Tamil Nadu
-
జమాబందిలోనే గ్రామీణ సమస్యల పరిష్కారం
వేలూరు: జమబందీల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లాలోని ఆరు తాలూకా కార్యాలయాల్లో బుధవారం ఉదయం వెళితే వినతి పత్రాలు స్వీకరణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా గుడియాత్తం తాలూకా కార్యాలయంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు అధికంగా పింఛన్, ఇళ్ల పట్టాలు, బ్యాంకు రుణాల కోసం విన్నవించడంతో వాటిపై విచారణ జరిపి 15 రోజుల్లోపు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి వారం రోజులపాటు జమాబందీ కార్యక్రమం నిర్వహించడంతో తాలూకా కార్యాలయం ఎదుట అర్జీదారులు బార్లు తీరారు. ఆనకట్ట తాలూకా కార్యాలయంలో డీఆర్వో మాలతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తహసీల్దార్ వెండా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
తిరువళ్లూరు: రైతుల కోసం కై వండూరులో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్లోని కై వండూరులో రైతుల కోసం ప్రత్యక్షంగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, కలెక్టర్ ప్రతాప్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్ కై వండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగానే కై వండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజా సభ్యురాలు శివశంకరి, డీఎంకే ఉపకార్యదర్శి కాంచీపాడి శరవణన్, డీఎంకే ఎన్ఆర్ఐ వింగ్ జిల్లా కార్యదర్శి జైకృష్ణ, డీఎంకే యువజన విభాగం ఉప కార్యదర్శి మోతీలాల్, చిట్టిబాబు, కన్నదాసన్, తిరుత్తువరాజ్ పాల్గొన్నారు. -
యువత అప్రమత్తంగా ఉండాలి
తిరువళ్లూరు: యుక్తవయస్సులో యువతీయువకులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా చిన్నపిల్లల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరై, ప్రసంగించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ఆశ్రమాల్లో ఉన్న యువతీయువకులు, చిన్నారులు, విద్యార్థులకు శరీరంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించాలని సూచించారు. యుక్త వయస్సులో హార్మోన్ల ద్వారా వచ్చే మార్పుల ఫలితంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అయితే శరీరం, ఆలోచన విధానాన్ని అదుపులో వుంచుకోవాలని పిలుపునిచ్చారు. యుక్తవయస్సులో పౌష్టికాహారం తీసుకోకపోతే భవిషత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. -
నెలకు రూ.40 లక్షలు భరణం
● కోర్టులో నటుడు రవిమోహన్ పై భార్య పిటిషన్ తమిళసినిమా: పలు విజయవంతమైన చిత్రాలు చేసి ప్రముఖ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న జయంరవి. ఈయన 2009లో ఆర్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అలాంటిది అనూహ్యంగా వీరి సంసార జీవితంలో ముసలం పుట్టింది. కారణాలేమైనా విడిపోయారు. విడాకుల కోసం కోర్టుకెక్కారు . జయం రవి తన పేరును రవిమోహన్గా మార్చుకున్నారు. వీరి వ్యవహారం గత కొంత కాలంగా టీవీ.సీరియల్గా సాగుతోంది. భార్య ఆర్తితో తలెత్తిన విభేదాల కారణంగా నటుడు రవిమోహన్ ఇటీవల ఆమె నుంచి విడాకులు కోరుతూ చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్దానం ఇద్దరి మధ్య సామరస్య చర్చలతో పరిష్కారానికి పలు మార్లు అవకాశం కల్పించింది. అయితే చర్చలు సఫలం కాలేదు. తనకు విడాకులు కావాలని నటుడు రవిమోహన్ పట్టుబట్టారు. ఆ తరువాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకెక్కుతున్నారు. తన సంపాదనంతా ఆర్తి తన ఆడంబరాలకే ఖర్చు చేసిందని రవిమోహన్ ఆరోపిస్తే, తమ మధ్య విడాకులకు కారణం గాయని కనిష్కా ఫ్రాన్సిస్ అని, ఆమెతో తన భర్త కలిసి తిరుగుతున్నారని ఆర్తి విమర్శించారు. కాగా బుధవారం నటుడు రవిమోహన్, ఆర్తి విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భరణంగా రవిమోహన్ తనకు నెలకు 40 లక్షలు చెల్లించేవిధంగా ఆదేశించాలని కోరుతూ ఆర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె పిటిషన్పై బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తి రవిమోహన్కు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేశారు. -
మా మధ్య విభేదాలు లేవు
● రాందాసు ● త్వరలో తైలాపురంకు అన్బుమణిసాక్షి, చైన్నె: అన్భుమణితో తనకు ఎలాంటి విభేదాలు, విద్వేషాలు లేవు అని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వస్తారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. పీఎంకేలో అధ్యక్ష పదవీ వార్ తండ్రి రాందాసు , తనయుడు అన్బుమణి మధ్య చిచ్చు రగిల్చిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా తైలాపురం తోట్టంలో జరిగిన పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, యువజన నేతలు, వన్నియర్ సంఘాల నేతల భేటిని అన్బుమణి బహిష్కరించడం చర్చకు దారి తీసింది. ఈ సమావేశాలకు అన్బుమణితో పాటుగా ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు పెద్ద ఎత్తున గైర్హాజరయ్యారు. దీనిని రాందాసు తీవ్రంగా పరిగణించినట్టు, త్వరలో అన్బుమణిని పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇది కాస్త పీఎంకేలో మరింత గందరగోళాన్ని సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం రాందాసు మీడియా ముందుకు వచ్చారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు, విద్వేషాలు లేవు అని స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టకు అన్బుమణి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, పార్టీ గౌరవ అధ్యక్షుడు జీకేమణి మాట్లాడుతూ, పార్టీలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు అన్ని సమసినట్టే అని వ్యాఖ్యలు చేశారు. రాందాసు తదుపరి అన్బుమణి పార్టీకి నాయకత్వం వహిస్తారని పేర్కొంటూ, త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వెళ్తారని స్పష్టం చేశారు. పీఎంకేలో అందరూ ఒక్కటేనని, అందరూ సమానంగానే, ఐక్యతతోనే ఉన్నారని, పార్టీలో కొన్ని సమస్యలు సహజమేనని, అవన్నీ సమసినట్టే అని వ్యాఖ్యానించారు. -
మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ
పళ్లిపట్టు: మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ కనువిందు చేశారు. పళ్లిపట్టు గంగజాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామ దేవత కొళ్లాపురమ్మకు మహిషాసురమర్దిని అలంకరణలో కొలువుదీర్చి, మేళతాళాలు, బాణసంచా సంబరాలు నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం గంగమ్మ తల్లి గ్రామ వీధుల్లో ఊరేగి నడివీధిలో కొలువుదీరారు. మహిళలు కుంభం సమర్పించి దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారు ఊరేగింపు సందర్భంగా యువత విభిన్న వేషధారణలో పట్టణంలో సందడి చేశారు. అశేష జనవాహిని నడుమ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి కుశస్థలినదిలో నిమజ్జనం చేశారు. -
● కిడ్స్ గేమ్స్
మేడవాక్కంలోని నవీన్స్ స్టార్వుడ్ టవర్స్లో 6–13 సంవత్సరాల పిల్లల కోసం బుధవారం ఇంటరాక్టివ్ గేమ్, మాక్ టెయిల్స్, మ్యూజిక్ మార్క్ కిడ్స్ పూల్ పార్టీ కార్యాక్రమం జరిగింది. ఇందులో నవీన్స్ డైరెక్టర్ క్షీర్ వసుధకుమార్, సీఓఓ కల్యాణ రామన్తో పాటుగా పెద్ద సంఖ్యలో పిల్లలు ఇక్కడ జరిగిన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచారు. – సాక్షి, చైన్నె ● ఆవిష్కరణ ప్రోక్టాలజీ సంరక్షణలో స్పెక్ట్రా ఆస్పత్రిగా పురోగతిని సాధిస్తూ అపోలో స్పెక్ట్రా ఏర్పాటైంది. రాఫెలో ప్రొసీజర్తో హెమోరాయిడ్స్ కోసం అత్యాధునిక, మినిమల్లీ ఇన్వేషివ్ రేడియే ఫ్రీక్వెన్నీ థెరపిని పరిచయం చేసింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కొలొరెక్టల్ సర్జన్ డాక్టర్ వాణి విజయ్, సినీ నటి పార్వతి నాయర్, ఏహెచ్ఎల్ఎల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్ నిశాంత్ మిశ్రా, మెడికల్ డైరెక్టర్ డాక్టర్విజయ్ అగర్వాల్ తదితరులు ఈ విధానం గురించి బ్రోచ్ర్ను ఆవిష్కరించారు. – సాక్షి, చైన్నె తిరుత్తణిలో రెండోరోజు జమాబందీ తిరుత్తణి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జమాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులకు ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ ప్రతాప్ అందజేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి జమాబందీ శిబిరాలు ప్రారంభమైయ్యాయి. తిరుత్తణి తహసీల్దార్ కార్యాలయంలో రెండో రోజు నిర్వహించిన శిబిరంలో కృష్ణసముద్రం, మద్దూరు, సూర్యనగరం, సహా పది గ్రామాల నుంచి ప్రజలు పాల్గొని, అర్జీలు అందజేశారు. కలెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో వినతిపత్రాలపై విచారణ జరిపి, అర్హులైన పది మందికి ఉచితంగా ఇంటి పట్టాలు, కుల సర్టిఫికెట్లు, వృద్ధాప్య పింఛన్లు, పట్టా మార్పిడి సర్టిఫికెట్లు సంబంధించి ధ్రువీకరణ సర్టిఫికెట్లు అందజేశారు. రెండో రోజు 268 మంది వినతిపత్రాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. 24 వరకు ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉన్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్/కన్వీనర్ వి.శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ‘‘ఐటీఐ.ఏపీ.జీఓవి.ఇన్’’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను మే 26వ తేదీలోపు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో పరిశీలన చేయించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 94928 61369, 85000 21856, 94908 06942, 93989 62635 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
మృగరాజుపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : కార్వేటినగరం టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి కాళ సర్పంపై నృత్య వేణుగోపాలుడుగా ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరారు. ఉదయం సింహ వాహనంపై వేణుగోపాలుడు భక్తులను అనుగ్రహించారు. తెల్లవారు జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు నరసింహ అవతారంలో స్వామివారు సింహ వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం 10 గంటల నుంచి 11 గంటల మధ్య రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులకు వేదపండితులు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం శ్రీకృష్ణ అవతారంలోని శ్రీవేణుగోపాలుడికి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో టీటీడీ బృందం గాత్ర కచేరితో కనులపండువగా ఊంజల్సేవ నిర్వహించారు, ఉభయ నాంచార్లుతో వేణుగోపాలుడు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి రుక్మిణీ సత్యభామ సమేతుడై శ్రీవేణుగోపాలుడు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి చిన్నారుల కోలాటాలు, మహిళల చెక్కభజనల, మంగళ వాయిద్యాలు, నడుమ అత్యంత వైభవంగా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు ఇంటింటా కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవతో స్వామి వారిని పవళింప జేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఆలయ అధికారి సురేష్కుమార్, షరాబ్ బాబు సురేష్, కంకణభట్టర్ తరుణ్కుమార్, వేద పండితులు నారాయణదాసరథి, గోపాలాచార్యులు, రమేష్, శభరీష్, అలంకార పండితులు మోహన్బట్టాచార్యులు టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. నేడు కల్యాణోత్సవం కార్వేటినగరంలో జరుగుతున్న రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామి ఊరేగనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి సురేష్కుమార్ చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి సర్వభూపాల వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
మైక్రో ఇరిగేషన్ పరికరాలపై అవగాహన
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు మైక్రో ఇరిగేషన్ పరికరాలపై అవగాహన కల్పించే కార్యక్రమం బుధవారం జరిగింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో జరిగిన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గణేషన్ పాల్గొని, రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గణేషన్ మాట్లాడుతూ రైతులు మైక్రో ఇరిగేషన్ విధానంపై అవగాహన కలిగి ఉంటే, నీటిని ఆదా చేసుకోవడంతోపాటు సాగుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మైక్రో ఇరిగేషన్కు ఉపయోగించే వస్తువులపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయకుమార్, ఇంజినీర్ రమేష్, హార్టికల్చర్ అధికారి మహేంద్రన్ పాల్గొన్నారు. -
దిశ కమిటీ రాష్ట్ర సభ్యుడిగా కరుణాకరన్
తిరువళ్లూరు: రాష్ట్ర దిశ కమిటీ సభ్యుడిగా తిరువళ్లూరుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మానిటరింగ్ చేయడానికి రాష్ట్రస్థాయిలో డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పని చేస్తోంది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి స్టాలిన్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సభ్యులుగా సిఫార్సు చేసింది. ఇందులో తిరువళ్లూరుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్ పేరును ప్రకటించింది. కాగా దిశ కమిటిలో చోటు దక్కించుకున్న కరుణాకరన్కు కేంఽద్రమంత్రి ఎల్. మురుగన్, రాష్ట్ర అధ్యక్షుడు నాయినార్ నాగ్రేందన్ అభినందనలు తెలిపారు. -
పశ్చాత్తాపంతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మాహుతి
సాక్షి, చైన్నె: మద్యం మత్తుతో తాను చేసిన ప్రమాదానికి పశ్చాత్తాపంతో చైన్నె తరమణిలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మాహతి చేసుకున్నాడు. వివరాలు.. తరమణి స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా సెంథిల్ పనిచేస్తున్నాడు. మంగళవారం గిండిసమీపంలోని మడువంకరై వంతెనపై కారు – మోటారు సైకిల్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సెంథిల్ కారణంగా విచారణలో తేలింది. మద్యం మత్తుతో అతి వేగంగా కారును నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో పెరుంగుడికి చెందిన మురుగన్ గాయపడ్డట్టు వెలుగు చూసింది. మత్తులో ఉన్న సెంథిల్ను ఆ పరిసర వాసులు చితక్కొట్టిన వీడియో సైతం వైరల్గా మారింది. తన మీద కేసు నమోదు కావడంతో తీవ్ర ఆందోళనకు సెంథిల్ గురయ్యాడు. అలాగే, మద్యం మత్తుతో తానుచేసిన ప్రమాదానికి పశ్చాత్తపం వ్యక్తం చేస్తూ బుధవారం ఉదయం తరమణి ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్ వంతెన కింద ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. వంతెన కింద ఎవరో తగల బడుతున్నట్టు గుర్తించిన స్థానికలు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సెంథిల్ సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకున్న తరమణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న కారు ● ముగ్గురి దుర్మరణం సాక్షి, చైన్నె: అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు మరణించారు. కన్యాకుమారి సమీంలోని సూరంకొడి గ్రామానికి చెందిన బాల ప్రభు, తన భార్య, రెండేళ్ల కుమార్తె, మామ కరుప్పు స్వామితో కారులో చైన్నెకు బయలు దేరారు. మార్గంమధ్యలో పాడలూరు వద్ద బుధవారం ఉదయం కారు అతి వేగం కారణంగా అదుపు తప్పింది. రోడ్డు పక్కగా ఉన్న చెట్టును ఢీ కొట్టి ఫల్టీలు కొట్టింది. ఈప్రమాదంతో అటు వైపుగా వెళుతున్న వాహనదారులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో బాల ప్రభు, కరుప్పుస్వామి, రెండేళ్ల కుమార్తె మరణించారు. బాల ప్రభు సతీమణి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సలో ఉన్నారు. మాజీ మంత్రి బంధువు మృతి అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ బంధువు అరుణ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేరళలోని మూనారు పర్యటనకు వెళ్లి శివకాశికి తిరుగు ప్రయాణంలో ఉన్న ఆయన కారు మార్గంమధ్యలోని బోడి సమీపంలో అదుపు తప్పింది. ఘటనా స్థలంలోనే అ రు ణ్ మరణించారు. అరుణ్ మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ మేన కోడలి భర్త కావడంతో ఆయ న కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. త్యాగ భూమిలో కాంగ్రెస్ నేతల నివాళి సాక్షి, చైన్నె: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక ప్రదేశంగా శ్రీపెరంబదూరులోని త్యాగ భూమిలో కాంగ్రెస్ నేతలు బుధవారం ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధి 34వ వర్ధంతి సందర్భంగా అక్కడున్న ఆయన విగ్రహానికి, చిత్ర పటానికి నేతలు పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుతొంగై నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పార్టీ వర్గాలు తరలి వచ్చినివాళులర్పించారు. అనంతరం ఉగ్ర వాదాన్ని తరిమి కొట్టడం లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలోనూ రాజీవ్ చిత్ర పటానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిద్దామని, అమర వీరుల కలలను సాకారం చేద్దామని వ్యాఖ్యలు చేశారు. కౌన్సిలర్ శారద డీఎంకే నుంచి బహిష్కరణ స్టాలిన్ ఆదేశాలు కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్ 65వ వార్డు కౌన్సిల్ సభ్యురాలు శారద. ఆమె కొళత్తూర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చైన్నె తూర్పు జిల్లా డీఎంకే సభ్యులు. ఆమైపె పార్టీ నాయకత్వానికి వివిధ ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజల అసంతృప్తికి కారణమైన ఈమెకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా ఆమె ధోరణిలో మార్పు లేదు. దీంతో ఆమైపె చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ఆదేశించారు. శారదను పార్టీ నుంచి బహిష్కరించారు. దీనికి సంబంధించి డీఎంకే జనరల్ సెక్రటరీ దురై మురుగన్ ఓ ప్రకటనను బుధవారం విడుదల చేశారు. శారద పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని, పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నందున ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవుల నుంచి ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
హిట్ కాంబో రిపీట్?
తమిళసినిమా: ఒక సూపర్హిట్ చిత్రం తరువాత మళ్లీ అదే కాంబినేషన్లో చిత్రం వస్తుందంటే కచ్చితంగా ఆ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి కాంబో రిపీట్ కానుందనేది తాజా సమాచారం. ఇటీవల ఏ పత్రికలో చూసినా, సామాజిక మాధ్యమాల్లో చూసినా నటుడు విశాల్ పెళ్లి వార్తలే. ఆయన నటి సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్త ప్రత్యేకంగా మారింది. కాగా ఇప్పుడు విశాల్ తదుపరి చిత్రం గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విశాల్, దర్శకుడు సుందర్.సీ దర్శకత్వంలో రూపొందిన మదగజరాజా చిత్రం 12 ఏళ్ల తరువాత సమీప కాలంలో తెరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ సుందర్.సీ దర్శకత్వంలో నటించనున్నట్లు విశాల్ ప్రకటించారు. అదే సమయంలో తన స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాలేదు. కాగా తాజాగా విశాల్ తాజా చిత్రాన్ని పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబోలో ఇంతకు ముందు ఇరుంబుతిరై అనే సూపర్హిట్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. కాగా తాజాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మంచనున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా విశాల్, దర్శకుడు పీఎస్.మిత్రన్ ల కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
ధనుష్, వెట్రిమారన్ కాంబోలో మరోచిత్రం
తమిళసినిమా: నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్లది సూపర్హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఇంతకు ముందు పొల్లాదవన్, ఆడుగళం, వడచెన్న, అసురన్ మొదలగు సక్సెస్పుల్ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. కాగా తాజాగా మరో చిత్రానికి ఈ కాంబో సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం నటుడు సూర్య హీరోగా వాడివాసల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. జల్లికట్టు క్రీడ నేపధ్యంలో సాగే ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు. దీని తరువాత ధనుష్ హీరోగా నటించే చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇది వడచైన్నెకి సీక్వెల్నా లేక వేరే కథా చిత్రమా అన్నది వేచి చూడాలి. విశేషం ఏమిటంటే ఈయన ఇప్పటికే ధనుష్ హీరోగా రెండు చిత్రాలను నిర్మించనున్నారు. అందులో ఒక చిత్రానికి విఘ్నేశ్ రాజా, మరో చిత్రానికి మారిసెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. కాగా నటుడు ధనుష్ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థలో మూడు చిత్రాలు కమిట్ అయ్యారన్నమాట. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాఽశం ఉంది. -
వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రాజీవ్ గాంధీ వర్ధంతి
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు, వేసి నివాళులర్పించారు. అలాగే వేలూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట రాజీవ్ చిత్ర పటాన్ని ఉంచి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వాహీద్బాషా అధ్యక్షతన రాజీవ్ చిత్ర పటాన్ని ఉంచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాహీద్బాషా మాట్లాడుతూ రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. నిరుపేద ప్రజలకు అవసరమైన పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. దేశంలో తీవ్ర వాద శక్తులు లేకుండా చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీకా రామన్, జిల్లా మాజీ అధ్యక్షుడు కదిర్వేలన్, మాజీ కౌన్సిలర్ కోదండపాణి, మూడో డివిజన్ అధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి బాలక్రిష్ణన్, జానకీరామన్, జీకే మోహన్, కప్పల్మణి, కోణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వేలూరు, తిరుపత్తూరు,రాణిపేట,తిరువణ్ణామలై జిల్లాల్లో తీవ్ర వాదానికి వ్యతిరేకంగా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. -
సెప్టెంబర్లో సెట్పైకి గాడ్ ఆఫ్ లవ్
తమిళసినిమా: సంచలన నటుడు శింబు తన చిత్రాల విషయంలో స్వీడ్ పెంచారు. ఈయన కమలహాసన్తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్లైఫ్ చిత్రం జూన్ 5న తెరపైకి రానుంది. ఇది ఆయన నటించిన 48వ చిత్రం. కాగా శింబు తన 49,50,51వ చిత్రాలను ఇటీవల ప్రకటించారు. అందులో 49వ చిత్రాన్ని పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటి కయాదు లోహర్ నాయకిగా నటించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. అదేవిధంగా 50వ చిత్రానికి దేసింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. కాగా శింబు నటించనున్న 51వ చిత్రానికి ఒమై కడవులే, డ్రాగన్ చిత్రాల ఫేమ్ అశ్వద్ మారిముత్తు దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. దీనికి గాడ్ ఆఫ్ లైవ్ అనే టైటిల్ను నిర్ణయించారు.ఈ చిత్రం గురించి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు అర్జన కల్పాత్తి పేర్కొంటూ శింబు హీరోగా చేస్తున్న చిత్రం చాలా పెద్ద బడ్జెట్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర కథే చాలా ఆసక్తిగా ఉంటుందన్నారు. ఇది శింబు అభిమానులకు చాలా సంతృప్తిని కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందులో నటించే కథానాయకిని ఎంపిక చేసినట్లు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను ఆగస్ట్ నెలలో విడుదల చేయనున్నట్లు ఆమె చెప్పారు. దీంతో ఈ చిత్ర వివరాల కోసం శింబు అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శింబుతో దర్శకుడు అశ్వద్ మారిముత్తు -
ఒకే ట్రాక్లో రెండు ఈవీఎంలు
సాక్షి, చైన్నె: చైన్నెలో సాగే ఎలక్ట్రిక్ రైలు సేవలకు అర గంటకు పైగా అంతరాయం బుధవారం ఏర్పడింది. ఇందుకు కారణం ఒకేట్రాక్పై రెండు రైళ్లు ఆగటమే. ఈ ఘటన కాసేపు కలకలం రేపినా ఆతర్వాత రైలు సేవలను పునరుద్దరించారు. చైన్నె తాంబరం నుంచి బీచ్ వైపుగా ఉదయం సుమారు 8.40 గంటలకు ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది. ఈ రైలు పల్లావరం స్టేషన్కు 5.50 గంటల సమయంలో చేరుకుంది. ఈ రైలు ఒకట వ నెంబరు ప్లాట్ పాం నుంచి బయలు దేరే సమయంలో హఠాత్తుగా ఓ బోగి వద్ద పొగ రావడాన్ని డ్రైవర్గుర్తించి ఆపేశాడు. అదే సమయంలో ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్లోకి మరో రైలు వెనుకే రావడంతో ఉత్కంఠ నెలకొంది. తక్షణం ఆ రైలును కూత వేటు దూరంలో ఆపేశారు. ఒకే ట్రాక్లో రెండు రైళ్లు ఆగడంతోకలకలం రేగింది. హఠాత్తుగా రైళ్లు ఆగడంతో ఉదయాన్నే పనుల నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బందులు తప్పలేదు. ముందుగా వెళ్తున్న రైలు బ్రేక్ షడన్గా వేయడం వల్లే పొగ వచ్చినట్టు భావించారు. దీంతో ఆ రైలులలో ఉన్నవారందర్నీ దించేశారు. ఆరైలును తాంబరం యార్డ్కు పంపించారు. ఈ ప్రక్రియ కారణంగా తాంబరం టూ బీచ్ మధ్య అర గంట పాటుగా సేవలకు ఆటంకం తప్పలేదు. పల్లావరం వద్ద పొగ కలకలం -
5 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనకు ఇకపై జరిమానా
సాక్షి, చైన్నె: మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించక పోవడం వంటి ఐదురకాల ఉల్లంఘనలకు ప్రాధాన్యత ఇస్తూ ఇక చైన్నెలో జరీమానాల వడ్డనకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను బుధవారం గ్రేటర్ చైన్నె పోలీసు కమిషనర్ అరుణ్ జారీ చేశారు. వివరాలు.. చైన్నె నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పీక్ అవర్స్లలో కూడా ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ పోలీసులు వాహన దారుల భరతం పట్టేవిధంగా ముందుకెళ్తున్నారు.. తమ వద్ద ఉన్న మొబైల్ పోన్ తరహా ప్రత్యేక పరికరం ఆధారంగా పట్టుబడే వారికి జరిమానా విధిస్తూ , తక్షణం రశీదులను అందజేస్తూ వస్తున్నారు. అలాగే చైన్నె నగరంలోని ప్రధాన మార్గాలలో ఉన్న కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పడుతున్నారు. ఎవ్వరెవ్వరూ నిబంధనలు ఉల్లంఘిస్తారో వారి మొబైల్ నంబర్లకు ఆటోమెటిక్గా జరిమాన సమాచారాలు వెళ్తుంటాయి. జరిమానాలను ట్రాఫిక్ యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్ల వద్దకు వెళ్లి కట్టాల్సిన పరిస్థితి. అయితే, అనేక మంది తమకు జరిమానా కెమెరాల ద్వారా పడ్డా,వాటిని ఖాతరు చేయడం లేదు. జరీమాన కట్టేందుకు ముందుకు రావడం లేదు. అదే సమయంలో పోలీసులు ఇష్టానుసారంగా కెమెరాల ఆధారంగా, తమ వద్ద ఉన్న స్కానర్ల ద్వారా జరిమానాలను విధించి సమాచారాలను ఎస్ఎంఎస్ ద్వారా పంపించేస్తున్నారన్న విమర్శలు బయలుదేరాయి. ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టే విధంగా ఇక, స్పాట్ ఫైన్ జరీమానల విధించే ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. మద్యం సేవించి వాహనం నడిపే వారు, హెల్మెట్ లేకుండా వాహనంనడిపేవాళ్లు, త్రిబుల్స్ రైడింగ్,అతి వేగం వంటి ఐదు రకాల నిబంధనల ఉల్లంఘనకు ప్రాధాన్యత ఇస్తూ ఇక, జరీమాన వడ్డన మోగనున్నది. సీటు బెల్టూ ధరించక పోవడం, సెల్ పోన్ డ్రైవింగ్లకు నిఘా నేత్రాల ద్వారా జరీమాన వడ్డన మోగనుంది. అయితే, సిగ్నల్స్ గిర్ర కాస్తదాటి వచ్చినా, ఇతర నిబంధనలకు జరిమాన నుంచి కాస్త ఉపశమనం కలగనున్నది. అయితే పైనపేర్కొన్న ఐదు నిబంధనలు ఉల్లంఘించే వారే చైన్నె నగరంలో అత్యధికంగా ఉండటం గమనార్హం. -
పాదాలకు చెక్క కర్రలతో చెన్నిమలై మురుగన్ దర్శనం
సేలం: ఈరోడ్లోని ఉజవాన్ కలైకుగు అనే సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాలురు, బాలికలు చెన్నిమలై మురుగన్ ఆలయంలోని 1,320 మెట్లను ఎక్కి కొండ ఆలయానికి చేరుకున్నారు, వారి పాదాలకు 2 అడుగుల పొడవైన చెక్క కరల్రు కట్టుకున్నారు. తరువాత అక్కడి నుంచి మెట్ల ద్వారా బేస్ కు తిరిగి వచ్చారు. 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వల్లి గుమ్మి నృత్యం, సాలంగై యాట్టం, పెరుంజలంగై యాట్టం వంటి కళా ప్రదర్శనలలో కాళ్లను తాళ్లతో కట్టి పాల్గొనేలా శిక్షణ అందిస్తున్నామని కళా బృందం నిర్వాహకులు తెలిపారు. చెన్నిమలై మెట్లు ఎక్కిన అబ్బాయిలు, అమ్మాయిలను కాళ్లుకు కట్టి, మెట్ల గుండా వెళుతున్న భక్తులు ఆసక్తిగా గమనించారు. -
పది విమానాల సేవల రద్దు
సాక్షి, చైన్నె : చైన్నె నుంచి కొచ్చి, హైదరాబాద్, ఢిల్లీ, పుణె తదితర ప్రాంతాలకు బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి వరకు బయలు దేరాల్సిన పది విమానాల సేవలను ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సేవలను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్వహణా కారణాలతోనే వీటి సేవలను రద్దు చేసినట్టు విమానాశ్రయ వర్గాలు పేర్కొంటున్నాయి. రద్దయిన విమానాలలో చైన్నె నుంచి సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ బయలు దేరాల్సిన విమానం, రాత్రి 8.35కు కొచ్చి బయలు దేరాల్సిన విమానం, 9.20కు పుణె బయలు దేరాల్సిన విమానం, 9.45కు ఢిల్లీ, 9.50కు హైదరాబాద్ బయలు దేరాల్సిన విమానాలు ఉండటం గమనార్హం. రద్దయిన విమానాలలో ఏర్పాట్లు చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. -
మా మధ్య విభేదాలు లేవు
● రాందాసు ● త్వరలో తైలాపురంకు అన్బుమణిసాక్షి, చైన్నె: అన్భుమణితో తనకు ఎలాంటి విభేదాలు, విద్వేషాలు లేవు అని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వస్తారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. పీఎంకేలో అధ్యక్ష పదవీ వార్ తండ్రి రాందాసు , తనయుడు అన్బుమణి మధ్య చిచ్చు రగిల్చిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా తైలాపురం తోట్టంలో జరిగిన పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, యువజన నేతలు, వన్నియర్ సంఘాల నేతల భేటిని అన్బుమణి బహిష్కరించడం చర్చకు దారి తీసింది. ఈ సమావేశాలకు అన్బుమణితో పాటుగా ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు పెద్ద ఎత్తున గైర్హాజరయ్యారు. దీనిని రాందాసు తీవ్రంగా పరిగణించినట్టు, త్వరలో అన్బుమణిని పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇది కాస్త పీఎంకేలో మరింత గందరగోళాన్ని సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం రాందాసు మీడియా ముందుకు వచ్చారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు, విద్వేషాలు లేవు అని స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టకు అన్బుమణి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, పార్టీ గౌరవ అధ్యక్షుడు జీకేమణి మాట్లాడుతూ, పార్టీలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు అన్ని సమసినట్టే అని వ్యాఖ్యలు చేశారు. రాందాసు తదుపరి అన్బుమణి పార్టీకి నాయకత్వం వహిస్తారని పేర్కొంటూ, త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వెళ్తారని స్పష్టం చేశారు. పీఎంకేలో అందరూ ఒక్కటేనని, అందరూ సమానంగానే, ఐక్యతతోనే ఉన్నారని, పార్టీలో కొన్ని సమస్యలు సహజమేనని, అవన్నీ సమసినట్టే అని వ్యాఖ్యానించారు. -
రుక్మిణి వసంత్కు లక్కీఛాన్స్
తమిళసినిమా: లక్కు ఉంటే అవకాశాల కిక్కే వేరు. కొందరు అవకాశాల కోసం ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి కొందరికి ఒక్క హిట్ వస్తే ఆ తరువాత అవకాశాలు వరుస కడుతుంటాయి. ఇక్కడ నటి రుక్మిణి వసంత్ కథే వేరు. ఈ కన్నడ భామ తమిళంలో నటించిన ఒక్క చిత్రం కూడా ఇంకా తెరపైకి రాలేదు. అదేంటో వరుసగా క్రేజీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈమె శివకార్తీకేయన్కు జంటగా నటిస్తున్న మదరాశీ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే అంతకంటే ముందు విజయ్ సేతుపతి సరసన నటించిన ఏస్ చిత్రం ఈ నెల 23వ తేదీన తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ అవకాశం వరించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీఛాన్స్. నటుడు కమలహాసన్ కథానాయకుడిగా శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన థగ్లైఫ్ చిత్రాన్ని మణిరత్నం పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. దీంతో మణిరత్నం కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం చాలా రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ద్విభాషా(తమిళం, తెలుగు) చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే సాయిపల్లవి విషయం ఏమైందో గానీ ఇప్పుడు ఈ చిత్రంలో నటించే అదృష్టం నటి రుక్మిణి వసంత్ను వరించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. కాగా కమలహాసన్, శింబు, త్రిషలో భారీ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు తదుపరి ఫ్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా ఈ అమ్మడు తెలుగులోనూ క్రేజీ అవకాశాలను అందుకుంటున్నారు. ఇప్పటికే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంలో నటించిన రుక్మిణి వసంత్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్తో జత కట్టే లక్కీఛాన్స్ను అందుకున్నట్లు తెలిసింది. ఇలా అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిని చుట్టేస్తున్నారన్నమాట.నటి రుక్మిణి వసంత్ -
మళ్లీ పెరగనున్న వేడి!
● వారం పాటు సాధారణంగానే వానలు సాక్షి, చైన్నె: రాష్ట్రంలో వాతావరణంలో మళ్లీ మార్పు చోటు చేసుకుంది. అరేబియా సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం పుణ్యమాని గాలిలో తేమ తగ్గి మళ్లీ భానుడి ప్రతాపం పెరగనుంది. వారం రోజుల పాటు అక్కడక్కడ సాధారణం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతు పవనాలు అండమాన్ తీరాన్ని తాకినానంతరం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో చెదరు మదురుగా, మరికొన్ని జిల్లాలో అనేక చోట్ల భారీ గా వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కోయంబత్తూరు, నీలగిరి, వేలూరు, రాణిపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తరుగా వర్షం కురిసింది. రాణిపేట జిల్లా ఆర్కాడులో అత్యధికంగా 14 సెంటీమీటర్ల, అరక్కోణంలో 12 సె.మీ., వేలూరు జిల్లా పరిధిలోని అనైకట్టులో 10 సె.మీ వర్షం పడింది. చైన్నె శివారులో తేలిక పాటి వర్షం కురిసింది. వర్షాలు ఇంకా కొనసాగుతాయని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ముందుగా ప్రకటించింది. అయితే, అరేబియా సముద్రంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఇది వాయుగుండంగా, ఆ తర్వాత తుపాన్గా మారే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడి గాలిలో తేమ తగ్గనుంది. ఈ కారణంగా రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగానే ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే, నీలగిరి, కోయంబత్తూరు, కృష్ణగిరి, ధర్మపురితోపాటుగా పశ్చిమ కనుమల వెంబడి జిల్లాలో మోస్తరుగా వర్షం, ఇతర ప్రాంతాల్లో సాధారణంగా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అరేబియా సముద్రంలో నెలకొనే అల్పపీడనం ప్రయాణించే మార్గం ఆధారంగా పరిస్థితులు మారవచ్చని పేర్కొనడం గమనార్హం. -
విస్తృతంగా తోళి!
● 38.15 కోట్లతో 3 చోట్ల నిర్మాణాలు పూర్తి ● మరో 14 చోట్ల రూ.176 కోట్లతో పనులు ● సీఎం శంకుస్థాపన వర్కింగ్ ఉమెన్స్ కోసం తోళి (ఫ్రెండ్స్ హాస్టల్ ) హాస్టళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంది. రూ. 38.15 కోట్లతో పరింగిమలై, హోసూరు, తిరువణ్ణామలైలలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న తోళి హాస్టళ్లను బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. మరో 14 చోట్ల రూ. 176 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం మహిళలకు పెద్దపీట వేస్తూ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, నెలకు రూ. 1000 నగదు పంపిణి నిమిత్తం కలైంజ్ఞర్ మగళీర్ ఉరిమై తిట్టం, విద్యార్ధినులకు నెలకు రూ. 1000 ఉన్నత విద్యా ప్రోత్సాహం వంటి పథకాలు విస్తృతంగా అమల్లో ఉన్నాయి. అదే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి చైన్నెతో పాటుగా పలు నగరాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు, యువతులకు భద్రత పరంగా , అన్ని రకాల వసతులతో సురక్షితంగా, తక్కువ అద్దెతో బస కల్పించే విధంగా తోళి (ఫ్రెండ్ హాస్టల్స్) నిర్మాణాలను సాంఘీక సంక్షేమం, మహిళా శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు చైన్నె, తిరువళ్లూరు, కోయంబత్తూరు. చెంగల్పట్టు, తిరుచ్చి, తంజావూరు, వేలూరు, సేలం, విల్లుపురం, తిరునెల్వేలి, పెరంబలూరు, పుదుక్కోట్టై, తూత్తుకుడి సహా 13 జిల్లాలలో 14 హాస్టళ్లను నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్న మహిళలు, యువతులకు ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు సురక్షితంగా మారాయి. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉండటంతో ఆదరణ పెరిగింది. మరింతగా నిర్మాణాలు ఫ్రెండ్స్ హాస్టళ్లకు ఆదరణ క్రమంగా పెరుగుతుండటంతో మహిళకు మరింత సహకారం అందించేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ప్రభుత్వ నేతృత్వంలో మరింతగా నిర్మాణాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అదనంగా చైన్నె – పరింగిమలై, హోసూరు, తిరువణ్ణామలైలో 38 కోట్ల 15 లక్షలతో 442 పడకలతో 3 కొత్త హాస్టళ్లు నిర్మించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వీటిని సచివాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, చైన్నె తరమణి, చేపాక్, మధురై, కోయంబత్తూర్, నాగపట్నం, కృష్ణగిరి, ఈరోడ్, కాంచీపురం, కడలూరు, ధర్మపురి, తేని, శివగంగై, రాణిపేట, కరూర్ లలో రూ. 176.93 కోట్లతో 2 వేల పడకలతో 14 హాస్టళ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ హాస్టళ్లలో బయోమెట్రిక్ ఎంట్రీ, 24 గంటల భద్రత, వై–ఫై సౌకర్యం, సీసీటీవీ ద్వారా నిఘా, శుద్ధి చేసిన తాగునీరు, ఆరోగ్యకరమైన ఆహారం, టెలివిజన్, వేడి నీటి సౌకర్యం, వాషింగ్ మెషిన్, ఇసీ్త్ర సౌకర్యం, పార్కింగ్ వంటి సౌకర్యాలు తక్కువ అద్దెకు వర్కింగ్ ఉమెన్స్కు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ మహిళా హక్కుల శాఖ మంత్రి గీతా జీవన్, ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ కార్యదర్శి జయశ్రీ మురళీధరన్, అదనపు కార్యదర్శి , తోళి ఎండీ ఎస్.వలర్మతి తదితర అధికారులు పాల్గొన్నారు.ఆర్థిక హక్కుల కోసం ఢిల్లీ వెళ్తున్నా... ఢిల్లీలో ఈనెల 24వ తేదీన నీతి ఆయోగ్ భేటీ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనాలని ఈసారి సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దీనిపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కొన్ని ప్రశ్నలు సంధించారు. టాస్మాక్ అక్రమాలలో తన వాళ్లను రక్షించుకునేందుకే ఈసారి ఢిల్లీ పర్యటనకు సీఎం వెళ్తున్నారని ఆరోపించారు. అలాగే ఈ అక్రమాలలో ఆ తమ్ముడు ఎవరో? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా సీఎం స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడుకు న్యాయపరంగా దక్కాల్సిన నిధులు, ఆర్థిక హక్కులను రక్షించుకునేందుకే తాను వెళ్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. శశికళ నుంచి అమిత్ షా వరకు బల్ల కింద కాళ్లు పట్టుకునే అలవాటు ఉన్న ప్రతి పక్ష నేతకు తన ఢిల్లీ పర్యటన మీద ఎందుకు అంత ఈర్ష్య అని ప్రశ్నించారు. పులిలా గర్జించిన పులికేసి , చివరకు ఒక్క దండయాత్రతో పిల్లలా మారి తెల్ల జెండాను పట్టిన పళణి స్వామి తన ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీతో పొత్తే లేదంటూ వీరావేశంతో వ్యాఖ్యలు చేసి , చివరకు తమరు ఏం చేశారో అందరికి తెలుసు అని చురకలంటించారు. కారుణ్య నియామకాలు అనంతరం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో మరణించిన పోలీసుల కుటుంబాలకు చెందిన వారసులు 115 మందికి కారుణ్య నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ అసిస్టెంట్, పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్ వంటి పోస్టులు ఇందులో ఉన్నారు. మరణించిన పోలీసు అధికారుల వారసులు 1,132 మంది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి 41 పోలీసు అసిస్టెంట్ సూపరింటెండెంట్, 444 మంది అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, 16,199 మంది గ్రేడ్ 2 కానిస్టేబుళ్లు, 472 మంది అసిస్టెంట్లు, 215 మంది జూనియర్ అసిస్టెంట్లు, 42 టైపిస్టుల పోస్టులు, 42 షార్ట్ హ్యాండ్ టైపిస్టుల పోస్టులు అంటూ మొత్తంగా 17,436 మందికి నియామక ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసినట్టు ఈసందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురుగానందం, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్, డీజీపీ శంకర్ జివాల్, పోలీస్ ప్రధాన కార్యాలయం డైరెక్టర్ వినీత్ దేవ్ వాంఖడే, పోలీసు సూపరింటెండెంట్ (సంక్షేమం) సత్యప్రియ పాల్గొన్నారు. -
అపోలో ఆస్పత్రిలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె: కీళ్లు సంరక్షణకు చైన్నెలోని అపోలో ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేసింది. కొత్తగా అపోలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్టు ఆ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోఫెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కన్నన్ తెలిపారు. స్థానికంగా మంగళవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు పురుషుల క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ ఎంఎం సెంథిల్ నాథన్ పాల్గొని చైన్నెలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా డాక్టర్ అరుణ్ కన్నన్ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ కేర్లో గణనీయమైన మార్పును సూచించే సమగ్రమైన జాయింట్ ఫ్రిజర్వేషన్ ప్రోగ్రామ్ అని తెలిపారు. ఈ కార్యక్రమం రోగులు కీళ్ల పనితీరును నిర్వహించడానికి, అనవసరమైన శస్త్రచికిత్సలను నివారించడానికి , చురుకై న జీవితాలను కొనసాగించడానికి సహాయపడడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కీళ్ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే నాన్–ఇన్వాసివ్ , మినిమల్లీ ఇన్వాసివ్ చికిత్సలను ముందుకు తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తుందన్నారు. అనంతరం తమిళనాడు పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ సెంథిల్ నాథన్ మాట్లాడుతూ, క్రికెట్ ఆటగాళ్ల నుంచి వారి దైనందిన జీవితాన్ని గడిపే సాధారణ వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన కీళ్లు చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో చైన్నెలోని అపోలో హాస్పిటల్స్ కిచెందిన సీనియర్ కన్సల్టెంట్లు డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, డాక్టర్ ఎన్. చిదంబరనాథన్, డాక్టర్ నవలాడి శంకర్, డాక్టర్ కె.పి. కోసిగన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు
వేలూరు: జిల్లాలో కరోనా వ్యాపించకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. మంగళవారం ఉదయం వేలూరు తొర్రపాడిలోని తందై పెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో రూ.2.33 కోట్ల వ్యయంతో తరగతి గదుల నిర్మాణం కోసం సీఎం స్టాలిన్ చైన్నె సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ చేశారు. దీంతో కలెక్టర్ సుబ్బలక్ష్మి వేలూరులో పూజలు చేసి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వారం జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్షించి, డెంగీ, మలేరియా, తదితర వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బందితో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల కరోనా వ్యాపిస్తుందని సమాచారం వచ్చిందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం వద్ద నుంచి ఇంత వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని వైద్యాధికారులతో సంప్రదించి, నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున పంటలు, వంకలు, వాగులు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సంబంధిత అఽధికారులతో సమీక్షించి, అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, అధికారులు పాల్గొన్నారు. -
షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ..
స్పృహతప్పి పడి ఆర్మీ అధికారి మృతి అన్నానగర్: కశ్మీర్కు చెందిన ఉమాంగర్ (28) పరంగిమలైలోని ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. ఈనెల 16న అతను మీనంబాక్కంలోని కేంద్రంలో షూటింగ్ శిక్షణలో పాల్గొన్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఉమాంగర్ స్పృహతప్పి పడిపోయాడు. ఇతర సైనిక అధికారులు వెంటనే అతన్ని చికిత్స కోసం బరంగేహిల్లోని సైనిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఉమాంగర్ మంగళవారం తెల్లవారుజామున మరణించారు. ఎండదెబ్బ ప్రభావం వల్ల శరీరంలో డీహైడ్రేషన్కు గురై అతడు చెందినట్లు తెలుస్తుంది. మీనంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిలేదు ● ప్రజలు భయపడాల్సిన పనిలేదు కొరుక్కుపేట: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిలేదని ప్రజలు భయపడవద్దని తమిళనాడు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన కరోనా, ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభావాన్ని చూపింది. అయితే, తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలుతోపాటూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడం, టీకాలు విస్తృతంగా అందించడం ద్వారా, కరోనా మహమ్మారిని తరిమికొట్టామన్నారు. కాగా ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా, ప్రభావితమైన వ్యక్తులలో ఎటువంటి తీవ్రమైన లక్షణాలు కనిపించలేదు. కరోనా వైరస్ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదన్నారు. అయితే సాధారణ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాలి, సరైన ఇన్ఫెక్షన్ నివారణ చర్యలను పాటించాలి. లక్షణాలు ఉన్నవారు, ముఖ్యంగా జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నవారు సమీపంలోని వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలని కోరారు. పది, ప్లస్–1 సప్లిమెంటరీ పరీక్షకు 22 నుంచి దరఖాస్తులు కొరుక్కుపేట: పదో తరగతి, ప్లస్–1 సప్లిమెంటరీ పరీక్షకు 22వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి, ప్లస్–1 తరగతుల విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు జూలై 4 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ పరీక్షకు పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారు, పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు ఈనెల 22వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ దరఖాస్తులు అందజేయడానికి జూన్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని తెలిపింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులు జిల్లాల వారీగా ప్రభుత్వ పరీక్షా సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్ష రుసుం, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రుసుం నగదు రూపంలో చెల్లించాలని పేర్కొంది. అలాగే స్పెషల్ అడ్మిషన్ స్కీమ్ (తత్కాల్) కోసం దరఖాస్తులను జూన్ 5, 6 తేదీలలో పాఠశాల సేవా కేంద్రాలలో తగిన రుసుముతో ఆన్లైన్లో సమర్పించవచ్చని పేర్కొంది. ప్రత్యేక ప్రవేశ రుసుం పదో తరగతికి రూ.500, ప్లస్–1కు రూ.1000గా నిర్ణయించారు. ప్రభుత్వ , ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారికి ఈ రుసుము నుంచి మినహాయింపు ఉంటుందని డైరెక్టరేట్ పేర్కొంది. ఇతర వివరాలకు www.dfe.in.gov.in అనే వెబ్సైట్లో సంప్రదించాలని తెలిపింది. అద్దకం పరిశ్రమలో విషవాయువుకు ముగ్గురు బలి కొరుక్కుపేట: తిరుప్పూరులో ఓ అద్దకం పరిశ్రమలో విషవాయువు పీల్చి ముగ్గురు మృతి చెందారు. తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం సమీపంలోని కరైప్పుదూర్లో ఒక ప్రైవేట్ అద్దకం కర్మాగారం పనిచేస్తోంది. ఈ కర్మాగారంలోని డై వేస్ట్ వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడానికి కంపెనీలో పనిచేస్తున్న శరవణన్ (30), వేణుగోపాల్ (31), హరి (26), చిన్నస్వామి (36) అనే నలుగురు వ్యక్తులు దాదాపు 6 అడుగుల లోతున ఉన్న మురుగునీటి ట్యాంక్లోకి దిగారు. ట్యాంక్లోకి దిగిన కొద్దిసేపటికే, చిన్నస్వామికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది మొదలైంది. దీంతో బయటకు వచ్చేశారు. శరవణన్, వేణుగోపాల్, హరి శుభ్రపరిచే పనిలో కొనసాగారు. చిన్నస్వామి పైనుంచి దీన్ని పర్యవేక్షిస్తున్నాడు. విషపూరిత వాయువుకు శరవణన్, వేణుగోపాల్, హరి స్పృహ కోల్పోయారు. వెంటనే ఆ ముగ్గురినీ రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ శరవణన్, వేణుగోపాల్ మరణించారు. హరి ప్రాణాపాయ స్థితిలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి బాలుడి మృతి
సేలం: బావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సేలం సమీపంలోని నీల్వరపట్టి ప్రాంతానికి చెందిన శక్తివేల్ దినసరి కూలీ. ఇతనికి నిషాంత్ (8) కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో షాక్కు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. మంగళవారం ఉదయం వెతుకులాట కొనసాగించగా, అక్కడి సమీపంలోని ఓ బావిలో అతని మృతదేహం కనిపించింది. ఈ విషయమై మల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి, సేలం ప్రభుత్వాస్పత్రికి పంపారు. శవపరీక్ష తర్వాతే బాలుడు ఎలా చనిపోయాడో తెలుస్తుంది. అతను బావిలో పడి చనిపోయాడా?, లేక ఎవరైనా అతన్ని చంపి బావిలో పడేశారా? అనే విషయంలో మిస్టరీ కొనసాగుతోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం దుకాణం ప్రారంభించొద్దు
నిరసన తెలుపుతున్న పట్టాభిరామాపురం మహిళలుతిరుత్తణి: పట్టన శివారులో మద్యం దుకాణం ప్రారంభించవద్దని మహిళలు ఆందోళన చేపట్టారు. తిరుత్తణి సమీపం చైన్నె తిరుపతి జాతీయ రహ దారి సమీపంలో పట్టాభిరామాపురం పంచాయతీ పరిధిలో కొత్తగా టాస్మాక్ మద్యం షాపు ప్రారంభానికి టాస్మాక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త మద్యం షాపు ప్రా రంభాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆర్డీఓ, డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో మంగళవా రం పట్టాభిరామాపురం గ్రామానికి చెందిన మహిళలు వంద మందికి పైగా మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. దీంతో పట్టణ సీఐ మదియరసన్ మహిళలతో చర్చలు జరిపారు. గ్రామీణుల వ్య తిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టాస్మాక్ దుకాణం మరో ప్రాంతానికి తరలించేందుకు చర్చలు తీసుకుంటామని, గ్రామస్తులు ఆందోళన విరమించాలని కోరారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. -
ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు దరఖాస్తుల హోరు
● 1,61,324 మంది నమోదుసాక్షి, చైన్నె : రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు దరఖాస్తులు హోరెత్తాయి. 1,61,324 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడంతో సీట్లకు డిమాండ్ నెలకొన్నట్లు అయ్యింది. రాష్ట్రంలో 165 ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో డిగ్రీ కోర్సులకు సంబంధించి సుమారు 1.08 లక్షల సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ నిమిత్తం నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి 1,61,324 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 46,691 మంది విద్యార్థులు, 75,959 మంది విద్యార్థినులు, మిగిలిన వారు మూడో కేటగిరికి చెందిన వారు ఉన్నారు. వీరిలో 1,22,698 మంది విద్యార్థులు దరఖాస్తు రుసుం సైతం చెల్లించి ఉన్నారు. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉంది. ఈ దృష్ట్యా, రెండు లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల కోసం ఉన్నత విద్యాశాఖ హెల్ప్–డెస్క్, విద్యార్థులకు మార్గదర్శకం, అడ్మిషన్ ఫెసిలిటేషన్ సెంటర్లు తదితర వివరాలను తెలియజేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం విద్యార్థులు 044–24342911 నంబర్కు కాల్ చేసి సమాచారం పొందేలా టోల్ ఫ్రీ నంబర్ను మంగళవారం ప్రకటించింది. అలాగే, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సైనన్స్ కళాశాలల్లో ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రత్యేక కోర్సులను సైతం అందించనున్నారు. కోర్సులు... కళాశాలలు కాలేజ్ రెగ్యులర్ ఆర్ట్స్ అండ్ సైనన్స్, మేనేజ్మెంట్ కోర్సులతో కూడిన ప్రత్యేకమైన కోర్సులు క్వీన్ మేరీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) అందించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. బ్యాచిలర్ ఆఫ్ జియోగ్రఫీ, టూరిజం, గృహ ఆర్థిక శాస్త్రం, పోషకాహారం, ఆహారసేవ నిర్వహణ, హోమియోపతి, వైద్య పోషకాహారం, ఆహార నియమాలు (హోం సైన్న్స్ – క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్), భారతీయ సంగీతం తదితర కోర్సులను కూడా అందించనున్నారు. నందనం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, వ్యాసార్పాడిలోని డాక్టర్ అంబేడ్కర్ గవర్నమెంట్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్– న్యూట్రిషన్, ఆహార సేవా నిర్వహణ, ఆహార వ్యవస్థ (హోం సైన్స్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సర్వీస్ నిర్వహణ ఆహార నియంత్రణ), బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ, విజువల్ కమ్యూనికేష్న్లో బ్యాచిలర్ డిగ్రీ కమ్యూనికేషన్), కాయిదే ఏ మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)లో బ్యాచిలర్ ఆఫ్ హోమ్ సైన్స్, ఆలందూరు ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ, చైన్నె రాజధాని కళాశాలలో బీఏ భూగర్భ శాస్త్రం, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం బి.కామ్ ,బి.కాం(హియరింగ్ ఇంపెయిర్డ్), బీసీఏ(హియరింగ్) వంటి కోర్సులను అందించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. కాగా, విద్యా పరంగా కొత్త కోర్సులను ప్రకటించినా, అదనపు సీట్లను పెంచినా, ఈ సారి దరఖాస్తులు హోరెత్తుతుండడం చూస్తుంటే, డిగ్రీ కోర్సులకు డిమాండ్ మరింతగా పెరగడం ఖాయమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సీట్లకు డిమాండ్ పెరిగిన పక్షంలో ఇంజినీరింగ్కు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. -
పది కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు అరెస్టు తిరువళ్లూరు: బస్సులో గంజాయిని తరలించి విక్రయించడానికి యత్నించిన ఇద్దరిని సెంగుడ్రం పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా సెంగుండ్రం, ఎన్నూరు, అత్తిపట్టు, మీంజూరు తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్టు ఆవడి పోలీసు కమిషనర్ శంకర్కు ఫిర్యాదు అందింది. దీంతో సంబంధిత ప్రాంతాల్లో ఇన్స్పెక్టర్ శశికుమార్ నేతృత్వంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో సెంగుండ్రం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించారు. విచారణలో పట్టుబడిన వ్యక్తులు కారైకాల్ జిల్లాకు చెందిన మాదేష్(19), రాహుల్శుక్లా(20)గా గుర్తించారు. వీరు ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సులో గంజాయిని తరలించి విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. వారి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. -
చేపలవేటకు వెళ్లిన వ్యక్తి మృతి
తిరువళ్లూరు: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన తిరువళ్లూరు సమీపంలోని పోలీవా క్కం గ్రామంలో విషాదం నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కం గ్రామానికి చెందిన అమల్రాజ్(42). ఇతడికి భార్య పిల్లలు ఉన్నారు. వికలాంగుడైన అమల్రాజ్ సోమవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని పొన్నిమ్మన్ ఆలయం వద్ద వున్న కొలనులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపల వేట సాగిస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో కొలనులో పడిపోయాడు. ఈ సమయంలో సాయం కోసం గట్టిగా అరవడంతో చుట్టుపక్కలనున్న వారు అమల్రాజ్ను రక్షించి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అతడ్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య ఇందిర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు. -
17 ఏళ్లుగా పోరాడుతున్నాం..!
యోగిడా చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై యూనిట్ సభ్యులు తమిళసినిమా: ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సెంథిల్ కుమార్ నిర్మాతగా మారి శ్రీ మౌనిక సినీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం యోగిడా. నటి సాయి ధన్సిక ఫవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించిన ఈ చిత్రంలో షాయాజీ షిండే, మనోబాల, కబీర్ తుహాన్ సింగ్, ఎస్థర్, రాజ్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ కృష్ణ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి ఎస్కేఏ.భూపతి ఛాయా గ్రహణం, దీపక్ దేవ్ నేపథ్య సంగీతాన్ని, అస్వమిత్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యా బ్లో నిర్వహించారు. కార్యక్రమంలో నటుడు విశాల్, దర్శకుడు ఆర్ వీ.ఉదయ్ కుమార్, పేరరసు, రాధా రవి, మీరా కధిరవన్, మిత్రన్ ఆర్.జవహర్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటి సాయి ధన్సిక మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి పోరాడుతూనే ఉన్నామన్నారు. శ్రమను మాత్రమే నమ్మి ఈ రంగంలో ఇంతకాలం పయనించడం వల్ల యోగిడా చిత్రం వరకు వచ్చానన్నారు. నటుడు విశాల్ తనకు 15 ఏళ్ల క్రితమే తెలుసని చెప్పారు. ఆయన తాను ఆగస్టు 29వ తేదీన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నటుడు విశాల్ మాట్లాడుతూ సినిమా బాగా వచ్చిందని ముఖ్యంగా ఫైట్ సన్నివేశాలు బ్రహ్మాండంగా కుదిరాయని చెప్పారని, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సాయి ధన్సిక తాను ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. యోగిడా చిత్రంలో ఫైట్స్ సన్నివేశాల్లో నటి సాయి ధన్సిక అద్భుతంగా నటించారని విశాల్ ప్రశంసించారు. -
ఆక్రమ ఇళ్ల తొలగింపు
కొరుక్కుపేట: అడయార్ నదిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగించారు. సాయుధ పోలీసులు మోహరింపుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పల్లవరం పక్కనే ఉన్న అనకాపుత్తూరులో అడయార్ నది ఉంది. ఈ నదీ తీరంలో క్వాయిడ్–ఎ–అజంమిల్లత్ నగర్, శాంతి నగర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 ఇళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ అడయార్ నది ఒడ్డున ఉన్న పరీవాహక ప్రాంతంలో స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. మొదటి దశలో 81 కుటుంబాలను ఖాళీ చేయించి, తమిళనాడు హౌసింగ్ బోర్డు రూ.100 కోట్లతో నిర్మించిన అపార్ట్మెంట్లలో ఇళ్లు ఇచ్చారు. చైన్నె పెరుంబాక్కం, గూడూవాంచేరి, కీరప్పక్కం, కిష్కింధ సెల్లం రోడ్ ప్రాంతాల్లో రూ.30 లక్షలు విలువచేసే గృహాలను అందించారు. ఈ పరిస్థితిలో ఈ నెల 12వ తేదీన రెవెన్యూ శాఖ అధికారులకు మిగిలిన ఆక్రమణల గురించి సమాచారం అందించారు. ఆ ప్రాంతం నుంచి వంద మందికి పైగా ప్రజలు గుమిగూడి, చేతుల్లో బ్యానర్లు పట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. దీంతో అధికారులు ఆక్రమణ తొలగింపు పనిని వదిలేశారు. ఈ పరిస్థితిలో మంగళవారం ఉదయం చెంగల్పట్టు కలెక్టర్ అరుణ అధ్యక్షతన మళ్లీ రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనకాపుత్తూర్ అడయార్ నది ఒడ్డున ఉన్న ఆక్రమణలను తొలగించడానికి సిద్ధం అయ్యారు. ఇందుకోసం వంద మందికి పైగా సాయుధ పోలీసు అధికారులు ముందుగానే మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తరువాత, అధికారులు ప్రజలతో నిర్వహించిన చర్చలో 20 కుటుంబాలు తమ ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వం కేటాయించిన అపార్ట్మెంట్లలోకి మారడానికి అంగీకరించాయి. తరువాత, అధికారులు ప్రొకై ్లయిన్తో ఇళ్లను తొలిగించారు. -
ఫలించని చికిత్స.. ఏనుగు మృతి
సేలం: చికిత్స ఫలించక ఏనుగు మృతి చెందింది. తల్లి ఏనుగు మరణించడంతో గున్నఏనుగు తల్లఢిల్లింది. ఆ గున్న ఏనుగును అటవీ అధికారులు తమ సంరక్షణలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. కోయంబత్తూరు సమీపంలోని మరుదమలై అటవీప్రాంతంలో శనివారం ఓ ఆడ ఏనుగు కదల లేని స్థితిలో పడి ఉండడం, దాని చుట్టూ గున్నఏనుగు తిరుగుతూ ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులు, వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. ఆదివారం నుంచి ఆ తల్లి ఏనుగుకు చికిత్సలు అందించే ప్రయత్నం చేశారు. తన తల్లికి ఏమైందో తెలియక ఆందోళనతో ఆ పిల్ల ఏనుగు అటు ఇటు తిరుగుతూ తీవ్రవిషాదంతో కనిపించింది. తన తల్లి వద్దకు వైద్యులు, అటవీ అధికారులు వెళ్లే ప్రయత్నం చేయగా, అడ్డుకునేపనిలో పడింది. చివరకు ఆ పిల్ల ఏనుగును అటవీ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. తల్లి ఏనుగు లేవ లేని స్థితిలో ఉండడంతో క్రేన్ల సాయంతో నిలబెట్టి వైద్య చికిత్సలు అందించారు. తల్లి ఏనుగును రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. మంగళవారం ఆ తల్లి ఏనుగు మరణించింది. జీవచ్చవంగా పడి ఉన్న తల్లి ఏనుగును చూసి ఆ పిల్ల ఏనుగు పడిన మదన వేదన అక్కడున్న వారిని కలిచి వేసింది. ఆ ఏనుగును వైద్యులు అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి పోయారు. మూడు రోజులుగా ఆహారంతో పాటు మందులు ,మాత్రలు అన్ని ఇచ్చినా, ఆ ఏనుగు ఆరోగ్యం కుదుట పడ లేదని, తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్టు వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఏనుగు కళేబరానికి అంత్యక్రియలు జరిపే పనిలో అటవీ అధికారులు పడ్డారు. అలాగే ఆ పిల్ల ఏనుగును తమ సంరక్షణలో ఉంచుకున్నారు. తదుపరి ఏనుగుల మందలోకి ఆ పిల్ల ఏనుగును పంపించడమా..? లేదా మరెదేని ప్రత్యామ్నాయం అన్నది ఉందా..? అని పరిశీలిస్తున్నారు. -
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
తిరువళ్లూరు: భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఉత్తర ప్రదేశ్కు చెందిన యువకుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తిరువళ్లూ జిల్లా మహిళ కోర్టు న్యాయమూర్తి రేవతి తీర్పు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హరీష్ (29) తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు టీచర్ కాలనీలో భార్య రజియాకాట్టు(36)తో కలిసి నివాసమున్నాడు. ఈ క్రమంలో భార్యపై హరీష్కు అను మానం ఉండేది. ఈ విషయమై ఇద్దరి మధ్య తర చూ మనస్పర్థలు రావడంతో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో 2022 మే1న హరీష్ భార్యను హత్య చేశాడు. ఈ సంఘటనపై మృతు రాలి బంధువు అంబత్తూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు మహిళ కోర్టులో సాగింది. నేరం రుజువు కావడంతో హరీష్కు యావజ్జీవశిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రేవతి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ముద్దాయిని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. -
సీఎం స్టాలిన్
‘నీతి ఆయోగ్’కు● 23న హస్తిన పర్యటన ● జాతీయ స్థాయి నేతలతో భేటీకి ఏర్పాట్లు సాక్షి, చైన్నె: నిధుల విడుదలలో తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి అనుసరిస్తున్నట్టు ఆది నుంచి రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాము వ్యతిరేకిస్తున్న పథకాలను సైతం అమలు చేయాల్సిందేనని కేంద్రం ఒత్తిడి తీసుకు రావడాన్ని డీఎంకే పాలకులు ఇప్పటికే తీవ్రంగా పరిగణించి ఉన్నారు. అలాగే లోక్సభ పునర్విభజన వ్యవహారంలో గానీయండి, నిధుల విడుదల విషయంలో గానీయండి ప్రధాని నరేంద్ర మోదీని ఎంపీల బృందంతో వెళ్లి కలిసేందుకు అనుమతి కోరినా, ఇంత వరకు అవకాశం అన్నది సీఎం స్టాలిన్కు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 24వ తేదీన ఢిల్లీ వేదికగా నీతి అయోగ్ భేటీ జరుగుతుండడంతో ఈ సమావేశాన్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో డీఎంకే పాలకులు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో తమ గళాన్ని వినిపించడం లేదా నిరసనను తెలియజేయడానికి అవకాశం దక్కినట్టుగా భావిస్తున్నారు. ఇది వరకు నీతి అయోగ్ భేటీకి ఆర్థిక మంత్రి వెళ్లేవారు. గత ఏడాది అయితే ఏకంగా భేటీని బహిష్కరించారు. అయితే, ఈసారి మాత్రం స్వయంగా తానే ఈ సమావేశానికి వెళ్లేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టి ఉన్నారు. ఈనెల 23వ తేదీన సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. నీతి అయోగ్ భేటీతో పాటూ ఈ సమావేశానికి వచ్చే బీజేపీయేతర ప్రభుత్వాల సీఎంలను ప్రత్యేకంగా భేటీకి కసరత్తులలో ఉన్నారు. పది ముసాయిదాల వ్యవహరంలో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి 14 ప్రశ్నలను సంధిస్తూ లేఖ రాయడాన్ని వ్యతిరేకించే విధంగా బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు ఇప్పటికే స్టాలిన్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జరగనున్న నీతి అయోగ్కు హాజరయ్యే వివిధ రాష్ట్రాల సీఎంలను ఏకం చేసే దిశగా తన పర్యటనకు స్టాలిన్ సన్నద్ధం అవుతున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.క్వీన్ మేరీ కళాశాలలో.. ప్రారంభోత్సవాలతో బిజీబిజీ ఢిల్లీ పర్యటన కసరత్తులు ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు మంగళవారం సీఎం స్టాలిన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలలో బిజీ అయ్యారు. తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్మెంట్ బోర్డు తరపున రూ. 527.84 కోట్లతో నిర్మించిన బహుళ అంతస్తుల తరహాలోని 4,978 ప్లాట్లను ప్రారంభించారు. తమిళనాడు హౌసింగ్ బోర్డు నేతృత్వంలో రూ. 207 కోట్లతో నిర్మించిన నాలుగు బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలను ప్రారంభించారు. ఇందులో అందరికీ గృహనిర్మాణ పథకం కింద చైన్నెలోని కై లాసపురం 14 అంతస్తులతో కూడిన 392 ప్లాట్లు , విరుదునగర్ నగర్లో మూడు అంతస్తులతో కూడిన పలు టవర్ల అపార్ట్మెంట్లలో 864 ప్లాట్లు, మధురై జిల్లాలోని ఉచ్చపట్టిలో మూడు అంతస్తుల కూడిన పలు టవర్ల అపార్ట్మెంట్లలో 672 ప్లాట్లు కళ్లకురిచ్చిలో 512, తిరుప్పూర్ 432, కాంచీపురం సాలమంగళంలో 420 ప్లాట్లు ఉన్నాయి. అలాగే, తమిళనాడు హౌసింగ్ బోర్డు చైన్నె నెర్కుండ్రం, సీఐటీ నగర్, మదురై, తోప్పూర్లో నిర్మించిన బహుళ అంతస్తులతో కూడిన వాణిజ్య సముదాయ భవనాలు కూడా ఉన్నాయి. కార్యక్రమంలో మంత్రులు ముత్తుస్వామి, అన్బరసన్, సీఎస్ మురుగానందం, అదనపు ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, తమిళనాడు హౌసింగ్ బోర్డు చైర్మన్ పూచ్చి ఎస్మురుగన్, తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్మెంట్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ మిశ్రా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె. విజయకార్తికేయన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. సమీరన్ పాల్గొన్నారు. అనంతరం చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున రూ. 14.66 కోట్లతో పూర్తి చేసిన ఐదుప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే, రూ.255.60 కోట్లతో చేపట్టనున్న 20 కొత్త పనులకు శంకుస్థాపన చేశారు.చైన్నె క్వీన్ మేరీ కళాశాలలో ఉన్నత విద్యా శాఖ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరు అయ్యారు. రూ. 42 కోట్లతో కొత్తగా నిర్మించిన విద్యార్థుల హాస్టల్ భవనంతో సహా ఉన్నత విద్యాశాఖ తరపున 120.02 కోట్లుతో నిరిచిన భవనాలను ప్రారంభించారు. రూ. 207.82 కోట్లు నిర్మించనున్న కొత్త భవనాల స్టాలిన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెలియన్, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్, విల్సన్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సమయమూర్తి తదితరులు పాల్గొన్నారు.ముందుగా వాల్ టాక్స్ రోడ్డులోని బకింగ్ హాం కాలువలో పూడిక తీత పనులను సీఎం పరిశీలించారు. వర్షాల సీజన్ ఆరంభంలోపు పనులు ముగించాలని అధికారులను ఆదేశించారు. కాగా సచివాలయంలో సీఎం స్టాలిన్ను కశ్మీర్ నుంచి వచ్చిన విద్యార్థులు కలిశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కశ్మీర్, సరిహద్దు రాష్ట్రాలలోని విద్యా సంస్థలలో చిక్కుకున్న తమిళ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా ఇక్కడకు రప్పించిన విషయం తెలిసిందే. తమను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చిన సీఎంకు సచివాలయంలో విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు
తిరువళ్లూరు: ప్రైవేటు కంపెనీల నుంచి వెలువడే ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ చేసిన ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతె అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కన్నూరు కళంబేడు ప్రాంతంలో ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో సమీపంలోని ప్రైవేటు కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను భారీగా డంప్ చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడాయి. అలాగే ఆ ప్రాంతంలో పొగ కమ్ముకోవడంతో సమీప గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. -
ఏర్కాడు పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు
సేలం: ఏర్కాడులో పర్యాటకులకు ప్రాథమిక సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారుల ను జిల్లా కలెక్టర్ ఇరా బృందాదేవి ఆదేశించారు. ఈనెల 23వ తేదీన ప్రారంభం కానున్న 48వ వేసవి ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రసిద్ధ వేసవి హిల్ స్టేషన్లలో ఒకటైన ఏర్కాడులో ప్రతి సంవత్సరం ఏర్కాడు వేసవి ఉత్సవం జరుగుతుందని, వేసవి కాలాన్ని జరుపుకోవడానికి పాఠశాల పిల్లలు, పర్యాటకులు ఇతర ప్రజా సందర్శకులు ఏర్కాడు కొండలకు వస్తార న్నారు. ఈ 48వ ఏర్కాడు వేసవి ఉత్సవం ఈ నెల 23న ప్రారంభమై 29వ తేదీ వరకు 7 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఏర్కాడు వే సవి ఉత్సవానికి పర్యాటకులను ఆకర్షించడానికి, ఉద్యానవన శాఖ అన్నాపార్క్లో 1.50 లక్షల పూల తో పూల ప్రదర్శన, చేతిపనుల ప్రదర్శన, కూరగాయల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. అలాగే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రో గ్రామ్, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, ఉమెన్స్ ప్రోగ్రామ్ వంటి విభాగాల తరపున వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేసవి ఉత్సవంలో ప్రతిరోజూ వివిధ కళా, సంగీత ప్రదర్శనలు, పెంపుడు జంతువుల ప్రదర్శనలు, పడవ పందేలు తదితర కార్యక్రమాలు జరుగుతా యని వెల్లడించారు. అలాగే ఏర్కాడు పర్వత మా ర్గంలో రోడ్డు భద్రత గురించి పర్యాటకులలో అవగాహన కల్పించడానికి రవాణా శాఖ అవగాహన కో సం బ్యానర్లు, గోడ ప్రకటనలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు, పాదచారులు రోడ్డు నియమాలను, జిల్లా యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. కలెక్టర్ ఇరా బృందాదేవి -
ఐదుగురిని బలిగొన్న క్వారీ
సాక్షి, చైన్నె: శివగంగైలో ఓ క్వారీలో మట్టి చరియలు విరిగిపడ్డాయి. ఐదుగురు కార్మికులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. శివగంగై జిల్లా తిరుపత్తూరు సమీపంలోని మలకోట్టై గ్రామంలో మేఘ వర్ణం అనే వ్యక్తి క్రషర్ క్వారీని నిర్వహిస్తున్నాడు. ఇక్కడ మంగళవారం ఉదయం కార్మికులు విధులలో ఉన్నారు. ఇందులో ఆరుగురు కార్మికులు ఓ చోట పనిచేస్తుండగా హఠాత్తుగా మట్టి చరియలు విరిగి పడ్డాయి. వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. ఇందులో ఒకరు పెట్టిన కేకలతో మిగిలిన వారు పరుగులు తీశారు. మట్టి చరియలు పెద్ద ఎత్తునపడడంతో సహాయక చర్యలకు సంక్లిష్టంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గుర్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరు చికిత్స ఫలించక మరణించారు. మరో ముగ్గురు మట్టి చరియల శిథిలాల క్రింద మరణించారు. వీరి మృతదేహాలను అతి కష్టంపై వెలికి తీశారు. ఈ ఘటన సమాచారంతో మంత్రి పెరియకరుప్పన్, జిల్లా కలెక్టర్ ఆశా అజిత్లతో పాటుగా అధికారులుసంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మరణించిన వారిలో స్థానికుడైన ఆండి చామి, గణేషన్ ఉన్నారు. మిగిలిన వారు ఒడిశ్వా కార్మికులుగా భావిస్తున్నారు. వీరి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ● మట్టి చరియలు విరిగి పడడంతో ఘటన -
ఇళ్లకు వడ్డన ఇల్లే!
● అన్ని రాయితీలు కొనసాగుతాయి ● మంత్రి శివ శంకర్ స్పష్టంసాక్షి, చైన్నె: గృహాలకు ఎలాంటి విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని, అన్ని రకాల రాయితీలు కొనసాగుతాయని విద్యుత్, రవాణాశాఖ మంత్రి ఎస్ శివశంకర్ స్పష్టం చేశారు. ఏటా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జూలైలో విద్యుత్ చార్జీలను వడ్డిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2023లో గృహాలకు పెంపు నుంచి మినహాయించారు. 2024 లోక్ సభ ఎన్నికల అనంతరం జూలైలో 4.83 శాతం చార్జీలను వడ్డించారు. ఈ పరిస్థితులలో తాజాగా 3.16 శాతం చార్జీలను వడ్డించే విధంగా విద్యుత్ బోర్డు కసరత్తులు చేసి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న డీఎంకే ప్రభుత్వానికి ఈ పెంపు కసరత్తులు ఇరకాటంలో పడేశాయి. ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యారంటూ ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. దీంతో విద్యుత్ మంత్రి శివశంకర్ స్పందించారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు మంత్రి శివశంకర్ పేర్కొంటూ, గత కొన్ని రోజులుగా విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ వస్తున్న సమాచారాలను ఖండించారు. ఇవన్నీ అనధికారికం అని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. తమిళనాడు విద్యుత్ నియంత్రణ కమిషన్ ద్వారా కూడా ఎలాంటి సిఫారసులు, కసరత్తులు జరగ లేదని వివరించారు. అయితే, విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి రెగ్యులేటరీ కమిషన్ ఒక ఉత్తర్వులు సిద్ధం చేసేటప్పుడు గానీ, అమలు చేసేటప్పుడు గానీ, గృహ విద్యుత్ వినియోగ దారులకు ఎలాంటి పెంపు అన్నది ఉండదన్నారు. గృహాలకు ఎలాంటి పెంపు అన్నది ఉండదని, ఉచిత, ఇతర రాయితీలన్నీ కొనసాగుతాయని స్పష్టం చేశారు. -
నీట్ మరో విద్యార్థిని మింగేసింది!
● ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య సేలం: సేలంలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థి ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. రాష్ట్రంలో నీట్ భయంతో బలన్మరణానికి పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. నీట్ రద్దుకు పాలకులు ఆది నుంచి పట్టుపడుతున్నా ఫలితం శూన్యం. దీంతో మరో బలి దానం తప్పలేదు. సేలం నరసొత్తి పట్టి ప్రాంతానికి చెందిన రంగన్ మెకానిక్ వర్క్షాప్ నడుపుతున్నాడు. ఆయన కుమారుడు గౌతమ్ (21) గతంలో రెండుసార్లు నీట్ పరీక్షకు హాజరయ్యాడు. తగినన్ని మార్కులు సాధించకపోవడంతో అతను ప్రస్తుతం మూడోసారి నీట్ పరీక్ష రాశాడు. గౌతమ్ ఈ పరీక్ష సరిగ్గా రాయలేదని చెబుతూవచ్చాడు. కొన్ని రోజులుగా ఫెయిల్ అవుతానన్న భయంతో ఇంట్లో విచారంగా ఉంటూ వచ్చాడు. ఈ పరిస్థితిలో సోమవారం రాత్రి, అతని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గౌతమ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. మంగళశారం ఈ విషయం తెలుసుకున్న సూరమంగళం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతదేహాన్ని శవపరీక్ష కోసం సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్యాప్తులో, గౌతమ్ నీట్లో ఫెయిల్ అవుతానన్న భయంతో బలవన్మరణానికి పాల్పడినట్టు తేలింది. కాగా, నీట్ మరణాలు పెరుగుతుండడంతో విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక నైనా నీట్ రద్దుకు పాలకులు సరైన మార్గంలో పయనించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు డిమాండ్ చేశారు. -
‘నైరుతి’ ఆశలు..
● ఆశాజనకంగా పవనాల కదలిక ● 24న రాష్ట్రాన్ని తాకే అవకాశం ● కావేరి పరవళ్లు ● మేట్టూరులోకి పెరిగిన నీటి రాక ● గోడ కూలి..ముగ్గురి మృతి సాక్షి, చైన్నె : నైరుతి రుతు పవనాల కదలిక ఆశాజనకంగా మారింది. ఈ రుతు పవనాలు ఈ నెల 24వ తేదీన లేదా 25వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఇందుకు శుభసూచకంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తారంగా, మరికొన్ని జిల్లాల్లో కుండ పోతగా వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో ఏటా నైరుతి రుతు పవనాల ప్రభావం అంతంత మాత్రమే. అయితే కేరళ, కర్ణాటకల్లో ఈ పవనాల రూపంలో వర్షాలు పడితే తమిళనాడులోని అన్నదాతలకు ఆనందమే. కేరళ నుంచి ముల్లై పెరియార్, వైగై, భవానీ సాగర్ జలాశయాలకు నీటి రాక పెరుగుతుంది. కర్ణాటకలో వర్షాలు కురిస్తే, కావేరి పరవళ్లు తొక్కినట్టే. అదే సమయంలో ఈ ఏడాది భానుడి ప్రతాపం మరీ ఎక్కువగానే రాష్ట్రంలో ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ దృష్ట్యా జల వనరులలో ప్రస్తుతం నీటి శాతం కూడా తగ్గి ఉంది. దీంతో నైరుతిపై ఆశలు మొదలయ్యాయి. సంవృద్ధిగా ఈ సారైనా వర్షాలు కురవాలని ప్రజలు ఎదురు చూశారు. ఇందుకు అనుగుణంగానే సమాచారాలు వెలువడ్డాయి. ముందుగానే నైరుతి ప్రవేశం నైరుతి రుతు పవనాలు ఇప్పటికే అండమాన్ తీరాన్ని తాకాయి. ఆశాజనకంగా ఈ పవనాలు కదులుతూ కేరళ తీరాన్ని మరికొద్ది రోజుల్లో తాకనున్నాయి. ఈ పవనాలు ఈనెల 28వ తేదీ తర్వాత తమిళనాడులోకి ప్రవేశించవచ్చని భావించారు. అయితే, ముందుగానే ఈనెల 24 లేదా 25 తేదీల్లో పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఈ పవనాలతో తమిళనాడు– కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్ కాశి, తేని, కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్ జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగా కురిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి చెదరుమదురుగా వర్షాలు పడుతున్నాయి. అలాగే, పశ్చిమ కనుమలలోని కోయంబత్తూరు, ఈరోడ్, నీలగిరి జిల్లాల్లోనూ బుధవారం నుంచి మరింతగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. డెల్టా, పశ్చిమ కనుమలతో పాటుగా 12 జిల్లాలో వర్షాలు పడనున్నాయి. కావేరి నదిలో నీటి ఉధృతి పెరిగింది. మేట్టూరు జలాశయంలోకి సెకనుకు పది వేల క్యూసెక్కుల నీరు ప్రవేశిస్తుంది. దీంతో జలాశయం నీటి మట్టం బుధవారం నాటికి 110 అడుగులకు చేరనుంది. కర్ణాటకలో మరింతగా భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి నుంచి నీటి రాక కావేరిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కావేరి తీరంలో అలర్ట్ ప్రకటించారు. చైన్నె శివారులో.. చైన్నె శివారులో మంగళవారం భారీ వర్షం కురిసింది. విమానాశ్రయం పరిసరాల నుంచి తాంబరం, చెంగల్పట్టు వైపుగా, కాంచీపురం వైపుగా గంటకు పైగా కుండ పోత వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరదలా నీరు పారింది. వాహన చోదకులకు ఇబ్బందులు తప్పలేదు. అదే సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో చైన్నెలో ల్యాండ్ కావాల్సిన పది విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. వాతావరణం మారిన అనంతరం ల్యాండింగ్ అయ్యాయి. మదురై పరిసరాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మదురై తిరుప్పర కుండ్రం సమీపంలోని పెరుంగుడి గ్రామంలో ఓ ఇంటి గోడ కూలింది. ఆ ఇంట్లో ఉన్న అమ్మా పిల్లై(65), వెంకటి(55)తో పాటుగా వీరమణి అనే బాలుడు మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. -
పళ్లిపట్టులో జాతర కోలాహలం
పళ్లిపట్టు: పళ్లిపట్టులో మంగళవారం జాతర కోలాహలం జరిగింది. జాతర సందర్భంగా గ్రామ దేవత కొళ్లాపురమ్మ ఆలయంలో అమ్మవారికి ఉదయం అభిషేక పూజలు చేసి, పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు అమ్మవారికి అంబలి సమర్పించారు. ఆలయం వద్ద పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి ,అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం కొళ్లపురమ్మకు మహి షాసుర మర్ధిని అలంకరణలో పుష్పాలంకరణ వాహన సేవలో కొలువు తీర్చి మేళతాళాలు నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. రాత్రి బంకమట్టితో గంగమ్మ తల్లిని అలంకరించి పూజలు చేసుకున్నారు. -
ఘనంగా అగ్నిగుండ ప్రవేశం
పళ్లిపట్టు: అత్తిమాంజేరిలోని ద్రౌపదీదేవి ఆలయంలో జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం అగ్నిగుండ ప్రవేశం ఘనంగా నిర్వహించారు. పళ్లిపట్టు యూనియన్లోని అత్తిమాంజేరి, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని వనదుర్గాపురం గ్రామాలు సంయుక్తంగా ఏటా మహాభారత యజ్ఞం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గత 9వ తేదీ నుంచి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా రోజూ మహాభారత హరికథాగానం, రాత్రి వీధి నాటకాలు ప్రదర్శించారు. ఆదివారం 500 మంది భక్తులు కంకణాలు ధరించి, అగ్నిగుండ ప్రవేశం చేశారు. రాత్రి అమ్మవారు గ్రామ వీధుల్లో ఊరేగారు. సోమవారం ఉదయం ధర్మరాజుల పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కాకర్లపూడి వెంకటరమణరాజు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. -
నైట్వాక్తో ‘లూపస్’పై అవగాహన
సాక్షి, చైన్నె: ఆళ్వార్ పేటలోని కావేరి హాస్పిటల్ నేతృత్వంలో చైన్నెలోని బెసెంట్ నగర్ ఎలియట్స్ బీచ్ రోడ్లో లూపస్ అవగాహన కోసం నైట్ వాక్ను విజయవంతంగా నిర్వహించారు. రుమటాలజీ విభాగం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. లక్షలాది మందిని ప్రభా వితం చేసే దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన లూపస్ గురించి ఈ కార్యక్రమంలో అవగాహన పెంచడం లక్ష్యంగా ముందుకు సాగారు. ఈ నడకతో రోగులు, సంరక్షకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సాధారణ ప్రజలను ఒకచోట చేర్చినట్లయ్యింది. లూపస్తో జీవిస్తున్న వారి ప్రయాణాన్ని ప్రకాశవంతం చేయడమే లక్ష్యంగా సోమవారం సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ షామ్ ఎస్ లూపస్ గురించి అవగాహన కల్పించే విధంగా ప్రసంగించారు. లూపస్ అనేది తరచుగా గుర్తించబడని సంక్లిష్టమైన పరిస్థితి అని, ఇది రోగ నిర్ధారణ , చికిత్సలో జాప్యానికి దారితీస్తుందని చెప్పారు. ముందస్తుగా గుర్తించడం ద్వారా ఆరోగ్యకరమైన, పూర్తి జీవితాలను గడపడానికి సహాయం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావేరి హాస్పిటల్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్తో తదితరులు పాల్గొన్నారు. -
వందేళ్ల బామ్మకు జన్మదిన వేడుకలు
తిరువళ్లూరు: వందేళ్లు దాటిన వృద్ధురాలికి కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పున్నపాక్కం గ్రామానికి చెందిన పొట్టెమ్మ(100). ఈమె భర్త జగన్నాథం. వీరికి 1925వ సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి దయాళం, జయమణి, పన్నీరు, శేఖర్, కస్తూరి, విజయన్, కృభా కరన్, చిత్ర తదితర 8 మంది సంతానం. వీరిలో ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. జగన్నాథం గత 2019లో మృతి చెందారు. పొట్టెమ్మ నాలుగు తరాలుగా కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనువరాళ్లు, మునిమనవళ్ల తో సహా మొత్తం 50 మందికి పైగా బంధువులతో కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో పొట్టెమ్మకు వందేళ్లు దాటిన క్రమంలో ఆమె జన్మదిన వేడుకలను ఆదివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధురాలిని గ్రామంలో ఊరేగించి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టి వేడుకలు జరిపారు. అనంతరం కుటుంబ సభ్యులు వృద్ధురాలితో గ్రూపు ఫొటో దిగారు. మూడుతరాలతో వృద్ధురాలికి.. కొరుక్కుపేట: కొడుకులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు మనవరాళ్ల ఇలా మూ డు తరాల వారసులతో కలసి ఓ వృద్ధురాలు 100వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. తంజా వూరు జిల్లా పాపనాశంశెట్టి వీధిలో డేవిడ్ నివసించారు. ఆయన కూరగాయలు, బియ్యం దుకాణం నడుపుతుండేవారు. 1925లో శివగంగై జిల్లాలోని సరుగాలిలో జన్మించిన రాజమణిని 1941లో వివా హం చేసుకున్నారు. వివాహం తర్వాత రాజ మణి తన భర్తతో కలసి పాపనాశంలో నివశించేది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఆరుగురు కుమార్తెలున్నారు. భర్త మరణించిన తరువాత రాజమణి ఆ దుకాణాన్ని చూసుకుంది. రాజమణి కుటుంబంలో 107 మంది ఉన్నారు. ఈ పరిస్థితిలో వృద్ధురాలు రాజమణికి 100 ఏళ్లు నిండాయి. దీంతో ఆదివారం రాజమణి తన 100వ పుట్టిన రోజును జరుపుకుంది. 107 మందితో కూడిన మూడు తరాల వారు పాల్గొని, ఎంతో ఘనంగా పుట్టిన రోజు జరిపించారు. డప్పులు, మంగళవాయిద్యాలు వాయిస్తూ టపాసులు పేల్చి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి విందు ఏర్పాటు చేసి సంబరంగా జరుపుకున్నారు. అందరూ రాజమణికి బహుమతులు అందించి, శాలువాలు కప్పి, స్వీట్లు అందజేసి ఆమె ఆశీస్సులు పొందారు. వృద్ధురాలి దీర్ఘాయువు రహస్యం గురించి ఆమె కుమారుడు జెబాస్టిన్ ఆనందన్ మాట్లాడుతూ తన అమ్మకు మాంసాహారం తినడం అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. ఇప్పటివరకు ఆమె అనారోగ్యం కారణంగా ఎప్పుడూ ఆస్పత్రికి వెళ్లలేదన్నారు. ఎల్లప్పు డూ సంతోషంగా ఉంటారు. తన రోజువారీ కార్యక్రమాలను తానే చేసుకుంటారని చెప్పారు. -
గ్రీవెన్స్డేకు 314 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేలో 314 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్డేను నిర్వహించారు. గ్రీవెన్స్డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించి కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. పట్టాలు కోసం 123 వినతులు, పక్కాగృహాలు 55, ఉపాధి 63, మౌలిక సదుపాయాలతో సహా ఇతర వసతుల కల్పించాలని 25 వినతులతో కలిపి మొత్తం 314 వినతులు వచ్చాయి. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్ ప్రతాప్, వాటిని తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మూడుచక్రాల వాహనం కోసం వినతి పత్రం సమర్పించిన వికలాంగులరాలికి తక్షణం రూ.15,400 విలువ చేసే వాహనాన్ని అందజేశారు. 2021లో కృష్ణాకాలువలో పడి మృతి చెందిన ప్రణేష్ అనే బాలుడి కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సాయం రూ.లక్ష చెక్కును తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు సహా 17 మంది రైతుల అరెస్టు
పళ్లిపట్టు: రైతుల పోరాటాన్ని పోలీసులు అడ్డుకుని, మహిళలు సహా 17 మంది రైతులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నగరి నుంచి దిండివనం వరకు 186 కి.మీ దూరం రైలు మార్గం పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం రైల్వే అధికారులు రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకుని, పనులు నిర్వహిస్తున్నారు. పళ్లిపట్టు యూనియన్లోని పాండ్రవేడు వద్ద రైలు మార్గం కోసం చెరువుతోపాటు మడుగును మట్టి పోసి పూడ్చుతున్నారు. దీంతో తమకు తాగునీటికి కష్టాలతోపాటు రెండు వేల ఎకరాల పంట భూములకు నీరందని పరిస్థితులు తలెత్తుతాయని, వెంటనే ప్రత్యామ్నయ మార్గంలో రైలు మార్గం పనులు చేపట్టాలని పాండ్రవేడు గ్రామానికి చెందిన రైతులు రైల్వే అధికారులను కోరారు. అయితే ఏమాత్రం పట్టించుకోకుండా చెరువులో రైల్వే మార్గం పనులు చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు సోమవారం ఉదయం రైలు మార్గం పనులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది పోలీసులు మొహరించి, అడ్డుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా పోరాటం చేపట్టారంటూ ఇద్దరు మహిళలసహా 17 మందిని పోలీసులు అరెస్టు చేసి, పొదటూరుపేటలోని పోలీసు సముదాయ భవనానికి తీసుకెళ్లారు. వారందరినీ సాయంత్రం విడిచిపెట్టారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు
తిరుత్తణి: స్థానిక బైపాస్ రోడ్డులో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్న క్రమంలో ప్రమాదాలను అరికట్టేందుకు వీలుగా అధికారుల బృందం సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కణిమెళి, డీఎస్పీ కందన్, మోటారు వాహన సీఐ రాజశేఖర్ తదితరుల బృందం బైపాస్ రోడ్డులో ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనచోదకులకు అవగాహన కల్పించారు. అనంతరం చైన్నె బైపాస్లో రోడ్డులో పార్కింగ్ చేసిన 45 బైకులకు రూ. 500 చొప్పున జరిమానా విధించారు. శాస్త్రోక్తంగా చక్రస్నానం నారాయణవనం: టీటీడీ అనుబంధ పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు సోమవారం ఉదయం పద్మ సరస్సులో చక్తతాళ్వార్కు చక్రస్నానాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి. వేకువ జామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి శ్రీవారి పల్లకీ సేవ చేపట్టారు. అనంతరం శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన వెంకటేశ్వర స్వామి చక్రతాళ్వార్తో కలిసి ఊరేగింపుగా పద్మ సరస్సుకు చేరుకున్నారు. అక్కడ వేద పండితులు చక్రత్తాళ్వార్తో కలిసి దేవరులకు సుగంధ దవ్యాలు, పాలు, పెరుగు, తేనే తదితర ద్రవ్యాలతో తిరుమంజనం పూర్తి చేశారు. 9.45 గంటలకు పద్మసరస్సులోని జలాలకు సంప్రోక్షణ చేసి చక్రస్నానం నిర్వహించారు. -
చౌక దుకాణం నూతన భవనం ప్రారంభం
పళ్లిపట్టు: పళ్లిపట్టు యూనియన్లోని రామసముద్రం గ్రామ పంచాయతీలోని నారాయణపురం గ్రామంలో వందకు పైబడిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తులకు రేషన్ వస్తువులు సరఫరా చేసేందుకు ప్రభుత్వ భవనం లేకపోవడంతో చాలాకాలంగా అద్దె భవనంలో వస్తువులు విక్రయించేవారు. దీంతో కొత్త భవనం నిర్మించాలని ఎమ్మెల్యే చంద్రన్కు గ్రామస్తులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే నియోజకవర్గ నిధుల నుంచి రూ. 7 లక్షలు కేటాయించి నూతన భవనం నిర్మించారు. ప్రారంభోత్సవానికి రామసముద్రం ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి గోవిందరాజ్ అధ్యక్షత వహించారు. మండల డీఎంకే కార్యదర్శి జి.రవీంద్ర స్వాగతం పలికారు. ముఖ అతిథిగా తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని నూతన భవనం ప్రారంభించి వినియోగదారులకు రేషన్ వస్తువుల పంపిణీని ప్రారంభించారు. -
సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం
కొరుక్కుపేట: చైన్నె పాత చాకలిపేటలోని కన్నికలమ్మ దేవస్థానం వేదికగా శ్రీ కృష్ణగీతా సమాజం స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సంగీత గాయకులు ఎంఆర్ సుబ్రమణ్యం బృందం భక్తిగీతాలాపన అందరినీ అలరించింది. ఈ నెల 4 నుంచి శ్రీమద్భగవద్గీత ఉపన్యాసములు 18 అధ్యాయములు నిర్విఘ్నంగా జరుగుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు శ్రీమద్భగవద్గీతలో అధ్యాయాలపై పోటీలు నిర్వహించారు. విజేతలకు పూజ్యశ్రీ సరస్వతి మాతాజీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. సోమవారం శ్రీమద్భగవద్గీతపై పూజ్యశ్రీ సరస్వతి మాతాజీ ప్రవచనం చేశారు. కాగా ప్రముఖ న్యాయవాది జక్కుల హరికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని, సరస్వతి మాతాజీ ఆశీస్సులు అందుకున్నారు. -
నటి మేఘ్నా స్వీయ దర్శకత్వంలో..
తమిళసినిమా: నటి మేఘ్నా కథానాయకిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించి, సంగీతాన్ని అందించిన చిత్రం 13/13 ఎన్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలో నిర్వహించారు. నటుడు ఎస్వీ.శేఖర్, తంబిరామయ్య, నట్టి, తేనప్పన్, దర్శకుడు కన్నన్, జయకుమార్, కళాదర్శకుడు రామలింగం తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. నటుడు తంబిరామయ్య మాట్లాడుతూ పలు ఏళ్ల తరువాత తమిళసినిమాలో ఒక కథానాయకి చిత్రానికి దర్శకత్వం వహించి, సంగీతాన్ని సమకూర్చి, నిర్మించారని, ఆమెను మనమంతా స్వాగతించాలని పేర్కొన్నారు. సినిమా రంగంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చునని, అయితే ప్రతిభ, శ్రమ, అంకిత భావం ఉంటే జయించవచ్చునని అన్నారు. చిత్ర కథానాయకి, దర్శక నిర్మాత మేఘ్నా మాట్లాడుతూ ఇది హారర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. కథా, కథనాలు ఉత్కంఠభరితంగా సాగుతాయని చెప్పారు. చిత్ర షూటింగ్ను మలేషియా, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
విద్యుత్ షాక్తో ప్లస్– 2 విద్యార్థి మృతి
– మరో విద్యార్థికి గాయాలుతిరువొత్తియూరు: వరత్తనాడు సమీపంలో కొబ్బరి కోస్తున్న సమయంలో కత్తి విద్యుత్తు తీగకు తగలడంతో షాక్ తగిలి ప్లస్–2 విద్యార్థి మృతి చెందాడు. మరొక విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. తంజావూరు జిల్లా వరత్నాడు సమీపంలోని చిలుత్తూర్ వెట్టికాడు కష్ణాపురం ప్రాంతానికి చెందిన భారతి(16). ఇతను వెట్టికాడలో ఉన్న పాఠశాలలో ప్లస్–2 చదువుతున్నాడు. భారతి తన ఇంటిలో ఉన్న కొబ్బరి చెట్టుపై ఎక్కి కొబ్బరి కోసేందుకు ఇనుము తో చేసిన పట్టా కత్తి ద్వారా యత్నించాడు. ఆ సమయంలో ఉన్న కత్తి విద్యుత్ తీగకు తగలడంతో ఘటన స్థలంలోని భారతి మృతి చెందాడు. ఆ సమయంలో అక్కడ వున్న భారతి స్నేహితుడు 10 తరగతి చదువుతున్న కేశవన్ కూడా గాయపడ్డాడు. వరత్నాడు పోలీసులు కేసు నమోదు చేసి మృతి చెందిన భారతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డీఎస్పీ కార్తికేయన్ కేసు విచారణ చేస్తున్నారు. -
చైన్నెలో గైడ్హౌస్ సేవలు
సాక్షి, చైన్నె: వాణిజ్య, ప్రభుత్వ రంగాలకు సేవలందిస్తున్న ప్రపంచ సలహా, సాంకేతికత నిర్వహణ సేవల సంస్థ గైడ్హౌస్ చైన్నెలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. చైన్నెలోని పోరూర్లోని కెప్పెల్ వన్ పారామౌంట్లో కొత్త సౌకర్యాలతో సేవలను ప్రారంభించింది. ఆవిష్కరణ, సామర్థ్యం కోసం రూపొందించబడిన కొత్త క్యాంపస్, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల సమూహంతో నిరంతర సేవలను అందించనున్నారు. గైడ్హౌస్ ఇండియా భాగస్వామి, కంట్రీ హెడ్ మహేంద్ర రావత్ తమ సేవల విస్తరణ గురించి మాట్లాడుతూ, ఇది గైడ్హౌస్ అతిపెద్ద కార్యాలయం అని, దీనిని ప్రజలు , ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా నిర్మించామన్నారు. తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. రెండు సిఫ్టులలో ఇక్కడ 5 వేల మంది ఉద్యోగులు ఉంటారని, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, సాంకేతికత , కార్పొరేట్ మద్దతు విధులలో గైడ్హౌస్ సేవలు ఉంటాయని వివరించారు. ప్లాటినం–సర్టిఫైడ్ సౌకర్యం, సౌకర్యవంతమైన వర్క్స్టేషన్లు, వెల్నెస్ జోన్లు, గ్రీన్ ల్యాండ్స్కేప్లు, ప్రీమియం వర్క్స్పేస్ జీవనశైలి సౌకర్యాలను అందిస్తామన్నారు. ఆవిష్కరణ, సహకారానికి కేంద్రంగా తమ నిబద్ధతను బలోపేతం చేస్తామన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు జీవిత, ప్రమాద బీమా
సాక్షి, చైన్నె: ప్రభుత్వ ఉద్యోగులకు జీవిత, ప్రమాద బీమాతో సహా బ్యాంకు ప్రయోజనాల ఉచిత సేవలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్యాంకులతో సీఎం స్టాలిన్ సమక్షంలో సోమవారం సచివాలయంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. జీవిత, ప్రమాద బీమాతో సహా బ్యాంకింగ్ ప్రయోజనాలు ఉచితంగా అందించడానికి 7 మార్గదర్శక బ్యాంకులతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు , వారి కుటుంబాల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టు సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా అసెంబ్లీలో చేసిన ప్రకటనలు, వివిధ రాయితీలను గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యక్తిగత జీవిత బీమా , ప్రమాద బీమాలో పురోగతి సాధిస్తున్నాయని వివరించారు. నేటి యుగంలోప్రతి వ్యక్తికి జీవిత బీమా తప్పని సరిగా పేర్కొంటూ, అత్యవసర పరిస్థితులలో ఈ భీమా ఎంతో ఉపయోగకరంగా ఉందని వివిరంచారు. ఉద్యోగుల జీవిత బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా మొదలైన వాటి కోసం. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా బీమా పొందేందుకు ప్రభుత్వం బ్యాంకులతో చర్చించి నిర్ణయం తీసుకుందన్నారు. కీలక ఒప్పందాలు ఫలితంగా, అనేక బ్యాంకులు రాయితీలు అందించడానికి ముందుకొచ్చాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు , అధికారులు హఠాత్తుగా జరిగే ప్రమాదంలో మరణించినప్పుడు లేదా ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే వారికి ప్రభుత్వం రూ. ఒక కోటి బీమా సౌకర్యాన్ని అందిస్తుందన్నారు. అలాగే, ఉద్యోగి లేదా అధికారి కుటుంబంలో వివాహ వయస్సు వచ్చిన కుమార్తె వివాహం ఖర్చుల కోసం కుమార్తె ఒక్కొక్కరికి రూ. 5 నుంచి పది లక్షల వరకు ఆర్థిక సాయం, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కుమార్తెకు రూ. 10 లక్షల స్కాలర్షిప్ అందించే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సహజ మరణం సంభవిస్తే, జీవిత బీమా మొత్తం రూ. 10 లక్షలు అందజేయనున్నారని పేర్కొన్నారు. పైన పేర్కొన్న ప్రయోజనాలను అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా 7 మార్గదర్శక బ్యాంకులలో.. ఉద్యోగులు తమ జీతాల ఖాతాలను నిర్వహిస్తున్నట్లయితే, పై ప్రయోజనాలతో పాటు వ్యక్తిగత బ్యాంకు రుణాలు, గృహ రుణాలు విద్యా రుణాలను అందించేందుకు వీలు కలిగినట్టు అవుతుందన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను అందించడానికి బ్యాంకులు కట్టుబడి ఉన్నాయన్నారు. అందుకే ఈ ఒప్పందాలకు సంబంధించి సీఎంస్టాలిన్ సమక్షంలో ట్రెజరీ, అగ్రాగామి బ్యాంకుల డైరెక్టర్ అఫ్ అకౌంట్స్, సీనిర్ అధికారులతో ప్రభుత్వ అధికారుల ఒప్పందాలు జరిగినట్టు ప్రకటించారు. ఈకార్యక్రమంలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, ఆర్థిక శాఖ కార్యదర్శి టి. ఉదయచంద్రన్, ట్రేజరీ, అకౌంట్తో పాటుగా వివిధ విభాగాల అధికారులు నాగరాజన్, చారుశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రూ. 457.14 కోట్లతో నిర్మించిన పోలీసుస్టేషన్లు, పోలీసు క్వార్టర్సులు, రూ. 211 కోట్ల 57 లక్షలతో కోయంబత్తూరు సెంట్రల్ జైలు భవనంను వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ కార్యదర్శి ధీరజ్ కుమార్, డీజీపీ శంకర్ జివాల్, తమిళనాడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ శైలేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
చైన్నెలోని 50 ప్రదేశాల్లో ఉచిత తాగునీటి ఏటీఎంలు
కొరుక్కుపేట: ఉచిత స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం చైన్నె తాగునీటి బోర్డు చైన్నె నగర వ్యాప్తంగా 5 వేల నీటి పంపిణీ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు చైన్నెలో ప్రజలు తరచుగా గుమిగూడే ప్రదేశాలలో శుద్ధి చేసిన తాగునీటిని అందించడానికి మొదటి దశలో 50 తాగునీటి ఏటీఎంలను ప్రారంభించాలని ప్రణాళిక రచిస్తోంది. ఇవి త్వరలో వాడుకలోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. ఈ ఉచిత తాగునీటి ఎటీఎంలు బీచ్లు, బస్సు స్టాండ్లు, పార్కులు, పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్ ప్రాంతాలతో సహా 50 ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కాగా ఒక్కో నీటి ఏటీఎం యంత్రాన్ని ఏర్పాటు చేయడానికి రూ. 10 లక్షలు ఖర్చువుతుందని తెలిపారు. ఇవి 24 గంటలూ పనిచేసే సౌకర్యాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభిస్తారని సమాచారం. వేలూరులో విజయ్ బూత్ కమిటీ భేటీ సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం బూత్ కమి టీ తదుపరి మహానాడుకు వేలూరును ఎంపి క చేశారు. మహానాడు తేదీని ఆపార్టీ నేత విజయ్ ప్రకటించనన్నారు. పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తున్న విజయ్ కోయంబత్తూరు వేదికగా రెండు రోజుల పాటుగా బూత్ కమిటీ మహానాడును ఇటీవల విజయవంతం చేసుకున్నారు. ఈ మహానాడు సమయంలో జనం విజయ్కు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ఆపార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలో జిల్లాల కార్యదర్శుల సమావేశాలు విస్తృతంగా జరుగుతూ వస్తున్నాయి. ఈనెలాఖరులోపు అన్ని ప్రక్రియలను ముగించి జూన్ రెండో వారం లేదా మూడో వారం నుంచి ప్రజల్లోకి చొచ్చుకెళ్లే కార్యక్రమాలకు విజయ్ సన్నద్దం అవుతున్నారు. ఈ పరిస్థితులలో వేలూరు, రాణి పేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, కడలూరు,కృష్ణగిరి తదితర జిల్లాలతో కూడిన బూత్ కమిటీల మహానాడును వేలూరులో నిర్వహించేందుకు ప్రస్తుతం నిర్ణయించారు. ఇందుకోసం స్థల పరిశీలనపై పార్టీ వర్గాలు దృష్టి పెట్టాయి. మహానాడు ఎప్పుడు అన్నది విజయ్ ఒకటి రెండు రోజులలో తేదిని ప్రకటించనున్నారు. ఈ విషయంగా పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ మాట్లాడుతూ తదుపరి మహానాడుకు సన్నద్దమయ్యామన్నారు. 2026 ఎన్నికలలో డీఎంకే, బీజేపీ కూటమితో పొత్తు ప్రసక్తే లేదని మరో మారు ఆయన స్పష్టం చేశారు. మదురై ఆధీనం మఠాన్ని ముట్టడించే యత్నం ● 50 మందికి పైగా అరెస్టు కొరుక్కుపేట: మదురై ఆధీనం మఠాన్ని దిగ్బంధించడానికి యత్నించిన 50 మందికి పైగా అరెస్టు చేశారు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా జ్ఞాన సంబంధ దేశికర్ మాట్లాడుతున్నారంటూ మదురైలోని మత సామరస్య ప్రజా కూటమి తరపున సోమవారం నిరసన చేపట్టారు. న్యాయవాది వాంచినాథన్ అధ్యక్షత వహించారు. నిరసనలో పాల్గొన్న వారు మాట్లాడుతూ మతసామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్న జ్ఞాన సంబంధ దేశికర్ను మఠం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లతో నినాదాలు చేశారు. కాగా మదురై ఆధీన మఠాన్ని ముట్టడించడానికి బయలుదేరిగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆరు కొత్త థింక్ గ్యాస్ డిస్పెన్సింగ్ స్టేషన్ల ఏర్పాటు సాక్షి, చైన్నె: థింక్ గ్యాస్ ఆరు కొత్త డిస్పెన్సింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని, ఎల్ఎన్జీ అడుగు జాడలలో విస్తరణకు చర్యలు చేపట్టామని ఆ సంస్థ ఎండీ అభిలేష్ గుప్తా తెలిపారు. కొత్త స్టేషన్ల గురించి సోమవారం స్థానికంగా ఆయన ప్రకటించారు. పర్యావరణ పరివర్తనను వేగవంతం చేస్తున్నామన్నారు. బోపాల్లోని ఫ్లాగ్షి్ప్ ఎల్ఎన్జీ స్టేషన్ లో విజయవంతమైన ఆపరేషన్ తర్వాత 3 కొత్త ఫిల్లింగ్ హబ్లు, పాయింట్ల వ్యూహాత్మక అమలుతో సుదూర హెవీ డ్యూటీ ట్రక్ మొబిలిటీ కోసం చర్యలు తీసుకున్నామన్నారు. ఏజీ అండ్ పీ ప్రథమ్ , థింక్ గ్యాస్ విలీన సీజీడీ సంస్థగా ప్రస్తుతం థింక్ గ్యాస్ బ్రాండ్ కింద పనిచేస్తున్నాయని వివరించారు. సుదూర సేవలందించడానికి వ్యూహాత్మకంగా ఉన్న 3 కొత్త ఇంధన కేంద్రాలు, పాయింట్లు కాంచీపురం జిల్లా వల్లం, అనంతపురం, నెల్లూరు ఉంటాయన్నారు. సెప్టెంబర్ 25 నాటికి ఇవి పనిచేయడం ప్రారంభిస్తాయని భావిస్తున్నామన్నారు. అదనంగా, డిసెంబర్ 2025 నాటికి మరో 3 ఇంధన కేంద్రాలు, పాయింట్లు పనిచేయడం ప్రారంభిస్తామన్నారు. -
ఐఐటీఎంలో రెండు కొత్త బీటెక్ ప్రోగ్రామ్లు
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసు రెండు కొత్త బీటెక్ ప్రోగ్రామ్లను సోమవారం ప్రకటించింది. ఈ కోర్సులు అత్యాధునిక భవిష్యత్ కార్యక్రమాలుగా మెకానిక్స్ బయోమెడికల్ ఇన్సుట్రుమెంటేషన్లో కోర్ ఇంజినీరింగ్తో పాటూ కంప్యూటేషనల్ ఇంటెలిజెనన్స్ను మిళితం చేసే సిస్టమ్స్ అప్రోచ్ శిక్షణ ద్వారా విద్యార్థులను సమకాలిన సవాళ్లను పరిష్కరించడానికి సిద్ధం చేయనున్నాయి. దేశంలోనే నంబర్ 1 ర్యాంక్ పొందిన ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) 2025–26 విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభిస్తోంది. 1959లో ఐఐటీ మద్రాస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలో ముందంజలో ఉన్న అప్లైడ్ మెకానిక్స్ , బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఈ కోర్సులు అందించనున్నారు. జేఈఈ (అడ్వాన్స్డ్)లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాబోయే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ( జేఓఎస్ఏఏ) కౌన్సెలింగ్లో ఈ రెండు కొత్త ప్రోగ్రామ్లను ఎంచుకోవచ్చు అని ప్రకటించారు. ఈ కొత్త ప్రోగ్రామ్ గురించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మార్పులకు గురవుతున్నందున, ఉన్నత విద్యా సంస్థలు విద్యా–పరిశ్రమ అంతరాన్ని తగ్గించడానికి కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడం చాలా ముఖ్యం అని వివరించారు. ఈ రెండు కొత్త అత్యాధునిక బి.టెక్ ప్రోగ్రామ్లు పరిశ్రమ 5.ఓ, ఆరోగ్య సాంకేతికత, అధునాతన తయారీ రంగాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తాయని వివరించారు. రెండు ప్రోగ్రామ్లు విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీ(ఐడీడీడీ) ప్రోగ్రామ్ల ద్వారా ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ( బీటెక్ ప్లస్ ఎంటెక్)కి అప్గ్రేడ్ అయ్యే అవకాశాన్ని అందిస్తాయని వివరించారు. వీటిలో మూడు – కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ , కాంప్లెక్స్ సిస్టమ్స్, డైనమిక్స్ – అప్లైడ్ మెకానిక్స్ , బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం యొక్క అధ్యాపకుల ద్వారా సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల ప్రత్యేక అంశాలను హైలైట్ చేస్తూ, ఐఐటీ మద్రాస్లోని అప్లైడ్ మెకానిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సయాన్ గుప్తా మాట్లాడుతూ, ఈ అత్యాధునిక కార్యక్రమాలు సమస్య పరిష్కారానికి బలమైన వ్యవస్థల విధానాన్ని విద్యార్థులకు సన్నద్ధం చేస్తాయన్నారు. కోర్ ఇంజినీరింగ్ సూత్రాలను తాజా సాంకేతిక పురోగతితో మిళితం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాలు విద్యారంగం, పరిశ్రమ రెండింటిలోనూ సంక్లిష్టమైన వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో నాయకత్వ పాత్రలకు గ్రాడ్యుయేట్లను సిద్ధం చేస్తాయని వివరించారు. -
రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా పోరాటాలు
సాక్షి, చైన్నె : 10.5 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా తమిళనాట పోరాటాలకు వన్నియర్ సంఘాల భేటీలో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు నిర్ణయించారు. ఈ సమావేశానికి అన్బుమణి రాందాసు డుమ్మాకొట్టారు. పీఎంకేలో సాగుతున్న అధికార సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి రాందాసు, తనయుడుఅ న్బుమణి మధ్య సాగుతున్న ఈ సమరంలో నేతలు నలిగి పోతున్నారు. ఈ పరిస్థితుల్లో గత నాలుగు రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో, ఆతర్వాత జిల్లాల కార్యదర్శులతో, యువజన నేతలతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు తైలాపురం తోట్టం వేదికగా సమావేశం అవుతూ వచ్చారు. ఈసమావేశాలను అన్బుమణి బహిష్కరించారు. సోమవారం పార్టీకి కీలకంగా ఉన్న వన్నియర్ సంఘాల నేతలతో సమావేశం జరిగింది. దీనికి సైతం అన్బుమణి గైర్హాజరయ్యారు. పీఎంకే గౌరవ అధ్యక్షుడు జికేమణి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావణన్, వన్నియర్ సంఘాల అధ్యక్షుడు అరుల్ మొళిలతో పాటూ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. ఇందులో పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికలలో వన్నియర్ సంఘాలు, సామాజిక వర్గాల బలాన్ని చాటే విధంగా కార్యక్రమాల విస్తృతానికి నిర్ణయించారు. అలాగే 10.5 శాతం రిజర్వేషన్ సాధన లక్ష్యంగా రాష్ట్రంలో పెద్దఎత్తున పోరాటాలకు నిర్ణయించారు. ఈసందర్భంగా జికే మణి మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో ఎలాంటి వివాదాలు లేవు అని, రాందాసుతో కలిసి అన్బుమణి పార్టీని నడిపిస్తారని స్పష్టం చేశారు. పార్టీకి వారే నాయకత్వం వహిస్తారని, బలోపేతం దిశగా దూసుకెళ్తామన్నారు. వన్నియర్ సంఘాల నేత భేటీలో రాందాసు నిర్ణయం డుమ్మాకొట్టిన అన్బుమణి -
నైరుతి.. అలర్ట్
● విపత్తులను సమర్థంగా ఎదుర్కొందాం ● ముందస్తు జాగ్రత్తలపై దృష్టి ● అధికారులతో సీఎం సమీక్ష ● సాగు విస్తీర్ణం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ ● మేట్టూరు నీటి విడుదలపై అధ్యయనం సాక్షి, చైన్నె: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చైన్నె నగరం, శివారు జిల్లాలో ఆదివారం రాత్రంతా అనేక చోట్ల వర్షం పడింది. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. విల్లుపురం, కళ్లకురిచ్చి, మదురై, కోయంబత్తూరు, నీలగిరి, దిండుగల్, తెన్కాశి, విరుదునగర్, ఈరోడ్, తిరుప్పూర్, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, నామక్కల్, తిరుపత్తూరు, తిరువణ్ణామలై తదితర 17 జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా మారింది. అప్పుడప్పుడూ చెదురు ముదురుగా, మరికాసేపు భారీగా అనేక చోట్ల వర్షం పడుతోంది. మంగళ, బుధవారాల్లోనూ వర్షాలు కొనసాగనున్నాయి. అత్యధికంగా కళ్లకురిచ్చి జిల్లా రిషివందియంలో 14 సెం.మీ వర్షం పడిందివ. నైరుతి రుతు పవనాలు ఒకటి రెండు రోజులలో కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం తమిళనాడులోని పలు జిల్లాల మీద పడటం ఖాయం. ఈ పరిస్థితుల్లో ఆయా జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు పనులపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. నామక్కల్కవింజ్ఞర్ మాళిగై సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో నైరుతి రుతు పవనాలకు సన్నద్ధం అయ్యేందుకు చేపట్టాల్సిన ముందస్తు కసరత్తులు, మేట్టూరు జలాశయం నీటి గురించి సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్షించారు. సమర్థవంతంగా.. ఈ సమావేశంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలలో, అనేక విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఈ సీజన్లలో మొదటి ప్రాధాన్యత ప్రజల ప్రాణాలను కాపాడడమే అన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా తుపానులు, వరదల, భారీ వర్షాలు వంటి విపత్తులు సంభవిస్తూ వస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల సీజన్లోకి అడుగిడుతున్నామని దీనిని కూడా సమర్థంగా ఎదుర్కొందామని పిలుపు నిచ్చారు. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ ముందు జాగ్రత్తలో సర్వం సిద్ధం చేసుకుందామని సూచించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఈ సీజన్లో భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకుందామని పేర్కొంటూ, సాధారణంగా ఈ సీజన్లో కావేరి డెల్టా జిల్లాలు, నీలగిరి కొండలు, పశ్చిమ కనుమల వెంబడి జిల్లాల మీద అధిక ప్రభావం ఉంటుందని గుర్తు చేస్తూ, భారీ వర్షాలు, తుపానులను ఎదుర్కోవడానికి అన్ని జిల్లాల యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని జిల్లాల కలెక్టరుల అధికారులతో సమీక్షించి జిల్లా స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ సెంటర్, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి 24 గంటల సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ ఉండాలని సూచించారు. కమ్యూనికేషన్ పరికరాలు, రెస్క్యూ పరికరాలు, రికవరీ వాహనాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని, విద్యుత్, ఆహారం, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు. విపత్తు నిర్వహణ ప్రణాళిక – సమాచారం, కమ్యూనికేషన్ ప్రణాళిక – ప్రాథమిక రక్షణ, సేవలకు సంబంధించిన జాబితాతో పాటూ సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు ప్రజలకు తెలియజేయాలన్నారు. అప్రమత్తత కారణంగా విపత్తుల సమయంలో తలెత్తే అనేక ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు. మీడియా, సోషల్ మీడియాలలో వచ్చే సమాచారాలు, ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులు, ఫిర్యాదు చేసే వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, వారికి కావాల్సిన సాయం అందించాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ఆకస్మిక విద్యుత్తు అంతరాయం, ముందుగా ప్రకటించిన మేరకు విద్యుత్ సరఫరా నిలుపుదల , విద్యుత్ నిర్వహణ పనుల గురించిరన సమాచారాన్ని వినియోగదారుడి సెల్ ఫోన్కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలన్నారు. అంతేకాదు, వారి వారి ప్రాంతంలో విద్యుత్ ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో అనే సందేశాన్ని కూడా పంపించాలని స్పష్టం చేశారు. కురువై సాగుకు.. మేట్టూరు జలాశయం నీటి మట్టం శనివారం నాటికి 108.33 అడుగులకు చేరిందని గుర్తు చేస్తూ జూన్ 12న కరువై సాగు నిమిత్తం నీటి విడుదలకు సంబంధించి ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కావేరి, దాని ఉప నదులు, కాలువలు, తదితర వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, కురువై సాగుబడికి సంవృద్ధిగా నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసి ఉంచాలని పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు ప్రణాళికలు, వాటి ప్రయోజనాలు రైతులకు దరిచేరే విధంగా ఫీల్డ్ ఆఫీసర్లు పూర్తి అంకిత భావంతో పనిచేయాలని కోరారు. నైరుతి రుతుపవనాల కాలంలో ప్రాణ, ఆస్తి నష్టం, మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అందరూ కలిసి కట్టుగా పూర్తి అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ పరిపాలన విభాగం, రెవెన్యూ విభాగం, వ్యవసాయం – రైతు సంక్షేమ శాఖ, రహదారులు , చిన్న ఓడరేవుల శాఖ, జలవనరులు, నిఘా విభాగాల కార్యదర్శులు తమ తమ విభాగాల తరపున సిద్ధంగా ఉన్న ఏర్పాట్లను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో జలవనరుల మంత్రి దురైమురుగన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మునిసిపాలిటీ, పరిపాలన మంత్రి కె.ఎన్. నెహ్రూ, ప్రజా పనులశాఖ మంత్రి ఏ.వి. వేలు, వ్యవసాయ – రైతు సంక్షేమశాఖ మంత్రి ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, మత్స్యశాఖ మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్, రవాణా, విద్యుత్ శాఖ మంత్రి మంత్రి ఎస్.ఎస్. శివశంకర్, హిందూ మతం, దేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు, సీఎస్ మురుగానందం, డీజీపీ శంకర్ జివాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్కాలో జ్వలించిన.. ‘మెంబర్స్ వాయిస్’!
● ఎన్నికలలో జయ కేతనం ● అధ్యక్షుడిగా జి. శశిధర్రెడ్ది ఎన్నిక సాక్షి, చైన్నె: ఆస్కా ఎన్నికలలో ‘మెంబర్స్ వాయిస్’ గళం జ్వలించింది. ఈ ప్యానెల్ సంపూర్ణ ఆధిక్యంతో ఆస్కాను గుప్పెట్లోకి తీసుకుంది. ఈ ప్యానెల్ తరపున ఆస్కా అధ్యక్షుడిగా జీ శశిధర్రెడ్డి ఎన్నికయ్యారు. వివరాలు.. తెలుగువారికి కేరాఫ్ అడ్రస్సుగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా టీనగర్లో ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్(ఆస్కా) విరాజిల్లుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలు, కోర్టు కేసులతో నలుగుతూ వచ్చిన ఆస్కా కార్యవర్గం ఎన్నికకు ఎట్టకేలకు ఇటీవల మోక్షం లభించింది. దీంతో జి. శశిధర్రెడ్డి సారథ్యంలో ఈ ఎన్నికలలో మెంబర్స్ వాయిస్ పేరిట తొలుత ఓ ప్యానెల్ పోటీకి దిగింది. ఆ తర్వాత తాము సైతం అంటూ ఎం. ప్రతాప్రెడ్డి సారథ్యంలోని ట్రెండ్ సెట్టర్స్ జట్టు రంగంలోకి దిగింది. ఈ రెండు ప్యానెల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆదివారం ఆస్కా ఆవరణలో ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి కోశాధికారి, సాంస్కృతిక కార్యదర్శి పదవులతో పాటూ 9 మంది కార్యవర్గ సభ్యులు, 9 మంది ట్రస్టీల ఎన్నిక నిమిత్తం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిటీ చైర్మన్ టీవీ కృష్ణకుమార్, సభ్యులు ఎ. వెంకటరెడ్డి, ఎంఆర్ రవికుమార్ల పర్యవేక్షణల ఈ ప్రక్రియ ప్రశాంతంగా విజయవంతమైంది. మెంబర్స్ వాయిస్ జయకేతనం.. ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి సోమవారం వేకువజాము వరకు ఫలితాల లెక్కింపు జరిగింది. తుది ఫలితాలను ఉదయం 6 గంటలకు ప్రకటించారు. ఈ ఎన్నికలలో మెంబర్స్ వాయిస్ జయ కేతనం ఎగుర వేసింది. అధ్యక్ష పదవికి ట్రెండ్ సెట్టర్స్ తరపున పోటీ చేసిన ఎం. ప్రతాప్రెడ్డికి 450 ఓట్లు రాగా, మెంబర్స్ వాయిస్ తరపున పోటీ చేసిన జి. శశిధర్రెడ్డి 668 ఓట్లు వచ్చాయి. 218 ఓట్లతో జి. శశిధర్రెడ్డి ఆస్కా అధ్యక్ష పగ్గాలను చేజిక్కించుకున్నారు. మెంబర్స్ వాయిస్ ప్యానెల్ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన వై. రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా పోటీ చేసిన మాదాల వెంకట సుబ్బారావు, కోశాధికారిగా పోటీ చేసిన ఎల్. శాంతకుమార్, కల్చరల్ సెక్రటరీగా పోటీ చేసిన సినీ నటుడు భాను చందర్ విజయకేతనం ఎగుర వేశారు. అలాగే కమిటీ సభ్యులుగా ఇదే ప్యానెల్కు చెందిన ఎం. చలపతి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, రవిచంద్రన్, ఎస్కే దుర్గా ప్రసాద్, రమేష్రెడ్డి, టీ రాజేష్, జే. మదనగోపాల్రావు, ఎస్పీ శ్రీనివాస్లు గెలిచారు. ఈ ప్యానెల్కు చెందిన సభ్యుడు పీ ప్రేమ్కుమార్ ఓటమి పాలు కాగా, ట్రెండ్ సెట్టర్స్ తరపున పోటీ చేసిన సభ్యుడు గోపాల్ కృష్ణారెడ్డి గెలిచారు. ట్రస్టీలుగా కోటరెడ్డి వేమిరెడ్డి, వి. విజయేంద్ర రావు, ఎం. శ్రీనివాసరావు, పి. సంతోష్కుమార్, బీవీఎస్ కోటేశ్వరరావు, మనోహర్రెడ్డి, ఎన్ఎన్ భిక్షం, వీ బాలాజీ, వీ. ప్రశాంత్ విజయఢంకా మోగించారు. ఆస్కాకు ఇది వరకు నరసారెడ్డి, ఆదిశేషయ్య, సుబ్బారెడ్డి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా అధ్యక్ష ఎన్నికలలో విజయ కేతనంతో ఆస్కా పగ్గాలను జి. శశిధర్రెడ్డి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. నమ్మకంతో ఓట్ల వేసి గెలిపించారు.. తన విజయానికి స్థానిక సభ్యులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి శ్రమ కోర్చి తరలివచ్చి ఓట్లు వేసిన సభ్యులు కూడా కారణం అంటూ అందరికీ శశిధర్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తన మీద నమ్మకంతో అధ్యక్ష పదవికి ఓట్లు వేసి గెలిపించారని, తమ ప్యానెల్కు సంపూర్ణ ఆధిక్యాన్ని అందించారని వ్యాఖ్యానించారు. ఆస్కా అభివృద్ధికి ఇచ్చిన వాగ్దానాలన్నీ త్వరితగతిన అమల్లోకి తీసుకొస్తానన్నారు. క్రమంతప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తామని, యువత, మహిళలకు సబ్ కమిటీలలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సౌకర్యాలను మెరుగు పరచడమే కాదు, అన్నింటా పారదర్శకతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. తనతో పాటూ తన ప్యానెల్ విజయానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, అందరి నమ్మకానికి మరింత బలం చేకూర్చే విధంగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. -
సుప్రీంకు రాష్ట్రపతి లేఖను వ్యతిరేకిద్దాం
సాక్షి, చెన్నై: పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదం విషయంలో తనకు గడువు విధించడంపై రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టుకు లేఖ రాయడాన్ని ఐకమత్యంతో వ్యతిరేకిద్దామంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు, సమన్వయంతో కూడిన చట్టపరమైన వ్యూహం రూపొందించుకుందామని పిలుపునిచ్చారు. ‘‘తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించడమే రాష్ట్రపతి లేఖ ఉద్దేశం. అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును ధిక్కరించలేమని తెలిసి కూడా రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చి కేంద్రమే ఆమెతో లేఖ రాయించింది. దీని వెనుక మోదీ ప్రభుత్వ దురుద్దేశం వెల్లడవుతోంది’’ అంటూ పశ్చిమ బెంగాల్, కర్నాటక, హిమాచల్ప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, పంజాబ్, జమ్మూకశీ్మర్ సీఎంలను స్టాలిన్ కోరారు. -
మాజీ మంత్రిపై విజిలెన్స్ గురి
● తిరువణ్ణామలైలో సోదాలు ● మదురైలోమాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే మాజీ మంత్రి సేవూరు రామచంద్రన్ను రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ విభాగం టార్గెట్ చేసింది. తిరువణ్ణామలైలో ఆయనకు చెందిన కార్యాలయాలు, నివాసాలలో విస్తృతంగా సోదాలు శనివారం చేపట్టారు. అలాగే, మదురైలోని మాజీ ఎమ్మెల్యే నీధిపది ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వివరాలు.. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం అన్నాడీఎంకే మాజీ మంత్రులను గురి పెట్టి విజిలెన్స్, ఏసీబీ దాడులు హోరెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి సేవూరు రామచంద్రన్ను టార్గెట్ చేసినట్టున్నారు. 2016–21లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న రామచంద్రన్ ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టు వచ్చిన ఫిర్యాదును విజిలెన్స్ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్టుగా తమకు ప్రాథమిక ఆధారాలు చిక్కడంతో తిరువణ్ణామలై అవినీతి నిరోధక శాఖ అధికారులు , విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. 20 మందితో కూడిన అధికారుల బృందం తిరువణ్ణామలైలోని రామచంద్రన్కు చెందిన నివాసాలు, కార్యాలయాలలో సోదాలో నిమగ్నమైంది. గట్టి భద్రత నడుమ ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఈ సోదాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే వర్గాలు ఆందోళనకు దిగాయి. 2016లో నామినేషన్ దాఖలు సమయంలో చూపిన లెక్కలు, 2021 ఎన్నికల సమయంలో చూపించిన లెక్కలలో భారీగా తేడాలు ఉండటంతో ఆదిశగా సైతం దర్యాప్తును వేగవంతం చేసి ఉన్నారు. ఉసిలం పట్టిలో.. మదురై జిల్లా ఉసిలం పట్టిలోమాజీ ఎమ్మెల్యే నీదిపది ఇంట్లోనూ సోదాలు విస్తృతంగా జరిగాయి. 2016లో ఎమ్మెల్యేగా గెలిచినానంతరం ఆదాయానికి మించి ఆస్తులను కూడ బెట్టినట్టుగా ఆయనపై ఫిర్యాదులు రావడంతో ఈ సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఆయనపై ఓ కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాజా సోదాలలో పలు కీలక రికార్డులు బయట పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
ఇంధన అక్రమ రవాణాను అడ్డుకున్న భారత్ కోస్ట్ గార్డు
కొరుక్కుపేట: ఇంధనం అక్రమ రవాణాను భారత కోస్ట్గార్డు సిబ్బంది అడ్డుకున్నారు. మన్నారు గల్ఫ్లో అనుమానాస్పద కార్యకలాపాల గురించి కస్టమ్స్ విభాగం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్గార్డు స్టేషన్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మన్నార్ గల్ఫ్లోని ముసల్ దీవుల వద్ద ఉన్న అనుమతికి మించి 600 లీటర్ల పెట్రోల్, ఇండియన్ ఫిషింగ్ బోట్ను స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కస్టమ్స్ శాఖ దర్యాప్తు చేస్తోంది. సముద్రం ద్వారా అక్రమ వ్యాపా రాన్ని అడ్డుకోవడానికి ఇది మరో విజయవంతమైన ఆపరేషన్ అని ఇండియన్ కోస్ట్గార్డు అధికారులు వెల్లడించారు. -
కేరళకు ఖనిజ సంపదల అక్రమరవాణా
సాక్షి, చైన్నె: తిరునల్వేలి జిల్లాలోని క్వారీల ద్వారా ఖనిజ సంపదలను కేరళకు అక్రమ రవాణాలో అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఖనిజ సంపదల విభాగం అధికారులందరిపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇద్దర్ని సస్పెండ్ చేయగా, ఒకరిని వీఆర్కు పంపించారు. మిగిలిన వారందర్నీ మూకుమ్మడిగా ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాలు.. తిరునల్వేలి జిల్లాలో క్వారీలు అధికం, ఇక్కడి కొండలను క్వారీలు పిండి చేస్తున్నాయి. నిర్ణీత శాతం కంటే అధికంగా తవ్వకాలు జరిపి ఖనిజ సంపదలను అక్రమంగా కేరళకు తరలించేస్తున్నారు. పొరుగున ఉన్న కేరళకు ఈ అక్రమ రవాణా సాగుతుండడం వెనుక అధికారుల హస్తం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. నకిలీ రశీదులతో అధికారులు సాగిస్తూ వచ్చిన మాయాజాలం ప్రభుత్వం దృష్టికి చేరింది. దీనిపై రహస్యంగా ఉన్నతాధికారలు విచారణ జరిపి అక్రమాలలో భాగస్వామ్యంగా ఉన్న అధికారుల భరతం పట్టే విదంగా ఉత్తర్వులు జారీ చేశారు. తిరునల్వేలి జిల్లా ఖనిజ సంపదల విభాగం డైరెక్టర్ బాల మురుగన్ను వీఆర్కు పంపించారు. అసిస్టెంట్ ఇంజినీరుతో పాటూ మరో మహిళా అధికారినిని సస్పెండ్ చేశారు. జిల్లాలోఉన్న 100 మందికి పైగా అధికారులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. వీరందర్నీ ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. తిరునల్వేలి జిల్లా ఖనిజ సంపదల విభాగానికి పూర్తిగా కొత్త ముఖాలను తీసుకొచ్చిపెట్టే విధంగా చర్యలు తీసుకోవడం గమనార్హం. నెల్లై జిల్లాలోని అధికారులందరిపై కన్నెర ఇద్దరు సస్పెన్షన్, ఒకరు వీఆర్కు.. -
గోవింద నామస్మరణతో ‘కంచి’ పులకింత
సాక్షి, చైన్నె : గోవిందా...గోవిందా అన్న నామస్మరణతో శనివారం కాంచీపురం పులకించింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు రథోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వివరాలు.. ఆథ్యాత్మిక నగరం కాంచీపురంలో వెలసిన వరద రాజ స్వామి ఆలయంలో ఈనెల 11 తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో వరద రాజ స్వామి వారు రోజూ ఉదయం, సాయంత్రం వేళలో వివిధ వాహనాలలో భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టం రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువ జాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా వరదరాజ స్వామి వారు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాల్ని ధరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. 73 అడుగులతో కూడిన రథంలో స్వామి వారు ఆశీనులై భక్తుల్ని కటాక్షించారు. ఈ రథోత్సవం అంగరంగ వైభంగా జరిగింది. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చి రథాన్ని లాగారు. గోవిందా..గోవింద అన్న నామస్మరణ కాంచీపురం వీధుల్లో మార్మోగాయి. భక్త జన సంద్రంతో కాంచీపురం పరిసరాలు పులకించాయి. రథోత్సవం సందర్భంగా భక్తుల సేవలో పలు సంస్థలు తరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. రథోత్సవం కారణంగా కాంచీపురంలో పలు మార్గాలలో ట్రాఫిక్ మార్పులు చేశారు. -
టార్గెట్.. విశాఖన్
● ఈడీ తీవ్ర విచారణ ● రెండో రోజుగా సోదాలుసాక్షి, చైన్నె: టాస్మాక్ ఎండీ ఐఎఎస్ అధికారి విశాఖన్ను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసినట్టుంది. ఆయన వద్ద తీవ్ర విచారణలో ప్రత్యేక బృందం అధికారులు నిమగ్నమయ్యారు. రెండో రోజుగా శనివారం ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. రాష్ట్రంలోని మద్యం షాపులకు అను సంధానంగా బార్ల ఏర్పాటు, మద్యం కొనుగోళ్లు తదితర వ్యవహారాలకు సంబంధించిన టెండర్లన్ని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) నేతృత్వంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో రూ.1000 కోట్లు అక్రమాలు జరిగినట్టుగా ఇటీవల చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో ఈడీ గుర్తించింది. హైకోర్టు ఆదేశాలతో తదుపరి విచారణను తాజాగా వేగవంతం చేసింది. శుక్రవారం ఎనిమిది చోట్ల చైన్నెలో విస్తృతంగా ఈడీ సోదాలు జరిగాయి. ఇందులో టాస్మాక్ ఎండీ ఐఎఎస్అధికారి ఆర్ విశాఖన్ను ఈడీ టార్గెట్ చేసింది. ముమ్మర విచారణ విశాఖన్ ఇంట్లో లభించిన ఆధారాలు, వాట్సాప్ కాల్ సందేశాల ఆధారంగా ఈ స్కాంలో ఓ కీలక వ్యక్తి ఉన్నట్టు, ఆయన ఎవరో అన్నది వెలుగులోకి తెచ్చే దిశగా ఈడీ విచారణ వేగవంతమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. విశాఖన్ను నుంగంబాక్కంలోని కార్యాలయానికి తీసుకెళ్లి శుక్రవారం పొద్దు పోయే వరకు ఈడీ వర్గాలు తీవ్రంగా విచారించాయి. రెండవ రోజైన శనివారం కూడా ఆయన్ని టార్గెట్ చేసి ఈడీ విచారణ జరగడం గమనార్హం. ఆయన ఇంట్లో లభించిన ఆధారాలు, వాట్సాప్ సందేశాలు, మెస్సేజ్లను గురి పెట్టి అనేక ప్రశ్నలను ఈడీ సందించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ టెండర్ల ప్రక్రియ, అక్రమాల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో అన్న విచారణ విస్తృతంగా సాగుతుండటంతో తదుపరి ఈడీ ఎవరిని టార్గెట్ చేయనున్నదో అన్న ఉత్కంఠ మార్కెటింగ్ కార్పొరేషన్లోనే కాదు, ఎకై ్సజ్ శాఖలోనూ నెలకొంది. అదే సమయంలో రాష్ట్ర మంత్రి ముత్తుస్వామి మీడియాతో మాట్లాడుతూ, కక్ష సాధింపు ధోరణితో ఈడీ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపును చట్ట పరంగా తిప్పి కొడుతామని, న్యాయ పోరాటం చేయనున్నామని వ్యాఖ్యానించారు. -
అలాంటి పనులు వేదన కలిగిస్తాయి..!
తమిళసినిమా: నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉంటే మామన్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సూరి అభిమానులు దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. అలా తిరుప్పాంగుడ్రంలో కుమారస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సూరి అభిమానులు కొందరు మామన్ చిత్రం విజయం సాధించాలని మొక్కుకుని నేలపై భోజనం చేశారు. ఈ విషయం తెలిసిన సూరి అభిమానులపై ఫైర్ అయ్యారు. కథ, కథనం బాగుంటే చిత్రం హిట్ అవుతుందన్నారు. అంతే కానీ నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని, ఇది వేదన కలిగిస్తోందని అన్నారు. ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టించవచ్చని, నీళ్లు, మజ్జిగ వంటివి ఇచ్చి దాహం తీర్చవచ్చని అన్నారు. అలాంటి వాళ్లకు తన అభిమానులని చెప్పుకునే అర్హతే లేదని పేర్కొన్నారు. సూరి అభిప్రాయాన్ని ప్రముఖ గీత రచయిత వైరముత్తు ప్రశంసించారు. అభిమానుల అనైతిక చర్యలను ప్రతి నటుడు ఖండించాలని, తమ అభిమానులకు హిత వ్యాఖ్యలు చేయాలన్నారు. అప్పుడే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మెరుగు పడతారనే అభిప్రాయాన్ని వైరముత్తు వ్యక్తం చేశారు. -
ఓమ్నీ బస్సు, టూరిస్టు వ్యాన్ ఢీ
● నలుగురి మృతి సేలం : కరూర్ సమీపంలో ఓమ్ని బస్సు, టూరిస్టు వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఒక బాలికసహా నలుగు రు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి నాగర్కోయిల్కు ఓమ్ని బస్సు బయలుదేరింది. కరూర్ జిల్లాలోని సెమ్డై సమీపంలోని జాతీయ రహదారిపై ట్రాక్టర్ను ఢీకొని వ్యతిరేక దిశలో సెంట్రల్ మీడియంను దాటింది. ఆ సమయంలో తూత్తుకు డి జిల్లాలోని కోవిల్పట్టి ప్రాంతం నుంచి వస్తున్న టూరిస్ట్ వ్యాన్ను ఓమ్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో టూరిస్ట్ వ్యాన్లో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు మృతి చెందారు. 8 ఏళ్ల బాలిక, టాక్సీ డ్రైవర్, టూరిస్ట్ వ్యాన్ డ్రైవర్, వ్యాన్ లోని ఒక ప్రయాణికుడు మొత్తం నలుగురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడగా, సమీపంలో ఉన్న వారు క్షతగాత్రులను రక్షించి కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి, ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఓమ్ని బస్సు అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. తీవ్రంగా గాయపడిన వారిలో 14 మంది కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. మాజీ మంత్రి విజయ్కర్ క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి ఎంఆర్ విజయకర్ విలేకరులతో మాట్లాడుతూ కోవిల్పట్టి నుంచి ఏర్కాడుకు పర్యాటక వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలు సహా నలుగురు వ్యక్తులు బెంగళూరు నుంచి నాగర్కోయిల్కు వెళుతున్న లగ్జరీ బస్సును ఢీకొనడంతో ప్రమాదానికి కారణమని చెప్పారు. 14 మంది ప్రభుత్వాస్పత్రిల్లోని ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారని, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్నారని చెప్పారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొంతమందిని మెరుగైన చికిత్స కోసం మధురై ఆస్పత్రికి తరలించారని తెలిపారు. -
బిస్కెట్ ప్యాకెట్లో గంజాయి సరఫరాకు యత్నం
● యువకుడి అరెస్టు అన్నానగర్: సేలం సెంట్రల్ జైలులో ఒక ఖైదీని చూడడానికి వచ్చిన ఒక యువకుడు బిస్కెట్ ప్యాకెట్లో గంజాయిని తీసుకువచ్చి పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వెల్లూరు జిల్లాలోని మేట్టూరుకు చెందిన కవియరసు (27) సేలం సెంట్రల్ జైలులో ఉన్నాడు. అతనిపై దోపిడీ, చోరీ సహా పలు కేసులున్నాయి. బెయిల్ పై బయటకు వచ్చిన జైలులో అతని భాగస్వామి అయిన ధర్మపురికి చెందిన మహ్మద్ సుగిల్ (30), కవియరసును కలవడానికి శనివారం సేలం జైలుకు వచ్చాడు. అక్కడే ఉన్న కవియరసు ఇంటర్ కామ్లో మాట్లాడాడు. అప్పుడు మహమ్మద్ సుగిల్ తాను తెచ్చుకున్న రెండు బిస్కెట్ ప్యాకెట్లపై తన పేరు రాశాడు. వాటిని స్కాన్ చేయగా, బిస్కెట్ ప్యాకెట్పై అనుమానాస్పద లేఖ కనిపించింది. జైలు వార్డెన్లు వెంటనే మహమ్మద్ సుగిల్ను అదుపులోకి తీసుకున్నారు. అతను తన ముందున్న బ్యాగ్ తెరిచినప్పుడు బిస్కెట్ ప్యాకెట్ మధ్యలో 4 ప్యాకెట్లలో 80 గ్రాముల గంజాయిని దాచిపెట్టినట్లు వెల్లడైంది. దీంతో జైలు అధికారులు మహమ్మద్ సుగిల్ను అరెస్టు చేసి, అస్తంబట్టి పోలీసులకు అప్పగించారు. ఖైదీ కవియరసుపై కూడా ఫిర్యాదు నమోదైంది. -
రేషన్ దుకాణం ముట్టడి
తిరువళ్లూరు: రేషన్ దుకాణంలో సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ 86–వేపంబట్టు గ్రామానికి చెందిన ప్రజలు దుకాణాన్ని ముట్టడించారు. 86–వేపంబట్టులోని దుకాణం ద్వారా 1,500 మంది కార్డుదారులకు సరుకులను అందజేయాల్సి ఉండగా, మూడు నెలల నుంచి బయోమెట్రిక్ సరిగ్గా పని చేయడం లేదని తిప్పి పంపడం, తరువాత గడువు ముగిసిందని చెప్పి సరుకులు ఇవ్వడానికి నిరాకరిచడంతో ఆగ్రహించిన స్థానికులు శనివారం ఉదయం రేషన్ దుకాణాన్ని ముట్టడించి నిరసనకు దిగారు. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం అందించే సరుకులను సిబ్బంది సరిగ్గా అందించడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. భవిషత్తులో సరుకుల పంపిణీకి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
తరమణిలో భారీ గొయ్యి!
● దూసుకెళ్లిన కారు ● స్తంభించిన ఓఎంఆర్సాక్షి, చైన్నె: తరమణి సమీపంలో రోడ్డుపై భారీ గొయ్య ఏర్పడింది. ఇందులోకి ఐదుగురు ప్రయాణికులతో కూడిన కారు దూసుకెళ్లింది. వీరిని అతి కష్టం మీద రక్షించారు. ఈ ఘటనతో ఓఎంఆర్ మార్గం స్తంభించినట్టైంది. వివరాల్లోకి వెళితే.. చైన్నె ఓఎంఆర్ మార్గంలో మెట్రో రైలు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మార్గం నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటోంది. ఈ మార్గంలో తరమణి జంక్షన్కు కూత వేటు దూరంలో హఠాత్తుగా రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. పది అడుగుల మేరకు ఏర్పడిన ఈ గొయ్యి లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఇందులో ఇద్దరు మహిళలు, పిల్లలతో సహా ఐదుగురు ఉన్నారు. రోడ్డు మీద వెళుతున్న వారు, ఆ పరిసరాల్లో విధుల్లో ఉన్న పోలీసులు పరుగులు తీసి, కారును అతి కష్టం మీద బయటకు తీశారు. అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. అయితే, డ్రైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఓఎంఆర్ మార్గం స్తంభించినటైంది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడిన సమాచారం ఆ పరిసరాలలో కలకలం రేపింది. తరచూ చైన్నెలో ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తరమణి వద్ద జరిగిన ఘటనతో ఆ పరిసర వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
థగ్ లైఫ్ ట్రైలర్ విడుదల
తమిళసినిమా: కమలహాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్లైఫ్. నటుడు శింబు, త్రిష జంటగా నటించిన ఇందులో అశోక్ సెల్వన్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిరత్నం కథా, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కమలహాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మణిరత్నంకు చెందిన మెడ్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న థగ్ లైఫ్ చిత్రం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా దీని టీజర్ చిత్రంపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఇటీవలే ఇందులోని జింగుచ్చా అనే పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్న్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను శనివారం సాయంత్రం ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు, యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా భారీ బడ్జెట్ కమలహాసన్ స్మగ్లర్ల్గా నటించిన థగ్ లైఫ్, నాయగన్ చిత్రం తర్వాత కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో రూపొందడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,970 మంది స్వామిని దర్శించుకున్నారు. 33,871 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 16 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని లోనికి అనుమతించబోమని పేర్కొంది. -
నయన్ మరోసారి ద్విపాత్రాభినయం
తమిళసినిమా: నటి నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య హిందీలో షారుక్ఖాన్కు జంటగా నటించిన జవాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే తమిళంలో ఈమె ఇటీవల నటించినా ఏ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతేకాదు నయనతారను ప్రేక్షకులు తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య ఉమన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించినా అన్నపూరిణి చిత్రం, ఇటీవల మాధవన్, సిద్ధార్థ్తో కలిసి నటించిన టెస్ట్ చిత్రాలు ఓటీటీకే పరిమితం అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో ఆమెను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమె చేతిలో ప్రస్తుతం అర డజన్కు పైగా చిత్రాలు ఉన్నా, ఇప్పట్లో ఏదీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాల్లో మూక్కుత్తి అమ్మన్ 2 ఒకటి. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నా రు. ఇది రూ.100 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం అని సమాచారం. కాగా ఇంతకు ముందు మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార దేవతగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దానికి సీక్వెల్గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి దేవత పా త్ర కాగా, మరొకటి పోలీస్ అధికారి పాత్ర అని తెలిసింది. దీంతో ఈమె తొలిసారిగా ఖాకీ డ్రెస్ లో కనిపించబోతున్నారన్నమాట. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్లో పోలీస్ అధికారిగా నటించిన అందులో ఖాకీ దుస్తులు ధరించలేదు. అలాగే నయనతార ద్విపాత్రాభినయం చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఐరా చిత్రంలో ద్విపాత్రాభియం చేశా రు. కాగా మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో నయనతారతో పాటు ఇండియా యోగిబాబు సింగం పులి కన్నడ నటుడు దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు మరో హైలెట్గా ఉంటాయని సమాచారం. నయనతార -
మోడల్ స్కూలు పనుల పరిశీలన
తిరువళ్లూరు: పట్టాభిరామ్లో రూ.1.90 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ పాఠశాల, విల్లివాక్కంలో నిర్మిస్తున్న గ్రీనరీ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ ప్రతాప్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వేపంబట్టు, సెవ్వాపేటలో ప్రారంభమైన రైల్వే బ్రిడ్జి పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ పట్టభిరామ్లో నిర్మిస్తున్న మోడల్ స్కూల్ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ తనిఖీల్లో పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ దేవన్, చీఫ్ ఎడ్యుకేషన్ అధికారి(ఇన్చార్జ్) మోహన పాల్గొన్నారు. -
సూర్య, చంద్రప్రభలపై కల్యాణ వెంకన్న
నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామివారు విహరించారు. భక్తుల వేకువ జామున సుప్రభాత సేవ తో ఆలయాన్ని తెరచిన అర్చకులు నిత్యపూజా కార్యక్రమాలను పూర్తి చేసి, తొలి గంటతో దూప, దీప నైవేద్యాలను సమర్పించారు. 7.30 గంటలకు సూర్యప్రభ వాహనంపై కల్యాణ వెంకన్నను త్రివిక్రముని అవతారంలో కొలువుదీర్చి, ఊరేగించారు. అనంతరం ఉత్సవర్లకు సుగంధ పరిమల ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం బాల గోపాలుని అవతారంలో స్వామివారికి ఊంజల్సేవ నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనానంలో కొలువుదీరి పురవీధుల్లో ఊరేగారు. ఈ కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయాధికారి నాగరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య, ఆర్జితం అధికారి భరత్ తదితరులు పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం 7.45 గంటలకు స్వామి వారి రథోత్సవం ప్రారంభమవుతుందని ఆలయాధికారి నాగరాజు తెలిపారు. సాయంత్రం మాడవీధిలో క్షత్రియ వేషధారణలో స్వామివారు అశ్వవాహనంపై ఊరేగనున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆర్జిత కల్యాణోత్సవం జరుగుతుందని తెలిపారు. ఆర్జిత కల్యాణంలో పాల్గొనే దంపతులు రూ.వెయ్యి చెల్లించి పాల్గొని, తీర్థ ప్రసాదాలను అందుకోవాలని నాగరాజు తెలిపారు. శ్రీవారి రథానికి ముస్తాబు ఉభయ దేవరులతో కలిసి కల్యాణ వేంకటేశ్వరస్వామి పురవీధుల్లో విహరించడానికి శ్రీవారి రథం ముస్తాబైంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామవారి రథోత్సవం జరుగుతుంది. వేకువజామున 2 గంటలకు మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీదేవీ, భూదేవీ సమేత కల్యాణ వెంకన్న రథం మండపానికి చేరుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య తెలిపారు. రథం 7.45 నిమిషాలకు కదులుతుందన్నారు. సుమారు 60 అడుగుల ఎత్తైన చెక్క రథం నగరవీధి, ట్రంకురోడ్డు, మట్లవారి వీధి, కోమిటి బజారు వీధి మీదుగా గంగుండ్రమండపానికి రథోత్సవం చేరుకుంటుంది. అయితే రథోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఆపివేస్తున్నట్లు ట్రాన్స్కో ఏఈ జయప్రకాష్ తెలిపారు. -
నా తదుపరి చిత్రం ఎప్పుడంటే..
అజిత్ తమిళసినిమా: నటుడు అజిత్ ఇటీవల చాలా ఖుషీగా ఉన్నారు. అందుకు కారణం ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మంచి విజయాన్ని సాధించడం ఒక ఎత్తు అయితే, అంతర్జాతీయ స్థాయి కార్ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో విజేతగా నిలవడం మరో కారణం. అజిత్ ఇటీవల కార్ రేసులపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారన్నది తెలిసిన విషయమే. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈయన పూర్తిగా కార్రేస్లపైనే దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం 40 కిలోల వరకు బరువు తగ్గి, పూర్తిగా ఫిట్నెస్గా మారారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం గత ఏప్రిల్ 10వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అజిత్ నటించే తదుపరి చిత్రం అప్డేట్ గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ఒక గుడ్ న్యూస్ చెబుతూ అజిత్ ఇటీవల భేటీలో వచ్చే నవంబర్లో తన నూతన చిత్రం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆ చిత్రం 2026 ఏప్రిల్గానీ, మే నెలలో గానీ తెరపైకి వస్తుందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా తనకు కార్ రేస్ల్లో పాల్గొనడం అంటే ఆసక్తి అన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అయితే కార్ రేస్ల్లో పాల్గొంటూ సినిమాల్లో నటించడం అంత సులభం కాదన్నారు. తన మాదిరిగానే తనతో చిత్రాలు చేస్తే దర్శక నిర్మాతలు కూడా అదే భావంతో ఉండడంతో ప్రస్తుతం తాను కార్ రేస్లపైనే పూర్తిగా కాన్స్స్ట్రేషన్ చేస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది నవంబర్లో మళ్లీ నటించడానికి సిద్ధమవుతానని అజిత్ పేర్కొన్నారు. దీంతో ఆయన నటించే చిత్రం ఏ సంస్థలో ఉంటుంది, దర్శకుడు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చిత్రాలు చేయడానికి నటుడు ధనుష్తో సహా పలువురు దర్శకులు లైన్లో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. -
నర్సులు సేవాభావం కలిగి ఉండాలి
వేలూరు: నర్సింగ్ సిబ్బంది సేవా భావం కలిగి ఉండాలని సినీ నటి నళిని అన్నారు. వేలూరు సమీపంలోని శ్రీపురం బంగారుగుడి పీఠాధిపతి శ్రీశక్తిఅమ్మ ఆశీస్సులతో నడుస్తున్న శ్రీ నారాయణి ఆస్పత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లుల దినోత్సవం, నర్సుల దినోత్సవాన్ని ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అన్ని సేవలకన్నా నర్సులు చేసే సేవ మరవలేనిదన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని డాక్టర్ల కన్నా ముందుగా నర్సులే చూస్తా రని వారితో ప్రేమతో మాట్లాడి వారికి అవసరమైన వైద్య సేవలు అందజేయాలన్నారు. నర్సులు ఈ వృత్తిని ఉద్యోగంగా చూడకుండా సేవభావంతో చూడాలన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడడం తోనే వారికి సగం రోగం నయం అవుతుందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో ప్రతి ఒక్కరూ స్నేహ పూర్వకంగా కుటుంబ సభ్యుల తరహాలో వ్యవహ రించాలన్నారు. అనంతరం విశిష్ట సేవలు అందజే సిన నర్సులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంత రం సినీనటి నళినికి ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ జ్ఞాపిక ను అందజేసి. సన్మానించారు. కార్యక్రమంలో డివైన్ సుకీ గ్రూప్స్ డైరెక్టర్లు శ్రీకాంత్, శ్రీనాథ్, ఇండియన్ స్పోర్ట్స్ కమ్మాడేటర్ రవి చదుర్వేది, ఇండియన్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ గీత, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ శక్తివేలన్, నర్సింగ్ కళాశాల మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ మాధవి, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. -
పార్థసారథి స్వామి సన్నిధిలో రోజంతా అన్నదానం
● పథకాన్ని ప్రారంభించిన ఉదయనిధి సాక్షి, చైన్నె: చైన్నె ట్రిప్లికేన్లోని పార్థసారథి స్వామి ఆలయంలో శనివారాలలో రోజంతా అన్నదానం పథకాన్ని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రా రంభించారు. ఇక, మీదట ప్రతి శనివారం ఇక్కడ రోజంతా ఆహారం, ప్రసాదం అందించనున్నారు. తమిళనాడులోని ఆలయాలను సందర్శించే భక్తుల కోసం అన్నదాన పథకాన్ని ప్రభుత్వం విస్తృతం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్య రోజులలో, పండుగ సందర్భాలు, ఉత్సవాల సమయంలో అయితే, రోజంతా ఆహారం పంపిణీ చేయబడుతున్నది. శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, పళణి దండాయుధ పాణి ఆలయంతో పాటుగా పలు ఆలయాలలో రోజంతా అన్నదానాలు చేస్తూ వస్తున్నారు. అన్నదానధర్మాలు జరుగుతాయి, చైన్నె ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి ఆలయంలో మధ్యాహ్నం వేళలో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అయితే, ఈ పథకాన్ని విస్తరించే విధంగా శనివారాలు, పండుగ రోజులు, ముఖ్య రోజులు, ఉత్సవాల సమయంలో ఇక రోజంతా అన్నదానం చేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం ఆలయంలో రోజంతా అన్నదానం నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ భక్తులతో కలిసి భోజనం చేశారు. పార్థసారథి స్వామి ఆలయంలో జరిగిన ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశిలతో పాటూ శనివారాలలో మొత్తంగా 82రోజుల పాటుగా రోజంతా ఆహారంతో వడ, పాయసం అందించనున్నారు. ఆలయాన్ని సందర్శించే 82,000 మంది భక్తులకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ మతం, ధార్మిక శాఖమంత్రి పి.కె. శేఖర్ బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్, ఆర్. ప్రియ, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎన్. చిట్టరసు, ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు ఎస్. మదన్మోహన్, పర్యాటకం, సాంస్కృతిక విభాగం అధికారి డాక్టర్ కె. మణివాసన్, దేవాదాయ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి పి.ఎన్. శ్రీధర్, అదనపు కమిషనర్ డాక్టర్ సి. పళని పాల్గొన్నారు. -
ఐదేళ్ల బంగ్లాదేశ్ బాలికకు అరుదైన శస్త్రచికిత్స
కొరుక్కుపేట: ఊబకాయం సమస్యతో అధికబరువు పెరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్న ఓ 5 ఏళ్ల బంగ్లాదేశ్ చిన్నారికి చైన్నెలోని లైఫ్లైన్ ఆస్పత్రి వైద్యులు అరుదైన బేరియాట్రిక్ సర్జరీని చేసి, పునర్జన్మను ప్రసాదించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లైఫ్లైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ అడ్వాన్సుడ్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిరుధ్ రాజ్కుమార్, చైర్మెన్ అండ్ చీఫ్ సర్జన్ డాక్టర్ జేఎస్ రాజ్కుమార్ మాట్లాడారు. బంగ్లాదేశ్కు చెందిన ఐదేళ్ల బాలిక ప్రాడర్ –విల్లీ సిండ్రోమ్తో బాదపడుతూ ఆస్పత్రికి వచ్చిందన్నారు. ఊబకాయం కారణంగా నడవలేకపోవడంతోపాటు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయిందని, అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహం ప్రారంభదశలో ఉన్న కొవ్వుకాలేయవ్యాధితో పోరాడుతుందని తెలిపారు. తగిన పరీక్షలు నిర్వహించిన అనంతరం దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా హైరిస్క్ బేరియాట్రిక్ విధానంతో సర్జరీని విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి సాధారణంగా నడవగలగడంతోపాటు దాదాపు 8 కిలోల బరువు తగ్గిపోయిందని, మరో ఆరునెలల్లో 10నుంచి 15 కిలోలు బరువు తగ్గుతుందని తెలిపారు. -
డెల్టాలో జోరు వానలు
సాక్షి, చైన్నె : డెల్టాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో ఐదురోజులు ఈ వర్షాలు కురవనున్నాయి. ఈ ఏడాది వేసవిలో భానుడి ప్రతాపం గురించి చెప్పనక్కర్లేదు. మరో రెండు వారాలలొఓ అగ్ని నక్షత్రం సీజన్ ముగియనున్నది. అయితే, నైరుతి రుతు పవనాలు ముందుగానే కేరళ తీరాన్ని తాకనున్నడంతో పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాలో వాతావరణం ప్రస్తుతం చల్లబడింది. అక్కడక్కడ అకాల వ ర్షం పలకరిస్తున్నది. నైరుతీ పవనాలు అండమాన్ తీరాన్ని తాకిన దృష్ట్యా, ప్రస్తుతం డెల్టా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడుతోంది. తిరుచ్చి, పెరంబలూరు, నాగపట్నం, తిరువా రూర్,తంజావూరు, మైలాడుతురై జిల్లాలో వ ర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం నుంచి ధర్మపురి, కృష్ణగిరి, వేలూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలైలోనూ వర్షాలు పడుతాయని ప్రకటించింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక జిల్లాలో భానుడి సెగ తగ్గినట్లయ్యింది. అదే సమయంలో ఇక వేసవి కాలం సీజన్ ముగిసినట్టే అని ప్రై వేటు వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. నాలుగు ముసాయిదాలకు గవర్నర్ ఆమోదం సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఆమోదం పొందిన నాలుగు ముసాయిదాలకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులను రాజ్ భవన్కు గవర్నర్ పరిమితం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తూ వచ్చారు.ఈ పరిస్థితులలో గత నెల వర్సిటీలకు సంబంధించిన పది ముసాయిదాల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కొన్ని కీలక ముసాయిదాల మీద రాజ్ భవన్ త్వరిత గతిన నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో పలు ముసాయిదాలను ఆమోదించారు. ఇందులో నాలుగు ముసాయిదాలను గవర్నర్ ఆమోదించినట్టు శనివారం రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఆర్థిక పరమైన బిల్లులు ఇందులో ఉన్నాయి. ఇక,మరో 14 ముసాయిదాలు పెండింగ్లో ఉండడం గమనార్హం. వైరముత్తుకు సీఎం పరామర్శ సాక్షి, చైన్నె : సినీ రచయిత వైరముత్తును సీఎం ఎంకే స్టాలిన్ పరామర్శించారు. వైరముత్తు మాతృమూర్తి అంగముత్తు ఇటీవల కాలం చెందారు. ఈ సమయంలో సీఎం స్టాలిన్ నీలగిరి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఊటీ నుంచి శుక్రవారం రాత్రి చైన్నెకు సీఎం చేరుకున్నారు. శనివారం ఉదయాన్నే ఎంపీలు టీఆర్ బాలు, ఏ రాజ, మంత్రి శేఖర్బాబుతో కలిసి బీసెంట్ నగర్లోని వైరముత్తు నివాసానికి వెళ్లారు. ఆయన్ని కలిసి తన సానుభూతిని తెలిపారు. అనంతరం సీఎం స్టాలిన్ డీఎంకే సీనియర్ నేత ఎస్ఎం రామచంద్రన్ ఇంటికి వెళ్లారు. 100వ జన్మదినాన్ని జరుపుకుంటున్న ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. అత్యాచారం కేసులో కార్మికుడికి జీవిత ఖైదు అన్నానగర్: వివాహం పేరుతో బాలికపై అత్యాచారం చేసిన కార్మికుడికి జీవిత ఖైదు, అతడి స్నేహితురాలు అయిన బాలిక తల్లికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ దిండుక్కల్ జిల్లా పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు.. దిండుక్కల్ జిల్లా వడమదురైకి చెందిన శివకుమార్ (39)కార్మికుడు. 2021లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి బాలిక తల్లి కూడా సహకరించిందని తెలుస్తోంది. ఈ విషయంలో, ఉత్తర మధురై ఆల్ ఉమెన్స్ పోలీసులు కేసు నమోదు చేసి శివకుమార్, బాలిక తల్లిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ దిండుక్కల్ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి వేల్ మురుగన్ సమక్షంలో జరుగుతోంది. దర్యాప్తు ముగిసిన తరువాత, న్యాయమూర్తి వెల్ మురుగన్ శనివారం తన తీర్పును వెలువరించారు. అందులో బాలికపై అత్యాచారం చేసిన శివకుమార్కు జీవిత ఖైదు, రూ.లక్ష 12 వేలు జరిమానా విధించారు. స్నేహితురాలైన అయిన బాలిక తల్లికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించారు. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం వేలూరు: తిరువణ్ణామలై జిల్లా పులియంబట్టి గ్రామంలోని కాలియమ్మన్ ఆలయం వీధికి చెందిన మాదేశ్వరన్(40) నర్సుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాదేశ్వరన్ ఈనెల 15న తిరువణ్ణామలై జిల్లా సెంగం వద్ద బైకులో వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలైన మాదేశ్వరన్ను వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. దీంతో అతన్ని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో అతన్ని కిడ్నీ రాణిపేట సీఎంసీ ఆసుపత్రికి, మరొక కిడ్నీ శ్రీనారాయణి ఆసుపత్రికి, గుండెను చైన్నెలోని అపోలో ఆసుపత్రికి దానంగా అందజేసినట్లు వేలూరు సీఎంసీ ఆసుపత్రి నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
వివాదానికి తెర పడేదెన్నడో?
సాక్షి, చైన్నె: పీఎంకేలో అధ్యక్ష పదవి వ్యవహారంలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. తానే అధ్యక్షుడ్ని అని రాందాసు, కాదు..కాదు తానే అధ్యక్షుడ్ని అంటూ అన్బుమణి పరస్పరం కయ్యానికి కాలుదువ్వే రీతిలో వ్యవహరిస్తుండడం ఆ పార్టీలోని జిల్లాల నేతలను సందిగ్ధంలో పడేసింది. పార్టీ భవిష్యత్తు అన్బుమణిగా ఉన్నప్పటికీ, పార్టీ వ్యవస్థాపకుడ్ని వదలుకునే పరిస్థితులలో లేక అనేక మంది నేతలు సతమతం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. రెండవ రోజూ డుమ్మా.. జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నేతలు సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో రెండవ రోజు యువజన విభాగం భేటీ సైతం అదే బాటకు దారి తీసింది. యువజన నేతలు పెద్దగా ఎవ్వరూ రాందాసు నేతృత్వంలో జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. పదుల సంఖ్యలో నేతలు రావడం, పార్టీ ప్రధాన కార్యదర్శి వడి వేలురావన్ మినహా తక్కిన రాష్ట్ర స్థాయి నేతలు కనిపించక పోవడం చర్చకు దారి తీసింది. అన్బుమణిని దూరం చేసుకోవడం ఇష్టంలేక యువజన నేతలందరూ ఈ సమావేశానికి గైర్హాజరైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎవరు వచ్చినా రాకున్నా, పార్టీ పరంగా 2026 ఎన్నికలలో తానే తుది నిర్ణయం తీసుకుంటానని, తన సారథ్యంలో పార్టీ వర్గాలు ఎన్నికలకు సమాయత్తం కావాలని రాందాసు ఆదేశించడం గమనార్హం. అదే సమయంలో రానున్న ఎన్నికలలో కూటమి ఉంటుందని, అది ఎవరితో అన్న నిర్ణయం కూడా తానే తీసుకుంటానని రాందాసు స్పష్టం చేయడంతో పీఎంకే తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం పీఎంకే గౌరవ అధ్యక్షుడు జీకేమణి నేతృత్వంలోని బృందం అన్బుమణితో భేటీ అయ్యింది. ఈ భేటీ అనంతరం జీకేమణి స్పందిస్తూ, పార్టీలో సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయన్నది వాస్తవమేని పేర్కొంటూ, అన్నీ త్వరలో సమసి పోతాయన్నారు. పార్టీలో అందరూ ఒక్కటేనని, అందరు మళ్లీ ఒక చోట చేరుతారని, అన్బు సైతం సమావేశాలకు వస్తారని ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. న్యూస్రీల్తెర పడేనా..? రాందాసు నేతృత్వంలో జరిగే భేటికి వెళ్తే, అన్బుమణి ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సి ఉంటుందో అన్న ఆందోళనతో శుక్రవారం జరిగిన భేటీకి సుమారు యాభైకు పైగా జిల్లాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు డుమ్మా కొట్టినట్టు సమాచారం వెలువడింది. అన్బుమణికి మద్దతుగా తాము ఉన్నప్పటికీ, వ్యవస్థాపకుడికి వ్యతిరేకంగా వ్యవహరించ లేని పరిస్థితులలో ఈ నేతలందరూ తమలో తాము మదన పడుతూ తండ్రి, తనయుడి మధ్య సఖ్యత కుదరాలన్న ఎదురు చూపులలో పడ్డాయి. అదే సమయంలో ఈ వివాదం ఇలాగే కొనసాగిన పక్షంలో కేడర్లో గందరగోళం తప్పదని, ఇది పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని మరికొందరు హెచ్చరిస్తుండడం గమనార్హం. పీఎంకే వర్గాల అయోమయం యువజన విభాగం భేటీకి సైతం నేతల డుమ్మా అన్బుమణితో జీకే మణి సమావేశం త్వరలో అన్ని అడ్డంకులు తొలగుతాయని వ్యాఖ్య పీఎంకేలో అధికార వార్కు తెర పడెదెన్నడో అని ఆ పార్టీ వర్గాలు ఎదురు చూపుల్లో పడ్డారు. ఓ వైపు తండ్రి, మరోవైపు తనయుడి మధ్య నేతలు నలిగి పోవాల్సిన పరిస్థితి రావడంతో రాయబారాలపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు. అన్బుమణితో పార్టీ గౌరవ అధ్యక్షుడు జికే మణి నేతృత్వంలోని బృందం శనివారం చైన్నెలో భేటీ అయింది. అదే సమయంలో తైలాపురంలో రెండవ రోజు జరిగిన యూత్ భేటికి అన్బుమణి , మద్దతు యువత డుమ్మాకొట్టడం చర్చకు దారి తీసింది. -
పార్థసారథి స్వామి సన్నిధిలో రోజంతా అన్నదానం
● పథకాన్ని ప్రారంభించిన ఉదయనిధి సాక్షి, చైన్నె: చైన్నె ట్రిప్లికేన్లోని పార్థసారథి స్వామి ఆలయంలో శనివారాలలో రోజంతా అన్నదానం పథకాన్ని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఇక, మీదట ప్రతి శనివారం ఇక్కడ రోజంతా ఆహారం, ప్రసాదం అందించనున్నారు. తమిళనాడులోని ఆలయాలను సందర్శించే భక్తుల కోసం అన్నదాన పథకాన్ని ప్రభుత్వం విస్తృతం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్య రోజులలో, పండుగ సందర్భాలు, ఉత్సవాల సమయంలో అయితే, రోజంతా ఆహారం పంపిణీ చేయబడుతున్నది. శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, పళణి దండాయుధ పాణి ఆలయంతో పాటుగా పలు ఆలయాలలో రోజంతా అన్నదానాలు చేస్తూ వస్తున్నారు. అన్నదానధర్మాలు జరుగుతాయి, చైన్నె ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి ఆలయంలో మధ్యాహ్నం వేళలో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అయితే, ఈ పథకాన్ని విస్తరించే విధంగా శనివారాలు, పండుగ రోజులు, ముఖ్య రోజులు, ఉత్సవాల సమయంలో ఇక రోజంతా అన్నదానం చేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం ఆలయంలో రోజంతా అన్నదానం నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ భక్తులతో కలిసి భోజనం చేశారు. పార్థసారథి స్వామి ఆలయంలో జరిగిన ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశిలతో పాటూ శనివారాలలో మొత్తంగా 82రోజుల పాటుగా రోజంతా ఆహారంతో వడ, పాయసం అందించనున్నారు. ఆలయాన్ని సందర్శించే 82,000 మంది భక్తులకు ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూ మతం, ధార్మిక శాఖమంత్రి పి.కె. శేఖర్ బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్, ఆర్. ప్రియ, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎన్. చిట్టరసు, ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు ఎస్. మదన్మోహన్, పర్యాటకం, సాంస్కృతిక విభాగం అధికారి డాక్టర్ కె. మణివాసన్, దేవాదాయ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి పి.ఎన్. శ్రీధర్, అదనపు కమిషనర్ డాక్టర్ సి. పళని పాల్గొన్నారు. -
నీట్–యూజీ ఫలితాలపై హైకోర్టు స్టే
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఒక పరీక్షా కేంద్రంలో నీట్–యూజీ,2025 ప్రవేశపరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం కారణంగా అసౌకర్యం కల్గిందని, ఆ కారణంగా పరీక్ష ఫలితాల విడుదలను నిలిపివేయాలన్న అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు సమ్మతించింది. ఈ మేరకు ఫలితాలను నిలిపివేయాలంటూ సంబంధిత అధికారులకు జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంలో తదుపరి వాదోపవాదనలను జూన్ రెండో తేదీన ఆలకిస్తామని బెంచ్ పేర్కొంది. చెన్నైలోని ‘పీఎం శ్రీ’కేంద్రీయ విద్యాలయ సీఆర్పీఎఫ్–అవడిలోని పరీక్షా కేంద్రంలో పలువురు అభ్యర్థులు ఈనెల నాలుగో తేదీన నీట్–యూజీ పరీక్షరాసేందుకు సిద్ధమవగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4.15 గంటలదాకా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా వెంటనే విద్యుత్ పునరుద్ధరణ సాధ్యంకాలేదు. అందుబాటులో ఎలాంటి జనరేటర్, ఇన్వెర్టర్లు లేవని 13 మంది అభ్యర్థుల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ‘‘సరైన వెలుతురు లేకున్నా పరీక్ష రాయాల్సి వచ్చింది. వర్షం నీరు పరీక్ష గదుల్లోకి చేరడంతో కేటాయించిన సీట్లోకాకుండా కాస్తంత దూరంగా జరిగి కూర్చుని పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇంత అసౌకర్యం, అంతరాయం, సమయం వృథా అయినా ఈ అభ్యర్థులకు అధికారులు అదనపు సమయం కేటాయించలేదు. దీంతో మొత్తం ప్రశ్నలకు వాళ్లు సమాధానాలు రాయలేకపోయారు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14 ప్రకారం చూస్తే ఇతర కేంద్రాల్లోని అభ్యర్థులతో పోలిస్తే వీళ్లకు సమాన అవకాశాలు, హక్కులు లభించలేదు. అందుకే ఈ విషయం తేలేవరకు పరీక్ష ఫలితాలను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వండి’’అని న్యాయవాదులు కోరారు. -
నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే
చెన్నై: నీట్ ఫలితాల విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలను విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది.తమ ఎగ్జామ్ సెంటర్లో విద్యుత్ అంతరాయం కారణంగా.. పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని కొంతమంది విద్యార్థులు ఫిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు, ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితాలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. కాగా రిజల్ట్స్ విడుదలకు సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.2024 - 25 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షలమంది అప్లై చేసుకోగా.. 20.8 లక్షలమంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. -
తమిళ పాలిటిక్స్.. పార్టీ నేతలకు విజయ్ కీలక ఆదేశాలు
సాక్షి, చెన్నై: పార్టీ పరంగా కమిటీలు, పదవుల భర్తీ ప్రక్రియలన్నీ ఈ నెలాఖరులోపు ముగించే విధంగా ముఖ్య నేతలకు తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలను జూన్ నుంచి విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటుతో జిల్లాల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ముఖ్య పదవులన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఇతర కమిటీలలో కొన్ని పదవుల భర్తీ కసరత్తులు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలు ఉన్న దృష్ట్యా, ఇక ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణలో విజయ్ ఉన్నారు.ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జననాయగన్ చిత్ర షూటింగ్ ఈనెలతో ముగియనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత జూన్ మొదటి వారం నుంచి విజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉండబోతున్నారు. ఇందులో భాగంగా విజయ్ పర్యటనలకు సంబంధించి గత రెండు రోజులుగా చెన్నైలో జిల్లాల కార్యదర్శుల సమావేశం విస్తృతంగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షణలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా అన్ని ప్రక్రియలను, పదవుల భర్తీని ఈ నెలాఖరులోపు ముగించాలని విజయ్ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జూన్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ సైతం సిద్ధమవుతోంది. -
విద్యతోనే ఉన్నత శిఖరాలకు..
వేలూరు: విద్యతోనే ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, అనకట్టు ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్లస్టూ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం, అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందనేరిలోని విద్యాశ్రమం పాఠశాలకు చెందిన విద్యార్థిని చారుమతి ప్లస్టూలో 600కుగాను 597 మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలోను, వేలూరు జిల్లాలోను మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులను ప్రొత్సహించేందుకు ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతితోపాటు అభినందన సభ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాల విద్యలో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించేందుకు ప్రతి ఒక్కరూ పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. విద్య అనే ఆయుధంతో ఒక వ్యక్తి ఎంతటి స్థాయికై నా ఎదగగలడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఎమ్మెల్యే నందకుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బాబు, డీఎంకే పార్టీ యూనియన్ కార్యదర్శి జ్ఞానశేఖరన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
17 అక్రమ కట్టడాల కూల్చివేత
తిరువొత్తియూరు: చైన్నె గిండి రేస్ కోర్స్ రోడ్డులో 17 అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె గిండి రేస్ కోర్స్ రోడ్డులో భవాని అమ్మన్ ఆలయానికి చెందిన స్థలంలో 7 దుకాణాలు, అక్కడున్న ప్రభుత్వ భూములు ఆక్రమించి 10 దుకాణాలు ఆక్రమంగా నిర్మించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఈ ఆక్రమణ కట్టడాలను కూల్చి వేయడానికి చైన్నె జిల్లా కలెక్టర్ రష్మీ సిద్ధార్థ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చైన్నె గిండి రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న ఆలయ స్థలంలో ఆక్రమంగా నిర్మించిన 7 దుకాణాలు, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 10 కట్టడాలను శుక్రవారం గిండి తసీల్దార్ మణిమేఘలై నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూల్చివేశారు. గిండీ పోలీసులు ఇన్స్పెక్టర్ ప్రభు నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. హజ్ యాత్ర సాక్షి, చైన్నె: తమిళనాడు నుంచి హజ్ యాత్ర శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో జరిగే ప్రార్థనల నిమిత్తం హజ్ యాత్రకు రాష్ట్రం నుంచి అర్హులైన వారిని హజ్ కమిటీ ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో తొలి బృందం బయలు దేరి వెళ్లింది. వీరికి మంత్రి నాజర్ తదితరులు విమానాశ్రయంలో ఆహ్వానం పలికి హజ్ యాత్రకు పంపించారు. లైంగిక వేధింపుల కేసులో ఇద్దరికి జైలు అన్నానగర్: పదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రైవేట్ స్కూలు ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. కరూర్ జిల్లాలోని సెంగల్ సమీపంలోని పాపిరెడ్డి పట్టిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో తమిళ ఉపాధ్యాయుడు నీలవోలి (42), ఆ పాఠశాల ప్రిన్సిపల్ యువరాజ్ (41) ఒక విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై కరూర్ అదనపు మహిళా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తయి శుక్రవారం తీర్పు వెలువడింది. పోక్సో కేసులో ఒక సెక్షన్ కింద తమిళ ఉపాధ్యాయుడి 20 ఏళ్లు, మరో సెక్షన్ కింద 20 ఏళ్లు, మరో సెక్షన్ కింద 3 ఏళ్లు జైలుశిక్ష, ఈ శిక్షలను అతను ఏకకాలంలో (20 సంవత్సరాలు మాత్రమే) అనుభవించాలని, ప్రిన్సిపల్ యువరాజ్కు కూడా 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించి న్యాయమూర్తి తంగవేల్ తన తీర్పులో పేర్కొన్నారు. న్యాయమూర్తి బాధిత బాలికకు రూ.7 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వ వైద్యుడికి నోటీసులు తిరువొత్తియూరు: తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో చికిత్స అందించిన సంఘటనలో వివరణ కోరుతూ వైద్యుడికి నోటీసులు జారీ చేశారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలోని పురుషుల ఔట్ పేషెంట్ విభాగంలో శుక్రవారం ఎక్కువ మంది రోగులు చికిత్స పొందడానికి వేచి ఉన్నారు. ఆ సమయంలో జనరల్ మెడికల్ విభాగానికి చెందిన ఒక వైద్యుడు అక్కడ ఉన్నాడు. అతను మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. అతను ఔట్ పేషెంట్ విభాగానికి వెళ్లి దాదాపు గంటన్నర పాటు రోగులకు చికిత్స చేశారు. ఆ సమయంలో తామాల్పురం నుంచి వచ్చిన మహిళ తన పక్కింటికి చెందిన వృద్ధుడికి చికిత్స చేయించడానికి వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆ డాక్టర్ తాగి మత్తులో ఉండడాన్ని ఆమె తన సెల్ఫోన్లో వీడియో తీశారు. తరువాత ఆమె ఆస్పత్రిలోని ఇతర వైద్యులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ తీసిన వీడియో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైద్యులకు సమాచారం అందించడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, విధుల్లో ఉన్న వైద్యుడిని తొలగించి, మరొక వైద్యుడిని నియమించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరణ కోరుతూ మెడికల్ కాలేజీ ఆస్పత్రి యాజమాన్యం సంబంధిత వైద్యుడికి నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రి అధికారులు కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నాణ్యమైన సాంకేతిక విద్యకు ఆర్ఎంకే సహకారం
● చైర్మన్ ఆర్ఎస్ మునిరత్నం తిరువళ్లూరు: రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఆర్ఎంకే విద్యా సంస్థలు సహకారం అందిస్తాయని ఆ సంస్థల చైర్మన్ ఆర్ఎస్ మునిరత్నం తెలిపారు. తిరువళ్లూరు జిల్లా క వరపేటలోని ఆర్ఎంకే కళాశాలలో ఐఎస్టీఈ ప్రొఫె సర్ల సంఘం తమిళనాడు విభాగం 27వ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎంకే విద్యాసంస్థల ప్రిన్సిపల్ మహ్మాద్ జునైత్ అధ్యక్షత వహించగా ము ఖ్యఅతిథిగా చైర్మన్ ఆర్ఎస్ మునిరత్నం, విశిష్ట అతిథి గా విశ్రాంత ఐఏఎస్ పిచ్చాండి హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరసుబ్రమణ్యం మాట్లాడు తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచడం, విద్యార్థులను నూతన ఆధునిక పరిశోధనల వైపు ప్రో త్సహించడంలో ప్రొఫెసర్ల పాత్ర కీలకమన్నారు. ఐఎస్టీఈ సంఘం ప్రొఫెషన్ సంస్థగానూ, విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 1.50లక్షల మంది ప్రొఫెసర్లు, 4లక్షల మంది విద్యార్థులు సభ్య త్వం ఐఎస్టీఈ సంఘంలో ఉందన్నారు. ఆర్ఎంకే కళాశాల చైర్మన్ ఆర్ఎస్ మునిరత్నం మాట్లాడుతూ ఐఎస్టీఈ సంస్థ గత ఏడాది కా లంలో విద్యార్థులు, ప్రొఫెసర్ల కోసం 150 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందన్నారు. విద్యా ర్థులను ఐటీ రంగంలో ఐఎస్టీఈ సంస్థ ప్రోత్సహిస్తు న్న తీరును అభినందనీయమన్నారు. నూతన ఆధునిక పరిశోధనలు చేయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థుల ను గుర్తించి, తాము ప్రోత్సహిస్తామన్నారు. డైరెక్టర్ జ్యోతినాయుడు, ఉపాధ్యక్షుడు ఆర్ఎం కిషోర్, కార్యదర్శి యలమంచి ప్రదీప్, అడ్వయిజర్ పళణిస్వామి, మైనింగ్ శాఖ మాజీ ఎండీ మనోహరన్, ప్రొఫెసర్ చంద్రమేనీ, శివజ్ఞాన ప్రభు, మణిమారన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఉత్తమ ప్రొఫెసర్లు, సంఘం ప్రతినిధులను కళాశాల నిర్వాహకులు సత్కరించారు. -
మెంబర్స్ వాయిస్ పేరిట ఆస్కాలో పోటీ
–జి.శశిధర్రెడ్డి సాక్షి, చైన్నె: ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఎన్నికల్లో మెంబర్స్ వాయిస్ పేరిట తాము పోటీ చేస్తున్నామని అధ్యక్ష అభ్యర్థి జి.శశిధర్రెడ్డి తెలిపారు. తమ జట్టును శుక్రవారం సాయంత్రం ఆస్కా ఆవరణలో ఆయన పరిచయం చేశారు. శశిధర్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఆస్కా కార్యవర్గం ఎంపికకు ఎన్నికలు మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. 2,600 మందికి పైగా సభ్యులు ఆస్కాలో ఉన్నట్టు వివరించారు. తమను గెలిపిస్తే ఆస్కా సంస్థను మరింతగా అభివృద్ధి పరిచేలా ముందుకెళ్తామన్నారు. సభ్యులందరూ ఓటు హక్కును వినియోగించుకుని తమ జట్టును బలపరచాలని కోరారు. తమ జట్టు తరఫున ప్రధాన కార్యదర్శిగా వడ్లమూడి దిలీప్కుమార్, ఉపాధ్యక్షుడిగా వై.రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా మాదాల వెంకటసుబ్బారావు, కోశాధికారిగా ఎల్.శాంతకుమార్, సినీ నటుడు ఎం.భానుచందర్, కల్చరల్ సెక్రటరీగా పోటీ చేయనున్నారని వివరించారు. అలాగే, రవిచందర్, చలపతి, మదనగోపాల్ రావు, ప్రేమ్కుమార్, రమేష్రెడ్డి, దుర్గా ప్రసాద్, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, రాజేష్, శ్రీనివాస్లు కమిటీ సభ్యులుగా, ట్రస్టీలుగా ఎం.శ్రీనివాసరావు, కోటారెడ్డి వేమిరెడ్డి, వి.విజయేంద్రరావు, సంతోష్కుమార్, కోటేశ్వరరావు, మనోహర్రెడ్డి, ఎన్ఎన్ భిక్షం, వి.బాలాజీ, ప్రశాంత్ తమ జట్టు తరపున పోటీ చేయనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికల వాగ్దానాలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. మాజీ అధ్యక్షుడు మాదాల ఆదిశేషయ్య పాల్గొన్నారు. -
వ్యవసాయ యంత్రాల వినియోగంపై అవగాహన
తిరుత్తణి: సాగు విస్తీర్ణం పెంచి, కూలీల సమస్య పరిష్కరించేందుకు వీలుగా రైతులు వ్యవసాయ అత్యాధునిక యంత్రాలు వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వ్యవసాయశాఖ విభాగం ఆధ్వర్యంలో పంట సాగులో యంత్రాల వినియోగానికి సంబంధించి రైతులకు అవగాహనతోపాటు యంత్రాలు వినియోగించడం, యంత్రాల సమస్యలు పరిష్కరించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం వరినాట్లు, కోత, చెరుకు కట్టింగ్, దుక్కి దున్నడం, నారు పోసే యంత్రం, ట్రాక్టర్, జేసీబీ వినియోగం సహా అత్యాధునిక యంత్రాలు శిబిరంలో ఉంచి వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ శిబిరానికి మండల వ్యవ సాయ విభాగ సహాయ ఇంజినీర్ రాజవేల్ అధ్యక్షత వహించారు. జిల్లా వ్యవసాయ ఇంజినీరింగ్ విభాగ చీఫ్ ఇంజినీర్ గణేశన్, ఆర్డీఓ కనిమొళి శిబిరాన్ని ప్రా రంభించారు. లాభసాటి పంటసాగు, అధిక దిగుబడికి సంబంధించి యంత్రాల వినియోగం, అద్దెకు అందుబాటులో ఉన్న యంత్రాలు, సబ్సిడీ ద్వారా అందుతున్న యంత్రాలపై అవగాహన కల్పించారు. -
తిరువళ్లూరు జిల్లాలో 89.60 శాతం
● ప్లస్–1లో 87.39 శాతం తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లాలో పది ఫలితాల్లో 89.60 శాతం మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఏడాది 3.76 శాతం ఎక్కువ. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 31,305 మంది పరీక్షలకు హాజరయ్యారు. బాలురు 86.93 శాతం, బాలికలు 92.25 శాతం మొత్తం 89.60 శాతం మందిఉత్తీర్ణత సాధించారు. ప్లస్–1లో 87.39 శాతం ఉత్తీర్ణత తిరువళ్లూరు జిల్లాలో ప్లస్–1 పరీక్ష ఫలితాల్లో 87.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్లస్–1 పరీక్షలను జిల్లాలో 29,234 మంది రాశారు. 11,479 మంది బాలురు, 14,068 బాలికలు మొత్తం 25,574 మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదికంటే 1.85 శాతం పెరిగింది. -
ఇది కదా లక్కు అంటే!
తమిళసినిమా: రంగుల ప్రపంచం, కలల ప్రపంచం, మాయాజాలం అంతా సినిమానే. ఇక్కడ ప్రయత్నాలు ఫలిస్తే అందే అంతస్తే వేరుగా ఉంటుంది. అయితే అలాంటి విజయం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నటి కయ్యదు లోహర్ది ఇదే పరిస్థితి. ఈ జాన మూడు, నాలుగేళ్లు పోరాడిందనే చెప్పాలి. 2021లో కన్నడంలో ముకిల్ పేట్ అనే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత మలయాళంలో పత్తొంబదామ్ నూట్రాండు చిత్రంతో అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఆ తరువాత తెలుగులో అల్లూరి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అలా మరాఠి భాషలోనూ నటించింది. వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయం సాధించకపోయినా, వరుసగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వరించడం ఈ అమ్మడి లక్కే అని చెప్పక తప్పదు. అలా ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఈమెకు డ్రాగన్ చిత్రం రూపంలో అదృష్టం పట్టుకుంది. ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక నాయకిగా నటించింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. డ్రాగన్ చిత్రం సూపర్హిట్ కావడంతో నటి కయ్యదు లోహర్ వెంటే దర్శక నిర్మాతలు, కథానాయకులు పరిగెడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ ఈమె నటించిన డ్రాగన్ చిత్రం ఒక్కటే విడుదలైంది. అయితే కయ్యదు లోహర్ రూ.కోటి పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందనే ప్రచారం జరుగుతోంది. కారణం సంచలన నటుడు శింబు, ధనుష్ వంటి వారు ఈ అమ్మడిని హీరోయిన్గా కోరుకోవడమే అంటున్నారు. ప్రస్తుతం నటుడు అధర్వకు జంటగా ఇదయం మురళి చిత్రంలో నటిస్తున్న కయ్యదు లోహర్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా ఇమ్మార్టల్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా ఽశింబు 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్తో జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న చిత్రంలో కయ్యదు లోహర్ను హీరోయిన్గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా లబ్బర్ బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న చిత్రంలోనూ కయ్యదు లోహర్నే నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అదే సమయంలో టాలీవుడ్లోనూ మరో చిత్రం చేస్తోంది. ఇలా డ్రాగన్ అనే ఒక్క చిత్రం సక్సెస్తో ఇప్పుడు కోలీవుడ్లో కయ్యదు లోహర్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇది కదా లక్కు అంటే. కయ్యదు లోహర్ -
పూండి రిజర్వాయర్లో మాక్డ్రిల్
తిరువళ్లూరు: జాతీయ విపత్తు ఏర్పడిన సమయంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడంపై రెవెన్యూ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పూండి రిజర్వాయర్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదలు, భూకంపాలు, యుద్ధం తదితర సమయంలో ఏర్పడే విపత్తులో చిక్కుకునే వారికి సాయం అందించడంతో పాటు, విపత్తు సమయంలో ప్రజలు ఎలా స్పందించాలన్న అంశంపై తిరువళ్లూరు జిల్లాలోని పూండి, గురువాయల్, రామతండం, సేతపాక్కం, వెళ్లివాయల్ తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఉషారాణి, తహసీల్దార్ రజినీకాంత్, ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ప్రదీష్ , బీడీఓ వరదరాజన్, బ్లాక్ మెడికల్ ఆఫీసర్ రవిచంద్రన్, రెవెన్యూ అధికారులు శేఖర్, సుఖన్యదేవి పాల్గొన్నారు. -
వ్యర్థ జలాల శుద్ధీకరణకు కొత్త సాంకేతికత
– ఐఐటీ మద్రాసు ఆవిష్కరణ సాక్షి, చైన్నె : వస్త్ర పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి ఐఐటీ మద్రాసు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. తమిళనాడులోని తిరుపూర్లో ఏర్పాటు చేసిన పైలట్ ప్లాంట్లో దీనిని ఆవిష్కరించారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ల సాంకేతిక–ఆర్థిక సాధ్యతను తద్వారా మెరుగు పరిచారు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాల కారణంగా మనుషులు, జలచరాలు, ఇతర జీవరాశులకు ప్రమాదాలు కలుగకుండా ఈ ప్రాజెక్ట్ ఒక వినూత్నంగా తీర్చిదిద్దారు. ఎలక్ట్రోకెమికల్ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేయడం ద్వారా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ల సాంకేతిక–ఆర్థిక సాధ్యాసాధ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు. పర్యావరణ ప్రభావాలను తగ్గించడానికి చర్యలు చేపట్టారు. ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ ఇందుమతి ఎం.నంబి నేతృత్వంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ను తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని కున్నకల్పాళయం సీఈటీపీలో అమలు చేశారు. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య అన్నానగర్: విచిత్ర హెయిర్ స్టైల్ పెట్టుకోవడానికి తల్లిదండ్రులు నిరాకరించారని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లాలోని ఇడైపాడి సమీపంలోని చానరపట్టి గ్రామానికి చెందిన లారీడ్రైవర్ గోపాల్, కోకిల దంపతుల చిన్న కుమారుడు కీర్తిశర్మ (15), చానరపట్టి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాశాడు. ఈ స్థితిలో కీర్తి శర్మ విచిత్ర హెయిర్ స్టైల్ చేసుకోవటానికి తన తల్లిదండ్రుల అనుమతి కోరాడు. వారు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తిశర్మ శుక్రవారం తన ఇంటి నుంచి బయటకు వెళ్లి సమీపంలోని తోటలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కొంగణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రమణ–2 చేద్దాం రండి!
తమిళసినిమా: దివంగత నటుడు, రాజకీయనాయకుడు విజయ్కాంత్ను అందరూ అభిమానంతో కెప్టెన్ అని పిలిచేవారు. ఈయన సినిమాల్లో నటిస్తున్నప్పుడే దేశం గురించి, ప్రజల గురించి ఆలోచించేవారు. చిత్ర పరిశ్రమలో ఎందరికో సాయాన్ని అందించారు. అలాంటి విజయకాంత్కు విజయ్ప్రభాకర్, షణ్మగపాండియన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. వారిలో విజయ్ప్రభాకర్ తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి ప్రవేశించగా, రెండో కుమారుడు షణ్ముగ పాండియన్ సినీ రంగప్రవేశం చేశారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం పడైతలైవన్. ఈ చిత్రానికి అన్బు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఈనెల 23న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. కార్యక్రమంలో విజయ్కాంత్ సతీమణి ప్రేమలత, ఎల్.సుదీశ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, శశికుమార్, పొన్రామ్ పాల్గొ న్నారు. మురుగదాస్ మాట్లాడుతూ విజయ్కాంత్ హీరోగా తాను తెరకెక్కించిన రమణ చిత్రానికి ముందే ఆయనతో తనకు పరిచయం ఉందన్నారు. ఆయన నటించేటప్పుడు రెండు టేక్ల కంటే ఎక్కవ ఎప్పుడూ తీసుకోలేదన్నారు. కాగా విజయ్కాంత్ వారసుడు షణ్ముగ పాండియన్ నటించిన పడైతలైవన్ చిత్రాన్ని సక్సెస్ చేయడానికి ఆయన అభిమానులమైన మనం అంతా ముందుకు రావాలన్నారు. తాను విజయ్కాంత్ కళ్లను షణ్ముగపాండియన్లో చూస్తున్నాననీ, రమణ–2 చిత్రం చేద్దాం ఎదిగి రండి అంటూ మురుగదాస్ షణ్ముగపాండియన్తో అన్నారు. అందుకు ఓకే అని షణ్ముగపాండియన్ చెప్పారు. వేదికపై ఉన్న సుదీశ్ రమణ–2 చిత్రాన్ని నిర్మించడానికి తాను రెడీ అని చెప్పారు. కాగా మనుషులకై నా, జీవాలకై నా ప్రాణం ఒక్కటే అనే సందేశంతో కూడిన పడైతలైవన్ చిత్రంలో ఏనుగు ప్రధాన పాత్రను పోషించడం విశేషం. కాగా ఈ యన తర్వాత పొన్రామ్ దర్శకత్వంలో కొంబు సీవి అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు శశికుమార్ దర్శకత్వంలో కుట్రపరంపరై అనే వెబ్సీరీస్లోనూ నటించనున్నారు. -
● పది, ప్లస్ ఒన్ ఫలితాలు విడుదల ● పదిలో 93.8 శాతం మంది ఉత్తీర్ణత ● ప్లస్ ఒన్లో 92.09 శాతం ఉత్తీర్ణత ● జూలై 4 నుంచి సప్లిమెంటరీ
సాక్షి, చైన్నె: మార్చి నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు ప్లస్టూ, ప్లస్ ఒన్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఇందులో ముందుగా నిర్ణయించిన సమయానికి కంటే రెండు రోజులు ముందుగానే ప్లస్టూ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కూడా తమదే పైచేయి అని మరో మారు బాలికలు సత్తా చాటుకున్నారు. తాజాగా విడుదల చేసిన పది, ప్లస్ఒన్లోనూ తమ హవాను కొనసాగించారు. ఫలితాల విడుదలతో ఉత్తీర్ణులైన వారు కేరింతలు కొట్టారు. ఉదయం డీపీఐ ఆవరణలో మంత్రి అన్బిల్ మహేశ్ ఫలితాలను విడుదల చేయగానే విద్యార్థులు తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్లకు వచ్చిన సమాచారాన్ని చూసుకునే పనిలో పడ్డారు. మరికొందరు విద్యా శాఖ ప్రకటించిన వెబ్సైట్లపై దృష్టి పెట్టారు. ఉత్తీర్ణత, తమకు వచ్చిన మార్కులను చూసి ఆనందంలో పరస్పరం విద్యార్థులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్లస్ ఒన్ ఫలితాలు: ప్లస్ ఒన్ పరీక్షలను 8,07,098 మంది విద్యార్థులు రాశారు. ఇందులో 7,43,232 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత 92.09 శాతంగా నమోదైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్లస్ ఒన్లో 0.92 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 2042 ప్రభుత్వ సహకారం, ప్రైవేటు బడులు 282, ప్రభుత్వ బడులు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. 125 మంది ఖైదీలు పరీక్ష రాయగా 113 మంది ఉత్తీర్ణులయ్యారు. తమిళం సబ్జెక్టులో 41 మంది, ఆంగ్లంలో 39 మంది, ఫిజిక్స్ –390, కెమిస్ట్ట్రీ 593, బయాలజీ –91, మ్యాథ్స్–1338, బోటనీ–4, జువాలజి –2,కంప్యూటర్ సైన్స్లో –3,535, హిస్టరీ –806, అకౌంటెన్సీ –111, ఎకనామిక్స్ –254, కంప్యూటర్ అప్లికేషన్ –761, స్టాటిస్టిక్స్లో 117 మంది వంద మార్కులు సాధించారు. ప్లస్ ఒన్లో అత్యధికంగా 97.76 శాతంతో అరియలూరు, 96.97 శాతంతో ఈరోడ్, 96.23 శాతంతో విరుదునగర్, 95.77 శాతంతో కోయంబత్తూరు, 95.01 శాతంతో తూత్తుకుడిలో మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. పదో తరగతి ఫలితాల్లో శివగంగై జిల్లా తొలి స్థానంలో నిలవడంతో ఆ జిల్లాకు చెందిన మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ స్థానికంగా ఉన్న పాఠశాల వద్దకు వెళ్లి స్వీట్లు పంపిణీ చేశారు. ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్యనామక్కల్ సమీపంలోని పరమత్తివేలూరుకు చెందిన ప్రకాశం, కవిత దంపతుల కుమార్తె కదివాసవి (15). పరీక్షలో తప్పుతానన్న భయంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆ బాలిక 348 మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో ఆ కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. విరుదాచలంకు చెందిన ప్రభు, తేన్మొళి దంపతుల కుమార్తె శివానిశ్రీ 500లకు 201 మార్కులే రావడంతోఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి టాప్పేటై ప్రాంతానికి చెందిన మురళి (50) పరీక్ష సమయంలో మరణించాడు. తండ్రి మరణంతో బాధలో ఉన్న ఆయన కుమార్తె నిరంజన పది ఫలితాల్లో 461 మార్కులు సాధించడం విశేషం. న్యూస్రీల్రామన్న మంతనాలు! ఈడీ దాడులు జూలైలో సప్లిమెంటరీ మంత్రి అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరుగుతోందని, ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 19వ తేదీ నుంచి తాత్కాలిక మార్కుల జాబితాను అందజేస్తామన్నారు. పది, ప్లస్ ఒన్లలో మార్కులు తక్కువగా వచ్చిన వారు తమ జవాబు పత్రాల నకలు కోసం ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 22 నుంచి జూన్ 6వ తేదీలోపు సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని సూచిస్తూ జూలై 4 నుంచి ఈ పరీక్ష ఉంటుందన్నారు. ప్లస్టూలో విల్లుపురంలోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన 167 మంది విద్యార్థులకు వందకు వంద మార్కులు ఓ సబ్జెక్టులో రావడం గురించి విచారణకు ఆదేశించామన్నారు. జూన్ 2వ తేదీన బడుల రీ ఓపెనింగ్కు ముందుగా నిర్ణయించామని, ఎండలు, ఇతర పరిస్థితులు బట్టి సీఎం స్టాలిన్ సెలవుల పొడిగింపు ప్రకటన చేస్తారన్నారు. ఇదిలా ఉండగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సీఎం స్టాలిన్, ప్రధాన ప్రతిపక్ష నేత పళణిస్వామి, తమిళ వెట్రి కళగం నేత విజయ్ శుభాకాంక్షలు విడుదల చేశారు. పరీక్ష తప్పిన విద్యార్థులు, తక్కువ మార్కులు సాధించిన వారు, మనోధైర్యంతో ముందుకు సాగాలని, వారికి తల్లిదండ్రులు భరోసాగా నిలబడాలని కోరారు. ప్లస్టూలోనే కాదు పదో తరగతి, ప్లస్ ఒన్లోనూ బాలికల హవా కొనసాగింది. పదో తరగతి, ప్లస్ఒన్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. డీపీఐ ఆవరణలో ఈ ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేశ్ ప్రకటించారు. పదో తరగతిలో 93.80 శాతం, ప్లస్ ఒన్లో 92.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. పది ఫలితాలు పదో తరగతిలో 8,71,239 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 8.17,261 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 93.80 గా నమోదైంది. విద్యార్థినులు 95.88 శాతం, విద్యార్థులు 91.74 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక, గత విద్యా సంవత్సరం కంటే ఈ సారి 2.25 శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. 4,917 ప్రభుత్వ సహకారంతో నడిచే బడులు, మెట్రిక్యులేషన్ బడులు, 1,867 ప్రభుత్వ బడులు 100 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకున్నాయి. పరీక్ష రాసిన దివ్యాంగులలో 92.83 శాతం మంది ఉతీర్ణులయ్యారు. రాష్ట్రంలో 98.31 శాతం ఉత్తీర్ణతతో శివగంగై జిల్లా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 97.45 శాతం ఉత్తీర్ణతతో రెండవ స్థానంలో విరుదునగర్, 96.76 శాతంతో తూత్తుకుడి మూడో స్థానంలో, 96.66 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో కన్యాకుమారి, 96.61 శాతంతో ఐదో స్థానంలో తిరుచ్చి జిల్లాలు నిలిచాయి. తమిళం సబ్జెక్టులో 8 మంది, ఆంగ్లంలో 346 మంది, గణితంలో 1,996, సైన్స్లో 10,838, సోషియల్ సైన్స్లో 10,256 మంది విద్యార్థులు వందకు వంద మార్కులు దక్కించుకోవడం విశేషం. -
మోదీ గుండెలో పన్నీర్కు ప్రత్యేక స్థానం
వేలూరు: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వంకు ప్రధాని మోదీ గుండెలో ప్రత్యేక స్థానం ఉందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తిరువణ్ణామలైలోని అన్నామలైయార్ను దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా ఆలయ శివాచార్యులు ఆయన కు ప్రత్యేక దర్శనం కల్పించి, ఆలయ సంప్రదా యం ప్రకారం స్వామి వారి ప్రసాదాలను ఆయన కు అందజేశారు. అనంతరం ఆయన ఆలయం వెలుపుల విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి వారి అధికారాన్ని ఉపయోగించి, సుప్రీంకోర్టును పలు ప్రశ్నలు అడిగారని, అయితే వీటిని తమిళనాడులోని కొందరు రాజకీయం చేస్తున్నారన్నారు. రాష్ట్రపతి అడిగిన 14 ప్రశ్నల్లో ఎటువంటి తప్పులేదనే విషయాన్ని తమిళులు తెలుసుకోవాలన్నారు. ఇప్పటివరకు రాజ్యాంగ చట్టం 143 ఐని ఉపయోగించి రాష్ట్రపతి 15 సార్లు సుప్రీంకోర్టును ప్రశ్నలు అడిగారన్నారు. తమిళనాడుకు 205 టీఎంసీ నీటిని ఇవ్వాలని కావేరి మేనేజ్మెంట్ బృందం తీర్పు నిచ్చిందని, అయితే అప్పటి కర్ణాటక సీఎం బంగారప్ప తమిళనాడుకు నీటిని ఇచ్చేందుకు కుదరదని, అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. తమిళనాడులో బీజేపీ కూటమి బలంగా ఉందని, అయితే డీఎంకే కూటమి ఇంకనూ అనుమానంగానే ఉందన్నారు. తమిళనాడు హత్యా రాష్ట్రంగా మారిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. దీంతోనే 2026వ సంవత్సరం జరిగే ఎన్నికల్లో డీఎంకేను రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపడం ఖాయమన్నారు. -
23న తెరపైకి నరివేట్టై
తమిళసినిమా: మలయాళ నటుడు టోవినో థామస్ మాలీవుడ్లో స్టార్ హీరో. ఈయనకు కోలీవుడ్లోనూ మంచి పేరు ఉంది. కాగా తాజాగా టొవినో థామన్ కథానాయకుడిగా నటించిన ద్విభాషా (తమిళం, మలయాళం) చిత్రం నరివేట్టై. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాహితీ అకాడమి అవార్డు గ్రహీత అబిన్ జోసఫ్ కథ, కథనం, మాటలు అందించిన ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా కంపెనీ పతాకంపై దీపుషా, షియాజ్హాసన్ నిర్మించారు. ఇందులో నటుడు టోవినో థామస్తోపాటు సురాజ్ వెంజరాముడు, దర్శకుడు చేరన్, ప్రియంవద కృష్ణన్, ఆర్య సలీమ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు చేరన్ ఈ చిత్రం ద్వారా మాలీవుడ్లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారన్నది గమనార్హం. ఇది యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఉత్కంఠ భరితంగా సాగే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కథ, కథనాలు ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగిస్తాయన్నారు. దీంతో నరివేట్టై చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్ టెయిన్మెంట్ సంస్థ, ఫ్యూచర్ రన్ అఫ్ ఫిలింస్ సంస్థలు తమిళనాడులో విడుదల చేయనున్నాయి. ఈ సంస్థలు చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయ నున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
డీఎంకేలో డివిజన్ల వారీగా ఇన్చార్జ్లు
● రంగంలోకి ముఖ్య నేతలు ● ఇక ఎన్నికల పనుల వేగం సాక్షి,చైన్నె: డీఎంకేలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయడం లక్ష్యంగా డివిజన్ల వారీగా ఇన్చార్జ్లు రంగంలోకి దిగనున్నారు. ఏడుగురు నేతల్ని డివిజన్ల వారీగా నియమించేందుకు కసరత్తులు పూర్తి చేశారు. మళ్లీ అధికారంలో లక్ష్యంగా ద్రావిడ మోడల్ సీఎం ఎంకే స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. డీఎంకే యువజన విభాగం ఓ వైపు, పార్టీ అనుబంధ విభాగాలు మరో వైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాయి. జిల్లాలు, యూ నియన్లు, పట్టణాలు, నగరాలు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం చేయించడమే కాకుండా, ప్రజల్లోకి చొచ్చుకేళ్లే కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ పథకాలన్నీ ఇంటింటా దరి చేరాయా అని పరిశీలించి అర్హులైన వారికి మరిన్ని పథకాలను దరి చేర్చే దిశగా కసరత్తులు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని ఏడు డివిజన్లుగా పార్టీ పరంగా విభజించారు. ఆయా డివిజన్లకు ఇన్చార్జ్లను రంగంలోకి దించనున్నారు. జిల్లాల కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతల ద్వారా వీరు పనుల వేగాన్ని పెంచనున్నారు. ఇన్చార్జ్లుగా.. : పార్టీ వర్గాల సమాచారం మేరకు తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మైలాడుతురై జిల్లాలను ఏకం చేస్తూ ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. దీనికి ఇన్చార్జ్గా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, మంత్రి కేఎన్ నెహ్రూను నియమించనున్నారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధికి దక్షిణ తమిళనాడులోని ఓ భాగానికి ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించనున్నా రు. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి, కన్యా కుమారి జిల్లాల్లో ఆమె పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇక, చైన్నె డివిజన్లోని చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలతో కూడిన డివిజన్కు ఎంపీ రాజాను ఇన్చార్జ్గా నియమించనున్నారు. రామనాథపురం, విరుదునగర్, శివగంగై జిల్లాల డివిజన్ ఇన్చార్జ్గా మంత్రి తంగం తెన్నరసు, తిరువణ్నామలై, వేలూరు, విల్లుపురం జిల్లా లతో కూడిన డివిజన్ బాధ్యతలు మంత్రి ఏవీ వేలుకు అప్పగించనున్నారు. కొంగు మండలం సెంథిల్కు.. మదురై, దిండుగల్, తేని జిల్లాలతో కూడిన డివిజన్కు మంత్రి చక్రపాణి ఇన్చార్జ్గా ఉండబోతున్నారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి కొంగు మండలం ఇన్చార్జ్ పగ్గాలు అప్పగించనున్నారు. కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, కరూర్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలు ఆయన గుప్పెట్లోకి తీసుకు రాబోతున్నారు. జూన్ 1న మదురైలో జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ఈ ఇన్చార్జ్ల ప్రకటన వెలువడనున్నట్టు ఓ నేత పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్చార్జ్ల పర్యవేక్షణలో 1,244 బహిరంగ సభల నిర్వహణతోపాటు ఇతర కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం చేశారు. -
2026లోనే కాదు 2031లోనూ అధికారం మాదే!
– సీఎం స్టాలిన్ ధీమా సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, 2031, 2036లోనూ డీఎంకే అధికారంలోకి వస్తుందని సీఎం ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ ఊటీలో ఐదు రోజులు పర్యటించారు. చివరి రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం అక్కడి పార్కులో ఎంపీ రాజాతో కలిసి ఆయన వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఐదు రోజులు ఇక్కడే ఉన్నానని గుర్తు చేస్తూ, ఈ పర్యటన ఎంతో ఆనందకరంగా ఉందని పేర్కొన్నారు. నీలగిరి ప్రజలే కాదు, ఇక్కడకు వచ్చిన పర్యాటకులు సైతం తనను చూసేందుకు వచ్చారని, వారి మద్దతును తెలుపుతున్నారని చెప్పారు. గవర్నర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడం గురించి ఇప్పటికే తాను స్పష్టత ఇచ్చానన్నారు. ఇక, ఇతర బీజేపీ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య పార్టీల నేతలతో చర్చించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం నిరంకుశ విధానాన్ని అనుసరిస్తున్నదని మండిపడ్డారు. 2026లో ద్రావిడ మోడల్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఆ తర్వాత జరిగే 2031, 2036లోనూ అధికారి తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఆ మేరకు ప్రజాహిత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. కాగా, ఊటీ పర్యటనకు వచ్చిన సీఎంను చూసేందుకు శుక్రవారం కూడా జనం ఎగబడ్డారు. నీలగిరుల్లోని అటవీ గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు, కొన్ని సంఘాల ప్రతినిధులు సీఎంను కలిసి తమ సంప్రదాయం మేరకు సత్కరించారు. -
శుక్రవారం వస్తే సందడే!
మామన్ చిత్రంలో సూరి, ఐశ్వర్యలక్ష్మి తమిళసినిమా: శుక్రవారం వస్తుందంటే నటీనటులు, దర్శక నిర్మాతల్లో గుబులు, డిస్ట్రిబ్యూటర్లలో హడావుడి, థియేటర్ల వద్ద సందడి మొదలవుతుండడం మామూలే. అలా ఈ శుక్రవారం తమిళంలో మూడు చిత్రాలు తెరపైకి వచ్చాయి. వాటిలో సూరి కథానాయకుడిగా నటించిన మామన్, సంతానం హీరోగా నటించిన డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్, నవీన్చంద్ర హీరోగా నటించిన లెవెన్ చిత్రాలు ఉన్నాయి. సూరి, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటించిన మామన్ చిత్రంలో రాజ్కిరణ్, స్వాశిక ముఖ్య పాత్రలు పోషించారు. విళంగు వెబ్సీరీస్ ఫేమ్ పాండిరాజ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ పతాకంపై కే.కుమార్ నిర్మించారు. సంతానం కథానాయకుడిగా నటించిన డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ ప్రేమ్ ఆనంద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రంహర్రర్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అలాగే నవీన్ చంద్ర హీరోగా తెలుగు,తమిళం భాషల్లో రూపొందిన చిత్రానికి లోకేశ్ అజిల్స్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. డీ.ఇమాన్ సంగీతం అందించారు. వీటిలో ప్రేక్షకులు దేనిని ఆదరిస్తారో వేచి చూడాలి. -
శేషవాహనంపై వేణుగోపాలుడి చిద్విలాసం
పళ్లిపట్టు: చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా గు రువారం రాత్రి వేణుగోపాలస్వామి శేషవాహనంపై గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు కటాక్షించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుసంధానంగా ఆర్కేపేట సమీపం ఎస్వీజీ.సపురంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో 11న చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారు శేషవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించి బంగారు ఆభరణాలతో శేష వాహనంలో కొలువుదీర్చి గ్రామవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి వారికి కర్పూర హారతులిచ్చి, కొబ్బరి కాయలు కొట్టి దర్శించుకున్నారు. శేషవాహన సేవ ఉభయ దారులుగా గ్రామానికి చెందిన గిరి, తిరుమలేష్, ప్రకాష్ ఉత్సవ ఏర్పాట్లు చేశారు. -
టెన్త్ పరీక్షల్లో గ్రామీణ విద్యార్థుల సత్తా
పళ్లిపట్టు: టెన్త్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం విడుదల కాగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. సుందరేశనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాస్థాయి ప్రథమ స్థానం సాధించి, సత్తా చాటా రు. పళ్లిపట్టు యూనియనన్ అత్తిమాంజేరిపేట లోని సుందరేశనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి మణిమారన్ 495 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాస్థాయి ప్రథమస్థానం సాధించగా, అదే పాఠశాలకు చెందిన విద్యార్థిని సెల్వశ్రీ 494 మార్కులతో రెండో స్థానం కై వసం చేసుకుంది. అలాగే కోనసముద్రం ఎరుంబి, ఆదివరాహపురం, కరింబేడు, మామండూరు, నల్లవానంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
పక్షిరాజుపై పరంధాముడు
నారాయణవనం: పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి పక్షి రాజైన గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మోహినీ అవతారంలో పల్లకిలో భక్తుల హారతులందుకున్నారు. వేకువ జామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరచి నిత్యపూజ, హోమశాలలో ప్రత్యేక పూజలు, తొలి గంట, దూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని మోహినీ అవతారంలో పల్లకిలో కొలువుదీర్చారు. భక్తులు స్వామివారిని తిలకించి కర్పూర హారతులిచ్చి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారికి స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్సేవ నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించిన గ్రామ వీధుల్లో ఊరేగారు. రాత్రి 11 గంటలకు ఆస్థానం, శుద్ధి తదితర కార్యక్రమాలను పూర్తి చేసి, స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవ, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజవాహన సేవలు జరగనున్నాయి. -
92 ఏళ్ల డాక్టరుకు అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: చైన్నెకు చెందిన 92 సంవత్సరాల వైద్యుడికి కంబైన్డ్ బీటింగ్ హార్ట్ ఫోర్ వెసెల్ బైపాస్, పేస్ మేకర్ఇంప్లాంటేషన్ను సిమ్స్ వైద్యులు విజయవంతం చేశారు. గురువారం ఆస్పత్రి ఆవరణలో ఈ శస్త్ర చికిత్స గురించిన వివరాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ అండ్ అడ్వాన్స్డ్ అయోర్టిక్ డిసీజ్ విభాగం డైరెక్టర్ డాక్టర్ వీవీ భాషి ప్రకటించారు. చైన్నెకు చెందిన శ్రీవల్సన్ గైనాకాలిజిస్టు సీనియర్ వైద్యులు అని వివరించారు. 92సంవత్సరాల వయస్సు కలిగిన ఆయన ఇటీవల ఛాతిలో తీవ్ర నొప్పి రావడంతో సిమ్స్లో చేరారు. ఇక్కడ పరీక్షలునిర్వహించిన డాక్టర్ భాషి నేతృత్వంలో వైద్యుల బృందం అన్ని రకాల పరిశోధనలతో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. 92 సంవత్సరాల వయస్సు కలిగిన ఆయనకు ఒకే ప్రక్రియలో బీటింగ్ హార్ట్ ఫోర్ వెసెల్ బైపాస్ సర్జరీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ను విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు శ్రీవల్సన్ కుటుంబ సభ్యులు సైతం అంగీకరించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసి మూడు రోజులు ఐసీయూలో ఉంచారు. ఏడు రోజులలో ఆయన డిశ్చార్జ్ కావడమే కాదు, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండడం గమనార్హం. ఈ వయస్సులో తనకు జరిగిన ఈ శస్త్ర చికిత్స గురించి శ్రీవల్సన్ మాట్లాడుతూ, తన లాంటి వృద్ధులకు ఇలాంటి సమస్యలు ఎదురైన పక్షంలో శస్త్ర చికిత్సలను ధైర్యంగా చేయించుకోవచ్చు అన్న అవగాహన కల్పించేందుకు తాను మీడియా ముందుకు వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ మహ్మద్ ఇధ్రీస్, సిమ్స్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజు శివస్వామి పాల్గొన్నారు. -
భార్యపై అనుమానంతో..
● అత్త, ఇద్దరి బంధువులను హత్య చేసిన భర్త ●రాణిపేట జిల్లాలో సంచలనం వేలూరు: రాణిపేట జిల్లా షోలింగర్ సమీపంలోని పుదుగుడియనూరు గ్రామానికి చెందిన బాలు(30) కూలీ కార్మికుడు. ఇతనికి వాలాజ సమీపంలోని కీల్ పుదుపేట గ్రామంలోని రాజంద్రన్ కుమార్తె భువనేశ్వరి(26)తో కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నాలుగు సంవత్సరాల కుమారుడున్నారు. బాలు ఇంటి ఎదురుగా విజయ్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా భువనేశ్వరికి, ఇంటి ఎదురుగా ఉన్న విజయ్కి అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. దీంతో బార్య భర్తల మధ్య తరచూ ఘర్షణలు వచ్చేవి. దీంతో పది నెలల క్రితం భువనేశ్వరి భర్తను వదిలిపెట్టి కీల్పుదుపేటలోని అమ్మగారింటికి వెల్లింది. అయితే ప్రస్తుతం భువనేశ్వరి ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది. భార్య విడిచి వెల్లడంతో బాలు తరచూ మద్యం తాగేవాడు. బుధవారం సాయంత్రం బాలు అధికంగా మద్యం సేవించి రాత్రి 9 గంటల సమయంలో కీల్ పుదుపేటలోని అత్తగారింటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య భర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. అల్లుడిని అత్త భారతి(47) నిలదీసింది. దీంతో ఆగ్రహించిన బాలు కత్తితో ఆమెను నరికేందుకు యత్నించాడు. దీంతో భారతి అక్కడ నుంచి పరుగులు తీసింది. అయినప్పటికీ వెంబడించి భారతిని హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి భారతి అక్కడక్కడే మృతి చెందింది. తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె తప్పించుకు పారిపోయింది. విజయ్ లేకపోవడంతో.. దీంతో బాలు సొంత గ్రామానికి చేరుకొని భార్యతో అక్రమ సంబందం పెట్టుకున్న విజయ్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విజయ్ లేకపోవడంతో అతని తండ్రి అన్నామలై(60) నిలదీశాడు. తర్వాత ఇనుప రాడ్డుతో అన్నామలైని హత్య చేశాడు. వీటిని గమనించిన విజయ్ తల్లి రాజేశ్వరి(55) కేకలు వేయడంతో అదే ఇనుప రాడ్డుతో రాజేశ్వరిని హత్య చేసి అక్కడ నుంచి పరుగులు తీశారు. ఒకే రోజు అత్తతో పాటు సొంత గ్రామంలోని బంధువులు ఇద్దరిని హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి బాలు కోసం గాలించారు. ఉదయం వాలాజ సమీపంలోని కులత్తేరి గ్రామంలో దాగి ఉన్న బాలును పట్టుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో బాలు పరుగులు తీయడంతో కింద పడి కాలు విరిగింది. పోలీసులు అతన్ని పట్టుకొని వాలాజ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఈ మేరకు వాలాజ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నా. భార్య అక్రమ సంబందం పెట్టుకుందన్న ఆగ్రహంతో మద్యం మత్తులో అత్తతో పాటు సొంత గ్రామంలోని ఇద్దరిని హత్య చేసిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. -
పుష్పపల్లకీలో ద్రౌపదమ్మ విహారం
● అలరించిన ‘అర్జున తపస్మాన్’ గుడుపల్లె: మండలంలో యామగానిపల్లెలోని శ్రీ ద్రౌపదీ ధర్మరాజుల మహా భారత ఉత్సవాల్లో 14వ రోజు గురువారం ద్రౌపది అమ్మవారి పుష్పపల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. తొలుత ఉదయం ఆలయం వద్ద అర్జున తపస్మాన్ కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. కౌరవులతో యుద్ధంలో గెలవడానికి అర్జునుడు శివుని నుంచి పాశుపతాస్త్రం శివుని పొందడానికి తపస్మాన్ అధిరోహిస్తాడని భారతగాథ. బుధవారం రాత్రి అరణ్యపర్వం నాటక ప్రదర్శన అనంతరం ఉదయాన అర్జున వేషధారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం తపస్సు మానుకు ప్రత్యేక పూజలు చేసి, నిమ్మకాయలు, పూజాసామగ్రిని తీసుకుని అధిరోహించాడు. అక్కడ నుంచి విసిరిన నిమ్మకాయలు, విభూది ఉండలు, ఇతరత్రా వాటిని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఆ తర్వాత మొక్కులు చెల్లించారు. అనంతరం రాత్రి ఆలయంలో ద్రౌపదమ్మను ప్రత్యేకంగా అలంకరించి పుష్పపల్లకిలో మంగళవాయిద్యాలు, బాణ సంచా మోత నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. ఆ తర్వాత శ్రీకృష్ణార్జునుని యుద్ధం పౌరాణిక నాటకం ప్రదర్శించారు. భక్తులకు అన్నదానం చేశారు. -
మెడ్రాస్ మ్యాట్నీ ఫస్ట్లుక్ విడుదల
తమిళసినిమా: డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ అధినేతలు ఎస్సార్ ప్రకాష్బాబు, ఎస్సార్ ప్రభు సమర్పణలో రూపొందుతున్న చిత్రం మెడ్రాస్ మ్యాట్ని. కార్తికేయన్ మణి దర్శకత్వం వహిస్తున్న ఇందులో సత్యరాజ్, కాళీ వెంకట్, రోషిణి హరిప్రియన్, సెల్వివిశ్వ, జార్జ్ మరియన్, అర్చన చందూర్, సునిల్ సుగధ, మధుమిత, శ్యామ్స్, గీతా కై లాసం, భానుప్రియ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. మెడ్రాస్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మూమెంట్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆనంద్ జీకే చాయాగ్రహణం, కేసీ బాలసారంగన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జూన్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. నటుడు సత్యరాజ్ కామెంట్స్తో విడుదలైన ఈ చిత్ర టైటిల్కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్న్స్ వచ్చిందని నిర్మాతలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ పోస్టర్ను దర్శకుడు, వెంకట్ ప్రభు, సంగీత దర్శకుడు, జీవీ ప్రకాష్కుమార్ బుధవారం సాయంత్రం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది విభిన్న కథా, కథనాలతో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. చిత్రం కూడా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
కనులపండువగా ఉత్సవశాంతి అభిషేకం
వేలూరు: వేలూరు బ్రాహ్మణ సంఘం, సౌత్జోన్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లోక క్షేమం కోసం వేలూరు కోట మైదానంలోని అఖిలాండేశ్వరి సమేత జలకంఠేశ్వరస్వామికి ఉత్సవ శాంతి అభిషేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు వేలూరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాజా, సౌత్జోన్ సంఘం ప్రధాన కార్యదర్శి, సౌత్జోన్ పురోహితుల సంఘం కోశాధికారి శేఖర్, రాష్ట్ర ఆర్గనైజర్ క్రిష్ణమూర్తి అధ్యక్షతన అధికసంఖ్యలో పురోహితులు ప్రత్యేక వేద మంత్రాలు చదివి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వామి వారికి మహాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక యాగ గుండం ఏర్పాటు చేసి వివిధ పుణ్య జలాలను తీసుకొచ్చి కలశాలలో ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంఘం నిర్వాహకులు శ్రీనివాసన్, రామచంద్రన్, పురోహితుల నిర్వాహకులు, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు. -
కోలాహలం.. గంగయమ్మన్ జాతర
● ఐదు లక్షల మంది దర్శనంవేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం గంగయమ్మన్ ఆలయ జాతరను పురస్కరించుకుని శిరస్సు జాతర గురువారం ఉదయం కోలాహలంగా జరిగింది. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గుడియాత్తం గంగయమ్మన్ జాతర ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులోభాగంగా గురువారం ఉదయం ముత్తాలమ్మన్ ఆలయంలోని అమ్మన్ శిరస్సుకు ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో భక్తుల కోలాహలం మధ్య శిరస్సు ఊరేగింపుగా తీసుకొచ్చి పాలారు నది ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహానికి అమర్చారు. ఊరేగింపులో ఓంశక్తి భక్తులతోపాటు, భక్తులు వివిధ వేషధారణలు పులివేశం, స్వామి వేషాలు ధరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు అక్కడక్కడ నీరు, మజ్జిగ, అంబలి ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ శివకుమార్, అసిస్టెంట్ కమిషనర్ నిత్య, ఆలయ ధర్మకర్త ఆర్పీఎస్ సంపత్, ఆర్జేఎస్ కార్తికేయన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎసీమదివాణన్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగింపులో రాత్రి బాన వేడుకలను ఏర్పాటు చేశారు. -
కోలీవుడ్పై కోమలి కన్ను
తమిళసినిమా: ఇప్పుడు నటీనటులు ఒక్క భాషలో నటిస్తే చాలు. ఇతర భాషల్లోనూ ఇట్టే వ్యాప్తి చెందుతున్నారు. అలా ఇతర భాషల్లోనూ అవకాశాలు పొందుతూ తమ సత్తాను చాటుకుంటున్నారు. అలా హాలీవుడ్లో పాగా వేయాలని ఆశపడుతున్న టాలీవుడ్ నటి కోమలిప్రసాద్. పదహారణాల తెలుగు అమ్మాయి అయినా ఈమె ప్రతిభ పాటవాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కోమలి ప్రసాద్లో నటి మాత్రమే కాకుండా ఒక వైద్యురాలు (డెంటిస్ట్), జాతీయస్థాయి అథ్లెట్, క్లాసికల్ నృత్య కళాకారిణి అంటూ పలు ముఖాలు కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి. ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలను నటించిన కోమలిప్రసాద్ తాజాగా నాని కథానాయకుడిగా నటించిన హిట్–3 చిత్రంలో ఏ ఎస్పీ వర్షాగా చాలా కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను కోమలి ప్రసాద్ పంచుకుంటూ హిట్–3 చిత్రంలో తాను పోషించిన ఎస్పీ వర్షా పాత్ర శారీరకంగానూ, మానసికంగానూ చాలెంజ్ అనిపించిందన్నారు. ఈపాత్ర కోసం జాతీయస్థాయి బాక్సర్ అనిల్ వద్ద శిక్షణ పొందినట్లు చెప్పారు. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు ఆనంద భాష్పాలు వచ్చాయన్నారు. ఈ చిత్రంలో నానితో కలిసి నటించడం మంచి అనుభవం అని, ఆయన చాలా సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథా చిత్రంలోనూ నటించాలన్నది తన కలగా పేర్కొన్నారు. తమిళ చిత్రాలపై ఆశతో తమిళభాషను సరళంగా మాట్లాడడం నేర్చుకున్నానని చెప్పారు. సి. ప్రేమ్కుమార్, ఆల్ ఫోన్న్స్ పుత్తిరన్, మణికంఠన్, గౌతమ్మీనన్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు, అజిత్ ఎప్పటికీ తన ఫేవరెట్ అని, ఆయనతో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు కోమలి పేర్కొన్నారు. కోమలి ప్రసాద్ -
ఒంటరి ఏనుగు హల్చల్
హడలిపోతున్న గ్రామస్తులు గుడుపల్లె: ఒంటరి ఏనుగు రోడ్డుపై హల్చల్ చేసింది. ఈ సంఘటన మండలంలోని సంగనపల్లె నుంచి తమిళనాడులోని వేపనపల్లెకు వెళ్లే రోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సంగనపల్లె, చిన్నపర్తికుంట, పెద్దపిర్తకుంట గ్రామాల సమీపంలోని ఉన్న రోడ్డుపై ఒంటరి ఏనుగు సంచరించింది. నడి రోడ్డుపై ఏనుగు ఉండడంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, మోటార్ సైక్లిస్టులు హడలిపోయారు. ఈ రోడ్డులో నిత్యం ద్విచక్రవాహనాలలో రాకపోకలు సాగిస్తూంటారు. గ్రామాలకు సమీపంలోనే అటవీ ప్రాంతం ఉండడం, దీనికి ఆనుకుని సాగు చేసిన పంటలు ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల నుంచి రాత్రి పూట వెలుపలికి వచ్చేందుకు జంకుతున్నారు. అటవీ శాఖ అదికారులు స్పందించి ఒంటరి ఏనుగు గ్రామాల వైపు రాకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు. -
అలరించిన నృత్యప్రదర్శనలు
కొరుక్కుపేట: చిత్రా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలతో కళాకారులు రంజింపజేశారు. తంజావూర్లోని ప్రాచీన చరిత్ర కలిగిన బృహదీశ్వర ఆలయం వేదికగా చిత్రా పౌర్ణమి కలై విళా –2025 పేరుతో అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ గురువు రోజా రాణి, అకాడమీ డైరెక్టర్ అండ్ ఆర్గనైజర్ దుర్గా నటరాజ్ అధ్యక్షతన ఈ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తంజావూరు 13వ రాజు బాబాజీ రాజా బోస్లే, ఇంకా తమిళనాడు యూనివర్సిటీ –తంజావూరు వ్యవస్థాపక చైర్మన్ భాస్కరన్, శివ సేన స్టేట్ ఎగ్జిక్యూటివ్ లీడర్ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళా రత్న డాక్టర్ సంజయ్ శాంతారామ్, శివ ప్రియా టీమ్ –బెంగళూరు వారు శివోహం భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనతో కనువిందు చేశారు. శాస్త్ర టెంపుల్ ఆఫ్ డ్యాన్స్ టీమ్ కోయంబత్తూర్కు డా. అర్చన, వారి శిష్యులు, ద్వనీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ తురైపాక్కంకి చెందిన శారిక, రాజేశ్వరి సుందరరామన్ అకాడమీకి చెందిన తమిళ రోజా జగత్ ప్రభు బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ఈ సందర్భంగా కళాకారులను ఘనంగా సత్కరించిన నిర్వాహకులు రోజా రాణి మాట్లాడుతూ తంజావూరు గుడిలో నృత్య ప్రదర్శన చేసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తమకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఊర్మిళా సత్యనారాయణన్ నాటక్ అకాడమీకి చెందిన విద్యార్థుల ప్రదర్శన అమోఘం అని కొనియాడారు. కళా కారులకు ఘన సత్కారం -
కొడనాడు కేసులో దోషులను శిక్షించాలి
సాక్షి, చైన్నె : కొడనాడు హత్య, దోపిడీ కేసులో దోషులు శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో హాట్ టాఫిక్గా మారాయి. అన్నాడీఎంకే హయాంలో దివంగత సీఎం జె. జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో జరిగిన, హత్య, దోపిడీ గురించి తెలిసిందే. ఈ కేసులో నిందితులు అరెస్టయినా, అన్నాడీఎంకే పెద్ద చుట్టూ, మాజీ పెద్దల చుట్టూ విచారణ సాగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో బుధవారం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో నిందితులకు పడ్డ శిక్షను గుర్తు చేస్తూ, కొడనాడు కేసులో నిందితులకు ఇదే తరహా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తిరుచ్చిలో మీడియాతో మాట్లాడుతూ, కొడనాడు కేసును ప్రస్తావించారు. పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో బాధితులకు న్యాయంజరిగిందని పేర్కొంటూ, కొడనాడు కేసులోనూ దోషులు శిక్షించ బడాలని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమకు వ్యతిరేకంగా డీఎంకే పాలకులు ఈకేసును అస్త్రంగా చేసుకుని వ్యూహాలకు పదును పెట్టి ఉన్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు సైతం కేసులో దోషులు శిక్షించ బడాలని వ్యాఖ్యలు చేయడాన్ని అన్నాడీఎంకే వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. -
అదుపుతప్పిన లారీ
●ముగ్గురికి తీవ్రగాయాలు ●ఆరు వాహనాలు ధ్వంసం తిరువొత్తియూరు: లారీ అదుపుతప్పి దూసుకెళ్లడంతో ముగ్గురు గాయపడ్డారు. ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈఘటన చైన్నె, మూలక్కడ కూడలి వంతెన వద్ద చోటుచేసుకుంది. చైన్నె మాధవరం రౌండ్టానా నుంచి మూలక్కడై వైపు బుధవారం రాత్రి లారీ వెళుతోంది. మూలక్కడై వంతెన కింద కూడలి వద్ద వెళుతుండగా హఠాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో, నాలుగు బైకులు, లగేజీ వ్యాన్ను ఢీకొంది. ఈప్రమాదంలో ఆటో ధ్వంసమైన సంఘటనలో ఒక వృద్ధురాలికి, బైక్లో కూర్చుని ఉన్న బిడ్డ ,రోడ్డుపై నడిచి వెళుతున్న జయకుమార్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మాధవరం ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లి గాయపడిన వారిని స్టాన్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ విజయ్ (35)ను స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పుళల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పళ్లికొండేశ్వరుడి సేవలో ఉడిపి పీఠాధిపతి నాగలాపురం: మండలంలో సురుటుపల్లిలోని పళ్లికొండేశ్వరస్వామిని ఉడిపి పీఠాధిపతి ఈషా ప్రియ తీర్థ స్వామీజీ, తన శిష్య బృందంతో దర్శించుకున్నారు. వారికి ఆలయాధికారుల స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి ఆలయ ప్రదోష మండపంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు ●టీవీకే స్పష్టీకరణ సాక్షి, చైన్నె: బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని తమిళగ వెట్రి కళగం(టీవీకే) ప్రకటించింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రిక ళగం బలోపేతం దిశగా ప్రజలలోకి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సాగిన ఓ సర్వేలో సైతం విజయ్ సత్తా చాటుకుంటారన్నది స్పష్టమైంది. అదే సమయంలోఅన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలోని కూటమిలోకి విజయ్ను ఆహ్వానించే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు గత కొద్ది రోజులుగా చర్చ జోరందుకుంది. ఇందుకు సమాధానం ఇస్తూ గురువారం తమిళగ వెట్రి కళగం డిప్యూటీ ప్రధానకార్యదర్శి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకునేప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమిళ వెట్రి కళగం నేతృత్వంలోనే కూటమి ఉంటుందని వ్యాఖ్యానించారు. కూటమిలోకి ఎవ్వర్వెరు వస్తారో, పొత్తుల కసరత్తు గురించి త్వరలో తమ నేత విజయ్ ప్రకటిస్తారన్నారు. బీజేపీతో పొత్తు లేదని, తమ మహానాడులోనే స్పష్టంగా సిద్ధాంతాలను ప్రకటించామన్నారు. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న వారితో పొత్తులు ఉండవని స్పష్టంచేశారు. రాయిని ఢీకొన్న కారు నాగలాపురం: మండలంలోని చిన్నాపట్టు వద్ద పుత్తూరు–చైన్నె హైవే పక్కన రాయిని కారు ఢీకొంది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తమిళనాడులోని కొలత్తూరుకు చెందిన ఇద్దరు కారులో తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి తిరిగి చైన్నెకి బయలుదేరారు. మార్గమధ్యంలో చిన్నాపట్టు గ్రామం వద్ద కారు అదుపుతప్పి హైవే పక్కన ఉన్న రాయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు ముందు భాగం మాత్రం దెబ్బతింది. -
● సప్తవర్ణ పుష్పాలతో ఊటీ కనువిందు ● పర్యాటకం కిటకిట ● 127వ ప్రదర్శనను ప్రారంభించిన సీఎం ● పుష్ప ప్రదర్శనలతో ఫొటోలు దిగుతూ ఆనందం
సాక్షి, చైన్నె: తమిళనాడులోని నీలగిరి జిల్లాల్లో పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఊటి. ప్రకృతి రమణీయతకు రారాజుగా పేరుగడించిన ఈ ప్రాంతం ఎల్లప్పుడూ ఆహ్లాదకర వాతావరణంలో మునిగి ఉంటుంది. ఇక్కడి పర్యాటక అందాల్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక్కడ రోడ్డు మార్గంలో కన్నా, రైలు మార్గంలో ఊటి పయనం ప్రత్యేక అనుభూతి. మేట్టుపాళయం నుంచి కున్నూరు మీదుగా ఊటీకి వెళ్లే ఈ రైలు కొండకోనల్లో ప్రయాణిస్తుంది. ఈ ప్రకృతి సీమలో ఏటా వేసవి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతుంటాయి. ఈ ఏడాది వేసవి ఉత్సవాలలో భాగంగా పుష్ప ప్రదర్శనకు నీలగిరి జిల్లా యంత్రాంగం, ఉద్యానవన, అటవీ , వ్యవసాయ శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకుంది. పుష్ప ప్రదర్శన.. 127వ పుష్ప ప్రదర్శనను రూ. 24.60 లక్షలతో ఏర్పాటు చేశారు. వేసవిలో నీలగిరి అందాలను ఆస్వాదించడానికి వస్తున్న పర్యాటకులకు కనువిందుగా ఈనెల 25 వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ పుష్ప ప్రదర్శనలో పురాతన తమిళ రాజుల రాజభవనాలు. జీవనశైలిని చూపించే అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 70 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు ఉన్న అద్భుతమైన రాజభవనం ప్రవేశ ద్వారం డిజైన్ 1,30,000 పువ్వులతో తీర్చిదిద్దారు. 75 అడుగుల పొడవు , 25 అడుగుల ఎత్తు కార్నేషన్లు, గులాబీలు, బంతి పువ్వులు తదితర 2,00,000 పువ్వులతో పురాతన రాజభవన రూపొందించారు. అదనంగా, 8 అడుగుల పొడవు, 35 అడుగుల పొడవుతో బంతి పువ్వులు, గులాబీలతో రాజహంస, కుండలు మరింత వన్నె తెచ్చి ఉన్నాయి. పార్కులోని వివిధ ప్రాంతాలను పూర్తిగా పువ్వులతో అలంకరించారు. పురాతన సింహాసనం. ఊయల, అద్దం, సంగీత ఉపకరణాలు, ఫిరంగులు, ఏనుగు, పులి, చదరంగం సెట్ వంటి అనేక ఆకర్షణీయ అంశాలను పువ్వులతో తీర్చిదిద్దారు. ఈ ప్రదర్శనలో భాగంగా వివిధ కళా ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఉదయం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. గార్డెన్ అంతా తిరుగుతూ పువ్వుల అలంకరణలను ఆస్వాధీస్తూ, రాజ భవనం సెట్లో పోటోలు దిగుతూ ఆనందంగా సీఎం స్టాలిన్ చక్కర్లు కొట్టారు. రాజసంగా పొటోకు పోజు కళా ప్రదర్శన -
నాలుగు రోజులు వానలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. పలు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కుండ పోతగావర్షం పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ముందుగానే ప్రారంభం కానుంది. మరో పది రోజులలో ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. దీంతో తమిళనాడులోని పశ్చిమ కనుమల వెంబడి ఉన్న కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తేని, దిండుగల్, కోయంత్తూరు, ఈరోడ్ జిల్లాలోని రైతులు దుక్కి దున్నేపనిలో నిమగ్నమయ్యారు. ఈఏడాది పలు జిల్లాలో భానుడి ప్రభావం అధికంగానే ఉంటూవస్తున్నా, ముందుగానే రుతు పవనాలు రానున్నడం కొంత ఆనందాన్ని కలిగిస్తున్నది. ఏటా నైరుతి ప్రభావం అన్నదికేవళం పశ్చిమ కనుమల వెండి ఉన్న జిల్లాల మీదే ఉంటుంది. మిగిలిన చోట్ల చెదరు ముదురుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి నుంచి వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి. తిరుచ్చి, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్, పుదుకోట్టై తదితర డెల్టా జిల్లాలో మోస్తారుగానే వర్షం పడింది. కోయంబత్తూరులోనూ వర్షం పడింది. డెల్టా జిల్లాలో కొన్ని చోట్ల ఈదురు గాలులు, ఉరుముల మెరుపుతో కూడిన వర్ష ప్రభావానికి అరటి పంట దెబ్బతింది. మామిడి సైతం నేల రాలింది. అండమాన్ తీరాన్ని రుతుపవనాలు తాకిన నేపథ్యంలో ఈ వర్షాలుమరి కొన్ని రోజులు ఎదురు చూడవచ్చు అని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర,శని, ఆది,సోమవారాలలో నీలగిరి, కోయంబత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూరు, తదితర జిల్లాలో వర్షాలు పడుతాయని, డెల్టా, పశ్చిమ కనుమలవెంబడి జిల్లాలోనూ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం గురువారం ప్రకటించింది. పుదుకోట్టై జిల్లాతిరువారంకులం గ్రామంలో వర్షం, ఈదురుగాలులో కారణంగా దెబ్బ తిన్న అరటి పంటను మంత్రి శివ వీ మెయ్యనాథన్, ,వ్యవసాయ అధికారులు పరిశీలించారు. -
4 వేల కోచ్ల లక్ష్యం
● ఐసీఎఫ్ టార్గెట్ సాక్షి, చైన్నె : చైన్నె ఐసీఎఫ్ మరో ముందడుగు వేయనుంది. 2025–26లో నాలుగు వేల కోచ్లను తయారు చేయడం లక్ష్యంగా టార్గెట్ను నిర్ణయించుకున్నారు. భారత రైల్వేలోనే సరికొత్తగా, అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైళ్ల తయారీలో ఐసీఎఫ్ దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఐసీఎఫ్ చరిత్రలో ఎన్నో మైలు రాళ్లు చైన్నె నుంచి పట్టాలెక్కాయి. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలలో చైన్నె దేశానికే ఆదర్శంగా నిలుస్తూ, అగ్రస్థానాన్ని దక్కించుకుంటూ వస్తోంది. ఒక్కటా రెండా...ఎన్నో అత్యాధునిక రైళ్లు, బోగీల నిర్మాణంలో ఐసీఎఫ్ ఘన కీర్తిని చాటుకుంది. స్వదేశీ పరిజ్ఞానంగా ఆధునిక సౌకర్యాలతో సాగుతున్న ఐసీఎఫ్ నిర్మాణాలన్నీ సంతృప్తికరంగా మారింది. వందే భారత్ స్లీపర్ వర్షన్ వరకు అన్నీ ప్రత్యేకతను సంతరించుకున్నవే. ఈ పరిస్థితులలో 2024–25 సంవత్సరంలో గత రికార్డులను అధిగమించే విధంగా ఇక్కడ రైలు కోచ్ల తయారీ జరిగింది. గతంలో 2829 కోచ్లను ఒకే ఏడాదిలో తయారు చేయగా, 2024–25లో 3007 కోచ్లను సిద్ధం చేశారు. ఇందులో 1,169 డీపీఆర్ ఎస్ కోచ్లు ఉన్నాయి. వీటిలో వందే భారత్ స్లీపర్, వందేభారత్ చైర్ కార్, ఈఎంయూ, ఎంఈఎంయూలు ఉన్నాయి. 1,838 కోచ్లు ఎల్హెచ్బీలు ఉన్నాయి. వందేభారత్, ట్రెజరీ వ్యాన్ కోచ్ల పరిచయం, అమృత్ భారత్ 2.ఓ వంటి రైళ్లకు కోచ్ల తయారీలో ఐసీఎఫ్ దూసుకెళ్లింది. ఈ పరిస్థితులలో 2025–26లో 4 వేల కోచ్ల తయారీ లక్ష్యంగా టార్గెట్ను నిర్ణయించుకున్నారు. ఇందులో వందే భారత్ స్లీపర్ కోచ్లకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. మరిన్ని లగ్జరీ సేవలతో సూపర్ ఫాస్ట్ రైలు కోచ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఐసీఎఫ్ -
70 వేల ఆటోలకు క్యూర్ కోడ్లు
సాక్షి, చైన్నె : చైన్నెలో 70 వేల ఆటోలకు క్యూర్ కోడ్ స్టిక్కర్లను అంటించారు. మరో 20 వేల ఆటోలకు అంటించే పనులు జరుగుతున్నాయి. చైన్నె నగరంలో సుమారు 90 వేల మేరకు ఆటోలు ఉన్న విషయం తెలిసిందే. ప్రయాణీకులకు భద్రత కల్పించే విధంగా, ప్రధానంగా మహిళలు, యువతులు, పిల్లలకు భద్రతా పరంగా మరింత తోడ్పాటు అందించేందుకు గ్రేటర్ చైన్నె పోలీసు కమిషనరేట్ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఆటోలకు క్యూర్ కోడ్ స్టిక్కర్లను అంటించే పనులు చేపట్టారు. చైన్నె నగరంలో 89,011 ఆటోలు ఉన్నట్టుగా పోలీసు పరిశీలనలో తేల్చారు. మిగిలిన ఆటోల వివరాలను సైతం సేకరిస్తున్నారు. అన్ని ఆటోల నెంబర్లు, ప్రయాణికులు అత్యవసర సమయాలలోక్యూర్ కోడ్ను ఉపయోగించేందుకు వీలుగా ప్రత్యేక వివరాలు, కంట్రోల్ రూమ్, గస్తీ పోలీసులకు తక్షన సమాచారాల చేర వేయడం వంటి ప్రక్రియతో క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లను సిద్ధం చేశారు. గత నెలన్నర రోజులుగా 70 వేల ఆటోలకు క్యూర్ కోడ్తో కూడిన స్టిక్కర్లను అంటించారు.మరో 20 వేల ఆటోలకు స్టిక్కర్టు అంటించే పనులను వేగవంతంచేశామని గ్రేటర్ చైన్నె పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. -
కోర్టుకు సీమాన్ డుమ్మా
సాక్షి, చైన్నె: తిరుచ్చి కోర్టుకు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ గురువారం డుమ్మా కొట్టారు. ఆయనకు న్యాయమూర్తి విజయ అక్షింతలు వేశారు. తిరుచ్చి డీఐజీ వరుణ్కుమార్కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలను చేసి సీమాన్ ఇరకాటంలో పడ్డ విషయం తెలిసిందే. ఆయన దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును తిరుచ్చి కోర్టు న్యాయమూర్తి విజయ విచారిస్తున్నారు. పలుమార్లు కోర్టుకు సీమాన్ డుమ్మా కొట్టారు. తీవ్ర హెచ్చరికలతో అప్పుడప్పుడు హాజరవుతూ వచ్చారు. ఈ పరిస్థితులలో గురువారం సీమాన్ విచారణకు తప్పని సరిగాహాజరు కావాల్సి ఉంది. అయితే, ఆయన రాలేదు. దీంతో న్యాయమూర్తి విజయ్ ఆయన తరపు న్యాయవాదులకు అక్షింతలు వేశారు. తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేస్తూ, ఆ రోజున విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ నుంచి .. ● గోవిందా పాట తొలగింపు తమిళసినిమా: నటుడు సంతానం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్. నటుడు ఆర్యకు చెందిన షో పీపుల్ సంస్థ, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. కాగా ఇందులో చోటు చేసుకున్న శ్రీనివాస గోవిందా అనే పాట పెద్ద వివాదానికి దారి తీసింది. పాట యూట్యూబ్ ఛానళ్లలో వైరల్ అవుతుండడంతో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ చిత్రం నుంచి వెంటనే ఆ పాటను తొలగించాలని, ఇప్పటికే భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు గానూ నష్టపరిహారంగా రూ. 100 కోట్లు చెల్లించాలని నటుడు సంతానంకు, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థ నోటీసులు జారీ చేశారు. లేనిపక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ చిత్రం నుంచి శ్రీనివాసా గోవిందా పాటను తొలగించి, మరోసారి సెన్సార్ చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. దీంతో ఈ సమస్య సమసిపోయినట్లేనా అన్నది వేచి చూడాలి క్షేత్రస్థాయిలోకి పళణి సేన ●నేటి నుంచి 82 చోట్ల కార్యక్రమాలు సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే బలోపేతం దిశగా ప్రజలలోకి చొచ్చుకెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ సేనల కార్యక్రమాలు శుక్రవారం నుంచి 14 వారాల పాటుగా జరగనున్నాయి. బీజేపీతో అన్నాడీఎంకే మళ్లీ జత కట్టిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికలలో అధికారం లక్ష్యంగా వ్యూహాలకు ఆ పార్టీ నేత పళని స్వామి పదును పెట్టారు. పార్టీ జిల్లాల నేతలు, అనుబంధ విభాగాలతో పాటూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీతోనూ సమావేశాలను ముగించారు. ఇక, తాను స్వయంగా రంగంలోకి దిగే రీతిలో ప్రజలలోకి చొచ్చుకెళ్లే దిశగా కసరత్తు మొదలెట్టారు. ఇందులో భాగంగా ప్రజా సమస్యలు, స్థానిక సమస్యల అధ్యయనంతో పాటూ తాము గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించే రీతిలో క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి 14 వారాల పాటుగా పార్టీ పరంగా ఉన్న 82 జిల్లాలో రోజుకు ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజలను నేరుగా కలవడమే కాదు, వారి సమస్యలను తెలుసుకునే దిశగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఈ పర్యటనలో దూసుకెళ్లనున్నారు. చైన్నె, శివారులలో తాంబరం, మదుర వాయిల్, అంబత్తూరు, తిరువొత్తియూరు, కాంచీపురం, మదురాంతకం, తదితర ప్రాంతాలలో ప్రజలతో మమేకమయ్యే విధంగా క్షేత్ర స్థాయిలోకి పళణి సేన దూసుకెళ్లనున్నారు. 25న తిరుచ్చిలో డీఎంకే యూత్ భేటీ సాక్షి, చైన్నె: తిరుచ్చి వేదికగా ఈనెల 25న డీఎంకే యువజన సమావేశం జరగనుంది. ఆ విభాగం ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో 2026 ఎన్నికలలో డీఎంకే యూత్ పాత్ర గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మళ్లీ అధికారం, మళ్లీ సీఎంగా స్టాలిన్ను బాధ్యతల స్వీకరణ దిశగా డీఎంకే యువజనులు శ్రమించే విధంగా కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. -
ఎంపీలతో రైల్వే జీఎం భేటీ
సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ గురువారం పాలక్కాడు డివిజన్ పరిధిలోని లోక్సభ నియోజకవర్గాల ఎంపీలతో సమావేశమయ్యారు. దక్షిణ చైన్నె రైల్వే పరిధిలోని పాలక్కాడు డివిజన్లో ఉన్న వివిధ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని రైల్వే లైన్లలో పూర్తి చేసిన పనులు, కొనసాగుతున్న పనుల గురించి స్థానికంగా ఎంపీలకు వివరించారు. ప్రయాణికులకు మెరుగు పరచాల్సిన సౌకర్యాలు, మౌలిక సదుపయాల మెరుగు అంశాలను గురించి ఈ సందర్భంగా ఎంపీలు పలు సూచనలు చేశారు. తమిళనాడులోని పొల్లాచ్చి లోక్సభ నియోజకవర్గం ఎంపీ కె. ఈశ్వర స్వామి, కేరళలోని లోక్సభ నియోజకవర్గాల ఎంపీలు,రాజ్య సభ సభ్యులు కె. రాధాకృష్ణన్, ఎంకే రాఘవన్, రాజ్ మోహన్ షఫీ, శ్రీకందన్, డా. వి. శివదాసన్, పి.పి. సునీర్, శ్రీమతి పి.టి. ఉష ఈ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. సింగ్ పేర్కొంటూ, ప్రయాణికుల సౌకర్యాలను పెంపొందించడానికి ఇటీవల కాలంలో తీసుకున్న చర్యలు, వివిధ కార్యక్రమాలను వివరించారు. పాలక్కాడ్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ చతుర్వేది, దక్షిణ రైల్వే ప్రధాన విభాగాల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పొల్లాచ్చి నియోజకవర్గం పరిధిలో కినత్తు కడవు వద్ద కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి, పొల్లాచిలో ప్లాట్ఫామ్ షెల్టర్ అప్గ్రేడ్లు, మదుకరైలో హైలెవల్ ప్లాట్ఫామ్ నిర్మాణాల పూర్తి గురించి వివరించారు. -
ఢిల్లీకి గవర్నర్
● రాజ్యాంగాన్ని అపహస్యం చెయొద్దన్న సీఎం సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం ఢిల్లీ వెళ్లారు. నాలుగురోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. దీంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పది ముసాయిదాల విషయంలో సుప్రీంకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. గత నెలాఖరులో ఢిల్లీ వెళ్లిన ఆయన ఐదు రోజుల పాటూ అక్కడే ఉన్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటూ పలువురు మంత్రులు, న్యాయ నిపుణులు, అధికారులతో సమావేశమై ఇక్కడకు వచ్చారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం దూకుడు పెంచి వీసీల నియామక కసరత్తులను వేగవంతం చేసింది. ప్రభుత్వ పరిధిలోని వర్శిటీలకు వీసీల ఎంపిక ప్రక్రియ త్వరితగతిన ముగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితులలో ఈపది ముసాయిదాల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు లేఖ రాస్తూ, 14 ప్రశ్నలను గురువారం రాష్ట్రపతి దౌప్రది ముర్ము సందించారు. రాష్ట్రపతి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే దిశగా సుప్రీం కోర్టు సైతం ఐదుగురు న్యాయమూర్తుల బృందాన్ని రంగంలోకి దించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ రవి ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నాలుగు రోజులు ఢిల్లీ ఉంటారు. 18వ తేదీ ఆదివారం చైన్నెకు తిరుగు ప్రయాణం అవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, హోంమంత్రి అమిత్షాను కలిసేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు చర్చ జరుగుతోంది. రాజ్యాంగాన్ని కించపరచొద్దు రాజ్యాంగ స్థానాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును ప్రశ్నించినట్టుందని సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ కేసుతో పాటూ ఇతర కేసులలో సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ సీఎం ట్వీట్ చేశారు. రాజ్యాంగ స్థానాన్ని రాష్ట్రపతి ద్వారా అస్థిరపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు వివరణ కోరడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమిళనాడు గవర్నర్ ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, అవమాన పరిచే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజలచే ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను తాజా పరిణామాలు ఏకం చేయనున్నట్టు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను బలహీన పరిచే ప్రయత్నంలో ఉన్నారని మండిపడ్డారు. తాజా పరిణామాలు సుప్రీంకోర్టును కూడా నేరుగా సవాలు చేస్తున్నట్టుందన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ న్యాయ పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. తమ శక్తినంతా ఏకం చేసి ఈ పోరాటంలో చేరుదామని, తమిళనాడు పోరుడుతుంది..తమిళనాడు గెలుస్తుందని వ్యాఖ్యలు చేశారు. -
తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన..!
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు. -
సింధూర్ యాత్రకు శ్రీకారం
●చైన్నెలో విజయోత్సవ హోమంసాక్షి, చైన్నె: పాక్ ఉగ్ర మూకలను ఏరి పారేసేందుకు సాగిన ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ ప్రదర్శించిన అత్యుత్తమ సాహసాన్ని విజయోత్సవంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ చైన్నెలో బుధవారం సింధూర్ యాత్రను బీజేపీ వర్గాలు నిర్వహించాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో–ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, నేతలు తమిళిసై సౌందరరాజన్ ఉదయం వెస్ట్ మాంబలంలోని అయోధ్య అశ్వ మేధ మహా మండపంలోని శ్రీరామ సమాజంలో జరిగిన హోమంలో పాల్గొన్నారు. చైతన్యవంతమైన, దార్శనిక నాయకత్వం, భారత సాయుధ దళాల శ్రేయస్సు కోసం, నిరంతర విజయం కోసం, దేశ ఐక్యతను కాంక్షిస్తూ ఈ హోమం జరిగింది. సాయంత్రం చైన్నెలో జాతీయ జెండాలను చేతబట్టి ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ యాత్ర నిర్వహించారు. జాతీయ జెండా రెపరెపలాడే విధంగా, భారత ఆర్మీ సేనల శౌర్యాన్ని చాటే విధంగా ఈ యాత్ర జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ వర్గాలు ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. గురువారం ఇతర నగరాలలో, 16, 17 తేదీలలో జిల్లా కేంద్రాలలో, 18 నుంచి 23వ తేదీ వరకు గ్రామగ్రామాన జాతీయ జెండా రెప రెపలాడే విధంగా, త్రివర్ణ దళాలకు మద్దతుగా నిలిచే రీతిలో సింధూర్ యాత్ర నిర్వహించనున్నారు. -
క్రీడాకారులకు ప్రోత్సాహం!
● కాలేజ్ డ్రీమ్ ప్రోగ్రామ్ ప్రారంభంసాక్షి, చైన్నె: జర్మనీలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికై న 12 మంది క్రీడకారులకు తమిళనాడు చాంపియన్స్ ఫౌండేషన్ నుంచి డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ నగదు ప్రోత్సహం అందజేశారు. తమిళనాడు చాంపియనన్స్ ఫౌండేషన్న్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. వివిధ దేశాలు, ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ఖర్చుల నిమిత్తం నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు. క్రీడాకారులకు అవసరమయ్యే క్రీడాపరికరాలను అందజేస్తున్నారు. ఈ పరిస్థితులలో జర్మనీలో ఈనెల 16 నుంచి జూలై 27 వరకు జరగనున్న యూనివర్సిటీ గేమ్స్లో పాల్గొనే తమిళనాడుకు చెందిన అథ్లెట్ ఏంజెల్ సిల్వియా, ఆటగాళ్లు జెరోమ్, అశ్విన్కృష్ణన్, రీగన్, బాస్కెట్బాల్ ప్లేయర్ సంగీత్కుమార్, అథ్లెట్ తేజశ్రీ, సుగంధన్, వాలీబాల్ క్రీడాకారులు ఆనంది, సుజీ, కనిమొళి, అథ్లెట్ అభితాన్, ఫెన్సింగ్ అథ్లెట్ కనకలక్ష్మి ఎంపికయ్యారు. వీరికి ప్రయాణ, ఇతర ఖర్చుల నిమిత్తం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రూ.32.25 లక్షల చెక్కును అందజేశారు. అలాగే, తమిళనాడు చాంపియన్స్ ఫౌండేషన్ ఫండ్ నుంచి స్విమ్మర్ కామిని, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జానాక్షి, అథ్లెట్ వాసన్, యుగేంద్రన్, శ్వేత, రేష్మ, క్యారమ్ క్రీడాకారులు హరిణి, కావ్యలకు రూ.4.80 లక్షల విలువ కలిగిన క్రీడా పరికరణాలను ఈసందర్భంగా అందజేశారు. క్రీడల కార్యదర్శి అతుల్యమిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జె.మేఘనాథరెడ్డి పాల్గొన్నారు. కాలేజ్ డ్రీమ్: నాన్ మొదల్వన్ పథకం కింద ఉన్నత విద్య మార్గదర్శకత్వానికి అర్హులుగా కాలేజ్ డ్రీమ్ 2025 కార్యక్రమం కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో జరిగింది. ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగ్ పరీక్షల్లో నాన్ మొదల్వన్ పథకం ద్వారా విజయం సాధించిన 58 మంది విద్యార్థులను కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సత్కరించారు. ఉదయనిధి మాట్లాడుతూ కాలేజ్ డ్రీమ్ – 2025 ప్రాజెక్ట్, నాన్ మొదల్వన్ పథకం సీఎం స్టాలిన్ కలల పథకాలు అని గుర్తుచేశారు. ఉన్నత విద్యను విద్యార్థులకు దరిచేర్చే విధంగా, శిక్షణ, ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఈ పథకం దోహద పడుతుందన్నారు. నేడు కళాశాలలకు వెళ్తున్నవారి సంఖ్య పెరిగిందని, విద్యాపరంగా విద్యాలోకానికి సంపూర్ణ మద్దతు, సహకారం అందించేందుకు ద్రావిడ మోడల్ సీఎం స్టాలిన్ ఎ ల్లప్పుడు సిద్ధంగా ఉంటారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కాలేజ్ డ్రీమ్ ప్రొగ్రామ్ ద్వారా విద్యార్థులు మరిన్ని విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు. మంత్రులు ఎం సుబ్రమణియన్, అన్బిల్ మహేశ్ పాల్గొన్నారు. -
వ్యవసాయ కార్మిక విభాగం కన్వీనర్ నియామకం
పళ్లిపట్టు: పళ్లిపట్టు నార్త్ మండల డీఎంకే వ్యవసాయ కార్మిక విభాగం కన్వీనర్గా మాధవన్ నియమితులయ్యారు. ఇతను మండల కార్యదర్శి న్యాయవాది సీజే.శ్రీనివాసన్ సమక్షంలో తిరుత్తణిలోని పార్టీ జిల్లా కార్యదర్శి కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే చంద్రన్ను కలిసి ఆశీస్సులు పొందారు. కొత్తగా నియమితులైన మాధవన్కు జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే చంద్రన్ శుభాకాంక్షలు తెలిపి పార్టీ పటిష్టతకు కృషిచేయాలని సూచించారు. ఈసందర్భంగా మాధవన్ ఎమ్మెను సత్కరించారు. పార్టీ మండల యువజన విభాగ ఉప కార్యదర్శి చంద్రు, విద్యార్థి విభాగ ఉపకార్యదర్శి రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన
తిరువళ్లూరు: తమపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే ఇన్స్పెక్టర్ బాధితులనే బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ కళ్లకు నల్లరిబ్బన్ కట్టుకుని నిరసనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా తిరుమళిసై ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆరీఫ్ ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి కుటుంబం అద్దెకు దిగింది. పది నెలల కిందట అద్దెకు దిగిన క్రమంలో ప్రతి నెలా రెండు వేల రూపాయలను చెల్లించారు. అయితే గత రెండు నెలల నుంచి ఉమామహేశ్వరి ఇంటి అద్దెను చెల్లించలేదు. ఇదే విషయంపై ఇంటి యజమానికి, ఉమామహేశ్వరికి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఉమామహేశ్వరి కుటుంబంపై ఆరీఫ్ దాడులకు దిగాడు. దాడిలో గాయపడ్డ బాధితులు న్యాయం కోసం వెళ్లవేడు పోలీసులకు పిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఇన్స్పెక్టర్ అయ్యప్పన్ భాదితులకు న్యాయం చేయకపోగా, పిర్యాదు చేసిన వారిపై బెదిరింపులకు దిగిన క్రమంలో బాధితులు బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం వద్ద నల్ల రిబ్బన్ను కళ్లకు కట్టుకుని నిరసనకు దిగారు. బెదిరింపులకు దిగుతున్న వెళ్లవేడు ఇన్స్పెక్టర్ అయ్యప్పన్పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
ఘనంగా కూత్తాండవర్ రథోత్సవం
సేలం: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటుగా చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళి బొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జన సందోహం తరలి వచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం తదితర గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలి దానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్క సారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు పెడబొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు. తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన వితంతువులుగా మారి స్వస్థలాలకు పయనం -
కోర్సుల ఎంపికలో గందరగోళం వద్దు
తిరువళ్లూరు: ఇంటర్ తరువాత డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు కోర్సుల ఎంపికలో గందరగోళం చెంద వద్దని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. ఇంటర్ పూర్తి చేసిన తరువాత డిగ్రీ కోర్సుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కల్లూరి కనవు(కళాశాల కల) పేరుతో వినూత్న పథకాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగానే ఇటీవల ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డిగ్రీ చేరాలనుకునే వారి కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా ఆలమాదిలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ హాజరై ప్రసంగించారు. కార్యక్రమానికి గుమ్మిడిపూండి, మీంజూరు, చోళవరం, పొన్నేరితో పాటు ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పాసైన తరువాత డిగ్రీ కోర్సుల ఎంపికలో చాలా మంది విద్యార్థులు గందరగోళం చెందుతూ ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థుల్లో వున్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు కోర్సుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన తరువాత ఇంజినీరింగ్, వైద్యం, లాతో పాటు ఇతర కోర్సులను చేయవచ్చన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కలెక్టరేట్లో ఉచిత టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. -
నెమళ్ల మృత్యుగీతం
కుప్పం రూరల్ : కుప్పం మండలం, పెద్దబంగారునత్తం పరిసరాల్లో నెమళ్లు రాలిపోతున్నాయి. పెద్దబంగారునత్తం సమీపంలోని మార్వాడ సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద నెమళ్లు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆహారం కోసం అక్కడి నుంచి రైల్వే ట్రాక్ దాటుకుని ఇటువైపు పొలాల్లోకి వస్తున్నాయి. బెంగళూరు – చైన్నె రైల్వే లైన్ దాటుకుని రావాల్సి ఉంది. ఈ క్రమంలో నెమళ్లు రైల్వే విద్యుత్ లేన్లకు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. నిత్యం ఒకటి రెండు నెమళ్లు పడిపోయి దర్శనమిస్తున్నాయి. నిత్యం నెమళ్లు రైల్వే ట్రాక్పై పడిి ఉండడాన్ని చూసి స్థానికుల మనసు కలిచి వేస్తోంది. అటవీశాఖ అధికారులు అయినా నెమళ్లు ఇటు వైపుకు రాకుండా చూడాలని కోరుతున్నారు. -
రేపు పది, ప్లస్ ఒన్ ఫలితాలు
సాక్షి, చైన్నె: పదో తరగతి, ప్లస్ ఒన్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఒకే రోజు పదో తరగతి, ప్లస్ఒన్ ఫలితాలను ప్రకటించిన గడువు కంటే 3 రోజులు ముందుగానే విడుదల చేయడానికి విద్యా శాఖ చర్యలు తీసుకుంది. ప్లస్ఒన్కు మార్చి 5 నుంచి 27 వరకు పరీక్షలు జరిగాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోని 7,557 పాఠశాలల నుంచి 8,23,261 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 3,89,423 మంది బాలురు, 4, 28,946 మంది బాలికలు ఉన్నారు. వీరితో పాటు, 4,755 మంది ప్రైవేటు అభ్యర్థులు, 137 మంది జైలు ఖైదీలు ఉన్నారు. ఇక, మార్చి 28 నుంచి ఏప్రిల్ 15 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు, వీరిలో 40 వేల 465 మంది ప్రైవేటు అభ్యర్థులు, 272 మంది ఖైదీలు ఉన్నారు. ముందుగానే ఫలితాలు ప్లస్టూ ఫలితాలను మే 8న ప్రకటిస్తామని చెప్పి రెండు రోజులు ముందుగానే ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. గణితం, సైన్స్ సబ్జెక్టులో పెద్ద సంఖ్యలో వందకు వంద మార్కులు సాధించిన వారు ఉన్నారు. అదే సమయంలో సీబీఐఎస్ఈ ఫలితాలో ఈసారి గణితం, సైన్స్ సంబంధిత సబ్జెక్టులలో వందకు వంద శాతం అన్నది రాష్ట్రంలో తక్కువ కావడంతో ఇంజినీరింగ్ ఉన్నత విద్యా కోర్సుల్లో ఈ సారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అధిక అవకాశాలు దక్కబోతున్నాయి. అదేసమయంలో నాన్ మొదల్వన్ పథకం మేరకు ఈ సారి ఆదిద్రావిడ, గిరిజన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అన్నది 96 శాతంగా నమోదు కావడంతో ఉన్నత విద్యా కోర్సుల సీట్లలో అత్యుత్తమ విద్యా సంస్థలలో చేరేందుకు ఈ విద్యార్థులకు అధిక అవకాశాలు పెరిగాయి. శాతం పెరిగింది. ఈ పరిస్థితుల్లో పదో తరగతి, ప్లస్ఒన్ ఫలితాలను 19వ తేదీ నుంచి విడుదల చేయడానికి తొలుత నిర్ణయించారు. అయితే, మూడు రోజులు ముందుగానే ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈనెల 16వ తేదీ శుక్రవారం విద్యామంత్రి అన్బిల్ మహేశ్ ఫలితాలను విడుదల చేయబోతున్నారు. నుంగంబాక్కం కాలేజ్ రోడ్డులోని డీపీఐ ఆవరణలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను htt pr://www.difioc-ker.gov.in , www.rerutr.gov.intnrerutr.nic.in వెబ్సైట్లలో చూసుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. పాఠశాల విద్యార్థులు తాము చదివిన పాఠశాలల నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే, విద్యార్థులు నమోదు చేసుకున్న సెల్ఫోన్ నంబర్లకు కూడా ఫలితాలను పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. -
● బిడ్దలను కడతేర్చి, దంపతుల బలవన్మరణం ● తిరుచ్చిలో విషాదం
సాక్షి, చైన్నె: అప్పుల భారంతో ఓ దంపతులు తమ ఇద్దరి బిడ్డలను కడతేర్చారు. ఆపై వారు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం తిరుచ్చిలో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...తిరుచ్చి మేఘలా థియేటర్ ఎదురుగా ఉన్న ముకాంబికై నగర్కు చెందిన అలెక్స్(42) వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు భార్య విక్టోరియా(38), కుమార్తెలు ఆరాధన(9), ఆలియా(3) ఉన్నారు. విక్టోరియా రైల్వే ఉద్యోగి. పిల్లలు ఇద్దరూ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. అలెక్స్ అద్దె ఇంట్లో నివాసం ఉన్నప్పటికీ, మీనాక్షి నగర్లో ఒక సొంత ఇల్లు కొనడంతో అప్పుల భారం క్రమంగా పెరిగింది. అయితే విక్టోరియా తండ్రి తన పెన్షన్ను సాయంగా అందించడంతో కొంత మేరకు గట్టెక్కుతూ వచ్చాడు. అదే సమయంలో తంజావూరులో తన సమీప బంధువు ఒకరికి పూచీకత్తు ఇచ్చి మళ్లీ అప్పుల ఊబిలో అలెక్స్ పడ్డాడు. అలాగే తన తల్లికి క్యాన్సర్ బయట పడడంతో ఆమె చికిత్స కోసం అప్పులు చేయడం మొదలు పెట్టాడు. విక్టోరియా తండ్రి మరణించడంతో పెన్షన్ ఆగిపోయింది. అప్పులు పెరిగాయి. వస్త్ర దుకాణంలో నష్టం పెరిగింది. బలవన్మరణం అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు పెరగడంతో బలవన్మరణానికి అలెక్స్ సిద్ధమయ్యాడు. తాను మరణిస్తే తన కుటుంబాన్ని వేధిస్తారన్న ఆందోళనలో పడ్డాడు. చివరకు మంగళవారం రాత్రి బిడ్డలు ఇరువురికి ఆ దంపతులు విషం కలిపిన ఆహారం తినిపించారు. వారు మరణించడంతో దంపతులు ఇద్దరు తలా ఓ గదిలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం అప్పు ఇచ్చిన వ్యక్తి ఒకరు ఆ ఇంటికి వచ్చాడు. ఎంతకూ తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి ఇరుగు పొరుగు వారి ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా, బిడ్డలు ఇరువురు మరణించి ఉండడం, అదే గదిలో అలెక్స్, మరో గదిలో విక్టోరియా ఉరి పోసుకుని వేలాడుతుండడంతో విషాదం చోటు చేసుకుంది. తిరుచ్చి అసిస్టెంట్ కమిషనర్ సతీష్కుమార్, పొన్ మలై ఇన్స్పెక్టర్ వెట్రివేల్లు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించారు. వీరికి అప్పులు ఇచ్చిన వారు, వేధింపులకు గురి చేసిన వారి వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాటేసిన అప్పు -
నేడు పన్నీరుశిబిరం భేటీ
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరుసెల్వం, ఆయన మద్దతు ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులు గురువారం చైన్నెలో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎన్డీఏలో కొనసాగడం గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినానంతరం ఓ వైపు న్యాయపోరాటం చేస్తూ, మరోవైపు ప్రత్యేక శిబిరంగా పన్నీరుసెల్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పయనించారు. అయితే, తాజాగా అన్నాడీఎంకే ఎన్డీఏలోకి రావడం, తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అన్న ప్రకటనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించడం పన్నీరు శిబిరాన్ని సందిగ్ధంలో పడేసింది. ఈ పరిస్థితులలో ఈ కూటమిలో కొనసాగాలా లేదా ప్రత్యామ్నయ మార్గం మీద దృష్టిపెట్టాలా అనే విషయంగా చర్చించి నిర్ణయం తీసుకునేందుకు పన్నీరుసెల్వం నిర్ణయించారు. దీంతో గురువారం జరిగే కీలక సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ విషయంగా ఆ శిబిరం ఎమ్మెల్యే వైద్యలింగం మాట్లాడుతూ పన్నీరుసెల్వం నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు. తమను వదులుకోరని భావిస్తున్నామంటూ పరోక్షంగా ఎన్డీఏ కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తన బలాన్ని పెంచుకునే దిశగా బూత్ కమిటీల ఏర్పాటు, సమావేశాలకు నిర్ణయించడం గమనార్హం. టాస్మాక్ స్కాంలో నోటీసులు సాక్షి,చైన్నె: టాస్మాక్లో రూ.1000 కోట్ల స్కాం వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీలకు బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఇటీవల మూడు రోజులు ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. రూ.1000 కోట్ల మేరకు స్కాం జరిగినట్టు ఈడీకి ఆధారాలు చిక్కాయి. అదే సమయంలో ఈడీ తదుపరి చర్యలకు బ్రేక్ వేసే విధంగా టాస్మాక్ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈడీ విచారణను అడ్డుకోవాలని కోరాయి. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈడీకి కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసును సీబీఐకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేశారు. ఇంకుడు గుంతలు తప్పనిసరి ● రాష్ట్ర ప్రభుత్వం కొత్త షరతులు కొరుక్కుపేట: భూగర్భ జలాలను పెంచుకోవాలంటే వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే ఇంకుడుగుంతలు నిర్మాణం తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ప్రభుత్వం వార్షిక సమగ్ర ఆటోమేటెడ్ భూగర్భజల పర్యవేక్షణ ప్రవేశపెట్టింది . ఇందులో తొలి భారతీయ నగరంగా చైన్నె ఘనత సాధించింది. తదనంతరం చైన్నె నగరంలో భూగర్భ జాలాల స్థాయిని అంచనా వేయడానికి 15 జోన్లలో 200 భూగర్భ నీటి పర్యవేక్షణ పరికరాలు, 20 రెయిన్ గేజ్లను ఏర్పాటు చేశారు. ఒక కంపెనీ లక్ష లీటర్లు నీటిని తీసుకుంటే భూగర్భ జాలాల పట్టికను నిర్వహించడానికి సమానమైన నీటిని ఉపయోగించేందుకు దాని ప్రాంగణంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ రీచార్జి నిర్మాణాలను నిర్మించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటోందని వెల్లడించారు ఐఐటీ మద్రాస్తో ఒప్పందాలు సాక్షి,చైన్నె: సరిహద్దు జ్ఞాన మార్పిడి, అనువర్తిత పరిశోధన, స్వచ్ఛమైన ఇంధన సాంకేతిక పరిజ్ఞానాల వాణిజ్యకరణకు కొత్త అవకాశాలను కల్పించే విధంగా బుధవారం అంతర్జాతీయ ఒప్పందాలు జరిగాయి. ఐఐటీ మద్రాస్ ఎనర్జీ కన్సార్టియం, ఇంధన ఆవిష్కరణ, స్థిరత్వంపై పని చేయడానికి నికర–సున్నాశక్తి వ్యవస్థ పరివర్తనకు మద్దతు ఇచ్చే విధంగా యూకేకు చెందిన ఎనర్జీ సిస్టమ్స్ కాటాపుల్ట్ (ఈఎస్సీ)తో భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయి. 2015లో ఇన్నోవేట్ యూకే ద్వారా ప్రారంభించిన ఎనర్జీ సిస్టమ్స్ కాటాపుల్ట్, ఇన్నోవేట్ యూకే ద్వారా స్థాపించినట్టు ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డీన్ (గ్లోబల్ ఎంగేజ్మెంట్) ప్రొఫెసర్ రఘునాథన్ రంగస్వామి, ఇతర ప్రముఖుల సమక్షంలో వివరాలను ప్రకటించారు. ఐఐటీ మద్రాస్ తరఫున డీన్ (ఐసీఎస్ఆర్) ప్రొఫెసర్ మనుసంతానం, ఫ్యాకల్టీ హెడ్ ప్రొఫెసర్ సత్య శేషాద్రి, ది ఎనర్జీ కన్సా ర్టియం సీఈఓ నిఖిల్ తంబే, ఎనర్జీ సిస్టమ్స్ కాటాపుల్ తరఫున ఇన్నోవేటర్ సపోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ సలహాదారు బ్రెండన్ ఓనీల్, న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ సీనియర్ నెట్ జీరో సలహాదారు బబితా శర్మ ఈ ఒప్పందాల కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఐటీ మద్రాస్లోని ది ఎనర్జీ కన్సార్టియం ఫ్యాకల్టీ హెడ్ ప్రొఫెసర్ సత్య శేషాద్రి మాట్లాడుతూ ఈ ఒప్పందాల గురించి, జ్ఞాన మార్పిడి, పరిశోధనల అంశాలను గురించి విశదీకరించారు. -
గంగమ్మ అభయం.. ఆనందమయం
● భక్తిశ్రద్ధలతో గంగమ్మ నిమజ్జనం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలో బుధవారం గంగమ్మ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రెండో రోజు అమ్మవారికి విశేష పూజలు చేశారు. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గజమాలలు, చీరలు, నైవేద్యం సమర్పించారు. అమ్మవారి మెడలోని నిమ్మకాయల కోసం పోటీ పడ్డారు. సాయంత్రం వంశపారంపర్య ధర్మకర్తలు ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవతకు పూజలు చేసి చిత్తూరు నడివీధి గంగమ్మ జలాధి పూజలను ప్రారంభించారు. అనంతరం అమ్మవారి ఊరేగింపు కదిలింది. భక్తులు అమ్మవారిని కనులారా వీక్షించేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. అర్ధరాత్రి వరకు ఊరేగింపు సాగింది. చివరకు కట్టమంచి చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఓంశక్తి భక్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
నిందితులకు శిక్ష తప్పదు
సాక్షి, చైన్నె: దివంగత సీఎం జే జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో గతంలో జరిగిన హత్య, దోపిడీ కేసు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఎవరెవరు నిందితులుగా ఉన్నారో వారందరికి పొల్లాచ్చి కేసు తరహాలో శిక్ష తప్పదన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ నీలగిరి జిల్లా ఊటీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఊటీలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.143.69 కోట్లతో 700 పడకలతో బ్రహ్మాండ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఎనిమిది టవర్లతో కూడిన భవనాలు ఇందులో ఉన్నాయి. అవుట్ పేషెంట్ వైద్యసేవల కోసం ప్రత్యేక బ్లాక్ను, అత్యాధునిక వసతులతో పది ఆపరేషన్ థియేటర్లు ఏర్పాట్లు చేశారు. రక్తహీనత, సికిల్ సెల్ అనీమియా, తలసేమియా వంటి చికిత్సలకు ప్రత్యేక బ్లాక్లను కేటాయించారు. 20 పడకలతో 24 గంటల సేవతో అత్యవసర చికిత్సా విభాగాన్ని ఎమర్జెన్సీ బ్లాక్గా రూపొందించారు. బ్లడ్ బ్యాంక్, రోగులకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక వంట గది, ఆటోమెటిక్ వాషింగ్ మెషిన్లు, ప్రత్యేక బ్లాక్లో మార్చురీని ఏర్పాటు చేశారు. నీలగిరి జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా రూపుదిద్దుకుని సేవలు అందిస్తున్న ఈ ఆస్పత్రిని బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ స్వయంగా సందర్శించారు. ఇక్కడి వైద్య చికిత్సలు, సౌకర్యాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడారు. రోగులను ప్రతి వార్డుకు వెళ్లి పరామర్శించి అక్కడి సేవలు, అక్కడ అందిస్తున్న సహకారం, సిబ్బంది పని తీరు గురించి ఆరా తీశారు. చికిత్స కోసం వచ్చిన వారంతా సేవలు, అత్యాధునిక వసతులు ప్రయోజకరంగా ఉన్నట్టు సీఎంకు వివరించారు. అవగాహన కల్పనకు ఆదేశాలు ఈ ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, ప్రాజెక్టులు, అమల్లో ఉన్న వైద్య పథకాలను, సేవ్ మోర్ లైవ్స్ 48 పథకంతో పాటు వివిధ వైద్య అంశాల గురించి అటవీ గ్రామాలు, కుగ్రామాల్లోని ప్రజలకు తెలియజేయాలని, వారికి అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్యసిబ్బంది హాజరు రికార్డుల, మందుల వివరాలకు సంబంధించిన రికార్డులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం నీలగిరి ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం సందర్శించారు. వైద్యకళాశాల విద్యార్థులతో మాట్లాడారు. సేవా స్ఫూర్తితో వైద్యవృత్తిలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. వైద్యకళాశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడుతూ నీలగిరి ఆస్పత్రి సేవలను తెలుసుకునేందుకు స్వయంగా తాను వచ్చినట్టు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఆస్పత్రికి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తున్నట్టు వివరించారు. రోజుకు 1,300 మంది ఔట్ పేషెంట్లు చికిత్సకు వస్తున్నట్టు, ఇన్పేషంట్ విభాగంలో మరింత మెరుగుగా వైద్యసేవలు అందుతున్నట్టు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రికు దీటుగా ఇక్కడ సేవలు అందుతున్నాయని, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, స్కాన్లు ఉచితంగా తీయడం జరుగుతుందన్నారు. రోగులు, విద్యార్థులు అందించిన సమాచారం, వివరాల మేరకు ఇక్కడ ఎలాంటి లోపాలు అన్నది లేదన్నది స్పష్టమైందన్నారు. అధికారుల సూచన మేరకు, అవసరమైన విధంగా అదనపు సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. ముందుగా ఊటీలో సీఎం స్టాలిన్ వాకింగ్ చేశారు. ఈసందర్భంగా ఫుట్బాల్ ఆడుతున్న పిల్లలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈసమయంలో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో తాను పొల్లాచ్చి లైంగిక వేధింపు కేసు గురించి ప్రస్తావిస్తూ, ఈ కేసులో ఏఒక్క నిందితుడు తప్పించుకోలేడని, తాము అఽధికారంలోకి రాగానే శిక్షపడుతుందని స్పష్టం చేశామన్నారు. ఇది తాజాగా కార్యరూపం దాల్చిందన్నారు. దివంగత సీఎం జే జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్లో గతంలో జరిగిన హత్య, దోపిడీ ఘటన గురించి స్పందిస్తూ, ఈ కేసులోనూ ఏ ఒక్కరూ తప్పించు కోలేరన్నారు. నిందితులు శిక్షించబడతారని స్పష్టం చేశారు. ఎంపీ ఏ.రాజా, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రన్, నీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య తాండూరి, నీలగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.గీతాంజలి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జయలలిత పాల్గొన్నారు.ఆస్పత్రిలో రోగిని పరామర్శిస్తున్న సీఎం స్టాలిన్ ఆస్పత్రి రికార్డులను పరిశీలిస్తున్న స్టాలిన్ న్యూస్రీల్నేడు పుష్ప ప్రదర్శన ఊటీ బొటానికల్ గార్డెన్లో 127వ పుష్ప ప్రదర్శన గురువారం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఉద్యానవన విభాగం సర్వం సిద్ధం చేసింది. వేసవి ఉత్సవాల్లో భాగంగా ఊటీలో ప్రతి సంవత్సరం ఈ పుష్పప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈప్రదర్శనను సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఈసారి పుష్ప ప్రదర్శనతో పాటు బొటానికల్ గార్డెన్లో మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు సైతం ఏర్పాట్లు చేశారు. పొల్లాచ్చి కేసు తరహాలో కొడనాడు కేసు నిందితులకు శిక్షలు సీఎం స్టాలిన్ నీలగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో అధ్యయనం -
కాడువెట్టి చిత్రాన్ని నిషేధించాలి
తమిళసినిమా: కాడువెట్టి చిత్ర విడుదలను నిషేధించాలని వన్నియార్ సంఘం అధ్యక్షుడు, పాట్టాలి మక్కల్ కట్చి మాజీ శాసనసభ్యుడైన దివంగత జె.గురు, కళ్యాణి దంపతుల కూతురు విరుదాంబికై చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో జె.గురు బయోపిక్లో పాట్టాలి మక్కల్ కట్చి నాయకుడు రామదాసుకు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు గౌతమన్ కాడువెట్టి పేరుతో చిత్రంగా రూపొందించారు. జె.గురు మరణంలో తమకు చాలా సందేహాలు ఉన్నాయని, ఆయన భౌతిక కాయాన్ని చూడ్డానికి కూడా పాట్టాలి మక్కల్ కట్చి నాయకులు రాందాస్, అన్బుమణి రాందాస్ తమకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇదే విధంగా జె.గురు జీవిత చరిత్రను దర్శకుడు గౌతమన్ తప్పుగా చిత్రీకరించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా జె.గురు జీవిత చరిత్రను చిత్రంగా తెరకెక్కించారని ఆరోపించారు. ఇప్పటికే చిత్ర ట్రైలర్, ఆడియోను విడుదల చేశారని, చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారని తెలిపారు. అందువల్ల కాడువెట్టి చిత్ర విడుదలను నిషేధించాలని కోరారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుధ ఈ నెల 15వ తేదీ లోపు వివరణ ఇవ్వాల్సిందిగా దర్శకుడు గౌతమన్కు నోటీసులు జారీ చేసి, విచారణను వాయిదా వేశారు. -
పాన్ ఇండియా స్టార్గా రెజీనా
తమిళసినిమా: కళలకు హద్దులు ఉండవు. కళాకారులకు భాష ఆటంకం రాదు. అలా ఇప్పుడు దక్షిణాది తారలు బాలీవుడ్లోనూ, ఉత్తరాది తారలు దక్షిణాదిలోనూ ఏలుతున్నారు. ఇప్పుడు ఈ కోవలో నటి రెజీనా కసాండ్ర చేరారు. కండనాళ్ మొదల్ చిత్రం ద్వారా కొలీవుడ్కు పరిచయమైన నటి రెజీనా కసాండ్ర. ఆ తరువాత అళగీయ అసురా చిత్రంతో కథానాయకిగా తన నటనతో ప్రేక్షకులను అలరించారు. అలా కేడీ బిల్లా కిలాడి రంగా, నిర్ణయం, రాజతందిరం, మానగరం, శరవణన్ ఇరుక్క భయమేన్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్ను తెచ్చుకున్నారు. కన్నడంలోనూ పలు చిత్రాలు చేసిన రెజీనా కొన్ని వెబ్ సీరీస్లోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎలాంటి పాత్రనైనా చేసి సత్తా చాటగలనని ఇటీవల అజిత్ హీరోగా నటించిన విడాముయర్చి చిత్రంలో ప్రతినాయకిగా నటించారు. ఇటీవల ఈ బ్యూటీ హిందీలోనూ నటించడం ప్రారంభించారు. అలా హిందీలో సన్నిలియోన్తో కలిసి జాత్, అక్షయ్కుమార్, అనన్య పాండే జంటగా నటించిన కేసరి–2 చిత్రంలో ముఖ్యపాత్రను పోషించి ఆ చిత్రాల విజయంలో పాలుపంచుకున్నారు. దీంతో పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన రెజీనా ప్రస్తుతం సుందర్.సీ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న మూక్తుత్తి అమ్మన్–2 చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. -
నిజమైన వసూళ్లను ప్రకటించండి
శశికుమార్తో టూరిస్ట్ ఫ్యామిలీ చిత్ర యూనిట్ తమిళసినిమా: ఇంతకుముందు గుడ్నైట్, లవర్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్స్ సంస్థ అధినేతలు పస్సియాన్ నజరేద్, మహేశ్ రాజ్ పస్సియాన్, యువరాజ్ గణేశన్ కలిసి తాజాగా నిర్మించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. సిమ్రాన్, శశికుమార్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రం ద్వారా అభిషన్ జీవింత్ దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్యాన్ లోల్డన్ సంగీతాన్ని, అందించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం ఈనెల 1న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో నటుడు శశికుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం సక్సెస్ కావడంతో మీ పారితోషికం పెంచుతున్నారా అని చాలా మంది అడుగుతున్నారన్నారు. తాను పారితోషికాన్ని పెంచనని స్పష్టం చేశారు. అలా పెంచితే చిత్రాల బడ్జెట్ ఇంకా పెరిగిపోతుందని అన్నారు. ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు గురించి అందరికీ తెలుసన్నారు. దీంతో తన చిత్రం వసూళ్లు ఇంతేనా అని ఆశ్చర్యపోయానన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం రూ.54 కోట్ల వరకూ వసూళ్లు సాధించిందన్నారు. తన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించింది సుందరపాండియన్, కుట్టిపులి అని, వాటిని ఈ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం అధిగమించిందని చెప్పారు. అదేవిధంగా మంచి కథలు తయారు చేసుకున్న కొత్తవారికి నమ్మకాన్ని కలిగించిన చిత్రం అని అన్నారు. చిత్రాల యథార్థ వసూళ్లను నటీనటులకు నిర్మాతలు చెప్పాలన్నారు. అప్పుడే వారు పారితోషికం పెంచరని అన్నారు. ఈ చిత్ర విజయం కొత్త ఊపిరి పోసిందని అన్నారు. ఇందులో సిమ్రాన్ నటించడానికి అంగీకరించడం సంతోషకరమన్నారు. -
ఎంపికై న అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు
కొరుక్కుపేట: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ట్ర హిందూ, దేవదాయ శాఖ మంత్రి నేతృత్వంలో మొదటి దశలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్తగా ఎంపికై న 15 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టుల అభ్యర్థులకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ నియామక ఉత్తర్వులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్–2025 సంవత్సరానికి 144 పోస్టులకు నియామక పరీక్షను నిర్వహించిందని పేర్కొన్నారు. ఇందులో 15 మంది జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టులు కార్పోరేషన్కు ఎంపికయ్యారని తెలిపారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అదనపు ప్రదాన కార్యదర్శి కాకర్ల ఉష, చైన్నె మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రభాకర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ. శివజ్ఞానం,చీఫ్ ప్రాజెక్టు ఆర్గనైజర్ ఎస్.రుద్రమూర్తి, ఏ.బాలసుబ్రమణియన్, ఎన్.రవి కుమార్ పాల్గొన్నారు.● అందజేసిన మంత్రి శేఖర్బాబు -
ఆమెది అందమైన పొగరు!
తమిళసినిమా: నటి వరలక్ష్మీశరత్కుమార్, శ్రుతీహాసన్, సుహాసిని, విద్యుత్లేఖ రామన్, ప్రకాశ్ మోహన్దాస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ది వెర్డిక్. కృష్ణశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, అగ్ని ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై ప్రకాశ్ మోహన్దాస్, ఎన్.గోపికృష్ణన్ కలిసి నిర్మించారు. అరవింద్కృష్ణ చాయాగ్రహణం, ఆదిత్యరావ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర షూటింగ్ను పూర్తిగా అమెరికాలో చిత్రీకరించడం విశేషం. హత్య, దానికి సంబంధించిన విచారణ వంటి పలు ఆసక్తికరమైన థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రం ఈనెల 30న తెరపైకి రానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు ఆర్.పార్థిబన్ ఒక పాటను రాయడం విశేషం. కాగా మంగళవారం ఈ చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వరలక్ష్మీ శరత్కుమార్, సుహాసిని, పార్థిబన్లతో యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. దర్శకుడు కృష్ణశంకర్ మాట్లాడుతూ ఒక్కో తమిళ నటుడు, నటి 10 మంది హాలీవుడ్ నటీ నటులకు సమానం అని అమెరికన్ నటీనటులు చెప్పారని అన్నారు. చిత్ర యూనిట్ సహకారంతోనే ది వెర్డిక్ చిత్రాన్ని 23 రోజుల్లో పూర్తి చేయగలిగినట్లు చెప్పారు. తనను హాలీవుడ్కు తీసుకెళ్లిన ఈ చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు అని నటి శ్రుతీహాసన్ పేర్కొన్నారు. పార్థిబన్ మాట్లాడుతూ ఇక్కడ సుహాసినిని చూస్తుంటే ఆమె అందమైన పొగరు అని అన్నారు. అలా పార్థిబన్ మాట్లాడుతుండగా సుహాసిని వేదికపైకి వచ్చి తన వయసు ఇప్పుడు 62 ఏళ్లని చెప్పడం విశేషం. నిర్మాత ప్రకాశ్మోహన్దాస్ మాట్లాడుతూ తాము ఇంతకుముందు పలు మాలీవుడ్ చిత్రాలు చేసినా, తమిళంలో నిర్మించిన తొలి చిత్రం ది వెవెర్డిక్ అని పేర్కొన్నారు. ఇందులో ఇంత మంది ప్రముఖ నటీనటులను నటింపజేయడం తమకే ఆశ్యర్యంగానూ, మరచిపోలేని అనుభవంగానూ ఉందన్నారు. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన గోపికి ధన్యవాదాలు అన్నారు. షూటింగ్లో తాను మన నటీనటులను చూసి చాలా నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ నటీమణులతో ది వెర్డిక్ చిత్ర యూనిట్ -
కనులపండువగా దశావతార ఉత్సవం
● నేడు అళగర్మలై వైపు స్వామివారు ● ముగింపు దశలో మదురైలో చిత్తిరై ఉత్సవాలు సేలం: మదురై చిత్తిరై ఉత్సవాలు ముగింపుదశకు చేరాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రామరాయర్ మండపంలో కళ్లగర్ స్వామి వారి దశావతార ఉత్సవం కనులపండువగా జరిగింది. మదురైలో చిత్తిరై ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శైవం, వైష్ణవం ఐక్యతను చాటే విధంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాల్లో మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో ఉత్సవాలు ముగిశాయి. ఇక, కళ్లలగర్(విష్ణు) ఆలయంలో ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. మంగళవారం తేనూరులో మండుగ మునికి శాప విమోచనం చేసినానంతరం కళ్లలగర్స్వామి రామరాయర్ మండపానికి చేరుకున్నారు. ఇక్కడ రాత్రి 11 గంటల నుంచి బుధవారం ఉదయం 6.30 గంటల వరకు దశావతార ఉత్సవం కనులపండువగా జరిగింది. మత్స్య, కూర్మ, నరసింహ, వామన, రామ సహా ఇతర అవతరాల ఉత్సవాల అనంతరం శ్రీకృష్ణ అవతారం సమయానికి సూర్యుడి ఉదయించాడు. రాత్రంతా భక్తులు నిద్రను పక్కన పెట్టి దశావతార మహోత్సవాన్ని కనులారా వీక్షించి స్వామి వారిని దర్శించుకున్నారు. చివరగా మోహిని అవతారంలో కళ్లగర్ స్వామి రామరాయర్ మండపం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాదిగా భక్తులు దశావతార ఉత్సవాన్ని తిలకించారు. ఇక్కడి నుంచి ఆనంద రాయర్ మండపం చేరుకుని భక్తులను స్వామి వారు కటాక్షించారు. అనంతరం తాల్లకులం మన్నర్ సేతుపతి మండపం చేరుకున్న స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి. గురువారం ఇక్కడి నుంచి స్వామి వారు పుష్పపల్లకీలో భక్తులకు దర్శనం ఇస్తారు. అనంతరం కరుప్పన్న స్వామి సన్నిధిలో పూజలు జరుగుతాయి. ఇక్కడి నుంచి అళగర్ మలైకు స్వామి వారు బయలుదేరి వెళ్తారు. శుక్రవారం అళగర్మలైకు చేరుకునే స్వామి వారికి విశిష్ట పూజలు జరుగుతాయి. మరుసటి రోజున జరిగే విశిష్ట పూజలతో మదురై చిత్తిరై ఉత్సవాలను ముగించనున్నారు. రెండు వారాలకు పైగా చిత్తిరై ఉత్సవాలతో మదురైలో ఆధ్యాత్మిక వాతావరణం మిన్నంటింది. తొలుత శివ నామ స్మరణ, చివరగా జరిగిన ఉత్సవాలలో గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక నగరం పులకించింది. -
వీఐటీ చాన్స్లర్కు గౌరవ డాక్టరేట్
వేలూరు: వేలూరు వీఐటీ వ్యవస్థాపకులు, చాన్స్లర్ విశ్వనాథన్కు న్యూయార్క్లోని రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. భారతదేశ వ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ విద్యను విస్తరించడంలో ఆయన నాయకత్వం, ఆర్థికంగా వెనుకబడిన వారికి మద్దతు ఇవ్వడంలో ఆయన అంకితభావానికి రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్య సీనియర్ అధికారి డాక్టర్ డేవిట్ మున్సన్, విద్యా వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభు డేవిడ్, విశ్వనాథన్కు గౌరవ డాక్టరేట్ డిగ్రీ పట్టాను అందజేశారు. ఈ గుర్తింపు అమెరిక్ యూనివర్సిటీ నుంచి ఒక భారతీయుడికి గౌరవ డాక్టరేట్ లభించడం ఇది మూడోసారి. గతంలో వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్కు 2009లో యూఎస్లోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ, 2024లో యూఎస్లోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశాయి. 2025వ సంవత్సరంలో కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. చాన్స్లర్ విశ్వనాథన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలుపుతూ తనకు గత వారం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన ఆర్ఐటీకి కృతజ్ఞతలు తెలిపారు. వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, వైస్ చాన్స్లర్ కాంచన, అంతర్జాతీయ సంబంధాల డైరెక్టర్ ఆర్.శ్రీనివాసన్ పాల్గొన్నట్లు ప్రకటనలో తెలిపారు. -
ఘనంగా పొర్కోడియమ్మన్ జాతర
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు సమీపంలోని వేలంగాడు పొర్కోడియమ్మన్ ఆలయ చెరువు జాతర బుధవారం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం చిత్ర మాసంలో చెరువులో 10 గ్రామ పంచాయతీలు కలిసి పొర్కోడిఅమ్మన్ జాతర నిర్వహించడం ఆనవాయితీ. అందులోభాగంగా మంగళవారం రాత్రి అమ్మన్ను అలంకరించిన రథంలో ఆశీనులు చేసి వెల్లండ్రం గ్రామం నుంచి ఊరేగింపుగా చెరువులోకి తీసుకొచ్చి ఆలయంలో ఉంచారు. అనంతరం ఉదయం అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు మేళతాళాల నడుమ అమ్మవారి రథాన్ని భక్తి శ్రద్ధలతో చెరువులోకి తీసుకొచ్చారు. ఈరథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథంపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా వేలూరు జిల్లా నుంచి కొంత మంది భక్తులు పారంపర్యంగా ఎడ్లబండ్లపై వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు కుటుంబ సమేతంగా భక్తులకు ఆహారం, మజ్జిగ అందజేశారు. దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ అనిత, ఎగ్జిక్యూటివ్ అఽధికారి అన్నామలై, సేన్బాక్కం అసిస్టెంట్ కమిషనర్ శంకర్, కార్యాలయ అకౌంటెంట్ ఆర్ముగం, సభ్యులు, తహసీల్దార్ వేండా పాల్గొన్నారు. -
నేటి నుంచి సిందూర్ యాత్ర!
నైనార్ సాక్షి, చైన్నె : పాక్ ఉగ్ర మూకలను ఏరి పారేసే రీతిలో సాగిన ఆపరేషన్ సిందూర్లో భారత ఆర్మీ ప్రదర్శించిన అత్యుత్తమ సాహసాన్ని విజయోత్సవంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు. నాలుగు విడతలుగా రాష్ట్రలో సిందూర్ యాత్ర పేరిట జాతీయ జెండాను చేత పట్టి యాత్ర చేపట్టనున్నామని మంగళవారం స్థానికంగా ప్రకటించారు. బుధవారం చైన్నెలో జాతీయ జెండా రెప రెపలాడేలా, భారత ఆర్మీ సేనల శౌర్యాన్ని చాటేలా యాత్ర జరుగుతుందన్నారు. 15వ తేదీన ఇతర నగరాల్లో, 16,17 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, 18 నుంచి 23వ తేదీ వరకు గ్రామ గ్రామన జాతీయ జెండా రెప రెపలాడేలా త్రివర్ణ దళాలకు మద్దతుగా నిలిచే రీతిలో సిందూర్ యాత్ర సాగనున్నట్టు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. పల్లావరం– కుండ్రత్తూరు రోడ్డు విస్తరణకు భూ సేకరణ కొరుక్కుపేట: పల్లావరం – కుండ్రత్తూరు రోడ్డు విస్తరణకు భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి. చాలా ఏళ్లుగా ఈ రహదారి వెడల్పు చేయలేదు. ఇది పల్లావరం , పమ్మల్ , అనకాపుత్తూరు , తిరునీర్మలై , కుండ్రత్తూరు , పోరూర్ , పూందమల్లిని కలిసే ప్రధాన రహదారి. ఇది రెండు లైన్ల రోడ్డుగా ఉంది. ఈ మార్గంలో వెళ్లే వాహనచోదకులు భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటున్నారు. అనకాపుత్తూరు నుంచి పల్లావరం వరకు 4 కిలో మీటర్లు ప్రయాణం దాదాపు 35 నుంచి 40 నిమిషాలు పడుతోంది. అందువల్ల ఈ రహదారిని వీలైనంత త్వరగా నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని వాహనచోదకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లావరం –కుండ్రత్తూరు రహదారిని రెండు నుంచి 4 లైన్లుగా విస్తరించే ప్రాజెక్టు కోసం భూమి సేకరించే పనులు ప్రారంభమైయ్యాయి . భూసేకరణ ముగిసిన తరువాత పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు . ఐదేళ్ల లా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం కొరుక్కుపేట: ప్రభుత్వ న్యాయ కళాశాలల్లో 5 సంవత్సరాల లా కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తుల నమోదు సోమవారం ప్రారంభమైంది. 5 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్ఎల్బి– ఆనర్స్), బీకాం ఎల్ఎల్బి(ఆనర్స్), బీజీఏ ఎల్ఎల్బీ చైన్నెలోని తమిళనాడు డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో కోర్సులు అందిస్తున్నారు. చైన్నె, మదురై, తిరునల్వేలి తదితర ప్రదేశాలలోని ప్రభుత్వ లా కాలేజీల్లో ఈ కోర్సులు అందించబడుతున్నాయి . పార్టు టైమ్ బీఏ ఎల్ఎల్బీ కోర్సులు కూడా అందించబడుతున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం(2025–26)లో ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 12వ తేదీన ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తుందని లా యూనివర్సిటీ ప్రకటించింది. దీని ప్రకారం ఆన్లైన్ దరఖాస్తు నమోదు సోమవారం నుంచి ప్రారంభమైంది. ఐదేళ్ల లా కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు www.tndau.ac.in వెబ్ సైట్ని ఉపయోగించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు . వివిధ న్యాయ కోర్సులకు విద్యా అర్హతలు, ఆన్లైన్ దరఖాస్తు రుసుములు తదితర వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చునని తెలిపారు . అడ్మిషన్లకు సంబంధించి ఏవైనా సందేహాల కోసం విద్యార్థులు లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గౌరీ రమేష్ 044–24641919, 24957414 ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చునని ప్రకటించారు. అన్నదానానికి కర్ణాటక భక్తుడి విరాళం తిరుత్తణి: తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో అన్నదాన సేవకు కర్ణాటక భక్తుడు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త ప్రసాద్బాబు తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామిని దర్శనం చేసుకునేందుకు మంగళవారం ఉదయం వచ్చారు. ఆయనకు ఆలయ పేష్కార్ దామోదరన్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మూలవర్లు, వల్లి, దేవసేన, ఉత్సవర్లు, షణ్ముఖర్, ఆపత్సహాయక వినాయకుడు, కల్యాణ ఉత్సవర్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో నిత్య అన్నదాన సేవ కోసం రూ.50 వేలు విరాళంగా అందజేశారు. అన్నదాన సేవా కేంద్రానికి వెళ్లి భక్తులకు ఉదయం అల్పాహారం అందజేశారు. అతను వెంట నొచ్చిలి గ్రామానికి చెందిన చక్రవర్తి నాయుడు, ముద్దుకృష్ణమ నాయుడు పాల్గొన్నారు. -
ఎవరితోనూ శతృత్వం ఇల్లే!
1.38 లక్షల మందికి ఇళ్ల పట్టాలు గరుడ వాహన సేవలో గోవిందుడు సాక్షి, చైన్నె : ఎవరితోనూ తనకు వ్యక్తిగతంగా పరిచయం గానీ, శతృత్వంగానీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ ఆర్ఎన్ రవిను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. తనకు తమిళనాడు ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్య అంశాలను ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది. గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వ న్యాయ పోరాటం గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్రాల హక్కుల కోసం జరిగే చట్టపరమైన పోరాటాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చారిత్మ్రాతక మైలు రాయిగా వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, శాసన సభ ఆమోదించిన తీర్మానాన్ని ఆమోదించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే గవర్నర్లకు గుణపాఠం కావాలని, ఈ తీర్పు రాజ్యాంగాన్ని పరిరక్షించిందన్నారు. తమిళనాడు ప్రభుత్వ కేసులో వెలువడిన ఈ తీర్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కులకు బలాన్ని చేకూర్చిందన్నారు. వ్యక్తిగతంగా.. గవర్నర్ రవి గురించి ప్రస్తావిస్తూ తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ పరిచయం లేదని, అది గవర్నర్ అయినా, ప్రధానమంత్రి అయినా. ప్రత్యక్ష శత్రుత్వం కూడా లేదని స్పష్టం చేశారు. వారి స్థానాన్ని సరైన రీతిలో గౌరవాన్ని తాము అందిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల గవర్నర్లతో ప్రభుత్వాలను తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్ భవన్ను, విశ్వ విద్యాలయాలను తమకు అనుకూలంగా మలచుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వేదికగా ఎంపిక చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల ద్వారా ప్రజాస్వామ్య హక్కులు రక్షించపడుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి, ఉన్నత స్థాయి కమిటీ గురించి స్పందిస్తూ, ఢిల్లీలో ఉన్నవారు సుల్తానులు కారు, తమిళనాడు లాగా రాష్ట్రాలను పాలించే వారు బానిసలు కాదు! అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి – కేంద్రంలో సమాఖ్యవాదం లక్ష్యంగా తాము ఆది నుంచి పట్టుపడుతూ వస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలు కూడా గతంలో అమలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం స్వయంగా తనను తాను సుల్తాన్న్గా భావించి, రాష్ట్రాల హక్కులన్నింటినీ తనదిగా భావించి లాక్కోవాలనుకుంటోందని మండిపడ్డారు. విద్యాహక్కు, ఆర్థిక హక్కు, పన్ను హక్కు, అధికార హక్కు అంటూ అనేక హక్కులను హరించుకుంటూ పోతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒక ప్రణాళికతో పనిచేస్తూ ముందుకెళుతోందని, ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను ఎదుర్కోవడానికే ఉన్నత స్థాయి కమిటీని రంగంలోకి దించామన్నారు. న్యూస్రీల్దేశ భద్రతకు భంగం కలుగకుండా.. కేంద్ర ప్రభుత్వ అధికారానికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల కూటమికి నాయకత్వం వహిస్తారా.? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాష్ట్ర హక్కుల సాధనకు సాగిన పరిణామాలను గుర్తుచేస్తూ, డీఎంకే నేతృత్వంలోని ఆ గొంతును ఇతర రాష్ట్రాలు కూడా ప్రతిధ్వనింపజేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాష్ట్ర హోదా కోసం మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను వదులుకోమని, వాటి కోసం ఎలాంటి లాభాపేక్షతో కాకుండా దేశ సమగ్రతకు భంగం కలుగకుండా ఎంత వరకై నా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఎంతో గర్వించదగ్గ భాష తమిళం అంటూ, రాజుకు నచ్చకుంటే తమిళులను దేశంలో రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తారా..? పౌరులు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. తమ కూటమి బలమైనదని, ద్రావిడ మోడల్ పాలనకు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రయోజనమే ముఖ్యం సీఎం స్టాలిన్ వ్యాఖ్య ముదుమలైలో సీఎం.. కోయంబత్తూరు జిల్లా పరిధిలో ముదుమలై రిజర్వు పారెస్టు ఉన్న ఏనుగుల సంరక్షణ శిబిరాన్ని సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం సందర్శించారు. ఏనుగులకు ఆహారం పంపిణీ చేశారు. నీలగిరి జిల్లా ఊటీ పర్యటనలో ఉన్న సీఎం స్టాలిన్ ముదుమలై రిజర్వు ఫారెస్టులోని ఆసియాలోనే అతి పెద్దదిగా పేరుగడించిన తెప్పకాడు ఏనుగుల సంరక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఊటీ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లిన ఆయన అక్కడి ఏనుగులకు ఆహారం పంపిణీ చేశారు. ఏనుగు మావటీలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. గిరిజన ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. గున్న ఏనుగుపై వచ్చిన డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్ , బెల్లి దంపతులను కలిశారు. వారితో మాట్లాడారు. ఎవరితోనూ శతృత్వం ఇల్లే.. రాష్ట్ర హక్కులను వదులుకోం.. వాటి కోసం ఎలాంటి లాభాపేక్షతో కాకుండా దేశ సమగ్రతకు భంగం కలుగకుండా ఎంత వరకై నా వెళ్లడానికి సిద్ధం..ఎంతో గర్వించదగ్గ భాష తమిళం..రాజుకు నచ్చకుంటే తమిళులను దేశంలో రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తారా..?అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
మృగాళ్లకు మరణ శిక్ష
సాక్షి, చైన్నె చదువుకుంటున్న విద్యార్థినులు, తమ సన్నిహిత మహిళలు, యువతులను పొల్లాచ్చి శివారులోని గెస్ట్ హౌస్కు తీసుకెళ్లి వారిని బలవంతంగా వాడుకున్నారు. ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతూ ఎందరో జీవితాలను సర్వనాశనం చేసిన సంపన్న ఇంటి బిడ్డల భాగోతం 2019లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంపన్న ఇంటి పిల్లలే కాదు, రాజకీయ నాయకుల వారసులు సైతం ఉన్నట్టుగా అప్పట్లో ఆరోపణలు, ప్రచారాలు హోరెత్తాయి. అప్పట్లో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు చెందిన నాయకుల వారసుల పేర్లు అనేకం తెర మీదకు వచ్చాయి. దీంతో పోరాటాలు భగ్గుమన్నాయి. నిందితులను అరెస్టు చేయాలంటూ డీఎంకే తదితర పార్టీలు ఆందోళనలు ఉధృతం చేశాయి. సీబీఐ విచారణ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించడమే కాదు, రాజకీయ దుమారానికి ఈ వ్యవహారం దారి తీయడంతో తొలుత పొల్లాచ్చి పోలీసులు, ఆ తర్వాత సీబీసీఐడీ పోలీసులు కేసును విచారించారు. చివరకు సీబీఐ రంగంలోకి దిగింది. గ్యాంగ్ రేప్లకు పాల్పడుతూ యువతుల జీవితాలతో చెలాగాటం ఆడుతున్న కోయంబత్తూరు, పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు(25), శబరిరాజన్(25), సతీష్(28), వసంత కుమార్(27), మణివణ్ణన్ (28), హెరన్పాల్(29), బాబు (27), అరులానందం(34), అరుణ్కుమార్లను అరెస్టు చేశారు. ఇందులో ఒకరు అన్నాడీఎంకే నిర్వాహకుడు కావడంతో వివాదం మరింతగా రాజుకుంది. నిందితులకు వ్యతిరేకంగా మహిళా న్యాయ వాదులు సైతం కన్నెర్ర చేశారు. వీరికి అందరు న్యాయవాదులు మద్దతు పలికారు. నిందితుల తరఫున ఏ ఒక్కరూ కోర్టు విచారణకు హాజరు కాకుండా తీర్మానించారు. నిందితులను విచారణ సమయంలో పలు మార్లు కోర్టుకు తుపాకీ నీడలో తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరేళ్లు విచారణ 2019 మే 21 నుంచి ఈ కేసు విచారణ కోయంబత్తూరు మహిళా కోర్టులో వాయిదాల పర్వంతో కొనసాగుతూ వచ్చింది. ఈ కేసు విచారణ సమయంలో అనేక మలుపులు, వివాదాలు సాగాయి. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి నందినీ దేవిని 2023లో బదిలీ చేశారు. చివరకు హైకోర్టు జోక్యంతో ఈ కేసు విచారణ ముగిసే వరకు న్యాయమూర్తిగా నందినీ దేవి కొనసాగారు. కేసు విచారణను ముగించారు. బాధితుల వాంగ్మూలం, సాక్షుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మరణించే వరకు జైలు కేసు విచారణను ముగించిన న్యాయమూర్తి నందినీ దేవి మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితులకు మరణించే వరకు జైలు శిక్ష అని ప్రకటించారు. ఈ సమయంలో నిందితులు తీవ్ర కలవరంలో పడ్డారు. కోర్టు పరిసరాలలో భద్రతను కట్టుదిట్టం చేసి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. బాధితులైన ఎనిమిది మంది యువతులకు రూ.85 లక్షలు నష్ట పరిహారం అందజేయాలని ఆదేశించారు. పలు సెక్షన్ల ఆధారంగా కేసులో శబరి రాజన్కు నాలుగు యావజ్జీవాలు, తిరునావుక్కరసర్కు ఐదు యావజ్జీవాలు, మణివణ్ణన్కు కూడా ఐదు యావజ్జీవాలు, సతీష్కు మూడు, వసంతకుమార్కు రెండు, బాబుకు ఒకటి, అరులానందం, అరుణ్కుమార్, హెరన్ పాల్లకు మూడు చొప్పున యావజ్జీవ శిక్షలు విధించారు. అన్ని శిక్షలను వీరు ఏక కాలంలో అనుభవించాల్సి ఉంటుంది. తీర్పు సమయంలో కోర్టుకు వచ్చిన నిందితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వీరందర్నీ నిఘా నీడలో కారాగారానికి తరలించారు. మృగాళ్లకు మరణించే వరకు జైలు శిక్ష అని కోర్టు తీర్పు వెలువరించడంతో మహిళా సంఘాలు, పొల్లాచ్చివాసులు ఆనందంతో రంకెలు వేశారు. ఆరేళ్లకు నిందితులకు సరైన శిక్ష పడిందని ఆనందం వ్యక్తం చేస్తూ, బానసంచా పేలుళ్లతో హోరెత్తించారు. స్వీట్లు పంచి పెట్టారు. మరణించే వరకు జైలు పొల్లాచ్చి కేసులో కోయంబత్తూరు మహిళా కోర్టు తీర్పు సర్వత్రా సంబరాలు బాణసంచా హోరు, స్వీట్ల పంపిణీ బాధిత మహిళలకు రూ.85 లక్షల పరిహారం స్నేహం ముసుగులో మాయమాటలు చెప్పి విద్యార్ధినులను, యువతులను బలవంతంగా లొంగ తీసుకోవడమే కాదు, ఆ దృశ్యాల్ని కెమెరాల్లో బంధించి, తరచూ బెదిరిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడిన మృగాళ్లకు మర ణించే వరకు జైలు శిక్ష విధిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తొమ్మిది మంది కామాంధులకు శిక్ష పడ్డ సమాచారంతో సర్వత్రా ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచా హోరుతో, స్వీట్లు పంచి పెట్టారు. సర్వత్రా హర్షం కేసు తీర్పుతో పొల్లాచ్చి, కోయంబత్తూరులలో సంబరాలు మిన్నంటాయి. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్లు సాగించిన పోరాటాలకు న్యాయం లభించిందని మహిళా సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. అన్నాడీఎంకే హయాంలో కేసును తుంగలో తొక్కే ప్రయత్నం చేశారని, సీబీఐ రంగంలోకి దిగడంతోనే నిందితుల గుట్టురట్టైందన్నారు. సీఎం స్టాలిన్ స్పందిస్తూ తీర్పును ఆహ్వానిస్తున్నామన్నారు. అన్నాడీఎంకేకు చెందిన వారితోపాటుగా నిందితులకు సరైన శిక్షపడిందని, బాధితులకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ బాధితుల తరఫున డీఎంకే మహిళా విభాగం చేసిన పోరాటాలను గుర్తు చేశారు. బాధిత యువతులకు న్యాయం దక్కిందన్నారు. అన్నాడీఎంకే తరఫున విడుదల చేసిన ప్రకటనలో ఈ కేసును సరైన సమయంలో సీబీఐకు తమ నేత పళణి స్వామి అప్పట్లో అప్పగించడంతోనే నిందితులకు ప్రస్తుతం శిక్ష పడిందన్నారు. -
● మహిళాభ్యున్నతే లక్ష్యంగా పథకాలు ● డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
సాక్షి, చైన్నె : ఎన్నికల వాగ్దానాలన్నీ అమలు చేస్తూ వస్తున్న సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం చైన్నె, శివారులో 1.38 లక్షల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తెలిపారు. చైన్నెలోని తిరువొత్తియూరులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో 1,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను మంగళవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ గత సంవత్సరం ఫెంగల్ తుపాన్ సమయంలో ఈ పరిసరాల్లో ప్రజలు తీవ్ర కష్టాలకు గురైనట్టు గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పరిస్థితులు త్వరితగతిన కుదుట పడ్డాయన్నారు. తాము చెప్పేది చేస్తామని, చేసేది చెబుతామని వ్యాఖ్యానించారు. అంతేకాదు, చెప్పనివి కూడా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. చైన్నెలో చాలా సంవత్సరాలుగా ఇళ్ల పట్టాలు లేకుండా సతమతం అవుతున్న వారిని గుర్తించి, ఇళ్ల పట్టాల మంజూరుకు సీఎం ఆదేశించారని గుర్తు చేస్తూ, మాధవరంలో ఇటీవల కాలంలో 2,200 మందికి, షోలింగనల్లూరులో 2 వేల మందికి, తిరువొత్తియూరులో 2,120 మందికి ఇలా ఇప్పటివరకు ఒక లక్షా 38 వేల మందికి ఇళ్ల పట్టాలను అందజేశామన్నారు. తమిళనాడులో ఆహార కొరత అన్నది లేదని, ఆమేరకు ఇక్కడ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ వస్తున్నట్టు తెలిపారు. పేదలకు సొంతంటి కలను సైతం ప్రభుత్వం సాకారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. చైన్నెలోనే కాదు, తమిళనాడు అంతటా ఎవరూ నిరాశ్రయులు లేరని వ్యాఖ్యలు చేశారు. అందరికీ ఇల్లు ఎంత ముఖ్యమో.. ఇంటి పేరు కూడా ముఖ్యమైనదని, ఇంటి పట్టా చట్టపరమైన హక్కుగా వ్యాఖ్యలు చేశారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వం మహిళాభ్యున్నతిని కాంక్షిస్తూ పథకాలను అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. ఒక కోటి 15 లక్షల మంది నెలకు రూ.వెయ్యి అందజేస్తున్నామని తెలిపారు. జూన్లో మరింత మంది అర్హులైన వారిని ఈ పథకానికి ఎంపిక చేయనున్నామన్నారు. దరఖాస్తులను అర్హులైనవారు సమర్పించాలని సూచించారు. రూ 6 వేల కోట్లతో ఉత్తర చైన్నె అభివృద్ధి జరుగుతున్నట్టు తెలిపారు. త్వరలో ఉత్తర చైన్నె మరింత సుందరంగా కనిపించబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, పీకే శేఖర్బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ, ఎంపీ కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యేలు ఎస్ సుదర్శనం, తాయగం కవి, ఆర్డీ శేఖర్, ఎలిలన్, ఐడ్రీమ్ ఆర్ మూర్తి, ఎబినేజర్, ఎంవీ ప్రభాకర్ రాజా, కేపీ శంకర్, జోసెఫ్ శామ్యూల్, డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్, అదనపు ముఖ్య కార్యదర్శి పి.అముదా.ఐ.ఎ.పి., గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్, చైన్నె జిల్లా కలెక్టర్ రష్మి సిద్ధార్థ్ జగడే తదితరులు పాల్గొన్నారు. -
రాఘవ లారెన్స్ హీరోగా బెంజ్
తమిళసినిమా: నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బెంజ్. ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, జి స్క్వాడ్ సంస్థ అధినేత దర్శకుడు లోకేష్ కనకరాజ్ , ది రూట్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత జగదీష్ పళనిస్వామి కలిసి నిర్మిస్తున్న కమర్షియల్ అంచనాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఇది. ఇంతకుముందు రెమో, సుల్తాన్ తదితర సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన భాగ్యరాజ్ కన్నన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న తాజా చిత్రం బెంజ్.ఈ చిత్రం షూటింగ్ సోమవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు అనంతరం చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇందులో నటి సంయుక్త నాయకిగా నటిస్తున్నారని, పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. వారి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. సాయి అభయంకర్ సంగీతాన్ని, గౌతమ్ జార్జ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగును యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ లోని పలు ప్రాంతాల్లో 120 రోజులకు పైగా నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదలవుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. -
గుడియాత్తం గంగమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు
వేలూరు: జిల్లాలోని గుడియాత్తం గంగమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మదివాణన్ తెలిపారు. ప్రసిద్ధి చెందిన గంగమ్మ శిరస్సు జాతర ఈనెల 15న గురువారం జరగనుంది. బుధవారం ఉదయం అమ్మవారి రథోత్సవం, గురువారం ఉదయం శిరస్సు ఉత్సవం జరగనుంది. ఇందుకోసం వేలూరు, ఆంబూరు, తిరుపత్తూరు, చిత్తూరు వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ జాతరకు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లును సిద్ధం చేశారు. ఇందుకోసం మూడు తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయడంతో పాటు కారు పార్కింగ్లు నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. భక్తులు తొక్కిసలాట లేకుండా అవసరమైన పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి భక్తులు వచ్చి వెళ్లేందుకు వేర్వేరుగా దార్లు ఏర్పాటు చేయడాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఇందుకు భక్తులు సహకరించాలన్నారు. అదే బాణ సంచా వేడుకల చేసే ప్రాంతంలో అగ్గిపెట్టె, సిగిరేట్ వంటి వాటిని ఉపయోగించకుండా ఉండాలన్నారు. ఆలయ జాతరను పురష్కరించుకుని ఈనెల 15వ తేదీన వేలూరు జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. జాతర జరిగే ప్రాంతంలో అక్కడక్కడ తాగునీరు, మజ్జిగ వంటి శీతల పానియాలు ఏర్పాటు చేయాలన్నారు.