breaking news
incident
-
ముగ్గురు పిల్లల తల్లి.. నాగరాజుతో అక్రమ సంబంధం!
అనైతిక బంధాలు, కాపురాల్లో కోపావేశాలకు విలువైన ప్రాణాలు బలవుతున్నాయి. దారితప్పి చివరకు రక్తపాతంతో ముగుస్తున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలకు కన్నీరే మిగులుతోంది. ఈ పెడపోకడలు సామాజిక సమస్యగా పరిణమించాయి.కర్ణాటక: ముగ్గురు పిల్లల తల్లిని ఆమె ప్రియుడే గొంతుకోసి హతమార్చిన సంఘటన దావణగెరె సిటీ శేఖరప్ప నగరలో జరిగింది. నాగరత్న(45)ను నాగరాజు (36) హత్య చేశాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగరాజుతో అక్రమ సంబంధం సాగుతోంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా చొరబడ్డ నాగరాజు కత్తితో హత్య చేశాడు. నాగరత్న ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని పరారవుతున్న నాగరాజును పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.ప్రియురాలి చేతిలో ప్రియుడు హతం దొడ్డబళ్లాపురం: ప్రియురాలి చేతిలో ప్రియుడు హత్యకు గురైన సంఘటన దావణగెరెలోని కేశవమూర్తి కాలనీలో జరిగింది. మంజప్ప (40)ను, ప్రేయసి షబీనా (38) చీరతో గొంతు బిగించి ప్రాణాలు తీసింది. మంజప్పకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా విడాకులు తీసుకుని షబీనాతో జీవిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇద్దరూ గొడవకు దిగారు. దీంతో ఆమె ఏకంగా హత్య చేసింది. పోలీసులు నిందితురాలిని నిర్బంధించారు.భార్యను కడతేర్చి.. తానూ ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పట్టణంలోని ఒక లాడ్జిలో భార్యను హత్య చేసి పరారైన కసాయి భర్త చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డ రూరల్ ఠాణా దగ్గర లాడ్జిలో భార్య విద్య (21)ను ఆమె ఐడెంటిటీ కార్డ్ ట్యాగ్తో గొంతు బిగించి హత్య చేసి పరారైన భర్త ఆనంద్ నాలుగు రోజుల నుంచి జాడ లేడు. సొంతూరైన గౌరిబిదనూరు తాలూకా ముదుగెరె చెరువు వద్ద మద్యం తాగి చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. బైక్, 2 మొబైళ్లు తదితరాలు అక్కడ ఉన్నాయి. గౌరిబిదనూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసింది బనశంకరి: కుటుంబ కలహాలతో కోపోద్రిక్తురాలైన మహిళ ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసిన ఘటన మంగళూరు వద్ద ఉప్పినంగడి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఒకరు మృతిచెందగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. సినాన్, నూరున్నీషా దంపతుల మధ్య ఫోన్కాల్ గురించి రగడ మొదలైంది. నూరున్నీషా కోపం పట్టలేక తన మూడేళ్ల కుమారుడు, భర్త చెల్లెలి మూడేళ్లు కొడుకుని తీసుకెళ్లి ఇంటి వద్దనున్న బావిలోకి పడేసింది. స్థానికులు చూసి పిల్లలను బయటకు తీశారు. భర్త చెల్లి కుమారుడు చనిపోగా, సొంత కొడుకు తీవ్ర అస్వస్థత పాలయ్యాడు. అతనిని మంగళూరు ఆస్పత్రిలో చేరి్పంచారు. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. -
నర్సు కేసులో కీలక ఆధారం.. నిందితుడి డీఎన్ఏ మ్యాచ్!
సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో నర్సుపై (21) ‘హత్యా’చారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ సనావుల్లాను (34) న్యాయస్థానంలో దోషిగా నిరూపించడానికి పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. కేవలం సాక్షుల వాంగ్మూలాలు, భౌతికాంశాలే కాకుండా శాస్త్రీయ ఆధారాల పైనా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా హతురాలి శరీరం నుంచి సేకరించిన జీవ నమూనాలను నిందితుడి నుంచి సేకరించిన శాంపిల్స్ పోలుస్తూ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ఫోరెన్సిక్ లాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) చేపట్టిన పరీక్షల్లో నివేదికలు పాజిటివ్గా వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితుడిని దోషిగా నిరూపించడంలో ఈ నివేదిక కీలకం కానుంది. దారుణం జరిగిన మరుసటి రోజే (ఆగస్టు 30) పోలీసులు బిహార్కు చెందిన సనావుల్లాను పట్టుకున్నారు. హత్య కేసుగా నమోదైన ఈ కేసులో తర్వాత అత్యాచారం, ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టంలో సెక్షన్లను చేర్చారు. ఇదిలా ఉండగా నిందితుడు దాదాపు నెల రోజుల పాటు నర్సు కదలికలను గమనించినట్లు వెల్లడైంది. సనావుల్లాను అరెస్టు చేసిన పోలీసులు నేర నిరూపణలో కేవలం అతడి వాంగ్మూలం పైనే ఆధారపడకూడదని భావించారు.ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలపైనా దృష్టి సారించారు. ఘటనాస్థలంలో లభించిన వస్తువులు, వెంట్రుకలు, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను క్లూస్ టీమ్స్ సాయంతో సేకరించారు. వీటితో పాటు నిందితుడి కదలికలకు సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్నీ సంగ్రహించారు. హతురాలి శరీరంపై నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన అధికారులు కోర్టు అనుమతితో నిందితుడి నుంచి శాంపుల్స్ సేకరించి పరీక్ష చేయించారు. ఈ నేపథ్యంలో ఆమె శరీరంపై లభించిన డీఎన్ఏ సనావుల్లా డీఎన్ఏతో సరిపోలినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందించింది. ఇది నర్సుపై నిందితుడే లైంగిక దాడి చేశాడని న్యాయస్థానంలో నిరూపించడానికి తిరుగులేని ఆధారంగా మారనుంది. త్వరలో ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయడానికీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య! -
భార్యను లాడ్జికి తీసుకెళ్లి..
బెంగళూరు: భార్యను లాడ్జికి తీసికెళ్లిన భర్త ఆమెను గొంతు బిగించి హత్య చేసిన సంఘటన దొడ్డబళ్లాపురంలో జరిగింది. వివరాలు.. గౌరిబిదనూరు తాలూకా నగరగెరె గ్రామానికి చెందిన విద్య (23), నాలుగేళ్ల క్రితం ముదుగెరె నివాసి ఆనంద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. విద్య ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆమె బెంగళూరులో పీజీ హాస్టల్లో ఉంటోంది. ఇటీవల ఆనంద్ తన భార్య కనబడడం లేదని దొడ్డబళ్లాపురం మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విద్యను తీసుకువచ్చిన పోలీసులు 20 రోజుల క్రితం ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కలిపి పంపించేశారు. బుధవారం రాత్రి విద్యను తీసుకుని ఆనంద్ దొడ్డలో ఓ లాడ్జిలో దిగాడు. ఆమె ఐడీ కార్డ్తోనే గొంతు బిగించి హత్య చేసి మొబైల్ను తీసుకుని అర్ధరాత్రి వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న ఆనంద్ కోసం గాలిస్తున్నారు. -
న్యాయం చేయండి అంటే చేయలేదు.. వాడిని చంపి నా భర్త న్యాయం చేశాడు..! వైష్ణవి కుటుంబ సభ్యుల రియాక్షన్
-
మామయ్యా కడుపులో నొప్పి, మంటగా ఉంది..
ఖమ్మం: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురానికి చెందిన రైతు పుసులూరి శ్రీనివాస్ కలుపు మందు కలిపిన కూల్ డ్రింగ్ తాగి.. ఆ తర్వాత తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించిన విషయం విదితమే. ఘటనలో శ్రీనివాస్, ఆయన కుమార్తె లాస్య మృతి చెందగా.. కుమారుడు నిఖిల్ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు తండ్రీకుమార్తె మృతదేహాలను గురువారం అప్పలనరసింహాపురం తీసుకురాగా.. కుటుంబీకులు, స్థానికుల రోదనల నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు.పిల్లలను పానీపూరి తినిపించి...పుసులూరి శ్రీనివాస్–లీలా దంపతులకు కుమార్తె లాస్య, కుమారుడు నిఖిల్ ఉన్నారు. ఆయన గ్రామంలోని పది ఎకరాలతో పాటు ముదిగొండ మండలం పెద్ద మండవ, ఏపీలోని గండ్రాయిలో పదేసి ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. ఇటీవల పెట్టుబడులకు అప్పులు చేయగా, చీడపీడలకు తోడు సరిపడా నీరు అందక మనోవేదనకు గురయ్యాడు. దాదాపు రూ.15 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వినాయకచవితి పండగ కోసం ఇంటికి వచ్చిన లాస్యను బుధవారం బైక్పై తీసుకుని నిఖిల్ స్కూల్కు వద్దకు వెళ్లి బయటకు తీసుకొచ్చాడు. కోదాడలో ఇద్దరికీ ఇష్టమని పానీపూరి తినిపించాక కలుపు మందు కలిపిన థమ్సఫ్ సీసాతో గండ్రాయిలో కౌలు చేస్తున్న పొలం వద్దకు వెళ్లాడు. తొలుత శ్రీనివాస్ తాగి... ఆ తరువాత లాస్యకు తాగించగా.. నిఖిల్ కొద్దిగా తాగగానే ఘాటుగా ఉందని తాగలేకపోయాడు. ఆ తర్వాత విషయాన్ని శ్రీనివాస్ తన బావమరిదికి ఫోన్లో చెప్పి స్విచాఫ్ చేసినా పోలీసుల సాయంతో ఘటనా స్థలిని గుర్తించే సరికి శ్రీనివాస్, లాస్య స్పృ హ కోల్పోయారు. ముగ్గురికి గండ్రాయిలో చికిత్స అందించి ఖమ్మం తరలించగా తండ్రి, కూతురు మృతి చెందారు.నన్ను బతికించండి మామయ్యాఖమ్మంలో చికిత్స పొందుతుండగా లాస్య వద్దకు వెళ్లిన మేనమామను చూసి బోరున విలపించించిందని కుటుంబీకులు తెలిపారు. ‘మామయ్యా కడుపులో నొప్పి, మంటగా ఉంది.. నన్ను బ్రతికించండి...’ అంటూ రోదించిందని గుర్తు చేసుకుంటూ మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, హైదరాబాద్లో చికిత్స పొందుతున్న నిఖిల్ను గురువారం శ్రీనివాస్ తండ్రి రామారావుతో వీడియో కాల్ మాట్లాడించగా.. ‘తాతా నేను బాగున్నా.. నాకేమీ కాలేదు...’ అని చెప్పాడు. ఇక గండ్రాయి శివారులో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోగా అక్కడి పోలీసులు గురువారం అప్పలనరసింహాపురం వచ్చారు. శ్రీనివాస్ భార్య లీల, తండ్రి రామారావు నుంచి వివరాలు సేకరించారు. అయితే, ‘అప్పులు ఉన్నాయని చెప్పుకుని బాధపడేవాడు.. ఏమీ కాదని ధైర్యం చెప్పాను. అయినా ఇలా చేసుకుంటాడని ఊహించలేదు’ అని శ్రీనివాస్ తండ్రి రామారావు పోలీసులకు వివరించారు. ఇక భర్త, కుమార్తెను కోల్పోగా.. కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లీల రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. ఇదీ చదవండి: నీకు నా మీద లవ్ తగ్గిపోయింది కదా... -
ఐదుగురి అరెస్టుతో సరిపుచ్చారు...
గుంటూరు : మైనర్ను వ్యభిచార కూపంలోకి దించిన కేసులో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు మైనర్ను సుమారు ఏడాదిపాటు వ్యభిచార కూపంలోకి దించిన మహిళ, మరో నలుగురు వ్యక్తుల అరెస్ట్ విషయంలో ఏదైనా మతలబు జరిగిందా..? అనే అనుమానాలు లేకపోలేదు. పది రోజుల క్రితం గుంటూరు ఈస్ట్ సబ్డివిజన్ పాతగుంటూరు పోలీసుస్టేషన్లో మైనర్తో వ్యభిచారం చేయించిన ఘటనపై కేసు నమోదైంది. పరిస్థితిని ఆసరాగా తీసుకుని... మైనర్ విద్యార్థిని తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఒంగోలులో ఉంటున్న తల్లి దగ్గర నుంచి తండ్రి వద్దకు వచ్చిన మైనర్ను నగరంలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేర్పించారు. ఈ క్రమంలో తండ్రి పాతగుంటూరు బాలాజీనగర్లో నివాసం ఉండే తన సోదరుడి దగ్గర కుమార్తెను ఉంచి చదివిస్తున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉండే పావని అనే మహిళతో పరిచయం ఏర్పడింది. విద్యార్థినికి మాయమాటలు చెప్పి, లేనిపోని ఆశలు చూపి వ్యభిచార కూపంలోకి దించింది. అసలు ఆ బాలిక ఇంటికి కూడా సరిగా రావడం లేదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీనిపై ఈ నెల 5వ తేదీన పాతగుంటూరు పీఎస్లో కేసు నమోదు చేశారు. తొలి నుంచి గోప్యమే... ఈ కేసులో పోలీసులు తొలి నుంచి గోప్యంగానే వ్యవహరించారు. విషయం బయటకు పొక్కకుండా, మీడియా అడుగుతున్నప్పటికీ సమాధానం దాటవేస్తూ వచ్చారు. ప్రధాన నిందితురాలు పావని, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. తర్వాత విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి, వారిని సైలెంట్గా కోర్టుకు హాజరుపరిచారు. ఫిర్యాదులో స్పష్టంగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్, విజయవాడతో పాటు పలు ప్రాంతాలకు పావని తనను తీసుకుని వెళ్లిందని మైనర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెలల తరబడి ఈ తంతు జరిగినా కేవలం ముగ్గురిని మాత్రమే నిందితులుగా చూపడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో అసలు ఏ లాడ్జికి తీసుకుని వెళ్లారు.. అక్కడ ఆధార్ ఏం ఇచ్చారు.. మైనర్ లాడ్జిలోకి వెళ్తుంటే ఎలా అంగీకరించారు..? అనే అంశాలు మిస్టరీగానే ఉన్నాయి. ఈ కేసులో ఇంకెంత మంది నిందితులు ఉన్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నాడు బాధితులకు న్యాయం మేడికొండూరుకు చెందిన ఒక మైనర్ ఘటన గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసు విషయంలో అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఉన్న కె. సుప్రజ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఏపీ, తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలకు వెళ్లి మరీ 112 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరికి లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. ఈ కేసు విచారణ సుమారు సుదీర్ఘంగా మూడు నెలలపైనే సాగింది. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగింది. తీవ్ర నిర్లక్ష్యం ఈ కేసు పరిణామంలో పోలీసులు నిందితులను వదిలివేశారా..? కేసును తూతూ మంత్రంగా విచారించారా..? ఎవరైనా పెద్దల ప్రమేయం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పావని, ఆమె భర్త, కేవలం ముగ్గురు విటులుగా ఉన్న వారిని అరెస్ట్ చేసి మమ అనిపించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన పోలీసులు.. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. ఈ కేసులో లాడ్జి నిర్వాహకులు, పావనికి సహకరించిన మరికొంత మందిని ఎందుకు నిందితులుగా చేర్చలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాకు తెలియకుండా అరెస్ట్ చూపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: టీడీపీ నేతల వికృత చేష్టలు -
కాల్వలో దూకిన భర్త.. ఉరి వేసుకున్న భార్య
ఖమ్మం జిల్లా: క్షణికావేశంలో నాగార్జునసాగర్ కాల్వలో దూకిన గల్లంతయ్యాడనే విషయం తెలిసి సదరు వ్యక్తి భార్య ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెంలో బుధవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆటో నడుపుతూ జీవనం సాగించే అమ్మపాలెంనకు చెందిన తేజావత్ హరిప్రసాద్కు అన్నవరం గ్రామానికి చెందిన సునీత(28)తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా అప్పులయ్యాయి. దీనికి తోడు వారం రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలుకావడంతో హరిప్రసాద్ బుధవారం ఉదయం బయటకు వెళ్లి తన అన్న రామ్మూర్తికి ఫోన్ చేసి చనిపోతున్నానని, బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఇదే సమాచారం సర్పంచ్కు కూడా ఇవ్వగా వారు పోలీసులకు తెలపడంతో ఫోన్ నంబర్ ఆధారంగా వి.వెంకటాయపాలెం సమీపాన ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పరిశీలించగా హరిప్రసాద్ ఆటో, చెప్పులు, సెల్ఫోన్ ఉండడంతో ఆయన కాల్వలో దూకాడనే అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చేపట్టగా రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. కాగా, భర్త కాల్వలో దూకాడని తెలియగానే సునీత ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హరిప్రసాద్ దంపతులు ఇటీవలే ప్రైవేట్ బ్యాంకులో రుణానికి దరఖాస్తు చేసుకోగా విచారణకు వచ్చిన సిబ్బంది ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూశారు. దీంతో సునీత ఉరి వేసుకుని కనిపించగా స్థానికులకు చెప్పడంతో పరిశీలించేసరికి ఆమె మృతి చెందింది. అయితే, సునీత బలవన్మరణంపై ఆమె తరఫు బంధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, విచారణలో వివరాలు వెల్లడవుతాయని ఎస్ఐ సూరజ్ తెలిపారు. కాగా, హరిప్రసాద్ కానరాకుండా పోవడం, సునీత ఎందుకు మృతి చెందిందో తెలియక వీరి పిల్లలు మనోహర్, భార్గవి అడుగుతున్న ప్రశ్నలు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
నాన్నకు మనసెలా వచ్చిందో.. ఊహించని దారుణం!
ఖమ్మం జిల్లా: ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ... ఓ రైతు కలుపు మందు తాగడమేకాక తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించాడు. ఘటనలో తండ్రి, కుమార్తె మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాస్ (44) స్వగ్రామంలోనే కాక ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయిలో భూమి కౌలుకు తీసుకుని భార్యతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు.ఈక్రమాన భార్య అప్పలనరసింహాపురంలోని ఇంట్లో ఉండగా... సూర్యాపేట జిల్లా కోదాడలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న కుమార్తె లాస్య (14), నేలకొండపల్లి మండలం చెరువుమాధారం ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న కుమారుడు నిఖిల్ (11)ను బుధవారం వారి పాఠశాలలకు వెళ్లి తీసుకొచ్చాడు. ఆపై పిల్లలతో కలిసి గండ్రాయిలో కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లాడు. తండ్రి ఇచ్చింది విషమని తెలియక... ముందుగా శ్రీనివాస్ థమ్సప్ సీసాలో గడ్డి మందు కలిపినట్లు తెలుస్తుండగా, పొలం వద్ద తొలుత తాను తాగాడు. ఆ తర్వాత లాస్య, నిఖిల్కు కూడా తాగించాడు. తండ్రి ఇచ్చింది విషమని తెలియని ఆ చిన్నారులు సైతం తాగేశారు. ఆపై బంధువులకు ఫోన్ చేసిన శ్రీనివాస్ విషయాన్ని చెప్పి స్విచ్చాఫ్ చేశాడు. దీంతో బంధువులు, గ్రామస్తులు గండ్రాయిలోని పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. చివరకు పోలీసుల సాయం తీసుకుని ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా గుర్తించేసరికి ముగ్గురూ స్పృహ తప్పి కనిపించాడు. ఈ మేరకు శ్రీనివాస్, ఇద్దరు పిల్లలను ఖమ్మం జనరల్ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ తండ్రి, కుమార్తె లాస్య మృతి చెందారు. ఇక కుమారుడు నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. శ్రీనివాస్కు గ్రామంలో ఉత్తమ రైతుగా పేరుండటమేకాక అందరితో కలివిడిగా ఉండేవాడు. దీంతో ఆయన ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఈ ఘటనపై ఏపీలోని చిల్లకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. -
HYD: క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి హత్య.. రెండు కుటుంబాలను విషాదంలో ముంచింది. బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు వివరాలు ఆరా తీయడానికి శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లిన ఆయన బంధువు శ్యామ్ గుండెపోటుతో అక్కడిక్కడే చనిపోయారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గురువారం రాత్రి అదృశ్యం.. ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన రాజశేఖర్ (32) నగరానికి వలసవచ్చి బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్లో స్ధిరపడ్డారు. ఈయనకు భార్య లీల, ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమార్తెలు శ్రీనిధి, అనన్య ఉన్నారు. రాజశేఖర్కు రెండు కార్లు ఉండేవి. ఒకదాన్ని తాను నడుపుతూ.. మరో దాన్ని డ్రైవర్ ద్వారా నడిపిస్తున్నారు. రాజశేఖర్ సమీప బంధువు అశోక్ మూడు రోజుల క్రితం ఓ కారు ఖరీదు చేశారు. దీన్ని ప్రస్తుతం రాజశేఖర్ నడుపుతున్నారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబీకులు శుక్రవారం బేగంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహం, కారు వేర్వేరు చోట్ల.. సంగారెడ్డి జిల్లా కోహిర్లోని గోల్డెన్ దాబా సమీపంలో రాజశేఖర్ కారు పోలీసులకు లభించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి వెళ్లారు. రాజశేఖర్ కోసం పోలీసులు, కుటుంబీకులు, స్నేహితులు వెతికారు. శుక్రవారం అర్ధరాత్రి రుద్రారం శివారులోని చెట్ల పొదల్లో రాజశేఖర్ మృతదేహం లభించింది. హతుడి సోదరుడు రాంబాబు ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రాజశేఖర్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. బెల్ట్ వంటి దాంతో మెడకు ఉరి బిగించి చంపినట్లు నిర్ధారించారు ఠాణాలో కుప్పకూలిన బంధువు.. కేసు పూర్వాపరాలు, దర్యాప్తు అంశాలను ఆరా తీయడానికి రాజశేఖర్ బంధువులు, స్నేహితులు శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సమయంలో హతుడి సమీప బంధువు శ్యామ్ గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అటు రాజశేఖర్, ఇటు శ్యామ్ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకొన్నాయి. కారు కోసమే ఘాతుకమా? ప్రాథమిక ఆధారాలను బట్టి రాజశేఖర్ నడుపుతున్న కారు కోసమే ఆయన హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ప్యాసింజర్ల మాదిరిగా కారు బుక్ చేసుకుని, ఆపై వెనుక సీటు నుంచి మెడకు బెల్టు బిగించి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. కారు మరమ్మతులకు లోనుకావడంతోనే అక్కడ వదిలేసి పారిపోయినట్లు భావిస్తున్నారు. ఇదీ చదవండి: నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం -
పోలవరంలో పాప ఘటన.. MP తనూజ రాణి ఎమోషనల్
-
అంతా సౌజన్యే చేసింది!
కాకినాడ రూరల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకినాడకు చెందిన షేక్ సాధిక్ ఖాన్ ఈ నేరానికి సంబంధించి పోలీసుల ప్రశ్నలకు వరుసగా రెండవరోజూ ఎప్పటిలాగే ‘తనకేం తెలియదు, తన తప్పేంలేదు’ అని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ‘తప్పంతా జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్యదే’ అంటూ ఆమెపై నెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మూడు రోజుల విచారణ నిమిత్తం సాధిక్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మొదటిరోజు మంగళవారం విచారణలో 60 ప్రశ్నలు సంధించిన పోలీసులు, బుధవారం రెండోరోజూ పలు కీలకమైన అంశాలపై 70 ప్రశ్నలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ సీఐ గదిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో న్యాయవాది సమక్షంలో సాధిక్ను ప్రశ్నించారు. జగదీశ్వరరెడ్డి హత్యకుగాను సాధిక్కు సైనేడ్ ఎలా వచ్చిందనే కోణంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు సర్పవరం స్టేషన్కు రప్పించి సాధిక్ సమక్షంలో విచారించారు. ఈ క్రమంలో ఒకరు సైనేడ్ ఇచ్చిన విషయం ఒప్పుకున్నట్టు తెలిసింది. ఉదయం విచారణలో అదనపు ఎస్పీ మహంతి కిశోర్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. ముఖ్యంగా సౌజన్యతో పరిచయం ఎలా ఏర్పడింది, ఆమె భర్త జగదీశ్వరరెడ్డి హత్య, అందుకు వినియోగించిన రసాయనాలు, నూకరాజు కుటుంబానికి వేధింపులు, వారి ఆస్తులపై కన్ను, నకిలీ సర్టిఫికెట్లతో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వహణ తదితర అంశాలపై సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. సాధిక్ విచారణ కోసం మొదటి నుంచీ సేకరించిన ఆధారాలు, సూసైడ్ నోట్లలోని అంశాల ఆధారంగా సుమారు 200 ప్రశ్నలతో జాబితా సిద్ధం చేసుకున్న పోలీసులు ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు. -
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. సర్పవరం పోలీసుల తొలిరోజు విచారణలో నిందితుడు సాధిక్ఖాన్ ఇచ్చిన సమాధానాలు దాదాపుగా ఇవే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు అనుమానాస్పద మృతిలో కీలక నిందితుడు సాధిక్ ఖాన్ను మంగళవారం కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు తొలిరోజు విచారణ ప్రారంభించారు. అతడి న్యాయవాది సమక్షంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్కుమార్ ఆధ్వర్యంలో రూరల్ పీఎస్ ఆవరణలో ఉన్న ప్రత్యేక గదిలో అతన్ని విచారిస్తున్నారు.ఉదయం ప్రారంభమైన విచారణ, రాత్రి 9.30 సమయానికి కూడా కొనసాగుతోంది. పోలీసు వర్గాల నుంచి తెలిసిన సమాచారం మేరకు.. సాధిక్ను విచారించేందుకు 200 ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు తొలిరోజు 60 ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మేరకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సాధిక్ సమాధానం ఇవ్వడం గమనార్హం. సాంకేతిక ఆధారాలతో సాధిక్ను అడిగిన ప్రశ్నలకు వాస్తవ సమాధానాలు కనిపెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. విచారణకు పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్ల సాంకేతిక అంశాలపై ఆధారపడి కేసు విచారణ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. మీరట్లో ఏం జరిగింది... సాధిక్ మీరట్ వెళ్లడం వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కకుండా సాధిక్ అక్కడి పోలీసుల ద్వారా అరెస్టయ్యాడని తెలిసింది. స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వల్లే ఆంధ్రా పోలీసులు వెళ్లి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకురావలసి వచ్చిందని స్పష్టమైంది. ఆంధ్ర పోలీసులకు చిక్కే సమయానికి సాధిక్కు చెందిన స్థానికులు మీరట్ పోలీసులకు సమాచారం అందించి కావాలనే అరెస్టు చేయించారని, నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే గుర్తించిన సాధిక్ తన మార్గదర్శి ద్వారా ఈ పన్నాగం పన్నాడని చెబుతున్నారు. అతడి వెనకున్నదెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏ మూల ఉన్నా నిందితులను పోలీసులు ఆయా ప్రాంతాలను వెళ్లి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువస్తారు. కాని సాధిక్ విషయంలో అలా జరగలేదు. ట్రాన్సిట్ వారెంట్ తప్పనిసరి అయింది. అవును రసాయనం తెచ్చాను... సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు వినియోగించాడని చెబుతున్న ప్రాణాంతక రసాయనం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావన్న ప్రశ్నకు రసాయనం తేవడం నిజమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే, ఆ రసాయనం ఉపయోగించి తాను చంపలేదని చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడం పోలీసులకు ఓ సవాల్గా మారింది. ఇప్పటికే జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఆరోగ్య నివేదికలు సేకరించారు. వాటిని నిపుణుల పరిశీలనకు పంపారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో.. మంగళవారం నాటి విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టారు. మోసం చేయడం ఆది నుంచి సాధిక్కు ఓ అలవాటైన విషయమని మరోసారి నిర్ధారించుకున్నారు. ఇంత డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తున్న సాధిక్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నకిలీ సర్టిఫికెట్ ఒకటి తయారు చేయించుకొని వివిధ పోటీలలో పాల్గొనడం దగ్గర నుంచి, కోచ్గా పాఠశాలల్లో చేరడం వరకు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని స్వయానా సాధిక్ అంగీకరించాడు. ఇద్దరు సెంటు వ్యాపారస్తుల విచారణ... సా«ధిక్ ఖాన్ను కస్టడీకి తీసుకొచ్చే కొద్ది రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగదీశ్వర్రెడ్డిని హతమార్చేందుకు సాధిక్ సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం రూఢీ అయింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం గాం«దీపురంలో ఉన్న ఓ సెంటు వ్యాపారస్తుడు అబ్దుర్ రెహమాన్ సాధిక్ సంప్రదించాడు. తనకు హానికారక రసాయనం కావాలని, ఒక వ్యక్తిని హతమార్చాలని చెప్పాడు. అది ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పిన రెహమాన్ హైదరాబాద్కు చెందిన అబ్దుల్ ఖాదిర్ను సంప్రదించాలని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు. పోలీసులు వీరిద్దరినీ విచారిస్తుండగా వారి న్యాయవాది వచ్చి విడుదల చేయించారని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిసింది. సాధిక్ విచారణ కొనసాగుతుండడంతో వారిద్దరినీ మరో మారు పిలిపించే అవకాశం ఉంది. ఆ పార్సిల్లో ఏముంది? అబ్దుల్ ఖాదిర్ హైదరాబాద్ నుంచి సెంట్ల తయారీలో వినియోగించే ఓ హానికర రసాయనాన్ని సాధిక్కు పంపాడని సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పంపిన మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ట్రావెల్ బస్సులో కొద్ది రోజుల క్రితం సాధిక్కు ఓ పార్సిల్ అందిందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో డీఎంహెచ్వో కార్యాలయం ఎదురుగా ఉన్న సదరు ట్రావెల్స్ ఆఫీసులో విచారణ చేశారు. అక్కడి వారు పార్సిల్ రావడం నిజమేనని నిర్ధారించారు. ఆ పార్సిల్లో ఏమొచ్చిందో పోలీసులకు అంతుబట్టడం లేదు. అది ఖాదిర్ పంపిన విషపూరిత రసాయనం అయి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులలో ఉన్నాయి. -కాకినాడచదవండి: బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు -
అక్కా.. నన్ను చంపేస్తారు..!
విశాఖపట్నం: రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య మత్స్యకార కుటుంబం వారిది. కష్టాల కడలిని ఈదుతూ నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పొరుగు జిల్లా నుంచి వలసొచ్చిన ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రాత్రి ‘బయటకు వెళ్లి వస్తా’నని చెప్పి వెళ్లిన వ్యక్తి.. తెల్లవారేసరికి సముద్రతీరంలో విగతజీవిగా కనిపించడంతో భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున రక్తపు మడుగులో.. వన్ టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి(30) కొంతకాలంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి స్థానిక పెయిన్దొరపేటలో నివాసం ఉంటున్నాడు. వారం రోజులుగా వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న చంటి, ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం నేవల్ కోస్టల్ బ్యాటరీ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద రక్తపు మడుగులో కనిపించాడు. చంటిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై కర్రలతో బలంగా కొట్టి, మెడకు నైలాన్ తాడు బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందే ఊహించినా.. దక్కని ప్రాణం ఈ దారుణం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆదివారమే చంటి తన సోదరి అప్పలకొండ వద్ద వాపోయాడు. అంతలోనే.. హత్యకు గురికావడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ బెదిరింపులకు పాల్పడినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. కష్టపడి బతికే మత్స్యకారుడి ప్రాణాలు గాల్లో కలసిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. చదవండి: భర్త ఫోన్ ఎత్తలేదని భార్య ఆత్మహత్య -
పబ్లో అర్ధరాత్రి ఘర్షణ
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒక స్టార్ హోటల్ పబ్లో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక వర్గంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ సోదరుడు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్లోని ఎనిమిదో అంతస్థులో ‘కారా కారా’ పేరుతో పబ్ ఉంది. శనివారం రాత్రి దాదాపు 2.10 గంటల ప్రాంతంలో పబ్లో దాదాపు 200 మందికిపైగా ఉన్నారు. అదే సమయంలో పబ్లో గోడకు, టేబుల్కు మధ్యలో ఉన్న అనిల్ కుమార్యాదవ్ సోదరుడు అరవింద్ యాదవ్ (టిల్లు)ను దాటుకొని వెళ్లడానికి మరో యువకుడు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న అరవింద్ యాదవ్ స్నేహితులు యువకుడిపై దాడికి దిగారు. ఇది గమనించిన యువకుడి స్నేహితులు సైతం ఒక్కసారిగా రెచ్చిపోయి అరవింద్తోపాటు అతని స్నేహితులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పబ్లో రణరంగం చోటచేసుకొంది. బీరు సీసాలతో చేతులు, కాళ్లతో దాడికి దిగబడటంతో చుట్టు ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉద్రిక్త వాతవారణం చోటుచేసుకొంది. ఈ గొడవలో ఒక యువతి కింద పడిపోయింది. అదే సమయంలో పబ్లోని బౌన్సర్లు వచ్చి ఇరువర్గాలను అడ్డుకొని అక్కడి నుంచి కిందకు పంపారు. వీరంతా హోటల్ సెల్లార్లోకి చేరుకుని అక్కడా ఘర్షణకు దిగారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. హోటల్ నిర్వాహకులతోపాటు అక్కడే ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఇరువర్గాలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్లో అద్దాలు పగిలి ఉండటంతోపాటు, బల్లలు, కురీ్చలు దెబ్బతిని ఉండటాన్ని గుర్తించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీల్లో అరవింద్ యాదవ్ టోపీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు పబ్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని విచారిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సమయానికి మించి పబ్ను నడపడంతో మరో కేసు సైతం సుమోటోగా నమోదు చేశారు. -
ఢిల్లీ హాస్టల్ ఘటన: పెరిగిన మృతుల సంఖ్య
ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చిన విద్యార్థుల జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్లో ఆదివారం కుప్పకూలిన పీజీ హాస్టల్ భవనం ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రాత్రంతా కొనసాగిన సహాయక చర్యల్లో మరో వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 11 మందిని రక్షించగా.. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతుండగానే.. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో లోపల ఉన్న పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కూలడానికి బేస్మెంట్ పనులు, నిర్మాణంలో లోపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన మరో సీసీటీవీ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా భవనం కూలడం ప్రారంభమైంది. భారీగా దుమ్ము కమ్ముకోవడంతో అప్రమత్తమైన అతడు వెంటనే దుకాణం నుంచి బయటకు పరుగెత్తాడు. క్షణాల వ్యవధిలోనే భవనం కుప్పకూలడంతో అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.DELHI: SATYA NIKETAN BUILDING COLLAPSE: CCTV FOOTAGE EMERGESCCTV footage from opposite the building captures the moment a person rushes out of his shop to save his life as the collapse unfolds.Search and rescue operations continue at the site. pic.twitter.com/svxVTwDYhW— Subodh Kumar (@kumarsubodh_) September 7, 2026తప్పిన పెనుముప్పు?సత్య నికేతన్లోని ఈ ఐదు అంతస్తుల భవనంలో సుమారు 15 గదులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉండేవారని చెప్పారు. ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకోవడంతో చాలామంది విద్యార్థులు బయట ఉండటం వల్ల ప్రాణనష్టం కొంత తగ్గిందని స్థానికులు పేర్కొన్నారు. ఇక సుమారు 30 ఏళ్ల నాటి ఈ భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరుతో పీజీ వసతి గృహం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి ముందు బేస్మెంట్లో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలి వర్షాలతో బేస్మెంట్లో నీరు చేరి పునాది బలహీనపడటం వల్లే భవనం కూలిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.శిథిలాల కింద ఆర్తనాదాలు..భవనం కూలిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారు తమను కాపాడాలంటూ ఫోన్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కొందరు బాధితులు లోపల నుంచి వీడియోలు తీసి మిత్రులకు పంపించారు. శిథిలాల కింద ఉన్నవారు ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్లను పంపించినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు.ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇరుకైన వీధులు కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.పీజీల నిర్వహణపై ప్రశ్నలుసత్య నికేతన్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీజీలు, హాస్టళ్లలో ఉంటున్నారు. పాత భవనాలను పీజీలుగా మార్చి నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాల నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, నిర్వహణపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ప్రముఖుల సంతాపంఈ విషాద ఘటనపై రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. మృతుల సంఖ్య ఆరుకు చేరడం, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుండటంతో సత్య నికేతన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా బయటపడిన సీసీటీవీ దృశ్యాలు మాత్రం ప్రమాదం కూలిన భవనం లోపలే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారినీ ఎంతటి ముప్పులోకి నెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్ చూసి మోసపోవద్దు! పాపం ఆ అమ్మాయి.. -
సినిమాకు తీసుకెళ్లి భార్య గొంతు కోసిన భర్త
నెల్లూరు జిల్లా: పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అంతలోనే వివాదాలు నెలకొని భార్య గొంతు, రెండు చేతుల మణికట్టు వద్ద భర్త కత్తితో కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆత్మకూరు పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై జంపానికుమార్ వివరాల మేరకు.. ఏఎస్పేట మండలం పందిపాడుకు చెందిన బద్దుకూరి మహాలక్ష్మి, హేమసాయి దగ్గరి బంధువులు కావడంతో కుటుంబ సభ్యులు గత నెల చివర్లో వివాహం చేశారు. వారు బైక్పై శనివారం సినిమాకి వెళ్లి ఆత్మకూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాపురం సమీపంలో ఏఎస్పేట ఆర్చి వద్ద రోడ్డు పక్కనున్న నిమ్మతోట వద్ద బైక్ను నిలిపి దంపతులు గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త హేమసాయి ముందుగా తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు, మణికట్టు వద్ద కోసి తీవ్రంగా గాయపరిచాడు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఏఎస్పేట ఎస్సై జిలానీ గుర్తించి తన వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి! -
నడిరోడ్డుపై భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్?
బనశంకరి: బెంగళూరులో నడిరోడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.చదవండి: రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి -
పిచ్చికుక్క కాటుకు రిన్తో శుభ్రం చేస్తారా?
అమలాపురం టౌన్: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు పిచ్చి కుక్క దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ శనివారం పార్టీ నాయకులతో కలసి వచ్చి పరామర్శించారు. ఆ సమయంలో పిచ్చి కుక్క కరిచిన పిల్లల గాయాలకు హైడ్రోజన్ ఫైరాక్సైడ్, స్పిరిట్, బెటాడిన్, నార్మల్ సైలన్ వంటి వాటితో కాకుండా సరైన వైద్య విధానాలు పాటించకుండా చికిత్స చేస్తున్న తీరను చూసి డాక్టర్ శ్రీకాంత్ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలను దుస్తులు ఉతికే రిన్ సబ్బుతో శుభ్రపరిచే విధానాన్ని ఆయన తప్పు పట్టారు. కుక్క కరిచిన బాధిత చిన్నారుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య నిబంధనల ప్రకారం బాధితులకు మెరుగైన, నాణ్యమైన చికిత్స అందించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడడంపై ఆయన మండిపడ్డారు. చిన్నారులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుంటే స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు పట్టదా...? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రిన్ సబ్బుతో వైద్యం చేస్తున్న తీరును, వైద్యులు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని డాక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. -
రన్నింగ్ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి
‘నాకు జన్మ ఇవ్వమని అడిగానా అమ్మా..ఎందుకు పుట్టిన వెంటనే పేగుబంధం తెంచ్చుకొని రోడ్డుపై వదిలేసి వెళ్లావ్’ అంటూ ఒక నవజాత శిశువు మూగరోదన ఇది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిన అమానుష ఘటన మహబూబ్నగర్ నగరంలో చోటుచేసుకుంది. రన్నింగ్ ఆటోలోనే ప్రసవం జరిగిన అనంతరం గుర్తుతెలియని మహిళ శిశువును రోడ్డుపై వదిలేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రక్తపు మరకలను గమనించిన వాహనదారులు వాటిని అనుసరించడంతో శిశువు ఆచూకీ లభించింది. సకాలంలో గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. నగరంలోని న్యూటౌన్ హెచ్డీఎఫ్సీ సమీపంలో శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని మహిళ ఆటోలో ప్రసవించిన అనంతరం శిశువును చీరలో చుట్టి కేఎఫ్సీ దుకాణం ఎదుట రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న వాహనదారులు రోడ్డుపై రక్తపు మరకలను గుర్తించారు. వాటిని అనుసరించగా శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నవజాత శిశువును మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్నాడు. సీసీ కెమెరాల్లో రికార్డు శిశువును ఆటో నుంచి రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలు సమీపంలోని దుకాణాల సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. వాటిని పరిశీలిస్తూ శిశువును వదిలేసిన మహిళతో పాటు ఆటో వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై పడివున్న శిశువును వాహనదారులు సకాలంలో గుర్తించకపోయి ఉంటే పరిస్థితి మరింత విషమంగా మారేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ తెలిపారు. శిశువును ఎవరు వదిలేసి వెళ్లారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.మహబూబ్నగర్ క్రైం: చదవండి: చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి! -
మృతదేహంపై గాయాలున్నా.. గుండెపోటు అంటారేం?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన ల్యాదెల్ల రాజు మృతదేహంపై గాయాల గుర్తులున్నా, గుండెపోటుతో సహజ మరణంగా కేసును మూసివేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోసారి ఫోరెన్సిక్ అభిప్రాయం తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతికి పోలీసులు లేఖ రాయాలని ఆదేశించింది. పోస్టుమార్టం నివేదిక, మృతదేహం ఫొటోలు, గతంలో ఇచ్చిన ఫోరెన్సిక్ అభిప్రాయాలతో పాటు సంబంధిత రికార్డులన్నింటినీ పంపించాలని స్పష్టం చేసింది. తాజా ఫోరెన్సిక్ అభిప్రాయం అందిన అనంతరం పోలీసులు చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొత్తగా ఇచ్చే అభిప్రాయం కాపీని పిటిషనర్కు కూడా అందించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఉత్తర్వుల కాపీ అందిన తేదీ నుంచి మూడు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధిస్తూ.. విచారణ ముగించింది. తన భర్త రాజు మృతి కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదంటూ ప్రియాంక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఈ పిటిషన్పై జస్టిస్ తంగిరాల మాధవీ దేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. మరో సారి అన్ని పరీక్షలు నిర్వహించి, నివేదికలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య
కర్నూలు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను కడతేర్చిన çఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నాయీబ్రాహ్మణ కాలనీలో నివాసముండే ఆంజనేయులు (27)కు రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో సుబ్బులుకు చాగలమర్రి మండలం తోడేండ్లపల్లె గ్రామానికి చెందిన గురుప్రసాద్ ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న ఆంజనేయులు భార్యను హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని సుబ్బులు తన ప్రియుడు గురుప్రసాద్తో కలిసి కుట్ర పన్నింది. ఈ మేరకు గురుప్రసాద్, అతని స్నేహితుడు షరీఫ్ ఆదివారం రాత్రి ఆంజనేయులను మద్యం తాగుదామంటూ నమ్మించి పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయులకు మద్యం తాగించి తర్వాత రాళ్లతో తలపై మోది హత్య చేశారు. సోమవారం హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మృతుడి భార్య ఏమి తెలియనట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గరున్న తన భర్తను పిలుచుకు పోయారని, తెల్లారే సరికి హత్య చేశారని నమ్మబలికింది. ఆమె మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీంతో సుబ్బులు, గురుప్రసాద్తో పాటు హత్య కు సహకరించిన షరీఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా హత్య జరిగిన ఒక రోజులోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్న పీరయ్యను డీఎస్పీ అభినందించారు. -
ఇది సాధారణ ఘటన కాదు: ప్రధాని బాలేంద్ర షా
కఠ్మాండు: నేపాల్లోని భోటేకోషి-త్రిశూలి నదుల్లో వరదలు వచ్చి నేటికి ఏడు రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు, పునరావాసం, మృతదేహాల నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రధాన మంత్రి బాలేంద్ర షా మీడియాకు వివరించారు. టిబెట్ సరిహద్దులో బుధవారం సంభవించిన భీకర వరద సాధారణ సంఘటన కాదని, ఇది పూర్తిగా వాతావరణ మార్పుల వల్ల సంభవించినదని ఆయన పేర్కొన్నారు. ఒక సోషల్ మీడియాలో పోస్ట్లో ఆయన.. అంతర్జాతీయ స్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిమాలయ ప్రాంతంలో మంచు, హిమపాతం కారణంగా సంభవించిన అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాల్లో ఇది ఒకటని ఆయన అభివర్ణించారు.ప్రాజెక్టుల సొరంగాల్లో వందలాది కార్మికులుకాగా జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో వందలాది మంది కార్మికులు చిక్కుకుని ఉండవచ్చనే అనుమానంతో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారని ప్రధాని తెలిపారు. ఈ సహాయక చర్యల్లో కొందరు విదేశీ నిపుణులు కూడా భాగస్వాములవుతున్నారన్నారు. వరదల కారణంగా నేపాల్లో ఇప్పటివరకు 900 మందికి పైగా మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. సుమారు 4,000 మంది ఆచూకీ గల్లంతైంది. రసువాలో ఏర్పడిన ఒక హిమ సరస్సు పరిమాణం క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం సహాయక చర్యలపైనే పూర్తి దృష్టి సారించిందని ప్రధాన వెల్లడించారు.987కి చేరిన మృతుల సంఖ్యనేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ మంగళవారం ఉదయం అందించిన సమాచారం ప్రకారం, భోటేకోషి వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 987కి చేరింది. ఇంకా 3,916 మంది ఆచూకీ గల్లంతైనట్లు ప్రవక్త శాంతి మహత్ తెలిపారు. సోమవారం ఉదయం వరకు 2,500 మందికి పైగా గల్లంతయినట్లు చూపిన గణాంకాలు, మధ్యాహ్నానికి అకస్మాత్తుగా 4,200 దాటాయి. క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందడంలో ఆలస్యం కావడం వల్లే ఈ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని అధికారులు స్పష్టం చేశారు. మృతదేహాలు దొరికినప్పటికీ చాలా వరకు ఇంకా గుర్తింపు (సనాఖత్) కాలేదని, దీనివల్ల మృతులు మరియు గల్లంతైన వారి సంఖ్యలో కొన్నిసార్లు పునరావృతం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ డేటాను మరింత శాస్త్రీయంగా నిర్వహించడానికి జిల్లాలన్నింటినీ అనుసంధానిస్తూ కొత్త యాప్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.గ్యాస్ ట్యాంకర్లు వెళ్లేందుకు మార్గం లేక..పృథ్వీ హైవేలోని కృష్ణభీర్ వద్ద రహదారి కుంగిపోవడంతో కాట్మండు లోయ వెలుపలి ప్రాంతాలలో ఎల్పీ గ్యాస్ సిలిండర్లను నింపే ఏర్పాట్లు చేశారు. గ్యాస్ ట్యాంకర్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో, లోయ, పొరుగు జిల్లాల్లోని 16 గ్యాస్ పరిశ్రమలు.. బారా, పార్సా, చిత్వన్, మక్వాన్పూర్, నవల్పరాసి జిల్లాల పరిశ్రమలతో సమన్వయం చేసుకుని అక్కడే సిలిండర్లు నింపి చిన్న వాహనాల ద్వారా రవాణా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాయి. కాట్మండు లోయలో మొత్తం వినియోగంలో 40 శాతానికి పైగా గ్యాస్ అవసరమని నేపాల్ ఎల్పీ గ్యాస్ ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు దేవాన్ చంద్ తెలిపారు.ఎనిమిది జిల్లాల్లో మృతదేహాలుభోటేకోషి, త్రిశూలి వరదల్లో మరణించిన వారి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు రసువా నుండి నవల్పరాసి పశ్చిమం వరకు ఎనిమిది జిల్లాలలో మృతదేహాలు వెలుగుచూశాయి. నేపాల్ పోలీసుల వెబ్సైట్ ప్రకారం, సోమవారం నాటికి మృతుల సంఖ్య 951కి చేరింది. కాగా, అత్యధికంగా చిత్వన్ జిల్లాలోనే 282 మృతదేహాలు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసులు మొదటి రోజు నుంచే సహాయక చర్యలు, రోడ్లపై అడ్డంకులను తొలగించడం, జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.నేడు అఖిలపక్ష సమావేశంభోటేకోషి, త్రిశూలి నదుల వరదల వల్ల జరిగిన నష్టం, గల్లంతైన వారి అన్వేషణ, సహాయక చర్యలు, పునరావాస అంశాలపై చర్చించేందుకు నేడు(మంగళవారం) అఖిలపక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 2:00 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.ఇది కూడా చదవండి: దీక్ష విరమణ వెనుక.. నిజాలు వెల్లడించిన వాంగ్చుక్! -
ఫోన్ నిండా పోర్నో వీడియోలే!
సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో నర్సును హత్య చేసి, ఆమె మృతదేహంపై అత్యాచారం చేసిన మానవమృగం ఎండీ సనావుల్లా ఫోన్ నిండా అశ్లీల వీడియోలే ఉన్నాయి. ఈ ‘హత్యా’చారానికి వాటి ప్రభావమూ తీవ్రంగా ఉందని పోలీసులు చెప్తున్నారు. కేవలం ఇలాంటి వాళ్లే కాదు... మైనర్లు కూడా పెడదోవ పట్టడం వెనుక పోర్న్ వెబ్సైట్ల ప్రభావం ఎక్కువగానే ఉంటోందని అంటున్నారు. ఇంటర్నెట్లో ఉన్న వీటి సర్వర్లు విదేశాల్లో ఉండటంతో చర్యలకు ఆస్కారం ఉండట్లేదని చెప్తున్నారు. నిఘా సంస్థలు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీని పరిగణించినంత తీవ్రంగా ఇతర అశ్లీలతను పరిగణించట్లేదు.‘చేతుల్లోకి’ రావడంతో తేలికైంది... కొన్నేళ్ల క్రితం అశ్లీల చిత్రాలు చూడాలంటే ప్రత్యేకించి సినిమా థియేటర్లు ఉండేవి. ఆ తర్వాత వీడియో క్యాసెట్ల రూపంలో అందుబాటులోకి రావడంతో వీసీపీ, టీవీ ఉంటేనే వీటిని చూడటానికి ఆస్కారం ఉండేది. కంప్యూటర్, ల్యాప్టాప్ల వాడకం పెరిగిన తర్వాత నెట్కేఫ్లతో పాటు ఇళ్లల్లోనూ ఈ ‘దృశ్యాలు’ కనిపించడం మొదలైంది. అప్పట్లో ఎదుటి వారు చూస్తారనే భయం, అదే జరిగితే పరువు పోతుందనే ఆందోళన యువతలో ఉండేది. స్మార్ట్ఫోన్ యుగం ప్రారంభమైన తర్వాత ఈ పోర్న్ సైట్లన్నీ వాటి నుంచే చూసేందుకు అవకాశం చిక్కింది. ఈ కారణంగానే అనేక మంది యువత పోర్నోగ్రఫీకి బానిసలుగా మారుతున్నారు. కొందరు అదుపుతప్పి జీవితాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. సర్వర్లు ఇక్కడ లేకపోవడంతో... ఈ పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. అయితే తెలివిమీరిన వీటి నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు ఏర్పాటు చేసి మరో సైట్ ప్రారంభిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు అందే వరకు యథేచ్ఛంగా ఇంటర్నెట్లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. ఈ కారణంగానే వరుసగా ఫిర్యాదులు వచి్చన వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. ఆ చర్యలు మిగిలిన వాటిపై లేవు... ప్రస్తుతం చైల్డ్ పోర్నోగ్రఫీని మాత్రమే తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధమూ కొనసాగుతోంది. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో సాగుతున్న చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డన్ర్ (ఎన్సీఎంఈసీ) పని చేస్తోంది. అలాంటి చర్యలు వీటికీ అవసరం.. ఆయా సైబర్ స్పేస్, సోషల్ మీడియాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా..తక్షణం గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వారి వినియోగించిన ఐపీ అడ్రస్లను గుర్తిస్తుంది. ఈ సమాచారం స్థానిక పోలీసులకు ఇచ్చి నిందితులను అరెస్టు చేయిస్తుంది. చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉన్న మాదిరిగానే ఇతర అశ్లీల అంశాలపైనా చర్యలు అవసరమన్నది నిపుణుల మాట. పోర్న్సైట్స్ను ఎవరు సెర్చ్ చేసినా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దీనిపైనా సుమోటో కేసుల్ని నమోదు చేయాలని ఐటీ యాక్ట్లోని సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చదవండి: ఉదయకృష్ణారెడ్డికి పరీక్షపై పట్టుబట్టొద్దు -
ఢిల్లీలో నిర్భయ తరహాలో ఘటన.. స్లీపర్ బస్సులో బాలికపై..
-
సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!
కాకినాడ క్రైం: పంచాయతీరాజ్ శాఖ పిఠాపురం ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డికి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ)కు సంబంధించి రూ.2 కోట్ల ఓడీ పరిమితి ఉన్న ఖాతా సాధిక్ ఖాన్ చేతికి చిక్కిందనే కీలక విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేవీబీ భానుగుడి బ్రాంచికి శుక్రవారం వెళ్లి మేనేజర్ను ఆ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. తనకు, జగదీశ్వరరెడ్డికి చెందిన ఖాతాల్లో తన ఫోన్ నంబర్ మార్చి, వాటి ఆర్థిక లావాదేవీలను సాధిక్ ఖాన్ తన చేతుల్లో పెట్టుకున్నాడన్న నూకరాజు కుమార్తె సౌజన్య ఆరోపణలపై లోతైన విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మరింత స్పష్టత కోసం బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే, సాధిక్ సోదరి, తల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకు ఖాతాలపై పరిశీలన మొదలు పెట్టారు. సౌజన్య దగ్గర నుంచి సాధిక్ తీసుకున్న సొత్తును వారికి బదలాయించాడన్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులున్నారు. ఇదిలా ఉండగా సాధిక్ను కోర్టు సోమవారం తమ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రశ్నల వర్షం కురిపించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అంతకు ముందే పూర్తి వివరాలు, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.సాధిక్ ఖాన్ కస్టడీ పిటిషన్పైవిచారణ వాయిదా కాకినాడ లీగల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ ఘాటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్ను పలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిని న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై శుక్రవారం మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. చదవండి: నా బిడ్డకు తండ్రి నువ్వే.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం! -
నా బిడ్డకు తండ్రి నువ్వే.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం!
సాక్షి, గద్వాల (ధరూరు): తనకు తండ్రి గుర్తింపు ఇవ్వాలని ఓ యువకుడు ధర్నాకు దిగిన ఘటన మండల పరిధిలోని చింతలరేవులలో శుక్రవారం జరిగింది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో 20 ఏళ్ల క్రితం మైనర్ అయిన తన తల్లి పనికి వెళ్లగా ఆ సమయంలో ఆమెను నమ్మంచి మోసం చేశాడని, ఇన్నేళ్లుగా తన తల్లి మనో వేదనను అనుభవిస్తూ ఉందని, తనకు తండ్రి గుర్తింపు ఇవ్వాలని మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు బైఠాయించారు.తాను ఆయన సంతానమేనని ఇప్పుడు 20 ఏళ్లు పైబడి ఉన్నాయని.. డీఎన్ఏ పరీక్షకు సైతం సిద్ధమేనన్నాడు. ఈ విషయమై చేతబడి చేసి చంపు తానని బెదిరిస్తున్నాడని ఆరోపించాడు. చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలంటూ యువకుడు, అతడి తల్లి కలిసి ఇంటి ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని, ఇంటి వద్ద కూర్చుంటే న్యాయమెలా జరుగుతుందన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితులు పేర్కొంటున్నారు. చదవండి: ‘అంతా ఆ ఉంగరం వల్లే’.. -
‘అంతా ఆ ఉంగరం వల్లే’..
అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆ కుటుంబంలో ఆశల దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. ‘అమ్మా.. నాన్న.. ఎప్పుడొస్తారు?’ అంటూ ఆ పసికవలలు అడుగుతున్న ప్రశ్నలకు ఆ ఇల్లంతా మూగబోయింది. రూ.50 వేల విలువైన ఉంగరం కోసం సాగిన వేధింపులు, బెదిరింపులు చివరికి ఆ దంపతులను గోదావరి ప్రవాహంలోకి నెట్టేశాయి. రెండేళ్ల క్రితం తీసుకున్న చిన్న బాకీ, మానసిక ఒత్తిడి ఆ దంపతుల ప్రాణాలను బలిగొనగా, అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను అనాథలను చేసింది. ఈ విషాద ఘటన ఊరందరినీ కంటతడి పెట్టిస్తోంది.తణుకు అర్బన్ : యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి దంపతులు గోదావరిలోకి దూ కిన ఉదంతం కలకలం రేపుతోంది. ఆర్థిక సమస్య లు, ఒత్తిళ్లు, బెదిరింపులు వీరి ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది. అమ్మా.. నాన్న.. అంటూ విలపిస్తున్న పసిపిల్లలు, కుమారుడు, కోడలును పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలతో వే ల్పూరులో విషాదఛాయలు అలముకున్నాయి. వే ల్పూరుకు చెందిన దొడ్డా వెంకట ధన సాయికృష్ణ అలియాస్ డీవీడీ (32), భార్య శిరీష (28)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది.గురువారం రాత్రి వీరిద్దరూ గోదావరి దూకి ఆత్మహత్యకు యత్నించారు. వేల్పూరులో నివసిస్తున్న సాయికృష్ణ కొన్ని నెలల నుంచి భీమవరంలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. వివాహానికి ముందు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో కొంతకాలం పనిచేశాడు. స్వదేశానికి వచ్చిన తర్వా త శిరీషను వివాహం చేసుకుని కొన్నాళ్లు హైదరాబాద్లో అంబులెన్స్ డ్రైవర్గానూ జీవనం సాగించాడు. అనంతరం వేల్పూరులో రెడీమేడ్ వస్త్ర దుకాణం నిర్వహించినా వ్యాపారం లేక అప్పులపాలై దుకాణం మూతపడింది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, దుర్గ వారి ఇంటిని సైతం విక్రయించి ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తుండగా కొంతమేర రుణాల నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. సాయికృష్ణ దంపతులకు కుమారుడు, కుమార్తె (కవలలు) ఉన్నారు. హింస పెట్టి, నానా మాటలు అన్నారు ‘నేను ఒకరి వద్ద ఉంగరం తీసుకుని ఇవ్వలేకపోయాను. దీంతో వారు మమ్మల్ని హింసపెట్టి నానామాటలు అనడం, చేసిన రాద్ధాంతంతో టెన్షన్ వచ్చి ఉండలేకపోయాం. పరిస్థితులు బాగోనప్పుడు.. నానామాటలు పడటంతో ధైర్యం చాలక ఏంచేయాలో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే మేం చేసిన అప్పులు మా అ మ్మా నాన్న తీర్చారు.. మా చావుకు మా అమ్మ నాన్నలకు ఎటువంటి సంబంధం లేదు..’ – సాయికృష్ణ మాట్లాడినట్టువైరల్ అవుతున్న వాయిస్ రికార్డింగ్గోదావరిలో కొనసాగుతున్న గాలింపు యలమంచిలి: చించినాడ వద్ద వశిష్ట గోదావరిలో దొడ్డా సాయికృష్ణ, శిరీష దంపతుల కోసం శుక్రవారం పోలీసుల గాలింపు కొనసాగింది. ఎస్సై మోటూరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సభ్యులు సంయుక్తంగా స్పీడ్ బోట్లలో చించినాడ నుంచి ఏనుగువానిలంక, రామరాజులంక వైపు గాలించారు. రాత్రి 7 గంటల వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడం, మరో వైపు చీకటి పడడంతో గాలింపు ఆపివేశారు. ఆదివారం ఉదయం మళ్లీ గాలింపు కొనసాగిస్తామని ఎస్సై రాజ్కుమార్ చెప్పారు. ఉంగరం కోసం రాద్ధాంతంతోనే.. దొడ్డా వెంకటేశ్వరరావు (సాయికృష్ణ తండ్రి) తమ సమీప నివాసితుడైన రవి అనే వ్యక్తి నుంచి తీసుకున్న ఉంగరం దంపతుల ప్రాణంపైకి వచ్చిందని సాయికృష్ణ తల్లితండ్రులు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. రెండేళ్ల క్రితం రవి నుంచి తీసుకున్న ఉంగరాన్ని తమ కుమారుడు తాకట్టు పెట్టి తిరిగి ఇవ్వలేకపోయాడని, గురువారం రవి కొందరు వ్యక్తులను వెంటపెట్టుకుని వచ్చి ఉంగరం కోసం చేసిన ఒత్తిడి, రాద్ధాంతం చేశాడని అన్నారు. ఈ కారణంగానే తన కుమారుడు, కోడలు బలవన్మరణానికి పాల్పడ్డారంటూ తల్లితండ్రులు మీడియా వద్ద వాపోయారు. ముందుగా వేల్పూరులో తమ ఇంటికి వచ్చి దుర్భాషలాడారని, అనంతరం భీమవరం వెళ్లి సాయికృష్ణ, శిరీషను ఇష్టానుసారంగా మాట్లాడి దాడికి దిగబోయారని కన్నీళ్లపర్యంతమయ్యారు. పసిపిల్లలను చూసి కూడా వారికి జాలి కలగలేదని కేవలం రూ.50 వేల కోసం తమను నానా మాటలు అన్నారంటూ వాపోయారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం సాయికృష్ణ ఫ్యాన్కు ఉరేసుకుని చేసిన సెల్ఫీ వీడియో కూడా వైరల్గా మారడం తాజాగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో తేలాల్సి ఉండగా, దీనిపై ఎ టువంటి ఫిర్యాదులు అందలేదని తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: వీడియో కాల్ వైద్యానికి గర్భిణి మృతి -
ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం?
కాకినాడ క్రైం: ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనంపై వచ్చిన వ్యక్తితో నలుగురు చుట్టుముట్టారు. వారిలో ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. వారు ప్రతిదాడి చేశారు. వీరికి మిగిలిన ఇద్దరూ తోడయ్యారు. మొత్తం నలుగురూ కలసి మూకదాడికి దిగారు. అక్కడే ఉన్న చెక్కతో ఆ వ్యక్తిపై విచక్షణారహితంగా చావబాదారు. విరిగిన చెక్కలో పదునైన భాగాన్ని.. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ వ్యక్తి గొంతులో పరమ కిరాతకంగా దించేశారు. అయినా బతికేస్తాడేమోననే అనుమానంతో ఆ కర్రను బయటకు తీసి మరింత లోతుగా దించారు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మూడుసార్లు తీసి గుచ్చి, చివరిగా ఆ కర్రను బలంగా గొంతులోకి దిగ్గొట్టి క్రూరాతిక్రూరంగా హతమార్చారు. ఇదంతా మూడంటే మూడు నిమిషాల్లోనే జరిగిపోయింది. ఏదో క్రైం థ్రిల్లర్ కథలా.. సినిమాలోని క్రూర సన్నివేశంలా జరిగిన ఈ దారుణం.. ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకొనే కాకినాడ నగరం నడిబొడ్డున.. భానుగుడి సెంటర్లో.. జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరాన.. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్రెడ్డి (30) క్రూరహత్యోదంతం జిల్లాను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో పోలీసు భద్రతను ప్రశ్నార్థకం చేసింది. హతమార్చింది అందుకేనా? ఈ హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్న వ్యక్తికి రాజకీయ అండదండలున్నాయని చెబుతున్నారు. అతడి భార్య బ్యూటీషియన్గా పని చేస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని సమాచారం. ఆమెతో హతుడు సతీష్ చనువుగా ఉండేవాడని తెలుస్తోంది. అతడి స్నేహితుడు సాయికిరణ్ కూడా ఆమెపై కన్ను వేశాడని, ఆమెకు ఇష్టం లేకపోయినా దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ సతీష్కు చెప్పడంతో అతడికి, సాయికిరణ్కు మధ్య తరచుగా గొడవలు జరుగుతూండేవి. ఈ నేపథ్యంలో సాయికిరణ్ ఆ మహిళ భర్తకు సతీష్ పై లేనిపోని చాడీలు చెప్పి, ఇద్దరి మధ్య కక్షలు పెంచాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్త ఆదేశాలు, అండదండలతో సాయికిరణ్, మరో ముగ్గురు కలసి సతీష్ను ప్రణాళిక ప్రకారం అర్థరాత్రి భానుగుడి సెంటర్కు రప్పించి హతమార్చినట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన కర్రను సాయికిరణ్ అప్పటికే సమకూర్చుకున్నాడని తెలుస్తోంది. ఆ నాలుగు రోజుల్లో ఏం జరిగింది! గత నెల 8 నుంచి 12వ తేదీ మధ్య జరిగిన సంఘటనలే ఈ హత్యకు దారి తీశాయని తెలియవచ్చింది. ఆ మహిళ విషయంలో సతీష్ భార్య జయశ్రీని సాయికిరణ్ కలిశాడు. ఆ మహిళతో సతీష్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమె ఫలానా వ్యక్తి భార్య అని వెల్లడించాడు. టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడిగా చెబుతున్న ఆ వ్యక్తి అప్పటికే తన భర్త సతీష్ ద్వారా జయశ్రీకి తెలుసు. గర్భిణిగా ఉన్న ఆమె పుట్టింట్లో ఉండగా సాయికిరణ్, ఆ వ్యక్తితో జయశ్రీని కలిశాడు. ఆమె భర్తను చంపేస్తానని చెప్పాడు. తనను, కడుపులో ఉన్న బిడ్డను చూసి తన భర్తను విడిచిపెట్టాలని, సతీష్ ఆ మహిళ జోలికి వెళ్లకుండా చూసుకుంటానని ఆమె చెప్పింది. వారు వెళ్లిన తర్వాత రోజు ఆ మహిళ విషయమై సతీష్ను జయశ్రీ నిలదీసింది. ఆమెతో మాట్లాడుతున్నానని ఒప్పుకున్న అతడు.. నిండుగర్భిణిగా ఉన్న తన భార్యకు ఈ విషయం చెప్పిన సాయికిరణ్పై ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండగా, మంగళవారం అర్ధరాత్రి సాయికిరణ్, సతీష్లు ఫోనులో గొడవ పడ్డారు. దమ్ముంటే రా అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన సతీష్ తన ద్విచక్ర వాహనంపై కిరణ్ ఉన్న భానుగుడి జంక్షన్కు రాత్రి 1.45 సమయంలో వెళ్లాడు. ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం అతడిని సాయికిరణ్, అనుచరుల హతమార్చారు. సతీష్కు జయశ్రీతో ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరో నెల గర్భిణి. పొంతన లేకుండా.. ఈ హత్యకు సంబంధించి పోలీసులు చెబుతున్న కారణాలకు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తునికి చెందిన ఓ యువతిని ఇద్దరూ ప్రేమించి గొడవ పడగా అది హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, అది పోలీసుల కల్పిస్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిద్రలో నైట్ డ్యూటీ కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఈ హత్య నేపథ్యంలో పోలీసుల రాత్రి నిఘా పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. హత్య జరిగిన భానుగుడి సెంటర్ జిల్లా పోలీసు కార్యాలయానికి 200 మీటర్ల లోపే ఉంది. హత్య సమయంలో అరగంట పైగా అక్కడ అలజడి చోటు చేసుకుంది. అయినప్పటికీ నైట్ బీట్లు అటువైపు కనీసం దృష్టి పెట్టలేకపోయాయి. పోనీ కూతవేటు దూరంలోనే ఉన్న కమాండ్ కంట్రోల్ సిబ్బంది కూడా సీసీ కెమెరాల ద్వారా ఏమీ గమనించలేదు. రాత్రి వేళ డ్యూటీల్లో ఉన్న వారు గుర్రు పెట్టి నిద్రపోవడం వల్లనే దీనిని గమనించలేదనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారే కనుక మేల్కొని ఉండి, ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గమనించి ఉంటే కనీసం సైరన్ మోగించే అవకాశం ఉండేది. అప్పుడైనా ఈ నేరం ఆగి ఉండేదని పలువురు అంటున్నారు. పోలీసులపై టీడీపీ నేత ఒత్తిళ్లు! రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం రేపిన ఈ హత్యపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. సతష్ హత్యను నగరంలోని ఓ ముఖ్య టీడీపీ నేత అనుచరుడే చేయించాడని ప్రచారం జరుగుతోంది. అతడు సెటిల్మెంట్లు, దందాలతో పేట్రేగిపోతూ నగరంలో గూండాగిరి చేస్తూంటాడని, అతడే ఈ హత్య చేయించాడని సతీష్ కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. అయితే, తమ నోటి వెంట అతడి పేరు రానివ్వకుండా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సతీష్ హత్య రాత్రి 2 గంటల సమయంలో జరిగితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీడీపీ నాయకుడి అనుచరుడు తనకు ఒంట్లో బాగోలేదంటూ సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో 3 గంటల ప్రాంతంలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ కేసు నుంచి తన అనుచరుడిని తప్పించాలంటూ ఆ టీడీపీ నేత ఉన్నతాధికారుల ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నలుగురు దుర్మార్గులూ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు.చదవండి: సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్ను ఈడ్చుకెళ్లిన లారీ -
తేజ.. లేమ్మా.. నా పట్టీలు ఇస్తాను.. తమ్ముడికి రాఖీ కడుదువు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ జయప్రకాష్ నగర్కు చెందిన పడికిటి లక్ష్మీతేజ(30) హైదరాబాద్లో అమెజాన్ కంపెనీలో ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆమెకు తండ్రి రామ్ప్రసాద్, తల్లి కవిత, తమ్ముడు దేవివరప్రసాద్ ఉన్నారు. మిలాద్ ఉన్నబీ, రాఖీ, వీకెండ్ వరుస సెలవులు కావడంతో ఆమె తమ్ముడికి రాఖీ కట్టేందుకు విజయవాడకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఆనందంగా బయలుదేరారు. మంగళవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి బుధవారం ఉదయం ఆరు గంటలకల్లా విజయవాడలో ఉంటానని సంతోషంగా చెప్పింది. కూతురి కోసం ఏడు గంటల వరకు వేచి చూసిన తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో ఏం జరిగిందో తెలీక కంగారు పడ్డారు. ఇంతలో కోదాడ సమీపంలో ప్రమాదం జరిగిందని టీవీలో వార్తలు ప్రసారం కావడం, మృతుల జాబితాలో లక్ష్మీతేజ పేరు ఉండడంతో తండ్రి రాంప్రసాద్ హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే లక్ష్మితేజ మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురిలో ఉంచారు. రాత్రి ఫోన్ చేసి ఉదయానికి వస్తాను నాన్న అని చెప్పిన నా కూతురిని ఇలా చూస్తానని అనుకోలేదని రాంప్రసాద్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి తీసుకొచ్చిన కూతురు మృతదేహంపై పడి తల్లి కవిత విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇంటికి వచ్చినప్పుడల్లా నీ కాళ్ల పట్టీలు కావాలమ్మా.. అని అడిగేదానివి కదా.. లే అమ్మా పట్టీలు ఇస్తాను. తమ్ముడికి రాఖీ కడుదువుగానీ అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. గత రెండేళ్ల నుంచి లక్ష్మితేజకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని, ఈ ఏడాది ఎలాగైనా కల్యాణం జరిపించాలని అనుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది.చదవండి: ఉద్యోగం వస్తుందన్న ఆనందం అంతలోనే ఆవిరి... -
ఏఈ నూకరాజు కుటుంబం కేసులో మరో మలుపు
సాక్షి, కాకినాడ జిల్లా: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ వేధింపులు కారణం కాదని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డిని సాధిక్ చంపలేదన్నారు. ‘‘సౌజన్య రెండు సార్లు మా ఇంటికొచ్చింది. సాధిక్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. ఈ ప్రతిపాదనకు మా కుటుంబం ఒప్పుకోలేదు. జగదీశ్వరరెడ్డి మరణించాక తనను పెళ్లి చేసుకోవాలని సౌజన్య.. సాధిక్ను ఒత్తిడి చేసింది’’ అంటూ సాధిక్ ఖాన్ తల్లి చెప్పుకొచ్చారు.‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 14న సౌజన్య ఇంటికి రమ్మని సాధిక్ను పిలిచింది. అక్కడ సాధిక్పై జగదీశ్వర్రెడ్డి అతని మనుషులు దాడి చేసి బంధించారు. దీంతో వంటగదిలో కత్తితో బెదిరించి సాధిక్ అక్కడ నుండి పారిపోయాడు. జగదీశ్వరరెడ్డితో పెళ్లి కాకపొతే సౌజన్యను సాధిక్ ఇచ్చి వివాహం చేసేవాడినని నూకరాజు మా ఇంటికి వచ్చి చెప్పాడు. ఈ రిలేషనల్ మంచిది కాదని సాధిక్ను మందలించాను. తన భర్త పట్టించుకోవడం లేదని సాధిక్తో సౌజన్య రిలేషన్ నడిపింది. సౌజన్య కొడుకు సాధిక్ను అబ్బు అని.. తన తండ్రిని ఇడియట్ అని పిలిచేవాడు. రోజు ఫోన్లో మా అబ్బాయి చెప్పే కథలు విని సౌజన్య కొడుకు పడుకునేవాడు.‘‘మా ఇంటికి వచ్చి తెలుగు ఖురాన్, బుర్కా కావాలని సౌజన్య అడిగింది. చనిపోయిన రోజు సాయంత్రం 5:30కి సాధిక్కు సౌజన్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. తన స్టూడెంట్స్ కేరళలో ఈవెంట్స్ వెళ్లాలని.. రావడం కుదరదని చెప్పి సాధిక్ అకాడమీకి వెళ్ళిపోయాడు. నూకరాజు, జగదీశ్వర రెడ్డి ఆస్తులు, బంగారం మా వద్ద లేదు. మా కుటుంబం బ్యాంక్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చేశాము.’’ అని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు.. -
కొడుకు వరుసైన వ్యక్తితో భార్య అక్రమ సంబంధం
యాదాద్రి భువనగిరి జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని వరుసకు కొడుకైన వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య(38), శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు పంతంగి గ్రామ శివారులోని శనిగలగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు.శారదకు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుసుకున్న భర్త దానయ్య ఆమెను పలుమార్లు మందలించాడు. శారద గతంలో పంతంగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి వెళ్లిపోయి తిరిగి భర్త వద్దకు వచ్చింది. ఇటీవల దానయ్య సొంత అన్న కుమారుడు రాపోలు శివతో శారద వివాహేతర సంబంధం పెట్టుకుంది. దానయ్యకు ఈ విషయం తెలియడంతో ఇద్దరిని మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన రాపోలు శివ తన బాబాయి అయిన దానయ్యను చంపుతానంటూ గతంలో పలుమార్లు బెదిరించాడు. దురాజ్పల్లికి వెళ్లాల్సి ఉండగా..దానయ్య ఆదివారం సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లికి వెళ్లాల్సి ఉండగా.. భార్య శారద అతడిని దురాజ్పల్లికి వెళ్లకుండా ఆపి పొలం వద్దకు తీసుకెళ్లింది. కొంతసేపటి తర్వాత తన ప్రియుడు రాపోలు శివను పొలం వద్దకు పిలిపించుకుంది. శారద, శివ ఏకాంతంగా ఉన్న సమయంలో దానయ్య గమనించి శివతో గొడవపడ్డాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో దానయ్య కిందపడిపోగా అతడి కాళ్లను శారద బిగ్గరగా పట్టుకుంది. శివ అక్కడే ఉన్న బండరాళ్లతో దానయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో..హత్య చేసిన తర్వాత శారద పక్క పొలంలో పనిచేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి తన భర్త కనిపించడంలేదని చెప్పింది. చుట్టుపక్కల వెతకగా దానయ్య రక్తపు మడుగులో కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శారద ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజం ఒప్పుకుంది. అప్పటికే రాపోలు శివ సెల్ఫోన్లు, తన దుస్తులను తీసుకొని పారిపోయాడు. వాటిని చిట్యాల మండలం గుండ్రాంపల్లి చెరువులో పడేయగా.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పంతంగి టోల్ప్లాజా వద్ద పోలీసులకు శివ పట్టుబడ్డాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి భార్యకు చాలా మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆమెకు సోషల్ మీడియాలో రకరకాల అకౌంట్లు ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు ఆమెతో సంబంధాలు కలిగి ఉన్నారని డీఎస్పీ తెలిపారు. -
మధ్యాహ్న భోజనం వికటించి 27 మంది విద్యార్థులకు అస్వస్థత!
కోటా: రాజస్థాన్లోని కోటా జిల్లా పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం పాఠశాలలో భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు, తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు పలువురు చిన్నారులను స్థానిక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా, మరికొందరి కోసం పాఠశాల వద్దకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించారు. VIDEO | Rajasthan: More than 27 students fell ill after allegedly consuming the mid-day meal provided at a Government Upper Primary School in the Ranpur police station area of Kota on Monday. The students from 1-8 classes suffered from nausea, vomiting, stomach aches, and… pic.twitter.com/QxUpUx6sYf— Press Trust of India (@PTI_News) August 24, 2026ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోటా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రూప్ సింగ్ మీనా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సుమారు 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, 10 నుంచి 12 మందిని మెడికల్ కాలేజీకి తరలించారని, అందులో నలుగురిని చేర్చుకుని మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లలందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిరంతర పర్యవేక్షణలో ఉంచామని అధికారులు తెలిపారు.రాష్ట్ర మంత్రి మదన్ దిలావర్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. చిన్నారులందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఆహార నాణ్యతపై విచారణకు ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. వీరి అనారోగ్యానికి భోజనమే కారణమా కాదా అన్నది దర్యాప్తు తర్వాత తేలనుంది. ఇటీవల బిహార్లోని నలంద జిల్లాలో ఉప్పుకు బదులు డిటర్జెంట్ పౌడర్ కలపడంతో 34 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరవకముందే ఈ ఉదంతం చోటుచేసుకోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: అంటార్కిటికాకు ఫైబర్ నెట్.. షాకిస్తున్న భారీ ప్లాన్! -
మీనా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలోకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యం కాగా, ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇదిలావుండగా మీనా మృతదేహం బాగా పాడవడంతో కుటుంబీకులు సొంతూరు కాకినాడకు తీసుకెళ్లకుండా, ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంబాలచెరువు (రాజమహేంద్రవరం) -
అసలు ఆ రాత్రికి ఏ జరిగింది? ఇప్పటికీ మిస్టరీగానే ఆ ఘటన!
1959 ఫిబ్రవరి ఒకటో తేదీ... రష్యాలోని యూరల్ పర్వత ప్రాంతం– సంధ్యకాంతుల్లో ఆ మంచు పర్వతం శోభాయమానంగా కనిపిస్తోంది. అప్పుడే అక్కడకు ఓ పర్వతారోహకుల బృందం వచ్చింది. ‘‘ఈ రాత్రికి ఇక్కడ బస చేద్దాం’’ అని 23 ఏళ్ల ఇగోర్ డియాట్లోవ్ తన సహచరులను ఉద్దేశించి అనడంతో అందరూ టెంట్ వేయడానికి ఉపక్రమించారు.గంటలు గడిచాయి. అందరూ గాఢనిద్రలోకి జారుకున్నారు. చుట్టూ తెల్లటి మంచుకొండలు తప్ప ఎలాంటి అలికిడీ లేదు. బయట ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలకు పడిపోయి భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అంతలోనే ఏమైందో తెలియదు– టెంటులో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. లోపలున్నవారు విపరీతమైన భయంతో టెంట్ను కత్తితో చీల్చుకుని బయటకు వచ్చారు. పెద్దగా అరుస్తూ ప్రాణభయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. ఆ రాత్రి వారి జీవితంలో కాళరాత్రిగా మిగిలిపోయింది.ఆ భయానక రాత్రికి ఎనిమిది రోజుల ముందు– అంటే, 1959 జనవరి 23న రష్యాలోని యూరల్ పాలిటెక్నిక్ ఇన్ స్టిట్యూట్కు చెందిన ఎనిమిది మంది యువకులు, ఇద్దరు యువతులు ‘ఓటోర్టెన్’ అనే ప్రమాదకరమైన మంచు పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరారు. అనారోగ్యం కారణంగా ‘యూరీ యుడిన్’ అనే యువకుడు వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.మిగిలిన తొమ్మిదిమంది ఫిబ్రవరి 1న ‘ఖోలాట్ స్యాఖ్ల్’ అనే కొండపైకి చేరుకుని అక్కడ టెంట్ వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికి తిరిగి రావాలి. కానీ ఫిబ్రవరి 20 వచ్చినా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో కుటుంబసభ్యుల విన్నపం మేరకు రష్యా ప్రభుత్వం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఫిబ్రవరి 26న సహాయక బృందాలు ఆ కొండ వద్దకు చేరుకుని అక్కడి దృశ్యాలు చూసి షాక్ తిన్నాయి.టెంట్ను లోపల నుంచి కోసిన ఆనవాళ్లు కనిపించాయి. కానీ చుట్టుపక్కల ఎవరూ లేరు. టెంట్కు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టు కింద ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వారి ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. మరికొంత దూరంలో డియాట్లోవ్ సహా మరో ముగ్గురి శవాలు మంచులో గడ్డకట్టి కనిపించాయి. మిగిలిన నలుగురి మృతదేహాలు మే నెలలో కరిగిన మంచు ప్రవాహంలో దొరికాయి. వీరిలో కొందరి పక్కటెముకలు విరిగిపోగా, ఒకరి పుర్రె పగిలిపోయింది. ల్యూడ్మిలా దుబినినా అనే యువతి నాలుక, కళ్లు కనిపించలేదు. మరొకరి కనుగుడ్లు లేవు. వారి ఒంటిపై అంతటి గాయాలు ఉన్నప్పటికీ, బయటి నుంచి దెబ్బలు తగిలిన గుర్తులు లేవు. కొందరి దుస్తులపై రేడియోయాక్టివ్ ఆనవాళ్లు కూడా కనిపించాయి.ఈ మరణాలపై దశాబ్దాల పాటు రకరకాల ప్రచారాలు సాగాయి. ఆ రాత్రి ఆకాశంలో వింత కాంతులు కనిపించాయని స్థానికులు చెప్పడంతో ఏలియన్స్ లేదా యూఎఫ్ఓల దాడే కారణమని కొందరు నమ్మారు. రష్యా మిలిటరీ అక్కడ రేడియేషన్ ఆయుధాలను పరీక్షించిందని, అది వికటించి వీరు చనిపోయారని ప్రచారం జరిగింది. ఆ ప్రాంతంలో ఉండే ‘మాన్సీ’ అనే గిరిజన తెగకు చెందిన వ్యక్తులు తమ పవిత్ర స్థలంలోకి వచ్చినందుకు వీరిని హత్య చేశారని అనుకున్నారు.భారీ ఆకారం కలిగిన యతి అనే మంచు మనిషి దాడి చేయడం వల్లే వారికి ఎముకలు విరిగిపోయాయని మరో ఊహాగానం సాగింది. కానీ వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లభించలేదు. చివరకు ప్రభుత్వం– ‘నిరోధించలేని ఒక అపరిమితమైన ప్రకృతి శక్తి’ వల్ల వీరు చనిపోయారని 1959లోనే ఆ కేసును మూసివేసింది. అనంతరం ఆ ప్రాంతం ఆ గ్రూప్ లీడర్ పేరుతో ‘డియాట్లోవ్ పాస్’గా ప్రసిద్ధికెక్కింది.మిస్టరీగా మిగిలిపోయిన ఆ మరణాలపై 2021లో స్విట్జర్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు జోహన్ గౌమే, అలెగ్జాండర్ పుజ్రిన్ కలిసి కంప్యూటర్ మోడళ్లు, స్నో ఫిజిక్స్ ఆధారంగా అధ్యయనం చేసి, శాస్త్రీయ వివరణ ఇచ్చారు. ఆ రాత్రి వీచిన బలమైన గాలుల వల్ల ఒక భారీ మంచుపలక టెంట్పై పడిందని, దీంతో అందులో ఉన్నవారి పక్కటెముకలు విరిగిపోయాయని అంచనా వేశారు.మంచు పలకలు పడతాయనే భయంతో వారు టెంట్ను లోపలి నుంచి కోసుకుని బయటకు పరిగెత్తారని, మైనస్ 30 డిగ్రీల చలిలో ‘హైపోథెర్మియా’ (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం)తో చనిపోయారని వివరించారు. మృతదేహాలు చాలారోజులు మంచులో ఉండటంతో పక్షులు, అడవి జంతువులు కళ్లు, నాలుకలను తినేసి ఉంటాయని పేర్కొన్నారు. అందులో కొందరు గతంలో రేడియేషన్ కు గురయ్యే వాతావరణంలో ఉన్నందున వారి దుస్తులపై రేడియేషన్ ఆనవాళ్లు కనిపించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వివరణపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఇంతకీ అసలా రాత్రి ఏం జరిగింది? వారంతా ఎలా చనిపోయారు... అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం నేటికీ ఆ యూరల్ పర్వతాల మంచు పొరల కిందే నిక్షిప్తమై ఉండిపోయాయి.- సత్యకిశోర్ కొండ్రెడ్డి -
బ్యాంక్ ఉద్యోగిని సుప్రియ కాలువలో శవమై తేలింది
తూర్పుగోదావరి: స్థానిక యూనియన్ బ్యాంకులో రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఆర్డీఓ)గా పనిచేస్తున్న గానుగపెంట సుప్రియ (28) మృతదేహం గురువారం లభ్యమైంది. ఈ నెల 17న బ్యాంకులో మొబైల్ ఫోన్, చొప్పెల్ల లాకుల వద్ద తన స్కూటర్, తాళం, పాదరక్షలు, కళ్లజోడు వదిలి అదృశ్యమైన సుప్రియ నాలుగు రోజుల అనంతరం తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని కాలేరు వద్ద కోరంగి పంట కాలువలో శవమై తేలింది. ఆమె అదృశ్యమైనప్పటి నుంచి స్థానిక పోలీసులు ఎన్ని విధాల గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని కడప జిల్లాలోని సింగారెడ్డిపల్లిలోని కుటుంబ సభ్యులకు బ్యాంకు అధికారులకు తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై జి.నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బ్రాంచిలో చేరిన మూడు నెలల్లోనే.. శవమై సుప్రియ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట యూనియన్ బ్యాంకు శాఖ నుంచి ఆలమూరు శాఖకు వచ్చిన మూడు నెలల్లోనే తూర్పు డెల్టా ప్రధాన కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అవసరమైతే తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదని సహోద్యోగులు తెలిపారు. ఆమె తన తల్లితో కలిసి స్థానిక పోలీసు స్టేషన్ ఎదుటి వీధిలో నివసిస్తున్నారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. ఆమె మృతితో సహోద్యోగులు విచారం వ్యక్తం చేశారు. చదవండి: వాషింగ్మిషన్ ప్లగ్ తీసేందుకు వెళ్లి.. -
మీరట్లో ఉద్రిక్తత.. హిందూ యువతితో ఇమామ్ కుమారుడు పరార్!
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించగా, కచేరీ మసీదు ఇమామ్ (మౌలానా) మన్సూర్ కుమారుడు ఫైజ్ ఆమెను మభ్యపెట్టి తన వెంట తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. యువతి స్నేహితురాలి ద్వారా ఈ సమాచారం బయటకు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.అనంతరం అఖిల భారత హిందూ సురక్షా సంఘటన్ కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబీకులు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేసే అవకాశం ఉందని, ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: జాబిల్లిపై రాకెట్ క్రాష్.. భారీ గుంతను గుర్తించిన నాసా! -
భర్త బంధువుతో భార్య వివాహేతర సంబంధం.!
పల్నాడు: విడాకులు తీసుకోకుండానే తన భార్య రెండో పెళ్లి చేసుకుందని మైదుకూరు పట్టణంలోని రాజీవ్ గాంధీ నగర్కు చెందిన కాకిమాను వెంకట నరేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. రాజీవ్ గాంధీ నగర్కు చెందిన రెడ్డప్ప కుమారుడు వెంకట నరేష్కు పల్నాడు జిల్లా చిన్నకొండాయపల్లెకు చెందిన తురుమెల్ల దుర్గారావు కుమార్తె ప్రవల్లికతో 2022 ఆగస్టు 13న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొన్నాళ్లకు నరేష్ భార్య రాజీవ్ గాంధీ నగర్కే చెందిన నరేష్ బంధువు అయిన తిరువాయిపాటి సందీప్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయమై మామ రెడ్డప్ప, భర్త నరేష్.. ప్రవల్లికను మందలించారు. అది మనసులో పెట్టుకొని నరేష్తో, అత్తమామలతో ఆమె చీటికిమాటికి గొడవపడేది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ప్రవల్లిక కాపురం చేయకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన భార్య తన బంధువైన సందీప్ను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో నరేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనస్పర్థలతో తాము దూరంగా ఉంటున్నామని, విడాకులు తీసుకోలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేష్ పేర్కొన్నారు. చట్టపరంగా విడాకులు తీసుకోకుండా, తన అనుమతి లేకుండా తన భార్య రెండో వివాహం చేసుకుందని తెలిపారు. తన భార్యపై, ఆమెను వివాహం చేసుకున్న సందీప్పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
డాక్టర్ ప్రియాంక కేసులో మరో మలుపు
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక మృతి ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తునకు తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. దీంతో డాక్టర్ ప్రియాంక కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక ప్రసాదిత్య మాల్ వద్ద ఘటన జరిగిన తేదీ నుంచి విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చే వరకు గడిచిన సమయం ఏమిటి? ఆ మధ్యలో అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఎప్పుడు చేరింది? చేరిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలను సేకరించనున్నారు. అదేవిధంగా ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీ, మృతురాలి కాల్స్ డేటా, ఆమెతో చివరిగా మాట్లాడిన వ్యక్తులు, నిందితుల కదలికలు, వాహనాల ప్రయాణ వివరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్ట్మార్టం నివేదికతో పాటు ఇప్పటివరకు సేకరించిన ప్రతి ఆధారాన్ని విచారణ అధికారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసలు పరీక్ష ఇక్కడే.. ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారాన్ని మాత్రమే ధ్రువీకరించడమా? లేకుంటే ఘటనకు ముందు నుంచి, ఘటన జరిగిన సమయం నుంచి, ఆ తర్వాత విషయం వెలుగులోకి వచ్చే వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని స్వతంత్రంగా పరిశీలించడమా? అనేది కీలకం. ఈ విచారణలో ప్రతి అనుమానానికి ఆధారాలతో సమాధానం లభిస్తేనే ప్రజల్లో నెలకొన్న సందేహాలు తొలగుతాయి. ఎవరి తప్పు ఉన్నా బయటపెట్టడం, దర్యాప్తులో ఎక్కడైనా లోపం జరిగి ఉంటే దానిని కూడా స్పష్టంగా వెల్లడించడం ఈ విచారణకు అసలు సవాల్. ఈ విచారణలో భాగంగా కేసు ఫైల్స్ను పాటిల్కు ప్రకాశ్నగర్ పోలీసులు అప్పగించారు. -
కలకలం రేపుతున్న నూకంరాజు లెటర్.. పోలీసుల అరా
పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం.. దానికి కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ రాయడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన పిఠాపురంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నూకరాజుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆనందంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి వక్రించింది. కుమారుడు కొన్నేళ్ల క్రితమే మృతి చెందడంతో విషాదం అలుముకుంది. దాని నుంచి తేరుకుని కుమార్తెకు జగదీశ్వరరావుతో పెళ్లి చేయగా, పండంటి మనువడు కార్తికేయరెడ్డి పుట్టడంతో వారింట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. కుమార్తెను అల్లుడిని మనువడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, కొడుకు చనిపోయిన లోటును మర్చిపోయి ఆనందంగా ఉంటున్న వారి కుటుంబంలోకి షేక్ సాధిక్ఖాన్ అనే వ్యక్తి వేధింపులు అల్లుడిని కూడా పొట్టన పెట్టుకున్నట్లు చెబుతున్నారు. గత జూలైలో అల్లుడు చనిపోవడం, షేక్ షాధిక్ఖాన్ వేధింపులు రోజురోజుకూ రెట్టింపు కావడంతో కుటుంబం అంతా ప్రతి రోజూ నరకం అనుభవించేదని బంధువులు అంటున్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో (పంచాయతీరాజ్ ఏఈగా) ఉంటూ కంటికి రెప్పలా చూసుకునే కన్న కూతురికి ఎదురైన వేధింపుల నుంచి ఆమెను కాపాడలేని నిస్సాయస్థితిలో సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న భయంతో తండ్రిగా నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనువడు కార్తికేయరెడ్డి బలవన్మరణానికి తెగించేలా చేసిందంటున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరిలోకి దూకిన నూకరాజు, ఆయన భార్య, కుమార్తె గల్లంతు కావడం.. ఆయన మనువడికి మాత్రం ఈత రావడంతో ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇంకా సూసైడ్ నోట్లు ఉన్నాయా! నూకరాజుతో పాటు ఆయన కుమార్తె, భార్య సైతం తాము చనిపోతున్నట్లు దానికి కారణాలను తెలుపుతూ మరో రెండు సూసైడ్ నోట్లు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అవి బయటపడలేదంటున్నారు. వారు కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ లెటర్లు రాసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు వారు రాసినట్లు చెబుతున్న సూసైడ్నోట్లు బయటపడలేదు. అటువంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దిగ్భ్రాంతిలో పిఠాపురం పిఠాపురంలో పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తను పిఠాపురంలో సహచర ఉద్యోగులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు జీరి్ణంచుకోలేక పోతున్నారు. అందరితో కలుపుగోరుతనంగా ఉంటూ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుపోయే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా పేరున్న నూకరాజు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలియడంతో పిఠాపురంలో నేతలు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 12 ఏళ్లుగా ఒకేచోట అదీ పిఠాపురంలో ఆయన పని చేస్తున్నారంటే ఆయన మంచితనమే ఇక్కడ ఇంతకాలం పనిచేసేలా చేసిందని సహచర ఉద్యోగులు చెబుతున్నారు. పిఠాపురంలో పోలీసుల విచారణ పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో ఏఈగా పని చేస్తున్న నూకరాజు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కార్యాలయంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఆత్మహత్యకు సూసైడ్ నోట్లో రాసిన కారణంతో పాటు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆయన పని చేసేటప్పుడు ఎలా ఉండేవారు, ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో సహచర ఉద్యోగులను అడిగి వివరాలు సేకరించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు తీసుకున్నారు.గంటన్నరకు పైగా ఈతకొట్టి..కారులో ఊరికి వెళుతున్నామని బయలుదేరాం. చుట్టాలింటికి అనుకున్నాను. కానీ రాజమహేంద్రవరం బ్రిడ్జిపై కారు ఆపి అందరం దిగాం. నేను చూస్తుండగానే మా తాత, అమ్మమ్మ గోదావరిలోకి దూకేశారు. వారి వెనుక మా అమ్మ నా చేయి పట్టుకుని దూకేసింది. కానీ నేను బ్రిడ్జి రెయిలింగ్ పట్టుకుని ఉండిపోయాను. కానీ కొంతసేపటికి చేయిజారి పోయి గోదావరిలో పడిపోయాను. నాకు ఈత రావడం వల్ల సుమారు గంటన్నరకు పైగా కిలోమీటరు దూరం వరకు ఈత కొడుతూ పైకి తేలాను. ఇంతలో ఒక బోటు వచ్చి, నన్ను కాపాడిందని మృత్యుంజయుడిగా బయటపడిన కార్తికేయరెడ్డి చెబుతున్న మాటలు విన్న వారిని కలిచివేశాయి. -
కారు కాలువలో పడి ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సంచలన నిజాలు
-
ఎందుకు చంపినవారిని కాపాడుతున్నారు? ప్రియాంక ఆత్మకు శాంతి చేకూర్చాలంటే...
-
ఆటోపై కుక్క మూత్రం పోసిందని..
ఖమ్మం క్రైం: ఆటోపై కుక్క మూత్ర విసర్జన చేసిందనే కారణంతో మొదలైన వివాదం తీవ్రరూపం దాల్చగా ఓ యువకుడి మృతికి దారి తీసింది. అయితే, ఘర్షణ పడిన ఇద్దరి మధ్య పాత ఘర్షణలు ఉండడం గొడవ పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన కుటుంబాలుఖమ్మం రూరల్ మండలం పోలేపల్లికి చెందిన ఉండేటి ఏసు – నాగమణి దంపతులకు కుమారుడు శ్రీనాధ్ అలియాస్ పండు(24), కుమార్తె ఉన్నారు. శ్రీనాధ్ చిన్నప్పటి నుంచి త్రీటౌన్ ప్రాంతంలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో అమ్మమ్మ వెంకటమ్మ, మేనమామ రాజు వద్ద ఉంటూ ఫ్లెక్సీ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు టేకులపల్లిలోని డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్నారు. ఇక రంగనాయకుల గుట్ట వద్దే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన వేముల యల్లమ్మ తన కుమారుడైన మధుతో కలిసి కూలీ పనులు చేస్తూ అద్దె ఇంట్లో జీవిస్తోంది. కాగా, శ్రీనాధ్ – మధుకు మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈక్రమాన గురువారం రాత్రి 11గంటలు దాటాక మ«ధు తన పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లగా శ్రీనాధ్, ఆయన స్నేహితుడు వీరేశ్తో కలిసి ఆటోలో కూర్చున్నారు. ఈమేరకు కుక్క వారు కూర్చున్న ఆటోపై మూత్రవిసర్జన చేయడమే కాక చీకట్లో ఉన్న శ్రీనాధ్, ఆయన స్నేహితుడిని చూసి మొరిగింది. దీంతో కావాలనే మధు తమపై కుక్కను ఉసిగొల్పాడని భావించి వాగ్వావాదానికి దిగారు. ఈక్రమాన ‘కుక్కను కట్టేసి వచ్చి సంగతి చూస్తా’ అంటూ మధు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి శ్రీనాధ్, వీరేశ్ ఆయన ఇంటికి వెళ్లి గొడవ పడుతూ కర్రలతో కొట్టుకున్నారు. దీంతో క్షణికావేశంతో మధు ఇంట్లోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి శ్రీనాధ్ను పలుమార్లు పొడవగా తీవ్ర రక్తస్రావంతో ఆయన సమీపంలోని డ్రెయినేజీలో పడి అపస్మారక స్థితికి చేరాడు. ఈలోగా శ్రీనాధ్ అమ్మమ్మ, మేనమామ చేరుకుని పెద్దాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.పోలీసుల అదుపులో నిందితుడు?ఘటన సమాచారం అందుకున్న నగర ఏసీపీ రమణమూర్తి, త్రీటౌన్ సీఐ మోహన్బాబు, సిబ్బంది వచ్చేసరికి మధు పారిపోయాడు. కాగా, శ్రీనాధ్ మృతదేహంపై ఏడు కత్తిపోట్లు ఉండగా, పేగులు సైతం బయటకు రావడంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని మార్చురీకి తరలించగా స్నేహితులు భారీగా తరలివచ్చారు. అలాగే, కాంగ్రెస్ నాయకులు రుద్రగాని ఉపేందర్, నల్లపు శ్రీను ఆయన కుటుంబీకులను పరామర్శించారు. మూడేళ్ల పంపింగ్ వెల్రోడ్డులో జరిగిన ఘర్షణలో సాయి అనే వ్యక్తి కత్తిపోట్లతో మృతి చెందా డు. మళ్లీ ఇప్పుడు తరహా గొడవ జరగడం గమనార్హం. కాగా, పరారీలో ఉన్న మధును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క పోసుమార్టం అనంతరం శ్రీనాధ్ మృతదేహాన్ని రంగనాయకుల గుట్ట వద్ద ఇంటికి తీసుకొచ్చాక స్వగ్రామమైన పోలేపల్లికి తీసుకెళ్లారు. ఈక్రమాన పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
కలియుగ పతివ్రత.. ఇలాంటి రాజకీయాలు చూసి ఒక మహిళగా సిగ్గుపడుతున్నా
-
పోలీసులే దొంగలు! విరూపాక్షి ఇంట్లో సీసీ ఫుటేజీ... సంచలన నిజాలు బయటపెట్టిన జగన్
-
మోతె దంపతుల కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, సూర్యాపేట: మోతె మండల కేంద్రంలో దంపతుల హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ షరీఫ్తో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు బూబాతో షరీఫ్కు వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. మరో మహిళతోనూ షరీఫ్కు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మరో మహిళతో సంబంధంపై షరీఫ్ను బూబా నిలదీసింది. కొంతకాలంగా బూబా, షరీఫ్ మధ్య గొడవ జరుగుతుంది.ఓ నిర్మానుష్య ప్రాంతానికి షరీఫ్తో పాటు బూబా వెళ్లింది. మాటామాటా పెరిగి బూబాను షరీఫ్ హత్య చేశాడు. బూబాను హత్య చేసేందుకు షరీఫ్కు సుందరయ్య సహకరించాడు. అదే సమయంలో విషయం తెలుసుకుని ఘటనాస్థలికి వెళ్లిన బూబా భర్తను సైతం కొట్టి చంపిన కానిస్టేబుల్ షరీఫ్.. హత్యానంతరం దంపతుల డెడ్బాడీలను పాతిపెట్టాడు.దంపతులను హత్య చేసిన తర్వాత మోతె నుంచి సూర్యాపేట వెళ్లిపోయిన కానిస్టేబుల్ షరీఫ్.. బుధవారం యథావిధిగా విధులకు హాజరయ్యాడు. ఘటనా స్థలంలో మృతదేహాలను వెలికితీసే సమయంలో అక్కడే విధుల్లో పాల్గొన్న షరీఫ్.. తనకేం తెలియదన్నట్లు అమాయకంగా ప్రవర్తించారు. స్థానికులు.. ఘటనా స్థలంలోకి వస్తున్న సమయంలో ఆధారాలు చెదిరిపోతాయంటూ అరుస్తూ షరీఫ్ ఏమీ తెలియనట్టు నటించాడు.అయితే, ఈ కేసులో సీసీ ఫుటేజ్ నిందితులను పట్టించింది. సుందరయ్య గుంతను పూడ్చేందుకు పార తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సుందరయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనే ఓసారి బూబా హత్యకు షరీఫ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. షరీఫ్ చంపిన బూబా వయస్సు 42 సంవత్సరాలు కాగా, హత్య చేసిన కానిస్టేబుల్ షరీఫ్ వయస్సు 26 సంవత్సరాలు. -
ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!
అనంతపురం సెంట్రల్: ఓ మ్యాట్రిమోనీ ద్వారా వారిద్దరి మనసులు కలిశాయి. కొన్ని రోజులకే వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఏమైందో తెలియదు కానీ పెళ్లైన నెలరోజులకే భర్త కాలయముడిగా మారి భార్యను కడతేర్చాడు. పోలీసుల కథనం మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంట గ్రామానికి చెందిన మహేష్ గుంటూరుకు చెందిన శాంతి (26)కి మధ్య ఓ మ్యాట్రిమొనీ వెబ్సైట్ ద్వారా పరిచయం కుదిరి మనసులు కలిశాయి. నెలరోజుల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. పెళ్లైన తర్వాత మహేష్ శాంతిలు అనంతపురం నగరంలోని యల్లమ్మకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. శాంతి ఇంట్లోనే ఉంటుండగా, మహేష్ ఓ ఆటో తీసుకొని పాల ప్యాకెట్ల వ్యాపారం చేసేవాడు. ఏమైందో తెలియదు కానీ, మూడు రోజుల క్రితం రోకలి బండతో మోది శాంతిని మహేష్ దారుణంగా హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి తాళం వేసి ఎక్కడికో పరారయ్యాడు. కొత్తగా పెళ్లయిన వారు కావడంతో భార్యాభర్తలిద్దరూ బంధువుల ఊళ్లకు వెళ్లారేమోనని ఇంటి యజమానులు భావించారు. బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా శాంతి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరులో నివాసముంటున్న మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అనంతపురం డీఎస్పీ చంద్రశేఖర్ పరిశీలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. -
ప్రియాంక ఘటనలో ఎందుకీ గోప్యత? తెర వెనుక ఎవరు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థిని ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడం.. రోజుల తరబడి మృత్యువుతో పోరాడి ఆమె మృతి చెందిన ఘటనలో ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ జవాబు లేనివిగానే కనిపిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించిన ఈ దారుణం రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద ఈ నెల 3వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఈ విషయం వెలుగులోకి రాలేదు. దీనికి తెర వెనుక అధికార పార్టీ నగర నాయకులు కథ నడిపారనే విమర్శలు వచ్చాయి. వారెవరనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ అపవాదును తుడుచుకునేందుకు అటు పోలీసులు, ఇటు నగర ప్రజాప్రతినిధులు పోటీ పడిన తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడి, చావుబతుకుల్లో ఉన్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమె బంధువులు ఈ నెల 5వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సాక్షికి ఈ సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తెర వెనుక వ్యక్తులెవరు? ఆ రోజు ప్రసాదిత్య మాల్ వద్ద సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఎడ్వర్డ్ మద్యం తాగి, తమ కారుతో ప్రియాంక ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగానే మూడుసార్లు ఢీకొన్నారు. అనంతరం, ఆమె తలపై నుంచి కారు ఎక్కించి, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘోరంపై అదే రోజు రాత్రి పోలీసులకు సమాచారం అందింది. ఆ రోజు రాత్రి స్థానిక స్వతంత్ర ఆసుపత్రికి వెళ్లి, ఈ సంఘటనలో గాయపడిన ప్రియాంక స్నేహితుడి వాంగ్మూలం సేకరించారు. ప్రియాంకను ఢీకొన్న వెంటనే అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన కారును పోలీసులు ఆ మర్నాడు కానీ సీజ్ చేయలేదు. తీవ్రమైన ఈ సంఘటన సమాచారాన్ని పోలీసులు తొలుత బహిర్గతం చేయలేదు. దీంతో, కొంత మంది కూటమి నాయకులు వారిపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని చిన్న ప్రమాదంగా కూడా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని, దీని వెనుక ఉన్న పెద్దలెవరనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి. ఆ సమయంలో దర్యాప్తు అధికారికి వచ్చిన ఫోన్లపై సైతం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాదం పెద్దది అవుతూండటంతో పోలీసులు ఎట్టకేలకు నిందితుల్ని అరెస్టు చేసి, ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి, స్టేషన్ వద్ద ప్రదర్శనకు పెట్టారు. ఆ సమయంలో కారు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయతి్నంచారనే విషయం స్పష్టమవుతోంది. ప్రసాదిత్య మాల్లో సీసీ కెమెరాల్లో ఈ సంఘటన నమోదై ఉండకపోతే ఈ సంఘటన వెలుగులోకే వచ్చేది కాదని పలువురు అంటున్నారు. ఒకరిపై ఒకరు నింద వేస్తూ.. కారు ఢీకొన్న సమయంలో అక్కడే కొందరు మీడియా ప్రతినిధులున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వారెవరనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. నిందితుల్లో ఒకరు విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణ ఘటనలో అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను చిన్నదిగా చూపించేందుకు ఎవరి ప్రయత్నం వారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రియాంక తండ్రి విలేకర్లతో మాట్లాడిన రోజే ఆయనను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హడావుడిగా హైదరాబాద్కు వెంట పెట్టుకుని వెళ్లారని, దీనిలో ఆంతర్యమేమిటనే ప్రశ్న కూడా జవాబు లేనిదిగానే మిగిలింది. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలన్నీ వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకేనా హైదరాబాద్కు?కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను స్వతంత్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులతో చికిత్స అందించారు. ఈ దారుణాన్ని సాక్షి మొదటిసారి వెలుగులోకి తీసుకువచ్చింది. అనంతరం, సోషల్ మీడియాలో కారు ఢీకొన్న ఘటన వీడియో క్లిప్పింగ్లు హల్చల్ చేయడంతో విద్యార్థి వర్గాలు ఆవేదన, ఆపై ఆగ్రహంతో రగిలిపోయాయి. ఇది మరింత ముదిరి ఆందోళనకు దారి తీస్తుందనే భయంతోనే ప్రియాంకను మెరుగైన చికిత్స పేరుతో హైదరాబాద్కు పంపించారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రధాన ఆసుపత్రి అయిన జీఎల్ఎస్ ట్రస్టు ఆ మాత్రం వైద్యం అందించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి నుంచి తరలించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
క్రితం వరకు వేరు.. ఒక్క వర్షంతో ఒక్కటయ్యారు. వాటే సీన్!
కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనూహ్యంగా మారిపోతుంటాయి.. కాసేపటి క్రితం వరకు ఒకరినొకరు ఎదుర్కొన్నవారే.. ఆ తర్వాత ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. రాంచీలో నిరసనల సందర్భంలో వర్షం కారణంగా కనిపించిన ఈ దృశ్యం కూడా అలాంటి ఆసక్తికర ఘటనే..!రాంచీలో జేపీఎస్సీ అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు.అయితే, అదే సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పరిస్థితి అంతా మారిపోయింది. వర్షం నుంచి రక్షించుకునేందుకు విద్యార్థులు గొడుగులు తెరవగా.. వారిని అడ్డుకుంటున్న కొందరు పోలీసు సిబ్బంది కూడా అదే గొడుగుల కిందకు చేరారు.కాసేపటి క్రితం వరకు లాఠీలు, వాటర్ క్యానన్లతో విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు.. ఇప్పుడు అదే విద్యార్థుల గొడుగుల కిందకు చేరి వర్షం నుంచి తలదాచుకోవడం ఆసక్తికరంగా మారింది. పోలీసు, నిరసనకారుల మధ్య కనిపించిన ఈ మానవీయ దృశ్యాలు అక్కడున్న వారిని ఆశ్చర్యంతోపాటు ఎంతో ఆకట్టుకున్నాయి.ప్రకృతి ముందు అందరూ సమానమేనని చాటిచెప్పిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను వ్యక్తిగత శత్రువులుగా చూడలేదనే విషయాన్ని ఈ దృశ్యాలు చాటిచెప్పాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎస్ఐ ప్రవళ్లిక కేసు.. ఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు!
శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల ఒత్తిడితో వైఎస్ జగన్ జిల్లా పర్యటన నాడు ఘటనా స్థలిలో లేని వ్యక్తిపై హత్యాయత్నం, ఇతర నాన్బెయిల్బుల్ సెక్షన్లు ఆపాదించిన పోలీసులు.. ఇప్పుడు తూచ్ తూచ్ అంటున్నారు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైఎస్సార్సీపీ ఆమదాలవలస ఇన్చార్జి చింతాడ రవికుమార్తో పాటు మరో 20 మందిపై అక్రమ కేసులు కట్టి రిమాండ్కు పంపిన విషయం విదితమే. వీరిలో ఓ ప్రైవేటు ఉద్యోగి గురుగుబెల్లి తేజేశ్వరరావు పంజాబ్ యూనివర్సిటీలో అదే రోజు తన కుమార్తెతో ఉన్నట్లు ఆధారాలు నిర్ధారణ కావడంతో కేసు నుంచి ఆయనని తొలగిస్తున్నట్లు కోర్టుకు మెమో సమరి్పంచామని డీఎస్పీ వివేకానంద స్పష్టం చేయడం విశేషం. ఇప్పటికే ఈ అక్రమ కేసుకు సంబంధించి జిల్లా పీడీఎం కోర్టు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా నేరం చేయు సెక్షన్లైన 109, 111 సెక్షన్లు వర్తించవని ఆదివారం రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం పాఠకులకు విదితమే. ప్రజల్లో అబాసుపాలు.. టీడీపీ అధిష్టానం, స్థానిక నాయకత్వం ఒత్తిడి మేరకు పోలీసు ఉన్నతాధికారులు తమ పోలీసులతో ఇలాంటి నాన్బెయిల్బుల్ సెక్షన్లు వేయించడం, అదనంగా కేసులో మరో ఏడుగురిని కేసులో చేర్చడం, రి మాండ్కు తరలించే సమయంలో చింతాడ రవిని రెండు చోట్ల హైకోర్టు నిబంధనలు కాలరాసి నడిపించుకుని తీసుకువెళ్లడం వంటి అంశాలతో ప్రజల్లో అబాసుపాలయ్యారు. ఈ కేసులో 14 మంది రిమాండ్కు వెళ్లడం తెలిసిందే. మరికొంతమంది మంగళవారం ఆమదాలవలస స్టేషన్లో లొంగిపోతున్నట్లు సమాచారం. మరోసారి అప్పలరాజును కస్టడీ కోరిన పోలీసులు.. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు మరోసారి కస్టడీ విచారణ కోరుతూ సోమవారం పలాస కోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం. -
‘సీరియస్ ఇన్సిడెంట్..’ ఎయిరిండియా ఘటనలో కొత్త ట్విస్ట్
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తు కోల్పోయిన ఘటనలో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. తొలుత తీవ్ర టర్బులెన్స్ కారణంగా భావించిన ఈ ఘటనలో.. విమానంలోని సాంకేతిక వ్యవస్థల పనితీరుపై ఇప్పుడు దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ప్రయాణ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, నమోదైన హెచ్చరికలు పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి. అసలు ఏం జరిగిందన్నది తేల్చేందుకు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) లోతైన విచారణ కొనసాగిస్తోంది.ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 విమానం AI2379 ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణం సాధారణంగానే సాగుతుండగా.. అకస్మాత్తుగా విమానం ఎత్తు కోల్పోయింది. క్షణాల్లో జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే పైలట్లు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 17 మంది గాయపడ్డారు. విమానం ఒక్కసారిగా కిందకు జారిన సమయంలో క్యాబిన్లో గందరగోళ పరిస్థితి నెలకొందని ప్రయాణికులు తెలిపారు. కొందరు సీట్ల నుంచి కదిలిపోయారని, ఆకస్మిక కుదుపులతో భయానికి గురయ్యారని చెప్పారు.సాంకేతిక లోపాలపై దర్యాప్తుఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా విమానంలోని పలు సాంకేతిక అంశాలు ఇప్పుడు పరిశీలనలోకి వచ్చాయి. ప్రయాణ సమయంలో విమాన వ్యవస్థలు ఎలా స్పందించాయి? ఏ హెచ్చరికలు నమోదయ్యాయి? ఎత్తు కోల్పోయిన సమయంలో కంట్రోల్ సిస్టమ్స్ పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.ఆటోపైలట్ డిస్కనెక్ట్.. మాన్యువల్ కంట్రోల్లోకి పైలట్దర్యాప్తు వివరాల ప్రకారం.. విమాన ప్రయాణ సమయంలో ఆటోపైలట్ వ్యవస్థ డిస్కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కో–పైలట్ మాన్యువల్గా విమాన నియంత్రణ చేపట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్లైట్ కంట్రోల్ వ్యవస్థకు సంబంధించిన హెచ్చరికలు కనిపించినట్లు సమాచారం. కొన్ని ఇండికేటర్ స్విచ్లు తాత్కాలికంగా పనిచేయకపోవడం వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.హైడ్రాలిక్ వ్యవస్థలపైనా అనుమానాలువిమాన నియంత్రణలో కీలకమైన హైడ్రాలిక్ వ్యవస్థల్లోనూ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. విమానం దిశను నియంత్రించడం, రెక్కల కదలికలు, ల్యాండింగ్ వ్యవస్థల పనితీరులో హైడ్రాలిక్ వ్యవస్థల పాత్ర కీలకం. అయితే ఈ వైఫల్యాలు విమానం 300 అడుగుల ఎత్తు కోల్పోవడానికి కారణమయ్యాయా? లేదంటే ఇతర సాంకేతిక సమస్యలతో కలిసి ప్రభావం చూపించాయా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.‘సీరియస్ ఇన్సిడెంట్’గా డీజీసీఏ గుర్తింపుఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్ర ఘటనగా వర్గీకరించింది. దీనిపై AAIB దర్యాప్తు చేపట్టింది. విమానంలోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఇతర సాంకేతిక వ్యవస్థలను అధికారులు విశ్లేషిస్తున్నారు. విమానం ఎప్పుడు ఎత్తు కోల్పోయింది? ఆ సమయంలో ఏ వ్యవస్థలు పనిచేశాయి? లోపాలు ఏ క్రమంలో వచ్చాయి? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.ఎయిర్బస్, ఫ్రాన్స్ నిపుణుల సహకారంఏ320 విమానం కావడంతో తయారీ సంస్థ ఎయిర్బస్ నిపుణులు కూడా విచారణలో భాగమవుతున్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫ్రాన్స్కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ BEA సాంకేతిక సహకారం అందించనుంది. విమాన సాఫ్ట్వేర్, కంట్రోల్ సిస్టమ్స్, హార్డ్వేర్ పనితీరును నిపుణులు పరిశీలించనున్నారు.పైలట్ల పరీక్షలపైనా దృష్టిఘటన తర్వాత నిబంధనల ప్రకారం ఇద్దరు పైలట్లకు మాదకద్రవ్య పరీక్షలు నిర్వహించారు. పైలట్ ఇన్ కమాండ్ నమూనాలో వచ్చిన ప్రాథమిక ఫలితం(విఫలమైనట్లు వచ్చింది!)పై మరింత నిర్ధారణ అవసరమని అధికారులు తెలిపారు. తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని స్పష్టం చేశారు. ఇద్దరు పైలట్లను తాత్కాలికంగా ఫ్లయింగ్ డ్యూటీల నుంచి తప్పించారు.విమానం ఎత్తు కోల్పోయి కుదుపులకు లోనుకావడానికి కేవలం వాతావరణ పరిస్థితులే కారణమా? లేదంటే సాంకేతిక లోపాలు కూడా ప్రభావం చూపించాయా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకేసారి పలు విమాన వ్యవస్థలకు సంబంధించిన అంశాలు తెరపైకి రావడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది. -
ఎంతో బాధతో ఈ వీడియో చేస్తున్న.. డాక్టర్ ప్రియాంక మృతిపై మార్గాని భరత్ ఎమోషనల్
-
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది..! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రియాంక తండ్రి ఫైర్
-
మెడికో ప్రియాంక కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ప్రియాంక ఘటన దురదృష్టకరమని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ నెల మూడో తేదీ రాత్రి 10 గంటలకు మెడికల్ సమాచారం వచ్చింది...వెంటనే ప్రకాష్ నగర్ పీఎస్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ముందస్తు సమాచారంతో కేసు నమోదు చేశాం. ఆ మర్నాడు ఉదయానికి కల్లా నిందితులను గుర్తించాము. నిందితులు బైక్ మీద ఉన్న ప్రియాంకను మూడు సార్లు కారుతో ఢీకొట్టారు. ఇద్దరు నిందితులను విచారించి ఆరో తేదీన అరెస్ట్ చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.‘‘గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నిందితులను గుర్తించాం. నిందితులు మాల్లో కొందరితో ఘర్షణ పడ్డారు. ప్రియాంకది రోడ్డు ప్రమాదం కాదు.. క్రిమినల్ చర్య. ప్రియాంక ఫ్రెండ్ ఉమేశ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశాం. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ప్రియాంక తండ్రికి ఈ కేసు విచారణపై బ్రీఫ్ చేశాం. నిందితులను పోలీసు కస్టడికీ తీసుకుంటున్నాం. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా అనేదానిపై విచారణ చేస్తాం. ఘటన తరువాత ఒక చోటకు వెళ్లి నిందితులు పడుకున్నారు. నిందితులపై గతంలో కేసులు లేవు. నిందితులపై బీఎన్ఎస్ 110 సెక్షన్ నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. -
డా.ప్రియాంక ఘటనపై అడ్వకేట్ రజిని ఫస్ట్ రియాక్షన్
-
ఇద్దరు బాలికలపై లైంగిక దాడి
పెడన: కృష్ణా జిల్లా పెడన మండలంలోని బల్లిపర్రు గ్రామంలో ఉన్న ఓ బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం కావడం, వారిని గుర్తించిన పోలీసులు క్షేమంగా విద్యా సంస్థకు చేర్చడంతో కథ సుఖాంతమైందని అంతా అనుకున్నారు. పోలీసుల విచారణలో ఈ అదృశ్యం వెనుక ఇద్దరు యువకుల ప్రమేయం ఉందని, వారు బాలికలపై లైంగికదాడి చేసినట్లు తేలింది. దీంతో వారిపై పోక్సో, లైంగికదాడి కేసులను శనివారం నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల ఆరో తేదీన పాఠశాల నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు మచిలీపట్నంలోని కోనేరుసెంటరుకు చేరుకున్నారు. అనంతరం బందరు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మద్దాల శ్యామ్కిరణ్కు ఫోన్ చేశారు. బాలికల విషయం తెలుసుకున్న శ్యామ్కిరణ్ శారదానగర్కు చెందిన స్నేహితుడు ఆటో డ్రైవర్ కొక్కిలిగడ్డ సిద్దును వెంటతీసుకువెళ్లాడు. కోనేరుసెంటరులో ఉన్న ఇద్దరు బాలికలను వారిద్దరూ ఆటోలో ఎక్కించుకుని బందరు మండలం రుద్రవరం గ్రామంలోని టిడ్కో గృహాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఖాళీగా ఉన్న ఒక ప్లాట్లోకి బాలికలను తీసుకువెళ్లి ఇరువురు యువకులు వారిపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికలను రుద్రవరం తీసుకెళ్లి ఒక బాలిక ఇంటి సమీపంలో వారిని విడిచిపెట్టారు. మరుసటి రోజు ఒక బాలిక అస్వస్థతకు గురికావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నిలదీయగా ఆ బాలిక జరిగిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు బాలికను తీసుకుని పోలీసులకు వద్దకు వెళ్లారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లపై పోక్సో, లైంగికదాడి కేసు నమోదు చేసినట్లు పెడన పోలీసులు తెలిపారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు వారు పేర్కొన్నారు.చదవండి: ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్ -
విమానం కాలిపోతోంది... కాపాడండి! అర్ధరాత్రి బాలుడి కేకలు..
1945 మార్చి 3 – జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఇవోజిమా ద్వీపం...రెండో ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయం... అప్పుడే అమెరికాకు చెందిన యుద్ధ విమాన పైలట్ జేమ్స్ హూస్టన్– యుద్ధనౌక నుంచి టేకాఫ్కు సిద్ధమయ్యాడు.‘జాక్! ఈరోజు శత్రువుల పీచమణిచి విజయంతో తిరిగొస్తా. పార్టీ చేసుకుందాం’ అని తన సహచరుడికి చెప్పి ఇవోజిమా ద్వీపం వైపు దూసుకెళ్లాడు జేమ్స్ హూస్టన్. జపాన్ సేనలపై బాంబుల వర్షం కురిపించాడు. అయితే, జపాన్ సైన్యం చేసిన దాడిలో ఇంజిన్కు మంటలంటుకుని విమానం సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న జేమ్స్ చనిపోయాడు.2000 ఏప్రిల్ 10 – అమెరికాలోని లూసియానాలో నివసించే బ్రూస్ లైనింజర్, ఆండ్రియా లైనింజర్ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు జేమ్స్ లైనింజర్తో కలిసి ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆ బాలుడు గట్టిగా కేకలు వేశాడు.‘విమానం కాలిపోతోంది! మంటలు అంటుకున్నాయి! ఆ చిన్న మనిషి బయటకు రాలేకపోతున్నాడు... కాపాడండి!’ అంటూ అరిచాడు. దీంతో ఉలిక్కిపడ్డ అతడి తల్లిదండ్రులు జేమ్స్ను దగ్గరకు తీసుకుని బుజ్జగించి నిద్రపుచ్చారు. ఇక ఆ రోజు నుంచి వారికి నిద్ర కరువైంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రపోతున్న బాలుడు ఉన్నట్టుండి గాల్లో కాళ్లు, చేతులు విసిరేస్తూ, ఊపిరి ఆడనట్లు విలవిలలాడిపోయేవాడు. చెమటలతో తడిసిపోతూ గట్టిగా కేకలు వేసేవాడు.వారంలో నాలుగైదు రోజులు ఇదే సీన్. మొదట్లో తల్లిదండ్రులు ఏదో పీడకల అనుకున్నారు. కానీ అంతకంతకూ ఆ చిన్నారి ప్రవర్తన విచిత్రంగా మారింది. బొమ్మ విమానాలతో ఆడుకుంటూ, వాటిని నేలకేసి కొడుతూ ‘విమానం క్రాష్ అయిపోయింది’ అని అరిచేవాడు.రోజులు గడిచేకొద్దీ ఆ చిన్నారి చెబుతున్న మాటలకు తల్లిదండ్రులు షాకయ్యేవారు. ఆ వయసు పిల్లలకు అస్సలు తెలియని ‘విమాన çపరిభాష’ గురించి జేమ్స్ మాట్లాడటం చూసి నిర్ఘాంతపోయేవారు. విమానం కింద ఉండే ‘డ్రాప్ ట్యాంక్’ గురించి, దాన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలో స్పష్టంగా చెప్పేవాడు. దీంతో ఒకరోజు తండ్రి బ్రూస్ తన కొడుకుని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా ఆరా తీశాడు.‘నాన్నా, అసలు ఆ విమానం ఎక్కడి నుంచి ఎగిరేది?’ అని అడిగితే, ‘అది నటోమా అనే పెద్ద యుద్ధనౌక మీద నుంచి ఎగిరేది డాడీ’ అని బదులిచ్చాడు. ఆ చిన్న మనిషి ఎవరు నాన్నా అని ప్రశ్నిస్తే, ‘అది నేనే.. నా పేరు కూడా జేమ్సే’ అని సమాధానమిచ్చాడు. ‘నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అంటే.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ జాక్ లార్సన్ నాతోనే ఉండేవాడు’ అని చెప్పాడు. ‘జపాన్ సైనికులు తన విమానం ఇంజిన్ పై దాడి చేసి కూల్చివేశారు. విమానానికి మంటలు అంటుకుని సముద్రంలో పడిపోయి చనిపోయాను’ ఆ పసివాడు కళ్లు పెద్దవి చేసి మరీ వివరించాడు.ఇదంతా పసివాడి ఊహాజనిత కథ అని నిరూపించాలని బ్రూస్ నిశ్చయించుకున్నాడు. సైనిక రికార్డులు, రెండో ప్రపంచ యుద్ధ పత్రాలను జల్లెడ పట్టాడు. అవి చూసిన తర్వాత ఆయన వెన్నులో వణుకు పుట్టింది.పసిఫిక్ మహాసముద్రంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పేరు యూఎస్ఎస్ నటోమా బే అని, ఆ నౌకపై జాక్ లార్సన్ అనే పైలట్ పనిచేశాడని, అప్పటికి ఆయన ఇంకా జీవించే ఉన్నాడని తెలుసుకున్నాడు.1945 మార్చి 3న జేమ్స్ హూస్టన్ జూనియర్ అనే 21 ఏళ్ల పైలట్ విమానంపై జపాన్ సైనికులు దాడి చేయడంతో అది సముద్రంలో కూలిపోయి అతడు మరణించాడని మిలిటరీ రికార్డులను బట్టి బ్రూస్ నిర్ధారణకు వచ్చాడు. ఈ నమ్మలేని నిజాలను ప్రత్యక్షంగా నిరూపించుకోవడానికి లైనింజర్ కుటుంబం– చనిపోయిన పైలట్ జేమ్స్ హూస్టన్ సోదరి యాన్ బారన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికి వృద్ధురాలైన యాన్ బారన్ ను చూడగానే జేమ్స్– పరిగెత్తుకుంటూ వెళ్లి ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. వారి చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, హూస్టన్ ఇంట్లో ఉన్న బొమ్మల పేర్లు, కేవలం ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన కుటుంబ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు.అవన్నీ విన్న తర్వాత ఆనందబాష్పాలతో యాన్ బారన్ అన్న మాట: ‘ఇతడు నా తమ్ముడు జేమ్స్ హూస్టన్... నా తమ్ముడే మళ్లీ పుట్టాడు’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం అప్పటికి బతికి ఉన్న సహచర పైలట్ జాక్ లార్సన్ను కలిసినప్పుడు కూడా చిన్నారి జేమ్స్ ఆయనను గుర్తుపట్టి, నాటి యుద్ధ జ్ఞాపకాలను పంచుకున్నాడు.చిన్నారి జేమ్స్ లైనింజర్ కథ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాను, పారాసైకాలజీ పరిశోధకులను ఆకర్షించింది. గత జన్మ వివరాలన్నీ చెప్పిన జేమ్స్... తను మరణించిన జపాన్ సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించాడు. అంతే, అప్పటి నుంచి అతడికి పీడకలలు రావడం ఆగిపోయాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు దీనికి ఎటువంటి శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్న జేమ్స్ లైనింజర్ కథ– ‘పునర్జన్మ’ ఉందనే నమ్మకానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన, సజీవ ఆధారంగా ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డి -
హైదరాబాద్లో మహిళ అనుమానాస్పద మృతి
చిలకలూరిపేట: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన నూర్ బాష ఆశా (33) కొంతకాలంగా తన 12 ఏళ్ల కుమారుడితో కలసి తాగునీటి చెరువుకు వెళ్లే టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉంటుంది. సుమారు ఐదేళ్ల కిందట కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయింది. కొంతకాలంగా తన మాజీ భర్త ఊరికి చెందిన పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన, సుల్తాన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సుల్తాన్ కూడా భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల కిందట కుమారుడిని తెలిసిన వాళ్ల ఇంటిలో వదిలివేసి ప్రియుడు సుల్తాన్తో కలసి హైదరాబాద్ వెళ్లింది. అక్కడ మెకానిక్గా పనికి కుదిరిన సుల్తాన్ గురువారం ఉదయం పనుల నిమిత్తం షెడ్డుకు వెళ్లాడు. అతను పనిలో ఉండగా ఇంటి చుట్టుపక్కల వారు ఫోన్ చేసి ఆశా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నట్లు, తాము కిటికీలో నుంచి చూశామని సమాచారం అందించారు. దీంతో ఇంటికి చేరుకున్న సుల్తాన్ మృతదేహాన్ని తీసుకొని అంబులెన్స్లో ఎక్కించుకొని చిలకలూరిపేటలోని వైఎస్సార్ కాలనీ వద్దకు చేరుకున్నాడు. అంబులెన్స్కు బాడుగ డబ్బులు తీసుకువస్తానని వెళ్లి ఎంతకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ డయల్ 100కు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో చిలకలూరిపేట పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుల్తాన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రీల్స్ మోజులో వంట చేయలేదని భార్యను.. కడతేర్చాడు!
బెంగళూరు: సమయానికి సక్రమంగా వంట వండకుండా ఇంట్లో రీల్స్తో కాలం గడుపుతున్న భార్యను హత్య చేసినట్లు పోలీసుల ముందు భర్త నోరువిప్పాడు. కుంబళగోడు పోలీస్స్టేషన్ పరిధిలో 12 రోజుల క్రితం బెడ్షీట్లో మహిళ శవం చుట్టిన కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు హత్యకు కారణాలను పోలీసులు సేకరించారు. బిహార్కు చెందిన ధీరజ్ కుమార్(24), రీమా కుమారి(20) ప్రేమించుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా బిహార్ నుంచి 10 నెలల క్రితం బెంగళూరుకు చేరుకుని ఇద్దరూ వివాహం చేసుకున్నారు. దంపతులు గేరుపాళ్యలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ సమీపంలోని పరిశ్రమలో పనికి వెళ్లేవారు. రీమా రీల్స్ చేయడానికి అలవాటు పడి ఇంట్లో సక్రమంగా వంట చేసేది కాదు. దీంతో కోపోద్రిక్తుడైన ధీరజ్కుమార్ భార్యతో గొడవ పడేవాడు. ప్రతినిత్యం ఇద్దరూ ఘర్షణ పడేవారు. రీమా ఇటీవల తాను బిహార్కు వెళ్లిపోతానని పట్టుబట్టింది. ఈక్రమంలో గత నెల 27న రాత్రి ధీరజ్కుమార్ విధులు ముగించుకుని ఇంటికి రాగా ఇంట్లో వంట వండలేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి తీవ్ర స్థాయికి చేరడంతో చేతికి దొరికిన కర్రతో ధీరజ్కుమార్ రీమాపై దాడి చేశాడు. అనంతరం చున్నీతో రీమా గొంతు బిగించి చంపి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి బిహార్కు పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుంబళగోడు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి బిహార్లో ఉన్న ధీరజ్కుమార్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం
సాక్షి, హైదరాబాద్: మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో కారు ప్రమాదంలో ప్రియాంక గాయపడిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో ప్రియాంక బైక్ను యువకులు కారుతో ఢీకొట్టారు. ప్రియాంకపై నుంచి కారు దూసుకెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటన సంచలనం రేపింది.ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు.మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది.ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.ప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించ డం పలు అనుమానాలకు తావిస్తోంది. -
నాలుగేళ్ల కొడుకుపై కన్న తండ్రి ఘాతుకం
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించాడు. రోడ్డుపై వెళుతున్న డీసీఎం కింద తోసినా చనిపోకపోవడంతో ఫ్లై ఓవర్ పిల్లర్కేసి బాదాడు. అదృష్టవశాత్తు స్థానికులు అడ్డుకోవడంతో బాలుడు మృత్యువాత నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన బుధవారం గుడిమల్కాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ ఫతేదర్వాజాకు చెందిన సల్మాన్ (25) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇతడికి ముగ్గురు పిల్లలు. కొంతకాలంగా మద్యానికి బానిసగా మారిన సల్మాన్ భార్యతో నిత్యం గొడవపడుతూ ఉండేవాడు. మంగళవారం రాత్రి కూడా తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సల్మాన్ తన కుమారుడు అర్మాన్(4)ను గోల్కొండ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెంబర్ 104 వద్దకు తెచ్చాడు. మద్యం మత్తులో కుమారుడిని డీసీఎం ముందుకు తోశాడు. అదృష్టవశాత్తు డీసీఎం వాహనం బాలుడిపై వెళ్లలేదు. అయితే కుమారుడు చనిపోలేదన్న కోపంతో కసాయి తండ్రి చిన్నారి జుట్టును పట్టుకుని పిల్లర్కు కొట్టడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు సల్మాన్ను అడ్డుకొని బాలుడిని కాపాడారు. పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. -
కారుతో మహిళ బీభత్సం
తూర్పుగోదావరి: మండలంలోని పెరుమాళ్లపురంలో ఓ కారు రెండు బైకులను ఢీకొట్టి బీభత్సం సృష్టించిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజమహేంద్రవరం వద్ద బొమ్మూరుకు చెందిన విప్పర్తి మాధవికి తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీ బుచ్చియ్యపేట గ్రామానికి చెందిన అంబుజాలపు బాబ్జీ తన స్నేహితురాలి ద్వారా కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం బాబ్జీ మాధవి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారు కాకినాడలో నాలుగు నెలలుగా ఉంటున్నారు. సోమవారం రాత్రి బాబ్జీ కాకినాడ నుంచి తనకు చెప్పకుండా వచ్చేయడంతో మంగళవారం ఉదయం మాధవి బుచ్చియ్యపేటకు తన కారులో వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసి కారును సైతం ధ్వంసం చేశారు. దీంతో ఆమె ప్రాణభయంతో కారుతో అతివేగంగా రాజమహేంద్రవరం వైపు బయలుదేరింది. కారు అద్దాలు పగిలిపోవడం, దారి స్పష్టంగా లేకపోవడంతో పెరుమాళ్లపురం మెయిన్ సెంటర్లో రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యయి. దీంతో స్థానికులు కారును అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మాధవి తనపై జరిగిన దాడిపై ఇచ్చిన ఫిర్యాదుపైనా, కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారు ఇచ్చిన ఫిర్యాదుపైనా పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యపై బెస్బాల్ బ్యాట్తో దాడి చేసిన భర్త!
జనగామ రూరల్: భార్యపై భర్త బెస్ బాల్ బ్యాట్తో దాడి చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం ఓబుల్కేశావాపూర్ గ్రామానికి చెందిన మోకు మహేందర్రెడ్డి ఎనిమిదేళ్ల క్రితం మాధవిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల మహేందర్కు మరో మహిళతో పరిచయం ఏర్పడడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలవడంతో మాధవి మే నెలలో సరూర్నగర్లో తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. కాగా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మాధవి 2వ తేదీన (ఆదివారం) గ్రామానికి వచ్చింది. పంచాయితీకి భర్త రాకపోవడంతో గ్రామ పెద్దమనుషులు ఇంటి తాళం పగలగొట్టి ఉండమని చెప్పి వెళ్లిపోయారు.అనంతరం సుమారు 4 గంటల సమయంలో మహేందర్రెడ్డి ఇంటికి వచ్చి వెంట తెచ్చుకున్న బేస్బాల్ బ్యాట్తో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డువచ్చిన మాధవి సోదరుడిని కూడా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన మాధవిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. దాడి అనంతరం మహేందర్ రెడ్డి ఇద్దరు పిల్లలను తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
వాడొక రాక్షసుడు అందమైన భార్యను..!
జనగామ: ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరి«ధిలోని నాలుగో డివిజన్ కృష్ణాకాలనీలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల తండాకు చెందిన గుగులోత్ రజిత (26), నర్సంపేట మండలం రాజీపేటకు చెందిన అనిల్ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నెల రోజుల క్రితం రజిత–అనిల్ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. కృష్ణాకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొంతకాలంగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అనిల్ తన భార్య రజిత కాళ్లు, చేతులు కట్టి కత్తితో మెడ కోసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో రజిత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న కేయూసీ పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై నవీన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తల్లి హత్యకు గురికావడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. -
మహిళా SI వ్యవహారంపై చింతాడ రవికుమార్ క్లారిటీ
-
పిల్లల ప్రాణాలు పోలేదుగా.. చిన్న గీతే కదా! వార్డెన్ సమాధానం
ఆంధ్రప్రదేశ్, విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్ బాష కుమార్తె సోఫియా స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్ కనీసం తల్లిదండ్రులకు కూడా తెలపలేదు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్కు చేరుకుని ప్రిన్సిపాల్, వార్డెన్లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్ నల్లమ్మను నిలదీశారు. ఇందుకు వార్డెన్.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా ఏదో చిన్న గీత పడిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. -
భార్యను చంపి.. ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకుని..
కర్నూలు జిల్లా: నిద్రిస్తున్న భార్యను అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన నిందితుడు ఆమె సమాధి వద్దే బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు, సీఐ మధు వివరాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన మాదరమోని బాబు (56), అమృత (45) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. మద్యానికి అలవాటు పడిన బాబు తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న భార్యను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు అతడిని పట్టుకొని రిమాండ్కు తరలించారు. వారం రోజుల కిందట పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ క్రమంలో అతనితో ఎవరూ సరిగా మాట్లాడటం లేదు. దీంతో మానసిక వేదనకు గురైన బాబు గురువారం రాత్రి నోములలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న భార్య సమాధి వద్దకు వెళ్లి అక్కడే నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు చూసి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పిఠాపురం ప్రిస్కిల్లాను చంపేశారా..!
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గొల్లప్రోలులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లప్రోలు రైల్వే స్టేషన్ సమీపాన నివాసం ఉంటున్న తండి ప్రిస్కిల్లా (27) కాకినాడలోని ఎస్ఆర్ఎంటీ మాల్లో ఉన్న రిలయన్స్ డిజిటల్లో బజాజ్ ఫైనాన్స్ సేల్స్ ఆఫీసర్గా పని చేస్తుంది. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో ఆమెను వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
అమ్మా నాన్నా.. సారీ!
సూసైడ్ నోట్లో సారాంశం అమ్మా నన్ను క్షమించు.. నా కోసం చాలా కష్టపడ్డావ్.. డాడీ నీ డ్రీమ్ నిలబెట్టలేకపోతున్నా.. నా డ్రీమ్ కూడా పూర్తిచేయలేకపోతున్నా.. అమ్మా నాన్నా నాకు బతకాలని ఉంది. కానీ, బతకడానికి చాలా సిగ్గుగా ఉంది. అమ్మా నీ కోసం నేనేం చెయ్యలేదు. నాన్న నేను నీకు ఏదైనా సాధించి చూపించాలని ఉంది. కానీ నేను ఇంతకు మించి తట్టుకోలేకపోతున్నా.. ఈ బాధ ఒక్కదానిని మోయడం నా వల్ల కావట్లేదు. నేను చనిపోయాక నాపై ఎవరూ కోప్పడకండి. డాడీ నన్ను మీరు ఎప్పుడూ లవ్ చేస్తూ ఉండండి. అమ్మా బై.. అమ్మమ్మ జాగ్రత్త. అన్నయ్య డాడీ మాట విని జాగ్రత్తగా ఉండు. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ ఎప్పటికైనా కలవండి, ద్వేషించుకోకండి.. ఇక ఉంటా.. రంపచోడవరం: ఆ చిన్నారి తల్లడిల్లిపోయింది.. గుండె నిండా బాధతో, బరువెక్కిన హృదయంతో బలవన్మరణానికి పాల్పడింది.. గిరిసీమలో ఓ విద్యాకుసుమం నేలకొరిగింది.. ఇటీవల మెగా పేరెంట్స్, టీచర్స్ సభలో తన ప్రసంగంతో మెప్పించి, సీఎం చంద్రబాబు సైతం అబ్బురపడి తన పక్కన కూర్చోబెట్టుకుని మరీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో షైనింగ్ స్టార్గా మెరిసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకం, ప్రశంసా పత్రాన్ని అందుకున్న శివాని అనుకోని విధంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఏజెన్సీలో విషాదం అలముకొంది. ఇర్లపల్లిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ముర్రం శివాని రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లి సౌభాగ్యవతి, తండ్రి వరప్రసాద్లు నాలుగేళ్ల క్రితమే విడిపోయారు. దీంతో శివాని అప్పుడప్పుడూ గోకవరం మండలం బావాజీపేటలో తండ్రి వద్దకు వెళ్లి వస్తూండేది. ఆదివారం పుట్టిన రోజు కావడంతో తండ్రి వద్దకు వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు ఇర్లపల్లిలో ఇంటికి వచ్చింది. తల్లి సౌభాగ్యవతి వెదురుపాకలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఒక్కోసారి ఆమె అక్కడే ఉంటుంటారు. తల్లి లేని సమయంలో శివాని, అమ్మమ్మ బాలమ్మలు ఇద్దరే ఇంటి వద్ద ఉంటారు. బావాజీపేటలో తండ్రి వద్దకు వెళ్లి తిరిగి ఆరు గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి రాసుకుంటానని అమ్మమ్మకు చెప్పింది. సోమవారం ఉదయం అమ్మమ్మ ఆ గది తలుపు తీసి చూసేసరికి ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ ఉండడంతో కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కిందకు దింపారు. అప్పటికే శివాని మృతిచెంది ఉండడంతో ఆదివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. డాడీ ఇంటికెళ్లిపోయా.. అదే చివరి మాట తన కుమార్తె శివాని మృతి తండ్రి వరప్రసాద్ను కలిచివేసింది. ఆదివారం సెలవు డాడీ వస్తానని చెప్పిందని, రా తల్లీ అన్నానని ఆయన వివరించారు. నేను గోకవరం సమీపంలోని అష్టలక్ష్మి గుడి సమీపంలోని బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాను.. సాయంత్రం వరకూ తన దగ్గరే ఉంది. నా చిట్టి తల్లి ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు. పచ్చకామెర్లు వచ్చి తగ్గడంతో ఉత్తి బిర్యానీ తినమని చెప్పాను.. అదే తింది. సీఎంతో ఫొటో తీయించుకున్నావు, బాగా మాట్లాడవు అన్నాను. డాడీ నీ పరువు నిలబెడతానని చెప్పింది. చీకటి పడుతుంది ఉండిపో తల్లీ అన్నాను. వెళ్లిపోతానని చెప్పింది. మా చిన్నోడు బన్నీతో కలసి గోకవరం బస్ కాంప్లెక్స్లో దింపాను. గోకవరంలో చాక్లెట్ కావాలంది. కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను. మధ్యలో ఫోన్ చేశాను దారిలో ఉన్నాను డాడీ అని చెప్పింది. తరువాత ఇంటికి వచ్చానని చెప్పింది. అవే చివరి మాటలని తండ్రి వరప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏ బాధ ఉండో చెప్పలేదు, ఏ కష్టం ఉందో చెప్పలేదు.. ఎందుకు చనిపోయిందో తెలియడం లేదు. బాధతో చనిపోయింది.. ఇప్పుడు నా ప్రాణమే పోయిందని వరప్రసాద్ రోదించారు. లోపం ఎక్కడుంది? పసిపిల్లల్లో.. బలవన్మరణానికి చాలా ధైర్యం కావాలి. ఏం సాధించలేక పోతున్నాననే ఆలోచన ఆ పసి మనసులో, ఆ వయసులోనే రావడం అంటే... అది మన వ్యవస్థలోనే లోపం ఉన్నట్టు కాదా..! మన విద్యా వ్యవస్థ, ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకొనే వారికి... ఎలాగైనా బతికగలం అన్న నమ్మకాన్ని ఎందుకు ఇవ్వలేక పోతోంది... చదువు అంటే... ర్యాంకులు, గ్రేడ్లు, మార్కులు మాత్రమే కాదు.. అనే అంశాన్ని ఆ పసి మనసులకు అర్థమయ్యేలా ఎందుకు వివరించలేకపోతోంది..? లోపం ఎవరిది...? ఎక్కడుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తాం: కలెక్టర్ రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని బలవన్మరణం అత్యంత బాధాకరమని కలెక్టర్ కె. దినేష్ కుమార్ అన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో శివాని మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అశ్రఫ్ అలీతో కలసి శివాని మృతికి సంబంధించిన పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలపై సమీక్ష నిర్వహించారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మంచి భవిష్యత్తు ఉన్న విద్యారి్థని ఇలా మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. బాలిక మృతిపై కేసు నమోదు శివాని ఆత్మహత్యపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రమేష్ తెలిపారు. సంఘటన స్థలంలో సూసైట్ నోట్, సెల్ఫోన్ స్వాదీనం చేసుకున్నామని అన్నారు. తల్లి బంధువుల ఫంక్షన్కు వెళ్లడంతో అమ్మమ్మ, బాలిక మాత్రమే ఇంటి వద్ద ఉన్నారన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు తెలియాల్సి ఉందని వివరించారు. కుటుంబ కలహాలు ఏమీ లేవని అన్నారు.విద్యార్థిని మృతి బాధాకరం ఇర్లపల్లి గ్రామానికి చెందిన ముర్రం శివాని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఇర్లపల్లి ఆర్అండ్ఆర్ కాలనీకి వెళ్లి శివాని మృతదేహానికి పూలమాలు వేసి నివాళులరి్పంచి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పండా వెంకటలక్షి్మ, ఎంపీపీ బంధం శ్రీదేవి, మండల పార్టీ అధ్యక్షుడు జల్లేపల్లి రామన్నదొర, పండా రామకృష్ణదొర, మాజీ సర్పంచ్లు మంగా బొజ్జయ్య, రమేష్ దొర, బొజ్జయ్య, ఆనందరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు బొబ్బా శేఖర్, డొక్కులూరి రత్నరాజు తదితరలు ఉన్నారు. -
ఏం జరిగిందో..? విషం తాగి దంపతుల బలవన్మరణం
విజయవాడ: చూడ ముచ్చటైన జంట.. అనురాగం.. ప్రేమ, ఆప్యాయతలతో సంతోషంగా సాగుతున్న సంసారం.. ఏడేళ్ల ఆ బంధానికి ఇద్దరు మగపిల్లల సంతానం.. అంతా బాగుందని అనుకున్న ఆ చిన్న కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో.. ఏమో కానీ భార్యాభర్తలిద్దరూ విషం తాగి మృత్యువు ఒడికి చేరిపోయారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దేవీనగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం కలకలం సృష్టించింది. ఏం జరిగిందంటే.. దేవీనగర్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి బాజీ సైదులు(30), జలసూత్రం మానస(27)కు పెద్దల సమక్షంలో 2019లో వివాహమైంది. వీరికి సంజయ్(5), సంతోష్ (ఏడాదిన్నర) కుమారులు ఉన్నారు. సైదులు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మానస ఇంటి వద్దే ఉంటూ టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఆదివారం ఉదయం సైదులు తన పిల్లలిద్దరినీ ఇందిరా నాయక్నగర్లోని తన సోదరుడు నాగుల్మీరా వద్ద దింపి పనులకు వెళ్లగా మానస వారి ఇంటి సమీపంలోని చర్చికి ఉదయం పది గంటలకు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల తిరిగి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో సైదులు తన మావయ్య వీరభద్రరావుకు ఫోను చేసి దంపతులిద్దరం విషం తాగేశామని.. ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పాడు. దీంతో అతను తన వియ్యంకుడు ఏడుకొండలు, సైదులు సోదరుడు నాగుల్మీరాకు ఫోను చేసి హూటాహూటిన వారి ఇంటికి వెళ్లి తలుపులు పగలకొట్టి అపస్మారక స్థితిలో పడి ఉన్న భార్యాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న భార్యాభర్తలిద్దరూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు. దీంతో వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆన్లైన్లో ఆర్డరు పెట్టుకొని.. సైదులు, మానస ఎంతో అన్యోన్యంగా ఉంటారని, వారికి ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవని వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలతో మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆన్లైన్లో గడ్డిమందు, కూల్డ్రింక్ను ఆర్డర్ పెట్టుకొని డ్రింక్లో దానిని కలుపుకొని ఇద్దరూ తాగినట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అజిత్సింగ్నగర్ సీఐ దాడి చంద్ర శేఖర్ తెలిపారు. -
దళిత బాలికపై అత్యాచారం
సాక్షి, పుట్టపర్తి/గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లాలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దళిత బాలికపై అత్యాచారం జరిగింది. పదోతరగతి చదువుతున్న ఆ బాలిక ప్రస్తుతం ఐదునెలల గర్భంతో ఉన్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బొంబాయి బాబు (55)ను గోరంట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ గ్రామానికి చెందిన బొంబాయి బాబు అదే కాలనీలోకి చెందిన దళిత బాలికను మాయమాటలతో లొంగదీసుకున్నాడు.అనారోగ్యంగా ఉన్న బాలికను హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఐదునెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు గోరంట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బొంబాయి బాబుపై పోక్సో కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం మరిన్ని సెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని గోరంట్ల సీఐ బోయ శేఖర్ చెప్పారు. తనతోపాటు ఇంకొందరు ఆ బాలికపై అత్యాచారం చేశారని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. మద్యం మత్తులో ఉన్న బొంబాయి బాబు ఆ వ్యక్తులు ఎవరనేది చెప్పలేదని, అతడిని మరోసారి విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
నా భర్తకు తెలిస్తే నా జీవితం నాశనమవుతుంది..!
హైదరాబాద్: ఓ మహిళ నగ్న ఫొటోలను ఆమె భర్తకు చూపిస్తానని బెదిరించిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్లో సె క్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ (34)కు హెడ్ సెక్యూరిటీ గార్డు బి.రమేషతో పరిచయం ఏర్పడి సన్నిహతంగా మెలిగారు. ఈ క్రమంలో ఆమెకు తెలికుండా తీసిన నగ్న ఫొటోలను రమేష్ ఆమెకే చూపించాడు. ఈ విషయం గురించి భర్తకు చెబితే తన కు టుంబ జీవితమే నాశనమవుతుందని భయపడి చెప్పలేదు. ఇదిలా ఉండగా, సోమవారం రమేష్ బాధితు రాలికి ఫోన్ చేసి బెదిరించి తనకు సహకరించకపోతే రహస్య ఫొటోలను భర్తకు చూపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గురువారం ఫిర్యాదు చేసింది. -
టీచర్ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి..
తమిళనాడు: కన్యాకుమారి జిల్లా తక్కలై సమీపంలో స్నానం చేస్తున్న ఉపాధ్యాయురాలిని రహస్యంగా వీడియో తీసి, బెదిరించి బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు దానిని రికార్డ్ చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు కూడా సదరు టీచర్ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. తమిళనాడు కన్యాకుమారి జిల్లా తక్కలై సమీప ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల ఉపాధ్యాయురాలు మదురై హైకోర్టు బెంచ్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ‘‘నేను ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను. నా భర్త టెంపో డ్రైవర్. నేను నా ఇంటి బాత్రూమ్లో స్నానం చేస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన జయకాంతన్ అనే వ్యక్తి రహస్యంగా తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆ వీడియోను అడ్డం పెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేస్తూ, నిరంతరం వేధింపులకు గురిచేశాడు’’ అని ఆ పేర్కొన్నారు. నిందితుడు తనను భయపెట్టి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, అతని స్నేహితుడు కూడా ఈ విషయం తెలుసుకుని తనను వేధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆదేశాల మేరకు తక్కలై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై సమాచార సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం, బలవంతపు వేధింపులు ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
భార్య, పిల్లలను కడతేర్చి ఆత్మహత్య
కర్ణాటక : జిల్లాలోని హుణసూరు పట్టణంలో హృదయ విదారక సంఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేసి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలే కారణమని అనుమానాలున్నాయి. వివరాలు... పట్టణంలోని న్యూ మారుతి బరంగాయ్కు చెందిన హరీష్ (49), భార్య నిష్ఠ (36), పిల్లలు నిక్షా (12), రక్ష (8)తో నివసిస్తున్నాడు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసే హరీష్ , మూడు రోజుల క్రితం తన తల్లిని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాడు. సోమవారం రాత్రి కింది అంతస్తులో తన భార్య, పిల్లల ముక్కులకు, నోళ్లకు ప్లాస్టర్ అతికించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మొదటి అంతస్తుకు వెళ్లి ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగిందని అనుమానిస్తున్నారు. ఇరుగుపొరుగు అనుమానంతో.. మంగళవారం ఉదయం 9 గంటలైనా తలుపులు తెరవకపోవడతో ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూసి ఏదో జరిగిందని కనుగొన్నారు. పట్టణ పోలీసులకు తెలుపగా తలుపులు బద్ధలుకొట్టి లోపలకు ప్రవేశించారు. నలుగురి మృతదేహాలు కనిపించాయి. అక్కడ లభించిన డెత్ నోట్ను స్వా«దీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫలానా ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరికి ఇవ్వాలో అందులో రాశాడు. పూర్తి లేఖ బయటకు రాలేదు. ఇరుకుటుంబాల బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. -
నిందితులను రక్షించడానికి గళ్ళా మాధవి ప్రయత్నిస్తుందా..?
-
నేను.. ఆ వివాహిత 2025 జూన్ నుంచి రిలేషన్లో ఉన్నాం..!
సాక్షి, హైదరాబాద్: వివాహిత అయిన సహ ట్రైనీని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఎం.ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో సోమవారం ఆద్యంతం హైడ్రామా నడిచింది. మోతీనగర్లో ఉండే తన సోదరుడి ఇంట్లో ఈయన స్పృహ లేకుండా పడిపోయారు. పక్కనే మద్యం సీసాలతోపాటు సగం ఖాళీ అయిన ఓ శానిటైజర్ బాటిల్, సూసైడ్ నోట్ ఉండటంతో కుటుంబీకులు ఆత్మహత్యాయత్నంగా భావించి ఆస్పత్రికి తరలించారు. స్టమక్ వాష్తోపాటు ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు ఆయన రక్తనమూనాలు సేకరించి పరీక్షించారు. వీటిలో ఎలాంటి విష పదార్థపు ఆనవాళ్లు లేవని తేలింది. దీంతో ఆ సూసైడ్ నోట్ ఎందుకు రాశారు? అందులో బాధితురాలు, ఆమె భర్తతో పాటు మరికొందరు ట్రైనీ ఐపీఎస్ల పేర్లు ఎందుకు చేర్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణారెడ్డి తనపై సానుభూతి కోసం ఇంతటి హైడ్రామా నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్ నోట్ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. కృష్ణారెడ్డి సస్పెన్షన్: హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో (ఎస్వీపీఎన్ పీఏ) శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ గత గురువారమే కృష్ణారెడ్డిపై తమ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ అంశంపై విచారణ చేపట్టే బాధ్యతల్ని ఎన్పీఏ ప్రివిలేజెస్ కమిటీకి అప్పగించారు. అకాడమీలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, బాధితురాలి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తేల్చింది. దీంతో కృష్ణారెడ్డిని ఎన్పీఏ నుంచి శుక్రవారం సస్పెండ్ చేశారు.దీంతో ఆయన అక్కడ నుంచి మోతీనగర్లో ఉన్న తన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేస్తూ ఎనిమిది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి తన వాట్సాప్ స్టేటస్, ఇన్స్ట్రాగామ్లో లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై ప్రచారం జరుగుతున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు. అమీర్పేటలోని తన స్నేహితుడైన లాయర్ ఫ్లాట్కు ఆదివారం రాత్రి వెళ్లారు. అనంతరం సోదరుడి ఇంటికి వెళ్లిన కృష్ణారెడ్డి రెండు పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఆపై మద్యం మత్తులో స్పృహ తప్పారు. కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో ఏముందంటే... ‘నేను.. ఆ వివాహిత 2025 జూన్నుంచి రిలేషన్లో ఉన్నాం. ఆమెకు వివాహమైన తర్వాత కూడా మా మధ్య శారీరకంగా, భావోద్వేగపరంగా సంబంధం కొనసాగింది. దీనికి సంబంధించిన ఆధారంగా నా ఐఫోన్లో వీడియోలు రికార్డు చేశాను. వాటిని ఆమె భర్తకు పంపాను. ఆమె స్నేహితులు నాపై ఫిర్యాదు చేసేలా రెచ్చగొట్టారు. నా ఆత్మహత్యకు ఆమె, ఆమె భర్తతోపాటు ఇద్దరు స్నేహితులు కారణం. వారందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’. -
అర్ధరాత్రి నగ్నంగా వెళ్లి.. గుడిలో విగ్రహం తీసుకుని..
మేడిపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ శంకర్నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గణపతినగరం మండలం దేవలపల్లి గ్రామానికి చెందిన వకలగాడి తేజస్విని (27) మూడు నెలలుగా తల్లి అరుణతో కలిసి శంకర్నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. కొంతకాలంగా ఆమె మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తండ్రి ఈశ్వర్రావు విశాఖ పట్నంలో ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుంచి నగ్నంగా బయటకి వెళ్లిన తేజస్విని.. సమీపంలోని బీరప్ప ఆలయం లోపలకు వెళ్లింది. అనంతరం ఆలయంలోని విగ్రహం తీసుకునివెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం యువతి మృతదేహాన్ని బయటకుతీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లి ఫిర్యాదుతో కేసు న మోదు చేశారు. తేజస్విని గతంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, యువతి తీసుకెళ్లిన విగ్రహం కోసం హైడ్రా బృందం ప్రత్యేక పరికరాలతో చెరువులో ముమ్మరంగా అన్వేషణ సాగిస్తోంది. 🚨 Running Naked in the Streets at Midnight, Then Jumping Into a Lake🚨 Tragic Suicide of a Young Woman Causes Stir in Medipally, Telangana."Here is the full story, unfolded" ✍🏻***Disturbing Visuals***A software job at a young age, earning a salary in the lakhs—her happy… pic.twitter.com/1xh7FjBXpf— Vamshi (@vamshi020693) July 19, 2026 -
గుంటూరు ఘటన అత్యంత అమానవీయం: అంబటి
సాక్షి, తాడేపల్లి: గుంటూరు ఘటన అత్యంత అమానవీయం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో అమానుషంగా మహిళను వివస్త్రను చేసి.. టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నూరి ఫాతిమా పరామర్శించారు. బాధిత మహిళకు ధైర్యం చెప్పారు.అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడు రోజుల క్రితం సంఘటన జరిగితే నిన్న జరిగినట్టు చంద్రబాబు చెప్తున్నారు. ఈ మూడు రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు అబద్దాలు చెప్పటం దుర్మార్గం. టీడీపీ నేత మల్లెల మూర్తి బాధిత మహిళ, ఆమె కుమారుడిని దారుణంగా కొట్టారు. అదే రోజు పోలీసు స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘నా మీదే స్టేషన్కు వెళ్తావా? అంటూ రోడ్డు మీదే కొట్టారు. ఆ మహిళను వివస్త్ర చేశారు. కేసు పెట్టకపోగా కేసు రిజిస్టర్ చేయలేదు. ఆ తర్వాత 16న నమోదు చేసి అరెస్టు కూడా చేయలేదు. సీసీ కెమెరా పుటేజీ బయటకు వచ్చాక చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే మేల్కొన్నారు. ఆ టీడీపీ నేత మూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మేము పరామర్శకు వెళ్తున్నామని తెలిసి బాధిత కుటుంబాన్ని విచారణ పేరుతో పీఎస్కు తరలించారు...టీడీపీ నేత డబ్బులు వసూలు చేసే దందాలో జరిగిన గొడవ ఇది. దీన్ని వెలుగులోకి రాకుండా తొక్కేసేందుకు ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కుట్ర జరిగింది. కానీ పోలీసులను బలి చేసే కుట్ర చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూసి హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. తన పదవికి రాజీనామా చేసి వెళ్లాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు. -
నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
హైదరాబాద్: రహదారులు రుధిర ధారలుగా మారాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గ్రేటర్ పరిధిలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు పాఠశాల విద్యార్థి, మరొకరు ఇంటర్మీడియట్ విద్యార్థి, ఓ మహిళ ఉన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..మేడ్చల్లో బైక్ను ఢీకొట్టడంతో.. నగర శివారు ఐడీపీఎల్ దిల్కుష్నగర్కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సొహైల్ (18), కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సుమిత్ గైక్వాడ్ (17) గురువారం అర్ధరాత్రి మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వీరి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సొహైల్, సుమిత్ గైక్వాడ్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.కీసర ఓఆర్ఆర్పై..మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన రషీద్ (40) మటన్ షాప్ యజమాని. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాములు (60), గౌస్ కలిసి బొలేరో వాహనంలో గొర్రెల లోడ్తో నగర శివారు చెంగిచర్లలోని మండీకి వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర రావడంతో కీసర ఓఆర్ఆర్పై రాంపల్లి దాయర వద్ద బొలేరో వాహనాన్ని ఎడమ వైపు ఆపి నిద్రించారు. గుర్తు తెలియని వాహనం వెనక నుంచి వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. వాహనంలో నిద్రిస్తున్న రషీద్, రాములు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గౌస్కు కాలు విరిగింది. వాహనంలోని కొన్ని గొర్రెలు సైతం మృతిచెందాయి. మృతుడు రషీద్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రాములుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ ఆంజనేయులు చెప్పారు. మెట్రో పిల్లర్ను బైక్ ఢీ..జగిత్యాల జిల్లా బీజ్పూర్ మండలం నర్సింహుల పల్లె గ్రామానికి చెందిన చెర్పూరి అఖిలేష్ యాదవ్ (24) నగరంలోని కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఆస్పత్రిలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన మహమ్మద్ యూనిస్ (26) ప్రైవేట్ ఉద్యోగ చేస్తూ ఇక్కడి హాస్టల్లో ఉంటున్నాడు.వీరిద్దరూ కలిసి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్పై జేఎన్టీయూ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి భాగ్యనగర్ బస్టాప్ వద్ద వీరి బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో అఖిలేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న మహమమ్మద్ యూనిస్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అఖిలేష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నా భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా?!
కృష్ణాజిల్లా: కట్టుకున్న భర్త మరో మహిళతో ఉంటూ తనని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో భార్య తన కుటుంబ సభ్యులతో ఆ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మచిలీపట్నంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బలరామునిపేటకు చెందిన శ్రీను అనే వ్యక్తికి అంజలితో వివాహం అయ్యింది. శ్రీను శ్లాబు పనులు చేస్తుంటాడు. అయితే ఐదేళ్ల క్రితం శ్రీను మీనాక్షి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా ఆమెతోనే ఉంటూ మొదటి భార్యను పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అంజలి శుక్రవారం రాత్రి తన బంధువులతో కలిసి మీనాక్షిని నడిరోడ్డుపై అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేసింది. ఆమెతో పాటు బంధువులు మీనాక్షిని మహిళ అని కూడా చూడకుండా మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నడిరోడ్డుపై ఆమె దుస్తులను చింపేసి తీవ్రంగా అవమానించారు. కొంత మంది మగాళ్లు కూడా మహిళ అని చూడకుండా మీనాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు పలువురు చికిత్స నిమిత్తం ఆమెను మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వైద్యుల సలహా మేరకు పోలీసులు తమ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. బాధితురాలు కోలుకున్న అనంతరం వివరాలు సేకరించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చిలకలపూడి పోలీసులు తెలిపారు. -
కల్మా చదవాలని విద్యార్థుల డైరీలో రాసిన టీచర్
హైదరాబాద్ : పాతబస్తీ సైదాబాద్లోని సక్సెస్ స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్కూల్లో పని చేస్తున్న ఓ టీచర్ రెండో తరగతి హిందూ విద్యార్థితో ఉర్దూలోని కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలని హోమ్వర్క్ ఇవ్వడం సంచలనంగా మారింది. స్కూల్ డైరీలోనూ అదే విషయాన్ని రాశాడు. గమనించిన బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఈ విషయంపై టీచర్ను నిలదీశారు.విషయం పలు ఇందూ సంఘాలు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బాలికపై లైంగికదాడి.. ఆరుగురిపై పోక్సో కేసు నమోదు
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం టూటౌన్ పరిధిలో బాలికపై లైంగికదాడి చేసిన ఘటనలో ఆరుగురిపై పోక్సో కేసు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గరీబ్పేటకు చెందిన మార్తి రామకృష్ణ ఓ బాలికను ప్రేమపేరుతో వేధించాడు. ఆ తర్వాత ఆమెను జాలె నవీన్, గణేశ్ సహకారంతో ఈ నెల 3వ తేదీన తన బావ, కానిస్టేబుల్ వెంకటేశ్ గదికి తీసుకువెళ్లి లైంగికదాడి చేశాడని తెలిపారు. తరువాత స్నేహితులైన కలకుంట్ల విజేందర్, బడేటి మహేశ్కు చెప్పగా వారు కూడా ఈనెల 4, 5వ తేదీల్లో వేర్వేరుగా బాధితురాలిని భయపెట్టి ఆటోల్లో తీసుకువెళ్లి లైంగికదాడి చేశారని వివరించారు. ఈ విషయమైబాలిక ఈ నెల 11న తల్లికి తెలపగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి బుధవారం మార్తి రామకృష్ణ, కలకుంట్ల విజేందర్, బడేటి మహేశ్, బాలె నవీన్ను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు ఆటోలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన నిందితుల్లో కానిస్టేబుల్ వెంకటేశ్తో పాటు గణేశ్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. వన్టౌన్ సీఐ కరుణాకర్, టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
విధుల్లో ఉండగానే కంప్యూటర్ ఆపరేటర్ను లాక్కెళ్లే యత్నం..!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో దారుణం చోటుచేసుకొంది. తప్పతాగిన ఇద్దరు నగరపాలకసంస్థ కంప్యూటర్ ఆపరేటర్లు, విధుల్లో ఉన్న ఓ మహిళా కంప్యూటర్ ఆపరేటర్ను లైంగికవేధింపులకు గురిచేశారు. ఒక దశలో ఆమెను చుట్టుముట్టి నిర్మానుష్యప్రాంతానికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరపాలకసంస్థలోని ఓ విభాగంలో పనిచేస్తున్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్ సీతారాంపూర్ ప్రాంతంలో ఎస్ఐఆర్ విధులు చేపడుతున్నారు. ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం ఆమె విధుల్లో ఉండగా, అక్కడికి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు వచ్చారు. ఆమెను చుట్టుముట్టి లైంగికవేధింపులకు దిగారు. ఒక దశలో నిర్మానుష్యప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అక్కడ జనాలు ఉండడంతో వీలుపడలేదు. ఆమెను దుర్భాషలాడుతూ తమతో రావాలని, తమకు కంపెనీ ఇవ్వాలంటూ వేధించారు. దీంతో తాను కమిషనర్, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తే, ఉన్నతాధికారులు అని కూడా చూడకుండా వారు ఏమీ చేయలేరంటూ దుర్భాషలాడారు. గట్టిగా హెచ్చరించడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా భర్త మరణంతో కారుణ్య ఉద్యోగం పొందిన ఆమెపై గత ఏడాదిన్నరగా వేధింపులు జరుగుతుండడం గమనార్హం. అప్పట్లోనే బాధిత మహిళ వేధింపులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా, సదరు కంప్యూటర్ ఆపరేటర్తో క్షమాపణ చెప్పించారు. విచారణకు ఆదేశంతనను వేధిస్తున్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లపై చర్యతీసుకోవాలని ఈ నెల 13వ తేదీన బాధిత ఆపరేటర్ నగరపాలకసంస్థ కమిషనర్కు ఫిర్యాదు చే సింది. కమిషనర్ విచారణకు ఆదేశించారు. బుధవా రం నగరపాలకసంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ చేపట్టింది. నిందితులు తమకు రాజకీయ పలుకుబడి ఉందంటూ, తమను ఎవరూ ఏం చేయలేరంటూ బాధిత మహిళను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఇలానే రాజకీయ పలుకుబడితోనే బయటపడ్డారని, మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విధుల్లో ఉన్న మహిళా కంప్యూటర్ ఆపరేటర్ను లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. -
ఆ ముగ్గురు చేసిన తప్పేంటి?
జల్సాలు.. అప్పులు.. ఆస్తి వివాదం.. ఒక హత్య. చివరకు నాలుగు ప్రాణాలను మింగేసింది. హత్య కేసులో నిందితుడిగా మారిన వ్యక్తి అరెస్ట్ భయంతో తన ప్రాణం తీసుకోవడమే కాదు, ప్రపంచం అంటే ఏమిటో కూడా తెలియని ఇద్దరు చిన్నారులను, తనను నమ్ముకుని వచ్చిన భార్యను కూడా మరణం వైపు నడిపించాడు. బావ హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం.. ఓ కుటుంబాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసిన విషాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ ముగ్గురు చేసిన తప్పేంటి?. అభం శుభం తెలియని ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు, భర్తే లోకంగా భావించిన ఓ భార్య. వీరికి హత్య కేసుతో సంబంధం లేదు. కానీ నేరం చేసిన వ్యక్తి తను శిక్షను తప్పించుకోవాలని చూసి.. తన కుటుంబానికే శాశ్వత శిక్ష విధించాడు. భావావేశంలో తీసుకున్న నిర్ణయంతో నాలుగు జీవితాలు రైలు పట్టాలపై ముగిశాయి. నెల్లూరు: బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్యోదంతం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఆస్తి కోసం మేనబావను హత్య చేసిన బావమరిది హరికృష్ణ ఉదంతం వెలుగులోకి రావడం, ఉలిక్కి పడిన నిందితుడు హరికృష్ణ కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్లో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ రెండు కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిలి్చంది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పోలీస్శాఖ అవినీతి, నిర్లక్ష్యం వెరసీ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు హరికృష్ణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘోర కలికి కారణమైంది. ఆ రోజే స్పందించి ఉంటే.. వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్య జరిగిన రోజే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఉంటే.. ఈ రోజు ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఆ రోజే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలోనే కాదు.. ప్రస్తుతం దర్యాప్తు దశలో కూడా పోలీస్ శాఖ నిర్లిప్తత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ కదలికలపై నిఘా పెట్టలేకపోయారు. హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో టచ్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. భార్యాపిల్లలు ఆమె పుట్టింట్లో ఉండగా, మంగళవారం తెల్లవారుజామున వచ్చి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హరికృష్ణ, అతని కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్, కదలికలపై నిఘా ఉండి ఉంటే.. అభం శుభం తెలియని చిన్నారులతోపాటు జీవితాన్ని పంచుకున్న భార్య బతికుండేది. వారేం తప్పు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజునే హరికృష్ణ తాను చనిపోతున్నానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చినా.. పోలీస్శాఖ నిర్లిప్తతగా వ్యవహరించిందని జిల్లా ప్రజలు నిందిస్తున్నారు. హత్య కేసులో ఇరుక్కుని.. కుటుంబాన్ని బలి తీసుకుని జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చులు బాగా పెట్టేవాడు. అంతే స్థాయిలో అప్పుల పాలయ్యాడు. మేనబావ కాక చెల్లి భర్త అయిన బావ ఆస్తిని కాజేయాలని బావ హత్య కేసులో ఏ–1 నిందితుడిగా మారాడు. చివరకు పోలీసులు గాలిస్తున్నారని అరెస్ట్కు భయపడి తనతోపాటు అభం శుభం తెలియని చిన్న పిల్లలు, భార్యతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని వాడు. గ్రామంలో చురుగ్గా ఉండే శ్రీహరి స్థానిక రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉండేవాడు. అయితే ఏఓ శ్రీహరి రెండో వివాహానికి హరికృష్ణ చెల్లెలను ఇచ్చారు. శ్రీహరి మేనమామ కూడా కావడం వల్ల ఇద్దరి మధ్య ఆస్తి వ్యవహారాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీహరిని హరికృష్ణ అంతమొంచాడని పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో హరికృష్ణకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా ఏ–1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ కేసులో ఇరుక్కుని తన జీవితాన్ని నాశం చేసుకోవడంతోపాటు కుటుంబాన్ని కూడా బలి తీసుకున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం ఏఓ శ్రీహరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హతుని బావమరిది కుడుముల హరికృష్ణ (32) ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్కు వెళ్లి భార్య ప్రణతి (29), కుమార్తె మూగాంబిక (5), కుమారుడు కౌశిక్(3)లతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘోరకలి తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావులవారి కండ్రికలో విషాదం నెలకొంది. వెంటాడిన అమావాస్య ఏఓ శ్రీహరి గత నెల 15వ తేదీన అమావాస్య నాడు హత్యకు గురయ్యాడు. సరిగ్గా నెల తిరగకుండానే అదే అమావాస్య అయిన 14వ తేదీ మంగళవారం హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం యాదృచ్చికంగానే భావిస్తున్నారు.తెల్లవారు జామున ఇంటికొచ్చి.. హరికృష్ణ మంగళవారం తెల్లవారు జామున ఇంటికొచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకుని సింగరాయకొండకు వెళ్లాడు. అక్కడే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల భయం పట్టుకుని అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టంగా మారుతుందని తన భార్య, పిల్లలు దిక్కులేని వారవుతారనే ఉద్దేశంతోనే హరికృష్ణ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. -
వైద్యుల భద్రతే ఆరోగ్య భద్రత
మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు, నర్సులపై స్థానిక కార్పొరేటర్ దాడి చేశాడనే వార్తలొచ్చాయి. అరెస్టు చేయబోతున్నారని తెలియగానే, ఆ కార్పొరేటర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని సమాచారం. తాను దాడి చేసిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచే తనకు వైద్యం అందాలని ఆయన ఏ సంకోచం లేకుండా ఆశించడం హాస్యాస్పద విషాదం.ఇదే సంఘటన సింగపూర్లో జరిగితే పరిస్థితి వేరేలా ఉండేది. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో దాడులు, వేధింపుల నివారణకు త్రైపాక్షిక విధానం’ అక్కడ అమలవుతోంది. దాడి చేసిన వ్యక్తికి (అత్యవసరం కాని) చికిత్సను నిరాకరించడంతో పాటు, మెడికల్ రికార్డులలో ‘దురుసుగా ప్రవర్తించే వ్యక్తి’గా శాశ్వతంగా ముద్రించే అవకాశం ఉంది. వైద్యులపై హింసకు అక్కడ జీవితకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.భారతదేశంలో ఆరోగ్య సంరక్షకులపై హింస సాధారణమై పోయింది. వైద్యులు, నర్సులు ఇప్పటికే సుదీర్ఘ పనివేళలు, మాన సిక ఒత్తిడి, వసతుల కొరతతో సతమత మవు తుండగా... ఇప్పుడు బెదిరింపులు, భౌతిక దాడుల భయం పెరుగుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురి తమైన ఉత్తరాఖండ్ అధ్యయనం వివరాల ప్రకారం, 75% మంది వైద్యులు ప్రతీకార దాడులు ఎదుర్కొన్నారు. ఇందులో 68% దాడులు రోగుల బంధు వులు చేస్తే, కేవలం 18% కేసులు మాత్రమే పోలీసుల దృష్టికి వెళ్లాయి. సఫ్దర్ జంగ్ వంటి ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్లలో జరిగిన ఆడిట్ ప్రకారం అధిక ఒత్తిడి షిఫ్ట్లలో హింస రేటు 63.6%గా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసా గితే వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులు ముందు కురారు. ఫలితంగా దేశంలో వైద్య నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను, ఆసుపత్రులకు నష్టం కలిగించ డాన్ని నిషేధిస్తూ అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘హెల్త్కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ వయొలెన్స్ అండ్ డామేజ్ టు ప్రాపర్టీ) బిల్లు’ ముసాయిదాను 2019లో రూపొందించింది. అయితే అది చట్టంగా మారలేదు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ‘అంటు (ఎపిడమిక్) వ్యాధుల చట్టాన్ని’ సవరించి, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడటాన్ని నాన్– బెయిలబుల్ నేరంగా పరిగణించి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా 2020లో చట్టం తీసుకువచ్చినా ఆశించిన స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. వైద్యుల భద్రత – జాతీయ ఆరోగ్య భద్రతకు కీలకం. వైద్యులను గౌరవించడం అంటే – ఆరోగ్య సంరక్షణ పొందే పౌరుల రాజ్యాంగ హక్కును కాపాడటమే.– శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త -
కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి
అనంతపురం సెంట్రల్: అనంతపురంలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన కుమారుడితో విసిగి వేజారిన ఓ తల్లి కత్తెరతో పొడిచి చంపింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని మొదటిరోడ్డు శివాలయం సమీపంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీత, బ్రహ్మయ్య ఆచారి దంపతులు ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కొంతకాలంగా మొదటిరోడ్డు శివాలయం సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమారుడు సురేంద్రచారి(28) ఉన్నాడు. వీరి కుటుంబం కార్పెంటర్ వృత్తిపై ఆధారపడి జీవిస్తోంది. అయితే.. అవివాహితుడైన సురేంద్రచారి కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. పనికి వెళ్లకుండా మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలంటూ నిత్యం తల్లిదండ్రులపై దాడి చేస్తూ వేధించేవాడు. సోమవారం సాయంత్రం తల్లి సునీతతో గొడవ పెట్టుకున్నాడు. పలు దఫాలు దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత అక్కడే ఉన్న దుస్తులు కత్తిరించే కత్తెరతో పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న త్రీటౌన్ పోలీసుస్టేషన్ ఇన్చార్జ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శరత్చంద్ర, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
పల్నాడులో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఘటనాస్థలిలో పోలీసులు ఓ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు‘ అని భారతి రాసినట్లు తెలుస్తోంది. భారతి ఈ ఘోర నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను పోలీసులు విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
కుక్కల్ని చంపే ఇంజెక్షన్ ఎక్కించి ఏవో హత్య..!
నెల్లూరు జిల్లా: బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి (ఏవో) శ్రీహరి హత్య ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జూన్ 15న జరిగిన ఈ ఘోర హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించి ఆధారాలు కాజేసే ప్రయత్నం చేయగా, తాజాగా పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో శ్రీహరిని ఆయన సొంత బావమరిది హరికృష్ణ పక్కా ప్రణాళికతో హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో హత్యకు సహకరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు హరికృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏవో శ్రీహరి తన బావమరిది హరికృష్ణను అమితంగా నమ్మి కోట్ల విలువైన ఆస్తితో పాటు భారీగా అప్పుగా డబ్బులు ఇచ్చారు. అయితే, ఇటీవల శ్రీహరి తనకు మంచి ఇల్లు కట్టుకోవాలని ఉందని, తాను ఇచ్చిన ఆస్తిని, డబ్బును తిరిగి ఇవ్వాలని హరికృష్ణను కోరారు. ఆస్తిని తిరిగి ఇవ్వడం ఇష్టం లేని హరికృష్ణ.. బావను వదిలించుకోవాలని స్కెచ్ వేశాడు. ఇందుకోసం రవీంద్ర, యానాది అనే ఇద్దరు వ్యక్తులను డబ్బు ఆశ చూపి నియమించుకున్నాడు.జూన్ 15న దైవదర్శనం పేరుతో బావను నమ్మించి పెంచలకోనకు కారులో తీసుకెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో చేజర్ల మండలం సమీపంలో కారును ఆపాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన రవీంద్ర, యానాదిలు కారులో ఉన్న శ్రీహరిని గట్టిగా పట్టుకోగా.. హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే రెండు బలమైన ఇంజెక్షన్లను శ్రీహరికి బలవంతంగా గుచ్చాడు. ఆ ఇంజెక్షన్ల ప్రభావంతో శ్రీహరి కారులోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.హత్య అనంతరం దీనిని గుండెపోటుతో జరిగిన సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అనుమానాస్పద పరిస్థితులు, సేకరించిన ఆధారాల ఆధారంగా కేసును ఛేదించారు. ఈ కేసులో హత్యకు సహకరించిన రవీంద్ర, యానాదిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సెల్ఫీ వీడియోతో తెరపైకి కొత్త అంశాలు ఈ క్రమంలో హరికృష్ణ పేరుతో విడుదలైన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తాను చనిపోతున్నానంటూ పేర్కొంటూ విడుదల చేసిన ఈ వీడియోలో తన వ్యక్తిగత విషయాలు, ఆస్తులు, అప్పుల వివరాలను ప్రస్తావించారు. తాను ఎవరికీ ఎలాంటి నష్టం చేయలేదని, తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం. వీడియో చివరలో తన భార్య, పిల్లల గురించి ప్రస్తావిస్తూ వారికి జాగ్రత్తలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సెల్ఫీ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడిందనే అంశంపైనా పోలీసులు దృష్టి సారించి, అతని కోసం గాలిస్తున్నారు. హరికృష్ణ పట్టుబడితే కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించే అవకాశం ఉంది. -
పోలీసుల అదుపులో షాబాద్ ఘటన నిందితుడు?
సాక్షి, హైదరాబాద్: షాబాద్ హత్యల కేసులో నిందితుడు రాజ్కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులో తీసుకున్నట్లు సమాచారం. చేగూరు నుంచి లిఫ్ట్ అడిగి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిన రాజ్ కుమార్.. పోలీస్ కానిస్టేబుల్తో టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్పై కానిస్టేబుల్కు అనుమానం రాగానే పారిపోయేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసులు వెంబడించి పట్టుకున్నట్లు సమాచారం.అయితే, రాజ్కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం మాట్లాడుతూ.. ఆరుగురు హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశామని.. నిందితుడు కోసం మొత్తం తొమ్మిది బృందాలతో గాలిస్తున్నామన్నారు. చేగూరు రైల్వే ట్రాక్ దాటి అడవి ప్రాంతంలో రాజ్ కుమార్ వెళ్లినట్లు సమాచారం. రాజ్ కుమార్ తన మొబైల్ ఫోన్ శుక్రవారం రాత్రి 11:47 స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని రాజ్ కుమార్ కోసం రైల్వే పోలీస్, ట్రాకింగ్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.పోక్సో కేసులో నిందితుడైన రాజ్కుమార్ వరుసబెట్టి ఆరుగుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడు. తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మను మట్టుబెట్టిన ఈ రాక్షసుడు, వారికి మద్దతుగా నిలిచిందనే కోపంతో కట్టుకున్న భార్యను, అభం శుభం తెలియని ఇద్దరు కొడుకుల్నీ కడతేర్చాడు. శుక్రవారం అర్ధరాత్రి ఈ హత్యాకాండ చోటు చేసుకోగా, శనివారం ఉదయం ఈ ఘోరం సంచలనం సృష్టించింది. -
నిందితుడు రాజ్కుమార్ను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ ఘటనలో పోలీసుల కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్కుమార్ను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. ఆరుగురిని హత్య చేసిన పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాజ్కుమార్ కోసం 10 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్కుమార్ ఓ మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. ఈ క్రమంలో అతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మే చివరి వారంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం స్టేషన్ బెయిల్ మీద రాజ్కుమార్ బయటకు వచ్చాడు. ఓ కారు అద్దెకు తీసుకుని సరాసరి బాధితురాలి ఇంటికి వెళ్లి.. ఆమె తల్లి, నాన్నమ్మల గొంతు కోశాడు. ఆపై బాలికను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లి శివారులోని చెరువు వద్ద అత్యాచారం జరిపాడు. ఆపై తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు బిడ్డలను కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీసుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు షాబాద్ చౌరస్తాలో ఈ ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. "పోక్సో కేసులో బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి ఉంటే ఈరోజు ఆరుగురు ప్రాణాలు పోయేవి కావు" అంటూ గ్రామస్తులు పోలీసులపై మండిపడ్డారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ రమేశ్ను సస్పెండ్ చేశామని కలెక్టర్ తెలిపారు. -
8 నెలల గర్భిణిపై భర్త కిరాతకం..!
కడుపులో పెరుగుతున్న బిడ్డ వద్దనుకున్న భర్త 8 నెలల కడుపుతో ఉన్న భార్యను హత్య చేయడానికి ప్రయత్నించిన సంఘటన చిక్కబాణావర పోలీస్స్టేషన్ పరిధిలోని హెసరఘట్ట రోడ్డులో చోటు చేసుకుంది. మహమ్మద్ పీర్(40) అనే వ్యక్తి తన భార్య హసీనా(35)పై హత్యాయత్నం చేశాడు. వివరాలు.. మహమ్మద్ పీర్, హసీనాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే అంతకు ముందే మహమ్మద్ పీర్కు వివాహమై సంతానం కూడా ఉన్నారు. ఈక్రమంలో హసీనా రెండు సార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. మళ్లీ ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవడానికి హసీనా ఒప్పుకోలేదు. మహమ్మద్ పీర్ ఆమెపై దాడి చేసి అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసినా హసీనా ససేమిరా అంది. గురువారం సాయంత్రం హసీనా ఇంట్లో నిద్రిస్తుండగా చున్నీ(వేల్)తో గొంతు బిగించి హత్యాయత్నం చేశాడు. పెనుగులాటలో హసీనా మూర్ఛబోవడంతో మృతి చెందిందని భావించి పరారయ్యాడు. అయితే హసీనాకు స్పృహ వచ్చాక పుట్టింటికి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే హసీనాను వెంటబెట్టుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించి నిందితుడిని అరెస్టు చేశారు.కర్ణాటక: -
భర్త ఆత్మహత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్
బోధన్(నిజామాబాద్): భర్త ఆత్మహత్యకు కారణమైన భార్య.. ప్రియుడితో కలిసి అతడి మరణాన్ని సహజమరణంగా చిత్రించేందుకు యత్నించి పోలీసులకు చిక్కింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య అలియాస్ మహిపాల్ (27), భార్య స్వరూప ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. మల్లయ్య తల్లి గ్రామంలోనే విడిగా ఉంటోంది. గ్రామానికి చెందిన సుమన్తో స్వరూప వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో మల్లయ్య మనస్తాపానికి గురై గత నెల 30వ తేదీన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని స్వరూప ఆమె ప్రియుడు సుమన్కు తెలపగా.. అతను ఇంటికి చేరుకుని ఉరిని తొలగించాడు. భర్త మల్లయ్యది సహజ మరణమని స్వరూప గ్రామస్తులను నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాటు చేయించింది. ఈ క్రమంలో మల్లయ్య గొంతుపై గాట్లు కనిపించడంతో మృతుని తల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, మల్లయ్యది సహజ మరణం కాదని, ఆత్మహత్య అని తేల్చా రు. అతని ఆత్మహత్యకు కారణమైన స్వరూపతోపాటు ఆమె ప్రియుడు సుమన్ను శుక్రవారం రిమాండ్కు తరలించారు. -
భార్య కళ్లెదుటే.. భర్త, అతడి ప్రియురాలు ఆత్మహత్య!
హైదరాబాద్, అడ్డగుట్ట: ఈ నెల 7న శబరి ఎక్స్ప్రెస్లో భార్య కళ్ల ముందే భర్త, అతని ప్రియురాలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, గురువారం నీలవేణి(36) మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని చప్రా గ్రామానికి చెందిన నీలవేణికి భర్త, 16, 18 సంవత్సరాల ఇద్దరు కుమారులు ఉన్నారు.రెండు నెలల క్రితం కుటుంబసభ్యులతో కలిసి నగరానికి వచ్చి మూసాపేటలో నివాసముంటున్నారు. అదే గ్రామానికి చెందిన శిరీష్ అనే వ్యక్తితో నీలవేణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. నెల రోజుల క్రితం ఇద్దరూ కొయంబత్తూరుకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఆచూకీ తెలుసుకున్న శిరీష్ భార్య సులోచన వారిని పట్టుకొని ఈ నెల 7న భర్త, నీలవేణితో కలిసి సికింద్రాబాద్కు శబరి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరింది.ఈ క్రమంలో రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో సులోచన కళ్లెదుటే శిరీష్, నీలవేణిలు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలించగా, రెండ్రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నీలవేణి గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శిరీష్ పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
తరచూ పుట్టింటికి వెళ్తోందని.. హెల్మెట్తో కొట్టి చంపిన భర్త..!
బెంగళూరు: ఓ భర్త తన భార్యను హెల్మెట్తో కొట్టి దారుణంగా కడతేర్చిన ఘటన హుబ్లీ సమీపంలోని తారిహళ గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. నాలుగున్నర నెలల క్రితమే వీరికి వివాహం కావడం గమనార్హం. మృతురాలిని నాగరత్న హొళెమని(24)గా గుర్తించారు. నిందితుడైన భర్తను తారిహాళ గ్రామ గణేష్ నగర్ నివాసి శివరాజ్ హొళెమని(28)గా గుర్తించారు. పెళ్లి అయ్యాక ఈ యువ దంపతుల మధ్య తరచు కలతలు, కలహాలు నెలకొనేవి. నాగరత్న పదే పదే పుట్టింటికి వెళుతుండేది. బుధవారం ఉదయమే నాగరత్న పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చింది. ఉదయం మాటామాటా పెంచుకొని పరిస్థితి ప్రకోపానికి దారి తీయడంతో ఆగ్రహానికి గురైన శివరాజ్ హెల్మెట్తో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగరత్న స్థలంలోనే మృతి చెందిందని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా పరారీలో ఉన్న నిందితుడు శివరాజ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతానికి హత్యకు గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. త్వరలోనే నిందితుడిని పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
అమ్మా.. ఎంత పనిచేశావు?
తిరుపతి జిల్లా: బడి నుంచి ఇంటికొచ్చిన బిడ్డకు అన్నం పెట్టి మళ్లీ పంపించాల్సిన తల్లి.. దారుణానికి పాల్పడింది. కొడుకుపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఆ తల్లి తానూ పెట్రోల్ పోసుకుని సజీవదహనమైంది. అమ్మ తనకు ఎందుకు నిప్పంటించిందో తెలియక శరీరం కాలిపోతుంటే భరించలేక కేకలు వేస్తూ పరుగెత్తిన ఆ చిన్నారి తరువాత కన్నుమూశాడు. అమ్మ స్కూటీ ఎక్కమంటే.. ఎక్కడికో తీసుకెళుతుంది, ఏదో కొనిపెడుతుందన్న ఆశతో స్కూటీ ఎక్కిన ఆ చిన్నారి శరీరం కాలి విలవిల్లాడుతూ ప్రాణాలొదిలాడు. హృదయవిదారకమైన ఈ ఘటన సోమవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో అందరికంట తడిపెట్టించింది.పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరికి చెందిన నాగేశ్వరశర్మకు, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన గూడలి శ్రావణి (35)కి 2014లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు చంద్రమౌళి (09) ఉన్నాడు. పట్టణంలోని కర్ణకమ్మ వీధిలో నివాసముంటున్నారు. నాగేశ్వరశర్మ కాశీపేటలోని శివాలయంలో అర్చకుడుగా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రమౌళి స్థానిక కేంద్రీయ విద్యాలయంలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం బడికెళ్లి మధ్యాహ్నం ఇంటికొచి్చన చంద్రమౌళిని తల్లి శ్రావణి స్కూటీపై ఎక్కించుకుంది. పట్టణానికి కిలోమీటరు దూరం తీసుకెళ్లి రోడ్డుపక్కన ఆపింది. తన వెంటతెచ్చిన సీసాలో పెట్రోల్ కుమారుడిపై పోసి నిప్పంటించింది. ఆ తర్వాత తనపైనా పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు, కాలిన గాయాలు తట్టుకోలేక ఆ బాలుడు కేకలు వేస్తూ పట్టణం వైపు పరుగులు తీస్తూ ఓ ఆటోడ్రైవర్ వద్దకు చేరుకున్నాడు. ఆటోడ్రైవర్ తన సెల్ఫోన్తో నాగేశ్వరశర్మకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరశర్మ హుటాహుటిన అక్కడికి చేరుకునేసరికే శ్రావణి పూర్తిగా కాలి ముద్దగా మారింది. తీవ్రంగా శరీరం కాలిన చంద్రమౌళిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లారు. తరువాత మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న సీఐ రోశయ్య, ఎస్ఐ స్వరూప ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రావణి ఈ దారుణానికి పాల్పడటానికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నేను బతికున్నానంటే నా తమ్ముడు పెట్టిన భిక్షే..
విశాఖపట్నం : ‘నేను బతికున్నానంటే అది కేవలం నా తమ్ముడు పెట్టిన భిక్ష.. నన్ను బతకమని తను మునిగిపోయాడు‘ అంటూ విశాఖ తీరంలో బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన భోగాపురం మత్స్యకారుడు కారె చిన్న మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆ నరకప్రాయమైన రోజు సముద్రంలో ఏం జరిగిందో వివరిస్తూ గుండె పగిలేలా రోదించాడు. ఆయన మాటల్లోనే.. 37 మైళ్ల దూరం వెళ్లాం.. ‘మేము జాలై 1వ తేదీన హార్బర్ నుంచి వేటకు బయలుదేరి సముద్రంలో సుమారు 30 నుంచి 37 మైళ్ల దూరం లోపలికి వెళ్లాం. రెండు రోజుల పాటు వేట బాగానే సాగింది. ఇక ఇంటికి తిరుగు ప్రయాణం అవుదాం అనుకుంటుండగా.. తీరానికి మరో 10 మైళ్ల దూరం ఉందనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తుఫాను గాలులు, రాకాసి అలలు బోటును ముంచెత్తాయి. మేము తేరుకునే లోపే ఒక భారీ అల వచ్చి బోటును బోల్తా కొట్టేసింది. ఆ క్షణంలోనే నా కళ్ల ముందే మా అన్నయ్య కొడుకు (చిన్నయ్య) నీటిలో పడిపోయాడు. మా అన్నయ్య ఏడుస్తూ వెంటనే వాడిని కాపాడటానికి నీళ్లలోకి దూకాడు. అలా వాళ్లిద్దరూ మా కళ్లముందే సముద్రంలో కలిసిపోయారు.బోటు మునుగుతోంది.. రాత్రంతా ఒకే ఫోర్సు పట్టుకుని కూర్చున్నాం.. ‘అప్పటికి బోటు పైన మేం ఆరుగురం మిగిలాం. సమయం గడుస్తున్న కొద్దీ రాత్రి 9 గంటల ప్రాంతంలో బోటు నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభమైంది. ‘మనం విడిపోతే ఎక్కడో దగ్గర చచ్చిపోతాం.. రాత్రంతా ఆరుగురం కలిసే ఉందాం’ అని ఒకరినొకరు ధైర్యం చెప్పుకున్నాం. రాత్రంతా సముద్రం మధ్యలో ఆ మునుగుతున్న బోటుపై రెండు లైఫ్ బాయ్ ఫోర్సులను (రక్షణ వలయాలు) ఆరుగురం గట్టిగా పట్టుకుని తెల్లవార్లూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. కానీ, తెల్లవారేసరికి మాలో ఒక మనిషి కనిపించలేదు. చీకట్లోనే ఎప్పుడు అలల దాటికి కొట్టుకుపోయాడో తెలియదు. అప్పటికి మేం ఐదుగురం మిగిలాం.’ కదిలించిన తమ్ముడి త్యాగం! ‘ఉదయం వెలుతురు వస్తున్న సమయంలో చాలా దూరంలో ఒక చైనా వాణిజ్య నౌక (షిప్) వెళ్లడం కనిపించింది. నేను మా తమ్ముడితో అన్నాను.. ‘తమ్ముడూ.. అక్కడ షిప్ కనిపిస్తోంది.. ఎలాగోలా ఈదుకుంటూ అక్కడికి వెళ్దాం పదా’ అని పిలిచాను. కానీ నా తమ్ముడు నీరసంగా నా వంక చూసి.. ‘నా ప్రాణం ఇక్కడితో అయిపోయింది, ఇక నా వల్ల ఈదడం సాధ్యం కాదు. నేను రాను. నువ్వు నలుగురు పిల్లలున్న వాడివి.. నా మాట విని నువ్వు వెళ్లు.. ఎలాగోలా బతుకు!’ అని నన్ను బలవంతంగా ముందుకు నెట్టాడు. నా తమ్ముడు నన్ను వెళ్లమన్న ఆ మాట నా గుండెను కోసేసింది. వాడు చెప్పినట్లే మేం నలుగురం ఆ షిప్ వైపు ఈదడం ప్రారంభించాం. మేం ఈదుకుంటూ వెళ్తుంటే.. వెనక నుంచి నా తమ్ముడు ’నేను వచ్చేస్తాను.. మీరు వెళ్లండి’ అని ధైర్యం చెప్తూనే ఉన్నాడు. కానీ కొద్దిసేపటికే వాడు కూడా అలల తాకిడికి సముద్రంలో కలిసిపోయాడు.’15 కిలోమీటర్ల ఈత.. చైనా షిప్ లంగర్ పట్టుకుని మృత్యుంజయుడిగా.. ‘నాతో పాటు బయలుదేరిన మిగిలిన ముగ్గురు కూడా మధ్యలోనే అలల వేగానికి కొట్టుకుపోయారు. చివరకు నేను ఒక్కడినే మిగిలాను. దాదాపు 15 కిలోమీటర్ల దూరం మృత్యువుతో పోరాడుతూ ఈదాను. ఎలాగోలా ఆ చైనా షిప్ దగ్గరకు చేరుకుని, దాని ‘లంగర్’ (యాంకర్) గొలుసును గట్టిగా పట్టుకున్నాను. ఆ సమయంలో పెద్ద అల వచ్చి నన్ను కిందకు పడేసింది. చచ్చిపోతాననే భయంతో ’బాబోయ్ కాపాడండి.. కాపాడండి..’ అని గట్టిగా కేకలు వేశాను. నా కేకలు విని షిప్ పైనున్న చైనా సిబ్బంది కిందికి చూశారు. వెంటనే వారు ఒక లైఫ్ జాకెట్, తాడు కిందికి విసిరారు. దాన్ని నడుముకు కట్టుకోగానే నన్ను పైకి లాగారు. నన్ను పైకి తీసుకెళ్లాక దాదాపు రెండు వాటర్ బాటిళ్లు తాగాను. ఆ తర్వాత వాళ్లు నాకు బట్టలు ఇచ్చి, భోజనం పెట్టి ఆదరించారు. నౌకాదళ హెలికాప్టర్ వచ్చేంత వరకు నేను ఆ చైనా షిప్లోనే ఉన్నాను’ అని చిన్న కన్నీరు మున్నీరవుతూ ముగించాడు. మిగిలిన వారి కోసం ఉత్కంఠగా గాలింపు తమ కళ్లముందే కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఒక్కొక్కరుగా సముద్రంలో కలిసిపోతుంటే ఏమీ చేయలేకపోయానన్న చిన్న ఆవేదన అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. ప్రస్తుతం చిన్న ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, మానసిక ఆందోళనలో ఉన్నాడు. కాగా, ప్రమాదంలో కొట్టుకుపోయిన మిగిలిన ఆరుగురి కోసం నౌకాదళ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ బోట్లు సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నాయి. -
ర్యాపిడో రైడ్ విషాదం.. యువతికి విరిగిన ఎముకలు
ర్యాపిడో ఎక్కిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడో రైడర్ వేగంగా బైక్ నడపడంతో ప్రమాదవశాత్తూ కిందపడటంతో పక్కటెములు విరిగిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జూన్ 17న సానికృష్ణ (32) అనే యువతి బైరసంద్రలో ఇంటి నుంచి దొమ్మలూరుకు ర్యాపిడో బుక్ చేసుకుంది. బైక్ వేగంగా నడపొద్దని సానికృష్ణ సూచించింది. తనకు వాహనం ఎలా నడపాలో తెలుసంటూ డ్రైవర్ వాదించాడు. ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో కిందపడిన సానికృష్ణపై వెనుక వచ్చిన ట్రాక్టర్ దూసుకెళ్లింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఎక్స్రేలో పక్కటెములు విరిగినట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన ర్యాపిడో రైడర్, ట్రాక్టర్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.- బెంగళూరు -
‘ఈరోజే నువ్వు ఉరేసుకుని చస్తావు‘
హైదరాబాద్: తాగుడు మానుకోవాలని కోరిన భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు..ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన కిలారు బాలకృష్ణ, భార్గవి దంపతులు బాచుపల్లి రాజీవ్ గాం«దీనగర్లో ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న బాలకృష్ణ మద్యానికి బానిసయ్యాడు. భార్య..మద్యం మానుకోవాలని పలుసార్లు చెప్పింది. అయితే భార్య మాటలను అవమానంగా భావించిన బాలకృష్ణ.. కొన్ని నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. పిల్లలకు సెలవులు రావడంతో భార్గవి పుట్టింటికి వెళ్లగా.. ఏప్రిల్ 25న బాలకృష్ణ తన సోదరుడితో కలిసి మద్యం మత్తులో అక్కడికి చేరుకుని భార్యతో పాటు అత్తను దుర్భాషలాడాడు. భార్గవి సోదరుడిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భార్గవి భర్త ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది.అత్తమామలు వచ్చి సర్దిచెప్పడంతో జూన్ 13న భర్త వద్దకు వెళ్లింది. మొదటి రోజే బాలకృష్ణ భార్యపై బెల్టుతో దాడి చేశాడు. జూన్ 20న ఉదయం నుంచే మద్యంతాగి భార్యపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ ఇంటి బయటే అవమానించాడు. అదేరోజు బయటకు వెళ్లే ముందు ‘ఈరోజే నువ్వు ఉరేసుకుని చస్తావు‘ అని బెదిరించిన బాలకృష్ణ, రాత్రి తిరిగి వచ్చి భార్గవిని గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్కు వేలాడదీశాడు. పిల్లలకు కూడా తల్లి ఉరేసుకుందని చెప్పి, అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడని పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద పరిస్థితులు గమనించి కేసు నమోదు చేశారు. విచారణలో బాలకృష్ణ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. హత్య చేసిన విషయాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ప్రియుడితో సినిమాకు వెళ్లిన భార్య.. నరికి చంపిన భర్త!
చెన్నై: తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి, ప్రియుడితో సినిమాకు వెళ్లిందని తెలుసుకున్న ఓ భర్త కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి, ఇంట్లోనే దాచి ఉంచాడు. ఈ సంఘటన వేలూరు జిల్లా పేర్నంబట్టు సమీపంలోని రాజకల్ పంచాయతీ కూతండవర్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. కూతండవర్నగర్కు చెందిన విజయకుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య ధనలక్ష్మి(36). వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. ధనలక్ష్మి పేర్నంబట్టులోని ఒక ఇంటిలో పని మనిషిగా పనిచేసేది. దీంతో ధనలక్ష్మి పది రోజులకోసారి మాత్రమే తన ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ నేపథ్యంలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య పదిరోజులకోసారి మాత్రమే ఇంటికి వస్తూండడంతో విజయకుమార్ అనుమానించాడు. ఇదలా ఉంచితే, రెండ్రోజుల క్రితం ధనలక్ష్మి తన రెండవ కుమార్తె, ప్రియుడితో కలిసి ఆంబూరులోని ఒక సినిమా చేసి ఆ తర్వాత ఆటోలో స్వగ్రామానికి వెళ్లింది. పనికెళ్తున్నట్టు చెప్పి ఆమె సినిమాకు ప్రియుడితో వెళ్లినట్లు కుమార్తె ద్వారా తెలుసుకున్న విజయకుమార్ రగిలిపోయాడు. తన కుమార్తెలు, కుమారుడిని బంధువుల ఇంటికి పంపించి, ఆ తర్వాత భార్యను నిలదీశాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహించిన విజయకుమార్ కత్తితో ఆమెపై దాడి చేశాడు. చేతుల నరాలు కట్ చేసి, గొంతు కోసి ముక్కలుగా నరికాడు. ఆమె కాళ్లు, చేతులను ఒక గోనె సంచిలో కట్టి ఇంటిలోని వంటగదిలోని స్లాబుపై పెట్టాడు. రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేశాడు. ఆపై ఏమీ ఎరగనట్లు మంగళవారం ఉదయం నుంచి తన భార్య కనిపించడం లేదంటూ బంధువులకు చెప్పాడు. ఈ పరిణామాల క్రమంలో బుధవారం ఉదయం విజయకుమార్ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానించి సమాచారం ఇవ్వడంతో మేల్పట్టి పోలీసులు విజయకుమార్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని, నెత్తుటి మరకలు తుడిచిన గుడ్డను స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లావుగా ఉన్నావని భార్యను కడతేర్చిన భర్త
కర్ణాటక: చిన్న కారణంతో ఓ భర్త తన భార్య గొంతు నులిమి హత్య చేసి ఘటన ధార్వాడ జిల్లాలోని నవలగుంద తాలూకా ఉణసి గ్రామంలో చోటు చేసుంది. ప్రియాంక (29) హత్యకు గురైన మహిళ. భర్త బసవరాజ్ వడ్డర్(32) నిందితుడు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. 2024లో ప్రియాంక, బసవరాజ్లకు పెళ్లయింది. పెళ్లైన నెల రోజుల నుంచి భర్త బసవరాజు సోదరుడు సిద్దరామేష్ తల్లిదండ్రులు సుభాష్, వేణవ్వ పుట్టింటి నుంచి బంగారం తీసుకురావాలని తమ కుమార్తెను వేధించారు. అంతేగాక నువ్వు చాలా లావుగా ఉన్నావు. భర్త వయస్సు కన్నా నీ వయస్సే పెద్దది. ఇలా అయితే గర్భిణివి కాలేవని మానసికంగా, శారీరకంగా హింసించారు. అంతేగాక ప్రియాంకపై అనుమానం పెట్టుకొని భర్త బసవరాజ్ తరచు ఘర్షణ పడుతూ ఆమె గొంతు నులిమి చంపాడని మృతురాలి తల్లి లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి భర్త బసవరాజ్తో పాటు నవలగుంద పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
రమ్యను మర్చిపోయారా?.. పదేళ్లైనా న్యాయం దక్కలేదు!
"ఆ రోజు మా జీవితాలను చీకటిలోకి నెట్టేసింది... కానీ పదేళ్లు గడిచినా న్యాయం మాత్రం దక్కలేదు.".. ఓ కుటుంబం ఆవేదన. 2016 జూలై 1... తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన జరిగిన రోజు. మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన కారు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 10 ఏళ్ల చిన్నారి రమ్య, ఆమె బాబాయి, తాత.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ప్రమాదంలో చనిపోయిన వారి జ్ఞాపకాలు మాత్రమే కాదు.. న్యాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తున్న బాధ కూడా ఇప్పటికీ అలాగే ఉంది.2016 జూలై 1న బంజారాహిల్స్ ప్రాంతంలో మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న వాహనంపై పడింది. ఆ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల చిన్నారి రమ్య తీవ్రంగా గాయపడింది. ఆమె బాబాయి రాజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రమ్య కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గాయాల కారణంగా ఆమె తాత మధుసూదనాచారి కూడా కన్నుమూశారు. ఒకే ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.డ్రంక్ అండ్ డ్రైవ్పై అప్పట్లో దేశవ్యాప్త చర్చఈ కేసులో నిందితులంతా 20 ఏళ్ల లోపే కావడం.. అదీ ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం గమనార్హం. రమ్య కేసు తర్వాత హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్పై విస్తృత చర్చ జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పబ్ల నియంత్రణను మరింత కఠినతరం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. తాగి వాహనాలు నడపకండంటూ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లకార్డులతో జనాలు రోడ్డెక్కి నిరసనలు చేశారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించినప్పటికీ.. ఇలాంటి ప్రమాదాలు పూర్తిగా ఆగలేదు.పదేళ్లలో ఒక్కసారే విచారణ?ఈ కేసులో న్యాయం కోసం పదేళ్లుగా పోరాడుతున్నామని బాధిత కుటుంబం చెబుతోంది. కానీ ఈ పదేళ్లలో కోర్టులో కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణ ముందుకు సాగకపోవడం, తరచూ వాయిదాలు పడుతుండటంతో న్యాయం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.విదేశాల్లో నిందితుడు.. అదో మిస్టరీ!ఈ కేసులో శ్రవిల్, విష్ణు వినీత్లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వెంట మరో నలుగురు కుర్రాళ్లు ఉన్నప్పటికీ.. వాళ్ల గురించి స్పష్టత లేదు. అయితే కేసు తర్వాత విష్ణు వినీత్ విదేశాలకు పారిపోయాడని.. అతన్ని తిరిగి భారత్కు తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు పలుమార్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ఫలితం కనిపించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిందితుడిని భారత్కు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలన్న తమ డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.'ప్రతీకారం కాదు.. న్యాయం కావాలి'పదేళ్లు గడిచినా రమ్య జ్ఞాపకాలు ప్రతి రోజూ వెంటాడుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు ఎవరిపైనా ప్రతీకారం అవసరం లేదని.. కానీ చట్టం తన పని చేసి బాధ్యులకు శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటున్నామని అంటున్నారు. కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను వారు కోరుతున్నారు. -
మా చావుకు కారణం.. ఈ మెసేజ్ చదివితే తెలుస్తుంది!
రంగారెడ్డి: దంపతులు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో మిస్టరీ వీడింది. మోకిల పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. జన్వాడకి చెందిన వడ్ల బాలసాయి (32) సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ గ్రామానికి చెందిన పద్మ(26) కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోగా.. వారికి ఐదునెలల బాబు ఉన్నాడు. బాలసాయి ఫొటోగ్రాఫర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగునెలల క్రితం జుల్కల్లో నివసించే అత్తామామలు శాంతమ్మ, చంద్రయ్య ఇంటికి గుర్తు తెలియని సాధువు వచ్చాడు. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, తవ్వితే ధనవంతులు అవుతారని ఆశ పెట్టాడు. దీనికి ధనం కావాలని చెప్పడంతో వారు పెద్దల్లుడు వెంకటేశ్తో కలిసి బాలసాయిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పలు దఫాలుగా రూ.10 లక్షలు వారికి ఇచ్చాడు. తీరా అడిగే సరికి ఇష్టం వచ్చినట్లు దూషించడంతో భార్యాభర్తలు మనస్తాపానికి గురయ్యారు. చేసిన అప్పులు తీర్చే అవకాశం లేకపోవడంతో బలవన్మరణానికి సిద్ధపడ్డారు. ఆదివారం కుటుంబసభ్యులకు తెలిసేలా భార్య ఫోన్కి మెసేజ్ పెట్టి, ఇంట్లోని ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మెసేజ్ ఆధారంగా పోలీసులు శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేశ్ని అదుపులోకి విచారించగా నేరం అంగీకరించారు. వారిని సోమవారం చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు. అమ్మ, తమ్ముళ్లకు సారీ.. బాబుని బాగా చూసుకోండి చనిపోయే ముందు బాలసాయి చేసిన మెసేజ్లో పెళ్లి జరిగిన తర్వాత అత్తమామతో పడిన బాధలను క్లుప్తంగా వివరించాడు. ‘అమ్మ, తమ్ముళ్లు సారీ.. నాతో కావడం లేదు. నేను నా భార్య చనిపోతున్నాం.. మీరు బాబుని బాగా చూసుకోండి.. పెళ్లి తర్వాత అందరం మంచిగా ఉందామని అత్త, మామ ఇంటికి పిలిచారు.. భార్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నరకం చూపించారు.. ధనవంతులు అవుతాం, అప్పు కావాలని అడిగితే మొత్తంగా రూ. 10 లక్షలు ఇచ్చా.. అడిగితే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు.. ఫొటోగ్రాఫర్గా ఈవెంట్స్ చేసిన డబ్బులు, కెమెరా తాకట్టు పెట్టి మరీ ఇచ్చా.. మా చావుకి కారణం అత్తామామలు శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేశ్లే’ అని మెసేజ్ చేశాడు. -
అత్త కాలు విరగొట్టిన అల్లుడు?
అన్నమయ్య జిలా: కన్నబిడ్డ కాపురంలో వచ్చిన సమస్యలను చక్కబెట్టడానికి వారింటికి వెళ్తే ... విచక్షణారహితంగా దాడిచేసి కాలు విరగ్గొట్టారని బాధితురాలు అమ్రీన్ ఆదివారం తెలిపింది. వివరాలు..పలమనేరుకు చెందిన అమ్రీన్ కుమార్తె అంజును రెండేళ్ల క్రితం చౌడేపల్లె మండలం కోటూరుకు చెందిన మహబూబ్బాషా కుమారుడు ఎండీ గౌస్కు ఇచ్చి వివాహం చేశారు. కొద్దిరోజులపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి కాపురాన్ని సరిదిద్దడానికి కృషి చేసినా మార్పురాలేదు. తన కుమార్తెపై అల్లుడు, వారికుటుంబ సభ్యుల వేధింపులు అధికమయ్యాయని అమ్రీన్ తెలిపారు. కుమార్తె ఫోన్ చేయడంతో ఆదివారం తన మరో ఇద్దరు కుమార్తెలతో కలిసి కోటూరుకు అమ్రీన్ వెళ్లారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో అమ్రీన్కు కాలువిరిగింది. వెంటనే చౌడేపల్లె 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పలమనేరుకు తరలించారు. ఈ మేరకు ఘర్షణ కేసు పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేతన్ హత్య కేసు: ఏఐ సాయంతో వికృత రీల్స్!
పూణె: మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ఇటీవల లోహగఢ్ కోటపై దారుణ హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఒక కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘాతుకం.. డిజిటల్ ప్రపంచంలో ఒక వైరల్ వినోదంగా మారిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ)సాంకేతికతతో సృష్టించిన వికృతమైన రీల్స్, మీమ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫారమ్లలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ, మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. People out there are really making AI edits of Ketan and Siya, Instagram is full of it now pic.twitter.com/Rg6yy86Oyq— Shubham2.0 (@bhav_paaji) June 26, 2026సాంకేతికత దుర్వినియోగంపోలీసుల దర్యాప్తు ప్రకారం, కేతన్ అగర్వాల్ను అతని కాబోయే భార్య సియా గోయల్ లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి తోసి హత్య చేసింది. తొలుత దీనిని ప్రమాదంగా చిత్రీకరించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత అసలు నిజం బయటపడింది. కానీ డిజిటల్ క్రియేటర్లు ఈ దారుణాన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా తరహాలో మలిచేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఏఐ సాయంతో కొండ అంచున ఉన్న ఒక జంట, గంభీరమైన సంగీతం, కిందకు తోసివేయడం, స్లో-మోషన్లో కింద పడిపోవడం లాంటిటి విజువల్స్ను అత్యంత స్టైలిష్గా రీ-క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఒక మనిషి చివరి క్షణాలు, నేడు క్లిక్ల కోసం వాడే కంటెంట్గా మారిపోవడం సమాజ పతనానికి అద్దం పడుతోంది.Ketan Agarwal, owner of business worth crores, was ki!!ed by Siya Goyal with the help of her boyfriend Chetan Chaudhary.A marriage worth crores was arranged. Ketan was innocent and in love with her. She had the courage to kill someone rather than tell her family she loved pic.twitter.com/r5JneEr4zQ— Er Nawaz Choudhary (@N143ch) June 24, 2026లింగ వివక్ష.. నెట్టింట వికృత వ్యాఖ్యలుఈ దురదృష్టకర ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్న తీరు మరిన్ని కలవరపెట్టే నిజాలను బయటపెడుతోంది. ఇలాంటి దారుణాలలో బాధితులు పురుషులైనప్పుడు సోషల్ మీడియా వ్యాఖ్యల విభాగం హింసకు వ్యతిరేకంగా కాకుండా, మహిళలపై సార్వత్రిక దాడులకు వేదికగా మారుతోంది. ‘మగవారికి రక్షణ లేదు’ అనే తరహా కథనాలతో పాటు సియా గోయల్ను విలన్గా చూపిస్తూ వేసిన వికృతమైన జోకులు, మీమ్స్ ఇందుకు ఉదాహరణ. నేరం ఎవరూ చేసినా క్షమార్హం కాదు. కానీ ఒక వ్యక్తిగత నేరాన్ని సమాజంపైకి అస్త్రంగా మార్చుకోవడం ఇక్కడి దుస్థితి.केतन और सिया का अनोखा अवतार!' सोशल मीडिया पर वायरल AI वीडियो ने मचाया तहलकाइंटरनेट पर केतन और सिया का एक नया एआई (AI) जेनरेटेड वीडियो तेजी से वायरल हो रहा है, Ketan Siya Viral Video, AI Generated Look, Social Media Reaction, Trending AI Video]#KetanSiya #AIVideo #ViralTrend pic.twitter.com/L6TbD1l8NT— The Lokdoot (@thelokdoot) June 26, 2026ప్లాట్ఫారమ్ల బాధ్యతారాహిత్యంసోషల్ మీడియా అల్గారిథమ్లు సానుభూతికి, దోపిడీకి మధ్య తేడాను గుర్తించవు. అవి కేవలం వినియోగదారుల ‘అటెన్షన్’ (ఆకర్షణ)ను మాత్రమే కోరుకుంటాయి. ఈ ఘోర శోకాన్ని కూడా రీల్స్, షేర్ల రూపంలోకి మార్చి, బాధితుడి తల్లిదండ్రుల వేదనను పట్టించుకోకుండా క్లిక్లను లాభాలుగా మార్చుకునే ఒక వికృతమైన వ్యవస్థ నడుస్తోంది. సాంకేతికత చిత్రాలను సృష్టించవచ్చు, కానీ వాటిని అప్లోడ్ చేసి, చూసి, ఆనందిస్తున్నది మనుషులే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. లోహగఢ్ కోటపై జరిగిన హత్య ఒక విషాదమైతే, సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వికృత క్రీడ అంతకన్నా పెద్ద మానసిక విషాదంగా పరిణమించింది.ఇది కూడా చదవండి: సింగిల్ శాలరీతో కష్టమే.. మారిన ఆర్థిక సూత్రం -
ప్రియుడి మోజులో భర్త, పిల్లలను వదిలేసి..!
బెంగళూరు: దారి తప్పిన ప్రేమ విషాదాంతమైంది. వివాహిత మహిళతో ప్రేమాయణం నడిపి, ఆమెతో పరారైన వ్యక్తి.. చివరికి ఆమెను హతమార్చాడు. ఈ ఘోర సంఘటన బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకా జిగణిలో జరిగింది. బాగల్కోట జిల్లా ఇళకల్కు చెందిన అక్షత (30)ను ఆమె ప్రియుడు నానా సాహెబ్ బలిగొన్నాడు. ఈ నెల 20న జిగణి పటాలమ్మ లేఔట్లోని ఇంటిలో దుర్వాసన వచ్చింది. ఇంటి యజమాని కిటికిలోంచి చూడగా అక్షత శవం కనిపించగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్లు రిపోర్టులో తెలిపారు. బాడుగ ఇల్లు తీసుకుని.. 2014లో అక్షత, కృష్ణ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కూతురు, కొడుకు ఉన్నారు. భర్త కార్పెంటర్గా పనిచేసేవాడు. ఆమెకు చేనేత కార్మికుడు నానా సాహెబ్తో పరిచయమై అనైతిక సంబంధం ఏర్పడింది. ఇతడు అవివాహితుడు అని సమాచారం. అతని మోజులో పడిన అక్షత భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఇటీవల ప్రియునితో కలిసి ఇళకల్ నుంచి బెంగళూరుకు వచ్చేసింది. తామిద్దం భార్యాభర్తలమని చెప్పి బాడుగ ఇంటిలో చేరారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నానాసాహెబ్ ఆమెను చంపి ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయాడు. హంతకుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఫోన్ మాట్లాడేందుకు టెర్రస్ పైకి వెళ్లి..
మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఐదో అంతస్తుపైనుంచి పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లా చెందిన బుద్ధ వెంకటప్రతాప్ రెడ్డి–ప్రశాంతి దంపతులు అమెరికాలో ఉంటున్నారు. తల్లి ప్రశాంతితో కలిసి కుమార్తె బుద్ధ శ్రీ ప్రాణమ్య (20) ఇటీవల మయూరీ నగర్లోని బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రాణమ్య ఫోన్ మాట్లాడేందుకు టెర్రస్ పైకి వెళ్లి గోడకు ఆనుకొని ఉండగా అదుపు తప్పి కిందపడింది. వాచ్మెన్ సమాచారం ఇవ్వడంతో తల్లి ప్రశాంతి కూతురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రాణమ్య డిగ్రీ ఆన్లైన్లో చదువుతోంది. మృతురాలి తల్లి ప్రశాంతికి స్థానికంగా ఓ ఫ్లాట్ ఉందని.. రెండు మూడు రోజుల్లో అక్కడికి వెళ్లాల్సి ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
రేపే వివాహం.. నిప్పులు పోసిన పోకిరీ
కర్ణాటక: మైసూరు జిల్లాలోని టి.నరసిపుర తాలూకాలోని కెంపయ్యన హుండి గ్రామంలో ఘోర దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులు, కూతురు మరణ వాంగూల్మం రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శివన్న–నాగరత్న దంపతులు, వారి కుమార్తె రక్షిత (20) మృతులు. అదే గ్రామానికి చెందిన ఉల్లాస్ గౌడ అనే వ్యక్తి ఈ కుటుంబాన్ని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విలన్.. ఉల్లాస్గౌడ శివన్న, నాగరత్న దంపతులు కూతురు రక్షితకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ నెల 24న ఆ యువతి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఉల్లాస్గౌడ రక్షితను ప్రేమించానని, తానే పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ రక్షిత, ఆమె తల్లిదండ్రులు అతనిని అంగీకరిచలేదు. కానీ ఆ యువకుడు రక్షితను వెంటాడుతూ వేధిస్తున్నాడు. రక్షితతో పెళ్లి నిశ్చయమైన యువకునికి చెడు సందేశాలను పంపసాగాడు.తాను ఆమెను ప్రేమించానని, నీవు పెళ్లి చేసుకోరాదని బెదిరించాడు. గ్రామంలోనూ ఇదే మాదిరిగా ప్రచారం చేయసాగాడు. దీంతో పెళ్లి రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. తీవ్ర ఆవేదన చెందిన రక్షిత, ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. పెళ్లి వేడుకతో కళకళలాడాల్సిన ఇల్లు స్మశానంలా ఏడుపులతో మార్మోగింది. వరుణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలాదండి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వారి డెత్నోట్ను స్వా«దీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఉల్లాస్గౌడను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరారు. -
గొంతుపై కత్తి పెట్టి.. రెచ్చిపోయిన ప్రేమోన్మాది!
గచ్చిబౌలి: ఇంట్లోకి చొరబడ్డ ఓ ప్రేమోన్మాది యువతి కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని పోచమ్మబస్తీలో నివాసం ఉండే డిగ్రీ విద్యార్థిని (20)ను పక్కింట్లో ఉండే కంచమీది గోవర్ధన్ (22) ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు.శుక్రవారం తెల్లవారుజామున నిందితుడు పక్కనున్న భవనం పైనుంచి యువతి ఉంటున్న రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. యువతి అక్క గొంతుపై కత్తి పెట్టి, అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆపై తల్లిదండ్రులు సత్యనారాయణ, సుజాత, యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. బాధితుల కేకలు విని సత్యనారాయణ సోదరుడు అర్జున్ అక్కడికి రాగా అతనిపై కూడా దాడి చేశాడు. బాధితుల కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని గోవర్ధన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఐదుగురిని గాయపరచిన నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. -
నా అల్లుడిని ఎంత క్రూరంగా హింసించాడంటే.. గోళ్లు పీకేయడం ఏంటండీ..
-
నాకు ఒక్కతే కూతురు.. కొడుకు పుట్టాలని.. సాయి కృష్ణ ఘటనపై అడ్వకేట్ రజిని ఎమోషనల్
-
యువతి దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టి చెరువులో పడేశారు!
ప్రశాంతతకు మారుపేరైన పాలకొండలో ఓ గిరిజన యువతి అనుమానాస్పద మృతి ఈ ప్రాంత వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఓ గిరిజన యువతిని అత్యంత కిరాతకంగా కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసిన ఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూడటంతో సర్వత్రా భయాందోళనలు నెలకున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు.. పాలకొండ మండలం తుమరాడ వయా చింతాడ గ్రామం మధ్య గల చెరువులో యువతి మృతదేహం తేలుతున్నట్లు పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసినట్లు గుర్తించారు. అప్పటికే మండల పరిధిలో బర్నసీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి (32) కనిపించటం లేదని ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి చేరకపోవటంతో తల్లిదండ్రులు చిన్నారావు, కామమ్మ పోలీసులకు బుధవారం ఉదయం తెలియజేశారు. చెరువులో యువతి మృతదేహాం ఉండటంతో పోలీసులు చిన్నారావుకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా నీటిలో నాని రూపు కోల్పోవటంతో దుస్తుల ఆధారంగా మృతురాలు తమ కుమార్తె అని నిర్ధారించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే తపనతో బీఈడీ పూర్తి చేసిన కుమార్తె ఇలా ఘోరమైన స్థితిలో శవంగా మారటంతో మృతురాలి తల్లిదండ్రులు, అన్నదమ్ములు సతీష్ సురేష్, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఆస్పత్రికి తరలించారు. వలంటీరుగా సేవలు గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్గా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్న ఉషారాణి ఇలా చెరువులో దారుణమైన స్థితిలో శవమై కనిపించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలె శ్రీకాకుళంలో బీఈడీ పూర్తి చేసిన ఉషారాణి ఈ నెల 6వ తేదీన చదువుకు సంబంధించి అప్లికేషన్ పెట్టేందుకు ఇంట్లో చెప్పి పాలకొండ వెళ్లాలని తండ్రి వద్ద రూ.500 తీసుకుని వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. తిరిగి ఇంటికి రాకపోవటంతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉంటుందని భావించామన్నారు. శనివారం రాత్రి నుంచి తన సెల్ కూడా అందుబాట్లోకి రాలేదన్నారు. ఘటనా స్థలానికి, మృతురాలి స్వగ్రామానికి దాదాపు 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఉషారాణి మృతి తీరు అనుమానాలకు తావిస్తుంది. ఏం జరిగిందోగాని కాళ్లు చేతులు వెనక్కి విరిచి, తాళ్లతో కట్టి చెరువులోకి తోసేయటం వెనుక కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇది ఒక్కరి పనేనా.. లేక ఎంతమంది ఉన్నారు... ఈ ఘటనకు కారణమేమన్న కోణాల్లో దర్యాప్తు చేపడతామని ఎస్ఐ డోల వెంకన్న తెలిపారు. మహిళలకు రక్షణ కరువు కూటమి అధికారం చేపట్టిన తరువాత మహిళలకు రక్షణకు కరువైందని మాజీ ఎమ్మెల్యే విశ్వాçసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన యువతి అత్యంత దారుణంగా హత్యకు గురవడం అమానుషం అన్నారు. ఈ ప్రభుత్వం మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించకపోవటంతో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. ఉషారాణిని హత్య చేసిన వారిని త్వరితగతిన గుర్తించాలన్నారు. వారిని కఠినంగా శిక్షించి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. భవిష్యత్లో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని కోరారు.పాలకొండ రూరల్/పాలకొండ: -
ఆంటీతో యువకుడి వివాహేతర సంబంధం..!
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో పట్టపగలు మహిళ దారుణ హత్యకు గురైంది. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే అనుమానంతో ఆమెను కడతేర్చాడు. అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. కనుపర్తిపాడుకు చెందిన రేవతి (35)కి సుమారు 18 సంవత్సరాల క్రితం సుమన్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విభేదాల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం రేవతి భర్త నుంచి విడిపోయింది. ఆమె పిల్లలతో కలిసి కనుపర్తిపాడులో తండ్రి వద్ద ఉంటోంది. ఈక్రమంలో అదే ప్రాంతానికి చెందిన కడప శ్రీకాంత్తో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె మరొకరితో మాట్లాడుతుందన్న అనుమానంతో శ్రీకాంత్ తరచూ గొడవ పడేవాడు. ఎలాగైనా రేవతిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.కత్తితో పొడిచి..మంగళవారం రేవతి కొండాయపాళెంలోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్న తన తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చి స్కూటీలో పెట్రోల్ పట్టించుకుని వెళ్తానని బయటకు వచ్చింది అక్కడ శ్రీకాంత్ ఆమెను కలిశాడు. ఇద్దరూ పడారుపల్లి చెరువుకట్ట రేవు వద్దకు వెళ్లారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం నిందితుడు నేరుగా వేదాయపాళెం పోలీస్స్టేషన్కు వెళ్లి తాను ఓ మహిళను హత్య చేశానని జరిగిన విషయం చెప్పాడు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి కాలికి గాయమై ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేర్పించినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. -
నన్ను వదిలి వెళ్లిపోయావా?
‘నువ్వు వస్తావని ఇంటి డోర్ వద్దే చూస్తున్నా.. ఇలా నన్ను వదిలేసి వెళ్లిపోయావా?’ అంటూ వేరొకరు.. నన్ను వదిలి వెళ్లిపోయావా? డ్యూటీకి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న భార్యకు అంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. నువ్వు ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లి.. అక్కడి నుంచి అటుగానే నన్ను వదిలి వెళ్లిపోయావా? స్టీల్ప్లాంట్లో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇలా అర్థాంతరంగా వదిలి వెళ్లిపోతారని ఏనాడూ అనుకోలేదు. మావి కూలి బతుకులు. ఇప్పుడు మాకు దిక్కెవరు. – నక్కా జోగమ్మ, మృతుడు రమణ భార్య‘12 ఏళ్ల క్రితం ఉక్కు ద్రవం పడి కాళ్లు గాయపడ్డాయి.. నేడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను మింగేసింది!’ అని ఒకరు..అప్పుడు కాలు.. ఇప్పుడు శరీరమే మసైపోయింది.. 12 ఏళ్ల కిందట నా భర్త విధి నిర్వహణలో ఉంటుండగానే ఉక్కు ద్రవం పడి కాలు తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను పొట్టనబెట్టుకుంది. ఏంటి భగవంతుడా మాకీ కర్మ? జీవితంలో ఎన్ని కష్టాలు పడినా పిల్లలిద్దరినీ బీటెక్ చదివించారు. ఇప్పుడు అకస్మాత్తుగా నా భర్తను దూరం చేసి మమ్మల్ని ఇలా రోడ్డున పడేశావు. – గొట్టాపు రాధ, మృతుడు గోట్టాపు త్రినాథ్ భార్య అన్యోన్య దాంపత్యాన్ని చూసి దేవుడికే కన్ను కుట్టి.. ‘పిల్లల్ని బాగా చూసుకో’ అంటూ మధ్యాహ్నం పెట్టిన మెసేజే నా భర్త ఆఖరి మాట అవుతుందనుకోలేదు’ అని మరొకరు.. ‘మాది ప్రేమ వివాహం. 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. మాకు ఇద్దరు పిల్లలు ధను‹Ù, లోకేష్ 6, 7 తరగతులు చదువుతున్నారు. సోమవారం విధులకు వెళ్లిన నా భర్త, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫోన్కు మెసేజ్ చేశారు. ‘పిల్లలకు ఒంట్లో బాగోలేదు, వారిని కనిపెట్టుకుని ఉండు’ అని చెప్పారు. ఇంతలోనే ఇంతటి ఘోరవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ప్రేమ వివాహం చేసుకుని పిల్లలతో అన్యోన్యంగా ఉన్న తమ కుటుంబాన్ని చూసి భగవంతుడికి కన్ను కుట్టిందనుకుంటా. సాయంత్రం దేవుడి గదిలో దీపం పెడదామనుకుంటే.. ఏకంగా భర్త జీవితమే దీపంలా ఆరిపోతుందని ఊహించలేకపోయాను. –గొందేశి రాజమ్మ, మృతుడు వెంకటప్పారావు భార్య ఇలా మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా చేసిన ఆక్రందనలు.. కన్నీటి రోదనలతో కేజీహెచ్ మార్చురీ ప్రాంగణం శోకసంద్రంగా మారిపోయింది. విశాఖ స్టీల్ప్లాంట్లో సంభవించిన ఘోర ప్రమాదం ఎనిమిది మంది శ్రామికుల ప్రాణాలను బూడిద చేయడమే కాకుండా, వారిని నమ్ముకున్న కుటుంబాల జీవితాల్లో ఎప్పటికీ పూడ్చలేని చీకట్లను నింపింది. బతుకుదెరువు కోసం నిరంతరం స్వేదం చిందించే ఆ కార్మికులపై, సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల మరిగే ఉక్కు ద్రవం మృత్యువులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది శ్రామికులు సజీవ దహనమై బొగ్గు ముద్దల్లా మారిపోయారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మంగళవారం నిర్వహించిన పోస్టుమార్టం ప్రక్రియ, ఆపై తమ వారి మృతదేహాలను చూసి బంధువులు చేసిన ఆర్తనాదాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించాయి. -
మా నాన్నది నైట్ డ్యూటీ... కానీ, సంచలన నిజాలు బయటపెట్టిన మృతుని కుమారుడు
-
పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం
జనగామ: తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఓ పసికందుకు వైద్యులే అమ్మానాన్నలుగా మారి 72 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడిన మానవీయ ఘటన జనగామ చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దిన వైద్యులు గురువారం శిశుగృహకు అప్పగించారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. లింగాలఘనపురం మండలం (ఏపీ వసల కూలీలు) కళ్లెం గ్రామానికి చెందిన తిక్కవరపు పద్మ, నరేశ్ దంపతులు ఇటుక బట్టీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనావిుకను శిశుగృహ సిబ్బందికి అప్పగిస్తున్న వైద్యులు ఈ ఏడాది మార్చి 23న పద్మ ఐదో సంతానంగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. కేవలం 1.24 కిలోల బరువు, చిన్న ఆరోగ్య సమస్యలతో జన్మించిన ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఎస్ఎసీయూలో ఇన్నాళ్లు చికిత్స అందించారు. అయితే ఆడపిల్ల కావడం, అత్యల్ప బరువుతో జన్మించడం వంటి కారణాలతో డెలివరీ జరిగిన వారం రోజులకే తల్లిదండ్రులు పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం ఆధ్వర్యంలో, డిప్యూటీ సూపరింటెండెంట్ మధుసూధన్రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆ చిన్నారికి అండగా నిలిచారు. పాపకు ‘అనావిుక’ అని పేరు పెట్టి నెల బర్త్డే వేడుకలతోపాటు మినీ బారసాల కార్యక్రమం కూడా నిర్వహించారు. పూర్తిగా ఆరోగ్యవంతురాలిగా మారడంతో డాక్టర్ మధుసూధన్రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో గురువారం హనుమకొండ శిశు గృహకుప్రత్యేక వాహనంలో తరలించారు.భావోద్వేగంఅయితే ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. 72 రోజులుగా తమ చేతుల్లో పెరిగిన చిన్నారిని పంపించే సమయంలో వైద్యులు, సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. పేగుబంధం లేకపోయినా ప్రేమతో పెంచిన అనావిుకకు వీడ్కోలు పలుకుతూ వారు చూపిన ఆప్యాయత అందరినీ కదిలించింది. పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!! -
కూతురి ప్రేమ వివాహం.. మనవడిని కుక్కర్తో కొట్టి చంపిన తాత!
తమిళనాడు: నామక్కల్ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన వెంకటాచలం. ఇతని భార్య అముధ. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వెంకటాచలం మద్యపానానికి బానిసయ్యాడు. ఇతను ఇంట్లోని పాత్రలను అమ్ముతాడు. ఆ డబ్బుతో మద్యం తాగుతూ తిరుగుతాడు. ఈ క్రమంలో, అతని పెద్ద కుమార్తె మోనిషా, భవానికి చెందిన మయిలానందన్తో ప్రేమలో పడింది. తల్లిదండ్రుల వ్యతిరేకత ఉన్నప్పటికీ వీరికి వివాహం జరిగింది. ఈ పరిస్థితుల్లో, మోనిషా 10 రోజుల క్రితం తన 10 నెలల బాబు జోష్విక్తో కలిసి తల్లి ఇంటికి వచ్చింది. దీనికి వెంకటాచలం అభ్యంతరం తెలిపి, ‘ఎందుకు ఇంటికి వచ్చావు? అని అడిగి కూతురిని కొట్టి, హింసించాడు. కుక్కర్ మూత తీసుకుని మోనిషాపై విసిరాడు. అది ఆ పిల్లాడి తలపై పడడంతో, ఆ పిల్లాడు గాయపడి మరణించాడు. మోనిషా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంకటాచలాన్ని అరెస్టు చేశారు. -
వార్త రాస్తే నోటీసులా?
అనకాపల్లి జిల్లా: హోంమంత్రి నియోజకవర్గంలో ఎన్ని ఘోరాలు జరిగినా చేతులు ముడుచుకుని కూర్చోవాలన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వార్తలు రాసే విలేకర్లకు నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. దీనికి ఉదాహరణ ఈ నెల 20వ తేదీన పాయకరావుపేట కంటోన్మెంట్ ఏరియాలో దళిత మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేరోజు లీడర్ పత్రికలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్టు వార్త ప్రచురితమైంది. ఈ వార్త రాసిన పాయకరావుపేట విలేకరి బి.రమేష్ బాబుకు పోలీసులు బిఎన్ఎన్ చట్టం 179కింద పాయకరావుపేట స్టేషన్ హౌస్ ఆఫీసరు పేరుతో నోటీసు ఇచ్చారు. ఈనెల 26వ తేదీన స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. బాధితులు తెలిపిన వివరాలు, తమకు అందిన సమాచారం మేరకు వార్త రాస్తే జరిగిన ఘటనపై మీకు అవగాహన ఉందని స్టేట్మెంట్ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు లైంగిక దాడిని సెల్ఫోన్ వివాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో కేసు సెక్షన్లు వేసి నిందితులు ఇద్దరిని ఆదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బాలికపై జరిగింది లైంగికదాడి కాదని సెల్ఫోన్ వివాదమని..దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మరుసటిరోజు నర్సిపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వివరణ ఇచ్చినప్పటికీ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ శంకర్రావు కూడా ఫిర్యాదు అందింది, పోక్సో కేసు కాబట్టి గోప్యత పాటిస్తున్నాం అని తెలిపారు. పోలీసులే పోక్సో కేసు వర్తిస్తుందంటూ కేసు నమోదు చేసినప్పుడు వార్త రాసిన విలేకరికి నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్న వాదన వినిపిస్తోంది. హోం మంత్రి నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో మంత్రి మెప్పుకోసమే ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి అనిత కూడా ఇటీవల దళిత బాలికపై జరిగింది అత్యాచారం కాదంటూ చెప్పడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తెను నిందితులు కొబ్బరితోటలోకి తీసుకెళ్లి కొట్టడంతో పాటు, లైంగిక దాడికి పాల్పడ్డారని, శరీరంపై గాయాలు కూడా ఉన్నాయంటూ బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొంది. మంత్రి నియోజకవర్గంలో భవిష్యత్లో ఎటువంటి వ్యతిరేక వార్తలు రాయకూడదన్న బెదిరింపు ధోరణితోనే విలేకరికి పోలీసులు నోటీసులు ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
జైపూర్ మహిళ కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
జైపూర్: జైపూర్లో మహిళ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అను మీనాకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న గౌతమ్ మీనాతో 2015లో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల నుంచే గౌతమ్ మద్యానికి బానిసై ఆమెను వేధించడం ప్రారంభించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆమెను పలుమార్లు తిట్టడమే కాకుండా శారీరకంగా కూడా దాడి చేసేవాడని సమాచారం.పదేళ్ల కుమారుడు తన తండ్రి క్రూరత్వాన్ని గురించి వివరించాడు. తన తండ్రి తరచూ అమ్మను కొట్టేవాడని తెలిపాడు. తన రక్తపోటు (బిపి) పడిపోయినప్పుడల్లా ఉప్పు నీరు ఇవ్వమని అమ్మ తనకు చెప్పేదని.. ఒకసారి తాను అమ్మకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుండగా.. తండ్రి అడ్డుకున్నారన్నారు. నాన్న తరచూ అమ్మను కొడుతూ, వేధించేవాడు.ఒక రోజు నాన్న ఇంటికి వచ్చి, టీవీలో పాట పెట్టి, ఆ తర్వాత టీవీని పగలగొట్టి అమ్మను కొట్టాడు. నేను అమ్మ కోసం నీళ్లు తేవడానికి వెళ్తే.. నాన్న అమ్మదే తప్పు అంటూ నిందించాడు" అంటూ కుమారుడు మాహిర్ చెప్పాడు. వారి 8 ఏళ్ల కుమార్తె సమైరా కూడా తన తల్లిదండ్రుల మధ్య జరిగే తరచుగా గొడవల గురించి వివరించింది. సామాజిక కార్యక్రమాలు, ఒక ఫ్యామిలీ ట్రిప్కు వెళ్లినప్పుడు కూడా అందరి ముందే గొడవలు పడేవారని ఆమె పేర్కొంది.వీడియో కాల్లో ఆత్మహత్యనిరంతర వేధింపులను భరించలేక ఏప్రిల్ 7న అను మీనా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె తన భర్తకు వీడియో కాల్ చేసి ఆ కాల్ నడుస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నారు. పొరుగువారు గమనించి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెను బ్రతికించడానికి సిపిఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.అను తల్లి మాట్లాడుతూ... అను తన భర్త ప్రవర్తన గురించి తరచూ ఫిర్యాదు చేసేదని.. కానీ పరిస్థితి ఇంతవరకు వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన జరిగిన రోజు తాను అను చేసిన ఫోన్ కాల్ను మిస్ అయ్యానని.. ఆ కాల్ ఎత్తి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఫోన్లో లభించిన ఆధారాలుసంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత.. కుమారుడు మాహిర్ తన తల్లి ఫోన్ను తెరిచి అందులోని కొన్ని వీడియోలను గొడవకు సంబంధించిన ఫుటేజీని సేకరించాడు. ఒక వీడియోలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో గౌతమ్.. అనును తీవ్ర పదజాలంతో తిట్టడం స్పష్టంగా వినబడుతోంది. ఆ వీడియోలో గౌతమ్.. అనును, ఆమె కుటుంబ సభ్యులను కూడా దూషించడం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. -
అమీర్పేట గర్ల్స్ హాస్టల్లో.. చొరబడ్డ వ్యక్తులు..!
హైదరాబాద్: గర్ల్స్ హాస్టల్లో గుర్తుతెలియని వ్యక్తులు కనిపించారని చెప్పిన యువతులపై దుర్భాషలాడిన హాస్టల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన మేరకు.. అమీర్పేటలో ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్ను శివపార్వతి, ఆమె కుమారుడు వీరారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న తెల్లవారు జామున ఓ గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో యువతి లేచి చూడగా బాత్రూమ్లో దూరాడు. గట్టిగా అరవడంతో పరారయ్యాడు. ఈ విషయం నిర్వాహకుడు వీరారెడ్డికి చెబితే దుర్భాషలాడాడు. ఇలా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చినట్లు యువతులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి వీరారెడ్డిని అరెస్టు చేశారు. శివపార్వతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
జడ్చర్ల ఘటన.. ప్రేమోన్మాది మృతి
సాక్షి, మహబూబ్నగర్ జిల్లా: జడ్చర్లలో యువతిని హత్య చేసిన యువకుడు తేజ మృతిచెందాడు. నిన్న యువతి వైష్ణవిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు.. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. యువతిని కత్తితో విచక్షణారహితంగా తల, మెడపై పొడవడంతోపాటు గొంతు కోయడంతో యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మృత్యువాత పడింది. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి (23) పోలేపల్లి సెజ్లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు.ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచి్చన 108 అంబులెన్స్లో యువతిని వైద్యచికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.అయితే దాడికి పాల్పడిన యువకుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా స్థానికులు పోలీసులను దరిచేరకుండా అడ్డుకున్నారు. తోపులాటలు, వాగ్వివాదం, కేకలు చోటు చేసుకున్నాయి. చివరకు తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. చివరికి ఆ యవకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.ఎర్రసత్యం కాలనీలో నివాసం ఉంటున్న రాంచంద్రయ్యకు భార్య శ్రీలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో హతురాలు వైష్ణవి పెద్ద కూతురు. ఈమెకు ఇటీవల పెళ్లి నిశ్చయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే నెలలో నిశ్చితార్థం, మరో రెండు నెలల్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈలోగా ఈ దారుణం జరిగిందని వారు కన్నీటిపర్యంతం అయ్యారు.మరో వంద అడుగులు వేసి ఉంటే తమ ఇంట్లోకి వచ్చేదని, ఇంతలోనే దారుణ హత్యకు గురైనట్లు వారు పేర్కొన్నారు. దాడి చేసిన యువకుడు ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. హత్య చేసి పారిపోతుండగా యువకుడిని పట్టుకున్న స్థానికులు అతని గురించి ఆరా తీశారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన డబ్బులు తీసుకుందని నిందితుడు పేర్కొన్నాడు. -
మొయినాబాద్ ఫౌంహౌస్లో దారుణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం తాండూరులో అదృశ్యమైన ఇద్దరు మహిళలుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను తాండూరులో కిడ్నాప్ చేసిన దుండగులు.. దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మహిళల నుంచి అప్పులు తీసుకున్నవాళ్లే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
బోరుబావిలో చిన్నారి.. 10 గంటల ఉత్కంఠ!
హోషియార్పూర్: పంజాబ్లోని హోషియార్పూర్లో శుక్రవారం సాయంత్రం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన ఓ చిన్నారి దాదాపు 10 గంటల పాటు మృత్యువుతో పోరాడాడు. 90 అడుగుల లోతులో చీకటిలో చిక్కుకున్న ఆ అభం శుభం తెలియని ప్రాణాన్ని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేసిన సాహసోపేత ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతమైంది. ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.300 అడుగుల లోతు కలిగిన..అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ హృదయ విదారక ఘటన హోషియార్పూర్ జిల్లాలోని చక్ సవానా గ్రామంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. 300 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన ఆ చిన్నారి, సుమారు 90 అడుగుల వద్ద ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్ సేవలతో పాటు ఎంపీ రాజ్ కుమార్ చబ్బెవాల్, పంజాబ్ మంత్రి రవ్జోత్ సింగ్, జిల్లా ఎస్ఎస్పీ తదితర ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.10 గంటల పాటు ఉత్కంఠబాలుడి ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శరవేగంగా రంగంలోకి దిగాయి. చిన్నారి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు బోరుబావి లోపలికి అధునాతన కెమెరాలను పంపారు. అలాగే నాలుగు జేసీబీ యంత్రాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా భారీ తవ్వకాలు చేపట్టారు. పోలీసులతో పాటు స్థానిక ఎన్జీవోలు, గ్రామస్తులు కూడా ఈ సహాయక చర్యల్లో చురుకుగా పాలుపంచుకున్నారు. రాత్రింబవళ్లు శ్రమించి, దాదాపు 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ ఆపరేషన్ చివరకు ఫలించింది. అర్ధరాత్రి సమయంలో బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో రెస్క్యూ సిబ్బంది సఫలమయ్యారు.ఆస్పత్రికి తరలింపు.. ఆనందంలో కుటుంబంబోరుబావి నుంచి ప్రాణాలతో బయటపడిన చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గంటల తరబడి బోరుబావిలో ఇరుక్కుపోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా తలెత్తాయా అని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బాలుడు క్షేమంగా ఉన్నాడని అధికారులు వెల్లడించడంతో, అప్పటివరకు తీవ్ర ఆందోళనతో గడిపిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సకాలంలో స్పందించి, తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన రెస్క్యూ బృందాలకు వారు కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు. -
తల్లిని చంపిన కోరిక!
విజయనగరం: నవమాసాలు కని పెంచిన కన్న కొడుకే తల్లి పాలిట కాలయముడయ్యాడు. ప్రయోజకుడిని చేయాలనుకున్న కన్నపేగే మృత్యుపాశమైంది. సెల్ఫోన్లో వచ్చే కిల్లర్ యానిమేషన్, డాన్ ఫిల్్మలకు ఆకర్షితుడైన ఆ యువకుడు అతిగా ఊహించుకున్నాడు. వాటికి తోడు తల్లి పెట్టిన ఆంక్షలు తట్టుకోలేకపోయాడు. మరో స్నేహితుడి సాయం తీసుకుని తల్లినే హతమార్చాడు. ఇవీ రాజాం పట్టణం డోలపేటలో ఈనెల 4న జరిగిన స్పందన హత్యకేసు ఘటన వివరాలు. పదిరోజుల అనంతరం పోలీసులు కేసు ఛేదించి తల్లి హత్యకు కారణమైన కుమారుడిని, స్నేహితుడిని పట్టుకుని రాజాం పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.ఈ నెల 4న డోలపేటలో స్పందన అనుమానాస్పద హత్యకు గురైంది. హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె కుమారుడిపై అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి పట్టుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో 525 మార్కులు సాధించిన స్పందన కుమారుడు సెల్ఫోన్లో యానిమేషన్ ఫిల్్మకు ఆకర్షితుడయ్యాడు. బాగా చదవాలని, సెల్ఫోన్ వినియోగించరాదని తల్లి బుద్ధులు చెప్పడంతో పాటు బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుని రావాలని, పెద్దలతో మర్యాదగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని రూల్స్ పెట్టింది. వాటికి తోడు కుమారుడి వద్ద ఉన్న లెటర్స్, పుస్తకాలు తరచూ తనిఖీ చేస్తుండేది. ఈ కట్టుబాట్లకు ఆ యువకుడు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతే కాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి మందలించింది. దీంతో మరింత మనస్తాపానికి గురై స్నేహితుల వద్ద మా అమ్మ నన్ను టార్చర్ చేస్తోందని, ఇల్లు వదిలి బయటకు వెళ్లి డాన్గా మారాలని చెప్పేవాడు. అదే సమయంలో డోలపేట సమీపంలోని గ్రామానికి చెందిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు కూడా ఇలానే ఆలోచించడం, ఇంటర్పరీక్షలు ఇటీవల రాయకుండా వదిలేయడం, ఇంటి వద్ద తండ్రి మందలించడంతో బయట తిరగడం చేసేవాడు. వ్యవస్థపై విసుగుచెంది కోపం పెంచుకోవడంతో పాటు ముంబై వంటి ప్రాంతాల్లో మాఫియాలో చేరాలని ఆ యువకుడు కూడా అనుకునేవాడు. దీంతో వారిద్దరి ఆలోచనలు ఒకటి కావడంతో ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో స్పందన కుమారుడు మా అమ్మని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. తాను కూడా మాఫియాలో చేరాలని అనుకున్నాడు. దీనికి పథకం వేసుకున్నారు. అక్కడి నుంచి అనుకున్న పథకం ప్రకారం ఈనెల 4న స్పందన ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆమె ఇంట్లో లేదు. మా అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే బాత్రూమ్కి వచ్చి కాళ్లు కడుక్కుంటుందని అని చెప్పడంతో అతని స్నేహితుడు బాత్రూమ్లో దాక్కున్నాడు. వారు అనుకున్నట్లే ఆమె ఇంటికి వచ్చి బాత్రూమ్లో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లింది. అప్పటికే అక్కడే ఉన్న స్నేహితుడు ఆమె మెడపట్టుకుని కిందపడిపోయాడు. అరుస్తున్న ఆమె నోటిని రెండో చేతితో గట్టిగా మూశాడు. ఆమె ఆ యువకుడి చేతిని కొరికినా విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నాడు. చనిపోయిందని అనుకుని వదిలేశారు. అయినా ఆమెలో కదలికలు రావడంతో ఇద్దరూ ఇంట్లో ఉన్న కత్తులతో దాడిచేశారు. బాత్రూమ్లో రక్తాన్ని కడిగేసిన తరువాత చీరలో అమెను చుట్టి ఇంటి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరపడేశారు. వారు ధరించిన బట్టలు, కత్తులు సైతం ఎవరికీ కనిపించకుండా విసిరేశారు. అనంతరం వారిద్దరూ ఇంట్లో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5వేలు నగదు తీసుకుని వెళ్లిపోయారు. అక్కడి నుంచి పలాస, విశాఖపట్నం, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లలో సిమ్లు పడేసి అప్పుడప్పుడు ఫ్రెండ్స్కు ఇన్స్ట్రాగామ్ ద్వారా మెసేజ్లు చేసేవారు. అలా ఇన్స్టా గ్రామ్ మెసేజ్ ద్వారా వారిద్దరూ తిరుపతిలో ఉన్నట్లు రాజాం పోలీసులు కనిపెట్టి తిరుపతి పోలీసుల సహాయంతో నిందితులిద్దరినీ పట్టుకుని వారి వద్ద ఉన్న బంగారం కడియం, కత్తులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ జువైనల్ హోమ్కు తరలించనున్నామని డీఎస్పీ పేర్కొన్నారు.మాఫియాకు ఆధారాలు చూపించాలనే..సంవత్సరం క్రితం పరిచయమైన వారిద్దరూ మాఫియాలో చేరాలని నిర్ణయించుకుని, జపాన్ యానిమేషన్లు తరచూ చూస్తూ వాటిని అనుకరించారు. దీంతో వాటికి ఆకర్షితులై వారిలా మాఫియా డాన్లు కావాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన తల్లిని చంపిన తరువాత వారిని పోలీసులు వెతికిన ఆధారాలు చూపిస్తే మాఫియాలో జాయిన్ చేసుకుంటారనేది రెండో బాలుడు చెప్పిన అంశమని డీఎస్పీ తెలిపారు. పిల్లల ప్రవర్తనపై దృష్టిసారించాలి..ఇంట్లో చిన్నారుల కదలికలతోపాటు వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని డీఎస్పీ రాఘవులు అన్నారు. ఎక్కువగా సెల్ఫోన్లకు అలవాటుపడిన పిల్లలు ఏం చేస్తున్నారు? వారి ఫ్రెండ్స్ ఎవరు? సోషల్ మీడియాలో వారి పాత్ర ఏమిటి వంటి వాటిని గ్రహించాలని హితవు పలికారు. ఇలా వారిపై దృష్టిసారిస్తే తీవ్రమైన నేరాలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. సమావేశంలో టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్కుమార్, హెచ్.ఉపేంద్ర, ఎస్సై సల్మాన్ బేగ్లు పాల్గొన్నారు. -
అద్దె అడిగితే గొంతు కోశాడు
సూర్యాపేట జిల్లా: అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధురి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
బాలికపై బాబాయి లైంగిక దాడి
హైదరాబాద్: పరీక్షలు పూర్తి అయ్యాయి..వేసవి సెలవులు సరదాగా గడుపుదామని బాబాయి ఇంటికి వెళ్లింది ఓ బాలిక..అయితే బాబాయి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన బాలిక (16) సెలవులకు తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. జీఎస్టీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పసిచేస్తున్న బాబాయి రామమూర్తి... తన భార్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల తరువాత నగరానికి వచి్చన బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచి్చంది. తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేష¯న్కు బదిలీ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో..
ఢిల్లీ: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. స్లీపర్ బస్సులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. బస్సులో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలు పీతంపురలోని మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. మే 11వ తేదీ రాత్రి సదరు మహిళ పని ముగించుకుని ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో సరస్వతి విహార్లోని బస్టాప్ వద్ద ఓ స్లీపర్ బస్సు ఆగింది. బస్సు తలుపు వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం ఎంత అని అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.అనంతరం నిందితులు బస్సును నాంగ్లోయ్ వైపు నడిపారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. బస్సును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుగుతోందని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. -
భర్తను చంపిన కేసులో భార్య, ప్రియునికి ఉరిశిక్ష..14 లక్షల జరిమానా..!
బెంగళూరు: అనైతిక బంధానికి ఒడిగట్టిన భార్య చివరకు హత్యకూ వెనుకాడలేదు, ఫలితంగా కఠిన శిక్షకు గురైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియునికి శివమొగ్గ జిల్లా భద్రావతి కోర్టు మరణశిక్షతో పాటు రూ. 14 లక్షల జరిమానా విధించింది. మత్తు మందు ఇచ్చి.. వివరాలు... 2020 జనవరి 15న, భద్రావతిలోని పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురగీ టాప్కు చెందిన ఫ్లోరా నాన్సీ అనే మహిళ, తన ప్రియుడు రాజశేఖరయ్యతో కలిసి భర్త ప్రకాష బాబుకు మత్తుమందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి, సీఐ మంజునాథ్.. దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషిట్ సమర్పించారు. భద్రావతిలోని 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ రత్నమ్మ వాదనలు వినిపించారు. ఫ్లోరా నాన్సీ, ప్రియునికి ఉరే సరైన శిక్ష అని వాదిస్తూ ఆధారాలను సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఇందిరా మైలస్వామి చెట్టియార్.. ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో పాటు రూ.14 లక్షల జరిమానా విధించారు. మృతుని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
కొడుకు కోసం నితీష్ అంత పనిచేశారా?.. ఆ రోజు ఏం జరిగింది?
పట్నా: బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో భాగంగా బిహార్లో 32 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్, ఇప్పుడు పూర్తిస్థాయి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిశాంత్ కుమార్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.నిశాంత్ ప్రాథమిక విద్యాభ్యాసం పట్నాలోని సెయింట్ కారెన్స్ స్కూల్లోసాగింది. ఆ తర్వాత ముస్సోరీలోని మానవ్ భారతి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. ప్రఖ్యాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT) మెస్రా నుండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశారు.నిశాంత్ కుమార్ చిన్నతనంలో జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నిశాంత్ రెండో తరగతి చదువుతున్నప్పుడు.. ఓ ఉపాధ్యాయుడు అతడిని బెత్తంతో కొట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నితీష్ కుమార్ కోపంతో నేరుగా స్కూల్కి వెళ్లారు. అయితే, ఉపాధ్యాయుడిపై ఎటువంటి గొడవ చేయలేదు. మౌనంగా తన కుమారుడిని వేరే పాఠశాలలో చేర్పించారు.ఇది నితీష్ కుమార్ క్రమశిక్షణ, తన కొడుకు పట్ల ఆయనకున్న బాధ్యతకు నిదర్శనంగా చెబుతుంటారు. 2007లో నిశాంత్ తల్లి మంజు సిన్హా మరణించారు. ఈ ఘటన నిశాంత్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన చాలా కాలం పాటు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8న ఆయన అధికారికంగా జేడీయూ పార్టీలో చేరారు. -
లావుగా ఉందని భార్యకు విషమిచ్చి చంపిన భర్త
ప్రొద్దుటూరు : తన భార్య పద్మజ లావుగా ఉందని విషమిచ్చి చంపిన భర్త కిరణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ విభూ కృష్ణ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. భార్య పద్మజ లావుగా ఉందని, విపరీతమైన మాంసహారం, ఫాస్ట్ ఫుడ్ తింటుండటం గమనించిన భర్త బద్రిపల్లె కిరణ్కుమార్ భార్యకు విషమిచ్చి చంపాడన్నారు. ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్రెడ్డి నగర్కు చెందిన బద్రిపల్లె కిరణ్కుమార్ 8 ఏళ్ల క్రితం ముద్దనూరుకు చెందిన పద్మజతో వివాహం అయిందన్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉందన్నారు. భార్యను ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్లో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి కిరణ్ గత నెల 26న తీసుకొచ్చాడని పేర్కొన్నారు. ఇల్లరికంలో ఉన్న కిరణ్కుమార్ను చిన్న చూపు చూస్తూ అవమానకరంగా మాట్లాడుతుండే వారని, కిరణ్కుమార్ మరో మహిళను ప్రేమించినట్లు, దానివల్ల భార్యాభర్తలకు మనస్పర్థలు వచ్చాయని తెలిపారు. ఎలాగైనా భార్య పద్మజను చంపాలనుకున్న కిరణ్కుమార్ యూట్యూబ్లో వీడియోలు చూస్తుండగా, డేంజరస్ పాయిజన్ అవేలబుల్ అనే క్యాప్షన్తో వీడియోను చూసి.. అందులోని ఫోన్ నంబర్కు సంప్రదించి రూ.80 వేలు పెట్టి కొరియర్ ద్వారా విషం కొనుగోలు చేశాడన్నారు. గత నెల 29న రాత్రి 11.30 గంటల సమయంలో కవ్వాలో విషం కలిపి భార్యకు కిరణ్కుమార్ ఇచ్చి ఆమె ముఖంపై ఊపిరి ఆడకుండా తలదిండు ఒత్తి పెట్టడం వల్ల ఆమె మృతి చెందినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. విషం అమ్మిన వ్యక్తి గురించి విచారణ చేస్తున్నామని, తర్వాత విచారణలో విషం అమ్మిన వ్యక్తితోపాటు తయారు చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. తొలుత పద్మజ మృతిని అనుమానాస్పద కేసు కింద నమోదు చేశామని, వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి విచారణ చేసి కేసును నిగ్గుతేల్చారన్నారు. నిందితుడు కిరణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో వన్టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఎవండీ.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదు..!
బెంగళూరు: ప్రియుడితో దిగిన ఫొటోను భార్య తన భర్తకు పంపడంతో అతను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా దాండేలి పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన రాఘవేంద్ర వాడకర్ మలేషియాలో ఉంటన్నాడు. వారం రోజుల క్రితం దాండేలికి వచ్చాడు. ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన భార్య తాను.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదని పేర్కొంది. మరో యువకుడితో ఆమె కలిసి ఉన్న ఫొటోను రాఘవేంద్రకు పంపించి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంది. నీతో కలిసి జీవించడం ఇష్టం లేదని, కావాలంటే చచ్చిపో అంటూ తేల్చి చేప్పింది. దీంతో రాఘవేంద్ర బుద్ధి మాటలు చెప్పాడు. అయినా భార్య పట్టించుకోలేదు. దీంతో చాకుతో కోసుకోని వాట్సాప్లో పొటోలు పంపాడు. నీవు చచ్చినా నాకు ఎలాంటి ఇబ్బందిలేదంటూ భార్య చెప్పడంతో జీవితంపై విరక్తి చెందిన రాఘవేంద్ర ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య తీరు గురించి లేఖ రాశాడు. దాండేలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
గుప్త నిధి కోసం కన్నతల్లి బలి యత్నం..!
కర్ణాటక: ధనం కోసం కన్న తల్లిని బలివ్వబోయిన కర్కోటక తనయుడి ఉదంతం చామరాజనగర తాలూకా సగడే గ్రామంలో చోటు చేసుకుంది. మే 1వ తేదీన పౌర్ణమి రోజున ఒకరిని బలి ఇస్తే నిధి లభిస్తుందని స్కెచ్ గీసిన కొండయ్యన మదశెట్టి తన 80 ఏళ్ల అంధ, చెవిటి తల్లి మదమ్మ శెట్టిని బలివ్వడానికి సిద్ధమయ్యాడు. ఈ ఉదయం అతను తన ఇంట్లో 4 అడుగుల గొయ్యి తవ్వకం, అందులో ఒక మంత్రకుండం ఉంచి, నిమ్మ, పసుపు, కుంకుమపువ్వు, కలశంతో పూజ చేశాడు. దీనిపై అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. చామరాజనగర రూరల్ స్టేషన్ పోలీసులు ఇంటికి చేరుకోగానే మంత్రగత్తె పారిపోయింది. దీంతో మదశెట్టిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నిధిని పొందడానికి ఉపయోగించిన మాయాజాలం గురించి తెలుసుకుని సగడే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. -
వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కిరాయి హంతకుతో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సుధీర్ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది.ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుదీర్ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్ నవీన్ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్ను ఆశ్రయించింది.తన భర్త ఈశ్వర్రెడ్డిని చంపేయాలని అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని శిల్పారెడ్డి వారితో రూ.10 లక్షల సుపారీ కుదుర్చుకుంది. ఈ క్రమంలో రూ.5 లక్షలు ఇవ్వడంతో హిందూపురానికి చెందిన కిరాయి గ్యాంగ్ బుధవారం ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్రెడ్డిని కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. వెంటనే వన్టౌన్ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్టౌన్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వ్యూహం బెడిసికొట్టడంతో నిందితులు.. పోలీసులకు చిక్కారు. భార్య శిల్పారెడ్డి, ప్రియుడు సుధీర్, రౌడీ షీటర్ వినయ్, హిందూపురం కిరాయి ముఠాతో పాటు 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విబూకృష్ణ పోలీసులు వెల్లడించారు. -
భర్త అక్రమ సంబంధం.. బట్టబయలు చేసిన భార్య!
సాక్షి, నిజామాబాద్: భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ రోడ్డులో జరిగింది. గుత్పకు చెందిన శివ రంజనితో తన భర్త శ్రవణ్ కుమార్.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళా సంధ్య ఆరోపిస్తోంది. ప్రియురాలు శివ రంజనితో భర్త శ్రవణ్ కుమార్ షాపింగ్ చేసి వస్తుండగా భార్య సంధ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. వారి సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.భర్త శ్రవణ్, అతని ప్రియురాలు శివరంజని ఇంటి ముందు భార్య సంధ్య ఆందోళనకు దిగింది. తాను ఉండగా మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకుని దుబ్బ రోడ్డులో సంసారం చేస్తున్నారంటూ బాధిత మహిళ ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసుల కాళ్లు పట్టుకుంది. సంఘటన స్థలానికి వచ్చిన ప్రియురాలి భర్త శ్రీధర్పై శ్రవణ్కుమార్ దాడికి పాల్పడ్డారు. ప్రియురాలి భర్త శ్రీధర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఈ రాత్రికే నా భర్తను చంపేయండి.. 10 లక్షల సుఫారి!
ప్రొద్దుటూరు క్రైం : తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపేందుకు భార్య కిరాయిహంతకులకు సుఫారి ఇచ్చిన ఘటన ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. ఈ రాత్రి గడిస్తే కిరాయి హంతకుల చేతిలో భర్త హతమయ్యేవాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి సుఫారి గ్యాంగ్ ఆట కట్టించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు మండంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. భర్త వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం భార్య వైద్యం కోసం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఆస్పత్రిలో పని చేసే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి పరిచయమయ్యాడు. ఇలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది. భర్తను చంపేందుకు సుఫారి.. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని ఎలాగైనా హతమార్చాలని భార్య ప్రియుడితో కలిసి వ్యూహ రచన చేసింది. తనకు తెలిసిన వాళ్లు రౌడీలు ఉన్నారని, వాళ్లకు కొంత డబ్బు ఇస్తే పని ముగించేస్తారని ప్రియుడు చెప్పాడు. దీంతో మహిళ అతనికి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు డబ్బు కూడా ఇచ్చింది. దీంతో ప్రియుడు రాజుపాళెంలోని ఒక రౌడీషిటర్ను ఆశ్రయించాడు. లింగాపురం వ్యక్తిని హత్య చేస్తే రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా కొంత డబ్బు ఇచ్చి ఎలాగైనా ఆ వ్యక్తిని చంపాలని చెప్పాడు. అతని వద్ద సు«ఫారి తీసుకున్న రౌడీషిటర్ ప్రొద్దుటూరులోనే పాత బస్టాండు సమీపంలో ఉన్న హిందూపురం వాళ్ల వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వాళ్లకు రౌడీషిటర్ వివరించాడు. వాళ్లకు కొంత డబ్బు ఇవ్వడంతో హిందూపురంలో ఉన్న ప్రధాన కిరాయి గ్యాంగ్ను ప్రొద్దుటూరుకు పిలిపించారు. ప్రొద్దుటూరులో దిగిన హిందూపురం గ్యాంగ్.. లింగాపురం వాసిని చంపేందుకు హిందూపురం నుంచి సుఫారి గ్యాంగ్ బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరులో దిగారు. ఈ రాత్రికి లేదా గురువారం ఉదయం అతన్ని చంపాలని పథకం పన్నారు. ఈ విషయం వన్టౌన్ పోలీసులకు తెలియడంతో అలర్ట్ అయ్యారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో హిందూపురం గ్యాంగ్, రాజుపాళెం రౌడీషిటర్ను, లింగాపురం గ్రామంలోని భార్యభర్తలు, ప్రియుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
ఇంట్లో అందమైన భార్య ఉన్నా.. పరస్త్రీ మోజుతో దారుణం
సాక్షి,బళ్లారి: వారిద్దరిరి జంట చూడముచ్చటైనదని పెళ్లి రోజు రెండు కుటుంబాల వారు సంబరపడ్డారు. పెళ్లయి రెండున్నర సంవత్సరాలకే అక్రమ సంబంధం వ్యామోహంలో పడిన భర్త తన భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించడంతో పాటు వరకట్న వేధింపులకు గురి చేయడం కూడా మొదలు పెట్టారు. అక్రమ సంబంధం మోజు రోజు రోజుకు పెరిగిపోవడంతో అందమైన భార్యను హతమార్చాలని కుట్ర పన్ని ఆ దిశగా పథకం పన్నారు. భర్త వేధింపులు తదితరాలను భార్య రోజు సెల్ఫోన్లో చిత్రీకరించింది. వివరాల్లోకి వెళితే... దావణగెరె తాలూకా మండలూరు గ్రామానికి చెందిన పేదింటి అందమైన అమ్మాయి కావ్యకు చెన్నగిరి తాలూకా హూదగెరె గ్రామానికి చెందిన మను అనే వ్యక్తితో రెండున్నర సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆడబిడ్డ తల్లిదండ్రులు సంబరపడి పెళ్లి చేశారు. పెళ్లిలో అష్టకష్టాలతో రెండున్నర లక్షల నగదు, 70 గ్రాముల బంగారం కూడా ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. భార్యను అంతమొందించాలని వేధింపులు అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాల నుంచి భార్యను విపరీతంగా వేధించడం మొదలుపెట్టిన మను తీరును భార్య గమనించింది. పరస్త్రీ మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని గమనించి తల్లిదండ్రులకు తెలిపిన తర్వాత పంచాయతీ కూడా చేశారు. దావణగెరె నగరంలో కాపురం ఉంటున్న కావ్య, మను మంత్రాలయానికి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నారు. భార్యను హత్య చేయాలని పథకం వేసుకున్న మను ఆ దిశగా ఆమెను హత్య చేసిన తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి కావ్య ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు దావణగెరెకి వచ్చి పరిశీలించగా, కుమార్తె అచేతనంగా పడి ఉండటం గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే కావ్య మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుమార్తె సెల్ఫోన్ పరిశీలించగా భర్త గుట్టురట్టు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య మిస్టరీని సెల్ఫోన్ ద్వారా ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రియుడిపై మోజు సుపారీ ఇచ్చి భర్తను లేపేసిన భర్య!
వరంగల్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, నిత్యం తాగి ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే నెపంతో రూ.5లక్షలు సుఫారీఇచ్చి భర్తను హత్య చేయించింది ఓభార్య. ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 8న పరకాలకు చెందిన మడికొండ సాంబయ్య తన కుమారుడు మడికొండ సుమన్ భరత్ (38) కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మడికొండ సుమన్ భరత్కు 2012 సంవత్సరంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాములపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం లావణ్యకు పరకాల పట్టణంలోని ఇమ్మడి నరేశ్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ విషయంలో మడికొండ సుమన్ భరత్ రోజు తాగి వచ్చి లావణ్యను హింసించేవాడు. దీంతో లావణ్య తన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు ఇమ్మడి నరేశ్తో కలిసి సుమన్ భరత్ను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. దీంతో ప్రియుడు ఇమ్మడి నరేష్కు పరిచయం ఉన్న గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లతో హత్యకు బేరం కుదుర్చుకున్నారు.బంగారం కుదువపెట్టి సుపారీ ఇచ్చి..లావణ్య తన బంగారం కుదువ పెట్టి రూ.1,59,000, ఇమ్మడి నరేశ్, పెండల రాజు కలిసి రూ.3లక్షలు పోగు చేసి మొత్తం రూ.4,59,000 చిరంశెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చి సుమన్భరత్ను హత్య చేయించారు. వెంకటేశ్వర్లు మరో వ్యక్తి భూక్య రాకేశ్తో కలిసి సుమన్ భరత్కు మద్యం, డబ్బులు ఆశ చూపి ఈనెల 3న రాత్రి 8 గంటలకు ములుగుకి పిలిపించారు. అక్కడినుంచి చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి సుమన్ భరత్కి మద్యం తాగించారు. అతను మత్తులో లేవలేని స్థితిలో ఉండగా చిరంశెట్టి వెంకటేశ్వర్లు బీర్ బాటిల్తో భరత్ తల వెనక భాగంలో కొట్టగా సుమన్ భరత్ పడిపోయాడు. అనంతరం వారు ముందే తెచ్చి పెట్టుకున్న పెట్రోల్ భరత్ ఒంటిపై పోసి నిప్పంటించారు. భరత్ మృతదేహం కాలుతుండగా.. భూక్యా రాకేశ్, చిరంశెట్టి వెంకటేశ్వర్లు ఫోన్లో ఫోటోలు, వీడియో తీసి, మరుసటి రోజు ములుగుకు వచ్చిన లావణ్య, పెండల రాజుకు చూపించారు. దీంతో సుఫారీలో మిగిలిన డబ్బులను వారు అప్పగించారు. అనంరతం లావణ్య తన అత్తగారి ఇల్లు అయిన పరకాలకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉంది. ఈనెల 5న చిరంశెట్టి వెంకటేశ్వర్లు రాత్రి 10 గంటలకు పొలం వద్దకు వెళ్లి భరత్ కాలిపోగా మిగిలిన ఎముకలను పక్కనే ఉన్న వాగులో పడేశాడు. దర్యాప్తులో భాగంగా పరకాల పోలీసులు చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రాకేశ్ను గోవిందరావుపేట శివారులోని చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి కాల్వలోని భరత్ ఎముకలు, బూడిద, కాలిచ్చి పడేసిన సిగరెట్ పికలు, బీర్ బాటిల్ ముక్కలు, మందు బాటిళ్ల మూతలు, ప్లాస్టిక్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. హత్య కేసును చేధించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పరకాల ఏసీపీ సతీష్బాబు, ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్నాయక్ను డీసీపీ అంకిత్ కుమార్ అభినందించారు. -
ఏకాంతంగా ఉన్న జంటలే ఆ ఏఎస్సై టార్గెట్
పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో సంచలన ఘటన బయటపడింది. మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఓ ఏఎస్ఐ అకృత్యాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని, వారి వీడియోలను రహస్యంగా చిత్రీకరించి తర్వాత బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, ఆ వీడియోలను చూపిస్తూ యువతులు, మహిళలను లైంగికంగా వేధిస్తూ కోరికలు తీర్చాలని ఒత్తిడి తెస్తున్నాడని బాధితులు చెబుతున్నారు.ఈ వ్యవహారంలో జమ్మలమడకకు చెందిన ఓ ఆటో డ్రైవర్ సహకారం తీసుకుని వీడియోలు తీయిస్తున్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన బెదిరింపు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.ఇక ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న స్థానిక ఎస్సై, కానిస్టేబుల్ కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. -
సమ్మక్క పూజారి కుమారుడి కాలు తొలగింపు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన రాణా రమేశ్ కుమారుడు ఏడేళ్ల యువిన్ రెండు కాళ్లపై ఇటీవల గద్దెల ప్రాంగణంలో రాతిశిల పడటంతో తీవ్ర గాయాలుకాగా, శుక్రవారం వైద్యులు ఎడమకాలిని తొలగించారు. వారం రోజులక్రితం యువిన్ గద్దెల ప్రాంగణం వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లగా సారలమ్మ గద్దె వద్ద ఓ రాతిశిల బాలుడి కాళ్లపై పడింది. దీంతో రెండు కాళ్లు విరిగిపోగా, వెంటనే కుటుంబ సభ్యులు హనుమకొండలోని గార్డియన్ హాస్పిటల్కి తరలించారు. ఎడమ కాలికి శస్త్రచికిత్స నిర్వహించినప్పటికి బాగుకాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వైద్యులు కాలుని తొలగించారు. కుడి కాలికి సర్జరీ చేసి రాడ్డు వేశారు. ఇటీవల సీతక్క బాలుడిని పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మేడారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బాలుడికి సంబంధించి వైద్య ఖర్చులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం..
సాక్షి, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. మాచర్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తలుపు కొట్టి దాహమని నీళ్లు అడిగి ఇంట్లోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. మహిళ మెడపై కత్తి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అందుకే చంపేశా.. రూమ్ 102లో ఏం జరిగింది..?
విశాఖపట్నం: రిలేషన్షిప్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తుండడంవల్లే మౌనికను నిందితుడు చింతాడ రవీంద్ర హత్యచేసినట్లు సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ ఎ. పార్థసారధి వెల్లడించారు. విశాఖలో ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వివరాలను సోమవారం వారు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (29) విశాఖలోని ఇండియన్ నేవీలోని ఐఎన్ఎస్ డేగాలో పెట్టీ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ పాత గాజువాక ఎల్వీనగర్లోని కీర్తి ఎన్క్లేవ్లో ఉంటున్నాడు. రవీంద్రకు విజయనగరం జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో ఏడాది క్రితమే వివాహమైంది. మరోవైపు.. తాటిచెట్లపాలెంలోని సంజీవయ్య కాలనీ–1కు చెందిన పోలిపల్లి మౌనిక (31) ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఈవెంట్ల నిర్వహణకు వెళ్తుంది. ఆమె తండ్రి వేణుగోపాల్ ప్రైవేట్ ఉద్యోగి. మౌనిక, రవీంద్ర మధ్య మింగిల్ డేటింగ్ యాప్ ద్వారా 2021లో పరిచయం ఏర్పడింది. ఇది రిలేషన్షిప్కు దారితీసింది. పెళ్లి తరువాత కూడా నిందితుడు మౌనికతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. రవీంద్రకు పెళ్లైన విషయం తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. డబ్బు కోసం రిలేషన్షిప్ విషయాన్ని నిందితుడి భార్యకు చెబుతానంటూ మౌనిక వేధించడం మొదలుపెట్టింది. మౌనికకు రవీంద్ర నగదు ఇస్తున్నా ఇంకా కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇద్దరికీ సంబంధించిన వీడియోలను రవీంద్ర భార్య శ్రీలక్ష్మికి షేర్ చేయడంతోపాటు ఇంకా రకరకాలుగా ఒత్తిడి పెంచింది. దీంతో మౌనికను హత్యచేయాలని రవీంద్ర నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్తో పాశవిక హత్య.. ఈ నేపథ్యంలో.. భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను అడ్డు తొలగించుకునేందుకు రవీంద్ర స్కెచ్ వేశాడు. ఇన్స్టామార్ట్ ద్వారా కత్తి కొనుగోలు చేశాడు. స్థానికంగా కొన్ని కవర్లు కొన్నాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఇంటికి పిలిచాడు. 12.30 గంటల సమయంలో ముక్కు, నోరు మూసి ఆమెను హత్యచేశాడు. ఆ తరువాత ఆమె తల, చేతులు, కాళ్లు ముక్కలు ముక్కలుగా కోశాడు. రక్తపు మరకలు లేకుండా శరీర భాగాలను బాత్రూమ్లో శుభ్రంగా కడిగి కవర్లో ప్యాక్ చేశాడు. తల, చేతి భాగాలను ఒక గోనె సంచిలో, ఇతర భాగాలను క్లాత్ సూట్కేసులోను పెట్టాడు. కొన్నింటిని ఫ్రిజ్లో పెట్టాడు. అనంతరం అడవివరం రోడ్లోని ధారపాలెం వద్ద నిర్జన ప్రదేశానికి కారులో వెళ్లి తల, చేతి భాగాలను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్చేసి మౌనికను హత్యచేసినట్లు చెప్పాడు. అతని సూచన మేరకు పోలీస్స్టేషన్కు వెళ్లి రవీంద్ర లొంగిపోయాడు. తల, చేతి భాగాలను కాల్చేసిన స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లి శాంపిల్స్ సేకరించారు. కవర్లో పెట్టి ఇంట్లో ఫ్రిజ్లో ఉంచిన శరీర భాగాలను కేజీహెచ్కు తరలించారు. -
బావమరిదిని చంపి డిక్కీలో వేసుకుని పోలీసుల వద్దకు..
బెంగళూరు: బంధువుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసిన ఘటన బెంగళూరు శివారులోని ఆనేకల్ తాలూకా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో వరుసకు బావమరిది అయిన యువకుడికి ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వివరాలు.. బన్నేరుఘట్ట సమీపంలోని బైరప్పనహళ్లి నివాసి శ్రీనివాస్ నిందితుడు. మరసూరు వాసి, తన సొంత బావమరిది రంజిత్(24)ను హత్య చేశాడు. శ్రీనివాస్కు రంజిత్ సొంత సోదరి పవిత్రతో వివాహం జరిగింది. దీంతో రంజిత్, నిందితుడైన శ్రీనివాస్కు సొంత బావమరిది అయ్యాడు. నిందితుడైన శ్రీనివాస్ సోదరి కోమలతో రంజిత్కు అక్రమ సంబంధం ఉందని చెబుతున్నారు. కోమలికి అప్పటికే వేరొకరితో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమె తన భర్తను విడిచిపెట్టి రంజిత్తో పారిపోయింది. ఈ సంఘటన రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలకు కారణమైంది. పరువు తీశాడనే కోపంతో.. తన కుటుంబ పరువును పది మందిలో వేలం వేస్తున్నాడనే కోపంతో శ్రీనివాస్ చాలాసార్లు రంజిత్ను హెచ్చరించాడు. కానీ అతను వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్ ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూశాడు. సినీ ఫక్కీలో హత్య చేయడానికి పథకం వేసిన శ్రీనివాస్ గురువారం సాయంత్రం మాట్లాడదామనే నెపంతో రంజిత్ను తన కారులోకి ఎక్కించుకున్నాడు. బన్నేరుఘట్టలోని బిల్వరదహళ్లిలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశాడు. ఆ తర్వాత రక్తసిక్తమైన ఆ మృతదేహాన్ని తన కారు డిక్కీలో పెట్టుకుని నేరుగా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడ అతను పోలీసుల ఎదుట తాను చేసిన హత్యను ఒప్పుకుని లొంగిపోయాడు. మొదట శ్రీనివాస్ మృతదేహాన్ని ఎక్కడో ఒకచోట పడేసి పారిపోవాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ తర్వాత భయపడి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న బన్నేరుఘట్ట పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. నిందితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ పాల ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఏపీ సీఎస్, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. నివేదికలో బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలను వెల్లడించాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.గత ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు చౌడేశ్వరి నగర్ స్వరూపనగర్లో కల్తీపాల తాగి 16 మంది మృత్యువాత పడ్డారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. పాలలో విషపూరిత రసాయనాలు ఇథైల్ గ్లైకోల్ కలిసింది. విషపూరిత పాలను నరసాపురం గ్రామంలోని డెయిరీ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. దాదాపు 100 ఇళ్లకు సరఫరా చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం.. ఘటనపై విచారణకు స్వీకరించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. -
భర్తను చంపి చెరువులో పడేసిన భార్య..!
గుంటూరు: ఈనెల 19వ తేదీన యనమదల / ఈదులపాలెం గ్రామాల పరిధిలోని ఎన్హెచ్ 16 సమీపానున్న చెరువులో నడుముకు రాయికట్టి గోనెసంచిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం తాలూకా మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఉన్న భర్తను తాడుతో కట్టేసి, కర్రలతో కొట్టి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో మృతుడి భార్య, మరో ముగ్గుర్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల 19న మృతుడి నడుంకు రాయిని తాడుతో కట్టి, గోనెసంచిలో పెట్టిఉంచారని అందిన సమాచారం మేరకు.. ప్రత్తిపాడు పీఎస్ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతన్ని ఎవరైనా హత్య చేసి ఉంటారని, ఆ దిశగా దక్షిణ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్రావు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు దాసరిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం ఇంటి సామగ్రి, పశువులతో పరారవుతున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్లో ఉంటున్న తెనాలి ఐతానగర్ బత్తులవారివీధికి చెందిన ఉప్పుతల్ల లక్ష్మి అలియాస్ తన్నీరు తిరుపతమ్మ, ప్రస్తుతం తెనాలి పెదరావూరులో ఉంటున్న చౌడవరం సీఆర్నగర్కు చెందిన భార్యభర్తలు సిద్ధి అంకమ్మ, సురేష్ పేరేచర్ల లక్ష్మీనరసింహకాలనీ ఐదో వీధికి చెందిన ఓ మైనర్గా గుర్తించారు. చెరువులో మృతదేహం తన్నీరు వెంకటేశ్వర్లు (30)గా గుర్తించి, మృతురాలి భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి అంకమ్మ, భర్త సురేష్, సోదరుడు మైనర్ను అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన కరల్రు, ఇనుప పలుగు, పారలు, మోటార్సైకిళ్లు స్వా«దీనం చేసుకున్నారు. హత్య చేశారిలా.. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై, భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడు. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పురాలేదు. ఈనెల 17న వెంకటేశ్వర్లు, తిరుపతమ్మకు మళ్లీ వివాదం నెలకొంది. దీంతో తిరుపతమ్మ ఆతన సోదరి, బావ, మైనర్లకు సమాచారం అందించింది. దీంతో భార్య, ఆ ముగ్గురు కల్సి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి, కరల్రతో తీవ్రంగా కొట్టగా మృతిచెందాడు. తొలుత భర్త మృతదేహన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా, స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్సైకిళ్లపై తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే మృతదేహాం పైకి తేలకుండా నడుముకు రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుని చేధించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్ఛార్జ్ డీఎస్పీ మధుసూదన్రావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరిలో పడి ఐదుగురు ఎస్ఆర్ఎం కాలేజీ విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన విషాదకరమని.. ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుక్కునూరు మండలం వేలేరు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారిగా గుర్తించారు. గోక తేజ-ఉయ్యూరు (ఏపీ), నవదీప్-ఉయ్యూరు (ఏపీ), పాశం సతీష్ కుమార్, మదనపల్లి (ఏపీ), చారు గుండ్ల శ్రీకర్ భద్రాచలం (తెలంగాణ), పొడిచేటి అభిరామ్ భద్రాచలం (తెలంగాణ) గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య
కరీంనగర్క్రైం: కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుందని వన్టౌన్ సీఐ రాంచందర్రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని హనుమాన్నగర్లో నివాసం ఉంటూ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్ చంద్రశేఖర్ భార్య దివ్య(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాధ భరించలేక మంగళవారం మధ్యాహ్నం గన్నేరుపువ్వుల రసం తాగింది. ఈ విషయం పోలీసుస్టేషన్కు వెళ్లిన చంద్రశేఖర్కు ఫోన్చేసి చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. దివ్య తండ్రి తెడ్ల చిన్నసమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు -
లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐ సందేశ్ సస్పెండ్
బొమ్మనహళ్ళి, యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణా సీఐ సందేశ్ లైంగిక వేధింపులపై ఓ మహిళ ఆరోపణలు చేశాక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. న్యాయం కోసం ఠాణాకు వెళ్లిన అనేక మంది మహిళలను ఇతడు అధికార బలంతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. నీ భర్తను విడిచిపెట్టాలంటూ పడక గదికైనా రావాలి, లేదా రూ.25 లక్షలు ఇవ్వు అని బెదిరించాడని ఓ మహిళ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. ఈ సీఐ మీద విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఉమానాథ కోట్యాన్ హోంమంత్రి పరమేశ్వర్కు లేఖ రాశారు. మహిళలను వేధించడం, లంచాలు డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించారు. కాగా, బాధిత మహిళ సోదరి సీఐని వెనకేసుకు రావడం గమనార్హం. సీఐ సందేశ్ నిరాపరాధి అని, కుటుంబ కలహాల నేపథ్యంలో సీఐపై మా అక్క ఆరోపణలు చేసినట్లు చెప్పింది.సీఐ సస్పెండ్ సీఐ సందేశ్ని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుదీర్కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు. పలు ఆడియోలు, వీడియోలు విడుదల కావడంతో చర్య తీసుకున్నారు. అతనిపై కేసును దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని ఏసీపీ శ్రీకాంత్ను ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలతో మూడబిద్రిలో సందేశ్పై సుమోటోగా కేసు నమోదైంది. బాధితురాలి కుమారునిపై కూడా దాడి చేశాడని ఫిర్యాదు నమోదైంది. నిన్ను రేప్ చేస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని బెదిరించాడని బాధిత మహిళ తాజాగా ఆరోపించింది. రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా -
ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే
రాజంపేట: ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని వైఎస్సార్ కడప జిల్లా మన్నూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ లింగప్ప కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నందలూరుకు చెందిన రైల్వే లోకో పైలెట్ శ్రీరాం శ్రీనివాస్ 2017లో కృష్ణవేణి(30)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరు బోయనపల్లెలోని శ్రీరామ్నగర్లో నివాసం ఉండేవారు. శ్రీరాం మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈనెల 11న కారు మరమ్మతుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీరాం శ్రీనివాస్ కృష్ణవేణిని బెల్టుతో కొట్టాడు. ఆమెను చనిపోవాలని తీవ్రంగా ప్రేరేపించాడు. మనోవేదనకు గురైన మృతురాలు బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకొని ఉరి వేసుకుంటుండగా, నిందితుడు ఆమెను కాపాడకపోగా , ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి భార్య సెల్ఫోన్లోనే వీడియో తీశాడు. ఉరి అలా కాదు.. కృష్ణా.. సరిగ్గా వేసుకో అంటూ వికృతంగా నవ్వుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆమె ఉరివేసుకుని మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి, మరుసటి రోజు తన తల్లిదండ్రులు వచి్చన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్ 108 బీఎన్ఎస్ కింద కేసుగా మార్చి నిందితుడు శ్రీరాం శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
అమ్మా.. ఎందుకిలా..!
భువనగిరి : కుటుంబాలలో నెలకొనే చిన్నచిన్న తగాదాలు, సమస్యలతో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో తమతో పాటు నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డలను సైతం చంపుతున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ట్రైన్కు ఎదురెళ్లి దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలను ఊపిరాగకుండా చేసి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరవకముందే తాజాగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలపై కత్తితో దాడికి పాల్పడి తాను ఆత్మహత్య చేసుకుంది. నెలన్నర వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ మూడు ఘటనల్లో బాధితులు బీబీనగర్ మండలానికి చెందిన వారు కావడం గమనార్హం. పిల్లలపై కత్తితో దాడి చేసి..బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జం నరేందర్రెడ్డి భార్య రత్నకళ (నీలిమ) మానసిక స్థితి సరిగా లేక పిల్లలతో తల్లిగారి గ్రామమైన భువనగిరి మండలం తుక్కాపురానికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున నిద్రలో ఉన్న కుమార్తె కృతిరెడ్డి(14)పై కత్తితో దాడి చేసి చంపింది. అనంతరం పన్నెండేళ్ల కుమారుడి అక్షిత్రెడ్డిపై దాడికి యత్నంచగా అతడు తప్పించుకుని కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చాడు. అనంతరం ఆమె అదే గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. ఈ ఘటన బీబీనగర్ మండలంలో కలకలం సృష్టించింది.గతంలో రెండు ఘటనలు ఇలా..అయితే బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి అనే మహిళ జనవరి 31న ఘట్కేసర్ వద్ద తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్రెడ్డితో కలిసి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే ఈ నెల 2న ఇదే మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మహిళ ఐశ్వర్య కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలైన ఝాన్సీ, పండును ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత తాను ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నెలన్నర వ్యవధిలోనే ఒకే మండలానికి ఇద్దరు మహిళలు తమ పిల్లలను చంపి తాము చావాలనుకోవడం లాంటి ఘటనలు మరువక ముందే ఇదే మండలానికి చెందిన తమ మరో మహిళ తన తల్లి గారి ఊరిలో తన కుమార్తెను చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం చర్చనీయాంశంగా మారింది. -
కృష్ణవేణి మరణం వెనుక దారుణాలు!
వైఎస్ఆర్ కడప జిల్లా: నందలూరు రైల్వేలోకోపైలెట్ శ్రీరామ్ శ్రీనివాస్ రెండో భార్య కృష్ణవేణి మరణం వెనుక అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణవేణి ఆత్మహత్య చేసుకున్న రాత్రంతా మద్యం సేవించి ఇంటిలోనే ఉన్నట్లు, గురువారం అటు పోలీసులకు, ఇటు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియజేశాడు.శ్రీరామ్ శ్రీనివాస్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు అమ్మ చచ్చిపోయింది అని కిటికీలోంచి ఉరి వేసుకున్న కృష్ణవేణిని చూపించినట్లు తెలిసింది. అనంతరం పిల్లలకు భోజనాలు పెట్టి, తను మద్యం సేవించి, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఇంట్లోనే పిల్లలతోనే భర్త ఉండిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణవేణి వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారణమయ్యాడని బంధువులు ఆరోపించారు.పది సంవత్సరాల క్రితం ఆయన మొదటి భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఆరుసంవత్సరాల కిందట మృతురాలిని వివాహం చేసుకున్నాడు. కాగా శ్రీనివాస్ మరో అమ్మాయి ప్రేమలో పడి భార్యకు చిత్రహింసలు పెడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోభార్యతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. కాల్చి వాత పెడుతున్నట్లు, ఆ గాయాలను పుట్టింటి వారికి చూపించి బాధపడేదని బంధువులు చెబుతున్నారు. మృతురాలి వంటిపై గాయాలు కూడా ఉన్నట్లుగా సంబంధీకులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడు నాగరాజు మీడియా ఎదుట ఆరోపణలు చేస్తూ శ్రీరామ్ శ్రీనివాస్కు తగిన శిక్ష వేసి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. -
‘ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి‘
వైఎస్ఆర్ కడప జిల్లా: ఓ పైశాచిక భర్త కట్టుకున్న భార్యను చిత్రవధకు గురిచేశాడు. మానసికంగా వేధించి.. ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆమె బలవన్మరణానికి పాల్పడబోతే నివారించాల్సింది పోయి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ ఉరి ఇలా వేసుకోవాలంటూ మానసికంగా మరింత కుంగదీశాడు. ఉరి బిగుసుకుని బాధితురాలు దుర్మరణం పాలైంది. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలంలోని బోయనపల్లెలో జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ నందలూరు రైల్వే కేంద్రంలో లోకోపైలట్గా పనిచేస్తున్నారు. ఆయన రెండో భార్య కృష్ణవేణి తన నివాసంలో గురువారం ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. అయితే, భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సిన భర్త, ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించడం అతనిలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది. శ్రీరామ్ శ్రీనివాస్, కృష్ణవేణి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంటానని ఉరితాడు సిద్ధం చేసుకుంది. భర్త ఆమెను ఆపడానికి బదులు.. ‘ఉరి అలా కాదు, ఇలా వేసుకోవాలి‘ అంటూ సూచనలు చేస్తూ ఆ ఘటనను తన మొబైల్లో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోని సెల్ఫోన్ ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహోదగ్రులైన కృష్ణవేణి బంధువులు నిందితుడిపై దాడికి యతి్నంచారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. గతంలో శ్రీనివాస్ తొలి భార్య కూడా తిరుపతిలో రైలు కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. కృష్ణవేణి మృతిపై మన్నూరు సీఐ లింగప్ప మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిన సమయంలో కృష్ణవేణి తలుపు వేసుకుని ఆత్మహత్యకు యతి్నంచిందని, దానిని భర్త కిటికీలో నుంచి వీడియో తీసినట్లు అందులోని మాటలను బట్టి అర్థమవుతోందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.


