ఏర్కాడు పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

ఏర్కాడు పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు

May 21 2025 1:35 AM | Updated on May 21 2025 1:35 AM

ఏర్కాడు పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు

ఏర్కాడు పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు

సేలం: ఏర్కాడులో పర్యాటకులకు ప్రాథమిక సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారుల ను జిల్లా కలెక్టర్‌ ఇరా బృందాదేవి ఆదేశించారు. ఈనెల 23వ తేదీన ప్రారంభం కానున్న 48వ వేసవి ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రసిద్ధ వేసవి హిల్‌ స్టేషన్లలో ఒకటైన ఏర్కాడులో ప్రతి సంవత్సరం ఏర్కాడు వేసవి ఉత్సవం జరుగుతుందని, వేసవి కాలాన్ని జరుపుకోవడానికి పాఠశాల పిల్లలు, పర్యాటకులు ఇతర ప్రజా సందర్శకులు ఏర్కాడు కొండలకు వస్తార న్నారు. ఈ 48వ ఏర్కాడు వేసవి ఉత్సవం ఈ నెల 23న ప్రారంభమై 29వ తేదీ వరకు 7 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఏర్కాడు వే సవి ఉత్సవానికి పర్యాటకులను ఆకర్షించడానికి, ఉద్యానవన శాఖ అన్నాపార్క్‌లో 1.50 లక్షల పూల తో పూల ప్రదర్శన, చేతిపనుల ప్రదర్శన, కూరగాయల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. అలాగే ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రో గ్రామ్‌, తమిళనాడు స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఉమెన్స్‌ ప్రోగ్రామ్‌ వంటి విభాగాల తరపున వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేసవి ఉత్సవంలో ప్రతిరోజూ వివిధ కళా, సంగీత ప్రదర్శనలు, పెంపుడు జంతువుల ప్రదర్శనలు, పడవ పందేలు తదితర కార్యక్రమాలు జరుగుతా యని వెల్లడించారు. అలాగే ఏర్కాడు పర్వత మా ర్గంలో రోడ్డు భద్రత గురించి పర్యాటకులలో అవగాహన కల్పించడానికి రవాణా శాఖ అవగాహన కో సం బ్యానర్లు, గోడ ప్రకటనలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు, పాదచారులు రోడ్డు నియమాలను, జిల్లా యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు.

కలెక్టర్‌ ఇరా బృందాదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement