మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ | - | Sakshi
Sakshi News home page

మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ

May 22 2025 5:46 AM | Updated on May 22 2025 5:46 AM

మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ

మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ

పళ్లిపట్టు: మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ కనువిందు చేశారు. పళ్లిపట్టు గంగజాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామ దేవత కొళ్లాపురమ్మకు మహిషాసురమర్దిని అలంకరణలో కొలువుదీర్చి, మేళతాళాలు, బాణసంచా సంబరాలు నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం గంగమ్మ తల్లి గ్రామ వీధుల్లో ఊరేగి నడివీధిలో కొలువుదీరారు. మహిళలు కుంభం సమర్పించి దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారు ఊరేగింపు సందర్భంగా యువత విభిన్న వేషధారణలో పట్టణంలో సందడి చేశారు. అశేష జనవాహిని నడుమ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి కుశస్థలినదిలో నిమజ్జనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement