breaking news
kerala
-
76 ఏళ్ల వయసులో జిప్లైన్పై రయ్యి!
మళప్పురం: బామ్మ వయసు 76 ఏళ్లే కానీ... మనసు మాత్రం పదహారుకు మించదు. అందుకేనేమో... కొడుకు, కోడళ్లు.. మనుమలు, మనుమరాండ్రు అందరితో విహారయాత్రకు వెళ్లి... జిప్లైన్ సవారీ చేస్తానని పట్టుపట్టింది. కుటుంబ సభ్యులు వద్దని వారించినా... ప్రమాదమని హెచ్చరించినా అస్సలు పట్టించుకోలేదు. ‘‘అదేంటో (జిప్లైన్ సవారీ) నాకు తెలియదు. కానీ చూడగానే సవారీ చేయాలని అనిపించింది. ఇంట్లోవాళ్లందరూ పడవలో తిరుగుతూండగా చూశా జిప్లైన్ను. అక్కడి వెళ్లా. అక్కడున్న వ్యక్తి ఏం ఫర్వాలేదు. నేను తీసుకెళతా. భయపడొద్దు అన్నాడు. సరే అని సవారీ మొదలుపెట్టా. భయమేమీ కాలేదు. సగం దూరం వెళ్లిన తరువాత... నా చేయి వదిలేయమని ఆ వ్యక్తికి చెప్పాను. నేనే స్వయంగా తాడు పట్టుకుని సవారీ మొత్తం పూర్తి చేశా’’అని బోసినవ్వుతో తన అనుభవాన్ని వెల్లడించింది. సవారీ మొత్తం పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందంటూనే... ఎప్పుడు ఇలాంటి సాహసాలు ఎదురపడ్డా వదిలేది లేదని ధీమాగా చెప్పింది. ఊరూ.. పేరు చెప్పనే లేదు కదూ... బామ్మది కేరళలోని మళప్పురం వద్ద ఉన్న తనూర్. పేరు లక్ష్మి. పొన్నాని నదిపై జిప్లైన్పై బామ్మ సవారీ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్! -
బీజేపీ జెండాలతో ధర్మేంద్ర రాజీనామా డిమాండ్
-
కూటమిలో తిరుగుబాటు.. యంగెస్ట్ చైర్పర్సన్కు బిగ్ షాక్!
దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్ దియా బినుకి(21) బిగ్ షాక్ తగిలింది. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. కేవలం ఏడు నెలలకే ఆమె పదవికి ముగింపు పడింది. అయితే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ సభ్యుల క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె కుర్చీని వీడాల్సి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేరళ కొట్టాయం జిల్లా పాలా మున్సిపాలిటీలో 26 మంది సభ్యులున్నారు. మున్సిపల్ కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 17 మంది ఓటు వేశారు. దీంతో అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ పరిణామం అధికార యూడీఎఫ్కు భారీ ఎదురుదెబ్బగా మారింది.కాంగ్రెస్ తిరుగుబాటుతోనే.. పాలా మున్సిపాలిటీలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్కు చెందిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం దియా ఓటమికి కారణమైంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు బిజు మాథ్యూస్, టోనీ థైపరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ, రాజిత ప్రకాశ్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. డిప్యూటీ చైర్పర్సన్ మాయా రాహుల్ కూడా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. తమకు పార్టీ విప్ అందలేదని తిరుగుబాటు కౌన్సిలర్లు చెబుతూ.. స్థానిక ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.ఎవరీ దియా బిను పులిక్కకండం?21 ఏళ్ల దియా బిను పులిక్కకండం దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్గా రికార్డు సృష్టించారు. చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎకనామిక్స్ చదివిన ఆమె.. ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం తన తండ్రి బిను పులిక్కకండం, మేనమామ బిజు పులిక్కకండంతో కలిసి స్వతంత్ర వర్గంగా ఏర్పడ్డారు. ఈ మూడు సభ్యుల బ్లాక్కు యూడీఎఫ్ మద్దతు ఇవ్వడంతో గత డిసెంబర్లో దియా పాలా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.యూడీఎఫ్కు అధికారం తెచ్చిన కుటుంబ బ్లాక్పాలా మున్సిపాలిటీలో సుదీర్ఘకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న కేరళ కాంగ్రెస్(ఎం)కు వ్యతిరేకంగా బిను పులిక్కకండం రాజకీయంగా ఎదిగారు. స్వతంత్ర వర్గం కీలకంగా మారడంతో యూడీఎఫ్కు మున్సిపల్ పీఠం దక్కింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్, పులిక్కకండం కుటుంబం మధ్య విభేదాలు పెరిగాయి. పలు పాలనా నిర్ణయాలు, రాజకీయ అంశాలపై ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.వివాదాల తర్వాత అవిశ్వాస తీర్మానండీవైఎఫ్ఐ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం వంటి అంశాలపై కాంగ్రెస్, దియా వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల కాంగ్రెస్ కౌన్సిలర్ బిజు మాథ్యూస్పై దియా ఫిర్యాదు చేయడం కూడా వివాదానికి దారితీసింది. తన కార్యాలయం నుంచి ఖరీదైన వాచ్, కొన్ని అధికారిక ఫైళ్లు కనిపించకుండా పోయాయని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బిజు మాథ్యూస్ ఖండించారు."ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నా"పదవి కోల్పోయిన అనంతరం దియా బిను స్పందించారు. ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. తనపై అవినీతి, నిధుల దుర్వినియోగం, లంచాలు, బంధుప్రీతి లేదా చట్ట ఉల్లంఘన వంటి ఎలాంటి నిరూపిత ఆరోపణలు లేవని చెప్పారు. "నా పదవీకాలంలో పారదర్శకత, చట్టబద్ధత, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాను. పదవులు తాత్కాలికం.. విలువలు శాశ్వతం" అని దియా పేర్కొన్నారు.పాలా మున్సిపాలిటీ భవిష్యత్పై ఉత్కంఠదియా తొలగింపుతో పాలా మున్సిపాలిటీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో తదుపరి పాలనపై ఉత్కంఠ నెలకొంది. అవిశ్వాస తీర్మానంతో యూడీఎఫ్ పాలన ముగియగా.. ఎల్డీఎఫ్ మద్దతుతో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. -
సిక్కిం సొరంగ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి
నామ్చి: సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కూలిన దుర్ఘటనలో కేరళలోని కోట్టాయం జిల్లాకు చెందిన జియాలజిస్ట్ అనీష్ మోహన్ గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సమర్దుంగ్ ప్రాంతంలోని సొరంగంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. సొరంగంలో చిక్కుకున్న వారిని, గల్లంతైన అనీష్ మోహన్ను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. #WATCH | Gangtok, Sikkim: Rescue operations are underway in Sikkim's Namchi district after a tunnel collapsed, trapping at least 12 workers. More details awaited. (Source: Sikkim government) pic.twitter.com/DTWs7KLtDa— ANI (@ANI) July 20, 2026సహాయక చర్యలను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్హెచ్పిసి అధికారులు సంయుక్తంగా ముమ్మరం చేశారు. సవాళ్లతో కూడిన వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కుటుంబాలకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తమాంగ్ సానుభూతి తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
జంట హత్యల కేసులో మరణశిక్ష
పాలక్కాడ్: కేరళలో గత ఏడాది సంచలనం సృష్టించిన నెన్మర జంట హత్యల కేసు నిందితుడికి మరణశిక్ష పడింది. పాలక్కాడ్ అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ సోమవారం ఈ మేరకు తీర్పు ప్రకటించారు. జంట హత్యలను అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయమూర్తి 61 ఏళ్ల నిందితుడు చెన్తామర రూ.20 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1), సెక్షన్ 126 (2)ల కింద ఈ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత ఏడది జనవరి 27న చెన్తామర తన పొరుగింటి సుధాకరన్తోపాటు తల్లి లక్ష్మిని హత్య చేశారు. చెన్తామర ఒకే కుటుంబంలోని వారిని హత్య చేసినందున ఈ కేసును అరుదైనదిగా భావిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తన దాంపత్య సమస్యలన్నింటికీ కారణమని ఆరోపిస్తూ చెన్తామర పొరుగింటి సుధాకరన్ భార్య సజితను 2019లో హత్య చేశాడు. ఈ కేసులో డబుల్ జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే గత ఏడాది జనవరిలో బెయిల్పై విడుదలైన సందర్భంగా మరోసారి ఆ ఇంటిపై దాడి చేసి సుధాకరన్తోపాటు అతడి తల్లిని చంపేశాడు. ఈ ఘటన కాస్తా నెన్మర జంట హత్యల కేసుగా ఖ్యాతి చెందింది. పోలీసులు చాలా వేగంగా నిందితుడిని అరెస్ట్ చేయగలిగారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం సుమారు 81 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే దాదాపు 28 వస్తువులను పరిశీలించింది. సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి కెన్నెత్ జార్జ్ చెన్తామరకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. బాధితుడి పెద్ద కుమార్తెకు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఆ ఇంటికెళ్లం నెన్మర జంట హత్యల కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును బాధితుడు సుధాకరన్ కుమార్తెలు అతుల్య, అఖిల స్వాగతించారు. నిందితుడికి తగిన శిక్ష పడటంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన తరువాత వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులతోపాటు నానమ్మను కూడా కోల్పోయిన ఆ ఇంటికి మళ్లీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘నాన్న, మిగిలిన వారందరి జ్ఞాపకా>లున్నాయి అక్కడ. మళ్లీ అక్కడికి వెళ్లలేము. వెళితే ఆ జ్ఞాపకాలు చుట్టుముడతాయి.’’అని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బంధువుల ఇంట్లోనే ఉంటున్నారు. తీర్పు వెలువడిన తరువాత కూడా చెన్తామర ముఖంలో ఎలాంటి పశ్చాతాపమూ కనిపించలేదని అతుల్య వ్యాఖ్యానించగా న్యాయప్రక్రియ పూర్తయ్యేంతవరకూ భయం తమను వెంటాడుతూనే ఉంటుందని అఖిల ఆందోళన వ్యక్తం చేసింది. -
‘రేర్ ఆఫ్ ది రేరెస్ట్’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు
కేరళలో సంచలనం సృష్టించిన నెన్మారా డబుల్ మర్డర్ కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడింది. తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసిన కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతమరాకు కోర్టు మరణశిక్ష విధించింది. అంతకు ముందు అదే కుటుంబంలోని వ్యక్తిని హత్య చేసిన చెంతమరా.. బెయిల్పై బయటకు వచ్చి జంట హత్యలకు పాల్పడడం గమనార్హం. దీంతో ఈ కేసు అత్యంత అరుదైన కేసుల (రేర్ ఆఫ్ ది రేరెస్ట్) పరిధిలోకి వస్తుందని భావించిన న్యాయస్థానం కఠిన శిక్షను ఖరారు చేసింది.పాలక్కాడ్ జిల్లా నెన్మారా పరిధిలోని పొతుండి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2025 జనవరి 27న సుధాకరన్ (55), ఆయన తల్లి లక్ష్మి (75)పై నిందితుడు చెంతమరా (Chenthamara) దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.భార్య దూరం కావడంపై అనుమానంతో.. చెంతమరా నేర చరిత్ర మొదలైంది 2019 ఆగస్టు 31న. ఆ రోజు అతను తన పొరుగింటి మహిళ సజిత (35)ను హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. తన భార్య, కుమార్తె తనను విడిచిపెట్టి వెళ్లడానికి సజిత కుటుంబం చేసిన చేతబడే కారణమని చెంతమరా అనుమానించాడు. ఈ అనుమానంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. బెయిల్పై బయటకు వచ్చాక ఘాతుకంసుధాకరన్ భార్య సజిత హత్య కేసులో అరెస్టైన చెంతమరా.. బెయిల్పై బయటకు వచ్చాడు. సరాసరి సజిత ఇంటికి వెళ్లి.. ఆమె భర్త సుధాకరన్, తల్లి లక్ష్మిలను హత్య చేశాడు. నేర తీవ్రత, హత్య చేసిన తీరు, బాధిత కుటుంబంపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ కేసును అత్యంత అరుదైన నేరంగా పరిగణించింది. సాధారణంగా జీవిత ఖైదు విధించే పరిస్థితుల్లో కాకుండా.. అరుదైన సందర్భాల్లో మాత్రమే విధించే మరణశిక్షను పాలక్కాడ్ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు–IV అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ (Kenneth George) ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.తీర్పుతో ముగిసిపోలేదా?నెన్మారా జంట హత్యల కేసు కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా కోర్టు తీర్పుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడికి అప్పీల్ అవకాశాలు ఉండనున్నాయి. -
శబరిమల వెళ్లే భక్తులకు ఐఎండీ కీలక సూచన
తిరువనంతపురం: కేరళ శబరిమల భక్తులకు వాతావరణ శాఖ కీలక సూచన జారీ చేసింది. ఈ జూలై 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దీంతో అక్కడికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని రెయిన్ కోట్, గొడుగులు తమ వెంట తీసుకెళ్లాలని సూచించింది. గతంలో నాలుగు జిల్లాలకు జారీ చేసిన హెచ్చరికను ఈ రోజు (శనివారం) ఏడు జిల్లాలకు పెంచి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రానున్న 24 గంటల వ్యవధిలో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్లు వరకు భారీ వర్షపాతం కురుస్తుందని హెచ్చరిక జారీ చేసింది. పతనంతిట్ట , కొట్టాయం , ఇడుక్కి, మలప్పురం , కోజికోడ్ , కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలకు ఇదివరకే ఎల్లో అలర్డ్ జారీ చేయగా తాజాగా మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ కాసరగోడ్లలో ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.నైరుతి రుతపవనాలు బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం మీదుగా, ఉత్తర తమిళనాడు,దక్షిణ అంతర్గత కర్ణాటక ,ఉత్తర కేరళ వరకు విస్తరిస్తాయని అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
శబరిమల సన్నిధానంలో కొత్త తీర్థకుళం..! కానీ ఆ పేరు వద్దు..
శబరిమల సన్నిధానంలో ప్రస్తుతం ఉన్న భస్మకుళం వాస్తు శాస్త్ర సూత్రాలకు అనుగుణంగా లేదని ఇటీవల జరిగిన ఒక అంచనాలో తేలింది. దీని ఫలితంగా , ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సన్నిధానంలో కొత్త తీర్థకుళం (పవిత్ర కొలను) నిర్మించాలని యోచిస్తోంది.2014 దేవప్రశ్నం కొత్త ఆలయ చెరువు తవ్వకాన్ని సిఫార్సు చేసింది. కానీ దానికి "భస్మకుళం" అని పేరు పెట్టకూడదని పేర్కొంది. ఈ సిఫార్సును అనుసరించి , ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రతిపాదిత చెరువుకు "తీర్థకుళం" అని పేరు పెట్టాలని నిర్ణయించింది.ప్రతిపాదిత చెరువును లార్జ్ నడపండల్ బరి గెస్ట్ హౌస్ మధ్య , కొబ్బరి నిల్వ యార్డులో భాగంగా ఉన్న ప్రాంతంలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు బోర్డు ఆరన్ముళ వాస్తు విద్యా గురుకులాన్ని కన్సల్టెంట్గా నియమించింది.వాస్తు శాస్త్రం ప్రకారం, ఆలయ చెరువు ఆలయానికి ఈశాన్య దిశలో ఉండాలి. అయితే, ప్రస్తుతం ఉన్న భస్మకుళం ఆలయం వెనుక భాగంలో ఉంది. అంతేకాకుండా , సన్నిధానం నుంచి వచ్చే మురుగునీరు భస్మకులం సమీపంలో ప్రవహించడం వల్ల , కలుషితమైన నీరు చెరువులోకి చేరుతున్నట్లు కూడా గుర్తించారు. అలాగే గతంలో సన్నిధానంలో నిర్వహించిన దేవప్రశ్నం (దేవాలయ జ్యోతిష్య అంచనా) కూడా భస్మకులం ఉన్న ప్రదేశం అనువైనది కాదని సూచించింది.వాస్తవానికి, భస్మకులం ఆలయానికి వాయువ్య దిశలో ఉండేది. కారణాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా సన్నిధానం విస్తరణలో భాగంగా దానిని మూసివేసి, చివరికి పూడ్చివేశారు. తదనంతరం, దాని ప్రస్తుత ప్రదేశంలో కొత్త భస్మకులాన్ని నిర్మించారు.2018 దేవప్రశ్న ప్రకారం, అయ్యప్ప స్వామి అసలైన భస్మకుళాన్ని దాని అసలు ప్రదేశంలో పునరుద్ధరించాలని కోరుకున్నట్లు సమాచారం.కాగా, అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్ నేతృత్వంలోని గత ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు హయాంలో , కొబ్బరి నిల్వ యార్డు సమీపంలో ఒక కొత్త భస్మకుళం నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. ప్రాయోజకుల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. అయితే , ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్పెషల్ కమిషనర్ కేరళ హైకోర్టుకు నివేదిక సమర్పించడంతో నిర్మాణం నిలిచిపోయింది. ఆ తర్వాత ఎటువంటి పనులు చేపట్టలేదు.ప్రస్తుత అధ్యక్షుడు కె. జయకుమార్ నేతృత్వంలోని కొత్త బోర్డు , ఆ స్థలంలో కొత్త భస్మకుళం బదులుగా తీర్థకుళం నిర్మించాలని ఇప్పుడు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో ముందుకు సాగడానికి దేవస్వం బోర్డు కేరళ హైకోర్టు నుంచి కూడా అనుమతి కోరుతోంది.(చదవండి: శబరిమలలో ఏఐ సాంకేతికత.. భక్తుల మిస్సింగ్కి చెక్) -
విజయ్కు త్రిష.. నాకేమో నవ్వు!
సాక్షి సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ బంధంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ధ్యాన్.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకను పరోక్షంగా ప్రస్తావిస్తూ వేసిన సరదా పంచ్లు ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్లో తన సహనటి నవ్యా నాయర్ను ఉద్దేశించి ధ్యాన్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యాకు పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా నేను ఒకరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. నువ్వు తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని, కళ్లలో నీళ్లతో నన్ను చూస్తూ ఉండాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో సభలో నవ్వులు పూశాయి.Trisha emotions were on high during Vijay oath ceremony. An emotional moment ❤️ pic.twitter.com/GrJcW88bwg— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 10, 2026ఆ తర్వాత మైక్ అందుకున్న నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందించింది. "నువ్వు సీఎం అయితే.. నువ్వు చెప్పినట్టే తెల్లచీరకు ఆకుపచ్చ అంచు, డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలో కూర్చుంటా. కళ్లలో ఆనందబాష్పాలతో నీకు జైకొడతా. కానీ ముందు వరుసలో నాకు సీటు మాత్రం రిజర్వ్ చేయాలి" అంటూ చమత్కరించింది. దీంతో సభలో మరోసారి నవ్వుల వెల్లువ ఎగిసింది.ఇదంతా సరదా సంభాషణలా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తప్పు బడుతున్నారు. ఈ వ్యాఖ్యలను విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పోలుస్తున్నారు. వాళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు. The day I take the oath as CM... I think Navya will be there in the front row wearing a saree...!!- Dhyan Sreenivasan 😂 pic.twitter.com/UT5GvyK8Fq— Trollywood 𝕏 (@TrollywoodX) July 16, 2026 తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిష.. ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురికావడం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఘటననే ధ్యాన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్ మరో సరదా వ్యాఖ్య కూడా చేశాడు. విజయ్ ముఖ్యమంత్రి అయినట్లే.. తానూ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అవుతానని జోక్ చేశాడు. అలాగే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్ను ఈ సంభాషణలోకి లాగుతూ.. తనకి గవర్నర్ పదవి బాగుంటుందని నవ్వించాడు. వెంటనే అజు వర్గీస్ మీ అమ్మగారికి రాష్ట్రపతి పదవి దక్కుతుందని జోక్ చేశాడు.అయితే ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందని అనుకున్నాడో ఏమో.. అజు వర్గీస్ వేదిక మీదకు వచ్చి "విజయ్ సార్, నా ఫ్రెండ్ కొంచెం పిచ్చోడు.. దయచేసి క్షమించండి" అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటతో అక్కుడున్నవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.ఎవరీ ధ్యాన్-నవ్యా?ధ్యాన్ శ్రీనివాసన్(Dhyan Sreenivasan) మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాసన్ కుమారుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్కు సోదరుడు. 2013లో వచ్చిన తీరా సినిమాతో నటుడిగా పరిచయమైన ధ్యాన్, 2013లో 'తీరా' చిత్రంతో నటుడిగా పరిచయమైన ధ్యాన్ శ్రీనివాసన్.. 'ఆది కాప్యారే కూటమణి', 'కుంజిరామాయణం', 'గూడలోచన', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక.. నవ్యా నాయర్ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి. 'నందనం', 'ఇష్టం', 'కళ్యాణరామన్', 'పందిప్పాడ' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్ 2017లో అర్పితా సెబాస్టియన్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్యా నాయర్ 2010లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. -
కుమారుడి సర్ప్రైజ్ గిఫ్ట్..! కన్నీటి సంద్రంలో తండ్రి
తలిదండ్రులు తమ పిల్లల చదవుల కోసం, వారి ఉన్నతి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమ పడతారు. ఆ బిడ్డ ప్రయోజకుడై వాళ్ల కష్టాన్ని గుర్తించి..కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలిగితే..ఆ పేరెంట్స్కి మించిన అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. అలాంటి ఆనందాన్నే తిరిగి ఇచ్చాడు కేరళకు దీప్ నీలమ్. అంతేగాదు కుమారుడి ఊహించని చర్యకు ఆ తండ్రి కళ్లలలో నీళ్లు తిరిగాయ్.అసలేం జరిగిందంటే..కేరళకు దీప్ నీలిమ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో నెటిజన్లకు తెగ ఆకట్టుకుంది. ఆ వీడియోలో తనను ఎప్పటికీ వీడిపోని జ్ఞాపకాలతో మొదలవుతుంది. అతన పాఠశాలలో చదువుతున్నప్పుడు తన తండ్రి తాను ఎప్పటికీ ఎస్యూవీని కొనని అమ్మతో చెప్పడం విన్నానని చెప్పుకొచ్చాడు.ఎందుకంటే తన చదువుకి పెట్టుబడి కోసం తక్కువ ఖరీదైన కారుతో సరిపెట్టుకున్నట్లు తెలిపాడు. అయితే తాను కచ్చితంగా ఆయన పదవీవిరమణ సమయానికి తన డ్రీమ్ వాహనాన్ని కొంటానని తండ్రికి వాగ్దానం చేసినట్లు చెప్పుకొచ్చాడు నీలిమ్. ఆరోజు నుంచే తన తండ్రి కోరికను ఎలాగైన నెరవేర్చాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడట. అయితే అనుకోకుండా తన జీవితం కాస్త ముందుగానే ఆ అవకాశం ఇచ్చిందని చెప్పాడు. తాను ఐఐఎం కోజికోడ్ నుంచి పట్టభద్రుడైన కేవలం ఆరు నెలలకే, తన చిన్ననాటి వాగ్దానం నిజం చేసుకోగలిగానని ఆనందంగా చెప్పాడు. ఎందుకంటే తాను కేపీఎంజీలో జాబ్ సంపాదించడంతో అది సులభమైందని అన్నాడు. అందుకే తన తండ్రి కోరికను నెరవేర్చిన క్షణం చిరస్మరణీయం ఉండేలా టెస్ట్ డ్రైవ్ చేద్దామనే నెపంతో ఆయనను ఒక కార్ షోరూమ్కు తీసుకువెళ్లినట్లు చెప్పాడు. ఆ ఎస్యూవీ వాహనం చూశాక గానీ ఆ తండ్రికి తెలియలేదు అప్పటికే కొడుకు ఆ కారుని కొనుగులు చేసినట్లు. అంతే ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేగాదు నీలమ్ ఇది తనకు జాబ్ ఆఫర్, ప్రమోషన్ కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే విషయం అంటూ తన పోస్ట్ని ముగించాడు. పైగా నీలమ్ ఆ వీడియోకి తమ కలల కన్నా పిల్లల కలలకే ప్రాధాన్యత ఇచ్చే ప్రతి తల్లిదండ్రులకు తలవంచి నమస్కరిస్తున్నా అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు నీలమ్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ఈ పోస్ట్ మా పేరెంట్స్ త్యాగాలను గుర్తు చేసిందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Dip Nilim | IIM Kozhikode (@miles.and.mindset__) (చదవండి: స్లోవేకియా నాయకుడు రిచర్డ్ 'థేకువా స్వీట్'రుచికి ఫిదా! ఎలా తయారు చేస్తారంటే..) -
సైన్స్కు షాక్ ఇచ్చిన గణేశుడు.. ఆర్నెల్లు నలుపు.. ఆర్నెల్లు తెలుపు
మనం ఇప్పటి వరకు ఆధ్యాత్మకతకు సైన్స్ను జోడిస్తూ.. సైన్స్ కూడా ఛేదించలేని కొన్ని ఆలయాల విశేషాలు తెలుసుకున్నాం కదా? నేను ఈరోజు మీకు అలాంటి మరో అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి..! దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నించే నాస్తికులను సైతం ముక్కున వేలువేసుకునేలా చేస్తున్న బ్లాక్ అండ్ వైట్ గణేశుడి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆ గణపతి విగ్రహం ఇప్పటికీ సైన్స్కు అంతు చిక్కలేదు. విశేషం ఏంటనుకుంటున్నారా?సంవత్సరంలో రెండు ఆయనాలుంటాయి. అవి ఉత్తరాయణం, దక్షిణాయనం. ఆ గణపతి విగ్రహం ఉత్తరాయణంలో నలుపు రంగులో.. దక్షిణాయనంలో తెలుపురంగులో ఉంటుంది. ఆ విగ్రహం ఎదుట ఉండే బావిలో నీరు విగ్రహం రంగుకు వ్యతిరేక వర్ణంలో ఉండడం గమనార్హం..! అంటే.. విగ్రహం తెల్లగా ఉన్నప్పుడు బావినీళ్లు నల్లగా.. విగ్రహం నలుపు రంగులో ఉన్నప్పుడు బావినీళ్లు తెల్లగా ఉంటాయి. అంతేకాదు.. ఆ ఆలయంలోని మర్రిచెట్టు వింత కూడా సైన్స్కు చిక్కడం లేదు.తమిళనాడు – కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి జిల్లా సమీపంలో.. నాగర్కోయిల్కు దగ్గర్లోని కేరళపురం అనే గ్రామంలో ఉన్న 'శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం' ఈ కోవలోకే వస్తుంది. పేరులోనే ఉంది కదా.. 'అతిశయ వినాయకర్'.. అంటేనే అద్భుతాలు చేసే వినాయకుడు అని అర్థం. ఈ రోజు ఈ వీడియోలో ఆ ఆలయం గురించి తెలుసుకుందామా? -
కండక్టర్ను దోచుకుని.. 36 ఏళ్ల తర్వాత దొరికిపోయి..
కోజికోడ్: కేరళలో బస్సు కండక్టర్ను తుపాకీతో బెదిరించి టికెట్ విక్రయ నగదును దోచుకుని పరారైన ఒక వ్యక్తిని ఏకంగా 36 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు కేరళ నుంచి పారిపోయి కర్ణాటకలోని మైసూరులో మారుపేరుతో జీవిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య పెట్టిన వేధింపుల కేసు ఇతడిని ఎట్టకేలకు పట్టిచ్చింది. 71 ఏళ్ల వయస్సులో అనుకోకుండా ఇతను పోలీసులకు దొరికిపోయాడు. కేరళలోని మలప్పురం జిల్లా అరికోడ్కు చెందిన వీకే జోస్ 1990లో కేరళ కేఎస్ఆర్టీసీ బస్సు థిరువంబాడీ నుంచి కూంబారా పట్టణానికి వెళ్తున్నప్పుడు అందులోని కండక్టర్ను తుపాకీతో బెదిరించి కండక్టర్ వద్ద ఉన్న రోజువారీ టికెట్ కలెక్షన్ సొమ్మును నిందితుడు లాక్కొని పరారయ్యాడు. ఈ కేసులో ఇతనిపై కోర్టు అప్పట్లోనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఇతడు శివకుమార్ అనే మారుపేరుతో మైసూరులోని నరసింహరాజా ప్రాంతంలో జీవించడం మొదలెట్టాడు. పెళ్లిచేసుకుని భార్య, పిల్లలతో ఉంటున్నాడు. అయితే తనను భర్త వేధిస్తున్నాడంటూ ఇతని భార్య జూలై 8వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇతని ఇంట్లో సోదాలు చేయగా ఒక తుపాకీ లభించింది. తుపాకీ లైసెన్స్ వివరాలు ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇతని వివరాలను కేరళ పోలీసులకు మైసూరు పోలీసులు పంపించారు. దీంతో ఇతనిపై మూడు దశాబ్దాల క్రితం చోరీ కేసు నమోదైనట్లు గుర్తించి వెంటనే అరెస్ట్చేశారు. తర్వాత కేరళలోని థిరువంబాడీకి తీసుకొచ్చి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!
భారతీయ వివాహాలు అంటే ఏ రేంజ్లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పెళ్లి కూతురు అలంకరణ అంటే..అందరి దృష్టి ఆమెపైనే అన్నంత అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కళ్లు చెదిరిపోయే రేంజ్ ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే వస్త్రాలంకరణ తప్పనిసరి. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ పెళ్లి కూతురు రూపానికి సరికొత్త అర్థం ఇచ్చేలా రెడీ అయ్యింది. స్వచ్ఛతకు మరో రూపంలా కనిపించిన తీరు అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ హర్ష పత్తు నజీమ్ మహమ్మద్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఆమె తన బ్రైడల్ షూట్, వివాహా వేదికకు సంబంధిచిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. అవి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ఎందుకంటే ‘క్లీన్ గర్ల్’ లుక్లో కనిపించడం విశేషం. కనీసం ఆ లుక్లో కూడా చెవికి ఇయర్ స్టడ్స్ అయినా ఉంటాయి. కానీ ఈ మేకప్ ఆర్టిస్ట్ హర్ష అవి కూడా ధరించలేదు. కేరళకు చెందిన ఈ వధువు ఎలాంటి బంగారం, వెండి లేదా వజ్రాల ఆభరణాలు ధరించకుండా పెళ్లి పీటల మీద నడచి తన చిరకాల ఆచారాన్ని సవాలు చేసింది. చాలా నిరాడంబరంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కనీసం ఝంకాలు, మాంగ్ టిక్కా, లేదా ఒక సాధారణ బిందీ వంటి ప్రాథమిక ఆభరణాలకు కూడా చోటివ్వలేదామె. స్వచ్ఛమైన పెళ్లికూతురు ఇలానే ఉంటుంది అని చాటిచెప్పేలా ముస్తాబైంది. ఆఖరికి మేకప్ విషయంలో కూడా నేచురల్గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎలాంటి ఆభరణాలు ధరించకపోయినా..పెళ్లికూతురు దుస్తులు పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉండగలవని తన ఆహార్యంతో నిరూపించిందామె. ఆమె పెళ్లి కూతురు లుక్ని హైలెట్ చేసింది ధరించిన చీర. హర్ష ధరించిన శారీ రిచ్గా డిటైల్డ్గా ఉండటమే దీనికి కారణం. సాధారణంగా నవవధువు ధరించే ఎరుపు రంగునే ఎంచుకుంది. ఇక్కడ హర్ష్ దానిపై క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ, ఫుల్-స్లీవ్ బ్లౌజ్తో స్టైల్ చేశారు. అలాగే ఆభరణాలు, మేకప్ లేకుండా కనిపించినప్పటికీ..ఓ విలక్షణమైన పెళ్లి కూతురు లుక్తో అక్కడున్న వారందర్నీ ఆకట్టుకోవడం విశేషం. ప్రీ వెడ్డింగ్ షూట్లో సైతం ఇలానే నిరాడంబరమైన లుక్తో అలరించింది. నెటిజన్లు సైతం ఆమె లుక్కి ఫిదా అవుతూ..ఆభరణాలు లేని అందమైన వధువు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Harsha Pathu (@harsha_pathu_)(చదవండి: పాటలు పాడటం.. నిజంగానే ఊపిరితిత్తులకు మంచిదా?) -
చార్టర్డ్ ప్లైట్లలో పనస పండ్ల ప్రయాణం!
మన దేశంలోని చాలా ప్రాంతాల్లో చెట్టుకు కాసి, వృథాగా రాలిపోయే పనస పండుకు అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు అత్యధిక డిమాండ్ పలుకుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల అధికారిక ఫలమైన పనసపండు (జాక్ఫ్రూట్) ప్రస్తుతం సరిహద్దులు దాటి చార్టర్డ్ విమానాల్లో విదేశాలకు ఎగుమతి అవుతోంది. స్థానికంగా కేవలం రూ.10 పలుకుతున్న కిలో పనస ధర, విదేశీ మార్కెట్లలో ఏకంగా రూ.500 నుండి రూ.600 వరకు పలుకుతుండటం విశేషం. ముఖ్యంగా కేరళకు చెందిన ‘వరిక్క’ రకం పనస పండ్లకు గల్ఫ్, యూరప్ దేశాలలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.చార్టర్డ్ విమానాల్లో.. పండగ సీజన్లలో గల్ఫ్, యూరప్ దేశాల నుండి వచ్చే డిమాండ్ను అందుకోవడానికి పనసపండ్ల విక్రయదారులు ఏకంగా చార్టర్డ్ విమానాలను కూడా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పండగ రోజుల్లో కేరళ నుండి ప్రతిరోజూ 500 కిలోల నుండి ఒక టన్ను వరకు పనస పండ్లను విదేశాలకు విమానాల ద్వారా తరలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 దేశాలకు ఈ పండ్లు ప్రధానంగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాల నుండి కూడా పనస పండ్లు గల్ఫ్, యూరప్ మార్కెట్లకు వస్తున్నప్పటికీ, కేరళ పనసకు ఉన్న ప్రత్యేక క్రేజ్ వల్ల దీనికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.పెరిగిన కార్గో ధరలు - ఎగుమతులపై ప్రభావంప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ వాతావరణం కారణంగా కార్గో రవాణా ఛార్జీలు రెట్టింపయ్యాయి. దీనివల్ల గత కొన్ని నెలలుగా పనస ఎగుమతులు కొంత మేర తగ్గాయని పనస ఎగుమతిదారుడు ఆర్ అశోక్ తెలిపారు. విదేశీ ఎగుమతులతో పాటు, ఉత్తర భారత రాష్ట్రాలలో వేగన్ (పాలు, వెన్న, తేనె వంటి జంతుసంబంధిత ఉత్పత్తులను కూడా తీసుకోని వారు) ఆహారానికి ఆదరణ పెరగడంతో, వారికి అవసరమైన పచ్చి పనసకాయలను రైళ్ల ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.సీజన్ ఆధారిత ఎగుమతులుపనస పండ్ల ఎగుమతి పూర్తిగా సీజన్లపై ఆధారపడి ఉంటుంది. కేరళలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పనస పండ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ఆ తర్వాత మే నుండి జూలై వరకు కేరళలో వర్షాకాలం (మాన్సూన్) ప్రారంభం కావడంతో, ఎగుమతిదారులు సరఫరా కోసం తమిళనాడుపై ఆధారపడతారు. వాతావరణ మార్పుల వల్ల కేరళలో పనస ఉత్పత్తిపై కొంత ప్రభావం పడినప్పటికీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో హైబ్రిడ్ పనస చెట్లను విస్తృతంగా సాగు చేస్తుండటంతో ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు.కొల్లి హిల్స్ పనస ప్రత్యేకతతమిళనాడులోని నామక్కల్ జిల్లాలో సముద్ర మట్టానికి 1,300 మీటర్ల ఎత్తులో ఉన్న ‘కొల్లి హిల్స్’ ప్రాంతం పనస సాగుకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జూన్ నుండి ఆగస్టు వరకు పనస కోతల సీజన్ సాగుతుంది. కొల్లి హిల్స్ పనస పండ్లు వాటి పెద్ద తొనలు, అమితమైన తీపి, ప్రత్యేకమైన సువాసనకు మార్కెట్లో ఎంతో గుర్తింపు పొందాయి.నాణ్యమైన సేకరణ విధానంకొల్లి హిల్స్లో పనస పండ్లను సేకరించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎత్తైన, పెద్ద పెద్ద చెట్ల నుండి పండ్లు కింద పడి పాడవకుండా, నేలను తాకకుండా చాలా జాగ్రత్తగా తాడు సాయంతో కిందికి దించుతారు. ఇలా సేకరించిన నాణ్యమైన పండ్లను కొనుగోలుదారులు నేరుగా రైతులకు చెందిన తోటల వద్ద నుండి కానీ లేదా మధ్యవర్తుల ద్వారా కానీ కొనుగోలు చేస్తుంటారు. -
30 ఏళ్లు తర్వాత రుణం తీర్చుకున్న వ్యక్తి ఎందుకో చుడండి
-
18 నెలల చిన్నారికి గుండెపోటా? వైద్యుడిపై కేసు
కేరళలోని కన్నూర్లో ఒక ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ ఏకైక కుమారుడు, 18 నెలల చిన్నారి కన్నుమూశాడు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.కన్నూర్లోని ఎరమామ్-కుట్టూర్ నివాసులైన టి. సూరజ్, విజయషాల ఏకైక కుమారుడు ఏడాదిన్నర బాలుడు దేవాన్ష్ శౌర్య. జూలై 5న ఇంటి బయట ఆడుకుంటుండగా కిందపడి పెదవికి గాయమైంది. తొలుతు బాలుడిని మాతమంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.ఆ తర్వాత అతడిని పయ్యన్నూర్లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ అనస్థీషియా ఇచ్చి గాయానికి కుట్లు వేశారు. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోయినట్లు సమాచారం.పరిస్థితి మరింత విషమించడంతో అనంతరం కన్నూర్లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం రాత్రి సుమారు 9 గంటలకు శౌర్య ప్రాణాలు విడిచాడు. అనస్థీషియా ఇచ్చిన తర్వాత స్పృహ కోల్పోయి, తమ బిడ్డ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ అంజలి పొడువాల్ నిర్లక్ష్యమే తమ బిడ్డ చావుకు కారణమని వాపోయారు. #WATCH | Keralam: A toddler from Kannur died five days after undergoing anaesthesia for a procedure to treat a cut lip at Kannur Government Medical College. Post-mortem examination has been completed, and police have registered a case investigating the circumstances surrounding… pic.twitter.com/EsW9Zmt3pp— ANI (@ANI) July 11, 2026అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి ఖండించింది. అనస్థీషియా ఇచ్చిన వెంటనే ఆ బిడ్డకు ఊహించని విధంగా గుండెపోటు వచ్చింది. వెంటనే వెంటిలేటర్పై ఉంచి, మెరుగైన క్రిటికల్ కేర్ కోసం తమ కన్నూర్ ఆసుపత్రికి తరలించామని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సరైన మోతాదులో అనస్థీషియా ఇచ్చినా, సరైన వైద్య సంరక్షణ అందించినా సమస్యలు తలెత్తవచ్చని ఆసుపత్రి పేర్కొంది. బిడ్డ ప్రాణాలను కాపాడటానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశామని ఆసుపత్రి వాదిస్తోంది. ప్రస్తుతం దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
భారత మెడికో మృతి.. గాయాల గుర్తులతో మిస్టరీగా మరణం!
తిరువనంతపురం: కేరళకు చెందిన విద్యార్థిని ఉజ్బెకిస్థాన్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, తమ కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, మత మార్పిడికి ఒత్తిడి చేయడం కూడా ఘటనకు కారణమై ఉండొచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో భారత అధికారులు, ఉజ్బెకిస్థాన్ దర్యాప్తు సంస్థలు కలిసి కేసును పరిశీలిస్తున్నాయి. దీంతో, ఆమె మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన సవారియా బసంత్ (22) ఉజ్బెకిస్థాన్లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు సమాచారం. ఆమె అక్కడ తన వైద్య విద్య కొనసాగిస్తుండగా ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె మృతదేహం స్వదేశానికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహంపై ఉన్న గాయాలను చూసి అనుమానాలు వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, సవారియాను కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఒక వ్యక్తి ఆమెపై మత మార్పిడికి ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. అందుకు ఆమె నిరాకరించడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఇది సాధారణ మరణం కాదని కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కోణంతో పాటు కుటుంబం చేసిన ఇతర ఆరోపణలను కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ఉజ్బెకిస్థాన్కు చెందినది కావడంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం కూడా ఈ అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు.. ఉజ్బెకిస్థాన్లోని స్థానిక అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. అసలు విద్యార్థిని ఎలా మృతి చెందింది, దానికి కారణాలు ఏమిటి, కుటుంబం చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది.కాగా, ఈ ఘటన విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ విద్యార్థులు వైద్య, ఇంజినీరింగ్ తదితర కోర్సుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ వారి భద్రత, స్థానిక చట్టాలపై అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే వ్యవస్థలపై మరింత దృష్టి అవసరమని నిపుణులు చెబుతున్నారు. -
25 ఏళ్ల స్నేహం, రూ. 25 వేల అప్పు : ధర్మపురికి చేరిన ఇంట్రస్టింగ్ స్టోరీ
నిజాయితీకి, స్నేహానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం కోసం కేరళకు చెందిన ఒక వ్యక్తి వందల కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణకు వచ్చిన వైనం ప్రశంసల్ని దక్కించుకుంటోంది. అసలు ఏం జరిగిందంటే..కేరళలోని పాలక్కాడ్కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్, తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన తన స్నేహితుడు ఎడ్ల లచ్చన్నకు రూ. 25,000 తిరిగి ఇవ్వడానికి ఇక్కడికి చేరుకున్నారు. దశాబ్దాల క్రితం వీరిద్దరూ సౌదీ అరేబియాలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ డబ్బును అప్పుగా తీసుకున్నారు.అసలేంటీ అప్పు?సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలోని ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇస్మాయిల్, లచ్చన్న మంచి స్నేహితులయ్యారు. ఆ సమయంలో ఇస్మాయిల్కు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడటంతో, లచ్చన్న అతనికి రూ. 25,000 ఇచ్చి సహాయం చేశారు. భారతదేశానికి తిరిగి వెళ్లేముందు ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని ఇస్మాయిల్ మాట ఇచ్చారు. అయితే, ఇద్దరూ సౌదీ విడిచి స్వదేశానికి వచ్చిన తర్వాత ఒకరి ఫోన్ నంబర్లు, చిరునామాలు మరొకరి వద్ద లేకపోవడంతో పూర్తిగా పరిచయాలు తెగిపోయాయి.గూగుల్ మ్యాప్స్ సాయంతో లచ్చన్న కాంటాక్ట్ లేకపోయినా, ఇస్మాయిల్కు తాను చేసిన అప్పు, ఇచ్చిన మాట మాత్రం ఎపుడూ మర్చిపోలేదు. అతని అప్పు ఎలా తీర్చాలా మధనపడుతూ వచ్చాడు. అయితే తన దగ్గర ఎలాంటి ఆధారం లేదు.కానీ లచ్చన్నది "ధర్మపురి" అనే విషయం మాత్రమే అతనికి గుర్తుంది. ఎలాగైనా అప్పు తీర్చాలనే పట్టుదలతో, ఇస్మాయిల్ గూగుల్ మ్యాప్స్ (Google Maps) సహాయంతో ఆ ఊరిని వెతుక్కుంటూ కేరళ నుండి తెలంగాణలోని ధర్మపురి చేరుకున్నాక, స్థానికులను అడిగి మొత్తం మీద లచ్చన్న ఆచూకీని కనిపెట్టారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందిభావోద్వేగ కలయికఇస్మాయిల్ అక్కడికి వెళ్లేసరికి, లచ్చన్న మళ్లీ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లినట్లు తెలిసింది.దాంతో ఇస్మాయిల్ తనను తాను లచ్చన్న కుటుంబ సభ్యులకు పరిచయం చేసుకుని, ఫోన్ ద్వారా లచ్చన్నతో మాట్లాడారు. తాను ఇచ్చిన అప్పు సంగతినే పూర్తిగా మర్చిపోయిన లచ్చన్న, 25 ఏళ్ల తర్వాత తన స్నేహితుడి గొంతు విని ఆశ్చర్యపోయారు. ఇద్దరూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఇస్మాయిల్ ఆ రూ. 25,000 నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశారు.ఇదీ చదవండి: 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!భారం దిగిపోయింది"ఇన్నాళ్లుగా నా గుండెల్లో ఒక పెద్ద భారాన్ని మోస్తున్నట్లు అనిపించేది. ఈరోజు నా స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా ప్రశాంతంగా ఉంది." అంటూ ఇస్మాయిల్ చాలా రిలీఫ్గా ఫీలవ్వడం విశేషం. ఇస్మాయిల్ చూపిన ఈ గొప్ప నిజాయితీకి లచ్చన్న కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థానిక ప్రజలు కూడా ఇస్మాయిల్ నిబద్ధతను, స్నేహాన్ని ఎంతో అభినందించారు. కాలం ఎంత మారినా నమ్మకం, కృతజ్ఞత, నిజమైన స్నేహం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని ఈ ఘటన నిరూపించింది.ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాల కోత, ప్లాంట్లు మూసివేత : వెల్లువెత్తిన నిరసన -
‘పాంచ్ సాహెబ్’ గా హార్మోజ్ను గెలిచింది
తల పైనుంచి దూసుకెళ్తున్న క్షిపణులు.. కింద మందుపాతర్ల సముద్రం.. నౌకలోని 24 మంది సిబ్బందిలో ఆమె ఒక్కతే స్త్రీ. అయినా భయపడలేదు. షిప్లో అందరూ ఆమెను ‘పాంచ్ సాహెబ్‘ (ఫిఫ్త్ ఇంజనీర్) అని పిలుస్తారు. ఆమే కేరళకు చెందిన ధీర వనిత హిఫా సలీమ్. స్ట్రయిట్ ఆఫ్ హార్మోజ్లో యుద్ధం మధ్య 100 రోజుల పాటు చిక్కుకుపోయినా భయానికి ఆస్కారం ఇవ్వని ధైర్యశాలి.‘ఆ రోజు మర్చిపోలేను. మా షిప్ మీద నుంచి పెద్ద శబ్దంతో క్షిపణి ఒకటి దూసుకు వెళ్లింది. నేను ఇంజన్ రూమ్లో ఉన్నాను. అది నౌకకు గుండెకాయ. నా డ్యూటీ అక్కడే. అయినా కదల్లేదు. నా స్టాఫ్ వచ్చి పాంచ్ సాహెబ్... మనం ఈ పరిస్థితిని ఎదుర్కొందాం అన్నారు. అందరం ఒక టీమ్గా నిలబడ్డాం’ అంది హిఫా సలీమ్.మొన్నటి అక్టోబర్ చివర్లో ఆమె పని చేస్తున్న కార్గో షిప్ హార్మోజ్ జల«సంధిలో ఇరుక్కున్నప్పుడు కేవలం 200 మీటర్ల దూరంలో క్షిపణులు, డ్రోన్లు పడ్డాయి. ఒక క్షిపణి తలపై నుంచే పోయింది. ‘భయం వేసింది... కానీ ΄్యానిక్ అవలేదు. డ్యూటీనే ముఖ్యం అనుకున్నాను’ అంది హిఫా. ‘క్షిపణి సమస్యలే కాదు... రాత్రిళ్లు ‘దాడులు ఎక్కువ కావడంతో జీపీఎస్ జామ్ అయిపోయింది. శాటిలైట్ కమ్యూనికేషన్, మాన్యువల్ కో ఆర్డినేట్స్తో మందుపాతర్లు తప్పించుకుంటూ నౌకను నడిపించాం’ అంది.మధ్యతరగతి అమ్మాయి..కేరళలోని సాధారణ కుటుంబం నుండి వచ్చిన హిఫా సలీమ్, చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ నుంచి మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అక్టోబర్ 15న హ్యూస్టన్ లో ‘బిడబ్ల్యూ కిజోకు’ నౌకలో తన మొదటి సీ అసైన్ మెంట్ను ప్రారంభించింది. ఆ రోజు ఎంతో సంతోషంగా తన డైరీలో ‘ఎక్సైట్మెంట్ ప్లస్ ఆందోళన.. నా మొదటి షిప్’ అని రాసుకుంది. కానీ చేరిన మూడు వారాల్లోనే అంతర్జాతీయ పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్మోజ్ జలసంధిలో 13 భారతీయ నౌకలు, 550 మందికి పైగా భారతీయ నావికులు చిక్కుకుపోయారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1% మాత్రమే మహిళా నావికులు ఉన్న ఈ రంగంలో, ఆ క్లిష్ట పరిస్థితుల్లో హిఫా ఒంటరిగా పోరాడింది. ఇంట్లో చెప్పని ’100 రోజులు’..యుద్ధక్షేత్రం లాంటి అంతర్జాతీయ జలాల్లో వంద రోజులు గడిచినా హిఫా తన ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పలేదు. ‘అమ్మకు బీపీ ఉంది, నాన్న టెన్షన్ పడతారు‘ అని ప్రతి విషయాన్నీ దాచేసింది. రోజూ నవ్వుతూ వీడియో కాల్స్ చేస్తూ ‘ఇక్కడ అంతా బాగుంది’ అని అబద్ధం చెప్పేది. కానీ, లోపల మాత్రం ఆమెకు ప్రతి రాత్రి ‘ఈ రోజు బతికి బయటపడతామా?’ అనే భయం వెంటాడేది. నౌకకు గుండెకాయ లాంటి ఇంజిన్ ఒక్క నిమిషం ఆగినా అందరి ప్రాణాలూ గాల్లో కలవడం ఖాయం. ఆ క్లిష్ట సమయంలో హిఫా చేతులే, ఆమె నైపుణ్యమే మిగిలిన 23 మంది నావికుల ప్రాణాలకు బలమైన ఆధారం అయ్యాయి. జపాన్ లో సైన్ ఆఫ్.. ఎట్టకేలకు 2026 జనవరి చివర్లో ఉద్రిక్తతలు కాస్త తగ్గాక ఆమె జపాన్ తీరంలో సురక్షితంగా ‘సైన్ ఆఫ్’ (విధుల నుంచి విరామం) చేసింది. హార్మోజ్ నరకంలో 3 నెలల పాటు మృత్యువుతో పోరాడి, క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మీడియా ప్రతినిధులు ‘మీకు ఇప్పుడు మొదట ఏం కావాలి?’ అని అడిగారు. దానికి ఆమె నవ్వుతూ ‘నాకు రెస్ట్ వద్దు, సెలబ్రేషన్స్ వద్దు.. కేవలం అమ్మ చేతి వంట చాలు’ అని బదులిచ్చింది. సాగర విజేతప్రస్తుతం హిఫా సలీమ్ తన తదుపరి ఉన్నత ర్యాంక్ (ఫోర్త్ ఇంజనీర్) పరీక్షల కోసం సన్నద్ధమవుతోంది. నాడు హార్మోజ్ జలసంధిలో ఇరుక్కుపోయిన 550 మంది భారతీయులలో హిఫా కథ అత్యంత ప్రత్యేకం. హార్మోజ్ జలసంధిలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. అలాంటి అత్యంత ప్రమాదకరమైన చోట, కేవలం 20 ఏళ్ల ప్రాయంలోనే ‘పాంచ్ సాహెబ్’గా క్షిపణుల మధ్య నిలబడి 23 మంది మగవాళ్లకు భరోసానిచ్చింది. ‘ఆడపిల్లలు సముద్ర ప్రయాణాలకు, మెరైన్ రంగానికి పనికిరారు‘ అనే పాతకాలపు అపనమ్మకాలను హిఫా సలీమ్ తన నమ్మకంతో, ధైర్యంతో సముద్రపు లోతుల్లో ముంచేసింది! -
విజింజం పోర్టులో అదానీ వాటా విక్రయంపై కమిటీ
దేశీయ నౌకాయాన రంగంలో వ్యూహాత్మకమైన విజింజం అంతర్జాతీయ పోర్టులో అదానీ గ్రూప్ తన 49 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత వాటా విక్రయం వల్ల రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేరళ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.రాష్ట్ర ప్రయోజనాలే పరమావధికేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సతీశన్ విలేకరులతో మాట్లాడారు. విజింజం పోర్టు కేరళ ఆర్థిక ప్రగతికి కీలకమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో కథనాలు వచ్చేంత వరకు అదానీ గ్రూప్ తలపెట్టిన ఈ వాటా బదిలీ వ్యవహారం తమ ప్రభుత్వ దృష్టికి రాలేదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ షిప్పింగ్ దిగ్గజం ఎంఎస్సీ గ్రూప్తో అదానీ సంస్థ దాదాపు ఏడాది కాలంగా ఈ వ్యవహారంపై చర్చలు జరుపుతోందనే నిజాన్ని ప్రభుత్వం ఆ తర్వాతే గుర్తించిందని ఆయన వెల్లడించారు.‘వాటా బదిలీకి సంబంధించిన ప్రతిపాదనను అదానీ గ్రూప్ సెబీకి సమర్పించిన రోజే.. ముందస్తుగా రాష్ట్రానికి సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశాం. ఆ తర్వాతే కన్సెషన్ ఒప్పంద నిబంధనల ప్రకారం వాటా బదిలీకి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరుతూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్రభుత్వం వద్దకు వచ్చింది’ అని ముఖ్యమంత్రి అన్నారు.గుత్తాధిపత్యం అసాధ్యంవిపక్ష నేత పినరయి విజయన్ చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి పూర్తిగా కొట్టిపారేశారు. విజయన్ అసలు కన్సెషన్ అగ్రిమెంట్ (రాయితీ ఒప్పందం) చదవకుండానే గుడ్డిగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ డీల్ వల్ల ఎమ్మెస్సీ గ్రూప్ గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. ఏ ఒక్క సంస్థా దీనిపై పూర్తి ఆధిపత్యం చలాయించలేదని సీఎం స్పష్టం చేశారు.కేంద్ర అనుమతులు వస్తేనే డీల్ పూర్తి!ప్రస్తుతానికి వాటా బదిలీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి రాయితీ ఒప్పందాన్ని అదానీ గ్రూప్ ఉల్లంఘించిందని చెప్పలేమని సీఎం వివరించారు. ఈ లావాదేవీ ముగియాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మాత్రమే సరిపోదని.. దీనికి అనేక రకాల భద్రతా, వ్యూహాత్మక కోణాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
Watch Video: కొట్టుకుపోయిన మనుషులు, బస్సులు, లారీలు, ట్యాంకర్లు.. కేరళలో ఊహకందని ఘోరం..
-
వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి
-
వర్ష విలయం.. వయనాడ్ లో విషాదం
-
వయనాడ్: సెకన్ల వ్యవధిలో చావును జయించి..
కల్లాడి (కేరళ): ‘అసలు ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. బురద, నీరు మెరుపు వేగంతో మా వైపు దూసుకురావడం చూసి ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగెత్తాం. ఎంత వేగంగా పరిగెత్తినా, అసలు కదలడం లేదనే భావన కలిగింది. భయంతో కాళ్లు పూర్తిగా సహకరించలేదు’ అని వయనాడ్ సమీపంలోని మేప్పాడిలో సంభవించిన ఘోర కొండచరియల విపత్తు నుండి ప్రాణాలతో బయటపడిన కూడమ్మాల్ ఆ ఘోర ఉదంతాన్ని గుర్తుచేసుకున్నారు. #Video | At least three killed and many feared missing after a major #landslide was reported at #Kalladi near #Meppady in #Wayanad on Tuesday.https://t.co/K2LFCFlrVP pic.twitter.com/BqyYxP4RvG— Deccan Herald (@DeccanHerald) July 7, 2026బ్యాంకుకు వెళ్లే ఉద్దేశ్యంతో బస్సు ఎక్కేందుకు కూడమ్మాల్, ఆమె భర్త స్థానిక బస్టాప్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. బస్ షెల్టర్ వద్ద మరో కొన్ని నిమిషాలు ఉండి ఉంటే, తాము సజీవ సమాధి అయ్యేవాళ్లమని ఆమె పేర్కొన్నారు. మీనాక్షి వంతెన సమీపంలోని ఒక దుకాణంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఈ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతోంది. వంతెనను తాకుతూ బురద, నీరు ఉధృతంగా ప్రవహించడాన్ని అందులో చూడవచ్చు. వారి వెనుకే ఒక భారీ వాటర్ ట్యాంకర్ లారీ బురద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా, దంపతులిద్దరూ ప్రాణభయంతో పరుగెత్తడం ఆ వీడియోలో నమోదైంది. అదృష్టవశాత్తూ, కూడమ్మాల్, ఆమె భర్త ఇద్దరూ ఎటువంటి పెద్ద గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు.ఇది కూడా చదవండి: ముంబై రన్వేపై తృటిలో తప్పిన విమాన ప్రమాదం -
భారీ వర్షాలకు కూలిన మట్టిదిబ్బ
వయనాడ్/తిరువనంతపురం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కేరళలోని వయనాడ్లో భారీ విపత్తుకు కారణమైంది. కోజికోడ్ – వయనాడ్ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన భారీ జంట సొరంగ మార్గం కోసం తవి్వన మట్టి వర్షం కారణంగా అకస్మాత్తుగా జారిపోవడంతో ముగ్గురు మరణించగా పదిమంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వయనాడ్ జిల్లాలోని కల్లడి ప్రాంతంలోని మేప్పడి గ్రామం వద్ద నిర్మాణమవుతున్న మీనాక్షి వంతెన వద్ద మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.కుప్పగా పోసిన మట్టిని తొలగించాలని జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సొరంగం నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను చాలాకాలం క్రితమే హెచ్చరించినా పట్టించుకోక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కేరళ ముఖ్యమంత్రి వి.డి.సతీశన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదో దురదృష్టకర సంఘటన. సహాయక చర్యలు చేపట్టాము’’అని తెలిపారు. వాతావరణ హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనడం సరికాదని సకాలంలో మట్టి తొలగించకపోవడం కారణమని వివరించారు. ఉన్నట్టుండి కుప్పకూలిన మట్టిదిబ్బ... ప్రమాద దృశ్యాలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది... ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం... బ్యారికేడ్లన్నింటినీ తోసేసుకుని మట్టిదిబ్బ అకస్మాత్తుగా కుప్పకూలి పోయింది. ఈ ధాటికి ఒక ట్యాంకర్ లారీ కొట్టుకుపోయింది. అదే సమయంలో ఇంకో ప్రైవేట్ బస్సు నదిలో పడిపోయింది. పాదచారులైతే ప్రాణాలు దక్కించుకునేందుకు పారిపోతూ కనిపించారు. కొందరు మట్టిలో కూరుకుపోగా... మరికొందరు ఇరుగుపొరుగు సాయంతో బయటపడ్డారు. స్నిఫర్ డాగ్ల సాయంతో మట్టిలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.కశ్మీర్లో మెరుపు వరదలు జమ్మూ: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం ఉదయం కొండ ప్రాంతాల నుంచి ప్రవేశించిన వరదతో థాత్రి పట్టణంలో పలు దుకాణాలు, ఇళ్లు, వాహనాలకు నష్టం వాటిల్లింది. భారీగా దొర్లి పడ్డ రాళ్లు, కొట్టుకువచ్చిన మట్టి, వేళ్లతో సహా పెకిలించుకువచ్చిన చెట్లు పట్టణంలో ఎక్కడ చూసినా మేట వేశాయి. థాత్రి పట్టణంలో దోడా–కి‹Ù్తవార్ రహదారి మూసుకుపోయింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాలు పెద్ద సంఖ్యలో మట్టి, బురదలో కూరుకుపోయాయి. మట్టిదోడా, కిష్త్వార్ జిల్లాల్లో రెండు రోజుల వ్యవధిలో ఇలా మూడు చోట్ల మెరుపు వరదలు సంభవించాయి.ప్రాణం దక్కించిన పరుగువయనాడ్లో జరిగిన ప్రమాదం నుంచి దంపతులిద్దరు భలే తప్పించుకున్నారు. మట్టిదిబ్బ కూలే క్రమంలో కట్టలు తెంచుకుని అడ్డంకులను దాటుకుని బురద శరవేగంగా దూసుకొస్తూంటే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పలువురు పరుగురు పెట్టడం వీడియోలో కనిపించింది. అందరి ప్రాణాలు ఆ మట్టిలోనే కలిసిపోతాయని అందరూ అనుకున్నారు.బురద మనుషులతోపాటు ట్యాంకర్ వంటి భారీ వాహనాలను కూడా తనతో ఈడ్చుకెళ్లింది. ట్యాంకర్ కాస్తా బ్రిడ్జికి ఆవల నిలిపిన జీప్ను గుద్దుకోవడమూ కనిపించింది. ఆ దంపతులు కూడా కొట్టుకుపోయారని అందరూ అనుకున్నారు కానీ సెకన్ల తరువాత ఇద్దరూ లారీకి, జీపుకు మధ్య నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ‘‘నిర్మాణం జరిగే చోట బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. అకస్మాత్తుగా మట్టి మావైపు దూసుకొస్తూ కనిపించింది. వంతెనకు అడ్డంగా పరుగెత్తాం. వెనుక నుంచి చుట్టేసిన మట్టి మమ్మల్ని దూరంగా తోసేసింది. ఇద్దరం పడిపోయాం. లారీతోపాటు కొట్టుకుపోతున్నాం.లారీ కింద పడిపోతానేమో అనిపించింది. కానీ దాని పక్కన నుంచి వెళ్లిపోయాం. ప్రాణాలతో ఎలా బయటపడ్డామో ఇప్పటికీ తెలియడం లేదు’’అని బాధిత మహిళ తన భయంకర అనుభవాన్ని వివరించింది. మట్టి కనిపించగానే పరుగు లంకించుకున్నామని, బురదలో కొట్టుకుపోతున్న తమకు లారీ కనిపించలేదని ప్రమాదం నుంచి బయటపడ్డ భర్త తెలిపారు. -
బావిలో పడిన ఏనుగు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
కొచ్చి: కేరళలోని ఎర్ణాకులం జిల్లా మలయాట్టూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఒక అడవి ఏనుగు ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. అయితే, ఈ ప్రాంతంలో తరచూ జరుగుతున్న మానవ- వన్యప్రాణి సంఘర్షణలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అటవీ శాఖ అధికారుల రెస్క్యూ ఆపరేషన్ను అడ్డుకోవడంతో ఏనుగు రక్షణ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.అటవీ శాఖ సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం 5- 6 గంటల మధ్య ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన సిబ్బంది సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి చేరుకున్నారు. కానీ ఈ ప్రాంతంలో అడవి జంతువుల దాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారుల వాహనాలను, సహాయక చర్యలను అడ్డుకున్నారు.ఈ నిరసనల మధ్యే అటవీ శాఖ సిబ్బంది ఏనుగును రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బావి నుంచి ఏనుగు సురక్షితంగా పైకి రావడానికి వీలుగా ఎర్త్మూవర్ సహాయంతో వాలుగా ఉండే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, వీలైనంత త్వరగా ఏనుగును సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్లు శ్రమిస్తున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కేరళ: విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో 50 మంది కార్మికులు!
వయనాడ్: కేరళలోని వయనాడ్ టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో మంగళవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జి సమీపంలో ఉన్న సొరంగం నిర్మాణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 నుంచి 50 మంది వరకు కార్మికులు భూగర్భంలో చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. నిర్మాణ సంస్థకు చెందిన తాత్కాలిక కార్యాలయ కంటైనర్లు, బస్సులు, కార్లు, జెసిబి యంత్రాలు పూర్తిగా మట్టి దిబ్బల కింద పూడుకుపోయాయి.స్థానికులు కొందరు బాధితులను రక్షించి హారిసన్ మలయాళం ఎస్టేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. భారీ వృక్షాలు కూలిపోవడం, సమీపంలోని చిన్న నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది. ముందస్తు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అత్యవసర సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. Several people are feared to be trapped under the debris after a landslide hit Kerala’s Wayanad. The landslide occurred after a portion of the hill caved in at the entrance of the under-construction Kozhikode-Wayanad twin-tunnel road.The incident was reported in the Meenakshi… pic.twitter.com/R0RKO6b3TT— The Indian Express (@IndianExpress) July 7, 2026 -
ఉజ్బెకిస్తాన్లో కేరళ విద్యార్థిని హత్య: మలప్పురం యువకుడి అరెస్ట్
హరిపాడ్: ఉజ్బెకిస్తాన్లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని సవారియా తోటి విద్యార్థి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఉజ్బెకిస్తాన్లో ఉంటున్న మలప్పురంలోని పెరింతల్మన్నకు చెందిన విద్యార్థి సధారుల్ అనామ్ను ఉజ్బెకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.సవారియా, నిందితుడికి మధ్య నాలుగు రోజుల క్రితం ఒక చిన్న వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అనామ్.. సవారియా తలపై ల్యాప్టాప్తో బలంగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ సవారియా మృతి చెందింది.కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఉజ్బెకిస్తాన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మంగళవారం నాటికి సవారియా మృతదేహం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ నుంచి కొచ్చి మీదుగా ఆమె స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కువైట్లో పనిచేస్తున్న సవారియా తండ్రికి అవసరమైన పత్రాలు లభించకపోవడంతో నేరుగా కేరళకు చేరుకోగా, ఆమె బాబాయ్ ఉజ్బెకిస్తాన్ వెళ్లి మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చే ప్రక్రియను పూర్తి చేశారు. మృతురాలికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నారు.ఇది కూడా చదవండి: మూకాంబికా భక్తుల కోసం సురేష్ గోపి డిమాండ్ -
మరో ‘పరీక్ష కుంభకోణం’: సమాధానాలు దిద్దకుండానే ఉద్యోగాలు!
తిరువనంతపురం: స్టేట్ ప్లానింగ్ బోర్డులోని చీఫ్ లెవెల్ పోస్టుల భర్తీకి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) నిర్వహించిన నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై ‘విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో’ (విఏసిబి) చేత దర్యాప్తు జరిపించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. పీఎస్సీ అంతర్గతంగా జరుపుతున్న విచారణపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రాజ్యాంగబద్ధమైన పీఎస్సీపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించడంలో ఏవైనా చట్టపరమైన చిక్కులు ఉన్నాయా అనే కోణంలో హోంశాఖ న్యాయ సలహా కోరింది. తదుపరి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్లానింగ్ బోర్డు పరిధిలోని మూడు విభాగాల పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఉమ్మడి పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో 10 సమాధానాలను అసలు పరిశీలించనే లేదని పీఎస్సీ స్వయంగా అంగీకరించింది. అప్పటికే రెండు పోస్టులకు సంబంధించిన ర్యాంక్ జాబితాలు విడుదలై, ఇద్దరు అభ్యర్థులు విధుల్లో చేరిపోవడం గమనార్హం.కేరళ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో దాఖలైన ఒక ఫిర్యాదుతో ఈ ఘోర తప్పిదం వెలుగుచూసింది. దీంతో పరీక్ష రాసిన 200 మందికి పైగా అభ్యర్థుల సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి, ర్యాంక్ జాబితాలను సవరిస్తామని పీఎస్సీ ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీనితో పాటు ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కేఏఎస్ వంటి పలు ఇతర నియామకాలపై కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందడంతో, వాటన్నింటినీ విజిలెన్స్ దర్యాప్తునకు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఇది కూడా చదవండి: ఎన్కౌంటర్లో ఇద్దరు బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లు హతం -
ఏనుగు దంతాల వివాదం: చిక్కుల్లో మోహన్ లాల్
కొచ్చి: కేరళ ప్రభుత్వ వన్ టైమ్ అమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం కింద తన వద్ద ఉన్న ఏనుగు దంతాలను డిక్లేర్ చేయడానికి, తద్వారా చట్టపరమైన చర్యల నుండి మినహాయింపు పొందడానికి నటుడు మోహన్లాల్ కేరళ అటవీ శాఖను ఆశ్రయించినట్లు ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది. ఇటీవల ఒక సీనియర్ అటవీ శాఖ అధికారి కొచ్చిలోని మోహన్లాల్ నివాసానికి వెళ్లి, వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 లోని సెక్షన్ 41 ప్రకారం విచారణ జరిపినట్లు సమాచారం. ఈ విచారణలో భాగంగా, ఆ ఏనుగు దంతాలను ఆయన ఎలా సేకరించారు? వాటి వయసు ఎంత? అంతకుముందు వాటిని ఎందుకు డిక్లేర్ చేయలేదు? అనే అంశాలపై మోహన్లాల్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.యాజమాన్య పత్రాలను రద్దు చేసిన హైకోర్టుమోహన్లాల్ వద్ద ఉన్న ఏనుగు దంతాలకు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ 2025 అక్టోబర్లో రద్దు చేసింది. అలాగే ఆయన వద్ద ఏనుగు దంతాలు ఉండటాన్ని చట్టబద్ధం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు కొట్టివేసింది. 2015 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ అధికారిక గెజెట్లో ప్రచురించలేదని, ఈ విధానపరమైన లోపం కారణంగానే ఆ యాజమాన్య ధృవీకరణ పత్రాలు, లైసెన్స్కు చట్టబద్ధత లేకుండా పోయిందని కోర్టు పేర్కొంది.అయితే ఇలాంటి వన్యప్రాణి వస్తువులు కలిగి ఉన్నవారు వాటిని డిక్లేర్ చేసి, మినహాయింపు పొందేలా వన్ టైమ్ అమ్నెస్టీ పథకాన్ని ఉపయోగించుకోవచ్చని హైకోర్టు బెంచ్ అప్పట్లో అభిప్రాయపడింది. హైకోర్టు యాజమాన్య పత్రాలను రద్దు చేసినప్పటికీ, అక్రమంగా ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అటవీశాఖ మోహన్లాల్పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఈ తరుణంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.కొనసాగుతున్న న్యాయపోరాటంమోహన్లాల్పై ఉన్న ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మోహన్లాల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న క్రిమినల్ విచారణను ఎత్తివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉంది. -
కదిలొచ్చిన దేవతలు
రోడ్డంతా ట్రాఫిక్ జామ్. వాహనాలు అంగుళం కూడా కదలడం లేదు. ఆ సమయంలో ఓ కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి చేరుకునే ప్రయత్నంలోనే ఆయన స్పృహ కోల్పోయాడు. చుట్టూ ఉన్నవారికి ఏం చేయాలో అర్థం కాక అయోమయం నెలకొంది. కారులో ఉన్నవాళ్ల కేకలు.. ఆర్తనాదాలు. ఏ దేవుళ్లను తల్చుకున్నారో.. ఏమో ఇద్దరు యువతులు హఠాత్తుగా అక్కడ దర్శనమిచ్చారు. ఆ వ్యక్తిని రక్షించారు.హృదయాన్ని కదిలించే ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం థన్నిపుజ సమీపంలోని ఒక్కల్ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల సినోజ్ కారులో కుటుంబంతో వెళ్తుండగా.. తీవ్ర ఛాతినొప్పి వచ్చింది. అలా తానే నడిపించుకుంటూ కారులోనే ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే కలాడి వంతెన సమీపంలో భారీ ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు. నొప్పి మరింత పెరగడంతో కారులోనే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. అదే సమయంలో పక్కనే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు నర్సులు ఆ పరిస్థితిని గమనించారు. వెంటనే బస్సు దిగి కారువద్దకు పరుగెత్తారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా సినోజ్కు సీపీఆర్ ప్రారంభించారు. అంతటితో ఆగలేదు. సినోజ్ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న కారులోనే నిరంతరం సీపీఆర్ కొనసాగించారు. దీంతో ఆస్పత్రికి చేరేసరికి ఆయనలో మళ్లీ కదలిక వచ్చింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమని పూర్తిగా బ్లాక్ కావడంతో.. వెంటనే అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించి వైద్యులు రక్షించారు. సకాలంలో సీపీఆర్ చేసి సినోజ్ ప్రాణాలు కాపాడినందుకు వైద్యులు ఆ ఇద్దరినీ అభినందించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ల పేర్లు అంజలి బైజు, ఆర్ధ్ర రాజ్. అంజలి అంగమాలిలోని ఎల్ఎఫ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తోంది. ఆర్ధ్రరాజ్ ఏమో బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి. ఈ మొత్తం ఎపిసోడ్లో.. స్థానికుల పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. సినోజ్కు గుండెనొప్పి వచ్చిందని తెలుసుకున్న ఓ వ్యక్తి వెంటనే ఆ కారు స్టీరింగ్ చేపట్టి ఆస్పత్రి వైపు నడిపించాడు. మరికొందరు ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో సహకరించగా, ఇంకొందరు అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేశారు. అందరి సమిష్టి సహకారంతో విలువైన సమయం ఆదా కావడంతో ఒక ప్రాణం నిలిచింది. వైద్య వృత్తి అంటే ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా అని అంజలి, ఆర్ద్ర మరోసారి నిరూపించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. సరైన సమయంలో అందించిన సీపీఆర్ ఒక మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడగలదో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపించింది. -
లాటరీ టిక్కెట్ల దొంగ అరెస్ట్.. దివ్యాంగుల హర్షం!
త్రిసూర్: కేరళలోని త్రిసూర్ జిల్లాలో దివ్యాంగులైన లాటరీ విక్రేతలను మోసం చేసి, డబ్బులు చెల్లించకుండా లాటరీ టిక్కెట్లతో పరారైన 57 ఏళ్ల వ్యక్తిని అంతికాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడని చొవ్వల్లూరుకు చెందిన కబీర్గా గుర్తించారు. గురువాయూర్లో పోలీసులు కబీర్ను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 21న ఉదయం అంతికాడ్కు చెందిన దివ్యాంగులైన నటరాజన్, ప్రియ అనే ఇద్దరు లాటరీ విక్రేతల వద్దకు నిందితుడు కస్టమర్గా వచ్చి ఈ మోసానికి పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కబీర్ స్కూటర్పై వచ్చి, టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి వారి నుండి లాటరీ టిక్కెట్లను సేకరించాడు. ఆ తర్వాత వాటికి డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుండి స్కూటర్పై వేగంగా పరారయ్యాడు. బాధితుడైన నటరాజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అంతికాడ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో సేకరించిన సమాచారంతో నిందితుడిని గురువాయూర్లో గుర్తించి అరెస్ట్ చేశారు. అంతికాడ్ సబ్-ఇన్స్పెక్టర్ విష్ణు నేతృత్వంలోని పోలీస్ బృందం అతనిని అదుపులోనికి తీసుకుంది. నిందితుడు కబీర్ గతంలోనూ ఇదే పద్ధతిలో లాటరీ విక్రేతలను లక్ష్యంగా చేసుకుని టిక్కెట్లు దొంగిలించేవాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. -
నైవేద్యం ఆలస్యమైతే కరిగిపోయే విగ్రహం!.. ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?
ఆకలి.. జీవులకు ఓ గొప్ప వరం.. ఒక్కోసారి అదే పెద్ద శాపం! ‘క్షుధాతురాణాం న రుచి న పక్వమ్’ అన్నారు పెద్దలు. అంటే ఆకలి వేసినప్పుడు రుచులు, పక్వాలు చూడరని అర్థం. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని శంకరుల వారే చెప్పారు. కానీ.. ఈ ఆకలికి ఆ దేవుడు అతీతుడా? అసలు దేవుడికి కూడా తీవ్రమైన ఆకలి వేస్తుందా? గ్రహణం పడితే ప్రపంచంలో ఏ గుడైనా మూసేస్తారు.. కానీ, గ్రహణ సమయంలో కూడా ఆకలి తట్టుకోలేక, నైవేద్యం స్వీకరించే వింత దేవుళ్లు ఎక్కడైనా ఉన్నారా?మన దేశంలోని కొన్ని పురాణ క్షేత్రాలు... 'అవును.. దేవుడికి కూడా ఆకలి వేస్తుంది!' అని నిరూపిస్తున్నాయి. ఒక్క 10 నిమిషాలు నైవేద్యం ఆలస్యమైతే చాలు.. అక్కడ దేవుడి విగ్రహం ఆకలితో చిక్కిపోతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాలా నిజం! ఆ అద్భుత క్షేత్రాల రహస్యాలు ఏంటో తెలుసా?గ్రహణం అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దేవాలయాల తలుపులను మూసివేయడం.. గ్రహణం విడుపు తర్వాత శుద్ధి కార్యక్రమాలు జరిపి, నిత్య సేవలను ప్రారంభించడమే..! కానీ, కొన్ని ఆలయాల్లో దేవుడి ఆకలి కారణంగా.. గ్రహణ సమయంలోనూ ఆలయాల తలుపులు తెరుచుకునే ఉంటాయి. కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఈ కోవలో ముందంజలో ఉంటుంది. ఇక్కడ కొలువుదీరిన కన్నయ్యకు ఆకలి చాలా ఎక్కువ. రోజుకు 10 సార్లు నైవేద్యం పెడతారు. అంతేకాదు.. ఈ ఆలయంలోని గర్భగుడి వెలుపల పెద్ద గొడ్డలి ఉంటుంది. ఉదయం ఆలయం తెరవడానికి తాళం మొరాయిస్తే.. దాన్ని ఈ గొడ్డలితో పగులగొట్టి మరీ.. దేవుడి ఆకలిని తీర్చేలా వెనువెంటనే నైవేద్యాలు పెడతారు. ఈ ఆలయంలో 10 నైవేద్యాల్లో ఏ ఒక్కటి తగ్గినా.. స్వామివారు సన్నబడతారట..! సైన్స్కు కూడా ఈ వింత అంతుచిక్కలేదట..! అందుకే.. ఇక్కడి పూజారులు గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. స్వామివారు ఆకలిని తట్టుకోలేరనే ఉద్దేశంతో.. గ్రహణ పట్టు.. విడుపులతో సంబంధం లేకుండా నైవేద్యం సమర్పిస్తారు.రాజస్థాన్లోని బికనీర్లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంచుతారు. ఓసారి ఇక్కడి ఆలయాన్ని గ్రహణ సమయంలో మూసివేస్తే.. స్వామివారు ఆ పక్కనే ఉన్న మిఠాయి దుకాణం వ్యాపారి కలలోకి వచ్చి.. ‘‘నాకు చాలా ఆకలిగా ఉంది’’ అని చెప్పారట. అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి క్షేత్రంలో శివలింగం స్వయంభూ. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడు నవగ్రహాలను, 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. ఆయనకు గ్రహాలను శాసించే స్వామిగా పేరుంది. అలాంటి స్వామికి గ్రహణ దోషం ఎందుకుంటుంది? అందుకే.. ఇక్కడ గ్రహణ సమయంలో రాహు-కేతులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఉజ్జయినిలోని మహాకాళుడికి కాలాతీతుడు.. అంటే కాలానికి అతీతుడు అనే పేరుంది. అందుకే.. ఈ స్వామివారికి గ్రహణ ప్రభావం అంటదు. గ్రహణ సమయంలో ఈ జ్యోతిర్లింగ దర్శన సమయాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఇక దివి నుంచి భువికి గంగాప్రవాహం వచ్చేప్పుడు.. ఆ ఉధృతిని తన జటాజూటంతో నిర్బంధించిన శివుడు ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయంలో కొలువుదీరాడు. ఈయనకు కూడా గ్రహణ సమయంలో పూజలు ఆగవు. ఇక ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో అమ్మవారు కల్కాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె సాక్షాత్తూ కాలచక్రానికే అధిపతి. అంటే.. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయి. అందుకే.. గ్రహణ ప్రభావం అమ్మవారిపై ఉండదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక గయలోని విష్ణుపాద ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. ఇక్కడ గ్రహణ సమయంలో పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. -
కేరళ లాటరీపై ‘కాగ్’ సంచలన నివేదిక
కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే కేరళ స్టేట్ లాటరీ డిపార్ట్మెంట్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రికార్డు స్థాయిలో టికెట్ల విక్రయాలు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే అసలు లాభాలు (నికర రాబడి) క్రమంగా తగ్గిపోతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా ఆడిట్ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు అంతర్గత లోపాలు ఈ అదృష్ట వ్యాపారాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి.ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుకేరళ రాష్ట్ర పన్నేతర ఆదాయంలో లాటరీ విభాగం ఇప్పటికీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మొత్తం పన్నేతర ఆదాయంలో ఈ శాఖ నుంచే ఏకంగా 76.66 శాతం లభించడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అంతేకాకుండా, 2024-25 నాటికి లాటరీ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం రాబడి రూ. 12,711.18 కోట్లకు చేరుకుంది.జీఎస్టీ రూపంలో భారీ పన్నులుఈ లాటరీ కేవలం రాష్ట్ర ఖజానాను నింపడమే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయాన్ని కూడా సమకూరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే లాటరీ విక్రయాల ద్వారా మొత్తం రూ. 3,559.34 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి నేరుగా ఆదాయాన్ని అందించే ఒక ద్వంద్వ ప్రయోజన ఆర్థిక వనరుగా నిలిచింది.తగ్గిన నికర లాభాలుటికెట్ల అమ్మకాలు భారీగా పెరిగినప్పటికీ, ప్రభుత్వం చేతికి వచ్చే నికర లాభం (Net Yield) మాత్రం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లాటరీ ద్వారా వచ్చిన నికర లాభం రూ. 140.51 కోట్లు తగ్గింది. పెరిగిన అమ్మకాలతో సంబంధం లేకుండా లాభాల శాతం క్షీణించడం వెనుక నిర్వహణ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.బహుమతులు, కమీషన్ల భారంలాభాలు తగ్గడానికి గల కారణాలను పరిశీలిస్తే, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఇచ్చే బహుమతి మొత్తం, ఏజెంట్ల నెట్వర్క్ను నిలబెట్టేందుకు ఇచ్చే కమీషన్లు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైజ్ మనీ, కమీషన్ల కోసం డిపార్ట్మెంట్ ఏకంగా రూ. 11,721.98 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నా, ప్రభుత్వానికి దక్కే వాటా మాత్రం స్వల్పంగానే ఉంటోంది.భారీ వర్షాలు, మెషిన్ల కొరతకేరళ లాటరీ ఆదాయ వృద్ధి రేటు గతంలో నమోదైన 5.36 శాతం నుండి ఒక్కసారిగా 1.44 శాతానికి పడిపోయింది. ఈ మందగమనానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలేనని అధికారులు పేర్కొన్నారు. దీనికి తోడు కొత్త లాటరీ సిరీస్లను ప్రారంభించడానికి అవసరమైన డ్రాయింగ్ మెషిన్ల కొరత కూడా అమ్మకాల విస్తరణకు ప్రతిబంధకంగా మారింది.ఆడిట్ లోపాలు, నిధుల దుర్వినియోగంఆర్థిక పరమైన సవాళ్లతో పాటు, శాఖలోని పరిపాలనా లోపాలను కూడా ‘కాగ్’ ఎండగట్టింది. జూన్ 2024 నాటికి రూ. 7.30 కోట్లకు సంబంధించిన 77 ఆడిట్ పారాగ్రాఫ్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిపై కనీసం ఒక్క సమీక్షా సమావేశం కూడా జరగలేదు. అంతేకాకుండా, గత 15 ఏళ్లుగా రూ.49.03 లక్షల నిధుల దుర్వినియోగం కేసు ఇప్పటికీ పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోవడం అంతర్గత పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తోంది.ఇది కూడా చదవండి: ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్ బి’! -
చిప్పలు చెప్పే కథ
వేసవొస్తే కొబ్బరి నీళ్లకు యమగిరాకీ ఉంటుంది. వీధి చివరన, హైవే రోడ్ల మీద, మార్కెట్ యార్డుల దగ్గర.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బోండాలు ఎడాపెడా తాగేసి ఖాళీ చేసి పడేస్తాం. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. అయితే తాగి పడేసిన ఖాళీ బోండాల గురించి మాత్రం ఆలోచించం. కాని కేరళకి చెందిన ఓ అమ్మాయి ఆలోచించింది. పనికిరాని చెత్త అనుకున్న కొబ్బరి చిప్పలను కళాకృతులుగా మలిచింది. ఉపయోగం లేదనుకున్నవాటినే ఉపాధిగా ఎంచుకుంది. బ్యాక్ టు హోం...కేరళలోని పాలక్కాడ్కు చెందిన మరియా కురియాకోస్ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేయడానికి ముంబై వెళ్లింది. ఆ తర్వాత స్పెయిన్లో ఎంబీఏ చేసింది. కార్పొరేట్ రంగంలో రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత ఆమెకు ఏదైనా భిన్నంగా చేయాలి, ఏం చేసినా సొంతంగా గుర్తింపు పొందేలా ఉండాలి అని నిర్ణయించుకుంది. ప్రకృతి జీవవైవిధ్యాన్ని దెబ్బతీయకుండా సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా వ్యాపారం చేయాలని తన స్వస్థలానికి చేరుకుంది.‘తేంగా కోకో’ ప్రారంభం...తొలుత మరియా కొబ్బరి ఆకులతో చిన్నచిన్న ఉత్పత్తులను మొదలుపెట్టింది. అయితే ఆ వ్యాపారం ఆశించినంతగా ప్రాచుర్యం పొందలేదు. కాని ఒకరోజు ఇంట్లో కొబ్బరి చిప్పలను చూసి ఒకదానిని తీసుకుని శుభ్రం చేసింది. సాల్ట్ పేపర్తో బ్రష్ చేసి దానిపై కాస్త ఆయిల్ వేసి రబ్ చేయగా ఆ కొబ్బరి చిప్ప ఓ కళాకృతిలా మరియాకి అనిపించింది. తన తండ్రికి చూపించగా ఆయన కూడా ‘వావ్’అనడంతో కొబ్బరి చిప్పల కళాకృతుల కోసం ‘తేంగా కోకో’ అనే సంస్థను 2019లో ప్రారంభించింది.విదేశాలకు ఎగుమతి...ప్రస్తుతం తేంగా కోకో ఉత్పత్తులు ఇటలీ, స్పెయిన్, బల్గేరియా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతున్నాయి. హోటళ్లు, రీసార్టులు, కార్పొరేట్ గిఫ్టింగ్ సంస్థలు, రెస్టారెంట్లు ఈ కంపెనీ చెందిన సుమారు 110 రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ వార్షిక ఆదాయం రూ.3.5 కోట్లకు పెరిగింది. వచ్చే ఏడాదికి ఈ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మరియ పేర్కొంది. చిన్న ఆలోచనతో ప్రకృతికి ఏమాత్రం హాని కలగకుండా... పర్యావరణానికి మేలు చేసే వ్యాపారం ఒకవైపు, సంప్రదాయ కళావృత్తులకు జీవం పోసిన వైనం మరోవైపు... రెండింటినీ సాధించి చూపించిన మరియ ప్రతిభ ప్రశంసనీయమని సోషల్ మీడియా సాక్షిగా దేశవిదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు ఉపాధికొబ్బరి చిప్పలతో కళాకృతులు తయారుచేసే సంప్రదాయ కళాకారులు కేరళలో ఉన్నప్పటికీ, ప్లాస్టిక్, మెటల్ వస్తువుల రాకతో వారికి సరైన మార్కెట్ లేదు. దీంతో మరియా అలాంటివారిని వెతికి పట్టుకుంది. టీ కప్పులు, స్మూతీ బౌల్స్, సర్వింగ్ స్పూన్లు, ఇతర అలంకరణ వస్తువులను తయారుచేసేలా వారికి అవగాహన కల్పించింది. మెల్లగా తెంగా కోకో ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో మరింతమంది కళాకారులను చేరదీసి 2024లోపాలక్కాడ్ జిల్లా సరిహద్దులో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విషయమేమిటంటే ఇక్కడ పని చేసేవారంతా మహిళలే. -
ఘోర ప్రమాదం చిన్నారులపై టిప్పర్ బోల్తా
-
లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్
కేరళలోని తిరువనంతపురంలోని కిలిమనూర్ వద్ద MC రోడ్డు వద్ద క్షణాల్లో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ట్రక్బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల తోపాటు, తండ్రి కూడా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారురోడ్డు పక్కన నిలిపిన కారు నుండి ఓ మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తునాతునాకలైపోయింది. కానీ కారులో ఉన్న వారిద్దరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఈ భయంకరమైన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.जाको राखे साइयाँ मार सके ना कोईA mother and child had a miraculous narrow escape📍KERALA pic.twitter.com/gYmHVUg1zx— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 22, 2026 నిజంగా లక్ అంటే వీరిదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను ట్రక్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..? -
కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే
-
మహా శివమ్: చెంగల్ శివ పార్వతి క్షేత్రం
మహేశ్వరా! మహాశివా పరమ శివా అని ఈశ్వరుని ఆరాధిస్తాం. అంటే మహాపర్వతం మీద వాసం ఉండేవాడు అని అర్ధం. అంతటి మహాశివుడికి పెద్ద మహా శివాలయాన్ని కేరళలో నిర్మించారు. నిరూపధారిగా లింగ రూపంలో మహా మహా రుద్రాలను తనలో ఆవహించుకున్న మహాదేవుడు లోక రక్షకుడు పరమ శివుడు. మన పుణ్యభూమిలో పలుచోట్ల జ్యోతిర్లింగాలు... ఆత్మలింగాలుగా కొలువుదీరాడాయన. అలాంటి మహాలింగం కేరళలో నిర్మించారు.కేరళ రాజధాని తిరువనంతపురానికి దగ్గర నెయ్యాటింకర అనేప్రాంతంలో ఉంది. నూట పదకొండు అడుగుల ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్టించారు.అక్కడ ఎనిమిది అంతస్థులలో మన దేశంలోకెల్ల పెద్ద శివ క్షేత్రం. దీని పేరు చెంగల్ శివ పార్వతి క్షేత్రం. ఈ స్థల మహాత్మ్యం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ రెండు సార్లు అతి రుద్ర యజ్ఞం చేశారు. అలాగే మరెన్నో సార్లు అతిరుద్ర యజ్ఞం చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఒకసారి అతి రుద్ర మహా యజ్ఞం చేయడమే గొప్ప విషయం. చెంగల్ శివ పార్వతి క్షేత్రం ఉన్న ప్రదేశం ఎంతో పుణ్యభూమిగా భావిస్తారు.ఈ స్థలానికి ఉండే మహత్వాన్ని గమనించి స్వామి మహేశ్వరానంద సరస్వతి ఈ మహా శివలింగ ప్రతిష్ట కోసం పూనుకున్నారు. వీరికి కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి మంత్ర దీక్ష ఉపదేశించారు. ఈ పుణ్యస్థలం పేరు పుట్టురాకల్. ఇక్కడే శివపార్వతులు పుట్టరూపంలో వెలిశారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో దొరికిన ఆధారాల వలన దేవాలమం 5 వేల ఏళ్ళ పురాతనమైనది అని తెలిసింది. దేశం నలుమూలల నుంచి మట్టి, పవిత్ర నదీ జలాలు వనమూలికలు తెచ్చి నిర్మించారు. మూలాధారంగా వినాయకుడు సరస్వతి బ్రహ్మ రూపాలను ప్రతిష్టించారు. మొదటి అంతస్థు భూ మట్టానికి కింద నిర్మించారు.64 మహారూపాలలో శివుని విగ్రహాలను ఉంచారు. భక్తులు కూర్చుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు అలాగే ప్రతి అంతస్థులో ఓంకారనాదం వినిపిస్తుంటుంది. పంచభూతాలు తనలో ఇమిడి ఉన్నట్టుగా ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఏడవ అంతస్తులోకి వెళితే కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది మనకి. సహస్రదళ పద్మాకృతి కింద శివ పార్వతి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలోకి వెళ్లడం మనస్సుకి ప్రశాంతంగా ఉండడం గమనించవచ్చు. కింద అంతస్థులో శివలింగ ప్రతిష్ట ఉంది ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల భావన కలిగిన శివ ప్రతిష్ట అద్భుతం. శివపార్వతుల తనయునికి ఇక్కడ చాలప్రాధాన్యత ఉంది. అందుకే 32 విఘ్నేశ్వర రూపాల ప్రతిష్ట ఉంది. బాల గణపతి నుండి యోగ గణపతి వరకు ఉన్న రూపాలకి నిత్యపూజలు జరిపే దేవాలయం ఇక్కడ మాత్రమే ఉంది.అసామాన్య శిల్పకళాచాతుర్యంమహాబలి పురం నుండి వచ్చిన శిల్పుల కళాచాతుర్యం ఇక్కడ ఉన్న విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. రుద్రుడు అంటేనే మానవ కష్టాలను హరించేవాడు అని అర్ధము. మహా రుద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతి రుద్ర మహా యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేయడం నిజంగా ఎంతో మహత్తర విషయం. పదకొండు రోజులపాటు 121 మంది వేద పండితులు 121 కలశాలతో అభిషేకం, పదకొండు సార్లు రుద్రా మంత్రం జపిస్తే ఫలప్రాప్తి కలుగుతుంది .అటువంటిది రెండుసార్లు జరగడం శివుని శక్తికి నిదర్శనం అని నమ్ముతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా భావంతో ఇక్కడకు భక్తులు వస్తుంటారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంచెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం 111.2 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివలింగం గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇంతకుముందు, కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలోని 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైనది గా ఉండేది.10 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 లోప్రారంభమైంది, దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. దాని ఎత్తు మాత్రమే కాదు, దాని విశిష్టమైన స్థూపాకార నిర్మాణం, దానిలోపల దాగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యాలు కూడా చూడటానికి ఒక అద్భుతం.కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాసం వంటి వివిధ పుణ్యక్షేత్రాల నుండి నీరు, ఇసుక, మట్టిని కూడా నిర్మాణ సామగ్రిలో కలిపారు. అందువల్ల, చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం ఒక దైవిక నిర్మాణంగా భావిస్తారు. ఈ కట్టడంలో 8 అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఆరు అంతస్తులు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తికేంద్రాలకుప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ అంతస్తులలో భక్తులు, యాత్రికులు, పర్యాటకులు ఆయా చక్రాలపై ధ్యానం చేయడానికి 6 ధ్యానమందిరాలు ఉన్నాయి. ఈ కట్టడం మొదటి అంతస్తులో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.భక్తులు మహా శివలింగంలోకి ప్రవేశించవచ్చు. ఈ శివలింగం లోపల, శివలింగం విశ్వ ప్రభావాన్ని అనుభవించడంతో పాటు, శరీరంలోని చక్రాల శక్తిని పెంచుకోవడానికి ధ్యానం కూడా చేయవచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి
తిరువనంతపురం: కేరళ సీఎం వీడీ సతీషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలకు సంబంధించిన సిలబస్ రూపకల్పణలో పూర్తి హక్కులు రాష్ట్రాలకే ఉంటాయన్నారు. ఈ అంశంలో కేంద్రానికి ఎటువంటి జోక్యం ఉండకూడదన్నారు. పీఎం శ్రీపథకంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారుకేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం శ్రీ స్కూళ్ల పథకంపై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రత్యేక కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ" పాఠశాలల పాఠ్యప్రణాళికను నిర్ణయించే రాష్ట్రాల స్వేచ్ఛలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అనుమతించబోము, పాఠశాలల సిలబస్ను నిర్ణయించే రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు" అని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం పీఎం శ్రీ ఒప్పందంపై సంతకం చేసి, కేంద్రం నుంచి రూ. 99 కోట్ల నిధులను సైతం స్వీకరించిందని అందుకోసమే ఈ పథకంలో కొనసాగుతున్నామని తెలిపారు.పీఎంశ్రీపీఎం శ్రీ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి, ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. అయితే ఈ పథకం వల్ల జాతీయ విద్యా విధానం అమలుపై వ్యతిరేకత దక్షిణాదిన పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత ఎదురవుతోంది. హిందీని బలవంతంగా బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు, కేరళ లాంటి పలు రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీని ద్వారా మాతృభాషకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి మరోసారి ఈ అంశంపై చర్చ లేవనెత్తారు. -
రేపు అర్జెంటీనా మ్యాచ్.. కేరళలో మెస్సీ మేనియా!
ఫిఫా ప్రపంచకప్-2026లో బుధవారం డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ను ఆడనుంది. గ్రూప్-ఐలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్లో అల్జీరియాతో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రేపు ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. మెస్సీ ఆఖరి ఫిఫా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతడి ఆట కోసం ప్రపంచం మొత్తం వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. భారత్లో కూడా మెస్సీకి వీరాభిమానులు ఉన్నారు. కేరళలో మెస్సీ అంటే పడిచచ్చిపోయేవాళ్లు లెక్కలేనంత మంది ఉంటారు. అసలే ఫిఫా ప్రపంచకప్, ఆపై డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో అర్జెంటీనా బరిలోకి దిగుతుండడంతో కేరళలో ఫిఫా కళ వచ్చేసింది. ముఖ్యంగా కేరళలోని పుల్లవూర్ గ్రామంలో మెస్సీ మేనియా మాములుగా లేదు. ఆ ఊర్లో ఎక్కడ చూసినా ఫుట్బాల్ ఆటగాళ్ల కటౌట్లే కనిపిస్తాయి. ఇక్కడ మెస్సీ అభిమానులే కాదు రొనాల్డో, నెయ్మర్, ఎంబాపె, సాలా, లామినే యమాల్ వంటి ఆటగాళ్లకు కూడా విపరీతమైన ఆదరణ ఉంది. అక్కడి ఇళ్లకు కూడా ప్రజలు తమకిష్టమైన జట్ల రంగులను పెయింటింగ్ వేసుకోవడం విశేషం. ఇక రేపు అర్జెంటీనా మ్యాచ్ ఉండడంతో ఆ జట్టు అభిమానులు పుల్లవూరు గ్రామంలో ఉన్న నది మధ్యలో ప్లోటింగ్ బోర్డుపై అర్జెంటీనా జట్టు మొత్తాన్ని కటౌట్ల రూపంలో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మొత్తం మీద ఫిఫా ప్రపంచకప్ మేనియా ఇప్పుడు భారత్లో కూడా టాప్ గేర్కు చేరుకున్నట్లయింది. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్ను షూటౌట్లో ఓడించి మూడోసారి ఫిఫా టైటిల్ను కైవసం చేసుకుంది.Frome Viral Kerala #Argentina pic.twitter.com/PLUUUWK9Fc— FIFAHighlightsTV (@Worldcupcatcher) June 13, 2026అసలు సమరం మొదలు..మరో విషయమేంటంటే.. బుధవారం ఒక్కరోజే ముగ్గురు బిగ్స్టార్స్ మ్యాచ్లు ఆడనుండడంతో ఫిఫాలో అసలు సమరం మొదలుకానుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్రాన్స్, సెనెగల్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత ఉదయం 6.30 గంటలకు మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అల్జీరియాతో తలపడనుంది. ఇక అదే రోజు రాత్రి 10.30 గంటలకు పోర్చుగల్ కాంగో రిపబ్లిక్తో తలపడనుంది. ఇలా త్రిమూర్తులు ఒకేరోజు మ్యాచ్ ఆడనుండడంతో అభిమానుల్లో ఎనలేని జోష్ వచ్చింది.చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్! -
కేరళ: 3,125 బస్సుల్లో ఉచిత సేవలు షురూ!
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్జెండర్లకు కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ)ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించే ‘ప్రియదర్శిని’ పథకాన్ని సోమవారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తిరువనంతపురంలోని తంబానూర్ బస్ టెర్మినల్లో ఈ పథకాన్ని ప్రారంభించి, మహిళా ప్రయాణికులకు సరికొత్త కానుకను అందించారు.ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభంఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర రాజధానిలో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ రిబ్బన్ కట్ చేసి, ఈ సేవలను ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు వీలుగా, కేరళవ్యాప్తంగా ఉన్న అన్ని కేఎస్ఆర్టీసీ డిపోల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమాలను సైతం నిర్వహించారు. VIDEO | Kerala: Chief Minister VD Satheesan formally inaugurates the state government’s flagship ‘Priyadarshini’ free travel scheme for women and transgender individuals.This scheme is part of the UDF government’s ‘Indira Guarantee’ initiative that opens up free transit across… pic.twitter.com/r8ABPsSSS8— Press Trust of India (@PTI_News) June 15, 2026గుర్తింపు కార్డులు అవసరం లేదుఈ పథకానికి సంబంధించి రవాణా సంస్థ నిబంధనలను వెల్లడించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందడానికి మహిళలు లేదా ట్రాన్స్జెండర్లు ఎలాంటి గుర్తింపు కార్డులను చూపించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రయాణం ఉచితమే అయినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య, రికార్డుల కోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ‘జీరో-ఫేర్’ టికెట్ను మాత్రం తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, పథకం అధికారికంగా ప్రారంభమైన సమయం నుంచే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.3,125 బస్సుల్లో ఉచిత సేవలుప్రస్తుతానికి కేరళ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న 3,125 కేఎస్ఆర్టీసీ సాధారణ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు ఈ బస్సులను సులభంగా గుర్తించేందుకు వీలుగా, వీటికి ప్రత్యేకంగా ‘ప్రియదర్శిని’ అనే స్టిక్కర్లను కూడా అంటించారు. కేరళ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా లోకం నుంచి హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఈ పథకంపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ బస్సుల యూనియన్ల నుంచి సమ్మె హెచ్చరికలు కూడా వస్తున్నాయి. -
కేరళలో ‘నిపా’: తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్
చెన్నై: పొరుగు రాష్ట్రమైన కేరళలోని కోజికోడ్లో నిపా వైరస్ అనుమానిత కేసు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి వ్యాపించకుండా నిరోధించేందుకు కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని నీలగిరి జిల్లా యంత్రాంగం నిఘా చర్యలను చేపట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య నిరంతరాయంగా జరిగే రాకపోకల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్తగా సరిహద్దులను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలునీలగిరి జిల్లా కలెక్టర్ లక్ష్మి భవ్య తన్నేరు ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. తాళూర్, నాడుగని, నంబియార్కున్ను, సోలాడి, పట్టవాయల్ వంటి కీలక సరిహద్దు చెక్పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించారు. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులలో నిపా వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అని నిశితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపార, ఉపాధి నిమిత్తం ప్రతిరోజూ కేరళకు వెళ్లి వచ్చే సరిహద్దు గ్రామాల ప్రజలు, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.ఆస్పత్రులకు అత్యవసర ఆదేశాలుపరిస్థితిని అదుపులో ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రులను యంత్రాంగం అప్రమత్తం చేసింది. నిపా వైరస్ లక్షణాలతో కూడిన ఏ ఒక్క అనుమానిత కేసు వచ్చినా, వెంటనే ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలని వైద్య సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేరళ నుండి వచ్చే వారికి జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే స్వచ్ఛందంగా వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ఆందోళన చెందవద్దుతమిళనాడులో ఇప్పటివరకు ఎలాంటి నిపా వైరస్ ముప్పు నిర్ధారణ కాలేదని, ఈ చర్యలన్నీ కేవలం ముందస్తు జాగ్రత్తలు మాత్రమేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆమె కోరారు. కేరళలో మారుతున్న పరిస్థితులను తాము నిరంతరం సమీక్షిస్తున్నామని, జిల్లా యంత్రాంగం ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉందని తెలిపారు.ఇది కూడా చదవండి: నోయిడా ఎయిర్పోర్ట్: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం.. -
పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్ సివిల్స్ విజయగాథ..!
ఎన్నో సివిల్స్ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో మరోసారి సివిల్స్కి సన్నద్ధమైంది. కానీ ఈ సారి వరుస వైఫల్యాలు ఎదురవ్వుతున్నా.. వెనక్కి తగ్గకుండా ప్రయత్నించి ఐఏఎస్ అధికారి అయ్యింది. అపజయం అంటే విజయానికి ముగింపు కాదని..ప్రయత్నం ఆపకపోవడం అని చాటిచెప్పి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే కేరళకు చెందిన కాజల్ రాజు. ఆమె పుట్టుకతో ఫోకోమెలియా సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి కారణంగా కుడి ముంజేయి లేకుండా జన్మించింది. ఆమె చిన్ననాటి నుంచి చదువులో ముందంజలో ఉండేది. అలా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన ఐఐటి మద్రాస్లో డెవలప్మెంట్ స్టడీస్లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిందామె. అయితే క్యాంపస్లో ఉన్నప్పుడే ప్రజా సేవపై మక్కువ ఏర్పడింది. అలా సివిల్స్ వైపు అడుగులు వేసింది. అయితే తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుని ఆల్ ఇండియా 910వ ర్యాంకు దక్కించుకుని ఐఆర్ఎస్కు ఎంపికైంది. అయితే కాజల్ అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరడమే లక్ష్యంగా మరోసారి సివిల్స్కి సన్నద్ధమైంది. ఈసారి మరింతగా ర్యాంకును మెరుగుపరుచుకోవాలనుకుంటే..మరింతగా ర్యాంకు దిగజారగా, మూడోసారి ఏకంగా ప్రిలిమ్స్లోనే ఓటమిని చవి చూసింది. నిజానికి ఈ వరుస వైఫల్యం ఎవ్వరికైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయేలా చేస్తుంది. కానీ కాజల్కి మరింతగా బలంగా ప్రిప్రేరవ్వాలన్న కసి అంతకంతకు పెరిగింది. అలా ఆమె సివిల్స్లో చివరికి ఆల్ ఇండియా ర్యాంక్ 167కి మెరుగుపరుచుకుని ఐఏఎస్ అధికారి అయ్యింది. ఇక్కడ కాజల్కి రైల్వే సర్వీస్ శిక్షణ, యూపీఎస్సీ ప్రిపరేసన్ అత్యంత సవాలుగా మారింది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ చదవడం అత్యంత కష్టంగా ఉన్నా..ఏదోరకంగా ప్రిపరేషన్ కొనసాగించేది. తనకు ఏ కాస్త చిన్న సమయం దొరికినా..పుస్తకాలతో కుస్తీ పట్టేది. అంతేగాదు ఉద్యోగ బిజీ షెడ్యూల్ని, ప్రిపరేషన్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి క్రమశిక్షణతో కూడిన నిలకడ అవసరం. ఈ కథ ఎదురుదెబ్బలు విజయాన్ని ఆలస్యం చేయొచ్చేమో గానీ అందుకోసం ప్రయత్నం మాత్రం ఆపకూడదనే స్ఫూర్తిని సివిల్స్ ఔత్సాహికుల్లో నింపుతోంది కదూ..!.(చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..) -
మాట జారిన రాహుల్.. ఇండియా కూటమిలో దుమారం
తిరువనంతపురం: ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై విజయన్తో పాటు సీపీఎం అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇండియా కూటమిలో ఐక్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే..ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మిత్రపక్షాల మధ్య సంబంధాలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ రాజకీయాలను ప్రస్తావిస్తూ..‘కేరళలో మేము సీపీఎంతో రాజకీయంగా పోరాడుతున్నాం. అక్కడ పినరాయి విజయన్ మా ప్రధాన ప్రత్యర్థి. అందుకే నేను వెళ్లి ఆయనను హగ్ చేసుకోలేను, చేయను కూడా’ అని కామెంట్స్. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.పినరాయి ఘాటు స్పందన..రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన పినరాయి విజయన్.. తనకు హగ్ చేయడం లేదా చేయకపోవడం అసలు సమస్య కాదన్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశమే ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు.‘నన్ను హగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హగ్ చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఇప్పుడు నన్ను హగ్ చేయలేనని చెప్పడం ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం, అదే సమయంలో మిత్రపక్షాలపై దాడి చేయడం సరైన రాజకీయ విధానం కాదని విమర్శించారు.సీపీఎం నుంచి తీవ్ర ప్రతిస్పందన..రాహుల్ వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేజీ కూడా తీవ్రంగా స్పందించారు. ‘పినరాయి విజయన్ను హగ్ చేయమని ఎవరూ రాహుల్ గాంధీని అడగలేదు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణలను బలపరిచేలా మాట్లాడటం మాత్రం మానుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులు బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయని అన్నారు.Mr Rahul Gandhi said in INDIA alliance meeting that he cannot hug his alliance partner CPM’s ex-CM Mr Pinarayi Vijayan because he has an ongoing political fight with him. pic.twitter.com/8G9OE0npcm— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) June 14, 2026కేరళలో కాంగ్రెస్-సీపీఎం ప్రత్యర్థులేఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఎం జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం రెండు పార్టీలు దశాబ్దాలుగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కేరళలో ఎల్డీఎఫ్కు సీపీఎం నాయకత్వం వహిస్తుండగా, యూడీఎఫ్కు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. ప్రతి ఎన్నికలోనూ ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ జరుగుతుంది. అందువల్ల జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకోవడం కొనసాగుతోంది.కూటమికి కొత్త తలనొప్పి..ఇప్పటికే ఇండియా కూటమిలోని పలు మిత్రపక్షాల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ మధ్య, పంజాబ్లో కాంగ్రెస్-ఆప్ మధ్య, కేరళలో కాంగ్రెస్-సీపీఎం మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూటమి ఐక్యతపై కొత్త సందేహాలకు తావిచ్చాయి. 2029 లోక్సభ ఎన్నికల దిశగా ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో మిత్రపక్షాల మధ్య బహిరంగ విమర్శలు కూటమికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి నాయకుల మధ్య పరస్పర విమర్శలు అధికార బీజేపీఒకి రాజకీయ అస్త్రంగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు వేదికలపై ఐక్యంగా ఉన్నామని చెబుతూనే, మరోవైపు పరస్పరం విమర్శించుకోవడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా రాహుల్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం కాంగ్రెస్-సీపీఎం మధ్య మాటల యుద్ధానికి దారితీయగా, ఇండియా కూటమి భవిష్యత్తుపై కూడా కొత్త చర్చకు తెరలేపింది. -
నిపా కలకలం: క్షీణించిన బాధితుడి ఆరోగ్యం.. అబ్జర్వేషన్లో 100 మంది !
కోజికోడ్: కేరళను మరోసారి నిపా వైరస్ వణికిస్తోంది. కోజికోడ్లో నిపా పాజిటివ్గా తేలిన 43 ఏళ్ల వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్ర అప్రమత్తమైంది. బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య నిపుణులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటిలేటర్పై బాధితుడు.. మెడికల్ బోర్డ్ భేటీఫారూఖ్ కాలేజీ ప్రాంతానికి చెందిన ఈ బాధితుడికి ప్రస్తుతం చికిత్సా ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన అన్ని రకాల మందులను అందజేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 48 గంటల తర్వాత బాధితుడి ఆరోగ్య పరిస్థితిని మెడికల్ బోర్డ్ నిశితంగా సమీక్షించనుంది. ఆ తర్వాతే ఆయనకు రెండో డోస్ ‘మోనోక్లోనల్ యాంటీబాడీ’ చికిత్సను అందించాలా వద్దా అనే దానిపై వైద్యులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.కొత్తగా ఇద్దరు స్నేహితులు చేరికమరోవైపు బాధితుడికి అత్యంత సమీపంగా ఉన్న భార్య, కుమారుడు, సోదరిల నుంచి సేకరించిన నమూనాల పరీక్షల్లో నిపా నెగెటివ్గా తేలడం కాస్త ఊరటనిచ్చే అంశం. శనివారం నాడు మరో నలుగురు లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం మొత్తం ఏడుగురు అనుమానితులు కోజికోడ్ మెడికల్ కాలేజీలో అబ్జర్వేషన్లో ఉన్నారు. బాధితుడితో పరిచయం ఉన్న ఇద్దరు స్నేహితులకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వారిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. అలాగే బాధితుడు వెళ్లిన రెడ్ క్రెసెంట్ ఆసుపత్రిని సందర్శించిన 9 ఏళ్ల చిన్నారికి కూడా జ్వరం, దగ్గు రావడంతో ఐసోలేషన్కు తరలించి నమూనాలను పరీక్షలకు పంపారు.100కి చేరిన నిఘా జాబితావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ను ముమ్మరం చేశారు. కొత్తగా మరో 13 మందిని ఈ జాబితాలో చేర్చడంతో, ప్రస్తుతం నిఘాలో ఉన్న వారి సంఖ్య 100కు పెరిగింది. ఇందులో అత్యంత ప్రమాదకర విభాగం (వెరీ హై-రిస్క్)లో నలుగురు, హై-రిస్క్ విభాగంలో 14 మంది, తక్కువ ప్రమాదం (లో-రిస్క్) ఉన్న విభాగంలో 82 మంది ఉన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. -
తల్లిదండ్రుల మధ్య వివాదం.. చిన్నారికి పేరు పెట్టిన కోర్టు!
తల్లిదండ్రుల మధ్య వివాదం ఓ చిన్నారికి ‘పేరు’ సంకటాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చెరో పేరూ చెప్పడంతో ఏ పేరూ ఖరారు కాలేదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని రిజిస్ట్రార్ చెప్పడం వివాదానికి కారణమైంది. చివరికి ఆ చిన్నారి తల్లి కోర్టును ఆశ్రయించింది. ఆ కుటుంబ సమస్యకు పరిష్కారమే కాదు.. ‘పేరెంట్’ అనే పదానికి ఉన్నత న్యాయస్థానం అర్థం చెప్పింది.కేరళకు చెందిన సంగీత, బాలగంగాధరన్ నాయర్ దంపతులకు 2020లో ఓ పాప జన్మించింది. తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నారికి ఏ పేరు పెట్టాలనే అంశంపై వారి మధ్య సయోధ్య కుదరక ఏ పేరూ పెట్టలేదు. రోజులు గడిచాయి. పాపను స్కూల్లో చేర్చాల్సిన సమయం వచ్చింది. జనన ధ్రువీకరణ పత్రంలో చిన్నారి పేరు లేకపోతే అడ్మిషన్ ఇవ్వడం కుదరదని యాజమాన్యం చెప్పింది. దీంతో ‘పేరు’ తప్పనిసరి అయింది.కోర్టును ఆశ్రయించిన తల్లిపేరు నమోదు కోసం తల్లి జనన, మరణ ధ్రువీకరణ రిజిస్ట్రార్ను కలిసింది. ‘ఫుణ్యనాయర్’ పేరుతో తన కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని ఆ అధికారి చెప్పాడు. దీంతో కుమార్తెకు పేరు పెట్టేందుకు తన భర్త సహకరించేలా ఆదేశించాలని కోరుతూ ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని, పేరు నమోదుకు సహకరించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. ఇరువురు కలిసి నమోదు కేంద్రానికి వెళ్లాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.ఉన్నత న్యాయస్థానానికి చేరిన సమస్యహైకోర్టులో ఆ చిన్నారి పేరు విషయమే కాదు, జనన, మరణాల నమోదు చట్టం–1969లోని సెక్షన్ 14 ప్రకారం పేరు నమోదుకు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు వెళితే సరిపోతుందా? పేరు నమోదుకు ఇద్దరి అంగీకారం అవసరమా? ‘ది పేరెంట్’ అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు కేసు విచారణ సందర్భంగా తలెత్తాయి. వీటిపై కోర్టు లోతుగా విశ్లేషించింది.‘ది పేరెంట్’ ఏకవచనమే‘ది పేరెంట్’ లేదా గార్డియన్ అని దరఖాస్తులో ఉంది. పేరెంట్ అంటే తల్లి లేదా తండ్రి అని డిక్షనరీ సూచిస్తోంది. బ్లాక్స్ లా డిక్షనరీ ప్రకారం పేరెంట్ అంటే ‘ఒక వ్యక్తికి చట్టబద్ధమైన తండ్రి లేదా తల్లి’. అందువల్ల పేరెంట్ అనే పదం తండ్రిని గాని తల్లిని గాని సూచించవచ్చు అని కోర్టు పేర్కొంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇద్దరినీ కలిపి కూడా సూచించవచ్చని తెలిపింది. ఈ పదానికి ఏ అర్థం ఇవ్వాలనే కేసు పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో నిర్ణయించాల్సి వస్తోందని పేర్కొంది.చట్టంలో పేరెంట్ అనే పదానికి ముందు ‘ద’ అనే ఆర్టికల్ను ఉపయోగించారు. పేరెంట్ అనే పదాన్ని పేరెంట్స్ అనే బహువచన రూపంలో ఇవ్వలేదు. కావున ‘ద పేరెంట్’ అనే పదానికి ఏకవచన అర్థం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ‘బోత్ పెరెంట్స్’ అని ఎక్కడా లేదు. అందువల్ల తల్లి లేదా తండ్రి వారిలో ఎవరైనా పేరు నమోదుకు హక్కు కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. చట్టంలో లేని విధంగా ఇద్దరూ కలిసే దరఖాస్తు చేయాలి. ఇరువురి అంగీకారం కావాలని రిజిస్ట్రార్ కొత్త నియమాన్ని పెట్టలేడని పేర్కొంది. ఈ వ్యాఖ్యానం ఆధారంగా తల్లి లేదా తండ్రి తొందరపడి తనకు నచ్చిన పేరుతో పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆపేరు నచ్చకపోతే చట్టపరంగా సవరణలు కోరే అవకాశం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.పాప భవిష్యత్తే ముఖ్యం‘పుణ్య నాయర్’ అని తన కుమార్తెకు పేరు పెట్టాలని తల్లి కోరింది. ‘పద్మ నాయర్’ పేరును తండ్రి సూచించాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్న సమయంలో ‘పిల్లల ప్రయోజనాలనే పరిగణన’లోకి తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాప భవిష్యత్తే ముఖ్యమని పేర్కొంది. పేరు విషయంలో తల్లిదండ్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ‘పేరెన్స్ పాట్రీ’ కింద కోర్టే తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లి సంరక్షణలోఉన్నందున ఆమె సూచించిన పేరుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. పితృత్వం విషయంలో ఎలాంటి వివాదం లేనందున తండ్రి పేరును కూడా చేర్చాలని అభిప్రాయపడింది. ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ సంక్షిప్తంగా ‘పుణ్య బి.నాయర్’ గా ఆ చిన్నారికి పేరు పెట్టింది. ఈ పేరుతో కొత్తగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు అందిన 15 రోజుల లోపు ఆ పేరుతో జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ కేసులో కోర్టు కేవలం ‘పేరు’ వివాదాన్ని మాత్రమే పరిష్కరించలేదు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు, చట్టంలో పేర్కొన్న పదాలకు ఇవ్వాల్సిన సరైన అర్థం గురించి స్పష్టత ఇచ్చింది. కన్నబిడ్డకు తల్లిదండ్రులే పేరు నిర్ణయించలేని స్థితిలో కోర్టే స్వయంగా ఓ చిన్నారికి పేరు పెట్టడంతో న్యాయవ్యవస్థలో ఇది ఆసక్తికరమైన, అరుదైన తీర్పుల్లో ఒకటిగా నిలిచింది. - దిలీప్ మాదిరెడ్డి -
యుద్దంలో పాక్ ఓడిపోతే అదే చేయాలి
తిరువనంతరపురం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో చర్చలు జరపాలని RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గతంలో చేసిన వ్యాఖ్యలు సమర్ధిస్తున్నానని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ ఇలా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ "మనం హిట్లర్ లాంటి వాళ్లం కాదు, అది మన స్వభావం కూడా కాదు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోతే.. అక్కడ ఉన్న ప్రజలను భారత్లో భాగం చేయడమో లేదా వారు ప్రశాంతంగా జీవించేలా చూడడమో చేయాలి. అందుకోసం వారితో చర్చలు జరిపే మార్గాలను (తలుపులను) ఎప్పుడూ తెరిచే ఉంచాలి" అని భగవత్ పేర్కొన్నారు. అన్యాయాన్ని, నియంతృత్వాన్ని అంతమొందించాలని అదే సమయంలో మంచిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.పాకిస్తాన్లో మారుతున్న ఆలోచనలుదేశ విభజన జరగడం తప్పని భావించే ప్రజలు పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారన్నారు. అక్కడ ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారని, 'రెండు దేశాల సిద్ధాంతం తప్పని, కలిసి ఉంటేనే బాగుండేదనే భావన అక్కడ అంతర్గతంగా బలంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏ దేశంతోనైనా విదేశీ సంబంధాల విషయంలో ఆర్ఎస్ఎస్కు విడిగా ఎలాంటి ప్రత్యేక విధానాలు ఉండవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకే సంఘ్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ, అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని వ్యాఖ్యానించారు. యూనిఫామ్ వేసుకుని చేసే రూట్ మార్చ్లను చూసి కొందరు దీనిని పారామిలిటరీ సంస్థ అనుకుంటారని, వ్యాయామాలు చూసి వ్యాయామశాల అనుకుంటారని, కానీ బయట నుండి చూస్తే సంఘ్ అర్థం కాదని, దానిని లోపలికి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన కోరారు. -
హ్యాపీ రీరిలీజ్.. కేరళలో భాయ్ సెన్సేషన్
-
కేరళ ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం
తిరువనంతపురం: ఎన్నికల వాగ్దానం ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన ప్రియదర్శిని పథకం అమలవుతుందని తెలిపింది. ఈ పథకం కింద కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఆర్డీనరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వివరించింది.ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఆర్డినరీ బస్సుల్లోని ఏడు కేటగిరీల్లో ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రియదర్శిని పథకం కింద ఉచిత ప్రయాణానికి ఎంపిక చేసిన బస్సులపై ప్రత్యేకంగా స్టిక్కర్లను అంటిస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం అమలుతో అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించనుంది. -
శబరిమలలో రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ
తిరువనంతపురం: వచ్చే శబరిమల యాత్రా సీజన్లో జనసమూహ నిర్వహణ , డిజిటలైజేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో సహా పలు కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ శుక్రవారం తెలిపారు.ఇక్కడ జరిగిన టీడీబీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అనేక సన్నాహక పనులు చాలా ముందుగానే చేపడుతున్నామని జయకుమార్ తెలిపారు.‘మేము వివిధ వ్యవస్థలను డిజిటలైజ్ చేసే దిశగా కృషి చేస్తున్నాము. శబరిమలలో నగదు లావాదేవీలకు తావు ఉండదు; ప్రతిదీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాదు, పరిపాలనా ప్రక్రియలకు కూడా వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు.జనసమూహ నిర్వహణకు సంబంధించిన మరో ముఖ్యమైన కార్యక్రమం ఉందని ఆయన అన్నారు. ‘జూన్ 20న, పోలీసు శాఖ సహకారంతో, జన సమూహాల నిర్వహణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడంపై కొచ్చిలో ఒక ప్రధాన వర్క్షాప్ను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు ఆరుగురు గుర్తింపు పొందిన ఏఐ నిపుణులు పాల్గొంటారు’ అని ఆయన అన్నారు.వాస్తవ రద్దీ పరిస్థితుల ఆధారంగా నీలక్కల్, పంపా, మరకూట్టం మరియు సన్నిధానానికి యాత్రికుల రాకపోకలను నియంత్రించే ఒక ప్రొటోకాల్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ‘ రియల్ టైమ్లో ఏఐని ఉపయోగించి, ఏ సమయంలోనైనా ఎంత మందిని ముందుకు వెళ్లడానికి అనుమతించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ వర్క్షాప్ జూన్ 20న కొచ్చిలోని ఐఎంఏ హాల్లో జరుగుతుంది’అని స్పష్టం చేశారు. జూన్ 14న టీడీబీ హరిత శబరిమల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం శబరిమల యాత్రకు సంబంధించి దానికి అనుగుణంగా జల ప్రాధికార సంస్థ, విద్యుత్ బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖ మరియు ఇతర ఏజెన్సీల అధికారులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ టీడీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. ‘అన్ని విభాగాలను సమన్వయం చేసి, శబరిమల కోసం సమగ్రమైన గ్రీన్ ప్రోటోకాల్స్ను అమలు చేయడమే లక్ష్యం. గ్రీన్ ప్రోటోకాల్తో పాటు, మేము ప్రత్యేక పారిశుధ్య ప్రోటోకాల్ను కూడా ప్రవేశపెడుతున్నాము. సుచిత్వ మిషన్తో కూలంకషంగా చర్చలు జరిగాయి," అని ఆయన అన్నారు.తగినంత పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడమే అతిపెద్ద ఫిర్యాదులలో ఒకటిగా ఉందని జయకుమార్ అన్నారు. ‘ఇప్పటివరకు కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను పెట్టడమే సాధారణ పద్ధతిగా ఉండేది, కానీ అది సరిపోలేదు. మేము మూడు డబ్బాల విధానానికి మారుతున్నాము," అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి మద్దతుగా టీడీబీ తగినన్ని స్టీల్ వ్యర్థాల డబ్బాలను సమకూరుస్తుంది. వ్యర్థాలను వాటి మూలం వద్దనే జీవవిచ్ఛిన్నమయ్యేవి, జీవవిచ్ఛిన్నం కానివి మరియు ప్రమాదకర వ్యర్థాలు అనే మూడు వర్గాలుగా విభజిస్తారు.‘సరైన వ్యర్థాల విభజన బాధ్యతను దుకాణ యజమానులకు అప్పగిస్తాము, ఇందుకోసం ఇప్పటికే ఒప్పందాలు సిద్ధం చేశాము. మేము వ్యర్థాల సరైన శుద్ధిని కూడా నిర్ధారించి, బయో-ట్రీట్మెంట్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో పనిచేసేలా చేస్తాము’ అని ఆయన అన్నారు. ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించబడుతోందని అన్నారు. ‘ ఈ ఏడాది శబరిమల యాత్రను అత్యంత వృత్తిపరంగా నిర్వహించాలన్నదే మా కల, దానిని సాధించేందుకు బోర్డు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. -
రూ. 12 కోట్ల గంజాయి : అడ్డంగా బుక్కైన కేరళ బ్యూటీ
పేరుకే అందాల సుందరి. చేసేది మాత్రం గలీజ దందా. 28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025 పోటీదారు హర్ష సన్నీ దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా బుక్కైంది. బ్యాంకాక్ నుండి విమానంలో ముంబైకి వస్తూ పోలీసులకు చిక్కింది.కస్టమ్స్ అధికారుల ప్రకారం, హర్ష సన్నీ జూన్ 10-11 తేదీల రాత్రి ఎయిర్ ఇండియా విమానం TG-351లో బ్యాంకాక్ నుండి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బ్యాంకాక్నుంచి 11 కిలోలకు పైగా హై క్వాలిటీ 'హైడ్రోపోనిక్ గంజాయి'ని గుట్టుచప్పుడు కాకుండా బాగానే తీసుకొచ్చింది. కానీ ఆమె ప్రవర్తనను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా అసలు గట్టు రట్టైంది. ఇదీ చదవండి: ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఇపుడెలా ఉన్నాడు?ఆమె ట్రాలీ బాగ్లో 12 వాక్యూమ్-సీల్డ్ ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) కిట్ను ఉపయోగించి అక్కడికక్కడే జరిపిన రసాయన పరీక్షలో, ఆ పదార్థం'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. విలువ రూ. 11.82 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆమెను ఎన్డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ సరుకును ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడకు చేరవేయాలనుకున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ! -
కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం : హై అలర్ట్
కేరళలో మరో సారి నిపా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. కోజికోడ్లోని ఫెరోక్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.ప్రాథమిక పరిశీలన ప్రకారం, రోగికి మొదట మామూలు జ్వరం వచ్చి తగ్గింది, ఆ తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. నిపా అనుమానిత కేసుగా గుర్తించడానికి ముందు పలు ఆసుపత్రిలను సందర్శించిన తరువాత సదరు రోగి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్పేషెంట్ విభాగానికి వచ్చారు. దీంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక గిడ్డంగిని శుభ్రం చేస్తున్నప్పుడు అతనికి ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో వైరస్ సోకిన గబ్బిలాలు ఉండటమే వైరస్ వ్యాప్తికి ప్రాథమిక కారణమని దర్యాప్తు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన మూలాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనేందుకు గురువారం తిరువనంతపురంలోని ఆరోగ్యమంత్రి కె. మురళీధరన్ కార్యాలయంలో సీనియర్ ఆరోగ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్య అధికారులు ఇప్పటికే కాంటాక్ట్-ట్రేసింగ్ చర్యలను ప్రారంభించారని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఆందోళన వద్దు : కేరళ ఆరోగ్య మంత్రిబాధిత వ్యక్తి చాలా మందిని కలిసినప్పటికీ, ప్రస్తుత దశలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత రోగి చికిత్స కోసం వెళ్లిన ప్రైవేట్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించారని, దీనివల్ల ఇతరులకు కూడా వైరస్ వ్యాపించి ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా, ఆ రోగి వెళ్లినఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు.ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్ న్యూస్, ఆ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రద్దు -
Kerala: చొరబాట్ల కలకలం.. 10 వేల మంది నకిలీ పౌరులు?
తిరువనంతపురం: కేరళలో వలస కూలీల ముసుగులో భారీ ఎత్తున బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా నివసిస్తున్నారనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొల్లాం జిల్లాలోని కొట్టారక్కరలో ఇటీవల పోలీసులు పది మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకోవడంతో ఈ నకిలీ గుర్తింపు పత్రాల రాకెట్ గుట్టురట్టయింది. కేవలం 700 రూపాయలకే అసలైన వాటిని పోలిన నకిలీ ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను సృష్టిస్తూ, సుమారు 10,000 మందికి పైగా బంగ్లాదేశీయులు భారతీయ పౌరులుగా చలామణి అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామం దేశ రక్షణ, ఇంటెలిజెన్స్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.రూ.700లకే గుర్తింపు పత్రాలుపోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అక్రమ వలసదారులు మొదట పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ప్రాథమిక నకిలీ పత్రాలను సంపాదించిన తర్వాత, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కేరళకు చేరుకుంటున్నారు. కేరళలోని స్థానిక చిరునామాలను ఉపయోగించుకుని, పూర్తి స్థాయి నకిలీ ఐడీలను సృష్టిస్తున్నారు. దీని వెనుక బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించి, వాటిలో బంగ్లాదేశ్ పాస్పోర్ట్ల కాపీలను కనుగొనడంతో వారి అసలు పౌరసత్వం బయటపడింది.గొలుసుకట్టు వలసల గుట్టుఈ అక్రమ వలసల్లో గొలుసుకట్టు (చైన్ మైగ్రేషన్) విధానం సాగుతున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. 13 ఏళ్ల క్రితం కేరళకు వచ్చిన ముగల్ ఖాతూన్ అనే బంగ్లాదేశ్ మహిళ, ఇక్కడ ‘మామ్దాస్’ అనే నకిలీ పేరుతో అన్ని రకాల గుర్తింపు పత్రాలను పొందింది. ఆ తర్వాత ఆమె తన బంధువులను కూడా ఇక్కడికి రప్పించింది. అరెస్ట్ కావడానికి రెండు నెలల ముందే ఆమె బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ఉపయోగించి ఇద్దరు పిల్లలతో కలిసి స్వదేశానికి వెళ్లివచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ కూలీలకు, బంగ్లాదేశీయులకు మధ్య ఉన్న స్వల్ప భాషా వ్యత్యాసాల ద్వారా వీరిని గుర్తించవచ్చని, అయితే భయం కారణంగా స్థానికులు సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది.భద్రతా ఆందోళనలు ఈ వ్యవహారాన్ని కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు అత్యంత తీవ్రమైన భద్రతా సమస్యగా పరిగణిస్తున్నాయి. దేశ వ్యతిరేక శక్తులు లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా ఈ నకిలీ పత్రాలను వాడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, పోలీసుల నిఘా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశీయులు కేరళను విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో కేరళలోని వలస కార్మికులందరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్రమ చొరబాటుదారులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు.ఇది కూడా చదవండి: సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత! -
ఎత్తయిన ఏనుగుపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు!
న్యూఢిల్లీ: కేరళలోనే అత్యంత ఎత్తయిన ఏనుగుగా పేరొందిన ‘రామన్’ సంరక్షణపై దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కీలక నిర్ణయం తీసుకుంది. నోరులేని మూగజీవాల సంక్షేమమే పరమావధి అని స్పష్టం చేస్తూ, రామన్ను తక్షణమే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపి, రామన్ను ఒక సరైన పునరావాస కేంద్రానికి తరలించాలని స్పష్టం చేసింది.కోర్టు ధిక్కరణ..వాణిజ్య దోపిడీ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామన్ ఏనుగును వాణిజ్య అవసరాలకు, ఉత్సవాలు, వివిధ ఆచారాల ఊరేగింపుల కోసం విపరీతంగా ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ, ఏనుగును నిర్బంధంలో ఉంచిన కృష్ణన్కుట్టి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ క్రమంలోనే అతనికి రూ. 2,000 జరిమానా కూడా విధించింది. నోరులేని మూగజీవాల పట్ల జరుగుతున్న ఇటువంటి ఉల్లంఘనలపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేమని, మూగ ప్రాణుల సంక్షేమం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.మాతా అమృతానందమయి మఠంతో.. జయకృష్ణ మీనన్ అనే వ్యక్తి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ఆధారంగా ఈ విచారణ జరిగింది. పిటిషనర్ వాదనల ప్రకారం.. ఈ రామన్ ఏనుగు వాస్తవానికి 'మాతా అమృతానందమయి మఠం'నకు చెందినది. దాని సంరక్షణ, నిర్వహణ బాధ్యతల కోసం మాత్రమే తాత్కాలికంగా కృష్ణన్కుట్టి అనే వ్యక్తికి అప్పగించడం జరిగింది. అయితే, కృష్ణన్కుట్టి ఒక వివాదాస్పద విలునామా (ఉయిల్), గిఫ్ట్ డీడ్స్ ఆధారంగా ఈ ఏనుగు చట్టబద్ధంగా తనకే దక్కిందని, గత 10-12 ఏళ్లుగా తానే దాన్ని నిరంతరాయంగా పోషిస్తున్నానని కోర్టుకు తెలిపాడు.కేరళ ప్రభుత్వానికి తాత్కాలిక బాధ్యతలుప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్వాధీన ఆదేశాలు కేవలం తాత్కాలికమైనవని, కోర్టు వెలువరించే తుది తీర్పునకు ఇవి లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 లోని చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఈ ఏనుగును తాత్కాలికంగా సంరక్షించాలని, ఇందుకు అవసరమైన పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేయవచ్చని పేర్కొంది. మరోవైపు, ఏనుగుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించిన కేరళ రాష్ట్ర అధికారులను కోర్టు ధిక్కరణ ఆరోపణల నుండి న్యాయస్థానం విముక్తి కల్పించింది.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి భారీ షాక్: ఢిల్లీలో టీఎంసీ ఆఫీస్ ఖాళీ -
పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు
తిరువనంతపురం: మనీలాండరింగ్ కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణాకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం కొచ్చిలోని తమ కార్యాలయానికి హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వీణాతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు చెందిన అధికారులు సహా మొత్తం తొమ్మిది మందికి ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.కాగా, గత నెల పినరయి విజయన్ నివాసంలో ఈడీ ఆకస్మిక తనీఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయన్ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు చేసింది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈడీ దర్యాప్తు కేరళంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.కొచిన్ మినలర్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత.. సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సీపీఎం, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. నిరసనల సమయంలో ఈడీ సిబ్బంది, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడులు జరిగాయని ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే పోలీసుల చర్యను కేరళ ప్రభుత్వం సమర్థించగా, దర్యాప్తును అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. -
మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు!
తిరువనంతపురం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న భారతీయ హెల్త్కేర్ కార్మికులు, ముఖ్యంగా కేరళకు చెందిన నర్సులు, పారామెడికల్ సిబ్బంది ప్రస్తుతం ఊహించని వీసా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అక్కడ నివసిస్తున్న వేలాది మంది నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వీసా సమస్యల కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, దేశం విడిచి వెళ్లాల్సిన (డిపోర్టేషన్) పరిస్థితి తలెత్తింది. ఈ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చిత భవిష్యత్తుపై కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మానవీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక అత్యవసర లేఖ రాశారు.ఇరాన్ ఆస్పత్రి ఉద్యోగుల ఆందోళనప్రాంతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్రిక్తతల ప్రభావం దుబాయ్లోని ఇరానియన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కేరళ వైద్య సిబ్బందిపై పడింది. ఇక్కడి ఆంక్షల కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని సీఎం సతీశన్ లేఖలో పేర్కొన్నారు. యూఏఈ నిబంధనల ప్రకారం వీరికి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ముగిసిపోతుండటంతో, గడువులోగా వీసా హోదాను క్రమబద్ధీకరించుకోకపోతే డిపోర్టేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వారి కెరీర్ను దెబ్బతీయడమే కాకుండా, భవిష్యత్తులో ఉద్యోగ, ప్రొఫెషనల్ లైసెన్సింగ్ అవకాశాలను కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.కుటుంబాల భవితవ్యం ప్రమాదంలో..ఈ అకస్మాత్తు వీసా ఇబ్బందుల వల్ల ఉపాధి వీసాలు, విజిట్ వీసాలు, డిపెండెంట్ వీసాలు పొందడం కష్టంగా మారింది. యూఏఈలో స్థిరపడిన అనేక మలయాళీ కుటుంబాలు తమ పిల్లల విద్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో అక్కడి జీవితానికి అలవాటు పడ్డాయి. ఇప్పుడు ఉద్యోగాల ముప్పు, దేశ బహిష్కరణ భయాల నేపథ్యంలో వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వం పూర్తిగా ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి వివరించారు.మానవీయ కోణంలో జోక్యం చేసుకోవాలిఈ సంక్షోభానికి తగిన పరిష్కారం కనుగొనేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తక్షణమే యూఏఈలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి అధికారులతో చర్చలు జరపాలని సీఎం కోరారు. కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వారియర్లుగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన భారతీయ వైద్య సిబ్బంది సహకారాన్ని ఆయన గుర్తుచేశారు. కాబట్టి ఈ సమస్యను మానవీయ కోణంలో, న్యాయబద్ధంగా పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు: గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా -
లుక్స్, భాష పరంగా..అభద్రతా భావంతో ఉండేదాన్ని..!
కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ కేరళ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ఈ టైటిల్ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె అరుదైన రికార్డును సృష్టించారు. అయితే ఆమెను ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ గెలుపు ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా..అందుకు కజియా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారామె. మిస్ యూనివర్స్ ఇండియాకు సిద్ధమవుతున్న ఈ 19 ఏళ్ల యువతి..తన లుక్స్, సంభాషణ పరంగా అభద్రతా భావంతో ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఆత్మవిశ్వాసంగా ఉండలేకపోయాదాన్ని అని వాపోయారు. అయితే దీన్ని అధిగమించడం రాత్రికి రాత్రే జరిగిపోలేదన్నారు. ఇలా కాదు మొదట తాను కాన్ఫిడెంట్ని డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాని అన్నారామె. అందుకోసం తనపై తాను ఫోకస్ పెట్టడం ప్రారంభించానని అన్నారామె. అంటే నా సంభాషణ నైపుణ్యాలు, వ్యక్తిత్వం, రూపం ఇలా మొత్తం తనపై తాను ఎక్కువ దృష్టి పెట్టి మెరుగయ్యేలా చేసుకున్నానని అన్నారు. అయితే తనకు బాగా హెల్ప్ అయిన విషయం ఏంటంటే..సాధించే వరకు ఆపొద్దు అనే సూత్రంం. ఈ భూమ్మీద నేనే అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని అని తన బ్రెయిన్ని పూర్తిగా నమ్మించి వేదికలపైకి కాన్ఫిడెన్స్గా నడవగలిగానని అన్నారు. ఇక తనకు ఈ అందాల పోటీలపై ఆసక్తి మొదలైంది..2021లో భారతదేశం మిస్ యూనివర్స్ గెలవడాన్ని చూసిన తర్వాతేనని అన్నారామె. అంతవరకు అందాల పోటీల గురించి పెద్దగా తెలియదని అన్నారు. భారత్ ఆ పోటీల్ల గెలవడంతో తనలో ఏదో స్ఫూర్తి రగిలిందన్నారు. అదీగాక హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021ను గెలుచుకోవడంతో భారత్ 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లైందని పేర్కొంది. అంతకుముందు 1994లో సుష్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ టైటిల్ని గెలుచుకున్నారు. అయితే చాలామంది ఈ అందాల పోటీలను కేవలం శారీరక సౌందర్య ప్రదర్శనగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అయితే ఈ అందాల పోటీలు గెలిచినా, గెలవకపోయినా..మీ గొంతుని కనుగొనడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటివి ఎన్నో నేర్పిస్తుందన్నారు. పైగా ఈ జర్నీలోని ఎంతో మెరుగవుతాం అంటూ తన సంభాషణను ముగించారామె.(చదవండి: అంతా అయిపోయాక కాదు..ముందుగా తెలుసుకోవాల్సిన ఆరోగ్య పాఠాలు..!) -
కేరళ, కర్ణాటకలో అలర్ట్ ఐఎండీ భారీ వర్ష హెచ్చరిక
-
‘లింగ వివక్ష బస్సులు’.. ఉచిత బస్సులపై రచ్చ!
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం మహిళలు, విద్యార్థినులకు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. 2026, జూన్ 15 నుంచి అమలు కానున్న ఈ పథకాన్ని ఎల్డీఎఫ్ (డీఎల్ఎప్) కూటమి భాగస్వామ్య పక్షమైన కేరళ కాంగ్రెస్ (ఎం) ఛైర్మన్ జోస్ కె. మణి స్వాగతించారు. అయితే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కేవలం అమ్మాయిలకే పరిమితం చేయడం వల్ల విద్యార్థుల మధ్య లింగ వివక్ష తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక వర్గానికే కాకుండా, అబ్బాయిలకూ ఈ ఉచిత సౌకర్యాన్ని వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా విజ్ఞప్తి చేశారు.విద్యార్థుల్లో వివక్ష వద్దు పాఠశాలలు, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు వంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించేటప్పుడు అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఎలాంటి తేడాలు చూపడం లేదని జోస్ కె. మణి గుర్తుచేశారు. కేవలం రవాణా సౌకర్యం విషయంలోనే ఇలాంటి భేదాలు చూపడం సమంజసం కాదని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్, వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఒకే తరగతిలో కలిసి చదువుకునే విద్యార్థుల్లో ఒకరికి ఉచిత ప్రయాణం, మరొకరికి కాదనడం వల్ల వారి మధ్య తారతమ్యాలు ఏర్పడతాయని, అందువల్ల లింగభేదం లేకుండా విద్యార్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.ఉచిత రవాణా ఒక పెట్టుబడి విద్యా రంగంలో కేరళ ఎప్పుడూ ముందుంటుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఉచిత రవాణా విధానాన్ని తీసుకురావాలని జోస్ కె. మణి ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 33 లక్షల మంది విద్యార్థులు వివిధ ప్రయోజనాలను పొందుతున్నారని, దీనికి అదనంగా ఇల్లు - పాఠశాల మధ్య ఉచిత ప్రయాణ గ్యారంటీని కూడా జోడించాలన్నారు. ఈ పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఆర్థిక భారంగా భావించకూడదని, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని ఆయన హితవు పలికారు.కేఎస్ఆర్టీసీ ముందడుగు వేయాలి ఈ ఉచిత ప్రయాణ విధానాన్ని ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులకూ వర్తింపజేయాలని జోస్ కె. మణి సూచించారు. ప్రస్తుతానికి ప్రైవేట్ ఆపరేటర్లకు ఈ పథకాన్ని విస్తరించడం సాధ్యం కాకపోతే, కనీసం కేఎస్ఆర్టీసీ బస్సుల్లోనైనా హయ్యర్ సెకండరీ స్థాయి వరకు ఉన్న విద్యార్థులందరికీ తక్షణమే ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చదువుకోవడానికి రవాణా అనేది ఒక ముఖ్యమైన అవసరమని, ఇల్లు దాటి విద్యాసంస్థకు వెళ్లి, మళ్లీ సురక్షితంగా ఇళ్లకు చేరుకునే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే భరించాలని ఆయన స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: సురేష్ గోపీ రాజీనామా?.. సస్పెన్స్కు ఎండ్ కార్డ్! -
‘గ్రాండ్ఫేర్వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!
ఎవరైనా ఉద్యోగం నుంచి రిటైర్ అయితే శాలువా కప్పి సన్మానం చేసి నాలుగు మంచి మాటలు చెప్పడం చాలా కామన్ అయితే మంచి చెప్పడం కన్నా చేతల్లో చూపించడం అరుదు. అదే చేశారు కేరళలోని కొందరు పూర్వ విద్యార్థులు. కాసరగాడ్లోని చెన్మాద్ వెస్ట్ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో హెడ్మాస్టర్గా పని చేసిన పీటీ. బెన్నీ గతవారం రిటైర్ అయ్యారు. పూర్వ విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామస్తులందరూ కలిసి ఓ కారుని బెన్నీకి బహుమానంగా అందజేశారు.నూట ఇరవై ఏడు సంవత్సరాల స్కూల్చెన్మాద్ స్కూల్ను ఏర్పాటు చేయడానికి 1899లో చెన్మాద్ జమాద్ కమిటీ కొంత స్థలాన్నిచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కాని పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా సదుపాయాలు, ఉపాధ్యాయులు, ఇతర వసతులు అందుబాటులోకి రాలేదు. పీటీ బెన్నీ ఎక్కడ పని చేసినా ఎవరో ఇచ్చే విరాళాల కోసం చూడకుండా తన సొంత ఖర్చులతో స్కూలును బాగు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని అందించేవారు. ఆయన గురించి తెలిసి 2019లో చెన్మాద్ స్కూల్కి రప్పించారు. హెడ్మాస్టర్గా బెన్నీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాలను పూర్తిగా మార్చివేశారు. ఆయన ప్రయత్నం చూసి స్థానికులు కూడా తమ వంతు సాయం చేశారు. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే తరగతి గదులు పెరిగాయి. పాఠశాలకు రెగ్యులర్గా 25 మంది ఉపాధ్యాయులను నియమించారు. విద్యార్థుల సంఖ్య 550 నుంచి 850కి పెరిగింది. ప్రముఖ పోగటీ పరీక్షలలో పాఠశాల విద్యార్థులు టాపర్స్గా నిలిచారు. నూట ఇరవై ఏడు సంవత్సరాల పాఠశాల చరిత్రలో ఉత్తమ గురువుగా బెన్నీ పేరు సంపాదించారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా పండగలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతి ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా సంబరంలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. (చదవండి: ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..) -
ఎల్డీఎఫ్లో చిచ్చు.. కేరళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్
కేరళలో ఎన్నికల పరాజయం తర్వాత ఎల్డీఎఫ్లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో డిప్యూటీ ప్రతిపక్ష నేత పదవిపై సీపీఎం–సీపీఐ మధ్య తీవ్ర పోటీ చెలరేగడంతో లెఫ్ట్ కూటమిలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ఒకవైపు ఈ పదవి తమకే దక్కాలని సీపీఐ గట్టిగా పట్టుబడుతుండగా, మరోవైపు సంప్రదాయాలను చూపిస్తూ సీపీఎం వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష డిప్యూటీ నేత పదవిపై ఎల్డీఎఫ్లో భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి. రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తమకే ఈ పదవి దక్కాలని సీపీఐ స్పష్టం చేస్తూ.. ఈ విషయంలో జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని కూడా కోరింది. ఇక సీపీఎం మాత్రం గత సంప్రదాయాలను ప్రస్తావిస్తూ, ఈ పదవిని ఎప్పటినుంచో తమ పార్టీనే నిర్వహిస్తోందని వాదిస్తోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో కీలక పదవుల పంపకంలో మార్పులు అవసరం లేదని సీపీఎం నేతలు చెబుతున్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతిలో ఎల్డీఎఫ్ ఓటమి పాలైన తర్వాత కూటమిలో అంతర్గత సమీక్షలు, చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు సమావేశాలు జరుగుతూ, ఎన్నికల పరాజయానికి కారణాలపై విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఈ అంతర్గత చర్చల మధ్యే సీపీఎం–సీపీఐ మధ్య పదవుల వివాదం మరింత వేడెక్కింది. అంతకుముందే ప్రతిపక్ష నేత పదవిపై కూడా పినరయి విజయన్ పేరుకు సీపీఐ అభ్యంతరం తెలిపిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఓటమికి నాయకత్వమే కారణమన్నది సీపీఐ వాదనగా ఉంది. మొత్తంగా, ఎన్నికల పరాజయం తర్వాత ఎల్డీఎఫ్లో మొదలైన అంతర్గత చిచ్చు ఇప్పుడు కీలక పదవుల పంపకంపైకి చేరి, కూటమి ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
ఇక వర్షాతిరేకం
న్యూఢిల్లీ: వేసవి ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తూ నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం ప్రకటించింది. సాధారణంగా ఈ రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవన కాలం(జూన్–సెపె్టంబర్) ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కాస్త ఆలస్యంగా రుతుపవనాలు కేరళను తాకాయి. ‘‘నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, మొత్తం లక్షదీ్వప్ దీవులు, కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, కొమరిన్ ప్రాంతంలోని మిగిలిన భాగాలు, ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి విస్తరిస్తున్నాయి’’అని ఐఎండీ వెల్లడించింది. మే 26న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ గతంలో అంచనా వేసింది. అయితే, ఎల్నినో ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమైంది. వీటి ప్రభావంతో కేరళ, తమిళనాడు తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న కొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రుతుపవనాలు మరో వారం రోజుల్లోగా పొరుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. -
పొట్టకూటి కోసం వెెళితే.. రూ. 52 కోట్ల లాటరీ
మనామా: ఆ భారతీయుడు పొట్టకూటి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. ఆ దేశంలో చిన్నచితకా వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే అంతలోనే ఆ చిరువ్యాపారిని అదృష్టలక్ష్మీ వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 52 కోట్ల లక్కీడ్రాలో అతనికి దక్కింది. దీంతో ప్రవాస భారతీయుడు ఆనందంతో ఉబ్బితబ్బయ్యాడు.కేరళ త్రిసూర్కు చెందిన కృష్ణకుమార్ అనే వ్యక్తి గత 23 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం బహ్రెయిన్కు వెళ్లాడు. అప్పటి నుండి అక్కడ పలురకాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏలాగైనా తన జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని భావించిన కృష్ణకుమార్ లాటరీ టికెట్లను కొనడం ప్రారంభించాడు. అప్పటి నుంచి తరచుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్ బంఫర్ డ్రాలో రూ. 52 కోట్ల ఫ్రైజ్మనీ గెలుచుకుంది. దీంతో బహ్రెయిన్ కరెన్సీ ప్రకారం రూ. రెండు కోట్ల దిర్హమ్లు ( రూ. 52 కోట్ల) రుపాయల ఫ్రైజ్మనీ గెలుచుకున్నారు. అయితే తను కొన్న టికెట్ లక్కీడ్రాలో ఎంపికవడంతో నిర్వాహకులు తనకు ఫోన్ చేశారని ఆసమయంలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని కృష్ణకుమార్ తెలిపారు. అయితే ఇన్నేళ్లుగా తన స్నేహితులతో కలిసి లాటరీ టికెట్లు కొనేవాడినని ఇప్పుడు స్వంతంగా టికెట్ కొనడం దానికి లాటరీ తాకడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఇంతపెద్దమెుత్తంలో డబ్బు చూడడం ఇదే తొలిసారని బహుమతి డబ్బులతో ఏం చేయాలనే విషయం తన కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని కృష్ణకుమార్ అన్నారు. అయితే ఈ లాటరీలో మెుదటి బహుమతి 25 మిలియన్ల దిర్హమ్లు కాగా ఐదుగురికి ఒక మిలియన్, లగ్జరీ కార్లు బహుమతులుగా ఉన్నాయి. -
నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు
నేడు శాటిలైట్లు, డాప్లర్ రాడార్లు, స్మార్ట్ఫోన్ అలర్ట్లు వాతావరణాన్ని ముందుగానే చెబుతున్నాయి. కానీ, టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే కేరళ ప్రజలు నైరుతి రుతుపవనాల రాకను అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేసేవారు. గ్రామాలు, వరి పొలాలు, అడవులు, నదీ తీరాల వెంబడి నివసించే మలయాళీలు ప్రకృతిని నిశితంగా గమనించడం ద్వారా వర్షాన్ని పసిగట్టే పద్ధతులను గ్రహించారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయ పరిజ్ఞానం కేరళ వ్యవసాయ సంస్కృతితో గాఢంగా ముడిపడి ఉంది.కీటకాల కదలికలే వాతావరణ అలర్ట్లువర్షం రాకను సూచించడంలో కీటకాల ప్రవర్తన కీలక పాత్ర పోషించేది. స్థానికంగా ‘ఈయం పాట’ అని పిలిచే రెక్కల చెదపురుగులు నేల నుండి ముదురు రంగులో పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఎగిరితే, త్వరలోనే వర్షం పడుతుందని పెద్దలు నమ్మేవారు. ఒకవేళ తెల్లటి చెదపురుగులు ఎగిరితే వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయని సంకేతంగా భావించేవారు. అలాగే, వరి పొలాలపై ‘తుంబి’ (తూనీగలు) గుంపులుగా నేల నుండి ఒక నిర్దిష్ట ఎత్తులో తిరుగాడితే, దానిని వర్షపాతానికి నమ్మదగిన సూచికగా రైతులు గుర్తించేవారు.చీమల వేగం.. పక్షుల అరుపులుసంప్రదాయ వాతావరణ పరిజ్ఞానంలో చీమల క్రమశిక్షణ కూడా ఒక అద్భుతమైన హెచ్చరికగా పనిచేసేది. చీమలు తమ గుడ్లను నోట కరుచుకుని సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలకు వేగంగా తరలిస్తూ కనిపిస్తే, ఒకటి లేదా రెండు రోజుల్లో భారీ వర్షం కురుస్తుందని గ్రామస్థులు బలంగా నమ్మేవారు. ప్రకృతి అందించే అత్యంత నమ్మదగిన హెచ్చరికలలో ఇది ఒకటి. వీటితో పాటు, పక్షుల అరుపులు, వాటి అసాధారణ కదలికలు కూడా వాతావరణంలో రాబోయే మార్పులకు సంకేతాలుగా నిలిచేవి.వృక్ష సంపదలో వర్షపు ఛాయలుకేరళలోని రైతులు కేవలం జంతువులనే కాకుండా మొక్కలు, చెట్ల మార్పులను కూడా నిశితంగా గమనించేవారు. బ్రహ్మజెముడు (క్యాక్టస్) వంటి కొన్ని అడవి మొక్కలు పూయడం రుతుపవనాల కాలానికి స్వాగత గీతంగా భావించేవారు. అలాగే, విషు పండుగతో ముడిపడి ఉన్న ‘కొన్న’ (రేల చెట్టు) పుష్పించే నమూనాలను బట్టి వర్షాన్ని అంచనా వేసేవారు. కొన్ని ప్రాంతాలలో మర్రిచెట్టు ఊడలను కోసి, వాటి లోపల తేమను పరిశీలించేవారు. అక్కడ తేమ కనిపిస్తే వర్షం త్వరలోనే కురవనుందని చెప్పేవారు.అంతరిక్ష విజ్ఞానం: న్యాట్టువేల క్యాలెండర్సంప్రదాయ అంచనా వ్యవస్థలలో అత్యంత అధునాతనమైనది 'న్యాట్టువేల' క్యాలెండర్. ఇది 27 నక్షత్రరాశుల గుండా సూర్యుని గమనాన్ని బట్టి సంవత్సరాన్ని నిర్దిష్ట వ్యవసాయ కాలాలుగా విభజిస్తుంది. పంటలు విత్తడానికి, నాట్లు వేయడానికి, కోతలకు రైతులు ఈ చక్రాన్నే నమ్ముకునేవారు. ముఖ్యంగా జూన్ నెలలో వేసవి కాలం ముగిసే సమయంలో (సమ్మర్ సోల్స్టిస్) వచ్చే ‘తిరువాతిర న్యాట్టువేల’ అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ కాలం ప్రారంభమైన తదుపరి 14 రోజులు బలమైన, స్థిరమైన వర్షాలు కురుస్తాయని, ఇది పంటల వృద్ధికి ఎంతో అవసరమని భావిస్తారు.ఆధునిక కాలంలోనూ సజీవ సాక్ష్యంప్రస్తుత ఆధునిక యుగంలో అత్యాధునిక వాతావరణ నమూనాలు, సైన్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఈ పురాతన జ్ఞానం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేరళలోని చాలా మంది రైతులు తమ వ్యవసాయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేటికీ ఆధునిక వాతావరణ అంచనాలతో పాటు, ఈ 'న్యాట్టువేల' క్యాలెండర్ పరిశీలనలను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. సాంకేతికత ఎంత పెరిగినా పూర్వీకుల అనుభవానికి ఉన్న విలువను ఇది నిరూపిస్తోంది.అంతరిస్తున్న అపురూప వారసత్వంప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాల నమూనాలు అనూహ్యంగా మారుతున్నాయి. దీనివల్ల కాలక్రమేణా ఈ సాంప్రదాయ అంచనా పద్ధతులు జ్ఞాపకాల నుండి కనుమరుగవుతున్నాయి. అయినప్పటికీ, కేరళ పర్యావరణ, సాంస్కృతిక వారసత్వంలో ఇవి ఎంతో విలువైనవని పరిశోధకులు, చరిత్రకారులు చెప్తున్నారు. శాటిలైట్లు తూనీగలను, వెదర్ యాప్లు చీమలను భర్తీ చేసినా.. మానవుడు ప్రకృతితో ఎంత మమేకమై జీవించవచ్చో చెప్పడానికి కేరళ రైతుల ఈ పురాతన విజ్ఞానమే ఒక సజీవ నిదర్శనం. ఇది కూడా చదవండి: కేరళం తీరాన్ని తాకిన నైరుతి.. దంచికొడుతున్న వర్షాలు -
కేరళం తీరాన్ని తాకిన నైరుతి.. దంచికొడుతున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఒక్కసారిగా పెరిగి, అనేక జిల్లాల్లో భారీ వర్ష సూచనలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత పెరగడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ ప్రవేశాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.కేరళలోని సుమారు 15 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షాలు, తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరగవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇదే సమయంలో కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ తమిళనాడు, చెన్నై ప్రాంతాల్లో కూడా వర్ష సూచనలు వెలువడుతున్నాయి. అక్కడ కూడా మేఘావృత వాతావరణం నెలకొని, రాబోయే గంటల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ఆలస్యంగా, దాదాపు పది రోజుల ఆలస్యంతో కేరళ తీరాన్ని తాకినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి తీవ్రత ఆశించినంత బలంగా లేదని భారత వాతావరణ శాఖ ప్రాథమిక విశ్లేషణలో పేర్కొంది. రుతుపవనాల ప్రస్తుత దశ బలహీనంగానే కొనసాగుతోందని ఐఎండీ అంచనా వేస్తోంది.ఇక రాబోయే వారం రోజుల్లో ఈ రుతుపవనాలు క్రమంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు విస్తరించే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. మరో వారం తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే చాన్స్ కనిపిస్తోంది. దక్షిణ భారతంలో వర్షపాతం పెరుగుతుందా లేదా అన్నది రుతుపవనాల బలం, దిశపై ఆధారపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం కేరళలో వర్షాలు మొదలైన నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాబోయే రోజుల్లో రుతుపవనాల వేగం ఎలా మారుతుందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
మోనాలిసా దంపతులకు ఊరట
కొచ్చి: కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన మోనాలిసా భోస్లేకు, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్కు ఊరట లభించింది. వాళ్లను అరెస్ట్ చేయొద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.మోనాలిసా మైనర్ అని, ఆమెను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు.. అలాగే ఈ వివాహం చట్టబద్ధం కాదనే మధ్యప్రదేశ్ పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అభియోగాలను తోసిపుచ్చుతూ అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ మోనాలిసా, ఫర్మాన్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నెలరోజుల పాటు ఫర్మాన్ ఖాన్ను అరెస్ట్ చేయొద్దని మద్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఈలోగా.. అక్కడి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఈ జంటకు కోర్టు సూచించింది. 2025 కుంభమేళా సందర్భంగా పూసలు విక్రయిస్తూ వైరల్ అయిన మోనాలిసా భోస్తే Monalisa Bhosle ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకుంది. మతాంతర వివాహం కావడంతో ఈ వ్యహారం పెను దుమారం రేపింది. అయితే మోనాలిసా వివాహం సమయంలో కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నారని ఆరోపణలు రావడంతో వివాహ చట్టబద్ధతపై వివాదం చెలరేగింది. దీంతో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఇక మోనాలిసా తండ్రి పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఫర్మాన్ ఖాన్పై కేసు నమోదైంది. తాము ఎలాంటి అక్రమానికి పాల్పడలేదని, మోనాలిసా మైనర్ కాదని దంపతులు కోర్టులో వాదించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు, మోనాలిసా వయస్సుకు సంబంధించిన పత్రాల్లో ఫోర్జరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె జననం 2009 డిసెంబర్లో జరిగిందని, దంపతులు చెబుతున్నట్లుగా 2008 జనవరిలో కాదని వాదించారు. అయితే ఈ ఆరోపణలను మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు ఖండించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్.. ఒక నెలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.ఇదీ చదవండి: కేరళలో ఉండడం మీ అదృష్టం! -
కేరళలో ఉండడం మీ అదృష్టం!
కొచ్చి: కుంభమేళా సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోనాలిసా, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ ముగిసింది. బుధవారం(ఇవాళ) ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తీర్పు రిజర్వ్ చేసే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.విచారణలో భాగంగా న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ “మీరు కేరళలో ఉన్నందుకు అదృష్టవంతులు” అని వ్యాఖ్యానించారు. దానికి మొనాలిసా తరఫు న్యాయవాది.. అందువల్లే వీళ్లు ఇంకా బతికి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెట్టింట దుమారం రేగింది. జడ్జి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..న్యాయ వర్గాల ప్రకారం కోర్టు ఉద్దేశం కేసుపై ప్రత్యక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసు చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భద్రతా పరిస్థితులను పరోక్షంగా సూచించడమేనని భావిస్తున్నారు. కేరళలో న్యాయ ప్రక్రియ తక్కువ ఒత్తిడితో, మరింత నిష్పక్షపాత వాతావరణంలో సాగుతోందన్న సందేశాన్ని ఆ వ్యాఖ్య ద్వారా ఇచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఈ కేసు ఒక సాధారణ వివాహ వివాదం నుంచి ఇప్పుడు ఇంటర్ఫెయిత్ వివాహం, వయస్సు నిర్ధారణ(ఆమె మైనర్ అనే ఆరోపణలు), ఫోర్జరీ ఆరోపణలు, కిడ్నాప్ కేసులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలతో కేరళ-మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద న్యాయ వివాదంగా మారింది. మోనాలిసా వివాహం, ఆమె వయస్సు నిర్ధారణ, మతాంతర వివాహ చట్టబద్ధతతో పాటు పలు రాష్ట్రాల్లో నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు క్లిష్ట అంశాలు ఒకేసారి విచారణ జరిగాయి.ఇక మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమపై వివిధ వర్గాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వయస్సు తప్పుడు నమోదు, ఫోర్జరీ ఆరోపణలు సహా కేసు తీవ్రమని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా రెండు రాష్ట్రాల అంశంగా మారింది. తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. -
పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్
తిరువనంతపురం: నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు హంతకుడి ఆత్మప్రబోధంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని తెలియజేసి లొంగిపోయాడు. కోజికోడ్ జిల్లా కూడరంజికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ అలీ గత ఏడాది పోలీసులను ఆశ్రయించాడు. 1980ల కాలంలో తాను రెండు హత్యలు చేశానని, తనను అరెస్ట్ చేయాలని కోరాడు.అవి తాను తెలియక చేసిన తప్పులని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నానని మీడియాకు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం అతడిని నీటిలో ముంచి చంపేశానన్నాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా, డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్త సారాంశం.తిరువంబడి పోలీసులు 1980ల కాలంలో మలబార్ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. సుదీర్ఘ శాస్త్రీయ విచారణ అనంతరం ఆ మృతుడు కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన మోహనన్గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలాలకు సరిగ్గా సరిపోలడంతో ఈ కేసును ధృవీకరించారు. కాగా, 1989లో కోజికోడ్ బీచ్లో చేసినట్లు చెబుతున్న మరో హత్యకు సంబంధించిన వివరాలను, బాధితుడి గుర్తింపును కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ టెన్షన్: ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే.. -
రిటైర్ అయిన కొన్ని నిమిషాల్లోనే ప్రమోషన్.. ఇదేమి వింత గోల?
తిరువనంతపురం: కేరళలోని కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బిందు అనే మహిళకు ఉద్యోగ జీవితంలో చివరి రోజున ఊహించని అనుభవం ఎదురైంది. 2026 మే 30న ఆమె చివరి పని దినం. ఇన్నేళ్లు సేవలు అందించిన ఆమెకు సహోద్యోగులు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్న సమయంలో, పదవీ విరమణకు సంబంధించిన ప్రక్రియలు పూర్తిచేసిన కొన్ని నిమిషాల్లోనే ఆమెకు ఆశ్చర్యకరమైన సమాచారం అందింది.సాయంత్రం 5 గంటల సమయంలో కళాశాల నుంచి బయలుదేరి, 5.30 గంటలకు ఇంటికి చేరుకున్న బిందుకు వాట్సాప్ ద్వారా సందేశం వచ్చింది. అందులో ఆమెకు పదోన్నతి కల్పించి, త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా నియమించినట్టు పేర్కొన్నారు. మరుసటి రోజే విధుల్లో చేరాలని కూడా ఆదేశించారు.ఈ పదవి సాంకేతిక విద్యాశాఖ పరిపాలనా విభాగంలో ఉన్నత హోదా. సాధారణంగా ఇలాంటి నియామకాలు, పదోన్నతి ఉత్తర్వులు ఈ-ఆఫీస్ వ్యవస్థ ద్వారా జారీ అవుతాయి. అయితే నిర్ణయం చివరి క్షణంలో తీసుకోవడంతో వాట్సాప్ ద్వారా సమాచారం పంపించారు.తాను స్వస్థలం చేర్తలాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ సమాచారం రావడంతో ఆమె ప్రణాళికలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే మరో సమస్య ఎదురైంది. మే 31 ఆదివారం కావడంతో కొత్త ఉద్యోగంలో అధికారికంగా ఎలా చేరాలనే ప్రశ్న తలెత్తింది.బిందు వెంటనే తిరువనంతపురంలోని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ను సంప్రదించారు. అనంతరం త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల సూపరింటెండెంట్తో మాట్లాడారు. అప్పటికే ఆమె నియామకంపై డైరెక్టరేట్ నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు చేరాయి. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు కూడా తెలియజేశారు.స్వస్థలానికి వెళ్లేందుకు బిందు ముందుగానే మావేలి ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే చేర్తలాలో దిగకుండా త్రిస్సూర్లో దిగారు. అక్కడ ఒక బంధువు రైల్వే స్టేషన్ వద్ద ఆమెను తీసుకెళ్లి బస ఏర్పాట్లు చేశారు.సూపరింటెండెంట్ సూచనల మేరకు ఆదివారం ఉదయం ఒక క్లర్క్ ప్రత్యేకంగా కళాశాలకు వచ్చి కార్యాలయాన్ని తెరిచారు. ఉదయం 10 గంటలకు బిందు త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఆమె ఉద్యోగ సర్వీసు అధికారికంగా ముగిసింది. దీంతో ఆ పదవి నుంచి కూడా విరమించారు.అలాగే, 24 గంటల్లోనే బిందు రెండు సార్లు పదవీ విరమణ చేసిన అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. మొదట కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అకౌంట్స్ అధికారిగా, ఆ తర్వాత త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా పదవీ విరమణ చేశారు.పదోన్నతి వస్తుందని బిందు ఆశించినప్పటికీ, ఉత్తర్వులు ఆలస్యం కావడంతో మే మధ్య నాటికే ఆశలు వదులుకున్నారు. అయితే చివరి క్షణంలో పదోన్నతి రావడంతో, ఆ హోదాతోనే పదవీ విరమణ చేయగలిగినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. లలిత అంబికా దేవి, దివంగత రామచంద్ర పణిక్కర్ దంపతుల కుమార్తె అయిన బిందు, చేర్తలాలోని పట్టణక్కడ్లో నివసిస్తున్నారు. ఆమె భర్త అనిల్ కుమార్ రిటైర్డ్ సైనిక అధికారి. వీరికి వైశాఖ్, డాక్టర్ వైష్ణ శ్యామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
స్కూళ్లు తెరుచుకున్న రోజే ఘోరం.. విచారణకు ఆదేశాలు
తిరువనంతపురం: కేరళలో జూన్ ఒకటిన కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. అయితే ఇంతలోనే తిరువనంతపురంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత పురాతన విద్యాసంస్థల్లో ఒకటైన అట్టాకుళంకర సెంట్రల్ హైస్కూల్ భవనంలోని ఒక భాగం ఊహించని రీతిలో కుప్పకూలింది. అయితే, అదృష్టవశాత్తూ తరగతులు ముగిసి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.పెను ప్రమాదం తప్పిందిసాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కూలిపోయిన ఆ భాగంలో సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కార్యాలయం ఉంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి హాని జరగలేదు. ఒకవేళ స్కూల్ వేళల్లో గనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే, పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిజనిర్ధారణకు విచారణఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఎన్. షంసుద్దీన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. భవనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? క్రమ పద్ధతిలో భద్రతా తనిఖీలు జరిగాయా? లేదా? అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాతబడిన నిర్మాణాల కండిషన్పై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.భయపెడుతున్న పురాతన భవనాలుతిరువనంతపురంలోని అత్యంత పురాతన విద్యాసంస్థల్లో అట్టాకుళంకర స్కూల్ ఒకటి. ఈ భవనాల దుస్థితిపై గతంలోనే పలుమార్లు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత స్కూల్ భవనాల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. పాఠశాల ప్రాంగణం మొత్తం పరిశీలించి, తదుపరి భద్రతా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త: లైవ్లోకి సీబీఎస్ఈ రీ ఎవాల్యుయేషన్ పోర్టల్ -
రిటైర్మెంట్ వయసులో నియామక ఉత్తర్వు
మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ముచ్చికల్ అబ్దుల్ మజీద్కు ఎదురైన పరిస్థితి ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు పీఎస్సీ ఉద్యోగ నియామక ఉత్తర్వు అందింది. అయితే ప్రస్తుతం మజీద్ వయస్సు 60 ఏళ్లు దాటడంతో, ఉద్యోగంలో చేరడమా లేదా రిటైర్మెంట్ తీసుకోవడమా అన్న సందిగ్ధంలో ఆయన చిక్కుకుపోయారు.2005లో పీఎస్సీ పరీక్ష రాసి..2005లో మజీద్ పార్ట్-టైమ్ జూనియర్ ఎల్పీఎస్ అరబిక్ లాంగ్వేజ్ టీచర్ పోస్టు కోసం పీఎస్సీ పరీక్ష రాశారు. ఆ ర్యాంక్ లిస్టులో ఆయన 12వ స్థానంలో నిలిచారు. నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగం ఆయనకు దక్కాల్సింది. కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ ప్రక్రియ 18 ఏళ్ల పాటు సాగదీతకు గురైంది. 2022లో ఆ ఖాళీని పీఎస్సీ గుర్తించినప్పటికీ, ఉత్తర్వు రావడానికి మరో నాలుగేళ్లు పట్టింది.పరిపాలనా వైఫల్యాలకు పరాకాష్టఒక నియామక ప్రక్రియ గరిష్టంగా ఏడాదిలోపు పూర్తి కావాల్సిన చోట, దాదాపు రెండు దశాబ్దాలు పట్టడం వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. 2026 ఏప్రిల్ 26న మజీద్కు నియామక ఉత్తర్వు అందినప్పటికీ, అప్పటికే ఆయన పదవీ విరమణ వయసు చేరుకోవడంతో అది అపహాస్యం పాలైంది. అధికార యంత్రాంగం, పీఎస్సీ వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.న్యాయం కోసం పోరాటంప్రస్తుతం తన రికార్డుల్లో పుట్టిన తేదీకి సంబంధించి ఉన్న చిన్న తప్పును సరిదిద్దాలని మజీద్ కోరుతున్నారు. తన అసలు పుట్టిన తేదీ ఆధారంగా, కనీసం ఒక్క ఏడాది పాటు సర్వీసులో ఉండే అవకాశం కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. పట్టు వదలని ఈ ఉపాధ్యాయుని పోరాటపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చసాగుతోంది.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ? -
‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. Tragic incident from God’s own countryHere is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle.Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్ను హుటాహుటిన పనవూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి. అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.నెలల వయసు నుంచే..అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. ఆగ్రహంతో దంచి కొట్టారు!పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆదివారం అష్కర్ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026 -
మమత ఓటమితో.. కేరళ ప్లైవుడ్ పరిశ్రమలకు 2వేల్ కోట్ల నష్టం
-
సౌదీ నుంచి సజీవంగా వస్తాడనుకోలేదు..!
రెండు దశాబ్దాల ఆ తల్లి నిరీక్షణకు తెరపడింది. కోట్ల రూపాయల ‘బ్లడ్ మనీ’.. దీర్ఘకాల న్యాయపోరాటం, అంతర్జాతీయ స్థాయిలో సాగిన చర్చల అనంతరం అబ్దుల్ రహీమ్ చివరికి స్వదేశానికి చేరాడు. అదీ ఈద్ అల్ అదా రోజున!. ఇంకేం కోజికోడ్ విమానాశ్రయంలో ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు అల్లా సమాధానం ఇచ్చాడు” అంటూ తల్లి ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని కదిలించాయి.కేరళలోని కోజికోడ్ జిల్లా ఫెరోక్కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఆయన డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో, ఆయన సంరక్షణలో ఉన్న ఓ ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారి మరణించిన ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సౌదీ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. ఆ చిన్నారి సౌదీ వ్యాపారవేత్త అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి కొడుకు. ఆ బాలుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, వైద్య సహాయక పరికరాలపై ఆధారపడి చికిత్స పొందుతున్నాడు. ఒక సందర్భంలో ఆ చిన్నారికి అమర్చిన వైద్య సహాయక పరికరాన్ని రహీమ్ అనుకోకుండా తాకాడు. దీంతో అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.తాను కావాలని చేయలేదని రహీమ్ చెప్పినా కోర్టులు వినలేదు. ఈ ఘటనపై సౌదీ కోర్టు విచారణ జరిపి 2012లో ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత కేసు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కొడుకు మీద ఆశలు వదిలేసుకున్న టైంలో.. దగ్గరి బంధువు ద్వారా బ్లడ్ మనీ గురించి తెలుసుకుంది రహీమ్ తల్లి ఫాతిమా. కొందరు అధికారులు, మత పెద్దలు ద్వారా కొడుకు విడుదల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా నెలల తరబడి చర్చల తర్వాత.. రహీమ్కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి బ్లడ్మనీకి అంగీకరించింది. కేరళలో పెద్ద ఎత్తున మానవతా సహాయ ప్రచారం ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు, వ్యాపారులు, విద్యార్థులు కలిసి నిధులు సేకరించారు. మొత్తం సుమారు రూ.47 కోట్లు సమీకరించగా, అందులో రూ.34 కోట్లు ‘బ్లడ్ మనీ’గా బాధిత కుటుంబానికి చెల్లించారు. అనంతరం బాధిత కుటుంబం క్షమాభిక్ష ఇవ్వడంతో 2014లో మరణశిక్ష రద్దయింది. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.సౌదీ చట్టాల ప్రకారం పబ్లిక్ రైట్స్ కింద ఆయనకు అప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. దీంతో.. ఆ శిక్ష పూర్తయ్యేదాకా ఆయన ఆగాల్సి వచ్చింది. ఇటీవల ఆ శిక్షపూర్తి కావడంతో రహీమ్ విడుదల అయ్యాడు. ఈద్ పండుగ రోజున ఆయన కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, వందలాది మంది కుటుంబ సభ్యులు, మద్దతుదారులు అక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆ క్షణం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.ఇంటివద్ద కూడా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తల్లి ఫాతిమా కన్నీళ్లతో కుమారుడిని ఆలింగనం చేసుకుని, “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు ఈ రోజు సమాధానం లభించింది” అని చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భారత రాయబార కార్యాలయం, లీగల్ కమిటీ సహకారంతో అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసి ఆయన స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటన కేరళలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మలయాళీ సమాజంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.నిమిషా ప్రియా పరిస్థితి?రహీమ్ ఘటన నేపథ్యంలో.. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియా కేసు కూడా కొనసాగుతోంది. 2017లో ఓ యెమెన్ పౌరుడి మరణ ఘటనలో ఆమెపై కేసు నమోదై కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాలు, భారత ప్రభుత్వ వర్గాలు కలిసి ఆమె శిక్షను నిలిపివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ‘బ్లడ్ మనీ’ ద్వారా క్షమాభిక్ష సాధించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, కేసు ఇంకా తుది దశకు చేరలేదు. -
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎల్నివో ప్రభావంతో ఐఎండీ అంచనాలు తలకిందులయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమవుతోంది. నెమ్మదిగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు... జూన్ 4,5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను తాకిన మూడు రోజుల తర్వాత తెలంగాణలో రుతు పవనాలు ప్రవేశించనున్నాయి.మే చివరి వారంలో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ భావించింది. అయితే, ఈ ఏడాది ఇంకా అక్కడ విస్తరించలేదు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ సీజన్లో వర్షపాతం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రుతు పవనాల రాక ఆలస్యం కావడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. రుతుపవన గాలులు అరేబియా సముద్రంలోని చాలా భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోకి మరింత ముందుకు సాగాయి. రుతుపవనాల గమనం ప్రస్తుతం నెమ్మదిగా ఉన్నప్పటికీ.. అవి సహజంగానే మళ్లీ పుంజుకుంటాయని ఐఎండీ పేర్కొంది.రుతుపవనాల విస్తరణకు ఆటంకం కలిగించిన సముద్ర, వాతావరణ పరిస్థితులు ఇప్పుడు క్రమంగా తొలగిపోతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం.. రుతుపవనాల వ్యవస్థ నైరుతి అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా మయన్మార్ వరకు విస్తరించి ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.సాధారణంగా జూన్ 1న ప్రవేశించే రుతుపవనాలు.. ఈసారి దాదాపు ఐదు రోజులు ముందుగానే.. మే 26 నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ గతంలో అంచనా వేసింది. అయితే.. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా రుతుపవన గాలులు తాత్కాలికంగా బలహీనపడ్డాయి. కాగా, ప్రస్తుత మందగమనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించాయి. ఇప్పుడు వాయవ్య దిశగా వేగంగా కదులుతున్నాయి. ప్రారంభ అంచనాతో పోలిస్తే స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ.. రుతు పవనాల ప్రస్తుత కదలిక సాధారణంగానే ఉన్నాయి.సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 27 నాటికి రాజధాని ఢిల్లీకి చేరుకుంటాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా.. జూన్ 25 నుండి 30 మధ్య రుతుపవనాలు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మందగమనం జూన్ మొదటి వారం వరకు కొనసాగకపోతే.. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాల గమనం చాలా వరకు సాధారణంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
కేరళ అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ సతీశన్-విజయన్!
కేరళ రాజకీయాల్లో మరోసారి “వందేమాతరం” వివాదం చెలరేగింది. కొత్త అసెంబ్లీ సమావేశాల తొలి రోజే జాతీయ గీతం ఆలాపన చుట్టూ మొదలైన వివాదం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. గవర్నర్ సమక్షంలో పూర్తి “వందేమాతరం” వినిపించాల్సిన కేంద్ర మార్గదర్శకాలను పాటించలేదంటూ బీజేపీ మండిపడుతుండగా.. ఇది ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సంప్రదాయమేనని ప్రభుత్వం సమర్థించుకోవడం, దానికి ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.తిరువనంతపురంలోని అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగానికి ముందు “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపించారు. అయితే 2026 ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాల్లో పూర్తి ఆరు చరణాలు వినిపించాలని సూచించిందని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై గవర్నర్ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ షమ్షీర్ దృష్టికి ప్రోటోకాల్ అంశాన్ని తీసుకెళ్లారు.VIDEO | Thiruvananthapuram: Kerala Governor Rajendra Vishwanath Arlekar on truncated 'Vande Mataram' being reportedly played ahead of his address in the state Assembly, says, "What we had insisted that there has to be, whenever Governor is present, it is the protocol, you are… pic.twitter.com/liuZK9IBsx— Press Trust of India (@PTI_News) May 29, 2026అయితే ఈ వ్యవహారంపై కేరళ ప్రభుత్వం మాత్రం ఇది కొత్త విషయం కాదని స్పష్టం చేసింది. అసెంబ్లీలో గతం నుంచే “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపిస్తున్న సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత పినరయి విజయన్ కూడా ప్రభుత్వ వైఖరినే సమర్థించారు. పూర్తి “వందేమాతరం” ఆలాపన తప్పనిసరి కాదని, 2026 మార్చిలో సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దీంతో ఇది కేవలం ప్రోటోకాల్ వివాదమా? లేక రాజకీయ సంకేతమా? అన్న చర్చ మొదలైంది.ఇక బీజేపీ నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. “వందేమాతరం”కు 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఇలా చేయడం జాతీయ గీతానికే అవమానమని విమర్శించారు. గవర్నర్ను, లోక్భవన్ను, జాతీయ వారసత్వాన్ని కూడా అవమానించినట్లేనని ఆరోపించారు. అంతేకాదు.. ప్రభుత్వం జమాత్-ఏ-ఇస్లామీ, సీపీఎం అభిప్రాయాలకు తలొగ్గుతోందంటూ ఆరోపణలు గుప్పించారు.ചരിത്രത്തിൽ ആദ്യമായി കേരള നിയമസഭയിൽ❤️ വന്ദേ മാതരം ❤️For the first time in history, “Vande Mataram” was sung in the Kerala Legislative Assembly.🔥🔥 pic.twitter.com/f0URhQmPGd— ശിവ (@Rathees19362122) May 29, 2026మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వివాదం తలెత్తడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ 102 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి అసెంబ్లీలో “వందేమాతరం” ఆలాపన కూడా చారిత్రక పరిణామమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. 1957 తర్వాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. “వందేమాతరం”లో ఎన్ని చరణాలు పాడాలి అనే అంశం ఇప్పుడు కేరళలో రాజకీయ, సాంస్కృతిక, రాజ్యాంగ చర్చకు దారితీసింది. -
పంపా నదిలో ఇక ‘నో డంపింగ్’!
శబరిమల యాత్ర నేపథ్యంలో పరమపవిత్రంగా భావించే పంపా నది కాలుష్య కూపంగా మారడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పడేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొంటూ.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.శబరిమల యాత్రకు వచ్చే భక్తులు సంప్రదాయాల పేరుతో పాత బట్టలు, తువాళ్లు పంపా నదిలో వదిలిపెడుతుండడం, అలాగే చెత్తను పారబోస్తుండడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీనివల్ల నది కాలుష్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ దృశ్యాలు బయటకు రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా హైకోర్టు స్వయంగా (సుమోటోగా) ఈ అంశాన్ని విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కేసును విచారించిన హైకోర్టు.. అధికారులపై గత విచారణల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యంత్రాంగం కదిలి క్లీన్ డ్రైవ్ చేపట్టింది. ఇప్పటికే నదిలో పేరుకుపోయిన బట్టలు, వ్యర్థాల్లో 97 శాతం వరకు తొలగించినట్లు కోర్టుకు శుక్రవారం నివేదించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంటూ సుమోటో పిటిషన్ను ముగించింది.అయితే భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డుతో పాటు పాటు స్థానిక సంస్థలు, పోలీసులు, సంబంధిత అధికారులు కలిసి పనిచేసి పంపా నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పారబోయకుండా నిరోధించాలని ఆదేశించింది.అలాగే శబరిమల యాత్రికుల్లో అవగాహన పెంచాలని, నది పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని కోర్టు వ్యాఖ్యానించింది. నదీ తీరాల్లో పర్యవేక్షణ పెంచడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.కేరళలోని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన నదుల్లో పంపా నది ఒకటి. ఈ నది పశ్చిమ కనుమలలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న పులచిమల కొండల ప్రాంతంలో పుట్టి.. పథనంతిట్ట, అలప్పుజా గుండా సుమారు 175 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. చివరకు వెంబనాడ్ సరస్సులో కలిసే ఈ నది, అక్కడి నుంచి అరేబియా సముద్రాన్ని చేరుతుంది.శబరిమల అయ్యప్ప స్వామి యాత్రలో పంపా నదికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అయ్యప్ప భక్తులు ఆలయ దర్శనానికి ముందు ఈ నదిలో పవిత్ర స్నానం చేసి, పాప విమోచనం కలుగుతుందని విశ్వసిస్తారు. అందుకే పంపాను “దక్షిణ గంగ” అని కూడా పిలుస్తారు. అంతేకాదు.. కేరళలో తాగునీరు, సాగు, మత్స్యకార రంగాలకు కూడా ఈ నది కీలక ఆధారంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో యాత్రికుల రద్దీ, వ్యర్థాల పారవేత, కాలుష్యం కారణంగా పంపా నది పరిశుభ్రతపై పర్యావరణవేత్తల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. -
రెండు దశాబ్దాల తరువాత..
కేరళలోని కోజికోడ్ సమీపంలో ఉన్న ఫెరోక్లోని ఆ ఇంట్లో బక్రీద్ నాడు అసలైన వేడుక జరిగింది. సౌదీ జైలులో రెండు దశాబ్దాలు గడిపి, మరణశిక్షను ఎదుర్కొన్న వ్యక్తి కేరళకు తిరిగి వచ్చాడు. టీనేజర్ మృతికి కారణమయ్యారనే అభియోగంతో మరణశిక్ష పడిన వ్యక్తి.. ఉరిశిక్ష నుంచి తృటిలో తప్పించుకుని ఇంటికి తిరిగొచ్చాడు. డ్రైవర్గా వెళ్లి కేర్ టేకర్గా..సౌదీ అరేబియాకు వెళ్లడానికి ముందు రహీం కేరళలో ఆటోరిక్షా, స్కూల్ బస్సు నడిపాడు. ఆరుగురు తోబుట్టువులలో అందరికంటే చిన్న వాడైన అతను, డ్రైవర్గా ఉద్యోగం సంపాదించి తర్వాత 2006 నవంబర్ 28న రియాద్కు వెళ్లాడు. కానీ, పక్షవాతంతో బాధపడుతూ శ్వాస పరికరంపై ఆధారపడి జీవిస్తున్న 17 ఏళ్ల వ్యక్తికి కేర్టేకర్గా పని ఇచ్చారు. 2006 డిసెంబర్ 24న, ఆ బాలుడిని వెనుక కూర్చో బెట్టుకుని రహీమ్ వాహనం నడుపుతుండగా శ్వాస సహాయక పరికరం ఊడిపోవడంతో ఆ బాలుడు మరణించాడు. అప్పుడు 26 ఏళ్ల వయసున్న రహీం, సౌదీ అరేబియాకు వచ్చిన కేవలం 28 రోజులకే అరెస్టయ్యాడు. 2011లో సౌదీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ శిక్షను సమర్థించాయి.పరిహారంతో పరిష్కారం...అతనికి మరణశిక్ష ఎప్పుడైనా పడొచ్చని అతని కుటుంబం అనుక్షణం భయంతో జీవించింది. అయితే రూ. 34 కోట్ల పరిహారం ఇస్తే రహీంను క్షమించడానికి ఆ కుటుంబం అంగీకరించింది. దీంతో అతని మరణ శిక్షను రద్దు చేశారు. పొట్టకూటి కోసం అంతదూరం వెళ్లిన రహీం అంతమొత్తాన్ని ఎలా ఇవ్వగలడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ సమాజం అతనికి సాయం చేసింది. భారీ క్రౌడ్ఫండింగ్తో విరాళాలు వెల్లువెత్తాయి. నాలుగు రోజుల్లోనే విరాళాలు సేకరించి పరిహారం పూర్తిగా చెల్లించారు. అయితే, రహీం 20 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేయాలని సౌదీ అధికారులు ఆదేశించారు. అరబిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే 20న ఆ శిక్ష ముగిసింది.తండ్రిని కోల్పోయి.. కోజికోడ్లో రహీం కుటుంబానికి ఈ సమయం పరీక్షలా నిలిచింది. అతను జైలు పాలైన ఆరు నెలలకే తండ్రి ముహమ్మద్కుట్టి మరణించారు. క్షమాభిక్ష మంజూరైన తర్వాత 2024 నవంబర్లో తల్లి ఫాతిమా అతన్ని ఒక్కసారి మాత్రమే కలవగలిగింది. వీడియో కాల్స్ వారికి ఊరటనిచ్చాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణకు గురువారం తెరపడింది. తనకు పునర్జన్మను ప్రసాదించిన వారందరికీ రహీం కృతజ్ఞతలు తెలిపాడు. ఇంటికి చేరుకున్న రహీం ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. తన ప్రాణాలు నిలబెట్టి, తన విడుదలను సుసాధ్యం చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులందరికీ రహీం ధన్యవాదాలు తెలిపాడు. బక్రీద్ పండుగ సమయంలోనే రహీం తిరిగి రావడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతని స్నేహితులు, స్థానికులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ఇది కూడా చదవండి: పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు -
పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి
-
విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఈడీ అధికారుల వాహనంపై దాడి
తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారుల వాహనంపై విజయన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తిరువనంతపురంలో ఆందోళనకారులను అదుపు చేసే సమయంలో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. విజయన్పై ఈడీ దాడి బీజేపీ-కాంగ్రెస్ ఒప్పందంలో భాగమని సీపీఎం ఆరోపణలు చేస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి తిరువనంతపురం, కన్నూరులో విజయన్ ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో పినరయి విజయన్ ఇళ్లు సహా కేరళంలోని 10 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు.వందలాది పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు, మాజీ మంత్రులు విజయన్ ఇంటి ఎదుట గుమిగూడారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యకర్తలు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు కాంగ్రెస్-బీజేపీ ఒప్పందంలో భాగమని అన్నారు. సీపీఎంను బలహీనపర్చే ప్రయత్నాలను ఆందోళనలు, న్యాయ పోరాటాలతో ఎదుర్కొంటామని చెప్పారు. -
విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు
కేరళం మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత పినరయి విజయన్కు బిగ్ షాక్ తగిలింది. ఆయన నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆకస్మిక తనీఖీలకు దిగింది. విజయన్ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నట్లు ఏఎన్ఐ సంస్థ ఓ కథనం ఇచ్చింది. ఈ సోదాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం కూడా ఉందని ఆ కథనం పేర్కొంది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో.. పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. విజయన్ కుమార్తె వీణ అవినీతి కేసులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.ఏంటీ సీఎంఆర్ఎల్ కేసు?కేరళ రాజకీయాల్లో ఇటీవల తరచూ చర్చకు వచ్చిన అంశాల్లో సీఎంఆర్ఎల్ కేసు ఒకటి. కొచిన్ మినలర్స్ అండ్ రూటిలె లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత, సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఈ చెల్లింపులు ప్రధానంగా కన్సల్టెన్సీ/సర్వీస్ ఫీజుల పేరుతో జరిగినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ సేవలు నిజంగా అందించబడ్డాయా? లేదా? అనేది ప్రధాన వివాదాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రాజకీయ, మీడియా వర్గాలు ఈ లావాదేవీలపై ప్రశ్నలు లేవనెత్తాయి.విజయన్ కూతురి పేరుతో..ఈ వివాదంలో ముఖ్యంగా వీణా విజయన్కు సంబంధించిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ (Exalogic Solutions) అనే సంస్థ పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని అప్పటి ప్రతిపక్ష పార్టీలు విజయన్ సర్కార్పై విరుచుకుపడ్డాయి. అయితే ఈ ఆరోపణలను వీణా విజయన్ ఇప్పటికే ఖండించారు. తమపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరితమని, అన్ని లావాదేవీలు చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగాయని ఆమె చెప్పారు. అయినప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నాడు అధికార పక్షంగా ఉన్న విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఈ ఆరోపణలను రాజకీయ దాడిగా అభివర్ణించింది. ప్రతిపక్షాలు మాత్రం అవినీతి అనుమానాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్ని తమ ఆయుధంగా యూడీఎఫ్ మల్చుకుంది. అలా విజయన్ ఓటమిలో ఈ ఆరోపణలు కూడా ఓ భాగం కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ కేసులో కోర్టు స్థాయిలో(హైకోర్టులో విచారణ దశలో ఉంది) నేరం నిర్ధారణ కాలేదు. అయితే ఈడీ సోదాల నేపథ్యంలో ఈ కేసు మరోసారి ప్రాముఖ్యతను సంతరించుకుంది. -
టాయిలెట్లో బిడ్డను కని.. వెంటిలేటర్ నుంచి విసిరేసి..
హరిపాడు: కేరళలోని అలప్పుజ జిల్లా, హరిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కడుపునొప్పిగా ఉందని చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన 19 ఏళ్ల విద్యార్థిని, టాయిలెట్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ఆ నవజాత శిశువును ఆస్పత్రి టాయిలెట్ వెంటిలేటర్ గుండా బయటకు విసిరేసింది.ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తతతో..తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో విద్యార్థిని టాయిలెట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే, బయట నుంచి పసికందు ఏడుపు వినిపించడాన్ని డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గమనించారు. డాక్టర్లు తిష, డాక్టర్ ఆల్ఫీ, నర్సింగ్ ఆఫీసర్ జిషా, సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో గాలించారు. ఆస్పత్రి భవనం వెలుపల పడి ఉన్న శిశువును గుర్తించి రక్షించారు.ప్రాణాపాయం నుంచి..ఆ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల, చిన్నారికి ప్రమాదం పొంచి ఉండేది. కానీ, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, వేగంగా స్పందించడం వల్ల శిశువు ప్రాణాలతో దక్కింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, పసికందు సురక్షితంగా ఉంది. ప్రస్తుతం చిన్నారి, ఆమె తల్లి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తల్లికి, బిడ్డకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వారిద్దరినీ ఆలప్పుజ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై పిటిషన్.. సీజేఐ ఘాటు వ్యాఖ్యలు! -
‘షిగెల్లా’ మళ్లొచ్చింది.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ జిల్లా పెరుమన్నలో ఇద్దరు చిన్నారులకు షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. రెండుమూడేళ్ల వయస్సు గల ఈ ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పెరుమన్న పంచాయతీ పరిధిలోని పరక్కండం, పుతియోటిల్ ప్రాంతాలకు చెందిన ఈ చిన్నారులకు అనారోగ్య లక్షణాలు కనిపించడంతో, మొదట స్థానిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మెడికల్ కాలేజీకి తరలించారు.తీసుకుంటున్న జాగ్రత్తలుషిగెల్లా నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. గతంలో కోజికోడ్లోని పెరువయల్ గ్రామ పంచాయతీలో షిగెల్లా ప్రబలి, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా, నివారణ చర్యలతో దానిని అదుపులోకి తెచ్చారు. అదే తరహా చర్యలను ఇప్పుడు పెరుమన్నలో కూడా అమలు చేస్తున్నారు.షిగెల్లా అంటే ఏమిటి?‘షిగెల్లా’ బ్యాక్టీరియా గ్రూపు వల్ల కలిగే పేగు సంబంధిత ఇన్ఫెక్షన్నే ‘షిగెల్లోసిస్’ అని పిలుస్తారు. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ప్రధానంగా విరేచనాలు, తీవ్రమైన సందర్భాల్లో రక్తంతో కూడిన విరేచనాలు దీని ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి వల్ల కలిగే ‘డీహైడ్రేషన్’ అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోతే ఇది ప్రాణాపాయానికి దారితీయవచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, సరైన సమయంలో చికిత్స అందిస్తే దీనిని పూర్తిగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.లక్షణాలుషిగెల్లా బ్యాక్టీరియా పేగు పొరలకు సోకినప్పుడు, అది ‘షిగెల్లా టాక్సిన్’ అనే విషాన్ని విడుదల చేస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి నుండి మూడు రోజులలోపు (కొన్ని సందర్భాల్లో వారం రోజులలోపు) లక్షణాలు కనిపిస్తాయి.* రక్తం, శ్లేష్మంతో కూడిన విరేచనాలు* తీవ్రమైన కడుపు నొప్పి* వాంతులు, వికారం* మల విసర్జన తర్వాత కూడా ఇంకా అవ్వాలనే భావన కలగడం* కొన్ని సందర్భాల్లో ఫిట్స్ వంటి నాడీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.చికిత్సడీహైడ్రేషన్ నివారణ: శరీరంలో కోల్పోయిన నీరు, లవణాలను భర్తీ చేయడం ప్రధాన చికిత్స. ఓఆర్ఎస్ ద్రావణం, ఉప్పు కలిపిన గంజి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. సాధారణ విరేచనాలకు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. కానీ షిగెల్లోసిస్ విషయంలో ఇన్ఫెక్షన్ తీవ్రతను, వ్యాప్తిని తగ్గించడానికి వైద్యులు వీటిని సూచించవచ్చు. సకాలంలో వ్యాధిని గుర్తించకపోవడం వల్లే సమస్య తీవ్రమవుతోందని, రోగులు ఆసుపత్రికి వచ్చేసరికి తీవ్రమైన నిర్జలీకరణకు లోనవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క కాఫీ.. చిన్న పేస్ట్రీ.. పెద్ద ఉపశమనం! -
లాటరీ టికెట్ల విక్రేతకు రూ.12 కోట్ల జాక్పాట్
కొల్లాం(కేరళ): కేరళకు చెందిన ఓ లాటరీ టికెట్ల విక్రేత ఏకంగా రూ.12 కోట్ల జాక్పాట్ గెల్చుకున్నారు. శనివారం ప్రకటించిన విష్ణు బంపర్ లాటరీలో ఈయన తన కోసం ఉంచుకున్న టికెట్ కోట్లు కురిపించింది. కొల్లాంకు చెందిన పొన్నన్ రోడ్డు పక్కన లాటరీ టికెట్లను అమ్ముతుంటారు. ఆయన భార్య, కుమారుడు చేసేదీ ఇదే. ‘నా లక్కీ నంబర్ 2, నేను సొంతానికి ఉంచుకున్న టికెట్ చిట్టచివరి నంబర్ కూడా ఇదే‘అని పొన్నన్ అన్నారు. లాటరీ వచ్చిందని చెబితే తానస్సలు నమ్మలేకపోయానన్నారు. ‘ఒకటికి పదిసార్లు చూసుకున్నా..కచ్చితంగా అది నా దగ్గరున్న టికెట్కే వచ్చిందా అని, నేను నమ్మకలేకపోయా’అంటూ ఆయన ఉద్వేగంతో చెప్పారు. ‘పేదలకు పిల్లనిచ్చే వారే దొరకడం లేదు. ఇకనైనా నా కుమారుడిని తగిన వధువు దొరుకుతుందం’టూ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మా ఆయన ఇప్పుడు కోటీశ్వరుడు. మాకున్న అప్పులన్నీ తీరుతాయి’అంటూ పొన్నన్ భార్య అంటోంది. -
‘దేశ అస్థిరతకే ‘కాక్రోచ్’ పార్టీ: బీజేపీ మండిపాటు
తిరువనంతపురం: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేవలం ఒక వ్యంగ్య ప్రచారం కాదని, దీని వెనుక సరిహద్దు ఆవల నుండి జరుగుతున్న ఒక క్రమబద్ధమైన కుట్ర ఉందని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి, దేశాన్ని అస్థిరపరచడమే ఈ ప్రచారంలోని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.డిజిటల్ యుద్ధంలో కొత్త ఎత్తుగడరాజీవ్ చంద్రశేఖర్ ఈ వ్యవహారాన్ని ‘క్లాసిక్ క్రాస్-బోర్డర్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్’గా అభివర్ణించారు. బాట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డిజిటల్ మానిప్యులేషన్ ఉపయోగించి, సహజమైన ప్రజా ఉద్యమంలా సోషల్ మీడియాలో కథనాలను అల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం సాధిస్తున్న ఆర్థిక ప్రగతిని ఓర్వలేని శక్తులే ఇలాంటి అశాంతిని ప్రేరేపిస్తున్నాయని, ఇవన్నీ దేశాభివృద్ధిని దెబ్బతీయలేవని ఆయన స్పష్టం చేశారు.కేరళలో ఊపందుకున్న ప్రచారంగత వారం వెలుగులోకి వచ్చిన ఈ సీజేపీ ఉద్యమం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది. ‘ ఎక్స్’ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసినా, 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' పేరుతో మరో ఖాతా పుట్టుకొచ్చింది. కేరళకు చెందిన పలువురు యువ ఎమ్మెల్యేలు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం గమనార్హం. విద్యాశాఖ మంత్రిని తొలగించాలన్న డిమాండ్తో వీరు చేస్తున్న ఆన్లైన్ ప్రచారాలు చర్చనీయాంశంగా మారాయి.బెంగళూరు పోలీసుల హెచ్చరికఈ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. మే 24న బెంగళూరు టౌన్ హాల్ వద్ద ‘శాంతియుత మానవ గొలుసు’ నిర్వహిస్తామని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. బాధ్యతారహితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ వ్యంగ్యం పేరుతో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. -
ఆ ముఖం అయితే కచ్చితంగా గెలిచేవాళ్లం
కేరళం రాజకీయాల్లో ఒకప్పుడు “విజయానికి బ్రాండ్”గా కనిపించిన పార్టీ.. విమర్శలు, ఓటమి అనే ఎదురుదెబ్బతో ఆత్మపరిశీలనలో పడింది. సాధారణంగా.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థులపైనే విమర్శలు వినిపిస్తాయి. కానీ అక్కడ మాత్రం అక్కడి రాజకీయాల్లో మునుపెన్నడూ కనిపించని వాతావరణం కనిపిస్తోంది. బహిరంగంగా తమ నాయకత్వ నిర్ణయాలను సీపీఎం కార్యకర్తలే తప్పుబడుతున్నారు. పార్టీ ఓటమికి “కమ్యూనలిజం”, “మైనారిటీ ఓట్ల ధ్రువీకరణ” కారణమంటూ సీపీఎం రాష్ట్ర నాయకత్వం ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయి కేడర్ మాత్రం ఆ వాదనను నేరుగా తిరస్కరిస్తున్నారు. “మైనారిటీ ఓటు కాదు.. సీపీఎం సంప్రదాయ ఓటర్లే దూరమయ్యారు” అంటూ గణాంకాలతో సహా చెబుతున్నారు. తాళిపరంబ ఏరియా కమిటీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు సీపీఎంలో పెరుగుతున్న అసహనాన్ని బహిర్గతం చేశాయి.కన్నూర్ జిల్లాలోని తాళిపరంబ నియోజకవర్గం సీపీఎంకు కంచుకోటగా ఉంటూ వచ్చింది. విజయన్కు అత్యంత సన్నిహితుడైన ఎంవీ గోవిందన్ ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఈ ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ను అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదు. గోవిందన్నే అక్కడ బరిలోకి దింపాలని కిందిస్థాయి శ్రేణులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశాయి. అయితే పీకే శ్యామలను అభ్యర్థిగా దింపి ప్రయోగం చేసింది. అయితే అనూహ్యంగా.. యూడీఎఫ్ మద్దతుతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగిన టీకే గోవిందన్ ఇక్కడ ఘన విజయం సాధించారు. దీంతో దశాబ్దాల తర్వాత ఇక్కడ సీపీఎం అభ్యర్థి ఓటమిపాలైనట్లయ్యింది. “ప్రజల్లో ఆదరణ లేని ముఖాలను ముందుకు తెచ్చారు. నిజంగా ప్రజలు నమ్మిన నాయకత్వాన్ని పక్కన పెట్టారు” అంటూ మండిపడ్డారు. ఈ చర్చల్లో ఎక్కువగా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ పేరు ఎక్కువగా వినిపించింది. నిపా, కరోనా వైరస్ సమయాల్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆమెను ముఖ్యమంత్రి ముఖంగా ముందుకు తెచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వాళ్లంతా బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. “ఆమె ముఖం అయితే గెలిచేవాళ్లం” అన్న వ్యాఖ్య ఇప్పుడు కేరళ రాజకీయాల్లో వైరల్గా మారింది.అయితే ఈ అసంతృప్తి కేవలం సీపీఎం లోపలే కాదు.. మిత్రపక్షమైన సీపీఐ వరకూ చేరడం కేరళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా మళ్లీ పినరయి విజయన్కే ప్రాధాన్యం ఇవ్వడంపై మిత్రపక్షమైన సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. యువ నాయకత్వాన్ని లేదంటే ప్రజల్లో మరింత ఆమోదం ఉన్న కొత్త ముఖాన్ని(కొంత మంది శైలజ పేరునే ప్రస్తావించారట) ముందుకు తేవాల్సిన అవసరం ఉందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఓటమికి విజయన్ నాయకత్వ శైలే ప్రధాన కారణమన్న వాదనను వారు కూడా పరోక్షంగా ప్రస్తావించినట్లు సమాచారం.అయితే సీపీఎం మాత్రం సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పినరయి విజయన్కే మళ్లీ ప్రధాన ప్రతిపక్ష ముఖంగా అవకాశం ఇచ్చింది. పార్టీని కట్టిపడేసే శక్తి ఇంకా ఆయనకే ఉందన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. కానీ గ్రాస్రూట్ స్థాయిలో మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఇంత హైప్ ఉన్న కేకే శైలజ, పెరవూర్ నుంచి ఓటమి పాలయ్యారు. కేరళ పీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్(ప్రస్తుతం మంత్రి) చేతిలో ఆమె పరాజయం చెందారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు ఉన్న ఇమేజ్, కరోనా సమయంలో చూపించిన నాయకత్వం ఇప్పటికీ ప్రజల్లో బలంగానే ఉందని సీపీఎం వర్గాలు భావిస్తున్నాయి.వాస్తవానికి.. పినరయి విజయన్, ఎం.వి. గోవిందన్ లపై అధికార ధోరణి, అహంకారం, బంధుప్రీతి ఆరోపణలు ఉన్నాయి. శైలజా ప్రజాదరణ ఉన్నప్పటికీ, ఆమెను బలహీనమైన నియోజకవర్గంలో పోటీకి పంపడం ఓటమికి దారితీసిందనేది సీపీఎం కిందిస్థాయి శ్రేణుల వాదన. ఫలితంగా.. పార్టీ 2021లో 99 సీట్ల నుండి 2026లో 35కి పడిపోయింది. శైలజా ప్రజాదరణను ఉపయోగించుకోలేకపోవడం, నాయకత్వంపై అసంతృప్తి CPI(M)లో లోతైన సంక్షోభానికి దారితీసింది. ఇప్పటికైనా ఆ పని చేయాలని సీపీఎం నాయకత్వంపై తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి.ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. కేరళలో ఎల్డీఎఫ్ ఎదుర్కొంటున్న సమస్య కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కాదని స్పష్టమవుతోంది. నాయకత్వ శైలి, అభ్యర్థుల ఎంపిక, ప్రజల్లో పార్టీ ఇమేజ్, మిత్రపక్షాల అసంతృప్తి, గ్రాస్రూట్ కార్యకర్తల తిరుగుబాటు.. ఇవన్నీ ఇప్పుడు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఈ అసంతృప్తి ఇక్కడితో ఆగుతుందా? లేక సీపీఎంలో మరింత పెద్ద మార్పులకు దారితీస్తుందా? అన్నదే ఇప్పుడు కేరళ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. -
నీ తొక్కుడు.. సాటెవ్వడూ!
మీరు ఎప్పుడైనా రెండు చక్రాల సైకిల్ తొక్కారా? ఏమిటీ పిచ్చి ప్రశ్న.. సైకిల్కు రెండు చక్రాలు కాకపోతే నాలుగు ఉంటాయా? సింగిల్ వీల్ సైకిల్ ట్రై చేశారా? తొక్కడం మాట అటుంచి కనీసం ఎప్పుడు చూడలేదు అంటారా? ఒంటి చక్రం సైకిల్ కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు యువ రైడర్ సనీద్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎవరితడు, ఏమిటి అతడి ప్రత్యేకత?కేరళం రాష్ట్రానికి చెందిన సనీద్ సైకిల్పై నేపాల్కు యాత్ర చేపట్టాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అతడు ఒక చక్రం ఉన్న సైకిల్పై (one wheel cycle) ఈ సాహసయాత్ర చేస్తున్నాడు. ప్రత్యేకంగా మార్పులు చేసిన సింగిల్ వీల్ సైకిల్ తొక్కుతూ జాతీయ రహదారులు, పబ్లిక్ రోడ్లపై అతడు దూసుకుపోతుంటే జనాలంతా వింతగా వీక్షిస్తున్నారు. తాజాగా అతడి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంకల్పానికి సెల్యూట్సైకిల్ ముందు భాగాన్ని పైకి లేపి, సీటుపై కూర్చుని బ్యాలెన్స్ చేసుకుని ఎంతో సహనంతో సనీద్ సాహసయాత్ర కొనసాగిస్తున్నాడు. సైకిల్ వెనుక భాగంలో సామాను పెట్టుకున్నాడు. ముందు-వెనుక కేరళ టు నేపాల్ బోర్డు తగిలించుకుని, జాతీయ జెండాలు పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇది చూసిన వాళ్లందరూ సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. పిచ్చితనం అని కొందరు, సాహసం అని మరికొందరు వ్యాఖ్యానించారు. మామూలు మనుషులు ఇలాంటి సాహసాలు చేయలేరని చాలా మంది పేర్కొన్నారు. అతడి అంకితభావం, సంకల్పాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. రహదారులపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.సాహసాలతో సావాసంఇలాంటి సాహస యాత్రలు సనీద్కు కొత్త కాదు. స్టంట్ పెర్ఫార్మర్ అయిన ఈ యువ రైడర్ గతంలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఒంటి చక్రం సైకిల్పై 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన గురించి లోకానికి చాటాడు. ఇదే విధంగా అతను కేరళ అంతటా దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించినట్టు తన సోషల్ మీడియా బయోలో పేర్కొన్నాడు. సింగిల్ వీల్ సైకిల్ దేశమంతా చుట్టిరావాలన్నది తన కల అని వెల్లడించాడు. సనీద్ తన కలను సాకారం చేసుకోవాలని మనమంతా కోరుకుందాం. View this post on Instagram A post shared by Nafsil Ap (@nafsilpt) -
మొన్ననే విమర్శలు.. మళ్లీ అదే సీన్ రిపీట్ చేసిన కొత్త సీఎం
తిరువనంతపురం: కేరళం కొత్త సీఎం సతీశన్ విషయంలో మళ్లీ ‘‘కులం’’ పేరు మీద వివాదం రాజుకుంది. సతీశన్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో తన తండ్రి పేరు ‘‘దామోదర మీనన్’’ను మళ్లీ ప్రస్తావించారు. తన పూర్తి పేరు “వడస్సేరి దామోదర మీనన్ సతీశన్” అని చెప్పారు.ఈ వివాదం సీఎం సతీశన్ “మీనన్” అనే కులాన్ని తన పేరు ముందు ఇంటిపేరులా వాడటంతో మొదలైన విషయం తెలిసిందే. మే 18న కేరళం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా ఆయన తన పూర్తి పేరు “వడస్సేరి దామోదర మీనన్ సతీశన్” అని చెప్పారు. దీనిపై సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు నేతలు అభ్యంతరాలు తెలిపారు.సతీశన్ ఇంటి పేరును వాడడం పట్ల కొందరి వాదన ఇలా ఉంది.. కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు దూరంగా ఉండాలని చెబుతుంది. అలాంటి పార్టీకి చెందిన నేత కులాన్ని సూచించే పేరును వాడటం సరైంది కాదని అన్నారు. “మీనన్”ను కేరళంలో ఒక ఉన్నత కుల గుర్తింపుగా భావిస్తారు. అందుకే ఇది సమానత్వ భావనకు విరుద్ధమని విమర్శించారు.కాంగ్రెస్ నేత జింటో జాన్.. తాను కూడా తన వర్గ గుర్తింపును పేరులో పెట్టుకోనని సోషల్ మీడియాలో తెలిపారు. మరో నేత వీఆర్ అనూప్.. అంబేద్కర్ పుస్తకాలను చదవాలని సతీశన్కు సూచించారు. దీనికి సతీశన్ సమాధానం కూడా ఇచ్చారు. “అది నా తండ్రి పేరు” అని చెప్పారు. తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్తి పేరు చెప్పానన్నారు. పాస్పోర్ట్లో కూడా అదే పేరు ఉందని వివరించారు. ఇందులో కుల గర్వం లేదని, తల్లిదండ్రుల జ్ఞాపకం మాత్రమే ఉందన్నారు.మరో వివాదం “వందే మాతరం” పూర్తి రూపం పాడటంపై వచ్చింది. సీపీఎం అభిప్రాయం ప్రకారం.. వందే మాతరం పూర్తి పాటలో కొన్ని భాగాలు ఒక్క మత భావజాలాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. అందుకే గతంలో కొన్ని పంక్తులను అధికారికంగా తొలగించారు. కానీ ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో పూర్తి రూపం పాడటం బహుళ సమాజ భావనకు విరుద్ధమని సీపీఎం విమర్శించింది.కేరళం శాసనసభ తొలి సమావేశం షురూ ఇదిలా ఉండగా, 16వ కేరళం శాసనసభ తొలి సమావేశం గురువారం తిరువనంతపురంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైంది. ప్రో-టెమ్ స్పీకర్ జీ సుధాకరన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే వీ ఈ అబ్దుల్ గఫూర్ తొలి సభ్యుడిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి సతీశన్ నేతృత్వంలోని 21 మంది సభ్యుల మంత్రివర్గం మే 18న ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసింది.కొత్త సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మే 22న స్పీకర్ ఎన్నిక జరగనుంది. వెంటనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. కేరళం అసెంబ్లీలో తొలిసారి 3 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ స్పీకర్ ఎన్నికలో తన అభ్యర్థిని నిలబెడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.గోపకుమార్ బుధవారం అసెంబ్లీ కార్యదర్శి షాజీ సీ బేబీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీవ్ చంద్రశేఖర్, వీ మురళీధరన్ ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పీకర్ పదవికి సీనియర్ నేత తిరువంచూర్ రాధాకృష్ణన్ పేరును ప్రకటించింది.ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ముందు.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజీవ్ చంద్రశేఖర్, వీ మురళీధరన్, బీబీ గోపకుమార్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లారు. కాగా, 16వ కేరళం శాసనసభకు ఎన్నికైన మొత్తం 140 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రో-టెమ్ స్పీకర్ జీ సుధాకరన్ ప్రమాణం చేయించారు. కేరళం ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 140 స్థానాల్లో 102 గెలుచుకుంది. లెఫ్ట్ డెమోటిక్ ఫ్రంట్ 35 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 3 స్థానాలు సాధించింది. -
భారతీయ నర్స్ కుటుంబాన్ని గెంటేస్తున్న ఆస్ట్రేలియా
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో స్థిరపడాలనే ఆశతో వెళ్లిన ఓ భారతీయ కుటుంబానికి అక్కడ తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. తమ ఆరేళ్ల కుమారుడికి ఉన్న శారీరక ఎదుగుదల లోపాన్ని కారణంగా చూపిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ కుటుంబానికి పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) నిరాకరించింది. అంతటితో ఆగకుండా, వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమైంది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఈ కుటుంబం ప్రస్తుతం విక్టోరియాలోని బెండిగో నగరంలో తీవ్ర ఆందోళనతో కాలం వెళ్లదీస్తోంది.కన్నీరు పెట్టిస్తున్న విసా తిరస్కరణ ఈ కుటుంబానికి చెందిన క్రిస్టిన్ దాస్ విక్టోరియాలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో రిజిస్టర్డ్ నర్సుగా సేవలందిస్తున్నారు. ఆమె భర్త జినీష్ జోసెఫ్ క్వాలిఫైడ్ చెఫ్, అలాగే కొడుకు బాగోగులు చూసుకునే పూర్తి స్థాయి కేర్గివర్గా ఉన్నారు. వీరికి జాజియల్ (6), హేజెల్ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విక్టోరియాలో ఎమర్జెన్సీ కేర్, హాస్పిటాలిటీ రంగాలలో సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ, కొడుకు అనారోగ్యాన్ని సాకుగా చూపి వీసా నిరాకరించడంపై వారు తీవ్రంగా కలత చెందుతున్నారు.ఐర్లాండ్ వదిలి వస్తే నడిరోడ్డుపైనేనా? గతంలో ఈ కుటుంబం ఐర్లాండ్లో ఉండేది. ఆస్ట్రేలియా వీసా లభించడంతోనే వారు అక్కడి నుంచి ఇక్కడికి తరలివచ్చారు. వీసా దరఖాస్తు ప్రక్రియలోనే తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తాము స్పష్టంగా తెలియజేశామని వారు చెబుతున్నారు. ఒకవేళ అప్పుడే వీసా తిరస్కరించి ఉంటే, తాము ఐర్లాండ్లోనే ఉండేవారమని, ఇప్పుడు ఇక్కడ అన్నీ సెట్ చేసుకున్నాక నడిరోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తమ కుమారునికి అందుతున్న వైద్య సహాయం ఆగిపోతే, వాడి భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.న్యాయం కోసం డిజిటల్ పోరాటం తమకు జరుగుతున్న అన్యాయంపై ఈ కేరళ కుటుంబం 'Change.org' వేదికగా డిజిటల్ పిటిషన్ వేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమను దేశం నుంచి బహిష్కరించకుండా నిలిపివేయాలని, మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని వారు ప్రజల మద్దతు కోరుతున్నారు. ఈ పిటిషన్కు ఆస్ట్రేలియా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే 7,000 మందికి పైగా దీనిపై సంతకాలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ‘మా పిల్లలు ఇక్కడే పెరుగుతున్నారు. ఇదే వారి ఇల్లు... మమ్మల్ని వెళ్లగొడితే మా బాబుకు భవిష్యత్తు ఉండదు’ అంటూ ఆ తల్లిదండ్రులు చేస్తున్న అభ్యర్థన నెటిజన్లను కదిలిస్తోంది.ఇది కూడా చదవండి: ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు -
కేరళలో మళ్లీ భయం.. భయం.. వర్షాలు బాబోయ్..
తిరువనంతపురం: కేరళను భారీ వర్షాలు మరోసారి అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళలో గతంలో కురిసిన వర్షాలు ఎంతగా విధ్వంసం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వర్షాకాలాల్లో కేరళలో కురిసిన వర్షాలను గుర్తు చేసుకుంటే.. 2018లో సంభవించిన విపత్తును అత్యంత భయంకరమైన విపత్తుగా గుర్తించారు. 2019, 2020లో వరుస మాన్సూన్లలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. 2024 వయనాడ్ విపత్తును ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక నైరుతి రుతుపవనాలు ఈనెల 26న (4 రోజులు అటుఇటుగా) కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కేరళలో వర్ష హెచ్చరికలను భారత వాతావరణ శాఖ తాజాగా సవరించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పత్తనం తిట్ట, కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో మంగళవారం ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.అదే విధంగా బుధవారం కూడా నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. అలప్పుళ, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం జిల్లాల్లో బుధవారానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 115 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమూ ఉందని తెలిపింది.ఇక కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో భారీ అలలు ఏర్పడే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు.భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత వాతావరణ శాఖ జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. కానీ ఆ ఇద్దరూ జీవితపు చివరి దశలో తోడును సంపాదించుకున్నారు. వారి ఆసక్తికర కథ ఇప్పుడు అందరి హృదయాలను దోచుకుంటోంది. కేరళలోని కొట్టాయం జిల్లాలో 76 ఏళ్ల థామస్, 74 ఏళ్ల లీలమ్మ తమ మిగిలిన జీవితాన్ని కలసి పంచుకోవాలని నిర్ణయించుకుని, పవిత్రమైన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వృద్ధాప్యంలో ఒంటరితనంతో కుమిలిపోవడం కంటే, ఒకరికొకరు అండగా నిలవడమే జీవితానికి అర్థం అని ఈ జంట నిరూపిస్తోంది.ఒంటరి పోరాటం.. థామస్ గతంకల్లర కన్నరతిల్ కు చెందిన కేసీ థామస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు, కేరళ పోలీసు విభాగంలో టెక్నికల్ వింగ్ ఆఫీసర్గా సేవలందించి పదవీ విరమణ పొందారు. 2020లో ఆయన భార్య కన్నుమూశారు. ఆయన కుమారుడు అలెక్స్ కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో స్థిరపడగా, వివాహం చేసుకున్న కుమార్తె మెర్సీ స్థానికంగా ఉంటూ, తండ్రి బాగోగులు చూసుకుంటోంది. పిల్లలు అండగా ఉన్నప్పటికీ, జీవితంలో ఆయనకు ఏదో తెలియని ఒంటరితపం వెంటాడుతోంది. ఆస్పత్రిలో పరిచయం.. కలసిన మనసులు కడుతురుతికి చెందిన లీలమ్మ 16 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమారులు జోమోన్, జైమోన్ ఇటలీలో స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితం ఓ ప్రైవేట్ హెల్త్కేర్ సెంటర్లో థామస్, లీలమ్మ తొలిసారిగా కలుసుకున్నారు. ఆమెతో ఏర్పడిన అనుబంధంతో థామస్ తన జీవితాన్ని పంచుకోవాలని ఆహ్వానించగా, మొదట్లో ఆమె అంగీకరించలేదు. కానీ నెలన్నర క్రితం ఆయన మళ్లీ ఫోన్ చేసి ప్రతిపాదించడంతో, పిల్లలతో మాట్లాడిన తర్వాత లీలమ్మ తన అంగీకారాన్ని తెలిపారు.థామస్, లీలమ్మల పిల్లలు అనుమతవ్వడంతో..ఇద్దరి పిల్లలు కూడా ఈ వివాహానికి మనస్ఫూర్తిగా మద్దతు పలకడంతో, సోమవారం సాయంత్రం కల్లరలోని సెయింట్ మేరీస్ పుతెన్పల్లి చర్చిలో థామస్, లీలమ్మల వివాహం జరిగింది. బంధువుల సమక్షంలో, థామస్ బంధువు ఫాదర్ అబ్రహం తరతట్టెల్ ఈ వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు థామస్ కుమార్తె కుటుంబంతో పాటు, పారిష్ వికార్ ఫాదర్ థామస్ కరింపుకలాయిల్ హాజరయ్యారు.ఇది కూడా చదవండి: భోజ్శాల: 700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతి -
ఫ్రీ బస్సుతో కేరళ ఖజానాకు చిల్లు?
తిరువనంతపురం: కేరళలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ (యూడీఎప్) ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రకటించిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకం ఒకవైపు ఆడపడుచుల్లో ఆనందం నింపుతున్నా.. ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. జూన్ 15 నుంచి కేఎస్ఆర్టీసీ బస్సుల్లో అమలు కానున్న ఈ పథకంతో అటు రవాణా వ్యవస్థకు, ఇటు రాష్ట్ర ఖజానాకు మోయలేనంత ఆర్థిక భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రైవేట్ రవాణా వ్యవస్థకు ఉరితాడు!కేరళలో దాదాపు 80 శాతానికి పైగా ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల పైనే ఆధారపడి ఉన్నారు. మహిళలకు కేఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే, తమ బస్సుల్లో కేవలం విద్యార్థులు మాత్రమే మిగులుతారని, ఇది ప్రైవేట్ బస్ సెక్టార్ను నాశనం చేస్తుందని ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కనీసం డీజిల్ కొట్టించడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. గోపీనాథన్ వాపోతున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసి తమ సమస్యను వివరించనున్నట్లు వారు తెలిపారు.అప్పుల కుప్పగా మారనున్న కేరళ?ఈ ఉచిత హామీతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కేరళ తీవ్ర ఆర్థిక లోటుతో సతమతమవుతోంది. రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులు చేయాల్సిన ఈ తరుణంలో.. అదనపు సంక్షేమ పథకాలతో సబ్సిడీ భారం లక్ష కోట్ల రూపాయలు దాటే ప్రమాదం ఉందని, తద్వారా అభివృద్ధి పనులు కుంటుపడతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కేఎస్ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పొరుగు రాష్ట్రాల పాఠాలు ఏవి?కర్ణాటకలో అమలు చేస్తున్న ‘శక్తి’ పథకానికి ఏటా రూ. 5,300 కోట్లు ఖర్చవుతుండటంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడింది. తెలంగాణలో కూడా ఉచిత ప్రయాణ హామీతో ఆర్థిక ఒత్తిడి పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, మహిళలందరికీ కాకుండా, మత్స్యకార్మికులు, కార్మికుల వంటి అట్టడుగు వర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేస్తే ఆర్థికంగా అంతగా ఇబ్బందులు ఎదురుకావని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్కు అనుమతి -
కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం
సాక్షి, తిరువనంతపురం: కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణం చేశారు. సతీశన్తో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు, ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. డిప్యూటీ సీఎంలతో పాటు కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ తదితరులు హాజరయ్యారు. సతీశన్ ప్రభుత్వంలో మంత్రులుగా 21 మంది ప్రమాణం చేశారు. వాళ్లలో సీఎం రేసులో భంగపడ్డ చెన్నితల్ రమేశ్ కూడా ఉన్నారు. కున్హల్కుట్టి, మురళీధరన్, షాజీ, అబ్దుల్ గఫర్, బషీర్, మోన్స్ జోసెఫ్.. ఇతరులు ఉన్నారు. అలాగే ఆయన కేబినెట్లో ఇద్దరు మహిళలకు చోటు లభించింది. తులసి, బిందు కృష్ణలు మంత్రులుగా ప్రమాణం చేశారు. -
కేరళంలో నేడు కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం
తిరువనంతపురం: కేరళలో దశాబ్దకాలంపాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి నేడు నూతన ప్రభుత్వాన్ని కొలువు తీర్చనుంది. ఇందులోభాగంగా కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు తిరువనంతపురంలోకి సెంట్రల్ స్టేడియంలో సతీశన్తోపాటు 20 మంది నేతలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశముండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబోయే సీఎం సతీశన్ శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రివర్గం జాబితాను అందజేశారు. నేడు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా హాజరు కానున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. తన మంత్రివర్గంలో సీనియర్ నేతలు రమేశ్ చెన్నితాల, కె. మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్, ఏపీ అనిల్ ఉంటారని కాబోయే సీఎం సతీశన్ చెప్పారు. దీంతో, సీఎం కుర్చీ కోసం పోటీ పడిన చెన్నితాల కేబినెట్లో చేరే అవకాశం లేదంటూ వచ్చిన వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఈసారి కేబినెట్లోకి 14 మంది కొత్తముఖాలకు అవకాశం కల్పించనున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోస్టుకు మరో సీనియర్ నేత టి.రాధాకృష్ణన్ను ఎంపిక చేసినట్లు సతీశన్ చెప్పారు. ఐయూఎంఎల్ నేతలు పీకే కున్హలికుట్టి, ఎన్.షంషుద్దీన్, కేఎం షాజీ, పీకే భాస్కర్, వీఈ అబ్దుల్ గఫూర్, ఆర్ఎస్పీ నేత శిబూ బేబీ జాన్, కేరళ కాంగ్రెస్ నేత మోన్స్ జోసెఫ్, కేరళ కాంగ్రెస్(జాకబ్) నేత అనూప్ జాకబ్లకూ కేబినెట్ బెర్త్ ఖారారైంది. సీఎంగా సతీశన్ బాధ్యతలు చేపట్టక మునుపే మంత్రి పదవులకు ఎంపిక, అధికార పంపిణీ, అధిష్టానం నిర్ణయాలపై అంతర్గత అసమ్మతి రగులుతోంది. సీఎంగా సతీశన్ను ఎంపిక చేయడం వెనుక కూటమి భాగస్వామ్య పక్షం ఐయూఎంఎల్ ఒతిళ్లున్నాయని నాయర్ సేమా సమాజం(ఎన్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి సుకుమారన్ ఆరోపించారు. కూటమిలో ఎస్ఎన్డీపీ ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మణి కప్పన్ సంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. కేబినెట్ కూర్పులో రొటేషన్ విధానాన్ని ప్రతిపాదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. -
2 రోజుల్లో సీఎంగా సతీశన్ ప్రమాణం.. వేణు గోపాల్ ఏమన్నారంటే?
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న వీడీ సతీశన్ శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ను కలిశారు. వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన సతీశన్ కాసేపు మాట్లాడారు.ఈ సమావేశం తర్వాత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. “ఇందులో అసాధారణం ఏమీ లేదు. ఇది సాధారణ సమావేశమే. వీడీ సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా దానికి కట్టుబడి ఉండాలి. ఎల్లుండి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.వీడీ సతీశన్ నాయకత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని కేరళ మొత్తం ఆశిస్తోంది. అభివృద్ధి, పాలనలో కేరళలో మార్పు అవసరం. అందుకే కేరళ ప్రజలు, దేశ ప్రజలు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు.మాది ప్రజాస్వామ్య పార్టీ.. బీజేపీ లేదా సీపీఐఎంలా కాదు. కొంత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఐక్యంగా ఉండాలి. దేశానికే మా తొలి ప్రాధాన్యం. పార్టీకి రెండో ప్రాధాన్యం. దేశ సంక్షేమం కోసమే ముందుకు సాగుతాం” అని అన్నారు.కాగా, వీడీ సతీశన్ మే 18న కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాట్లలో భాగంగా కేసీ వేణుగోపాల్ ఇంటికి వీడీ సతీశన్ వెళ్లారని కూడా స్థానిక మీడియా పేర్కొంటోంది. కాంటోన్మెంట్ హౌస్లో లీగ్ నేతలతో కూడా చర్చలు జరిగాయి.కాగా, కేరళలో యూడీఎఫ్ గెలిచాక కేసీ వేణుగోపాల్ సీఎం అవుతారని చాలా మంది భావించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు. వేణుగోపాల్కు హైకమాండ్తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనతో పాటు రమేశ్ రామకృష్ణన్ చెన్నితాల, వీడీ సతీశన్ బలమున్న నాయకులు. చెన్నితాల మాజీ ప్రతిపక్ష నేత. వీడీ సతీశన్ కేరళలో మొన్నటివరకు ప్రతిపక్ష నాయకుడు. చివరకు ఆయననే సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో కేసీ వేణుగోపాల్ అసంతృప్తితో ఉన్నారా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. कांग्रेस के संगठन महासचिव केसी वेणुगोपाल से केरल के मनोनीत मुख्यमंत्री वीडी सतीशन ने आज मुलाकात की pic.twitter.com/yBHDCsjulZ— News Capsule (@newscapsule_) May 16, 2026 -
ప్రధాని బాటలో కేరళ గవర్నర్.. వీఐపీ కల్చర్కు చెక్!
తిరువనంతపురం: సాధారణంగా వీఐపీల ప్రయాణం అంటే భారీ కాన్వాయ్, సైరన్ల మోతతో మార్మోగిపోతుంది. అయితే పెరుగుతున్న ఇంధన ఖర్చులను అరికట్టేందుకు, పర్యావరణ పరిరక్షణకు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఆదర్శంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దిశగా కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించి, అందరి దృష్టిని ఆకర్షించారు.మంత్రివర్గ ప్రమాణస్వీకారం నుంచే అమలుప్రభుత్వ కార్యకలాపాల్లో ఇంధన వినియోగాన్ని వీలైనంత తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాజ్ భవన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ అధికారిక కాన్వాయ్ వాహనాల సంఖ్యను తొమ్మిది నుంచి ఆరుకు కుదించారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సహా ఇకపై జరిగే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఈ నిబంధన తక్షణం అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. ఒకేసారి మూడో వంతు వాహనాలను తగ్గించడం ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఏయే వాహనాలకు కోత పడిందంటే?అధికారిక వర్గాల తాజా సమాచారం ప్రకారం, గవర్నర్ కాన్వాయ్ నుండి ఒక ఎస్కార్ట్ వాహనాన్ని, అలాగే రెండు స్టాండ్ బై (అదనపు) వాహనాలను పూర్తిగా తొలగించారు. మారిన తాజా ప్రోటోకాల్ ప్రకారం ఇకపై ఆయన పర్యటనల్లో కేవలం ఆరు వాహనాలు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ లాజిస్టిక్స్లో అనవసరమైన ఇంధన వృథాను అరికట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయం అధికార యంత్రాంగానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఇలాంటి పొదుపు చర్యలను రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు.దేశవ్యాప్తంగా మారుతున్న ట్రెండ్వీఐపీల కాన్వాయ్ కుదింపు అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక కొత్త ట్రెండ్ గా మారుతోంది. గతంలో ప్రధాని మోదీ స్వయంగా తన కాన్వాయ్ సైజును తగ్గించుకోవడమే కాకుండా, ఎలక్ట్రిక్ పైలట్ వాహనాలను ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారు. ఇదే బాటలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా తన భద్రతా వాహనాలను కుదించారు. మరోవైపు సుప్రీంకోర్టు సైతం పర్యావరణ పరిరక్షణ, లాజిస్టిక్ ఖర్చుల నియంత్రణ కోసం డిజిటల్ విచారణలు, కార్ పూలింగ్ విధానాలను ప్రోత్సహిస్తోంది. ఈ సస్టైనబిలిటీ ప్రయత్నాలకు ఇప్పుడు కేరళ గవర్నర్ కూడా తమ మద్దతు తెలిపారు.ఇది కూడా చదవండి: మనీలాండరింగ్ కేసు: రాబర్ట్ వాద్రాకు భారీ ఉపశమనం -
చెల్లి మాటే నెగ్గింది.. కేరళలో చక్రం తిప్పిన ప్రియాంక
-
అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.కాగా, భారత్లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. -
ప్చ్ విజయన్.. ఎలా తట్టుకుంటారో?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామన్న పినరయి విజయన్ కల నెరవేరలేదు. ఘోర ఓటమితో.. కేరళంలో ఎల్డీఎఫ్ దశాబ్దకాల పాలన ముగిసింది. దీనికి తోడు అక్కడి రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని మలుపు ఒకటి చోటు చేసుకుంది.తాజా అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘన విజయం సాధించింది. 140 స్థానాల్లో 102 సీట్లు గెలుచుకుంది ఈ కూటమి. ఇందులో కాంగ్రెస్ 63 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. తీవ్ర తర్జన భర్జనల తర్వాత వీడీ సతీశన్ ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు. మరోవైపు.. ఎల్డీఎఫ్ కేవలం 35 సీట్లకే పరిమితమైంది. అందులో సీపీఎం 26, సీపీఐ 8, ఆర్జేడీ 1 సీటు గెలిచాయి. మరోవైపు బీజేపీ 3 సీట్లు సాధించి కేరళ చరిత్రలోనే మెరుగైన ఫలితం అందుకుంది.ఈ ఫలితాలతో.. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న పినరయి విజయన్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మారబోతున్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ పినరయి విజయన్ను శాసనసభా పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అయితే ఈ విషయంలో పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఓటమికి విజయన్ నాయకత్వ శైలే కారణమని.. ప్రతిపక్ష నేతగా కొత్త ముఖాన్ని తీసుకురావాలని.. మారుతున్న రాజకీయాలను అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాన మిత్రపక్షం సీపీఐలోని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సీపీఎం తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విజయన్నే ప్రతిపక్ష నేతగా నిర్ణయించింది.సీపీఎం చరిత్రలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతిపక్ష నేతగా మారడం కొత్త విషయం కాదు. ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, వీఎస్ అచ్యుతానందన్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పినరయి విజయన్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా విజయన్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విజయం సాధించిన 61 ఏళ్ల వీడీ సతీశన్.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. ఇంతకాలం అసెంబ్లీలో ప్రత్యర్థిగా సతీశన్ దూకుడు చూపించేవారు. ఆ దూకుడే విజయన్ సర్కార్ను ఇరకాటంలో పడేసేది. కానీ ఇప్పుడు 82 ఏళ్ల వయసులో విజయన్కి అంత ఓపిక ఉందా? అనే సందేహం తలెత్తుతోంది. మరోవైపు.. ఈ పాత్రల మార్పు కేరళ అసెంబ్లీ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. అదే సమయంలో అక్కడి ప్రజలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓటమి తర్వాత కూడా పార్టీకి పెద్దదిక్కుగా మారిన పినరయి.. ప్రతిపక్షంలో తన శక్తిని ఎలా వినియోగిస్తారన్నది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. -
కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై 10 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు, ఊహాగానాలకు తెరపడింది. సీనియర్ నేత వి.డి.సతీశన్కు సీఎం పీఠం కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం గురువారం నిర్ణయించింది. ఇప్పటిదాకా జరిగిన చర్చల ఆధారంగా సతీశన్ను కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పి) నాయకుడిగా నియమించాలని నిర్ణయించినట్లు కేరళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ వెల్లడించారు. ఆమె గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, సీనియర్ నేత జైరామ్ రమేశ్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 7న తిరువనంతపురంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో.. రాష్ట్రంలో సీఎల్పికి కొత్త నాయకుడిని నియమించే విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పూర్తి అధికారం కట్టబెడుతూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాం«దీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతోపాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సహా పార్టీ ఎంపీలు, నేతలతో ఖర్గే విస్తృతంగా సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. సీఎల్పీ నాయకుడిగా సతీశన్ను నియమిస్తూ తుది నిర్ణయం తీసుకున్నట్లు దీపాదాస్ మున్షీ స్పష్టంచేశారు. పార్టీలో తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి కోసం కె.సి.వేణుగోపాల్, సతీశన్, రమేశ్ చెన్నితాల పోటీపడ్డారు. పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా, దాదాపు 10 రోజులపాటు ఢిల్లీలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పెద్దలు ఎట్టకేలకు సతీశన్కే సీఎం పోస్టు అప్పగించాలని నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఖర్గే, రాహుల్ గాంధీ 40 నిమిషాలపాటు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. గురువారం తుది నిర్ణయం వెలువడింది. నూతన కేరళను సృష్టిస్తాం: సతీశన్ తనను సీఎంగా ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ హైకమాండ్కు సతీశన్ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనకు అతిపెద్ద బాధ్యత అప్పగించిందని అన్నారు. కేరళ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేరళ ప్రజలు పదేళ్ల వామపక్ష పాలనను అంతం చేశారని, ఎన్నో ఆశలతో తమకు అధికారం అప్పగించారని పేర్కొన్నారు. నూతన కేరళను సృష్టించడానికి, నూతన యుగాన్ని ప్రారంభించడానికి అంకితభావంతో పని చేస్తామని వెల్లడించారు. గురువాయూర్కు రమేశ్ చెన్నితాల! కేరళ సీఎం పదవిని ఆశించిన సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల గురువారం అధిష్టానం నిర్ణయం తెలిసిన తర్వాత తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. తిరువనంతపురంలోని తన ఇంటి నుంచి గురువాయూర్ శ్రీకృష్ణ మందిరానికి వెళ్లిపోయినట్లు సమాచారం.ఐయూఎంఎల్ ఒత్తిడి పెంచడం వల్లే.. కాంగ్రెస్ అధిష్టానం మద్దతు కె.సి.వేణుగోపాల్కు ఉన్నప్పటికీ సీఎంగా సతీశన్ను ఎంపిక చేయడం వెనుక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్లో ప్రధాన భాగస్వామి అయిన ఐయూఎంఎల్ అసెంబ్లీ ఎన్నికల్లో 22 సీట్లు గెల్చుకుంది. మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీఎం పదవిని సతీశన్ను కట్టబెట్టాలని ఆ పార్టీ కాంగ్రెస్ పెద్దలపై గట్టిగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అసెంబ్లీలో కాంగ్రెస్కు సొంతంగా స్పష్టమైన మెజార్టీ లేని నేపథ్యంలో మిత్రపక్షమైన ఐయూఎంఎల్ ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. మరోవైపు మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కె.సి.వేణుగోపాల్కు అండగా నిలిచారు. కానీ, క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు సతీశన్కే జైకొట్టారు. క్యాడర్పై బలమైన పట్టుండడం ఆయనకు అనుకూలంగా మారింది. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం సతీశన్ను సీఎంగా ఎంపిక చేయక తప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం సతీశన్ సహా కాంగ్రెస్ నేతలు గురువారం కేరళ గవర్నర్ ఆర్.వి.ఆర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నెల 18న సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సతీశన్ ఆచరణాత్మక రాజకీయవేత్తవి.డి.సతీశన్.. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూనే, ప్రశాంతమైన శైలితో ప్రజలకు అందుబాటులో ఉండే నేత. కేరళ రాజకీయాల్లో దూకుడుగల ప్రతిపక్ష నేతగా ప్రతిష్టను పెంచుకున్నారు. 2021లో ఓటమి తర్వాత దశాబ్దకాలంగా పార్టీ పునరుజ్జీవనానికి కృషి చేశారు. విద్యార్థి రాజకీయాల నుంచి ఉద్భవించి, కేరళలోని అత్యంత బలమైన ప్రతిపక్ష నాయకులలో ఒకరిగా ఎదిగిన సతీశన్, తన రాజకీయ వ్యూహంతో ఆచరణాత్మక రాజకీయవేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రజాకర్షక నేతగా.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ప్రధానంగా దృష్టి సారించారు. పినరయి విజయన్పై నేరుగా విమర్శలు గుప్పించారు. క్రమశిక్షణ కలిగిన నేతగా పేరుతెచ్చుకున్న సతీశన్.. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేకపోయినప్పటికీ, మీడియా వ్యవహారాలలో నేర్పరి. ఆయన శైలి.. వర్గపోరాటాలతో సతమతమవుతున్న పార్టీలో కొందరు సీనియర్ నాయకులను కలవరపెట్టింది. యువతను కాంగ్రెస్ వైపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. దిగ్గజ నాయకులైన కె. కరుణాకరన్, ఎ.కె.ఆంటోనీ, ఊమెన్ చాందీల తర్వాత కాంగ్రెస్లో ప్రజలను ఆకర్షించే నాయకుడిగా ఎదిగారు. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిని అధికారంలోకి తీసుకురాలేకపోతే రాజకీయ అజ్ఞాత వాసం చేస్తానని సంచలనాత్మక ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు, యూడీఎఫ్కు 100కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక ధైర్యమైన ప్రకటన. సతీశన్ క్షేత్రస్థాయి విధానం, స్థానిక సమస్యలపై నిరంతర దృష్టి, పార్టీ వ్యవస్థను, ఓటర్ల విశ్వాసాన్ని పునరి్నరి్మంచడంలో తోడ్పడ్డాయి. కాంగ్రెస్లో ఏఐసీసీ కార్యదర్శి, కేపీసీసీ ఉపాధ్యక్షుడు వంటి కీలక పదవులలో పనిచేశారు. సాధారణ కుటుంబం నుంచి1964 మే 31న ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కె.దామోదర మీనన్, తల్లి వి.విలాసిని అమ్మ. ఎర్నాకులంలోని సేక్రెడ్ హార్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో సోషల్ వర్క్ మాస్టర్స్ చదివారు. రాజకీయంలోకి రాకముందు ఆయన కేరళ హైకోర్టులో దాదాపు పదేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన భార్య ఆర్.లక్ష్మీప్రియ. వారికి ఉన్నిమాయ అనే ఒక కుమార్తె ఉంది. సతీశన్ రాజకీయ ప్రస్థానం విద్యారి్థగానే మొదలైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన కేఎస్యూ (కేరళ స్టూడెంట్స్ యూనియన్) ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) జాతీయ కార్యదర్శిగానూ పనిచేశారు. ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం1996లో మొదటిసారి పరవూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సీపీఐ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2001 ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. కేరళలో లెఫ్ట్ వేవ్ ఉన్నప్పుడూ తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, రమేష్ చెన్నితల స్థానంలో హైకమాండ్ సతీశన్ను అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా నియమించింది. అసెంబ్లీలో వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత దూకుడును అవలంబించారు. అసెంబ్లీలో ఏదైనా మాట్లాడేప్పుడూ పూర్తి సమాచారం, పక్కా ఆధారాలతో మాట్లాడి బెస్ట్ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో, యూడీఎఫ్ ఉప ఎన్నికల విజయాలతో పాటు లోక్సభ ఎన్నికలలో బలమైన ప్రదర్శనతో ఇచ్చింది. పార్టీలోపల, బయటా వివాద రహిత నాయకుడిగా క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళ కిరీటం సతీశన్కు...
పదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత కేరళ ప్రజలు మెచ్చి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెడితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవటానికి కాంగ్రెస్ పదిరోజుల సుదీర్ఘ సమయం తీసుకుంది. ఎట్టకేలకు వడస్సేరి దామోదరన్ సతీశన్కు ఆ పదవి కట్టబెట్టాలని గురు వారం నిర్ణయించింది. ఈ కాంగ్రెస్ మార్కు కథ అన్నిచోట్లా ఉండేదే. కాకపోతే ఆ పార్టీకి మెజారిటీ లభించే రాష్ట్రాలు కుంచించుకుపోతుండటంవల్ల ఇటీవలి కాలంలో ఆ సంగతి ఎవరికీ పెద్దగా తెలియకుండాపోయింది. కేరళలో సతీశన్తోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. వారి మధ్య తీవ్ర పోటీ ఉంది. అంతేకాదు... కేరళలో వారి ఇళ్ల దగ్గర గత పది రోజులుగా సాగుతున్న హడావుడికి అంతూ పొంతూ లేదు. ఏ క్షణంలోనైనా తమ నాయకుణ్ణి అధిష్టానం ఎంపిక చేస్తుందని ఆ నాయకుల్ని సమర్థిస్తున్న పార్టీ కార్య కర్తలు రాత్రింబగళ్లు ఆశగా ఎదురుచూశారు. బెదిరింపులు, ఆగ్రహ ప్రకటనలు సరేసరి. అందుకే ఎంపికలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. అంతిమ నిర్ణయం అధిష్టానానిదేనని చెప్పడం, శాసనసభాపక్షం తీర్మానం ఆమోదించటం రివాజు. అయితే మెజారిటీ సభ్యుల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న మెలిక ఎప్పుడూ ఉంటుంది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 63 స్థానాలు లభించగా, ఆ పార్టీ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమికి మొత్తంగా 102 వచ్చాయి. ఇలా భారీ స్థాయిలో జనం ఆమోదముద్ర ఉన్నా, కూటమి పక్షాలు ఆ అంశాన్ని త్వరగా పూర్తిచేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నా పార్టీ అధిష్టానం అడుగు ముందుకేయలేక పోయిందంటే సమస్య ఎంత జటిలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏఐసీసీ నాయకుడిగా తనకున్న పలుకుబడితో అధికశాతం మందికి కేసీ వేణుగోపాల్ టిక్కెట్లు ఇప్పించుకోగలిగారు. అందుకే ఎన్నికైన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు విడివిడిగా భేటీ అయినప్పుడు 47 మంది ఆయన వైపే మొగ్గారు. ఎమ్మెల్యే కాకపోయినా ఇంతమంది ఆయన వెనకుండటం చిన్న విషయం కాదు. అయితే మిత్ర పక్షాలు, ముఖ్యంగా ఐయూఎంఎల్ మరో నాయకుడు వీడీ సతీశన్కు ఇవ్వాలని సూచించాయి. మొన్నటివరకూ విపక్ష నేతగా ఉండటంవల్ల ఆ పార్టీలతో ఏర్పడిన సాన్నిహిత్యం సతీశన్కు పనికొచ్చినట్టుంది. రమేష్ చెన్నితలకు మద్దతు పలికినవారి సంఖ్య స్వల్పం. ఎన్నికలొస్తే ఓటమిపాలవుతామన్న బెరుకుకన్నా, గెలిస్తే ఎవరిని ఎలా ఒప్పించా లన్న చింత పార్టీ అధినాయకత్వానికి అధికం. ఇందుకు తనను తానే నిందించుకోవాలి. రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు విశేషంగా కృషిచేస్తూ, ప్రజానీకంలో పట్టు సాధించిన వారంటే నాయకత్వానికి భయం. అందుకే వారికి సమాంతరంగా మరొకరిని ప్రోత్సహించటం అలవాటు. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల ముఠా కక్షలు ముదిరి పార్టీ చీలికదాకా పోయింది. కాంగ్రెస్లో ఎప్పటికీ తనకు భవిష్యత్తు ఉండబోదన్న నిర్వేదంతో ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. నిజానికి కేరళ విషయంలో జరిగినంత జాప్యం గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి చోట్ల లేదు. ఆ రాష్ట్రాల్లో కూడా సీఎం కుర్చీ కోసం నాయకులు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో ముఠా తగాదాలు బయటికొచ్చాయి. అయితే పార్టీలోని యువతరం ఎక్కువగా సతీశన్వైపే మొగ్గింది. కొందరు మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధించిన నేతలపై చర్య తీసుకోవటంలో సతీశన్ వెనకాడకపోవటం, ఫలానా కులంవారూ, మతంవారూ దూరమవుతారని ఎందరుచెప్పినా వినకపోవడం యువతను ఆకర్షించింది. మంత్రిగా అనుభవం లేకున్నా నిజాయితీ, మంచి చదువరి కావటం, మేధోపరమైన అంశాలు చర్చించటంవంటివి సతీశన్కున్న అదనపు అర్హతలు. యూడీఎఫ్కు వందకుమించి స్థానాలు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాలు కూటమికి ఉత్సాహాన్నిచ్చింది. కాంగ్రెస్లో నాయకత్వం దక్కితే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవటానికి భిన్న వర్గాలను ప్రసన్నం చేసుకోవాలి. వారి ఆకాంక్షలు తీర్చాలి. ఆ విషయంలో సతీశన్ ఏ మేరకు విజయం సాధిస్తారన్నది మున్ముందు తెలుస్తుంది. -
లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..!
మన దక్షిణాదిన శుచీంద్రం ప్రముఖ శివ క్షేత్రాలలో ఒకటి. ఎంతో మహిమ గల శైవదేవాలయం. స్వర్గాధిపతి దేవేంద్రుడు శాపవిమోచన పొందిన స్థలం. మరి మనకి కూడా తెలిసీ తెలియక చేసిన తప్పులకి ప్రార్థనతో పొదవచ్చు. స్త్రీవ్యామోహంతో శాపం పొందిన ఇంద్రుడు ఇక్కడ పాప మోచనం పొంది శుచిత్వం పొందడంతో శుచీన్ద్రం అని పేరు వచ్చింది. ఆ కథ, శుచీంద్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. ఒకసారి అహల్య అందాన్ని చూసి మోహ పరవశుడు అయ్యాడు దేవేంద్రుడు. అప్పుడు ఇంద్రుడు తెల్లవారక ముందే కోడికూత వేసి గౌతమ మునిని స్నానానికి పం΄ాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతమ ముని వేషంలో అనసూయ దగ్గరకి వచ్చాడు. జరిగిన మోసం గ్రహించి గౌతమ ముని తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడిని, అహల్యని చూసి శపించాడు. శిలగా మారిన అహల్య శ్రీ రాముని పాదస్పర్శ తగిలి ఇక్కడే శాప విమోచనం పొందింది. ఇక్కడే అత్రి మహా ఋషికి ఆశ్రమం ఉండేది అందుకే జ్ఞానారణ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక చెట్టు మొదలు నరికినప్పుడు శివలింగం కనిపించింది. గొడ్డలి దెబ్బకి శివలింగం నుండి రక్తం కారసాగింది. ఇది దేవాలయ మూలస్థానంగా చెబుతారు. సుచీన్ద్రంలో మహాశివుని ప్రతిష్ట ఉన్నప్పటికీ త్రిమూర్తి సంకల్పం కూడా ఉంది. కారణం ఇక్కడ వృక్షాలలో త్రిమూర్తులు ఉన్నారు అని చెట్లకు పూజ చేస్తారు. తప్పు చేసిన వారు పాప పరిహారంగా సుచీన్ద్రుని దర్శించుకుని భక్తులు పాప విమోచనం పొందుతారు. సుచీన్ద్రుని ముందు మరుగుతున్న నేతిలో వెండి విగ్రహాన్ని వేస్తాడు పూజారి. తప్పు చేసిన వారు ఆ విగ్రహాన్ని చేతితో తీయాలి. పూజారి ఆ చేతిని వస్త్రంతో కట్టి మూడు రోజుల తరువాత విప్పుతాడు. చేతి చర్మం రంగు మారినా వ్రణం ఏర్పడినా ఆ వ్యక్తి తప్పు చేసినట్టుగా నిర్ధారిస్తారు. బ్రిటిష్ వారు ఈ విధానానికి స్వస్తి పలికారు. మహాభిషేకం సమయంలో భక్తులు రథం లాగుతారు. ఈ కార్యక్రమానికి సుచీన్ద్రం వాసులు ఎక్కడ ఉన్నా వచ్చి పాల్గొంటారు. ఆ విధంగా తమ పాప ప్రక్షాళనం చేసుకుంటారు. ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడి స్తంభాలను మీటితే సప్తస్వరాల ధ్వని వినిపిస్తుంది. స్త్రీ రూపంలో చెక్కిన వినాయకుడు, రుద్రవీణ వాయిస్తున్న రావణాసురుడు, నోటిలో తిరుగుతున్న భూగోళం, రామాయణ మహాభారతాల రాతి శిల్పాలు... ఎంత చూసినా అద్భుతమే. మన దేశంలో లాటరీ విధానం ఇక్కడ నుండి ప్రారంభించారు అని అధికారిక పత్రాలు ఉన్నాయి ఇక్కడ. శుచీన్ద్రం రాజ గోపుర పునరుద్ధరణకు డబ్బు అవసరం ఏర్పడింది. అప్పటి తిరువనంతపురం రాజు గారి అనుమతితో ఒక రూపాయి లాటరీ టికెట్ అమ్మకం చేశారు. పదివేల రూపాయల బహుమతి. యాభై వేల టికెట్లు అమ్మారు. బహుమతి సొమ్ము పోను మిగిలిన డబ్బుతో ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. పచ్చని అడవితో పాలార్ నదీ ప్రవాహం, శిల్పకళా వైభవం మంచి అనుభూతినిస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ టూర్ శబరిమల యాత్రలో సుచీన్ద్రం వెళ్లడం సులువు. కన్యాకుమారి నుండి 18, నాగర్కోయిల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది సుచీన్ద్రం శివ క్షేత్రం. సుచీన్ద్రంలో అంతగా లాడ్జీలు లేవు. నాగర్కోయిల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. – ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం(చదవండి: మైసూరు మహాదేవి చాముండేశ్వరి) -
స్టూడెంట్ సాహసం..!జస్ట్ రూ. 16 వేలతో..
ఓ వ్యక్తి తలచుకుంటే అనితర సాధ్యమైనదంటూ ఉండదు అని నిరూపించాడు ఈ విద్యార్థి. విలాసవంతమైన స్పాన్సర్లు, ఎలాంటి సాహసయాత్ర చేసిన నేపథ్యం లేకుండా ఎవరెస్టుని చుట్టేయలని ఉత్సాహం మాత్రం ఆకాశమంత. ఏదైతేనేం తన దగ్గర ఉన్న తక్కువ డబ్బుతోనే ఎవరెస్టు బేస్ క్యాప్కు చేరుకుని ఓ చిన్నపాటి విజయం సాధించాడు పైగా తన వయసు యువకులకు జస్ట్ ఊహాలాంటి డ్రీమ్ని సాధ్యం చేసి..పరిమిత వనరులు, ఆర్థిక పరిస్థితి, మార్గదర్శక లేమి వంటివి ఏమీ పెద్ద అడ్డంకులు కావని ప్రూవ్ చేశాడు. కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన 21 ఏళ్ల కేశవ్ సునీష్ బీకామ్ విద్యార్ధికి ఎవరెస్టుని అధిరోహించడం అతని డ్రీమ్. అలా అని బాగా ధనవంతుల కుటుంబ నేపథ్యమా? అంటే అదీ కాదు. పోనీ సాహసయాత్రలు చేసిన చరిత్ర ఉందా ?అంటే అదీ లేదు. కానీ ఎలాగైనా ఆకోరిక నేరవేర్చుకోవాలన్న ప్రగాఢమైన కోరిక ఒక్కటే బలంగా ఉంది. అదే అతడిని ఇంత పెద్ద సాహసానికి పూనుకునేలా చేసింది. అందుకోసం అతను కూరగాయ దుకాణంలో సహాయకుడిగా, ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసిన పోదుపుతో ఎవరెస్టు బేస్ క్యాంప్కు చేరుకున్నాడు. ఈ యాత్ర కోసం అతడ ఖర్చు చేసిందో ఎంతో తెలిస్తే విస్తుపోతారు. కేవలం రూ. 16 వేలతో ఈ డ్రిమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అంత తక్కువ డబ్బుతో ఎలా సాధ్యం అంటే..మనసుంటే మార్గం ఉందని అంటాడు కేశవ్. నిజానికి ఆ స్టూడెంట్ ఆశయం సాధరణమైంది కాదు. ఎందుకంటే ఎవరెస్టు యాత్రకు అయ్యే ఖర్చు సుమారు రూ. 15 లక్షలు. అయితే ఎవరెస్టు శిఖరాగ్రం అతడి స్థోమతకు అందనిది, అందుకని చిన్న చిన్న దశలుగా విభజించుకుని ఒక్కో మైలు రాయిని చేరుకునేలా ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్ క్యాంప్కు చేరుకున్నాడు కేశవ్. అలాగే తన స్థోమతకు అనుగుణంగా ఖర్చులు తగ్గించుకునేలా యాత్ర ప్లాన్ చేశాడు. సెకండ్ క్లాస్ రైళ్లు, బస్సుల్లో ప్రయాణించి సోనౌలి సరిహద్దు ద్వారా నేపాల్లోకి ప్రవేశించి, కాలినడకన యాత్ర కోసం సల్లేరికి చేరుకున్నాడు.దాదాపు ఎనిమిది రోజులు పైయా, టెంగ్బోచే, డింగ్బోచే, లుబుచేలా గుండా ప్రయాణిస్తూ..చివరకు ఎవరెస్టుబేస్ క్యాంప్కు చేరుకున్నాడు. అలాగే క్యాంప్కు సమీపంలో ఉన్న గోరక్షెప్కు చేరుకోవడానికి 132 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. మధ్యమధ్యలో టెంట్ వేసుకుని నిద్రించాడు కూడా. అలాగే తన బడ్జెట్కి అనుగుణంగా స్వయంగా వండుకుని ఆహారం తినేవాడు. ఈ యాత్రకు ఎన్నో అడ్డంకులు..అతడు ఈ యాత్రను సెప్టెంబర్ 2025లో ప్రారంభించాడు. జనవరిలో తన అమ్మమ్మ మరణింతో మధ్యలోనే తిరిగి వచ్చేశాడు, కానీ సంకల్పం వదులుకోలేదు. ఆ తర్వాత చిన్న చితకా ఉద్యోగాల్లో చేరి డబ్బు ఆదా చేసి ఏప్రిల్ 7న అధిరోహణ పునః ప్రారంభించాడు. అలా రెండో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకున్నాడు. అతడి కథ..చుట్టూ ఎలాంటి వనరులు లేకపోయినా..కనీసం మార్గనిర్దేశం లేకపోయానా..సాధించాలి అన్న తపన ఎవరెస్టు వరకు నడిపించింది. చాలా శ్రమకోర్చి సాధించిన విజయం ఇది. పైగా కేశవ్ జస్ట్ 21 ఏళ్లకే దాన్ని సాధించాడు. అయితే అతడు శిఖరాగ్రం చేరుకోకపోవచ్చు..సమీపం వరకు వెళ్లి అనుకున్నది సాధించాడు. నిజానికి ఎవరెస్టు శిఖరాగ్రం చేరుకోవడానికి బేస్క్యాంప్లో ఫిజికల్ శిక్షణ, వంటివి చాలానే ఉంటాయి. అయినా ఇంత సాధించిన కేశవ్కి అదేమంత కష్టమేమి కాదు. మరి అతడికి ఆల్ది బెస్ట్ చెబుదామా..! View this post on Instagram A post shared by Kesav Suneesh | Traveller 🇮🇳 (@kesav_on_go) (చదవండి: ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడు స్పేస్ టెక్ కంపెనీ సీఈవోగా..!) -
కేరళ సీఎం తొలి ప్రామిస్
-
కేరళం సీఎంగా సతీశనే ఎందుకు?
పది రోజుల సస్పెన్స్కు తెర దించుతూ కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. తమకు ఎంతో దగ్గరైన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ను పక్కనపెట్టి మరీ లాయర్ నుంచి లీడర్గా ఎదిగిన సతీశన్కు ఆ అవకాశం ఇవ్వడం కాస్త ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. ఈ ఎంపికను గమనిస్తే అనేక రాజకీయ గణాంకాలు కనిపిస్తున్నాయి. కేరళం కొత్త సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక కావడం ఒక సాధారణ నిర్ణయం కాదు. ప్రధానంగా.. ప్రజా మద్దతు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను బట్టబయలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు, కేఐఐఎఫ్బీ ఫండింగ్ వివాదం, ఇతర కుంభకోణాల ఆధారంగా విజయన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఈ పోరాటం వల్ల ఆయనకు ‘క్లీన్ లీడర్’ గా ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది.మిత్రపక్షాల బలం.. కేసీ వేణుగోపాల్కు కాంగ్రెస్లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అయితే మరో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలతో పోలిస్తే వీడీ సతీశన్కు పార్టీలో మద్దతుదారుల సంఖ్యా బలం తక్కువే. అయినపపటికీ మిత్రపక్షాలు ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వచ్చాయి. కేరళలో ముస్లిం లీగ్, ఇతర చిన్న పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ స్థిరమైన ప్రభుత్వం సాధ్యం కాదు. కాబట్టి మిత్రపక్షాలకు దగ్గరగా ఉన్న సతీశన్ను ఎంపిక చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా అధిష్టానం భావించింది.మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో ‘‘నేను సీఎం పోస్ట్ కోసం లేను.. పార్టీ కోసమే ఉన్నా అని ప్రకటించడం’’ కేసీ వేణుగోపాల్కు పెద్ద మైనస్ అయ్యింది. ఇది వీడీ సతీశన్కు మిత్రపక్షాల్లో, కేడర్లో మరింత సింపథీ తెచ్చి పెట్టింది. కేసీ అనుకూల వర్గం ఆయన పేరిట పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. ఓన్లీ వీడీ అంటూ పార్టీ కేడర్తో పాటు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. సమర్థుడనే ట్యాగ్ లైన్.. 2001 నుంచి పరవూర్ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్నారాయన. 2021 నుంచి 2026 మధ్య ప్రతిపక్ష నేతగా పని చేశారు. కేరళంలో యూడీఎఫ్ విక్టరీలో వీడీ సతీశన్ది కీలక పాత్ర అనే చెప్పొచ్చు. పైగా ఆయనకు ఉన్న న్యాయవాది నేపథ్యం, కిందస్థాయి నుంచి ఎదిగిన వైనం, అదనంగా సామాజిక సేవా దృక్ఫథం, .. ప్రజలు మాత్రమే కాదు పార్టీ కేడర్ ప్రజలు ఆయన్ని సమర్థుడైన నాయకుడిగా భావించడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పెద్దలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో కిందిస్థాయి వాళ్లకూ కాంగ్రెస్లో సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని సింబాలిక్గా చెప్పడానికి ఓ అవకాశం దొరికింది. వీడీ సతీశన్కు పాలనలో ప్రత్యక్ష అనుభవం లేకపోవచ్చు. కానీ, ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం అసామాన్యమైనది. మిత్రపక్షాల మద్దతు, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత.. అన్నీ కలిపి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచి ఆయనను సీఎం సీటులో కూర్చోబెట్టగలిగాయి. -
కేరళ కొత్త సీఎం VD. సతీశన్
-
కేరళం సీఎంని ప్రకటించిన ఏఐసీసీ
తిరువనంతపురం: కేరళం సీఎంగా వీడీ సతీషన్ నియామకమయ్యారు. ముఖ్యమంత్రిగా ఆయన పేరును అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. సతీషన్ నేపథ్యంఆయన పూర్తిపేరు వడక్కేయిల్ దామోదరన్ సతీషన్, నెట్టూరు, ఎర్నాకులం జిల్లాలో మే 31, 1964న ఆయన జన్మించారు. పనంపిల్లి నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యాబ్యాసం పూర్తి చేశారు. వృత్తిరీత్యా న్యాయవాదైన సతీషన్.. NSUI ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేగా 2001లో మొదటిసారిగా పారావూర్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుండి వరుసగా ఐదుసార్లు (2001, 2006, 2011, 2016, 2021) అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.అనంతరం 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, రమేష్ చెన్నితాల స్థానంలో ఆయనను కేరళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి రాష్ట్ర సమస్యలపై గత ప్రభుత్వాన్ని పలుసార్లు ఎండగడుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.కాగా కేరళం ముఖ్యమంత్రి సీటుపై తొలి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీడీ సతీషన్, రమేశ్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ల మధ్య ముఖ్యమంత్రి పదవికై తీవ్ర పోటీ నడిచింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సన్నిహితులైన కేసీ వేణుగోపాల్కు ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖరారైనేట్లేనని అంతా భావించారు. కాగా ఆశ్చర్యంగా ఆయనే పోటీ నుంచి తప్పుకోవడంతో వీడీ సతీషన్ పేరు అధిష్ఠానం ఖరారు చేసింది. -
కేరళం ముఖ్యమంత్రిపై వీడనున్న సస్పెన్స్
తిరువనంతపురం: కేరళం ముఖ్యమంత్రి అభర్థిపై మరికోద్దిసేపట్లో ఉత్కంఠ వీడనుంది. ఈ రోజు ముఖ్యమంత్రి అభర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏవరనే అంశం ఈ రోజు తేలనుంది. అయితే సీఎం రేసులో రాహుల్ గాంధీ విధేయులు కేసీ వేణుగోపాల్ ముందజంలో ఉన్నట్లు సమాచారం.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చి పదిరోజులు దాటింది. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మంత్రివర్గం కొలువుదీరింది. అయితే కాంగ్రెస్ అధికారం సాధించిన ఒక్క కేరళలో మాత్రం ఇంకా ముఖ్యమంత్రి ఎవరనే అంశమే స్పష్టత రాలేదు. దీంతో ఈ విషయమై ఎవరు సీఎం కానున్నారనే అంశం మరికొద్దిసేపట్లో తేలనుంది.నిన్న (బుధవారం) పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో 40 నిమిషాల పాటు తుది మంతనాలు జరిపాక నూతన ముఖ్యమంత్రి అంశంలో స్పష్టత వచ్చిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతమైన అన్ని ప్రక్రియలను ఆచరిస్తూ సీఎం పేరును ప్రకటిస్తున్నామని వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రి పదవి రేసులో కేరళ అసెంబ్లీలో విపక్షనేత వీడీ సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లు బరిలో ఉన్నారు.కాగా వీడీ సతీశన్ది లోక్సభ ఎన్నికలతో పాటు యూడీఎఫ్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరో వైపు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్కు రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితులు. అంతే కాకుండా ఈ విషయమై వీరిద్దరు ఇదివరకే చర్చలు జరిగినట్లు సమాచారం.అయితే సీఎం ఈ విషయంలో వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అధిష్ఠానం వీరిద్దరివైపూ కాకుండా రమేష్ చెన్నితల వైపు మెుగ్గు చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించనుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
కేరళ సీఎం ఎంపిక నేడే
న్యూఢిల్లీ: ఫలితాలొచ్చి పది రోజులైనా కేరళ ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులనే అంశాన్ని తేల్చుకోలేక తీవ్రంగా సతమతమవుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎట్టకేలకు గురువారం సీఎం పేరును ప్రకటించనుంది. రోజుల తరబడి సస్పెన్స్, సంప్రదింపులు, లాబీయింగ్, మంతనాల మారథాన్కు ముగింపు పలుకుతూ గురువారం ముఖ్యమంత్రి పేరును ప్రకటించబోతున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో 40 నిమిషాల పాటు తుది మంతనాలు జరిపాక నూతన ముఖ్యమంత్రి అంశంలో స్పష్టత వచ్చిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమి కేరళ శాసనసభ స్థానాల్లో భారీ మెజార్టీతో గెల్చిన విషయం విదితమే. ప్రజాస్వామ్యయుతమైన అన్ని ప్రక్రియలను ఆచరిస్తూ సీఎం పేరును ప్రకటిస్తున్నామని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. తొలి నుంచీ ముఖ్యమంత్రి పదవి రేసులో కేరళ అసెంబ్లీలో విపక్షనేత వీడీ సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(వ్యవస్థాగతం) కేసీ వేణుగోపాల్లు బరిలో ఉన్నారు. -
ఒక్కొక్కరికీ రూ. 5 వేలు పెట్రోలు మాత్రమే! ఎక్కడ?
కేరళలో ఒక వైపు ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం నడుస్తుండగానే మరో సంచలన వార్త దావాలనంలా వ్యాపించింది. ఇంధన విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో నిల్వలు అకస్మాత్తుగా అయిపోకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం, కేరళలోని ఇంధన కేంద్రాలు బల్క్ ఇంధన అమ్మకాలపై ఆంక్షలు విధించినట్లు సమాచారం ఒక్కో వ్యక్తికి గరిష్టంగా రూ. 5,000 విలువైన పెట్రోల్ను , డీజిల్ను 200 లీటర్లను విక్రయించనున్నాయి.ఎందుకీ నిర్ణయం?రిటైల్ అవుట్లెట్లలో ఇంధనం నిరంతరం అందుబాటులో ఉండేలా చూడటం, అధిక డిమాండ్ ఉన్న సమయంలో నిల్వలు పూర్తిగా ఖాళీ అవ్వకుండా నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం బంకులకు కేవలం కొన్ని రోజులకు సరిపడా స్టాక్ను మాత్రమే సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల బంకు యజమానులు జాగ్రత్తగా ఇంధనాన్ని విక్రయించాల్సి వస్తోంది. ముందస్తు చెల్లింపులు (Advance payments) చేయాల్సి రావడం క్రెడిట్ సౌకర్యాలు రద్దు కావడంతో పెట్రోల్ బంకుల నిర్వహణ కష్టతరంగా మారింది.ఇదీ చదవండి: ప్రసాదంగా నాణేలు : ఎక్కడుందీ గుడి? వీడియో వైరల్పంపిణీదారుల స్పందనకేరళ స్టేట్ పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ మరియు ఇంధన పంపిణీదారులు దీనిపై వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏమీ లేదు. కేవలం రవాణా పరమైన జాప్యాలు , పంపిణీని క్రమబద్ధీకరించడానికి మాత్రమే ఈ పరిమితులు విధించారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం సుమారు రెండు నెలలకు సరిపడా ముడి చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.ఈ ఆంక్షల వల్ల సాధారణ వినియోగదారుల కంటే భారీగా ఇంధనం కొనేవారు (Bulk buyers) , లాజిస్టిక్స్ ఆపరేటర్లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ కంపెనీలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, అందుకే పంపిణీలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని నివేదికలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ప్రతీక్ యాదవ్కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్మార్టం నివేదిక -
వయనాడ్ మరో అమేథీ?.. కాంగ్రెస్లో కలకలం
వయనాడ్: కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళలో పదేళ్ల తర్వాత సాధించిన ఘన విజయం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుండగానే, కాంగ్రెస్ అధిష్టానంపై సొంత పార్టీ వర్గాలే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నాయి. ముఖ్యంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను టార్గెట్ చేస్తూ, సొంత ఇలాకా వయనాడ్లో వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర సంచలనంగా మారాయి.వయనాడ్ మరో అమేథీ కానుందా?వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సమీపంలో రాత్రికి రాత్రే వెలసిన పోస్టర్లు కేరళ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కనుక కేరళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే.. ‘వయనాడ్ ఖచ్చితంగా తదుపరి అమేథీగా మారుతుంది’ అంటూ ఆ పోస్టర్లలో తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, కేరళ ప్రజలు అధిష్టానం తీసుకునే ఇలాంటి ‘మూర్ఖపు నిర్ణయాలను’ ఎన్నటికీ క్షమించరని, రాహుల్, ప్రియాంకలు ఇక వయనాడ్ నియోజకవర్గం నుంచి గెలవడం మర్చిపోవాలని ఆ పోస్టర్లలో ఘాటుగా విమర్శించారు. అమేథీలో ఎలాగైతే కాంగ్రెస్ పట్టు కోల్పోయిందో, భవిష్యత్తులో వయనాడ్లో కూడా అలాగే జరుగుతుందని వారు అంటున్నారు. Wayanad, Keralam: Posters targeting Congress MPs Rahul Gandhi and Priyanka Gandhi Vadra have appeared near the Wayanad District Congress Committee office amid ongoing suspense over Kerala's next Chief Minister following the UDF's election victory pic.twitter.com/z62QGaq9Rb— IANS (@ians_india) May 13, 2026భగ్గుమన్న అసమ్మతి.. సీఎం పీఠం కోసం పోరుఅధిష్టానం అండతో సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్ను రాహుల్ గాంధీకి కేవలం ‘బ్యాగ్ క్యారియర్’గా మాత్రమే పోస్టర్లలో అభివర్ణించడం గమనార్హం. ఆయనకు సీఎం పదవి ఇస్తే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గానూ 102 స్థానాలు సాధించి, యూడీఎఫ్ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. అయితే ముఖ్యమంత్రి పీఠం కోసం సీనియర్ నేతలు వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పార్టీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది.ఢిల్లీలో ముమ్మర మంతనాలు.. నేడే క్లైమాక్స్ఈ తీవ్ర ఉత్కంఠ నడుమ, ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంగళవారం ఢిల్లీలో కేరళ మాజీ కేపీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ స్వయంగా వరుస సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించారు. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బుధవారం మధ్యాహ్నానికల్లా కేరళ తదుపరి ముఖ్యమంత్రి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.ఇది కూడా చదవండి: ప్రతీక్ యాదవ్: ‘సయోధ్య’ కుదిరిన వేళ.. సాగనంపిన కాలం! -
కేరళ ఉత్కంఠ.. ఇరకాటంలో కాంగ్రెస్!
కేరళలో కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో తీవ్ర అంతర్గత పోరు నడుమ.. హస్తినలో కీలక సమావేశం జరగబోతోంది. దీంతో ఇవాళ సాయంత్రం లోపు కీలక నిర్ణయం వెలువడవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. ఇరకాటంలో పడేసేందుకు బీజేపీ రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్లో ప్రస్తుతం సీఎం రేసులో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వీ.డి. సతీశన్ ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. అదనంగా రమేశ్ చెన్నితాల కూడా చేరడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయసేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న కేసీ వేణుగోపాల్కు 63 మంది ఎమ్మెల్యేల్లో 47 మంది మద్దతు ఇస్తున్నారు. ఈ పోరులో రెండో ఎంపికగా రమేష్ చెన్నితల పేరును కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. అయితే వీడీ సతీశన్కు ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తోంది. దీంతో టాప్ ప్రయారిటీగా వేణుగోపాల్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. ఈ తరుణంలో..ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది యూడీఎఫ్ మిత్రపక్షం ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్). సీఎం ఎంపికలో జాప్యంపై అసంతృప్తితో ఉన్న ఐయూఎంఎల్.. అనూహ్యంగా సతీశన్కు మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్లోని ఒక వర్గం ఈ నిర్ణయంతో విబేధిస్తోంది. ఇప్పటికే బీజేపీ తరచూ కాంగ్రెస్ను ఓ మతానికి అనుకూల పార్టీ అని విమర్శిస్తోంది. ఈ దశలో ఐయూఎంఎల్ ఒత్తిడికి లొంగితే.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లే అవుతుందని కొందరు కేరళ కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.ఇదిలా ఉండగానే.. సతీశన్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ అంగీకరించబోనని హైకమాండ్కు స్పష్టం చేసినట్లు సమాచారం. సతీశన్ను ఎంపిక చేస్తే మరో సమస్య ఏమిటంటే.. ఆయనకు పరిపాలనా అనుభవం లేదు. వేణుగోపాల్ మాత్రం రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా సతీశన్ను సీఎం చేయాలని పోస్టర్లు కనిపించడం, ఆయన పార్టీని ఒత్తిడికి గురి చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వర్గపోరు, బహిరంగ శక్తి ప్రదర్శనలు ఆపాలని సూచించారు.మరోవైపు.. అనుభవజ్ఞుడైన వేణుగోపాల్ను సీఎం చేస్తే.. ఆయన లోక్సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక అసెంబ్లీ సీటు, ఒక లోక్సభ సీటుకు ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరగాలి. అదనంగా, కాంగ్రెస్ కేంద్ర స్థాయిలో కొత్త ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. అయితే.. కేసీ వేణుగోపాల్ ఛాయిస్ పైనా బీజేపీ సెటైర్లు వేస్తోంది.సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీఎం ఎంపిక విషయంలో కేరళ బీజేపీకి.. జాతీయ బీజేపీకి మధ్య పోరు నడుస్తోంది. ఆయన కేరళలో ఉండాలని కేరళ బీజేపీ, లేదు ఢిల్లీలో ఉండాలని జాతీయ బీజేపీ కోరుకుంటోంది అని కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దానికి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ వెటకారంగా స్పందించారు. ఇది నిజమని నేను ధృవీకరించను.. అలాగే ఖండించను కూడా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ లోపల జరుగుతున్న నాయకత్వ పోరును ఎగతాళి చేస్తూ, బీజేపీకి రాజకీయ వ్యంగ్యంగా మారింది.అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?. పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు.. యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ అని రమేశ్ చెన్నితాల మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ గందరగోళం నడుమ.. సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ హైకమాండ్ నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఈ సమావేశాలతో.. ఇవాళ సాయంత్రానికో.. లేదంటో రేపటికల్లా కేరళ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నిర్ణయం ఏదైనా సరే కేరళ రాజకీయ సమీకరణాలను మాత్రమే కాదు, జాతీయ స్థాయిలోనూ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. -
కేరళ సీఎం ఎంపికలో అదే అనిశ్చితి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం కూడా ఊహాగానాలు, సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, ఈ సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు అత్యున్నత నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశాలతో సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని చెబుతున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఒకట్రెండు రోజుల్లోనే వ్యవహారం కొలిక్కి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. 48 గంటల్లోనే దీనిపై స్పష్టత రానుందని ఓ నేత తెలిపారు. సీఎం రేసులో ఉన్న రమేశ్ చెన్నితాల, ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్లతో రాహుల్, ఖర్గేలు చర్చలు జరిపిన తర్వాత కూడా కాంగ్రెస్ అంతిమ నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. ఈ జాప్యంపై యూడీఎఫ్లోని కీలక పక్షమైన ఐయూఎంఎల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అనిశ్చితి ఇలాగే కొనసాగితే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరిస్తోంది. ఆలస్యం కారణంగా ప్రజలతోపాటు తమ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని ఐయూఎంల్ మలప్పురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హమీద్ తెలిపారు. ఎంపికలో కాలయాపనపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు బదులిచ్చారు. ‘అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?’అని ప్రశ్నించారు. ‘పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు, యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ’అని రమేశ్ చెన్నితాల పేర్కొన్నారు. -
సీఎం విజయ్ కోసం 650కిలో మీటర్ల కాలినడక .. సోషల్ మీడియాలో వైరల్!
సాక్షి,చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండ పార్టీలను మట్టికరిపించిన టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనను కలిసేందుకు ఓ యువజంట చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన రఫీ, షహానా భార్యాభర్తలు. రఫీ డ్రైవర్గా పనిచేస్తూనే డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు. ఈ దంపతులకు హీరో విజయ్ అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానం ఇప్పుడు హద్దులు దాటి, కేరళ నుంచి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో చెన్నైలో సీఎం విజయ్ను కలుసుకోవడానికి కాలినడకన ప్రయాణం ప్రారంభించారు.ఆకలేసినప్పుడు హోటల్లో తినడం, లేకపోతే రోడ్డు పక్కనే వండుకోవడం చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. రాత్రివేళల్లో పెట్రోల్ బంకులు, షాపుల వద్ద టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. మే 7న ప్రారంభమైన వారి ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ ప్రయాణంలో అనుభవాలను వీడియోల రూపంలో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నారు. నెటిజన్లు వారికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు అభిమానం వెర్రి తలలు అంటే ఇదేనేమో.. బస్సు, ట్రైన్లో వెళ్లొచ్చు కదా, కాలినడకన రావాల్సిన అవసరమా? అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.రఫీ దంపతులు మాట్లాడుతూ.. మాకు విజయ్, ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించి, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక మరింత బలపడింది. అందుకే చెన్నై వరకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.కేరళ జంట 650 కి.మీ నడిచి చెన్నై చేరుకోవడం, తలపతి విజయ్ను కలవాలని ప్రయత్నించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానులు ‘పీక్ తలపతి క్రేజ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఖచ్చితమైన అపాయింట్మెంట్ లేదా అధికారిక ఏర్పాట్లు లేకపోయినా, చెన్నై చేరుకున్న తర్వాత ఆ అవకాశం తప్పకుండా లభిస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు.రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ టీవీకే, సంకీర్ణ భాగస్వాముల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి మెజారిటీ సాధించింది. -
ఎస్ఐఆర్తో మాకూ లాభం జరిగిందేమో!: శశిథరూర్
ఎస్ఐఆర్పై దేశంలో ఒకపక్క దుమారం చెలరేగుతుండగా.. ఇంకోపక్క తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఈ అంశంపై ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. బెంగళూరు (దక్షిణ) నియోజకవర్గ ఎంపీ తేజస్వీ సూర్యతో కలిసి ఆయన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన చర్చలో శశిథరూర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ పేరుతో వివిధ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించిన ఎస్ఐఆర్ ప్రక్రియ కేరళలో తమకు లాభం చేకూర్చి ఉండవచ్చునని అన్నారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇటీవలే వెల్లడై ఓట్ల చోరీ అంశం మరోసారి చర్చనీయాంశమైన ప్రస్తుత తరుణంలో శశిథరూర్ వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా శశిథరూర్ వ్యాఖ్యానిస్తూ.. ‘అక్కడ సుమారు 91 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 34 లక్షల మంది తాము ఓటింగ్కు అర్హులమని, జాబితాలో తమ పేర్లు చేర్చాలని అప్పీల్ చేశారు కూడా. అయితే ఒకొక్కరి వివరాలను పరిశీలించి చేర్చాల్సి ఉన్నందున వీరిలో కొన్ని వందల మందికి మాత్రమే మళ్లీ అవకాశం దక్కింది. ఫలితంగా సుమారు 31 నుంచి 32 లక్షల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బెంగాల్లో టీఎంసీ కంటే బీజేపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కూడా కొంచెం అటు ఇటుగా 30 లక్షలు కావడం’ అని ఆయన వ్యాఖ్యానించారు.#WATCH | San Francisco, USA: Speaking at the roundtable on 'India, That is Bharat: Growth Governance and Identity' at Stanford India Conference, Congress MP Shashi Tharoor says, "About the SIR... there are legitimate questions to answer. Look at the Bengal case. 91 lakh names… pic.twitter.com/QpysPZcVV1— ANI (@ANI) May 10, 2026ఓటర్ల జాబితాలో అవకతవకలను సవరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ అభ్యంతరం పెట్టలేదని, డూప్లికేట్ ఓటర్లు, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం అవసరం కూడా అని ఆయన అన్నారు ఈ క్రమంలోనే కేరళలో ఎస్ఐఆర్ ప్రక్రియ తమకు ఎలా ఉపయోగపడిందో వివరిస్తూ శశిథరూర్ ఏమన్నారంటే.. ‘వాస్తవానికి ఎస్ఐఆర్ అన్నది కేరళలో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చి ఉండవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ప్రభుత్వం చాలాకాలంగా ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోంది. ఒకే ఓటరు మూడు నాలుగు చోట్ల నమోదు చేసకోవడం, డూప్లికేట్ ఓటర్లు చాలామంది ఉన్నారు. వీరందరి తొలగింపు ఫలితంగా కాంగ్రెస్కు మెజార్టీ లాభించి ఉండవచ్చు’ అని అన్నారు.కొందరిని ఒంటరి వాళ్లను చేశారు..దేశంలో మైనార్టీ వర్గాలను ఒంటరులను చేయడం గత దశాబ్ద కాలంలో ఎక్కువైందని, బీజేపీ అగ్రనేతలు మొదలుకొని సామాన్యుల వరకూ మైనార్టీలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తూండటం దీనికి కారణమని శశిథరూర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉన్నప్పటికీ బీజేపీ మార్కు రాజకీయాల విషయంలో మాత్రం తన వైఖరి నిక్కచ్చిగానే ఉంటుందని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో ఈ దేశంలోని మైనార్టీలు తమ పట్ల ఎందుకింత వివక్ష ఏర్పడిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ‘మా పూర్వీకులు ఈ మట్టిలోనే కలిసిపోయారు. అయినా మమల్ని వేరుగా ఎందుకు చూస్తున్నారు’ అని వారు భావిస్తున్నారని, విభజన గాయాలను రెచ్చగొడుతూ మైనార్టీలను అణచివేసే ప్రయత్నం చేయడం ద్వారా బీజేపీ తప్పు చేస్తోందని వ్యాఖ్యానించారు. -
మత్తు వల్లకాడుగా మారుతున్న కేరళ
తిరువనంతపురం: దేవుని సొంత దేశంగా పేరొందిన ‘కేరళ’ ఇప్పుడు డ్రగ్స్ మత్తులో తూగుతోంది. ఒకప్పుడు వీధుల్లో మాత్రమే గంజాయి కనిపించేది. ఇప్పుడైతే ఏకంగా ఫైవ్ స్టార్ హోటళ్లలో విలాసవంతమైన ‘ఎండీఎంఏ’ డ్రగ్ పార్టీలు దర్శనమిస్తున్నాయి. 590 కిలోమీటర్ల భారీ తీరప్రాంతం, మారుమూల రైల్వే నెట్వర్క్ను వాడుకుంటూ కొకైన్, హెరాయిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ కేరళకు వెల్లువలా పోటెత్తుతున్నాయని ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది. వలస కార్మికులను పావులుగా వాడుకుంటూ, ఎలైట్ క్లాస్ ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ హైటెక్ డ్రగ్ మాఫియా వ్యవహారం ఇప్పుడు పోలీసులకు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం డ్రగ్స్ రవాణా కేంద్రంగానే కాకుండా.. భారీ మాదకద్రవ్యాల వినియోగ మార్కెట్గా కేరళ ఎలా మారిందో దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.గంజాయి నుంచి సింథటిక్ డ్రగ్స్ వైపు.. కేరళలో డ్రగ్స్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. గంజాయి కన్నా తక్కువ స్థలం ఆక్రమించే, దాచడానికి సులభంగా ఉండే హెరాయిన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ వంటి హై-ఎండ్ సింథటిక్ డ్రగ్స్ వైపు స్మగ్లర్లు మొగ్గుచూపుతున్నారు. హెరాయిన్కు వాసన లేకపోవడం, స్మగ్లర్లకు భారీగా లాభాలు రావడం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా కొచ్చి వంటి నగరాల్లో విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రైవేట్ పార్టీల ముసుగులో డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్లో కొచ్చిలో ఏకంగా 183.55 గ్రాముల ఎండీఎంఏ, 93.51 గ్రాముల ఎక్స్టసీ పిల్స్తో కెవిన్ బి. మాథ్యూ అనే వ్యక్తి పట్టుబడటం కలకలం రేపింది. ఆ తర్వాత మార్చి 28న కడవంత్రలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా కొకైన్, మెథాంఫెటమైన్ పట్టుబడటం ఈ హై-ప్రొఫైల్ నెట్వర్క్ తీవ్రతను కళ్లకుకట్టింది.డ్రగ్ కొరియర్లుగా వలస కూలీలు.. ఎలైట్ పార్టీల సంగతి పక్కన పెడితే.. ఈ డ్రగ్ నెట్వర్క్లో వలస కార్మికులను పావులుగా వాడుతుండటం దర్యాప్తు సంస్థలను మరింత కలవరపెడుతోంది. అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి కేరళకు పనుల కోసం వచ్చే అమాయక కూలీలను ఏజెంట్లు బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాలు పీకేస్తామని, సొంతూళ్లకు పంపేస్తామని భయపెట్టి, వారిని డ్రగ్స్ కొరియర్లుగా మారుస్తున్నారు. గత 18 నెలల కాలంలోనే డ్రగ్స్ కేసుల్లో దాదాపు 103 మంది వలస కార్మికులు అరెస్ట్ కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మాదకద్రవ్యాల పంపిణీ కోసం వీరు ‘డెడ్ డ్రాప్స్’ అనే సరికొత్త, అత్యంత పకడ్బందీ వ్యూహాన్ని వాడుతున్నారు. కొరియర్లు డ్రగ్స్ ఉన్న బ్యాగులను తమ వద్ద ఉంచుకోకుండా, రైల్వే స్టేషన్లలో ముందుగా మాట్లాడుకున్న రహస్య ప్రదేశాల్లో వదిలేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత స్థానిక డిస్ట్రిబ్యూటర్లు వచ్చి వాటిని తీసుకెళ్తారు. దీనివల్ల అసలు స్మగ్లర్ల మూలాలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.అంతర్రాష్ట్ర ముఠాల వలయం.. ఈ డ్రగ్ మాఫియా మూలాలు కేవలం కేరళకే పరిమితం కాలేదు. జాతీయ, అంతర్జాతీయ ముఠాలతో వీరికి లోతైన సంబంధాలున్నాయి. కొచ్చిలోకి ప్రవేశిస్తున్న ఎండీఎంఏ, మెథాంఫెటమైన్లో ఎక్కువ భాగం బెంగళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తుండగా.. హెరాయిన్ సరఫరా ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలతో ముడిపడి ఉంది. గోల్డెన్ క్రెసెంట్ (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్), గోల్డెన్ ట్రయాంగిల్ (మయన్మార్, థాయ్లాండ్) లాంటి అంతర్జాతీయ మార్గాల నుంచి వచ్చే కార్టెల్స్ కేరళను ఒక ప్రధాన లాంచ్ప్యాడ్గా ఎంచుకున్నాయి. ఇక్కడికి చేరిన డ్రగ్స్ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. యువతలో పెరుగుతున్న ఆదాయం, గ్లోబల్ నైట్లైఫ్ సంస్కృతిపై ఆకర్షణ ఈ మార్కెట్ విస్తరణకు ఆజ్యం పోస్తున్నాయి. నిఘా పెంచినా, రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేసినా, ఈ భారీ డిమాండ్ ముందు భద్రతా సంస్థల ప్రయత్నాలు సరిపోవడం లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Watermelon Death: 70 శాతంతో పాస్ .. చూసేందుకే లేవు చిట్టి తల్లీ..! -
కేరళం సీఎం అభ్యర్థి ఫిక్స్.. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్..?
తిరువనంతపురం: కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడి దాదాపు వారం రోజులు గడుస్తోన్నా ఇంకా ముఖ్యమంత్రి ఎవరనే విషయం తేలలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ వైపు మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన అధికారిక భేటీకి ముందే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో విడిగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి అంశమై ఇరు నేతలు సుధీర్గంగా చర్చలు జరపునున్నట్లు సమాచారం. కాగా కేరళం ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, శశిథరూర్లు సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగింది.కాగా ఇటీవల వేణుగోపాల్కు వ్యతిరేకంగా కేరళలో పోస్టర్లు వెలిశాయి. దీని వెనుక సతీశన్ హస్తం ఉందనే ఆరోపణలు రావడంతో రాహుల్ గాంధీ ఆయనను నేరుగా ప్రశ్నించారు. వేణుగోపాల్ సీఎం కావడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు సతీశన్ అంగీకరించారు. మెుదటి నుంచి వేణుగోపాల్ ఎంపికను మరో కీలక నేత వీడీ సతీశన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేణుగోపాల్ తన పదవిని ఉపయోగించి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అధిష్టానం వద్ద సైతం ఫిర్యాదు చేశారు.కాగా సతీషన్, రమేష్ చెన్నితల వంటి స్థానిక నేతలకు కేరళలో మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ముస్లిం లీగ్ మద్దతు సైతం సతీశన్కు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంత బలంగా సతీశన్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ కేసీ వేణుగోపాల్ వైపే మెుగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాబోయే రెండు రోజుల్లో పార్టీ శ్రేణులను ఒప్పించి కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దిశగా హైకమాండ్ ప్రయత్నాలు సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక నేతల వ్యతిరేకతను కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ 63, ఐయూఎమ్ఎల్ 22 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. -
‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది!
భారతదేశ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక కీలక మలుపుగా నిలిచాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని మార్చేలా ఉన్నాయి. అస్సాం, పుదుచ్చేరిల్లో యథాతథ స్థితి కొనసాగినప్పటికీ, మిగిలిన మూడు రాష్ట్రాల్లో వచ్చిన మార్పులు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం, మరోవైపు జాతీయ పార్టీల వ్యూహాలు, ఇంకోవైపు సరికొత్త రాజకీయ శక్తుల ఉద్భవం వెరసి.. భారతదేశ సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.కేరళలో కాంగ్రెస్ పునరుజ్జీవంకేరళ రాజకీయ చరిత్రలో ఎల్డిఎఫ్ , యూడిఎఫ్ కూటములు దశాబ్దాలుగా మారుతూ అధికారంలోకి వస్తున్నాయి. అయితే 2021లో పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డిఎఫ్ వరుసగా రెండోసారి విజయం సాధించి, ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. అయితే గడిచిన ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త నాయకత్వంతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకు వెళ్ళింది. ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. లౌకికవాదాన్ని, ఆర్థిక పురోగతిని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు కేరళలో బలపడిన యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాలపై ఉంది.తమిళనాట ‘విజయ్’ మేజిక్తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఈసారి ఫలితాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. 2021లో ఘనవిజయం సాధించిన ఎంకె స్టాలిన్ ప్రభుత్వం ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాల్లో అద్భుతంగా రాణించినప్పటికీ, ఇతర అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం ఒక పెను తుఫానులా మారింది. రెండేళ్ల క్రితం పెట్టిన టీవీకే పార్టీ.. ఎన్నికలకు పది రోజుల ముందు పుంజుకుని ఏకంగా 108 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎటువంటి భారీ ప్రచారాలు లేకుండా, కేవలం సోషల్ మీడియా మీమ్స్, పాటలు, విజయ్ ప్రసంగాలతోనే ఈ విజయం సాధించడం విశేషం. మేజిక్ ఫిగర్కు 11 సీట్ల దూరంలో నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలపడంతో నూతన ప్రభుత్వానికి మార్గం సుగమం అయ్యింది.బెంగాల్లో తృణమూల్ వెనుకంజదేశ రాజకీయ దిశను మార్చగల సత్తా ఉన్న పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఈసారి దిగ్భ్రాంతిని కలిగించాయి. పదేళ్లుగా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, అక్కడ బలమైన శక్తిగా ఎదిగింది. గత మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్పై వ్యతిరేకత ఒక కారణమైతే, ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు మరో ప్రధాన కారణం. అనేక కుటుంబాల్లో తలిదండ్రులకు ఓటు హక్కు ఉంటే పిల్లలకు లేకపోవడం, కొన్నిచోట్ల వైరుధ్యాలు తలెత్తడం వంటి అంశాలు ప్రజాస్వామ్యంపై మచ్చగా నిలిచాయి. న్యాయవ్యవస్థ కూడా ఈ విషయంలో ఓటర్లను ఆదుకోలేకపోయింది. వరుస విజయాలతో ఉన్న దీదీకి ఈ ఓటమి గట్టి ఎదురుదెబ్బగా మారింది.ఈశాన్యంలోనూ కమలనాథుల హవా పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ ఆధిపత్యం దేశవ్యాప్తంగా దాదాపు పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి పశ్చిమ రాష్ట్రాల నుండి హిందీ బెల్ట్ వరకు, ఇప్పుడు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలనాథుల హవా నడుస్తోంది. అయితే, దక్షిణాది ఐదు రాష్ట్రాలు మాత్రం బీజేపీకి ఇప్పటికీ ఇనుప కోటలుగానే మిగిలాయి. కేరళ, తమిళనాడులో పాగా వేయడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలను అక్కడి ఓటర్లు తిప్పికొట్టారు. కేరళలో 3, తమిళనాడులో 1 సీటుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఉత్తరాదిని శాసిస్తున్నా, దక్షిణాది మాత్రం బీజేపీని సుదూరంగానే ఉంచింది.సమాఖ్య వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు?బీజేపీ వరుస విజయాలు సాధిస్తే భవిష్యత్తులో ఏకపార్టీ పాలన వైపు, హిందూత్వ భావజాలం వైపు రాజ్యాంగ సవరణలు జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకిక రాజ్యంగా ఉంచాలంటే ప్రతిపక్షాల ఐక్యత అనివార్యం. 2024లో కొంత విజయం సాధించిన ఇండియా కూటమి ఆ తర్వాత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఓటమి తర్వాత మమతా బెనర్జీ కూటమిని బలోపేతం చేస్తానని ప్రకటించారు. అటు స్టాలిన్ కూడా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా పరిగణిస్తున్నారు. కొత్తగా పుంజుకున్న విజయ్ (టీవీకే) కూడా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో దేశ భవిష్యత్తు కోసం ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం ఇప్పుడు చారిత్రక అవసరం అని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్? -
కేరళం సీఎంపై ఉత్కంఠ.. రంగంలోకి రాహుల్
-
కేరళం సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
పినరయి కారుపై మోజు.. కుంజుమోన్ సీటుకు ‘క్లోజు’!
కన్నత్తూర్: పాతికేళ్ల పాటు ఒకే నియోజకవర్గానికి రారాజుగా వెలుగొందిన ఓ సీనియర్ రాజకీయ నేత తన తొలి ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. కన్నత్తూర్ నియోజకవర్గంపై తన ముద్ర తొలిసారి చెరిగిపోవడంతో ఆర్ఎస్పీ(ఎల్) నేత కోవూరు కుంజుమోన్ మీడియా సమక్షంలో కన్నీరుమున్నీరయ్యారు. 2001 నుంచి వరుస విజయాలు సాధించిన ఆయన, తాజా ఎన్నికల్లో ఆర్ఎస్పీ అభ్యర్థి ఉల్లాస్ కోవూరు చేతిలో ఏకంగా 25 వేల భారీ ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలవ్వడం కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.రాజకీయ ప్రస్థానం.. ఊహించని షాక్ కుంజుమోన్ రాజకీయ ప్రస్థానంలో 2016లో కీలక మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు ఉన్న మాతృసంస్థ (ఆర్ఎస్పీ) యూడీఎఫ్లో చేరడంతో, ఆయన విడిపోయి లెనినిస్ట్-మార్క్సిస్ట్ వర్గాన్ని స్థాపించి ఎల్డీఎఫ్తో జతకట్టారు. అప్పటినుంచి కన్నత్తూర్ను తన కంచుకోటగా నిలుపుకున్నారు. అయితే తాజా అనూహ్య ఓటమిపై ఆయన స్పందిస్తూ.. ‘నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులన్నీ తీసుకొచ్చాను, ప్రజల మధ్యే ఉన్నాను, ఓటమిని అంగీకరిస్తున్నాను’ అని అన్నారు.ప్రచార లోపమే కొంపముంచిందా?తన ఓటమికి ప్రజల్లో వ్యతిరేకత కంటే, తాను చేసిన పనులను ప్రచారం చేసుకోకపోవడమే ప్రధాన కారణమని కుంజుమోన్ విశ్లేషించారు. ‘కిఫ్బీ’ తదితర నిధులతో ఏకంగా రూ. 1,010 కోట్ల అభివృద్ధి పనులు చేశానని ఆయన గుర్తుచేశారు. ‘నేను ప్రచార ఆర్భాటాలకు పోయే వ్యక్తిని కాను. కానీ రోడ్లు, పాఠశాలల నిర్మాణం వంటి పనులను ప్లెక్సీలు, ప్రకటనల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సింది’ అని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధిని చాటుకోవడంలో విఫలమవ్వడమే ఈ పరాజయానికి దారితీసిందని కుంజుమోన్ అభిప్రాయపడ్డారు.కారు కొంటే తప్పా..? కన్నీటి పర్యంతం మీడియా సమావేశంలో ఆయన వ్యక్తిగత జీవితం, ఇటీవల కొన్న కొత్త కారు గురించి ప్రస్తావన రాగానే కుంజుమోన్ తీవ్ర భావోద్వేగానికి గురై, వెక్కి వెక్కి ఏడ్చారు. ‘కామ్రేడ్ పినరయి విజయన్ నల్ల కారులో ప్రయాణిస్తుంటే చూసి, నాకూ అలాంటి కారు కొనుక్కోవాలనిపించింది. నా పొదుపు మొత్తాన్ని చిట్ ఫండ్స్ లో దాచుకుని, ఆ 27 లక్షలతో కారు కొన్నాను. అందులో తప్పేముంది?’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓటమి బాధ ఉన్నప్పటికీ, ప్రజాసేవలో కొనసాగుతానని, నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రాజెక్టుల కోసం పోరాడతానని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: ఓటింగ్లో సునామీ.. థర్డ్ జెండర్లకు ఒరిగిందేమీ.. -
కేరళ సీఎంగా ఆయనే?
న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి ఎంపిక ఘట్టం తుది దశకు చేరుకుంది. ముఖ్య మంత్రి కుర్చీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)కేసీ వేణుగోపాల్ కూర్చునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధిష్టానం పంపిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ బుధ, గురువారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వేర్వేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు.పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడా మాట్లాడి, అభిప్రాయాలను సేకరించారు. ఇందుకు సంబంధించిన తుది నివేదికను వారు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అంతిమ నిర్ణయం ఇప్పుడు ఖర్గే చేతుల్లో ఉంది. దీనిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి.సీఎం పదవిని చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితోపాటు అగ్ర నేత రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ముఖ్యమంత్రి పదవి ఆయన్ని వరించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేత, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ వైపు కూడా మొగ్గు చూపినట్లు సమాచారం. మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాల కూడా సీఎం రేసులో ఉన్నారు. -
మహిళా ఎమ్మెల్యేకు షాకిచ్చిన కాంగ్రెస్ నేత
తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఓ షాకింగ్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. కొత్తగా ఎన్నికైన కొల్లాం ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ.. లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి వచ్చారు.అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ, సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అసౌకర్యానికి గురవుతూ అడ్డుకున్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకపోవడం వివాదాస్పదమైంది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ పార్టీ నేత చెరియన్ ఫిలిప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలేం జరిగింది?వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే బిందు కృష్ణ సమావేశానికి చేరుకుని.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడం కనిపిస్తోంది. తెలుపు, పసుపు రంగు చీర ధరించిన ఆమె.. మొదట ఒక పార్టీ కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ ఆమె వద్దకు వచ్చారు. బిందు కృష్ణ కరచాలనం చేయడానికి తన చేతిని చాచారు. కానీ ఫిలిప్ మాత్రం ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు కదిలారు. ఆయన ఆమె మెడపై ఒక చేయి వేసి, ఆమె చాచిన చేతిని కిందకు నొక్కడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.Intern: Shocking news. A newly elected young woman MLA was seen being forcibly hugged by a senior leader.Rajdeep: What is this party culture? What example are we setting? Netas don’t even know how to conduct themselves.Intern: Cherian Philip tried to forcibly hug Kollam MLA… pic.twitter.com/JqTvSKEIoI— Lala (@FabulasGuy) May 7, 2026ఒక్కసారిగా షాక్..బిందు కృష్ణ.. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె ఆయనను పక్కకు నెట్టివేస్తూ ప్రతిఘటించారు. ఆమె వెనక్కి తగ్గినప్పటికీ.. ఫిలిప్ రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న పలువురు జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు నవ్వుతూ కనిపించడంపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆమె ఒక ఎమ్మెల్యే..ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నా కూడా ఫిలిప్ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సరిహద్దులను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని.. అయిష్టత వ్యక్తం చేసిన వెంటనే వెనక్కి తగ్గాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఆమె ఒక ఎమ్మెల్యే.. ఈ వయసులో కూడా ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
కేరళ సీఎం పీఠంపై తొలగని సస్పెన్స్
-
కేరళ సీఎం పదవిరేసులో ముగ్గురు!
లెఫ్ట్ కూటమి పరిపాలనా కోటగోడలను బద్దలుకొడుతూ పదేళ్ల తర్వాత కేరళలో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఎట్టకేలకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధంచేసుకుంది. అయితే రాష్ట్రపరిపాలనా రథాన్ని ముందుండి నడిపించే రథసారథి ఎవరనే చర్చ ఇప్పుడు మొదలైంది. గతంలో కేరళ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షనేతగా ఉండి సీఎం పినరయి విజయన్ ప్రభుత్వ వైఫల్యాలను విజయవంతంగా ఎండగట్టిన వీడీ సతీశన్కు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అగ్రనాయకుడు రాహుల్గాందీకి అత్యంత సన్నిహిత నేతగా మెలుగుతున్న కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఆస్కారముందని కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితల సైతం సీఎం రేసులో ముందుకు దూసుకుపోతున్నారని కేరళ మీడియా కోడైకూస్తోంది. పార్టీ నేతలందర్నీ సమన్వయం చేసే సత్తా, పరిపాలనా అనుభవం, ఢిల్లీలో మాట నెగ్గించుకురాగల పరపతి ఉన్న నేతకే సీఎం పదవి దక్కే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఎవరిని సీఎం పదవి వరిస్తుందనేది కేరళలో చర్చనీయాంశమైంది. ఈ ముగ్గురు కీలకనేతల గురించి క్లుప్తంగా.. వీడీ సతీశన్ వీడీ సతీశన్ ఐదేళ్లుగా విపక్షనేతగా కొనసాగుతూ ప్రజసమస్యలపై అసెంబ్లీలో ప్రజావాణిని బలంగా విన్పించి ఓటర్లలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎంగా ఈయనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ మద్దతు కూడా ఉంది. సతీశన్ సీఎం అయితే మైనార్టీల బాగోగులనూ పట్టించుకుంటారని ఐయూఎంఎల్ అధ్యక్షుడు పనక్కడ్ సాదిఖ్అలీ తంగల్ అన్నారు. పినరయి విజయన్ ప్రభుత్వహయాంలో జరిగిన అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలనపై సతీశన్ ప్రజాక్షేత్రంలో బలంగా ఎండగట్టారు. యువకుడిగా కేరళ స్టూడెంట్స్ యూనియన్లో సభ్యునిగా ఉన్నకాలం నుంచి లాయర్గా తర్వాత కాంగ్రెస్నేతగా పాతికేళ్లకుగాపైగా కేరళ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఎర్నాకులం ఈయనకు పెట్టని కోట. పార్టీ అధిష్టానం వద్ద సైతం సతీశన్కు మంచి పేరుంది. పరవూర్లో సీపీఐ నేత టైసన్ మాస్టర్పై భారీ మెజారీ్టతో గెలిచి ప్రజల్లో తనకున్న ఆదరణను మరోసారి నిరూపించుకున్నారు. రమేశ్ చెన్నితల 70 ఏళ్ల రమేశ్ చెన్నితల సొంత రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించారు. పారీ్టకి గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా సేవలందించారు. గత యూడీఎఫ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం, విజిలెన్స్ శాఖమంత్రిగా పనిచేశారు. విద్యార్థి నేతగా ఉంటూ ఈస్థాయికి ఎదిగారు. 1982లోనే విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐకి ఆలిండియా అధ్యక్షునిగా పనిచేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్కు సైతం అధ్యక్షునిగా చేశారు. కేరళ అసెంబ్లీలో గతంలో విపక్షనేతగా ఉంటూ ప్రభుత్వవిధానాలపై ఉద్యమించారు. సతీశన్ కంటే ముందు విపక్షనేతగా పనిచేసిన కాలంలో యూడీఎఫ్ కూటమి మిత్రపక్షాల మధ్య ఐక్యత పెంచడంలో సపలమయ్యారు. జిల్లా నేతలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సీపీఐ నేత జిస్మన్పై భారీ మెజారీ్టతో నెగ్గారు. అలప్పుజ జిల్లాలో గెలిచిన ఏకైక యూడీఎఫ్ అభ్యర్థి ఈయనే. తద్వారా జిల్లాపై తనకు ఎంత పట్టు ఉందనేది నిరూపించుకున్నారు. కేసీ వేణుగోపాల్ అటు ఢిల్లీలో ఇటు కేరళలో నెగ్గుకురాగల విలక్షణమైన నేపథ్యమున్న నేతగా కేసీ వేణుగోపాల్ నిలిచారు. అలప్పుజ నుంచి గతంలో ఎంపీగా గెలిచారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం అత్యంత కీలకమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(వ్యవస్థాగతం) హోదాలో కొనసాగుతూ అగ్రనాయకులు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీలకు కుడిభుజంగా ఉన్నారు. కేఎస్యూ, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో కష్టపడిపనిచేసి ఏఐసీసీ పదవి పొందేస్థాయికి ఎదిగారు. రాష్ట్ర నేతలకు, కేంద్ర నాయకత్వానికి మధ్య సంధాన కర్తగా ఉంటూ చాన్నాళ్లుగా చక్కటి సమన్వయం సాధించారు. అధినాయకత్వానికి దగ్గరగా ఉన్న కారణంగా ఈయనకు సీఎం పదవి దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయపండితులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాజీ సీఎం వెహికిల్పై ఇన్ని ట్రాఫిక్ చలాన్లా..?
తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు దెబ్బమీద దెబ్బ పడుతుంది. ఇదివరకే అధికారం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు ఇప్పుడు ఆ రాష్ట్ర ట్రాఫిక్ నిబంధనలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఆయన సీఎంగా వినియోగించిన కారుపై గత రెండేళ్లుగా 18 ఫైన్ చలాన్లు పడ్డాయని ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాటి జరిమానాలు సైతం ఇదివరకూ చెల్లించలేదని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన కేరళం ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ కూటమికి కేవలం 35 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో పదేళ్లపాటు సీఎంగా ఉన్న పినరయి విజయన్ సీఎంకు పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆయన కారు 18 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు గురైందని రూ.13,750 జరిమానాలు విధించబడ్డాయని పేర్కొన్నాయి.అందులో అధికంగా సీట్బెల్ట్ లేకుండా ప్రయాణించడం వల్ల 12 సార్లు జరిమానాలు పడ్డాయని పేర్కొన్నారు. జనవరి 2025లో కోవలం- కరోడే జాతీయ రహదారిపై గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించారని దానికి కూడా జరిమానా విధించబడిందని తెలిపారు. అదే విధంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వీ గోవిందన్ ప్రయాణించిన కేఎల్ 7 ఆర్ గల కారుపై సైతం 18 చలాన్లు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు నివేదికలు అందించారు.తాజాగా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు. అయితే పినరయి విజయన్ రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ట్రాఫిక్ నిబంధనలు అత్యంత పకడ్బందీగా అమలు చేసేందుకు ఆ రాష్ట్రంలో ఏఐ కెమెరాలు అమర్చారు. ఇప్పుడు ఆ కెమెరాలలోని మాజీ సీఎం కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన చిత్రాలు ఉండడం విశేషం. -
కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం
కేరళలో అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ ఫ్యాన్స్ మీటింగ్ లో అసోసియేషన్ ను మరింత బలపర్చడం, విస్తరించడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులకు చేరువకావడంపై డిస్కషన్స్ చేశారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) దేశంలో అతిపెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ గా ఏర్పడింది. అన్ని ప్రాంతాల్లో ఏఏఎఫ్ఏ తమ కార్యక్రమాలను చేపడుతోంది. సౌత్ ఇండియాలో సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇకపై నార్త్ ఇండియాలోనూ తమ యాక్టివిటీస్ చేసేందుకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. -
చరిత్ర సృష్టించకపోగా.. నవ్వుల పాలయ్యారు!
ఎన్నికల టైంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు సాధారణంగా కనిపించే వ్యవహారమే. అయితే అది అతిగా ఉంటేనే జనాల్లో నవ్వుల పాలయ్యేది. కేరళలో ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులది అదే తరహా పరిస్థితి. ఎలక్షన్ టైంలో ఈ ఇద్దరూ తమ నోటికి పని చెప్పడంతో.. వాళ్ల కలను తారుమారు చేసి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు!.. పీసీ జార్జ్.. కేరళ రాజకీయాలపై నాలుగు దశాబ్దాలుగా ప్రభావం చూపించిన నేత. పూన్జార్ నియోజవకర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. కేరళ కాంగ్రెస్(జోసెఫ్ గ్రూప్), అటుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగానూ నెగ్గిన ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి వ్యక్తి సొంత పార్టీ పెట్టాడు. ఓటమి చవిచూశాడు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. బీజేపీ నుంచి పోటీ చేసి తాను ఓడడమే కాదు.. తన తనయుడ్ని ఓడగొట్టారు. పీసీ జార్జ్ ఎన్నికల ముందు తన విజయంపై ఎంతలా ధీమా వ్యక్తం చేశారంటే.. ‘‘నేను పూన్జార్లో భారీ మెజారిటీతో గెలుస్తా. నేనే కాదు.. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా. నా తనయుడు షోన్ జార్జ్ కూడా గెలుస్తాడు. మేం ఇద్దరం కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టిస్తాం. ఎవరికైనా సందేహం ఉంటే ఒక కోటి రూపాయల పందానికి రెడీ’’ అంటూ సవాల్ విసిరాయాన. కట్ చేస్తే.. పూన్జార్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీ జార్జ్ చిత్తుగా ఓడారు. అక్కడ యూడీఎఫ్ అభ్యర్థి ఎం.జె. సెబాస్టియన్ నెగ్గారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సెబాస్టియన్ కులతుంకల్ రెండో స్థానంలో నిలవగా.. పీసీ జార్జ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇటు పాళాలో షోన్ జార్జ్కు వరుసగా రెండోసారి పరాభవం తప్పలేదు. 2021లో కేరళ కాంగ్రెస్(ఎం) ఎమ్మెల్యే జోస్ కే మణి రాజ్యసభకు వెళ్లారు. ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగ్గా.. షోన్ జార్జ్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే.. మణి సి కప్పన్ చేతిలో షోన్ ఓడారు. ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థిగా మరోసారి పోటీ చేసినా షోన్ నెగ్గలేకపోయారు. మళ్లీ మణి సి కప్పన్ నెగ్గగా.. ఇక్కడ కూడా షోన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఆ తండ్రీకొడుకుల మీద ‘కోటి రూపాయలెక్కడ?’ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. పీసీ జార్జ్ ఒకప్పుడు కేరళ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతనే. అయితే గత కొంతకాలంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నానుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మతపరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేశాయి. ఒకవైపు బీజేపీ కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ఈ తండ్రీకొడుకులు మాత్రం తమ నోటికి పని చెబుతూ ముస్లిం ఓట్లను దూరం చేశారు. దీంతో.. బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంకు దూరంగా ఉండడంతో పాటు ఒకేసారి కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆ తండ్రీకొడుకుల కల చెదిరినట్లైంది. అయితే గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఈ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకోవడం ఆ పార్టీకి కాస్త ఊరట ఇచ్చే అంశమే!. -
కేరళలో యూడీఎఫ్.. తదుపరి సీఎం ఇతనే?
తిరువనంతపురం: దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కేరళలో అధికారపీఠాన్ని కైవసంచేసుకుంది. రాష్ట్ర శాసనసభలో మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఏకంగా 102 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కేరళలో గెలిచి కాంగ్రెస్ దక్షిణాదిన మూడో రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టబోతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుతీరిన విషయం తెల్సిందే. కేరళలో వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన వామపక్ష పారీ్టల సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమి ఈసారి అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయింది. శబరిమల ఆలయ వివాదం మొదలు ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల అవినీతి, ప్రభుత్వవ్యతిరేకత దాకా ఎన్నో అంశాలు అధికారకూటమి పుట్టిముంచాయి. దీంతో ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 చోట్ల గెలిచింది. కొన్ని జిల్లాల్లో ఎల్డీఎఫ్ పార్టీల అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. 50 ఏళ్ల తర్వాత దేశంలో..ప్రభుత్వ వ్యతిరేకత అనూహ్యంగా పెరిగిపోవడంతో ఆ ధాటికి ఐదేళ్లు మంత్రిపదవులు వెలగబెట్టిన వీణా జార్జ్, ఆర్ బిందు, కేబీ గణేశ్, వీఎన్ వాసనన్సహా 13 మంది నేతలు సోమవారంనాటి ఫలితాల్లో ఓటమిని చవిచూడకతప్పలేదు. 21 మంది కేబినెట్ మంత్రుల్లో ముఖ్యమంత్రి విజయన్, పీఏ మొహమ్మెద్ రియాస్, కె.రాజన్, జీఆర్ అనిల్, కేఎన్ బాలగోపాల్, పీ.ప్రసాద్, సాజి చెరియాన్ మాత్రం గెలిచారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదం స్థానంలో విజయం సాధించారు. సీపీఐ(ఎం) పార్టీలో అత్యధిక మంది అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా కేరళ కాంగ్రెస్(ఎం) పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. ఎల్డీఎఫ్ కనీ్వనర్ టీపీ రామకృష్ణన్ సైతం తన సిట్టింగ్ స్థానం పెరాంబ్రలో ఓడిపోయారు. కేరళలో ఓటమితో వామపక్ష పారీ్టలు తొలిసారిగా 50 ఏళ్ల తర్వాత దేశంలో మరే రాష్ట్రంలోనూ అధికారంలోలేకుండా పోయాయి. ద్విముఖ పోరుగా తయారైన కేరళలో హిందూత్వ బీజేపీ తొలిసారిగా మూడుచోట్ల విజయం సాధించి పార్టీ విస్తరణకు ఉపక్రమించింది. తిరువనంతపురం కార్పోరేషన్ పరిధిలోని నిమోమ్, కళాకూట్టం నియోజకవర్గాలతోపాటు కొల్లం జిల్లాలోని ఛథనూర్లలో బీజేపీ అభ్యర్థులు విజయబావుటా ఎగరేశారు. కేరళ శాసనసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అభ్యర్థి వీడీ సతీశన్ పరవూర్ నియోజకవర్గంలో సీపీఐ నేత ఈటీ టైసన్ మాస్టర్పై 20,600 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలి 17 రౌండ్లలో వెనుకబడిన సతీశన్ తర్వాత పుంజుకుని జయకేతనం ఎగరేశారు. 2001 నుంచి వరసబెట్టి ఇక్కడి నుంచే సతీశన్ గెలుస్తున్నారు. ఈయనకు ఇది ఐదో విజయం. ఈసారి ఎన్నికల్లో అన్ని పారీ్టల నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ అగ్రనేత సతీశన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగుపడ్డ ఓట్ల శాతం ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల శాతం బాగా మెరుగుపడింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్ 28.79 శాతం ఓట్లను సాధించింది. తర్వాత సీపీఐ(ఎం) 21.77 శాతం ఓట్లను సాధించింది. తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) 11.01 శాతం ఓట్లు సాధించింది. అయితే స్థానిక ఎన్నికల్లో 15 శాతం ఓట్లను సాధించిన బీజేపీ తాజా ఫలితాల్లో కేవలం 11.42 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. సీపీఐ 6.64 శాతం ఓట్లు సాధించింది. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత కూటమి ఓడిపోయిన వార్త తెలియగానే ముఖ్యమంత్రి పదవికి సీపీఎం అగ్రనేత పినరయి విజయన్ రాజీనామాచేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు అందజేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయన్కు గవర్నర్ సూచించారు.ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్కు ఊపిరి -
ఇది పెద్ద దెబ్బే.. ‘లెఫ్ట్’ కళ తప్పింది!
న్యూఢిల్లీ: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ). ఒకప్పుడు కీలకమైన, బలమైన పార్టీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951–52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన ప్రతిపక్షం. ఆ తర్వాత పశి్చమ బెంగాల్కు 23 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన సీపీఎం నేత జ్యోతిబసుకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996లో ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం సైతం వచ్చింది అయితే, పార్టీ పొలిట్బ్యూరో అందుకు వ్యతిరేకత తెలపడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా ఆ పార్టీయే ఒప్పుకుంది.తిరిగి 2008లో, మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి 60 మంది సభ్యులున్న వామపక్ష కూటమి మద్దతు ఉపసంహరించుకుంది. భారత్– అమెరికా అణు ఒప్పందమే ఇందుకు కారణం. అప్పట్లో వామపక్షాలు కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురల్లో అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంది. ఓటర్లు వామపక్ష భావనను వీడి క్రమక్రమంగా దూరంగా వెళ్లిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కేరళలో పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ఓటమి కమ్యూనిస్టులకు తాజాగా పెద్ద దెబ్బ. దీంతో, 1970 తర్వాత దేశంలో కమ్యూనిస్ట్లు మొదటిసారిగా అధికారం కోల్పోవడం గమనార్హం. చారిత్రక విజయం.. దేశ రాజకీయ చరిత్రలో వామపక్షాలది విశిష్టమైన స్థానం. 1951–52లో దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో, లోక్సభలోని ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) మాత్రమే. కేవలం ఐదేళ్ల తర్వాత, 1957లో కేరళ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా నిలిచి వామపక్షాలు చరిత్ర సృష్టించాయి.కంచు కోటలు బెంగాల్, త్రిపుర 1977లో పశి్చమ బెంగాల్లో సీపీఎం అధికారాన్ని దక్కించుకుంది. దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒకే పార్టీ సుదీర్ఘకాలం పాటు పాలించిన రికార్డు సృష్టించింది. ఆ పార్టీ నేత జ్యోతి బసు ముఖ్యమంత్రిగా 23 ఏళ్లపాటు కొనసాగారు. ఆ తర్వాత 2000లో బుద్ధదేవ్ భట్టాచార్య బాధ్యతలు చేపట్టారు. మరో 11 ఏళ్ల పాటు అక్కడ వామపక్షాల పాలన సాగింది. కేరళలో అధికారం మారుతూ వచ్చినప్పటికీ, త్రిపురలో మాత్రం వామపక్షాలు సుస్థిర విజయాన్ని అందుకున్నాయి. 1993లో త్రిపురలో 60 స్థానాలకు గాను 44 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేశాయి. దశరథ్ దేబ్ 1998 వరకు, ఆపై మాణిక్ సర్కార్ వరుసగా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. క్షీణత..ఆపై పతనం: వామపక్షాల క్షీణత ముందుగానే మొదలైనప్పటికీ, 2011లో అది పతనం దిశగా సాగింది. నందిగ్రామ్, సింగూర్ భూసేకరణ నిరసనలతోపాటు మార్పు నినాదంతో ముందుకు వచి్చన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 2006లో వామపక్ష కూటమికి 235 సీట్లుండేవి. టీఎంసీ దెబ్బకు వామపక్ష కూటమి బలం 62 స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత త్రిపురలో కూడా కమ్యూనిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. అప్పట్లో దేశవ్యాప్తంగా వచి్చన కాషాయ అనుకూల పవనాల తాకిడికి వామపక్షాల కంచుకోట త్రిపుర కూడా కూలిపోయింది. అసెంబ్లీలోని 60 స్థానాల్లో బీజేపీ 36 గెలుచుకోగా, కమ్యూనిస్టుల బలం 50 నుంచి కేవలం 16కి పడిపోయింది. ఆ ఒక్కటీ పోయింది ఆ తర్వాత కాలంలో వామపక్షాలకు ఊరటగా నిలిచింది కేరళ మాత్రమే. 2016లో పినరయి విజయన్ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన లెఫ్ట్ ఫ్రంట్, 2021లో కూడా మళ్లీ గెలిచి కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీని తిరగరాసింది. అయితే, తాజా ఎన్నికల్లో వామపక్షాలు దక్షిణాది రాష్ట్రాన్ని కూడా కోల్పోయాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. -
కేరళం సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ..!
కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుపుతో సీఎం రేసు హాట్ టాపిక్గా మారింది. దశాబ్ద కాలం తర్వాత కేరళంను కాంగ్రెస్ దక్కించుకోవడంతో అక్కడ కాస్త జోష్ వచ్చింది. ఓవరాల్గా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను చూస్తే కేరళంలో మాత్రమే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మాత్రమే ఆధిక్యాన్ని కనబర్చింది. కేరళంలో ఉన్న 140 అసెంబ్లీ సీట్లకు గాను 102 సీట్లను యూడీఎఫ్ దక్కించుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. మరి సీఎం ఎవరు?కాంగ్రెస్ ఎక్కడైనా అధికారంలోకి వచ్చిందంటే సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు కేరళంలో అదే రిపీట్ అవుతుంది. ప్రస్తుతం కేరళంలో సీఎం పీఠం కోసం కాంగ్రెస్ ముఖ్యనేతల్లోనే పోరు తీవ్రంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కేరళంలో సీఎం రేసులో ఉన్న వారిలో వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్తో పాటు శశిథరూర్ కూడా ఉన్నారు. మాకు చాలా మందే ఉన్నారు..ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ఇప్పటివరకూ ముగ్గురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారనుకుంటే ఇప్పుడు శశిథరూర్ సైతం ఆ జాబితాలో చేరిపోయారు. వివాదాస్పద ఎంపీగా పేరున్న శశిథరూర్ తాజా వ్యాఖ్యలు తనను కూడా సీఎం అభ్యర్థికి అర్హుడుననే సంకేతాలిచ్చాయి. మరి ఆయనే స్వయంగా ఆ జాబితాలో చేరిపోయారా.. లేక కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోనే ఇలా వ్యాఖ్యానించారా అనేది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు సీఎం రేసులో ఉండగా, ఇంకా ఎవరైనా వచ్చి ఆ జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తుది నిర్ణయం హైకమాండ్దే అని శశిథరూర్ వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ దగ్గర శశిథరూర్ మంచి మార్కులు ఉన్నాయా అంటే అది పూర్తిగా అవునని చెప్పలేం.సందర్భం వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీకి జై కొట్టే శశిథరూర్.. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ కోపానికి తరుచు గురవుతూ వస్తూనే ఉన్నారు. మరి అటువంటి సమయంలో శశిథరూర్ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. సతీశన్ది కీలక పాత్రకేరళంలో కాంగ్రెస్ విజయం సాధించడంలో వీడీ సతీశన్ది కీలక పాత్ర. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారాయన. యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న సతీశన్కు సీఎం పీఠం దక్కుతుందని అంచనాలు ఉన్నప్పటికీ పోటీ గట్టిగా ఉండటంతో ఏమౌతుందో చివర వరకూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం సీఎం పీఠంపై సతీశన్ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలు అనుభవంలోకి వస్తాయా.. లేక అడియాశలుగా మిగిలిపోతాయనేది అధిష్టానమే నిర్ణయించాలి. రమేశ్ చెన్నితలది అనుభవం..కేరళం కాంగ్రెస్లో సీనియర్గా పేరున్న రమేశ్ చెన్నితలకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. అలాగే ఆర్గనైజేషన్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభం; తరువాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎదిగారు. 1982లో హరిపాడ్ నుండి మొదటిసారి గెలుపొందారు. 1989–1998లో కోట్టాయం, మావేలికర నియోజకవర్గాల నుండి ఎంపీగా గెలిచి సేవలందించారు. 1986-87లొ గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2014 వరకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. 2014 నుంచి 2016 వరకూ హోమ్ అండ్ విజిలెన్స్ మంత్రిగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకూ కేరళ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో సన్నిహితంగా..కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్. ప్రస్తుతం ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నారు మరియు 2026లో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఈయనకి రాజకీయ అనుభవం విశేషంగానే ఉంది. 2019 నుండి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ అధినాయకత్వానికి అతి దగ్గరగా ఉండే వేణుగోపాల్ అంటే హైకమాండ్కు బాగా నమ్మకం ఎక్కువ. దాంతో కేసీ వేణుగోపాల్ కూడా సీఎం అభ్యర్థి కోసం చివరి వరకూ రేసులో ఉండటం ఖాయం.ఈ నలుగురితోనే సరా.. ఇంకా వస్తారా?ప్రస్తుతానికి ఈ నలుగురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారు. మరి ఇంకే ఎవరైనా పోటీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా రాష్ట్రాల్లో పలు బుజ్జగింపుల తర్వాతే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తూ రావడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎవరైనా తాను కూడా సీఎం అభ్యర్థినేని పోటీ కొస్తే మాత్రం అధిష్టానికి తలనొప్పులు తప్పవు. ఏది ఏమైనా కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించింది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు విజయోత్సవ మూడ్లో ఉంది. రేపట్నుంచి సీఎం కుర్చీ కోసం రేసు మొదలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల మాట. -
కామ్రేడ్లకు భారీ షాక్.. చివరి కోట పతనం!
న్యూఢిల్లీ: భారత రాజకీయ ముఖచిత్రంపై ఒక సంచలన మార్పు చోటుచేసుకుంది. అర్ధ శతాబ్దం పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టుల పాలన ఇప్పుడు చరిత్రలో మిగిలిపోయింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఓటమి పాలుకావడంతో, 50 ఏళ్ల తర్వాత దేశంలో ఏ ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇది కామ్రేడ్ల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక పరిణామం అని విశ్లేషకులు అంటున్నారు.కూలిపోయిన చివరి కంచుకోటఒకప్పుడు దేశంలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా వెలుగొందిన వామపక్షాలకు ఇంతకాలం కేరళ చివరి కంచుకోటగా మిగిలింది. 1977 నుండి 2011 వరకు పశ్చిమ బెంగాల్ను, 1993 నుండి 2018 వరకు త్రిపురను పాలించిన కమ్యూనిస్టులు.. అక్కడ వరసగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల చేతిలో పరాజయం పాలయ్యారు. కేరళలో మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే సంప్రదాయాన్ని 2021లో తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్న లెఫ్ట్ ఫ్రంట్, తాజా ఎన్నికల్లో మాత్రం తన ఆఖరి కోటను కోల్పోయింది. దీంతో 1977 తర్వాత తొలిసారిగా దేశం కమ్యూనిస్ట్ పాలన లేని శకంలోకి అడుగుపెట్టింది.జాతీయ రాజకీయాల్లో చేజారిన పట్టుకేరళలో ఎదురైన ఈ ఘోర పరాజయం వామపక్షాల జాతీయ రాజకీయ ప్రాబల్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇన్నాళ్లూ కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల అండతో సీపీఎం, సీపీఐ, తదితర వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో తమ బలానికి మించి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఒకప్పుడు దేశ గతిని శాసించిన ఈ పార్టీలు.. ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన దయనీయ స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ మూడు కీలక రాష్ట్రాల నుండి వామపక్షాలకు కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే ఉండటం వారి రాజకీయ పతనానికి అద్దం పడుతోంది.యూపీఏ కాలం నుంచి మొదలైన క్షీణతకమ్యూనిస్టుల పతనం ఒక్కరోజులో జరిగింది కాదు. 2004 లోక్సభ ఎన్నికల్లో 59 స్థానాలు గెలుచుకుని యూపీఏ-1 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వామపక్షాలు, ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. ఇండో-యూఎస్ అణు ఒప్పందం నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత, 2009లో వారి బలం 24 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత 2014లో 10, 2019లో ఐదు స్థానాలకు దిగజారింది. ప్రస్తుతం సీపీఎం, సీపీఐలకు లోక్సభలో ఆరుగురు ఎంపీలు మాత్రమే ఉండగా, అందులో నలుగురు తమిళనాడులో డీఎంకే, ఒకరు రాజస్థాన్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వారే కావడం గమనార్హం.ఇది కూడా చదవండి: స్టాలిన్, పినరయికి షాక్... ఉత్కంఠ పోరులో దీదీ! -
స్టాలిన్, పినరయికి షాక్... ఉత్కంఠ పోరులో దీదీ!
న్యూఢిల్లీ: తాజా ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్ధండులైన ముఖ్యమంత్రులు తమ సొంత కోటల్లోనే చతికిలబడుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళలో సీఎం పినరయి విజయన్ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండగా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో ఆధిక్యం దోబూచులాడుతోంది.కొళత్తూరులో స్టాలిన్కు షాక్తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సృష్టించిన సునామీలో డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కొళత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ 4,000కు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 24,993 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, స్టాలిన్కు కేవలం 20,982 ఓట్లు వచ్చాయి. ఇక అన్నాడీఎంకే అభ్యర్థి పి.సంతాన కృష్ణన్ 5,982 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే ఏకంగా 112 స్థానాల్లో దూసుకుపోతుండగా, అన్నాడీఎంకే కూటమి 72, డీఎంకే కేవలం 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.ధర్మదంలో తడబడుతున్న పినరయికేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సైతం తొలిసారి చేదు అనుభవం ఎదురవుతోంది. ధర్మదం నియోజకవర్గంలో ఆరో రౌండ్ కౌంటింగ్ తర్వాత ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, అడ్వకేట్ వీపీ అబ్దుల్ రషీద్ చేతిలో 600 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. ఇప్పటివరకు పినరయికి 32,455 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కేవలం సీఎం మాత్రమే కాకుండా ఆయన కేబినెట్లోని పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉండటం అధికార ఎల్డీఎఫ్ కూటమిని కుంగదీసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి వారికి గట్టి పోటీనిస్తోంది.భవానీపూర్లో దీదీ ఉత్కంఠ పోరుమరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. తొలి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కన్నా వెనుకబడిన ఆమె తరువాత క్రమంగా పుంజుకున్నారు. నాలుగో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి మమత 17,244 ఓట్లు సాధించి, బీజేపీ అభ్యర్థిపై 8,000కు పైగా ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. క్షణక్షణానికి మారుతున్న ఈ ట్రెండ్స్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. -
అక్కడ అంతా కొత్త కొత్తగా..వింత వింతగా..!
ఒక ఊరిలో నడుస్తోంటే ప్రతీ ఒక్కరు రెండు సార్లు కనిపిస్తే ఎలా ఉంటుంది?! కేరళలోని మలప్పురం దగ్గర ఉండే ‘కోడిని’ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు మనకి అదే అనిపిస్తుంది. మొదటిసారి ట్రావెల్ చేసే వారికి ఇది చాలా వింతగా, ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది. స్పెషల్ ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ కావాలనే వారికి ఇది చాలా ఈజీగా, మనసును హత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక అద్దం ముందు నిలబడినట్టుగా ప్రతీ చోట జనాలు కనిపిస్తూ ఉంటే ఎవరికరైనా చాలా కొత్తగా అనిపిస్తుంది కదా!అక్కడ అడుగు పెట్టగానే పచ్చని పొలాలు, చల్లని గాలి మనకు స్వాగతం పలుకుతాయి. ఆర్కిటెక్చర్ చాలా సింపుల్గా, మన ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడక్కడ తిరిగే కవల పిల్లలు చూస్తుంటే ఒక్కసారిగా మనం ఎక్కడున్నాం అనే అనుభూతి కలుగుతుంది. ఆ గాలిలో నడుస్తుంటే మనం ఒక వింత స్వప్నంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ప్రతీ తోటలో, ప్రతీ ఇంటి ముందు ఒక కొత్త కళ కనిపిస్తుంది. మనుషుల చిరునవ్వులు, వారి అమాయకత్వం మనసుకు చాలా హాయిని ఇస్తాయి.సందర్శనీయ ప్రదేశాలుకవలల నగరం లేదా ట్విన్ టౌన్ అని పిలిచే ఈ ప్రాంతంలో తిరుగుతూ అక్కడి స్థానికులతో మాట్లాడటం ఒక గొప్ప అనుభవం. దగ్గరలో ఉన్న కడలుండి బర్డ్ శాంక్చువరీలో రంగురంగుల పక్షులను చూడటం లేదా నీలాంబుర్లోని తోటలను సందర్శించడం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.ఏం తినాలి?కేరళ స్థానిక రుచులు అయిన వేడి వేడి పుట్టు, కడల కర్రీ తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్ అని చెప్పవచ్చు. స్థానిక టీ స్టాల్స్ దగ్గర లభించే వేడి భోజనం, బనానా ఫ్రిట్టర్స్ అక్కడ కూర్చొని తినడం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఎప్పుడు వెళ్లాలి?సెప్టెంబర్ నుంచి మార్చి వరకు వాతావరణం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో కూడా వెళ్లవచ్చు. అప్పుడూ అక్కడి పచ్చదనం మనసును హాయిగా ఉంచుతుంది. కానీ చలికాలంలో వెళ్లడం ఉత్తమం. మీరు ఎప్పుడు వెళ్లినా కూడా స్థానికులు చాలా మర్యాదగా పలకరిస్తారు. మొత్తం ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి కోజికోడ్కు డైరెక్ట్ విమానాలు ఉంటాయి. ట్రైన్లో వెళ్తే కోజికోడ్ లేదా తిరూర్ దగ్గర దిగి సుమారు 40 కిమీ రోడ్ జర్నీ చేయాలి. బస్సులో వెళ్లాలని ప్లాన్ చేస్తే కోజికోడ్ లేదా మలప్పురంకి డైరెక్ట్ సర్వీసులు ఉంటాయి. అక్కడి నుంచి లోకల్ బస్ లేదా క్యాబ్తో కోడిని ఈజీగా చేరుకోవచ్చు. ఈ ప్రయాణం మనలోని క్యూరియాసిటీకి ఒక సమాధానంతోపాటు ప్రకతితో మమేకం అయ్యే ఒక అవకాశం. ప్రపంచంలోని వింతల గురించి ఆలోచించినప్పుడు కోడిని మీకు తప్పకుండా గుర్తుకు రావాలి అంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్లిరావాలి మరి!.(చదవండి: కేదార్నాథ్: మంచుకొండల్లో ఓంకార నాదం) -
నేడే కౌంటింగ్.. అందరి చూపు బెంగాల్ పైనే!
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నిక్షిప్తమైన ప్రజాతీర్పు సోమవారం బహిర్గతం కానుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజాతీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, సోమవారమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరికి లాభమో? పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా శ్రమించింది. ఈసారి బెంగాల్లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డుస్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూత్ల్లో శనివారం రీపోలింగ్ చేపట్టగా, 87 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గెలుపు తమదేనని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార తృణమూల్ కాంగ్రెస్దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటుచేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలే ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్కతాలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాపరింగ్కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. తమిళనాడులో విజయం విజయ్దేనా?తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పటా్నయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్పోల్స్ స్పష్టంచేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. అస్సాంలో 258 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించగా, 85.96 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం గమనార్హం. అధికార ఎన్డీయేలో బీజేపీతోపాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో రాయ్జోర్ దళ్, ఏజేపీ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఏపీహెచ్ఎల్సీ తదితర పార్టీలు ఉన్నాయి. కేరళలో వామపక్షాలకు చేదు అనుభవమే! కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్లో 79.63 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్పై యూడీఎఫ్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెల్చుకోవడం ఖాయమని ఎన్డీయే విశ్వాసం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే! కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలున్నాయి. – సాక్షి, నేషనల్æడెస్క్2 -
ఆలయంలో ఏనుగు బీభత్సం, ఒకరి మృతి
కేరళలోనిఒక దేవాలయంలో ఏనుగు ఉన్నట్టుండి హింసాత్మకంగా మారిపోయింది.అంగమాలిలో ఉన్న కిడంగూర్ మహావిష్ణు ఆలయంలోకి తీసుకొచ్చిన ఏనుగు అకస్మాత్తుగా దాడిచేయడంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఏనుగు ఆగ్రహం కొనసాగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు లోనయ్యారు. శుక్రవారం (మే 1) ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో, 'మయ్యానాడ్ పార్థసారథి' అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తిపై దాడిచేసి, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించగా, మావటి ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కొల్లాంకు చెందిన లారీ డ్రైవర్ విష్ణు (40)గా గుర్తించారు. కొల్లంనుంచి లారీలో ఈ గజరాజును ఈయనే తరలించినట్టు సమాచారం.https://t.co/U4Fc8bGCAp https://t.co/PSIgJrW4fP— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) May 2, 2026పోలీసుల కథనం ప్రకారం, భక్తులు,స్థానికులలో భయాందోళనలు వ్యాపించడంతో, ఆ ఏనుగు ప్రజలపై దాడి చేసి, ఆలయ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలను ధ్వంసం చేసింది. కార్లను పల్టీ కొట్టించింది. ద్విచక్ర వాహనాలను నుజ్జునుజ్జు చేసింది, అలాగే ఆలయ ప్రాకార కుడ్యాన్ని ధ్వంసం చేసింది. దాదాపు రెండు గంటల తర్వాత, అటవీ అధికారులు పోలీసులు మత్తు మందు (tranquilizers) ఉపయోగించి దానిని అదుపులోకి తీసుకువచ్చారు.ఆలయ కార్యక్రమానికి ముందు స్నానం చేయిస్తున్నప్పుడు కర్రతో కొట్టడం వల్లే ఏనుగు దూకుడుగా ప్రవర్తించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఇదీ చదవండి : Yoga సైనస్తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్ -
బెంగాల్ కిరీటం బీజేపీదే!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు నకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ‘టుడేస్ చాణక్య’ఎగ్జిట్పోల్ స్పష్టంచేసింది. బెంగాల్ అధికార కిరీటం ఈసారి బీజేపీకి దక్కడం ఖాయమని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా మెజార్టీ మార్కు 147 స్థానాలు. బీజేపీ 192కిపైగా స్థానాలు గెల్చుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టంచేసింది. చాణక్య ఎగ్జిట్పోల్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు గెల్చుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు తేలింది. ఇతరులు కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతారని చాణక్య తెలియజేసింది. ఈ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అది అతిపెద్ద మార్పు అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజల మద్దతు బలంగా ఏకీకృతం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది ఓటర్ల ప్రాధాన్యతలో నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తోంది. బెంగాల్లో ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. మమతా బెనర్జీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వివరించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు కీలకమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుందని పేర్కొన్నాయి. 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాన్నే అంచనా వేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్కు విజయం దక్కింది. ఆ పార్టీ 215 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 77 స్థానాలు మాత్రమే దక్కించుకొని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. తమిళనాట రెండో స్థానంలో విజయ్ పార్టీ తమిళనాడులో దళపతి విజయ్ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతున్నట్టు టుడేస్ చాణక్య స్పష్టంచేసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) ఈ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో దాదాపు 63 సీట్లు సాధించబోతున్నట్లు తెలియజేసింది. అధికార డీఎంకేకు 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకేకు కేవలం 45 స్థానాలు దక్కే వీలున్నట్లు వివరించింది. విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలవబోతున్నట్లు తెలిపింది. సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల్లో 29 శాతం మంది, అత్యంత వెనుకబడిన వర్గాల్లో 27 శాతం మంది, ఎస్సీలు, క్రైస్తవుల్లో 34 శాతం మంది విజయ్ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు మాత్రం అధికార డీఎంకేకు మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. యువతలో టీవీకేకు అమితాదరణ కనిపించింది. 30 ఏళ్లలోపు ఓటర్లు, ప్రధానంగా తొలిసారి ఓటు వేసినవారు, విద్యార్థులు నిరుద్యోగులు దళపతి పార్టీకి జైకొట్టారు. మరోవైపు మెజార్టీ ఎగ్జిట్పోల్స్ మళ్లీ డీఎంకే గెలుపు ఖాయమని తెలియజేశాయి. ‘యాక్సిస్ మై ఇండియా’మాత్రమే విజయ్ పార్టీ జయకేతనం ఎగురవేయబోతున్నట్లు తేల్చిచెప్పింది. కేరళలో యూడీఎఫ్కు విజయావకాశాలు కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్యగట్టి పోటీ నెలకొన్నట్లు టుడేస్ చాణక్య ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు విజయావకాశాలు ఉన్నట్లు తెలిపింది. 140 సీట్లకు గాను యూడీఎఫ్కు దాదాపు 69 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని వెల్లడించింది. 126 సీట్లకు గాను బీజేపీ 50 శాతం ఓట్లతో ఏకంగా 102 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బెంగాల్ ఎగ్జిట్పోల్స్ ప్రకటించని ‘యాక్సిస్ మై ఇండియా’ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ను ‘యాక్సిస్ మై ఇండియా’ప్రకటించలేదు. బుధవారం ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రకటించినప్పటికీ బెంగాల్ విషయం ప్రస్తావించలేదు. గురువారం ప్రకటిస్తారని భావించగా.. అది సాధ్యం కాలేదు. బెంగాల్లో భయానక వాతావరణం నెలకొందని, ఇతరులతో మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, శాంపిల్ సేకరించే పరిస్థితి కూడా లేదని ‘యాక్సిస్ మై ఇండియా’అధినేత ప్రదీప్ గుప్తా చెప్పారు. అసంపూర్ణమైన సమాచారంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు. -
కప్పు టీ.. కోటిన్నర విరాళం: ఆశ్రమం కోసం అద్భుతం
ఒక్క కప్పు టీ తాగితే ఎంత అవుతుంది? పది రూపాయలు.. మహా అయితే వంద రూపాయలు! కానీ అదే టీ కప్పు కోటిన్నర రూపాయల నిధిని సమకూర్చింది. కేరళలోని కోజికోడ్ జిల్లా ఎడచేరిలో జరిగిన ఈ అద్భుతం.. మనుషుల్లో ఇంకా మమకారం మిగిలేవుందని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారని మరోసారి నిరూపించింది. అప్పుల్లో కూరుకుపోయిన ఒక ఆశ్రమాన్ని కాపాడుకునేందుకు ఊరంతా ఏకమై చేసిన ఈ ‘ఛాయ్ ఛాలెంజ్’ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అంచనాలను తలకిందులు చేసిన జనప్రవాహంఅనాథలు, వృద్ధుల సంరక్షణ కోసం నెలకు రూ.25 లక్షలు ఖర్చు చేసే ‘తణల్’ ఆశ్రమం ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో, నిర్వాహకులు ‘ఛాయ్ తణల్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం 5,000 మంది వస్తారని భావిస్తే, ఏకంగా 18,000 మంది తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎడచేరి వీధులన్నీ జనసంద్రమయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినా సరే.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కిలోమీటర్ల మేర క్యూ కట్టి మరీ ప్రజలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక్కరోజే నగదు రూపంలో రూ. 57.42 లక్షలు రాగా, హామీలతో కలిపి మొత్తం రూ. 1.41 కోట్లు సమకూరడం విశేషం.ఒంటిపై నగలను కూడా విరాళంగా ఇచ్చి..ఈ సేవా యజ్ఞంలో కేవలం డబ్బు మాత్రమే కాదు, మనసున్న మనుషులు తమ సర్వస్వాన్ని అందించారు. కొందరు మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి నిర్వాహకుల చేతిలో పెట్టి కన్నీళ్లు పెట్టించారు. వచ్చిన వారందరికీ టీతో పాటు సుమారు 13,000 అరటికాయ బజ్జీలు (పళమ్ పోరి) వడ్డించారు. బజ్జీలు అయిపోతే సమోసాలు, అవి కూడా అయిపోతే బిస్కెట్లు అందించారు. ఇలా ఏదీ అందకపోయినా, ఆశ్రమానికి సాయం చేయాలన్న తపనతో జనం క్యూలోనే నిలబడ్డారు.సంగీత హోరులో సాగిన సేవప్రముఖ గాయకులు ప్రేమ్కుమార్ వడకర, సల్వాన్ వడకర తమ పాటలతో అక్కడ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. గానలహరి మధ్య ప్రజలు ఉత్సాహంగా విరాళాలు అందజేశారు. వార్షికంగా రూ.నాలుగు కోట్ల ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ‘తణల్’ ఆశ్రమానికి, ఈ ఒక్కరోజు స్పందన కొండంత అండగా నిలిచింది. ఒక టీ కప్పు సాక్షిగా కోజికోడ్ ప్రజలు రాసిన ఈ మమతానురాగాల కథ దేశవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఇది కూడా చదవండి: ‘పాక్లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్ క్షమాపణలు! -
ఊహించని విధంగా 5 రాష్ట్రాల.. ఎగ్జిట్ పోల్స్
-
ఎగ్జిట్ పల్స్.. అంచనాలు తారుమారు
-
పినరయ్కి షాక్ తప్పదా? కేరళలో యూడీఎఫ్కే పట్టం!
సాక్షి, తిరువనంతపురం: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్డీఎఫ్ కూటమికి ఈ సారి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. యూడీఎఫ్ కూటమి ఎల్డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యత కనబరుస్తుందని సర్వేలో వెల్లడైంది. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పనితీరుపై సర్వేలో 55.1 శాతం సంతృప్తి వ్యక్తం చేసినా ఎల్డీఎఫ్కు మళ్లీ అధికారం కట్టబెట్టక పోవడం ఇక్కడ విశేషం. ఎల్డీఎఫ్కు మరోసారి అవకాశం ఇవ్వమని 42 శాతం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినయర్ విజయన్కు 22.3 శాతం మద్దతివ్వగా, కాంగ్రెస్ నేత సతీషన్కు 14.5 శాతం మద్దతిచ్చారు. ఎన్నికల్లో పార్టీకి ప్రాధన్యతిచ్చామని 51.8 శాతం చెప్పగా, 33.1 శాతం మంది అభ్యర్థులను బట్టి ఓటు వేశామని చెప్పారు.కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. రాష్ట్రంలో ఎన్డీఏ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేదని సర్వేలో వెల్లడైంది. 59.4 శాతం మంది రాష్ట్రంలో మూడు ఫ్రంట్ అవసరం లేదని సర్వేలో చెప్పారు.కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై 50.9 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రచారంపై కేరళలో ఆసక్తి కనిపించలేదు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగిన కేరళలో పదేళ్ల వామపక్ష ప్రభుత్వానికి ప్రజలు బ్రేకులు వేసినట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ : యూడీఎఫ్(కాంగ్రెస్ కూటమి) 78 నుంచి 90 స్థానాలుపినరయ్ విజయ్ కూటమి,ఎల్డీఎఫ్కి 49 నుంచి 62 స్థానాలుబీజేపీ ఒకటి నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశంఆత్మసాక్షి.ఎగ్జిట్పోల్స్ UDF 76-81LDF 61-66BJP 3- 4ఇతరులు 1 -
మళయాళీ బంగారం మహా కాస్ట్లీగురూ!
-
విశ్వాసానికి మరణం లేదు: కన్నీరు పెట్టిస్తున్న శునకం!
మలప్పురం: మనిషికి, మూగజీవికి మధ్య ఉండే బంధం కేవలం అన్నం పెట్టే దగ్గరే ఆగిపోలేదు.. అది రెండు ఆత్మల అనుసంధానమని కేరళలోని మలప్పురం సాక్షిగా మరోసారి రుజువైంది. ఎడవన్న ప్రాంతానికి చెందిన అమీనా అనే వృద్ధురాలు, తన ఇంటి ముందుకు వచ్చే ఒక వీధి కుక్కకు రోజూ ప్రేమతో అన్నం పెట్టేది. ఈ నేపధ్యంలో ఆ మూగజీవికి ఆమె ప్రాణప్రదమైన స్నేహితురాలిగా మారిపోయింది. అమీనా చూపిన ఆదరణను ఆ మూగ జీవి గుండెల్లో పదిలంగా దాచుకుంది.ఒక రోజు అమీనా తన ఇంటి బయట అనారోగ్యంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయినప్పుడు ఆ మూగజీవి విలవిల్లాడిపోయింది. తన ప్రాణదాత ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే తట్టుకోలేక, ఆ వీధి కుక్క ఆపకుండా అరుస్తూ, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. దాని అరుపులు విని, స్థానికులు స్పందించే లోపే, అమీనా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అయితే ఆ మూగ జీవి తనను ఆదుకున్న యజమాని ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది.అమీనా అంతిమ యాత్ర మొదలైనప్పుడు, ఆ కుక్క కూడా అందరితో కలిసి మౌనంగా అడుగులు వేసింది. మసీదు శ్మశానవాటిక వరకు ఆ భౌతికకాయాన్ని అనుసరిస్తూ వెళ్లి, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండిపోయింది. స్థానికులు చెబుతున్న ప్రకారం.. ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ కుక్క శ్మశానవాటిక పరిసరాల్లో తచ్చాడుతూ కనిపించింది. బహుశా ఆ మూగజీవికి అమీనా దూరం కాబోతోందనే ముందస్తు సంకేతం అందిందేమోనని పలువురు కంటతడి పెట్టుకున్నారు.అంత్యక్రియలు ముగిసి రోజులు గడుస్తున్నా, ఆ శునకం తన యజమానిని మరువలేకపోతోంది. అమీనా కుటుంబ సభ్యులు ఎప్పుడు సమాధిని సందర్శించడానికి వచ్చినా, ఆ కుక్క అక్కడే ప్రత్యక్షమవుతోంది. ఎటువంటి అలికిడి చేయకుండా, ఆమె సమాధి పక్కనే గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చుని నిరీక్షిస్తోంది. తన ఆకలి తీర్చిన మనిషి తిరిగి రాదని తెలిసినా, ఆ సమాధి వద్ద అది చూపుతున్న స్వచ్ఛమైన ప్రేమ.. అందరికీ ఒక గొప్ప పాఠంలా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: ఈసీకి మహువా మోయిత్రా షాక్: బైక్ వద్దన్నారని.. -
పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు
-
కేరళలో యాక్షన్
హీరోయిన్ రష్మికా మందన్న యాక్షన్ బాట పట్టారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభం అయింది. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మైసా’. ఈ మూవీలో రష్మిక గోండు గిరిజన అమ్మాయిగా కనిపించనున్నారు.పాన్ ఇండియాగా రూపొందుతోన్న ఈ మూవీలో తన కెరీర్లో అత్యంత సవాల్తో కూడిన పాత్ర చేస్తున్నారు రష్మిక. 15 రోజుల పాటు జరగనున్న యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ను కేరళలో ప్రారంభించాం. కేచా ఖంపక్దీ మాస్టర్ హై ఓల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్గా నిలిచేలా ఉంటుంది. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: శ్రేయాస్ పి. కృష్ణ. -
ఆడుకుంటూ ఆడుకుంటూ ఘోర ప్రమాదం.. బుడ్డోడిని కాపాడిన పోలీసులు
-
‘ముండతికోడ్’ గుణపాఠం.. ఇక రోబోలకు బాణసంచా!
తిరువనంతపురం: కేరళలోని త్రిస్సూర్ జిల్లా ముండతికోడ్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదం 15 నిండు ప్రాణాలను బలిగొనడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి మారణహోమాలు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం, నిపుణులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించి ఫ్యాక్టరీలను సురక్షితంగా మార్చేందుకు, ప్రమాదాలను ప్రాథమిక దశలోనే నివారించేందుకు కసరత్తు మొదలైంది.శబ్దాల కంటే దృశ్యాలకే ప్రాధాన్యంప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు బాణసంచా ప్రదర్శనల విధానంలో భారీ మార్పులు రావాలని కేరళ దేవస్వం మంత్రి వీ.ఎన్. వాసవన్ పేర్కొన్నారు. కేవలం భారీ శబ్దాలతో దద్దరిల్లేలా కాకుండా, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడలలో మాదిరిగా కనువిందు చేసే సురక్షితమైన రంగుల ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ప్రాణనష్టం లేని ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.మనుషులకు బదులు రోబోలుప్రమాదకరమైన బాణసంచా తయారీ, పేల్చే విధానంలో మనుషుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించాలని ‘బెటర్ కొచ్చి రెస్పాన్స్ గ్రూప్’ (BKRG) ప్రతిపాదించింది. చేతులతో నిప్పు పెట్టే విధానానికి బదులుగా ఎలక్ట్రానిక్ టైమింగ్ సిస్టమ్స్ వినియోగించాలని కోరుతోంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్ తరహాలో, తయారీ కేంద్రాల్లో ప్రమాదకరమైన పనులను రోబోలు, ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా చేయిస్తే ప్రాణాపాయాన్ని దాదాపుగా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మానవ తప్పిదాలు జరగకుండా కచ్చితత్వంతో కూడిన ఉత్పత్తి సాధ్యమవుతుంది.ఏఐ సాంకేతికతతో ముందస్తు హెచ్చరికలుఫైర్క్రాకర్ యూనిట్లలో భద్రతను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా మారనుంది. థర్మల్ సెన్సార్లు, కెమెరాల సాయంతో ఉష్ణోగ్రత, పొగ, తేమ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించే ఏఐ వ్యవస్థలు.. మంటలు చెలరేగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, ఏఐ సాధనాలు క్షణాల్లో ప్రతిస్పందించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను సూచిస్తాయి. మెషిన్ లెర్నింగ్ సాయంతో ప్రాణనష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేలా ఈ అత్యాధునిక వ్యవస్థలు పనిచేస్తాయి.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా!
కేరళంలో ఒక బుడ్డోడు చేసిన పని తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది. అటు పోలీసులకు కూడా ముచ్చెమటలు పట్టించింది. చివరికి కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఎలా చేశావురా బుడ్డోడా అంటూ అందరూ నవ్వులు పువ్వులయ్యారు. ఇంతకీ అసలేమైంది అంటే..ఇంట్లో ఆడుకుంటూ, ఆడుకుంటూ ఒక బాలుడు అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయాడు. ఇక ఆ పాత్రలోంచి బయటికి రాలేక నానా కష్టాలు పడ్డాడు. తల్లిదండ్రుల ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు అగ్నిమాపక మరియు రెస్క్యూ సర్వీసెస్ బృందం ఆ బాలుడిని విజయవంతంగా రక్షించింది. చాలా అప్రమత్తంగా, కట్టర్ ద్వారా ఆ పాత్రను కట్ చేసి బాలుడికి విముక్తి ప్రసాదించారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు ఆ బాలుడు ఏడ్చి గోల చేయకుండా, ప్రశాంతంగా పోలీసులకు సహకరించడం విశేషం. దీంతో నెటిజన్లు జాగ్రత్తలను గుర్తు చేస్తూనే ఫన్నీగా స్పందించారు. ఇట్లాంటి అల్లరి పిడుగులు చాలామంది ఉన్నారు. వీరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కమెంట్స్ చేశారు. తల్లిదండ్రులారా, దయచేసి ఇంట్లోని వస్తువుల విషయంలో మీ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. వారిపై ఒక కన్నేసి ఉంచండి! అంటూ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది నెట్టింట వైరల్గా మారింది. A child in Kerala got stuck inside an aluminium cooking pot while playing at home. Fire and Rescue Services team successfully rescued the kid.Parents, please be extra careful and keep an eye on your children around household items!#Kerala #ChildSafety pic.twitter.com/DMG3ydxdJd— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) April 23, 2026 -
తల్లి కాబోతున్న మోనాలిసా.. పోలీసులకు భర్త ట్విస్ట్ !
కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్మీడియాలో గుర్తింపు పొందిన ‘మోనాలిసా భోంస్లే’ తల్లి కాబోతున్నట్లు ఆమె భర్త ఫర్మాన్ తెలిపాడని కథనాలు వస్తున్నాయి. తల్లిదండ్రులను కాదని కేరళకు చెందిన ఫర్మాన్ అనే యువకుడిని ప్రేమించి మార్చి 11న ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. అయితే, పోలీసు దర్యాప్తులో మోనాలిసా మైనర్ అని తేలడంతో ఆమె భర్తపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా మోనాలిసాను విచారణకు హాజరు కావాలని తెలిపారు.మోనాలిసా పుట్టిన ఆసుపత్రి రికార్డుల ప్రకారం పెళ్లి జరిగిన నాటికి ఆమె వయసు 16 ఏళ్ల 2 నెలల 12 రోజులేనని అధికారికంగా తేలింది. దీంతో మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు చేయడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ అంశంపైన ఆమెను విచారించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే, తన భార్య మోనాలిసా ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఈ విచారణ కోసం ప్రయాణం చేయలేదని మధ్యప్రదేశ్ పోలీసులతో ఫర్మాన్ ఖాన్ తెలియజేశారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసా కేరళలో ఉంది.మోనాలిసా తల్లి కాబోతుందని ఫర్మాన్ పోలీసులు వద్ద తెలిపారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమె నిజంగానే తల్లి కాబోతుందా..? లేదా కేసు నుంచి తప్పించుకునేందుకు ఫర్మాన్ ఏమైనా ప్లాన్ చేశాడా అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.


