హైదరాబాద్: భార్యపై అనుమానంతో భర్త ఆమెను బ్యాట్తో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా బీతపూడికి చెందిన వెంకట బ్రహ్మయ్య, కృష్ణవేణి భార్యాభర్తలు. మూడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి అమీన్పూర్ కేఎస్ఆర్నగర్ కాలనీలోని విష్ణుప్రియ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. గుంటూరు నుంచి వచ్చాక తొలుత వీరు హైదరాబాద్లో నివాసం ఉండగా గత మూడు సంవత్సరాల నుంచి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నివాసం ఉంటున్నారు.
కృష్ణవేణి డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా కోహిర్ బ్రాంచ్లో పని చేస్తోంది. వెంకట బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కాగా, భార్యపై బ్రహ్మయ్య కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వెంకట బ్రహ్మయ్య బ్యాట్తో భార్యను కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కృష్ణవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
∙
∙ సంగారెడ్డి జిల్లాలో ఘటన


