరస్ సోకినప్పుడు దాదాపు తొంభై శాతం శాశ్వత లివర్ వ్యాధిగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే మీరు ఇప్పుడే మీ వైద్యులకు చెప్పాలి. ముందుగా సమాచారం ఉంటే తగిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. బిడ్డ పుట్టిన వెంటనే ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించేందుకు ప్రత్యేకమైన రక్షణ చికిత్సలు ఉన్నాయి. బిడ్డ పుట్టిన నాటికి రెండు పనులు చేయాలి. ఒక్కటి ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది వైరస్ను వెంటనే అడ్డుకుంటుంది. రెండు, హెపటైటిస్–బీ టీకా మొదటి మోతాదును ఇవ్వాలి. ఈ రెండు కూడా బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపల చేయాలి. తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరు మోతాదుల టీకా షెడ్యూలును పూర్తి చేయాలి. మొదటి మోతాదు పుట్టిన వెంటనే, రెండవ మోతాదు నాలుగు వారాల్లో, మూడవది ఎనిమిది వారాల్లో, నాల్గవది పన్నెండు వారాల్లో, ఐదవది పదహారు వారాల్లో, ఆరవది ఇరవై నెలల్లో వేయాలి. ఆరు మోతాదులు పూర్తయిన తర్వాత బిడ్డకు రక్తపరీక్ష చేయాలి. అప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి ఏర్పడిందో లేదో తెలుస్తుంది. తల్లి ఈ సంగతిని వైద్యులకు ముందుగానే చెప్పడం వల్లే సాధ్యమవుతుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డను సంపూర్ణంగా రక్షించవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా తగిన సమాచారం డాక్టర్కి ఇవ్వండి. నేను గర్భధారణకు ప్లాన్ చేస్తున్నాను. కొంతమంది రుబెల్లా వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని చెబుతున్నారు. కాని, ఇదివరకు నాకు ఈ వ్యాధి వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పండి.– అనిత, రాజమండ్రిమీరు గర్భధారణ కోసం సిద్ధమవుతుంటే, రుబెల్లా వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రుబెల్లా అనేది ఒక వైరస్ వలన వచ్చే వ్యాధి. ఇది దగ్గుతో, తుమ్ముతో గాలిలోకి వచ్చే జలకణాల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది తేలికపాటి జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో కనిపిస్తుంది. కాని, గర్భధారణ సమయంలో ఈ వైరస్ సోకితే, బిడ్డకు తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు కలగవచ్చు. ఈ వ్యాధి గర్భంలో ఉన్న శిశువుకు సోకితే, చెవిటితనం, కాటరాక్ట్ వంటి కంటి లోపాలు, గుండెకు సంబంధించిన లోపాలు, మెదడు ఎదుగుదలపై ప్రభావం, లేదా గర్భస్రావం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ తొలి మూడు నెలల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నివారించడానికి ముందుగా ఒక రక్త పరీక్ష చేయించుకోవాలి. రుబెల్లా ఐజీజీ అనే పరీక్ష చేసి, మీ శరీరంలో ఇప్పటికే ఈ వైరస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉన్నాయా లేదా తెలుసుకుంటారు. యాంటీబాడీలు ఉన్నట్లయితే, మీ శరీరానికి రక్షణ ఉంది కాబట్టి టీకా అవసరం ఉండదు. యాంటీబాడీలు లేనట్లయితే, తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఎమ్ఎమ్ఆర్ (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) రూపంలో ఇవ్వబడుతుంది. ఒక మోతాదుతో ప్రారంభించి, అవసరమైతే రెండో మోతాదును కొన్ని వారాల గ్యాప్లో వేయొచ్చు. అయితే, వ్యాక్సిన్ వేసిన తరువాత కనీసం రెండు నెలల పాటు గర్భం ధరించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో శరీరం రక్షణ ఏర్పరచుకుంటుంది. ఇది శిశువును రక్షించడంలో కీలకంగా పనిచేస్తుంది. టీకా వల్ల కొన్నిసార్లు తేలికపాటి జ్వరం రావచ్చు. మీరు ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్ వేసుకున్నారా అనే విషయం స్పష్టంగా గుర్తులేనట్లయితే, పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. టీకా అవసరమైతే ఇప్పుడే వేయించుకుని, రెండు నెలలు గడిచిన తరువాత గర్భధారణకు ప్లాన్ చేసుకోండి. ఇలా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఎలాంటి హానికి గురికాకుండా, ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉంటుంది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్(చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్టాపిక్గా ఊబకాయం..) -
ఫ్యాటీ లివర్కు బొప్పాయితో చెక్
కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుని పోయే ఫ్యాటీ లివర్ వ్యాధికి ఇతర ఔషధాలకన్నా బొప్పాయి మంచి మందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో వారేం చెబుతున్నారో చూద్దాం...బొప్పాయిలో విటమిన్ సి, బీటా–కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.లివర్ డిటాక్స్కు మద్దతు బొప్పాయిలో పపైన్ మరియు కైమో΄ాపైన్ వంటి ఎంజైమ్లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. పరోక్షంగా కాలేయం నిర్విషీకరణ విధులకు మద్దతు ఇస్తాయి. ఈ ఎంజైమ్లు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో, కాలేయంపై జీర్ణ భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.కాలేయ ఎంజైమ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. బొప్పాయి వంటి కాలేయానికి అనుకూల మైన పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్ ప్రొఫైల్స్ మెరుగుపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాపును తగ్గిస్తుందిబొప్పాయిలోని కొన్ని సమ్మేళనాలు కాలేయ కణజాలాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయిలోని పోషక విలువలుతక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్, సహజ చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ ఉండకపోవడమనే లక్షణాలు కొవ్వు కాలేయ ఆహారాన్ని అనుసరించే వారికి బొ΄్పాయిని ఆదర్శవంతమైన పండుగా చేస్తాయి. ఎంత తినాలి?మితంగా తినడం చాలా ముఖ్యం. రోజుకు ఒక చిన్న గిన్నె బొప్పాయి – ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్గా – సహజ చక్కెరలపై ఓవర్లోడ్ లేకుండా అవసరమైన పోషకాలను అందిస్తుంది. కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారంతో దీన్ని ఎల్లప్పుడూ జత చేయండి. -
మంచి నిద్ర కోసం..ఏడు చిట్కాలు..!
-
పిల్లి పోజుతో వెన్నునొప్పి దూరం!
-
'వైకింగ్స్ డైట్' అంటే..! ఆరోగ్యానికి మంచిదేనా?
చాలా రకాల డైట్లు గురించి విన్నాం. ఇదేంటి 'వైకింగ్స్ డైట్(Viking Diet)'. పేరే ఇలా ఉంది. ఇక డైట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది కదూ..!. అదేం లేదండి అసలు అలా పిలవడానికి పెద్ద కథే ఉంది. ఆలస్యం చేయకుండా అదేంటో చకచక చదివేయండి మరి..'వైకింగ్స్' అంటే ఎనిమిదో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం వరకు స్కాండినేవియా నుంచి వచ్చిన సముద్రయాన ప్రజల(Scandinavian people)ను వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లు దాడిదారులు లేదా సముద్రదొంగలు అని కూడా అంటారు. వలసదారులుగా ఐరోపా వచ్చి అక్కడ స్థానిక వ్యాపారాలపై దాడుల చేసి స్థిరపడ్డ ప్రజలను ఇలా వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లంతా డెన్మార్క్, నార్వే, స్వీడన్ నుంచి వలస వచ్చిన వారు. అలా వలస వచ్చేటప్పుడూ స్థానికంగా దొరికే వాటినే తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అలా పుట్టుకొచ్చిందే ఈ 'వైకింగ్స్ డైట్'. అయితే ఇది ఆరోగ్యకరమైనది, పైగా అన్ని విధాల మంచిదని నిపుణులు చెబుతుండటం విశేషం. అలాగే ఈ డైట్లో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు తెలిపారు. మరి ఆ డైట్లో ప్రజలు ఏం తినేవారో చూద్దామా..!.'వైకింగ్స్ డైట్' అంటే?దీన్ని 'నార్డక్ డైట్' అని కూడా పిలుస్తారు. ఇది బౌగోళిక స్థానం, సామాజిక స్థితి, సీజన్ ఆధారంగా తీసుకునే ఆహారపదార్థాలను కలిగి ఉంటుంది. తీర ప్రాంతాల్లో నివశించేవారికి చేపలు ప్రదాన ఆహారం. కాబట్టి వాళ్లంతా వైకింగ్స్ కాడ్, హెర్రింగ్, ఈల్ వంటి చేపలను తింటుంటారు. వీటి తోపాటు మస్సెల్స్, ఓస్టర్స్ వంటి సముద్ర ఆహారాన్ని తీసుకునేవారు. అలాగే బెర్రీలు, ఆపిల్స్, ఫ్లమ్స్ వంటి పండ్లుఉ, కాబ్యేజీ, క్యారెట్లు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను కూడా తమ డైట్లో భాగం చేసుకునేవారు. ఆవులు, మేక, గొర్రెల నుంచి పాలు, జున్ను వంటివి తీసుకునేవారు. పైగా ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఉప్పు వేయడం లేదా కిణ్వన ప్రక్రియ వంటి పద్ధతులను వినియోగించేవారు. మంచిదేనా..?ఈ డైట్లో అందుబాటులో ఉన్న ఆహారానికే పరిమితం అవ్వుతూ..ఆరోగ్యకరమైన పోషక పదార్థాలనే తీసుకోవడంతో ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు, పేగు ఆరోగ్యానికి మద్దుతిస్తాయి. పైగా మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్లతో సహా వివిధ జీవనశైలి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దుష్ప్రభావాలు..అయితే ఈ డైట్లో కొన్ని పోషకపరమైన నష్టాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్తో గణనీయమైన మొత్తంలో మాంసం, జంతువుల కొవ్వు ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అధిక కొవ్వు పదార్థం ఆ ప్రజలకు శీతకాలన్ని తట్టుకునేందుకు సహాయపడుతుంది గానీ ఆ సంతృప్త కొవ్వు హృదయ సంబంధ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ డైట్ని అనుసరించేవాళ్లు ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉండి, అధిక కొవ్వు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు నిపుణులు.(చదవండి: మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్?) -
మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్' ?
ఉదయాన్నే నిద్రలేవడం, ఉత్సాహంగా రొటీన్ వర్క్లోకి దూకేయడం... ప్రతిరోజూ ఏమోగానీ, సోమవారం మాత్రం అంత వీజీ కాదు. విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా... సోమవారం ముంచుకొచ్చే బద్ధకం.. మండే అంటే ఒళ్లు మండేలా చేస్తోంది. ఇదే మండే బ్లూస్కి కారణమవుతోంది. ‘మండే బ్లూస్ అనే పదం సాధారణంగా సోమవారం రోజు పని లేదా చదువులను మొదలు పెట్టాల్సిన తప్పనిసరి అవసరం వల్ల కలిగే అలసట, నిరుత్సాహం వంటి భావాలకు అద్దం పడుతోంది. కొంతకాలంగా లెక్కలేనన్ని మీమ్స్, ట్వీట్లు కాఫీ మగ్ నినాదాలకు ‘మండే బ్లూస్‘అనేది ఒక పంచ్లైన్. ఆ పాపం వీకెండ్ దే... వారాంతంలో 2 రోజులపాటు సెలవులు అనే కార్పొరేట్ కల్చర్ విస్తృతంగా వ్యాపించడం ఈ మండే బ్లూస్కి ప్రధాన కారణమవుతోంది. వారంలో ఐదురోజుల పని ముగుస్తుండగానే శుక్రవారం సాయంత్రానికే వీకెండ్ ఉత్సాహం పుంజుకుంటుండగా, శనివారం, ఆదివారం సెలవులు పూర్తయ్యాక సోమవారం మళ్లీ రొటీన్ వర్క్ లేదా స్కూల్/కాలేజ్కు వెళ్లాల్సిన పరిస్థితి మండే బ్లూస్ని సృష్టిస్తోంది. సాధారణంగా సోమవారం ఆలస్యంగా లేచే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనికి కారణం వీకెండ్ రోజుల్లో ఆలస్యంగా నిద్రలేవడమే. పని మొదలు పెట్టే రోజు కాబట్టి సోమవారం పట్ల మానసిక విరక్తి, పని పట్ల ప్రతికూల భావన ఏర్పడుతోంది. ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్నాయ్... వారంలో తొలి నిరుత్సాహకర ప్రారంభం అనేది కేవలం మన ఆలోచనలపై మాత్రమే ప్రభావం చూపడం లేదని, అది మన శారీరక ధర్మాలను కూడా ప్రభావితం చేస్తోందని వైస్ (వీఐసీఇ) రిపోర్ట్ పేరిట జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్లో ప్రచురించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. దీని ప్రకారం.. ఒత్తిడిని అనుభవిస్తున్న వ్యక్తుల్లో కార్టిసాల్ స్థాయిలు ఇతర ఏ రోజు ఒత్తిడిని నివేదించిన వారి కంటే సోమవారాల్లో 23 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ తరణి చందోలా నేతృత్వంలో 3,500 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రాథమిక ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ‘సోమవారం వ్యక్తుల’లో గణనీయంగా పెరిగినట్టు కనిపెట్టింది. మానసికమే కాదు, అంతకు మించి... కార్టిసాల్ దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కావడానికి కీలకమైన బయోమార్కర్ అని పరిశోధకులు వెల్లడించారు. మెదడుకు ముప్పు లేదా ప్రమాదాన్ని గ్రహించినప్పుడు కలిగే ప్రతిస్పందన ఈ హార్మోన్. అంతేకాదు కార్టిసాల్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం, బలహీనమైన రోగనిరోధక శక్తి, రక్తపోటు, మధుమేహం వంటి వాటికి కూడా దారితీస్తున్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే సోమవారం భయం మానసిక స్థితిని దెబ్బతీయడం కంటే మరింత ఎక్కువ హాని కలిగిస్తుంది. అది వ్యక్తుల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. పరిష్కారం..సైకాలజిస్ట్ల కొన్ని సూచనలు.. ప్రణాళికాబద్ధంగా పనిని విభజించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. వారాంతపు రోజుల్లో ఆహారపు అలవాట్లలో అతి మార్పు చేర్పులు చేయవద్దు. శుక్రవారం రోజే సోమవారం నాటి పనులను పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం వర్క్ ప్రెషర్ను దూరం చేస్తుంది. ప్రతీ సోమవారం ఏదైనా కొత్త రకం వ్యాయామం, కొత్త రూట్లో వాకింగ్ వంటివి ప్లాన్ చేయడం ద్వారా కొత్త ఉత్సాహం వస్తుంది. మరోవైపు.. సోమవారాల్లో గుండె సంబంధిత సంఘటనలు పెరగడాన్ని వైద్యులు చాలాకాలంగా గమనిస్తున్నారు. దీన్ని ‘‘మండే ఎఫెక్ట్’’అని పిలుస్తారు. వారంలోని మొదటి రోజున గుండెపోటు, ఆకస్మిక గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గణాంకాల పరంగా గుర్తించారు. ఈ ధోరణికి తరచూ వారాంతపు విశ్రాంతి నుంచి ఆకస్మిక పని వైపు మళ్లిన ఆలోచనలే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహాలను అనుసరించి ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడటం అవసరం. -
రోజుకింత 'పీచు' చాలు..!
షుగర్ ఉన్నవారు, లేదా షుగర్ వచ్చే దశకు (ప్రీడయాబెటిస్) చేరుకున్నవారు నిరంతరం జాగ్రత్తగా ఉండటం అవసరం. మందులు సక్రమంగా వేసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తరచు షుగర్ టెస్ట్ చేయించుకుంటుండాలి. ఇదంతా కూడా ఒక ప్రణాళికలా ఉంటుంది. అయితే ఆ ప్రణాళికను పాటిస్తూనే, మీ షుగర్ను మీరు నియంత్రణలో ఉంచుకోటానికి ఒక తేలికైన మార్గం కూడా ఉంది. అదేమిటంటే, ఆహారంలోకి మీరు తీసుకునే పీచుపదార్థాలను (డైటరీ ఫైబర్) మరికాస్త ఎక్కువ చేయటం! ‘అమెరికన్ డయబెటిస్ అసోసియేషన్’ (ఎ.డి.ఎ.) తాజాగా పూర్తి చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. షుగర్ ఉన్నవారు లేదా షుగర్ వచ్చే దశలో ఉన్నవారు డైటరీ ఫైబర్ను ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని వెల్లడైంది. డైటరీ ఫైబర్ అంటే?పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు వంటి శాకాహారాల్లో కనిపించే ఒక రకమైన కార్బోహైడ్రేటే.. డైటరీ ఫైబర్. ఇతర కార్బోహైడ్రేట్ల (పిండి పదార్థాల) మాదిరిగా ఈ డైటరీ ఫైబర్ మీ శరీరంలో త్వరగా జీర్ణం కాకపోగా, ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతుంది. మీ రక్తప్రవాహంలోకి చక్కెర ప్రవేశించే వేగాన్ని నెమ్మదింపజేస్తుంది జీర్ణకోశంలోని మంచి బాక్టీరియాకు దన్నుగా ఉంటుంది. అధ్యయనంలో ఏం తేలింది?అధ్యయనం కోసం ఎ.డి.ఎ. పరిశోధకులు డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్న 3,000 కంటే ఎక్కువమంది అమెరికన్ల ఆరోగ్య వివరాలను అనేక ఏళ్ల పాటు నిశితంగా పరిశీలించారు. వారు ఎంత ఫైబర్ను తీసుకున్నారు, వారిలో ఎంతమంది ఎంతకాలానికి మరణించారు, మరణించినవారు ఏదైనా ఇతర కారణం వల్ల మరణించారా లేదా గుండె జబ్బుల వల్ల మరణించారా అన్నది చూశారు. ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. వాటి ప్రకారం, ఎక్కువ ఫైబర్ తీసుకున్న వ్యక్తులు ఏ కారణం చేతనైనా చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే వారు ప్రతిరోజూ తీసుకునే ప్రతి అదనపు గ్రాము ఫైబర్కు, వారు మరణించే అవకాశం దాదాపు 2 శాతం తగ్గింది. ఫైబర్తో గుండె ఆరోగ్యంహృద్రోగ మరణాల విషయానికి వస్తే... ఫైబర్కు, గుండె ఆరోగ్యానికి మధ్య సంబంధం కొంచెం సంక్షిష్టంగానే ఉంది. ఎక్కువ ఫైబర్ తీసుకోవటం వల్ల మరణ ప్రమాదం తగ్గింది కాని, అయితే అది ఒక నిర్దిష్ట పరిమితి వరకే. ఫైబర్ వల్ల గుండెకు చేకూరే ప్రయోజనాలు రోజుకు దాదాపు 26 గ్రాముల ఫైబర్తో ఆగిపోయాయి. ఫైబర్ అంతకు మించితే ప్రయోజనం లేకపోగా, ప్రమాదం పెరిగే అవకాశం కనిపించింది. అయినప్పటికీ ఇది పూర్తిగా నిర్ధారణ కాని విషయంగానే మిగిలింది. దీనిని బట్టి ఫైబర్ గుండెకు మంచిదే అయినప్పటికీ, ఎక్కువ తీసుకోవడం అన్నది అంత మంచిది కాకపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.ఇలా చేయండిమీకు ఫైబర్ను తీసుకునే అలవాటు లేకపోతే, కడుపులో అసౌకర్యాన్ని నివారించటం కోసం మొదట కొద్ది మొత్తంలో ఫైబర్ను మీ ఆహారంలో చేర్చుకోండి. మీ జీర్ణ వ్యవస్థలోకి చేరిన ఫైబర్ క్రియాశీలం అవటానికి నీరు తాగటం అవసరం.ఫైబర్ ఫలితాన్ని సంపూర్ణంగా పొందటానికి పండ్ల రసాలు కాకుండా పండ్లుగా తినండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. తృణధాన్యాలను ఎంచుకోండి. తెల్ల బియ్యం, బ్రెడ్ నుండి బ్రౌన్ రైస్, హోల్–వీట్ బ్రెడ్కు మారండి.∙చిక్కుళ్లను మీ ఆహారానికి జోడించండి. బీన్స్, కాయధాన్యాలు, సెనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మాంసకృత్తులు కూడా దండిగా ఉంటాయి. తీసుకోవలసిన జాగ్రత్తలుఒకేసారి ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల ఉబ్బరం లేదా కడుపులో గ్యాస్ వస్తుంది. కనీసం ఫైబర్ మీకు అలవాటయ్యే వరకైనా పూర్తి మొత్తం ఫైబర్ను తీసుకోకండి. అధిక మోతాదులో ఫైబర్ తీసుకోవడం వల్ల కాల్షియం లేదా ఇనుము వంటి కొన్ని ఖనిజాల శోషణ (శరీరం పీల్చుకోవటం) తగ్గుతుంది. కాబట్టి సమతులం అన్నది కీలకం.డయాబెటిక్ గ్యాస్ట్రోపరేసిస్ (తిన్న తర్వాత కడుపు ఎంతకూ ఖాళీ అయినట్లు ఉండకపోవటం) వంటి కొన్ని పరిస్థితులు ఉన్నవారు ఫైబర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఎంత ఫైబర్ తీసుకోవాలి?తాజా అధ్యయనం ఆధారంగా, రోజుకు 25 నుండి 26 గ్రాముల ఫైబర్ తీసుకోవటం సురక్షితం, ప్రభావవంతం అని తెలుస్తోంది. అనేక ఆరోగ్య సంస్థల సిఫారసులకు అనుగుణంగా ఈ మోతాదును నిర్ణయించారు. డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలోకి ఫైబర్ను తగినంతగా తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ నియంత్రణ ఒక సహజ ప్రక్రియగా జరిగిపోతుంది.కొంతమందికి సాధారణ స్థాయిలో ఫైబర్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఎక్కువ మోతాదులో ఫైబర్ను తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించటం తప్పనిసరి. నేడు మీరు ఫైబర్ తీసుకుంటే అది మీ రేపటి జీవితానికి ఆరోగ్యకరమని గుర్తుంచుకోండి. సాక్షి, స్పెషల్ డెస్క్(చదవండి: కొరకరాని గింజలే గాని...) -
‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!
‘కోవిడ్–19’ మహమ్మారి తర్వాత చాలామంది చాలారకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న వార్తలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల, ఆ తర్వాత తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల పలువురు మహిళలు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు, దానికి తోడు అసాధారణ రక్తస్రావంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్, కోవిడ్ వ్యాక్సిన్ల కారణంగా పలువురు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అధిక రక్తస్రావం సమస్య తలెత్తుతోందని లండన్లోని వైద్య నిపుణులు ఇటీవల గుర్తించారు. ఈ సమస్యపై వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ అధ్యయన వివరాలను ‘క్లినికల్ సైన్స్’ జర్నల్లో ప్రచురించారు. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్కు గురైన వారిలో దాదాపు 33.8 శాతం మహిళలకు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు ఏర్పడ్డాయి. 26 శాతం మహిళల్లో అస్తవ్యస్తమైన రుతుక్రమంతో పాటు అధిక రక్తస్రావం సమస్య ఏర్పడింది. 19.7 శాతం మహిళల్లో రుతుక్రమంలో అస్తవ్యస్తతలు లేకున్నా, అధిక రక్తస్రావం సమస్య తలెత్తింది. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!) -
స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..? ఇది ప్రమాదకరమా..
నేను రెండోసారి గర్భవతిని. ఇప్పుడు స్కాన్లో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తేలింది. ఇది ప్రమాదకరమా? ఆపరేషన్ తప్పకుండా చేయించుకోవాలా?– మధు, విశాఖపట్నంస్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక అరుదైన గర్భధారణ సమస్య. ఇది సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే గర్భం కాకుండా, గతంలో సిజేరియన్ చేసిన కుట్టు వద్ద ఏర్పడుతుంది. ఇది సుమారు రెండువేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే సమస్య. ప్రస్తుతం సిజేరియన్ డెలివరీల సంఖ్య పెరగడం, స్కానింగ్ పరికరాల మెరుగుదల వలన స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సకాలంలో గుర్తించడం సాధ్యమవుతోంది. కానీ, ఈ గర్భం కొనసాగితే తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గర్భాశయపు కుట్టు తెరుచుకోవడం, గర్భాశయం చీలిపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. గర్భం పెరిగే కొద్దీ కుట్టుపై ఒత్తిడి పెరిగి అది తెరుచుకోవచ్చు. ఇది ప్రాణాపాయ పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంది. ఇంకా, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన ప్లాసెంటా గర్భాశయ గోడకు గట్టిగా అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. దీనిని ప్లాసెంటా అక్రీటా స్పెక్ట్రమ్ అంటారు. ఇది గర్భధారణ చివర్లో తీవ్రమైన రక్తస్రావానికి కారణమవుతుంది. కొన్నిసార్లు ప్లాసెంటా మూత్రాశయానికి కూడా అతుక్కుపోతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని పూర్తిగా తీసేయాల్సి రావచ్చు. ఇవన్నీ ముందుగా గుర్తించడం కష్టం. చాలా సందర్భాల్లో చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రసవ సమయంలో కూడా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన తీవ్రమైన రక్తస్రావం సంభవించవచ్చు. ముఖ్యంగా ప్లాసెంటా వేరుచేసే సమయంలో ఇది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించడం, రక్త మార్పిడి, ఐసీయూలో చికిత్స అవసరం కావచ్చు. గర్భాన్ని కొనసాగించాలంటే అత్యంత జాగ్రత్తగా, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉండాలి. అవసరమైన ప్రత్యేక స్కాన్లు, పరీక్షలు చేయించుకోవాలి. స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్న చోట ప్లాసెంటా అతుక్కుపోతే, పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి, తగిన నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భాన్ని తొలగించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తారు. దీనికోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి: చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స చేసి గర్భాన్ని తొలగించడం. ఈ సమయంలో గత కుట్టు భాగాన్ని బలపరచే చర్యలు కూడా తీసుకుంటారు. తద్వారా భవిష్యత్తులో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మళ్లీ కలుగకుండా ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ఉంటే, మిథోట్రెక్సేట్ అనే ఔషధాన్ని గర్భాశయంలోకి నేరుగా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి, గర్భాన్ని ఆపవచ్చు. ఇది గర్భం చాలా చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. చివరిగా, డి అండ్ సి (డైలటేషన్ అండ్ క్యూరెటేజ్) అనే చిన్న శస్త్రచికిత్స ద్వారా కూడా గర్భాన్ని తొలగించవచ్చు. కాబట్టి, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రసూతి నిపుణులను కలసి, గర్భాన్ని కొనసాగించాలా లేక తొలగించాలా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో సురక్షితమైన గర్భధారణ కోసం ఇది చాలా అవసరం. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: శాకాహారుల్లో బీ12 లోపం అంటే..?)∙ -
ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్
ఒంటరితనంతో ఇటీవల చాలామంది బాధపడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవన విధానంలో మంచి సత్సంబంధాలు నెరపలేక ఒంటరిగా మిగిలిపోతుంటారు కొందరు. అలాగని మనం చొరవగా ఉన్నా.. మన సన్నిహితులు మనతో ఎంజాయ్ చేయలేనంత బిజిబిజీ పనులతో సతమతమవుతుంటారు. దాంతో తెలియని ఒంటిరితనం ఆవరిస్తుంటుంది. అది ఒక్కోసారి డిప్రెషన్కి దారితీస్తుంది కూడా. దానికి సరైన మందు రిటైల్ ధెరపీ అని అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్. అసలేంటి థెరపీ..?, ఎలా పనిచేస్తుందంటే..ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలతో మంచి సక్సెస్ని అందుకున్న ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్. ఆయన కాస్ట్యూం డిజైనర్, రచయితగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్తో ప్రేక్షఖులను అలరించి ఎన్నో అవార్డులను అందుకున్నారుడా. అంతటి విజయాన్ని అందుకుని కూడా ఒక్కోసారి దారుణమైన ఒంటరితనం అనే సమస్యను ఫేస్ చేస్తుంటారట కరణ్. స్వయంగా ఆ విషయాన్ని సోల్ సఫర్ విత్ భావ్ అనే పాడ్కాస్ట్ సంభాషణలో కరణ్ వెల్లడించారు. తాను కూడా భావోద్వేగా సమస్యలను ఎదుర్కొని ఒంటరిగా ఫీలవుతుంటానని అన్నారు. దాన్ని అధిగమించేందుకు షాపింగ్ చేస్తుంటానని అన్నారు. దీన్ని రిటైల్ థెరపీ అంటారని చెప్పారు కరణ్. సక్సెస్ అందుకుంటే ఆనందం వస్తుందని చాలామంంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పని అంటున్నారు. ఇలాంటి భావోద్వేగ సమస్యలు, విచారం, ఒంటరితనం ఆవరించినప్పుడూ ధెర్యంగా నిలబడి ఎదర్కొన్నప్పుడూ కలిగే ఆనందమే వేరెలెవల్ అని అంటున్నారు కరణ్. ఈ విచారం, ఒంటిరితనానికి తాను రిటైల్ ధెరపీతో చెక్పెడతాని అన్నారు. ఆ థెరపీలో భాగంగా ఆయన షాపింగ్ చేస్తుంటారట. ఈ ఒంటరితనాన్ని భర్తీ చేసేందుకు షాపింగ్ చేస్తుంటానని చెప్పారు. నా భావోద్వేగాన్ని అదుపు చేసేందుకు ఇలా షాపింగ్ పేరుతో వస్తువును కొని ఆ వ్యాధిని అధిగమిస్తానని అన్నారు. కొనుగోలు చేస్తున్నప్పుడూ ఎంత ఖరీదు వస్తువు కొంటున్నామనే దానిపై ధ్యాస..ఎంత ఖర్చు చేస్తున్నాం అనేదానిపై అటెన్షన్తో ఈ ఒత్తిడి, విచారం, ఒంటరితననాన్ని తెలియకుండానే దూరం చేసుకుంటామని చెబుతున్నారు కరణ్. View this post on Instagram A post shared by Soul Safar with Bhaav (@soulsafarwithbhaav) మంచిగానే పనిచేస్తుందా..?రిటైల్ థెరపీ అంటే..నిరాశనిస్ప్రుహలకు లోనైనప్పుడూ లేదా ఒత్తిడికి గురైనప్పుడు షాపింగ్ చేయడాన్ని రిటైల్ థెరపీ అంటారట. మానసిక స్థితిని పెంచేలా వస్తువులు కొనుగోలు చేయడమే రిటైల్ థెరపీ అట. అధ్యయనాలు కూడా మానసిక స్థితిని మెరుగ్గా ఉంచాడానికి ఇది సరైన థెరపీగా పేర్కొన్నాయి. నిజానికి ఇది తాత్కాలిక పరిష్కారం కాకపోయినా..అప్పటికప్పుడూ ఈ ఒత్తిడిని హ్యాండిల్ చేసేందుకు షాపింగ్ని ఉపయోగిస్తే..ఆటోమెటిగ్గా మానసికంగా మెరుగ్గా ఉండే వీలు ఏర్పడుతుందట. వ్యక్తిగతంగా ఈ థెరపీ మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని ఎదుర్కొనేలా సహాయపడకపోయినా.. మన మానసిక స్థితి అప్పటికప్పుడూ సవ్యంగా సాధారణ స్థితికి తీసుకువస్తుందట. ఇది దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వగల ప్రొఫెషనల్ థెరపీ మాత్రం కాదట. కేవలం ఆ సమయంలో మనలో వచ్చే నెగిటివ్ ఆలోచనలకు చెక్పెట్టి సాధారణ స్థితికి వచ్చేలా చేసే రెడీమేడ్ పరిష్కారంగా ఈ రిటైల్ థెరపీని పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు .గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే) -
ఇలా చేస్తే.. జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోల బరువు..!
బరువు తగ్గాలని స్ట్రాంగ్ డిసైడ్ ఉన్నావారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలంటోంది ఫిట్నెస్ కోచ్ అమకా. జస్ట్ ఐదు నెలల్లోనే మంచి ఫలితాలు అందుకోవాలని ప్రగాఢంగా కోరుకుంటే ఇలాంటి చిట్కాలు అనుసరించడం మంచిదని సూచిస్తుంది. తాను ఆ రెమిడీస్తోనే ఐదు నెలల్లోనే అనూహ్యంగా కిలోలు కొద్దీ బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. త్వరితగతిన ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే.. బెస్ట్ టిప్స్ ఇవే అని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ అమకా.బరువు తగ్గాలనుకుంటున్నవారు ముందుగా తాను ఎందుకు బరువు తగ్గలనుకుంటున్నా, ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నది లక్ష్యం అనేవి స్ట్రాంగ్గా నిర్దేశించుకోవాలంటున్నారు అమకా. అది మీకు లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందట. బరువు తగ్గాలనుకునేవారు ఎవ్వరైనా సింపుల్ దినచర్యను ప్రారంభించాలని చెప్పారు. ముందుగా రోజుకు మూడు లేదా రెండు సార్లు సమతుల్య భోజనం, పది నుంచి 20 నిమిషాల నడక, రెండు లీటర్ల నీరు, మంచి నిద్ర, సరైన క్వాంటిటీలో తీసుకోవడం వంటివి చాలని చెప్పారు. ఇక్కడ ఆహారం శరీరానికి సరిపడ పోషకాలు అందేలా సంతృప్తిని కలిగించేలా ఉండాలని చెప్పారు. అతిగా తినడాన్ని నివారించాలన్నారు. ముఖ్యంగా ప్రతి భోజనంలో ప్రోటీన్, అధిక ఫైబర్ తప్పనిసరిగా భాగం చేసుకోవాలని చెప్పారు. కార్బోహైడ్రేట్లు కూడా తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా సమతుల్యతను పాటిస్తే చాలు ఎలాంటి ఆహారమైనా ధైర్యంగా తినొచ్చని చెబుతున్నారామె. ప్రతి రోజు వాకింగ్, చక్కెర పానీయాలు దూరంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. ఈ చిన్నపాటి రెమిడీలు భారీ ఫలితాలను అందించి..శరీరంలో సత్వర మార్పులకు నాంది పలుకుతుందట. ఇలా స్ట్రిక్ట్గా డైట్ని అనుసరిస్తే..జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోలు మేర బరువు తగ్గుతారట. తాను కూడా అలాంటి సింపుల్ చిట్కాలను అనుసరించే ఐదునెలల్లోనే 25 కిలోలు పైనే తగ్గానని చెప్పుకొచ్చింది. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే ఈ విధానం చాలా హెల్ప్ అవుతుందని సూచిస్తోంది ఫిట్నెస్ కోచ్ అమకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) (చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్గా మోనాసింగ్) -
తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్ ది హాచ్
తరచుగా తుమ్ములు రావడం, ఛాతీ అంతా నొక్కేసినట్టుగా అనిపించడం చాలామంది ఎదుర్కొనే సమస్య. సాధారణంగా అలెర్జీలు, జలుబు వంటివి వచ్చినప్పుడు తుమ్ములు ఓ లక్షణంగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు తుమ్ములు చాలా మామూలు విషయమే గానీ... మరికొన్నిసార్లు అవి మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఓ సూచన కావచ్చు. ఈ నేపథ్యంలో తరచూ కనిపించే తుమ్ములు ఎందువల్ల వస్తాయో, ఏయే సమయాల్లో అవి తీవ్రమైన సమస్యలకు సూచికగా ఉంటాయో అలాంటప్పుడు అవసరమైన సాధారణ ఇంటి చిట్కాలు మొదలుకొని... పెద్ద సమస్యలకు అవసరమైన చికిత్సలేమిటన్న అనేక అంశాలపై అవగాహన కలిగించే కథనమిది...ఆవలింతకు అన్న ఉన్నాడుగానీ... తుమ్ముకు తమ్ముడు లేడని ఓ వాడకమాట. అంటే ఒకరు ఆవలించగానే మరొకరికి ఆవలింత వస్తుంది... కానీ తుమ్ము అలాకాదు... సోలోగా వస్తుందని అర్థం. తుమ్ము ఎలాంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తుందో చూద్దాం...అలెర్జీలు, పుప్పొడి, ధూళిలో ఉండే అతి చిన్న డస్ట్మైట్స్, పెంపుడు జంతువుల వెంట్రుకలు (పెట్ డ్యాండర్), బూజు వంటివి ఊపిరితిత్తులను ప్రేరేపించి తుమ్ములొచ్చేలా చేస్తాయి.జలుబు అలాగే ఫ్లూ (కామన్ కోల్డ్ అండ్ ఫ్లూజ్వరం)లో : వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంతో ముక్కు కారుతుండే సమయంలో; దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో పాటు తుమ్ములూ వస్తుంటాయి. నాన్–అలెర్జిక్ రైనైటిస్: ఈ సమస్య ఉన్నప్పుడు అలెర్జీని ట్రిగర్ చేసే కారకాలు లేకుండానే వచ్చే తుమ్ములూ, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఉంటాయి. వాతావరణంలో మార్పులు, కొన్ని రకాల వాసనలు, మసాలాలు ఇందుకు కారణమవుతుంటాయి. దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యాలు (డస్ట్ అండ్ పొల్యూషన్) : వాతావరణంలోని దుమ్ము, పొగ, వాయుకాలుష్యం వంటి అంశాలు ముక్కులోని అతి సున్నితమైన పొరలను ఇరిటేట్ చేయడం ద్వారా తుమ్ములొచ్చేలా చేస్తాయి. బాగా ఘాటుగా ఉండే వాసనలు (స్ట్రాంగ్ సెంట్స్) : కొన్ని రకాల సెంట్లూ, పెర్ఫ్యూమ్లూ, శుభ్రం చేయడానికి వాడే సువాసనగల క్లీనింగ్ ఉత్పత్తులు లేదా కొన్ని రకాల రసాయనాల తాలూకు ఘాటు వాసనలు తుమ్ములను తెప్పిస్తాయి.ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపించేలా చేసే ఈ కారణాలన్నీ తుమ్ములతో సంబంధం ఉన్నవే. చాలాసార్లు తుమ్ములు వస్తున్నప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతున్నట్లుగానూ, ఛాతీ బాగా బిగదీసుకుపోయిన ఫీలింగ్ కలుగుతుంటుంది. ఇలా ఏయే సమయాల్లో జరుగుతుందో తెలుసుకుందాం. తరచుగా వచ్చే దగ్గుతో (ఫ్రీక్వెంట్ కాఫ్ వల్ల) : తుమ్ములతోపాటు తరచూ వచ్చే దగ్గు వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. అలెర్జిక్ ఆస్తమా : అలెర్జీ సమస్య ఉన్న కొందరిలో అదేపనిగా తుమ్ములు వస్తుండటంతోపాటు వాళ్ల శ్వాసనాళాలూ, ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలూ సంకోచించి సన్నబారిపోతుంటాయి. దాంతో గాలి సాఫీగా ప్రవహించడానికీ / ప్రసరించడానికీ తగినంత స్థలం లేకపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం (ఆస్తమా) జరగవచ్చు. ఆ శ్వాసనాళాలన్నీ సన్నబారి ఊపిరితీసుకోవడం కష్టంగా మారడంతో ఛాతీలోనూ బిగుతుగా అనిపిస్తుంది. పిల్లికూతలతోపాటు ఇలా శ్వాస తీసుకోవడం కష్టం కావడాన్నే ఆస్తమాగా పేర్కొంటారు. సైనస్తో పెరిగే ఒత్తిడి (సైనస్ ప్రెషర్): ముఖం ఎముకల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలను సైనస్ అంటారు. తుమ్ములు, జలుబు లేదా అలెర్జీల వల్ల సైనస్లలో ఇన్ఫెక్షన్ (అంటే వాపు వచ్చి) ఆ కారణంగా ఛాతీపై పరోక్షంగా ఒత్తిడి పెరగవచ్చు. ఇలా సైనస్లలో పేరుకు΄ోయిన శ్లేష్మం... ఛాతీపై ఒత్తిడిని పెంచుతుంది.కండరాల నొప్పి (మజిల్ స్ట్రెయిన్): తరచుగా తుమ్మడం వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుండటం వల్ల ఆ కారణంగా నొప్పిగానూ, ఛాతీ బిగుతుగా అనిపించవచ్చు.తుమ్ములతో ఊపిరితిత్తులపై పడే ప్రభావమిలా...సాధారణంగా తుమ్మడమనే ప్రక్రియ... ముక్కు లేదా శ్వాసనాళాల్లో అడ్డుగా ఉండి చికాకు కలిగించే కొన్ని వ్యర్థాలనూ, కణాలను బలంగా బయటకు పంపడానికి శరీరం అసంకల్పితంగా చేసే ఓ రక్షణాత్మకమైన ప్రక్రియ. అయితే, తరచుగా, అలాగే తీవ్రంగా, అదేపనిగా తుమ్ములు వస్తున్న కొన్ని సందర్భాల్లో అవి ఊపిరితిత్తులపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఊపిరితిత్తుల కండరాలపై ఒత్తిడి (స్ట్రెయిన్ ఆన్ లంగ్ మజిల్స్)తుమ్మిన ప్రతిసారీ కడుపును రెండు భాగాలుగా విభజించి, ఊపిరితిత్తులనూ, కడుపు తాలూకు జీర్ణవ్యవస్థలోని భాగాల్ని వేరు చేసే డయాఫ్రమ్ అనే పొర, ఛాతీ కండరాలూ సంకోచిస్తాయి. ఇలా మరీ ఎక్కువగానూ, శక్తిమంతంగానూ తుమ్ములు వస్తున్నప్పుడు అక్కడి కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో ఛాతీలో నొప్పి, అక్కడి కండరాలకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులపైన నేరుగా ప్రభావం పడదుగానీ... శ్వాసప్రక్రియకు సహాయపడే కండరాలపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. దాంతో శ్వాస సరిగా ఆడకపోవడం, ఆయాసం రావడం జరుగుతాయి. దీన్నే వాడుక భాషలో ఉబ్బసంగా చెబుతుంటారు. శ్వాసనాళాల్లో ఇబ్బంది (ఇరిటేషన్), వాపు (ఎయిర్ వే ఇరిటేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్)తుమ్మినప్పుడు గాలి అకస్మాత్తుగా చిమ్మినట్టుగా చాలా వేగంగా బయటకు వస్తుంది. ఇది శ్వాసనాళాల లోపలి పొరల్లో ఇబ్బంది (ఇరిటేషన్) కలిగిస్తుంది. అలాగే అలెర్జీలూ, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల వల్ల తరచుగా తుమ్ములు వస్తున్నట్లయితే, ఈ ఇబ్బంది (ఇరిటేషన్) కాస్తా దీర్ఘకాలిక వాపునకు (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) దారితీసే అవకాశముంది. ఈ ఇన్ఫ్లమేషన్ కాస్తా శ్వాసనాళాలను మరింతగా కుంచించుకు΄ోయేలా చేసి, గాలి సాఫీగా ప్రసరించడాన్ని ఆటంకపరుస్తుంది. ఫలితంగా హాయిగా ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది.ఆస్తమాను ప్రేరేపించడం లేదా తీవ్రతరంచేయడం(ట్రిగరింగ్ / వర్సెనింగ్ ఆస్తమా) : ఆస్తమా సమస్య ఉన్నవారిలో తుమ్ములు ఆస్తమా అటాక్ను ప్రేరేపించగలవు... అంటే ట్రిగర్ చేయగలవు. అలెర్జీని కలిగించే అంశాలను (అలర్జెన్స్ను) దేహం ఎదుర్కొన్నప్పుడు యధేచ్ఛగా తుమ్ములు వస్తూ అవి శ్వాసనాళాలను కుంచించుకుపోయేలా / బిగుసుక΄ోయేలా చేస్తాయి. దాంతో ఛాతీ బిగదీసుకుపోవడం ఆస్తమా లక్షణాలు తీవ్రతరం కావడం జరగవచ్చు. అప్పుడు శ్వాసనాళాలు సన్నబారడంతో దగ్గు, ఆయాసం, ఎగశ్వాస, ఛాతీ బిగదీసుకుపోవడం వంటి ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి లేదా వాటిని తీవ్రతరం చేస్తాయి కూడా. తుమ్ములు మరింత ఎక్కువగా వస్తూ, దగ్గు కూడా తోడైనప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి బాగా పెరిగి, ఆస్తమా ఉన్నవారికి అది మరింత కష్టంగా పరిణమించవచ్చు.ఇన్ఫెక్షన్ వ్యాప్తి (స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్):జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల తుమ్ములు వస్తున్నప్పుడు, అలా తుమ్మినప్పుడు వెలువడే అతి సన్నటి తుంపర్లలతో వైరస్లు ఉంటాయి. ఆ తుంపర్ల కారణంగా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందడంతో పాటు, కొన్నిసార్లు శ్వాసనాళాల లోపల మరింత లోతుకు విస్తరించి బ్రాంకైటిస్ లేదా నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. మరీ ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇలా జరగడం చాలా సాధరణం.గాలి గదులు ధ్వంసం కావడం లేదా న్యూమోథొరాక్స్ : ఇది చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే ప్రమాదం. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, అంటే మరీ ముఖ్యంగా ముఖ్యంగా ఊపిరితిత్తులలోని అంతర్గత సమస్యలు (ఉదాహరణకు ఎంఫసిమా వంటి సమస్యలు) ఉన్నవారిలో, తుమ్ములు చాలా బలంగా లేదా తీవ్రంగా వస్తున్నప్పుడు ఊపిరితిత్తులలోని అతి చిన్న గాలి గదులు (బ్లెబ్స్ అండ్ బ్యుల్లే) ఫటేల్మంటూ పగిలినట్టుగా అయ్యే ముప్పు ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. అయితే ఇది జరిగితే దీనివల్ల ఊపిరితిత్తీ అలాగే ఛాతీ గోడకు మధ్యన గాలి లీక్ అయి, న్యుమోథొరాక్స్ (కొలాప్స్డ్ లంగ్) అనే తీవ్రమైన కండిషన్కు దారి తీస్తుంది. ఇది చాలా అత్యవసరంగా వైద్యచికిత్స అందించాల్సిన పరిస్థితి.... అంటే మెడికల్ ఎమర్జెన్సీ.వైద్యచికిత్స ఎప్పుడంటే... ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవి... గాలి పీల్చడంలో తీవ్రమైన ఇబ్బంది; శ్వాస సరిగా తీసుకోలేక΄ోవడం, ఊపిరి అందక΄ోవడం / ఊపిరాడకపోవడం ఛాతీ బిగుసుకు΄ోవడం / ఛాతీలో తీవ్రమైన నొప్పి ఒక పట్టాన తగ్గని తీవ్రమైన జ్వరం శ్లేష్మం / కఫం పసుపురంగులో లేదా ఆకుపచ్చరంగులో ఉండటం ఇక్కడ పేర్కొన్న ఈ లక్షణాలు కొన్ని రోజుల తర్వాత కూడా తగ్గకుండా ఉండటం లేదా మరింత తీవ్రతరమైతే తక్షణం డాక్టర్ను సంప్రదించడం అవసరం.కొన్ని ఇతర వైద్యపరమైన సమస్యలతో కనిపించే లక్షణాలు : గుండె సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర / వైద్య చరిత్ర (హెల్త్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు బాగా ఛాతీలో ఇబ్బంది లేదా ఛాతీ బిగుసుకు΄ోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు. తరచుగా తుమ్ములు, ఛాతీలో బాగా బిగదీసుకుపోయి ఛాతీలో ఒత్తిడి ఉన్నట్లుగా అనిపిస్తుండటం (ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సందర్భాల్లో సమస్య చాలా సాధారణంగా కనిపిస్తున్నా లేదా అంత తీవ్రమైన సమస్య కానప్పటికీ ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్కు చూపించి వెంటనే తగిన చికిత్స తీసుకోవడం అవసరం.చివరగా... తరచుగా తుమ్ములు రావడమన్నది దాదాపుగా అందరిలోనూ తమ జీవితకాలంలోని ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వచ్చే సమస్య. అయితే ఇలా తుమ్ములు పదేపదే కనిపిస్తుంటే మాత్రం ఒకసారి డాక్టర్ను సంప్రదించడం మంచిది.తుమ్ముల నివారణా... అందుకు ఉపకరించే ఇంటి చిట్కాలు నివారణకు అనుసరించాల్సిన సూచనలు : అలెర్జీకి కారణమయ్యే కారకాల (అలర్జెన్స్)ను గుర్తించడం, వాటికి దూరంగా ఉండటం. (అంటే మనకు ఏ కారణంగా అలెర్జీ వస్తుందో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం, అవి ఎదురుకాకుండా చూసుకోవడం; ఇంట్లో అలెర్జెన్స్ లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం; దుమ్మూ ధూళి లేకుండా జాగ్రత్తపడటం; పెంపుడు జంతువులూ, వాటి వెంట్రుకల నుంచి దూరంగా ఉండటం. డాక్టర్లు సూచించిన మేరకు అలర్జీలను నివారించే నేసల్ స్ప్రేలు వాడటం లేదా యోగా ప్రక్రియలో కొమ్ముతో ఉండే చిన్న భరిణె లాంటి ఉద్ధరిణి సహాయంతో ‘నేతి’ అనే యోగప్రక్రియతో ముక్కు రంధ్రాల్ని శుభ్రం చేసుకోవడం (ఈ నేతి ప్రక్రియ కారణంగా ముక్కులోని అలెర్జీ కారకాలు (అలర్జెన్స్). శ్లేష్మం కొట్టుకుపోయి ముక్కు శుభ్రంగా ఉండటంతో అలెర్జీ, ఆస్తమా నివారితమవుతాయి). ఆవిరి పీల్చడం (స్టీమ్ ఇన్హెలేషన్) : వేడినీటి ఆవిరి పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ తగ్గడంతోపాటు శ్వాస తేలిగ్గా అందుతుంది. నీరూ, ద్రవపదార్థాలూ ఎక్కువగా తీసుకోవడం (హైడ్రేటెడ్గా ఉండటం) : నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వల్ల శ్లేష్మం (స్ఫుటమ్) పల్చబడి అది తేలిగ్గా బయటకు వస్తుంది. (ఈ శ్లేష్మం ఊపిరితిత్తుల్లోనూ, గొంతులోనూ ఇరుక్కుని ఉన్నప్పుడు శ్వాస సరిగా అందకపోవడం, ఊపిరితీసుకోడానికి అది అడ్డుపడటం వల్ల చికాకుగా ఉండటం వంటివి చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే). ఇంటి చిట్కాలుతేనె అల్లం కలిపిన పానియాలు : తేనె (హనీ), జింజర్ (అల్లం) కలిపి చేసుకున్న పానియాల వల్ల గొంతు నొప్పి తగ్గడం, దగ్గు నుండి ఉపశమనం కలగడం వంటి ఫలితాలుంటాయి. తుమ్ములూ తగ్గుతాయి.తగినంత విశ్రాంతితో : శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవ్వడంతోపాటు త్వరగా కోలుకోవచ్చు. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం : పొగతాగడం, పొగకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇక పోగ ఎక్కువగా వస్తున్నచోట ఉంటే ఊపిరిసలపనట్టుగా అనిపిస్తుండటం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. అందుకే పొగ అలవాటుకూ, పొగకూ దూరంగా ఉండటం మేలు. (చదవండి: Beauty Tip: మేకప్ లేకున్నా...అందంగా కనిపించాలంటే..!) -
గుండె జబ్బులు...మూడు కారణాలు.. నాలుగు పరిష్కార మార్గాలు! (ఫొటోలు)
-
అరుదైన స్ట్రోక్తో..మెడుల్లాపై దాడి!
స్ట్రోక్ అంటే మనకు తెలిసింది మెదడుకు వచ్చే బ్రెయిన్ స్ట్రోక్. అయితే చిన్నప్పట్నుంచీ మనం చదువుకున్న మెదడులోని భాగాలైన పెద్ద మెదడు, చిన్న మెదడు, మెడుల్లా అబ్లాంగేటాలలో... మెడుల్లా అనే భాగానికి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశముంది. ఆ భాగానికి స్ట్రోక్ వచ్చినప్పుడు కలిగే కొన్ని నరాల మార్పుల (న్యూరలాజికల్ కండిషన్స్) వల్ల దేహంలోని ఓ పక్క భాగం (అంటే లాటరల్ భాగం) అచేతనమైపోయే అవకాశం ఉంది. ఇలా మెదడులోని మెడుల్లా అనే భాగానికి వచ్చే స్ట్రోక్ వల్ల కలిగే మార్పుల కారణంగా కళ్లు తిరుగుతున్నట్లు ఉండటం (డిజ్జీనెస్), సరిగా నిలబడలేక΄ోవడం, గుటక వేయలేకపోవడం వంటి లక్షణాలతో కనిపించే ఈ అనారోగ్యాన్ని ‘ల్యాటరల్ మెడుల్లరీ సిండ్రోమ్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.ల్యాటెరల్ మెడుల్లరీ సిండ్రోమ్ అనే ఈ సమస్య... సాధారణంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరెబెల్లార్ ఆర్టరీ (పీఐసీఏ)లో రక్తప్రవాహం ఆగడం వల్ల వస్తుంది. దాంతో మెడుల్లా (బ్రెయిన్ స్టెమ్)లోని ఒక పక్క భాగం (పార్శ్వం) ప్రభావితమవుతుంది. ఇవీ లక్షణాలు... బాధితులకు నొప్పి, వేడిమి, ఉష్ణబాధలు తెలియకపోవడం బాలెన్స్ కోల్పోవడం, నడుస్తున్నప్పుడు సరైన రీతిలో నడవలేకపోవడం (గెయిట్ సరిగా లేకపోవడం) ∙తల, కళ్లు తిరుగుతుండటం ∙గుటకవేయలేక΄ోవడం, గొంతు బొంగురుపోవడం, మాట ముద్దముద్దగా రావడం. (మెదడులోని మింగే వ్యవస్థనూ, మాట్లాడే కేంద్రాన్ని నియంత్రించే ‘న్యూక్లియస్ యాంబిగస్’ అనే భాగం ఆయా వ్యవస్థలపై అదుపు కోల్పోవడంతో ఈ పరిణామం సంభవిస్తుంది) కనురెప్ప దానంతట అదే వాలిపోవడం, కనుపాప దగ్గరగా ముడుచుకోవడం (ప్యూపిల్ కన్స్ట్రిక్షన్), కొన్నిసార్లు కళ్లు (నల్లగుడ్డు) వాటంతటవే కదుతుండటం కొందరిలో వికారం, వాంతులు, ఎక్కిళ్లు.కారణాలు... మెదడులోని కొన్ని భాగాలకు రక్తం అందించే ధమనులు గట్టిబారి΄ోయి సన్నబడటం లేదా ఆ గోడల్లో పగుళ్లు రావడం వల్ల మెడను సరిగా ఉపయోగించకుండా రఫ్గా వాడినప్పుడు అక్కడి వర్టెబ్రల్ ఆర్టరీస్లో పగుళ్లు రావడం వల్ల లేదా మార్ఫన్స్ సిండ్రోమ్, ఎహ్లెర్–డ్యాన్లస్ సిండ్రోమ్, ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియా (రక్తనాళాల లోపలివైపున కణాలు పెరగడం వల అవి సన్నబారిపోవడం) వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. అయితే మిగతా కారణాలతో పోలిస్తే ఈ అంశాలు చాలా అరుదు.నిర్ధారణ... మెదడు ఎమ్మారై ద్వారా అలాగే లక్షణాలను బట్టి దీన్ని నిర్ధారణ చేస్తారు. అయితే చాలా సందర్భాల్లో నిర్ధారణ సరిగా జరగక... ఈ సమస్యను ఇతర సమస్యగా పొరబడటం జరుగుతుంటుంది. ప్రధానంగా వికారం, వాంతులు, తలతిరగడం, కళ్లుతిరగడం వంటి లక్షణాలను బట్టి దీన్ని ఈఎన్టీ సమస్యగా పొరబడుతుంటారు. చికిత్స... స్ట్రోక్ అనేది ఈ తరహాదైనప్పటికీ దానికి అత్యంత త్వరగా చికిత్స అందడం అవసరం. అప్పుడే వీలైనంత తక్కువ నష్టం జరుగుతుంటుంది. ఈ తరహా స్ట్రోక్ మొదలుకొని అది ఎలాంటిదైనప్పటికీ వీలైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకురావాలి. బాధితుల్ని కనీసం మూడు నుంచి నాలుగు గంటల లోపు తీసుకొస్తే డాక్టర్లు థ్రాంబోలిటిక్ థెరపీ (అంటే ధమనుల్లో రక్తసరఫరాను పునరుద్ధరించేందుకు ఇంజెక్షన్ ద్వారా మందును ఇచ్చే చికిత్స)ని బాధితులకు అందించడానికి ప్రయత్నిస్తారు. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో కొందరికి ‘మెకానికల్ థ్రాంబెక్టమీ’ అనే (రక్తనాళాల్లో పేరుకుపోయిన క్లాట్ను తొలగించడానికి చేసే) శస్త్రచికిత్సతో పరిస్థితిని చక్కబరుస్తారు. ఇటీవల ఈ సమస్యపట్ల కొంత అవగాహన పెరగడంతో మునపటిలా కాకుండా సంబంధిత చికిత్సలు సత్వరమే జరుగుతున్నాయి. అయితే ముందుగా చెప్పినట్లుగా థ్రాంబోలిటిక్ థెరపీ చేయడానికి అవకాశం లేకుండా కాస్తంత ఆలస్యంగా వచ్చినవారికి క్లాట్స్ ఏర్పడకుండా ఉంచేందుకు రక్తం గడ్డకట్టి ఉండలుగా మారకుండా యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ను ఇవ్వడం, రక్త΄ోటు (బీపీ) అదుపులో ఉంచడం, కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను తగ్గించడం, రక్తాన్ని పలచబర్చేలా యాంటీ కోయాగ్యులెంట్స్ ఇవ్వడం వంటి మేనేజ్మెంట్ చికిత్సలూ అవసరమవుతాయి.రీ–హ్యాబిలిటేషన్... ఇక్కడ పేర్కొన్నవే కాకుండా బాధితులు కోలుకునేందుకు వీలుగా ఫిజియో వంటి ‘రీ–హ్యాబిలిటేషన్’ వంటి కాస్త సుదీర్ఘ చికిత్సలతో పాటు బ్యాలెన్స్డ్గా నడక ప్రాక్టీస్ చేయించడం, మాట ముద్దగా వస్తున్నవారికి స్పీచ్ థెరపీ వంటివి కూడా అవసరమవుతాయి. భవిష్యత్తు ఆశారేఖలివి... ఇప్పుడున్న మందులు కాకుండా న్యూరో ప్రొటెక్టివ్ మెడిసిన్, స్టెమ్సెల్ చికిత్సల వంటి వాటిపైనా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ లక్షణాలతో స్ట్రోక్ను గుర్తించి వీలైనంత త్వరగా బాధితులను హాస్పిటల్కు తరలించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జరిగే నష్టాన్ని వీలైనంతగా తగ్గించవచ్చు.(చదవండి: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?) -
అరవైలలోని మహిళలకూ ఆ ముప్పు!
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) కారణంగా సర్వైకల్ క్యాన్సర్ సోకే ముప్పు యువతులకు, నడివయసు మహిళలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే! అరవై ఏళ్లు నిండిన వయసులోని మహిళలకు కూడా ఈ ముప్పు ఎక్కువగానే ఉంటుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. అందువల్ల అరవైలలోని మహిళలు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని అంతర్జాతీయ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022లో సర్వైకల్ క్యాన్సర్ సోకిన మహిళల్లో 65 ఏళ్లు పైబడిన మహిళలు 1,57,182 మంది ఉంటే, వారిలో 1,24,269 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కన వార్ధక్యంలో సర్వైకల్ క్యాన్సర్ సోకిన మహిళలు ప్రాణాపాయం బారిన పడే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా ఈ వయసులోని మహిళలు వ్యా«ధి రెండో దశలోను, ఇంకా ముదిరిన దశలోను ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల అరవైలలో ఉన్న మహిళలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలపై ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, దానివల్ల వ్యాధిని తొలిదశలోనే గుర్తించి ప్రాణాపాయాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ముప్పును చాలావరకు తప్పించగల హెచ్పీవీ వ్యాక్సిన్ అందు బాటులోకి వచ్చినా, వ్యాక్సిన్ తీసుకుంటున్న మహిళల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంటోంది. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం 2017–2023 మధ్య కాలంలో 25–54 ఏళ్ల వయసు గల మహిళల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. (చదవండి: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?) -
సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నేను ఇద్దరు పిల్లల తల్లిని. వయసు నలభై రెండు సంవత్సరాలు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?– శాంత, విజయవాడ.మీరు తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన వస్తుంది. ఇది లైంగిక చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే ఇన్ఫెఫెక్షన్. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ కు ఎటువంటి లక్షణాలు ఉండవు. మన రోగనిరోధక వ్యవస్థ చాలాసార్లు దీన్ని తట్టుకోగలుగుతుంది. కాని, కొన్నిసార్లు హైరిస్క్ వైరస్లు పదహారు నుంచి పద్దెనిమిది రకాలు శరీరంలో ఉండిపోతే, గర్భాశయ కణాల్లో మార్పులు వస్తాయి. ఇవి కాలక్రమంలో క్యాన్సర్కి దారితీయవచ్చు. ఇలా క్యాన్సర్గా మారటానికి మూడు నుంచి పదిహేను సంవత్సరాల వరకు పడుతుంది. ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్కే కాకుండా జననాంగ క్యాన్సర్, మలద్వారం, నోటి, గొంతు క్యాన్సర్లు, పురుషుల్లో పురుషాంగ క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఈ టీకా ఎక్కువ ప్రయోజనం ఇచ్చేది పెళ్లికి ముందే తీసుకుంటే. ఎందుకంటే లైంగికంగా చురుకుగా ఉండే వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసిన పదమూడు రకాల వైరస్ల వలన క్యాన్సర్ రావచ్చు. అయితే, ఈ టీకా వాటిలో కొన్ని ముఖ్యమైన రకాల నుంచే రక్షణ ఇస్తుంది. అందుకే టీకాతో పాటు కండోమ్ వాడటం, అవసరమైనప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇది నిర్ధారించాలంటే ప్యాప్ టెస్ట్, వైరస్ టెస్ట్ అనే రెండు పరీక్షలు చేయించాలి. ఇవి గర్భాశయ కణాల్లో అసాధారణ మార్పులను ముందే చూపిస్తాయి. అవసరమైతే వెంటనే చికిత్స తీసుకుని క్యాన్సర్ దశకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. వైరస్ టెస్ట్ ద్వారా హైరిస్క్ వైరస్లు ఉన్నాయా లేదా అనే విషయం స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా వలన సర్వైకల్ క్యాన్సర్, మొటిమలు వచ్చిన వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అందుకే టీకా తీసుకోవడం ఎంతో అవసరం. టీకా తీసుకున్నాక కూడా ప్రతి మూడేళ్లకోసారి లేదా ఐదేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. తొమ్మిది నుంచి నలభై ఐదేళ్ల వయస్సు మధ్యలో ఉన్నవారికి ఈ టీకా ఇవ్వవచ్చు. తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు వయస్సు కలిగినవారికి రెండు డోసులు వేస్తారు. మొదటి డోసు తర్వాత ఆరు నుంచి పన్నెండు నెలల్లో రెండవ డోసు వేయాలి. పదిహేను నుంచి నలభై ఐదేళ్లవారికి మూడు డోసులు అవసరం. మొదటి డోసు తర్వాత రెండు నెలల్లో రెండవ డోసు, ఆరు నెలల్లో మూడవ డోసు తీసుకోవాలి. ఈ టీకాతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది సురక్షితమైంది. కాబట్టి డాక్టర్ను సంప్రదించి వారి పర్యవేక్షణలో తప్పకుండా తీసుకోండి. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..) -
గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..
బ్రిస్క్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బ్రిస్క్ వాకింగ్ అంటే మీ సాధారణ నడక కంటే వేగంగా నడవడం. అంటే హృదయ స్పందన రేటును పెంచే వేగంతో నడవాలి. ఇది మితమైన తీవ్రత కలిగిన వ్యాయామం, అంటే నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మాట్లాడగలరు. బ్రిస్క్ వాకింగ్ ప్రయోజనాలుబ్రిస్క్ వాకింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది ∙బ్రిస్క్ వాకింగ్ కేలరీలను కరిగించడానికి ఉపకరిస్తుంది. దీనిద్వారా ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ∙మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది బ్రిస్క్ వాకింగ్ ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుంది. ∙ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. బ్రిస్క్ వాకింగ్ ఎముకలు, కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది ఎముకల సాంద్రతను పెంచడం ద్వారా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.∙శక్తి స్థాయులను పెంచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. బ్రిస్క్వాకింగ్ ఎలా చేయాలి?మీ సాధారణ నడక వేగాన్ని పెంచండి.మీ చేతులను మీ వైపులా వదిలివేయండి, లేదా వాటిని కొద్దిగా వంచి, ముందుకు వెనుకకు ఊపండి. మీ నడకలో వేగం, దూరాన్ని పెంచండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకోండి. బ్రిస్క్వాకింగ్ ప్రారంభించడానికి చిట్కాలు. ∙మీకు నడవడం అలవాటు లేక΄ోతే, నెమ్మదిగా ప్రారంభించండి.క్రమంగా వేగాన్ని, దూరాన్ని పెంచండి. ∙మీకు నచ్చిన ప్రదేశంలో నడవండి ఉదాహరణకు తోటల్లో లేదా బీచ్ వంటి ప్రదేశాలలో అన్నమాట.. దీనిని ఒక సామాజిక కార్యకలాపంగా మార్చడానికి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి నడవండి. -
ఆయుష్షా.. ఆరోగ్యమా..!
ఆయుష్షు.. ఆరోగ్యం.. ఈ రెండింటిలో మీ ఓటు దేనికి అంటే చెప్పలేం. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా... ఆయుష్షు లేకపోతే ఏం లాభం? అదేవిధంగా ఎంత కాలం జీవించి ఉన్నా, ఆరోగ్యం లేకుండా ఎప్పుడూ మంచంలో పడి ఉంటే ప్రయోజనం ఏముంది? అయితే జీవిత కాలానికి, ఆరోగ్య కాలానికీ తేడా ఏమిటని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పచ్చు... జీవిత కాలం అంటే మనం లేదా ఇతర జీవులు ఎంతకాలం పాటు గరిష్టంగా జీవించి ఉన్నారన్నది చెప్పడమే. అదే ఆరోగ్య కాలం అంటే మనం లేదా ఆయా జీవులు బతికిన కాలంలో ఎంత కాలం పాటు ఆరోగ్యంగా ఉన్నారో చెప్పడం. ఆయుష్షులోనూ, ఆరోగ్యంలోనూ జన్యువుల పాత్ర కీలకమైనప్పటికీ ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక కాలం జీవించడం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. ఆయుఃప్రమాణం దేశాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు అమెరికాలో పురుషుల సగటు ఆయుఃప్రమాణం 75 ఏళ్లయితే స్త్రీలకు 80 సంవత్సరాలు. ప్రతివారూ దీర్ఘకాలం టు ఆరోగ్యంగా గడపాలంటే కొవ్వు స్థాయులు తక్కువగా.. పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం వంటి అలవాట్ల వల్ల జీవిత కాలం, ఆరోగ్య కాలం.. రెండూ సమతుల్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
బీపీ మందులు పనిచేయకపోవడానికి రీజన్ ఇదే..!
హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి. మందులు తీసుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వారి రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించలేక పోతున్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం, ఏడాదికి 1.6 మిలియన్ల మరణాలకు కారణం రక్తపోటే. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ జనాభాలో దాదాపు 29.8% మందిని ప్రభావితం చేస్తోంది. సమర్థవంతమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉండటం బాధకరం. కొందరికి మందులతో రక్తపోటు అదుపులో ఉండగా, మరికొందరిలో ఇది అసాధ్యంగా ఉండటానికి గల కారణాలు, ఈ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలి తదితరాల గురించి అపోలో ఆస్పత్రి ఇంటర్వెన్షన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా మాటల్లో తెలుసుకుందాం. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపులో లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్ మనోజ్. దీన్ని నిరోధక రక్తపోటుగా పిలుస్తారని తెలిపారు. సాధారణ చికిత్సల వల్ల అంతగా మార్పు లేదంటే..అంతర్గత అవయవ నష్టానికి సంకేతంగా పరిగణించాలని అన్నారు. అలాంటప్పుడు మూత్రపిండాల డెనెర్వేషన్' వంటి ఆధునిక చికిత్సలు ఈ సమస్య నుంచి బయటపడేయగలవని చెబుతున్నారు. ఈ విధానంలో మూత్రపిండాల్లోని హైపర్యాక్టివ్ నరాలకు చికిత్స చేయడం ద్వారా రక్తపోటుని నియంత్రించగలగడమే కాకుండా దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని కూడా తగ్గించగలమని చెప్పారు. ఈ చికిత్సా విధానం మెరుగైన జీవన నాణ్యతను అందించి, జీవితంపై కొత్త ఆశను అందిస్తుందన్నారు. అయితే రక్తపోటు మందులు రోగికి పనిచయడానికి ప్రధానంగా మూడు కారణాలని వాటి గురించి వివరించారు. మందులు పనిచేయకపోవడానికి రీజన్..నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, దాదాపు 50% మంది రోగులు తమ ఔషధ మోతాదులను సమర్థవంతంగా పాటించరు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పుడు లేదా దుష్ప్రభావాలు ఎదుర్కొన్నప్పుడూ మందులను నిలిపేస్తారు. అందువల్లే రక్తపోటు నియంత్రణ లోపం తలెత్తుందట. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 28.1% మంది పెద్దలకు అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 36.9% మందికి మాత్రమే కచ్చితమైన రోగనిర్ధారణ జరిగింది. వారిలో మందులు వాడేవాళ్లు 44.7% కాగా, కేవలం 8.5% మందికి బీపీ నియంత్రణలో ఉందట. సకాలంలో మందులు తీసుకోలేకపోవడాన్ని వైద్యులకు తెలిపి తగు ప్రత్యామ్నాయా వైద్య చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ మనోజ్.సాధారణ చికిత్సలకు స్పందించకపోవడానికి కారణం..కొన్ని సందర్భాల్లో రక్తపోటు అనేది ఒక హెచ్చరిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేదా హార్మోనల్ అసమతుల్యతలు వంటి మూల రుగ్మతలకు ప్రధాన కారణమవుతుంది. సాధారణ చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యం కాకపోతే, వైద్య నిపుణులు అంతర్లీన ఆరోగ్య సమస్యలను వెలికితీసేందుకు ప్రత్నించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తారు. పలితంగా రోగి మొత్తం ఆరోగ్య స్థితి కూడా గణనీయంగా మెరుగవుతుంది.రెసిస్టెంట్ హైపర్టెన్షన్ కావొచ్చు..మందులకు లొంగకపోతే అది'రెసిస్టెంట్ హైపర్ టెన్షన్' గా పరగణిస్తారు. అంటే ఆయా రోగుల్లో రక్తపోటు 140/90 mmHg కన్నా ఎక్కువ ఉంటుందట. ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అలాంటప్పుడే మూత్రపిండాల డెనెర్వేషన్ లేదా RDN వంటి అత్యాధునిక చికిత్సలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఈ విధానంలో రేడియోఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో రక్తపోటును ప్రభావితం చేసే మూత్రపిండాల ధమనుల్లో ఉన్న అధిక ఉత్కంఠ కలిగించే నరాలను లక్ష్యంగా చికిత్స అందిస్తారు. ఫలితంగా రక్తపోటు గణనీయంగా నింయత్రణలోకి వస్తుంది. సాదారణ మందుకుల స్పందించిన రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరం లాంటిది.తక్షణమే అవగాహన అవసరం.."రక్తపోటు మందుకు పనిచేయకపోతే సంప్రదాయ ఔషధ చికిత్సలకు మించి అత్యాధుని చికిత్స అవసరం అనేది గుర్తించాలి. ఈ విషయాన్ని వైద్యునితో చర్చించాలి. ఆర్డీఎన వంటి అత్యాధునిక చికిత్స విధానం అవసరం అవ్వక మునుపే మేల్కొని ..ఈ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ రక్తపోటు నియంత్రణలో ఉండటం అనేది మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది లాంటిది అని గ్రహించాలి". చెబుతున్నారు డాక్టర్ మనోజ్డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా, డైరెక్టర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
అతిగా చేస్తే.. ప్యాకైపోతారు..!
శరీరాకృతిపై నేటి తరం యువతలో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. ఇందుకు ఆహార అలవాట్లలోనూ అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పాటించకుండా ఓవర్నైట్లో కండలు, సిక్స్ ప్యాక్స్ సొంతం చేసుకోవాలనే అపోహతో అతిగా సాధన చేస్తున్నారు. గంటల తరబడి బరువులు ఎత్తుతూ సొంతంగా అనర్థాలకు కారకులవుతున్నారని పలువురు జిమ్ ట్రైనర్స్, వైద్యులు చెబుతున్న మాట. ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పలువురు అనారోగ్యానికి గురైన సంఘటనలే దీనికి నిదర్శనం. ఈ తరహా ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతున్నాయని, పరిస్థితి దెబ్బతిన్న తర్వాత తమను సంప్రదిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరంలో సుమారు 1.4 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడులతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. వీరిలోనూ ముఖ్యంగా సాఫ్ట్వేర్, ప్రభుత్వ, కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో పనిచేవారిలో ఎక్కువ మంది రోజుకు 8 నుంచి 9 గంటల పాటు కుర్చీలకే పరిమితమవుతున్నారు. ఈ కారణంగా శరీరాకృతిలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం ఒకెత్తయితే.. పని ఒత్తిడి, స్ట్రెస్ మరో ఎత్తు.. దీంతో తమ శరీరంలో పేరుకుపోయిన కేలరీలు తగ్గించుకునేందుకు వీలు చిక్కినప్పుడల్లా తమకు అందుబాటులో ఉన్న జిమ్ములు, పార్కులు, ఆట స్థలాల్లో తమకు తోచిన రీతిలో వ్యాయామాలు చేస్తున్నారు. కొందరైతే వీటికి ప్రత్యామ్నాయంగా ఆటలు, డ్యాన్స్ వంటి వాటిని సాధన చేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. క్రమ పద్ధతి పాటించకుండా అతిగా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, కండరాల్లో దీర్ఘకాలిక అలసట, నొప్పులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, నీరసం, ఆందోళన, నిరుత్సాహం, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా బద్ధకం అనిపిస్తుంది. కార్టిసాల్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించడం వల్ల గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్కు దారితీయవచ్చు.. ఇటీవల తరచూ కనిపిస్తున్న కేసుల్లో 90 శాతం ఈ తరహా సమస్యలే ఎక్కువని, క్రీడలు, వ్యాయామం చేస్తుండగానే కుప్పకూలిపోతున్నారన్న విషయం తెలిసిందే.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్ అవసరం.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్లో శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో.. వ్యాయామం, ఆహారపు అలవాట్లు అంతే అవసరం.. ఒక్కసారిగా సన్నబడిపోవాలని ఎక్కువగా జిమ్ చేయడం, అలసిపోయే వరకూ క్రీడల్లో పాల్గొనడం కార్డియాక్ అరెస్ట్కు కారణం కావచ్చు. ఆహారం తగ్గించి ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదు. జిమ్, క్రీడా మైదానాల్లో ఇంప్లాంటబుల్ కార్డియో వర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ) అనే పరికరం వినియోగిస్తే గుండె లయను క్రమబద్ధీకరిస్తుంది. ఎయిర్ పోర్టు, మాల్స్లో ఏఈడీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గుండె ఆగిపోయినప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కమ్యూనిటీల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థి దశ నుంచే పీసీఆర్పై శిక్షణ ఇస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ భార్గవి, కార్డియాలజిస్ట్, రెయిన్బో హార్ట్ ఇన్స్స్టిట్యూట్ -
టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే ! ఇలా తాగితే..
చాలా మందికి కప్పు చాయ్ తాగితే గాని రోజు ప్రారంభం కాదు, లక్షలాది మంది భారతీయులకు, టీ అనేది కేవలం ఒక పానీయం కంటే ఎక్కువ. కొన్ని చోట్ల ఇది ఒక ఆచారం కూడా. అయితే ఇది ఒక కప్పులో మనకు అందిస్తున్న వైద్య చికిత్స కూడా అంటున్నాయి అధ్యయనాలు. రోజుకు రెండు కప్పుల వరకు టీ తాగడం గుండెను కాపాడుతుంది. అంతేగాదు స్ట్రోక్, గుండె వైఫల్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేపట్టిన 2 అధ్యయనాలు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాయి. అవి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ‘‘హృదయ నాళ ప్రమాద కారకాలను నిర్వహించడంలో టీ పాత్ర: అందే ప్రయోజనాలు, విధానాలు ఇంటర్వెన్షనల్ వ్యూహాలు’’ అనే అంశంపై అదే విధంగా కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ అనే అంశంపైనా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. అవి చెబుతున్న ప్రకారం...టీ దాని రసాయన కూర్పు కారణంగా కేవలం పానీయం కాదు; ఇది యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలతో నిండిన సహజ శక్తి కేంద్రం. దీనిలో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే, వాపును తగ్గించే ఫ్రీ రాడికల్స్తో పోరాడే కాటెచిన్లు థియాఫ్లావిన్లు ఉన్నాయి. అంతేకాకుండా, టీ లోని పాలీశాకరైడ్లు రక్తంలో చక్కెరను సరైన విధంగా నిర్వహించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ: కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ లో ప్రచురించిన ఈ నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం దాదాపు 13 సంవత్సరాలుగా 177,000 మందిని భాగం చేసింది.టీ దాని ఆరోగ్య ప్రయోజనాలకు చాలా కాలంగా పేరొంది. శరీరంలో ఆరోగ్యకరమైన లిపిడ్ (కొవ్వు మరియు కొలెస్ట్రాల్) స్థాయిలకు మద్దతు ఇచ్చే దాని సామర్థ్యం వాటిలో ముఖ్యమైనది.ప్రతిరోజూ రెండు కప్పుల వరకు టీ తాగితే.. గుండె పోటు ప్రమాదం 21% తగ్గుతుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 14%, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 7% తగ్గుతాయి.కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తుంది: టీ శరీరపు సహజ కొవ్వును నిర్మూలించే ప్రక్రియలను బలోపేతం చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది అల్లం వంటి సప్లిమెంట్లతో కలిపితే ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి సహాయపడుతుంది.మహిళలకు ఎక్కువ ప్రయోజనాలు: శరీరంలో కొవ్వు సంబంధిత నష్టాన్ని తగ్గించే విషయంలో 20 నుండి 48 సంవత్సరాల వయస్సు గల మహిళలు విటమిన్ల నుంచి వచ్చే వాటి కంటే టీ తాలూకు యాంటీఆక్సిడెంట్ల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు.రక్తపోటు (అధిక రక్తపోటు) గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ముఖ్యంగా మితమైన పరిమాణంలో దీర్ఘకాలిక టీ వినియోగం వృద్ధులలో సిస్టోలిక్ డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ 2–3 ఎంఎంహెచ్జి వరకూ తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.తైవాన్ లో జరిగిన ఒక అధ్యయనంలో సంవత్సరానికి పైగా రోజుకు 120 మి.లీ. మించకుండా టీ తాగేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం బాగా తక్కువని తేలింది. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది: టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్ ఉన్నాయి, ఇవి రక్త నాళాలు సరళంగా ఉండటానికి (వాసోడైలేషన్), వాపును తగ్గించడానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవన్నీ కాలక్రమేణా రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి.ప్రయోజనాలు అందాలంటే...ఇలా తాగాలంతే...కానీ ట్విస్ట్ ఏమిటంటే... టీకి చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను జోడించిన వెంటనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అదృశ్యమవుతాయి, అంటే చాలా మంది ఇష్టపడే తీపి, పాల మసాలా చాయ్ వల్ల లాభాలు శూన్యం. ఆకుపచ్చ లేదా నలుపు రంగులో (గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ) ఉన్న ప్రతి కప్పు సైన్స్ ఆధారిత ఆరోగ్య లాభాలను అందిస్తుంది. అంతేగాదు చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లు లేకుండా ఆస్వాదించినప్పుడు దాని నిజమైన రుచి అలవాటవుతుంది. దానిని ఆరోగ్యం కోసం అనుసరించే ప్రిస్క్రిప్షన్ గా భావించాలి. కొన్ని రోజులు దీన్ని కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తే త్వరగానే అలవాటు పడతారు దాని స్వచ్ఛమైన రూపంలో టీ ఎంత రిఫ్రెషింగ్గా సహజంగా సంతృప్తికరంగా ఉంటుందో కూడా తెలిసివస్తుంది. -
ప్రకృతి సిద్ధమైన ఓజెంపిక్ !
-
కాలేయ సంబంధిత సమస్యలపై ఉచిత ఆరోగ్య శిబిరం
మెహదీపట్నంలోని ఆలివ్ ఆసుపత్రిలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో సుమారు రెండు వందల మంది పాల్గొన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. హెపటైటిస్ కన్సల్టేషన్ కోసం ఈ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు తెలిపింది. కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న ఈ తరుణంలో వీటిపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరముందని, ఈ దిశగా తామీ ప్రయత్నం చేశామని ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ పరాగ్ దశావతార్ (ఎండీ జనరల్ మెడిసిన్) తెలిపారు. జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు సుమారు 200 మంది కన్సల్టేషన్ సేవలు పొందారని ఆయన వివరించారు. ఆలివ్ హాస్పిటల్ సుమారు 210 పడకల అత్యాధునిక ఆసుపత్రి అని, తరచూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..
ఇటీవల కాలంలో అందరిని వేదించే సమస్య అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు. ఎందుకంటే నచ్చిన ఆహారం కాస్త ఎక్కువగా తినకుండా ఉండలేరు చాలామంది. చెప్పాలంటే.. ఫుడ్ విషయంలో నోరు కంట్రోల్లో ఉంటే చాలా వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అది చాలా కష్టం. ఎందుకంటే నోరూరించే పదార్థాలు తినమని పిలుస్తుంటే ఆగకుండా ఉండటం ఎవరికి సాధ్యం. మరి అలాంటి సమస్యను అధిగమించి రుచిని ఆస్వాదిస్తూ..బి లిమిట్ని పాటించటం ఎలాగో తెలుసుకుందామా..!.బాలీవుడ్ నటి కరీనా కపూర్ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ..మనసారా నచ్చిన ఆహారం తింటూనే అధిక బరువు, గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చొ షేర్ చేసుకున్నారు. నిజానికి మనం ఏ ఆహారాన్ని తింటున్నా..ఒకటి రెండు, మూడు..అలా అన్ని సార్లు పెట్టుకుంటూ లాగించేస్తాం. మరి ఇష్టమైన ఫుడ్ అయితే ..ఎంతలా తింటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియంత్రణ లేకుండా తినడాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే..ఈ మైండ్ఫుల్నెస్ టెక్నీక్ అయినా జోర్డాన్ ఫార్ములాను ఫాలోకండని చెబుతున్నారామె. ఇంతకీ అదేంటంటే..అందుకు ఆమె ఒక స్నాక్స్ ఐటెంని ఉదాహారణ తీసుకుంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఉదాహరణకు సగ్గుబియ్యం వడలు స్నాక్స్గా తినాలనుకున్నారు. అప్పుడు వెంటనే ప్లేట్ ఓ ఐదు వడలు తక్కువ కాకుండా లాగించేస్తారు. కానీ అలా కాకుండా ఇంత వరకు తినాలని ఫిక్స్అవ్వాలి. వంటకాలు నోరూరించేలా ఉండొచ్చు..కానీ ఆరోగ్యంపై ధ్యాస..ఎలా తింటే బెటర్గా ఉంటానన్నది ఆ పదార్థాలను చూడగానే ఠక్కున గుర్తుకు రావాలి. అలాంటి ఆలోచన రాగానే తినాలనే ఆలోచన ఆటోమెటిగ్గా నియంత్రణలోకి వచ్చేస్తుంది. వేసుకునేటప్పుడే రెండు లేదా మూడుతో ఆపేస్తారని చెబుతున్నారామె. పైగా దాన్ని ఎంజాయ్ చేసేలా చట్నీ లేదా ఇతరత్రా వాటిని సిద్ధం చేసుకుని ప్రతి ముక్కను ఆస్వాదిస్తూ..తింటుంటే కడుపు నిండిన అనుభూతి ప్లస్..తక్కువ తినడం రెండు సాధ్యమవుతాయట. దీన్ని మైండ్ఫుల్నెస్ తినడం అంటారని అన్నారు. రుజుతా ఈ చిట్కాకు జోర్డాన్ ఫార్ములాగా పేర్కొన్నారు. మంచి జోష్తో నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ లిమిట్గా తినడమే ఈ జోర్డాన్ ఫార్ములానట. ఈ టెక్నిక్లో బేసి సంఖ్యలో పదార్థాలను తీసుకునేలా ఫిక్స్ అవ్వడం తోపాటు..క్రమశిక్షణతో తినడం అలవడుతుందట. అయితే ఇక్కడ తప్పనిసరిగా బుద్ధిపూర్వకంగా, నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం అనేది అత్యంత కీలకం. అప్పుడే తీసుకునే ఆహారంపై కంట్రోల్ ఉంటుందట. ఇది స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తూ..ఆహారంపై అవగాహన ఉండేలా తీసుకునేలా చేస్తుందట. ఇది చక్కటి సత్ఫలితాలనిస్తుందని ఆమె ధీమాగా చెబుతున్నారు. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, ఆకలే ప్రధానం. అందుకోసం ఆనందిస్తూ తినేలా..పరిమితంగా తినడం అనేదానిపై శ్రద్ధ పెట్టడం అనే జోర్డాన్ సూత్రం పాటిస్తే చాలు అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. మరి ఇంకెందు ఆలస్యం ప్రయత్నంచి చూడండి. View this post on Instagram A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!)) -
బరువు తగ్గించే అద్భుత పానీయాలు ఇవే..!
బరువు తగ్గేందుకు ఎన్నో రకాల డైట్లు, వర్కౌట్లు చేస్తుంటారు. వాటి తోపాటు బాడీలోని చెడు కొలస్ట్రాల్ని తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే ఈ పానీయాలను కూడా జోడించినట్లయితే బరువు తగ్గడం మరింత సులభమవుతుంది. అందుకోసం అల్లాన్ని తప్పనిసరిగా మన రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి. మరి అదెలాగో తెలుసుకుందామా..!.అధిక బరువుకి చెక్ చెప్పే అద్భుత పానీయాలివే..గోరు వెచ్చిని అల్లం లెమెన్ వాటర్.. గోరువెచ్చని అల్లం నీటిలో కొద్దిగా నిమ్మరసం జోడించి పరగడుపునే తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే బాడీలోని చెడు కొలస్ట్రాల్ని తగ్గించి త్వరితగతిన బరువు తగ్గేలా చేస్తుంది. తయారీ విధానం: గోరువెచ్చని నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత నిమ్మకాయను జోడించి తీసుకుంటే చాలు. కావాలనుకుంటే దాల్చిన చెక్క లేదా నల్లమిరియాలు కూడా జోడించొచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా అల్లం షాట్: ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అల్లంతో కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎలా తయారు చేయాలంటే: ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్కు అరటీస్పూన్ అల్లం రసం జోడించాలి. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీరు జోడించాలి. రోజుకు ఒకసారి భోజనానికి ముందు తాగాలి. ఇది దంతాల సంరక్షణకు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దోసకాయ అల్లం డీటాక్స్: దీన్ని రిఫ్రెషింగ్ డ్రింగ్గా పిలుస్తారు. రోజంతా ఈ నీటిని సిప్ చేయొచ్చు. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అనవసరమైన చిరుతిండిని అరికట్టడంలో సహాయపడుతుంది. తయారీ విధానం: దోసకాయ, ఒక చిన్న అల్లం ముక్క, పుదీనా ఆకులు వేసి కొన్ని గంటలు లేదా రాత్రంత నానబెట్టాలి. ఈ వాటర్ని ఒక బాటిల్లో పోసుకుని కూడా హాయిగా తీసుకువెళ్లొచ్చు. అల్లం గ్రీన్ టీ: ఇది శరీరంలో కొవ్వుని సులభంగా కరిగిస్తుంది. భారీ భోజనాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తయారీ విధానం: వేడినీటిలో గ్రీన్ టీ బ్యాగ్ని ఉంచి, అల్లం జోడించాలి. తాగాడానికి కొన్ని నిమిషాలు ముందు చేసుకుంటే చాలు. వ్యాయమానికి ముందు ఆస్వాదిస్తే..సులభంగా బరువు తగ్గుతారు.పసుపు అల్లం లాట్టే (గోల్డెన్ మిల్క్)మంచి నిద్రకు సరైనది ఇది. చలికాలంలో మంచి వెచ్చదనాన్ని అందించి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లం, పసుపు మిశ్రం శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట జీర్ణక్రియకు మద్దతిస్తుంది. తయారీ విధానం: గోరువెచ్చని ఒక కప్పు బాదం లేదా ఓట్మిల్క్లో తాజా అల్లం లేదా అలం పొడిని కలపాలి. చిటికెడు నల్లమిరాయాలు, దాల్చిన చెక్క కలపి మరిగించండి. అవసరమైతే తేనెతో తాగండి. ఈ పానీయాలు డైట్లో చేర్చుకుంటే ఆకస్మికంగా అద్భుతమైన మార్పులు రాకపోయినప్పటికీ, మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే సమతుల్యం ఆహారాన్ని మెయింటైన్ చేయడంలో ఉపకరించడమే గాక సులభంగా బరువు తగ్గేందుకు దారితీస్తుంది.(చదవండి: యువరాజ్ సింగ్ లగ్జరీ ఇల్లు.. అసలైన ఇంటీరియర్ డిజైన్ అదే అంటున్న యువీ!) -
పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?
నాకు ముప్పై ఐదు ఏళ్లు. మోకాలి నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను. మునుపటి మందుల వలన ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పటికీ ఆ మందులు వాడొచ్చా?– అనిత, మెదక్.మీరు చెప్పిన మోకాలి నొప్పి సమస్య ఆస్టియో ఆర్థరైటిస్ కారణం కావచ్చు. ఇది జాయింట్ డీజెనరేషన్ లక్షణాలలో ఒకటి కావచ్చు. పెయిన్ కిల్లర్ మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కాని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ మందుల వాడకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఐబుప్రొఫెన్ లాంటి మందులు తక్కువ కాలం ఉపశమనం ఇస్తాయి కాని, దీర్ఘకాలంగా వాడడం సురక్షితమేమీ కాదు. ముందుగా పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. ఐబుప్రొఫెన్ వంటి మందులు ఎన్ ఎస్ఎఐడీ గ్రూపులోకి వస్తాయి. ఇవి నొప్పికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా వుంటాయి. మోకాలిలో నొప్పి లేదా గట్టిపడటం వంటి సందర్భాల్లో శరీరంలో ప్రోస్టాగ్లాండిన్లు అనే కెమికల్స్ విడుదల అవుతాయి. వీటిని తగ్గించడానికే ఈ మందులు పనిచేస్తాయి. ప్రెగ్నెన్సీలో వీటిని వాడితే పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని మందులు జీర్ణాశయంలో అల్సర్లు, శ్వాస సమస్యలు, బ్లడ్ క్లాట్లు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. హెర్బల్ మందులు కూడా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో ఏ ఔషధాన్నైనా డాక్టర్ను సంప్రదించి మాత్రమే వాడాలి.నాకు యాభై ఐదు ఏళ్లు. ఇటీవల వజైనాలో పొడిగా ఉంటోంది. ఇరిటేషన్, ఇచింగ్, డిశ్చార్జ్ వస్తోంది. కొన్ని క్రీములు వాడాను. అయినా తగ్గడం లేదు. పరిష్కారం చెప్పండి.– సుజాత, రాజోలు.వజైనాలో పొడిబారడం అంటే ఎక్కువగా హార్మోనుల మార్పుల వలన వచ్చే సమస్య. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పచ్చటి డిశ్చార్జ్ వస్తే, అది ఇన్ఫెక్షన్ కావొచ్చు. పొడిగా మారడం, ఇచింగ్ అనేవి వజైనల్ వాల్స్, యూరినరీ ట్రాక్ట్ సున్నితంగా మారినప్పుడు జరుగుతుంది. ఆరోగ్యకరమైన వజైనల్ మ్యూకస్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. దీనివల్ల వజైనాలో తేమ తగ్గిపోతుంది. ఇక ఎక్కువ మంది బాధపడే ఇచింగ్ సమస్యకు కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, వజైనల్ బ్యాక్టీరియా లోపం కూడా కారణం కావచ్చు. మెనోపాజ్ తర్వాత ఓవరీల నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కూడా తేమ తగ్గే అవకాశం ఉంటుంది. వజైనల్ గ్లాండ్లు ఈస్ట్రోజ పై ఆధారపడి మ్యూకస్ తయారుచేస్తాయి. అవి తగ్గిపోతే పొడి సమస్య ఎక్కువవుతుంది. యాంటీఫంగల్ ఆయింట్మెంట్లు, పౌడర్లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఈస్ట్రోజన్ క్రీములు, వజైనల్ లూబ్రికెంట్లు, వజైనల్ ఈస్ట్రోజన్ టాబ్లెట్లు, కొన్ని ప్రత్యేకమైన మందులు డాక్టర్ సూచనతోనే వాడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు ఈ చికిత్సలు తీసుకోకూడదు. కనుక తప్పకుండా గైనకాలజిస్టును సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన చికిత్స తీసుకోవాలి.(చదవండి: పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..! సీరియస్గా తీసుకోవాల్సిందే..) -
పెరిగే ఒత్తిడి కంటికీ కాటే..!
ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. ఒత్తిడి మన అంతర్గత అవయవాలపైనా, మెదడుపైనా ప్రతికూల ప్రభావాలను చూపి, అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు గుండె, మానసిక ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ మొదలైన అంశాలపై ఒత్తిడి ప్రభావం చాలా తీవ్రంగానే పడి గుండె΄ోటు మొదలుకొని, జీర్ణసమస్యలూ, మానసిక సమస్యలూ వస్తాయి. అలాగే కంటి విషయంలో ఒత్తిడి తన దుష్ప్రభావాన్ని ఎలా తెచ్చిపెడుతుందో తెలుసుకుందాం.కంటిపై ఒత్తిడి దుష్ప్రభావం ఎలాగంటే... కంటిపై పడే దుష్ప్రభావాలకంటే ముందుగా... అసలు ఒత్తిడి వల్ల దేహంపై కలిగే ప్రభావాలేమిటో, అసలవి ఎందుకు కలుగుతాయో చూద్దాం. అపాయకరమైన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడిలో దేహం ‘ఫైట్’ లేదా ‘ఫ్లైట్’ అనే పరిస్థితికి సిద్ధమవుతుంది. అంటే పోరాడు’ కుదరకపోతే పారిపో’ అనే పరిస్థితులకు దేహాన్ని సిద్ధం చేస్తుంది. ఈ సమయంలో దేహంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు వెలువడతాయి. ఆ హార్మోన్ల వల్ల దేహం చాలా కొద్ది వ్యవధిలోనే పారిపోవడానికి లేదా పోరాటానికి అవసరమైన బలాన్ని ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేలా చేస్తుంది. పదే పదే కలిగే ఒత్తిడి కారణంగా కండరాలు ఒత్తిడికి గురి కావడం, వాటికి అవసరమైన రక్తప్రవాహం అందక΄ోవడం, కండరాల్లో ఇన్ఫ్లమేషన్ వంటి అనర్థాలు ఏర్పడే అవకాశాలుంటాయి. కంట్లో ఉండేవీ కండరాలే కావడంతో అన్ని కండరాల్లాగానే వీటిపైన కూడా ఆ దుష్ప్రభావాలు పడతాయి.కంటిపై ఒత్తిడి పెంచే అంశాలివి... ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యేవారిలో కళ్లపై కొన్ని దుష్ప్రభావాలు పడతాయి. అన్ని రకాల ఒత్తిళ్లతో పాటు మరికొన్ని అంశాలు కళ్లపై తమ ప్రభావాన్ని నేరుగా పడేలా చేస్తాయి. అవి... ఎక్కువ సేపు స్క్రీన్ను చూస్తుండటం. (అది టీవీ, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ ఏదైనా కావచ్చు); నిద్రలేకపోవడం; వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటుండటం... ఇవన్నీ కంటిపైనా ఒత్తిడి పడేలా చేస్తాయి.ఒత్తిడి కారణంగా వచ్చే కంటి సమస్యలివి... కన్ను స్ట్రెయిన్ కావడం (ఏస్థెనోపియా) : డిజిటల్ స్క్రీన్స్కు నిత్యం ఎక్స్΄ోజ్ అవుతూ ఉండటం. ఈ కారణంగా కళ్లు స్ట్రెయిన్ అవుతుంటే తలనొప్పి, కళ్లు ΄÷డిబారడం, మసక మసగ్గా కనిపించడం వంటివి.డ్రై ఐస్ : ఒత్తిడి కారణంగా కళ్లలో స్రవించే నీరు (కన్నీరు లేదా లాక్రిమస్ సెక్రిషన్) తగ్గుతుంది. దీని కారణంగా కళ్లు పొడిబారడంతో పాటు కళ్లలో ఇసకపడ్డట్లు ఫీలింగ్, ఇరిటేషన్, కళ్లమంటల వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్లర్డ్ విజన్ : కంటి చుట్టూతా ఉండే కండరాలు ఒత్తిడితో బిగుసుకుపోతున్న కారణంగా... చూపు స్పష్టంగా కనిపించక ఎదుటనున్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. ఒక్కోసారి ఒత్తిడి కారణంగా కళ్లలో సన్నటి కన్నీటి పొర అవరించినప్పుడూ ఇలా మసగ్గా కనిపించవచ్చు. కన్ను అదరడం (ట్విచ్చింగ్) : కన్ను అదరడం చాలామందిలో కనిపించే సాధారణమైన అంశం. కన్ను అదరడాన్ని బట్టి కొందరు శుభసూచనలను / అశుభసూచకాలను దీనికి ఆ΄ాదిస్తుంటారు. ఇలా కన్ను అదరడాన్ని (ట్విచ్చింగ్ను) దీన్నే వైద్య పరిభాషలో ‘మయోకైమియా’ అంటారు. ఇది దీనివల్ల ఎలాంటి హానీ ఉండదు. అయితే ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడి కారణంగా కన్ను అదురుతుండటం చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. కాంతికి ప్రతిస్పందించడం (లెట్ సెన్సిటివిటీ) : తీవ్రమైన కాంతిలో కన్ను చాలా ఇబ్బందికి గురయ్యే విషయం తెలిసిందే. ఒత్తిడితో కన్ను రెండు రకాలుగా ఇబ్బంది పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి... మైగ్రేన్ను కలగజేస్తుందన్న విషయం తెలిసిందే. మైగ్రేన్లో కన్ను మామూలు కాంతిని కూడా చూడలేక΄ోతుంది. అలాగే ఆరుబయట తీవ్రమైన కాంతి ఉన్నప్పడూ కన్ను తెరుచుకోడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని కంటి భ్రమలూ, భ్రాంతులు (విజువల్ హేలూసినేషన్స్) : అరుదుగా కొన్ని సందర్భాల్లో కంటికి కొన్ని దిగ్భ్రమలు కలుగతాయి. దాంతో కంటి ముందు లేనివి కూడా ఉన్నట్లు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని కాంతిపుంజాలు వెలుగుతున్నట్లుగానూ, అవి తేలుతూ పోతున్నట్లుగానూ (వీటినే ఫ్లోటర్స్ అంటారు), మెరుపులు మెరుస్తున్నట్లుగా దిగ్భ్రమలు కలగవచ్చు. కొన్నిసార్లు తాత్కాలికంగా కన్ను దేన్నీ చూడలేకపోవచ్చు కూడా. ముఖ్యంగా ఇలాంటివి ఆక్యులార్ మైగ్రేన్ అనే కండిషన్లో కలుగుతాయి.మేనేజ్మెంట్ / చికిత్స...లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. ఉదాహరణకు కన్ను పొడిబారిన సందర్భాల్లో కృత్రిమంగా కన్నీటిని ఇచ్చే చుక్కల మందులూ, ల్యూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, కన్ను సరిగా చూడలేక΄ోతున్న సందర్భాల్లో యాంటీ గ్లేర్ కళ్లజోడు, కన్ను పూర్తిగా అలసి΄ోతున్నప్పుడు కంటికి సంబంధించిన కొన్ని వ్యాయామాలను డాక్టర్లు చెబుతారు. దీనికి తోడు పూర్తి దేహానికి ఒత్తిడి తొలగేందుకు యోగా, పప్రాణాయామ వంటి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలంటూ చెబుతారు. ఇక కొందరికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. దీనికి తోడు దేహానికి తగినన్ని ద్రవాలు అందుతూ దేహాన్ని హైడ్రేటెడ్గా ఉంచేలా నీరూ, ద్రవాహారం తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, మంచి ΄ోషకాహారం తీసుకోవడం వంటి మంచి జీవనశైలి మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. చివరగా... ఇటీవల వైగవంతమైన జీవనశైలిలో కంటినీ, కంటి ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. మొదట్లో ఒత్తిడి (స్ట్రెస్) కారణంగా కంటికి వచ్చే అనారోగ్యాలు పెద్దగా ఇబ్బంది పెట్టక΄ోవచ్చుగానీ... ఇదే వత్తిడి దీర్ఘకాలం ఉంటూ అదేపనిగా కంటిపై ఒత్తిడి కలగజేస్తే అది మరిన్ని దుష్పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ‘చికిత్స కంటే నివారణ మేలు’ అనే సూక్తిని అనుసరించి సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిపై దృష్టి కేంద్రీకరించి, దాన్ని పూర్తిగా తగ్గించుకోవలన్న వాస్తవం కంటి విషయంలో మరింతగా ఆచరించాల్సిన సత్యం. కంటిపై ఒత్తిడి తగ్గి... కన్ను ఆరోగ్యంగా ఉండాలంటే...ప్రతి 20 నిమిషాలకొకసారి 20 అడుగుల దూరాన్ని 20 సెకన్ల పాటు చూస్తుండాలి.ప్రతి రెండు గంటలకోసారి (కంప్యూటర్ చూడ్డంలాంటి) పనికి బ్రేకిచ్చి 10 – 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే గంటా లేదా రెండుగంటల ముందర మొబైల్ ఆపేయాలి. రాత్రి చీకట్లో లైట్ లేకుండా మొబైల్గానీ, లాప్టాప్గానీ చూడకూడదు.ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. (చదవండి: అరటి తొక్కలతో దంతాలకు తళతళలాడే తెలుపు..! నిపుణులు మాత్రం..) -
పీరియడ్ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)
-
వేడి వేడి కాఫీ...సైన్స్ ఏం చెబుతోంది? (ఫొటోలు)
-
ఉల్లి... వెల్లుల్లి.. తల్లి!.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు (ఫొటోలు)
-
ఊరికే అలసిపోతున్నారా?
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం ఒకటి. పొటాషియం మన శరీరంలో బీïపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను తీసుకోవాలి. పొటాషియం లోపిస్తే కండరాలు బలహీనంగా మారుతాయి. కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆకలి లేక΄ోవడం, మానసిక కుంగుబాటు, తరచు వాంతులు, విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. అందువల్ల పొటాషియం లోపించకుండా చూసుకోవాలి.సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.ఎందులో లభిస్తుందంటే.. కోడిగుడ్లు, టమాటాలు, చిలగడ దుంపలు, విత్తనాలు, నట్స్, అరటి పండ్లు, యాప్రికాట్స్, చేపలు, తృణ ధాన్యాలు, పెరుగు, పాలు, మాంసం, తర్బూజా, క్యారెట్, నారింజ, కివీ, కొబ్బరినీళ్లు, బీట్రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది.మనం ఏం చేయాలంటే...ఎవరైనా ‘మిరాకిల్ క్యూర్‘ అంటే వారి మాటలు నమ్మవద్దు. వాస్తవాలను చెక్ చేయాలి. ఇన్ఫ్లూయెన్సర్ల మాటల్ని అస్సలు నమ్మవద్దు. సోషల్ మీడియాలో చెప్పే ఔషధాలు/క్రీములు చాలావరకు నిర్ధారణ కానివే. వేళకు పోషకాహారం తినడం, నిద్ర, వ్యాయామం.. ఇవే నిజమైన యవ్వన రహస్యాలు.వయస్సు పెరిగినా యవ్వనాన్ని అవగాహనతో అందంగా, ఆరోగ్యంగా నిలుపుకోవచ్చు.ఔషధాలా, చికిత్సలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు, పూర్తి అవగాహనకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. (చదవండి: ఎప్పటికీ యవ్వనంగా.. అలాంటి చికిత్సలు తీసుకోవచ్చా..?) -
జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)
-
పదేపదే చెవుల్లో మ్యూజిక్ వినిపించడం మానసిక సమస్య..?
నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. కుటుంబపోషణ కోసం చిన్నప్పటినుంచే మా నాన్న గారి సెలూన్లో పని చేసేవాణ్ణి. పెళ్లిళ్లలో సన్నాయి వాయించడం కోసం కూడా వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. నా పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అయ్యారు. నేను సెలూన్ పని మానేసి పదేళ్లవుతోంది. సన్నాయి వాయించడం కూడా ఆపేశాను. కాలక్షేపం కోసం ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టుకున్నాను. నాకు ఒక సంవత్సర కాలం నుండి నేను గతంలో పెళ్లిళ్లలో వాయించిన సంగీతం, పాటలు చెవిలో మళ్లీ మళ్లీ వినపడుతున్నాయి, ముందు ఇంటి దగ్గర్లో ఏదైనా పెళ్లి అవుతుంటే అక్కడ నుండి వచ్చే శబ్దాలు, పాటలు అనుకున్నాను కానీ అని పగలు, రాత్రి, రోజంతా వినపడుతూనే ఉంటాయి. ఆ శబ్దాల వల్ల నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మాకే శబ్దాలూ వినపడట్లేదు. నువ్వు ఊహించుకుంటున్నావు అంటున్నారు. నాకే ఎందుకు ఇలా అవుతోంది... ఈ బాధ నుంచి నన్ను బయట పడేయండి డాక్టరు గారూ!– గురునాథం, కరీంనగర్ మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీ పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్లినందుకు ముందుగా మీకు నా అభినందనలు. ఇక మీ సమస్య విషయానికి వస్తే మీకు ఉన్న కండిషన్ని ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అంటారు. మనం గతంలో విన్న పాటలు, శబ్దాలు అప్పుడుప్పుడు వినపడటం అందరికీ జరుగుతుంటుంది. ఉదాహరణకు పొద్దున మనకు నచ్చిన పాట వింటే అది కాసేపు అలాగే ‘మైండ్లో’ ప్లే అవడం, దాన్ని మనం ఎంజాయ్ చేయడం సర్వసాధారణం! కాసేపటికి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ మీ విషయంలో ఎప్పుడో విన్న పాటలు, సంగీతం పదే పదే వినిపించడం, అవి మిగిలిన వాళ్ళకి వినపడకపోవడం, దానివల్ల డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు రావడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అనేది అరుదుగా కనబడే ఒక లక్షణం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముందుగా మీకు వినికిడి సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చెయించుకోండి. అలాంటిది ఏదైనా ఉంటే హియరింగ్ మెషిన్ వాడితే మీ సమస్య చాలావరకు తగ్గిపోతుంది. మీ వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి పెద్ద వయసులో వచ్చే డిమెన్షియా, మెదడులో ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. ఇవేమీ లేవని నిర్ధారణ అయితే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిస్తే మీకు పరీక్షలు చేసి ‘యాంటీ సైకోటిక్’ మందులు, అలాగే మీ డిప్రెషన్ తగ్గడానికి మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు. వాటిని కొంతకాలం వాడితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడమీ సమస్యలు, సందేహాలు sakshifamily3@gmail.com)(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్కి సై) -
Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!
చిరు జల్లుల, హోరు వానలతో వర్షాకాలం హాయిగా మనల్ని పలకరించేసింది. ఒళ్లంత తుళ్లింత కావాలిలే.. గుండెల్లో జల్లంతా కురవాలిలే! అన్న మురిపెం మాత్రమే కాదు ఇది వ్యాధులు ముసురుకునే కాలం కూడా. వైరస్లు, బ్యాక్టీరియా విజృంభించే కాలం. ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తాయి. ఫలితంగా వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కలరా, టైఫాయిడ్ ముసిరే అవకాశం ఉంది. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా వర్షకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.వేసవి తర్వాత వాతావరణంలో జరిగే మార్పులు, రుతుపవనాలు మార్పుల తదితర కారణా లరీత్యా సీజనల్ వ్యాధులు దాడిచేస్తాయి.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.ఎడతెరపి లేని వర్షాలు, వాటివల్ల నిల్వ ఉండే నీటిలో దోమలు ఆవాసాలను ఏర్పరచుకోవడం, రోడ్లపై మురిగిన నీరు ఉండటం.. ఇలా రకరకాల కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.నీటికుంటలో, కాలువల్లో, ఇంటి పరిసరాల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీరు దోమలకు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలకు సంతానోత్పత్తి నిలయంగా మారి,వ్యాధులకు కారణమవుతాయి.దోమల డెంగ్యూ, మలేరియా టైపాయిడ్ తో పాటు గాలి ద్వారా వ్యాపించే జబ్బులు జలుబు, గొంతునొప్పి వస్తాయి. (Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే)వర్షాల వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే శుభ్రమైన, కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. గోరువెచ్చని నీటిని తాగితే ఇంకా మంచిది.తాజాకూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆకుకూరలు వాడేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి తీసుకోవాలి.బయట ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లోనే తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలుషిత ఆహారం ద్వారా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోవాలి.ఆహారానికి తీసుకునేముందు ముందు చేతులు కడుక్కోవాలి.ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా పిల్లలకు దీన్ని బాగా అలవాటు చేయాలి.రాత్రి పూటదోమలు కుట్టకుండా దోమతెరలు వాడటం మంచిది. బాగా చల్లగా ఉన్నపుడు శరీరం వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి.పోషకాహారం ఆహారంపై శ్రద్ధపెట్టాలి. రోగనిరోధక శక్తి బలపడేలావిటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి.వర్షం అనగానే సంబరపడిపోయే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక వేళ వర్షంలో తడిచినా, వెంటనే శుభ్రంగా తుడిచి పొడి బట్టలు వేయాలి. ముఖ్యంగా తల తడి లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అనారోగ్యం తప్పదు.ఇదీ చదవండి : కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోపిల్లల్లో జలుబు, చిన్నపాటి జ్వరాల నుంచి కాపడడానికి అల్లం, తులసి, వామ్ము ఆకులతో చేసిన కషాయానికి కొద్దిగా తేనె కలిపి ఇస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.నోట్ : ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఎలాంటి అనారోగ్య లక్షణాలు కన్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
చినుకుల్లో హాయి..! జాగ్రత్తలు అవసరమోయి..
చిరుజల్లులలో ఏదైనా వేడి వేడి ఫుడ్ ఉంటే.. దానికి తోడు కమ్మటి వాసనతో హాట్ కాఫీ సిప్ చేస్తుంటే.. ఆ హాయి మరోలా ఉంటుంది. ఇలాంటి అనుభూతులు నగరవాసులకు ఎన్నెన్నో.. సిటీలో చినుకులు పడుతుంటే చాలు జనం ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్లపై సందడి చేస్తుంటారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో ఆరోగ్యం, హైజీన్, డిజిటల్ టూల్స్ వంటి అంశాలను సైతం సమానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు నగరవాసులు. ఎందుకంటే ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలాన్ని సురక్షితంగా, అందంగా అనుభవించడానికి కొన్ని లైఫ్స్టైల్ హ్యాక్స్, గాడ్జెట్స్, యాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలం అనేది సహజంగా ఆనందాన్ని కలిగించేది. కానీ అదే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని, గాడ్జెట్లను, ఇంటిని, ఫ్యాషన్ను సమానంగా వాడుకుంటే ఈ సీజన్ను ఎంతో ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. మోడ్రన్ లైఫ్స్టైల్లో టెక్నాలజీ సహకారంతో వర్షాకాలాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం. ఈ వానల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు పొందే ఆనందానికి బలం అవుతాయి.వర్షాకాలం హెల్త్కేర్ టిప్స్.. వానల సమయంలో నీటి కాలుష్యం, ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల జ్వరాలు, డైజెస్టివ్ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సీజన్లో ఇంట్లోనే వంట చేసుకోవడం, వేడి నీళ్లు తాగడం, తులసి టీ, అల్లం–పెప్పర్ సూప్ వంటి బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాషన్తో పాటు ఫంక్షనాలిటీ.. వర్షాకాలం అంటే మడమ తొక్కినట్లుగా బురద, తడిగా మారే దుస్తులు.. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటర్ రిపెలెంట్ ఫ్యాబ్రిక్స్, సిలికాన్ షూ కవర్స్, ఫోల్డబుల్ రైనిక్స్ లాంటి ఉత్పత్తులతో స్టైలిష్గా ఉండటమే కాకుండా తడిసిపోకుండా ఉండొచ్చు. ట్రెండీ అంబ్రెల్లాస్: యాక్టివ్ కలర్స్, ఓపెన్–క్లోజ్ మెకానిజంతో అందంగా ఉండే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటర్ప్రూఫ్ బ్యాక్ప్యాక్స్: టెక్ లవర్స్ కోసం వర్షంలో కూడా ల్యాప్టాప్, గ్యాడ్జెట్లు భద్రంగా తీసుకెళ్లేందుకు ఉపయోగకరం. వాటర్ప్రూఫ్ ఫోన్ కవర్లు: ముఖ్యంగా రోడ్ల మీద లేదా బైక్ ప్రయాణాల్లో తప్పనిసరి. హెల్త్ మానిటరింగ్ యాప్లు, గాడ్జెట్స్.. ఫిట్ బిట్, ఎమ్ఐ బ్యాండ్ వంటి వేరబుల్స్ ద్వారా వాకింగ్ ట్రాక్ చేయవచ్చు. హెల్తీ ఫై మీ వంటి డైట్ యాప్లు మంచి ఆహార నియమాలు పాటించేందుకు దోహదపడుతున్నాయి. ప్రాక్టో, టాటా 1 ఎంజీ వంటి యాప్ల ద్వారా ఇంట్లో నుంచే డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు.టెక్నాలజీతో వర్షాన్ని అనుభవించండి.. వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుందో ముందే తెలిసిపోతే బాగుంటుందనే మాట వాస్తవమే. ఈ విషయంలో కొన్ని యాప్స్తో పాటు ప్రయాణించవచ్చు. ఆక్యూ వెదర్, స్కైమెట్ వెదర్, లైవ్ రడార్తో వర్ష సూచన. గూగుల్ మ్యాప్స్, మై గేట్ల టెక్నాలజీతో ట్రాఫిక్ అప్డేట్స్, లోకేషన్ ఆధారిత అలర్ట్స్. స్పాటీ ఫై, పాకెట్ ఎఫ్ఎఫ్: వానలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు, లేదా ఇంట్లో కూర్చుని విండో వెనుకగా జల్లులు చూస్తున్నప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్. వర్షంలో ఇంటిని కాపాడండి డోర్ మ్యాట్స్, షూ స్టాండ్స్: వర్షపు నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు.. డీహ్యూమిడిఫైయర్స్: గదుల్లో తడిగా మారే వాతావరణం, మబ్బును నివారించేందుకు ఉపయోగపడతాయి. ఆరోమా డిఫ్యూజర్లు: తడి వాసనను తొలగించి ఫ్రెష్నెస్ కలిగించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.విందుగా మార్చే చిట్కాలు వీకెండ్ విత్ రైన్ థీమ్: ఇంట్లో ఫ్రెండ్స్తో టీవీకి దగ్గరగా బీన్స్ బ్యాగ్స్, మసాలా టీ, బజ్జీలు.. ఇదే అసలైన హ్యాపీనెస్. రెయిన్ ఫ్రేమ్స్ ఫొటోగ్రఫీ: వర్షపు నీటి బిందువులు, బల్కనీ పూల మధ్య సెల్ఫీలు.. సోషల్ మీడియాకు మరిచిపోలేని అనుభూతులు. రెయిన్ ఫ్రెండ్లీ రైడ్స్: వర్షంలో బైక్ రైడ్స్, సైక్లింగ్ ట్రిప్స్ వంటి గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా వర్షాన్ని మరింత ఆస్వాదించవచ్చు. (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!) -
నా మొండి భర్తను మార్చగలరా!
నా భర్తకు 48 ఏళ్లు, రైల్వే ఉద్యోగి. చిన్నవయసు నుండే కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడ్డాయి. అప్పటి నుండే మందుకు, స్మోకింగ్కి బానిస అయ్యారు. ఈ మధ్య గుండెకి ఆపరేషన్ కూడా అయింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాతి రోజే మళ్లీ మందు, సిగరెట్ మెదలుపెట్టారు. ఆఫీస్కి సరిగా వెళ్ళరు. మందులు వేసుకోరు. ఈయన పరిస్థితికి భయం వేసి హైదరాబాద్లో రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశాము. కొన్నిరోజులు అవగానే అక్కడ తిండి తినకుండా గొడవ చేసి మారుతానని బతిమిలాడితే ఇంటికి తీస్కొచ్చేశాం. బయటకు రాగానే అన్నీ – మళ్ళీ మొదలు పెట్టారు. ఇలా కనీసం ఇప్పటికి మూడుసార్లు జరిగింది. అసలు ఆయన మారతాడంటారా? సలహా ఇవ్వండి.– పద్మలత, కాజీపేట మీ భర్త ఆరోగ్యం గురించి మీరు పడే ఆందోళన, తపన అర్థం అవుతున్నాయి. ఇది ఆల్కహాల్కి బానిస అయిన చాలామంది పేషెంట్ల కుటుంబ సభ్యుల సమస్య కూడా. ఆల్కహాల్ అడిక్షన్కి వంశపారంపర్యం, వ్యక్తిత్వం, చుట్టూ ఉండే పరిస్థితులు, ఇతర మానసిక సమస్యలు... ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి. మద్యం లేదా ఇతర, మత్తుపదార్థాలకు బానిస అయిన వారి మెదడు అనేకమైన మార్పులకి గురయి ఉంటుంది. వారిని ఆ అలవాటు నుండి బయట తీసుకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక రిహాబిలిటేషన్ అనేది చాలా నిదానంగా చేసే చికిత్స. అందుకని ఆ వ్యక్తికి మారాలి అనే ఆలోచన లేనపుడు, ఆ ఆలోచన తీసుకురావడానికి కూడా చాలా సమయం పడుతుంది. చికిత్సకి అసలు సహకరించరు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. వీరిలో మారాలనే ఆలోచన వచ్చేలా సి.బి.టి, మోటివేషన్ ఇంటర్వ్యూయింగ్ పద్ధతులు వాడతాము. ఒకసారి మోటివేషన్ వస్తే అపుడు మళ్ళీ మద్యం జోలికి పోకుండా ఉండడానికి ‘ప్రివెన్షన్ రిలాప్స్’ పద్ధతులు చెబుతారు. దీనితోపాటు వారి జీవన శైలిలో, స్నేహితుల విషయాలలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ తట్టుకోడానికి, కోపం తొందరపాటు తగ్గించుకునేలా కూడా థెరపీ ఇస్తారు. 30 సంవత్సరాల అలవాటుని 30 రోజుల్లో మార్చడం అసంభవం అని గుర్తుపెట్టుకోండి! ఈ సందర్భంలోనే మీరు ఓర్పుగా, నేర్పుగా సంయమనంతో ఉండాలి. అలాగే మీరు చేర్పించే రీహాబిలిటేషన్ సెంటర్లో సరైన శిక్షణ, అనుభవం కలిగిన మానసిక వైద్యులు, కౌన్సిలర్లు, సోషల్ వర్కర్లు, యోగ థెరపిస్ట్ లాంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడండి. పేషెంట్తో పాటు కుటుంబ సభ్యులు కూడా రెగ్యులర్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స పూర్తి స్థాయిలో అందించండి. అతనిలో తప్పకుండా పరివర్తన వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడ(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com)(చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..) -
ఆసనం.. ఓ ఔషధం..! అధ్యయనం చెబుతోందిదే..
ఒకప్పుడు ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కోసం మాత్రమే యోగాని ఒక మార్గంగా పరిగణించేవారు. ప్రస్తుతం అనారోగ్యానికి చికిత్సా మార్గంగా మారింది. దీంతో ఆధునిక వైద్యంలో అనేక దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో యోగాసనాల ప్రాముఖ్యత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒక్కో వ్యాధికీ ఒక్కో రకం మందు లాగా వ్యాధికి తగిన యోగాసనం ఉండటం విశేషం. దినచర్యలో ఈ ఆసనాలను చేర్చడం ద్వారా ఒక్కోసారి మందులు లేకుండానే లేదా మందులతో పాటు అనుసరించి శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. రానున్న ఆరోగ్య సమస్యల నివారణకు మాత్రమే కాదు, చికిత్సకు కూడా ఒక బలమైన సాధనంగా అవతరిస్తోంది. కేవలం మందులపైనే ఆధారపడే పలువురు బాధితులకు యోగా చికిత్సగా మారుతోంది. అనారోగ్య సమస్యను బట్టి ఆసనాన్ని సూచించే విధానం స్థిరపడుతోంది. నగర జీవనశైలిలో ఎంత వేగం పెరిగినప్పటికీ ఆరోగ్యం కూడా అంతే వేగంగా దెబ్బతింటోంది. ఒత్తిడితో కూడిన జీవన శైలి కారణంగా శారీరక, మానసిక ఒత్తిడులు, జీవనశైలిలో మార్పుల కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక రోగాలు నగరవాసులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాచీన భారతీయత అందించిన వారసత్వ సంపదగా యోగా, గతంలో వ్యాధుల నివారణకు మాత్రమే అన్నట్టుగా ఉండగా, ఇప్పుడు వాటి చికిత్సకు కూడా ఉపయుక్తంగా మారుతోంది. నివారణకు ఇలా... యోగా సాధన ద్వారా శరీరానికి కావాల్సిన స్థితిస్థాపక శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాడీ వ్యవస్థ, రక్తప్రసరణ, జీర్ణవ్యవస్థ ద్వారా కొత్తగా వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న రోగాలను నియంత్రించేందుకు యోగా ఒక సహాయక పద్ధతిగా మారుతోంది. ప్రాణాయామం, ధ్యానం, ఆసనాల ద్వారా వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేలా చేసి దెబ్బతిన్న ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. దీని కోసం అనారోగ్యాన్ని బట్టి వైద్యులు పలు ఆసనాలు సూచిస్తున్నారు.. అస్తమా (ఉపశ్వాసక సమస్యలు): శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారి ఊపిరితిత్తులకు శక్తినిచి్చ, ఆమ్లజన సరఫరా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దీని కోసం భ్రస్తిక ప్రాణాయామం, ధనురాసనం వంటి ఆసనాలను వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ (షుగర్): నగరంలో అనేక మందికి దీర్ఘకాలికంగా ఇబ్బందులు పెడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది డయాబెటిస్. దీనికి నిరంతరం ఇన్సులిన్, మందుల వాడకం తప్పడం లేదు. అయితే ఈ వ్యాధి నుంచి కోలుకోడానికి వాడుతున్న మందులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి పవనముక్తాసనం, అర్ధ మత్సేద్రాసనం, సూర్య నమస్కారాలు వంటివి ఉపకరిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్లోమగ్రంధి పనితీరును మెరుగుపరచడంలో ఆసనాల పాత్ర కీలకమని, రోజూ 15–20 నిమిషాల పాటు సాధన వల్ల రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించవచ్చని అంటున్నారు. బీపీ (అధిక రక్తపోటు): వయసులకు అతీతంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) కూడా ఒకటి. దీని చికిత్సలో శవాసనం, వజ్రాసనం, నాడీ శోధన ప్రాణాయామం సహకరిస్తాయని వైద్యుల సూచన. ఈ ఆసనాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి హృదయ స్పందనలు సరైన విధంగా నియంత్రించవచ్చు. జీర్ణ సమస్యలు (గ్యాస్ట్రో): వేళాపాళా లేని ఆహారపు అలవాట్ల కారణంగా నగరవాసుల్లో జీర్ణకోశ వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. వీటి నుంచి కోలుకునే క్రమంలో పశి్చమోత్తానాసనం, వజ్రాసనం అనుసరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత, భోజనానంతరం వజ్రాసనంలో కూర్చోవడం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. వాయువు, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ (పార్శ్వపు నొప్పి): ఇటీవల తలనొప్పి అదే విధంగా మైగ్రేన్ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. వీటికి మందులతో పాటు శశాంకాసనం, పద్మాసనం, బ్రహ్మరి ప్రాణాయామం వంటివి చికిత్సగా పనిచేస్తాయి. ఈ ఆసనాలు నాడీ తంత్రానికి విశ్రాంతిని అందిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు మైగ్రేన్ను తగ్గించడంలో సహాయపడతాయి. అత్యున్నత పరిష్కారం.. యోగాసనాలు కేవలం శరీర అవయవాలను కదలించే వ్యాయామం మాత్రమే కాదు.. వ్యాధులను తగ్గించే ఔషధం. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోడంలో యోగాసనాల ప్రభావం అధికంగా ఉంటుంది. దీనిపై నగరవాసులకు మరింత అవగాహన అవసరం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు అత్యున్నత పరిష్కారం. శ్రద్ధతో సాధన చేస్తే అద్భుత ఫలితాలు పొందవచ్చు. దీనిపై సోషల్ మీడియా సహా విభిన్న మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నా. – డా.జయప్రకాశ్ సాయి, వైద్యులు ఊబకాయం (ఒబెసిటీ): నగరంలో చిన్నా పెద్దా తేడా లేకుండా వేధిస్తున్న సమస్య ఓవర్వెయిట్, ఒబెసిటీ(సూ్థలకాయం). దీని నుంచి బయటపడేందుకు సూర్య నమస్కారాలు, నవక్రియాసనాలు, త్రికోణాసనం సాధన చేయాలి. ఇవి శరీరానికి తగిన రక్తప్రసరణ, చక్కటి వ్యాయామం అందించటంతో పాటు శరీరంలో అధిక క్యాలరీలను ఖర్చు చేయిస్తాయి. డిప్రెషన్, ఆందోళన: పని ఒత్తిడితోపాటు అనేక రకాల మానసిక సమస్యలతో నిత్యం పోరాటం చేస్తున్నారు. వీటిని తగ్గించుకునే క్రమంలో ధ్యానం, అనులోమవిలోమ ప్రాణాయామం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సాధనాలు. ఇవి మెదడులో సెరటోనిన్ వంటి ‘హ్యాపీ హార్మోన్ల’ను విడుదల చేస్తాయి. అయితే యోగా ఏ ఒక్క రోజులో ఫలితమివ్వదు. దినచర్యలో భాగంగా దీన్ని కొనసాగిస్తేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి’ అంటున్నారు ప్రముఖ యోగా నిపుణురాలు డా.మంజురెడ్డి. ముందస్తుగా శరీర పరిస్థితిని తెలుసుకుని నిపుణుల శిక్షణలో ప్రారంభించాలని సూచిస్తున్నారు. అధ్యయనాలు చెబుతోందిదే.. దీర్ఘకాలిక తక్కువ వెన్నునొప్పికి ప్రారంభ నాన్ ఫార్మాస్యూటికల్ చికిత్సలో భాగంగా యోగాను అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ సిఫార్సు చేస్తోంది. యోగాభ్యాసం గుండె జబ్బుల కారకాలను తగ్గించగలదని వృద్ధుల్లో అంతర్గత అవయవాల పనితీరు మెరుగు.. జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను అందిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. నొప్పులను నియంత్రించడంలో యోగా ప్రభావవంతంగా పనిచేస్తోందని, తలనొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, మెడనొప్పి, నడుమునొప్పి వంటి ఇబ్బందులను యోగా తొలగిస్తుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఎనిమిది వారాల యోగా సాధనతో మోచేయి, మోకాలి కండరాల బలాన్ని 10%–30% మెరుగుపరుస్తుందని పరిశోధకులు తేల్చారు. చీలమండ, భుజం, తుంటి, కీళ్ల ఫ్లెక్సిబిలిటీ 13%–188% పెరిగిందని గుర్తించారు. ఎనిమిది నుంచి 12 వారాల సాధారణ అభ్యాసన ఆందోళన, నిరాశ నిస్పృహలను తగ్గిస్తుందని, ఒత్తిడి నిర్వహణలో సహాయపడుతుందని పరిశోధనలు తేల్చాయి. (చదవండి: -
దారపు నరాలు..ఇట్టే నయం..!
చర్మంపై నరాలు తేలి అవి పైకి కనిపిస్తే అందవిహీనంగా కనిపిస్తుంది. నిజానికి ఈ సమస్యను దారపు నరాలు లేదా స్పైడర్ వీన్స్ అంటారు. ఇవి ఎక్కువగా కాళ్లు, తొడల భాగాల్లో నరాలు చర్మంపైకి నల్లటి లేదా ఎర్రటి చారల్లా కనిపిస్తాయి. సమస్య తీవ్రతను బట్టి అవి ముఖంపై కూడా వస్తుంటాయి. వాటికి సమర్థమైన చికిత్స ‘లిక్విడ్ స్క్లెరో థెరపీ’. ఈ ప్రక్రియలో, ఒక ప్రత్యేక రసాయనిక ద్రావణాన్ని, నేరుగా ప్రభావిత నరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. చిన్న చారల నుంచి మధ్యస్థాయి చారల వరకు, ఈ చికిత్స చేస్తే ఫలితం ఉంటుంది. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ సెషన్స్ అవసరం కాకపోవచ్చు. చికిత్స తర్వాత స్వల్ప అసౌకర్యం, వాపు ఉండవచ్చు కాని, అదంతా త్వరగా తగ్గిపోతుంది. ఈ థెరపీ చాలా సురక్షితం.చర్మ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి వేర్వేరు పరికరాలను ఉపయోగిస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. ‘మైట్రెక్స్ ప్రూవ్ టోటల్ లిఫ్ట్’ అనే ఈ పరికరంలో ముఖం, తల, శరీర సంరక్షణకు అవసరమైన అన్ని ఫీచర్స్ కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్తో హై పవర్ పల్స్తో చర్మాన్ని ఉత్తేజపరచి, కండరాలను బలోపేతం చేస్తుంది. దాంతో చర్మాన్ని బిగుతుగా మార్చి, నిగారింపునిస్తుంది.అలాగే ఈ మెషిన్ మూడు విభిన్న అటాచ్మెంట్లతో రూపొందింది. దీనికున్న బ్రష్ అటాచ్మెంట్ తలకు మసాజ్ చేసి, జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది. దీని కర్వ్డ్ అటాచ్మెంట్ ముఖంపై చర్మాన్ని బిగుతుగా మార్చి, ముడతలను నివారిస్తుంది. ఫ్లాటర్ అటాచ్మెంట్ శరీర భాగాలైన చేతులు, కాళ్లు వంటి వాటిపై చర్మాన్ని మెరుగుపరుస్తుంది.ఇది వాటర్ప్రూఫ్ డివైస్ కావడంతో తడి చర్మంపై కూడా సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఐదు లెవల్స్, రెండు మోడ్స్ ఉండటంతో అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. దీనికి ఒక్కసారి చార్జ్ పెడితే 7 నుంచి 11 గంటల వరకు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం, నిరంతరాయంగా పని చేస్తుంది. 15 నిమిషాల తర్వాత ఆటో–ఆఫ్ టైమర్ ఉండటంతో దీనిని వినియోగించడం చాలా తేలిక. (చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?) -
బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే..?
మన శరీర భాగాల్లో ఎక్కువ శ్రమపడేది– మెదడు. ఇది అద్భుతమైన శక్తులతో కూడినది. కాని, దానికి ఇచ్చే విశ్రాంతి, శ్రద్ధ మాత్రం చాలా తక్కువ. మెదడును పదిలంగా ఉంచుకోవాలంటే గంటల తరబడి యోగా, వ్యాయామం అవసరమేమీ కాదు. రోజుకు ఐదు నిమిషాల ‘చిన్న అలవాట్లు’ మన మెదడును శక్తిమంతంగా మార్చగలవని తాజా న్యూరో సైన్స్ పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ఐదు నిమిషాల అలవాట్లు కేవలం ప్రస్తుతానికే కాక, భవిష్యత్తులో వృద్ధాప్యంలో మెదడు మందగించడం నుంచి మిమ్మల్ని రక్షించే సాధనాలవుతాయి. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం. 1. ముక్కుతోనే పీల్చాలిమనం బతకాలన్నా, మెదడు బతకాలన్నా శ్వాస కావాలి. అయితే మనం ఎలా ఊపిరి పీలుస్తున్నామన్నది మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. ముక్కు ద్వారా పీల్చే శ్వాస నేరుగా ‘అల్ఫ్యాక్టరీ బల్బు’కు అనుసంధానమై ఉంటుంది. దీని వల్ల మెమరీ సెంటర్లు యాక్టివేట్ అవుతాయి. ముక్కు ద్వారా ఊపిరి తీసుకునే సమయంలో మెదడు స్మృతి కేంద్రాలను ప్రేరేపించే ‘సబ్టల్ ఎలక్ట్రికల్ రిథమ్స్’ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్లనే నోటిద్వారా శ్వాస తీసుకునే వారికంటే ముక్కుద్వారా శ్వాసతీసుకునేవారు 40శాతం మెరుగైన మెమరీ చూపించారు.2. బాక్స్ బ్రీతింగ్నాలుగు సెకన్లు శ్వాస తీసుకొని, నాలుగు సెకన్లు శ్వాస నిలిపి, నాలుగు సెకన్లు విడిచి, మరో నాలుగు సెకన్లు ఖాళీగా ఉండటం. ఈ విధానాన్ని రోజుకు ఐదు నిమిషాలు పాటిస్తే, మీ మెదడు ముందు భాగంలో (ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్) 25శాతం అదనపు ఆక్సిజన్ చేరుతుంది. ఇది నిర్ణయం తీసుకోవడం, ఫోకస్, మెమరీ వంటివి మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఇది మీ పారా సింపథటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తూ, కార్టిసాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఒక్క రోజు బాక్స్ బ్రీతింగ్ చేయడం, ఫోకస్ను పదిశాతం పెంచుతుంది. అదే అలవాటు 30 రోజులు కొనసాగితే మీ మెదడు పనితీరులో 40శాతం మెరుగుదల ఉంటుంది. 3. డెస్క్ వర్కవుట్స్... అధిక తీవ్రత గల వ్యాయామం చేసిన వారు రెండు గంటలపాటు మెరుగైన మెదడు పనితీరు చూపారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.. దీనివల్ల బ్రెయిన్ అండ్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) విడుదల అవుతుంది, ఇది మెదడు న్యూరాన్ల వృద్ధిని పెంచుతుంది. కేవలం మీ డెస్క్ దగ్గరే ఐదు నిమిషాల్లోనే సాధ్యమయ్యే వ్యాయామాల ఉదాహరణ: 30 సెకన్లు బాడీ వెయిట్ స్క్వాట్స్, 30 సెకన్లు ఆర్మ్ సర్కిల్స్, 30 సెకన్లు హై నీస్, 30 సెకన్లు వాల్ పుషప్స్– ఈ చర్యలతో మెదడులో రక్తప్రసరణ పెరిగి, మీ ఫోకస్, శక్తి, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి.4. విభిన్న మేధా కార్యకలాపాలుపజిల్స్, బ్రెయిన్ గేమ్స్ కాకుండా, మీ మెదడుకు ‘కొత్త’ అనుభవాలు ఇవ్వడం వల్ల అత్యంత ప్రభావం ఉంటుంది. రోజుకు ఒక కొత్త పదాన్ని నేర్చుకొని మూడు వేర్వేరు సందర్భాలలో ఉపయోగించడం, చిన్న గణిత సమస్యలను కాగితం–పెన్సిల్ లేకుండా లెక్కించడం, లేదా సాధారణ వస్తువులకు అసాధారణ ఉపయోగాలను కనుగొనడం వంటివి మెదడులో క్రియేటివ్, భాగాలను కలుపుతూ డైవర్జెంట్ థింకింగ్ను మెరుగుపరుస్తాయి. మళ్లీ మళ్లీ అదే ఆటలు ఆడే కన్నా, చిన్న కొత్త విషయాలే మెరుగైన న్యూరోప్లాస్టిసిటీని అందిస్తాయి.5. సంగీతంతో సరళతసంగీతం మనసుకు సాంత్వననిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గిటార్, పియానో లాంటి వాయిద్యాలను వాయించడం వల్ల మెదడులోని అనేక భాగాలు ఒకేసారి ఉత్తేజితమవుతాయి. ‘అరె... నాకే వాయిద్యమూ రాదండీ’ అని బాధపడకండి. బీట్కు సరిపడేలా వేలితో ట్యాప్ చేయడం వల్ల మెదడులోని మోటార్ కార్టెక్స్, ఆడిటరీ కార్టెక్స్, అటెన్షన్ భాగాలు యాక్టివ్ అవుతాయి. ఇది మీకు గణనీయమైన కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది.6. నలుగురితో మాట్లాడండిఐదు నిమిషాల సామాజిక సంభాషణలు మీ మెదడు పనితీరు, విశ్లేషణ సామర్థ్యం, వర్కింగ్ మెమరీని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో, కొత్త విషయాలపై చేసిన సంభాషణలు మీ మెదడుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. పాత పరిచయాల కన్నా వయస్సులో తేడా గలవారితో సంభాషణ వల్ల మెదడు కొత్త దృక్కోణాలనూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సరదా కబుర్ల కన్నా లోతైన సంభాషణలు మెరుగైన కాగ్నిటివ్ బెనిఫిట్స్ను అందిస్తాయి. వీడియో, ఫోన్ సంభాషణలు టెక్స్ట్ మెసేజెస్ కంటే నేరుగా మాట్లాడటమే మెరుగైన ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?) -
ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. ఫర్టిలిటీకి సంబంధించి పెళ్లిని ఇంకెంత కాలం వాయిదా వేసుకోవచ్చో చెప్పండి?– శ్రీలేఖ, హైదరాబాద్. ప్రస్తుతం మీరు ముప్పై ఐదేళ్ల వయస్సులో ఉన్నందున గర్భధారణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో ఎగ్స్ కౌంట్, వాటి నాణ్యత రెండూ తగ్గిపోతాయి. ముప్పై ఏళ్ల తర్వాత గర్భధారణలో సమస్యలు ఎక్కువ అవుతాయి. గర్భస్రావం, బీపీ, సుగర్, శిశువుకు జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మహిళల ఫర్టిలిటీ గరిష్ఠ స్థాయిలో ఉండే వయస్సు ఇరవై నుంచి ముప్పై మధ్య. ఇరవై ఏళ్లలోపు గర్భం ధరించే అవకాశం ఎనభై ఐదు శాతం ఉంటే, ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య అది అరవై శాతానికి పడిపోతుంది. ముప్పై ఐదు నుంచి నలభై మధ్య నలభై శాతానికి పడిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ గర్భం ధరించే అవకాశం తగ్గుతుంది. అప్పుడు సహజ గర్భధారణ కష్టమై, ఐయూఐ లేదా ఐవీఎఫ్ వంటి వైద్యపద్ధతులపై ఆధారపడాల్సి వస్తుంది. మీ వయస్సును బట్టి, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. నెలసరి చక్రాలు క్రమంగా ఉన్నాయా? పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలున్నాయా అన్నది పరిశీలించాలి. అధిక బరువు, పొగతాగే అలవాటు, రక్తపోటు, సెక్స్ మూలంగా వచ్చే వ్యాధులు వంటి అంశాలు కూడా గర్భధారణను ప్రభావితం చేస్తాయి. కనీసం ఒక సంవత్సరం పాటు సహజంగా గర్భం ధరించే ప్రయత్నం చేయాలి. ఫలితం రాకపోతే, వైద్య నిపుణుడిని కలవాలి. వయస్సు, జన్యు చరిత్ర ఆధారంగా తగిన మందులు, అవసరమైతే ఐయూఐ లేదా ఐవీఎఫ్ వంటి వైద్య విధానాలను సూచిస్తారు. అందుకే ఆలస్యం చేయకుండా మంచి నిర్ణయం తీసుకోండి. నా వయస్సు అరవై సంవత్సరాలు. ఇరవై సంవత్సరాల క్రితం బ్లీడింగ్ అవుతోందని గర్భాశయం తీసేశారు. ఇప్పుడు దగ్గినా, తుమ్మినా యోని భాగంలో గడ్డలాగా కనిపిస్తోంది. కానీ నొప్పి లేదు. డాక్టర్ను కలవాలా?– శారద, విశాఖపట్నం. మీరు చెప్పిన వివరాల ప్రకారం, మీ వయస్సులో యోని భాగంలో గడ్డలాగా కనిపించడం నిర్లక్ష్యం చేయదగ్గ విషయం కాదు. గర్భాశయం తొలగించిన తర్వాత ఆ ప్రాంతం బలహీనపడడం వలన కొన్ని సంవత్సరాల తర్వాత యోని భాగం కిందకు జారిపోతుంది. ఇది సాధారణంగా నొప్పిని కలిగించదు. కాని, ఏదో బరువుగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఈ పరిస్థితిని వజైనల్ వాల్ ప్రోలాప్స్గా పరిగణిస్తారు. ఇది నరాలపై ఒత్తిడి కలిగించి అసహజమైన ఫీలింగ్ను కలిగిస్తుంది. అలాగే, యోని భాగంలో పుండ్లు, మంటలు, వాపులు ఏర్పడిన సందర్భాల్లో కూడా గడ్డలాగా అనిపించవచ్చు. మూత్రనాళ సమస్యల కారణంగా కూడా ఇలాంటి సమస్యే వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో వజైనల్ వాల్తో పాటు మూత్ర సంచి లేదా మోషన్ పేగు కూడా బలహీనపడిపోయి కిందకు జారిపోవచ్చు. అప్పుడు మూత్రం పూర్తిగా వెలువడకపోవడం, మూత్ర సంచి తడిపోవడం, మలవిసర్జన నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇవన్నీ పెల్విక్ భాగం బలహీనతకు సంకేతాలు. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవాలి. వారు పెల్విక్ వ్యాయామాలు సూచిస్తారు. అవసరమైతే మల్టీ విటమిన్ మాత్రలు ఇస్తారు. మూత్రపరీక్ష, రక్తపరీక్ష, కల్చర్ పరీక్షలు చేసి, ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా? లేదా? అని చెక్ చేస్తారు. శరీరానికి అవసరమైన పోషకాహారం గురించి కూడా సలహా ఇస్తారు. మీ వయస్సును బట్టి, ముందు వ్యాయామం చేయటం ప్రారంభించాలి. ఇన్ఫెక్షన్ లేకపోతే, యోనిలో పెట్టుకునే వజైనల్ పెస్సరీ వాడాలని సూచిస్తారు. ఇది సాఫ్ట్ పదార్థాలతో తయారైన దై, డాక్టర్ సూచించిన పరిమాణంలో మాత్రమే వాడాలి. ఉపయోగించడం, తొలగించడం నేర్చుకున్న తర్వాత కూడా ప్రతి రెండు నెలలకోసారి వైద్యుని పునర్విమర్శ అవసరం. ఇది ఉపశమనం కలిగిస్తే కొనసాగించవచ్చు. లేకపోతే శస్త్రచికిత్సను సూచిస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: నెలలు నిండాక వచ్చే నొప్పులు పురిటినొప్పులేనా..?) -
'4ఏ మోడల్'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!
ఒత్తిడిని జయించడంఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో ఒత్తిడి అనేది ఒక భాగంగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, భవిష్యత్పై భయాలు.. ఐటీ ఉద్యోగాలు కావొచ్చు, తీరికలేని వ్యాపారాలు కావొచ్చు.. జీవితంలో ఇంకేమైనా కారణాలు కావొచ్చు, కానీ ఒత్తిడి అనేది ప్రధాన సమస్యగా మారింది. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. దీంతో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబం పరంగా మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించడానికి పలు థెరపీలు, విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒత్తిడిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మన చేతిలోనే ఉంది.ఒత్తిడిని నియంత్రించే ‘4ఏ మోడల్’.అవాయిడ్ (తగ్గించండి): అవసరం లేని ఒత్తిడికి తలవంచకండి. కొన్ని పనులను ఇతరులకు అప్పగించండి. జీవితంలో అసలైన ప్రాధాన్యతలను గుర్తించి, వాటినే ముందుగా చేయండి. ఇది మనసును చాలా వరకు ప్రశాంతంగా ఉంచుతుంది. అడాప్ట్ (అనుకూలించండి): ప్రస్తుత పరిస్థితులను మారుస్తూ, సరికొత్తగా ఆలోచించండి. అంచనాలను ఆచరణీయంగా మార్చుకోండి. నెగటివ్ ఆలోచనల్ని పాజిటివ్ దృష్టితో చూడటం అలవాటు చేసుకోండి. ప్రతి సమస్యలో పాఠం ఉంటుంది. దాన్ని గుర్తించి సమన్వయంగా ముందుకు సాగండి. ఆల్టర్(మార్పు తీసుకోండి): మీ అవసరాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. ప్రతి పనిని చిన్నచిన్న దశల్లో విడదీసి చేయండి. సమస్యలు వచి్చనప్పుడు వాటిని తొలగించే మార్గాలు వెతకండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించే ఉత్తమ మార్గాల్లో ఒకటి. యాక్సెప్ట్ (అంగీకరించండి): కొన్ని విషయాలను మనం మార్చలేం. అలాంటి వాటిని అంగీకరించడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. గతాన్ని మర్చిపోండి. ప్రతి సవాల్లో అభివృద్ధికి అవకాశం ఉందని తెలుసుకోండి. ఒత్తిడి పెరుగుతోంది అంటే భయపడాల్సిన అవసరం లేదుం దానిని ఎదుర్కొనడంపై దృష్టి సారించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మనసుకు శాంతి, శరీరానికి విశ్రాంతి ఇచ్చే మార్గాల్ని అన్వేషించడం ఈ తరానికి చాలా అవసరమని నిపుణుల మాట. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడే ‘4 ఏ మోడల్’ (అవాయిడ్, అడాప్ట్, ఆల్టర్, యాక్సెప్ట్), ‘6 ప్రాక్టికల్ టెక్నిక్స్’ బాగా ఉపయోగపడుతున్నాయి. శ్వాస వ్యాయామాలు, డిజిటల్ డిటాక్స్, మానసిక దృక్పథం మార్పు వంటి చిట్కాలతో మనశ్శాంతి ఎలా పొందాలో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఒత్తిడిని తగ్గించేందుకు 6 మార్గాలు.. 4–7–8 బ్రీత్ టెక్నిక్: నాలుగు సెకన్లు శ్వాస తీసుకోండి, 7 సెకన్లు ఆపండి, 8 సెకన్లకు మెల్లగా విడిచిపెట్టండి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్: ఒత్తడికి లోనైన కండరాలను గట్టిగా పట్టుకుని మెల్లగా విడవండి. శరీరమంతా రిలాక్స్ అవుతుంది. మెల్ రాబిన్స్ 5 సెకండ్ రూల్: ఒక నిర్ణయం తీసుకునే ముందు 5 నుంచి 1 వరకు వెనక్కి లెక్కించండి. దీని వల్ల ఆలస్యం కారణంగా వచ్చే ఒత్తిడిని నివారించవచ్చు. డిజిటల్ డిటాక్స్: రోజులో కొన్ని గంటలు స్క్రీన్లను పూర్తిగా దూరం పెట్టండి. ప్రత్యేకించి రాత్రి పూట ఫోన్లు, ల్యాప్టాప్లు పక్కన పెట్టడం ద్వారా మెదడు విశ్రాంతి పొందుతుంది. ఏబీసీ టెక్నిక్: ఒత్తిడికి కారణమైన సందర్భాన్ని, దానిపై మన నమ్మకాలను, దాని పరిణామాలను విశ్లేషించండి. ఇందులోని అవాస్తవ పరిస్థితులను మానసికంగా వదిలేయండి. బాక్స్ బ్రీథింగ్: నాలుగు సెకన్లు శ్వాస తీసుకోండి. నాలుగు సెకన్లు ఆపి వదలాలి. మరో నాలుగు సెకన్ల సమయం తరువాత ఈ పద్ధతిని మళ్లీ కొనసాగించాలి. మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థితి స్థిరంగా ఉంటుంది. (చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!) -
శరీరానికి సరిపడ బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ఇలా..!
నగరంలో ఫుడీస్, ఫుడ్ లవర్స్, భోజనప్రియులు.. పేరేదైనా కానీ.. విభిన్న వంటకాలు ఆస్వాదించేవారు పెరుగుతున్నారు. మరోవైపు రెస్టారెంట్స్లో మాత్రమే కాదు సంపన్నుల బఫే డిన్నర్స్లోనూ, పారీ్టస్లోనూ విభిన్న రకాల విదేశీ రుచుల వడ్డన సర్వసాధారణం అయ్యింది. అయితే కంటికి ఇంపైనంత మాత్రాన ఇంటికి ఇంపు కావాలని లేనట్టే, నోటికి ఇంపుగా అనిపించినంత మాత్రాన శరీరానికి ఇంపు కాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రుచుల వేట సాగించేవాళ్లు ముందస్తుగా ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్టు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. సాధారణంగా మనుషులు తినకూడని ఆహారాలు మనకి తెలుసు. తినదగినవీ తెలుసు. కానీ కొందరికి మాత్రమే తినదగినవి, కొందరు తినకూడనివి కూడా ఉంటాయి. అలానే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా కొన్నిసార్లు అస్వస్థతకు కారణమవుతాయి. ఇవి జీర్ణక్రియ సమస్యలు, చర్మం మీద ర్యాషెస్, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలను కలిగించవచ్చు. అయితే ఎటువంటి ఆహారం అనారోగ్యానికి కారణమవుతుందో గుర్తించడం చాలా కష్టం. అనేక సందర్భాల్లో ఈ లక్షణాలు ఆహారం తిన్న కొన్ని గంటల తరువాత మాత్రమే బయటపడతాయి. ఈ క్రమంలో ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫుడ్ అలర్జీ.. లక్షణాలు ఇలా.. ఆహారం పడకపోవడం వల్ల మొదటిగా చర్మంపై పొక్కులు, ఎర్రని దద్దుర్లు, నొప్పులు రావచ్చు. అయితే చిన్నపిల్లల్లో మొదటి లక్షణంగా చర్మంపై ర్యాష్ కనిపిస్తుంది. అలాగే శ్వాస సంబంధిత వ్యవస్థపై ప్రభావంతో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుదల, ముక్కు పొంగడం వంటి సమస్యలు కలగవచ్చు. జీర్ణ వ్యవస్థపై దాడితో.. నాలుక ఉబ్బిపోవడం, బొజ్జ నొప్పి, నోటిలో మెటాలిక్ రుచి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అనాఫిలాక్టిక్ షాక్ అనే తీవ్ర పరిస్థితి ఏర్పడినప్పుడు వేగంగా నాడీ స్పందన, పెదవులు, గొంతు ఉబ్బిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం తెల్లగా కనిపించడం, మూర్ఛ వంటివి కూడా రావచ్చు.నప్పనివి ఏమిటి? సాధారణంగా నప్పని ఆహారాల్లో పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, షెల్ ఫిష్, పీనట్స్, వాల్నట్, ఆల్మండ్, కాజు, పీకాన్ వంటి డ్రై ఫ్రూట్స్.. అయితే ఇవి నప్పకపోవడానికి వాటిలో ఉండే కొన్ని ఉపపదార్థాలు కూడా కారణమే. ఉదాహరణకు పాలలో ఉండే లాక్టోజ్ అనే ఒక రకమైన తియ్యటి పదార్థం, గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రొటీన్, ఫుడ్ ఫ్లేవర్ పెంచడానికి ఉపయోగించే ఎంఎస్జీ అనే పదార్థం.. ఇలా.. కొన్ని సందర్భాల్లో అతి తక్కువ మోతాదులో ఈ ఆహారాలను తీసుకున్నా తీవ్ర సమస్యలకు కారణం కావచ్చు. అలాగే మనకు ఏ మాత్రం పరిచయం లేని వంటకాల్లో ఏయే దినుసులు కలుపుతున్నారో వాటిలో ఏవి మనకు నప్పవో తెలీదు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం. ఆహారం.. అసహనం.. మన శరీరానికి హానికరం కాని ఆహారాలను హానికరమైన వైరస్లా గుర్తించి స్పందించే స్థితి కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు చిన్నపాటి జీర్ణ సమస్యలుగా ఉంటే, మరికొన్నిసార్లు అనాఫిలాక్టిక్ షాక్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. ఈ సమస్య చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం కంటే ఎక్కువ మంది చిన్నారులు దీని ప్రభావానికి లోనవుతున్నారు. చాలామంది పిల్లలు పెద్దయ్యాక ఈ అసహనాన్ని సహనంగా మార్చుకోగలుగుతారు. కానీ కొందరు మాత్రం కొన్నింటిని నప్పేలా చేసుకుంటారు కొన్నింటి పట్ల అసహనాన్ని కొనసాగిస్తారు. ఫుడ్ అలర్జీ పరీక్షలు.. ఎలా? ఎక్కడ? అనుమానాస్పద ఆహారాన్ని స్వల్పంగా ప్రయోగించి శరీరం ఎలా స్పందిస్తుందో పరిశీలించడాన్ని ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు. అలాగే అనుమానాస్పద ఆహారాలను పూర్తిగా ఆపి, తర్వాత ఒక్కొక్కటిగా మళ్లీ ఆహారంలో చేర్చడాన్ని ఎలిమినేషన్ డైట్, ఆహారాన్ని చర్మంపై ఉంచి సూదితో తక్కువగా గుచ్చి చేసే స్కిన్ ప్రిక్ టెస్ట్, రక్తంలో ఐజీఇ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది పరీక్షించడానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు. నగరంలో థైరోకేర్, మై డయాగ్నోస్టిక్స్, డీఎన్ఎ ల్యాబ్స్ ఇండియా, రెడ్ క్లిఫ్ ల్యాబ్స్, ల్యూసిడ్.. వంటి చోట్ల ఈ పరీక్షలు చేస్తున్నారు. కనీసం 200 రకాలు.. ఆ పైన అలర్జీలను గుర్తించేందుకు చేసే పరీక్షల వ్యయం కనీసం రూ.5వేల నుంచి రూ.15వేల వరకూ అవుతుంది. (చదవండి: ఆ జంట పిల్లలు కోసం సరోగసికి వెళ్తే.. ఊహకందని ట్విస్ట్! చివరికి..) -
పీసీఓఎస్తో మానసిక సమస్యలు..
నేను గర్భవతిని అని మూత్రపరీక్ష ద్వారా తెలిసింది. డాక్టర్ను ఎప్పుడు కలవాలి?– రమ్య, గుంటూరుగర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్ను కలవాలి. ఎందుకంటే శరీరంలో థైరాయిడ్, సుగర్, రక్తపోటులాంటి సమస్యలు ఉంటే, శిశువుపై వాటి ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ను కలిసిన వెంటనే వారు రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేస్తారు. అలాగే, శరీర పరిస్థితిని బట్టి ఫోలిక్ యాసిడ్, విటమిన్ –డి వంటి మాత్రలు సూచిస్తారు. ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. మొదటి వారాల్లోనే శుభ్రమైన, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు తగిన ఆహార నియమాలు కూడా డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు, జన్యుపరమైన లోపాలు భర్తవైపు లేదా భార్యవైపు ఉన్నా, అవి శిశువుకు వచ్చే అవకాశముంటుంది. అందుకే ప్రారంభ దశలోనే ఆయా సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, దానికి తగిన వైద్యం తీసుకోవాలి. సాధారణంగా గర్భం ఎనిమిదో వారం వచ్చేసరికి మొదటి స్కాన్ చేస్తారు. దానితో బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తర్వాతి స్కా మూడో నెలలో చేస్తారు. ఈ స్కానింగ్, మొదటి దశ రక్తపరీక్షల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను గుర్తించవచ్చు. అవసరమైన మందులు, తీసుకోవాల్సిన చికిత్సలు కూడా సూచిస్తారు. శరీర బరువు, రక్తపోటు స్థాయిని బట్టి ప్రారంభ దశలో చేయవలసిన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తారు. ఆహార నిపుణుల సలహాలు, జన్యుపరమైన కౌన్సెలింగ్ కూడా ఇప్పటి నుంచే తీసుకోవాలి. అందుకే ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ప్రసూతి నిపుణులను తప్పనిసరిగా కలవాలి.పీసీఓఎస్తో మానసిక సమస్యలుప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మహిళలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, ముఖంపై మొటిమలు ఎక్కువగా రావడం, తల మీద జుట్టు పల్చబడిపోవడం వంటి శారీరక సమస్యలే కాకుండా పలు మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నడివయసుకు చేరుకునే సరికి మతిమరపు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఒక్కోసారి మానసిక కుంగుబాటుకు లోనవడం వంటి లక్షణాలతో బాధపడతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీదర్ హడల్స్టన్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలో తేలింది. అలాగే, పీసీఓఎస్తో బాధపడే మహిళలకు టైప్–2 డయాబెటిస్ ముప్పు సాధారణ మహిళల కంటే రెట్టింపుగా ఉంటుందని కూడా ఈ పరిశోధనలో బయటపడింది. ఈ సమస్యల కారణంగానే పీసీఓఎస్తో బాధపడే మహిళలు నడివయసులో కెరీర్లోను, ఆర్థిక వ్యవహారాల్లోను వెనుకబడిపోతారని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన సారాంశం ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురితమైంది.ఆత్మహత్యా ధోరణులు కూడా..పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆత్మహత్యా ధోరణులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే, పీసీఓఎస్తో బాధపడే మహిళలు ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడే అవకాశాలు మూడు శాతం ఎక్కువగా ఉన్నట్లు తైవాన్లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ము హాంగ్ చెన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు) -
ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
నగరవాసం అంటేనే కొత్త కొత్త అనుభూతులు, అనుభవాలతో సహవాసం.. విశ్వవ్యాప్తంగా రాకపోకలు సాగించే మహానగరాల్లో కొత్త విశేషాలకు కొరత ఎప్పుడూ ఉండదు. అంతేకాదు కొత్త విషయాలకు నగరవాసులు ఎప్పుడూ ఆకర్షితులే.. వాటిలోని వింత అనుభవాలను చవిచూడాల ఎప్పుడూ ఉవి్వళ్లూరుతూ ఉంటారు. ఇలాంటి నయా ట్రెండ్స్కు తామేమీ తక్కువ కాదన్నట్లు భావిస్తుంటారు. అందుకే ఏ విషయంలోనైనా భాగ్యనగరవాసులు ముందుంటారు.. అలాంటి మరో కొత్త విశేషమే నగరానికి పరిచయమైంది. అదే ఐస్ బాత్. ఈ పేరిట ఇటీవలే ఓ ట్రెండ్ పరిచయమైంది. ఐస్ బాత్ థెరపీ నగరంలోని ఆరోగ్య, ఫిట్నెస్ ప్రియులకు నూతన ట్రెండ్గా మారింది. ఈ థెరపీ ద్వారా శరీరానికి మాత్రమే కాదు.. మానసికంగానూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని దీన్ని అందిస్తున్న నిపుణులు చెబుతున్నారు. సమంత, విరాట్ కోహ్లీ, విజయ్ దేవరకొండ, అనమ్ మీర్జా, విష్ణు మంచు వంటి ప్రముఖులు ఐస్ బాత్ తో వారి అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది అనేకమందిలో ఈ థెరపీ పట్ల ఆసక్తిని పెంచుతోంది. మరి కొందరు సైతం ఐస్బాత్ను ఒక ఈవెంట్లా నగరంలోని కేఫ్స్, క్లబ్స్.. వంటి విభిన్న ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. స్నాన విశేషాలివీ.. ఐస్ బాత్ అనేది చల్లటి నీటిలో, సాధారణంగా 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, 10 నుండి 15 నిమిషాల పాటు శరీరాన్ని ముంచడం. దీనినే క్రయోథెరపీ లేదా కోల్డ్–వాటర్ ఇమ్మర్షన్ టెక్నిక్/కోల్డ్ ప్లంజ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియ శరీరంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. తద్వారా వాపు, నొప్పి తగ్గుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి శరీరం త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. ఈ చికిత్స విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ప్రారంభ షాక్ తర్వాత, శరీరం అలవాటుపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలివీ.. ఈ ఐస్బాత్ సేవలు అందిస్తున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. దీని ద్వారా కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. చల్లటి నీటిలో శరీరం ఉన్నప్పుడు రక్తప్రసరణ మెరుగై, ఎండార్ఫిన్లు విడుదలై, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పని ఐస్ బాత్తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చల్లటి నీటి ప్రమేయంతో నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఇది డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. అత్యంత చల్లటి నీటిలో ఒక మునక డోపమైన్ ఉత్పత్తిని 250% వరకూ పెంచుతుంది. తద్వారా సహజమైన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.. ఇబ్బంది కలిగించే చలిని ఎదుర్కోవడం మెదడుని అసౌకర్యాన్ని స్వీకరించడానికి, స్థితిస్థాపన క్రమశిక్షణను పెంపొందించడానికి సహాయపడుతుంది. వ్యక్తిగతంగా మెచ్చి.. స్వదేశానికి తెచ్చి.. ‘మారథాన్ రన్నర్స్, క్రీడాకారులకు కఠినమైన శిక్షణ తర్వాత అలసట దూరం కావడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విభిన్న వర్గాల వారు ఆరోగ్యం కోసం దీన్ని ఎంచుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్పై ఆసక్తితో థాయిలాండ్లోని ఎలైట్ ఫైట్ క్లబ్లో సభ్యులుగా శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఐస్ బాత్ థెరపీ గురించి తెలిసింది. నగరంలో దీనిని ప్రవేశపెట్టాలని నార్సింగిలో ఓ సెంటర్తో పాటు మొబైల్ ఐస్ బాత్ థెరపీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రారంభకులకు 90 సెకన్ల నుంచి అత్యధికంగా 3 నిమిషాలు మాత్రమే సూచిస్తాం. ఆ తర్వాత వారి వారి ఇష్టం, సామర్థ్యాలను బట్టి వ్యవధి పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా 18 నిమిషాల వరకూ ఐస్ బాత్ చేయగలను. జాగ్రత్తలు తప్పనిసరి.. ఐస్బాత్ ఈవెంట్లో పాల్గొనాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ముందస్తు వైద్య సలహా తీసుకోవాలి. అధిక లేదా తక్కువ రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు, నాడీ సంబంధిత పరిస్థితులు, మధుమేహం లేదా వాసు్కలర్, ఏవైనా ఇతర సమస్యలు ఉన్నవారికి ఇది నప్పదు. ఐస్ బాత్ వ్యవధి ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు వరకూ సరిపోతుందని, అయితే కొన్ని సెషన్ల తర్వాత వ్యక్తులు వారి వారి శరీర తత్వాన్ని బట్టి వ్యవధిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభకులకు, సంవత్సరానికి 3–4 సెషన్లు సరిపోతాయి. శరీరం ప్రతిస్పందనను బట్టి ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు. ప్రస్తుతం సెషన్ సెటప్ ఫెసిలిటేటర్ నైపుణ్యాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.8,000 వరకూ ఉంది. (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
102 ఏళ్ల డాక్టర్..ఇప్పటికీ వైద్య సేవలోనే..! చిరకాలం బతకాలంటే..
ఎవ్వరైన రిటైర్మెంట్ ఏజ్ వరకు పనిచేస్తారు. ఆ తర్వాత పదవీవిరణ చేసి..రెస్ట్ తీసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఈ శతాధికుడు విరామం ఎరుగని వైద్యుడు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండొవ ప్రపంచకాలం నాటి ఈ వృద్ధ డాక్టర్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ అంతకంతకు పురోగమిస్తున్నారు. యువకుడి మాదిరిగా చురుగ్గా అన్నిపనులు చురుగ్గా చేసుకుంటారాయన. అంతేగాదు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలంటే ఆ పనులు చేయొద్దని సూచనలిస్తున్నారాయన.అతడే. అమెరికాలో క్లీవ్ల్యాండ్కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ హోవార్డ్ టక్కర్. ఆయనకు 102 ఏళ్లు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..ఎందరో వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేగాదు టక్కర్ అత్యంత వృద్ధ ప్రాక్టీస్ డాక్టర్(Worlds Oldest Practicing Doctor)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కూడా దక్కించుకున్నాడు. 1922లో జన్మించిన డాక్టర్ టక్కర్ మహా మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం, కోవిడ్-19 మహమ్మారితో సహా ఒక శతాబ్ద నాటి చారిత్రక సంక్షోభాలకు నిలువెత్తు సాక్ష్యం ఆయన. విశేషం ఏంటంటే..ఇప్పటివరకు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు డాక్టర్ టక్కర్. తాను ఇంతవరకు ఎలాంటి భయానక వ్యాధులతో బాధపడలేదన్నారు. అయితే 80లలో మాత్రం మెడ సమస్యతో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డానని, అయితే సునాయాసంగా ఆ సమస్యను జయించానని చెప్పారు. తన జీవితానుభవంతో నేర్చుకున్న ఆ నాలుగు పాఠాలే తన దీర్ఘాయువు రహస్యంగా విశ్వసిస్తారాయన. అంతేగాదు పదవీవిరమణ గురించి కూడా అస్సలు ఆలోచించరట. ఎందుకంటే దీర్ఘాయువు ప్రధాన శత్రువే పదవీ విరమణ అని నొక్కి చెబుతున్నారాయన. మరి టక్కర్ దీర్ఘాయువు రహస్యం ఏంటో తెలుసుకుందాం..👉 ఈ వృద్ధ డాక్టర్ తన జీవితాంతం వ్యాయామాన్ని స్కిప్ చేయలేదన్నారు. ఈత కొట్టడం దగ్గర నుంచి జాగింగ్, స్కీయింగ్, జిమ్, ట్రెడ్మీల్ వరకు అన్నింటి ని చేస్తారట ఆయన.👉 అలాగే ఉద్యోగానికి పదవీవిరమణ ఇవ్వొద్దు..ఏదో ఒక వ్యాపకంతో ఉండండి. చేయగలిగిన ఉద్యోగం ఏదో ఒకటి చేయండి అని అంటున్నారు. లేదంటే మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడవ్వుతుందట. తద్వారా అనారోగ్యాల బారినపడతామట. 👉 ఎల్లప్పుడూ పనిజీవితం, కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఎల్లప్పుడూ సానుకూలత, ఆశావాదానికే ప్రాముఖ్యత ఇవ్వండి. 👉 భవిష్యత్తు గురించి చిత్తించకుండా చేసే పనిలో సంతోషాన్ని వెతకండి. అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపండి. 👉 ఈ వృద్ధ డాక్టర్ వ్యక్తిగత జీవితానికి వస్తే..మానసిక నిపుణురాలైన సారా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు, పదిమంది మనవరాళ్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ తన భార్యతో గొడపడటం, ప్రేమించడం వంటివి చేస్తానన్నారు.👉 చివరగా ప్రతిఒక్కరు తమ జీవిత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. ప్రతి ఉదయం సాధారణంగా సాగిపోకూడదన్నారు. అప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పారు. 👉 అలాగే ఆయన సాధ్యమైనంత వరకు స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ని వినియోగిస్తారు. సోషల్ మీడియా స్టార్గా మాత్రం ఉండనున్నారు. ఎందుకంటే స్వానుభవాలే..గొప్ప పాఠాలనేది ఆయన అభిమతం. 👉 వీటన్నింటి తోపాటు ధూమపానం, మద్యపానం సేవించొద్దని అన్నారు. తాను జీవితాంతం వాటి జోలికిపోలేదన్నారు. అలాగే మితంగానే ఆహారం తీసుకుంటానని చెప్పారు. 👉 అంతేగాదు డాక్టర్ టక్కర్ "జీవితమే ప్రాణాంతక వ్యాధి , దానికి విరుగుడు జీవించడమే" అని చమత్కారంగా చెప్పారు. ఈ వృద్ధ డాక్టర్ మాములు గ్రేట్ కాదు. అద్భుతమైన జీవిత పాఠాలు, ఆరోగ్య విధానం గురించి బహు చక్కగా వివరించారు డాక్టర్ టక్కర్. (చదవండి: ఆక్సియమ్ స్పేస్ మిషన్లో ఈసారి సరస్వతి దేవి వాహనం..) -
‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే ..?
సినిమాల్లో ఈ థెరపీని భయంకరంగా చూపిస్తారు. ఎవరినైనా హింసించడానికి దాన్ని వాడుకుంటున్నట్టుగా చూపుతారు. అంతేకాదు... కొన్ని హాస్య సన్నివేశాల్లోనూ నవ్వించడానికీ దాంతో కామెడీ యాక్టర్లకు షాక్ ఇస్తున్నట్టు చూపి, నవ్వు తెప్పించడానికి వాడతారు. ఇక వార్తా కథనాల్లో ఎదుటి పార్టీవారికీ, ప్రత్యర్థులకు షాక్ ఇచ్చినప్పుడు ‘షాక్ ట్రీట్మెంట్’ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతుంటారు. అలా దానిపై ఎన్నో అనుమానాలూ, అపోహాలూ కల్పిస్తారు. కానీ నిజానికి అదో మంచి ట్రీట్మెంట్. బాధితులకు షాక్ తగినట్లుగా తెలియనివ్వని చికిత్స. మరెంతో మందికి మానసిక చికిత్సల కోసం, అనేక మందికి ప్రాణరక్షణ కోసం వాడే థెరపీ. దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి అనేక మందికి ప్రాణరక్షణ ఇచ్చిన చికిత్సా ప్రక్రియ. ఎంతో మందిని రక్షించిన ఆ చికిత్స పేరే ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్. వైద్య పరిభాషలో ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’అని పిలుస్తూ సంక్షిప్తంగా ‘ఈసీటీ’ అనే ఈ చికిత్సపై ఉండే అపోహలూ, అపార్థాలు తొలగించి, ఈ చికిత్స ప్రక్రియపై మంచి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. సినిమాల్లో, అలాగే కొన్ని టీవీ సీరియల్స్లో ఎంతగానో భయంగొలిపేలా చూపే ఈ షాక్ ట్రీట్మెంట్ నిజజీవితంలో ఎంత మాత్రమూ భయం గొలిపే చికిత్స కాదు. దీనిపై ఎంతగా అపార్థాలు నెలకొన్నాయంటే బాధితుడికి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలంటూ డాక్టర్లు చెబితే... అతడి బంధువులూ, స్నేహితులూ ఆందోళనకు గురయ్యేంతగా ఇది అపోహలకు గురయ్యింది. కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న అనేకమందిని తిరిగి సాధారణ స్థితికి రావడానికి ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ ఎంతగానో ఉపయోగపడింది. ప్రతి ఏటా దాదాపు లక్షల సంఖ్యలోని బాధితులకు వారి సమస్యలను నయం చేస్తూ, అనేక రకాలుగా స్వస్థత చేకూర్చే ఈ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రావడమూ చాలా నాటికీయంగా జరిగింది. అది సివియర్ డిప్రెషన్, కెటటోనియా లాంటి ఎన్ని రకాల సమస్యలనుంచి విముక్తి కల్పిస్తుందనే విషయంతోపాటు అసలు అది ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరుతెన్నులూ... ఈ విశేషాలన్నింటి గురించీ తెలుసుకుందాం...షాక్ ట్రీట్మెంట్ ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరిది... అసలు కరెంటు షాక్ ద్వారా కొన్ని మానసిక వ్యాధులను నయం చేయవచ్చని ఎలా తెలిసిందన్నదే అబ్బురాన్ని కలిగించే విషయం. తొలుత 1934లో డాక్టర్ మెడూనా అనే శాస్త్రవేత్త మానసిక సమస్యలు ఉన్న బాధితులకు క్యాంఫర్ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా బాధితుడికి మూర్చ (ఫిట్స్ / కన్వల్సెన్స్)ను కలిగించి, మానసిక సమస్యలను నయం చేయడానికి ప్రయత్నించాడు.ఇప్పుడు మరింత సమర్థంగా మాడిఫైడ్ ఈసీటీ రూపంలో ... ఇటీవల పెరిగిన వైద్యవిజ్ఞానంతో చాలా తక్కువ డోసులో మత్తు మందుతోపాటు తక్కువ మోతాదులో కరెంట్ ఇవ్వడం ఆధునిక మాడిఫైడ్ ఈసీటీలో జరుగుతుంది. శాస్త్రవిజ్ఞానం ఎంతో పెరిగిన ఇటీవల కాలంలో బాధితులకు ఇప్పుడు మత్తు కూడా చాలా తక్కువ మోతాదులో (షార్ట్ యాక్టింగ్) అలాగే చాలా సురక్షితంగా కూడా ఇస్తున్నారు. కండరాలుకు తగినంత విశ్రాంతి కలిగించే మందులు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రో కన్వల్సివ్ చికిత్స (ఈసీటీ) చేయడం జరుగుతుంది. ఇందులో బాధితులకు తమకు కరెంట్ షాక్ ఇస్తున్న విషయమూ తెలికుండానే... వారికి అసలేమీ జరగదలేదని అనిపించేలా... కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయడం సాధ్యమవుతోంది. నిద్రలోకి వెళ్లి మళ్లీ లేచినప్పుడు మాత్రమే బాధితులకు తమకేదో చికిత్స చేశారనే విషయం తెలుస్తుందిగానీ.... ఇందులో నిజానికి ఎలాంటి బాధా ఉండదు. ఈసీటీ ఇచ్చిన తర్వాత సుమారు 2 గంటల పాటు వైద్యులు సదరు మానసిక సమస్యల బాధితుల్ని తమ పర్యవేక్షణలోనే ఉంచుకుని (తాము వాడిన మందుల ప్రభావం తగ్గేంతవరకు) ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. అంటే ఈసీటీకి ప్రస్తుతం అత్యంత సులువైన, ప్రమాదరహితమైన ఔట్పేషెంట్ పద్ధతిలోనే చికిత్స జరుగుతుందన్నమాట. మన సమాజంలో నిజానికి మానసిక సమస్యలు వాటి కారణాలు గురించి చాలా తక్కువ అవగాహనే ఉంది. ఇప్పటికీ చాలా కుటుంబాల్లోని సభ్యులకు ఏదైనా మానసిక సమస్య ఉందంటే... వారు దాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచడానికే మొగ్గుచూపుతారు. ఇది సరైన పద్ధతి కాక΄ోయినా... దురదృష్టవశాత్తు ఇంకా ఇప్పటికీ ఇలాంటి ఆలోచన ధోరణే ప్రజల్లో / సమాజంలో కొనసాగుతోంది. నిజానికి మన దేహంలో ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇంకా పూర్తి స్థాయిలో అంతుచిక్కనిదీ లేదా చాలా తక్కువగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది మన మెదడు గురించే. మెదడు నిర్మాణం, జీవక్రియలూ అత్యంత సంక్లిష్టంగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ... ఈ అంశం మన మెదడు తాలూకు సంక్లిష్టతను తెలియజేస్తుంది. అందుకే మానసిక సమస్యల తాలూకు కారణాలు తెలుసుకోవడం చాలా సంక్లిష్టమైన కఠినమైన విషయంగా మారింది. ఇప్పుడిప్పుడు మెదడుకు సంబంధించిన చాలా రహస్యాలు మెల్లమెల్లగా తెలిసివస్తున్నాయి. ఈసీటీ ప్రక్రియ... మెదడులోని అనేక స్థాయుల్లో చాలారకాల మాలిక్యులార్ బయోకెమికల్, ఎండోక్రైన్, స్ట్రక్చరల్, జెనెటిక్ మార్పులను కలగజేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియ వ్యాధిని నయం చేయడానికి కారణమవుతోంది. ఎలక్ట్రో కన్వల్సివ్ ప్రక్రియ(ఈసీటీ) ఎలా పనిచేస్తుందంటే...నిజానికి ఈసీటీ చికిత్స ఎంత సురక్షితమైనదో చెప్పడానికి తార్కాణమేమిటంటే... గర్భవతుల్లో (ప్రెగ్నెన్సీలో)అలాగే ప్రసవం అయ్యాకకొత్తగా తల్లులైన మహిళల్లో వచ్చే పోస్ట్పార్టమ్ సైకోసిస్కు చికిత్సఇచ్చేటప్పుడు ఆ బాలెంతకూ...అంతేకాదు...గర్భంలో ఉన్నశిశువుకుసైతం ఈసీటీఅనేది చాలాసురక్షితమైన ప్రక్రియ అనితేలింది. ఈ నేపథ్యంలోసమాజంలో ఈ చికిత్సపై ఉన్న అపోహలు తొలగించుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం.ఈసీటీతో ఏయే సమస్యలుఉన్నవారికి చికిత్స అందిస్తారంటే...తీవ్రమైన వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలు ఉన్నవారికి. ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా అనుకుంటున్నవారికీ, ఆత్మహత్యలకు ప్రయత్నించేవారికీ (సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవారికీ) ఆహారాన్ని తిరస్కరించేవారికి. బైపోలార్ డిప్రెషన్ ఉన్న బాధితులకు మందులతో పైన పేర్కొన్న వ్యాధులు నయంకాని సందర్భాల్లో... స్కీజోఫ్రీనియా వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి. కెటటోనియా అనే మానసిక సమస్యలో (ఈ పరిస్థితిలో బాధితులు పూర్తిగా ఓ శిలాప్రతిమలా బిగుసుకుని ఉండిపోతారు. నిజానికి ఈ స్థితి అనేక మానసిక వ్యాధుల కారణంగా కలుగుతుంది. కెటటోనియా స్థితి నుంచి బాధితులను మామూలు స్థితికి తీసుకురావడానికి షాక్థెరపీ బాగా ఉపయోగపడుతుంది. తొలినాళ్లలో కాస్త ముతకగా... ఆ తర్వాతమెరుగ్గాతొలినాళ్లలో బాధితులకు మత్తు మందు ఇవ్వకుండానే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ)ని ఇచ్చేవారు. దాంతో బాధితుల్లో మూర్చలు కలిగినప్పుడు వారికి గాయాలు కావడం, ఒళ్లు నొప్పులు రావడం, ఎముకలు గాడితప్పడం (డిస్ లొకేట్ కావడం), ముఖ్యంగా దవడ ఎముక (జా డిజ్లొకేషన్) వంటివి ఎక్కువగా కనిపించేవి. అయితే తొలిసారిగా 1940లో బెనెట్ అనే శాస్త్రవేత్త మత్తుమందు ఇచ్చి ఈ చికిత్స ఇవ్వడం వల్ల పైన పేర్కొన్న సమస్యలేవీ రావనీ, దాంతో కొద్దిగా మత్తు ఇవ్వడం ద్వారా ఇతరత్రా సమస్యలేమీ లేకుండా చాలా సురక్షితంగా ఈ చికిత్సను అందించడం సాధ్యమేనని కనుగొన్నాడు.ఈసీటీపై అపోహలూ వాస్తవాలు అపోహ:ఈసీటీ ప్రక్రియ మెదడును గాయపరుస్తుంది. వాస్తవం : ఈసీటీ వల్ల మెదడు నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రాగానీ ఎలాంటి గాయాలూ కావనీ, మెదడులో ఏ రకమైన ప్రమాదకరమైన మార్పులూ కలగవంటూ అనేక పరిశోధనల్లో స్పష్టంగా తేలింది. అపోహ:ఈసీటీ వల్ల మతిమరపు వస్తుంది.వాస్తవం : ఈసీటీ వల్ల బాధితుల జ్ఞాపపశక్తిపై దాదాపుగా ఎలాంటి ప్రభావమూ పడదని చెప్పవచ్చు. ఒకవేళ పడినా అది చాలా చాలా తక్కువ. ఈసీటీ ఇచ్చే ముందు తాత్కాలికంగా ఇచ్చే మందు మోతాదు కూడా చాలా తక్కువ. అయితే ఈ మత్తు నుంచి బయటకు వచ్చే ముందర బాధితుల్లో కాస్త అయోమయ స్థితి కనిపించవచ్చు. ఇదే ఇలాంటి దురభిప్రాయానికి కారణమవుతోంది. అంతేతప్ప జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గదు. అయితే చాలా కొద్దిమందిలో మాత్రం ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు తాత్కాలికంగా జ్ఞాపకశక్తి తగ్గినప్పటికీ అది కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు మాత్రమే. ఈసీటీ వల్ల శాశ్వతమైన జ్ఞాపకశక్తి లోపం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. అపోహ: ఈసీటీ వల్ల మెదడులోనికి ఒక్కోసారి ప్రమాదకరమైన రీతిలో కరెంట్ ప్రవహించవచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. అప్పుడున్న అత్యాధునిక పరికరాల వల్ల కరెంట్ ఇచ్చే ప్రక్రియ పూర్తిగా సురక్షితం. దాంతో ఇది పూర్తిగా ప్రమాదరహితమైన వైద్యం ప్రక్రియ అని చెప్పవచ్చు. పైగా ఈసీటీలకు వాడే వోల్టేజీ కూడా చాలా తక్కువ. అపోహ: ఈసీటీకి వల్ల మెదడు దెబ్బతిని కొన్ని మానసిక వ్యాధులు రావచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. ఈసీటీతో కొన్ని మానసిక సమస్యలు తగ్గడమే తప్ప కొత్తగా ఎలాంటి మానసిక వ్యాధులూ రావని స్పష్టంగా చెప్పవచ్చు. అపోహ: కరెంట్ షాక్ ఇస్తారు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. వాస్తవం : ఇది పూర్తిగా ప్రమాదరహితం. అయితే ఎలక్ట్రో కన్వల్సివ్ ట్రీట్మెంట్లో ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా) వల్ల ఇతరత్రా శస్త్రచికిత్సలో ఉండే రిస్క్ మాత్రమే ఇందులోనూ ఉంటుంది. అంతేతప్ప ఇందులో ఎలాంటి అదనపు ముప్పూ ఉండదు. అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ఇతరత్రా జబ్బుల్లో ఇచ్చినప్పుడు చూసినట్టుగానే బాధితులకు దాన్ని తట్టుకునే ఫిట్నెస్ ఉందే లేదో చూసుకోవాలి. గుండెజబ్బులు, ఇతర శారీరక సమస్యలు ఉన్నాయేమో గమనించాలి. అప్పుడే అనస్థీషియాతో వచ్చే సమస్యలను గుర్తించి వాటిని నివారించవచ్చు. ఈసీటీ ఇచ్చే సమయంలో పల్స్ ఆక్సీమీటర్ అనే సాధనంతో గుండె, ఊపిరితిత్తులు మొదలైన శారీరక వ్యవస్థలను గమనిసూ ఉంటే ఇరత శరీరక సమస్యలపై పడే ప్రమాదాలను నివారించవచ్చు.ఈసీటీ ఇవ్వడం ఎప్పుడు సరికాదంటే...నిజానికి కొన్ని రకాల సమస్యలు ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు... ఒకవేళ అవి ఈసీటీ ఇవ్వడం వల్ల తగ్గేవైతే... అలాంటి సందర్భాల్లో మందులు మార్చి చూడటం కంటే ఈసీటీతోనే మంచి ఫలితాలు ఉంటాయంటూ వైద్యపరిశోధకులు, వైద్యులు గుర్తించారు. అయితే ఈసీటీ అన్నది పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియే అయినప్పటికీ ఈ చికిత్సకూ కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేమిటంటే... మెదడులో సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ కలిగించే ఒత్తిడి ఉన్నప్పుడు ఈసీటీ వాడకూడదు. ఇటీవల ట్రాన్స్క్రేనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులైజేషన్ అనే ప్రక్రియ వల్ల కూడా ఈసీటీతో ఉండే ప్రయోజనాలే కలుగుతాయని కొత్త పరిశోధనలతో తేలింది. కాబట్టి ఇదే ఈసీటీనే ఇంకాస్త అధునాతంగా ఇవ్వడంపై కూడా ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వైహెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
నిజానికి గుండెదడ ఒక జబ్బు కాదు. కాకతే కొన్ని సాధారణ లేదా తీవ్రమైన గుండె సమస్యల తాలూకు ఓ లక్షణంగా భావించవచ్చు. ఒక్కోసారి గుండె దడదడలాడుతున్న విషయం బాధితులకు ఏ ఉపకరణం లేదా ఏ టెస్ట్ సహాయం లేకుండానే తెలిసిపోతుంటుంది. ఆందోళనతో కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంది. అయితే అరుదుగా కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రమైన గుండె జబ్బులకు అదో సూచన కావచ్చు. అందుకే గుండెదడ గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం. అలాంటి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. గుండెదడను వైద్యపరిభాషలో పాల్పిటేషన్ అంటారు. చాలామంది జీవితకాలంలో ఏదో ఒకసారి అనుభవించే సాధారణ లక్షణం ఇది. చాలా సందర్భాల్లో ఏదో ఒక మానసిక ఆందోళన లేదా ఉద్విగ్నత వంటి కారణాలతో కనిపించే అత్యంత మామూలు సమస్య ఇది. చాలా వరకు తీవ్రమైన సమస్య కాకపోయేందుకే అవకాశాలెక్కువ. కాకపోతే చాలా అరుదుగానే ఏదైనా తీవ్రమైన గుండె సమస్యకు సూచన అయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు.పాల్పిటేషన్స్ అంటే...? గుండె నిత్యం స్పందిస్తున్నప్పటికీ... అది కొట్టుకుంటున్న తీరు సాధారణంగా మన అనుభవంలోకి రాదు. కానీ కొన్నిసార్లు వేగంగా స్పందించే ఆ స్పందనలు వ్యక్తుల అనుభవంలోకి వస్తాయి. కొట్టుకుంటున్న వేగాన్ని బట్టి వాటిని ఇంగ్లిష్లో సాధారణంగా ఫ్లట్టరింగ్, పౌండింగ్ లేదా రేసింగ్గా చెబుతుంటారు. కొన్నిసార్లు వ్యక్తులు వేగంగా పరిగెత్తడం, తీవ్రమైన భావోద్వేగాలకు గురికావడం, ఉద్విగ్నతకూ, తీవ్రమైన ఆందోళనకూ గురికావడం, అలాగే తీవ్రమైన జ్వరం లేదా గర్భధారణ సమయంలో గుండెదడ (పాల్పిటేషన్స్) అనుభవంలోకి వచ్చేందుకు అవకాశాలెక్కువ. అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కువసార్లు కాఫీ తాగడం, కొన్ని సందర్భాల్లో పొగతాగడం, మద్యం తీసుకోవడం లేదా నిద్రలేమి వంటి జీవనశైలి అలవాట్లు కూడా పాల్పిటేషన్స్కు దారితీయవచ్చు. సాధారణ జీవక్రియల్లో భాగంగానే ఇలా గుండెదడ రావచ్చు. అలాంటప్పుడు గుండెదడ పెద్దగా హానికరం కాదు.మరి పట్టించుకోవాల్సిందెప్పుడంటే... గుండెదడ (పాల్పిటేషన్ ) అకస్మాత్తుగా స్పష్టమైన కారణం లేకుండా వచ్చినప్పడు. తలతిరుగుతుండటం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, స్పృహ తప్పడం వంటివి జరిగినప్పుడు.గుండె లయ తప్పడం (అబ్నార్మల్ రిథమ్ లేదా అరిథ్మియా) వంటి లక్షణాలు కనిపించినప్పుడు...పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని కొంత సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ గుండె లయతప్పడంలో ఒక ప్రత్యేకమైన రకం గురించి చెప్పుకోవాలి. గుండె లయబద్ధంగా స్పందించడానికి వీలుగా సయనో ఏట్రియల్ నోడ్ అనే చోట ఎలక్ట్రిక్ సంకేతాలు వెలువడుతుంటాయి. వీటి కారణంగానే గుండె ఒకే రకమైన లయతో స్పందిస్తుంటుంది. ఒకవేళ అలా కాకుండా ఆ ఎలక్ట్రిక్ స్పందనలు అసాధారణంగా ఎక్కడపడితే అక్కడ (అంటే నిర్దిష్టమైన ట్రాక్లో కాకుండా ఒకదానిని మరొకటి బైపాస్ చేస్తూ) వెలువడుతున్నప్పుడు... గుండె తన నిర్దిష్టమైన లయతో... లయబద్ధంగా కాకుండా ఎలా పడితే అలా కొట్టుకుంటూ ఉండేందుకు అవకాశముంది. దాంతో గుండె రిథమ్ దెబ్బతినడం వల్ల అరిథ్మియా వచ్చే అవకాశముంది. అయితే ఇలా జరిగినప్పుడు అదృష్టవశాత్తు శస్త్రచికిత్స వంటి సంక్లిష్టమైన ప్రక్రియలు అవసరం లేకుండానే ‘రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్ఎఫ్ఏ)’ అని పిలిచే రక్తనాళాల్లోకి పైప్ను పంపే క్యాథెటర్ ప్రోసిజర్స్తోనే ‘ఎలక్ట్రో ఫిజియాలిస్ట్లు’ అనే నిపుణులు ఈ సమస్యను చక్కదిద్దే అవకాశం ఉంది.గుండెదడతో ఎవరెవరికి ముప్పు...?స్థూలకాయం (ఒబేసిటీ), అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ లేదా గుండె జబ్బులున్నవారు గుండెదడ లక్షణాన్ని కాస్త సీరియస్గానే పరిగణించాలి. అందునా మరీ ముఖ్యంగా వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా అనే ‘అరిథ్మియా’ (గుండె లయ తప్పడం) లేదా ఆర్టీరియల్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఉన్నవారిలో గుండెదడ ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకెళ్లి కార్డియాక్ అరెస్ట్ లేదా పక్షవాతం (స్ట్రోక్) వంటి ప్రాణహాని కలిగించేంత తీవ్రమైన ముప్పునకు కారణమయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఇక్కడ పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు గుండెదడ విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇక మరో రకమైన ముప్పు ఎవరిలోనంటే... కొందరి కుటుంబాల్లో అకస్మాత్తుగా గుండె΄ోటు వచ్చి మరణించిన (సడన్ కార్డియాక్ డెత్) దాఖలాలు ఉన్న వైద్య చరిత్ర గలవారైతే... అలాంటి కుటుంబాల్లోని వ్యక్తులు గుండెదడను అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇక కార్డియో మయోపతి (గుండె కండరానికి సంబంధించిన ఆరోగ్య సమస్య) లేదా వంశపారంపర్యంగా గుండె ఎలక్ట్రిక్ స్పందనల్లో తేడాలు కనిపించే ఛానెలోపతీస్) వంటి వారిలోగుండెదడ ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివారు ఎలక్ట్రోఫిజియాలజిస్టుల ఆధ్వర్యంలో తరచూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.ఆధునిక కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ భూమిక... కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ అనేది గుండె లయ (హార్ట్ రిథమ్) సమస్యలను గుర్తించడం, నిర్ధారణలతో పాటు ఆ సమస్యలకు తగిన చికిత్స అందించడానికి రూపొందిన గుండె చికిత్స విభాగం. గుండె సమస్యల నిర్ధారణ కోసం ఈసీజీ, హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రో ఫిజియోలాజికల్ స్టడీస్, అత్యాధునిక ఇమేజింగ్ వంటి ప్రక్రియల సహాయం తీసుకుంటారు. వాటి సాయంతో ఎలక్ట్రోఫిజియాలజిస్టులు ఈ తరహా సమస్యలను గుర్తిస్తారు. ఇక అత్యధికంగా ముప్పు ఉన్న బాధితులకు ముందుగానే ప్రమాదాలను నివారించేందుకు దేహంలో అమర్చే ఇంప్లాంటబుల్ కార్డియో–వెర్టర్ డీఫిబ్రిలేటర్స్ (ఐసీడీ) వంటి ఉపకరణాలను అమర్చుతారు. ఈ ఉపకరణాలు గుండె లయతప్పినప్పుడుల్లా చిన్న ఎలక్ట్రిక్ షాక్ను వెలువరించడం ద్వారా గుండె లయను మళ్లీ క్రమబద్ధీకరిస్తాయి. దాంతో గుండెనొటు వంటి ప్రాణాంతక పరిస్థితులు నివారితమవుతాయి. చివరగా... సాధారణగా గుండెదడ అన్నది అంత హానికరం కాదనే చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ముప్పు ఉన్నవారిలో అవి కొంత ప్రమాద హెచ్చరికలు (వార్నింగ్ సిగ్నల్స్)గా పరిగణించవచ్చు. కాబట్టి ఆ హెచ్చరికల ఆధారంగా వైద్యులను సంప్రదించడం వల్ల ఒక రకంగా గుండెదడ మేలే చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియలూ, ఆధునిక చికిత్సల వల్ల ప్రమాదాలను నివారించుకునేందుకు, చికిత్సతో నయం చేసుకునేందుకు వీలుంది కాబట్టి ఆందోళన అక్కర్లేదు. కాకతే తగిన జాగ్రత్త మాత్రం అవసరమంటూ గుండెదడ ఓ వార్నింగ్ బెల్లా పనిచేస్తుందని చెప్పవచ్చు. డాక్టర్ ఏ సురేశ్, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, హైదరాబాద్(చదవండి: బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?) -
బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?
నాకిప్పుడు తొమ్మిదోనెల. ఈ మధ్యన ఇంటర్నెట్లో బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించడం గురించి చదివాను. అది ఎలా ఉపయోగపడుతుంది? – వెన్నెల, కర్నూలు. బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించడం అనేది ఇప్పుడు అన్ని ఆసుపత్రులూ రొటీన్గా ఫాలో అవుతున్నాయి. బొడ్డుతాడు బేబీని, తల్లి ప్లాసెంటాకు జాయిన్ చేస్తుంది. ఈ తాడును డెలివరీ తరువాత కట్ చేస్తాం. ఈ పద్ధతిలో కనీసం ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు ఆగి ఆలస్యంగా కట్ చేస్తే బేబీకి ఉపయోగాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఇందులో అధిక రక్తప్రసరణ జరిగి, బేబీకి మంచి జరుగుతుంది. అందుకే, దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్ చేస్తోంది. అకస్మాత్తుగా బొడ్డుతాడును కత్తిరించినప్పుడు బేబీ బ్లడ్ ప్రెజర్ సడన్గా డ్రాప్ అవుతుంది. ఈ బొడ్డుతాడుతో బేబీకి బ్లడ్ ఐరన్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. మెదడు ఎదుగుదలకు కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ ప్రాసెస్ నార్మల్ డెలివరీ అయిన కేసెస్లో ఫాలో కావాలి. బేబీ పుట్టిన వెంటనే డ్రై చేసి, పొత్తిళ్లలో చుట్టి, పిల్లల డాక్టర్ అసెస్మెంట్ చేస్తారు. బేబీ ఏడుపు బాగుంటే, కనీసం ఒక నిమిషం ఆగి, బొడ్డుతాడును కత్తిరిస్తారు. ప్రీ ట్రర్మ్, సిక్ బేబీస్కి ఇలా ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరించడం ఇంకా మంచిది. అయితే, మరీ, ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరించడం కారణంగా, కొంతమంది బేబీస్కి ఎక్కువ రక్తం వెళ్తుంది. చాలా అరుదుగా జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కంట్రోల్ చెయ్యటానికి బేబీస్కి ఫొటోథెరపీ అవసరం. కానీ, కొంతమందికి కాన్పు కష్టంగా జరిగినప్పుడు, ఆలస్యం చేయకుండా వెంటనే బొడ్డుతాడును కత్తిరిస్తారు. కానీ, తల్లి ఆరోగ్యం నిలకడగా ఉంటే, బేబీ బొడ్డుతాడుని తప్పకుండా ఒక నిమిషం ఆగి, ఆ తర్వాతే కత్తిరిస్తారు. నాకు బిడ్డపుట్టి నెలవుతుంది. డెలివరీ అయినప్పటీ నుంచి నాకు పాలు తక్కువగానే వస్తున్నాయి. పాలు బాగా రావటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, తిరుపతి. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు చాలా ముఖ్యం. బేబీ కనీసం పదిహేను నుంచి నలభై నిమిషాల పాటు రొమ్ములను కంటిన్యూయస్గా సకింగ్ చెయ్యాలి. అప్పుడు ఆ స్టిమ్యులేషన్కి పాలు కూడా బాగా ఉత్పత్తి అవుతాయి. కొంతమంది బేబీ బాగా నిద్ర పోయినప్పుడు పాలు ఇవ్వకుండా ఉంటారు. అలా చేయకూడదు. బేబీ నిద్రపోయినా సరే, మీరు బేబీని రొమ్ముకి పెట్టుకొని నిద్రలేపటానికి ప్రయత్నించాలి. కనీసం రోజులో ఎనిమిదిసార్లు పాలు తాగేటట్టు చేయాలి. కొంత సమయం, ఓపిక, సపోర్ట్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ఫీడ్ చెయ్యలేకపోవటం అనేది ఉండదు. కొంతమంది బేబీస్ అసలు పాలు తాగడానికి కూడా ప్రయత్నం చెయ్యరు. అప్పుడు మీరు హ్యాండ్ ఎక్స్ప్రెస్ చేసి, ఉగ్గు గిన్నెలో నుంచి పట్టడానికి లేదా బ్రెస్ట్ బిల్క్ బాటిల్ నిపుల్ ద్వారా ఇవ్వటానికి ప్రయత్నించండి. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అలవాటు కావటానికి ఎప్పుడూ స్కిన్ టు స్కిన్ దగ్గరగా ఉంచండి. రెండు గంటలకు ఒకసారి పాలు ఇవ్వండి. బేబీ నిపుల్ని నోటితో పట్టుకునేటట్లు ప్రతి గంటన్నరకు ప్రయత్నించండి. చాలా డల్గా ఉంటే బేబీని ఒకసారి పిల్లల డాక్టర్కు చూపించండి. కొన్నిసార్లు షుగర్ డౌన్ అయితే అలా ఉంటారు. అప్పుడు ఫార్ములా ఫీడ్ ఎలా ఇవ్వాలో చెప్తారు. బ్రెస్ట్ పంప్ ఉపయోగించడం చాలా మంచిది. బేబీ నిపుల్ పట్టుకోకపోతే ప్రతి రెండు గంటలకు ఎలక్ట్రానిక్ పంప్ వాడడం వల్ల నిపుల్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. దీనితో ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణంగా డెలివరీ అయిన రెండు వారాల తరువాతే బ్రెస్ట్ మిల్క్ ఫ్లోలాగా చాలామందికి వస్తుంది. అందుకే ముందే మిల్క్ రావట్లేదు అని టెన్షన్ పడి, బ్రెస్ట్ ఫీడింగ్కి దూరం చేసే బాటిల్ ఫీడ్, ఫార్ములా ఫీడ్ ఇవ్వకండి. ట్రై చేస్తూనే ఉంటే ఫీడింగ్ ఇంప్రూవ్ అవుతుంది. పోషకాహారాలు ఎక్కువ ఉండే డైట్, లాక్టేషన్ డైట్ కౌన్సెలర్ని కలసి సలహా తీసుకోండి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఈ చికిత్సతో..పుట్టుమచ్చలను ఈజీగా తొలగించుకోవచ్చు..!) -
ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్
ఇటీవల కాలంలో చేతిలో మొబైల్ లేనిదే మన ప్రపంచమే ఆగినంతగా మారిపోయింది జీవితం. అది లేకపోతే మన గమనం లేదు అని చెప్పొచ్చు. అంతలా ప్రతిదానికి ఆ స్మార్ట్ఫోన్ పైనే ఆధారపడిపోతున్నారు అందరూ. ఏం కావాలన్న ఠక్కున జేబులోంచి ఫోన్ తీసి చెక్ చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. అలా ఫోన్ చూడనిదే పూట గడవదు అన్నంతగా యువత, పెద్దలు అడిక్ట్ అవుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తాజాగా తమిళ హీరో మాధవన్ కూడా ఫోన్ వాడకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పడమే కాదు చక్కటి హెల్త్ టిప్స్ని కూడా పంచుకున్నారు.ఎన్నో వైవిధ్యభరితమైన మూవీలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన నటుడు మాధవుడు. అమ్మాయి కలల రాకుమారుడిగా మంచి క్రేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న నటుడు. ప్రతి మూవీ అత్యంత విలక్షణంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడమే గాక, విలన్ పాత్రలతో కూడా మెప్పించి, విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఆయన ఎప్పటికప్పుడూ ఫిట్నెస్, పోషకాహారం తదితరాల గురించి సోషల్మీడియాలో నెటిజన్లతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఈసారి ఒక సెమినార్లో ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి మాట్లాడారు మాధవన్. ఈ డిజటల్ పరికరాలకు అలా అంకితమైపోతే..మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడమేగాక మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక్కసారి ఫోన్కి బ్రేక్ ఇచ్చి..మనతో మనం మమేకమైతే భావోద్వేగ పరంగా మెరుగవ్వడమే కాకుండా మంచి సంబధాలను నెరపగలుగుతామని అన్నారు. అంతేగాదు ఎప్పుడైనా.. మొబైల్ని పట్టుకోని చేతికి..వినియోగించే చేతికి తేడాని గమనించారా...? అని అడిగారు. సింపుల్గా చెప్పాలంటే మీ చేతి వేళ్లను బట్టి మీరెంతలా ఫోన్ వినియోగిస్తున్నారో చెప్పేయొచ్చని అంటున్నారు మాధవన్. వేళ్లల్లో గుంతలు కనిపిస్తున్నాయా..వేళ్ల ఎముకలు పక్కటెముకలు మాదిరిగా వంకర తిరిగి ఉన్నాయా..?.. గమనిస్తున్నారా అని ప్రశ్నించారు. అలా మారిన వేళ్లను మొబైల్ ఫోన్ ఫింగర్స్(mobile phone fingers) అంటారని, అవి మితిమీరిన ఫోన్ వాడకాన్ని చెప్పకనే చెప్పేస్తాయని అంటున్నారు. అంతేగాదు ఆ రక్తసికమైన ఫోన్ మీ శరీరం తీరుని పూర్తిగా మార్చేస్తోందని అన్నారు. అందువల్ల ఫోన్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం అని పిలుపునిచ్చారు నటుడు మాధవన్మొబైల్ ఫోన్ ఫింగర్స్ అంటే..చేతి వేళ్లు సహజసిద్ధంగా లేకుండా..మారిపోవడాన్ని మొబైల్ ఫోన్ వేళ్లు అంటారు. అంటే అధికంగా మొబైల్ ఫోన్ వినియోగించే వారి చేతి వేళ్లు తిమ్మిర్లు వచ్చి.. జాయింట్లు తప్పడం లేదా గ్యాప్ రావడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. వాటినే మొబైల్ ఫింగర్స్ అటారట. ఎక్కువసేపు పోన్ని వినియోగించేవారి చేతిలో కండరాలు దృఢత్వం కోల్పోయి తిమ్మిర్లు, మణికట్టు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తరుచుగా స్క్రోలింగ్, టైప్ చేయడం, ఎక్కువసేపు పట్టుకోవడం తదితర కదలికలు వల్ల ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు నిపుణులు. దీన్ని తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు.ఎలా నిరోధించాలంటే..సాధ్యమైనంతవరకు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలి. పనిచేయడం, వీడియోలు చూడటం, చదవటం వంటి కార్యకలాపాలకు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లను ప్రత్యామ్నాయంగా వినియోగించాలి. ఎందుకంటే ఈ పరికరాలు తగిన సెటప్ని అందిస్తాయి..పైగా చేతులు, వేళ్లపై తగిన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే వినియోగించక తప్పదు.. అనుకునేవారు..క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం, చేతులు సాగదీయడం లేదా రెండు చేతులతో ఫోన్ పట్టుకోవడం వంటివి చేస్తే..చేతులపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఒకరకంగా మీ కళ్ల ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలే చేకూరుస్తుందని అన్నారు. మెదడుపై కూడా మితిమీరిన స్మార్ట్ఫోన్ వినియోగం అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు. నెమ్మదిగా ఫోన్ వాడకాన్ని తగ్గించడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు నిపుణులు.నిర్ణిత వేళలో ఫోన్ రహిత సమయంగా పెట్టుకోవడం వంటివి చేయాలి. సోషల్ మీడియా వినియోగం తగ్గించడం తోపాటు యాప్ల వినియోగాన్ని తగ్గించాలి. దీనివల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు.. ) -
మామిడి తొక్కే కదా అని పారేయొద్దు.. లాభాలెన్నో తెలుసా?
ఇది మామిడి సీజన్ – ఎండల వేడితో పాటూ దక్కే తీపి రుచులు మామిడి పండ్లు. ఈ సీజన్లో మామిడి పండ్లు తింటాం కానీ.. తొక్క మాత్రం తీసి విసిరేస్తాం. కానీ మీకు తెలుసా? మామిడి తొక్క కూడా ఓ పోషకవంతమైన ఆహారం కావచ్చు. అవును – మామిడి తొక్క తినదగినదే, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిది కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు..తొక్క తినడం సురక్షితమేనా?సాంకేతికంగా చూస్తే, అవును. మామిడి తొక్క విషమేమీ కాదు. ఇది ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగిఫెరిన్, క్వెర్సిటిన్, కెరోటినాయిడ్లు వంటి బయోయాక్టివ్ పదార్థాలతో నిండివుంది. అయితే మామిడి తొక్క మందంగా, కొద్దిగా చేదుగా, కొన్నిసార్లు కొబ్బరి తరహాల ఉంటుంది. అందువల్ల చాలా మందికి నచ్చదు.అంతేకాదు కొంత మందికి మామిడి తొక్కలోని కొన్ని పదార్థాలు అలెర్జీ కలిగించొచ్చు మామిడిని తీసేటప్పుడు మురికితో పాటు చర్మంపై మంట వచ్చినట్లయితే, తొక్క తినకుండా ఉండటమే మంచిది.తొక్కలో పోషకాలు...ఇందులోని ఫైబర్: జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మాంగిఫెరిన్ వంటి పదార్థాలు శరీరంలో అలర్జీలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ చర్మాన్ని కాంతి వంతం చేస్తుంది. అలాగే కొన్ని పరిశోధనలు మామిడి తొక్క బ్లడ్ షుగర్ను నియంత్రించడంలో సహాయపడవచ్చని చెబుతున్నాయి. రుచికరంగా తినే విధాలు:మామిడి తొక్క చట్నీ:2 మామిడిల తొక్క (శుభ్రంగా కడగాలి)ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరిఅల్లం చిన్న ముక్క, తగినంత ఉప్పు,కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో కొద్దిగా మిక్స్ చేయండి. కావాలంటే మస్టర్డ్ గింజలు, కరివేపాకు టాంపర్ చేయొచ్చు.ఎండబెట్టి పొడి తయారు చేయడం:మామిడి తొక్కని ఎండలో లేదా ఓవెన్ లో బాగా ఎండబెట్టి పొడి చేసి, స్మూతీల్లో లేదా మసాలా మిశ్రమాలలో కలుపుకోవచ్చు. ఒక చిన్న ముక్క మామిడి తొక్క పండిన మామిడి, అరటిపండు, యోగర్ట్తో కలిపి మేళవిస్తే.. తీపి, చేదు మధ్య బ్యాలెన్స్ అవుతుంది. తొక్కని తరిగి, నీళ్ళలో నానబెట్టి, కొన్ని రోజులు ఫెర్మెంటేషన్కు ఉంచండి. స్వచ్చమైన వెనిగర్ లాగా తయారవుతుంది. సలాడ్ డ్రెస్సింగ్కు బాగా సరిపోతుంది.శుభ్రంగా కడిగిన మామిడి తొక్కని వేడి నీటిలో లేదా గ్రీన్ టీ లో వేసి మరిగించండి. హల్కా రుచి, యాంటీ ఆక్సిడెంట్ల తేలికపాటి పౌష్టికత మీకు లభిస్తుంది.జాగ్రత్తలు...పండే మామిడి తొక్కపై పురుగుమందుల శేషాలు ఉండొచ్చు. తొక్క తినాలంటే ఆర్గానిక్ మామిడిని మాత్రమే ఎంచుకోవాలి. అలా దొరకని పక్షంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అవేంటంటే..నీళ్ళలో 1 టీస్పూన్ ఉప్పు, టీస్పూన్ పసుపు కలిపి 10–15 నిమిషాలు నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగడం ద్వారా కాయపై అలుముకున్న పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే తొలగించవచ్చు. అలాగే ఒక బౌల్ నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టి, తరువాత మంచి నీటితో కడగడం 1:3 నిష్పత్తిలో వెనిగర్ : నీటిలో కలిపి 15–20 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి. అలాగే తినాలనుకుంటే మామిడి తొక్కని మృదువైన బ్రష్ లేదా గుడ్డతో సున్నితంగా తోమి శుభ్రం చేయాలి.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అంతర్జాతీయ వంటకాలు..) -
పగలబడి నవ్వేందుకు పది కారణాలు...
'సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా'..అంటున్నారు నిపుణులు. నవ్వు నాలుగు విధాల చేటు కాదు ఆరోగ్యం అని ఘంటాపథంగా చెబుతున్నారు. నవ్వడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే గాక ఒత్తిడి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖం సదా నవ్వుతూ ఉండే సంబంధబాంధవ్యాలు కూడా సానుకూలంగా ఉంటాయట. నిజానికి 'నవ్వు' వైజ్ఞానికంగా చాలా మంచిది అనే విషయాన్ని హైలెట్ చేస్తోంది. ఇలా ఎందుకు అంటున్నారంటే..నవ్వు ఆరోగ్యానికి ఎందుకు మంచిదంటే..రోగనిరోధక శక్తిని పెంచుతుంది - ఇది యాంటీబాడీల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది - నవ్వడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండి రక్తపోటును తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది - నవ్వు కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను తగ్గిస్తుంది, మరింత రిలాక్స్గా ఉండటానికి సహాయపడుతుంది.మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది - ఇది శరీరం సహజ అనుభూతిని కలిగించే రసాయనాలు అయిన ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది.సామాజిక బంధాలను బలపరుస్తుంది - నవ్వుతూ ఉంటే అందరు మనతో మాట్లాడటానికి, ఉండటానికి ఇష్టపడతారు. తద్వారా సమాజంలో ఇతరులతో మంచి సంబంధాలనే కుటుంబ సంబంధాలు కూడా బాగుంటాయి. ఆహ్లాదకరమైన సానుకూల వాతావరణాన్ని సొంతం చేసుకోవచ్చు. నొప్పిని తగ్గిస్తుంది - డోపమైన్ ఉత్పత్తిని ప్రేరేపించి..వివిధ రుగ్మతల నివారిణిగా పనిచేస్తుంది.సానుకూలతను ప్రోత్సహిస్తుంది - అంతేగాదు మనలో తెలియని కాన్ఫిడెన్స్ పెరిగి ఎలాంటి సవాళ్లనైనా సులభంగా అధిగమించగలుగుతారు. మానసిక ఆరోగ్యానికి మద్దతిస్తుంది - నవ్వు విశ్రాంతిని ప్రోత్సహించి ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది.ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది - గాఢమైన నవ్వు డయాఫ్రాగమ్కు మంచివ్యాయామంగా పని చేస్తుంది. పైగా శ్వాసక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది - ఎక్కువగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవిస్తారని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి.కావునా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వేద్దాం..చక్కటి ఆరోగ్యాన్ని పొందుదాం. ](చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
సరికొత్త వెల్నెస్ ట్రెండ్ "ఫార్ట్ వాక్" అంటే ..? వైద్య నిపుణుల సైతం బెస్ట్..
ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతికత తోపాటు..సరికొత్త వెల్నెస్ ట్రెండ్లు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. పైగా ఇంట్లో వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ డైట్ మంచిది, ఇలా చేస్తే బెటర్ అంటూ ఎన్నెన్నో ఆరోగ్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మరో వెల్నెస్ ట్రెండ్ నెట్టింట సందడి చేస్తోంది. ఆఖరికి నిపుణులు సైతం చాలా మంచిదని చెబుతుండటం మరింత విశేషం. మరీ ఆ ట్రెండ్ ఏంటి..? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ అంటే.."ఫార్ట్ వాక్"(Fart Walk) అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అట. తక్కువ శ్రమతో కూడిన ఆరోగ్య రహస్యమని అంటున్నారు. ఇంతకీ అసలు ఈ వాక్ ఎలా చేస్తారంటే..ఫార్ట్ వాక్ అంటే..భోజనం తర్వాత తేలికపాటి నడకనే ఫార్ట్వాక్ అంటారు. అంటే ఇక్కడ రాత్రిభోజనం తర్వాత తప్పనిసరిగా వాక్ చేయడంగా భావించాలి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యానికి సహాయపడుతుందట. ఈ ఫిట్నెస్ దినచర్య ప్రాథమిక లక్ష్యం జీర్ణక్రియకు సహాయపడటం, తీవ్రమైన వ్యాధులను నివారించడం అని రచయిత్రి స్మిత్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dr. Tim Tiutan | Internal Medicine (@doctortim.md) మనం ఫైబర్తో కూడిన భోజనం తీసుకుంటాం కాబట్టి గ్యాస్ సమస్య ఉత్ఫన్నమవుతుందట. అలాంటప్పుడు గనుక ఇలా ఫార్ట్ వాక్ చేస్తే.. ఆపానవాయువు నోరు లేదా కింద నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందట. జస్ట్ రెండు నిమిషాలు ఆ విధంగా నడిస్తే..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయని చెబుతున్నారు స్మిత్. కేన్సర్ వైద్యుడు డాక్టర్ టిమ్ టియుటన్ రచయిత్రి స్మిత్ సూచించిన ఫిట్నెస్ చిట్కాని సమర్థించారు. ఆమె చెప్పింది సరైనదేనని, నిజంగానే దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పారు. భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత - లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సులిన్ సమస్య ఏర్పడదని అన్నారు. అలాగే మరో వైద్యుడు అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ డామన్ కూడా ఈ ఫిట్నెస ట్రెండ్కి మద్దుతిచ్చారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఆలస్యంగా నడక ప్రారంభిస్తే అప్పటికే పోషకాలు శోషించబడి రక్తంలో కలిసిపోతాయని, అలాగే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయని చెబుతున్నారు డామన్. కలిగే లాభాలు..కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి దీర్ఘాయువుని అందిస్తుందిఎలాంటి అనారోగ్యల బారినపడకుండా కాపాడుతుందివృద్దాప్యంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటేనే కాసేపు ఓ రెండడుగులు అటు.. ఇటు..నడిచి ఆరోగ్యంగా ఉందామా మరీ..!. (చదవండి: Summer Tips: ఏసీతో పనిలేకుండానే సహజసిద్ధంగా ఇంటిని చల్లగా మార్చేద్దాం ఇలా..!) -
శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..
ఇంటిల్లిపాదికి శక్తిని ఇవ్వడానికి కష్టపడే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అందరూ తిన్నాక మిగిలినదో, ఫ్రిజ్లో ఉంచి తీసినవి తినడమో చాలా మంది చేస్తుంటారు. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోరు. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా మహిళలు, గర్భిణులు 30 శాతానికి పైగా రక్త హీనతతో బాధపడుతున్నారని నివేదికలు చూపుతున్నాయి. పోషకాలపై దృష్టి అవసరంజీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కేవలం ఆహార ప్లానింగ్ వల్లనే కాదు... తిన్నది జీర్ణం కాకపోవడం, మలబద్దకం వంటి వాటితోనూ వస్తుంటాయి. తమ శరీరానికి ఏ ఆహారాలు సరిపడుతున్నాయో, సమస్య దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనే అవగాహన కలుగుతుంది. సహజంగా మహిళలు రుతుక్రమంలో ఉన్నప్పుడు ప్రతి నెలా కొంత రక్తం పోతుంటుంది. దానిని భర్తీ చేయడానికి ఐరన్ సమృద్ధిగా లభించే బీట్రూట్, వేరుశనగ వంటి నట్స్ తీసుకోవాలి. ఆహారం తయారు చేసినప్పుడే ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఉంటాయనుకుంటే పొరబాటు. ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలనూ ఆహారంలో చేర్చుకోవాలి.పరీక్షలతో లోపాల గుర్తింపుఆహారం ద్వారా శరీరానికి పోషక విలువలు ఎంతమేరకు అందుతున్నాయి, హార్మోన్ల స్థితి ఎలా ఉంది.. అనే విషయాలు అర్థం చేసుకోవడానికి కొన్ని రక్తపరీక్షలు, ఫంక్షనల్ టెస్ట్లు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాహార లోపాలను గుర్తించవచ్చు. హార్మోన్ల అసమతుల్యతను అంచనా వేయడంలోనూ, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలోనూ ఈ టెస్టులు సహాయపడతాయి. కండరాల పటుత్వానికి40 నుంచి 50 ఏళ్ల మహిళల్లో కండరాల పటుత్వం తగ్గుతుంది. ఈ వయసులో సమతుల ఆహారంపై దృష్టిపెట్టకపోతే ఆ తర్వాత వయసులో మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందుకని ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, జింక్, మెగ్నీషియం, బీ కాంప్లెక్స్, విటమిన్ డి ... ఉండే ఆహారాలతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలి. విశ్రాంతికీ ప్రాధాన్యత ఇవ్వాలిసమతుల ఆహారం తీసుకోవడానికి ఎంత శ్రద్ధ చూపుతామో పనుల వల్ల అలసిన శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి అనే విషయంలోనూ అంతే జాగ్రత్త చూపాలి. అందుకు ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్ర ఉండాలి. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. రుతుక్రమ దశలోనూ, మెనోపాజ్ దశలోనూ భావోద్వేగాలలో మార్పు మహిళల్లో ఎక్కువ చూస్తుంటాం. ఆహారం నుంచి తగినన్ని పోషకాలు అందక΄ోతే నిపుణుల సాయంతో సప్లిమెంట్స్ వాడాలి. ప్రతి పోషకాన్నీ కవర్ చేస్తూ సరైన ఆహారం తీసుకోవడం, ఫిట్గా ఉండటం చాలా ముఖ్యం. – డాక్టర్ సమత తూళ్ల, ఎమ్.డి, మెడికల్ డైరెక్టర్, కో–ఫౌండర్, పిఎమ్ఎక్స్ హెల్త్ (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు) -
సమ్మర్ హీట్ని తట్టుకోవాలంటే..కళ్లకు సన్గ్లాస్ పెట్టాల్సిందే..!
సమ్మర్ హీట్ని బీట్ చేయాలంటే కళ్లకు సన్గ్లాస్ పెట్టాల్సిందే. సన్గ్లాసెస్ ఫ్యాషన్ యాక్సెసరీ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. సూర్యుడి అతి నీలలోహిత కిరణాలకు రేడియేషన్కు ఎక్కువసేపు గురి కావడం రకరకాల సమస్యలకు కారణం అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్ నుంచి సన్గ్లాసెస్ మన కళ్లకు రక్షణగా ఉంటాయి.ఎలాంటి సమస్యలు రాకుండా కంటి ఆరోగ్యం కోసం సన్ గ్లాసెస్ ఉపయోగపడతాయి. తీవ్రమైన సూర్యకాంతి వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. తలనొప్పి రావచ్చు. బయటికి వెళ్లినప్పుడు సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గించి కంటిపై ఒత్తిడి లేకుండా చేస్తాయి కూల్ గ్లాసెస్.ఎలాంటి సన్గ్లాసెస్ను ఎంచుకోవాలంటే...100 శాతం యూవీ ప్రొటెక్షన్ ఇచ్చేవాటిని ఎంపిక చేసుకోవాలి. పోలరైజ్డ్ లెన్సెస్ సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గిస్తాయి. బ్రైట్ కండీషన్స్లో పోలరైజ్డ్ గ్లాసెస్ మంచి క్లారిటీని ఇస్తాయి స్ట్రాంగ్, స్క్రాచ్–రెసిస్టెంట్ సన్ గ్లాసెస్ను ఎంచుకోవాలి లైట్ వెయిట్, ఇంపాక్ట్–రెసిస్టెంట్, గుడ్క్లారిటీ కోసం పాలీకార్బోనేట్ లెన్సులు పాపులర్ ఛాయిస్రకరకాల సైజ్, షేప్లలో సన్గ్లాసెస్ వస్తున్నాయి. అయితే వాటిలో మన ముఖ ఆకృతికి నప్పే అద్దాలను ఎంచుకోవడం ఉత్తమం. (చదవండి: చీర కేవలం మహిళల సొత్తు కాదు..! స్టైలిష్ ధోతీలా పురుషులు కూడా..) -
లెడ్ పాయిజనింగ్ అవుతోందా?
నాకిప్పుడు మూడోనెల. నేను పెయింట్, డైయింగ్ షాప్లో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాను. లెడ్ పాయిజనింగ్ అవుతుందని విన్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దేశీత, శ్రీకాకుళం.పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారు ఎక్కువ శాతం లెడ్ డస్ట్కి గురవుతారు. లెడ్ పెయింట్స్ని స్ట్రిప్ చేసినప్పుడు, అది పీల్చుకుంటే లెడ్ డస్ట్ ఎక్కువ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ పరిశ్రమల్లో ఉండే ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అవుతుంది. ఎక్కువ కాలం లెడ్ డస్ట్కు గురైతే, లెడ్ పార్టికల్స్ శరీరంలోకి చేరుతాయి. అందుకే, ఈ పరిశ్రమల్లో పని చేసేవారు శరీరం, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. సాధారణ వాతావరణం ద్వారా అందరికీ కొంత లెడ్ ఎక్స్పోజర్ అవుతుంది. కానీ, ఎక్కువ శాతం ఈ పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో వారికే అవుతుంది. ఈ లెడ్ శరీరంలోకి వ్యాపించి ఎముకలు, దంతాల్లో నిల్వ ఉంటుంది.అంతేకాదు, ప్రెగ్నెన్సీలో ఈ లెడ్ పార్టికల్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి చేరి తల్లికి, బిడ్డకు ప్రమాదం చేస్తాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో రక్తపరీక్షల్లో ఈ లెడ్ లెవల్ను పరిశీలిస్తాం. క్యాల్షియం, ఐరన్, విటమిన్ డీ, విటమిన్ ఈ, విటమిన్ సీలను ఆహారంలో తక్కువ తీసుకునే వారికి ఈ లెడ్ అబ్జార్ప›్షన్ పెరుగుతుంది. అందుకే, సమతుల్యమైన ఆహారం, పోషకాహారం ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఈ లెడ్ లెవెల్స్ 5 ఎమ్సీజీ / డీఎల్ కన్నా ఎక్కువ ఉంటే అది డేంజర్ లెవెల్ అని అర్థం. లెడ్ మెటల్ ప్లాసెంటాను దాటి పిండంలోకి చేరగలదు. ఈ లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గర్భస్రావం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు, హై బీపీ వంటి సమస్యలు పెరుగుతాయి. బిడ్డ మెదడుపై కూడా ప్రభావం పడుతుందని పరిశోధనల్లో తేలింది.బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. అందుకే, డాక్టర్ను వెంటనే సంప్రదించాలి. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, రక్తంలో మీ లెడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చెస్తారు. నీటిలో కూడా లెడ్ ఎక్స్ప్లోజర్ కావచ్చు. కాబట్టి వడగట్టి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. పరీక్షల్లో లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మొదట క్యాల్షియం మాత్రలు ఇస్తారు. ఒక గ్రాము డోస్ రోజూ డెలివరీ వరకు తీసుకోవాలి. చెలేషన్ థెరపీ ఇవ్వాలి. రెండు నుంచి నాలుగు వారాల తరువాత లెడ్ లెవెల్స్ను మళ్లీ చెక్ చేస్తాం. రెండో త్రైమాసికంలో సురక్షితంగా ఈ మందును అడ్జస్ట్ చేసి ఇస్తాం. భవిష్యత్తులో లెడ్ ఎక్స్పోజర్ ఎక్కువ కాకుండా డెలివరీ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి.ఎలాంటి వారికి సమస్య ఎక్కువ?నా వయసు ముప్పై సంవత్సరాలు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నాము. ఎలాంటి వాళ్లకి ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి?– ప్రణతి, గుంటూరు.ప్రెగ్నెన్సీలో కొందరికి ఎక్కువ సమస్యలు కావచ్చు. మరికొందరికి తక్కువ ఉండవచ్చు. సాధారణంగా అలసట, థైరాయిడ్ సమస్యలను ఎక్కువమందిలో చూస్తాం. కానీ, కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న వారిలో సమస్యలు ఎక్కువ అవుతాయి. బరువు ఎక్కువ ఉండటం, స్థూలకాయం, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో తల్లికి బీపీ, మధుమేహం, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బేబీకీ వెన్నెముక, మెదడు సమస్యలు పెరుగుతాయి. వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న తల్లుల్లో క్రోమోజోమ్ అసాధారణతలు ఎక్కువ ఉంటాయి. అలానే టీనేజ్ ప్రెగ్నెన్సీలో కూడా సమస్యలు ఎక్కువ. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన కండిషన్స్లో కూడా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ట్విన్స్, మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్లో ఉండవచ్చు. వారిలో షుగర్, హై బీపీ ప్రమాదం పెరుగుతుంది. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఎదుగుదల సమస్యలు, ప్లాసెంటా సమస్యలు ఉన్నా ఇప్పుడు అవి ప్రభావం చూపుతాయి. అందుకే, మూడవనెల నుంచి మంచి ఆహారం తీసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే, ప్రమాదాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా పరీక్షలు చేసి, మందులను సూచిస్తారు.ప్రెగ్నెన్సీలో బేబీకి ప్రమాదమా?నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నాను. ఇంట్లో ఉమ్మడి కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే పనిచేసే ఆఫీసులోనూ కూడా చాలా టార్గెట్స్ ఉంటాయి. ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. అది తగ్గించుకోవాలన్నా అవటం లేదు. ఈ ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో బేబీకి ఏదైనా ప్రభావం ఉంటుందా? – రూప, బెంగళూరు.ఒత్తిడి అనేది మానవ జీవితంలో సహజం. కానీ, ప్రెగ్నెన్సీ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా అనుభవించవలసిన సమయం. ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత సంతోషంగా ముందుకు వెళ్లగలరు. సానుకూల వైఖరి చాలా అవసరం. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. ఒత్తిడి పెంచే ఆలోచనలు అస్సలు చెయ్యకూడదు. ప్రెగ్నెన్సీలో శరీరం, మెదడులో చాలా మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పుల వలన కొంత అసహనం, చిరాకు ఉంటాయి. అతిగా ఒత్తిడికి గురైతే నిద్రలేమి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, హై బీపీ, నెలలు నిండకుండానే ప్రసవం, పుట్టిన బిడ్డ బరువు తక్కువ ఉండటంలాంటి సమస్యలు రావచ్చు. ఒత్తిడికి దారితీసే కారణాలను వెతికి, వాటిని ముందే పరిష్కరించుకోవాలి. కనీసం తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ ఒక గంటసేపు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. బాగా నిద్రపోవాలి. -
ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!
మా ఆయనకు 52 సం‘‘లు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. వృత్తిలో పెద్దగా సమస్య లేదు. కాని ఈ మధ్య రాత్రి నిద్రలో తన కాళ్ళతో నన్ను కొడుతున్నాడు. నిద్రలో కాళ్ళను గట్టిగా కదిలించడం, అప్పుడప్పుడు కేకలు వేయడం, కలలో ఎవరితోనో పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఉదయాన్నే లేచిన తరువాత అడిగితే రాత్రి జరిగిన విషయాలు ఏమి గుర్తులేవని అనడమే కాక, అసలు అలా చేయనే లేదని చెప్తున్నారు. మా ఇద్దరి వైవాహిక జీవితంలో వేరే ఏ సమస్యా లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. నాపైన కోపంతో పగలు నన్నేం అనలేక రాత్రి నిద్రలో నన్ను ఇబ్బంది పెడ్తున్నారేమోనని అనిపిస్తుంది. దీనికి తగిన పరిష్కారం చెప్పగలరు.– వరలక్ష్మి, మహబూబ్ నగర్ మీ భర్త విషయంలో మీరు వివరించిన లక్షణాలు రాత్రి నిద్రలో కాళ్ళతో తన్నడం, కేకలు వేయడం, చేతులు కదిలించడం, పొద్దున దాని గురించి అసలేం గుర్తు లేకపోవడం... ఇవన్నీ ‘రెమ్ స్లీప్ బివేవియర్ డిజార్డర్’ అనే నిద్రకు సంబంధించిన రుగ్మతను సూచిస్తున్నాయి. ఈ సమస్యలో ఆ వ్యక్తి నిద్రదశలో కలల్లో వచ్చే విషయాలకు అనుగుణంగా వారికి తెలియకుండానే ఆ విధంగా ప్రవర్తిస్తారు. సాధారణంగా కలలు వచ్చే సమయంలో మన శరీర కండరాలు అచేతనమై ఉంటాయి. కానీ పైన చెప్పిన సమస్య ఉన్న వారిలో అలా జరగక΄ోవడం వల్ల వారు విపరీతంగా కదలడం, కాళ్ళతో చేతులతో కొట్టడం చేస్తారు. మీరు వెంటనే మీ భర్తను ఒక న్యూరాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్ళి ‘స్లీప్ స్టడీ’ చేయించి ఈ రుగ్మతను నిర్ధారించుకోవాలి. కొన్ని మంచి మందులతో ఈ లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్స మొదలయ్యే వరకు మీ భద్రత కోసం మీరు వేరే బెడ్పై లేదా వేరే గదిలో నిద్రిస్తే మంచిది. ఆయన నిద్ర΄ోయే ముందు మద్యపానం, కాఫీ, సిగరెట్ లాంటివి తీసుకోకుండా చూడండి. అన్నిటికీ మించి ఇది ఆయన అదుపులో లేని ఒక వైద్యసమస్య అని గుర్తించండి. ఆయన్ని కోపగించుకోకుండా, అర్థం చేసుకొని వైద్య చికిత్స చేయించండి! అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్!(చదవండి: మంచి పనిచేశా..! భారత్పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..) -
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ ఆమె. తరుచుగా చుట్టూ జరుగుతున్న లోపాల గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ..సలహాలు సూచనలు ఇస్తుంటారు. చిన్నారులు దగ్గర నుంచి నేటి యువత వరకు ఎలాంటి జీవన విధానంతో లైఫ్ని లీడ్ చేస్తే బెటర్ అనే దాని గురించి అమూల్యమైన సలహలిస్తుంటారు కూడా. అలానే తాజాగా ఆహారపు అలవాట్లు ఎలా ఉంటే ఆరోగ్యానికి మంచిదో చెప్పారు. దాంతోపాటు తన తన ఆరోగ్యకరమైన డైట్ సీక్రెట్ని కూడా పంచుకున్నారు. మనం మనుషులం కాబట్టి ఒక్కోసారి చీట్ మీల్ తినేస్తుంటాం. అందుకు తాను కూడా మినహా కాదని నవ్వతూ చెప్పారామె. మరీ ఆ విషయాలేంటో చూద్దామా..!.పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్తో జరిగిన సంభాషణలో రాజ్యసభ ఎంపీ, విద్యావేత్త సుధామూర్తి భారతదేశం ఆహారం, భారతీయుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడారు. సుధామూర్తి ఆ భేటీలో ఇంట్లో వండిన ఆహారం తినడం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు. మనసుకు సంతృప్తిని, హాయిని ఇచ్చే ఆహారం తినడం గురించి నమ్ముతానన్నారు. అయితే అధిక కేలరీల ఆహారాన్ని మాత్రం తప్పకుండా నివారించాలన్నారు. అందుకోసం తానేం చేస్తారో కూడా వివరించారు. నోరూరించే అధిక కేలరీలు ఆహారాలు తన భోజనం టేబుల్పై లేకుండా ఉండేలా చూసుకుంటారట. చాలావరకు ఆ విషయంలో స్వీయ నియంత్రణ చాలా కష్టంగా ఉంటుంది. తాను కూడా ఒక్కోసారి చీట్ మీల్ చేస్తుంటానని అన్నారు. తనకు పెడ, బర్ఫీ లేదా మైస్ వంటి స్వీట్లంటే ఎంతో ఇష్టమని చూడగానే మనసు పారేసుకుంటానని నవ్వుతూ చెప్పారు. అయితే తీసుకునే ముందు ఇదొక్కటే లేదంటే తన ఆరోగ్యానికి ఇబ్బంది అని సర్ది చెప్పుకుంటూ ఆపేస్తా అన్నారు. డైట్ ఎలా ఉంటుందంటే..రోటీలలో ఒకటైన భక్రిని తాను ఇష్టంగా తింటానన్నారు. ఇక్కడ భక్రి అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తినే ప్రసిద్ధ ఫ్లాట్బ్రెడ్.ఎర్రటి గోధమ జోవర్ వంటి చిరుధాన్యాలను తీసుకుంటారెమె. చివరగా తీపి తినాలనే కోరికను నివారించడానికి పండ్లు ఎక్కువగా తీసుకుంటానన్నారు. అన్నీంట్ల కంటే కంఫర్ట్ ఫుడ్ - పోహా అంటారెమె. తన ప్రతి భోజనంలో తప్పనిసరిగా అది ఉండాల్సిందేనట.(చదవండి: అలనాటి గోల్డెన్ డేస్: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..) -
ఎక్కువ ఆయుర్దాయం కావాలా? జపనీయుల టాప్ సీక్రెట్స్ ఇవే!
జపనీయుల దీర్ఘాయువు వెనక... స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల అనుకున్నంత కాలం జీవించలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జపాన్? ప్రజలు మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయంతో ఎక్కువకాలం పాటు జీవిస్తున్నారు. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.. మనం కూడా వారిని అనుసరిద్దాం.డబ్ల్యుహెచ్. ఓ. అంచనాల మేరకు... జపాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 83.7 సంవత్సరాలు (మహిళలకు 86.8 సంవత్సరాలు పురుషులకు 80.5 సంవత్సరాలు)గా ఉంది. జపాన్ ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, సంస్కృతి, జెనెటిక్స్? దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇకిగై (సంతోషంతో జీవించడం): జపనీయులు ‘ఇకిగై’ అనే సిద్ధాంతంతో సంతోషంగా జీవిస్తారు. ఆనందంతో జీవించాలని ఈ పురాతన తత్వశాస్త్రం బోధిస్తుంది. అంతేకాక, ఎందుకు జీవిస్తున్నామనే దానిపై స్పష్టతతో జీవితానికి లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమతో కలిసి ఉండటం వంటి అంశాలు వారి ఆయుష్షును పెంచుతాయి. హరా హాచ్ బన్ మి. ఇది జపాన్లో ఒక సామెత. అంటే తగిన మోతాదులోనే ఆహారం తినాలని అర్థం. కడుపులో 80 శాతం నిండినంత వరకు మాత్రమే తింటే దీర్ఘాయువు కలిగి ఉంటామని జపనీయుల నమ్మకం. అంతేకాదు, పెద్ద పళ్లెంలో కాకుండా చిన్న చిన్న ప్లేట్లలో లేదా బౌల్స్లో నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి తింటారు. భోజనం చేసేటప్పుడు టీవీ, సెల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కింద కూర్చునే తింటారు. సమతుల ఆహారం: జపనీస్ ఆహారం లో పండ్లు, ఒమేగా ఫాటీ ఆమ్లాలు అధికం గా ఉండే చేపలు, బియ్యం, తృణధాన్యాలు, టోఫు, సోయా, మిసో, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. ఇవన్నీ తక్కువ కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కాన్సర్, గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చు. ఈ ఆహారం కారణంగానే జపాన్లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు.హెర్బల్ టీ: జపనీస్ ప్రజలు టీ తాగడాన్ని ఇష్టపడతారు. అది వారి సంస్కృతిలో భాగంగా భావిస్తారు. జపాన్ ద్వీప సమూహంలో మాచా టీ చాలా ప్రాచుర్యం పొందింది. టీ తయారీలో ఉపయోగించే టీ ఆకులు అధిక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కాన్సర్తో పోరాడే శక్తినిస్తాయి. కాలి నడకకు ప్రాధాన్యం: జపాన్ ప్రజలు ఒకేచోట కూర్చుని పని చేసే జీవన శైలిని అంతగా ఇష్టపడరు. యువకుల నుంచి వృద్ధుల వరకు అంతా నడవడానికే ఇష్టపడతారు. విద్యార్థులు, ఉద్యోగులు సమీపంలోని రైల్వే స్టేషన్కు నడవడం లేదా సైక్లింగ్? చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ వారి ఆయుర్ధాయం పెరగ డానికి దోహదం చేస్తాయి.జీన్స్ ఇవి వారు ధరించే జీన్స్ కాదు.. జపనీస్లో సహజసిద్ధంగా ఉండే జన్యువులు. ఇవే వారి ఆయుష్షును పెంచుతున్నాయి. టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్స్, గుండెపోటు, సెరెబ్రోవాస్కులర్, హృదయ సంబంధ వ్యాధులలను నిరోధించడానికి ఈ జన్యువులు సహాయపడతాయి.వృద్ధుల సంరక్షణ: ఇతర దేశాలలా జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఓల్డ్? ఏజ్?హోమ్లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం అక్కడి వారి సాంప్రదాయం. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని అక్కడి వారి నమ్మకం. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?ఆరోగ్య సంరక్షణ: జపాన్లో అనారోగ్యాలను నివారించి, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.సామాజిక నిర్మాణం: బలమైన సామాజిక సంబంధాలు, సమాజ మద్దతు మెరుగైన మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి దారితీస్తుంది, ఇవి దీర్ఘాయువుకు ముఖ్యమైనవి.చదవండి: ఇక్కడ జిమ్లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!చూశారుగా...పైన చెప్పుకున్న వాటిలో ఒక్క జన్యుపరమైన కారణాలు తప్ప మిగతావన్నీ మనం సులువుగా అనుసరించదగ్గవే. వీలయిన వాటిని వీలయినంత వరకు అనుసరించి ఆయురారోగ్యాలతో హాయిగా ఉందాం. దీర్ఘాయుష్మాన్ భవ! -
యూట్యూబ్ సలహా ప్రమాదం కావచ్చు...
ఉదయాన్నే రాగి సంగటి తినమంటారొకరు. తింటే డేంజరంటారొకరు. వేపాకులను తినేయండి అని ఒకరు. రావి ఆకుల జ్యూస్ అని ఒకరు. ఇటీవల ఆరోగ్యం మీద అందరికీ ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టు యూట్యూబ్లో చిట్కాల వీడియోలు పెరిగాయి. అర్హతలు ఉన్నవారూ లేనివారూ చెప్పేది వింటే ప్రొణం మీదకు రావచ్చు.కేరళలోని కన్నూరులో ఓ 18 ఏళ్ల యువతి బరువు తగ్గడానికి కేవలం వేడినీళ్లు తాగుతూ అవయవాలు దెబ్బ తిని మరణించింది. పిల్లలను హెచ్చరించే మనం జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.ఆరోగ్య ప్రచారం మంచికోసం కాకుండా సబ్స్ట్రయిబర్ల కోసం, వ్యూస్ కోసం సాగడం నేటి విషాదం. ఎలాంటి టిప్స్ చెప్పిస్తే వీడియోలు వైరల్ అవుతాయో చూస్తున్నారో తప్పితే చెబుతున్న విషయాలు ఎవరికి, ఎంతవరకు అవసరమో ఎవరికి కీడు చేస్తాయో చెప్పడం లేదు. ఆహార విధానాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతూ అయోమయానికి గురి చేయడం నేడు చూస్తున్నాం. కోడిగుడ్డు పచ్చసొన కొందరు వద్దు అంటే కొందరు అదే మంచిది అంటారు. ఇలాంటి అయోమయం మధ్యలో ప్రత్యామ్నాయ ఆహార ప్రచారకర్తలు ముందుకు వచ్చి తాము నమ్మిన విధానాలను ప్రచారం చేస్తున్నారు. వీరు చేస్తున్న వీడియోలకు శాస్త్రీయ నిర్థారణ ఏమిటి అన్నది ఎవరూ చూడటం లేదు. అలాగే చురుగ్గా, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ‘సన్నగా’ కనిపించడం అవసరం అనుకుంటున్నారు చాలామంది. సన్నగా అవడం అందరి శరీరతత్వాలకు సరిపడుతుందో లేదో వైద్య సలహా తీసుకోవడం లేదు. వీడియోలు చూసి బరువు తగ్గేందుకు ప్రయత్నించిప్రొణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేరళలో జరిగిన ఉదంతం ఈ విషయంలో హెచ్చరిక చేస్తోంది.50 కిలోల నుంచి 24 కిలోలకుకన్నూరు జిల్లా కలూరుపరయకు చెందిన 18 ఏళ్ల ఫస్ట్ ఇయర్ డిగ్రీ అమ్మాయి శ్రీనంద బరువు తగ్గిపోయి మాట్లాడలేని స్థితికి చేరుకోగా తల్లిదండ్రులు ఆమెను తలస్సెరి కోఆపరేటివ్ హాస్పిటల్కు తీసుకు వచ్చారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ప్రభు మాట్లాడుతూ ‘ఆమె బరువు 24 కేజీలు ఉంది. బి.పి. 70, ఆక్సిజన్ లెవల్ 70, బ్లడ్షుగర్ 45.. సోడియం, పొటాషియం లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఆమె ఆరు నెలలుగా ఆహారం తినకుండా దాచేస్తోంది. మూడునెలలుగా యూట్యూబర్ను నమ్మి హాట్ వాటర్ మాత్రమే తీసుకుంటోంది. 50 కిలోల నుంచి మూడునెలల్లో 24 కిలోలకు వచ్చేసింది. ఇది ఆహారాన్ని నిరాకరించే ‘అనొరెక్సియా’ అనే మానసిక స్థితి. తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. ఇలాంటి వారిని ముందే గుర్తించి మానసిక వైద్యం చేయించాలి’ అన్నారు. ‘రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు’ అని ఆయన తెలిపారు.బాడీ షేమింగ్, వీడియోలుఇటీవల కాలంలో బాడీ షేమింగ్ వల్ల టీనేజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దేశప్రధాని మన దేశంలో ఊబకాయం పెరిగిపోతోందని ఆందోళన చెందుతోంటే, అందుకు కారణాలను అర్థం చేసుకోకుండా ఊబకాయులను బాడీ షేమింగ్ చేస్తున్నారు కొందరు. టీనేజ్లో ఉన్న పిల్లలు సన్నబడాలని హటాత్తుగా బరువు తగ్గితే అది అవయవాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి వారిని ఆకర్షించేలా యూట్యూబ్లో బోలెడన్ని వీడియోలు ఉంటున్నాయి. ‘ఇలా చేస్తే వెంటనే బరువు తగ్గుతారు’ అనే వీడియోలు నమ్మవద్దని పిల్లలకు చె΄్పాల్సిన అవసరం ఉంది.గుడ్డిగా నమ్మవద్దుఅలోపతిలోగాని ఆయుర్వేదంలోగాని లేదా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లోగాని కచ్చితమైన నిపుణులను కలిసి పూర్తిగా కేస్ హిస్టరీ చెప్పి సన్నబడటానికి లేదా బరువు తగ్గడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చి ఆకుకూరల, కాయగూరల జ్యూసులు తాగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నిపుణుల సలహా తప్పనిసరిబరువు తగ్గడం అనేది మానసిక వైకల్యంగా మారే స్థితికి కొంతమంది చేరుకోవడం బాధాకరం. ఇలాంటి వారు యూట్యూబ్, ఇన్స్టా తదితర ప్లాట్ఫామ్స్లో తెలిసీ తెలియక చెప్పే సలహాలు నమ్మి నష్టపోతున్నారు. కేరళలో చనిపోయిన అమ్మాయి ఆరు నెలలు ‘హాట్వాటర్’ థెరపీ చేసింది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ ఇద్దరూ ఒకే విధంగా బరువు తగ్గరు. అందుకు వయసు, శరీరతత్త్వం, జన్యుపద్ధతి, జీవన విధానం... ప్రభావం చూపుతాయి. బరువు తగ్గించాలంటే ఎక్స్పర్ట్లు వ్యక్తిగతంగా వివరాలు తీసుకుని, మెడికల్ హిస్టరీ తెలుసుకొని, ఎటువంటి ఆహారం తీసుకోవాలో, వద్దో సూచిస్తారు. క్వాలిఫైడ్ డైటిషియన్స్ను వ్యక్తిగతంగా కలిసి డైట్ పాటించాలి తప్ప ఎవరూ ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే విధానాలకు దిగవద్దు.– డా.వాణి కత్తి, ఫుడ్సైన్స్ ఎక్స్పర్ట్ -
కివిపండుని తొక్కతో సహా తింటున్నారా..?
కివి విదేశీ పండైనా..మనకి మార్కెట్లలో అందుబాటులోనే ఉంది. దీన్ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. చాలామంది ఇష్టంగా తింటారు కూడా. అయితే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అన్నీ లాభాలనందించే ఈ పండుని తొక్కతో తినొచ్చా..? ఏ సమయంలో తింటే మంచిది వంటి వాటి గురించి తెలుసుకుందామా..!రుచిలో తియ్యగా, పుల్లగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే తియ్యగా, పుల్లగా ఉండే ఈ కివీ వివిధ వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా ఈ పండుని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఈ కివి పండుని తీసుకోవండ కలిగే లాభాలేంటంటే..ఆరోగ్య ప్రయోజనాలు..కివి పండులో విలువైన ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఉబ్బరం తగ్గిస్తుంది గట్ బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంది సెరటోనిస్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి హాయిగా నిద్రపడుతుంది ∙బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది ∙రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒమేగా ఫ్యాటీ అమ్లాల వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది మల బద్దకం సమస్య లేకుండా చేస్తుంది. కివీలో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది ∙శరీరం కోల్పోయిన నీటిని అందించడంలో కివీలోని విటమిన్లు సి, ఇ, పొటాషియం... ఉపయోగపడతాయి. ఏ సమయంలో తినాలి కివి తినడానికి సరైన సమయం ఉదయం. కివిలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. కివి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి కాబట్టి ఖాళీ కడుపుతో తినకుండా కాస్త బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తినడం మంచిది.ఎలా తింటే మంచిదంటే..కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుం టాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియిన్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు. (చదవండి: బీట్రూట్ని మజ్జిగతో కలిపి ఎందుకు తీసుకోవాలంటే..!) -
National Dentists Day : రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి?
నిజామాబాద్ నాగారం: మానవ శరీరంలో ఉన్న అవయవాలు సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తినిచ్చేది దంతాలు. ఆహారాన్ని నమిలి మింగడానికి దోహదప డతాయి. అందుకే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని దంత వైద్యులు చెబుతుంటారు. నోటి శుభ్రతపై నిర్లక్ష్యం వహించొద్దని సూచిస్తున్నారు. నేడు జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉదయం, సాయంత్రం సరిగా బ్రష్ చేసుకోకపోవడంతో నోట్లో ఆహారం చేరి బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో పుప్పిపళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది. ఇదే కాకుండా నోరు శుభ్రంగా లేకపోతే రోగాలు దరి చేరుతాయని వైద్యులు చెబుతున్నారు. దంతాల శుభ్రతలో జాగ్రత్తలు.. ●దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ● ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. దీంతో పంటిలో చిక్కుకున్న ఆహారం బయటకు పోతుంది. ● ప్రతి ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ● మన్నికై న టూత్ పేస్ట్, టూత్ బ్రష్లను వాడాలి. ● చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు తినొద్దు. ప్రతి సంవత్సరం మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దంతవైద్యులు మరియు వారు అందించే ముఖ్యమైన పాత్రను గుర్తించేందుకు జాతీయ దంతవైద్యుల దినోత్సవంగా మార్చి 6న పాటిస్తారు. జాతీయ దంతవైద్యుల దినోత్సవ చరిత్ర 20వ శతాబ్దం నాటిది, దీనిని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) అధికారికంగా మొదలు పెట్టింది. దంతవైద్యంలో మైలురాళ్లను స్మరించుకోవడానికి ఈ రోజును పాటిస్తారు. ఉదాహరణకు, 1840లో డాక్టర్ హోరేస్ వెల్స్ మొదటిసారిగా అనస్థీషియాను ఉపయోగించారు. దంతవైద్యులు దంత సమస్యలను నయం చేయడమే కాకుండా నోటి అనారోగ్యానికి సంబంధించిన సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను కూడా గుర్తిస్తారు. -
కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?
శరీరానికి కాల్షియం అనేక రోజువారీ పనులు చేసేందుకు ఉపకరిస్తుంది. అందువల్ల మన డైట్లో కాల్షియంని చేర్చుకోవడం ముఖ్యం. జున్ను, బొప్పాయి, మల్బరీ, లిచీ, కివి, బచ్చలికూర, బ్రకోలీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్గా తినడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పాలు, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుందంటే...పాలు, రాగులు రెండూ ఒకదానికి మించి లాభాలని అందిస్తాయి. ఉదాహరణకి..100 మి.లీ పాలు తాగితే 110 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. అదే 100 గ్రాముల రాగులని తీసుకుంటే, దాదాపు 350 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచితే, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి రాగులు మంచిది. రాగుల్లో ఉండే పొటాషియం వంటి ఇతర పోషకాలు మొత్తం శరీర ఆరోగ్యానికి సాయపడతాయి. పాలలో పోషకాలతో పాటు ఉండే ఎలక్ట్రోలైట్స్ బాడీని హైడ్రేట్ చేస్తాయి. రాగులు షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ని నియంత్రిస్తుంది కాబట్టి, మీ అవసరాలని బట్టి ఏది మంచిదో నిర్ణయించుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!రాగులు, ఆరోగ్య ప్రయోజనాలుభారతదేశంలోని చాలా ప్రాంతాలలో రాగిగా ప్రసిద్ధి చెందిన ఫింగర్ మిల్లెట్ అతి ముఖ్యమైన చిరుధాన్యాలలో ఒకటి ప్రధాన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి దీనిని తరచుగా శిశువులకు , వృద్ధులకు ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులలో ప్రోటీన్ ,ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. సంతృప్తిగా ,కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతుంది.ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుందిగ్లూటెన్ రహితం కాబట్టి గ్లూటెన్ అసహనం ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది , అసంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది.కాల్షియం మూలమైన రాగులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయిమొలకెత్తిన రాగులు విటమిన్ బి 12 అవసరాలను తీరుస్తాయి.శీతాకాలంలో ఇది బెస్ట్ ఫుడ్. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.ఇది మలబద్దకానికి సహాయపడుతుంది.ఎవరు తీసుకోకూడదుమూత్రపిండాల్లో రాళ్ళు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం వంటి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారురాగులలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక హైపర్కలేమియా లేదా సీరం పొటాషియం స్థాయిలు పెరిగినవారు. అలాగే రాగులు రాత్రి పూట తినకుండా ఉండటం మంచిది.ఇదీ చదవండి : ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి? -
కాలుష్యం కాటేస్తది.. చెవి, ముక్కు, గొంతు జాగ్రత్త!
ఇటీవల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముక్కు ఆరోగ్య సంరక్షణ చాలా కీలకంగా మారుతోంది. అంతేకాదు.. ఈమధ్యకాలంలో శబ్దకాలుష్యం కూడా అనూహ్యంగా పెరిగి పోతోంది. వాహనాల పెరుగుదల వల్ల శబ్ద, వాయు కాలుష్యాలు... ఈ రెండూ ఏకకాలంలో పెరిగి రెండు జ్ఞానేంద్రియాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ ముక్కు, చెవులు రెండూ గొంతుతో అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో చెవులు,ముక్కు, గొంతు ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకం. అందుకే వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలుసుకోవడం తప్పనిసరి. ముక్కు చెవులనూ, అలాగే తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే కీలక అవయవ భాగమే మెడ. వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలివి... చెవుల సంరక్షణ కోసం... ∙పెద్ద పెద్ద చప్పుళ్ల నుంచీ, శబ్దకాలుష్యం నుంచి చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇయర్ ఫోన్స్తో మొబైల్ వాడేటప్పుడు, కంప్యూటర్ను ఉపయోగిస్తూ హెడ్ఫోన్స్ పెట్టుకున్న సమయంలో పెద్దగా వాల్యుమ్ పెట్టుకోకుండా చెవికి తగినంత వాల్యుమ్తో జాగ్రత్తగా చెవులను కాపాడుకోవాలి. ∙పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి.చెవుల్లో హోరు శబ్దాలు గానీ, ట్రాన్స్ఫార్మర్ దగ్గరి గుయ్మనే శబ్దాలుగాని వినిపిస్తుంటే అది టినైటస్ అనే సమస్య కావచ్చని భావిస్తూ సర్టిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలా పరీక్షించి చికిత్స చేయిస్తే... అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాక΄ోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. కాక్లియర్ ఇం΄్లాంట్స్ వంటి చికిత్సలతో మాటలూ, వినికిడీ వచ్చేలా చేయవచ్చు సైనస్ ఇన్ఫెక్షన్లూ, సమస్యల నుంచి కాపాడుకోవడానికి... ఒక్కోసారి చేతుల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు ఏదైనా తింటున్న సమయంలో గొంతులోకి వెళ్లి అక్కణ్నుంచి ముక్కు, నోరు, గొంతు ద్వారా (ఒక్కోసారి కళ్ల నుంచి కూడా) లోనికి ప్రవేశించి ముక్కు, నోరు, గొంతు, కళ్ల ఇన్ఫెక్షన్లతో పాటు సైనసైటిస్ వంటి సమస్యలకూ కారణమవుతాయి. కానీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మంచి హ్యాండ్ హైజీన్ను పాటించడం మేలు. అందుకే కేవలం చేతులు శుభ్రంగా కడుక్కోవడం (హ్యాండ్ వాష్)తో ఎన్నో సమస్యలను నివారించవచ్చునని గుర్తుంచుకోవాలికొన్ని అలర్జీ సమస్యలను, మనకు సరిపడని అలర్జెన్స్ వల్ల ముక్కు, గొంతు, కళ్ల అలర్జీలూ, సైనస్ సమస్యలతో ΄ాటు ఊపిరితిత్తులకు సంబంధించిన మరికొన్ని రుగ్మతలూ రావచ్చు. అందుకే మనకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి వేడినీటితో ఆవిరిపట్టడం అనే ఓ చిట్కాతో ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఈ జాగ్రత్తలతోపాటు మంచి సమతులాహారం, విటమిన్–సి సమృద్ధిగా ఉండే నిమ్మజాతి పండ్లైన నారింజ, బత్తాయి వంటివి వాడటం, జింక్ మోతాదులు ఎక్కువగా ఉండే నట్స్, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ఈ జాగ్రత్తలతోపాటు మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితోపాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయనే అంశాన్ని గ్రహించాలి. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసంస్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్యం మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, జబ్బులూ, రుగ్మతలూ నివారితమవుతాయి. గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్తంత ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి ఇంటి చిట్కా. దీనివల్ల గొంతుకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్లూ, ఇన్ఫ్లమేషన్లూ, సోర్ థ్రోట్ వంటి సమస్యలు దూరం కావడమే కాకుండా అనేక రకాల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. ఇది చాలా సులువైన, నమ్మకమైన, ప్రభావపూర్వకమైన చిట్కా ∙ఇక నీళ్లు ఎక్కువగా తాగుతుండటమనేది ఇటు గొంతుతోపాటు పూర్తి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతూ అనేక సమస్యల నుంచి రక్షణ కల్పించే అంశం. (భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!)ముక్కు ఆరోగ్యం కోసం...ముక్కు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మనందరి మొదటి ప్రాధాన్యత. అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకోవాలి ∙ఈ సీజన్లో బాగా నీళ్లు తాగుతూ ఉంటే అది ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ను ΄పొడిబారకుండా తేమగా ఉండేలా చూడటంతో పాటు... మిగతా దేహమంతా బాగా హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకునేందుకు ఉపయోగపడుతుంది.ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. ఇక చీదే సమయంలో బలంగా చీదడం సరికాదు. ఒక్కోసారి దీంతో ముక్కులోని అతి సన్నటి రక్తనాళాలు (క్యాపిల్లరీస్) చెదిరి రక్తస్రావం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు -
వేడి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఏమవుతుందో తెలుసా?
వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అలసట తీరుతుంది. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటి (Hot water) స్నానం ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే దుమ్ము ధూళితో నిండిపోయిన ముఖాన్ని (Face) వేడినీళ్లతో కడుక్కుంటే ప్రశాంతంగా ఉంటుంది. అయితే వేడి వేడి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందట. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందట. వేడి నీరు మీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.వేడి-నీరు అకాల వృద్ధాప్యం వేడి నీరు ప్రశాంతంగా అనిపించినప్పటికీ, ముఖ చర్మంపై తీరని ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఎలా అంటే.. మన శరీరంలోని మిగిలిన భాగాలతో పోలిస్తే ముఖం చర్మం భిన్నంగా ఉంటుంది. చాలా సున్నితంగా, చిన్న కేశనాళికలతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత వంటి బాహ్య కారకాలకు తొందరగా ప్రభావితయ్యే ఉండే రంధ్రాలతో నిండి ఉంటుంది. వేడి నీరు అప్పటికపుడు ఊరటనిచ్చినా ఆ తరువాత అనేక సమస్యలను కలిగిస్తుంది అంటున్నారు.వేడి నీళ్లు ముఖంపై ఉండే సూక్ష్మకేశనాళికలకు హాని కలిగిస్తుంది. ఇరిటేషన్, చర్మం ఎర్రబారడం లాంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన చర్మం లేదా రోసేసియా వంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.నేచురల్ ఆయిల్స్కు నష్టంవేడి నీటి వలన ముఖంపై ఉండే సహజ నూనెలకు హాని కలుగుతుంది. ఇవి సెబమ్ను ఉత్పత్తి చేసి, తేమను కాపాడుతుంది. మృదువుగా ఉంచుతుంది. కానీ వేడి నీరు ఈ నూనెలకు నష్టం కలిగించి మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖం మీద చర్మం తొందరగా ముడతలు పడేలా చేస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీంతో చర్మం సహజత్వాన్ని కోల్పోయి, ముడతలు తొందరగా వస్తాయి. ఫలితంగా వయసుకుమించి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. వయసు పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్,ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అతినీలలోహిత (UV) కిరణాలు కొల్లాజెన్ ఎలాస్టిన్ను విచ్ఛిన్నం చేస్తాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులు వంటి సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలలో, ఎండలేకపోయినా కూడా చర్మాన్ని రక్షించు కునేందుకు సన్ స్క్రీన్ వాడాలి. ముఖాన్ని ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. అలాగే మొహాన్ని పదే పదే కడగడం వల్ల మెరుపు తగ్గిపోతుంది.కెమికల్స్తో కూడిన సబ్బులు, హానికరమైన రసాయన బ్యూటీ ప్రాడక్ట్స్ను అస్సలు వాడకూడదు.అలాగే అధిక కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు ,చక్కెరలు, గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారితీయవచ్చు. కొల్లాజెన్ను దెబ్బతీసి, తొందరగా ముసలి తనం వచ్చేలా చేస్తుంది. అందుకే పిండి పదార్ధాలను తగ్గించి, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి.మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి.ఎలాంటి మచ్చలు లేకుండా, మెరిసిపోతూ, ప్రకాశవంతమైన కాంప్లెక్షన్ రావాలంటే శుభ్రంగా తినాలి. విటమిన్లు అధికంగా ఉండే ఆహారం, ముఖ్యంగా విటమిన్ సి, ఆకుకూరలు, సోయా, చిక్కుళ్ళు, చేపలు, చికెన్ తాజా పండ్లు తీసుకోవాలి. అవసరమైతే చర్మ ఆరోగ్యానికి, ముఖ్యంగా బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే సప్లిమెంట్లను తీసుకోవాలి. -
చలికాలంతో జాగ్రత్త.. ఆరోగ్యం, ప్రమాదాలు నుంచి రక్షణ కోసం.. (ఫొటోలు)
-
భవిష్యత్తులో తగ్గొచ్చా?
మా కజిన్కి 26 ఏళ్లు. బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. కీమో వల్ల భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చు అంటున్నారు. తనకి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? – పద్మజ, వెస్ట్గోదావరిక్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయి. అలాగే ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసే కొత్త పద్ధతులు కూడా చాలా వచ్చాయి. కీమో రేడియేషన్తో అండాశయాలు దెబ్బతింటే భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల అండాశయాలు చాలా వేగంగా దెబ్బతింటాయి. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి ఆంకో ఫర్టిలిటీ క్లినిక్స్లో డిస్కస్ చేస్తారు. ఒవేరియన్ కార్టెక్స్ అంటే అండాశయ బాహ్యపొరలో అపరిపక్వ అండాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా డెవలప్ అయ్యి పరిపక్వ అండాలుగా, మంత్లీ సైకిల్లో విడుదలవుతాయి. కాబట్టి ఒవేరియన్ లేయర్ని డామేజ్ చేసే ట్రీట్మెంట్ తీసుకునే ముందు మల్టీ డిసిప్లినరీ టీమ్ డిస్కషన్తో.. ఈ ఒవేరియన్ టిష్యూని ప్రిజర్వ్ చేస్తారు. మత్తు మందు ఇచ్చి కీ హోల్ (లాపరోస్కోపీ) సర్జరీ ద్వారా ఒవేరియన్ టిష్యూని తీసి క్రయోప్రిజర్వ్ చేస్తారు. ఇందులో ఒక ఓవరీని లేదా ఒవేరియన్ టిష్యూ బయాప్సీస్ని తీసి ఫ్రీజ్ అండ్ ప్రిజర్వ్ చేస్తారు. మైనస్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ అల్ట్రా లో టెంపరేచర్లో ఉంచుతారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో ఈ టిష్యూను తిరిగి ఇంప్లాంట్ చేస్తారు. కొన్ని నెలల తరువాత ఈ టిష్యూ బాడీలో నార్మల్ ఫంక్షన్లోకి వచ్చి.. మంత్లీ సైకిల్స్, ఎగ్ డెవలప్మెంట్కి సిద్ధమవుతుంది. ఇది గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో ప్రాక్టీస్లో ఉంది. దీనిద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన కేసులూ ఉన్నాయి. మీ కజిన్ని ఒకసారి కౌన్సెలింగ్ సెషన్కి అటెండ్ అవమనండి. విషయం వివరంగా తెలుస్తుంది. నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. రెండవ నెల. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ రైట్ సైడ్ ట్యూబ్లో వచ్చింది. దాంతో రైట్ ట్యూబ్ తీసేశారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూబ్లో ఉందని చెప్పారు. మెడికల్ ట్రీట్మెంట్తో ఏమైనా మేనేజ్ చేయవచ్చా?– అపర్ణ, నిర్మల్సహజంగా గర్భం దాల్చడానికి ఫాలోపియన్ ట్యూబ్స్ అవసరం. మీకు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ మాత్రమే ఉంది కాబట్టి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీ)ని మెడికల్గా మేనేజ్ చేయడం అవసరం. కానీ దీనికి మీరు డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్ మీ కండిషన్, సిట్యుయేషన్, ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ, మీకు లివర్, కిడ్నీ టెస్ట్స్, Beta hcg టెస్ట్స్ చేసి, మెడికల్ మెథడ్ ట్రై చేయొచ్చా అని చెప్తారు. అందరికీ ఈ ట్రీట్మెంట్ పనిచేయకపోవచ్చు.Methotrexate అనే డ్రగ్ ద్వారా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ మెడిసిన్ వాడాలంటే మీకు పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ ఉండకూడదు. ట్యూబ్ రప్చర్ కాకుండా ఉందనే విషయం స్కాన్లో కన్ఫర్మ్ కావాలి. Beta hcg తక్కువ లెవెల్స్లో ఉండాలి. మీరు ఫాలో అప్కి రావటానికి రెడీగా ఉండాలి. ఆసుపత్రి దగ్గరలో ఉండాలి. ఇది ఇంజెక్షన్ ద్వారా ఫస్ట్ డోస్ ఇచ్చి, మూడురోజులకొకసారి Beta hcg లెవెల్స్ తగ్గుతున్నాయా అని చెక్ చేస్తారు. తగ్గుతోంది అంటే మెడిసిన్ పనిచేస్తోంది అని అర్థం. రెండు మూడు వారాలు కొంత పెయిన్, స్పాటింగ్ ఉండొచ్చు. నొప్పి తీవ్రంగా ఉంటే సర్జరీ చెయ్యాలి. పారాసిటమాల్ లాంటి మాత్రలు వాడొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ ఎమోషనల్గా కూడా సవాలుగా మారొచ్చు. అందుకే కౌన్సెలింగ్ సహాయమూ తీసుకోవాలి. ఈ మెడిసిన్తో నాలుగు నుంచి ఆరు వారాల సమయంలో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ దానంతట అది కరిగిపోతుంది. ఒకవేళ రెండో వారంలో ఏ మార్పులూ కనిపించకపోతే లాపరోస్కాపిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయిన తరువాత కనీసం మూడు వారాల వరకు ఆగి, మళ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ∙ -
కంటిచూపు మెరుగుపడాలంటే...సూపర్ ఫుడ్స్ ఇవే!
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేది అందరికి తెలుసు. పిల్లల ఉంచి పెద్దలదాకా కంటి వ్యాధులు ,దృష్టి లోపాలు చాలా సాధారణగా మారిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2.2 బిలియన్లకు పైగా ప్రజలు ఏదో ఒక రకమైన దృష్టి లోపం లేదా అంధత్వంతో బాధపడుతున్నారు. అయితే చాలా వరకు కంటి సమస్యల్ని చక్కటి ఆహారం, ముందస్తు ఆరోగ్య పరీక్షలతో నివారించు కోవచ్చు. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాల్సి ఉంటుంది అలాంటి సూపర్ ఫుడ్స్, జాగ్రత్తలేమిటో చూద్దాం!చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా చాలామంది కంటిచూపు సమస్యలతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే కళ్ల జోడు సాయం లేనిదే కాలం గడవని పరిస్థితి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి ఆహారం తీసుకోవాలి. క్యారెట్లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో తగినంత విటమిన్ ఏ కూడా ఉంటుంది.బచ్చలికూరలో లుటిన్,జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన యూవీ కిరణాలు, ఫ్రీ రాడికల్స్ నుండి కళ్ళను కాపాడతాయి. సాల్మన్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్ళు పొడిబారకుండా కాపాడతాయి.బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. వాపును తగ్గించి, ఆరోగ్యకరమైన,చక్కటి దృష్టిని అందించేలా తోడ్పడతాయి.స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, ఇది రాత్రి దృష్టిని పెంచడంలో సహాయపడుతుంది. కళ్లు పొడిరకుండా కాపాడుతంది. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది వయస్సు సంబంధిత సమస్యలనుంచిరక్షిస్తుంది. గుడ్డు సొనలో లుటిన్ ,జియాక్సంతిన్ బాగా లభిస్తుంది. ఇది కాంతి నష్టంతో పోరాడేలా కళ్ళ సామర్థ్యాన్ని పెంచుతుంది. నారింజలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటిశుక్లబాధలనుంచి కాపాడుతుంది. జాగ్రత్తలుకళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పౌష్టిక ఆహారాలను తీసుకోవాలి.విటమిన్ సీ లభించే పండ్లు, కూరగాయలు,ఆకు కూరలు ఎక్కువగా తినటం కూడా కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఎక్కువసేపు లాప్టాప్ ముందు, మొబైల్ ఫోన్లను చూస్తూ ఉండేవారి కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది గమనించాలి. అలాగే చలికాలంలో చలిగాలులకు కళ్లకు నష్టం ఏర్పడే అవకాశం ఉంది. చలిగాలలు, దుమ్ము ధూళినుంచి కళ్లను కాపాడుకోవాలి. -
ఎలాన్ మస్క్ తల్లి మాయే హెల్త్ టిప్స్: 14 మంది పిల్లలకు నానమ్మగా..!
ఎలన్ మస్క్ పేరు చెప్పగానే అందరికి టెక్నాలజీని శాసిస్తున్న వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎంత అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా.. ఓ కొడుకుగా తల్లి మాట వినాల్సిందే. ఇక్కడ మస్క్ కూడా తన తల్లి మాయే ఆహార నియమాలకు కట్టుబడి ఉంటాడట. అంతేకాదు ఆమె తన 14 మంది మనవళ్లు, మనవరాళ్లు కోసం కూడా కొన్ని ఆహార నియమాలను కూడా రూపొందించిందట. అవి వాళ్లంతా తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనట. ఇక మస్క్ తల్లి మాయే ఏడు పదుల వయసులో కూడా ఎంతో ఫిట్గా ఆరోగ్యంగా ఉంటారు. మాయే మాజీ మోడల్, డైటీషయన్ కూడా. ఆమె ఆహారం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా నోటిలో పెట్టుకునే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు యువతరం చక్కటి ఆరోగ్య కోసం ఎలాంటి పోషకాహార నియామాలు పాటించాలో కూడా వివరించారు. అవేంటో చూద్దామా..!.76 ఏళ్ల మాయే మస్క్ ఈ వయసులో కూడా ఎంతో అందంగా, చురుకుగా ఉంటారు. ఆమె గత 40 ఏళ్లుగా డైటీషియన్కి సంబంధించి ఓ ప్రైవేట్ సంస్థను కూడా నడుపుతోంది. ఆమె తరుచుగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతుంటారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్యూలో తన హెల్త్ సీక్రెట్ని వివరిస్తూ.. ఈనాటి యువతరం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా డైట్ని మార్చి ఆరోగ్యకరమైన వాటిని తీసుకునేలా ప్రయత్నించాలని అంటారు మాయే. అప్పుడు బ్లడ్లో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలో మెరుగైన మార్పులు కనిపించడమే గాక చికిత్స ఖర్చులు కూడా ఆదా అవుతాయని అంటారామె. అలాగే తాను 14 మంది పిల్లలకు నానమ్మగా ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వనని అన్నారు. ముఖ్యంగా చిప్స్, కుక్కీలకు తన ఇంట్లో స్థానం ఉండదంటారు. చక్కెర, సోడియంతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రమాదకరమైన దుష్ప్రభావాలను కలుగజేస్తాయని నొక్కిచెప్పారు. తన మనవళ్లు, మనవరాళ్లను అవి తినే విషయంలో తాను చాలా స్ట్రిక్గా ఉంటానన్నారు. జంక్ఫుడ్కి ఎడిక్ట్ అయ్యేలా చేసేవే అవేనని అంటారు మాయే. చిన్నారులు ఒక్కసారి తినే ప్రయత్నం చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకోలేరు అందువల్లే ముందే వాళ్ల దరిదాపుల్లోకి వాటిని రానీయకూడదంటారామె. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇవ్వమని సూచిస్తున్నారు మాయే. అవేంటంటే..పండ్లుకూరగాయలుపెరుగుపాలుతృణధాన్యాలు గోధుమ రొట్టె తదితరాలు..ఇక అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం..చిప్స్, కుక్కీలు విపరీతమైన ఉప్పు, చక్కెరతో ఉంటాయి. వీటిని తినడం వల్ల దంత క్షయం, చెడు కొలెస్ట్రాల్, టైప్2 డయాబెటిస్, కేన్సర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి, ఒబెసిటీ తదితర అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. వీటిని సరదాగా ఒక్కసారి చిన్నారులకు అలవాటు చేస్తే వాటి రుచికి ఆటోమెటిక్ మళ్లీ తినాలను కోరిక వారిలో బలంగా పెరుగుతుందని అన్నారు. ఒకరకంగా వారి మెదడు కూడా తెలియకుండా వాటికి బానిసయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఆదిలోనే వాటిని దరిచేరనీయకుండా చూస్తే ఆరోగ్యవంతంగా పెరుగుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: -
రికవరీ లేట్ అవుతుందా?
నాకు మూడవ నెల. నోట్లో అల్సర్స్ ఉన్నాయి. మెడ భాగంలో కూడా గడ్డలు వచ్చిపోతున్నాయి. నా భర్తకు కూడా ఇలానే వస్తున్నాయి. మందులు వాడాక తగ్గాయి. ఇప్పుడు బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా?నళినీ రాణి, మాధవరంమీరు చెప్పిన దానిని బట్టి ఇది రిపీటెడ్ ఇన్ఫెక్షన్లా ఉంది. నోట్లో, వెజైనా ఏరియాలో అల్సర్స్ రావడం, మీ ఆయనకు కూడా రావడం చాలా వరకు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్లో ఉంటుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది. చికిత్స తీసుకోకుంటే బిడ్డ మీద తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. ఏ లక్షణాలూ లేకుండా, కొంతమందికి మూడు నెలల తర్వాతే ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది. అందుకే ఇలా అల్సర్స్ రావడంతోనే వీడీఆర్ఎల్ టెస్ట్ చెయ్యాలి. రొటీన్ టెస్టుల్లో భాగంగానే గర్భవతికి కూడా ఈ టెస్ట్ చేస్తున్నారు. కండోమ్స్ వాడటంతో ఈ ఇన్ఫెక్షన్ని దూరం చెయ్యవచ్చు. మీరు వెంటనే దగ్గరలోని గైనకాలజిస్ట్ని కలవండి. కొన్ని రక్తపరీక్షలు, కొన్నిసార్లు ఈ అల్సర్స్ నుంచి స్వాబ్ టెస్ట్, వెజైనా స్వాబ్ టెస్ట్ చేస్తారు. గర్భిణులకు ఈ పరీక్షలు 3, 7, 9 నెలల్లో చేసి, చికిత్స ఇచ్చిన తరువాత నయమైందా లేదా అని చెక్ చెయ్యాలి. పెన్సిలిన్ ఇంజక్షన్తో ఈ ఇన్ఫెక్షన్ బాగా నయమవుతుంది. వీడీఆర్ఎల్ టెస్ట్ పాజిటివ్ ఉన్నవారిలో టీపీపీఏ, టీపీహెచ్ఏ చెయ్యాలి. ఒకవేళ ఆ టెస్ట్లో ఏమీ తెలియకపోతే చికిత్స చేసి, రెండు మూడు వారాల తరువాత పరీక్షల కోసం మళ్లీ శాంపిల్స్ పంపించాలి. సిఫిలిస్ ఇన్ఫెక్షన్ తొలిదశలో వస్తే ఫీటల్ మెడిసిన్ నిపుణులతో గర్భస్థ శిశువుకు స్కానింగ్ చేయించాలి. 5,7వ నెలలో చేసే ఈ స్కానింగ్లో ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చెక్ చేస్తారు. అల్సర్స్ వెజైనల్ ఏరియాలో మానకుండా ఉంటే 9వ నెలలో మళ్లీ టెస్ట్ చేసి, సిజేరియన్కు రికమండ్ చేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చు. బ్రెస్ట్ మీద మానని పుండ్లు లేకపోతే డైరెక్ట్ ఫీడింగ్కి అనుమతి ఇస్తారు. పిల్లల డాక్టర్కి కూడా ముందుగానే ఈ టెస్ట్ రిజల్ట్ చెప్పాలి. శిశువుకు కూడా 3వ నెలలో, ఏడాదిన్నర వయసులో పరీక్షలు చేస్తారు.నాకు డేకేర్లో హిస్టరోస్కోపీ అనే ప్రొసీజర్ ప్లాన్ చేశారు. గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. డైరెక్ట్గా కాకుండా ఇలాంటి ప్రొసీజర్తో రికవరీ లేట్ అవుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– గాయత్రి, వరంగల్హిస్టరోస్కోపీ ప్రొసీజర్లో చిన్న కెమెరా ద్వారా గర్భసంచిని, లోపలి పొరను స్పష్టంగా చూసి, ఉన్న సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. డైరెక్ట్గా డీ అండ్ సీ లాంటి వాటిలో సమస్య మూలం మిస్ అయ్యే చాన్స్ ఎక్కువ. పైగా బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. హిస్టరోస్కోపీలో చాలా చిన్న పల్చటి పరికరంతో ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. త్వరగా కోలుకోవడం కూడా జరుగుతుంది. హిస్టరోస్కోపీ పూర్తయ్యాక అదే రోజు డిశ్చార్జ్ చేస్తారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కొన్ని రోజులు స్పాటింగ్లాగ ఉండవచ్చు. కొంతమందికి వెజైనా పెయిన్ ఉండవచ్చు. రెండురోజులు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ప్రొసీజర్ తరువాత రొటీన్ పనులను రెండు రోజుల్లో మొదలుపెట్టుకోవచ్చు. ప్రతిరోజూ షవర్బాత్ చెయ్యాలి. బయట స్విమ్మింగ్ పూల్స్ రెండు వారాల వరకు వాడకూడదు. ఒకవేళ మీకు ఈ ప్రక్రియలో ‘పాలిపెక్టమీ’ చేసినట్లయితే, రెండు వారాల తరువాత రిపోర్ట్స్తో డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత ట్రీట్మెంట్, కేర్ అప్పుడు చెబుతారు. ఈ ప్రొసీజర్ తరువాత మీకు వెజైనల్ డిశ్చార్జ్, దుర్వాసన, జ్వరం, వెజైనల్ పెయిన్, హెవీ బ్లీడింగ్ ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ను కలవండి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
గౌట్ సమస్యతో బాధపడుతున్నారా? ఇవిగో ఆహార నియమాలు!
కీళ్ల మధ్య యూరిక్ యాసిడ్ రాయిగా ఏర్పడి... అందులోనూ ముఖ్యంగా బొటనవేలి ఎముకల మధ్యగానీ, మోకాలి దగ్గర గానీ రాపిడి కలిగిస్తూ ఎంతో నొప్పిని, ఇబ్బందినీ కలిగించే వ్యాధి గౌట్. గౌట్ను నివారించేవి లేదా వచ్చాక అనుసరించాల్సిన ఆహార నియమాలివి... మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి. మద్యం, మాంసాహారంలో ఉండే ప్యూరిన్స్ అనే వ్యర్థ పదార్థాల వల్ల గౌట్ వస్తుంది కాబట్టి మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. స్వీట్స్, సాఫ్ట్డ్రింక్స్, ఆలూ ( పొటాటోస్), ఐస్క్రీమ్స్లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి అవి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పండ్లు కూరగాయలు యూరిక్ యాసిడ్ను తగ్గిస్తాయి. చెర్రీ పండ్లు కూడా యూరిక్ యాసిడ్ మోతాదులను నియంత్రించేందుకు బాగా ఉపయోగపడతాయి. పొట్టు తీయని బియ్యం (బ్రౌన్ రైస్), ఓట్స్ గౌట్ నివారణకు బాగా పనిచేస్తాయి. ఆకుపచ్చరంగులో ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ను కలిగి ఉండే వెజిటబుల్స్ (ముఖ్యంగా బ్రాకలీ వంటివి) తీసుకోవడం వల్ల అవి గౌట్ను సమర్థంగా నివారించగలవు. కొంతమంది పిల్లల్లో అరచేతులు, అరికాళ్లలో దురదలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వచ్చి తగ్గి΄ోవడం అన్నది చాలా మామూలు విషయమే. అయితే అలా కాకుండా మరికొంతమంది పిల్లల్లోనైతే అరచేతులు లేదా అరికాళ్లలో విపరీతంగా దురద రావడంతో పాటు అక్కడి చర్మం పొరలుగా ఊడి΄ోతుంటుంది. ఇది అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. ఇలా జరగడానికి చాలా అంశాలు కారణమవుతుంటాయి. -
అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్!
నా వయస్సు 33 సం‘‘లు. నాన్వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక ఏడాది నుంచి పూర్తిగా మానేశాను. మాంసాహారం అంటే జంతువధ అని, వాటిని చంపడం, రక్తపాతం లాంటి దృశ్యాలు నా మనసులోకి పదే పదే రావడం వాటిని తప్పించడానికి నేను తరచు చేతులు కడగడం ఇల్లంతా శుభ్రం చేయడం, భర్తను పిల్లలను అనవసరంగా కోపగించుకోవడం వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు. దయచేసి మీరేదైనా మార్గం చెప్పండి! – ఎ. పార్వతి,హైదరాబాద్జంతువధ గురించి ఆలోచించి, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదే. అయితే మీ ఇంట్లో మాంసాహారం వండినప్పుడు, జంతువధ, రక్తపాతం లాంటి దృశ్యాలు మీ మదిలో మెదిలి, వీటి నుండి బయట పడేందుకు, చేతులు అతిగా కడగడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇదంతా పాపంగా భావిస్తూ, ప్రార్థనలు చేస్తూ, మనోవేదనకు గురి కావడం... ఇవన్నీ ‘ఓసీడీ’ అనే ఒక మానసిక వ్యాధి లక్షణాలు. మెదడులోని కొన్ని రసాయనిక పదార్థాల సమతుల్యం లో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి మానసిక రుగ్మత వస్తుంది. ఇదేదో మీ బలహీనత గానీ, తప్పు గానీ కానే కాదు. అలా అని మీరు బాధపడవద్దు.శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయని గుర్తించండి. ఈ ఒ.సి.డి జబ్బును పూర్తిగా నయం చేసేందుకు మంచి ఔషధాలున్నాయి. వాటితోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్, ‘ఆర్.టి.ఎమ్.ఎస్’అనే ప్రత్యేక అధునాతన పరికరాలతో చికిత్స చేసి, మీ బాధ నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తులను చేయవచ్చు. మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్ను వెంటనే కలవండి. ఆల్ ది బెస్ట్.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
హీరోయిన్ శ్రుతి హాసన్ మెంటల్ హెల్త్ టిప్స్
-
మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!
టాలీవుడ్ నటి, గాయని శృతి హాసన్ విలక్షణ నటుడు కమల హాసన్ కూమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఒకానొక సందర్భంలో శృతి తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవాలంటే మొదటగా ఏం చేయాలో తెలుసా అంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అవేంటంటే..అందరూ మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకే జంకుతారు. ఇది ముందు పక్కన పెట్టాయాలంటోంది శృతి. ఈ పరిస్థితిని అందరూ ఏదోఒక సందర్భంలో ఎదుర్కొనే సాధారణ పరిస్థితిగా పరిగణించాలి. అప్పుడే దీనిగురించి బహిరంగంగా మాట్లాడి స్వాంతన పొందే ప్రయత్నం చేయగలుగుతాం, బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతామని చెబుతోంది. నిజానికి మానసికంగా బాధపడుతున్నాను అంటూ.. వెంటనే థెరపిస్టు లేదా కౌన్సలర్ లేదా సైక్రియాట్రిస్ట్ వద్దకు వెళ్లిపోతారు. కానీ అవేమి అవసరం లేదంటోంది శృతి. మన చుట్టు ఉన్నవాళ్లతో లేదా మనకిష్టమైన వ్యక్తులను ఆత్మీయంగా పలకరించడం, వారితో కాసేపు గడపడం వంటివి చేస్తే చాలు మానసిక స్థితి కుదుటపడుతుందని నమ్మకంగా చెబుతోంది. అందుకు ఉదాహారణగా.. మనం ఏదైన జ్వరం రాగానే ఏం చేస్తాం చెప్పండి అంటోంది. మొదటగా.. ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుని చూస్తారు. తగ్గలేదు అనగానే వైద్యుడిని సంప్రదించే యత్నం చేస్తారు. అలానే దీని విషయంలో కూడా మనంతట మనంగా ఈ మానసిక సమస్యను నయం చేసుకునే యత్నం చేయాలి. అవన్నీ ఫలించని పక్షంలో థెరఫిస్టులను ఆశ్రయించడం మంచిదని చెబుతోంది. అలాగే కొందరూ మెంటల్ స్ట్రెస్ తగ్గేందుకు సినిమాలకు వెళ్లతారు. ఓ మంచి ఫీల్తో హ్యాపీగా ఉండేలా చేసుకుంటారు. ఇది కూడా మంచి పద్ధతే అయినా ఒక్కోసారి ఇది కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదని అంటోంది శృతి. చేయాల్సినవి..మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపించగానే దాన్ని పెనుభూతంలా, పెద్ద సమస్యలా చూడొద్దుఆ వ్యాధి మిమ్మల్ని తక్కువగా చేసి చూపించేది కాదు.నలుగురితో కలుపుగోలుగా మెలిగే ప్రయత్నం లేదా మాట్లాడటం వంటివి చేయండి. అలాగే మీ వ్యక్తిగత లేదా ప్రియమైన వ్యక్తులతో సమస్యను వివరించి బయటపడేలా మద్దతు తీసుకోండి. దీంతోపాటు మానసిక ఆరోగ్య నిపుణలను సంప్రదించి..ఏం చేస్తే బెటర్ అనేది కూలంకషంగా తెలుసుకుని బయటపడే ప్రయంత్నం చేయండి.నిజానికి మానసికి ఆరోగ్య మొత్తం ఆరోగ్య శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. ఇది బాగుంటేనే ఏ పనైనా సునాయాసంగా చేయగలం. అందరిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోగలుగుతాం అని చెబుతోంది శృతి.(చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!) -
తమలపాకుతో బోలెడన్ని లాభాలు, కానీ ఇవి తెలుసుకోవాల్సిందే!
తమలపాకులు అనగానే ఆధ్మాత్మిక భావన కలుగుతుంది. తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది.భారతదేశ సంస్కృతిలో తమలపాకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో తమలపాకుల వాడకం క్రీ.పూ 400 నాటిది. పురాతన కాలంనుంచి ఆయుర్వేద ఔషధాల్లో తమలపాకుల పాత్ర ఉంది.తమలపాకు పైపెరేసి కుటుంబానికి చెందినది. తమలపాకులో తమిళంలో వెతలై, తెలుగులో తమలపాకు, హిందీలో పాన్ కా పఠా అని పిలుస్తారు. తమలపాకును విందు భోజనాల తరువాత తాంబూలంలో వాడతారు అనుకుంటే పొరబాటే. తమలపాకును మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులో కార్డియోవాస్కులర్ , యాంటీ-డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ/ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీ- అల్సర్, హెపాటో-ప్రొటెక్టివ్ , యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి వివిధ లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు దీన్ని కామోద్దీపనకు పనికివస్తుందని కూడా భావిస్తారు.తమలపాకులోని పోషక విలువలుశుభకార్యం వచ్చిందంటే.. తప్పకుండా తమలపాకులు ఉండాల్సిందే. తమలపాకులను దేవుడికి సమర్పించడం మంచిదని, ఇతరులకు అందించినా శుభం జరుగుతుందని మన భారతీయులు భావిస్తారు. తమలపాకులో తగిన మొత్తంలో అవసరమైన పోషకాలు ఉంటాయి , 100 గ్రాముల తమలపాకులో ఈ పోషకాలు ఉంటాయి.అయోడిన్ 1.3 గ్రాములు, పొటాషియం 1.1-4.6 మైక్రోగ్రాములువిటమిన్ ఎ 1.9-2.9 మైక్రోగ్రాములు, విటమిన్ బి 1 13-0 మైక్రోగ్రాములువిటమిన్ B2 1.9-30 మైక్రోగ్రాములు, నికోటినిక్ యాసిడ్ 0.63-0.89 మైక్రోగ్రాములు తమలపాకు ప్రయోజనాలుతమలపాకును నమలడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. తమలపాకులను నేరుగా నమిలి తినవచ్చు. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్ల పవర్హౌస్గా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే పేగు ఆరోగ్యానికి మంచిది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తమలపాకులో కార్మినేటివ్, యాంటీ ఫ్లాట్యులెన్స్ వంటి లక్షణాలు ఉన్నాయి.ఇవి జీర్ణశయాంతర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తాయి.శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు , ఛాతీలో ఇబ్బంది, ఉబ్బసం లక్షణాలను ఉపశమనానికి , నయం చేయడానికి ఉపయోగిస్తారు . తమలపాకుకు ఆవాల నూనె రాసి ఛాతీపై ఉంచి కొద్దిసేపు అలాగే ఉంచితే చాతీలో ఇబ్బంది తగ్గుతుంది. తమలపాకు పేస్ట్ను చూర్ణం రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం కలిగుతుంది.జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి నిప్పుల మీద తమలపాకును వేడిచేసి, దాన్ని పసిపిల్లలకు గుండెలమీద కాస్తారు. రెండుచుక్కల తమలపాకు రసాన్ని తేనెలో రంగరించి పిల్లలకు నెమ్మదిగా పడితే (వేలితే నాకించాలి) దగ్గు తగ్గుతుందని పెద్దలు చెబుతారు. ఆర్థరైటిస్ వల్ల కీళ్ల భాగంలో వచ్చే వాపుపై తమలపాకుని కాసేపు ఉంచితే ఉపశమనం లభిస్తుంది. కాల్షియం లోపం ఉన్నవాళ్లు తమలపాకుల్లో సున్నం కలిపి తింటే మేలు. విటమిన్ సీ అధికంగా కలిగి ఉండే తమలపాకులు తింటే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.ఎక్కవగా తినకూడదా?రోజుకు 5 నుంచి 10 తమలపాకులను దీర్ఘకాలం తీసుకుంటే, డ్రగ్స్ లాగా బానిసలవుతారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు వ్యక్తులు తాంబూలం సేవించేపటుడు జాగ్రత్తగా ఉండాలి. తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్’ లాంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తమలపాకులు ఎప్పుడూ కూడా లేతగా తాజాగా ఉన్న వాటిని మాత్రమే తినాలి. కొంతమందికి తాంబూలంలో వాడే వక్కతో, సున్నంతో గొంతు పట్టేయడం లాంటి ఇబ్బంది వస్తుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తాంబూల సేవనం మితిమీరితే నోటి, దంత, సమస్యలు వస్తాయి.తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాధికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు, చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకోవడం ఆరోగ్యప్రదం. అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్ధిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి తొడిమలు, చివరలు తుంచివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక. అంతేకాదు తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవాలి. అయితే ఈ అభ్యంతరాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.ఏదైనా మితంగా ఉండటమే మంచిది. -
Health Tips: హెల్త్ టిప్స్
👉ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. ఎక్కువ సేపు నమలడం ద్వారా ముఖంలోని కండరాలు శ్రమిస్తాయి. చర్మపు మెటబాలిజమ్ మెరుగవుతుంది. కాబట్టి ముడతలు పడవు.👉బెల్లంలో మిరియాల పోడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది.👉ఒక గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక వెల్లుల్లి రెబ్బ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానే తాగండి. దీనిని సేవించడం వల్ల దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.👉బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది. 👉బొప్పాయి కాయను కానీ, ఆకుని కానీ మెత్తగా కాటుకలా నూరి ఆ ముద్దని అరికాళ్ళ ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.👉మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి. -
కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!
శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ పొట్ట పెద్దగా ముందుకు వచ్చి కనిపిస్తుంటే అది కాస్తంత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోవాలి. ఇదెంత ప్రమాదకరం, పొట్టను ఏ మేరకు తగ్గించుకోవాలి అనే విషయాలు ఓ టేప్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇలా కొలిచే సమయంలో పొట్టను బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలి. ఆ కొలతకూ, పిరుదుల కొలతకు నిష్పత్తిని లెక్కగట్టాలి. అంటే నడుము కొలతని హిప్ కొలతతో భాగించాలి. అదెప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. పురుషులకు ఇది 0.9 కంటే తక్కువగా రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోవాలి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండెసమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్ట చుట్టుకొలతను (పొట్టని) తగ్గించుకోవడమన్నది గుండెకూ, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇదీ చదవండి: పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా -
విటమిన్ బీ12 లోపమా? ఈ ఆహారం తీసుకోండి!
ఆరోగ్యకరమైన జీవనం కోసం పోషకాలు,విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా అసవరం. వీటిల్లో ఏది లోపించినా ఏదో శారీరక ఇబ్బందులు తప్పవు. అలాంటి వాటిల్లో విటమిన్ బీ 12. ఇది ఎర్రరక్త కణాల వృద్దికి, నాడీ వ్యవస్థకు చాలా తోడ్పాటునిస్తుంది. ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుందని అనేది గమనించాలి. మరి బీ 12 లోపంతో వచ్చే అనర్థాలు, లభించే ఆహారం గురించి తెలుసుకుందాం.వయసులో ఉన్నవారితో పోలిస్తే సాధారణంగా వయస్సుపైబడినవారు, స్త్రీలు, శాకాహారుల్లో విటమిన్ బీ 12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. భారతీయుల్లో సుమారు 47 శాతం మందిలో విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నట్టు అంచనా. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది.విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వలు తగ్గినప్పుడు బీ 12 లోపంకనిపిస్తుంది. లక్షణాలు రక్తహీనత, నీరసం అలసట, నిరాశ, నిస్సహాయత, గుండె దడ, నరాల సమస్యలు , ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా చర్మం పాలిపోయినట్లు ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగడం, తలనొప్పి, ఇన్ఫెక్షన్లు, నోరు పొడిబారడం, అతిసారం, మలబద్దకం, ఆకలి లేకపోవడం,జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత తగ్గడం, డిప్రెషన్, చిరాకు ఇవన్నీ బీ 12 లోపం వల్ల కావచ్చు. బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది.విటమిన్ బీ12 లేకపోవడం వల్ల వచ్చే అరుదైన పరిస్థితి ఆప్టిక్ న్యూరోపతి సంభవిస్తుంది. కంటి నుండి మెదడుకు దృశ్యమాన సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నరం దెబ్బతింటుంది. ఇది క్రమంగా చూపు కోల్పోయేలా చేస్తుంది. చర్మంపై హైపపర్ పిగ్మంటేషన్ (డార్క్ స్పాట్స్) కనిపిస్తాయి. బీ 12 ఎక్కువైనా, బొల్లి ,నోటి పూతల, తామర, మొటిమలు లాంటి లక్షణాలు కనిస్తాయి. (ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్ గుండెపోటుతో కన్నుమూత)బీ12 లభించే ఆహారంచేపలు, రొయ్యలు, మాంసం, శనగలు, బాదం పప్పు, పుట్ట గొడుగులు, జీడిపప్పు, అల్లం, ఉల్లిపాయ, ప్రాన్స్ , మాంసం, గుడ్లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. శాకాహారులు తృణధాన్యాలు పోషక ఈస్ట్ వంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా చీజ్, పాల ఉత్పత్తులు,సోయా ,బియ్యంలో కూడా ఇది లభిస్తుంది. వైద్యుల సలహా మేరకు ‘విటమిన్ బీ12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు.ఇదీ చదవండి : ఓనం అంటే సంబరం సరదా, సాధ్య! -
కీళ్ల నొప్పులకు కారణాలనేకం, కానీ అశ్రద్ధ పనికి రాదు!
40-50 ఏళ్ల వయసు దాటిన తరువాత స్త్రీ పురుషుల్లో కనిపించే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు. వయసుతోపాటు వచ్చేదేలే అని నిర్లక్ష్యం పనికి రాదు. తగిన వ్యాయామం, ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరోవైపు కొన్నిప్రత్యేక కారణాల రీత్యా యువతలో కూడా కీళ్ళ సమస్య కనిపించవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ కీళ్ల నొప్పులకు, కారణాలు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. కీళ్ల నొప్పులకు కారణాలుఆర్థరైటిస్ (ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్)గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు (సెప్టిక్ ఆర్థరైటిస్) గంటల తరబడి ఒకే చోట కూర్చుండి పోవడం, వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ (లూపస్, ఫైబ్రోమైయాల్జియా)కూర్చోవడం, లేదా నిలబడే తీరు సరిగ్గా లేకోవడం, లేదా బయోమెకానిక్స్వయస్సు-సంబంధిత దుస్తులు మరియు కన్నీటిమధుమేహం, థైరాయిడ్ లాంటి వ్యాధులుఅలాగే ఊబకాయం, సరైన జీవనశైలి, పేలవమైన భంగిమ, క్రీడలలో ఎక్కువగా పాల్గొనడం, కీళ్ల గాయాలు, జన్యుపరమైన కారణాలు, పుట్టుకతో వచ్చే పరిస్థితుల కారణంగా చిన్న వయసులో కూడా కీళ్ల నొప్పులు రావచ్చు. ఒక్కోసారి కేన్సర్లాంటి జబ్బులున్నపుడు కూడా కీళ్ల నొప్పులొస్తాయి.వైద్యుడిని ఎప్పుడు సందర్శించాలి?కీళ్ల నొప్పులకారణాన్ని గుర్తించి, తేలికపాటి వ్యాయామం, ఆహారంలో మార్పులతో చాలావరకు ఉపశమనం పొందవచ్చు. కానీ నొప్పి తీవ్రంగా ఉన్నపుడు, వాచినపుడు, నడవడంకష్టంగా మారినపుడు, అలాగే కీళ్ల నొప్పులతో మాటు జ్వరం వస్తే మాత్రం కచ్చితంగా వైద్యుణ్ని సంప్రదించాలి. ఎక్స్రే లాంటి కొన్ని పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధారణ తగిన చికిత్స పొందవచ్చు.కీళ్ల నొప్పులకు ఉపశమనమిచ్చే ఆహారంఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు / చేప నూనెలునట్స్ అండ్ విడ్స్బ్రాసికా కూరగాయలు, కాయధాన్యాలు, బీన్స్పండ్లు, ఆలివ్ నూనె, వెల్లుల్లి , దంప కూరగాయలు, తృణధాన్యాలుకీళ్ల నొప్పులకు ఏ ఆహారాలు చెడ్డవి?ఉప్పు, చక్కెరపదార్థాలు,ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్మీట్,మద్యంగ్లూటెన్ ఆహారాలుఅధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొన్నిరకాల నూనెలు ఇదీ చదవండి: నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!సమంత రోజు ఎలా గడుస్తుందంటే...??? -
అద్దె ఇల్లు.. ఆరుబయటనే శవం
ఇబ్రహీంపట్నం: మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజల మెదళ్లను శాసిస్తూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటూ ఉన్న ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రసాద్నగర్లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విషజ్వరంతో.. కూలి చేసుకునే పాలపర్తి రాజేష్, రూతు దంపతులకు ఇద్దరు కుమారులు. జెడ్పీ పాఠశాలలో పెద్ద కుమారుడు ఏడో తరగతి, చిన్న కుమారుడు జాన్ వెస్లీ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రసాద్నగర్ వరద ముంపునకు గురికావడంతో పారిశుద్ధ్యలేమి, కలుషిత తాగునీరు, అందుబాటులో లేని వైద్య సదుపాయం వల్ల కొద్ది రోజుల క్రితం బాలుడు జాన్వెస్లీ జ్వరం బారిన పడ్డాడు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో వైద్యం చేయించారు. మరలా కడుపులో నొప్పి రావడంతో రెండురోజుల క్రితం మరో ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. వారు మెడికల్ టెస్ట్లు రాయగా.. తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చేయించలేదు. దీంతో కడుపులో నొప్పి భరించలేక బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లిదంద్రులు చెబుతున్నారు. మంటగలసిన మానవత్వం.. వారు ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో ఆ యజమాని బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. దీంతో 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనే టెంట్వేసి బంధువుల కడసారి చూపుకోసం ఉంచారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ బాలుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? జాగ్రత్తలు!
వర్షాకాలం వచ్చిదంటే చాలా మందికి కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కండరాలు పట్టేసినట్టు అనిపిస్తాయి. వర్షాకాలంలోని తేమకు కీళ్లనొప్పులకు సంబంధం ఉంటుంది. వానాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.వానల రోజులు కొంతమంది ఆహ్లాదాన్ని పంచితే మరికొంతమందికి, ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఆందోళన మోసుకొస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వారికి నొప్పులతో రోజువారీ పనులను కొనసాగించడం, ఒక్కోసారి కాలు కదపడం కూడా కష్టం అనిపిస్తుంది. మారుతున్న వాతావరణానికి, కీళ్ల నొప్పులకు సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. చల్లని వాతావరణం, తేమ స్థాయిలలో మార్పులు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా కీళ్ల నొప్పులు, కండరాలు దృఢత్వంలో తేడాలు, తిమ్మిర్లు గాయం నొప్పి కనిపిస్తాయి. గాలిలోని అధిక తేమ స్థాయిలు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. రక్తపోటును పెంచుతాయి.ఎముకలకు కీలకమైన డీ విటమిన్ కూడా ఈ సీజన్లో సరిగ్గా అందదు. వర్షాకాలంలో నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అలాగే ఈ కాలంలో కీళ్ల చుట్టూ ఉండే ప్లూయడ్ పలచబడుతుంది. దీనివల్ల కూడా నొప్పి వస్తుంది. ఈ కారణాల రీత్యా కీళ్ల నొప్పులు పెరుగు తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలువిటమిన్ డీ, బీ 12 లభించే ఆహారాలు తీసుకోవాలి. అవసరమైతే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి.విటమిన్ ఇ నొప్పి , వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.గింజలు, అవకాడో, బెర్రీలు, ఆకు కూరలు, గింజలు, చేపలు ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. అవిసె గింజలు,నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, పనీర్, గుడ్లు తీసుకోవాలి. మోకాళ్లు, ఇతర కీళ్ళపై సురక్షితమైన ఆయిల్తో సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు. వేడి నీటి, హీట్బ్యాగ్తో కాపడం పెట్టుకోవచ్చు.కండరాలకు వ్యాయామం ఒక వరం. మార్నింగ్ వాక్, లెగ్, కండరాలను సాగదీసేలా వ్యాయామాలు, యోగా, సైక్లింగ్ చేయడం వంటివి చేయడం మర్చిపోకూడదు. అలాగని మరీ ఎక్కువ చేయకూడదు. ఎలాంటి వ్యాయామాలు చేయాలనే దానికోసం వైద్య నిపుణుడు, ఫిజియో థెరపిస్ట్ను సంప్రదించడం మంచిది -
బరువు తగ్గాలనుకుంటున్నారా? వాముతో ఇలా ట్రై చేయండి!
మారుతున్న ఆధునిక జీవన శైలి, ఆహార అలవాట్లు చాలామందిలో ఊబకాయానికి దారితీస్తున్నాయి. క్రమం తప్పని వ్యాయామం, కొన్ని ఆహార నియమాలతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ను లెక్కించుకుని మన వయసు, ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. అయితే ఊబకాయంతో బాధపడేవారికి వెయిట్ లాస్ జర్నీ అంత సులువు కాదు. అయితే మన ఇంట్లో సులువుగా లభించే వస్తువులతో ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువును తగ్గించుకునే చిట్కా గురించి తెలుసుకుందాం.వాముతోలాభం:ప్రాచీన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదంలో వాముకు అధిక ప్రాధాన్యత ఉంది. వామును సంస్కృతంలో ఉగ్రగంధ అంటారు. ప్రధానంగా వాము (అజ్వైన్)ను జీర్ణ సమస్యలకు ఎక్కువగా వాడతారు. వామును తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిక్ అనే పదార్థం విడుదలవుతుందని.. దీని వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుందంటారు నిపుణులు.అలాగే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వాము తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారట. దీన్ని వేడి నీటిలో కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును కరుగుతంది. అలాగే ఒక టీస్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఒక టీస్పూన్ తేనె వేసి ఖాళీ కడుపుతో తాగినా ఫలితం ఉంటుంది. అర గ్లాసు వాము నీటిని తాగితే రుతుక్రమంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.వాము తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సమస్యను కూడా అధిగమించవచ్చు.వాంతులు, వికారం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.వాము, కరివేపాకులు, ఎండు ద్రాక్ష, చక్కెరను ఓ కప్పు నీటిలో మరిగించి తాగే తెల్లజుట్టులో మార్పు కనిపిస్తుంది. అంతేనా జంతికలు, చక్రాలు చేసుకునేటపుడు ఆ పిండిలో కాసింత వాము జోడిస్తే, రుచి, వాసనతో పాటు అరుగుదలకు కూడా మంచిది. నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే అని గమనించండి. ఏదైనా అనారోగ్య సమస్ యవస్తే వైద్యులను సంప్రదించడం మేలు. -
పిల్లలు మట్టి, సుద్ద తింటున్నారా? కారణాలేంటో తెలుసా? చిన్ని చిట్కాలు
పుట్టబోయే బిడ్డ కడుపున పడింది మొదలు తల్లిదండ్రులకు బిడ్డలపై ఆపేక్ష మొదలవుతుంది. ఇక బోసి నవ్వులు నవ్వుతూ, పారాడుతూ, బుల్లి బుల్లిఅడుగులూ వేస్తూ, ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతోంటే ఆ మురిపమే వేరు. ఏ చిన్ని అనారోగ్యం వచ్చినా ఆందోళనే. పసిబిడ్డలను ఎదుగుతున్న క్రమంలో కంటికి రెప్పలా చూసుకోవాలి. వయసు తగ్గట్టుగా ఎదుగుతున్నారా లేదా అని తనిఖీ చేసుకోవడంతో పాటు, సమయానికి టీకాలు వేయించాలి. అలాగే వారి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కొంతమంది పిల్లలు మట్టి, బలపాలు, సబ్బు, పేపర్లు, సుద్ద లేదా గోడ గోళ్లతో గీరి తింటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? తిట్టి, కొట్టి దండించడం కాకుండా అసలు ఎలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వైద్యులను సంప్రదించాలి. పిల్లలు మట్టిని ఎందుకు తింటారు? ఈ బురద తినే అలవాటు లేదా అలాంటి ఇతర తినకూడని వస్తువులను తినే అలవాటు రెండేళ్లకు మించి కొనసాగితే, శిశువు పికా అనే రుగ్మతతో బాధపడుతూ ఉండవచ్చు. ఎందుకు అలా తింటారుపోషకాహార లోపం, జింక్, కాల్షియం ,ఇనుము మొదలైన మూలకాల లోపంకుటుంబలో నిర్లక్ష్యం/ అశాంతి వాతావరణంఆటిజం , మేధో వైకల్యం, ఇతర అభివృద్ధి సమస్యలు. ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక ఆరోగ్య సమస్యలుసుద్ద, బలపం, సున్నం, లాంటి వాటిని తినడం వల్ల పిల్లలు అనీమియా వస్తుంది. మరింత బలహీనంగా తయారవుతారు. కడుపులో పురుగులు, నొప్పులు, ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి?పిల్లల వైద్యుల సలహా ప్రకారం పిల్లలకు తగిన ఆహారం ఇస్తే ఈ సమస్యలు దూరమవుతాయి. అలాగే ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా లభించే అరటి పండ్లను తినిపించాలి. కాల్షియం లోపిస్తే పిల్లలకు బీన్స్, ఆకుపచ్చ కూరగాయలను తినిపించడం ద్వారా కాల్షియం లోపాన్ని దూరం చేయవచ్చు. పిల్లల్లో అభద్రత తొలగించేలా, వారితో మరింత సన్నిహితంగా మెలగాలి. వారి పట్ల ప్రేమను మరింత ఎక్కువ పంచాలి. పిల్లల అలవాటు, ఆరోగ్య ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. మినరల్, ఐరన్, కాల్షియం సప్లిమెంటేషన్తో పాటు డీవార్మ్ మందులను సిఫారసు చేస్తారు. కొంతమందిలో ప్రవర్తనా లేదా మానసిక చికిత్స కూడా అవసరం కావచ్చు. సమస్య ఏంటి అనేది వైద్య నిపుణుడు నిర్ధారిస్తారు. -
Beauty Tips: మీ ముఖంపై బ్లాక్హెడ్స్ తొలగించాలంటే..??
ముఖాన్ని కళావిహీనం చేసే సమస్యల్లో బ్లాక్హెడ్స్ మహా మొండివి. గడ్డం, ముక్కు, నుదురు సహా ముఖం మీద పలు భాగాల్లో కనిపించే ఈ బ్లాక్హెడ్స్ తొలగించడమంటే .. కాస్త నొప్పితో కూడిన పనే. అయితే చిత్రంలోని ఈ మెషిన్.. హై–డెఫినిషన్ పిక్సెల్ 20గీ మాగ్నిఫికేషన్ టెక్నాలజీతో ఎలాంటి నొప్పి లేకుండా బ్లాక్హెడ్స్ను తొలగించి ముఖాన్ని నీట్గా మారుస్తుంది.ఈ డివైస్లో మొత్తం ఐదు లెవెల్స్ ఉంటాయి. దీని పైన.. వాక్యూమ్ హెడ్స్ని బిగించే భాగంలో చిన్న కెమెరా ఉంటుంది. ఈ డివైస్ని స్మార్ట్ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే, చర్మాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యిందో, ఎక్కడెక్కడ బ్లాక్హెడ్స్ ఉన్నాయో చూపెడుతుంది. కింది భాగంలో హీటింగ్ మసాజర్ హెడ్ ఉంటుంది. దీన్ని వినియోగించడం చాలా తేలిక. మొదటి లెవెల్ ఆప్షన్తో.. చర్మపు తీరుతెన్నులను పరిశీలించుకోవచ్చు.రెండో లెవల్ ఆప్షన్తో సెన్సిటివ్ స్కిన్కి, మూడో లెవెల్ ఆప్షన్తో జిడ్డు చర్మానికి, నాల్గవ లెవెల్ ఆప్షన్తో మరింత జిడ్డు చర్మానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఐదవ లెవెల్ ఆప్షన్తో మొండి రంధ్రాలకు సైతం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో 3 సెకన్ల కంటే ఎక్కువసేపు ఒకే స్థలంలో క్లీన్ చేయకూడదు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,036 రూపాయలు.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
తరచూ ఇన్ఫెక్షన్.. ప్రమాదం కాదా?
నాకిప్పుడు నలభై ఏళ్లు. ఏడాదికి 3–4 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తోంది. అన్నన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదం కాదా? ఇలా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పేరు, ఊరు వివరాలు రాయలేదు.మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణం. యూరినరీ ఓపెనింగ్ అంటే యురేత్రా అనేది.. మోషన్ ఓపెనింగ్ అంటే మలద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఈజీగా వెజైనా,యురేత్రా, బ్లాడర్లోకి ప్రవేశిస్తుంది. మహిళల్లో యురేత్రా షార్ట్గా ఉండటం వల్ల మరింత త్వరగా బ్యాక్టీరియా బ్లాడర్లోకి వెళ్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, అర్జెన్సీ ఫీలవడం, మూత్రంలో మంట, దుర్వాసన వేయడం, మూత్రంలో రక్తం ఆనవాళ్లు వంటివి ఉన్నాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైందని అర్థం.ఆడవాళ్లలో 40–50 ఏళ్ల మధ్య ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. దీనికి ఈస్ట్రజన్ హార్మోన్ లోపం ఒక కారణం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్లో బ్లాక్స్తో కూడా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలోనూ యూరిన్ ఇన్ఫెక్షన్ చాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నవారిలోనూ బ్యాక్టీరియా రెండింతలయ్యే చాన్సెస్ ఎక్కువై తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు.కొన్ని సింపుల్ మెథడ్స్తో ఈ ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. యూరిన్, మోషన్ పాస్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవద్దు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగాలి. కాఫీ, సుగర్ లోడెడ్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. టైట్ ఇన్నర్వేర్స్, డ్రాయర్స్ అవాయిడ్ చేయాలి. కాటన్ లోదుస్తులనే వాడాలి. స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, సబ్బులను వెజైనా ప్రాంతంలో వాడకూడదు. స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఎక్కువసార్లు వాడటం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి.అందుకే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఏయే యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ ఉందో చూసి అది వాడటం మంచిది. కొంతమందికి రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తూంటే ఏ మెడిసిన్ లేదా ప్రివెంటివ్ మెథడ్ పనిచేయనప్పుడు యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో ప్రొఫిలాక్టిక్ లో డోస్ యాంటీబయాటిక్స్ని ఇస్తారు. ఏ ప్రాబ్లమ్ వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నారో కనిపెట్టడం కొంతమందిలో సాధ్యమవుతుంది.అంటే సుదీర్ఘ ప్రయాణాలు, లైంగిక సంపర్కం వంటివాటితో యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి వారికి ఒక డోస్ యాంటీబయాటిక్ టాబ్లెట్ని ఇస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని చెక్ చెయ్యాలి. మెనోపాజ్ వయసులో ఈస్ట్రజన్ క్రీమ్తో కూడా ఇన్ఫెక్షన్ని నివారించవచ్చు. ఆరునెలల కాలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా.. ఏడాదిలో మూడుసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానిని రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు. తొలిదశలోనే గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ఇవి చదవండి: బుల్లీయింగ్ను నిర్లక్ష్యం చేయొద్దు.. -
Health Tips: నిద్రపోయేముందు ఇలా చేశారో.. మీ ఆరోగ్యం?
నిద్రపోయేముందు నీళ్లు తాగి పడుకునే అలవాటు అందరికీ ఉన్నప్పటికీ దానిపై అశ్రద్ధ చూపేవారే ఎక్కువగా కనిపిస్తుంటారు. అలా చేయడం అనరోగ్యాలకు దారి తీస్తుంది. అలాగే నిద్రకు ఉపకరించే ముందు మీరు తాగే గ్లాసు నీళ్లలో వీటిని కలిపితే ఎంతో మేలు..ఇలా చేయండి..రాత్రి పడుకునేముందు గ్లాసు నీళ్లలో టీస్పూను మెంతులు వేసి నానపెట్టాలి. ఉదయం పరగడుపున ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలగడంతోపాటు, శరీర బరువు అదుపులో ఉంటుంది. రోజూ మెంతుల నీళ్లు తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ చల్లని పాలను తాగాలి. పాలను బాగా మరిగించి అనంతరం వాటిని చల్లార్చి కాసేపు ఫ్రిజ్లో ఉంచాలి. దీంతో పాలు చల్లగా మారుతాయి. అనంతరం వాటిని నిద్రకు ముందు తాగాలి. ఇలా మూడు రోజుల పాటు వరుసగా చేస్తే ఎసిడిటీ తగ్గిపోతుంది.రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం కాసిని సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇవి చదవండి: నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా? -
నోటి దుర్వాసన.. ఈ వ్యాధులకు సంకేతమని తెలుసా?
ఎవరైనా సరే, నోటిని సరిగా శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడం సహజం.. అయితే చిగుళ్ల వాపు లేదా దంత సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా... సక్రమంగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుంచి వాసన వస్తుంటే, దానిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదని, కొన్ని రకాల ఇతర వ్యాధులకు సంకేతంగా భావించి దాని గురించి శ్రద్ధ వహించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.నోటి దుర్వాసన అనేది ఆహారపు అలవాట్లు, నోటి పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, దంతవైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలని, భోజనం తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని పుక్కిలించి నోటిని శుభ్రం చేయమని చెబుతుంటారు. ఇవి పాటించిన తర్వాత కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే, అది శరీరంలో ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు..సైనసైటిస్, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు, ఈ ఇన్ఫెక్షన్లు సంభవించినప్పుడు, శ్వాసకోశంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని కారణంగా వాసన కలిగించే మూలకాలు ఏర్పడి ఇవి గాలి వదిలినప్పుడు దుర్వాసన వచ్చేలా చేస్తాయి.జీర్ణ సమస్యలు..కడుపులో ఉండే ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీనివల్ల నోటిలో పుల్లని తేన్పులతోపాటు వాసన కూడా వస్తుంటుంది.కిడ్నీవ్యాధులు..మూత్రపిండాలనేవి శరీరంలోని మలినాలను వడపోసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు అవి వాటి పని సక్రమంగా చేయలేక శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోతాయి. ఈ విధంగా రక్తంలో చేరిన వ్యర్థాల వల్ల వారు ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఒక విధమైన దుర్వాసన వెలువడుతుంటుంది.బీపీ, షుగర్..మధుమేహం ఉన్నవారిలో ఇది చాలా సాధారణ సమస్య.. ఎందుకంటే వారి శ్వాసలో ఎక్కువ కీటోన్లు ఉంటాయి. ఇవి ఒకవిధమైన చెడు శ్వాసను వెలువరిస్తుంటాయి. అదేవిధంగా దీర్ఘకాలికంగా బీపీ ఉన్న వారు వాడే కొన్ని రకాల మందులు కూడా నోటి దుర్వాసనకు కారణం కావచ్చు.కాలేయ సంబంధ వ్యాధులు..లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సమస్యల వల్ల శరీరంలోని వ్యర్థాల నిర్వహణ సరిగా జరగదు. అందువల్ల కాలేయంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.అందువల్ల నోటి దుర్వాసన ఉన్నప్పుడు దంత వైద్యుని సంప్రదించి, వారు సూచించిన మౌత్వాష్లను, ఇతర విధాలైన మౌత్ ఫ్రెష్నర్లను ఉపయోగించినా కూడా నోటి దుర్వాసన వదలకపోతుంటే మాత్రం అది ఇతర వ్యాధులకు సూచనగా భావించి ఫ్యామిలీ వైద్యుని సంప్రదించి వారి సూచన మేరకు తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది.ఇవి చదవండి: ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త! -
తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా?
శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం కోసం ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కొందరు రకరకాల ఎక్సర్సైజులు చేస్తే, పొట్టను మాడ్చుకుంటారు కొందరు. వాకింగ్, జాగింగ్ వంటి వాటితో ప్రారంభించి, చిన్న చిన్న బరువులు మోయడం... ఆ తర్వాత వాటన్నింటినీ అనుసరించలేక నీరస పడిపోతుంటారు ఇంకొందరు. అయితే అలా కాకుండా తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్ ఒకటుంది. అదేమంటే మెట్లెక్కడం... నిజమే! మెట్లెక్కడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మెట్లెకెక్కినట్లే! అయితే దానికీ ఓ పద్ధతుంటుంది మరి.నడవటం, పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈదటం లాంటి మిగతా వ్యాయామాలే కాదు, రోజూ మెట్లెక్కటం, దిగటం వల్ల కూడా శరీరం ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సాధారణంగా నేలమీద నడుస్తున్నప్పటి కంటే మెట్లెక్కుతూ పైకి వెళ్ళటం, కిందకు దిగటం మూలంగా కండరాలు బలపడతాయి. తొడలు, కాలి పిక్కలు పటిష్టంగా తయారవుతాయి. కండరాలు బలంగా ఉంటే నిటారుగా, మంచి ఫిటెనెస్ తో ఉన్నట్లుగా కనిపిస్తారు.శరీరాకృతి పట్ల శ్రద్ధ ఉండి రోజూ ఎక్సర్ సైజులు చేసేవాళ్ళు, వాటితో΄ాటు మెట్లెక్కటాన్ని కూడా అలవాటు చేసుకుంటే రోజు రోజుకూ శరీరాకృతిలో వచ్చే మార్పులను చూసి మనకే ఆశ్చర్యం వేస్తుంది.ఇలా అలవాటు చేసుకోవాలి!కింద నుంచి 8 మెట్ల దాకాఎన్నుకుని ఆ 8 మెట్లనూ పైకి ఎక్కటం, కిందికి దిగటం, మళ్ళీ ఎక్కటం, దిగటం అలా అలిసిపోయేదాకా చేయాలి. లేదా ఒక అంతస్తు పైదాకా ఎక్కుతూ దిగుతూ ఉండాలి. మెట్లను పైకి ఎక్కుతున్నప్పుడు చేతుల్ని రిలాక్స్గా పక్కలకు వదిలేయాలి. మోచేతుల్ని మాత్రం కొద్దిగా వంచాలి. బాగాప్రాక్టీస్ అయాక మోచేతుల్ని ఇంకా వంచవచ్చు. ఇలా చేయటం వల్ల మోకాళ్ళను ఎత్తి ఎత్తి వేయటానికి అనువుగా ఉంటుంది. అయితే ఎన్ని మెట్లెక్కినా, మరునాటికి కాళ్ళపిక్కల్లో పోట్లు, నొప్పులు వంటివి ఉండకూడదు. అలా ఉన్నాయంటే మీరు శక్తికి మించి మెట్లెక్కుతూ దిగుతున్నారన్న మాట.మెట్లు ఎక్కుతూ దిగుతూ వున్నప్పుడు ΄ాదాలు జారకుండా ఉండటానికి సౌకర్యంగా ఉండే షూస్ వాడాలి.మిగతా ఎక్సర్ సైజులతో ΄ాటు రెండు మూడు అంతస్తుల మెట్లను ఇలా ఎక్కుతూ దిగితే మీ శరీరం వెచ్చదనానికి చేరుకుంటుంది.తర్వాత శరీరం మామూలు స్థితికి వచ్చి కూల్ డౌన్ కావటానికి అనువుగా రిలాక్స్ అవుతూ కొద్దిసేపు నడవాలి. ఇందుకు సుమారు మూడు నుంచి 10 నిముషాల సమయం పడుతుంది.మిగతా ఏ ఎక్సర్ సైజులూ చేయనివారు ఈ మెట్లెక్కే ఎక్సర్ సైజును వారానికి కనీసం రెండుసార్లన్నా చేయాలి. తడవకు 20 నిముషాలకు తగ్గకుండా. ఆ తర్వాత పైన చెప్పిన నడక ఎక్సరసైజును తిరిగి చేయాలి.దీనిని ఒక సాధనగా చేసుకోవాలంటే మొదటి రెండువారాలలో 2 అంతస్తుల దాకా మెల్లగా ఎక్కుతూ దిగాలి. మూడోవారం వచ్చేసరికి 3 అంతస్తులు... ఇలా అయిదు అంతస్తుల దాకా అలుపు లేకుండా ఎక్కి, దిగగలిగేలా సాధన చేయాలి.ఇవి చదవండి: వారి చేతుల్లో.. వ్యర్థాలు కూడా బొమ్మలవుతాయి.. -
కాఫీ, టీలకు బ్రేక్: ఇలా ట్రై చేద్దామా..!
ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీగానీ, టీగానీ పడకపోతే కాలకృత్యాల దగ్గర్నించి ఏ పని కాదు చాలామందికి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తద్వారా రోజు చురుకుగా ఉండటానికికావాల్సిన పోషకాలు అందుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.కాఫీ, టీ అయినా అదొక సెంటిమెంట్లాగా మనకి అలవాటు అయిపోయింది. కానీ మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్ ,కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి.టీ లేదా కాఫీ ఉదయం పూట టీ, కాఫీలు అలవాటు మానలేని వారు చక్కెరను బాగా తగ్గించేస్తే బెటర్. మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మానేయాలి. తాజా పండ్లను, పళ్లతో చేసిన రసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్, కీరా, యాపిల్, బీట్రూట్ లాంటివాటితో జ్యూస్ చేసుకోవచ్చు. అయితే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ జోలికి వెళ్లవద్దు. వీటిల్లో ఫైబర్ ఉండదు,పైగా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జింజర్ టీ, హెర్బల్ టీపొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపు కోవచ్చు. ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అల్లం, తులసి, పుదీనా ఆకులు, తేనెతో చేసిన హెర్బల్. జింజర్ టీతాగవచ్చు. కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో అవసరమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి., అలాగే ఫ్రీ-రాడికల్తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. షుగర్ లెవల్స్ను బట్టి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.కాఫీ, టీలు రోజులో రెండుసార్లు తీసుకోవడం పెద్ద ప్రమాదం ఏమీకాదు. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తరువాత తీసుకుంటే మంచిది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర వాడకంలో జాగ్రత్త పడాలి. తాగకూడనివిసోడా, కార్బోనేటేడ్ పానీయాలు వీటిల్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయనేది గమనించాలి. -
అందం ఆరోగ్యం కలగలిపిన సిరి : కలబంద
Aloe Vera Juice: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?ప్రస్తుత కాలంలో కలబంద పేరువినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలోయి జాతికి చెందిన ఇది ఉష్ణమండలంలో విస్తారంగా పెరుగుతుంది. అలోవెరా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా చాలామందికి తెలుసు. అందంనుంచి ఆరోగ్యం దాకా కలబందతోలాభాల గురించి తెలుసుకుందాం.చర్మం, దంత, నోటి , జీర్ణ ఆరోగ్యానికి అలాగే బ్లడ్ షుగర్ లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సన్బర్న్ చికిత్సకు ఉపయోగడతాయి. చర్మం, జుట్టు అందాన్ని కాపాడుతుంది. అందుకే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్లో దీన్ని విరివిగా వాడతారు. దీంట్లో ఇంట్లోనే పెంచుకోవడం కూడా చాలా సులువు.కలబందలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ, సీ, ఇ , బి-కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంజైమ్లు, ఫైబర్లు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలిన గాయాలు , అటోపిక్ డెర్మటైటిస్ (1 ట్రస్టెడ్ సోర్స్, 2 ట్రస్టెడ్ సోర్స్) వంటి ఇతర చర్మ రుగ్మతలకు చికిత్సగా పని చేస్తుంది.కలబంద రసం ఆరోగ్య ప్రయోజనాలుఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. షుగర్ బోర్డర్లో ఉన్నవారు, ప్రీ డయాబెటిక్ రోగులకు కూడా ఈ కలబంద రసం బాగా పని చేస్తుంది.కలబంద పొట్టను శుభ్రపరుస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కలబంద రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో పాటు చిగుళ్ళు, దంతాలను శుభ్రంగా ఉంచడంలో అలోవెరా రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
మౌత్ అల్సర్ నుంచి ఉపశమనానికై.. ఇలా చేయండి!
కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పుళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏమైనా తాగినా, తిన్నా చాలా బాధగా ఉంటుంది. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. ఎందుంకటే కొబ్బరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మాని΄ోతుంది.పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం గా ఉంటుంది.తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. రోజుకు నాలుగైదు సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గి΄ోతుంది.చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా నోటిపూతను తగ్గిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..? -
Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ప్రస్తుత ఆహార అలవాట్లు, జీవన శైలి మార్పులు కారణంగా చాలామంది చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు. అధిక బరువు అనేక ఆరోగ్యసమస్యలకు మూలం. అందుకే బరువు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇవ్నీ కావు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేస్తున్నారు. వీటితోపాటు కొన్ని రకాల సింపుల్ చిట్కాలతో వెయిట్ లాస్ కావచ్చు అని నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి. ఎండు ద్రాక్ష నీరు ఎంతో మేలు చేస్తుంది. ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఎండు ద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని, ద్రాక్షతోకలిపి తీసుకోవడంతో వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. ప్రధానంగా ఎండుద్రాక్షలో ఉండే పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.ఎండు ద్రాక్ష వాటర్, ప్రయోజనాలు శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. శరీరం ఫ్రీ రాడికల్సతో పోరాడే శక్తినిస్తుంది. బరువు పెరగడం, నిద్రలేమి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.మెరుగైన జీర్ణక్రియ: ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను మెరుగుపర్చి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి: విటమిన్ సీ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫినాలిక్ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రక్తపోటు,గుండెపోటు: బీపీ, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గించే డైటరీ ఫైబర్ పాలీఫెనాల్స్ను కూడా ఇందులో లభిస్తాయి.చర్మ,నోటి సమస్యలు : ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. రక్తహీనతకు ఇది చాలామంది. ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యానికి కీలకమైన విటమమిన్ ఏ, ఈ ఇందులో లభిస్తాయి. రెగ్యులర్గా వీటిని తీసుకుంటే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ కావిటీస్ , చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి.ఈ ఎండు ద్రాక్ష నీటిలో పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న ద్రవాల స్థాయిలను అందుపులో ఉంచుతాయి. ముఖ్యంగా ఈ వేసవిలో చెమట కారణంగా కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. -
నిద్రలేమి ముప్పు : హైదరాబాద్ న్యూరాలజిస్ట్ కీలక పోస్ట్ వైరల్
మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నిద్ర అవసరం. రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నా, మరుసటి రోజుగా చురుగా పనులు చేసుకోవాలన్నా నిద్ర చాలా అవసరం.రనిద్ర తక్కువైతే ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్లో పనిచేస్తున్న న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మరికొన్ని కీలక విషయాలను ప్రకటించారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్గా మారింది.తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయి. రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. అనేక అధ్యయనాలు నిద్ర లేమి వల్ల బరువు పెరగడం, ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, పనితీరులో మార్పు ,హార్మోన్ల లోపాలు వంటి అనేక రుగ్మతలకు దారి తీస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు , మానసిక రుగ్మతలు అలాగే కొన్ని సందర్భాల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కానీ పెద్దలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పోవడం లేదు. ఇది మానవ శరీరంపై, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది న్యూరాలజిస్టులు, నిపుణులు నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో డా. సుధీర్ కుమార్ కూడా మరో కీలక విషయాన్ని వెల్లడించారు.If you lose just one hour of sleep, it could take 4 days to recover from that. Sleep deprivation can cause various symptoms, such as headache, poor focus and attention, increased irritability, poor judgement, poor decision making and increased sleepiness. #sleep #HealthyHabits— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) May 21, 2024కేవలం ఒక గంట నిద్రకోల్పోతే కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని సుధీర్ కుమార్ పేర్కొన్నారు. నిద్రలేమితో తలనొప్పి, కంటి చూపులో లోపం, చికాకు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో సమస్యలొస్తాయని ఆయన తన ఎక్స్లో వెల్లడించారు. అధిక ఒత్తిడి ,పేలవమైన జీవనశైలి అలవాట్ల కారణంగా నిద్రలో సమస్యలొస్తాయని ఆయన వివరించారు. అంతేకాదు ఏ వయసులో ఎంత సమయం నిద్ర పోవాలి అనేది కూడా ఆయన స్పష్టం చేశారు.వయసుల వారీగా సగటు రోజువారీ నిద్ర, నవజాత శిశువులు (3 నెలల వరకు): 14 నుండి 17 గంటలు నిద్రపోవాలి. శిశువులు (4 నుండి 12 నెలల వయస్సు): 12 నుండి 16 గంటలు నిద్రపోవాలి.చిన్నపిల్లలు (1 నుండి అయిదేళ్ల వయస్సు): 10 నుండి 14 గంటల వరకు, పాఠశాల వయస్సులో ఉన్న పిల్లలు (6 -12 సంవత్సరాలు): 8 నుండి 10 గంటల నిద్ర.అలాగే రాత్రిపూట 7-9 గంటలు ఒకేసారి నిద్రపోవడం సరైనది, ఉత్తమమైంది. ఒక వేళ రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే అతను/ఆమె పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చుఅని సుధీర్ కుమార్ తెలిపారు -
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
సాధారణంగా ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. అలాంటి వాటిలో ఒకటివేసవిలో ఎక్కువగా లభించే పుచ్చకాయ. సాధారణంగా పుచ్చకాయ కోసి తినే సమయంలో వాటి గింజలను పారేస్తుంటారు. నిజానికి పుచ్చకాయ గింజల్లోని గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈసారి గింజల్ని అపురూపంగా చూసుకుంటారు. పుచ్చకాయ గింజల వలన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి!పుచ్చకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఫ్రూట్. ఇందులో 92శాతం నీరే ఉంటుంది. ఇంకా ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి అలాగేదీని గింజలు వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని,గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని మిథనాలిక్ సారం అల్సర్లకు వ్యతిరేకంగా అద్భుతంగా పని చేస్తుందని ఎలుకలపై చేసిన అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.తక్కువ కేలరీలుపుచ్చకాయ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 4 గ్రాముల బరువున్న కొన్ని విత్తనాలలో 23 కేలరీలు మాత్రమే ఉంటాయి.మెగ్నీషియంజీవక్రియ కార్యకలాపాలకు అవసరమైన పోషకం మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, మన శరీరానికి ప్రతిరోజూ 420 గ్రాముల మెగ్నీషియం అవసరం.జింక్ఇందులోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇనుముఇనుము ఎక్కువగా లభిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఒక వ్యక్తికి రోజువారీ 18 mg ఇనుము అవసరం. మంచి కొవ్వులుగుడ్ కొలెస్ట్రాల్(మంచి కొవ్వు) మోనోఅన్శాచురేటెడ్ , పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ను నివారించడానికి ఉపయోగపడుతుంది . కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నాలుగు గ్రాముల పుచ్చకాయ గింజలు 0.3 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను , 1.1 గ్రాముల పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. -
బరువు తగ్గాలని రైస్కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..
బరువు తగ్గేందుకు రకరకాల డైట్లు ఫాలో అవుతాం. ముఖ్యంగా రైస్ని దూరంగా ఉంచుతారు. ఎక్కువగా పండ్లు, చిరుధాన్యాల మీద ఆధారపడుతుంటారు. ఒక్కోసారి నచ్చిన కూర ఉన్న కూడా బరువు విషయం గుర్తించి భారంగా దూరం పెట్టేస్తాం రైస్ని. ఇంతకి రైస్ వల్లే బరువు పెరిగిపోతామా? దీనిపై ఫిట్నెస్ కోచ్లు ఏమంటున్నారంటే..చాలామంది బరువు విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. అన్నంతో బరువు ముడిపడి ఉందని నమ్ముతుంటారు. అందువల్ల అన్నం తినడం తగ్గించేస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గే యత్నంలో అన్నంకి దూరంగా ఉంటారు. అయితే ఇది ఎంతమాత్ర నిజం కాదని తేల్చి చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సిమ్రాన్. బరువు తగ్గడంలో రైస్ని హాయిగా తింటూనే ఎలా నియంత్రించవచ్చో వివరించారు. ఎలాంటి చింత లేకుండా హాయిగా రైస్ని ఆస్వాదిస్తూ తినొచ్చని చెబుతున్నారు. అందుకోసం చేయాల్సింది ఏంటో వెల్లడించారు. భోజనం తినడానికి కనీసం 10 నుంచి 12 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీటిని హాయిగా తీసుకోండి. తర్వాత మంచి సలాడ్ కొద్దిగా తీసుకోండి. ఆ తర్వాత నచ్చిన భోజనం హాయిగా తినండి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినండి. అలాగే పెరుగు అన్నం కూడా స్కిప్ చెయ్యొద్దు మంచిగా లాగించేయండని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సిమ్రాన్. అంతేగాదు అన్నం తినడం వల్ల మధుమేహం రాదని, కేవలం అతిగా తినటం వల్ల వస్తుందని చెప్పారు. అలాగే యాక్టివ్గా ఉండేందుకు యత్నించండి, సమతుల్య ఆహారం బాగా తినండి, కాస్త కామన్ సెన్స్తో వ్యవహరిస్తూ నెట్టింట్లో చెప్పే ప్రతి చిట్కాను ఫాలో అవ్వకండి అని చెబుతున్నారు. అన్న తినడం వల్ల బరువు పెరుగుతాం అనే భావనను వదిలించుకోండి. శరీరం హెల్తీగా ఉండాలంటే మనస్ఫూర్తిగా అన్నం తినాలనే విషయాన్ని గ్రహించండి. (చదవండి: కొత్త హెయిర్ స్టైల్లో విరాట్ కోహ్లీ..వావ్!అంటూ ఫ్యాన్స్ కితాబు!) -
జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
జామపండుకు పేదల ఆపిల్ అని పేరు. అయితే పండే కాదు... ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు... ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది అధిక బరువును తగ్గించడంలో జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. స్త్రీలు నెలసరి సమయంలో కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులతో సతమతం అవుతుంటారు. అలాంటి వారికి జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి.కొలెస్ట్రాల్ లెవల్స్ను తగ్గించడంలో జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ ముప్పు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.యాంటీ స్ట్రెస్ ఏజెంట్గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి మంచిది. జామ ఆకులు శరీర మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. -
కొత్తిమీరతో అద్భుత ప్రయోజనాలు, వారికి తప్ప
వంటల్లో విరివిగా ఉపయోగించే మంచి హెర్బ్ కొత్తిమీర. అలాగే పురాతన కాలంనుంచీ వాడుకలో ఉన్నదిధనియాలు. ధనియాలు, కొత్తిమీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. కొత్తిమీర వినియోగంతో వచ్చే లాభాలు, బరువు తగ్గడానికి పని చేసే ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా?కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలని అమ్మమ్మల నుంచి విన్నాం. కొత్తిమీర ఆకులలో ముఖ్యమైన నూనెలు యాంటీమైక్రోబయల్, ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇంకా విటమిన్ ఏ సీ, కెరోటినాయిడ్లు, పుష్కలం. ఈ పోషకాలతో పాటు డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా సంతృప్త కొవ్వు, 11 ముఖ్యమైన నూనెలు లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలుకొన్ని అధ్యయనాల ఆధారంగా, కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళల సమస్యలు తగ్తుతాయి. విటమిన్ ఏ, సీ, ఈవిటమిన్ ఇ కారణంగా కళ్లకు చాలా మంచిది. కొత్తిమీర రోజువారీ వినియోగిస్తే వయసు కారణంగా వచ్చే మచ్చలకు మంచి చిట్కా. రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ఐరన్ తీసుకోవడంలో బాడీగా బాగా సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయికొత్తిమీరలోని ఆకుపచ్చ రంగు యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్తిమీర కలిపిన నీటిని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తికి మేలు జరుగుతుంది. ఇన్సులిన్ను నియంత్రిస్తుంది. కొత్తిమీర గ్లైసెమిక్ ఇండెక్స్ 33 మాత్రమే. ఇది చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే కొత్తిమీర నీళ్లు తాగకండి. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్నేటి జీవనశైలిలో, ప్రతి మూడవ వ్యక్తి అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ,హెచ్డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఎముకల ఆరోగ్యానికి కొత్తిమీర ఆకులు కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు పుష్కలం కొత్తిమీరలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ ఆర్థరైటిస్ సంబంధిత నొప్పి నుండి ఎముకలను రక్షిస్తుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోకొత్తిమీరలో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, ప్రేగు కదలికలు, గ్యాస్ లేదా వికారం వంటి వివిధ జీర్ణ సమస్యలకు కూడా పని చేస్తుంది. చర్మ ఆరోగ్యంఐరన్, విటమిన్ ఇ , విటమిన్ ఎ యొక్క పవర్హౌస్గా ఉండటం వల్ల ఇది చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. కొత్తిమీర అదనపు నూనెను పీల్చుకునే సామర్థ్యం కారణంగా జిడ్డు చర్మానికి నివారణగా కూడా పనిచేస్తుంది. యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ ,యాంటీ ఫంగల్ ఏజెంట్ చర్మాన్ని చల్లబరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిశరీరంలోని అదనపు నీరు, సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గాలంటే అంతేకాదు అధిక బరువుతో బాధపడే వారికి కొత్తిమీర నీరు మంచి వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో సహాయ పడుతుంది. కొత్తిమీరలోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి. థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు, కాండం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలలో ఉండే థైమోల్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలుకొత్తిమీర, ధనియా వాటర్ రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. లోబీపీ ఉన్నవారు అపమ్రత్తంగా ఉండాలి. దీనిని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఆందోళన, దడ, చెమట , ఆకలిలాంటి సమస్యలొస్తాయి. ఏదైనా మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. -
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
మొలకెత్తిన గింజధాన్యాలను తినడం వలనఅనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలన్నా, మంచి పోషకాలు అందాలన్నా మొలకలు తినాల్సి ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. మొలకలతో వచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసు కుందాం.గర్భిణీ స్త్రీలకుశరీరానికి విటమిన్ సి, ఫైబర్ , జింక్, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. మొలకలలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా అవసరం. ఆహారంలోని ఫోలేట్ సరైన పోషకాలను పిండానికి అందేలా సహాయపడుతుంది. పిల్లల మంచి మెదడు అభివృద్ధికి మంచిది . ఇంకా మలబద్ధకం , పెద్దప్రేగు క్యాన్సర్ను నివారిస్తాయి.విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదల ఉండేలా చేస్తుంది. జుట్టు రాలడం, తొందరగా జుట్టు మెరిసిపోవడం తగ్గుతుంది. రక్త ప్రసరణ పెరిగి, జుట్టును బలోపేతం చేసి పెరుగుదలకు సహాయపడుతుంది. మొలకలలో విటమిన్ ఏ అధిక సంఖ్యలో ఉంటుంది. ఇది కంటిశుక్లం రేచీకటి నివారణలోనూ మొత్తం కంటి ఆరోగ్యానికి మంచిది.శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మాస్కులర్ డిజెనరేషన్ సమస్యకు బాగా పనిచేస్తుంది. శాఖాహారులు మొలకలను తీసుకున్నప్పుడు ప్రోటీన్ అందుతుంది. వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయ పడతాయి.మొలకలలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెరుగైన స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. వీర్యకణాల కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి.మొలకల్లో విటమిన్ B లభిస్తుంది. ఇది చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. చర్మ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. సాధారణ జలుబు, ఆస్తమా నివారణలో సాయపడతాయి.సైడ్-ఎఫెక్ట్స్ & అలర్జీలుతక్కువ నాణ్యత గల మొలకలను ఉపయోగించినప్పుడు మొలకలు శరీరంలో సాల్మొనెల్లా, ఇ కోలి బ్యాక్టీరియా , వైరస్ దాడికి కారణమవుతాయని తెలుస్తోంది. ఒక్కోసారి, జ్వరం అతిసారం బారిన పడ్డారు . కొంతమందికి కడుపు తిమ్మిరి ఏర్పడింది. మొలకలు సరియైన పద్ధతిలో రాకపోతే హానికరమైన బ్యాక్టీరియా పుడుతుంది.నోట్: ఇది అవగాహన కోసం అనేది గమనించగలరు. ఏదైనా మితంగా తింటే మంచిది. మొలకలు తిన్నపుడు ఏదైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తేం వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు ప్రకృతి సహజం. అందుకే సీజన్కు తగ్గట్టుగా మన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చెమట రూపంలో నీరు ఎక్కువ నష్టపోతాం కాబట్టి, నీరు ఎక్కువగా లభించే పండ్లు కూరగాయలు తీసుకోవాలి. ఈ క్రమంలో సమ్మర్లో కీరదోసకాయను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. నిజానికి కీరదోస ఏ సీజన్లో తీసుకున్నా మంచిదే. ఇందులో పోషకాలు అనేక లాభాలను అందిస్తాయి. వేసవిలో అయితే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దోసకాయలు కేలరీలు తక్కువ. విటమిన్లు , ఖనిజాలు ఎక్కువ. కరిగే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.కీరదోసతో లాభాలుహైడ్రేషన్ & డిటాక్సిఫికేషన్ కోసం మంచిదిరక్తపోటును నియంత్రిస్తుందిజీర్ణక్రియకు మంచిదిబ్లడ్ షుగర్ తగ్గిస్తుందిబరువు తగ్గడంలో ఉపయోగపడుతుందిమెరుగైన చర్మం కోసంకళ్లకు సాంత్వన చేకూరుస్తుందికేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందివడదెబ్బతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇందులో 95 శాతం నీటితోపాటు, పొటాషియం,మెగ్నీషియం లభిస్తాయి. సోడియం లోపం ఉన్నవారు ఆహారంలో ఈ కీర దోసకాయని తీసుకుంటే మంచిది. పొట్టుతో కీర దోసకాయ తినడం వల్ల గరిష్టంగా పోషకాలు అందుతాయి.ఫ్లేవనాయిడ్లు ,టానిన్లతో సహా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి ,దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. కీర దోసకాయలోని పెక్టిన్ పేగు కదలికలను బాగు పరుస్తుంది. తద్వారా మలబద్దకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. -
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్ర్సైజ్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. జీవన శైలి మార్పులు,క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలు దీనికి పరిష్కారం. ఒకసారి మధుమేహం బారిన పడితే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్రమైన సమస్యలు తప్పవు.మధుమేహం వచ్చిందని భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. మధుమేహాన్ని నియంత్రించాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.కొద్దిపాటి నడక, యోగాఉదయాన్నే లేదా రాత్రి నడక, యోగా, ధ్యానం చాలా అవసరం. ముఖ్యంగా డయాబెటిక్ సమస్య ఉన్నవారు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకుపక్రమించకూడదు. కనీసం పది, ఇరవై నిమిషాలు నడక,వజ్రాసనం వంటి యోగాసనాలను అలవాటు చేసుకోవాలి. దీని బరువు అదుపులో ఉంటుంది. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం అనేది షుగర్ లెవల్స్ ఎలివేట్ కావడానికి ముఖ్యం కారణం. కాబట్టి తిన్న తర్వాత కనీస శారీరక శ్రమ చాలా అవసరంస్వీట్లకు, కొన్ని రకాల పండ్లుమామిడికాయ, పనస, అరటి లాంటి పండ్లకు చాలా దూరంగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క జామకాయ తప్ప ఏదీ తినకూడదు.. తిన్నా.. చాలాపరిమితంగా తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో స్వీట్లు తినకపోవడం మంచిది. మంచి నిద్ర, నీళ్లు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే రాత్రి నిద్ర కూడా పడుతుంది. డయాబెటిక్ రోగులు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.అలాగే రాత్రి భోజనం చేసిన 1 గంట తర్వాత మీరు కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు.రాత్రిపూట మొబైల్ స్క్రీన్లకు ఎంత దూరంగా ఉంటే మంచింది. రాత్రి పడుకుని టీవీ, మొబైల్ చూడటం వల్ల, మెడ నొప్పులు, తలనొప్పి వస్తాయి. మద్యపానం, ధూమపానం పూర్తిగా నిషేధించాలి. ఎప్పటికపుడు పరీక్షలు, వైద్యుల సలహాలుఒకసారి మన శరీరంలోకి మధుమేహం ఎంటర్ అయిందంటే అదొక హెచ్చరికలాగా భావించాలి. రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహా మేరకు మందులను వాడుతూ ఉండాలి.నోట్: డయాబెటిక్ వచ్చిందని భయపడకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామం, ఆహార నియంత్రణ లాంటి జీవన శైలి మార్పులు ఆరోగ్య జీవనానికి పునాది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పూర్తి సమాచారం, సందేహాలకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. -
Health Tips: ఈ చిట్కాలతో.. మీ ఆరోగ్యం నిలకడగా..
ప్రతీరోజూ.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంచాలంటే ఎన్నో విధానాలు, జాగ్రత్తలు పాటించక తప్పదు. మరి ఈ టిప్స్తో మీ ఆరోగ్యం మీ చేతిలోనే.. మరి అవేంటో చూద్దాం.కిస్మిస్లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తిని గోరువెచ్చటి నీరు తాగితే మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలా కాకపోతే రాత్రి పూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం కూడా తినవచ్చు. ఎలా తిన్నా సమస్య నుంచి బయట పడతారు.బాదంపప్పులో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పును రోజూ తింటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇందుకు గాను బాదంపప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని పొట్టు తీసి తినాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడంతో΄ాటు మలబద్దకం తగ్గుతుంది. పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.జామపండ్లలో విటమిన్లు, మినరల్స్ అనేకం ఉంటాయి. ఇవి దంతాలు, చిగుళ్ల సమస్యలు, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. జామ పండ్లను తినడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అలాగే పైల్స్ కూడా తగ్గిపోతాయి. రోజూ రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రకు ముందు ఒక జామ పండును తింటే ఈ ప్రయోజనం కలుగుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.రోజూ పరగడుపునే మూడు లేదా నాలుగు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పెనంపై వేసి వేయించి వాటిని అలాగే తినాలి. నేరుగా తినలేం అనుకుంటే తేనెతో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం నుంచి బయట పడతారు. మలబద్దకం తగ్గి పైల్స్ నుంచి విముక్తి పొందవచ్చు.జీర్ణ సమస్యలను తగ్గించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను చప్పరిస్తూ తినాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. క్రమం తప్పకుండా రోజూ రాత్రి బెల్లం తింటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.ఇవి చదవండి: Summer Special - ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త! -
Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
కోవిడ్-19 సంక్షోభం తరువాతఅందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు. నల్ల ఉప్పుతో ఎలాంటి ప్రయోజ నాలున్నాయో తెలుసుకుందాంఉప్పులేని వంటిల్లు లేదు. కానీ మనం రెగ్యులర్గా వాడే తెల్ల ఉప్పుతో కంటే కూడా బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగిన బ్లాక్సాల్ట్ ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలాబాగా పనిచేస్తుంది. అలాగే నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మందికి తెలియదు.ఎసిడిటీ, మెరుగైన జీర్ణక్రియ తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి నల్ల ఉప్పు నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. నల్ల ఉప్పును సరైన పరిమాణంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ అయినా వాటి రుచిని పెంచుతుంది. ఇది అనేక యాంటీఆక్సిడెంట్లు కలిగిన పోషకాల నిధి.గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.బరువు తగ్గడానికినల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది.సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే మంచిది.నోటి ఆరోగ్యం గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి నిద్రించే ముందు పుక్కిలిస్తే దంతాలు బలపడతాయి. దీంతో పంటి నొప్పి, కుహరం సమస్యలు కూడా నయం అవుతాయి. చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన సమస్యను కూడా వదిలించుకోవచ్చు.చర్మ సమస్యలు నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిది. సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు. నోట్: ఇది కేవలం సమాచారంగా మాత్రమే అని గమనించగలరు. బీపీ రోగులు ఉప్పును ఎంత పరిమితంగా వాడితే అంత మంచిది. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి.దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
Beauty Tips: పసుపుతో పింక్ లిప్స్..
ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాగానీ, కొన్ని సమస్యలు మనకు తెలియకుండానే పెద్ద తలనొప్పిగా మారుతాయి. వాటినుంచి ఎలా తప్పుకొవాల్లో కూడా తెలీక ఇబ్బంది పడుతుంటాం. మరి ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించాలంటే ఇలా ప్రయత్నం చేసి చూడండి.. ఇలా చేయండి.. పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. రోజూ రాత్రిపూట క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పెదవులు గులాబి రంగులోకి మారతాయి. చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల పెదవులపై ఏర్పడిన మచ్చలు పోతాయి. హెయిర్ కలర్గానీ హెన్నాగానీ జుట్టుకు పెట్టే ముందుకు చెవులు, నుదురుకు పెట్రోలియం జెల్లిని రాయాలి. తరువాత హెన్నా పెట్టుకోవాలి. చెవులు, నుదురు ్రపాంతంలో హెన్నా పడ్డప్పటికీ నీటితో కడిగితే ఇట్టే పోతుంది. పెట్రోలియం జెల్లి లానే ఆలివ్ ఆయిల్ను కూడా డైకు ముందు చెవులు, నుదురు, మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. తరువాత డై పడినా నీటితో కడిగితే పోతుంది. ఇవి చదవండి: Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి! -
గులాబీ రేకులతో స్వీట్ : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
గులాబీ పువ్వులు సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేదం చెబుతోంది.గుల్కంద్ అనే పదం గుల్ నుండి వచ్చింది. దీని అర్థం పెర్షియన్ భాషలో 'పువ్వు' అరబిక్లో 'కంద్' అంటే 'తీపి'. ముఖ్యంగా ఈ వేసవిలో గులాబీ రేకుల జామ్ లేదా గుల్కంద్ వల్ల ఒంటికి చలవ చేస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫిట్గా ఉంచే అద్భుతమైన టానిక్లా పనిచేసే గుల్కంద్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు.. లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గులాబీ రేకులు వెడల్పుమూత ఉన్న గాజు సీసా, లేదా జార్ యాలకులు గులాబీ రేకులను బాగా ఎండబెట్టాలి. ఎండిన వాటిని ఒక గాజు సీసాలో వేసి, దానికి కొద్దిగా చక్కెర, యాలకుల పొడి కలుపుకోవాలి. గాజు సీసాను ప్రతిరోజూ దాదాపు ఏడు గంటలపాటు ఎండలో ఉంచాలి. మళ్లీ రాత్రికి చెక్క స్పూన్తో లేదా తడిలేని గరిటెతో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా దాదాపు నెల రోజుల పాటు ఇలా చేయాలి. దీంతో జామ్లాగా ఇది తయారవుతుంది. దీన్ని పలు రకాల స్వీట్లలో వాడతారు. అలాగే ఫ్రూడ్ సలాడ్లలో వాడవచ్చు. కాస్త చల్లటి పాలు తీసుకుని అందులో ఒక చెంచా గుల్కంద్ వేసి తాగవచ్చు. అలాగే దీన్ని నేరుగా లేదా తమలపాకులతో కూడా తినవచ్చు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఈ గులాబీ గుల్కంద్ ఆయుర్వేద ప్రకారం పిత్త దోషాలకు చాలా మంచిది. వేడిని పుట్టిస్తుంది. చల్లగా ఉండేలాగా కూడా పనిచేస్తుంది దద్దుర్లు, నొప్పులు ,నొప్పులు వంటి వేడి-సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది , అరికాళ్ళు అరచేతులలో ఏవైనా మంటలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది కాలక్రమేణా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందుకే దీన్ని తాంబూలంలో కూడా ఎక్కువగా వాడతారు. రక్తహీనతను నివారిస్తుంది, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ఇది చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది కప్పు పాలలో వేసి రాత్రిపూట తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది చర్మం త్వరగా ముడతలు పడకుండా నివారిస్తుంది. మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది. గుల్కంద్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన అల్సర్లు, మలబద్ధకం, గుండె మంట సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. వేసవిలో గుల్కంద్ వాడటం వల్ల వడదెబ్బ, ముక్కు కారటం, తలతిరగడం వంటివి నివారించవచ్చు. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావానికి గుల్కంద్ మంచిది. ముఖ్యంగా పీసీఓడీతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది. థైరాయిడ్తో బాధపడేవారు కూడా ఈ జామ్ని చక్కగా తీసుకోవచ్చు -
గురక సమస్య అంతింత కాదయా! లైట్ తీసుకుంటే డేంజరే!
గురక సమస్యను చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారుగానీ, నిజానికి ఇది తీవ్రమైన స్లీప్ డిజార్డర్. గురకపెట్టేవారికి దాని ఇబ్బందులు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ పక్కనున్న వారికి అదో పెద్ద సమస్య. అసలు అంతపెద్దగా గురక పెడుతున్నామనేది కూడావారికి తెలియదు. వినేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది గురక శబ్దం ఎంత బిగ్గరగా ఉందో. అసలు గురక ఎందుకు వస్తుంది? గురక ఇచ్చే వార్నింగ్ బెల్స్ ఏంటి? తెలుసుకుందాం. నోటితోగాలి పీల్చుకోవడం, శ్వాసలో ఇబ్బంది ద్వారా నిద్రలో శ్వాస పీల్చుకునేటప్పుడు వచ్చే శబ్ధం.కొంత మందికి ఈ శబ్దం చిన్నగా గురక వస్తే మరి కొంత మందికి చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువగాఅలసిపోయినపుడు, అలర్జీలు, మద్యం సేవించడం, స్థూలకాయం ఉన్నవాళ్లకి గురక వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా గురక పెడతారు. అయితే ఈ గురక రోజూ వస్తోంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. దీర్ఘకాలిక గురక స్లీప్ అప్నియా కు దారి తీస్తుంది. ఈ స్లీప్ అప్నియా రెండు రకాలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA): గొంతు కండరాలు రిలాక్స్ అవుతూ ఊపిరితిత్తులలోకి గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇది పెద్ద వయసువారిలోనూ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో చాలా కామన్. అలాగే టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ సమస్య ఉన్న పిల్లలోలనూ , ఊబకాయం, మద్యం, ధూమపానం అలవాటు, మత్తుమందులు లేదా ట్రాంక్విలైజర్లనువాడేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గుండెకు రక్తప్రసరణ గుండె ఆగిపోవడం, అధిక రక్తపోటు ,టైప్ 2 మధుమేహం వంటివి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచే కొన్ని పరిస్థితులు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోన్ల రుగ్మతలు, ముందస్తు స్ట్రోక్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. సెంట్రల్ స్లీప్ అప్నియా (CSA), ఇది శ్వాసను నియంత్రించే కండరాలకు మెదడు సరైన సంకేతాలను పంపనప్పుడు సంభవిస్తుంది. పెద్ద,మధ్య వయస్కులు , వృద్ధులకు సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.సెంట్రల్ స్లీప్ అప్నియా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండె లోపాలు. రక్తప్రసరణ గుండె ఆగిపోయేప్రమాదాన్ని పెంచుతుంది.నార్కోటిక్ నొప్పి మందులను, ఓపియాయిడ్ ముఖ్యంగా మెథడోన్ వంటి దీర్ఘం కాలం తీసుకుంటే సెంట్రల్ స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచుతాయి. గురక సమస్యలు: సాధారణంగా గురక పెడుతూ నిద్రపోయే వారిలో రక్తం గడ్డకట్టడం, వయసు పెరిగే కొద్దీ వారి మెదడు శక్తిని వేగంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. శరీరానికి రాత్రి పూట అందాల్సిన ఆక్సిజన్ అందదు శరీర అవయవాల పనీతిరుకి ఆటంకం కలిగించొచ్చు. కొన్ని సందర్భాలలో తీవ్రంగా కణాల నష్టాన్ని కలిగిస్తుంది. ఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల మెదడులో కణాల పనీతీరును కూడా ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. గురకతో మధ్యలో లేవడం వల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. దీంతోపగటి పూట బద్ధకంగా, నిస్తేజంగా ఉండటమే కాదు, నిద్ర వస్తుంది. దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు వస్తాయి. గురక సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. నోట్. ఇది అవగాహనకు సంబంధించిన సమాచారం మాత్రమే. గురక సమస్యగా ఎక్కువగా బాధిస్తోంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఊబకాయులైతే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజూ యోగా ప్రాణాయామం లాంటివి చేయడం మంచిది. -
వందేళ్లనాటి కాను(టు)క ఇది : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
ఇంట్లో పసిపాప వస్తోంది అంటే చాలు అమ్మమ్మ, నానమ్మల హడావిడి మొదలవుతుంది. పొత్తిళ్లలో బిడ్డకు కావాల్సిన మెత్తటి బట్టలు సేకరించడం, పాపాయికి సౌకర్యంగా ఉండేలా పాత చీరలతో చేసిన బొంతలు తయారీ మొదలు, కాటుక, ఆముదం లాంటివి సిద్ధం చేసుకునేందుకు రడీ అయిపోయేవారు. సహజంగాఇంట్లోనే కాటుకునే తయారుచేసుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పత్తి దారంతో కొద్దిగా వామ్ము గింజలు వేసి వత్తి తయారు చేసిన దాన్ని ఆవ నూనెలో ముంచి మట్టి ప్రమిదలో దీపం వెలిగించింది. దానిపై వెడల్పాటి మూతను పెట్టింది. వత్తి మొత్తం కాలి ఆ మసి అంతా పళ్లానికి అంటుకుంది. ఈ మసిని తీసి కాజల్( కాటుక)గా తయారు చేసింది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆముదం, నూలు బట్ట సహాయంతో తమ నాన్నమ్మ, అమ్మమ్మ ఇలానే చేసేది అంటూ నెటిజన్లు గుర్తు చేసు కున్నారు. ఇందులో కెమికల్స్ ఉండవు. పైగా చిన్నపిల్లలకు కంటికి శీతలం కూడా అని వ్యాఖ్యానించారు.సహజమైన పదార్థాలతో ఇంట్లో తయారు చేసుకున్న కాటుక అయితే అందమైన అమ్మాయి కళ్ళు మరింత విశాలంగా బ్రైట్గా, బ్యూటీఫుల్గా మెరిసి పోతాయి. కళ్ళకి కాటుక పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు తొలగిపోతాయి. పైగా కాటుక పెట్టుకోవడం వల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా ఉంటుంది. Did you know this 100 years old technique of Kajal making? Ingredients: Cotton, Ajwain, Mustard Oil and Ghee… pic.twitter.com/K6rF6yRcal — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) April 15, 2024 నోట్: చాలావరకు డాక్టర్లు శిశువులకు కాటుక పెట్టవద్దని చెబుతారు. ఎందుకంటే రసాయనాలతో తయారు చేసిన కాటుకల వల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందనేది గమనించ గలరు. -
తొందరపడి లిప్ లాక్ చేస్తున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా?
ఇరువురు మనుషులు కలుసుకున్నపుడు చక్కని చిరునవ్వు, కరచాలనం, ఆత్మీయం ఆలింగనం ఇది సర్వ సాధారణం. మరికొన్ని చోట్ల ముద్దుగా బుగ్గలమీద చిన్న ముద్దుపెట్టుకోవడం ఒక అలవాటు. చిన్నారులను చూసినపుడు అందరమూ ముద్దు చేస్తాం. ఎదుటివారి పట్ల తమ ప్రేమను తెలియజెప్పేందుకు ఇలా చేస్తుంటాం. అదే ప్రేమికుల మధ్య ఈ ముద్దుల బంధం ఇంకొంచెం..మధురంగా ఉంటుంది. అయితే సినిమా కల్చర్ అనండీ..పాశ్చాత్య నాగరికత అనండీ.. ప్రేమికులతో పాటూ ఇతరులు కూడా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లిప్ టూ లిప్ ముద్దుల వల్ల లాభాల మాటేమో గానీ.. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉన్నాయంటున్నారు నిపుణులు. చిన్నపిలల్ల్ని ఇలా ముద్దు పెట్టుకోవడం చాలా అనర్థం. తీవ్ర అనారోగ్యం, ఫ్లూ, వైరస్ల బారిన పడిన వారితో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ♦ ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటివి ఇతర అంటు వ్యాధులు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. ♦ ఈ రకం ముద్దుల వల్ల మోనోన్యూక్లియోసిస్, మెనింజైటిస్ వంటి వైరస్లను వ్యాపింపజేస్తుంది. మోనో వైరస్ కారణంగా కొందరిలో ఆరు నెలల పాటు విపరీతమైన అలసట వంటి లక్షణాలుంటాయి. ♦ మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధిలు కూడా వ్యాప్తిస్తాయి. ♦ క్లామిడియా గనేరియా వంటి లైంగిక సమస్యలు కూడా రావచ్చు. లైంగిక వ్యాధులు కూడా చాలా తొందరగా వ్యాప్తిస్తాయి. ♦ స్వీడిష్ సర్వే ప్రకారం, అలెర్జీ ఉన్న వారిని ముద్దుపెట్టుకునే 12 శాతం మందికి అలెర్జీ త్వరగా సోకుతుంది. దురద, వాపు వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా లిప్ టూ లిప్ కిస్సులకు దూరంగా ఉండాలి. ♦ పంటి, చిగుళ్ల సమస్యలు కూడా వచ్చే అవకాశాలన్నాయంటే నమ్ముతారా? తీవ్ర చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు. ♦ న్యూమోనియా వంటి బ్యాక్టీరి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చివరిగా మరోమాట ఇలాంటి వేవీ గమనించకుండా తొందరపడితే దద్దుర్లు, ముఖం వాపు, శ్వాస ఆడకపోవడం, ఒక్కోసారి వాంతులు కూడా సంభవించవచ్చు. -
వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వేసవి కాలంలో ఎండల ప్రతాపాన్ని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఎండలో సాధారణంగా బయటికి రాకుండా ఉండటంమంచిది. అలాగే ఎక్కువ నీళ్లు తాగాలి. వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని పానీయాలను తీసుకోవాలి. ఈ విషయంలో మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా కాస్త చవగా అందరికీ అందుబాటులో ఉండేది కూడా. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూద్దాం! ► అద్భుతమైన ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాల గని మజ్జిగ. వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అధిక ఉష్ణంనుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. ► పల్చటి మజ్జిగలో నిమ్మకాయ,కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కాస్తంత కొత్తమీర, పుదీనా కలుపుకుని తాగితే మరీ మంచిది. రుచికీ రుచీ తగులుతుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ► మజ్జిగ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ► ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణసమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. సౌందర్య పోషణలో ►చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ►మజ్జిగలో పెద్ద మొత్తంలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (AHA) చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది, చర్మంపై నల్ల మచ్చలు , టాన్డ్ ప్యాచ్లకు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. ► కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి. ► కాల్షియం, విటమిన్స్ , ఇతరపోషక విలువల కారణంగా మజ్జిక కొన్ని రకాల జబ్బులను నివారిస్తుంది. -
లోటస్ సీడ్స్ : అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!
లోటస్ లేదా తామర అనేది నెలంబో జాతికి చెందిన మొక్క. దీని గింజలను లోటస్ సీడ్స్, తామర గింజలు, మఖానా (ఫాక్స్నట్స్) అంటారు. సుమారు 7000 సంవత్సరాలుగా దీన్ని పూజల్లోనే ఔషధంగా కూడా ఉపయోగ పడుతోంది. ఒక విధంగా బాదం, జీడిపప్పు , ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఎండ బెట్టిన తామర గింజలను మంచి పోషకాహారం, ఔషధంగా వినియోగిస్తున్నారు. ఒకటి తెల్ల, రెండు గోధుమ రంగులో ఉన్న లోటస్ విత్తనాలు భారతదేశం, జపాన్ , చైనాలలో విస్తృతంగా సాగవుతున్నాయి.లోటస్ ఫుడ్ను ఆహారంగా చైనా ఆమోదించింది. లోటస్ గింజలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి. తామర గింజల వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం ♦ నిద్రలేమి, జ్వరం ,హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు సాంప్రదాయకంగా తామర గింజలను ఉపయోగిస్తారు. ♦ లోటస్ గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిట్యూమర్ ఎఫెక్ట్లతో సహా వివిధ ఔషధ కార్యకలాపాలను కలిగి ఉంటాయి. ♦ విరేచనాలు ,విరేచనాలు వంటి జీర్ణశయాంతర రుగ్మతలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ సంతానోత్పత్తి , లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ♦ ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. ♦ తేలికగా బరువు తగ్గాలనుకునే వారు లోటస్ సీడ్స్ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ♦ తామర పువ్వు వేర్లలో అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ♦ విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ,ఐరన్ ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ♦ 100 గ్రాముల మఖానాలో, 9.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ♦ లోటస్ సీడ్స్ లేదా ఫాక్స్ నట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది యాంటి ఏజింగ్ ఎలిమెంట్గా పనిచేస్తుంది. ♦ తామర గింజల్లో కెంప్ఫెరోల్ అనే సహజ సమ్మేళనం ఆర్థరైటిస్ రుమాటిజం రోగుల్లో వాపులను నివారిస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు ఇది మంచిది. ♦ గ్లూటెన్ రహిత పదార్తాలకు ప్రత్యామ్నాయంగా మఖానాను తినవచ్చు. -
కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి!
ఊబకాయం, లేదా ఒబెసిటీ అనేక రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్ లాజ్ జర్నీ అనుకున్నంత ఈజీకాదు. దీనికి పట్టుదల, జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం తప్పనిసరి. ఈ క్రమంలో చెడు కొలెస్ట్రాల్కి చెక్ చెప్పే కొన్ని సహజమైన జ్యూసెస్ గురించి తెలుసుకుందాం. కరివేపాకు: ప్రతి వంటలోనూ కరివేపాకును ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ కరివేపాకు రాసం తాగడం వల్లన కొలెస్ట్రాల్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా కడగాలి. చీడపీడలు లేని ఆకులను తీసుకోవాలి. కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్లో చేర్చుకోవచ్చు. కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. నేరేడు ఆకులు : మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇదిసిరల్లోపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది. జామున్ ఆకులను శుభ్రంగా ఎండ బెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు త్రాగవచ్చు. మెంతి ఆకులు: మెంతి కూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. తులసి ఆకులు : తులసి పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పినివారణలో బాగా పనిచేస్తుంది. అలాఏగ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా చాలా మంచిది. అలోవెరా: కలబందప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ ఇది చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా గుజ్జును తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా ఇది దివ్యౌషధం. పైన పేర్కొన్న వాటి అన్నింటిలో కావాలంటే కొత్తిగా తేనెను యాడ్ చేసుకోవచ్చు. నోట్: ఈ సూచనలు అన్నీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
Ugadi 2024: ఉగాది పచ్చడి ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
#Ugadi 2024 తెలుగువారి తొలి పండుగ ఉగాది అంటేనే ఆనందం. ఉత్సాహం. కొత్తకు నాంది అనే సంబరం. ముఖ్యంగా ఉగాది అనగానే తీపి, చేదు, లాంటి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అందరికీ గుర్తొస్తుంది. ప్రతి పదార్ధం జీవితంలోని విభిన్న అనుభవాలకు గుర్తుగా అమృతం లాంటి జీవితాన్ని ఆస్వాదించే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఉగాది పచ్చడికి అంత ప్రాధాన్యత. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్తగా ఆరంభించ డానికి ఇది శుభతరుణమని భావిస్తారు. ఉగాదికి పులిహోర, బొబ్బట్లు, పూర్ణం బూరెలతోపాటు ఉగాది పచ్చడి చేయడం అనవాయితీ. అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చడి ఇలా.. పచ్చి మామిడికాయ – ఒకటి (మీడియం సైజు) వేప పువ్వు – టేబుల్ స్పూన్ (తొడిమలు ఒలిచినది) కొత్త చింతపండు – నిమ్మకాయంత (రసం చిక్కగా తీసుకోవాలి) బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్ మిరియాలు లేదా మిరియాల పొడి అర టీ స్పూన్ లేదా రెండు చిన్న పచ్చిమిర్చి తయారీ: పచ్చి మామిడి కాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి. ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం టేబుల్ స్పూన్ కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉగాది పచ్చడి.స్పూన్తో అరచేతిలో వేసుకుని తినేటట్లు చిక్కగా ఉంటుంది. తెలంగాణలో తెలంగాణలో ఇదే మోతాదులో తీసుకున్న దినుసులను ఒక పెద్ద పాత్రలో వేసి ముప్పావు వంతు నీటిని పోసి కలపాలి. గ్లాసులో పోసి తాగేటట్లు జారుడుగా ఉంటుంది. పిల్లలు మెచ్చేలా..! ఉగాది పచ్చడి ప్రాశస్త్యాన్ని పిల్లలకు చెబుతూనే , వారికి నచ్చే విధంగా ఉగాది పచ్చడిని ఫ్రూట్ సలాడ్లా కూడా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడిలో వేసే ఆరు రకాల పదార్థాలతో సంప్రదాయ బద్ధంగా ఉగాది పచ్చడిని చేసుకొని, అందులోనే అరటిపండు, యాపిల్, ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవచ్చు. దీనికి కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకుంటే మరీ జారుగా కాకుండా, చక్కగా స్పూన్తో తినేలా ఫ్రూట్ సలాడ్లా భలేగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రస్టింగ్గా తింటారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మన అందరి జీవితాల్లో శాంతిని, సుఖ సంతోషాలను కలగ చేయాలని, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం.! -
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
త్వరగా బిడ్డ పుట్టాలంటే.. ఈ ఆహారం ట్రై చేయండి!
మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో పెళ్లి అయిన ఏడాదిలోపు బిడ్డ కడుపున పడాలని కోరుకునేవారు. సాధారణంగా అలా జరిగేది కూడా. కానీ మారిన పరిస్థితులు, ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందిలో సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారింది. లైఫ్స్టయిల్, చేస్తున్న ఉద్యోగాలు తదితర కారణాల రీత్యా పిల్లలు పుట్టడం ఆలస్యమవుతోంది. అయితే చక్కటి లైంగిక జీవితంతోపాటు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం అవసరం. కొన్ని ఆహారాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.. తల్లి కావాలనుకునే మహిళలకు పోషకాలు, ఫోలిక్యాసిడ్,ఫోలేట్, కాల్షియం ఐరన్ పుష్కలంగా కావాలి. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, బ్రోకలీ, బోక్ చోయ్, కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. వీటిని ఆలివ్ నూనెలో వేయించుకుని, సైడ్ డిష్గా తినండి లేదా సూప్లు, సలాడ్లు, క్యాస్రోల్స్ మరియు ఆమ్లెట్లలో యాడ్ చేసుకోవాలి. కాల్షియం పునరుత్పత్తి వ్యవస్థ సజావుగా పని చేసేలా చేస్తుంది. వేగంగా గర్భం దాల్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే పుట్టబోయే బిడ్డకు అవసరమైన కాల్షియం నిల్వలు పెరుగుతాయి. సంతానోత్పత్తి స్థాయిని పెంచడానికి, మహిళలు తమ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలో విటమిన్ "బి", ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, విటమిన్ "సి" సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బీన్స్లో లీన్ ప్రొటీన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మహిళల సంతానోత్పత్తిని పెంచుతుంది. శరీరంలో ఐరన్ లోపం సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బీ6 ఇందులో తగినంత పరిమాణంల ఉంటాయి.సంతానోత్పత్తి హార్మోన్లను పెంచడంలో అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ త్వరగా గర్భం దాల్చడానికి తోడ్పడతాయి. విటమిన్ "సి" పుష్కలంగా ఉండే పండ్లను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. నోట్: పిల్లలు పుట్టాలంటే దంపతుల ఆరోగ్యం చాలా ముఖ్యం. పీరియడ్ సైకిల్ను, ఓవులేషన్ పీరియడ్ను సరిగ్గా అర్థం చేసుకోని ఆ సమయానికి శారీరక కలయిక చాలా కీలకం. ఒక వేళపిల్లలు పుట్టడం లేట్ అయితే.. నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. మహిళలైతే గర్భసంచిలో, ఫాలోపియన్ ట్యూబ్స్లో అడ్డంకులను గైనకాలజిస్ట్ అంచనా వేస్తారు. పురుషుల్లో అయితే వీర్య కణాలు, వాటి కదలికలు, సామర్థ్య పరీక్షలుంటాయి. అలాగే సహజంగా పిల్లలు కలగరు అని తెలిసినా ఆందోళన అనవసరం. ఇపుడు అనేక ఆధునిక సాంకేతికలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మనం పెద్ద మనసు చేసుకోవాలేగానీ ఆదరించే ఆమ్మానాన్నల కోసం అనాథ పసి బిడ్డలు చాలామంది వేచి ఉన్నారనేది గుర్తుంచుకోవాలి! -
ఎల్లో అలర్ట్: ఈ పనులు అస్సలు చేయకండి!
వేసవి కాలం అన్నాక ఎండలు సాధారణమే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మండే ఎండలు, తీవ్రమైన ఉష్ట్రోగ్రతలనుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణాలో ఉష్ణోగ్రతలు 43°Cకి పెరగడంతో తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణ విభాగం-హైదరాబాద్ (IMD-H) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నేడు రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఈ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. Serious heat continues for 7th straight day 🔥🥵 More 3days to suffer, later we will move into pre monsoon rains, respite from heat from Apr 7 From Apr 6 itself storms will start, North, Central TG to get good storms in coming week 🌧️ One spell ahead in HYD during April 6-9 🌧️ pic.twitter.com/7KXOjnGQof — Telangana Weatherman (@balaji25_t) April 4, 2024 కనీస జాగ్రత్తలు వాతావరణానికి తగ్గట్టుగానే సహజం మన బాడీకూడా రియాక్ట్ అవుతుంది. ఎండకు దాహం వేస్తుంది. చల్లదనాన్ని కోరుకుంటుంది. కానీ వేసవిలో దాహం వేయకపోయినా, వీలైనంత వరకు నీరు తాగుతూ ఉండాలి. ఏ కాస్త అనారోగ్యంగా అనిపించినా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS)ని తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసంలో సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి కనుక శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసి పోయినప్పుడు బాగా పనిచేస్తుంది. అలాగే ఉప్పు కలిపి నిమ్మరసం, మజ్జిగ/లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇంట్లోనే తయారుచేసిన పానీయాలైతే ఇంకా మంచిది. తొందరగా వంట ముఖ్యంగా ఈ వేసవికాలంలో వంట ఎంత తొందరగా పూర్తి చేసుకొని అంత తొందరగా బయటపడితే మంచిది. లేదంటే ఆ వేడికి, ఉక్క బోతకు చెప్పలేనంత నీరసం వస్తుంది. దాదాపు 10 గంటలలోపు వంట ఇంటి నుంచి బయపడాలి. బాగా వెంటిలేషన్ ,చల్లని ప్రదేశాలలో ఉండండి. సాధ్యమైనంతవరకు ఎండకు బయటికి వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు. మరీ తప్పనిసరి అయితే తప్ప బయటికి రావద్దు. ఒక వేళ వెళితే ఉదయం 12 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తరువాత బైటి పనులకు సమయాన్ని కేటాయించుకోవాలి. ఎండలో బయటి వెళ్లి..తిరిగి వచ్చిన వెంటనే హడావిడిగా నీళ్లు తాగవద్దు.. కాస్త నెమ్మదించి, మెల్లిగా నీటిని తాగండి. అలాగే మరీ చల్లని నీళ్లను కూడా తాగకూడదు. ఆహారం పుచ్చకాయ, తర్బూజ నారింజ, ద్రాక్ష, పైనాపిల్ లాంటి పండ్లతోపాటు, నీరు ఎక్కువగా ఉండే అన్ని రకాల ఆకు కూరలు, దోసకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడి, టమాటా లాంటి కూరగాయలు తీసుకోవాలి. వేపుళ్లు, మసాలాల వాడకాన్ని కూడా తగ్గించాలి. పగటిపూట కిటికీలు , కర్టెన్లను మూసి వేయాలి. రాత్రికి చల్ల గాలికి తెరిచి పెట్టండి. దోమలు రాకుండా దోమలు తెరలు తప్పనిసరి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు మర్చిపోకూడదు. సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. ఎండనుంచి కాపాడుకునేలా తలను టవల్ , స్కార్ప్, టోపీ, చున్నీతో కప్పుకోవాలి. ఈ పనులు మానుకోండి ♦ ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుండి 03:00 గంటల మధ్య ఎండలో బయటికి రావద్దు. ♦ ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బాగా ఎక్కువ కష్టపడవద్దు. కాసేపు నీడ పట్టున ఉండి విశ్రంతి తీసుకోండి. ♦ చెప్పులు, గొడుగు లేకుండా బయటకు వెళ్లవద్దు. ♦ ఆల్కహాల్, టీ, కాఫీ , కార్బోనేటేడ్ శీతల పానీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ♦ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, మాంసాహారాన్ని మితంగా వాడండి. నిల్వ ఉన్న ఆహారాన్ని అస్సలు తినకూడదు ♦ పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను, పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దు. ఇలా చేయడం వేడికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అప్రమత్తత విపరీతమైన తలనొప్పి, జ్వరం, నీరసం, వాంతులు, విరోచనలు, గందరగోళం, మూర్చ, కోమా లాంటి సమస్యలను కనిపిస్తే వెంటనే సమయంలోని వైద్యులను సంప్రదించండి. ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలి ఆరుబయట పనిచేసే వ్యక్తులు; గర్భిణీ స్త్రీలు; మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు; శారీరకంగా అనారోగ్యం ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు,వృద్ధులను కుటుంబ సభ్యులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. -
అరటి పండు, పాలు కలిపితే అద్భుతం.. కానీ వీళ్లు జాగ్రత్త..!
అరటి పండు మంచి బలవర్ధకమైన ఆహారం. ముఖ్యంగా ఎదిగే ప్లిలలకు, తొందరగా శక్తిని పుంజుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. పాలుపౌష్టికాహారం. మరి అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరెండూ కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలున్నాయా అన్నది కూడా ప్రశ్న. ఈ మిల్క్ షేక్నుఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు.. ఒకసారి చూద్దాం. వేసవి కాలం వచ్చిందంటే..పిల్లలకు ఆటవిడుపు. పరీక్షలు అయిపోయిన తరువాత ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి వెరైటీగా చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు. సాయంత్రం అయితే చాలు ‘‘ఠండా..ఠండాగా కావాలి’’ అంటూ ప్రాణం తీస్తారు. ఈ క్రమంలో సులభంగా చేసుకోగలిగేది బనానా మిల్క్ షేక్ లేదా బనానా మిల్క్ స్మూతీ. రెండు బాగా పండిన అరటిపండ్లు, కప్పు పాలు వేసి మిక్సీలో వేసి, జ్యూస్ చేయాలి. దీనికి ఓ రెండు ఐస్ముక్కలు, కాస్తంత హార్లిక్స్.. డ్రైఫ్రూట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్లకి పైన బాదం జీడిపప్పు అలంకరించి ఇస్తే సరిపోతుంది. ఇష్టంగా తాగుతారు. మంచిపౌష్టికాహారం అందుతుంది. అరటిపండు, పాలతో కలిపిన జ్యూస్ పొటాషియం, డైటరీ ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిల్క్ ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున, ఎముకల ఆరోగ్యానికి చాలామంచిది. ఒక సాధారణ సైజు అరటిపండు 105 కేలరీలను అందిస్తుంది . అలాగు ఒక కప్పు పాల ద్వారా 150 కేలరీలు లభిస్తాయి. అంటే దాదాపు ఒక రోజుకు ఒక మనిషికి ఇవి సరిపోతాయి. బరువు పెరగాలనుకునేవారికి చాలా మంచిది. పాలలో బరువు పెరగడానికి అవసరమైన ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు కండరాలు, ఎముకలను బలిష్టం చేస్తాయి. అరటిపండు , మిల్క్ డైట్తో బరువు పెరగాలనుకుంటే, బనానా మిల్క్ స్మూతీకి ప్రోటీన్-రిచ్ ఐటమ్లను యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, ప్రొటీన్ పౌడర్లు, చియా సీడ్స్ ఉన్నాయి. ఇంకా కోకో పౌడర్ లేదా చాక్లెట్ సిరప్ కూడా కలుపుకోవచ్చు. అలాగే బరువుతగ్గాలనకునేవారికి ఇది మంచిటిప్. పొట్టనిండినట్టుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. అయితే ఆయుర్వేద ఆహార సూత్రాల ప్రకారం పాల, అరటిపండ్లు కలపితే విరుద్ధమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పాలు, అరటిపండ్లు కలిపి తినడం ఆస్తమా రోగులకు అస్సలు మంచిది కాదని చెబుతోంది. ఎందుకంటే రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్లేష్మం, దగ్గు, ఆస్తమా సమస్యలు తీవ్రమవుతాయి. ఎవరు దూరంగా ఉండాలి? ♦ అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తినకుండా ఉండటమే మంచిది. అలర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు, పాలకు కూడా దూరంగా ఉండాలి. ♦ సైనసైటిస్తో బాధపడేవారు పాలు లేదా అరటిపండ్లు కలిపి తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ♦ పాలు, అరటిపండ్లు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండేందుకు రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. సమస్య ఉన్నవాళ్లు అరటిపళ్లు,పాలను విడివిడిగా తీసుకోవచ్చు. -
వెల్లుల్లితో మొటిమలు మటుమాయం? నిపుణులు ఏమంటున్నారు?
వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది.వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మ్యాజిక్ క్యూర్పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం.నిపుణుల మాట► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి.► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి.►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు. -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి.ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి.తాజా కూరలు, పళ్లుకూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది.ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు.వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి.ఇతర జాగ్రత్తలుమరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
సమ్మర్ : ఈ జాగ్రత్తలు మర్చిపోతున్నారా?
ఏప్రిల్ మాసంలోకి ఎంటరై పోయాం. మండే ఎండలకు సిద్ధం కావాలి. రాబోయే రోజుల్లో వేసవి తాపం గురించి వాతావరణ నిపుణులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వసవిలోత తాపానికి తట్టుకొని నిలబడే ఆహారాన్ని తీసుకుంటూ,దానికి తగినట్టుగా జీవన శైలిని మార్చుకోవాలి. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేలా, బాడీ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. వేసవిలో మాంసాహారాన్ని తగ్గించుకుంటే మంచింది. దీనికి బదులుగా తేలికగా జీర్ణమయ్యే తాజా కూరగాయలను ఎక్కువగా తినాలి. తాజా కూరలు, పళ్లు కూరగాయల్లో అన్ని రకాల ఆకు కూరలతోపాటు, దోసకాయ, కీరా, బీరకాయ, గుమ్మడి, టమాటా, బెండ, లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఫ్రూట్స్లో పుచ్చకాయ, జామ, పైనాపిల్, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లు కొవ్వు పదార్ధాలను విచ్ఛిన్నం చేస్తాయి, జీర్ణక్రియకు సహాయ పడతాయి. అలాగే బాడీకి చల్లదనాన్నిస్తాయి. నిమ్మ, పుదీనా - చల్లదానికి నిమ్మ పుదీనా చాలా మంచిది. ఈరెండూ కలిస్తే ఏ పానీయమైనా రిఫ్రెష్ అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు,మజ్జిగ : వేసవిలో ఎంత నీరు తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్లు సహజ ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ప్రత్యేకించి ఎండకు బాగా అలసిపోయినప్పుడు బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు - ఉల్లిపాయలు చలవగా చాగాబాగా పని చేస్తాయి. వడదెబ్బ నుంచి ఉల్లిపాయలు కాపాడతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే దీన్ని పచ్చిగా, రైతా, సలాడ్లు , చట్నీలలో వాడుకోవచ్చు. వేడిని పెంచే కొన్ని ఆహార పదార్థాలు వేరుశెనగ , క్యారెట్లు, గుడ్లు, మాంసాహారం లాంటి వాటిల్లో పోషకాలు అధికం కాబట్టి జీర్ణం కావడం లేటవుతుంది. వీటికి శరీరంలో వేడిని పెంచే శక్తి ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అల్లం, వెల్లుల్లి, ఇతర మసారా దినుసులను బాగా తగ్గించాలి. యాంటీ ఆక్సిడెంట్లులో పుష్కలంగా ఉండే అల్లం, వెల్లుల్లి, శరీరంలో వేడిని పెంచుతాయి. గుండెమంట, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలున్నవారు ఈ వేసవిలో జాగ్రత్తగా ఉంటే బెటర్. వేసవి వచ్చింది కదా అని పచ్చళ్లు తెగ తినేయకూడదు. కొత్త ఆవకాయ లాంటి పచ్చళ్లను మితంగా తీసుకోవాలి. ఇతర జాగ్రత్తలు మరీ అవసరం అయితే ఎండకు వెళ్లకుండా ఉండాలి. ఉదయం 12 తరువాత బయటికి వెళ్లవద్దు. సాయంత్రం పనులను 4 గంటల తరువాత ప్లాన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే.. గొడుగు, స్కార్ఫ్, తలపై కప్పుకోవాలి. లేదా టోపీ పెట్టుకోవాలి. వ్యాయామం చేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెంట నీళ్ల బాటిల్ తీసుకుపోవాలి. ఒకవేళ ఎండకు వెళ్లి వచ్చిన తరువాత బాగా నలతగా, అలసటా అనిపించినా అప్రమత్తం కావాలి. తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలొస్తే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలు, పెద్దల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. -
సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు!
వేసవి ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎండల్ని తట్టుకునేలా మన జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మన శరీరానికి చల్లదనాన్ని, పోషకాలు అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో ప్రధానమైంది ఫర్మెంటెడ్ రైస్, లేదా పులియ బెట్టిన పెరుగున్నం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఒకసారి చూద్దాం.! పులియబెట్టినపెరుగన్నంతో ప్రయోజనాలు వేసవిలో పెరుగు అన్నం లేదా రాత్రంతా పెరుగులో పులియబెట్టిన అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో విటమిన్ సితో పాటు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి పెరుగు అన్నంలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. కడుపులో చికాకు, అజీర్ణం లాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపులో కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా, సౌకర్యవంతంగా జీర్ణమవుతుంది. కాల్షియం, బీ12 విటమిన్ డీ, ప్రోటీన్తో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఎదుగుతున్న పిల్లల్లో బలమైన ఎముకలు ,దంతాలకు కాల్షియం చాలా అవసరం. పిల్లలు ఇది అలవాటు చేస్తే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఈ పెరుగు అన్నం ఎలా చేసుకోవాలి ప్రోబయాటిక్ పెరుగు అన్నం చేయడం చాలా సులభం. వండిన అన్నాన్ని కొంచెం వేడిగా ఉండగానే ఒక గిన్నె (మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది) లోకి తీసుకోవాలి. ఇందులో పాలు పోసి తోడు పెట్టాలి. ఇష్టం ఉన్నవాళ్లు ఇందులో ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానికి అదనపు పోషకాలతో చక్కగా పులిసి ఉంటుంది. దీన్ని తాలింపు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినవచ్చు. టిప్: పచ్చిమిర్చి వేయకుండా నల్లద్రాక్ష, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు లాంటివి వేసి చక్కగా గార్నిష్ చేసి ఇస్లే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాదు బోలెడన్ని పోషకాలు కూడా లభిస్తాయి. -
హెల్త్: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి!
ఆరోగ్యంగా ఉండటానికి సరైన తిండి, శరీరానికి తగిన వ్యాయామాలతో పాటు కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే కొంతమంది జీవన శైలి, మానసిక ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోవడం లేదు. అటువంటి వారు నిద్రమాత్రలకు బదులు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చు. అరటి పండు.. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే సమయంలో అరటిపండును తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే గుణాలు శరీరంలోని ఒత్తిడిని సులభంగా తగ్గించి నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈరోజు అరటి పండ్లతోపాటు చెర్రీలను కూడా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంతమంది తరచుగా నిద్ర పోయినట్లే పోయి మేల్కొంటారు. అయితే ఇలాంటివారు చెర్రీస్తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నిద్రను మెరుగుపరిచేందుకు పైనాపిల్ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి నిద్రలేని సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్ను తీసుకోవాలి. పైనాపిల్లో మెలటోనిన్, విటమిన్ సి, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో జ్యూస్ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కివీ పండ్లు.. ద్ర సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు కూడా నిద్ర స్థాయులను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. యాపిల్.. యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్ తింటే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి పూట తినడానికి యాపిల్ అనేది బెస్ట్ స్నాక్గా చెపొ్పచ్చు. రాత్రి ఆకలి వేస్తే ఎలాంటి సందేహం లేకుండా యాపిల్ తినండి. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. నిద్ర అనేది బాగా పడుతుంది. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు హాయిగా నిద్ర పోయేలా చేస్తాయి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట బొప్పాయి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చదవండి: Summer Season: డీ హైడ్రేషన్తో ఇబ్బందా? నివారించండి ఇలా.. -
వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!
వేసవిలో బాడీని చల్లగా చేసే గోండ్ కటీరా గురించి విన్నారా? ఇది ఎడిబుల్ గమ్. దీని వలన ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలను బలంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శక్తిని పెంచుతుంది. గోండ్ కటీరా మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..! గోండ్ కటీరా అనేది తినగలిగే గమ్. ఇది కిరాణా షాపుల్లో, ఆన్లైన్లో కూడా దొరుకు తుంది. వేసవిలో చల్లదనం కోసం దీన్ని తాగితే, చాలా లాభాలున్నాయి. గోధుమ బంక లేదా బాదాం బంక అనే పేర్లతో ప్రసిద్ధి. దీన్ని ఆస్ట్రాగాలస్ ప్రొపింకస్ అనే నాచు రకం మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. ఇది పౌడర్ లేదా క్యాండీ రూపంలో లభిస్తుంది. గోండ్ కటీరా జ్యూస్ ముందుగా ఈ గమ్ను కొద్దిగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. దీంతో ఇది ఒక జెల్లాగా తయారవుతుంది. దీన్ని ఒక గ్లాస్లో తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా తరగిన పుదీనా వేసుకోండి. ఇక చివరగా కాస్తంత నిమ్మరసం కలుపుకొని, గ్లాసు నిండా నీళ్లు పోసుకొని చక్కగా తాగెయ్యడమే. కావాలంటే ఒకటి రెండు ఐస్క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీని పౌడర్ను పాలలో కలుపుకొని తాగటం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. గోండ్ కటీరా ఆరోగ్య ప్రయోజనాలు: ఆయుర్వేద వైద్యంలో దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జిగురు లాంటి పదార్ధమైన గోండ్ కటిరా రుచికరమైంది ఇది అనేక పోషకాలతో నిండి ఉంది. అందుకే పంజాబ్లో రుచికరమైన గోండ్కే లడ్డూ, పిన్నియాన్ బాగా పాపులర్. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువ. అందుకే ప్రేగు కదలికలను సులభంచేసి మలబద్ధకానికి మంచి ఉపశమనంగా పని చేస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో ప్రయోజనకరమైన సప్లిమెంట్గా పనిచేస్తుంది. తల్లి, పిండం ఇద్దరికీ ఆరోగ్యకర మైన ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకాలు అధికం కాబట్టి బాలింతల్లో పాలను వృద్ధి చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మిశ్రమమైన ఇది శక్తిని పెంచుతుంది పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిది. పురుషులలో కొన్ని పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళల్లో పీరియడ్ సమస్యలకూ మంచింది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇందులోని కరిగే ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. -
రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!
ప్రకృతిలో వెదికి పట్టుకోవాలనే గానీ ఎన్నో ఔషధ మొక్కల నిలయం. సౌందర్య పోషణ దగ్గర్నించి, దీర్ఘకాల రోగా వలరు ఉన్నో ఔషధ గుణాలున్న మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. అలాంటి వాటిలో రణపాల ఒకటి. వాస్తవానికి రణపాల అలంకరణ మొక్కగా భావిస్తాం. కానీ ఆరోగ్య ప్రయోజనాలు కూడాచాలానే ఉన్నా యంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉంది. రణపాల శాస్త్రీయ నామం Bryophyllum pinnatum. దీని ఆకులు కాస్త మందంగా ఉంటాయి. రుచి కొద్దిగా వగరు, పులుపు సమ్మిళితంగా ఉంటుంది. ఆకు నాటడం ద్వారానే మరో మొక్కను అభివృద్ది చేసుకోవచ్చు. అంటే ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు రణపాలలో అధికంగా ఉన్నాయి రణపాల ప్రయోజనాలు ♦ ఆకు తినడం ద్వారా గానీ, కషాయం తయారు చేసి తీసుకోవడం ద్వారా, ఆకు పేస్ట్ను కట్టు కట్టడం ద్వారా గానీ చాల ఉపయోగాలను పొందవచ్చు. ♦ అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ♦ డయాబెటిస్ ని క్రమబద్దీకరిస్తుంది. ♦ కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. ఈ ఆకులను తింటే రక్తంలోని క్రియాటిన్ లెవల్స్ తగ్గుతాయి. ♦ జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను తగ్గించుకోవచ్చు ♦ ఆకులని వేడిచేసి గాయాలపై పెడితే గాయాలు త్వరగా మానుతాయి ♦ ఆకులని నూరి దాన్ని తలపై పట్టులా వేస్తే తల నొప్పి తగ్గుతుంది. ♦ రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుకలు రావడం ఆగుతుందట ♦ ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలు జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేస్తాయి. ♦ మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే మంచిది. ♦ రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గుతాయి. ♦ కామెర్లతో బాధపడేవారు రోజూ ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. నోట్: ఈ చిట్కాలను పాటించేటపుడు, రెగ్యులర్గా సంప్రదించే డాక్టర్, ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
హెల్త్: ఏంటీ అలసటగా ఉందా..? బహుశా ఇలా చేస్తున్నారా..!?
మనలో చాలా మంది పొద్దున్నే నిద్ర లేవడానికి ఫోన్లో రెండు మూడు అలారాలను సెట్ చేస్తారు. కానీ, వాటిని కట్ చేసి మళ్లీ పడుకుంటారు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటుంది. ఆ తర్వాత తమని తాము తిట్టుకుంటూ ఉంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి లభించక ఇలా అవుతోందా? లేక నిజంగానే బద్ధకంగా ఉంటుందా? బద్ధకానికి, విశ్రాంతికి విభజనరేఖ ఏమిటి? ఉత్సాహకరమైన ఉదయాన్ని ప్రారంభించడానికి నిద్ర మంచం మీద నుండి లేవడం అనే కష్టం నుంచి బయటపడటానికి సులువైన టెక్నిక్స్ కొన్నిటిని తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు అలారం సెట్ చేసి పెట్టుకుంటారు. ఉదయాన్నే ఆ అలారం మోగగానే మెలకువ వచ్చినా, లేవకుండా అలారం ఆఫ్ చేసి మళ్లీ పడుకుంటారు. నిద్ర రాకపోయినా అలాగే పడక నుంచి బయటకు రాకుండా ఉంటారు. దీంతో నిద్ర పోకపోయినా అలాగే పడుకోవడం వల్ల సమయం వృథా అవుతుందని నమ్ముతారు. అయితే విశ్రాంతి కోసం కొంత సమయాన్ని బద్ధకంగా గడిపినా ఫర్వాలేదు. కానీ, విశ్రాంతి కోసం పనిని పక్కన పెట్టడం వల్ల ఇబ్బందుల్లో పడవచ్చు. స్క్రీన్.. కలిగించే ఒత్తిడి చాలా మంది బెడ్ మీద ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడటం, మెయిల్స్ లేదా సోషల్ మీడియా వార్తలు చూడటం చేస్తుంటారు. దీనివల్ల కొంత సమయం బాగానే గడిచిపోతుందని అనిపించవచ్చు. విశ్రాంతి పొందుతున్నాం అనే భావన కూడా కలగవచ్చు. కానీ ఎక్కువసేపు పడుకుని స్క్రీన్ని, అందులోని సమాచారాన్ని చూడటం వల్ల బ్రెయిన్ ఒక విధమైన అసౌకర్యానికి, ఒత్తిడికి లోనవుతుంది. ఉదయం లేస్తూనే ఫోన్ తీసుకొని వచ్చిన నోటిఫికేషన్లు, మెసేజ్లు చూసే అలవాటును వదులుకోవాలి. మీతో మీరు.. రోజువారీ దినచర్యను ఎలాప్రారంభించాలో తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. మంచం మీద నుంచి లేచి, బయటకు వచ్చిన వెంటనే ఒత్తిడిని పెంచే పనులను ప్రారంభించవద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి. ఈ సమయంలో ప్రశాంతతను కలిగించే సంగీతాన్ని వింటూ సులభంగా చేయదగిన పనులను ఎంచుకోవాలి. ఈ విధానం వల్ల ఆ రోజు మొత్తంలో చేయదగిన పనులను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అరగంట లోపు ఓకే! ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు అలాగే పడుకోవడం దినచర్యలో భాగమైతే ప్రతిరోజూ చేయవచ్చు. నిద్రలేచిన తర్వాత ఎంతసేపు మంచం మీద పడుకోవాలో నిర్ణీత నియమాలు లేవు. అయితే, 15 నుంచి 30 నిమిషాల తర్వాత బెడ్ను వదిలేయడం మంచిది. శరీరం మాట వినాలి విశ్రాంతి నిద్రకు ప్రత్యామ్నాయం కాదు. కానీ, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మంచిగా అనిపిస్తే అది నిద్రతో సమానంగా లేకపోయినా కచ్చితమైన ప్రయోజనాలను పొందవచ్చు. విశ్రాంతి అవసరమైతే శరీరం మాట వినిపించుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి అనిపించినప్పుడు దానిని పాటించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. కొంతమంది వారాంతాల్లో రోజంతా మంచం పైనే బద్ధకంగా దొర్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏ పనీ చేయలేకపోయాం అనే అపరాధ భావనకు లోనవుతారు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికాక కొత్త చిక్కులు ఎదురయే ప్రమాదం ఉంది. అందువల్ల నిద్రపోవాలి అని అనిపించిన ప్పుడు నిద్ర పోవడమే మంచిది. మంచి నిద్ర కోసం.. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా, తిరిగి ఉదయం నిద్రలేచేలా స్థిరమైన షెడ్యూల్ని పాటించాలి. వారాంతాల్లో కూడా ఇదే నియమాన్ని పాటించాలి. నిద్రపోయే ముందు వేడినీటి స్నానం, ధ్యానం, పుస్తకం చదవడం, సంగీతం వినడం ప్రయోజనకరం. నిద్రపోయే ముందు మొబైల్ను దూరంగా ఉంచాలి. సోషల్ మీడియాను చూడటం పూర్తిగా మానుకోవాలి. త్వరగా జీర్ణం కాని ఆహారం, కెఫిన్, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఇవి చదవండి: వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలివిగో! -
సమ్మర్లో వేడి నీళ్ల స్నానమా? ఈ సర్ప్రైజింగ్ విషయాలు తెలుసా?
ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా స్నానం చేయడం దాదాపు అందరికీ అలవాటు. కొందరు వేడి నీటితో, మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడి నీటి ( మరీ వేడి నీళ్లు కాదు) స్నానంతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి సీజన్ ఏదైనా వామ్ వాటర్తో స్నానంతో శరీరం, మనస్సు సేద తీరుతాయి. మరి వేడి నీటి స్నానంతో ఇంకా ఎలాంటి ప్రయో జనాలున్నాయో చెక్ చేద్దామా? చలికాలంలో వేడి స్నానం చేయడం కామన్. కానీ వేసవిలో కూడా వేడి నీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అన్ని సీజన్లలో వేడి స్నానం చేయడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుండెజబ్బులు, అధిక బీపీ ఉన్న వారు కొంచెం అప్రతమత్తంగా ఉండాలి. కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది రోజంతా పనిచేసి అలిసిపోయిన శరీరానికి, కండరాలకు వేడి నీటి స్నానం హాయినిస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు. కీళ్లకు ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించడంలోసహాయపడుతుంది ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి చాలా కామన్ అయిపోయింది. అందువల్ల, మనస్సు ప్రశాంతంగా, పూర్తిగా రిలాక్స్గా ఉండాలంటే వేడి స్నానం ఉత్తమం. ఇందులో ఎప్సమ్ లవణాలు, మంచి సువాసన గల నూనెలు కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల వల్ల చర్మ రంధ్రాలు తెరుచు కుంటాయి .పేరుకుపోయిన మురికి, శరీరం శుభ్రపడి, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అందరికీ ఆరోగ్యకరమైన చర్మాన్నే కోరుకుంటారు. ఇందుకోసం కొంతమంది సౌందర్య సాధనాలు ఆశ్రయిస్తారు. కానీ, రోజువారీ వేడి స్నానంలో రహస్యాన్ని మర్చిపోకూడదు. వేడినీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి, చర్మ కణాలలో ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా మృదువైన స్కిన్ సొంతమవుతుంది. ఏర్పడుతుంది. రక్త ప్రసరణకు: శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్ని శరీర భాగాల సరైన పనితీరు సరైన రక్తప్రసరణచాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది కీలకం. మంచి నిద్రకు: వేడి నిటి షవర్ కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా. దీని ఫలితంగా ప్రశాంతమైన మెదడు మెలటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. జుట్టుకు: జుట్టుకు చాలా ప్రయోజనకరం. స్కాల్ప్ లోని సూక్ష్మ రంధ్రాలు ఓపెన్ అయ్యి, తేమ లోపలికి వెళ్లేలా చేస్తుంది. స్కాల్ప్ను శుభ్రనడుతుంది. బాగా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకే కాదు, చుండ్రు లాంటి నిరోధానికి కూడా కీలకం. ఇక శీతాకాలంలో అయితే జలుబు , ఫ్లూ బారిన పడటం చాలా సాధారణం. అందుకే వేడి షవర్ తలనొప్పి, ముక్కు దిబ్బడ, జలుబుకి మంచి ఉపశమనం. టిప్: ఎప్సమ్ లవణాలు, 10 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్,అర కప్పు బేకింగ్ సోడా కలుపుకొని వారానికి ఒకసారి 20 నిమిషాలు, హాట్ బాత్ టబ్లో కూర్చోండి. ఇది శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది. ఒత్తిడి సంబంధిత హార్మోన్లను తగ్గిస్తుంది, శరీర pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. -
కొబ్బరి బోండాం నీళ్లు, ఈ లెక్క తెలుసా మీకు!
వేసవి వచ్చిందంటే దాహార్తికి ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. కాస్త ఖరీదు ఎక్కువనిపించినా , కార్బోహైడ్రేట్లు, ముఖ్యమైన పోషకాలతో సహజంగా లభించే కొబ్బరి బోండాలు చాలా ఉత్తమం. ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా వీటిల్లో లభిస్తాయి. అయితే మనం కొబ్బరి బోండాలో నీరు ఎంత ఉంది అనేది ఎలా గుర్తుపట్టాలి? ఒకసారి పరిశీలిద్దాం. వామ్మో.. ఎండ సుర్రుమంటోంది.. దాహం.. కాస్త నీళ్లు ఎక్కువ ఉన్న బోండాం ఇవ్వు బాబు అనగానే.. కొబ్బరి బోండాలు అమ్యే వ్యక్తి ఏం చేస్తాడు? గుర్తుందా? కాయమీద కొట్టి చూస్తాడు.. లేదంటే కాయను పట్టుకొని ఊపి చూస్తాడు కదా. అంతే సింపుల్. దాదాపు మనం కూడా అలాగే చెక్ చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా కొబ్బరికాయ గుండ్రంగా, పెద్దగా ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉంటుంది.ఆకుపచ్చ రంగులో కాకుండా, ముదురు గోధుమ రంగులో ఉండే(ఇపుడు మార్కెట్లో లభిస్తున్న బెంగళూరు కాదు) ముదిరిన లేదా పండు కొబ్బరికాయలో నీరు తక్కువగా ఉంటుంది. కొబ్బరికాయను తీసి బాగా కదిలించినపుడు కూడా నీటి శబ్దం వినిపిస్తే .. సో అది కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో కొంచెం తీపి పుల్లని వగరు రుచి ఉంటుంది. త్వరగా పుల్లగా మారిపోతోంది. కాబట్టి తెరిచిన తర్వాత దానిని ఫ్రిజ్లో ఉంచి 24 గంటలలోపు తినాలి. అలాగే కొబ్బరి గుజ్జు సాంద్రతను కొలవడానికి టర్బిడిమీటర్ను ఉపయోగిస్తారట.ట్రాన్స్మిషన్ స్పెక్ట్రోఫోటోమీటర్గా, ‘‘విస్తా’’తో కొబ్బరినీళ్లను కొలుస్తారట. మరో విషయం ఏమిటంటే, ఇపుడు కొబ్బరి బొండాలుగా కాకుండా బాటిళ్లతో అమ్ముతున్నారు కాబట్టి వాటిని తీసుకోవచ్చు. లేదా దుకాణ దారుడి వద్ద మనమే బోండాలు కొట్టించుకుని, బాటిల్లో నింపుకోవచ్చు. అయితే ఈ నీళ్లను సాధ్యమైనంత తొందరగా సేవించాలి. లేదంటే పోషకాలు నష్టపోతాం. నిల్వ ఉండటం, పులిసిపోవడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. నోట్: కొబ్బరి నీళ్ల రుచి, సాంద్రత, ఎంత ఉన్నాయి, అలాగే గుజ్జు , టేస్ట్ తదితర అంశాలన్నీ ఆయా రకాలను బట్టి ఉంటుంది. -
బూడిద గుమ్మడితో ఇన్ని లాభాలా? కానీ వీళ్లు మాత్రం జాగ్రత్త!
ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నపేరు బూడిద గుమ్మడికాయ. వడియాలకోసమో, లేక గుమ్మానికి దిష్టికోసమో, స్వీట్కోసమే వినియోగించే గుమ్మడికాయ అనుకుంటే పొరబాటే. శరీరంలోని వ్యర్ధాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. పరగడుపున దీని జ్యూస్ తాగితే.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దీన్నే వింటర్మిలన్ అనీ, సంస్కృతంలో కుష్మాండ , బృహత్ఫల, ఘృణావాస, గ్రామ్యకర్కటి, కర్కారు అని కూడా అంటారు. ఇది ఆరిజన్ ఎక్కడ అనేదానిపై స్పష్టత లేనప్పటికీ జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో-మలేషియాలో పుట్టిందని ఊహిస్తున్నారు. అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద పానీయంగా భావించే గుమ్మడికాయ జ్యూస్తో ప్రస్తుతం, పొట్ట సమస్యలు, కాలేయ సమస్యలు , చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. చాలా మందికి రుచి నచ్చకపోవచ్చు, కానీ సప్లిమెంట్లు ఇతర ఆహార పదార్థాలలో లేని ఔషధ విలువలు ఇందులో చాలా ఉన్నాయి. గుమ్మడికాయ జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాలలో ఒకటి ఇందులోని బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తుందని నమ్మకం. బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ , కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సీ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. యాంటాసిడ్గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది బూడిద గుమ్మడికాయ రసంలో యాంజియోలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకుమంచిది. డిప్రెషన్, ఆందోళనతో బాధపడేవారికి చాలా మంచిది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్. కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫాట్ లక్షణాలు పైగా ఫైబర్ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఉబకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.గుమ్మడికాయలో విటమిన్ B3 అధికం. శక్తినిస్తుంది. రక్తంలో గ్లూకోజ్లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి మేలు చేస్తుంది. యాంటి ఏజింగ్గా పనిచేస్తుంది. ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ కేన్సర్గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది. ఎవరు తాగకూడదు ఈ ప్రపంచంలో ప్రతిదానికీ లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. దీర్ఘంకాలం తీసుకుంటే లోహ మూలకాలు పేరుకు పోతాయి. జ్వరంతో బాధపడుతున్నవారు, చలువ గుణం కలిగి ఉన్నందున జలుబుతో బాధపడుతున్న వారు తినకూడదు. బ్రోన్కైటిస్ ,ఆస్తమా పేషంట్లు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు వైద్యుల సలహా మేరకే దీన్ని తీసుకోవాలి. మితంగా తీసుకున్నంతవరకే ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుంది. ‘అతి సర్వత్రా వర్జయేత్’ దీన్ని మర్చిపోకూడదు. -
ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్!
బరువు తగ్గడం నుంచి చర్మం, జుట్టు సంరక్షణ దాకా ఆపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చళ్లు, మెరినేడ్స్ లాంటి వాటిల్లో కూడా విరివిగా వాడతారు. అయితే దీనిని తరచుగా ఉపయోగించడం మంచిదేనా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆపిల్ సైడర్ వెనిగర్(ACV) ఆపిల్ జ్యూస్ ఈస్ట్తో కలిపి పులియబెట్టి తయారు చేస్తారు. ఎక్కువగా డ్రెస్సింగ్, మెరినేడ్స్, పచ్చళ్ళలో వాడతారు. యాపిల్ సైడర్ వెనిగర్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు.అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల దుష్ర్పభావాలు కూడా ఉన్నాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై దద్దుర్లు, చికాకు కలుగుతాయి. అందుకే దీని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఈస్ట్ ఆపిల్లోని చక్కెరను ఆల్కహాల్గా మారుస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి సమస్యలొస్తాయి. అలాగే గ్యాస్ట్రోపరేసిస్తో బాధపడేవారిలో కడుపులోని నరాలు సరిగ్గా పనిచేయవు. గ్యాస్ట్రోపరేసిస్ (గుండెల్లో మంట, ఉబ్బరం వికారం) లక్షణాలు, టైప్-1డయాబెటీస్, ఇన్సులిన్ తీసుకునేవారిలో జీర్ణం ఆలస్యమవుతుంది కొన్ని మూత్రవిసర్జన మందులు, మధుమేహం మందులు, డిగోక్సిన్ ఇన్సులిన్-స్టిమ్యులేటింగ్ మందులు వాడేవారికి ఆపిల్ సైడర్ వెనిగర్తో రియాక్షన్ రావచ్చు. సుదీర్ఘ కాలం పాటు దీన్ని తీసుకుంటే బ్లడ్లో పొటాషియం స్థాయిలు ప్రభావితవుతాయి. తద్వారా ఎముకల బలహీనత రావచ్చు. దీంట్లోని ఎసిడిక్ యాసిడ్ మూలంగా పళ్ల ఎనామిల్ పాడయ్యే అవకాశం. పిల్లల్లో గొంతుమంట వచ్చే అవకాశం. తలపై ఆపిల్ సైడర్ వెనిగర్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్( తరచుగా వాడటం వల్ల నల్లటి జుట్టు వాడిపోతుంది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు. ఈ నేపథ్యంలో చర్మం లేదా జుట్టుకు వాడేటపుడు మోతాదు నియంత్రణ పాటించాలి. ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ కంటే ఎక్కువ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించ కూడదు. రోజుకు గరిష్టంగా 2 టేబుల్ స్పూన్లు (30 ఎంఎల్) మించ కూడదు. దీనికి అలర్జీలు సాధారణంగా రావు. ఒకవేళ వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. -
టేస్టీగా ఉన్నాయని పిల్లలకు చిప్స్ అలవాటు చేస్తున్నారా?
వేసవి వచ్చిందంటే పిల్లలకు ఆటవిడుపు. రోజంతా ఏదో ఒకటి తినాలని ఆశపడుతూ ఉంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తినే స్నాక్స్లో చిప్స్ ఒకటి. మన నోటికి నచ్చే చాలా ఆహారాలు, శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా కరకరలాడే చిప్స్ గుండెకు చెక్ పెడతాయి. ముఖ్యంగా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలకుదారి తీస్తాయి. రకరకాల రంగుల కవర్స్తో ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన చిప్స్ను చిన్నారులు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే చిప్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే మాత్రం ఇకపై వాటిని తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. చిప్స్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం ♦ చిప్స్లో ఎక్కువ కాల నిల్వ ఉంచేందుకు ఇందులో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ♦ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు చిప్స్లో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు.సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని చిప్స్ క్రమంగా దెబ్బతీస్తాయి. ♦ చిప్స్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ♦ శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరగడానికి గల కారణాలలో చిప్స్ ముఖ్య కారణం. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయానికి చిప్స్ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ చిప్స్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. చిప్స్లో ఫైబర్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. దీంతో చిన్నారుల్లో ఇది మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ♦ చిప్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వంధ్యత్వానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరుగుతారు. కడుపులో గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలకు చిప్స్ కారణమవుతుందని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి బలహీన పడి వైరస్లు, బ్యాక్టీరియా దాడులు పెరుగుతాయని చెబుతున్నారు. నోట్: పిల్లలకు జంక్ ఫుడ్ ఇచ్చే విషయంలో పెద్దలు ఒకటి రెండు ఆలోచించాల్సిందే. చిరుతిండ్లకోసం సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు వాడటం బెటర్. ముఖ్యంగా బెల్లంతో చేసిన పల్లీ, నువ్వుల ఉండలు. మినుములు,మిల్లెట్స్తో చేసిన తీపి లడ్డూలు, జంతికలు లాంటివి ఇంకా మంచిది. వీటితోపాటు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలతో చేసిన వంటకాలు, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్స్ వంటివి అలవాటు చేయడం మంచిది.