breaking news
Chittoor District Latest News
-
ఏఎన్ఎం బదిలీల్లో కూటమి పెత్తనం
తిరుపతి సాక్షిటాస్క్ఫోర్స్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 746 మంది గ్రేడ్–3 ఏఎన్ఎంలున్నారు. వీరిని బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 693 మందికి సాధారణ బదిలీలు చేయగా.. మిగిలిన వారిని మెడికల్ గ్రౌండ్స్ కింద చూపించారు. తొలుత మాన్యువల్ ప్రకారం బదిలీలు చేయాలని నిర్ణయించారు. కూటమి నాయకులు, పలువురు ప్రజాప్రతినిధుల జోక్యంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. సిఫార్సుల వెల్లువ బదిలీల ప్రకటనతో ఏఎన్ఎంలు వారికి అనుకూలమైన ప్రాంతాలు వరించేలా ఎవరికి వారు పోటీలు పడ్డారు. కూటమి బడా నేతలు, ఎమ్మెల్యేల వద్దకు క్యూకట్టారు. వారి సిఫార్సు లేఖలను బదిలీలకు జత చేశారు. ఈ సిఫార్సులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలతో పాటు కూటమిలోని చోటామోటా నాయకులు కూడా సొంత లెటర్లతో సిఫార్సులు పంపారు. ఎవరికి వారు సత్తా చాటుకోవాలని శాఖపై పట్టుబట్టారు. సిఫార్సులతో పాటు ఫోన్లు చేసి అధికారులను విసిగించారు. వారి హోదాను గుర్తు చేస్తూ.. భయభ్రాంతులకు గురిచేశారు. ఈకారణంగా ఎవరి సిఫార్సుకు తలొగ్గాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. బదిలీల ప్రక్రియను కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తూ వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖపై బురద కూటమి నేతల జోక్యం, ఒత్తిడి, సిఫార్సులను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు శాఖ అధికారులు బదిలీల్లో జూమ్ కౌన్సెలింగ్ను తీసుకొచ్చారు. ఈనెల 8వ తేదీ నుంచి జూమ్ ద్వారా కౌన్సెలింగ్ను ప్రారంభించారు. 11వ తేదీ రాత్రితో ఈ ప్రక్రియను ముగించారు. అయితే చాలా మందికి అశించిన ప్రాంతాలు రాక అయోమయానికి గురవుతున్నారు. మరికొందర్ని దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ ముగిసిన ఇప్పటికీ సిఫార్సుల గోల తగ్గడం లేదు. అధికారులపై కొందరు ఏఎన్ఎంలు ప్రజాప్రతినిధులు, కూటమి నేతల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆర్డర్ పత్రాలు ఇచ్చేందుకు కూడా అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ కారణంగా శాఖపై బురద పడుతోంది. కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ముడుపులు తీసుకుని ఇష్టానుసారంగా బదిలీలు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూటమి నేతల జోక్యంతో వచ్చిన యవ్వారమని ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు.గందరగోళం ఏమీ లేదు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించాం. జూమ్ పద్ధతిలో ప్రక్రియను పూర్తిచేశాం. త్వరలో ఆర్డర్లు కూడా ఇచ్చేస్తున్నాం. మాకై తే ఎవరినీ ఇబ్బంది పెట్టించాల్సిన అవసరం లేదు. శాఖలో పనిచేసేవారు మా కుటుంబ సభ్యులే. వాళ్లను ఇబ్బంది పెట్టించాలని మేము ఏరోజూ కోరుకోం. ఇప్పటి వరకు వారికి ఇబ్బంది లేకుండా చూడాలని మా ప్రయత్నం చేస్తున్నాం. గందరగోళం ఏమీ లేదు. తప్పులుంటే కచ్చితంగా సరిదిద్దేలా చూస్తాం. సమస్యలుంటే నేరుగా తీసుకురావొచ్చు. –సుధారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, చిత్తూరు ముందస్తు బుకింగ్లు ఏఎన్ఎంల బదిలీల విషయంలో డిమాండ్ పెరిగే కొద్దీ పలువురు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. తమ ప్రాంతంలో తమకు తెలియకుండా బదిలీలు చేయకూడదని హుక్కుం జారీ చేశారు. తమకు అనుకూలమైన వారినే వేయించుకుంటామని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ముందస్తుగానే 80శాతం ప్రాంతాలను వారి గుప్పట్లోకి తీసుకున్నారు. అక్కడికి రావాల్సిన వారిని వారే ఎంపిక చేసి అధికారులకు జాబితా పంపారు. కాగా వారి ఒత్తిడికి అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే ఇక్కడి నుంచి శాఖలో పనిచేసే అధికారులను బదిలీ చేయిస్తామని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో వారు చేసేది లేక వారు చెప్పినట్లు బదిలీలను ముగించారు. కొందరు ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ఉన్న ఏఎన్ఎంలు, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఏఎన్ఎంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయించాలని ప్రయత్నాలు చేశారు. సహాకులతో వసూళ్లు? కొందరు ఏఎన్ఎంలే వారి సహాయకులకు కాసులతో ఆశ చూపించారు. తాను అనుకున్న స్థానానికి బదిలీ చేయిస్తే అడిగింత ఇచ్చుకుంటానని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఏఎన్ఎంల బదిలీలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీన్ని అదునుగా చేసుకుని కొందరు రెచ్చిపోయారు. వారు ఒక్కో బదిలీకి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు పలువురు ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు బెదిరింపులు 80 శాతం ముందస్తు బుకింగ్లు ఆపై కొందరు ప్రజాప్రతినిధుల పేరుతో అనుచరుల దందాలు కోరుకున్న స్థానానికి బదిలీ చేస్తామంటూ రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వసూళ్లు మండిపడుతున్న ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు ఏఎన్ఎం బదిలీల్లో కూటమి పెత్తనం జోరందుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యంతో గందరగోళమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి 80 శాతం ముందస్తు బుకింగ్ చేసుకుంది. ఆపై పలువురు ప్రజాప్రతినిధుల అనుచరులు తెరపైకి తళుక్కుమన్నారు. కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యేందుకు రూ.30 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ దందాతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. కూటమి పెత్తనంపై ఏఎన్ఎం, వైద్య సంఘ నేతలు మండిపడుతున్నారు. -
ఎరువుల దుకాణాలపై దాడులు
పెనుమూరు(కార్వేటినగరం): ఎరువుల దుకాణాలపై సోమవారం స్టేట్ విజిలెన్స్ స్క్వాడ్ దాడులు నిర్వహించింది. ఏడీఏ ధనుంజయరెడ్డి, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవి మాట్లాడుతూ డీలర్లందరూ ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎరువుల దుకాణాలను పరిశీలించి నిల్వల వివరాలను, అమ్మకాలు జరిపిన బిల్లులను పరిశీలించారు. ఎరువుల ధరల డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ దాడుల్లో చిత్తూరు డీఏఓ కార్యాలయం ఏవో శ్రీకాంత్రెడ్డి, పెనుమూరు వ్యవసాయ అధికారి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. వెబ్ల్యాండ్ ప్రక్రియను పర్యవేక్షించాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వెబ్ల్యాండ్ ప్రక్రియను ఆర్డీవోలు పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె చాంబర్లో రెవెన్యూ, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వెబ్ల్యాండ్ ప్రక్రియలో తహసీల్దార్ల నుంచి ఒరిజినల్ ఫైళ్లను తెప్పించుకుని ఆర్డీవోలు పరిశీలించాలన్నారు. లబ్ధిదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా స్లాట్లు ఇచ్చి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. రీ సర్వే ప్రక్రియలో జిల్లాలో మొదటి దశలో 31 గ్రామాలలో చేపట్టినట్లు తెలిపారు. ఈ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆర్వోఆర్లను ఆర్డీవో లు వెంటనే ప్రచురించాలన్నారు. ఈ నెలాఖరు లోపు జిల్లాలోని వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటివద్దకే రేషన్ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి పట్టాకు అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను గుర్తించాలన్నారు. గ్రామసభలు నిర్వహించి జాయింట్ ఎల్పీఎం దరఖాస్తులు స్వీకరించాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం తగదు చిత్తూరు అర్బన్: ప్రజాఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వద్దన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులకు ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ సాయినాథ్ కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 42 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గిన్నీస్ రికార్డుకు టీచర్లు బాధ్యులా? చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం పాలనలో మెగా పీటీఎం పేరుతో గిన్నీస్ బుక్ రికార్డు పొందేందుకు టీచర్లను బాధ్యులు చేయడం తగదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇటీవల జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎంను నిర్వహించిందన్నారు. ఇందులో సాంకేతిక లోసుగులు సరిచేయకుండా ఆ తప్పులను టీచర్ల పై వేసి బాధ్యులను చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. టీచర్ల వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేసినప్పటికీ అవి సరిగా లేవంటూ తిరిగి అప్లోడ్ చేయాలంటూ ఒత్తిడి చేయడం కరెక్టు కాదన్నారు. అప్లోడ్ చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీచేస్తామని టీచర్లను భయాందోళనకు గురిచేయడం అన్యాయమన్నారు. యాప్ల నిర్వహణలో ఏర్పడే సాంకేతిక సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారో కూటమి ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
అక్రమ కేసులకు అదరం..బెదరం
కార్వేటినగరం: అక్రమ కేసులు బనాయించి వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూడడం వారి అవివేకమని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కళత్తూరు కృపాలక్ష్మి స్పష్టం చేశారు. గత వారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జిల్లా పర్యటనలో ఫొటో గ్రాఫర్పై దాడి చేశారని ఆరోపిస్తూ అక్రమ కేసులు బనాయించి జిల్లా కారాగారంలో బంధించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు చక్రి, మోహన్, వినోద్ను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా కృపాలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా జనంలో జగనన్నపై ఉన్న అభిమానాన్ని చెరపలేరని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు జగనన్న, జగనన్న పార్టీ అండగా నిలిస్తోందని భరోసానిచ్చారు. ఆమె వెంట జీడీ నెల్లూరు మండల కన్వీనర్ వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, నాయకులు పెద్దిరెడ్డి, అలీషేర్ఖాన్, ఉదయ్, మోహన్, వినోద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. రోల్ మోడల్గా చిత్తూరు ఎస్పీఎం చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్రంలో రోల్ మోడల్గా చిత్తూరు ఎస్పీఎం(ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం)ను తీర్చదిద్దుతామని ట్రాన్స్కో సీఎండీ సంతోషరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎస్పీఎంను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా చిత్తూరులో 2వేల లీటర్ల ఓఆర్ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్) అందుబాటులో ఉందన్నారు. ఇక్కడి నుంచి శుద్ధి చేసిన ఆయిల్ను పలమనేరు, పుంగనూరు, కార్వేటినగరం ఎస్పీఎంలకు పంపవచ్చన్నారు. మిషన్ ఆపరేటింగ్కు టెక్నికల్ సహాయకులను నియమిస్తామన్నారు. ట్రాన్స్ఫార్మర్ల పరంగా అన్ని మరమ్మతులు చిత్తూరు నుంచే జరిగే విధంగా చూస్తామన్నారు. ఈ విధానం విజయవంతమైతే ప్రతి జిల్లాలో ఒక ఓఆర్ఎంను కేటాయిస్తామన్నారు. పలు ప్రాంతాల్లో ఏఈలు మండల కేంద్రాల్లో నివాసం ఉండడం లేదన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఎలా అని ప్రశ్నించారు. మండల కేంద్రాల్లో ఏఈలు తప్పనిసరిగా నివాసం ఉండాలన్నారు. అనంతరం స్టోర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ కార్యాలయ మొదటి అంతస్తు నిర్మాణానికి ఫర్నిచర్ మంజూరు చేయాలని ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ కోరారు. అనంతరం చిత్తూరు రూరల్ డివిజన్ కార్యాలయాన్ని పరిశీలించారు. డైరెక్టర్ గురవయ్య, సీజీఎం జానకీరామ్, ఈఈలు మునిచంద్ర, సురేష్, అమర్బాబు, డీఈలు ప్రసాద్, వసంతనాయుడు, ఏఈలు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి సారూ..!
చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు క్యూ కట్టారు. మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025సదుం: ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ..అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరిస్తున్న చంద్రబాబును ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని ఎర్రాతివారిపల్లెలో బాబు షూరిటీ–మోసం గారెంటీలో భాగంగా నిర్వహించిన మండల స్థాయి వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన బాండ్ల హామీని బీజేపీ నాయకులు సైతం విశ్వసించ లేదన్నారు. ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కొని కరెంటు చార్జీలను పెంచడంతో పాటు, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. బెల్టుషాపులు విస్తృతం చేశారని మండిపడ్డారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను ఏనాడూ అమలు చేయలేదన్నారు. దీంతో ప్రజలకు చంద్రబాబుపై విశ్వాసం పోయిందన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా సంక్షేమ పథకాలను అమలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. గ్రామకమిటీలే కీలకం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. ఇవి భవిష్యత్తులో కీలకంగా మారనున్నట్టు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లోపు.. ఆ తర్వాత కూడా గ్రామ కమిటీలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గ్రామాల్లోని ముఖ్యనాయకులకు కమిటీలలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మీకు రుణపడి ఉంటా గత 47 ఏళ్ల తన రాజకీయ జీవితంలో అండగా ఉంటూ.. తన వెంట నడుస్తున్న మండల ప్రజానీకానికి రుణ పడి ఉంటానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ తమ కుటుంబ సభ్యులకు మెజారిటీ అందిస్తున్న మండల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. వారికి ఏకష్టం వచ్చినా తాము అండగా నిలుస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, అనీషారెడ్డి, శ్రీనాథ్రెడ్డి, పోకల అశోక్కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, కో–ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, పుట్రాజు, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్పరెడ్డి, ప్రకాష్రెడ్డి, కృష్ణారెడ్డి, రెడిఈశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, బాబురెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.– 8లో– 8లోన్యూస్రీల్ఎన్నికల ముందు అలవిగాని హామీలు అధికారంలోకి వచ్చాక పంగనామాలు నేతల సంతకాలతో ఇచ్చిన బాండ్ల సంతగేంటో? బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం ‘ఎన్నికల ముందు కూటమి నేతలు అలవిగాని హామీలిచ్చారు. సూపర్–6 పేరుతో కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఉచిత బస్సు అంటూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికీ రూ.5 వేలు అంటూ సంతకాలు పెట్టి మరీ బాండ్లు పంపిణీ చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ అటకెక్కించారు. ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఊర్లోకెళ్లినా ప్రజలు బాబును ఇక నమ్మే ప్రసక్తే లేదని అంటున్నారు..’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో సోమవారం జరిగిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ సభల్లో పాల్గొని ప్రసంగించారు. -
సమస్యలు పరిష్కరించండి సారూ..!
● కలెక్టరేట్కు క్యూ కట్టిన అర్జీదారులు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్కు మార్గాంధీ, జేసీ విద్యాధరి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు సోమవారం కలెక్టరేట్కు క్యూ కట్టారు. శ్రీసమస్యలు పరిష్కరించండి సారూ..!శ్రీ అంటూ అధికారులను అభ్యర్థించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు అందిస్తున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 299 అర్జీలు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. దూరంగా బదిలీ చేశారు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు తమను ఇష్టానుసారంగా దూరంగా బదిలీ చేశారని ఏఎన్ఎంలు లక్ష్మి, చైతన్య, లీలా, సావిత్రి తదితరులు ఆరోపించారు. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన బదిలీల్లో తమకు జరిగిన అన్యాయం పై కలెక్టర్ వద్దకు వెళ్లి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏఎన్ఎంల బదిలీ నిర్వహించారన్నారు. 200 మందికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. ముందు తప్పుల తడకగా సీనియారిటీ జాబితాను ప్రచురించారన్నారు. ఖాళీల జాబితాను ప్రచురించకుండా బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. 5 ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ అందులో ఒక్కటీ రాలేదన్నారు. విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య, తదితరులు పాల్గొన్నారు. ఆరు నెలలుగా నీటి సమస్య గత ఆరు నెలలుగా నీటి సమస్య ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులెవ్వరూ పట్టించుకోవడం లేదని పాలసముద్రం మండలం, కృష్ణజిమ్మాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట తలపై బిందెలు పెట్టుకుని ధర్నా నిర్వహించారు. ఆరు నెలలుగా నీటి కోసం అనేక కష్టాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో గ్రామస్తులు వెంకటమ్మ, రమణమ్మ, శాలిని, సుమలత పాల్గొన్నారు. భూములు ఎన్ని సార్లు ఇవ్వాలి ఇప్పటికే ఎన్హెచ్ 716 రోడ్డు ఏర్పాటుకు రెండు సార్లు తమ భూములను ఇచ్చామని, మరళా ఇంకెన్ని సార్లు భూములు ఇవ్వాలని నగరి మండలం, వీకేఆర్ పురం, తడుకుపేట గ్రామస్తులు రవిచంద్రన్, జ్యోతిప్రకాష్ వాపోయారు. ఈ మేరకు గ్రామస్తులు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రెండు సార్లు ఎన్హెచ్ 716 రోడ్డుకు భూములను తీసుకున్నారన్నారు. ప్రస్తుతం తిరిగి టోల్గేట్, స్లిప్ రోడ్డు ఏర్పాటు చేస్తామంటూ భూములు సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. తడుకుపేట వద్ద ఉన్న ప్రభుత్వ భూములలో టోల్గేట్, స్లిప్ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దారి సమస్య పరిష్కరించాలి తమ పొలాలకు దారి సమస్య ఉందని, దీన్ని వెంటనే పరిష్కరించాలని తవణంపల్లి మండలం, నల్లప్పరెడ్డిపల్లి గ్రామస్తులు రామచంద్ర, శిల్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తాము వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, తమ పొలాలకు తరతరాలుగా ప్రభుత్వ భూమిలో ఉండే నీటి కాల్వ దారిలో వెళ్తున్నామన్నారు. ఆ దారిని కొందరు అడ్డుకుని ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. -
ఆరు టిప్పర్ల సీజ్
పాలసముద్రం: గుట్టలోని గ్రావెల్ ఎర్రమట్టిని అక్రమంగా తమిళనాడుకి తీసుకెళ్తున్న ఆరు టిప్పర్లను స్థానిక తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తమ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించి సీజ్ చేశారు. వారు మాట్లాడుతూ మండలంలోని తమిళనాడు సరిహద్దు గ్రామమైన వనదుర్గాపురం పంచాయతీలోని గుట్టలో అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్ మట్టిని తీసుకెళ్తున్నట్టు ఫిర్యాదు అందిందన్నారు. పరిశీలించగా.. అక్కడ గ్రావెల్ ఎర్రమట్టిని టిప్పర్లో తమిళనాడుకు తీసుకెళ్తున్నట్టు గుర్తించామన్నారు. అనంతరం ఎర్రమట్టి తరలిస్తున్న ఆరు టిప్పర్లను సీజ్ చేసి పోలీస్టేషన్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఈ దాడుల్లో డెప్యూటీ తహసీల్దార్ రిశివర్మ, ఆర్ఐ దేవి, వీఆర్ఓ వెంకటాచలం పాల్గొన్నారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర రైలు దొంగల అరెస్ట్
● కత్తులు, వైర్కట్టర్లు స్వాధీనం చిత్తూరు కార్పొరేషన్: రైళ్లలో గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను రైల్వే గుంతకల్లు ఎస్పీ రాహుల్మీనా, తిరుపతి డీఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో రేణిగుంటలో చాకచక్యంగా పట్టుకున్నారు. సోమవారం పోలీసు అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణె జిల్లా, ఖడ్కి గ్రామానికి చెందిన జలిందర్ మహిర్యా పవార్(50), కోహినూర్ నవనత్ పవార్(24) రైళ్లలో దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. అనంతరం వారి నుంచి రెండు కత్తులు, రెండు వైర్కట్టర్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యులు ఎక్కువగా వేకువజామున 2–4 గంటల మధ్యలో నిర్మానుష ప్రాంతాల్లో సిగ్నల్బాక్స్లోని వైర్లను కట్ చేసి రైలు ఆగిపోయేలా చేసేవారని, ఆ తర్వాత కోచ్లో కిటికీ పక్కన ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు చైన్స్, విలువైన వస్తువులు దోచుకునేవారన్నారు. కొన్ని సందర్భాల్లో కత్తులతో ప్రయాణికులను బెదిరించారని చెప్పారు. వరుస దొంగతనాలు గత నెల 26న సిద్ధంపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో చామరాజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణిస్తుండగా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలును అపారన్నారు. నలుగురు మహిళలను కత్తులతో బెదిరించి 85 గ్రాముల బంగారు గొలుసులు లాక్కున్నారని తెలిపారు. వీటిపై డీఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో సీఐలు యత్రీంద, సుధాకర్రెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్, రవి, ధర్మేంద్రరాజు, గోపాల్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను నియమించి వీరి కోసం మహారాష్ట్రలోని సోలాపూర్, పూణేలోని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేసినట్టు తెలిపారు. అక్కడ దొరికిన సమాచారం మేరకు జూలై 13న నిందితులను రేణిగుంటలో అరెస్టు చేసినట్టు వెల్లడించారు. మే 2న మామండూరు రైల్వేస్టేషన్ సమీపంలో సోలాపూర్ స్పెషల్రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 35 గ్రామలు దోచుకోగా.., అదేనెల 12న పూతలపట్టు వద్ద ఆగి ఉన్న రైలు చివరిబోగిలో ఉన్న వ్యక్తి నుంచి దొంగతనానికి యత్నించి తప్పించుకున్నట్టు వెల్లడించారు. 14న ముంగిలిపట్టు రైల్వేస్టేషన్లో తిరుపతి–విల్లుపురం రైలులో ప్రయాణిస్తున్న మహిళ వద్ద 24 గ్రాముల బంగారు గొలుసు దొంగిలించగా.., 21న మంత్రాలయం రైల్వేస్టేషన్లో దొంగతనానికి యత్నించి విఫలమైనట్టు తెలిపారు. జూన్ 2న ముంగిలిపట్టు స్టేషన్లో చామరాజనగర్ ఎక్స్ప్రెస్లో ఇద్దరు మహిళల నుంచి 60 గ్రాములు దోచుకున్నట్టు పేర్కొన్నారు. జూన్ 5న మానవపాడు, 13న అల్లంపూర్ రైల్వేస్టేషన్లలో దొంగతనానికి యత్నించి విఫలమైనట్టు తెలిపారు. 24న తాడిపత్రి రైల్వేస్టేషన్లో కిటికీ పక్కన ఉన్న ప్రయాణికురాల నుంచి 27 గ్రాములు దోచుకున్నట్టు వెల్లడించారు.రికవరీ శూన్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత రెండు నెలలుగా ఈ ముఠా 9 దొంగతనాలకు పాల్పడింది. ఇందులో మొత్తం 242 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. వీరిని పట్టుకోవడానికి 40 మందితో కూడిన రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డాయి. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అక్కడ లభించిన సమాచారం మేరకు రేణిగుంటలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కత్తులు, రెండు వైర్కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఒక్క గ్రాము బంగారం కూడా వారి వద్ద రాబట్టలేకపోయారు. కేసు దర్యాప్తునకు సహకరించిన చిత్తూరు ఎస్పీ మణికంఠచందోలుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రత్యేక బృందం సభ్యులకు అభినందన పత్రాలు అందజేశారు. -
భక్తిప్రపత్తులతో సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో సోమవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతర్థి గణపతి వ్రతాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణరథంపై ఊరేగింపు రాత్రి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మాడ వీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : తోతాపురి మామిడికి ప్రభుత్వం అందజేసే సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చర్య లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తోతాపురి మా మిడి రైతులకు రూ.4ను ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదా పు మూడు లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురిని పరిశ్రమల నిర్వాహకులు కొనుగోలు చేశారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.4 సబ్సిడీ మొత్తం రూ.120 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 30,500 మెట్రిక్ ట న్నుల వేరుశనగ విత్తనాలు వచ్చినట్టు తెలిపారు. -
మేకలు తెచ్చిన గొడవ
● యువకుడిపై కత్తితో దాడిబంగారుపాళెం: మేకలు పొలంలో మేయడంతో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో మేకల యజమాని పొలం యజమానిపై కత్తితో విక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని తుంబకుప్పం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అహ్మద్బాషాకు కొని మేకలు ఉన్నాయి. ఆదివారం మేకలు మేపుకునేందుకు గ్రామ సమీపంలోకి వెళ్లాడు. మేకలు దళితవాడకు చెందిన రామ్విలాస్పాస్వాన్ పొలంలో పైరును మేశాయి. దాంతో పొలం యజమాని మేకల్లో ఒకదాన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయంగా రాత్రి అహ్మద్బాషా మేకను ఎందుకు పట్టుకుని పోయావని అడగడంతో రామ్విలాస్పాస్వాన్, అతని తండ్రి బాబుఅహ్మద్బాషా పై దాడి చేశాడు. గ్రామస్తులు చొరవ తీసుకుని సర్దుబాటు చేసి పంపారు. సోమవారం ఇదే విషయమై అహ్మద్బాషా, రామ్విలాస్పాస్వాన్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అహ్మద్బాషా తన వద్ద ఉన్న కత్తితో రామ్విలాస్పాస్వాన్ (30)పై దాడి చేసి ఎడమ చేయి, కుడికాలుపై తీవ్రంగా గాయపరచి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన యువకుడిని స్థానికులు 108 ద్వారా బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చీలాపల్లె సీఎంసీకి రెఫర్ చేశారు. బాఽధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవినీతి పీడీపై వేటు!
● హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ సస్పెన్షన్ ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు కలెక్టరేట్ : అవినీతి పీడీపై వేటు పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. హౌసింగ్ పీడీగా గోపాల్ నాయక్కు సీఎం సొంత జిల్లాలో పోస్టింగ్ కల్పించారు. ఈయన పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కీలకమైన శాఖను అప్పగించారు. ఆయన రోజూ తిరుపతి జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు సాగించేవారు. స్థానికంగా ఉండకపోవడంతో హౌసింగ్ అడ్మినిస్ట్రేషన్ను గాలికొదిలేశారు. గత సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ఆలస్యంగా వచ్చిన ఆయనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన గతంలో చేసిన అవినీతి ఆరోపణలను విచారించిన తర్వాత సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సస్పెండ్ ఇందుకేనా? భూక్య గోపాల్ నాయక్ గతంలో అన్నమయ్య జిల్లా పీలేరు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా పనిచేస్తూ రాయచోటి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ఆ సమయంలో అనగాని శ్రీహరి అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగి నుంచి బదిలీకి సంబంధించి లంచం డిమాండ్ చేశారు. ఈ విషయం బాధితుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. విచారించిన ప్రభుత్వం ప్రస్తుతం అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ ఉత్తర్వులు జారీచేశారు. అది ఆయనకు అలవాటే! హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ సస్పెండ్ విషయం జిల్లా అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన గతంలో పీలేరు డీఈఈగా పనిచేస్తున్న సమయంలో హౌసింగ్ లే అవుట్లలో జంగిల్ క్లియరెన్స్ కు ఓటీఎస్ నగదు ఖర్చు చేయకుండా నిబంధనలకు వ్యతిరేకంగా డ్రా చేసి పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా రాయచోటిలో ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించే ఇసుకను భారీ స్థాయిలో పక్కదారి పట్టించారని సమాచారం. పీలేరులో డీఈఈగా పనిచేస్తున్న సమయంలో ఇసుక, సిమెంట్, స్టీల్ ను భారీగా అక్రమదారుల్లో అమ్మకాలు చేశారనే ఆరోపణలున్నాయి. -
దొంగ అరెస్ట్
కుప్పం: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. తమిళనాడు రాష్ట్రం, తిరుపత్తూరు జిల్లా, కరంబూర్ గ్రామానికి చెందిన శక్తివేల్ దొంగతనాలకు పాల్పడేవాడని, ఈ క్రమంలో ఆంధ్రాలో అతనిపై ఇప్పటికే 14 కేసులు నమోదైనట్లు తెలిపారు. కుప్పం సర్కిల్ పరిధిలో కూడా అతనిపై నాలుగు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం పోలీసు నిఘా ఉంచి అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిదింతుడి వద్ద నుంచి 5 తులాల బంగారం, కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రామకుప్పం మండలం, ననియాల గ్రామానికి చెందిన ఇద్దరు బియ్యం వ్యాపారులపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఇదిలా వుండగా గోవిందరాజులు, మాణిక్యం తమిళనాడు బియ్యాన్ని కొనుగోలు చేసి ఓ బియ్యం వ్యాపారికి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దళితులంటే అలుసా? చిత్తూరు కలెక్టరేట్ : నగరి మండలం, గుండ్రాజకుప్పం దళితవాడ ప్రజలను ఆదుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. గుండ్రాజ కుప్పం దళితవాడకు ఆనుకొని ఉన్న కొండను క్వారీ యజమానులకు అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యను పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ జీడీ నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలం, సాయినగర్, ఎస్ఆర్ఆర్ కండ్రిగ, వనదుర్గపురం తదితర గ్రామాల్లో కొండలను తొలిచి టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని తోడేస్తున్నారని, అక్రమంగా తమిళనాడుకు తరలించి సొమ్ము చేస్తుకుంటున్నారని చెప్పారు. -
చిత్తూరు ఎంపీ ఇంతవరకు రాలేదు
● కలెక్టరేట్ ఎదుట టీడీపీ నగరి నియోజకవర్గ నేతల ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎన్నికై నప్పటి నుంచి ఇంత వరకు నగరి వైపు రాలేదని ఆ నియోజకవర్గ టీడీపీ నేత చలపతి ఆరోపించారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు చేతబట్టి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిత్తూరు ఎంపీని చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరికి రానివ్వకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. గతంలో సైతం దివంగత ఎంపీ శివప్రసాద్ పట్ల ఇలాంటి ధోరణే అమలు చేశారని ఆరోపించారు. చిత్తూరు ఎంపీ నగరికి విచ్చేసి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలన్నారు. అనంతరం నగరి తెలుగుదేశం పార్టీలో దెయ్యం ఎవరు భూతం ఎవరంటూ ప్లకార్డులు చేతబట్టి ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 200 మీటర్ల కేబుల్ వైరు చోరీ చౌడేపల్లె: మండలంలోని చారాల కురప్పల్లెకి తాగునీటి సరఫరాచేసే బోరుకు అమర్చిన 200 మీటర్ల కేబుల్ వైరు ఆదివారం రాత్రి చోరీకి గురైందని సర్పంచ్ విజయకుమారి తెలిపారు. వైరు విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు. -
టీబీని నివారిద్దాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): 2025 ఆఖరి కల్లా టీబీని దేశం నుంచి తరిమికొట్టాలని సెంట్రల్ టీబీ డివిజన్ డిప్యూటీ కమిషనర్ భవానిసింగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లాలో జరుగుతున్న టీబీ ముక్త భారత్ కార్యాక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. టీబీని సమూలంగా నిర్మూలించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ షుఘర్, తాగుడు అలవాటు ఉన్నవారికి, పాత టీబీ రోగులకు, హెచ్ఐవీ రోగులందరికీ టీబీ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. అనంతరం జిల్లా టీబీ నివారణ అధికారి వెంకటప్రసాద్ మాట్లాడారు. ప్రతి సచివాలయ పరిధిలో రోజూ 10 మందికి టీబీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామన్నారు. అంతకుముందు జిల్లా టీబీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పూతలపట్టులోని వేపనపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జీడీ నెల్లూరు మండలంలోని నెల్లేపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ను తనిఖీ చేశారు. ఆయన వెంటన కేంద్ర బృందం సభ్యులు దర్మారావు, గంగాధర్, శ్రీ ధీరజ్, టీబీ శాఖ అధికారులు మనోహర్రెడ్డి, జశ్వంత్, సంతోష్ పాల్గొన్నారు. -
కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం
● టైరు పేలి కారు బోల్తా ● ప్రాణాలతో బయటపడిన కుటుంబ సభ్యులు బంగారుపాళెం : మండలంలోని పాలేరు ఫ్లై ఓవర్ సమీపం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు టైరు పగిలి బోల్తా పడి దగ్ధమైంది. ఈ సంఘటనలో కాంచీపురానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు గాయాలతో బయటపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన తాండవమూర్తి (65)కి బైరెడ్డిపల్లె మండలంలోని విరుపాక్షపురంలోని ఆయుర్వేద వైద్యశాలలో నాటు మందు తాగించుకుని వచ్చేందుకు కుమారుడు కార్తికేయన్(34), తల్లి సంపత్కుమారి(60), భార్య అశ్వని(32), కుమారై రక్షిత(2), మామ వేలాయుధం(45) మొత్తం ఆరుగురు కలిసి ఉదయం 4.45 గంటలకు కాంచీపురం నుంచి తమ సొంత కారులో బయలుదేరి విరుపాక్షపురానికి 8 గంటలకు చేరుకున్నారు. అక్కడ తాండవమూర్తికి నాటుమందు తాగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో బంగారుపాళెం మండలం పాలేరు ఫ్లై ఓవర్కు కొంతదూరం వెళ్లిన తరువాత కారు టైరు పగిలి అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. కారుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. కారులో ఉన్న వారు డోర్ తెరుచుకుని దూకేసి ప్రాణాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న ఽకార్తీకేయన్, అతడి భార్య అశ్వనికి, మామ వేలాయుదానికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు మంటలను అదుపు చేసేందుకు కోసం పలమనేరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం అధికారి రెడ్డెప్పరెడ్డి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేలోగా కారు పూర్తిగా కాలిపోయింది. గాయపడిన వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిన ప్రాణాపాయం కారు టైరు ఉన్న ఫలంగా పగిలిపోవడంతో అదుపుతప్పి కారు బోల్తాపడి మంటలు చెలరేగాయని అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. కారులో ఉన్నవారు తేరుకుని డోర్లు తెరుచుకుని బయటకు వచ్చారని తెలిపారు. కొంతసేపటికే కారు పూర్తిగా దగ్ధమైందన్నారు. కారు డోర్లు తెరుచుకోకపోయి ఉంటే కారులోని వారు చనిపోయి ఉంటారన్నారు. -
లైంగిక దాడికి యత్నం
చౌడేపల్లె : ఇల్లు కట్టించడంతో పాటు అన్నీ తానై చూసుకుంటానని అసభ్యకరంగా మాట్లాడుతూ.. లైంగిక దాడికి యత్నించాడని కాగతి పంచాయతీ పలగార్లపల్లెకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదంటూ ఆదివారం ఆమె కన్నీటి పర్యంతమైంది. బాధితురాలి కథనం.. పలగార్లపల్లెకు చెందిన గంగరాజుకు ప్రాజెక్టు సమీపంలోని ఊదరకుంట వద్ద వ్యవసాయ పొలం ఉంది. ఈనెల 11వ తేదీనా ఆమె తన భర్త గంగరాజు పొలం వద్ద ఉండగా మధ్యాహ్నం అన్నం తీసుకొని బయలు దేరగా మార్గ మధ్యలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. లైంగిక దాడికి యత్నించగా కేకలు వేయడంతో పరారైనట్లు పేర్కొంది. ఈ ఘటనపై అదే రోజు రాత్రి వెళ్లి అడగ్గా తన అనుచరులతో కలిసి శ్రీనివాసులు తనతో పాటు తన భర్త కుటుంబీకులపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. ఈనెల 12 వతేదీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారి నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. ఆర్థిక కారణాలతో వ్యక్తి ఆత్మహత్య చిత్తూరు అర్బన్ : కుటుంబ ఆర్థిక కారణాలు వేధించడంతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్టౌన్ పోలీసుల కథథనం మేరకు చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన ఇన్భనాథన్(58) శనివారం సాయంత్రం కుటుంబీకులకు గిరింపేట వరకు వాకింగ్ వెళుతున్నాని చెప్పాడు. తీరా క్రిష్ణవేణి కళాశాల ప్రాంతంలో పురుగుమందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. కాగా భార్య షీలా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆర్థిక కారణాలతో మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లారీ బీభత్సం – మామిడిచెట్లు ధ్వంసం గుడిపాల : రోడ్డుపైన వెళ్తూ ఓ లారీ అదుపు తప్పడంతో వ్యవసాయ పొలంలోకి వెళ్లి పొలం పక్కన ఉన్న రాతి కూసాలను ఢీకొంటూ మామిడి చెట్లను ధ్వంసం చేసింది. బెంగుళూరు నుంచి తమిళనాడులోని నామక్కల్కు వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం తాగి మద్రాస్ క్రాస్ రోడ్డు వద్ద జ్యోతీశ్వర్రెడ్డికి చెందిన రైతు మామిడితోటలోకి లారీని వదిలేశాడు. ఎదురుగా ఎవ్వరూ రాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో వ్యవసాయ పొలంలోకి ప్రవేశించి రాతి కూసాలు ధ్వంసం కావడంతో పాటు మామిడిచెట్లు ధ్వంసం అయ్యాయి. -
కొండంత జనం
అమ్మవారికి ప్రీతికరమైన ఆదివారం బోయకోండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.కారు దగ్ధం..తప్పిన ప్రమాదం బంగారుపాళెం మండలంలో ఆదివారం పాలేరు ఫ్లైఓవర్ సమీపంలో కారు టైరు పేలి బోల్తాపడి దగ్ధమైంది. సోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం..తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో విద్యార్థుల తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి జాబితాలో పథకం వర్తించని పిల్లలు రెండో జాబితాకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో గ్రీవెన్స్ స్వీకరించడంతో ఈ పథకంపై పెద్ద ఎత్తున అర్జీలను విద్యార్థుల తల్లులు అందజేశారు. ఎవరు ఏ సమస్య వల్ల అనర్హత జాబితాలో ఉన్నారో పేర్ల వారీగా వివరణ ఉన్న జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించారు. వాటి ఆధారంగా అవసరమైన పత్రాలను జత చేసి గ్రీవెన్స్కు అర్జీలు అందజేశారు. అయితే ఆ అర్జీలు వివిధ దశల్లో అధికారులు ఆమోదించాల్సి ఉండటంతో పరిష్కారానికి నోచుకోని దుస్థితి నెలకొంది. అర్హులైనా..అనర్హులుగా తల్లికి వందనం పథకం అర్హత ఉన్నప్పటికీ గతంలో అమ్మఒడి పథకం పొందినప్పటికీ ఈ ఏటా అనర్హులుగా చూపించారు. అదే విధంగా చాలా మంది విద్యార్థుల తల్లులకు సంబంధం లేని సమస్యలను వారికి అంటగట్టి అనర్హులుగా జాబితాలో పెట్టారు. దీంతో జిల్లాలో తల్లికి వందనం వర్తింపజేయాలంటూ అర్జీలు సచివాలయాల్లో పోటెత్తాయి. తమకు అర్హత ఉన్నా పలు కారణాలతో జాబితాలో పేర్లు లేకుండా చేశారంటూ తల్లులు సచివాలయాలకు క్యూ కట్టి దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పుడో కారు విక్రయించేసినా కారు ఉందనే సాకుతో పథకం నుంచి తొలగించారని కొందరు. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు అధికంగా చూపడంతో డబ్బులు పడలేదని మరికొందరు.. మూడేళ్ల కింద ఆదాయపు పన్ను చూపించి డబ్బులివ్వలేదని ఇంకొందరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు, రేషన్న్కార్డు సమస్యలున్న కుటుంబాలు ఇలా రకరకాల కారణాలతో తమను పథకానికి దూరం చేశారంటూ వాపోతున్నారు. అర్హులుగా నిర్ధారించి డబ్బులివ్వాలంటూ అధిక సంఖ్యలో తల్లులు అర్జీలు పెట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 1,890 మంది తల్లులు అధికారికంగా అర్జీలు దాఖలు చేశారు. వీరే కాకుండా అవగాహన లేక దరఖాస్తు చేసుకోవాల్సిన తల్లులు మరో వెయ్యి మంది ఉండొచ్చని అంచనా. జిల్లాలో 1,890 అర్జీలు నమోదు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,890 అర్జీలు పోటెత్తాయి. అర్జీల్లో ఎక్కువశాతం విద్యుత్ బిల్లుకు సంబంధించినవే. పథకం వర్తించని వారు విద్యుత్ కార్యాలయాల వద్దకు వెళ్లి ఏడాది విద్యుత్ వినియోగ బిల్లులు తీసుకుని అర్జీలతో జత చేసి ఆధారాలు చూపుతూ అర్జీలు పెట్టుకుంటున్నారు. తమ పేరుపై అనేక విద్యుత్ మీటర్లు సీడింగ్ అయి ఉన్నాయని వాటిని తొలగించాలనే అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. తమ కారు విక్రయించేసినా పథకం అమలు కాలేదని అనేక అర్జీల్లో తల్లులు ప్రస్తావించారు. ఆదాయ పన్ను దరఖాస్తులదీ ఇదే తీరు. వివాహం తర్వాత తాము కుటుంబం నుంచి విడిపోయి విడిగా ఉంటున్నా ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆదా యం చూపించి తీసేశారంటూ అర్జీల్లో అనేక మంది పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అనేక మంది అర్జీలు దాఖలు చేశారు. అర్జీల పరిశీలనలో అలసత్వం తల్లికి వందనం పథకంలో వివిధ శాఖలకు పంపుతున్నా అర్జీల పరిశీలనలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కారుకు సంబంధించి జిల్లా రవాణా శాఖ, ఆదాయపు పన్ను అర్జీలను తహసీల్ధార్, ఇలా పలు సమస్యల అర్జీలను ఆయా శాఖల అధికారుల లాగిన్లకు పంపారు. అయితే సంబంధిత అర్జీలు ఆయా అధికారుల లాగిన్లలో నెలలు గడుస్తున్నప్పటికీ ఆమోదానికి నోచుకోక అలానే పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వేల మంది తల్లులు అర్జీల పురోగతి కోసం నిత్యం సచివాలయాల చుట్టూ తిరిగి వేశారి పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులం కాదంటూ 581 అర్జీలు నమోదు అయ్యాయి. ఆ అర్జీలను మొదటగా సచివాలయంలో దరఖాస్తు చేసుకోగా అక్కడ నుంచి వీఆర్వోకు, ఆ తర్వాత తహసీల్ధార్, అనంతరం ఆర్డీవో, చివరికి జాయింట్ కలెక్టర్ లాగిన్కు చేరుతాయి. ఇలా నమోదైన 581 అర్జీల్లో ఇప్పటి వరకు కేవలం 4 అర్జీలు మాత్రం ఆమోదించారు. అదే విధంగా ఇన్కం ట్యాక్స్ సమస్యలపై 263 అర్జీలు నమోదయ్యాయి. ఈ అర్జీల్లో ఇప్పటి వరకు 3 అర్జీలు మాత్రం ఆమోదించారు. నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : నగరిలో అక్రమ గ్రావెల్ క్వారీలు, పలు సమస్యల పరిష్కారానికి ఈనెల 14న సీపీఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. నగరిలో అక్రమ గ్రావెల్ క్వారీలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గుండ్రాజ కుప్పం దళితులు హైవేలో ఇళ్లు కోల్పోతున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. పలు డిమాండ్లు పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. 22న మామిడి రైతు మహా జనసభ చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రపంచ మామిడి దినోత్సవ సందర్భంగా ఈనెల 22న మామిడి రైతు మహా జనసభ నిర్వహిస్తున్నట్లు మామిడి రైతు సంక్షేమ సంఘం నాయకులు ఉమాపతి నాయుడు తెలిపారు. చిత్తూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ సభను ఏర్పాటు చేశామని, ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సంఘ సమావేశం ప్రారంభమవుతుందని, మామిడి రైతులు పాల్గొనాలని కోరారు. గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం పెద్దపంజాణి : మండలంలోని శంకర్రాయలపేటలోని మహాత్మా జ్యోతిభా పూలే బాలికల గురుకుల పాఠశాల (ఇంగ్లిష్ మీడియం)లో 2025–26 సంవత్సరానికి గానూ 5,6,7,8,9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ జోత్స్న తెలిపారు. ఈనెల 20 ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్థానిక గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలకు వచ్చేవారు పాస్పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ జిరాక్స్, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకుని ఈనెల 12 నుంచి 18వ తేదీ లోపు పాఠశాలలో దరఖాస్తు ఫారం పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను 18వ తేదీ సాయంత్రం లోపు పాఠశాలలో అందజేసి హాల్ టికెట్ తీసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 95157 64818 ఫోన్ నంబరును సంప్రదించాలని కోరారు. చిత్తూరు సచివాలయంలో తల్లికి వందనం సమస్యల అర్జీలు ఇస్తున్న తల్లిదండ్రులు (ఫైల్)రెండవ విడతకు కాలయాపన తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం జూన్ 13న అమలు చేసింది. నేటితో ఒక నెల పూర్తి అవుతోంది. చిత్తూరు జిల్లాలో 2,64,679 మంది విద్యార్థులకు సంబంధించి 1,30,382 మంది తల్లుల ఖాతాల్లో రూ.169.50 కోట్లు జమ చేశారు. అయితే మొదటి విడత మంజూరు కాని విద్యార్థులకు రెండో విడతలో పథకం నగదు జమ చేస్తామంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆర్భాటంగా చెప్పారు. మొదట రెండో విడత నగదును జులై 5వ తేదీన వేస్తామన్నారు. ఆ తర్వాత జులై 10వ తేదీ అన్నారు. ఈ రెండు తేదీలు గడిచిపోయినా ఇంకా నగదు జమ కాని దుస్థితి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఎగొట్టేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థుల తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన పలమనేరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు విమర్శించారు. పలమనేరు పట్టణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళైన ఉప్పాల హారికపై గుడివాడలో టీడీపీ, జనసేన గుండాలు మారణాయుధాలతో దాడి చేయడం దారుణమన్నారు. మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసుల సాక్షిగా జరుగుతున్నా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. జిల్లా ప్రథమ పౌరురాలకే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలోని సామాన్య మహిళల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్జిల్లాలోని తల్లికి వందనం పథకంలో తాము ప్రభుత్వ ఉద్యోగులం కాదంటూ చిత్తూరు అర్బన్లో 90, కుప్పం అర్బన్లో 28, కుప్పం రూరల్లో 28 మంది విద్యార్థుల తల్లులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తుల నమోదు చేసి నెల రోజులు అవుతున్నా మోక్షం కలగని దుస్థితి. ఇదే కాదు జిల్లాలోని అన్ని మండలాల్లో తల్లికి వందనం అర్జీల పరిష్కార పరిస్థితి ఇలానే ఉంది. చిత్తూరు జిల్లాలో 1,890 అర్జీల నమోదు పరిష్కారానికి నోచుకోని ‘తల్లికి వందనం’ అర్జీలు సచివాలయాల చుట్టూ తల్లుల ప్రదక్షిణలు రెండో విడత మంజూరులో కాలయాపన కూటమి ప్రభుత్వం అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం.. తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.. మొదటి జాబితాలో పథకం వర్తించని వారు రెండో జాబితాకు ఎదురు చూస్తున్నారు. అర్హులైనప్పటికీ అనర్హులని మొదటి విడత తల్లికి వందనంలో చాలా మంది విద్యార్థులకు పథకం ఎగ్గొట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేల మంది తల్లులకు తల్లికి వందనం అర్జీలతో సచివాలయాల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ అర్జీలు పరిష్కారానికి నోచుకోక విద్యార్థుల తల్లులు...తిప్పలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లికి వందనం పథకం అర్జీలపై సాక్షి ఫోకస్.జిల్లా సమాచారం నమోదైన పెండింగ్లో అర్జీలు ఉన్న అర్జీలు ప్రభుత్వ ఉద్యోగులం కాదంటూ 581 577 ఇన్కంట్యాక్స్ సమస్యలు 263 260 ఈకేవైసీ సమస్యలు 1,046 1,026 మొత్తం అర్జీలు 1,890 1,863 సర్కారు తీరు సరికాదు తల్లికి వందనం పథకం ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ హామీని విస్మరించింది. ఒక కుటుంబంలో ముగ్గురు విద్యార్థులుంటే ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చి మిగిలిన పిల్లలకు కొర్రీల పేరుతో తొలగించారు. అదే విధంగా చాలా మందికి గతంలో అమ్మఒడి వర్తించినప్పటికీ ఇప్పుడు తల్లికి వందనం ఎందుకు వర్తించదో అర్థం కావడం లేదు. అర్జీలను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు అలసత్వం వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
కొండంత జనం
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన బోయకొండ ఆలయం భక్తులతో ఆదివారం కిక్కిరిసింది. అమ్మవారికి ప్రీతికరమైన ఆదివారం న కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొండపై ఎటుచూసినా భకజన సందోహం నెలకొంది. అమ్మవారిని బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి నేవైద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయంలోని క్యూలైన్లు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. గంటల తరబడి నిరీక్షించి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. సుమారు 50 వేల మందికిపైగా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఊహంచని రీతిలో వాహనాల్లో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యతో భక్తులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. కిక్కిరిసిన బోయకొండ ఆలయం రద్దీగా మారిన క్యూలు బోయకొండ ఒక్క రోజు ఆదాయం రూ.28.60 లక్షలు బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రూ:28.60 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఆలయంలో భక్తులకు విక్రయించిన వివిధ రకాల సేవా టికెట్లు, ప్రసాదం, తీర్థం టికెట్లు ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు చెప్పారు. -
నిరాశ్రయుల వసతి గృహం తనిఖీ
చిత్తూరు అర్బన్ : రాష్ట్రంలోని నిరాశ్రయుల గృహాల్లోని పేదలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి మెప్మా తరపున సహకారం అందిస్తామని రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నా రు. చిత్తూరులోని నిరాశ్రయుల వసతి గృహాన్ని శనివారం రాత్రి మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ తనిఖీ చేశారు. వంట శాలలో ఆహార పదార్థాల తయారీ, నిత్యావసర సరుకులు తేదీలను, వసతి పొందుతున్న వారి రికార్డులను పరిశీలించారు. అనంతరం వసతి పొందుతున్న వారి నుంచి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ , మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రానికి, కొన్ని వసతులు కోరారని, పరిశీలించి సమకూర్చుతామన్నారు. సపోర్ట్ సంస్థ నిర్వాహకులు జోసఫ్ రాజు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఎస్ఎమ్ ఎమ్ మెప్మా శ్రీనివాసరావు , చిత్తూరు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర, సీఎంఎం వెంకటరమణ, టీఈఎస్ఎస్ రవి, మెప్మా పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం.. కాపర్ తీగలు చోరీ చౌడేపల్లె : కాపర్ వైర్ల కోసం వేర్వేరు ప్రదేశాల్లో ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని చారాల, శెట్టిపేట సమీపంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చారాల సచివాలయం పక్కన బీఎస్ఎన్ఎల్ టవర్ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మను ఽ పగులకొట్టి కాపర్వైరు చోరీ చేశారు. అలాగే శెట్టిపేట సమీపంలోని పురుషోత్తం రాజు మామిడి తోటలో టవర్ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి కాపర్ తీగలను అపహరించారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చోరీలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
● ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం విఫలం ● వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు : అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించార ని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఏడాది పాలనలోనే ప్రజా విశ్వాసం కోల్పోయారని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం మున్సి పాలిటీ, రూరల్ మండలాల్లో ‘బాబు షూరిటీ– మోసం గ్యారెంటీ’ కార్యక్రమా న్ని వేల మందితో విడివిడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాక ఆయన ప్రజలను మోసగించడంలో కొత్తేమీ కాదన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మోసాల తోనే సాగిపోతోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం చేస్తే ఒక్కొక్కరూ తిరుపతి వెళ్లాలంటే మూడు జిల్లాల బస్సులు మారాల్సి ఉందన్నారు. ఇలాంటి ప్రయాణాలతో ఉపయోగం లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి శ్రీకాకుళం నుంచి కుప్పం దాక ఉచిత ప్రయాణాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయిందని, సూపర్–6లో ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక టమాటా, మామిడి, మిర్చి, పొగాకు రైతు లు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయి న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న జగన్ మోహన్రెడ్డి పర్యటనలకు ప్రజలను రానివ్వకుండా వేల మంది పోలీసులతో చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ప్రజలను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. కానీ జగన్ మోహన్రెడ్డిపై ఉన్న నమ్మకం , అభిమానంతో ప్రజలకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వేల మంది తరలివచ్చి పర్యటనలను జయప్రదం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించి ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రజాభిమానం చూసి వణుకు జగన్ సభలకు వస్తున్న ప్రజాభిమానం చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి వణుకు పుడుతోందని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్.జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీతో సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, నియోజకవర్గ నాయకుడు నూతనకాల్వ శ్రీనాథరెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్ షరీఫ్, రాష్ట్ర యువత కార్యదర్శి కొత్తపల్లి చెంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్రెడ్డి, జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ముతో పాటు పార్టీ పట్టణ, రూరల్ అధ్యక్షులు ఇర్ఫాన్, అమరనాథరెడ్డి లతో పాటు సర్పంచ్లు, ఎంపీటీిసీలు, మాజీ ఎంపీపీలు, వైఎస్సార్సీపీ అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి తెలియజేయాలి... ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సూపర్–6ను అమలు చేయకపోవడం, మేనిఫెస్టోను పట్టించుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘బాబు షూరిటీ– మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రతి రోజు తెలియజేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో పాటు పార్టీ క్యాడర్ పూర్తిగా ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చే సమాచారాన్ని ప్రజలకు వివరించాలన్నారు. -
కోర్సుల కోత.. కాలేజీల మూత!
● యూనివర్సిటీలలో పలు కోర్సులకు మంగళం ● మరిన్నింటిని రద్దు చేసే యత్నంలో ప్రభుత్వం ● అగ్రి పాలిటెక్నిక్ కళాశాలలకు చెల్లిన కాలం ● సర్కారు వైఖరిపై విదార్థి సంఘాల ఆగ్రహంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావిప్లవానికి శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు బంగారు బాటలు వేసింది. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత విద్యారంగాన్ని విధ్వంసం చేస్తోంది. కార్పొరేట్కు కొమ్ముకాస్తూ గ్రామీణ విద్యార్థుల భవితను ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. అందులో భాగంగా విశ్వవిద్యాలయాల్లో పలు కోర్సులకు మంగళం పాడేసింది. అడ్మిషన్లు లేవనే సాకుతో మరిన్నింటిని తొలగించేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ పాలిటెక్నిక్ను పూర్తిగా రద్దు చేసేసింది. అలాగే యానిమల్ హస్బెండరీ కోర్సును సైతం చెల్లుచీటీ రాసేందుకు సన్నద్ధమవుతోంది. ఇక సాంకేతిక విద్యకు అధ్యాపకులను నియమించకుండా నిర్వీర్యం చేస్తోంది.ఆశగా ఎదురు చూశాం ఈ ఏడాది అగ్రి పాలిటెక్నిక్ కోర్సులో చేరాలని ఎంతో ఆశగా ఎదురు చూశా. మా సమీప బంధువు ఓ అమ్మాయి వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి విలేజ్ అగ్రికల్చరల్ ఆఫీసర్గా పనిచేస్తోంది. నేను కూడా ఉద్యోగం సాధించి రైతులకు సేవ చేయాలనుకున్నా. కానీ ఈ ఏడాది తిరుపతిలో ఆ కోర్సును రద్దు చేశారని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. – సౌమ్య, విద్యార్థిని, తిరుపతి బాధగా ఉంది తిరుపతిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మా అబ్బాయిని చదివించాలని అనుకున్నాం. కానీ ఈ ఏడాది నుంచి కోర్సును పూర్తిగా ఎత్తివేశారని తెలిసి చాలా బాధగా ఉంది. వ్యవసాయ విద్యను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సును దూరం చేయడం తగదు. దీంతో వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. – రామయ్య, రైతు, తిరుపతి రూరల్ భ్రష్టుపట్టించారు వర్సిటీలలో గ్రామీణ ప్రాంత పిల్లలు ఎంతో ఆసక్తితో చేరే ఆర్ట్స్ గ్రూప్లను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వ్యవసాయ విద్యను దూరం చేసే నిర్ణయాలు మంచివి కావు. వ్యవసాయ పాలిటెక్నిక్లో అడ్మిషన్లు రద్దు చేసి మూసివేయడం దారుణం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు. – మురళీధర్, వైఎస్సాఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి తిరుపతి సిటీ : గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి విశ్వవిద్యాలయాలే దిక్కు. అయితే వర్సిటీల్లో పేద విద్యార్థులు అడ్మిషన్లు పొందే ఆర్ట్స్ గ్రూప్లను క్రమేణా కుదిస్తూ వస్తోంది. అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయంటూ మెర్జింగ్ పేరుతో పలు కోర్సులను ఇప్పటికే రద్దు చేసింది. ఈ ఏడాదిలో వర్సిటీలలో సుమారు 12 కోర్సులను తొలగించింది. టెక్నాలజీ పేరుతో ఏఐ, డేటా సైన్స్ అంటూ నూతన కోర్సులను ప్రవేశపెట్టినప్పటికీ బోధనకు నిపుణులైన అధ్యాపకులు లేకపోవడంతో సాంకేతిక విద్య సైతం గాడి తప్పుతోంది. మూతపడిన వ్యవసాయ పాలిటెక్నిక్ గ్రామీణ వ్యవసాయ కుటుంబం నుంచి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతో ఆసక్తితో చేరే వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సును పూర్తిగా తొలగించారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్లో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను నిలిపివేస్తూ ఎన్జీ రంగా వర్సిటీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు నిరాశే మిగిలింది. అదే దారిలో వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సుకు సైతం త్వరలో గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవేశాలు తక్కువగా ఉన్నాయనే నెపంతో పలు కోర్సులకు మంగళం పాడుతున్న ప్రభుత్వ వైఖరిపై అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉన్నత విద్య దూరమవుతోంది ప్రభుత్వం కారణంగా గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోంది. అందుకే వర్సిటీలలో పలు కోర్సులను రద్దు చేసింది. వ్యవసాయ పాలిటెక్నిక్తో ఎంతో మంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అలాంటి కోర్సులను రద్దు చేసి ఏకంగా కళాశాలలనే మూసివేయడం దారుణం. – ఆర్.ఆషా, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి, తిరుపతి కోర్సుల రద్దు సరికాదు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిస్థాయిలో ఇంత వరకు విడుదల చేయలేదు. విద్యార్థుల ప్రవేశాలు తగ్గుముఖం పట్టడంతో వర్సిటీలు దయనీయస్థితిలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు చేపట్టకుండా కోర్సులను రద్దు చేయడం సరికాదు. – ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి, ఏఐఎస్ఎఫ్, తిరుపతి నిర్వీరం చేసే కుట్ర వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుకు ప్రభు త్వం మంగళం పాడేసింది. ఇదే తరహాలో మరిన్ని కోర్సులను రద్దు చేసి కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసేందుకు కుట్ర పన్నుతోంది. వర్సిటీలలో పెద్ద సంఖ్యలో మెర్జింగ్ పేరుతో పలు కోర్సులను రద్దు చేయడం దారుణం. – ఎస్.అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి -
ఔను.. వాళ్లు ఒక్కటవుతున్నారు
భార్యాభర్తల మధ్య అంతరాలు.. చిన్న చిన్న తగవులు.. ఇంకొద్దిగా మనస్పర్థలు.. మనస్సు తట్టి హృదయాంతరాల్లోకి చూస్తే తమను తక్కువ చేశారనే భావన.. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులపై అవగాహన లేమి.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం.. సమస్యలు విని సర్దుబాటు చేసే వారు లేకపోవడంతో పలు జంటలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాయి. అలాంటి జంటల సమస్యలను పరిష్కరించి, మళ్లీ వారి కాపురాలను చక్కదిద్దుతోంది ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం. నాటి వైఎస్సార్ సీపీ పాలనలో వేసిన ఈ బీజం నేడు సత్ఫలితాలను ఇస్తోంది. చిత్తూరు అర్బన్: మహిళల హక్కులు, దాంపత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నాటిన బీజం.. ఇపుడు వృక్షంగా ఎదిగింది. అదే ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం. నాడు దిశ స్టేషన్గా నామకరణం చేసి మహిళలకు అండగా నిలిచిన స్టేషన్ను.. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళా స్టేషన్గా పేరు మార్చి సేవలు అందిస్తోంది. నాటి ప్ర భుత్వంలో ఉన్న దిశ ఇపుడు పే రు మార్చినా.. అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతోంది. చిత్తూరు నగరంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో శనివారం ఎస్పీ మణికంఠ చందోలు ఈ కేంద్రం పనితీరును మీడియాకు వివరించారు. విభేదాలు పరిష్కరించి.. చిత్తూరు నగరంలోని దర్గా కూడలిలో ఉన్న ఫ్యామిలీ కౌ న్సెలింగ్ కేంద్రం మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మహిళలు, దంపతుల సమస్యలను పరిష్కరించడమే ఈ కేంద్రం లక్ష్యం. పోలీసులతో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మానసిక నిపుణులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా శిశు సంరక్షణ విభాగం ఉద్యోగులు ఓ కమిటీగా ఉంటారు. ఇంట్లో భర్తతో గొడవలు, అత్త–మామ, వదిన–తోడికోడళ్లు.. చాలా వరకు కేసుల్లో భర్త చెబితే నేను ఎందుకు వినాలి అని భార్య.. భార్యకు గౌరవం ఇవ్వడం ఏమిటని భర్త, అత్తా–మామాల చాదస్తం పడలేకపోతున్నామని కొందరు, కోడలు సరిగా చూసుకోవడం లేదని మరికొంరు స్టేష న్ మెట్లు ఎక్కుతుంటారు. ఇలా ఎవరి నుంచైనా సమస్య లు వస్తే నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లడం, ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయడం చేసేవాళ్లు. కానీ ఈ కేంద్రంలో తొలుత వ చ్చి ఫిర్యాదు ఇచ్చినా.. ఎదుటి వ్యక్తులను స్టేషన్కు పిలిపిస్తా రు. ఇరుపక్షాల సమస్యలు విన్న తరువాత సమస్యకు పరిష్కారం చూపించడంతోపాటు కొద్ది సమయం కూడా ఇస్తా రు. సమస్య సమసిపోతే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండ దు.. అలా వీలుకాని పక్షంలో చట్టపరంగా ముందుకు వెళుతారు. 482 కేసుల పరిష్కారం.. ఏడాది కాలంలో ఈ కేంద్రంలో 482 ఘటనల్లో ఎఫ్ఐఆర్లు కట్టకుండా సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఆవేశంలో తలెత్తిన విభేదాలకు కొద్దిగా సమయమిచ్చి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. చిన్నపాటి అభిప్రాయ భేదాలకు దారులు చూపిస్తున్నారు. ఈ కేంద్రంలో జిల్లాకు చెందిన కేసులే కాకుండా.. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ఇతర రాష్ట్రాలకు చెందిన 52, విదేశాల నుంచి వచ్చిన మూడు కుటుంబాల్లోని విభేదాలను సైతం పరిష్కరించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 748 కుటుంబ సదస్సులు నిర్వహించి, కుటుంబంలో తలెత్తే సమస్యలు ఎలా అధిగమించాలో పాఠశాలల్లోనే పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. సత్ఫలితాలిస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రం వైవాహిక బంధంలో సమస్యలు తీరుస్తున్న ఖాకీలు నాటి ప్రభుత్వంలో దిశ.. కూటమిలో మహిళాస్టేషన్ పేరు మారినా.. ప్రజలకు ఉపయోగపడుతున్న సెంటర్ శృతి మించితే.. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రంలో వీలైనంత వరకు ఓ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేస్తారు. కానీ కొన్ని కేసుల్లో భార్యను శారీరకంగా హింసించడం, కట్నం కోసం వేధించడం లాంటివి కూడా వస్తుంటాయి. వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇలా 181 మందిపై గృహహింస కేసు నమోదుకు సూచించామని, 58 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్టేషన్కు వెళితే తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి శనివారం స్టేషన్లో సమస్యలకు కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. -
స్వచ్ఛనీటి సరఫరా ప్రభుత్వాల బాధ్యత
నగరి : ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు, ఆల్ ఇండియా బుద్దిస్టు సొసైటీ జాతీయ అధ్యక్షుడు భీమ్రావ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. తమిళనాడు తిరుత్తణిలో నిర్వహించిన జైభీమ్ మహానాడులో పాల్గొనడానికి వెళుతూ నగరి పట్టణంలోని దళిత సంఘాల ఆహ్వానం మేరకు శనివారం మధ్యాహ్నం బస్టాండ్ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. స్థానిక నేతలు ఆయన్ని ఘనంగా స్వాగతించారు. ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు విచ్చేస్తుంటానని తన ఆర్గనైజేషన్ బుద్దిస్టు సొసైటీ అక్కడ ఉందన్నారు. ఇటీవల రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, సమ్తా షైనింగ్ వెల్ అండ్ గుడ్డే సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లు కూడా ప్రారంభించామన్నారు. ఈ మూడు ఆర్గనైజేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పునాది వేసిందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ మూడు ఆర్గనైజేషన్లను స్థాపించడమే తన ధ్యేయమన్నారు. ఈ ఆర్గనైజేషన్లు వెనుకబడిన సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందన్నారు. ఎన్నో పార్టీలు వస్తున్నాయి అంబేడ్కర్ పేరును వాడుకుంటున్నాయని, ఆ పార్టీలకు మనం ఓటేస్తున్నామని, అయితే ఆ పార్టీ లు మన సామాజిక వర్గానికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎఫ్ జాతీయ అధ్యక్షులు తిరునావుక్కరసు, రాష్ట్ర అధ్యక్షులు గజేంద్ర, ఆర్పీఐ పార్థసారధి, బీఎస్పీ నేత ధనంజేయులు, ఉమాపతి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు బీడీ భాస్కర్, లాయర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సన్నిధి వినాయకస్వామి ఆలయంలో చోరీ
నగరి : పట్టణంలోని బేరివీధిలో ఉన్న సన్ని ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలి యని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. హుండీ తాళా లు పగులగొట్టి చోరీ చేయడంతోపాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. శనివారం ఉదయం యథావిధిగా పూజలు చేయడానికి అర్చకుడు ఆలయానికి వచ్చాడు. అక్కడ హుండీ, సీసీ కెమెరాలు పగులగొట్టి ఉండడం చూసి, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ విక్రమ్ ఆదేశాల మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆలయానికి సమీపంగా ఉన్న నివాసాల ముందు అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితుల ఆచూకీ ఆరా తీస్తామని సీఐ తెలిపారు. మహిళ అదృశ్యం గంగవరం: మండలంలోని కొత్తపల్లికి చెందిన సుబ్రమణ్యం రెడ్డి భార్య మునిరత్నమ్మ(61) నా లుగు రోజులుగా కనిపించకుండా పోయిందని ఆమె బంధువులు శనివారం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి వెళ్లిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. బస్సును ఢీకొన్న ఐచర్ వాహనం బంగారుపాళెం : మండలంలోని మహాసముద్రం టోల్ప్లాజా వద్ద శనివారం బస్సును ఐచర్ వాహనం ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. అమరరాజా ఫ్యాక్టరీకి చెందిన బస్సు కార్మికులను తీసుకు వెళ్లేందుకు టోల్ప్లాజా వద్ద ఆగింది. అదే సమయంలో పలమనేరు నుంచి చిత్తూరు వెళుతున్న ఐచర్ వాహనం బస్సును వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఐచర్ వాహన డ్రైవర్ సలీంకు బలమైన గాయం తగలడంతో హైవే అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరకట్నం కేసు నమోదు పుంగనూరు (చౌడేపల్లె): అధిక కట్నం తేవాలని వివాహితను చిత్రహింసలకు గురి చేసిన నలు గురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రుక్ష్మినందనాయుడు శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని నల్లగుట్లపల్లెకి చెందిన స్వప్నకుమారితో కేవీ పల్లె మండలం పెద్దతాండాకు చెందిన గోవిందనాయక్ కుమారుడు బాలాజీనాయక్తో గత రెండేళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొన్ని రోజులపాటు సజావుగా సాగి న ఈ కుటుంబంలో అధిక కట్నం చిచ్చురేపింది. నిత్యం అధికకట్నం రూ.5 లక్షలు తేవాలని వేధించిన భర్త బాలాజీనాయక్, మామ గోవిందనాయక్, శ్రీదేవి, నూర్పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
క్యాబేజీ అధరహో
● ప్రస్తుతం టన్ను ధర రూ.12 వేలకు పైగా ● తోటల వద్దే కొంటున్న బయటి రాష్ట్రాల వ్యాపారులు ● నెలకు ముందు టన్ను క్యాబేజీ ధర రూ.వెయ్యి మాత్రమే ● అడిగేవారు లేక తోటల్లోనే పంటను వదిలేసిన రైతులు పలమనేరు ప్రాంతంలో వ్యాపార పంటల్లో క్యాబేజీ ఒకటి. ఈ పంటకు మొన్నటి వరకు ధర లేక.. అడిగేవారు లేక..పంట పొలాల్లోనే వదిలేశారు. ఈ పంట సాగుపై ఆసక్తి చూపలేదు. టన్ను రూ.వెయ్యి కూడా పలకని క్యాబేజీ నేడు అమాంతం రూ.12 వేలు పలుకుతోంది. దీంతో పుడమిపుత్రుడు పొంగిపోతున్నాడు. పలమనేరు: మొన్నటి దాకా క్యాబేజీని కొనేవారు లేక పంట సాగు చేసిన రైతులు పొలంలోనే పంటను వదిలేశారు. కనీసం టన్ను రూ. వెయ్యికి ఇస్తామన్నా కొనేవారు లేకుండా పోయారు. అ లాంటి క్యాబేజీ ధర ఇప్పుడు టన్ను రూ.12 వేల కు పైమాటే. పలు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రైతుల తోటల వద్దకొచ్చి పంటను కొని తీసుకెళుతున్నారు. దీంతో ఇప్పుడు క్యాబేజీ సాగు చేసి న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు సాగుకు అనుకూలం పలమనేరు ప్రాంతం శీతల వాతారణాన్ని కలిగి ఉంటుంది. ఇదే వాతారణం పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలోనూ ఉంది. దీంతో అక్కడి రైతులు పండించే పలు కూరగాయల పంటలను ఇక్కడి రైతులు కొన్నేళ్లుగా సాగు చే స్తున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు ఉద్యానశాఖ డివిజన్ పరిధిలో 600 హెక్టార్లలో క్యాబేజీని సాగు చేశారు. మొన్నటి దాకా అడిగే దిక్కేలేదు గత కొన్ని నెలలుగా క్యాబేజీ ధరలు అమాంతం తగ్గాయి. గత నెలలో టన్ను కేవలం రూ.వెయ్యికి చేరింది. పంటను కొనేవారు లేక రైతులు పంటను కోయకుండా చేలల్లోనే వదిలిపెట్టేశారు. దీంతో రైతులకు పంట పెట్టుబడి సైతం దక్కక నష్టపోవాల్సి వచ్చింది. ధరలు పడిపోవడంతో చాలామంది రైతులు క్యాబేజీ నాటడానికి భయపడ్డారు. ధైర్యం చేసి పంట సాగు చేసిన రైతులకు ఇప్పుడు లాటరీ తగిలినట్లు అయ్యింది. నేడు తోటల వద్దే కొనుగోలు తోటల వద్దకే వ్యాపారులు వచ్చి క్యాబేజీ పంటను కొనుగోలు చేసి, అక్కడే గ్రేడింగ్ చేసి బయటి రాష్ట్రాలకు లారీల్లో తీసుకెళుతున్నారు. ముఖ్యంగా చత్తీస్ఘడ్, రాయపూర్, భువనేశ్వర్, కటక్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సరుకును తీసుకెళుతున్నారు. స్థానిక మార్కెట్లలోనూ క్యాబేజీకి మంచి డిమాండ్ నెలకొంది. ధైర్యం చేసి పంట సాగుచేశా మా ప్రాంతంలో క్యాబేజీ సాగు చేసి ధరల్లేక తోటల్లోనే వదిలేసిన వాటిని చూశా. కానీ చూద్దాం జూలైలో ధరలు వస్తాయనే ధైర్యంతో పంటను సాగు చేశా. ఒకటిన్నర ఎకరాలో పంటను ఒబ్బిడి చేశా. 30 టన్నుల దాకా ఉత్పత్తి వచ్చింది. ధరలు బాగుడడంతో సంతోషంగా ఉంది. – జగదీష్, రైతు, రామాపురం, పలమనేరు మండలం మంచి గిట్టుబాటు ధర నేను క్యాబేజీ పంటను నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా. గతంలో ఎప్పుడూ కిలో రూపాయికి పడిపోలేదు. కానీ ఈ దఫా సరుకు కొనేవారు లేకుండా పోయారు. దీంతో చాలామంది రైతులు క్యాబేజీని సాగు చేయలేదు. ఇప్పుడు టన్ను రూ.12 వేలు దాటింది. తోటలున్న రైతులకు మంచి గిట్టుబాటుగా మారింది. – హరి, రైతు, రామాపురం, పలమనేరు మండలం -
హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?
శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ డ్రైవర్ దారుణ హత్య ● రాజకీయ వ్యూహాలు చేరవేస్తున్నాడని గత నెలలో డ్రైవర్గా తొలగింపు ● వ్యక్తిగత రహస్యాలు బట్టబయలవుతాయని కడతేర్చిన వైనం ● జనసేన నుంచి వినుతను తప్పిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు ఏర్పేడు : చిన్న వయస్సులోనే పెద్ద పదవి వరించింది.. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తూ.. పబ్లిసిటీ స్టంట్తో నెట్టుకొచ్చిన కోట వినుత అసలు బండారం బట్టబయలైంది. అంతర్గత వ్యవహారాల సమాచారాన్ని శ్రీకాళహస్తిలోని ఓ కీలక నాయకుడికి చేరవేస్తున్నాడని భావించింది. తన వద్ద డ్రైవర్గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడు(22)ను కిరాతకంగా చంపించి చైన్నెలోని ఓ నదిలో పడవేసినట్టు చైన్నె పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు, మరో ముగ్గురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర స్థాయిలో విచారిస్తుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. సాధారణ యువతి నుంచి.. రేణిగుంటకు చెందిన నగరం వినుత తండ్రి నగరం భాస్కర్ స్థానికంగా మెడికల్ ల్యాబ్ను నిర్వహిస్తున్నాడు. నగరం వినుత తండ్రికి సహాయపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే తన కళాశాలలో పరిచయమైన చిత్తూరు జిల్లా, బంగారుపాళెంకు చెందిన కోట చంద్రశేఖర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరడం, ఆమెకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జిగా పదవి దక్కడం.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 5 వేల ఓట్లు పడడంతో డిపాజిట్ కోల్పోయింది. ఎలాగైన వార్తల్లో ఉండాలని నిత్యం అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చేది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆమైపె పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకంగా ఉండడం, ఆశించిన ఆదరణ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి వినుతను పట్టించుకోవడం మానేశారు. జనసేన నుంచి కోట వినుత బహిష్కరణ తిరుపతి అన్నమయ్య సర్కిల్ : శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుతను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తెలిపారు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు వినుత దూరంగా ఉన్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆ వివరాలు వెల్లడించారు. చైన్నెలో వినుతపై హత్యా నేర అభియోగం నమోదు కావడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వారు చెప్పారు. జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చైన్నె పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చైన్నె పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చైన్నెకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చైన్నె పోలీసులు వెల్లడించారు. -
వర్క్ఆర్డర్లను పదిరోజుల్లో పూర్తి చేయాలి
చిత్తూరు కార్పొరేషన్: పెండింగ్లో ఉన్న వర్క్ ఆర్డర్లను పదిరోజుల్లో పూర్తి చేయాలని ట్రాన్స్కో డైరెక్టర్ గురవయ్య ఆదేశించారు. శనివారం ఎస్ఈ కార్యాలయంలో చిత్తూరు అర్బన్ డివిజన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పూతలపట్టు, యాదమరి, ఐరాల రూరల్స్ ఏఈలు నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు డబ్బులు చెల్లించి ట్రాన్స్ఫార్మర్లు కోసం వేచి చూస్తున్నారన్నారు. వారికి సకాలంలో వ్యవసాయ సర్వీసులను విడుదల చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని చెప్పారు. వేగంగా మరమ్మతులు చేయడానికి చిత్తూరులో అందులోబాటులో ఉన్న నూతన ఓఆర్ఎంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్డివిజన్ పరంగా పరిశీలన పనులు డీఈలు ఇంటర్ చేంజ్ చేసుకోవాలన్నారు. సంబంధిత ప్రాంతాల్లో పర్యటించి లైన్ సమస్యలను పరిష్కారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వరమైన ఆర్డీఎస్ఎస్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతి సారీ సాకులు చెబుతూ పనులను ఆలస్యం చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈలు మునిచంద్ర, జగదీష్, అమర్బాబు, ఏఓ ప్రసన్న ఆంజనేయులు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
‘విత్తు’కోని ఆశలు
● వర్షాభావంతో అదును దాటుతున్న వైనం ● ఈ దఫా భారీగా తగ్గనున్న వేరుశనగ సాగు విస్తీర్ణం జిల్లా వేరుశనగ సాగు వివరాలు సాధరణ సాగు విస్తీర్ణం : 35,228 హెక్టార్లు ఖరీఫ్లో పంటను సాగు చేసే రైతులు : 90 వేల మంది దాకా అవసరమైన విత్తనకాయలు : 50 వేల క్వింటాళ్లు కూటమి ప్రభుత్వంలో అందినవి : 39 వేల క్వింటాళ్లు ఇప్పటిదాకా సాగైన వేరుశనగ విస్తీర్ణం : 300 హెక్టార్లు పలమనేరు: వేరుశనగ రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. సాధారణంగా జూలై తొలి వారానికల్లా ఇక్కడ వేరుశనగ విత్తనాలేసే పనులు పూర్తికావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటిదాకా వరుణుడు కరుణించకపోవడంతో చేలల్లో విత్తనాలు పడలేదు. ఎక్కడో వెతికినా దొరకనట్టు ఓ శాతం మాత్రం వేసిన విత్తనాలు మొలకెత్తినా అవీ వర్షం లేక మాడిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ దఫా జిల్లాలో వేరుశనగ సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఆశలే వదేలుకోవాల్సిందేనా? పదేళ్ల క్రితం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.2 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాధారణ సాగుగా ఉండేది. ఏటా పంటసాగు తగ్గుతూ వస్తోంది. జిల్లా విభజన జరిగాక పంట సాధారణ సాగు 55 వేల హెక్టార్లకు పడిపోయింది. ప్రస్తుతం సాధారణ సాగు 35 వేల హెక్టార్లకు దిగజారిపోయింది. ఈ దఫా సకాలంలో వానలు పడుంటే పంట సాగు 20వేల హెక్టార్లు దాకా ఉండొచ్చునని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ సీజన్ ముగుస్తున్నా వరుణుడు కరుణించ లేదు. ఈ దఫా వేరుశనగ పంటపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనన్న మాటలు వినిపిస్తున్నాయి. సాగుచేసినా నష్టాలు తప్పవా? గత కొన్నేళ్లుగా వేరుశనగను రైతులు సాగుచేయడం తగ్గించారు. ఇందుకు ప్రధాన కారణం పంటకు పెట్టిన పెట్టుబడి సైతం దక్కడం లేదు. సకాలంలో వర్షాలు రాకపోవడం, లేదా ఎక్కువగా వర్షాలు పడి పంటకు నష్టం జరుగుతుండడంతో రైతులు వేరుశనగ సాగుపై ఆశలు వదులుకుంటున్నారు. పంట దిగుబడులు సైతం ఎకరానికి నాలుగైదు బస్తాలు కూడా కావడం లేదు. ఎకరా పొలంలో పంట సాగుకు రూ.15వేల దాకా అయితే దిగుబడి 5వేలు కూడా రావడం లేదు. దీంతో రైతులు వేరుశనగ పంటపై ఆసక్తిని చూపడం లేదని తెలుస్తోంది. బస్తా (30కేజీలకు) రూ.1116 సబ్సిడీగా వస్తుందని చాలామంది రైతులు విత్తనాలను తీసుకున్నారు. కానీ వర్షాలు లేక సీజన్ ముగుస్తుండడంతో వీటిని అమ్ముకోవడం .. లేదా ఇళ్లకు వాడుకోవడం చేసుకోవాల్సిందే. విత్తనాలే ఇవ్వలేదు విత్తనాలేసేందుకు వానలేదు. సరే కనీసం విత్తనాలను సైతం ఇవ్వలేదు. మాకు కొంగోళ్లపల్లి, మామొడుగు గ్రామాల్లో ఆరెకరాల భూములున్నాయి. రెండుచోట్ల రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలడిగినా లేవని చెప్పారు. వచ్చిన విత్తనాలను ఎవరు తీసుకున్నారో దేవుడికే తెలియాలి. – నాగరాజరెడ్డి, రైతు, కొంగోళ్లపల్లి, గంగవరం మండలం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం మరో వారం రోజుల దాకా విత్తనాలేసేందుకు సీజన్ ఉంది. అప్పటిదాకా వర్షం పడకుంటే ఆపై ఏమీచేయను కాదు. అందుకే ప్రత్యామ్నాయంగా వేరుశనగ పొలాల్లో ఉలవ సాగుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. పలమనేరు డివిజన్కు మాత్రమే 80 వేల క్వింటాళ్ల ఉలవ విత్తనాలకు ఇండెంట్ చేశాం. జిల్లాలో ఎక్కడా వర్షాలు లేవు. వేరుశనగ సాగు భారీగా తగ్గే అవకాశం ఉంది. – గీతాకుమారి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, పలమనేరు ఈ దఫా సీజన్ పోయినట్టే! సాధారణంగా వేరుశనగ విత్తనాలకు జూన్ 15 నుంచి జూలై తొలివారంలోగా చేలల్లో వేయాలి. ఈ సీజన్లో వేస్తేనే పంట దిగుబడి వస్తుంది. ఇప్పటిదాకా వర్షాలు పడలేదు. దీంతో 90 శాతంపైగా చేలు బీళ్లుగానే ఉన్నాయి. పది శాతం మంది రైతులు వేసవి దక్కులు చేసుకున్నా విత్తనాలేసేందుకు అవకాశం లేకుండా పోయింది. సిద్ధం చేసుకున్న విత్తనాలు వర్షం కోసం ఎదరుచూస్తున్నాయి. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అనుబంధ విభాగాల్లో పలువురిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. సోషల్ మీడియా ● జిల్లా ఉపాధ్యక్షులుగా ఈ.అనిల్కుమార్రెడ్డి(తిరుపతి), ఎ.భానుప్రకాష్(చిత్తూరు), ప్రధాన కార్యదర్శులుగా ది.షణ్ముగంరాయల్(తిరుపతి), ఈశ్వర్రెడ్డి(పుంగనూరు), ప్రదీప్రెడ్డి(చిత్తూరు), యోగానందరెడ్డి(చంద్రగిరి), శోభన్కుమార్(సత్యవేడు), కార్తీక్రెడ్డి(జీడీనెల్లూరు), ఎన్.మురుగేష్(తిరుపతి), కార్యదర్శులుగా జి.రమేష్(కుప్పం), అరుణ్కుమార్(చిత్తూరు), మహేష్రెడ్డి(పుంగనూరు), హరిప్రసాద్(తిరుపతి), ఈశ్వర్(పలమనేరు), మదన్(జీడీనెల్లూరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు. యువజన విభాగం ● జిల్లా ఉపాధ్యక్షులుగా సుబ్రమణ్యంనాయుడు (పలమనేరు), రూపేష్రెడ్డి(చిత్తూరు), ప్రభురాజ్(నగరి), ఆఫ్రిడ్ మాలిక్(పుంగనూరు), ప్రధాన కార్యదర్శులుగా దిలీప్యాదవ్(శ్రీకాళహస్తి), మోహన్వంశీ(తిరుపతి), పి.శివ(పుంగనూరు), నవీన్కుమార్రెడ్డి(జీడీనెల్లూరు), శశింద్ర(తిరుపతి), మనోహర్రెడ్డి(చంద్రగిరి), మునివెంకటలోకేష్(తిరుపతి), షేక్బావాజీ(పుంగనూరు), వంశీకృష్ణ(పూతలపట్టు), కార్యదర్శులుగా శేషాద్రిరెడ్డి(జీడీనెల్లూరు), రమేష్(సత్యవేడు), రెడ్డిప్రసాద్(పలమనేరు), ధనుంజయరెడ్డి(చంద్రగిరి), సుధీర్(తిరుపతి), హేమంత్కుమార్రెడ్డి(కుప్పం), ఈసీ మెంబర్లుగా 16 మందని నియమించారు. విద్యార్థి విభాగం ● జిల్లా ఉపాధ్యక్షులుగా శశిదీప్(చిత్తూరు), సోమశేఖర్(కుప్పం), ప్రధాన కార్యదర్శులుగా మహేష్చౌదరి(చిత్తూరు), మహేష్(జీడీనెల్లూరు), మధుసూదన్రెడ్డి(తిరుపతి), భానుప్రకాష్రెడ్డి(చంద్రగిరి), వీరమణి(కుప్పం), కార్యదర్శులుగా అజిత్కుమార్(చిత్తూరు), అశ్విత్(పలమనేరు), వేణురెడ్డి(జీడీనెల్లూరు), ప్రదీప్కుమార్(తిరుపతి), పృధ్వీరెడ్డి, సుధీర్రెడ్డి, దినేష్, నరేష్బాబు(చంద్రగిరి), ఈసీ మెంబర్లుగా 11 మందిని నియమించారు. వాణిజ్య విభాగం ● జిల్లా ఉపాధ్యక్షులుగా రూపేష్కుమార్రెడ్డి(తిరుపతి), ప్రసాద్(చంద్రగిరి), ప్రధాన కార్యదర్శులుగా రాధికరెడ్డి(జీడీనెల్లూరు), విజయరెడ్డి(తిరుపతి), రవి(కుప్పం), రమేష్(తిరుపతి), కార్యదర్శులుగా పెద్దన్న (కుప్పం), రోహిత్బుచ్చిరెడ్డి(చిత్తూరు), సుబ్రమణ్యంరెడ్డి(జీడీనెల్లూరు), అమర్నాథ్రెడ్డి(పలమనేరు), చలపతి, మంజూరు, కిషోర్(పుంగనూరు), జీవరత్నం (తిరుపతి), ఈసీ మెంబర్లుగా 19 మందిని నియమించారు. వైఎస్సార్టీయూసీ ● జిల్లా ఉపాధ్యక్షులుగా తిరుమలరెడ్డి(తిరుపతి), షేక్ ఫిరోజ్అహ్మద్(పూతలపట్టు), ప్రధాన కార్యదర్శులుగా వెంకటేష్(జీడీనెల్లూరు), ఎం.బాబు(నగరి), శ్రీమంతుల రామయ్య(తిరుపతి), సుబ్రమణ్యంరెడ్డి(చంద్రగిరి), వేణుగోపాల్(కుప్పం), కోటేశ్వరరావు(చంద్రగిరి), కార్యదర్శులుగా శ్రీనివాసులు(పలమనేరు), రఘు(పూతలపట్టు), మునికృష్ణరెడ్డి(జీడీనెల్లూరు), మాంగండన్(నగరి), వెంకటముని(చిన్ని)(తిరుపతి), జి.కోటేశ్వరరావు(సత్యవేడు), సురేష్(శ్రీకాళహస్తి), ఈసీ మెంబర్లుగా 16 మందిని నియమించారు. వలంటీర్ల విభాగం ● జిల్లా ప్రధాన కార్యదర్శులుగా జయచంద్ర(తిరుపతి), అబ్దులజైలా(జీడీనెల్లూరు),బోస్రెడ్డ్డి(చంద్రగిరి),శివలింగం(కుప్పం),బాలసుబ్రమణ్యం(సత్యవేడు), కార్యదర్శులుగా పి.వరదరాజన్, పురుషోత్తం(తిరుపతి), రాము (జీడీనెల్లూరు), మనోహర్(శ్రీకాళహస్తి), ప్రభాకర్రెడ్డి(పలమనేరు), ఈసీ మెంబర్లుగా 18 మందిని నియమించారు. చేనేత విభాగం ● జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏలుమలై(తిరుపతి), ప్రధాన కార్యదర్శులుగా రవిరెడ్డి(జీడీనెల్లూరు), పి.చంద్రశేఖర్(తిరుపతి), సుధాకర్, మునిరాజా(శ్రీకాళహస్తి), విజయ్భాస్కర్(సత్యవేడు), కార్యదర్శులుగా రమేష్రెడ్డి(పలమనేరు), తిరుమల(జీడీనెల్లూరు), కన్నాయిరం(నగరి), వెంకటేష్(కుప్పం), అమరలింగయ్య(సత్యవేడు), నలుగురిని ఈసీ మెంబర్లుగా నియమించారు. -
ఐషర్ను ఢీకొన్న బైక్
చంద్రగిరి : ఎదురుగా టమాట లోడుతో వస్తున్న ఐషర్ లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన ఘటన తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి పీటీసీ సమీపంలోని ఘాట్ రోడ్డు మలుపు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భాకరాపేటకు చెందిన మహబూబ్ బాషా(58) మండల పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో పీటీసీ సమీపంలోని పెద్ద మలుపు వద్ద వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న టమాట లోడుతో వస్తున్న ఐషర్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో బైక్తో పాటు ఐషర్ వాహనం అదుపుతప్పి కల్వర్టు పక్కన ఉన్న భారీ లోతు ప్రాంతంలో బోల్తా పడడంతో టమాటా బాక్స్లు , బైక్ మహబూబ్ బాషాపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐషర్ వాహనంలోని డ్రైవరుతో పాటు క్లీనర్ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘రూసా’ పనులు వేగవంతం చేయాలి
తిరుపతి సిటీ : రుసా ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్న పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రుసా) పథకం కింద జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని అంచనా వేయడానికి ఎస్వీయూలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం వర్సిటీ వీసీ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్రావు హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్సిటీలో మౌలిక సదుపాయాలు, విద్యా, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా వీసీ అప్పారావు వర్సిటీలో రూసా పథకం కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. అనంతరం రూసా కోర్డినేటర్ ప్రొఫెసర్ రమశ్రీ వర్సిటీలో జరిగే పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్లు, రుసా సీఈఓ, ఆర్థిక, అభివృద్ధి విభాగాల కీలక అధికారులు పాల్గొన్నారు. -
వేదం.. విజయనాదం
● దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ చలువతో వేదిక్ వర్సిటీ ● నేడు వేదిక్ వర్సిటీ 20వ వ్యవస్థాపక దినోత్సవం తిరుపతి సిటీ : వేద విద్యను విస్తృతం చేసి వేదాల సారాంశాన్ని, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో వేద విద్యకు ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచించారు. ఇందులో భాగంగా 2006లో టీటీడీ ఆధ్వర్యంలో వేద పండితులు, పీఠాధిపతులు సలహాలతో అలిపిరి జూపార్క్ రోడ్డు సమీపంలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 19 విభాగాలలో.. వర్సిటీ ఏర్పాటు చేసిన తొలి ఏడాది నుంచి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేద విద్యను అభ్యసించేందుకు వందల సంఖ్యలో విద్యార్థులు వేదిక్ వర్సిటీలో అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం సుమారు 19 విభాగాలలో వర్సిటీ వేద విద్యను అందిస్తోంది. వేద విభాగంలో రుగ్వేద, కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం, ఆగమ శాస్త్ర విభాగాలలో వైఖానస, పంచరత్ర, శైవాగమం, పౌరోహిత్యం విభాగాలలో ఆశ్వాలయన, అపస్తంభ, పరస్కర, వేద భాష్యంలోని 5 విభాగాలలో, కల్ప, మీమాంస విభాగాలలో 15 చొప్పున అడ్మిషన్లు చేపట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సులలో ప్రతి ఏడాది ఒక్కో విభాగంలో ప్రత్యేక నిపుణులైన వేద పండితులతో శిక్షణ ఇస్తున్నారు. సంస్కృత పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు ఏడు విభాగాలలో సర్టిఫికెట్ కోర్సులను సైతం వర్సిటీలో అందుబాటులో ఉంచారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా అడుగులు వేదిక్ వర్సిటీలో విద్యనభ్యసించి పీజీ, యూజీ, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు వంద శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. దేశ, విదేశాలలోని పలు ఆలయాలలో పండితులు, పూజారులుగా, సలహాదారులుగా వందల మంది వర్సిటీ విద్యార్థులు ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. టీటీడీ విద్యాసంస్థలలో అధ్యాపకులుగా, ఆలయాలలో పండితులుగా రాణిస్తున్నారు. అలాగే అయోధ్యలోని రామాలయంలో సైతం వేదిక్ వర్సిటీ విద్యార్థులు ఉన్నత స్థానాలలో పనిచేస్తుండటం వర్సిటీకి గర్వకారణంగా చెప్పవచ్చు. నేడు వర్సిటీ 20వ వ్యవస్థాపక వేడుకలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి 20 ఏళ్లు నిండిన సందర్భంగా శనివారం వర్సిటీలోని సంధ్యావందన శాలలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. వీసీ రాణి సదాశివమూర్తి అధ్యక్షతన రిజిస్ట్రార్ భాస్కరుడు పర్యవేక్షణలో నిర్వహించనున్న వ్యవస్థాపక దినోత్సవానికి టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు హాజరుకానున్నారు. -
నిందితుడికి మూడేళ్ల జైలు
చిత్తూరు అర్బన్: బాలికల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం స్థానిక జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి శంకరరావు తీర్పునిచ్చారు. ప్రత్యేక పీపీ మోహనకుమారి కథనం మేరకు వివరాలిలా.. మదనపల్లెకు చెందిన చంద్రశేఖర్(52) చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో మదనపల్లె బాలికోన్నత పాఠశాల వద్దకెళ్లి.. పిల్లల పట్ల అసభ్యకరంగా వ్యవహరించేవాడు. దీనిపై 2017లో పాఠశాల హెచ్ఎం పద్మజ మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చంద్రశేఖర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి మూడేళ్లు జైలు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఎన్ఐఏబీతో వెటర్నరీ వర్సిటీ ఒప్పందం తిరుపతి సిటీ : హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ (ఎన్ఐఏబీ)తో ఎస్వీ వెటర్నరీ వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం వర్సిటీలో జరిగిన ఒప్పందంపై వీసీ ప్రొఫెసర్ రమణ, ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారు శర్మ సంతకాలు చేసి ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. జంతు సంరక్షణ, ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్ఐఏబీ సంస్థతో వర్సిటీ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ప్రధానంగా నాణ్యమైన విద్య, నూతన పరిశోధనలు, విద్యా మార్పిడి వంటి విషయాలపై సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడమే ఎంఓయూ లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, డీన్, అధికారులు పాల్గొన్నారు.నేటి నుంచి గ్రాప్లింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి బైరాగిపట్టెడలోని గిరిజన భవన్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గ్రాప్లింగ్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు. రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అండర్–11, 13, 15, 17 కేటగిరిలో బాల బాలికలకు నిర్వహించనున్న ఈ పోటీలను శనివారం ప్రారంభించనున్నారు. ఆ మేరకు రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏజి.రేఖారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, ఆయా విభాగాల్లో గెలుపొందిన బాల బాలికలు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు చత్తీస్ఘడ్ రాష్ట్రం, బిలాస్పూర్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని పేర్కొన్నారు. తిరుమలకు వెళ్లి వచ్చేసరికే ఇల్లు గుల్ల 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చిల్లకూరు : తిరుమలలో జరిగే గరుడ సేవకు కుటుంబ సభ్యులు వెళ్లి వచ్చేసరికే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి దూరి 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన నల్లయగారిపాళెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని నల్లాయగారిపాళెం గ్రామానికి చెందిన మస్తానయ్య గురువారం తిరుమలకు వెళ్లారు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసిన పక్కనే ఉన్న బంధువులు గమనించి తిరుమలలోని మస్తానయ్యకు దొంగతనం జరిగినట్లు సమాచారం అందించారు. దీంతో ఆయన ఫోన్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ కిశోర్బాబు, ఎస్ఐ సురేష్బాబుతో పాటు క్లూస్ టీం చేరుకుని వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రేట్లు పెంచాలి
చిత్తూరు కలెక్టరేట్ : మధ్యాహ్న భోజన పథకం రేట్లు పెంచాలని వైఎస్సార్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి కేంద్రం రూ.5.45 చొప్పున మధ్యాహ్న భోజన ధరలను నిర్ణయించిందన్నారు. అయితే ఆ నగదుకు అధనంగా రాష్ట్ర ప్రభుత్వం కుకింగ్ కాస్ట్ గా రూ.0.43ను మంజూరు చేస్తూ మొత్తం రూ.5.88గా నిర్ణయించినట్టు తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కేంద్రం రూ.8.17 నిర్ణయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అధనంగా రూ.40 పైసలు మొత్తం రూ.8.57 గా నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో రూ.6.19, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.9.26 చొప్పున కేంద్రం పెంచిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కేంద్రం పెంచిన ఉత్తర్వులను అమలు చేయకుండా మీనామేషాలు లెక్కిస్తోందన్నారు. పెరిగిన కుకింగ్ కాస్ట్ను అమలు చేయకుండా పాతరేట్లు అమలు చేయడం తగదన్నారు. వెంటనే కొత్త ఎండీఎం రేట్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భోజనం తయారీ కార్మికులకు కనీస వేతనంగా రూ.5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు విశ్వంలో ఉచిత అవగాహన సదస్సు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం విద్యాసంస్థలో ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి అవగాహన సదస్సును ఉచితంగా నిర్వహించనున్నారు. ఆ మేరకు విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు 4 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. 14న కేంద్ర బృందం రాక చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో టీబీ ముక్తభారత్ అభియాన్ కార్యక్రమ అమలుపై సోమవారం కేంద్ర బృందం అధికారి భవాన్సింగ్ పర్యటించనున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. ఉదయం 9గంటలకు ఆయన జిల్లాకు చేరుకోనున్నారన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో టీబీ ముక్తభారత్ కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. అలాగే టీబీ సెంటర్లను పరిశీలించనున్నట్టు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 63,473 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
మేమూ రైతులమే
మా కష్టాలు మాకు తెలుసు. మా కష్టాలు ఎవరికో ఒకరికి చెప్పుకుంటే తప్ప తీరదు. అలాంటప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలి. రైతులను ఆదుకోవాలి. మా కష్టసుఖాలను వినాలి. అలా ఎవరు వచ్చినా కష్టాలను చెప్పుకోవడానికి రైతులు ముందు పడతాం. వస్తే అందుకు ఈ రకంగా చేస్తారా..? దారుణమండి. ఇలా చేయడం కరెక్టు కాదు. పోలీసులు మారాలి. కక్షపూరితమైన రాజకీయాలు వద్దు. మనుషులని చూడండి. రైతు కష్టాలను అన్ని శాఖల అధికారులకంటే.. పోలీసులే దగ్గరుండి చూశారు. మీలో కూడా రైతు కుటుంబాలు ఉన్నాయి..కదా. టోకన్ల కోసం ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు కదా.. మళ్లెందుకు ఇలా చేశారు. – పెద్దిరెడ్డి, రైతు, వేపంజేరి -
జగన్ పర్యటనలో రైతులపై ఎందుకీ ఆంక్షలు
● పోలీసుల అణచివేతతోనే భారీగా జనం ● రక్షకభటులే ఇంత కఠినంగా వ్యవహరిస్తే ఎలా? ● ఖాకీల తీరును తప్పుబడుతున్న రైతన్నలు పలమనేరు/కాణిపాకం: ప్రజలను రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ బుధవారం బంగారుపాళెంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఎందుకు వారిపై ఇంత కఠినంగా వ్యవహరించారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారుపాళెంలోకి ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు ఎందుకిలా అడ్డుకున్నారనే మాట రైతుల్లో అయోమయాన్ని కల్గిస్తోంది. ఏ మార్గంలోనూ జనం వెళ్లకుండా ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. ఎటుచూసినా కర్ఫూ వాతావరణాన్ని సృష్టించారు. కనీసం నడిచి వెళుతున్న వారితోనూ దురుసుగా మాట్లాడారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోలు బంకుల్లో పెట్రోలు పట్టనీయకుండా చేశారు. జగన్ పర్యనటలో భాగంగా కొన్ని చోట్ల గుమిగూడిన రైతులపై లాఠీతో విరుచుకుపడ్డారు. బంగారుపాళెం మార్కెట్లోని మామిడి రైతులను బయటకు పంపేశారు. వ్యాపారులు లేకుండా చేశారు. అసలు జనాన్ని చూస్తేనే పోలీసులు కోపంతో ఊగిపోయారు. మొత్తం మీద పోలీసులు చేసిన అణచివేత చర్యల కారణంగానే రైతులు వేలాదిగా ఈ కార్యక్రమానికి వచ్చేలా చేసిందనే మాట జనంలో వినిపిస్తోంది. పోలీసులు ఇన్ని రకాలుగా ఆంక్షలు పెట్టి ఉండకపోతే కార్యక్రమం ప్రశాంతంగానే జరిగిపోయేదని అంటున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కొందరి రైతుల మాటల్లోనే.. -
ఆదరణ చూసి ఓర్వలేక
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఇచ్చిన హామీల విషయంలో మాట దాట వేసింది. రైతులకు చేసేందేమీ లేదు. వేరుశనగ పంట పూర్తిగా నేటమట్టమైంది. మామిడి రైతులు మద్దతు ధర లేక రోడ్డుపై అల్లాడుతున్నాము. అయితే ఈ రోదనను వినేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పర్యటనను అడ్డుకోవడం సరికాదు. కూటమి ప్రభుత్వం ఆయన ఆదరణ చూసి ఓర్వలేకపోతోంది. అందుకే ఈ రకంగా రైతులను, జనాన్ని రాకుండా తొక్కిపడేస్తోంది. వాళ్లు ఎంత తొక్కితే అంతా పైకి లేస్తాం. – రవీంద్రనాథ్, రైతు నాయకులు -
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చంద్రశేఖర్
చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన న్యాయవాది ఎం.చంద్రశేఖర్ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. చిత్తూరులోని మొదటి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానానికి ఈయన మూడేళ్ల పాటు ఏపీపీగా కొనసాగనున్నారు. ఇందుకోసం నెలకు రూ.40 వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేషనల్ అవార్డ్స్కు దరఖాస్తుల ఆహ్వానం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు నేషనల్ అవార్డ్స్కు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2025 కు సంబంధించి జాతీయ పురస్కారాలు (నేషనల్ అవార్డ్స్)కు అర్హత, ఆసక్తి ఉన్న టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 13వ తేదీలోపు www.nationa lawardstoteacher.education.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలన్నారు. అనంతరం హార్డ్ కాపీని డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు. ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ సెల్ఫ్ నామినేటెడ్ ది టీచర్ చివరి తేదీ ఈనెల 15 అని ఆమె వెల్లడించారు. జిల్లా ఓటర్లు 15,71,402 చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై ఒకటవ తేదీ నాటికి 15,71,402 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మృతి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓటర్ల జాబితా సిద్ధం చేసి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఓటర్ల జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10,615 మందికి ఓటర్ ఎపిక్ కార్డులను పంపుతున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్వో మోహన్కుమార్, పలు పార్టీల ప్రతినిధులు ఉదయ్కుమార్, సురేంద్రకుమార్, అట్లూరి శ్రీనివాసులు, వాడ గంగరాజు పాల్గొన్నారు. మంజూరైన పనులు చేయకపోతే రద్దు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా జెడ్పీ, 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం క్షేత్రస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో జెడ్పీ, 15 వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. పనుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు. జిల్లాలోని 31 మండలాల్లో చేపడుతున్న తాగునీరు, మురుగునీటి కాలువలు, సిమెంట్ రోడ్లు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో లోపం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంజూరై పనులు ప్రారంభం కాకపోతే రద్దు చేస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నెలకు ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
కేసులతో భయపెడతారా?
రైతులతో ఆటలొద్దు. మేము రోడ్డు మీదకు వస్తే మళ్లీ మా మూళ్లగా ఉండదు. రైతు పండించే పంటకు గిట్టుబా టు ధర కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది చేయలేకపోతే..ఇలా ప్రతిపక్షాలు రోడ్డుపైకి వస్తాయి. ఇదీ ఆయన సొంత కార్యక్రమం కాదు కదా. మామిడి రైతులు పడుతున్న కష్టాలను చూసి సమస్యలను వినేందుకు వచ్చారు. అందులో తప్పేంముంది. అడ్డకుంలు సృష్టించడంతో పాటు గొంతు కూడా నొక్కేస్తున్నారు. కేసుల పేరుతో భయపెట్టడం న్యాయం కాదు. – ఉమాచంద్ర, రైతు నాయకులు -
విత్తుకోని ఆశలు
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025‘పోలీసులు తన, మన తేడా లేకుండా వ్యవహరించాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు పెద్ద పీట వేయాలి. నేరాల నియంత్రణకు కట్టుబడి పనిచేయాలి. పౌరుల హక్కులకు భంగం వాటిల్లకుండా సేవ చేయాలి..’ కానీ కూటమి ప్రభుత్వంలో ఖాకీలు ఇలాంటివి పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రోద్బలంతో కక్ష సాధింపులకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ విధులు మరచి ప్రవర్తిస్తున్నారనే ఆపవాదులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఘటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటనలో ఎదురైందని ప్రజలు, రైతులు గళం విప్పుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇంత కఠినంగా వ్యవహరించడంపై పెదవి విరుస్తున్నారు. పోలీసన్నా.. ఇదేందన్నా అంటూ నిట్టూర్పులు వెళ్లగక్కుతున్నారు. – 8లోన్యూస్రీల్ -
ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే
ఎన్ని అడ్డంకులు ఉన్నా వాటి ని అధిగమించి మా కష్టాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్తో పంచుకోవాలని పర్యటనకు వెళ్లాం. కనీసం ద్విచక్ర వాహనం కూడా వదల్లేదు. ఎ క్కడికక్కడ కట్టడి చేసి విఘాతం కలిగించారు. ఆయనకు వస్తున్న ప్రజాధరణను ఓర్వలేక కూటమి ప్రభు త్వం ఈ రకంగా హింసించింది. రైతులను అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. వాళ్లు ఏం చేసి నా జనబలాన్ని ఆపలేకపోయారు. ఇలా చేస్తే ప్రజా లే భవిష్యత్లో తీర్పునిస్తారు. ఏ అధికారమైనా జనబలం ముందు తలవంచాల్సిందే..అనడానికి ఇదీ ఒక నిదర్శనం. – వెంకటేష్, రైతు, జీడీనెల్లూరు -
దేవదాయ భూములను పరిరక్షించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా దేవదాయ భూములను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఆర్వో మోహన్కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో దేవదాయ భూముల పరిరక్షణ పై జిల్లా స్థాయి భూ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 17,540 ఎకరాల దేవలయ భూములున్నాయన్నారు. ఈ భూములన్నింటినీ సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నట్లైతే వెంటనే గుర్తించి తొలగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,343.17 ఎకరాల దేవదాయ భూములు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఏవైనా కోర్టు కేసుల్లో ఉన్నట్లైతే స్టే వెకేషన్కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 9,761 ఎకరాలకుగాను 4,866 ఎకరాల భూములు 1 బీ అడంగళ్లో దేవదాయ పేర్లుగా నమోదు చేశారన్నారు. 5,500 ఎకరాలకు 1 బీలో పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకా 2,200 ఎకరాల భూములను వెంటనే 1 బీ అడంగల్లో నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దేవదాయ భూములను తక్కువ ధరకు వేలంలో లీజుకు ఇస్తున్నారని తమ దృష్టికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. వివాదాస్పద భూములన్నింటినీ సర్వే చేయించాలని సూచించారు. జాయింట్ సర్వే పెండింగ్లో ఉన్న భూములను ఆయా శాఖల సమన్వయంతో 30 రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా దేవదాయ శాఖ కమిషనర్ చిట్టెమ్మ పాల్గొన్నారు. -
వేదం..విజయనాదం
తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీ 20వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ●కర్షకులపై కర్కశమా? కూటమి ప్రభుత్వం రైతులను కట్టడి చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకట్టలు వేసింది. పోలీసులతో నిలువరించింది. తెల్లచొక్కా, రైతు కండువ కనిపిస్తే చాలు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తమ సమస్యను మాజీ ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని వెళితే తప్పా..? సమస్యలు చెప్పుకుందామని నడుచుకుని వచ్చాం. అడ్డదారులో చేరాం. రాళ్లురప్పలను లెక్క చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి చెంత మామిడి కష్టాలను కన్నీళ్లతో వెలిబుచ్చాం. కర్షకులపై ఇంత కర్కశం పనికిరాదు. – వెంకటరెడ్డి, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు శత్రువులా చూశారు జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండి. ఆయనొస్తే..వీళ్లకెందుకు నొప్పి. కూటమి ప్రభుత్వం ప్రజాధరణతోనే గెలిచింది కదా. అలాంటప్పుడు జగన్మోహన్రెడ్డి వచ్చి వెళితే మీకేంటి?.. దానికి ఇంత రాద్ధాంతం చేయలా..?. ఇంతటి దౌర్జన్యం చేసినా రైతులు గుండెనిండా అభిమానంతో జగన్మోహన్రెడ్డిని కలవాలని వచ్చారు. ఆ అభిమానాన్ని ఎవరూ ఆపలేరు. పోలీసులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతులను శత్రువులను చూసినట్లు చూశారు. – పద్మనాభరెడ్డి, రైతు నాయకులు – 8లో -
వైద్యంపై నకిలీ పెత్తనం
డాక్టర్లు...డమ్మీ? అనుమతులు లేని క్లినిక్ల విషయాన్ని పక్కన పెడితే.. డాక్టర్లు కూడా నకిలీలు తయారయ్యారు. దర్జాగా డాక్టర్లగా కొనసాగుతున్నారు. ఇష్టామొచ్చినట్లు చికిత్సలు చేస్తూ..అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొంతమంది డమ్మీ డాక్టర్లు ఏకంగా ప్రసవాలు, చిన్నపిల్లల వైద్య చికిత్సలు, దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు తదితర వాటికి చికిత్సలు చేస్తుండడంతోపాటు ఏకంగా సర్జరీలు చేస్తూ.. రూ.లక్షలు కాజేస్తున్నారు. రెగ్యులర్గా కొంత మందికి సలహాలు ఇస్తూ.. ఎంబీబీఎస్ డాక్టర్లుగా నమ్మిస్తున్నారు. వీరంతా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పుట్టుకొస్తున్నారు.జ్వరం.. దగ్గు.. ఆయాసం.. గుండెపోటు.. వ్యాధి ఏదైనా నయం కావాలంటే నాణ్యమైన వైద్యం అందాలి. అయితే నకిలీల వైద్యం రోగి బతుకులో విషం చిమ్ముతోంది. రోగిని అప్పులు పాలు చేయడమే కాకుండా అతడి ప్రాణాలను హరిస్తోంది. జిల్లాలో ఈ నకిలీల బెడదతో పలువురు నష్టపోయారు. అయినా ఏమాత్రం జంకు లేకుండా నకిలీ క్లినిక్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వైద్యంపై నకిలీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. చిత్తూరురూరల్ (కాణిపాకం): జిల్లా నకిలీ వైద్యు లు, అక్రమార్కులకు చిరునామాగా మారింది. జిల్లాలో గతంలో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ కరెన్సీ వెలుగుచూడగా, ఇటీవల కాలంలో నకిలీ వైద్యులు పట్టుబడుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. తాజాగా రెండురోజులకు కిందట ఓ డాక్టర్ నకిలీ కార్డియాలజిస్ట్ అన్న విషయం వెలుగుచూసింది. దీనికితోడు జిల్లాలో నకిలీ దందా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో 900 క్లినిక్లు, 250 ఆస్పత్రులు, 20 పాలీక్లినిక్లు, 2వేల వరకు ఆర్ఎంపీ క్లినిక్లు ఉన్నాయి. ఇవన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అనుమతులతో నడుస్తున్నాయి. అయితే అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లు జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఒకదానికి కూడా రిజిస్ట్రేషన్ లేదు. ఇష్టానుసారంగా వైద్య కార్యకలపాలు నిర్వర్తిస్తున్నారు. చిత్తూరు పొన్నియమ్మ గుడివీధి, సుందరయ్యవీధి, చర్చివీధి, కొంగారెడ్డిపల్లి, పలమనేరు రోడ్డు. వన్డిపో రోడ్డు, మిట్టూరు, మురకంబట్టు, ప్రశాంత్నగర్, యాదమరి, పలమనేరు, కుప్పం, ఎస్ఆర్ పురం, నగరి తదితర ప్రాంతాల్లో ఈ నకిలీ క్లినిక్లు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. నకిలీ డాక్టర్లకు రూ.లక్షల్లో ఫీజులు జిల్లాలో కార్డియాలజిస్ట్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. గుండె జబ్బు వస్తే తిరుపతి, తమిళనాడులోని వేలూరు, రాణిపేట, చైన్నె, కర్ణాటకలోని బెంగళూరును ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో నకిలీ డాక్టర్లు డిమాండ్ ఉన్న విభాగానికి డాక్టర్గా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ప్రత్యక్షమవుతున్నారు. ప్రైవేటు క్లినిక్లను నడిపిస్తూ రూ.లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే ఫీజుతో పాటు సకల వసతులు ఉండేలా చూసుకుంటున్నారు. వైద్యశాఖ అనుమతులు తప్పనిసరి ఎవరైనా వైద్యులు తమ వైద్యవృత్తిని నిర్వహించుకోవాలంటే ముందుగా డీఎంహెచ్ఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యకోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్లను సమర్పించాలి. వైద్యాధికారులు సదరు సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాతే ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతులు జారీ చేస్తారు. అలాగే ఇండియన్న్ మెడికల్ అసోసియేషన్ మెంబర్షిప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు చేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల జీవితాలతో నకిలీ వైద్యులు చెలగాటం ఆడుతుంటే.. ప్రభుత్వ వైద్యాధికారులు ఏం చేస్తున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయనాయకులు, అధికారుల పలుకుబడితో వైద్యవృత్తికి సంబంధం లేని వ్యక్తులు జిల్లా కేంద్రంలో ఆస్పత్రులను నిర్వహిస్తుండడం గమనార్హం. తక్కువ మొత్తంలో జీతాలకు నామమాత్రంగా వైద్యులను తీసుకువచ్చి ఆస్పత్రులను నడుపుతున్నారు. ఎలాంటి అర్హత లేని వారు వైద్యవృత్తిని కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో క్లినిక్ల పేరుతో నకిలీ దందా చిత్తూరులో కలకలం సృష్టిస్తున్న నకిలీ డాక్టర్ల వ్యవహారం అనుమతులు లేకుండా క్లినిక్ల నిర్వహణ ఇష్టారాజ్యంగా వైద్యం.. పెయిన్స్ కిల్లర్స్ వారి ఆయుధం తమిళనాడు, కర్ణాటక కేంద్రంగా జిల్లాలోకి నకిలీ వైద్యులు ఇదిగో సాక్ష్యం.. చిత్తూరు నగరంలోని భరత్నగర్లో కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి తన ఇంట్లోనే లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జిల్లాలో సంచలనం రేపింది. ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి స్కానింగ్ చేసి, అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయం కలెక్టర్ చెవిలో పడడంతో ఆయన నిఘా పెట్టి పట్టుకున్నారు. కేసు నమోదు చేయించారు. పట్టుబడిన వారిలో చిత్తూరు వాసులతో పాటు తమిళనాడు వాసులున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం మేరకు చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తిది గుంటూరు జిల్లా. ఇతడు కొన్నేళ్లుగా కార్డియాలజిస్ట్గా నమ్మిస్తున్నాడు. బాధితులు మాయగాడి అవతారాన్ని బహిర్గతం చేయడంతో నకిలీ వ్యవహరం బయటకు వచ్చింది. ఏడేళ్లకు క్రితం ఓ మీడియా కూడా కార్డియాలజిస్ట్ నకిలీ వ్యవహరాన్ని బయటపెట్టింది. కొన్నాళ్లు తలదాచుకున్న ఈ వ్యక్తి బెంగళూరు నుంచి చిత్తూరు నగరానికి వచ్చాడు. ఇక్కడ డాక్టర్గా నమ్మించాడు. తీరా గుట్టు బయటకు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడికి సర్టిఫికెట్ ఎలా వచ్చింది. మెడికల్ కౌన్సిల్లో ఎలా పేరు నమోదైందనే విషయంపై పలువురు వైద్య నిపుణులు అవాక్కవుతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లో రూ.2 స్టాంప్లా ఉంటుందని, ఆ స్టాంప్ నకిలీ డాక్టర్ ఇచ్చుకున్న సర్టిఫికెట్లో లేదని, ఇది దొంగ పత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ డాక్టర్లుగా రుజువైతే కేసులుంటాయి. అలాంటివి జిల్లాలో ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బులు కోసం నకిలీ డాక్టర్లుగా అవతారమెత్తి..ప్రజల ఆరోగ్యాన్ని హరించకండి. ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులను సంప్రందించాలి. లేకుంటే గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలి. నకిలీ డాక్టర్లను నమ్మొద్దు. – సుధారాణి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు -
రైతులను దండుపాళెం బ్యాచ్గా చిత్రీకరణపై ఆగ్రహం
● విలువలు పాటించకుండా కర్షకులపై వ్యతిరేక కథనాలు ● కూటమి సర్కార్కు తొత్తుగా మారిన పచ్చమీడియా ● మండిపడుతున్న అన్నదాతలు రైతులను అవమానించడం దారుణం బంగారుపాళెం సమావేశానికి వెళ్లిన వారు రైతు లు కాదు.. దండుపాళెం బ్యాచ్ అంటూ ఓ పత్రిక లో వార్త చూశా. ఓ రైతు గా మనసులో చాలా బాధేసింది. పదిమందికి అన్నం పెట్టే రైతులంటే అందరికీ చులకన అయినట్టుంది. అన్నీ తెలిసి, బాగా చదువుకున్న వారే ఇలాంటి రాతలు రాయడం మంచిది కాదు. ఆ స్థానంలో మామిడి రైతే కాదు ఏ రైతున్నా ఒక్కటే కదా? ఎవరిపైనో కోపాన్ని రైతులపై చూపడం భావ్యం కాదు. – గోవిందురెడ్డి, రైతు, బేరుపల్లి -
ప్రచార ఆర్భాటం.. మెగా పీటీఎం
జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన మెగా పీటీఎం 2.0 సమావేశాలు కూటమి ప్రభుత్వం ప్రచారం కోసమే నిర్వహించినట్లు ఉందని విద్యావేత్తలు పెదవి విరిచారు. విద్యార్థులు పురోగతి, పాఠశాలల్లో నెలకొన్న సమస్యల నిమిత్తం నిర్వహించాల్సిన మెగా పీటీఎం సమావేశం ఉద్ధేశాన్నే మార్చేశారన్నారు. విద్యావ్యవస్థలో కూటమి పార్టీ ప్రచారం కోసం మెగా పీటీఎం సమావేశాలను పావుగా వాడుకున్నారన్న విమర్శ వచ్చింది. సమావేశాలకు తల్లిదండ్రులు గైర్హాజరు కావడంతో ఏదో నిర్వహించామంటే...నిర్వహించామనే ధోరణిలో మెగా పీటీఎం సమావేశాలు జరిపి, చేతులు దులుపుకున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 2,984 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమి కనిపించని పరిస్థితి నెలకొంది. మెగా పీటీఎం సమావేశం ఉద్దేశాన్ని పూర్తిగా నీరుగార్చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జిల్లాలో విద్యాభివృద్ధికి చేసిందేమి లేదు. అభివృద్ధి దిశగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలను పౌండేషన్ పాఠశాలల పేరుతో కిలోమీటర్ దూరంలో స్కూళ్లలో విలీనం చేసి విద్యార్థులకు నష్టం చేకూర్చారు. గత వైఎస్సార్సీపీ సర్కారు వేల కోట్లు ఖర్చు చేసి అమలు చేస్తున్న నాడు–నేడు పనులను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులను ఏ మార్చేందుకు పబ్లిసిటీ స్టంట్ కోసం మెగా పీటీఎంలను నిర్వహించారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆటల పోటీలు తప్ప..సాగని చర్చలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం సమావేశాలు మొదలు పెట్టినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆటల పోటీలు, డ్యాన్సులు చేయించారు. విద్యార్థులు విద్యలో ఎలా రాణిస్తున్నారు? ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు? వారి అభ్యున్నతికి చేపట్టే చర్యలేమిటి? పాఠశాల అభివృద్ధికి చేయాల్సిన పనులేమిటి? ఇలా పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉంటుంది. అయితే ఈ దిశగా చర్చలేమి మెగా పీటీఎం సమావేశాల్లో జరగని పరిస్థితి కనిపించింది. ఈ సమావేశాలకు కూటమి ఎమ్మెల్యేలు హాజరై గొప్పలు చేసేశామనే ధోరణిలో ప్రసంగాలు చేసి వెళ్లి పోయారు. దాదాపు 90 శాతం పైగా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చాలా వరకు పాఠశాలల్లో విద్యార్థుల పురోగతిని తెలిపే హోలిస్టిక్ ప్రోగ్రాస్ కార్డులను సైతం ఇవ్వని పరిస్థితి నెలకొంది. అధికంగా గైర్హాజరు జిల్లాలోని 2,984 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో 20 శాతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎం జాడే కనిపించని పరిస్థితులు నెలకున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం సమావేశాలకు 2,60,641 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి 2,894 మంది తల్లిదండ్రులు మాత్రం హాజరైనట్లు విద్యాశాఖ నివేదికలు పేర్కొన్నాయి. వీటిని చూస్తే అర్థం చేసుకోవచ్చు ఈ సమావేశాల నిర్వహణ తీరు ఎలా సాగిందన్న విషయం. కాగా కూటమి ప్రభుత్వంలో రెండో విడత ఈ సమావేశాలు నిర్వహించారు. గతంలో మొదటి సారి నిర్వహించిన ఈ సమావేశాల్లో చర్చించిన సమస్యలేవి పరిష్కారం కాలేదని తల్లిదండ్రులు పెదవి విరిచారు. ఈ సమావేశాల వల్ల ఒరిగిందేమి లేదని తల్లిదండ్రులు విమర్శలు గుప్పించారు. ప్రైవేట్, కార్పొరేట్లో ఇష్టానుసారం జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎం 2.0 సమావేశాలను ఇష్టానుసారంగా నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం వరకు కొన్ని పాఠశాలల్లో.. మరికొన్ని పాఠశాలల్లో 11.30 గంటలకే ముగించేశారు. అలాగే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలను భేఖాతర్ చేశారు. జిల్లాలోని నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లో మెగా పీటీఎం అని కాకుండా పేర్లు మార్చి సమావేశాలు నిర్వహించి మమ అనిపించేశారు. కూటమి ప్రచారం తప్ప ఒరిగిందేమి లేదు సమావేశంలో చర్చకు రాని విద్యార్థుల పురోగతి అధికంగా గైర్హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేరు మార్చి సమావేశాలు జిల్లాలో మెగా పీటీఎం 2.0 నిర్వహణ సమాచారం జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలలు : 2,984 సమావేశాలకు రిజిస్టర్ చేసుకోని పాఠశాలలు : 6 హాజరైన తల్లులు : 1,731 హాజరైన తండ్రులు : 1,112 హాజరైన సంరక్షకులు : 51 మొత్తం విద్యార్థులు : 2,60,641 హాజరైన విద్యార్థులు : 2,07,621 గైర్హాజరైన విద్యార్థులు : 53,020కొన్ని ఉదాహరణలు ఇలా.. చిత్తూరు సంతపేటలోని పీఎన్సీ మున్సిపల్ పాఠశాలలో మొత్తం 409 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కొందరు తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయ హామీ ఏమైంది సార్ అని ప్రశ్నించారు. ఇందుకు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి అంటూనే చివర్లో చిన్న సమస్యతో పెండింగ్ పడింది. త్వరలోనే కేంద్రీయ విద్యాలయ హామీ నెరవేరుతుందన్నారు. 409 మంది తల్లిదండ్రులు హాజరుకావాల్సి ఉండగా 150 మంది విద్యార్థులు మాత్రం సమావేశానికి హాజరయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం ఊటూరు ప్రాథమిక పాఠశాలలో నలుగురే విద్యార్థులున్నారు. ఆ నలుగురు విద్యార్థుల తల్లిదండ్రులు అర్ధగంట పాటు ఉండి వెళ్లిపోయారు. నగరి నియోజకవర్గంలోని నగరి మండలం ఎం.కొత్తూరు జెడ్పీ హైస్కూల్లో 226 మంది విద్యార్థులుంటే 36 మంది తల్లిదండ్రులు మాత్రమే హాజరయ్యారు. నగరి నియోజకవర్గంలోని చింతలపట్టెడ వినాయకపురం జెడ్పీ హైస్కూల్లో 175 మంది విద్యార్థులకుగాను ఐదుగురు తల్లులు మాత్రమే మెగా పీటీఎం సమావేశానికి హాజరయ్యారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నెలకొంది. -
మధ్యవర్తిత్వంపై ముగిసిన శిక్షణ
తిరుపతి లీగల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 48 మంది న్యాయవాదులు, సంఘ సేవకులకు మధ్యవర్తిత్వం, ఇతర అంశాలపై గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ, మధ్యవర్తిత్వ కేంద్రం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఈ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి భారతి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ అనూజ సక్సేన, మధ్యప్రదేశ్కు చెందిన న్యాయవాది, సంఘ సేవకురాలు నీనా కరే మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి భారతి ఇద్దరు న్యాయవాదులను సన్మానించారు. జగన్ పర్యటన సక్సెస్చిత్తూరు కార్పొరేషన్: పోలీసులను అడ్డం పె ట్టుకుని ప్రభుత్వం ఎ న్ని అడ్డంకులు సృష్టించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప ర్యటన విజయవంతమైందని వైఎస్సార్ సీపీ రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ రైతు విభాగం చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గుడిపాల మండల అధ్యక్షుడు ప్రకాష్, జెడ్పీటీసీ సభ్యుడు బాబునాయుడు, ఎఫ్ఎఫ్ఏ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, సర్పంచ్ మధుసూదన్రాయల్ మాట్లాడారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే వారికి మద్దతుగా జగనన్న బంగారుపాళెం పర్యటనకు వచ్చారన్నారు. జగనన్న పర్యటన కార్యక్రమాన్ని ప్రకటించిన తరువాత ప్రభుత్వానికి రైతులపై హఠాత్తుగా ప్రేమ వచ్చిదంన్నారు. ఆకస్మాతుగా వారితో అధికారులు సమావేశాలు పెట్టి హడావుడి చేశారన్నారు. జగనన్న పర్యటనకు 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతులు ఇచ్చామన్నారు. కానీ ఎందుకు 2 వేల మందికి పైగా పోలీసులు పెట్టి అడుగడు గున అడ్డంకులు సృష్టించారని ప్రశ్నించారు. ఎంత ప్రయత్నం చేసి అధినేతపై రైతులకు ఉండే ఆదరణ, అభిమానాన్ని అపలేకపోయారన్నారు. కొండలు, గు ట్టలు దాటుకుని మార్కెట్యార్డుకు వేలాది మంది వచ్చారన్నారు. పర్యటనను ఫ్లాప్ చేయాలని పోలీసులు దౌర్జన్యంగా లాఠీచార్జీ చేసి, రైతులను కొట్టారన్నారు. రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా? వేలాది మంది రైతులు రావడం చూసి ఓర్వలేని ఆంధ్రజ్యోతి పత్రికలో రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను దండుపాళ్యం బ్యాచ్తో పోలుస్తూ వార్తలు రాయ డం సరికాదన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు వేలాది టోకెన్లు అక్రమంగా తీ సుకున్నారన్నారు. వారు చెప్పిన వారికి మాత్రమే ఫ్యాక్టరీల్లో త్వరగా పంటను దింపుకున్నరన్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రూ.16 ఇస్తున్నారని చెప్పారు. విజనరీ సీఎంగా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కిలో మామిడి రూ.8 కూడా ఎందుకు కోనుగోలు చేయలేకపోతున్నరని ప్రశ్నించారు. రైతులంటే ప్రేమ లేదు చంద్రబాబుకు రైతులంటే ఎప్పుడు ప్రేమ లేదని గ్రీనరి బ్యూటిఫికేషన్ రాష్ట మాజీ డైరెక్టర్ గుణశేఖర్రెడ్డి, సర్పంచ్ అమరనాథ్రెడ్డి, ఏకాంబరం, నాయకులు రవీంద్రరెడ్డి విమర్శించారు. 1996లో బషీర్బాగ్లో రైతులు ధర్నా చేస్తుంటే వారిపై కాల్పులు జరిపిన ఘనత బాబుదన్నారు. తర్వాత వారి కుటుంబాలకు సైతం పరిహారం ఇవ్వలేదన్నారు. మంత్రి అచ్చెనాయుడు చిత్తూరుకు వచ్చి పల్ప్ ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం నిర్వహించిన తరువాత వారి పరిస్థితి ఇంకా దారుణంగా మారిందన్నారు. -
తానా కార్యదర్శిగా సునీల్ పాంట్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) కార్యదర్శిగా జిల్లాకు చెందిన సునీల్ పాంట్ర ఎన్నికయ్యారు. తానా సంఘంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పలు పదవులు అనుభవించారు. ఈ నేపథ్యంలో తానా కార్యదర్శిగా ఎంపికయ్యారు. కాగా ఆయన మన రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. ఘనంగా సత్యనారాయణ వ్రతం కాణిపాకం: గురుపౌర్ణమి సందర్భంగా కాణిపాకంలో సత్యనారాయణస్వామి వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీభూదేవి సమేత శ్రీవరదరాజులస్వామి ఆలయంలో గురువారం పౌర్ణమి పూజలు చేశారు. ఈ సందర్భంగా మూలవిరాట్కు విశేషాలంకరణ చేసి, అర్చన జరిపారు. అనంతరం సత్యనారాయణ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్ని వ్రతం ఆచరించి, తరించారు. -
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ రొంపిచెర్ల: విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండా లని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు. గురువారం రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ డ్రగ్స్ వాడకంతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయన్నారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రుల నిఘా ఉంచాలన్నారు. ప్రతి రోజూ కొంత సేపు పిల్లలతో కలసి ఉండాలన్నారు. పిల్లలు ఏమి చేస్తున్నారో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారా? లేదా అని అడిగి తెలుసుకోవాలన్నారు. అలాగే పాఠశాలలకు పిల్లలు సక్రమంగా వెళ్లుతున్నారా? లేదా అని పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వం నెలకు ఒక విద్యార్థిపై రూ.5 వేలు ఖర్చు చేస్తుందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పిల్ల లు విద్యార్థి దశలో సోషల్ మీడియా, సెల్ఫోన్లకు బానిసలవుతూ ఆట పాటలకు దూరం అవుతున్నా రని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలపై రుద్దడంతో వారు విజయాలు సాధించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. చదువుకోవడంలో పిల్లలకు తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. అలాగే పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలన్నారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ మార్కు లు సాధించిన రిషిత, భరత్ కుమార్, వీణావాణికి షైనింగ్ అవార్డులు, సాధియా, రీద, గీతాశ్రీకి ఎన్ఎంఎంఎస్ అవార్డులను ప్రదానం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ అమరనాఽథ్, ఎంఈఓ శ్రీనివాసులు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రెడ్డి ప్రదీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
శాంతిపురం: తెలుగుదేశం పార్టీ నాయకులు మోసం చేశారంటూ ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్లగట్ట పంచాయతీలోని తంబిగానిపల్లికి చెందిన ఎం.ఎల్లప్ప గురువారం కుప్పంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఆయనకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. తనకు మంచి పదవి ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు తమ పంచాయతీలోని టీడీపీ నాయకులు పార్టీలోకి చేర్చుకున్నారని ఎల్లప్ప చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం తిప్పుకోవడంతోపాటు భారీగా ఖర్చులు పెట్టించారని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా తనకు పదవి ఇవ్వలేదన్నారు. పదవి ఇవ్వాలని, పక్కా ఇల్లు ఇవ్వాలని పదే పదే అడిగితే తనను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరానికి తనను వాడుకుని మోసం చేశారని అర్థం కావడంతో తాను ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా పాలన సాగించి, మాట తప్పని నేతగా నిలిచిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కర్లగట్ట ఎంపీటీసీ సభ్యుడు చలం, నాయకులు శ్రీనివాసులు, వెంరటముని తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల అనంతరం టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం
సదుం: రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వి జయం ఖాయమని, తరువాత టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి తెలిపారు. సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో వైఎస్సార్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డితో కలసి గురు వారం బాబు షూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరకాలంగా చంద్రబాబు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గాలికొదిలేసి, ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ కోసం కష్టపడుతున్నవారిని వేధించడమే పని గా పెట్టుకున్నారన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకనే నిస్సిగ్గుగా అమలు చేస్తున్నట్లు ప్రకటించడం ఆయనకే చెల్లిందన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనలేదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కడం చంద్రబాబు నైజమన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మామిడి కిలో రూ. 2 పలకడం తన జీవింతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక రాష్ట్రం కిలో రూ.16 మద్దతు ధరతో కేంద్ర ప్రభుత్వం లక్షలాది టన్నులు కొనుగోలు చేస్తుంటే, ఢిల్లీకి మంత్రిని పంపి, కిలోకు రూ.4 ధరతో రూ. 260 కోట్లు చాలని కోరడం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. హామీల పేరుతో మోసం జగన్ అమలు చేసిన సంక్షేమం కంటే మరింత ఎక్కువ చేస్తానని ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు కరుణాకరరెడ్డి తెలిపారు. కూటమి పాలనలో అరాచకాలే మిగిలాయన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను జైళ్లకు పంపుతున్నారని, 680 మంది సోషియల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. ప్రభుత్వం 2 వేల మంది పోలీసులు ఎంత ఇబ్బందులు పెట్టినా బంగారుపాళెంలో మామిడి రైతులు నిర్వహించింది కవాతు అని చెప్పారు. బంగారుపాళెం పర్యటన చూసి జిల్లాలో వైఎస్సార్సీపీ సత్తా ఏమిటో వారికి తెలిసివచ్చిందన్నారు. పార్టీ కార్యక్రమాలు చూసి వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కొన్ని పచ్చ పత్రికలు ఏ రోజూ నిజం రాయవని, వైఎస్సార్సీపీపై నిందలు లేకుండా ఒక వార్తా రాయలేరని అన్నారు. బంగారుపాళెం పర్యటనను దండుపాళెం బ్యాచ్గా వర్ణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు దండుపాళెం బ్యాచ్ అయితే టీడీపీ నాయకులు వారికి వేదపండితులు, మునులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. అనంతరం క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, పోకల అశోక్ కుమార్, ఫకృద్ధిన్, చెంగారెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఆగని గజదాడులు
పులిచర్ల మండంలో గజదాడులు ఆగడం లేదు. రోజుకో చోట పంటలపై దాడులు చేసి, ధ్వంసం చేస్తున్నాయి.●అది మంచి పద్ధతి కాదు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలో దండుపాళ్యెం బ్యాచ్ దాడులంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు రాయడాన్ని తప్పుపడుతున్నాం. పత్రికలంటే ఎంతో గౌరవం ఉంది. ఒక వేళ రాజకీయంగా మీకు అనుకూలంగా ఉన్న నాయకుడిపై మంచి కథనాలు రాసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే రైతులకు వ్యతిరేకంగా దండుపాళ్యెం బ్యాచ్ అంటూ కథనం ఇవ్వడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. – సుబ్రమణ్యం, రైతు, జంగాలపల్లి, వెంకటగిరి రూరల్ మండలం మంచి చెడులతో సంబంధం లేదు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలకు మంచి చెడులతో సంబంధం లేదు. రైతులు, పేదోడు అనే భావన లేదు. ఒకటే మార్గం చంద్రబాబు ఏమీ చేసినా అదే కరెక్ట్గా భావిస్తున్నారు. ఆయనపై ఒక కథనం చెడుగా ఇప్పటి వరకు ఆ పత్రికల్లో రాలేదు. అంటే సీఎం చంద్రబాబు వందశాతం మంచే చేస్తున్నారా? ప్రతి పక్షనేతపై ఒక్క మంచి కథనం ఇప్పటివరకు ఇవ్వలేదు. చివరికి దండుపాళ్యెం బ్యాచ్ అంటూ రైతులకు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడం ఎంత వరకు న్యాయమో తెలియడం లేదు. – గుర్రం నాగిరెడ్డి, రైతు, ఆర్సీ పురం దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఎంటీ ? రైతులను ఎల్లో మీడియా దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఏమిటో తెలియడం లేదు. ఎంతో దారుణంగా కథనాలు రాస్తున్నా రు. చంద్రబాబును బతికించడానికే ఆ పత్రికలు పనిచేస్తున్నాయి. మామిడి రైతులు కష్టాల్లో ఉంటే వారిని పరామర్శించడానికి వచ్చిన వారిపై విషాన్ని చిమ్మడం ఎందుకో అర్ధం కావడం లేదు. పత్రిక విలువలు పూర్తిగా దిగజార్చి కథనాలు రాస్తున్నా యి. రైతులకు వ్యతిరేకంగా వార్తలు రాయడం మరింత దారుణంగా భావిస్తున్నాం. – తిరుమల రెడ్డి, రైతు, కారూరు, సూళ్లూరుపేట నియోజకవర్గం – 8లో -
ఆరోగ్య వివరాలు సేకరించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చిన్నారుల ఆరోగ్య వివరాలను పకడ్బందీగా సేకరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సూపర్వైజర్ 150 మంది పిల్లల బరువు వివరాలను సేకరించి రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. కచ్చితమైన కొలతలు నిర్వహించాలన్నారు. గత వివరాలతో సరిపోల్చి పురోగతిని అంచనా వేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పప్పు, పాల సరఫరాలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలన్నారు. చిన్నారుల్లో ఆధార్ సమస్యలున్నట్లైతే సరిచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆధార్ సమస్యలు ఎక్కువగా ఉన్న మండలాలను గుర్తించి, నివేదికలు అందజేయాలన్నారు. సూపర్వైజర్ నిత్యం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలన్నారు. కుప్పంలో ఆరోగ్య, పోషణ స్క్రీనింగ్ నాణ్యతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆగ్రహం బంగారుపాళెం: ‘టీడీపీ ఉడత బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడే ప్రసక్తేలేదు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి తమ కష్టాలను చెప్పకునేందుకు వచ్చిన రైతులపై కూటమి సర్కారు పోలీసులతో లాఠీచార్జి చేయించడం దారుణం.’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ అన్నారు. గురువారం ఆయన బంగారుపాళెంలో జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎంకు రైతులు కష్టాలు చెప్పుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో రైతులను దండుపాళెం బ్యాచ్తో పోల్చడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులతో అనుచితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. మీడియా ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యలను ప్రస్తావించాల్సింది పోయి ప్రభుత్వానికి కొమ్ముకాస్తోందన్నారు. జగన్మోహన్రెడ్డి పర్యటనకు జనం కరువయ్యారంటూ మొదటి పేజీలో ఫొటో పెట్టారన్నారు. 13వ పేజీలో 10 వేల మంది జనం వచ్చారని రాసుకోచ్చారన్నారు. మరి 10 వేల మంది జనం ఫొటోను ఎందుకు పెట్టలేకపోయారని మండిపడ్డారు. జగన్ పర్యటనకు రానీయకుండా బంగారుపాళేనికి 30 కిలోమీటర్ల అవతల నుంచి ఆంక్షలు విధించి, బారికేడ్లు పెట్టి, బెదిరించి రానీయకుండా చూశారన్నారు. అవేవీ లెక్క చేయకుండా రైతులు, అభిమానులు బంగారుపాళేనికి తరలిరాచ్చారన్నారు. స్థానిక ఎమ్మెల్యేకి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి కాదన్నారు. జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే, తానూ ఎమ్మెల్యేనే అంటూ సవాల్ చేయడం మంచిపద్ధతి కాదన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎమ్మెల్యే జూస్ ఫ్యాక్టరీ యజమానుల వద్ద కమీషన్లు తీసుకుని రైతులకు అన్యాయం చేసి, వారి కడుపుకొట్టారని ఆరోపించారు. మామిడికి గిట్టుబాటు ధర రాక మామిడి చెట్లను నరికి వేస్తున్నారని, అ విషయం ప్రభుత్వం కళ్లకు కనిపించలేదా? అని మండిపడ్డారు. జగన్ పర్యటలో మద్యం, బిరియాని పంపిణీ చేశామని ప్రచారం చేస్తున్నారన్నారు. వారికి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. దీనిపై సత్యప్రమాణం చేయగలరా? అని సవాలు విసిరారు. నాయకులకు నోటీసులు అందించి, కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రైతులు ఆవేదన చెంది మామిడి కాయలను రోడ్డుపై పడేెస్తే దానిపైనా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులు, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామన్నారు. మండల పార్టీ కన్వీనర్ రామచంద్రారెడ్డి, కుమార్రాజా, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షడు పాలాక్షిరెడ్డి, మాజీ సర్పంచులు ప్రకాష్రెడ్డి, కృష్ణమూర్తి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కిషోర్రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు గజేంద్ర, నాయకులు పరదేశి, మహేంద్ర, రఘుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. -
బంగారు విభూది పట్టి విరాళం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారికి గురువారం యూఎస్ఏకు చెందిన చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రూ.14 లక్షలు విలువ చేసే 140 గ్రామల బంగారు విభూది పట్టిని స్వామివారికి విరాళంగా ఇచ్చారు. దాతలు ఈ పట్టిని ఈఓ పెంచల కిషోర్కు అందజేశారు. అనంతరం వారికి ఆలయాధికారు లు ఆలయ మర్యాదలు చేసి, స్వామివారి దర్శనం కల్పించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి యాదమరి: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జా యింట్ కలెక్టర్ విధ్యాదరి అన్నారు. గురువారం ఆమె కోనాపల్లిలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తమ వంతు తోడ్పాటు అందించాలన్నా రు. ఎంఈఓ రుక్మిణి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిత చేకూరుతుందన్నారు. పిల్లలు సెల్ఫోన్ల తో కాలక్షేపం చేయకుండా చదువుపై దృష్టి సా రించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. అలాగే కొట్టాలం ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు యూసఫ్ తల్లిదండ్రులతో పాఠశాల అభివృద్ధి, బోధన, ఇతర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ పార్థసారథి, ఎంఈఓ–2 ప్రసాద్, ఉపాధ్యాయులు వెంకటరమణ పాల్గొన్నారు. -
పోలీసుల ఓవర్యాక్షన్!
పలమనేరు: పోలీసులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటనలో ఎక్కడాలేని ఆంక్షలు పెట్టి ఓవర్యాక్షన్ చేశారు. పలమనేరు వైపు నుంచి ద్విచక్ర వాహనాలను సైతం పంపకుండా పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద అడ్డుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వాహనాన్ని ఆపారు. ఆపై మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దురుసుగా మాట్లాడడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆపై అక్కడున్న వారిని పోలీసులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటకు పంపారు.పోలీసుల జులుంపలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు బంగారుపాళెం ఫ్లైవర్ నుంచి కాలినడకన వెళ్తుండగా అక్కడున్న పోలీసులు జనంపై లాఠీలతో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు సర్దిచెబుతున్నా లెక్కచేయలేదు. ఒకానొక సందర్భంలో పోలీసులపై ప్రజలు తిరగబడాల్సి వచ్చింది. ఎటూ చూసి నా జనాన్ని చూసిన పోలీసులు శత్రువులును చూసినట్టుగా అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. పోలీసుల కవ్వింపుల కారణంగానే ప్రజలు మరింత ఆగ్రహానికి గురయ్యారు.బైక్ల తాళాలు లాక్కునీ..రోడ్డుపై బైకులో వస్తున్న వందలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. తాము స్థానికులమని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. వారి బైక్ కీలను లాక్కొన్నారు. దీంతో జనం ఆగ్రహానికి గురయ్యారు. వైఎస్ జగన్ పర్యటక ముగిశాక సైతం మార్కెట్ నుంచి జనం బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లను వేసేశారు. దీంతో భయపడిన జనం గోడలు, గేట్లు దూకి బయటకు వెళ్లాల్సి వచ్చింది.సీఎం.. డౌన్డౌన్కాణిపాకం: బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్ గేటు ఎదుట బుధవారం ఉదయం 10.30గంటల ప్రాంతంలో రైతులు, జగనన్న అభిమానులు రెండో గేటు ఎదుట ఆగ్రమానికి గురయ్యారు. లోపాలికి పంపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పట్టించుకోని పోలీసులతో విసిగిపోయిన వారు సీఎం డౌన్..సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు మిన్నంటించారు. ఆపై ఒక్కసారిగా వారంతా మొదటి గేటులో నుంచి మార్కెట్ లోపలకి దూసుకొచ్చారు. కొందరు మార్కెట్ ప్రహారీ గోడను ఎక్కి లోపలికి తరలివచ్చారు.చిన్నారి పులకింతకాణిపాకం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు, స్థానికులతో పాటు వృద్ధులు, చిన్నారులు కూడా వైఎస్ జగన్ను చూసేందుకు తరలివచ్చారు. అందులో భాగంగా ఓ (చిత్తూరుకు చెందిన హోమ శైలుషా 7వ తరగతి) చిన్నారి తన భామతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు రోడ్డుపై వేచి ఉంది. వీరిని గమనించిన జగన్మోహన్రెడ్డి తన కాన్వాయ్ని ఆపి వారిని దగ్గరకు పిలిచారు. ఆప్యాయంగా పలకరించారు. దీంతో వారిద్దరూ ఆనందంలో మునిగితేలారు. -
బంగారుపాళెంలో జన సునామీ
● కూటమి కుయుక్తులు.. ఆంక్షల కంచె పటాపంచలు ● అభిమాన నేతను చూసి మురిసిపోయిన అక్కచెల్లెమ్మలు ● మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చిత్తూరు అర్బన్/ కాణిపాకం/ పలమనేరు/ బంగారుపాళెం: ఒకే ఒక వ్యక్తిని అడ్డుకోవడానికి వందలాది మంది ఖాకీలు. కానీ వేలాది మంది అభిమానం ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. చివరకు ఏ సంబంధం లేని సామాన్యులను సైతం అడ్డుకున్నారు. అడగుడగునా ఆంక్షల చట్రం విధించినా ఏ మాత్రం అవి పనిచేయ లేదు. మామిడి రైతులను పరామర్శించడానికి బుధవారం బంగారుపాళెంకు వచ్చిన మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన దిగ్విజయంగా ముగిసింది. రెడ్జోన్గా బంగారుపాళెం వాహనాల్లో బంగారుపాళెంకు వెళుతున్న పలువురు నాయకులను మహాసముద్రం టోల్గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలందర్నీ అదుపులోకి తీసుకుని చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. అసలు ఏ బస్సు కూడా బంగారుపాళెం లోపలకు వెళ్లకూడదని, జాతీయ రహదారి మీదుగా కూడా వెళ్లకూడదని హుకూం జారీ చేశారు. బంగారుపాళెం బస్సు టికెట్లే ఇవ్వలేదు. పలమనేరు టికెట్టు కొనుక్కున్న ప్రయాణికులు హైవేల వైపు దిగి కిలో మీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మహాసముద్రం టోల్ గేటు వద్ద బస్సుల్లోకి ఎక్కిన పోలీసులు ఎవరైనా బంగారుపాళెంకు వెళుతున్నారా..? అని అడుగుతూ.. వెళుతున్నామంటే ప్రయాణికులను సైతం అదుపులోకి తీసుకున్నారు. టోల్ గేటు వద్ద దించేశారు. పలుచోట్ల లాఠీ చార్జ్ వైఎస్.జగన్ను చూడడానికి పలుచోట్ల ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడ్డారు. వీళ్లను తరమివేయడానికి పోలీసులు గట్టిగానే ప్రయత్నించారు. చాలా చోట్ల ప్రజలు పోలీసుల మాటల్ని లెక్కచేయకపోవడంతో లాఠీలతో చావ బాదారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సామాన్యులు సైతం గాయపడ్డారు. మరికొన్ని చోట్ల ప్రజల్ని నెట్టేయడంతో తోపులాటకు కింద పడిపోయారు. నాయకులపై జులుం వైఎస్సార్సీపీ నాయకులపై చాలా చోట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు డా.సునీల్, వెంకటేగౌడ, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి తమ కార్యకర్తలతో హెలిప్యాడ్ వద్దకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. తాను మాజీ ఎంపీ అని రెడ్డెప్ప చెబుతున్నా పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు సునీల్కుమార్, వెంకటగౌడ్, బియ్యపు మధుసూదన్రెడ్డి, నియోజవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, భూమన అభినయరెడ్డి, కృపాలక్ష్మి, ఉమ్మడి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంగారుపాళెంలో జగన్ జాతర మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటన జన జాతరను తలపించింది. బంగారుపాళెం చుట్టూ పోలీసులు విధించిన ఆంక్షలు పటాపంచలయ్యాయి. పోలీసుల అడ్డగింతలు, నోటీసులతో జనం ఉలిక్కిపడ్డారని అధికార పక్షం, అధికారులు అనుకున్నారు. మార్కెట్ ప్రాంగంణం, రోడ్డు మార్గంలో జనం పలుచగా ఉన్నారని తెగ సంబరపడ్డారు. ఆ తర్వాత ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. వీరి రాకతో మార్కెట్ ప్రాంతమంతా నిండిపోయింది. కర్ణాటక సరిహద్దు నుంచి ఆంక్షలు బంగారుపాళెంకు జనం వెళ్లకుండా పోలీసులు కర్ణాటక సరిహద్దుల్లోని గంగవరం మండలం, కుప్పం ప్రాంతంలో వీకోట, బైరెడ్డిపల్లి, జాతీయ రహదారిలో గాంధీనగర్ వద్ద భారీగా మోహరించారు. బంగారుపాళెంకు వెళ్లే గ్రామీణ రహదారులను సైతం పోలీసులు దిగ్బంధం చేశారు. -
విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు పీజీ కోర్సుల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారం రోజుల పాటు నిర్వహించనున్న బ్రిడ్జ్ కోర్సును బుధవారం ప్రారంభించారు. వర్సిటీలోని చెలికాని అన్నారావు భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, స్కూల్ ఆఫ్ దర్శన్ డీన్ ప్రొఫెసర్ విష్ణుభట్టాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంస్కృత భాషతోపాటు అందులో శాసీ్త్రయ అంశాలు, శాస్త్రాల సమగ్ర జ్ఞానాన్ని బ్రిడ్జ్ కోర్సులో అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పంకజ్ కుమార్ వ్యాస్, సహాయక ఆచార్యులు డాక్టర్ యశస్వి, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా వీసీ కాన్ఫరెన్స్లో ఎన్ఎస్యూ వీసీ తిరుపతి సిటీ : కర్ణాటకలోని ముద్దెనహలి, సత్యగ్రామ, సత్యసాయి ప్రేమామృతం వేదికగా జరిగిన ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. భారత్ విశ్వగురువుగా వెలుగొందేందుకు తీసుకోవాల్సిన నూతన సంస్కరణలు, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ప్రోత్సహించడం, వర్సిటీల బలోపేతం తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో విస్తృతంగా చర్చించారు. -
జగన్ జనాదరణను అడ్డుకోలేరు
తిరుపతి కల్చరల్ : పంటకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతూ తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పర్యటనలో పోలీసులు అడుగడుగునా అడ్డుకునే చర్యలు రెడ్బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపోతున్న మామిడి రైతుల పరామర్శకు మాజీ సీఎం మార్కెట్ యార్డుకు రావడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. పర్యటనలో ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడమే కాక వారిని దూర ప్రాంతాలకు తరలించి నిర్భంధించడం దుర్మార్గ చర్య అన్నారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ నిర్భంధాలకు పూనుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ రైతు సంఘం నేతగా తనతో మరో 30 మందిని జగన్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకొని నిర్భంధించడమే కాక కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వ్యవహరించడం చూస్తే పోలీసులు కూటమి ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోందన్నారు. జగన్ పర్యటనకు వెళ్తే కేసులు పెడతామని, రౌడీషీట్ పెడతామని స్వేచ్ఛను హరించేలా పోలీసులు వ్యవహరించారన్నారు. బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డి ఒక అవివేకని విమర్శించారు. కర్ణాటకలో కేంద్ర మంత్రి కేంద్ర సహకారంతో మామిడి కిలో రూ.16 కల్పిస్తే ఆంధ్రాలోని మామిడి రైతులు నష్టపోతున్నా నోరు మెదపక, శ్రీవారి దర్శనాలే ప్రరమావధిగా వ్యవహరించే బీజేపీ నేత పసలేని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు వెంకటేష్రెడ్డి, కె,వెంకటాచలం పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే కేసులా?
గంగాధర నెల్లూరు: కూటమి ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం గంగాధరనెల్లూరు మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా నాయకురాలైన కృపాలక్ష్మి రాజకీయంగా ఎదుగుతున్న పరిస్థితిని ఓర్వలేక, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కృపాలక్ష్మి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి నేటి వరకు ఎవర్నీ కించపరిచే విధంగా మాట్లాడలేదని, సోషల్ మీడియాలోని ఇన్స్ట్రాగామ్లో అకౌంటే లేదని తెలిపారు. జనసేన నాయకులు ఉద్దేశపూర్వకంగానే కృపా లక్ష్మిపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. తన బిడ్డ పోస్టింగ్ చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, జిల్లా మాజీ సీడీసీఎంఎస్ చైర్మన్ వేల్కూర్ బాబురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి. మాజీ రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గుణశేఖర్రెడ్డి, సీనియర్ నాయకులు మునిరాజారెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, సర్పంచ్ సుబ్రహ్మణ్యంయాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏకాంబరం, యువజన విభాగం అధ్యక్షులు కిషోర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆంక్షలతో జగన్ పర్యటనను ఆపలేరు
బంగారుపాళెం: మామిడి రైతులకు అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు వస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. జగన్ రాకకోసం కొత్తపల్లె హైవే సమీపంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ను, బంగారుపాళెంలోని మామిడి మార్కెట్ యార్డ్ను మంగళవారం పార్టీ నేతలతో కలసి ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో మామిడి రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్నప్పుడు ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. వైఎస్సార్సీపీకి సంబంధించిన నాయకులు రాకూడదు.. ఇంత మందే రావాలి.. అంటే ఎట్లని ప్రశ్నించారు. అనుమతి ఇచ్చి.. కట్టడి చేసినట్టుగా ఉందని చెప్పారు. నాయకులెవర్నీ బయటకు రాకుండా చేసి జగన్మోహన్రెడ్డిని ఒక్కరినే మామిడి మార్కెట్ యార్డులోకి అనుమతించి టీడీపీ నాయకుల చేత అడ్డుకునే కుట్ర జరుగుతోందన్నారు. రూపాయికి కూడా కొనలేమని చెప్పిన ఫ్యాక్టరీ యజమానులు వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకుని రూ.6 కొనుగోలు చేస్తామంటూ టోకన్లు జారీ చేస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్కుమార్, లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా పాల్గొన్నారు. -
పకడ్బందీగా పీఎం ఉద్యోగ కల్పన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం అమలు చేయాలన్నారు. పరిశ్రమలు నెలకొల్పితేనే యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు అనుమతులు ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని కోరారు. యువత ఉపాధి కల్పన కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8.39 కోట్లతో 547 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలతో ఉత్పత్తులు ప్రారంభించారని వివరించారు. వీటిలో 1,604 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. రూ.3,494 కోట్లతో 13 భారీ, మధ్య తరహా, రూ.117 కోట్లతో 38 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇవి ప్రారంభమైతే దాదాపు 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సింగిల్ డెస్క్ విధానంలో 532 దరఖాస్తులను ఆమోదించామని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అమలు చేస్తున్నందున దరఖాస్తులు స్వీకరించి పకడ్బందీగా పరిశీలించాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన లో 2,131 యూనిట్లకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇందులో 1,843 మందికి లబ్ధి చేకూర్చి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జెడ్ఎం సుబ్బారావు, ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమల అసోషియేషన్ ప్రతినిధి కట్టమంచి బాబీ పాల్గొన్నారు. -
మామిడి గోడు వినరే!
● గిట్టుబాటు కాని మామిడి ● మాయమైన ప్రభుత్వ మద్దతు ధర ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు ● ఆదుకోవాలంటూ విన్నపాలు ● పట్టించుకోని కూటమి నేతలు ఒక్క పంటకూ దిక్కులేదు చక్కెర ఫ్యాక్టరీ మూయించిన ఘనత చంద్రబాబుదే. దీనికి ముందు పాల ఫ్యాక్టరీని మూయించారు. ఇదే మాదిరిగానే మామిడి రైతులను ముంచేయాలని చూస్తున్నట్లు ఉంది. ఈ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలి. చెరుకు పండించి బెల్లం తయారీ చేస్తే ఆంక్షలు పెడుతున్నారు. వేరుశనగ పండిస్తే చేతికి అందే పరిస్థితి లేదు. ఇప్పుడు పంట మామిడి ఒక్కటే. –రాము, చిత్తూరు మండలం ఈ ప్రభుత్వంతో ఒరిగిందేమీ లేదు 2018లో ఇలానే అల్లాడిపోయాం. అప్పు డు కాయలు కొనే వారు లేక చెట్లల్లోనే వదిలేశాను. ఈ సారి కాయలు అడిగే వారు లేరు. బలవంతంగా ప్యాక్టరీలకు తోలుకుంటున్నాం. ప్యాక్టరీ రేటు తొతాపురి రూ.8 అని ప్రకటించాయి. ఎక్కడ ఆ రేటుకు కొనుగోలు చేస్తున్నారు..?. కానీ ప్యాక్టరీలను ఏం చేయలేక పోతోంది. సీఎం, మంత్రులు అలా వచ్చి...ఇలా వెళ్లిపోయారు. –సాము, చిత్తూరు మండలం -
రేపు మెగా పీటీఎం 2.0
● మండల స్థాయి అధికారులకు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు ● ప్రతి పాఠశాలలో ఒక అధికారి పాల్గొనాలి ● ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కార్యక్రమాలు ● ప్రత్యేకంగా తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమం ● కలెక్టర్ సుమిత్కుమార్ వెల్లడి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం 2.0)ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం క్షేత్ర స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలోని ఎంఈవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్, అర్బన్ ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. మెగా పీటీఎం కు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు కచ్చితంగా ఒక్కొక్క పాఠశాలలో కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమ నిర్వహణ పై ఇదివరకే ఆయా ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. ఉదయం 9కే కార్యక్రమం జిల్లాలోని ప్రభుత్వ 2,437, ప్రైవేట్ 506, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 50 మొత్తం 2,993 విద్యాసంస్థల్లో తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉన్న 1,32,996 మంది, ప్రైవేట్ కళాశాలల పరిధిలోని 86,162, జూనియర్ కళాశాలల పరిధిలోని 7,576 మొత్తం 2,26,734 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు స్కూల్ గ్రాంట్స్లో రూ.2.68 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 11 గంటల వరకు తల్లిదండ్రులతో సమావేశం, 11 నుంచి 11.20 గంటల వరకు ఆటల పోటీలు, 11.30 నుంచి పాఠశాల ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, అధికారులు, దాతల ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. అనంతరం విద్యార్థుల తల్లి పేరుతో పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారని కలెక్టర్ వివరించారు. ఈ కాన్ఫరెన్స్లో డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ పాల్గొన్నారు. -
రూ.6కు అంగీకార పత్రం
కూటమి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనలేమని ఫ్యాక్టరీలు చేతులెత్తేస్తున్నాయి. అందుకు నిదర్శనమే జీడీనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ ఇచ్చిన అంగీకార పత్రం నిదర్శనంగా నిలుస్తోంది. అందులో తోతాపురి కేజీ రూ.6కే విక్రయిస్తున్నామని రైతుల నుంచి సంతకాలు తీసుకుంటోంది. ఆ పత్రాలను కూడా బయటకు ఇవ్వకుండా, ఫొటోలు తీయనీకుండా అడ్డుకుంటోంది. అతి కష్టం మీద ఓ అంగీకార పత్రం బయటకు వచ్చింది. తద్వారా సూపర్సిక్స్ రేటు తెల్లతేటమైంది. ఇదీ కూడా ఒక మాయే నంటూ రైతులు పలువురు మండిపడుతున్నారు. పూతలపట్టులోని ఓ ఫ్యాక్టరీ రూ.5 చొప్పున్న చెల్లిస్తోందని, ఆ చెల్లింపులు బ్యాంకులో జమ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తోతాపురి కేజీ రూ.8 చొప్పున్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
సమస్య చెప్పుకునే హక్కు కూడా లేదా?
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీలు ఇటీవల నిర్వహించారు. ఈ బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన అగ్రికల్చర్ అసిస్టెంట్లు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో చంటి పిల్లలతో పలువురు మహిళా సచివాలయ ఉద్యోగులు తమ ఆవేదనను కలెక్టర్కు విన్నవించుకునేందుకు విచ్చేశారు. బదిలీల్లో చోటు చేసుకున్న అన్యాయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించుకునేందుకు వస్తే దురుసుగా ప్రవర్తించడంతో సమస్యలు చెప్పుకునే హక్కు కూడా తమకు లేదా? అంటూ అగ్రికల్చర్ అసిస్టెంట్ ధర్నాలో ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు మాట్లాడుతూ ఇటీవల అగ్రికల్చర్ అసిస్టెంట్లకు నిర్వహించిన బదిలీలు పూర్తిగా జీఓ నంబర్ 5కు విరుద్ధంగా చేపట్టారన్నారు. ఎలాంటి మెరిట్ లిస్ట్ ప్రదర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య చెబితే నోరు మూసుకోమన్నారు! తమకు జరిగిన ఆవేదనను చెప్పుకునేందుకు వెళితే సానుకూలంగా స్పందించాల్సిన చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ నోరుమూసుకోమని చెప్పడం ఎంతవరకు న్యాయమని అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని అధికారులతో కాకుండా ఇంకెవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. ర్యాంకులు, మెరిట్ ఉన్న వారికి ఎక్కడో దూర ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యేల సిఫార్సులు, ముడుపులు ఇచ్చిన వారికి బదిలీల్లో న్యాయం చే శారని ఆరోపించారు. పలుకుబడి లేని, ముడుపులు ఇచ్చుకోని తమకు అన్యాయం చేశారని మండి ప డ్డారు. అనంతరం బదిలీల్లో జరిగిన అన్యాయంపై కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి విన్నవించుకు న్నారు. పరిశీలించిన ఆయన ఆయా శాఖల అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. త్రిశూల్, సెల్వం, భవ్య, పావని పాల్గొన్నారు. ● కలెక్టరేట్ ఎదుట ఉమ్మడి చిత్తూరు జిల్లా అగ్రికల్చర్ అసిస్టెంట్ల ధర్నా -
పేదల రాజసం
చిత్తూరు కార్పొరేషన్: పేదల గుండెల్లో కొలువైన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను ఇప్పటికీ ఉమ్మడి జిల్లా వాసులు నెమరువేసుకుంటూనే ఉన్నారు. రాజశేఖరరెడ్డి జిల్లాకు చేసిన మంచి, జనం హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.గాలేరు–నగరి సుజల స్రవంతికి శ్రీకారంకరవు ప్రాంతమైన చిత్తూరు జిల్లాకు శ్రీశైలం జలాశయం నుంచి వరదజలాల్లో మిగులు నీటిని తరలించి సాగు, తాగు నీరు అందించడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని 2005లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని 1,03,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి, ఈ జిల్లాలోని ప్రజలకు తాగునీరు అందించడానికి ఈ పథకానికి రూపకల్పన చేశారు. 430 కిలోమీటర్లు సాగే ఈ ప్రాజెక్టు కాలువ 254వ కిలోమీటరు వద్ద అప్పటి ఉమ్మడి జిల్లాకు ప్రవేశించేలా ఏర్పాటు చేశారు. జిల్లాలో మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్, పద్మసాగర్, శ్రీనివాససాగర్, వేణుగోపాలసాగర్, వేపగుంట రిజర్వాయర్ మీదుగా నగరి రూరల్ మండలంలోని అడవికొత్తూరులో నిర్మించే రిజర్వాయర్కు చేరుకుంటుంది. మహానేత పాలనలో 70 శాతం పూర్తి అయిన ఈ ప్రాజెక్టు ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.ఈటీపీ ప్లాంటునూలుకు రంగువేసే ప్రక్రియలో వెలువడే రసాయన నీటి కారణంగా భూగర్భజలాలు కలుషితమవుతుండడంతో కొన్నేళ్ల క్రితం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి డైయింగ్ యూనిట్కు ఈటీపీ అమర్చుకోవాలని లేకుంటే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. డైయింగ్ యూనిట్లు ఈటీపీ పెట్టుకోవాలంటే రూ.20 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చుచేయలేని స్థితిలో వారు ఉండడంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రసాయన నీటిని శుభ్రపరిచే కామన్ ఈటీపీ ప్లాంటు ఏర్పాటుకు సంసిద్ధత తెలిపి, రూ. 14 కోట్ల మంజూరు చేశారు. ఆయన పాలనలో వేగంగా జరిగిన పనులు ఆయన మరణంతో మందగించింది. తర్వాత గతంలో ఎమ్మెల్యే రోజా ప్లాంటును ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు.వంద పడకల ఆస్పత్రి..మహానేత పాలనలో నగరికి రూ.15 కోట్ల వ్యయంతో వందపడకల ఆస్పత్రి మంజూరైంది. ఆధునిక హంగులతో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభ మైన ఈ ఆస్పత్రి వైఎస్సార్ మరణానంతరం 60 పడకలకే పరిమితమైంది. గత పాలనలో ఆస్పత్రి అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారు.సమ్మర్ స్టోరేజ్ ట్యాంకునగరి తాగునీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపడానికి మున్సిపల్ పరిధి సత్రవాడ శివారుల్లో రూ.36 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. గాలేరు నగరి ప్రాజెక్టును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు అనుసంధానం చేశారు.నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం2006లో అధికారికంగా శ్రీసిటీ సెజ్కు పచ్చజెండా ఊపి 2008 ఆగస్టు 8వ తేదీన 8 పరిశ్రమలకు అప్పట్లో సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 8 పరిశ్రమలతో మొదలైన శ్రీసిటీ పారిశ్రామికవాడ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు రూ.60 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 27 దేశాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆంధ్ర–తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని వెనుకబడిన ప్రాంతమైన సత్యవేడు నియోజకవర్గం 2004–2009 మధ్యలో అన్ని విధాలా అభివృద్ధి చెందింది. అప్పటి సత్యవేడు ఎమ్మెల్యే నారాయణస్వామి చొరవతో నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేయూతనిచ్చారు. 2004లో వైఎస్సార్ రాజీవ్ పల్లెబాట పేరిట జిల్లాలోనే సత్యవేడు నియోజకవర్గంలో తొలిసారిగా పర్యటించిన ఆయన వరాల జల్లుతో ప్రాంతం అభివృద్ధికి నాంది పలికారు. సత్యవేడులో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు ఉబ్బలమడుగు, భూవతేశ్వరకోన, రాళ్లవాగు నీటి ప్రాజెక్టుల ఏర్పాటు చేశారు. సత్యవేడుకు కలగా మిగిలిన డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, తొమ్మిది హైస్కూళ్లు, ఒక తమిళ మీడియం స్కూల్ ఏర్పాటు చేయడంతో ఇంటర్ తర్వాత ఉన్నత విద్యకు విద్యార్థులకు కష్టాలు తప్పాయి. దీంతో నియోజకవర్గంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మహానేతను విద్యాదాతగా ఇప్పటికీ సర్మించుకుంటున్నారు.తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వైఎస్సార్ మానసపుత్రికగా నిలిచిపోయింది. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఏర్పాటుకు 2004 సెప్టెంబర్ 30వ తేదీన బీజం పడింది. అప్పటి సీఎం వైఎస్సార్ తిరుపతి వెటర్నరీ కళాశాల స్వర్ణత్సోవాలకు ముఖ్య అతిథిగా హాజరై కళాశాలకు యూనివర్సిటీ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. 2005 జూలై 15వ తేదీన వర్సిటీగా గుర్తింపు ఇచ్చారు. మొత్తం రూ.145 కోట్లు మౌలికవసతుల కల్పనకు కేటాయించారు. వర్సిటీ పరిధిలో తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు, గరివిడి వెటర్నరీ కళాశాలలు తిరుపతిలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, ముత్తుకూరులో మత్స్య కళాశాలలు ఉన్నాయి. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలు 30 ఉన్నాయి. వీటిలో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు అనిమల్ హస్బెండరీల పాలిటెక్నిక్ కోర్సులు సైతం ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య 3 వేలకు పైగా చదువుతున్నారు. అధ్యాపకులు 305, బోధనేతర సిబ్బంది 2,545 మంది వరకు ఉన్నారు. అలాగే ప్రపంచలోనే పేరొందిన పుంగనూరు, ఒంగోలు జాతి పశు సంతతి అభివృద్ధికి పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. -
దోపిడీ ఖాయం
మాట మాయం..మామిడి రైతుల ఏడాది శ్రమ ఆవిరైంది. గిట్టుబాటు దక్కకుండా పోయింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు.. మంత్రులు మామిడి ధరపై ఇచ్చిన మాట మాయమైంది. ఫల్ప్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు తాము చెప్పిందే వేదంగా ఇష్టమొచ్చిన రీతిలో ధర నిర్ణయిస్తున్నాయి.. ఆ ధరకే ఇష్టపడి విక్రయిస్తున్నట్లు పుడమి పుత్రుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని, వారి శ్రమను దోపిడీ చేస్తున్నాయి. వెరసి కూటమి పెద్దల మామిడి మాట మాయం కాగా.. దోపిడీ ఖాయం అయ్యింది. గుడిపాల వద్ద క్యూకట్టిన ట్రాక్టర్లు చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడి మాట మటాష్ అయింది. తోతాపురి కిలో రూ.8 మద్దతు ధర మాయమైంది. కొన్ని ఫ్యాక్టరీలు కిలో రూ.5, రూ.6 అని తేల్చాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు ధరలను నొక్కిపెడుతున్నాయి. ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి మద్ధతు ధర ఆదేశాలు ఆమడదూరంలో నిలిచాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనతో కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టుకుంది. మామిడి రేట్లను కప్పిపుచ్చేందుకు కుయుక్తులు పన్నుతోంది. దీంతో మామిడి రైతులు కుదేలవుతున్నారు. కొనుగోలిలా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 ఫ్యాక్టరీలుండగా 31 ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 38,706 మంది రైతుల నుంచి 2.22 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను కొనుగోలు చేశాయి. ఇంకా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు తోటల్లోనే ఉన్నాయి. మామిడి పోరుతో ఈసారి తోతాపురి కొనుగోలు మందగించాయి. దీంతో కాయలు చాలా వరకు రాలిపోతున్నాయి. రైతులు కూలీలకు కోత కూలి ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. ఫ్యాక్టరీలకు విక్రయించలేని పరిస్థితి నెలకొనిచ రైతులను నట్టేట మునుగుతున్నారు. ఇదీ మంత్రుల ధర... మామిడి కోతలకు ముందు ఎదురైనా సమస్యల కారణంగా కూటమి ప్రభుత్వం తోతాపురి కిలో ధర రూ.8కు ఫ్యాక్టరీలు కొనుగోలు చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహక నిధిగా కిలోకు రూ.4 చొప్పున్న అందిస్తుందని ప్రకటించింది. తీరా ఫ్యాక్టరీ రేటు అమలుకు నోచుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి అచ్చెంనాయుడు గత నెలలో జిల్లాలో పర్యటించారు. గుడిపాల మండలం గొల్లమడుగులోని ఫ్యాక్టరీని తనిఖీ చేసి, తోతాపురి కిలో రూ.8కు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు నగరం ఎంఎల్ఎస్ పాయింట్ ఆవరణలో జరిగిన రైతులు, ఫ్యాక్టరీల ముఖాముఖి కార్యక్రమంలో ప్రతి ఫ్యాక్టరీలోనూ కేజీ రూ.8కు కొంటారని తెలిపారు. తీరా ఆ ధరలు ఆ మరుసటి రోజు నుంచే అమలు కాలేదు. ఫ్యాక్టరీలు రూ.6, రూ.5 రూ.4 అంటూ పాట పాడాయి. తర్వాత ధరల విషయంలో ఫ్యాక్టరీలు నోరెత్తకుండా చాలించుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 3,4 తేదీల్లో కుప్పంలో పర్యటించిన సందర్భంగా మామిడి రైతులు, ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడారు. కచ్చితంగా తోతాపురి కేజీకి రూ.8కు ఇస్తారని గట్టిగా ప్రకటించారు. తీరా ఆ మాటలను కూడా ఫ్యాక్టరీలు లెక్క చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4,99,274 మెట్రిక్ టన్నుల దిగుబడి జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి పంట పండుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లకుగాను 4,99,274 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని ఉద్యానశాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. జూన్ నెల ఆరంభం నుంచే కోతలు ప్రారంభమయ్యాయి. ఫ్యాక్టరీలు జూన్ 6వ తేదీ నుంచి ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు ప్రారంభించాయి. ర్యాంపులు జూన్ మూడో వారం నుంచి కొనుగోలుకు ముందుకు వచ్చాయి. తోతాపురి కిలో రూ.8కే కొంటారన్న సీఎం చంద్రబాబు జీడీనెల్లూరు ఫ్యాక్టరీలో రూ.6 విక్రయిస్తున్నట్లు రైతుల నుంచి అంగీకారపత్రం పూతలపట్టులో రూ. 5 లెక్కన జమ పలు ఫ్యాక్టరీల్లో ధరలపై నోరు విప్పని ఫ్యాక్టరీ నిర్వాహకులు మామిడి రేట్లను కప్పి పుచ్చేందుకు కూటమి కుయుక్తులు మూగబోయిన మామిడి రైతులు రేటు చెబితే ఒట్టు.. దిగుబడిని సాకుచూపి మా పొట్టకొడుతున్నారు. ఎంతకు కొంటున్నారో చెప్పడం లేదు. మేము పండించిన పంటకు వారు చెప్పిందే ధరగా మారింది. ఈ పంట ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే. కొన్ని ఫ్యాక్టరీలు రూ.5, రూ.6 అని చెబుతున్నాయి. 5 ఎకరాలో పంట పండింది. రూ.లక్షల్లో ఖర్చు చేశాను. ఆ కాయలను అమ్మితే చేతికి ఏం మిగలదు. ఫ్యాక్టరీల వద్దకు కాయలు తోలుకొస్తే సిఫార్సులతోనే గడిచిపోతోంది. –మురళి, యాదమరి మండలం -
జగనన్న పర్యటన విజయవంతం చేయండి
పెనుమూరు(కార్వేటినగరం): మామిడి రైతుల కష్టాలపై పోరాటం చేయడానికి బంగారుపాళేనికి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముక్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం పెనుమూరు మండలంలోని పులిగుండు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసి, మామిడి రైతుల పక్షాన నిలిచి, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పోరాటం చేయడానికి జగనన్న జిల్లాలో అడుగు పెడుతున్నారన్నారు. గతంలో కూడా పొగాకు, మిర్చి రైతుల పక్షాన పోరాటం చేసి, వారికి ఊరట కల్పించారని, అదే దిశలో జిలాల్లో మామిడి రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఈ నెల 9వ తేదీ బంగారుపాళేనికి వస్తున్నారని, ఆయన పర్యటనకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ముఖ్యంగా మామిడి రైతులు అత్యధికంగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం కనీస మద్దతు ధర టన్నుకు రూ.20 వేలు అందించి మామిడి రైతులను ఆదుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జగనన్న ప్రభుత్వంలో రైతులకు జరిగిన మేలును గుర్తు చేశారు. రైతన్నలకు ఎక్కడ అన్యాయం జరిగినా జగనన్న అక్కడ రైతుల పక్షాన పోరాటం చేసి, రైతుల పక్షపాతిగా నిలుస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలి చిత్తూరు అర్బన్: ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులకు ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 54 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి -
విద్యాభివృద్ధికి కృషి చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మెగా పీటీఎం 2.0 నిర్వహణపై ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న మెగా పీటీఎం 2.0 ను ప్రైవేట్ విద్యాసంస్థల్లో తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 178 ప్రైవేట్ పాఠశాలల్లో పీటీఎం కార్యక్రమం నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ వరలక్ష్మి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తదవతరులు పాల్గొన్నారు. -
పిల్లల భవిష్యత్తుతో ఆటలా..?
● పాఠశాలల విలీనంపై ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసనయాదమరి: పసిపిల్లల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని పాచిగుంట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు పెరుమాళ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభం శుభం తెలియని చిన్న పిల్లలను స్థానిక పాఠశాలను విడిచి వేరే ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకోమనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తమ గ్రామంలోని పాఠశాలలోని 3,4,5 తరగతి విద్యార్థులు 26 మందిని పచ్చాపూరు, సిద్ధారెడ్డిపల్లి, కాశిరాళ్ల పాఠశాలలో విలీనం చేశారని చెప్పారు. ఈ మార్గంలో ప్రమాదకరమైన మలుపులు, బావులు, చెరువులున్నాయన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోకుండా కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం చిన్న పిల్లల భవితపై అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని ఎంఈఓ రుక్మిణి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ కుబేంద్రన్, వైస్ ప్రెసిడెంట్ కవిత, రాము తదితరులు పాల్గొన్నారు. -
జన తరంగాన్ని ఎవరూ ఆపలేరు
చిత్తూరు అర్బన్: జప తరంగాన్ని ఎవరూ ఆపలేరని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించిన అనంతరం జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులు, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డా.సునీల్ కుమార్ సోమవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతిథి గృహంలో ఎస్పీ మణికంఠతో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం కిలో మామిడికి కేంద్రం మెడలు వంచి రూ.16 చెల్లిస్తుంటే.. 20 మందికి పైగా ఎంపీలున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం రూ.8 కూడా రైతులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రైతుల కష్టాన్ని తెలుసుకోవడానికి వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్నా రు. ఆయన పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తల నోటీసులను ఎ స్పీ తమకు ఇచ్చారన్నారు. రైతులతో భేటీకి 500 మంది, హెలిప్యాడ్ వద్ద 30 మంది మాత్రమే వెళ్లాలని చెప్పారన్నారు. అయితే జననేతను చూడడానికి వచ్చే జనాన్ని ఆపడం ఎవరితరం సాధ్యం కాదన్నారు. జనం జగన్ను చూడడానికి వస్తారని, వాళ్ల అభిమానాన్ని తాము అదుపు చేయలేమని స్పష్టం చేశారు. -
పోటెత్తిన అర్జీలు
● కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్యలపై నమోదైన 332 అర్జీలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు పోటెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 332 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదైనట్లు కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్ వెల్లడించారు. ఇళ్లను తొలగిస్తామంటున్నారు తాము నివసిస్తున్న ఇళ్లను తొలగిస్తామంటున్నారు న్యాయం చేయాలంటూ పుంగనూరు మండలం మేలందొడ్డి పంచాయతీ గోపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర, శారదమ్మలు వాపోయారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో తమ సమస్యను విన్నవించుకున్నారు. రేషన్షాపు తొలగించారు ఎటువంటి ఫిర్యాదులు లేకున్నా తమ గ్రామంలోని రేషన్షాపును అన్యాయంగా తొలగించారని ఐరాల మండలం పుల్లూరు గ్రామానికి చెందిన దామోదరరెడ్డి, రంగయ్య తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ రేషన్షాపును తొలగించి పి.ఒడ్డుపల్లిలోని ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో రేషన్ పంపిణీ చేస్తున్నారన్నారు. దీంతో రేషన్కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలి వైద్యం వికటించేలా చికిత్స చేసిన ఆర్ఎంపీ వైద్యునిపై చర్యలు తీసుకోవాలని పలమనేరు మండలం కొలమాసనపల్లి వాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవల కల్పన అనే మహిళకు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించిందన్నారు. దీంతో ఆమెకు ప్రస్తుతం మాటలు రావడం లేదని వాపోయారు. అమాయక ప్రజలకు వికటించే వైద్యం చేస్తున్న ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఎంఅండ్హెచ్ఓను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు జీతం చెల్లించాలి జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు 13 నెలల పెండింగ్ జీతం వెంటనే చెల్లించాలని ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తి పెద్దాస్పత్రిలో రక్తపాతం
● అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల దాడులు ● ఐదుగురికి తీవ్ర గాయాలు ● ఏ పార్టీకి సంబంధం లేదంటూ డీఎస్పీ ప్రకటన సాక్షి టాస్క్ ఫోర్స్: అర్ధరాత్రి వేళ పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వర్గానికి చెందిన వారిపై, మరో వర్గం యువకులు దాడి చేయడంతో క్యాజు వాలిటీ విభాగం రక్తంతో తడిచింది. ఏం జరుగుతోందో అర్థం కాక వైద్య సిబ్బంది, సెక్యూరిటీ గా ర్డులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భయానక ఘటన ఆదివారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి ఏరి యా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఏరియా ఆసుపత్రి సీసీ కెమెరాలో నమోదైన దాడి దృశ్యాలు సా మాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాళహస్తిలో ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం సందర్భంగా పట్టణంలోని మంచినీళ్లగుంట, వీఎం పల్లికి చెందిన యువకుల మధ్య ఆదివారం రాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. అగ్నిగుండ ప్రవేశం ముగిసిన అనంతరం అర్ధరాత్రి వేళ, తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో మంచినీళ్ళగుంట, వీఎంపల్లికి చెందిన యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మంచినీళ్లగుంటకు చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొంత మందిని వెంట తీసుకొచ్చిన వీఎం పల్లి యువకులు ఏరియా ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగంలోకి చొరబడి చికిత్స పొందుతున్న యువకులు, వారి బంధువులపై కర్రలు, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మంచినీళ్ల గుంటకు చెందిన వారు కూడా తిరగబడి రాళ్లు రువ్వడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమయంలో వీఎంపల్లికి చెందిన యువకుల ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. పెట్రోలు పోసి తగులబెట్టే ప్రయత్నంలో ఉండగా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే దాడులకు పాల్పడింది టీడీపీకి చెందిన యువకులు కావడంతో ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ స్పందించడం లేదు. ఏం జరిగింది అనేది చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. -
సుపరిపాలన కాదు.. ఇది దుర్మార్గ పాలన
పాలసముద్రం : ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాలను దారుణంగా మోసగించిన కూటమి ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తూ.. సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదమని మాజీడిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, జీడీ నెల్లూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కృపాలక్ష్మి దుయ్యబట్టారు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ మండల కన్వీనర్ తులసి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు అన్బళగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణస్వామి, కృపాలక్ష్మి, పార్టీ నాయకులతో కలసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ ఏడాదిలో ఏం సాధించారో చెప్పే దమ్ము కూటమి నేతలకు ఉందా అంటూ ప్రశ్నించారు. కృపాలక్ష్మి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జనాల్లోకి రానివ్వకుండా ఈ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృషిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు శేఖర్ యాదవ్, పుష్పాప్రకాష్, సర్పంచ్లు భాస్కర్రెడ్డి, అనురేఖ, మహేష్ బాబు, అయ్య ప్ప, జీవిత, నరసింహులురాజు, ఎంపీటీసీలు గోవిందరాజ్, లిఖిత, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ధనంజయులతోపాటు నాయకులు పాల్గొన్నారు. -
ఉరేసుకోమంటారా..!?
● ధర ఇవ్వరు.. కాయలు కొనరు.. ● అయినా మామిడి పంట పండించాలంట ● చెట్లు తొలగిస్తే కేసుల నమోదు ● దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు కొందరు మామిడి రైతులపై పగబట్టారు. మామిడి రైతుల పీక నొక్కుతున్నారు. మామిడి పంట తొలగిస్తే నేరమంటున్నారు. కక్షగట్టి వేధిస్తున్నారు. అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కేసులు, జరిమానాల పేరుతో రైతులను భయపెడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు పొగ పెడుతున్నారు. దీనిపై వివిధ పార్టీ నేతలు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. మామిడి పంటకు ఆంక్షలు ఏమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మామిడి చెట్టు పూతకు వచ్చినప్పటి నుంచి కాయలు పక్వానికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. మంచి దిగుబడి వచ్చింది. ఆ సారి కొంచెం లాభాలైనా కళ్ల చూడచ్చని అనుకున్నారు. మామిడి కాయలు కోతలు మొదలయ్యాక తెలిసింది అసలు ధరల్లేవు అని.. ప్రభుత్వం ఒక వైపు అధికారులు మరోవైపు రోజుకో ధర ప్రకటిస్తుంటే, ఫ్యాక్టరీలు మాత్రం అసలు కాయలే కొనం అంటూ మొండికేశాయి. ఈ క్రమంలోనే మామిడి కాయల ట్రాక్టర్లు ఫ్యాక్టరీల ముందు బారులు తీరాయి. రోజులు గడిచిపోతున్నా ట్రాక్టర్లు మాత్రం అన్లోడ్ కావడం లేదు. ట్రాక్టర్లోనే కాయలు పండై కుళ్లిపోయాయి. విధిలేక రోడ్ల పక్కనే పోరబోసి ఖాళీ ట్రాక్టర్లు ఇంటికి చేరాయి. ఈ బాధతో ఇక మామిడి పంటకు బదులు వేరే ఏదైనా సాగు చేసుకుందామని, చెట్లను తొలగించేశారు. అయితే చెట్లను తొలగించే రైతులపై కేసులు పెడుతున్నారు. ఈ తరుణంలో మామిడి రైతులకు కన్నీటి సుడులు మొదలయ్యాయి. రైతులను బతకనివ్వండి ఏదైతే రైతుకు మంచి దిగుబడి ఇస్తుందో.. ఆ పంట పండించాలనే రైతు తాపత్రాయ పడుతుంటాడు. ఇప్పుడు మామిడి వల్ల రైతుకు ఒరిగింది ఏమి లేదు. ఈ పంట సక్రమంగా రాని పక్షంలో రైతు ప్రత్యామ్నాయంగా చూసుకుంటారు. అంతే కానీ మామిడి చెట్లను కొట్టేస్తున్నారని కేసులు పెట్టడం కరెక్టు కాదు. చిత్తూరులోని కొన్ని కార్యాలయాల్లో చెట్లు కొట్టేస్తున్నారని వీడియోలు తీసి పంపిస్తే ఎవరూ పట్టించుకోలేదు. రైతులను ప్రశాంతంగా బతకనివ్వండి. – శరవణ, జనసేన పార్టీ నేత, చిత్తూరు రైతు చనిపోతే బాధ్యతెవరిది మామిడికి ప్రభుత్వం ప్రక టించిన మద్దతు ధర అమ లు కాలేదు. పండిన పంట ను అమ్ముకోవడానికి అవస్థ లు పడుతున్నాం. విధిలేని పరిస్థితుల్లో వేరే పంట పండించుకోవాలని చూస్తున్నాం. అటవీ శాఖ అధికారు లు గ్రీనరీ అంటున్నారు కదా. రైతు అప్పుల పాలై చ నిపోతే ఈ అధికారులు బాధ్యత వహిస్తారా? దయ చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడే పీకల్లోతు అప్పుల్లో ఉన్నాం. చెట్టు కొట్టేస్తున్నారని జరిమానా లు, కేసులు పేరుతో మమ్మల్ని వేధించొద్దు. – కొత్తూరు బాబు నాయుడు, రైతు నాయకుడు, చిత్తూరు పంట మార్పిడికి అనుమతేంటి? అతని పొలంలో అతను మా మిడి చెట్లు పెట్టుకున్నారు. పంట బాగా వచ్చి లాభాలుంటే ఏ రైతూ పంటను నేల మ ట్టం చేయడు. నష్టం వస్తే ప్ర త్యామ్నాయం చూసుకుంటా డు. అది రైతు ఇష్టం. గ్రీనరీ పేరుతో రైతులను అధికారు లు వేధిస్తే ఎలా? అలా అనుకుంటే అన్ని రకాల పంటలు గ్రీనరీనే కదా. అప్పుడూ ఏ పంటనూ కోయకూడదు. పంట మార్పిడికి అనుమతి తీసుకోవాలనడం విచిత్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. రైతులను ఇబ్బంది పెడితే. తిరగబడడం ఖాయం. – నాగరాజు, సీపీఐ నాయకులు, చిత్తూరు -
బోయకొండ కిటకిట
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆలయంలో క్యూలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి దీపాలు, దీవెలతో మేళ తాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. -
జిల్లా సమాచారం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 18 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 78 టీటీడీ డిగ్రీ కళాశాలలు 5 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 132 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 66 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 521 టీటీడీ జూనియర్ కళాశాలలు 3 పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 52 డిగ్రీ కళాశాలలో రిటైర్మెంట్కు చేరువలో ఉన్న తాత్కాలిక అధ్యాపకులు 75 జూనియర్ కళాశాలలో రిటైర్మెంట్కు చేరువలో ఉన్నవారు 37 -
నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్డే చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. 9న సార్వత్రిక సమ్మె చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జిల్లాలో సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు తెలిపారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు ఆదివారం ఐసీడీఎస్ సూపరింటెండెంట్కు సమ్మె నోటీసు అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తోందన్నారు. దీనికి నిరసనగా చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సార్వత్రిక సమ్మె చేపడుతున్నామన్నారు. ఈ సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల జాబితాపై బీఎల్వోలకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్)లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ఈ నెల 5 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఇచ్చేలా కలెక్టరేట్ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఈఆర్వోల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. షెడ్యూ ల్ ప్రకారం ప్రతి రోజు 50 మందికి మించకుండా శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఈ శిక్షణలో ఎన్నికల ఓటర్ల జాబితాలో చేపట్టాల్సిన చర్యలను బీఎల్వోలకు క్షుణ్ణంగా వివరించనున్నారు. -
విధ్వంసక ‘కూటమి’ని ఎదుర్కొందాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అధికారం చేపట్టినప్పటి నుంచి విధ్వంసక పాలన సాగిస్తున్న ఈ మోసపూరితమైన ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొందామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు మండలం పాలంతోపు గ్రామంలో ఆదివారం ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అబద్ధాలకు మారు పేరు చంద్రబాబు అన్నారు. బాబు మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చారని, తీరా ప్రజలకు చేసేంది ఏమిలేదన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి నేతలు దౌర్జన్యాలు, విధ్వంసాలకు పాల్పడ్డారని చెప్పారు. ఇళ్లు, ఆస్తులు, పంటలు ధ్వంసం చేసి సామాన్యులు, వైఎస్సార్సీపీ శ్రేణుల రక్తాన్ని కళ్లచూశారన్నారు. పార్టీ పిలుపు మేరకు ఈ అరాచకాలు, తప్పుడు హామీలపై ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు. ప్రతి గడపలోకి వెళ్లి కూటమి మోసాన్ని వివరిద్దామన్నారు. రైతులను నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని బూచి చూపించి చివరకు నడి రోడ్డుపై వదిలేశారన్నారు. ఈ బాధలు తట్టుకోలేక ఓ రైతు మామిడి చెట్లు తొలగించి ప్రత్యామ్నాయం చూసుకుంటే ఆ రైతుకు అటవీశాఖ అధికారులు జరిమానా విధించడం విడ్డూరమన్నారు. ఇలా జిల్లాలో మామిడి రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9న బంగారుపాళ్యంకు వస్తున్నారన్నారు. ఆయనకు జిల్లాలోని ప్రతి రైతు స్వాగతం పలకాలని కోరారు. అనంతరం క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జయపాల్, జెడ్పీటీసీ ఎం.ఎస్బాబునాయుడు, నాయకులు సంపత్, అమర్నాథ్రెడ్డి, త్యాగరాజులు రామ్మోహన్, భాస్కర్రెడ్డి, భాస్కర్, వేలుస్వామి, రాబర్ట్, స్టాండ్లీ, దిలీప్, పాండి, రాజేంద్ర, సుబ్రమణి, జయచంద్ర, సుబ్రమణ్యం, మూర్తి, వైస్ ఎంపీపీ జయరాం పాల్గొన్నారు. -
వరసిద్ధుని బ్రహ్మోత్సవానికి ముహూర్తం ఖరారు
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 27వ తేదీ నుంచి బ్రహ్మో త్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయకచవితి రోజు నుంచే ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 28న ధ్వజారోహణం, హంసవాహనం, 29న బంగారు నెమలి వాహనం, 30న మూషికవాహనం, 31న బంగారు చిన్న, పెద్ద శేష వాహనం, సెప్టంబర్ 1న చిలుక వాహనం, వృషభవాహనం, 2వ తేదీ గజవాహనం, 3న రథోత్సవం, 4న తిరు కల్యాణం, 5న ధ్వజారోహణం, ఏకాంత సేవలు నిర్వహించనున్నారు. ఆపై ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. 6వ తేదీ అధికార నంది వాహనం, 7న రావణబ్రహ్మ వాహనం, 8న యాళి వాహనం, 9న సూర్యప్రభ వాహనం, 10న చంద్రప్రభ వాహనం, 11న కల్పవృక్ష వాహనం, 12న విమానోత్సవం, 13న పుష్పపల్లకి, 14న కామధేను వాహనం, 15న పూలంగిసేవ, 16న తెప్పోత్సవం ముగియనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు. -
నిర్బంధ విధానం సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం టీచర్ల పట్ల నిర్బంధ విధానం అమలు చేయడం ఏ మాత్రం సరికాదని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులను ఎక్కువగా అమలు చేయడం అన్యాయమన్నారు. బోధనేతర పనుల వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడి, అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. బోధన పట్ల ఏకాగ్రత కరువవుతోందని చెప్పారు. మెగా పీటీఎం పేరుతో పాఠశాలల్లో 17 కమిటీలు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యాశక్తి, ఆన్లైన్ కోర్సులు, తల్లికి వందనం పోటీలు, గ్రీన్ టైల్ నమోదు, వీడియోలు రికార్డు చేయడం వంటి అదనపు ఒత్తిళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయులపై నెట్టడం అన్యాయమన్నారు. -
వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేద్దాం
బంగారుపాళెం: మామిడి రైతులకు అండగా నిలిచేందుకు మండలానికి విచ్చేయనున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ తెలిపారు. మండలంలోని పాలేరు గ్రామంలో ఆదివారం సాయంత్రం మండల పార్టీ కన్వీనర్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సునీల్కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 9న మామిడి మార్కెట్ను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్నారని చెప్పారు. ధరలు లేక తోటల్లో కాయలు నేలరాలిపోతుంటే రైతులు కంట తడి పెట్టుకున్నట్లు తెలిపారు. మామిడి రైతులు పడుతున్న కష్టాలు కూటమి నాయకులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్రాజా, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సర్దార్, జిల్లా పార్టీ కార్యదర్శులు గోవిందరాజులు, ప్రకాష్రెడ్డి, వడ్డెర, ఈడిగ కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్లు మొగిలీశ్వర్, ఎల్లప్ప, నియోజవర్గ రైతు విభాగం అధ్యక్షులు పాలాక్షిరెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షులు అరుణామల్రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షాకీర్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు వాణీప్రియ, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు మాలతి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
చిత్తూరు అర్బన్: జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించడంపై ప్రతి ఒక్క న్యాయమూర్తి దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఆదేశించారు. చిత్తూరు కోర్టు భవనంలో ఆదివారం చిత్తూరు పూర్వపు ఉమ్మడి జిల్లా న్యాయాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత నెలాఖరు నాటికి జిల్లాలో 96,739 పెండింగ్ కేసులు ఉండగా, ఇందులో 48,751 సివిల్, 47,988 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో కేసులు పెండింగ్ ఉండడంపై రాష్ట్ర హైకోర్టు సైతం గమనిస్తోందన్నారు. ప్రధానంగా వృద్ధులకు సంబంధించిన కేసులు, అనుమతి లేని విచారణ ఖైదీల కేసులపై దృష్టి సారించాలన్నారు. న్యాయస్థానాలు జారీ చేసిన వారంట్లు ఏ మేరకు అమలు చేశారో సరి చూసుకోవాలన్నారు. జిల్లాలోని సీనియర్ జూనియర్ సివిల్ న్యాయమూర్తులకు పెండింగ్ కేసులు పరిష్కరించడానికి లక్ష్యాలు కూడా నిర్ణయిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులు హాజరయ్యారు. ఏరియా ఆస్పత్రిలో యువకుడి హల్చల్ పలమనేరు: మద్యం మత్తులో ఉన్న యువకుడు సైకోలా మారి హల్చల్ చేసిన సంఘటన పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. దండపల్లి మండలం కురప్పల్లెకు చెందిన భాను(25) భార్యతో కలిసి పట్టణంలోని గాంధీనగర్లో నివసిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్యపై దాడిచేశాడు. దీంతో ఆమెను బంధువులు స్థానిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే భర్త ఆస్పత్రికి వచ్చి మరీ భార్యతో గొడవపడి గట్టిగా కేకలు పెడుతూ చొక్కా తీసిపడేసి, అక్కడున్న వారిని తరుముకున్నాడు. సమాచారమందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని అతడిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న వారు యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి ఓ చెట్టుకు కట్టేశారు. భక్తులపై హిజ్రాల దాడి చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దర్శనం కోసం ఆటోలో వచ్చిన ఐదుగురు భక్తులు అడిగినంత డబ్బులు ఇవ్వలేదని హిజ్రాలు వారిపై దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు, బెంగళూరుకు చెందిన దేవరాజు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆటోలో బోయకొండకు బయల్దేరారు. బోయకొండ సమీపంలోని మేకలవారిపల్లె వద్ద రోడ్డుపై వెళ్తున్న వాహనాలను హిజ్రాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే వారు ఇవ్వకుండా అక్కడి నుంచి బోయకొండ రణభేరి గంగమ్మ ఆలయం సమీపం వద్దకు వచ్చారు. అక్కడే ఉన్న మరి కొందరు హిజ్రాలు డబ్బులు ఇచ్చి ఆటో ముందుకెళ్లాలని పట్టుబట్టారు. వారు అడిగినంత ఇవ్వలేదని బూతులు తిడుతూ, ఆటోలో ఉన్న దేవరాజు, మంగమ్మ, భవాని, లిఖిత, నారాయణస్వామి లపై హిజ్రాలు దాడిచేసి గాయపరిచారు. వారు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరికొందరు భక్తులు వారిని రక్షించారు. అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్కు భక్తులు ఫిర్యాదు చేశారు. -
అసలు సిసలైన నాయకుడు జగనే
● హామీలిచ్చి విస్మరించిన చంద్రబాబు ఎప్పటికీ మోసగాడే ● ఇది ప్రజలకు తెలియజేయడమేరీకాలింగ్ మేనిఫెస్టో ఉద్దేశం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన, మాజీ మంత్రి రోజా నగరి : అట్టడుగు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన అసలు సిసలైన ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. నగరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి ఆర్కే రోజాతో కలిసి క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. భూమన మాట్లాడుతూ మోసపూరిత మేనిఫెస్టోతో చంద్రబాబు ప్రజలను బురిడీ కొట్టించారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి నెరవేరిస్తే అంతకన్నా ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పింఛన్ తప్ప ఏమీ అందిచలేదన్నారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి 30 లక్షల మందికి కోతలు పెట్టి తల్లికి వందనం అమలుచేశారని దుయ్యబట్టారు. 3 అంకణాలకు మించి ఉన్నా, రూ.300 విద్యుత్ బిల్లు ఉన్నా రూ.8,020 మాత్రమే వేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి సంతకాలు చేసిన బాండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని చెప్పారు. గెలిచాక యథాప్రకారం ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. ఎన్ని హామీలు ఇచ్చారు ఏవి అమలు చేయలేదు అని క్షేత్రస్థాయి వరకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమ ఉద్దేశమన్నారు. జగనన్న చేసిన మంచిని చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజెప్పడం ప్రతి కార్యకర్త బాధ్యతన్నారు. సనాతన యోధుడు ఏమయ్యాడు తిరుమలలో దేవుడితో సమానమైన గోవుని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, శ్రీ కూర్మంలో తాబేళ్లు చనిపోతున్నాయని వీటిపై సనాతన యోధుడు పిఠాపురం పీఠాధిపతి పవన్ ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. ఆయన తమిళనాడుకెళితే తాను అక్క డే పుట్టానంటాడు.. గుంటూరుకు వెళితే అక్కడా పుట్టానంటాడు.. పిఠాపురం వెళితే అక్కడే పుట్టానంటున్నాడు.. అసలు ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అందరూ వీకెండ్కు వెకేషన్కు వెళితే, పవన్ వీకెండ్కు మాత్రమే రాష్ట్రానికి వస్తారన్నారు. ఎవరు రాష్ట్రానికి మంచిచేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, హరి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, విజయలక్ష్మి, దీప, వైస్చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పవన్ తిక్కకు బాబు లెక్కలు పవన్ తిక్కకు చంద్రబాబు వద్దే లెక్కుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి అన్నీ హామీలు నెరవేర్చేశానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎంతమంది ఉంటే అంత మందికి జగన్ చేసిన సంక్షేమం కన్నా ఎక్కువ చేస్తాం అంటూ ఎన్నికల బీరాలు పలికిన బాబు నేడు దీన స్వరంతో పథకాలు తలచుకుంటే భయమేస్తోందంటున్నారని ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని పేర్కొన్నారు. ఆయనకు నిజం చెబితే తల పగిలే శాపం ఉందేమో అన్నారు. అందుకే ఆయన అబద్ధాలు మాత్రమే చెబుతారంటూ ఎద్దేవా చేశారు. బాబు చంకలో కూర్చున్న పవన్ తానే టీడీపీని అధికారంలోకి తెచ్చానంటుంటే, తాము లేకుంటే పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవరని టీడీపీ చెబుతోందని, ఇలాంటి నాయకులందరూ కూటమిగా కొనసాగుతుండడం దౌర్భాగ్యమన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు తెస్తానన్నారు. ఇంత మంది ఆడపిల్లలు అఘాయిత్యాలకు బలవుతున్నా నోరుమెదపడం లేదేమిటని ప్రశ్నించారు. పవన్కు చంద్రబాబు చూపే గ్రాఫిక్స్ తప్ప మిగతా విషయాలు ఏవీ కనబడవన్నారు. -
వైఎస్సార్ అంతరాత్మ ‘తెలుగు’
చిత్తూరు రూరల్ (కాణిపాకం): దివంగత ముఖ్యమంత్రి డా వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంతరాత్మ తెలుగుభాష అని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షులు మర్రిపూడి దేవేంద్రరావు అన్నారు. న గరంలోని సమాఖ్య కార్యాలయంలో ఆదివారం రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ‘తెలుగుభాషాభిమా నం – వైఎస్సార్ అంతరంగం’పై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, తెలుగుభాషకు ప్రాచీనపరంగా తెచ్చిన తెలుగుతల్లి ముద్దుబిడ్డగా వైఎస్సార్ ఖ్యాతికెక్కారని చెప్పారు. పల్లెసోయగాలు ఉట్టిపడే పంచెకట్టుతో తేట తెలుగు నడికారపు పలుకుల పలకరింపులు ఒక్క వైఎస్సార్కే దక్కిందన్నారు. సమాఖ్య జిల్లా అధ్యక్షులు తోట గోవిందన్ మాట్లాడుతూ అనితర సాధ్యమైన సేవలను ఆంధ్రావనిలోని ప్రతిగుండె కు చేరవేసిన రాజన్న యుగం చిరస్మరణీయమన్నారు. అనంతరం రాజన్న పరిపాలనపై కవిసమ్మేళనం నిర్వహించారు. 20 మంది రచయితలను, సంఘసే వకులను దేవేంద్రరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రచయితలు శ్రీరాజు, ఎస్.మునీంద్ర, రమేష్ బాబు, తెలుగు భాషాభిమానులు కోటీశ్వ ర మొదలియార్, డి.రోహిత్, జి.లక్ష్మీపతి, చిట్టిబాబు, భూపతి, ఎం.దినకరన్, రాజేంద్రన్, మురళి పాల్గొన్నారు. -
● ప్రశ్నార్థకంగా కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ● ఉద్యోగ భద్రత కరువు..బతుకు భారం ● ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు అందని రెన్యూవల్ ఉత్తర్వులు ● తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ● మూడు నెలలుగా అందని వేతనాలు ● దయనీయ
తిరుపతి సిటీ : ప్రభుత్వ, టీటీడీ డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల భద్రత కరువై బతుకు భారంగా మారింది. కళాశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు తప్ప మిగిలిన డిగ్రీ, టీటీడీ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ రెన్యూవల్ ఆర్డర్స్ ఇచ్చిన పాపాన పోలేదు. 2025–26 అకడమిక్ ఇయర్ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులను కొనసాగించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ మేరకు అడుగులు వేసే ప్రయత్నం చేయడం లేదు. దీంతో అధ్యాపకులు మే నుంచి జులై వరకు మూడు నెలల జీతాలకు నోచుకోలేదు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో 2002 నుంచి పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 800 మందికి పైగా అధ్యాపకులు ఉద్యోగ భద్రత కరువైె చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. గత ప్రభుత్వం పర్మినెంట్కు ఆదేశాలిచ్చినా.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు 2024లో జీఓ 114 విడుదల చేసి ప్రక్రియ శర వేగంగా కొనసాగుతున్న తరుణంలో సాధారణ ఎన్నికలు రావడంతో బ్రేక్ పడింది. అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను పక్కన పెట్టి డిగ్రీ అధ్యాపకుల నియామకాల కోసం ఏపీపీఎస్సీ ద్వారా నియమించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి అయోమయంలో పడింది. రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికై న అధ్యాపకులతో తాత్కాలిక అధ్యాపకుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. కొంత మంది అధ్యాపకులు గత 22 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ రెగ్యులర్ చెయ్యకపోవడం కనీసం టైం స్కేల్ కూడా ఇవ్వకపోవడం దారుణం.రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వంజిల్లాలో ప్రభుత్వ, టీటీడీ కళాశాలలో 22 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రతకు నోచుకోలేక సతమతమతం అవుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 75 మంది తాత్కాలిక అధ్యాపకులు రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అటు పర్మినెంట్ చేయకపోగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించకపోవడంతో వారికి ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా 12 నెలల పాటు అధ్యాపకుల చేత సేవ చేయించుకుని కేవలం 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికి తోడు వేతనాలు సరైన సమయానికి అందించకుండా మూడు, నాలుగు నెలలకు ఒకసారి అందిస్తున్నారు. ఏటా నాలుగు నెలల నిరీక్షణ గతంలో డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకులకు అకడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి రెన్యూవల్ ఆర్డర్స్ వచ్చేవి. గత ఏడాది నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. కానీ కళాశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి కాకుండా మూడు నెలలు ఆలస్యంగా కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం నాలుగు నెలలు జీతభత్యాలు ఆలస్యమవడంతో ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రక్రియ పూర్తయే వరకు నూతన రిక్రూట్మెంట్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలి. ప్రస్తుతం 2025–26 సంత్సరానికి సంబంధించి తాత్కాలిక అధ్యాపకులను కొనసాగిస్తూ ఉత్తర్వులు తక్షణం జారీ చేయాలి. దీంతో పాటు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్న సబ్జెక్ట్లకు వదిలేసి ఖాళీగా ఉన్న సబ్జెక్ట్లకు మాత్రమే నూతన రిక్రూట్మెంట్ ద్వారా అధ్యాపకుల ఎంపిక చేయాలి. – డిగ్రీ కాంట్రాక్ట్ అధ్యాపకులు, తిరుపతి జిల్లా -
ఉద్యమంలా తెలుగు భాషా పరిరక్షణ
పలమనేరు: తెలుగుభాష, సంస్కృతి పరిరక్షణకు సాహితీవేత్తలు ఓ ఉద్యమంలా ముందుకెళ్లాలని ప్రముఖ శతావధాన్ని ఆముదాల మురళి సూచించారు. పట్టణ సమీపంలోని కళామందిరం మూడో వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాతృభాషను కాపాడుకోవాల్సిన అవరసం నేటి తరంపై ఉందన్నారు. పిల్లలు సెల్ఫోన్లు పక్కనబెట్టి పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని సూచించారు. కర్ణాటకకు చెందిన శాస్త్రవేత్త రమేష్, కడప జానమద్ది సాహితీపీఠం నిర్వాహకులు విజయభాస్కర్ ప్రసంగించారు. నిర్వాహకులు తులసీనాథం నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల్లో నీతిని ప్రతిబింబించేందుకు నీతిపద్యాలు ఎంతో తోడ్పడతాయన్నారు. వందకు పైగా నీతి పద్యాలను చెప్పిన 50 మంది చిన్నారులకు వారు బహుమతులను అందజేశారు. సాహితీ రంగంలో ప్రతిభ చూపుతున్న చింతకుంట శివారెడ్డి, ఏనుగు అంకమనాయుడు, మల్లారపు నాగార్జున, టెంకాయల దామోదరం, మాధవి, నడ్డి నారాయణ, ప్రకాష్రెడ్డి, సాంభయ్య, విజయలక్ష్మి, రంభ, హేమాద్రి, సుధాకర్, శాంతాభాస్కర్, ఆళ్ళ నాగేశ్వరావుకు వార్షికోత్సవ పురస్కారాలను అందజేశారు. డాక్టర్ మౌని రచించిన భిన్నధ్రువాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పట్టణానికి చెందిన డా.రజని భరత, కూచిపూడి నాట్యాలు అందరినీ అలరించాయి. ఇందులో పుష్ప, ధనుంజయ, డా.మాధవి, రమ్య, భారతి, జమున, పలమనేరు బాలాజీ, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కూలిన విద్యుత్ దీప స్తంభం
చిత్తూరు అర్బన్: నగరంలోని గాంధీ రోడ్డు కూడలిలో అర్ధరాత్రి విద్యుత్ దీపస్తంభం కుప్పకూలింది. శనివారం అర్ధరాత్రి తరువాత ఓ లారీ వేగంగా వచ్చి దాదాపు వంద అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్ దీప స్తంభాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ఆ స్తంభం రోడ్డుపైనే కూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జంతువులకు వ్యాధి నిరోధక టీకాలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జంతువుల నుంచి మనుషులకు సోకే రేబిస్ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ జేడీ అబ్దుల్ ఆరీఫ్ తెలిపారు. జూనోసిస్ డేను పురస్కరించుకుని ఆదివారం స్థానిక పశువైద్యశాలలో శునకాలకు ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జంతువులు, పక్షుల నుంచి మనుషులకు 280 రకాల వ్యాధులు వ్యాపించే వీలుందని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జూనోసిన్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పశువైద్య శాలల్లో 23,440 ఉచిత డోస్ల టీకాలు శునకాలకు వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 2,942 డోసుల టీకాలు వేశామన్నారు. ఉచిత టీకాల ప్రక్రియ స్టాక్ ఉన్నంత వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, పశువైద్యాధికారిణి సుబ్బమ్మ పాల్గొన్నారు. -
బడిబాట కాగితాల్లోనే..!
● ఆ 15,879 మంది ఎక్కడున్నారో తెలియని వైనం ● డ్రాప్బాక్స్ లెక్కలతో సమగ్రశిక్ష శాఖ అధికారుల హడావుడి ● క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం శూన్యం చిత్తూరు కలెక్టరేట్ : విద్యాహక్కు చట్టం ప్రకారం బడిఈడు ఉన్న పిల్లలంతా పాఠశాలల్లోనే ఉండాలి. అయితే జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వేల సంఖ్యలో విద్యార్థులు చిన్నతనంలోనే బడికి దూరమై కార్మికులుగా మారుతున్నారు. ఈ విషయం పలు సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6–14 ఏళ్ల వయసు ఉండి బడిలో చేరి మధ్యలో చదువు మానేసిన వారి సంఖ్య అధికారికంగా 15,879 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరినీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే జిల్లాలో మాత్రం ఆ దిశగా చర్యలు మాత్రం ముందుకు సాగడం లేదు. తమకేమీ ఆ ఉత్తర్వులు పట్టవనే చందంగా సమగ్రశిక్ష శాఖ అధికారులు ఉదాసీన వైఖరి అనుసరిస్తున్నారు. బడి బయట పిల్లల అంశంపై కలెక్టర్ సైతం పలు మార్లు సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ జిల్లాలో బడిబాట కార్యక్రమం ఊసే లేదు. కలెక్టర్ దృష్టి పెట్టాల్సిందే జిల్లా వ్యాప్తంగా కొంత మంది విద్యార్థులను బలవంతంగా బడుల్లో చేర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. బడుల్లో చేర్పించినప్పుడు మాత్రం ఫొటోలు తీసి అధికారులకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. బడిబయటి పిల్లల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో సైతం తెలియని దుస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ప్రభుత్వ బడులకు ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. పాఠశాలల విలీనం.. విద్యకు దూరం జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసే పనిచేపట్టారు. దీంతో వేలాది మంది విద్యార్థులు పాఠశాలలకు దూరమవుతున్నారు. సొంత గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను దాదాపు 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల్లోకి విలీనం చేశారు. దీంతో తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలతో ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూనే ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. -
రోజువారీగా టోకెన్లు పంపిణీ
పూతలపట్టు (యాదమరి): రైతులకు రోజువారీగా టోకెన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆయన ఆదివారం పూతలపట్టు మండలం గల్లా ఫుడ్స్ పరిశ్రమను సందర్శించారు. అక్కడ తయారవుతున్న పల్ప్ ఉత్పత్తులను పరిశీలించారు. మ్యాంగో పల్ప్, మ్యాంగో జ్యూస్ పైన ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని ఐదు శాతానికి తగ్గిస్తామన్నారు. దీనివల్ల వినియోగం పెరిగి డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ యజమానులకు తెలిపారు. అనంతరం అన్లోడింగ్ కోసం ట్రాక్టర్లతో వేచి ఉన్న రైతులతో సంభాషించారు. జిల్లా నలుమూలల నుంచి మండలంలోని మ్యాంగో ఫ్యాక్టరీలకు వస్తున్న మామిడి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఏ రోజుకారోజు టోకెన్లను పంపిణీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
నివేదిక సిద్ధం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పంచాయతీల్లో 2023–24లో జరిగిన వివిధ పనుల్లో 29 అంశాల పురోగతి పై నివేదికలు సిద్ధం చేయాలని జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తదితర అధికారులతో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో సంబంధిత సంవత్సరంలో జరిగిన అభివృద్ధి, తాగునీరు, పారుశుద్ధ్యం ఇలా 29 అంశాలపై నివేదికలివ్వాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ 2023–24 సంవత్సరంలో పంచాయతీల్లో జరిగిన, జరగాల్సిన అభివృద్ధి పనులపై పూర్తి నివేదికను సేకరించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చిత్తూరు రూరల్ (కాణిపాకం): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి సుధారాణి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆమె ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. రానున్నది వర్షాకాలమని, కురిసే వర్షాలకు దోమల ఉధృత్తి పెరగవచ్చన్నారు. దీనికితోడు సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలున్నాయన్నారు. ఇలాంటప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. వచ్చే జ్వరం కేసులను క్షుణంగా పరీక్షలు చేసి కచ్చితమైన రిపోర్టును ఇవ్వాలన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, మలేరియా అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు. -
జగనన్న వస్తున్నాడనీ..!
‘మామిడి’పై ఉరుకులు పరుగులు ● జగన్ పర్యటనతో రైతులను కట్టడి చేస్తున్న కూటమి నేతలు ● ధరల్లేక.. చెట్లు కొట్టేస్తుంటే రైతులపై అటవీశాఖ కేసులు ● ఉన్నట్టుండి రైతులపై ప్రేమ ఒలకబోస్తున్న కూటమి ప్రభుత్వం ● పరిశ్రమల నిర్వాహకులతో ప్రిన్సిపల్ కార్యదర్శి సమీక్షలు ● అయినా సరే.. ఇప్పటికీ కిలో మామిడి ధర తెలియని రైతు ఇంతకూ కిలో మామిడి ఎంత? పంట పండించే రైతుకు దాని ధరను నిర్ణయించే హక్కు ఉంటుంది. కానీ మామిడి రైతు మాత్రం తాను పండించిన పంటకు ఇప్పటి వరకు ధర చెప్పలేకపోతున్నాడు. సీజన్ ప్రారంభంలో రూ.12 ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ఆపై రూ.8 ప్రకటించి.. మిగిలిన రూ.4 ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అటు తరువాత అధికారులు రూ.6 ప్రకటించారు. ఇపుడు కిలో రూ.4–5 మధ్య అంటున్నారు. ర్యాంపుల వద్ద రూ.2–3 పలుకుతోంది. అసలు రైతు నుంచి టన్నలకొద్దీ పంట కొనుగోలు చేసిన ఫ్యాక్టరీలు ఏ ఒక్కరికీ ధర చెప్పలేదు. రైతుల నుంచి ఎంత పటం కొన్నామని స్లిప్పులు ఇస్తున్నారే తప్ప.. అందులో ధర ఎంతని పేర్కొనకపోవడం మామిడి రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. చిత్తూరు అర్బన్: అధికారంలో ఉన్న పాలకులు ప్రజల కష్టాలను పట్టించుకోనప్పుడు ప్రతిపక్షం అంకుశమై ప్రశ్నిస్తుంది. జిల్లాలో మామిడి రైతుల కష్టం విని, కన్నీళ్లు తుడవడానికి ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలిసిన కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయినా సరే, మామిడి రైతు కష్టం తీరలేదు. కన్నీళ్లు ఆగడం లేదు. వైఎస్.జగన్ ఫీవర్ పట్టుకున్న యంత్రాంగం.. క్షేత్ర స్థాయిలో పర్యటనలు, సమీక్షలు నిర్వహిస్తూ మసిపూసి మామిడి రైతును ఏమార్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు ఏం చేశారు? ఉమ్మడి జిల్లాలో దాదాపు 56 వేల హెక్టార్లలో మామిడి సాగవుతుంటే.. 39,895 హెక్టార్లలో తోతాపురి చెట్ల నుంచి సుమారుగా 5 లక్షల టన్నుల కాయలు దిగుబడి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గత నెల ప్రారంభమైన మామిడి సీజన్.. మరో పది రోజుల్లో ముగియనుంది. ఈ సారి మామిడి విస్తారంగా కాయడంతో రైతులంతా పొంగిపోయారు. కానీ రైతుల ఆశలు ఎన్నో రోజులు నిలవ లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కిలో మామిడికి రూ.12. కానీ జిల్లాలో ఏ ఒక్క ఫ్యాక్టరీ ఈ ధరను చెల్లించ లేదు. చిత్తూరు, గుడిపాల, తవణంపల్లె, పూతలపట్టు ప్రాంతాల్లో గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రాత్రింబవళ్లు రైతులు మామిడి కాయల లోడ్లతో నిరీక్షిస్తున్నారు. తొలుత టోకెన్ల పద్ధతిని ప్రవేశపెట్టిన ఫ్యాక్టరీల యాజమాన్యాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాయి. ఆపై ఎవరు ముందు వస్తే, వాళ్ల పంటను లోపలకు అనుమతిస్తామన్నారు. అసలు కాయలు లోపలకు వెళితే చాలని రైతులు తిండీనిద్ర లేకుండా ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల గిట్టుబాటు ధర రాకపోవడం, ఫ్యాక్టరీలోలపకు కాయలు తీసుకెళ్లలేని పరిస్థితుల్లో పంటను రైతులు రోడ్లపై పారబోశారు. లారీల్లో మామిడి తీసుకొచ్చి ప్రజలకు ఉచితంగా పంచి పెట్టారు. ఇన్ని జరుగుతున్నా ఏ ప్రజాప్రతినిధి చేసిందేమీలేదు. అధికారులు సాధించిందీ లేదు. కానీ ఒక్క జగన్ వస్తున్నాడని తెలిసిన వెంటనే ఏకంగా రైతులతో ముఖ్యమంత్రి సమావేశం కావడం, మామిడికి మద్దతు ధర ఇస్తామని ప్రగల్భాలు పలకడం, ప్రిన్సిపల్ కార్యదర్శి చిత్తూరు జిల్లాకు వచ్చి సమీక్షలు నిర్వహించడం, ఫ్యాక్టరీల వద్దకు పరుగులు పెట్టడం చూస్తుంటే జగన్ అంటే ఎంత భయమో అర్థమవుతోంది. ఏడుస్తున్న రైతులపై కేసులు పరిస్థితిని గమనించిన రైతులు మామిడికి భవిష్యత్తు ఉండదనే నిర్ధారణకు వచ్చేశారు. ఉన్న పంటను పారబోసి, వచ్చినకాడికి ఫ్యాక్టరీలకు అప్పగించి.. మామిడి పంటే వద్దనే నిర్ణయానికి వచ్చేశారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పలువురు రైతులు మామిడి చెట్లను పూర్తిగా తొలగించేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుందని, ప్రతిపక్షానికి ఈ అంశం అంకుశంగా మారుతుందని భావించిన కూటమి ప్రభుత్వం కపట ప్రణాళిక రచించింది. చెట్లు కొట్టేస్తున్న రైతులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదుచేయించి, జరిమానాలు విధించేలా అటవీశాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాలో ఆరుగురు రైతులపై కేసులు నమోదుచేయించి, జరిమానాలు విధించింది. తమకు ఆత్మహత్యలే శరణ్యమైన ఇలాంటి సమయంలో గుండె లోతుల్లోంచి వస్తున్న బాధను దిగమింగుకుని.. తమ కష్టాలు విన్నవించడానికి జగన్ రాక కోసం రోజులు లెక్కబెడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
గంగాధర నెల్లూరు: రాష్ట్రంలో మోసం అని పదం వినపడితే చంద్రబాబు గుర్తుకు వస్తారని, మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. శనివారం గంగాధర నెల్లూరు మండలంలోని వింజం పంచాయతీ సిద్ధేశ్వరస్వామి కొండ గ్రామంలో చంద్రబాబు చేసిన మోసాలను గుర్తుచేస్తూ ఇంటింటికీ వంచన అనే కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కృపాలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి ప్రభుత్వంలో మోసగాళ్లు ఎక్కువగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డబ్బు ఎక్కువగా ఉన్నవారిని ఎన్నుకుని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబెట్టి ప్రజలందరికీ అలివి గాని హామీలిచ్చి మోసం చేశారన్నారు. అదే కోవలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓటింగ్ ముందు రోజు నియోజకవర్గంలోని దళితవాడల్లో ఐదువేల రూపాయల కూపన్లు పంచిపెట్టి ఎమ్మెల్యేగా గెలిచేన తరువాత అడ్రస్ లేకుండా వెళ్లిపోయారని దుయ్యబడ్డారు. పాలసముద్రం మండలంలో యథేచ్ఛగా కొండలు తవ్వేసి గ్రావెల్ మాఫియా చేసి చైన్నెకి తరలించేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని గ్రానైట్ క్వారీలలో సెటిల్మెంట్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గంగాధర నెల్లూరులో జరుగుతున్న ప్రకృతి వనరుల ధ్వంసం పై ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రదర్శించి ప్రజలందరికీ తెలియజేశారు. -
పుత్తూరులో 293 కేసుల పరిష్కారం
పుత్తూరు: స్థానిక సబ్కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో మొత్తం 293 కేసులను పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎస్సీ.రాఘవేంద్ర తెలిపారు. కక్షిదారుల మధ్య రూ.2,44,28,593 రాజీ చేసినట్లు పేర్కొన్నారు. 257 క్రిమినల్ కేసులు, 24 సివిల్, 12 ఫ్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఇందులో విడాకుల కోసం కోర్టుకు ఎక్కిన పుత్తూరు కళ్యాణపురానికి చెందిన అశోక్, పవిత్ర దంపతులకు న్యాయమూర్తులు కౌన్సెలింగ్ ఇచ్చి ఒక్కటి చేశారు. లోక్ అదాలత్ ప్రిసీడింగ్ ఆపీసర్లుగా సీనియర్ సివిల్ జడ్జి ఎస్సీ.రాఘవేంద్ర, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సీ.జానకి, అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి రమ్యసాయి వ్యవహరించారు. లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లుగా న్యాయవాదులు ఎం.విజయ్కుమార్, ఎస్.లక్ష్మీపతి, ఎడీ.బాలాజీ వ్యవహరించారు. లోక్అదాలత్ను పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు మధ్యాహ్నం ఉచిత భోజనం అందజేశారు. పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
మామిడిని కొనుగోలు చేస్తాం
– రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గుడిపాల: రైతుల వద్ద నుంచి మామిడిని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు. శనివారం ఫుడ్ అండ్ ఇన్స్ మామిడి గుజ్జు పరిశ్రమని కలెక్టర్ సుమిత్కుమార్తో కలిసి పరిశీలించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా మామిడిని కొనుగోలు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు. అన్లోడింగ్కు నాలుగు రోజులు పడుతున్నట్లు రైతులు తెలపగా.. అటువంటి సమస్య రాకుండా చూస్తామని తెలిపారు. అనంతరం ప్రాసెసింగ్ యూనిట్లో మామిడి తయారీ ఎలా జరుగుతుందోనని ఆయన యాజమాన్యంతో కలిసి పరిశీలించారు. తమిళనాడుకు తరలిన ట్రాక్టర్లు రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి రాకతో మామిడి కాయల ట్రాక్టర్లు అన్నింటినీ తమిళనాడుకు తరలించారు. ఫుడ్ అండ్ ఇన్స్ ఫ్యాక్టరీ తమిళనాడు ప్రాంతానికి ఆనుకుని ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చౌదరి వస్తున్నారన్న నేపథ్యంలో ఫ్యాక్టరీ సమీపంలో చిత్తూరు–వేలూరు రహదారిలో ఉన్న ట్రాక్టర్లు అన్నింటినీ వెంటనే సరిహద్దులోని తమిళనాడు ప్రాంతానికి అధికారులు పంపించేశారు. ఇక్కడ పెద్దగా రద్దీ లేదని ఆయనకు తెలియజేశారు. ఫ్యాక్టరీని పరిశీలించి వెళ్లిన అనంతరం గుడిపాల రెవెన్యూ అధికారులు తమిళనాడు ప్రాంతానికి వెళ్లి ట్రాక్టర్లకు టోకెన్లను అందజేసి ఒక్కో ట్రాక్టర్ను పంపించారు. -
నకిలీ టోకెన్లు విక్రయించిన వ్యక్తి అరెస్ట్
కార్వేటినగరం: ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీలో కలకలం రేపిన నకిలీ టోకెన్ల విక్రయం ఘటనలో సచివాలయ ఆర్టికల్చర్ని అరెస్టు చేసినట్లు కార్వేటినగరం సీఐ హనుమంతప్ప తెలిపారు. శనివారం తన కార్యాలయ ఆవరణంలో నిందితుడ్ని అరెస్టు చూపించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండల పరిధిలోని చింతమండి వద్ద ఉన్న ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ నమోదు కోసం డీఎంపురం సచివాయ హార్టికల్చర్ అధికారి విధులకు కేటాయించిందన్నారు. ఇతను పుత్తూరు మండలం, నందిమంగళం గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు వెంకటేష్(31) అని పేర్కొన్నారు. అతను ఫ్యాక్టరీ వద్ద నకలీ టోకెన్లు సృష్టించి రైతులకు అమ్మి సొమ్ముచేసుకున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో టోకెన్ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు విక్రయించినట్టు తెలిపారు. ఇలా సుమారు 31 నకిలీ టోకెన్లు బయటపడ్డాయన్నారు. ఈ మేరకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. -
మెగా పీటీఎంకు పరిశీలన అధికారెందుకు?
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం సీజనల్ వ్యాధులపై ల్యాబ్ టెక్నీషియన్లు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సుధారాణి ఆదేశించారు. నష్టాల ఊబిలో రైతన్నలుమామిడిని కొంటాం జిల్లాలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మామిడిని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ హామీ ఇచ్చారు. ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025పలమనేరు: ‘ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వస్తే కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం దేనికని?. అంత బెదురెందుకని..’ అంటూ రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మామిడికి గట్టుబాటు ధర కోసం ఈనెల 9న బంగారుపాళెంకు వస్తున్న సందర్భంగా పలమనేరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా నేతలతో ఆయన శనివారం సన్నాహక సమావేశాన్ని నేర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పొగాకు, మిరప, టమాట రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వాపోయారు. ఇప్పుడు మామిడి రైతులు కూడా ఆ కోవలో చేరారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడిని అమ్ముకోలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతమన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో రైతులకు అక్కడి ఎంపీ కేంద్రానికి లేఖ రాసి వారిని ఆదుకున్న విషయం తెలిసిందేనన్నారు. కానీ కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన నేతలు ఇక్కడి మామిడి రైతుల కష్టాన్ని ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో మరింత మెరుగ్గా మామిడి ధరలు బంగారుపాళెం: రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి మరింత ధారుణంగా మారిందన్నారు. తోతాపురి మామిడికి ధర లేక అవస్థలు పడుతున్నట్టు వాపోయారు. కర్ణాటకలో మామిడి రైతుల కోసం జేడీఎస్ పార్టీ నాయకుడు లేక రాస్తే 2.60 లక్షల టన్నుల మామిడి కాలయను కిలో రూ.16తో కొలుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన ధరకు వ్యాపారులు, గుజ్జుపరిశ్రమ యజమానులు మామిడిని కొనుగోలు చేయడం లేదన్నారు. కిలో రెండు రూపాయలకు ధర పడిపోయిందన్నారు. దీంతో దిక్కుతోచని స్ధితిలో కొట్టు మిట్టాడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మామిడి టన్ను రూ.25 వేలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మామిడి టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలికిందని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. రైతు భరోసా కేందాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించి ఆదుకుందని పేర్కొన్నారు. బాబు మోసాలను ఎండగట్టాలి సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అందించలేదని ఆరోపించారు. మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు అల్లాడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ అనే నినాదంతో ప్రతి గ్రామానికి నాయకులు, కార్యకర్తలు వెళ్లి బాబు మోసాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయరెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్రెడ్డి, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల పార్టీ కన్వీనర్లు రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మాజీ కన్వీనర్లు సోమశేఖర్, ప్రతాప్రెడ్డి, జయచంద్రారెడ్డి, రాజారత్నం రెడ్డి, జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి గోహతిసుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, వడ్డెర, ఈడిగ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు మొగిలీశ్వర్, ఎల్లప్ప, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు దత్తా త్రేయరెడ్డి, జిల్లా పార్టీ నాయకులు ప్రకాష్రెడ్డి, గోవిందరాజులు, శరత్రెడ్డి, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు కిషోర్రెడ్డి, ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ సింహారెడ్డి, పలువురు మండల పార్టీ అనుబంధ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలమనేరులో మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి‘వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూస్తే సీఎం చంద్రబాబుకు వణుకుపుడుతోంది. అందుకే ఆయన పర్యటనలకు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా మా నాయకుడు జిల్లాకు వచ్చి తీరడం ఖాయం. హెలీప్యాడ్కు కూడా అనుమతివ్వడం లేదు. అందుకనే బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళెం చేరుకుంటారు. మామిడి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తారు..’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖలో ఇద్దరికి ఉద్యోగోన్నతులు చిత్తూరు కలెక్టరేట్ : విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ మేరకు డీఈఓ వరలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చిత్తూరు డీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రెడ్డిశేఖర్కు సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగోన్నతి కల్పించారు. ఆయనకు అన్నమయ్య జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎంఆర్సీలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న వనజకు ఉద్యోగోన్నతి కల్పించి తిరుపతి పాఠ్యపుస్తకాల గోడౌన్ లో పోస్టింగ్ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒంటరి ఏనుగు బీభత్సం గంగవరం: మండలంలోని కీలపట్ల పంచాయతీ, గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి పంట పొలాలపై ఒంటరి ఏనుగు దాడికి తెగబడింది. గ్రామానికి చెందిన రైతు అమ్ములు వ్యవసాయ పొలంలో టమాట పంటతో పాటు వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేసింది. ఏనుగుల కట్టడికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బీసీ వసతి గృహం అభివృద్ధికి చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీబాషా తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సంజయ్గాంధీ నగర్లో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో సీఎస్ఆర్ నిధులతో పలు ఉపకరణాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆక్వా కల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో రూ.12.80 లక్షలు సంజయ్ గాంధీ నగర్ బీసీ వసతి గృహం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీసీ వసతి గృహంలో ఓవర్ హెడ్ ట్యాంక్లు, ఆర్వో వాటర్ ప్లాంట్లు, ప్లంబింగ్ పనులు, వంటగది ఉపకరణాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆక్వా కల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్లాంట్ జనరల్ మేనేజర్ సకరన్ సనజాక్, ఇతర సిబ్బంది గోపీనాథ్, అక్రమ్, మాధవరావు, ఏబీసీడబ్ల్యూవో వాసంతి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పర్హానబేగం, కోటేశ్వరరావు, ఉమాదేవి, కరుణ తదితరులు పాల్గొన్నారు. నాకు న్యాయం చెయ్యండి నగరి : సహకార సంఘంలో రుణం తీసుకొని తిరిగి చెల్లించినా తనకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఎస్.వేలు శనివారం నగరి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్కు స్పందనలో ఇచ్చిన అర్జీ మేరకు విచారణ అధికారిగా ఉన్న నగరి పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి కేవీఆర్ కుమార్కు వినతిపత్రం అందించడానికి విచ్చేసిన ఆయన తన ఆవేదనను మీడియాకు వెల్లడించారు. కోసలనగరం సింగిల్ విండో సొసైటీ బ్యాంక్లో రుణం తీసుకుని దానిని పూర్తిగా చెల్లించినా.. బ్యాంకు ఇన్చార్జి సీఈవో తనకు నోడ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. 5,098 కేసుల పరిష్కారంచిత్తూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 5,098 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం నిర్వహించిన అదాలత్లో సివిల్ కేసులు 271, క్రిమినల్ 4687, ప్రిలిటిగేషన్ 140 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కోర్టుల వారీగా చూస్తే చిత్తూరులో 1,472, తిరుపతి 2,242, మదనపల్లి 44 , పీలేరు 72, శ్రీకాళహస్తి 268, పుత్తూరు 34, పుంగనూరు 69, పలమనేరు 235, కుప్పం 67, పాకాల 132, నగరి 109, సత్యవేడు 217, వాయల్పాడు 41, తంబళ్లపల్లిలో 96 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. – భగ్గుమంటున్న యూటీఎఫ్ నేతలు చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ఈనెల 10వ తేదీన చేపట్టబోయే మెగా పీటీఎం సమావేశాలను పరిశీలించేందుకు విట్నెస్ (పరిశీలన) అధికారులెందుకని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్నాయుడు, మణిగండన్ ప్రశ్నించారు. ఈ మేరకు పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆ సంఘ నాయకులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాఠశాలల్లో ఈనెల 10వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో విట్నెస్ అధికారిని నియమించడం అవమానకరంగా ఉందన్నారు. ఆ అధికారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులే నియమించుకుని వారిచేత వీడియోలు తీయించి అప్లోడ్ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారని, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని వింత నిర్ణయాలు ఇప్పుడెందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. టీచర్లను అవమానించేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం భావ్యం కాదన్నారు. ఇది పీటీఎం కాదు డాక్యుమెంట్ కార్యక్రమం కూటమి ప్రభుత్వం పీటీఎం కార్యక్రమాన్ని డాక్యుమెంట్ కార్యక్రమంగా మార్చడం సరికాదని ఆ సంఘ నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల విద్యాభివృద్ధి అంశం పై చర్చించే కార్యక్రమంగా మార్చాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమైన నెల రోజుల్లోపే యోగా పేరుతో వారం రోజులు, పీటీఎం పేరుతో మరో వారం రోజులు బోధన సమయాన్ని హరిస్తున్నారని విమర్శించారు. టీచర్లను బోధనకు పరిమితం చేయకుండా, బోధనేతర కార్యక్రమాల పేరుతో ఒత్తిడికి గురి చేయడం ఏ మాత్రం సరికాదన్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్ బంగారుపాళెం రావడం ఖాయం మామిడి రైతులకు అండగా నిలవడం తప్పా? హెలీప్యాడ్కు కూడా అనుమతివ్వకుండా ఆంక్షలా? మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఇలా.. ఈనెల 9న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు, ముళబాగిళు, ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా ఎంపీపీల సంఘ అధ్యక్షుడు మొగసాల రెడ్డెప్ప, వైఎఎస్సార్సీపీ పలమనేరు పట్టణ కన్వీనర్ హేమంత్కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్డీ మురళీకృష్ణ, చెంగారెడ్డి, దయానంద్గౌడ, నియోజకవర్గ కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ అనుభంద విభాగాల నాయకులు పాల్గొన్నారు. నేడు రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి, టమాట వంటి పంటలు పండించిన రైతులు ధరలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని వాపోయారు. సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం రాక అవస్థలు పడుతున్నట్టు వెల్లడించారు. మామిడికి వెన్నుదన్ను మామిడి రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది వైఎస్సార్సీపీనేనని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్రాజా స్వగృహంలో నియోజకవర్గ ముఖ్యనాయకులతో ఆయన సమావేశమయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 9వ తేదీన మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డుకు విచ్చేయనున్నట్టు తెలిపారు. తర్వాత మామిడి రైతుల కష్ట సుఖాలను తెలుసుకుని వారికి మద్దతుగా నిలిచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. హెలీప్యాడ్కు అనుమతులివ్వడం లేదు ప్రతిపక్ష నేతగా మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటకు హెలీప్యాడ్కు సైతం అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఏపీలో భారత రాజ్యాంగంకాకుండా రెడ్బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. అసలు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికై నా వస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఎందుకు అంతలా వణికిపోతోందే అర్థం కావడం లేదన్నారు. మొన్నటి దాకా తోతాపురి మామిడికి ధరలేక రైతులు కాయలు అమ్ముకోలేక తోపుల్లో వదిలేస్తున్నా పట్టించుకోని సీఎం చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్రెడ్డి వస్తున్నాడని తెలిసి మామిడిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే జగన్మోహన్రెడ్డి వస్తేగానీ రైతుల కష్టం ఈ ప్రభూత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వివిధ హోదాల్లో ప్రకటించిన పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన ఆరుగురికి అవకాశం కల్పిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షులుగా పుంగనూరుకు చెందిన పుష్పావతి, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీగా తిరుపతికి చెందిన కేతంరెడ్డి మురళీరెడ్డి, రాష్ట్ర సెక్రటరీలుగా గంగాధర్ నెల్లూరుకు చెందిన వి.సుందర్ రాజు, సత్యవేడుకు చెందిన జేబీ.మునిరత్నం (జేబీఆర్), తిరుపతికి చెందిన తిరుమల రెడ్డి, భరత్ రెడ్డిను నియమించారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన నలుగురిని ప్రకటిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో చిత్తూరు జిల్లా నుంచి పలమనేరుకు చెందిన జి.ప్రహ్లాద, ఆర్.చెంగారెడ్డి, ఎస్డీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తికి చెందిన షేక్ సిరాజ్బాషా ఉన్నారు. కూసాలు ధ్వంసం పులిచెర్ల(కల్లూరు): మండలంలోని చల్లావారిపల్లె సమీపంలో శనివారం తెల్లవారు జామున ఏనుగుల గుంపు డా.చంద్రబాబు మామిడి తోపులో, తోపు చుట్టూ ఉన్న 48 ముళ్ల కూసాలను ధ్వంసం చేశాయి. అలాగే చుట్టు పక్కల ఉన్న వరి పంటను తొక్కి నాశనం చేశాయి. సాహిత్య పురస్కారాలకు ఎంపిక చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరానికి చెందిన సంధ్యా శర్మ రాసిన సంధ్యా సమీరాలు(కవిత్వం) కవితా సంపుటి విశాలాక్షి సాహిత్య పురస్కారాలకు ఎంపికై ంది. పలు కవితా సంపుటి ఆమె పలు పురస్కారాలకు పంపారు. ఈ క్రమంలో సంధ్యా సమీరాలు అనే సంపుటి విశాలాక్షిని మెప్పించింది. నెల్లూరు జిల్లాలో ఈనెల 20వ తేదీన జరిగే కార్యక్రమంలో పురస్కారం అందుకోనున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య పుత్తూరు: పట్టణ పరిధిలోని మరాఠి రైల్వే గేట్ సమీపంలో శనివారం ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేణిగుంట రైల్వే ఎస్ఐ రవి కథనం మేరకు.. నాగలాపురం మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన కె.దేశయ్య కుమారుడు డి.శరత్(30) డిప్లోమా చేసి చైన్నెలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. పుత్తూరులోని సమీప బంధువుల ఇంటికి 15 రోజుల క్రితం వచ్చిన శరత్ మానసిక వేదనతో బాధపడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు. -
పకడ్బందీగా మెగా పీటీఎం 2.0
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన నిర్వహించే మెగా పీటీఎం 2.0 (పేరెంట్స్ టీచర్స్ మీటింగ్)ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆదేశించారు. మెగా పీటీఎం అంశంపై శనివారం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మెగా పీటీఎం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,492 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ సమావేశం నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశాల్లో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న 2,54,310 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన మెగా పీటీఎం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మధ్యాహ్న భోజనం విద్యార్థిమిత్ర కిట్లు, విద్యార్థుల సామర్థ్యాల పురోగతి, విద్యార్థుల నమోదు, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. గుర్తింపు లేని పాఠశాలలపై ప్రత్యేక ఫోకస్ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు అమలు చేయని పాఠశాలల పై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల కచ్చితంగా ప్రభుత్వ అనుమతి పొందాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల లిఖిత పూర్వక సమ్మతితోనే విలీన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 492 పాఠశాలలను సర్దుబాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాలో కొత్తగా టీచర్లు నియమితులవుతారని చెప్పారు. తల్లికి వందనం పథకంలో నమోదైన అర్జీలను నిర్ణీత గడువు లోపు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఐ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఇటీవల ఆయా యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలిచ్చామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొన్నారు. -
హామీలకు లేదు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ
● హామీలు అమలు చేయని మొనగాళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ● మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజం ● రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ కార్వేటినగరం: అధికారం చేతికి వచ్చాక ఇచ్చిన మాట మర్చిపోయిన మొనగాళ్లు చంద్రబాబు, పవన్కళ్యాణ్ఽ అని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. శుక్రవారం కొల్లాగుంట చెక్పోస్టు సమీపంలోని వెట్రివేల్ కల్యాణ మండపంలో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, ఎంపీపీ లతాబాలాజీ, మండల కన్వీనర్ శేఖర్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో క్యూర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పిల్లనిచ్చిన సొంత మామ ఎస్టీఆర్ను వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలను మోసం చేయడం లెక్కలేదన్నారు. అబద్ధాలు, మోశాలు, వెన్నుపోటు వంటివి బాబుకు వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. కూటమి ఎమ్మెల్యేలు అడవులు, గుట్టలను తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదేనా బాబు దృష్టిలో సంపద సృష్టించడం అని చురకలు అంటించారు. నెల రోజులకు పైగా మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక, పండించిన పంటను తరలించ లేక తల్లడిల్లి పోతుంటే ఏమీ ఎరుగనట్లు బాబు మొహం చాటేయడం దారుణమన్నారు. పేదల ఓట్ల కోసం పంపిణీ చేసిన కూపన్లకు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ రూ.5 వేలు చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. దండుకున్నది చాలక ఎమ్మెల్యేలు మామిడి గుజ్జు పరిశ్రమలనే కాకుండా రైతులు తరలించే మామిడిలోనూ కమీషన్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు సీఎం కుర్చీ కోసం కూటమిగా ఏర్పడి సూపర్సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను వెన్ను పోటు పొడిచాడని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. అధికార దాహంతో 143 హామీలు గుప్పించి ఏడాది పాలనలో కేవలం రెండు పథకాలను అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. నూతన కార్యవర్గానికి ఘన సన్మానం ఈ క్రమంలో భాగంగా నూతనంగా నియామకాలు చేపట్టిన వెంకటేష్, మోహనకుమారి, ఆకులగోపి, గాంధీ, మురళీకృష్ణారెడ్డి, మురగయ్య, శ్రీనివాసులురెడ్డి, అన్నివర్గాల అధ్యక్షులను రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, ఎంపీపీ లతాబాలాజీ, మండల పార్టీ కన్వీనర్ శేఖర్రాజు చేతుల మీదుగా శాలువలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడి గురవారెడ్డి, నియోజవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధికారెడ్డి, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు ప్రకాష్, రాధిక, సుగుణమ్మ, నియోజకవర్గ యువజ విభాగం అధ్యక్షుడు కిషోర్రెడ్డి, వైస్ ఎంపీపీ కార్తిక్రెడ్డి, కో–ఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్రెడ్డి, మురగయ్య, లోకనాథరెడ్డి, ధనంజయవర్మ, మునికృష్ణ, నందగోపాల్, లడ్డు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ‘ఓఆర్ఎం’ ప్రారంభం
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరులోని ఎస్పీఎం (ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం)లో నూతన ఓఆర్ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్)ను ఎట్టకేలకు శుక్రవారం ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ప్రారంభించారు. పాత మిషన్ రోజూ 200 లీటర్ల నూనెను శుద్ధి చేస్తుంది. కొత్త మిషన్ 2వేల లీటర్లను సిద్ధం చేస్తుంది. రాయలసీమలోనే మొదటి ఓఆర్ఎంను ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ మిషన్ ఏర్పాటుకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. నెలల తరబడి మిషన్ను అమర్చకుండా తాత్సారం చేశారు. అయితే సాక్షి పత్రికలో పలుమార్లు దీనిపై కథనాలు రావడంతో అధికారులు స్పందించి మిషన్ను ఇన్స్టాల్ చేశారు. అయితే ఈ మిషన్ను ప్రారంభించినప్పటికీ నిర్వహణ, పర్యవేక్షణకు టెక్నీషియన్ను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
మన్యం వీరుడు అల్లూరి
చిత్తూరు కలెక్టరేట్ : బ్రిటీష్ పాలకులపై సాయుధ పోరాటం చేసిన అసమాన పరాక్రమశాలి అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ కొనియాడారు. ఈ మేరకు కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటీష్ పాలకులపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జన్మించిన జిల్లాలో తాను జన్మించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. డీఆర్వో మోహన్కుమార్, ఏవో వాసుదేవన్, సీపీవో శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీబాషా పాల్గొన్నారు. అల్లూరికి ఘన నివాళి చిత్తూరు అర్బన్: మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు పోలీసుశాఖలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చిత్తూరు ఎస్పీ మణికంఠ అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల హక్కులను కాపాడడం, న్యాయాన్ని నిలబెట్టడం, నిబంధనలు అమలు చేయడంలో పోలీసుశాఖకు అల్లూరు ఆదర్శమన్నారు. ఏఎస్పీలు రాజశేఖరరాజు, శివానంద కిషోర్, డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్బాషా పాల్గొన్నారు. -
నకిలీ లాటరీ టికెట్లు
పుంగనూరులో నకిలీ లాటరీ టికెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. కొందరు ధనార్జనే ధ్యేయంగా చెలరేగిపోతున్నారు. జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం తిరుపతి మంగళం : మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 9వ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి విచ్చేయనున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ మర్యాదపూర్వకంగా భూమనను కలిశారు. అనంతరం మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న వైఎస్.జగన్మోహన్రెడ్డి కార్యక్రమంపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూమన సూచించారు. పోస్టర్ల ఆవిష్కరణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంట దెబ్బతింటే ఈ పథకం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తారన్నారు. నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. చిత్తూరు జిల్లాలో వరికి రూ.42 వేలు, రాగికి రూ.17 వేలు, కందులకు రూ.20 వేలు ఒక ఎకరానికి బీమా సౌకర్యం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు క్లస్టర్ మేనేజర్ సాగర్ 9059634144 నంబర్లో సంప్రదించాలన్నారు. డివిజనల్ కో ఆర్డినేటర్ పెద్దన్న పాల్గొన్నారు. – 8లో -
మానవత్వం పరిమళించి..స్థానికంగా విస్మరించి!
పలమనేరు: చావు బతుకుల్లో ఉన్న పసిప్రాణాలను కాపాడుకోవాలని ఏ తల్లిదండ్రులకై నా ఉంటుంది. దీనికోసం వారు పడని కష్టాలుండవు. ఇందుకోసం మానవత్వమున్న వారెవరైనా సాయం చేస్తుంటారు. కానీ ఓ ప్రజాప్రతినిధి ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడగా మరో ప్రజాప్రతినిధి ఓ పాప ప్రాణం పోయేందుకు కారణమైన వేర్వేరు ఘటనలు ఇటీవల పలమనేరు నియోజకవర్గంలో చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఘటనలపై బాధితుల ఆవేదన సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.పసివాడి ప్రాణం ఇలా నిలబెట్టారుపలమనేరు పట్టణానికి చెందిన గజ్జల దీపునాయుడు, జగదీష్ దంపతుల కుమారుడికి పుట్టుకతోనే కాలేయ సమస్య ఉంది. బాబుకు ఆపరేషన్కు రూ.20లక్షల దాకా ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు. బిడ్డకు ఆపరేషన్ చేయించే ఆర్థిక స్థోమత వారికి లేదు. పలు స్వచ్ఛంద సంస్థలు, వారికి తెలిసిన వారి ద్వారా పసివాడి ప్రాణాలను కాపాడుకునేందుకు ఆరు నెలలుగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరుకే చెందిన ఓ టీడీపీ కార్యకర్త వీరి గోడు విని సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందుంతుందని ధైర్యం చెప్పారు. వెంటనే పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిసేందుకు వారి కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. అక్కడున్న పీఏతో వారు గోడు వెల్లబోసుకున్నారు. కానీ ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆ కార్యకర్త మదనపల్లిలోని తన సోదరి ద్వారా ఇంతియాజ్ అనే వ్యక్తి సాయంతో అక్కడి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిశారు. పిల్లాడి పరిస్థితి విన్న ఆయన వెంటనే స్పందించి లెటర్ ఇచ్చి మంత్రి లోకేష్ ద్వారా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.15 లక్షలను మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ పసివాడు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఆ ఆస్పత్రి నుంచి పసివాడి కోసం పోరాడిన టీడీపీ మహిళా కార్యకర్త సోషల్మీడియా ద్వారా విడుడల చేసిన వీడియో వైరల్గా మారింది. మన ఎమ్మెల్యే చేయలేని పని పక్క జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే చేశారే అని ఆ పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు.మరో పాప విషయంలో ఏమి జరిగిందంటే...బైరెడ్డిపల్లి మండలం, తీర్థం పంచాయతీ, కై గల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు జనసేన కార్యకర్త. ఇతనికి ముగ్గురు పిల్లలు. రెండో కుమార్తె సౌమ్యకు పచ్చకామెర్లు ముదిరి లివర్ దెబ్బతింది. బాలికను పరిశీలించిన డాక్టర్లు లివర్ మార్పిడి చేయాలని ఇందుకోసం రూ.30 లక్షల దాకా ఖర్చవుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సాయం పొందే అవకాశం ఉందని కొందరు చెప్పారు. నియోజకవర్గ జనసేన నాయకుని ద్వారా స్థానిక ఎమ్మెల్యే లెటర్ కోసం పలుద ఫాలు ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో కుప్పానికి చెందిన వారి బంధువైన మండల స్థాయి నేత ద్వారా ఇక్కడి ఎమ్మెల్యే సిఫారస్తు లెటర్ కోసం ప్రయత్నించారు. ఓ రోజు ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారని తెలిసి శ్రీనివాసులే స్థానిక పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేతో మాట్లాడి లెటర్పై సంతకం చేస్తుండగానే లోకల్ లీడర్లు ఏమి చెప్పారోగానీ సంతకం పెట్టలేదు. ఇదేంటంటే మీ మండలంలోని నాయకులు కాకుండా కుప్పం వాళ్లు రెకమెండేషన్ ఏంటని అభ్యతరం చెప్పినట్టు తెలిసింది. ఏమీ చేయలేక ఆ జనసేన కార్యకర్త వచ్చేశాడు. గతనెల 24న ఆ పాప మృతి చెందింది. దీనిపై కడుపు మండి ఆ తండ్రి తనకు జరిగిన అన్యాయాన్ని తన బిడ్డను కాపాడుకోలేకపోయాననే బాధను సోషల్ మీడియాలో వ్యక్తం చేశాడు. ఇలా ఈ రెండు ఘటనల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
20 ఏళ్ల జైలు
చిత్తూరు లీగల్ : మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో రామకృష్ణ (65) అనే నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. 2020 జూలై 21న తొమ్మిదేళ్ల వయస్సున్న బాలికపై లైంగికదాడి జరిగిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమల మండలం, చింతలవారిపల్లెకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తికి పెళ్లయ్యి పిల్లలున్నారు. ఇతను మద్యానికి బానిసయ్యి.. గ్రామంలో జులాయిగా తిరుగుతుండడంతో భార్య, పిల్లలు ఇతడిని వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఓ మైనర్ బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి, ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడని అభియోగాలు మోపిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.శంకరరావు తీర్పునిచ్చారు. లీగల్ సెల్ సూపరింటెండెంట్పై క్రమశిక్షణా చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని లీగల్ సెల్ సూపరింటెండెంట్ షబ్బీర్బాషాపై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఆయనపై ఉన్న అభియోగాలకు సంబంధించి శుక్రవారం జీవో 688,689,690 లను ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టరేట్లో లీగల్ సెల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న షబ్బీర్బాషా అలియాస్ షబ్బాబాషా 2023లో జిల్లాలోని శ్రీరంగరాజపురం తహసీల్దార్గా పనిచేసేవారు. ఆయన 2023 మార్చి 21న ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించి ప్రెజెంటింగ్ ఆఫీసర్గా ఎల్.వెంకటనాయుడు (ఏసీబీ ఇన్స్పెక్టర్)ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏసీబీ కేసులో పట్టుబడ్డ షబ్బీర్ బాషాపై చార్జెస్ నమోదు చేయడంతో 10 రోజుల్లోపు లిఖిత పూర్వకంగా వివరణ సమర్పించాలని సూచించారు. నకిలీ టోకెన్ల కలకలం కార్వేటినగరం: ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీలో నకిలీ టోకెన్లు కలకలం రేపిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఓ హార్టికల్చర్ అధికారి ఏకంగా నకిలీ టోకెన్ల బుక్, ఫ్యాక్టరీ అధికారి సీలు తయారు చేశాడు. పోర్జరీ సంతకాలతో రైతులకు టోకెన్లు ఇచ్చి అటు రైతులను, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మోసగించాడు. వివరాలు.. మండల పరిధిలోని డీఎం పురం సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంటు వెంకటేష్ను ప్రభుత్వం మామిడి రైతులకు అందించే ప్రోత్సాహ సొమ్ము రూ.4ను నమోదు చేయడానికి ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద విధులు కేటాయించింది. దురాశతో పుత్తూరులో ఓ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ టోకెన్లు, ఫ్యాక్టరీ అధికారి సీలు తయారీ చేయించాడు. ఆపై ఒక్కో టోకెన్ను రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు రైతులకు విక్రయించాడు. ఇలా మొత్తం 34 నకిలీ టోకెన్లను పోలీసులు గుర్తిం సీజ్ చేశారు. ఇంతకీ ఎమిజరిగిందంటే నకిలీ టోకెన్ల వల్ల యాజమాన్యం ఇచ్చిన టోకెన్ల కన్నా అధికంగా వాహనాలు రావడంతో పాటు, టోకెన్ల వరుస నంబర్లలో తేడా రావడంతో యాజమాన్యం నిఘా ఉంచింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ హనుమంతప్ప రంగప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది. హార్టికల్చర్ అధికారి వెంకటేష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకాలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. రాహుకాల సమయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంప్రదాయరీతిలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆషాఢమాసపు తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలతో విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ఈవో ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
● ఛిన్నాభిన్నమవుతున్న మధ్యతరగతి కుటుంబాలు ● అమాయకులు, కూలీలకు ఎరవేస్తున్న దళారీలు ● రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం ● చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
పుంగనూరు(చౌడేపల్లె): పుంగనూరు పట్టణానికి చెందిన కొందరు సులభంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా నకిలీ లాటరీ టికెట్ల విక్రయాలను ఎంచుకున్నారు. ఏజెంట్లను నియమించుకుని గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కో టికెట్ రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయిస్తూ రోజూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రధానంగా లాటరీ విక్రయాలు ప్రజలు గుమికూడే టీ దుకాణాలు, పూల అంగళ్లు, ఆటోస్టాండ్, కారు పార్కింగ్, ఆర్టీసీ బస్టాండ్, ప్రైవేటు బస్టాండ్, నానాసాబ్పేట, మార్కెట్ యార్డు, తూర్పుమొగసాల, నగిరిప్యాలెస్ తదితర ప్రదేశాలను చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. పుంగనూరు పట్టణంలోకి కూలి పనులకు వచ్చే వారు, సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు. వారికి ఆశలు కల్పించి టికెట్లను అంటగడుతున్నారు. అసలు లాటరీ టికెట్లతో పోలిన డూప్లికేట్ టికెట్లు తయారు చేసుకుని అమాయకుల జేబులను ఖాళీ చేస్తున్నారు. తెల్లారి నుంచి సాయంత్రం 6 వరకు కష్టపడి సంపాదించిన కూలీ సొమ్ము ఖర్చయిపోతోంది తప్ప లాటరీ తగిలింది లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. లాటరీ టికెట్ల విక్రయాలను నిరోధించాల్సిన పోలీసులు చూసీచూడనట్లు ఉదాసీనంగా వ్యహరించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విక్రయదారుల నుంచి రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుని ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటాం పుంగనూరు పట్టణంలో నకిలీ లాటరీ టికెట్ల విక్రయాల విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా లాటరీలను నమ్ముకుని డబ్బును పోగొట్టుకోవద్దని సూచించారు. టికెట్ల విక్రేతల నుంచి మామూళ్లు తీసుకనే విషయం తనకు తెలియదని, ఇంతకు మునుపు ఏదైనా జరిగివుంటే తనకు సంబంధంలేదు. –సీఐ సుబ్బరాయుడు, పుంగనూరు -
డ్రైవర్ ఆత్మహత్య
బంగారుపాళెం: కుటుంబ కలహా ల కారణంగా డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం బంగారుపాళెం మండలంలో చోటుచేసుకుంది. సీఐ కథనం.. యాదమరి మండలం, సీఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన చాకల మునిరత్నం కుమారుడు చాకల దామోదరం(49) కోళ్ల వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నడు. మద్యానికి బానిస కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించా రు. మనస్తాపానికి గురైన దామోదరం బంగారుపాళెం సమీపంలోని కొత్తపల్లె రోడ్డు వద్ద కోళ్ల వాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మూడు నెలల్లో రూ.38.15 కోట్ల ఆదాయం చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ పరంగా ఆదాయం మూడు నెలల్లో రూ.38.15 కోట్లు వచ్చిందని జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా ఆదాయ లక్ష్యం రూ.218 కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఇప్పటి వరకు రూ.38.15 కోట్లు వచ్చిందన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మొత్తం రూ.50.17 కోట్లు లక్ష్యంగా కాగా అందులో రూ.38.15 కోట్లు ఆర్జించినట్టు వెల్లడించారు. ఇందులో బంగారుపాళ్యం రూ.2.05 కోట్లు, కుప్పం రూ.5.55 కోట్లు, పలమనేరు రూ.8.12 కోట్లు, పుంగనూరు రూ.4.40 కోట్లు, కార్వేటినగరం రూ.1.34 కోట్లు, నగరి రూ.3.24 కోట్లు, చిత్తూరు ఆర్వో రూ.9.67 కోట్లు, చిత్తూరు రూరల్ రూ.3.74 కోట్లు వచ్చిందన్నారు. గతంలో నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్స్ వివరాలు ఆన్లైన్లో నమోదయ్యేవి కావని, ప్రస్తుతం ఈ సమస్యను ఐజీ కార్యాలయం పరిష్కరించిందని చెప్పారు. -
బాలిక మృతితో అప్రమత్తం
చంద్రగిరి : ఇందిరమ్మ కాలనీ సమీపంలోని బాలిక (16) విష జ్వరంతో బుధవారం మృతి చెందడంపై గురువారం వైద్యాధికారులు స్పందించారు. ఇందిరమ్మ కాలనీలో గురువా రం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి స్థానికుల కు రక్త పరీక్షలు నిర్వహించారు. ఇంటింటికీ ఫీవర్ సర్వేను చేపట్టారు. అదే విధంగా ప్రతి ఇంటి వద్ద యాంటి లార్వా కార్యక్రమాన్ని చే పట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఇందిరమ్మ కాలనీలో ఎవరికి ఎలాంటి జ్వరాలు లేవని వైద్యాధికారులు నిర్ధారించారన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని కాచి, చలార్చి తాగాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, దోమ తెరలను వినియోగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ల భిస్తుందని, వేడి ఆహారం, మంచి పోషక వి లువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సెల్వియా, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రూప కుమార్, పీహెచ్సీ వైద్యాధికారి ణి ప్రియాంక, శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
మెటీరియల్ సైన్స్ అనుసంధానంతో మార్పు
– తిరుపతి ఐఐటీలో ప్రారంభమైన 3వ అంతర్జాతీయ సమావేశం ఏర్పేడు : మెటీరియల్ సైన్స్ అను సంధానంతో నిర్మాణ రంగంలో సుస్థిర మార్పు చోటు చేసుకుంటుందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని లెక్చరర్ హాల్లో గురువారం ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణ సామగ్రి– నిర్మాణ రంగం–2025పై 3వ అంతర్జాతీయ సమావేశం ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని నిర్మాణ రంగంలో సాంకేతిక మేళ వింపుపై ప్రసంగించారు. వర్జీనియా టెక్ (యుఎస్ఎ), క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్ (యుకె), మోనాష్ యూనివర్సిటీ మలేషియా, ఐఐటీ బాంబే, ఎన్ఐటీ కాలికట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జాతీయ మౌలిక సదుపాయాల సవాళ్లను పరిష్కరించడంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం కీలక పాత్రను పోషిస్తోందన్నారు. డాక్టర్ బిజిలీ బాలకృష్ణన్, డాక్టర్ అలెగ్జాండర్ బ్రాండ్, డాక్టర్ నారాయణన్ నీతలత్, డాక్టర్ వెంకటేష్ కోడూర్, డాక్టర్ మైక్ ష్లైచ్, డాక్టర్ కె.వి.ఎల్. సుబ్రమణ్యం వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణుల ప్రసంగిస్తూ నిర్మాణ శాస్త్రం పురోగతిని గురించి వివరించారు. సమావేశంలో ఐఐటీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ సురేష్జైన్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అందని పాఠ్య పుస్తకాలు
● టీటీడీ పాఠశాలల్లోనూ విద్యార్థుల అవస్థలు ● పుస్తకాలు లేక నామమాత్రంగా విద్యాబోధన తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని టీటీడీ పాఠశాలలు జూన్ 12వ తేదీన పునఃప్రారంభమయ్యాయి. అయితే ఎయిడెడ్ మినహాయించి అన్ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు నేటి వరకు పాఠ్యపుస్తకాలను అందించలేదు. దీంతో విద్యార్థులకు నామమాత్రంగా విద్యాబోధన అందుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ టీటీడీ విద్యాశాఖ స్పందించకపోవడం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన టీటీడీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించడం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి సన్నిధిలో ఉన్నట్టుగా భావిస్తుంటారు. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకోవడం పూర్వజన్మ సుకృతమని సంతోష పడుతుంటారు. ఈ భావనతోనే తమ పిల్లలను టీటీడీ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతుంటారు. దీంతో టీటీడీ పాఠశాలల్లో ప్రవేశాలకు డిమాండ్ నెలకొంది. తిరుపతిలో టీటీడీకి సంబంధించి 7 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2,600 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో మూడు పాఠశాలలు (హైస్కూల్) మాత్రమే ప్రభుత్వ గుర్తింపు (ఎయిడెడ్) కలిగి ఉన్నాయి. ఈ హైస్కూళ్లకు ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్లు అందాయి. మిగిలిన నాలుగు ఉన్నత పాఠశాలలు, వాటిలోనే ఉన్న 7ప్రాథమిక పాఠశాలలకు పుస్తకాలు నేటికీ అందలేదు. దీంతో ఇక్కడ చదివే విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం టీటీడీ పాఠశాలలన్నింటికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా సరఫరా చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎయిడెడ్కు మాత్రమే పాఠ్యపుస్తకాలు అందించి చేతులు దులుపుకుంది. ఇటు కూటమి ప్రభుత్వం, అటు టీటీడీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం ఏమిటో అర్థం కాలేదని తల్లిదండ్రులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. వెంటనే టీటీడీ యాజమాన్యం స్పందించి పాఠ్యపుస్తకాలను అందించాలని కోరుతున్నారు. ఎయిడెడ్కు అందించాం నిబంధనల మేరకు ప్రభుత్వ గుర్తింపు కలిగి న టీటీడీ ఉన్నత పాఠశాలలకు పాఠశాల తె రిచే నాటికే పాఠ్యపుస్తకాలను అందించాం. అన్ఎయిడెడ్ పాఠశాలలకు టీటీడీ యాజమాన్యమే పాఠ్యపుస్తకాలను అందించాల్సి ఉంది. –కేవీఎన్.కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ), తిరుపతి త్వరలోనే అందిస్తాం టీటీడీ పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుందని అనుకున్నాం. అయి తే పాఠ్యపుస్తకాలను టీటీడీ కొనుగోలు చేసి పిల్లలకు అందించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడంలో జాప్యం నెలకొంది. త్వరలోనే అందిస్తాం. – వెంకట సునీల్, టీటీడీ విద్యాశాఖాధికారి, తిరుపతి -
సిద్ధమవుతున్న ఓఆర్ఎం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్పీఎం (ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం)లో నూతన ఓఆర్ఎం(ఆయిల్ రీజనరేషన్ మిషన్) ఇన్స్టాలేషన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత ప్రభుత్వంలో రూ.50 లక్షల వ్యయంతో 2వేల లీటర్ల ట్రాన్స్ఫార్మర్ల ఆయిల్ను శుద్ధి చేసే మిషన్ను రేణిగుంటకు కేటాయించారు. అక్కడ ఎస్పీఎం మరమ్మతు పనులు జరుగుతుండడంతో వాటిని జిల్లాకు కేటాయించారు. రాయలసీమలోనే చిత్తూరులో మొదటి మిషన్ను పెట్టారు. కానీ దాదాపు 8 నెలలుగా ఇన్స్టాల్ చేయకుండా కాలయాపన చేశారు. వీటిని ఇన్స్టాల్ చేస్తే రైతుల ట్రాన్స్ఫార్మర్లను సకాలంలో బాగుచేసి పంపవచ్చు. కానీ ఎస్పీఎంలో నిరుయోగంగా వదిలివేయడంతో గతంలో ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఎట్టకేలకు స్పందించిన అధికారులు టెక్నీషియన్లను పిలిపించి ఇన్స్టాలేషన్ పనులు చేపట్టారు. పనులను టెక్నికల్ ఈఈ జగదీష్, ఎస్పీఎం డీఈ రవి, ఏఈ మోహన్శెట్టి పర్యవేక్షించారు. త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఉరి వేసుకుని మహిళ మృతి పుంగనూరు(చౌడేపల్లె): మనస్తాపంతో ఓ మహిళ ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. సీఐ కథనం.. మండలంలోని పట్రపల్లెలో నివాసం ఉన్న శ్రీనివాసులు భార్య సరస్వతి(35) కుమార్తె ప్రేమలో పడి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైంది. సరస్వతి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. సమ్మెకు తాత్కాలిక బ్రేక్ రిలే దీక్షలు కొనసాగించనున్న స్విమ్స్ కార్మికులు తిరుపతి తుడా : విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టిన స్విమ్స్ కార్మికుల దెబ్బకు అధికారులు దిగొచ్చారు. కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి గురువారం స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, ఏఎస్పీ మనోహరాచారి, ఆర్డీఓ రామ్మోహన్ చేరుకుని కార్మికుల డిమాండ్లు న్యాయ పరమైనవేనని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరవధిక సమ్మెను కార్మికులు తాత్కాలికంగా విరమించుకుని రిలే నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. అత్తపై అల్లుడి దాడి – అత్తకు తీవ్ర గాయాలు నాయుడుపేటటౌన్ : అల్లుడు మరో మహిళతో వివాహేతర సంబంధం గురించి అత్త ప్రశ్నించిదనే కోపంతో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నాయుడుపేట పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. అగ్రహారపేటకు చెందిన మహేశ్వరి, ఆమె కుమార్తె మునికుమారిని తాళ్లురు రవీంద్రనాథ్కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే రవీంద్రనాథ్ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని అల్లుడిని అత్త నిలదీసింది. దీంతో అత్తపై కోపంతో బుధవారం రాత్రి అగ్రహారపేటలో అత్త మహేశ్వరి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను తిరుపతి వైద్యశాలకు తరలించారు. బాధితురాలి భర్త మునీంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాబి తెలిపారు. -
పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపం
● సంక్షేమ వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ● నాసిరకం వంటకాలే కారణమా? ● ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ●రేణిగుంట బీసీ హాస్టల్లో శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు ప్రభుత్వ వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకమైన వంటలు, అపరిశుభ్రమైన పరిసరాలు, పర్యవేక్షణ లేని అధికారుల తీరుతో వసతి గృహాల నిర్వహణ గాడితప్పింది. ప్రశ్నించే వారు లేరనే నిర్లక్ష్యంతో కొంత మంది నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి విద్యార్థులను అర్ధాకలికి గురిచేస్తూ క్షోభ పెడుతున్నారు. వండిపెట్టే ఆహారం కూడా తరచూ కలుషితం కావడంతో విద్యార్థులు ఆస్పతుల పాలవుతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. వసతిగృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి జగనన్న పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి కరికులం అందించి వారి ఉన్నతికి బాటలు వేసేలా విప్లవాత్మకమైన పథకాలను విద్యారంగంలో అమలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తోంది. హాస్టళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకమైన భోజనం అందిస్తున్నారు. సరుకులు నాణ్యత లేకుండా సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారు. దీంతోనే మొన్న సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి అనిత బీసీ హాస్టల్లో విద్యార్థులతోపాటు తినేందుకు కూర్చుంటే ఆమెకు పెట్టిన ఆహారంలోనే బొద్దింక కనిపించడం రాష్ట్రమంతా చూశారు. ఇక్కడ వరుసగా హాస్టళ్లలో విద్యార్థులు విషాహారం తిని ఆస్పత్రులపాలవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా పరిస్థితిని చక్కదిద్దాలి. – బియ్యపు మధుసూదన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి హాస్టళ్లలో సిబ్బంది నిర్లక్ష్యమే హాస్టళ్లలో తరచూ విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతుండడం దురదృష్టకరం. చాలా హాస్టళ్లలో వంట సిబ్బంది కొరత ఉంది. ఉన్నచోట వారు రాకుండా సహాయకులను పెట్టుకుని జీతాలు తీసుకుంటున్నారు. దీంతోనే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. శ్రీకాళహస్తిలో హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘటనలపై పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు సరైన మౌలిక వసతులను కల్పించాలి. – చంద్రశేఖర్, ప్రగతి సంస్థ మండల కోఆర్డినేటర్, శ్రీకాళహస్తి ఏర్పేడు :‘‘ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న పేద విద్యార్థుల ఆరోగ్యం గాల్లో దీపంగా మారింది. విద్యార్థులు తినే ఆహారంలో నాసిరకమైన వంట సరుకులు వాడుతుండ టంతో పాటు అపరిశుభ్రమైన పరిసరాలతో తరచూ విద్యార్థు లు విషాహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతు న్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సంక్షేమ వసతి గృహాధికారులు పేద పిల్లలపై సవతి తల్లి ప్రేమ చూపు తూ వారికి ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగుతున్నారన్న విమర్శలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయి.’’ శ్రీకాళహస్తి పట్టణంలో గతనెల 24వ తేదీన బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పులిసిన ఇడ్లీ పెట్టడంతో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా గురువారం శ్రీకాళహస్తి బీసీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఉదయం పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షం కావడంతో ముగ్గురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో 8 హాస్టళ్లు ఉన్నాయి. రెండు గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 2 వేల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి పలు హాస్టళ్లకు వెళ్లి దత్తత తీసుకుని బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ జరగని అభివృద్ధి చేస్తామని, హాస్టళ్లలో చదువుతున్న పేద విద్యార్థులకు అధునాతన హంగులతో కూడిన వసతులను అందించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ ఉంటుందని డబ్బాలు కొట్టుకున్నారు. అయితే ఒకటి, రెండు హాస్టళ్ల గోడలకు సున్నం కొట్టించి అభివృద్ధి ప్రారంభమైందని సోషల్ మీడియాలో ఆర్బాటంగా ప్రచారం చేశారు. పర్యవేక్షణ లోపించి.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసుకునే వార్డెన్ల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడంలేదు. హాస్టల్ , వంట గది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి తోడు మెనూ ప్రకారం సక్రమంగా అమలు చేయకుండా కొందరు వార్డెన్లు విద్యార్థుల మెతుకుల్లో కక్కుర్తి చూపుతూ విద్యార్థులను తరచూ అర్దాకలికి గురి చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏడాది కిందట రేణిగుంట బీసీ హాస్టల్లో విద్యార్థులకు ప్రైవేటు ఫంక్షన్లో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పెట్టడంతో వాంతులు, విరేచనాలతో ఆప్పట్లో 20 మంది విద్యార్థులు ఆస్పత్రికి చేరారు. విద్యార్థులు తాగే నీటి తొట్లు పాచిపట్టి ఉన్నట్లు గుర్తించి అప్పట్లో ఉన్నతాధికారులు వార్డెన్ నిర్లక్ష్యంపై తీవ్రంగా మందలించారు. ఎప్పుడైన ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు మినహా మిగిలిన సమయాల్లో ఉన్నతాధికారులు హాస్టళ్ల పనితీరుపై తనిఖీలు చేయకపోవడంతో విద్యార్థులు సమస్యల లోగిళ్లలో చదువు బండి లాగుతున్నారు.వార్డెన్ సస్పెన్షన్ – ఇన్ఛార్జిగా విజయ శ్రీకాళహస్తి : బీసీ హాస్టల్ వార్డెన్ శ్రీలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థానంలో ఇన్ఛార్జిగా విజయను నియమించారు. వంటమనిషి అంకమ్మను విధులు నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. -
ఘనంగా ఐసీఎస్ఐ స్నాతకోత్సవం
తిరుపతి సిటీ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) స్నాతకోత్సం పద్మావతి మహిళా వర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలో కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పట్టాలను అతిథులు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కంపెనీ కార్యదర్శులుగా బహుముఖ పాత్రలు పోషించి దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఆర్థిక స్థితిని మదింపు చేసే కీలక బాధ్యతలు చేపట్టే ప్రధానమైన కోర్సును పూర్తి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ ఉపాధ్యక్షులు పవన్ జి చందక్, కౌన్సిల్ సభ్యుడు సీఎస్ మోహన్ కుమార్, సీఎస్ వెంకటరమణ, ఐసీఎస్ఐ ఎస్ఐఆర్సి చైర్మన్ సీఎస్ మధుసూధనన్, ప్రీతి కౌశిక్ బెనర్జీ పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు భద్రతా చర్యలు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలపై ఎస్పీ హర్షవర్దన్రాజు తనిఖీలు చేపట్టారు. గురువారం సాయంత్రం తిరుమల పోలీసు సిబ్బందితో కలిసి ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ లేపాక్షి ఏరియా బాలాజీనగర్, కల్యాణకట్ట, అఖిలాండం, పీఏస్–1, సీఆర్వో కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో ఏరియా డామినేషన్ నిర్వహించారు. స్థానిక బాలాజీనగర్లో బాంబ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా తనిఖీలు జరిపారు. కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ డీఎస్పీ విజయ్ శేఖర్, సీఐలు విజయ్ కుమార్, శ్రీరాముడు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఆటో బోల్తా..: వృద్ధుడి మృతి గూడూరు రూరల్ : ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని విందూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు విందూరు ఎస్టీ కాలనీకి చెందిన చిల్లకూరు చెంచయ్య(69) సైదాపురం మండలం జోగిపల్లిలో పీర్ల ఉత్సవానికి మేళం వాయించేందుకు మరో నలుగురితో కలసి ఆటోలో బయలుదేరాడు. గ్రామ సమీపంలోని చర్చి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చెంచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని గూడూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. తపాలా బీమా ఏజెంట్ల ఉద్యోగాలకు అవకాశం తిరుపతి సిటీ : తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సంస్థలో ఏజెంట్లుగా పనిచేసేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తిరుపతి డివిజన్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని తెలియజేశారు. ఎంపికై న ఏజెంట్లకు ఆకర్షణీయమైన ఆర్థిక భరోసాతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫీసులో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు డె వలప్మెంట్ ఆఫీసర్ రంజిత్ కుమార్ను 93907 36277 నంబర్ నందు సంప్రదించాలని సూచించారు. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు తిరుపతి ఎడ్యుకేషన్ : జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల గడువును జులై నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2,323 మంది, ఒక ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 364 మంది ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఇది వరకు జూన్ 30వ తేదీ వరకున్న అడ్మిషన్ల గడువును పొడిగించారని, ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఐఓ కోరారు. ఐఐహెచ్టీ స్పాట్ అడ్మిషన్లు వెంకటగిరి రూరల్:పట్టణంలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమో కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ఓఎస్డీ గిరిధర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పదో తరగతిలో మార్కుల ప్రాతిపదికన సీట్లు కల్పించనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు 98661 69908, 90102 43054 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
రేషన్ బియ్యం పట్టివేత
– 20 టన్నుల బియ్యం స్వాధీనం నాయుడుపేటటౌన్ : అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని గురువారం నాయుడుపేట అర్బన్ సీఐ బాబి సిబ్బందితో తనిఖీ చేపట్టి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. శ్రీకాళహస్తి నుంచి లారీలో అక్రమంగా రేషన్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ బాబి , సిబ్బందితో పట్టణ పరిధిలోిని జాతీయ రహదారి కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బియ్యం బస్తాల లోడుతో వస్తున్న లారీని నిలిపి పరిశీలన చేశారు. లారీలో రేషన్ బియ్యం బస్తాలు ఉండడాన్ని సీఐ గుర్తించి బియ్యంతో పాటు లారీను స్వాధీనం చేసుకున్నారు. సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ వేనాటి గజేంద్రను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అలాగే దిలీప్రెడ్డి అనే వ్యక్తి రేషన్ బియ్యం తరలింపులో ప్రధాన సూత్రదారిగా గుర్తించినట్లు సీఐ తెలిపారు. పోలీసులు పట్టుకున్న బియ్యం లారీలో రేషన్ బియ్యం ప్రభుత్వం సరఫరా చేసే బస్తాలలోనే ఉండడంతో వాటిని రేషన్ షాపులు, లేదా నేరుగా గోదాముల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్తో పాటు దిలీప్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పట్టుకున్న 400 బస్తాల (20 టన్నులు) రేషన్ బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారులకు అప్పగించడంతో వాటిని స్థానిక సివిల్ సప్లయి గోదాములో భద్రపరిచారు. -
విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : విభిన్నప్రతిభావంతుల శ్రేయస్సు, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రి రాందాస్ అతవాలే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టాన్ని 27 డిసెంబర్ 2016లో అమలు చేసినట్టు వెల్లడించారు. ఈ చట్టంలో వైకల్య వర్గాలను 7 నుంచి 12కి పెంచామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 3 నుంచి 4 శాతానికి పెంచినట్టు పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు 3 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,314 ప్రభుత్వ భవనాలను దివ్యాంగుల కోసం సుగమ్య అభియాన్ పథకంలో నిర్మించినట్టు వెల్లడించారు. ఈ భవనాలకు రూ.563.85 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. మొత్తం 35 అంతర్జాతీయ, 55 దేశీయ విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకొచిన్నట్లు వివరించారు. 709 రైల్వే స్టేషన్లు, 8,695 బస్సులు, 637 వెబ్సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 8.34 లక్షల పాఠశాలల్లో ర్యాంప్లు, హ్యాండ్రైల్లు అందుబాటులో ఉండే మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలో యాక్సెసిబుల్ ఇండియా ప్రచారం ఆంధ్రప్రదేశ్లో యాక్సెసిబుల్ ఇండియా ప్రచారంలో 38 భవనాలకు రూ.29.60 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విద్యా సాధికారత దిశగా స్కాలర్ షిప్ పథకంలో 2.81 లక్షల మంది దివ్యాంగ విద్యార్థులకు రూ.921.50 కోట్లను మంజూరు చేశామన్నారు. స్కాలర్షిప్ నగదును నేరుగా అర్హులైన విద్యార్థుల ఖాతాలకు జమచేస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని 7093 మంది దివ్యాంగులకు రూ.45.25 కోట్ల స్కాలర్షిప్లు అందజేశామన్నారు. డీడీఎస్ పథకంలో 3.84 లక్షల మంది లబ్ధిదారులకు రూ.951.77 కోట్లకు పైగా ప్రయోజనం పొందారన్నారు. ఏపీలో రూ.193.92 కోట్లతో 60,488 మంది దివ్యాంగులకు ప్రయోజనం కలిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో ఏడీపీ, ఆర్వీవై పథకాల్లో నిర్వహించిన పరీక్ష శిబిరాల నుంచి మొత్తం 3,505 మంది లబ్ధిదారులను గుర్తించారన్నారు. వారందరికీ రూ.4.69 కోట్ల విలువైన 8,916 ఉపకరణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్వో మోహన్కుమార్, ఏఎస్పీ రాజశేఖర్రాజు, డీఎస్పీ సాయినాథ్, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్, బీజేపీ నాయకులు చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, దివ్యాంగుల సంఘం నాయకులు మురళి పాల్గొన్నారు. ఉపకరణాల పంపిణీలో కేంద్ర మంత్రి రాందాస్ అతవాలే -
నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి
● బోన్ క్యాన్సర్తో పోరాడుతున్న షాహిద్ ● చిన్న వయసులోనే పెను విపత్తు ● దాతల చేయూత కోసం తల్లిదండ్రుల వేడుకోలు చౌడేపల్లె: ‘నాకు ఇద్దరు పిల్లలు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కార్పెంటర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇటీవల వెలువడిన పదోతరగతి ఫలితాల్లో నా కుమారుడు షాహిద్(16) 472 మార్కులు సాధించాడు. గత ఏడాది డిసెంబర్లో ఇంటి వద్ద పిల్లలతో కలిసి కబడ్డీ ఆడుతూ జారిపడ్డాడు. కుడి చెయ్యికి గాయమైంది. నొప్పి అధికం కావడంతో పుంగనూరు, మదనపల్లె, తిరుపతిలో చూపించాను. అయినా తగ్గలేదు. నొప్పి ఎక్కువ కావడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరులోని కొలంబియా ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. బోన్ క్యాన్సర్ ఉందని తేల్చారు. ఇప్పటికే అప్పూసప్పు చేసి రూ.3 లక్షలకు పైగా ఖర్చుచేశాను. ఇంకా రూ.5 లక్షలకు పైగా అవసరమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంత స్థోమత లేక.. ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడిపోతున్నాను. బిడ్డను చూస్తే కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు. కడుపు తర్కుపోతోంది. గుండె భారంగా మారుతోంది. బిడ్డను బతికించుకోవాలనే ఆరాటంతో కాళ్లూచేతులూ ఆడడం లేదు. దైవసమానులైన దాతలు ముందుకొచ్చి నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నాను’ అని చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లె రోడ్డు, జగనన్న కాలనీకి చెందిన షాజహాన్, నౌహీరా కోరుతున్నారు. చేతులు కలపండి..ప్రాణం పోయండి షాజహాన్ (కెనరా బ్యాంకు) 31872200068371 సీఎన్ఆర్బి0013187)కు, పోన్పే 9705508805కు సహాయం చేయాలని కోరారు. -
మామిడి..
అనారోగ్య‘వసతి’ తిరుపతి జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు అధ్వానంగా మారాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సిద్ధమవుతున్న ఓఆర్ఎం చిత్తూరు జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్పీఎం లో నూతన ఓఆర్ఎం ఇన్స్టాలేషన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ను పరిశీలిస్తున్న వైఎస్సార్సీపీ నేతలుతిరుపతి మంగళం: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీ నగర్లోని పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా లెక్కచేయకుండా ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి వస్తున్న జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మారానని చెప్పి .. ధర పెంచకుండా మారాం చేస్తున్నారు! ఆర్కే.రోజా మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకై క నాయకుడు జగనన్న అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పొగాకు, మిర్చి, మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు తాను మారానని చెప్పి అధికారంలోకి వచ్చాక కుక్కతోకర వంకర లాగా బుద్ధి చూపుతారన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో మామిడి రైతులకు అండగా ఉండేందుకు జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్నప్పుడే చంద్రబాబుకు రైతుల కష్టాలు గుర్తొస్తాయా? అని ప్రశ్నించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏడాదిలో ఏదో పొడిచేసినట్లు కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈవీఎం మాయాజాలంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందే తప్ప ప్రజల మద్దతుతో కాదన్నారు. ఈనెల 9వ తేదీన కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా జగనన్న పర్యటనను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే.రోజా, ఎమ్మెల్సీలు భరత్, సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్రెడ్డి, వెంకటేగౌడ్, సునీల్కుమార్, లలితకుమారి, నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్రెడ్డి, నూకతోట రాజేష్, కృపాలక్ష్మి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.– 8లో– 8లో– 8లోన్యూస్రీల్నష్టాల్లో మామిడి రైతు మద్దతు ధర లేక రోడ్డు పాలుచేస్తున్న అన్నదాతలు వారికి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్ 9న బంగారుపాళ్యానికి రాక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి, భూమన పిలుపు ఏ ప్రాంతానికెళ్లినా జన సునామీనే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా అనూహ్యమైన జన స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగనన్న వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో మామిడి రైతులు మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు సొంత జిల్లాలో మామిడిని పండించే రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పక్కన పారబోస్తున్నారని చెప్పారు. ఇలాంటి కష్టాలు ఎల్లో మీడియాకు కనిపించవా? అని ప్రశ్నించారు. జగనన్న పాలనలోనే రైతు సంక్షేమమని గుర్తుచేశారు. ‘చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు రోడ్డున పడ్డారు. గిట్టుబాటు ధర కల్పించకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటికందకుండా రోడ్డుపాలు చేస్తున్నారు. ఇల్లూవాకిలి వదిలి పంటనెత్తుకుని జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద.. ర్యాంప్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా సీఎం చంద్రబాబుకు కనిపించడం లేదు. గిట్టుబాటు ధర కల్పించి మామిడి రైతును ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగుతున్నారు. చెట్లు నరికివేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. మామిడి రైతుకు అండగా నిలిచేందుకు నేనున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ముందుకొస్తున్నారు. ఈనెల 9న బంగారుపాళ్యానికి విచ్చేయనున్నారు. ఆయన పర్యటనను కలసి కట్టుగా విజయవంతం చేయాలి’ అని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
మొహర్రం సెలవుపై స్పష్టత ఇవ్వండి
చిత్తూరు కలెక్టరేట్ : మొహర్రం సెలవుపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన ముస్లింల పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ సెలవు ప్రకటించిందన్నారు. అయితే పాఠశాలలకు ఆప్షనల్ సెలవులు వాడుకోవచ్చా లేదా అనే సందిగ్ధం నెలకొందన్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తుంటే ఎలాంటి స్పందన లేదన్నారు. గత వారంలో రథయాత్రకు సైతం సెలవు ప్రకటించి చివరి నిమిషంలో రద్దు చేసి విధులు నిర్వహించాలన్నారు. ముందుగానే ఆప్షనల్ సెలవు పై నిర్ణయం ప్రకటించాలని కోరారు. గిరిజన భవనం ఏర్పాటు చేయండి చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో గిరిజన భవనం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి, ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత శాఖా మంత్రి రాందాస్ అతవాలేకు వినతి పత్రం అందజేశారు. మంత్రితో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలో గిరిజన భవనం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ స్థలం కేటాయించి నూతన భవనం నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. మా బియ్యం ఎక్కడ? – రేషన్ షాపు ఎదుట కార్డుదారుల నిరసన పాలసముద్రం : మండలంలోని రాచపాల్యం 10వ నంబర్ రేషన్ షాపు వద్ద కార్డుదారులు నిరసన వ్యక్తం చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ రేషన్ షాపు పరిధిలో ఎస్బీఆర్ పురం, రాచపాళ్యం, మణిపురం గ్రామాలకు చెందిన 320 రేషన్ కార్డుదారులు ఉన్నారు. గ్రామానికి కిలో మీటర్ల దూరంలోని పాలసముద్రం రైతు సేవా కేంద్రంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ బియ్యం పంపిణీ చేశారు. ఆపై సుమారు 30 మందికిపైగా కార్డులకు బియ్యం పంపిణీ చేయలేదు. దీంతో కార్డుదారులు తమకు రావాల్సిన బియ్యం ఎక్కడ..? అంటూ రేషన్షాపు డీలర్ను నిలదీశారు. ఆపై షాపు ఎదుటే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తమకు బియ్యం పంపిణీ చేసేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. 6న బ్రహ్మోత్సవాలపై ఉభయదారుల సమావేశం కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఈనెల 6వ తేదీన ఉభయదారులతో సమావేశం జరగనున్నట్లు ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకంలోని శ్రీమణికంఠేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మధ్యాహ్నం 2గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఉభయదారులు పాల్గొన్నాలని ఆయన కోరారు. తోతాపురి.. వద్దులే మరి! యాదమరి: తోతాపురి రైతులు ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధరలేక నానాఅగచాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో తోతాపురిని వదిలించుకునేందుకు సిద్ధపడుతున్నారు. తోటల్లోని తోతాపురి చెట్లను తెగనరికి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి ఘటనే యాదమరి మండలంలో చోటు చేసుకుంది. మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య ఐదెకరాల్లో మామిడి పంటను సాగు చేశాడు. పదేళ్లపాటు కన్నబిడ్డల్లా పెంచాడు. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన తోతాపురికి గిట్టుబాటు ధర వచ్చి తమకు రక్షణగా ఉంటుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. గుజ్జు పరిశ్రమలు సిండికేట్గా మారి ధరలు తగ్గించేయడం.. దళారులు చెప్పిందే వేదంగా ఉండడంతో విసుగు చెందారు. ఎందుకొచ్చిన తంటలే అనుకుని తనకున్న ఐదెకరాల మామిడి తోటలో దాదాపు రెండు వందల తోతాపురి చెట్ల కొమ్మలను నరికేశాడు. ప్రత్యామ్నాయంగా దాని స్థానంలో వేరే రకాలను అంటు కట్టేందుకు సిద్ధపడ్డాడు. ఈ ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
కూటమి కక్ష..మామిడి రైతుకు శిక్ష!
● గిట్టుబాటుగాని మామిడి చెట్లను తొలగిస్తున్న రైతులు ● చెట్లు తొలగించినందుకు జరిమానా తప్పదంటున్న అటవీశాఖ ● కూటమి నేతల ఒత్తిడితోనే ఇలా చేయిస్తున్నారని అనుమానం! సాక్షి టాస్క్ఫోర్స్: మామిడి రైతుపై కొందరు కూటమి నేతలు కక్షగట్టారు. మామిడి చెట్ల నరికివేతను సాకుచూపి వేధింపులకు గురిచేస్తున్నారు. అటవీశాఖ అధికారుల ద్వారా రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. వివరాలు.. చిత్తూరు మండలం, తుమ్మింద గ్రామానికి చెందిన మామిడి రైతు కుమార్ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు. మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో తన భూమిలో పనస నాటుకోవాలని నిర్ణయించాడు. దీంతో బుధవారం కొన్ని మామిడి చెట్లను తొలగించారు. దీనిని సాకుగా చూపించి కొందరు కూటమి నేతలు అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ రైతుపై కేసు లేదా జరిమానా విధించేలా చర్యలు చేపట్టాలని హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో రంగలోకి దిగిన అటవీశాఖ అధికారులు పంటను పరిశీలించారు. ఆ తర్వాత రైతును కార్యాలయానికి పిలిపించి వాల్టా చట్టం ప్రకారం జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. మళ్లీ శుక్రవారం కార్యాలయానికి రావాలని పంపిం చేశారు. ఇలా రైతును వేధించడంతో పాటు కార్యాలయానికి తిప్పించుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. కూటమి నేతలు కక్ష పూరితంగానే ఇలా చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రైతు సంఘ నేతలు, వివిధ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రైతులపై ఇలా ఆంక్షలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. చట్టంలో కూడా మామిడి పంటకు వెసులుబాటు ఉందని, ఇంత వరకు మామిడి రైతు చెట్టు నరికాడని కేసులు, జరిమానాలు విధించిన ఘటనలు లేవని పలువురు న్యాయవాదులు సైతం వివరిస్తున్నారు. -
తోతా‘పూర్’
కాణిపాకం : ప్రస్తుతం జిల్లాలో మామిడి రైతులు కుదేలవుతున్నారు. ధరాఘాతంతో డీలా పడిపోయారు. తోతాపురి రకంను కొనేవారు లేక విలవిలలాడిపోతున్నారు. టేబుల్ రకాలు సైతం మామిడి రైతులకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఈసారి మామిడి ఫలం రైతుకు చేదును మిగిల్చాయి. తద్వారా మామిడిపై రైతులు ఆశలు వదులుకుంటున్నారు. గత ఐదేళ్లల్లో సిరులు గత ఐదేళ్ల కాలంలో మామిడి రైతులకు సిరులు కురిపించింది. టేబుల్ రకాలు...జేబులు నింపాయి. ఈరకం కేజీ రూ. 20 నుంచి సెంచరీ(రూ.100) కొట్టాయి. అదే తోతాపురి రూ. 10 నుంచి రూ.75వరకు పలికింది. దీంతో పండిన కాయలను రైతులు కోత కోసి చిత్తూరు, బంగారుపాళ్యం, దామలచెరువు మార్కెట్, ఫ్యాక్టరీలకు విక్రయించుకునేవారు. రోజుల తరబడి క్యూలో వేచి ఉండే పరిస్థితిలు ఉండేవి కావు. కాయలు అన్లోడింగ్ అయినా వెంటనే అప్పటికప్పుడే చేతికి డబ్బులు ముట్టేవి. ముఖ్యంగా టేబుల్ రకాలను చాలా మంది రైతులు బెంగుళూరు, చైన్నె వంటి ప్రాంతాలకు నేరుగా విక్రయించుకునేవారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని తద్వారా వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా కొనుగోలు దారులకు కాయలను పంపేవారు. ఇలాంటి బుకింగ్ల ద్వారా రైతులు అధిక లాభాలను గడించేవారు. అలాగే తోతాపురి కాయలు మంచి లాభాలను గడించి పెట్టాయి. ఐదేళ్ల కాలం పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మామిడి రైతులను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ప్రత్యామ్నాయం కోసం చెట్లు నరికేస్తూ.. మామిడి ఆశించిన మేర ప్రతిఫలం ఇవ్వకపోవడంతో పాటు అమ్మకపు పోరు పడలేక రైతులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ప్రధానంగా తోతాపురి పంటను నేలమట్టం చేస్తున్నారు. చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో మామిడి చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. అలాగే తవణంపల్లి మండలంలోని మామిడి చెట్లను ఇది వరకే నరికివేశారు. యాదమరి మండలం దాసరపల్లి గ్రామంలో ఓ రైతు తోతాపురి చెట్లను తలొగించి టేబుల్ రకం కాయలను అంటుకట్టేందుకు ముందడుగు వేశారు. మరింత మంది రైతులు కూడా మామిడి చెట్లను నరికివేసేందుకు సమాయత్తమయ్యారు. కొబ్బరి చెట్లు పెట్టాలనే యోచనలో ఉన్నారు. మామిడి.. కష్టాలు..కన్నీళ్లు మార్కెట్లో అమ్ముడుపోని తోతాపురి కాయలు రైతులకు చేదును మిగుల్చుతున్న వైనం ఫలరాజుపై ఆశలు వదలుకుంటున్న రైతులు మామిడి చెట్ల నరికివేతలు.. ప్రత్యామ్నాయం వైపు చూపులు నేడు కుదేలు ఈ ఏడాది మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దిగుబడిని చూసి...సంబర పడిపోయినా రైతులను ధరలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో వారి ఆశలు ఆడియాశలయ్యాయి. టేబుల్ రకాలు ప్రతి ఫలం ఇవ్వకపోగా..తోతాపురి చేదును నింపింది. రైతులు తోతాపురికాయల అమ్మకానికి అష్ట కష్టాలు పడుతున్నారు. టోకెన్ పద్ధతితో తికమకపడిపోతున్నారు. ఫ్యాక్టరీలు కాయలు తీసుకొచ్చాక మద్ధతు ధర మాయమైంది. ఫ్యాక్టరీలు కేజీ తోతాపురి రూ.8 పాట పాడి...తర్వాత రూ.6, రూ.5. రూ.4 అంటూ..చివరకు నోరెత్తకుండా చేసింది. ర్యాంపుల్లో రూ.2కే అమ్ముడుబోతుంది. అది కూడా క్యూ పద్ధతిలో కాయలు అమ్ముకుంటున్నారు. ఐదురోజులు అయినా అన్లోడింగ్ కానీ పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ధరలపై ఫ్యాక్టరీలు స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర అమలు విషయంలో నోరెత్తకపోవడంతో రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి మామిడి ధర వివరాలు మామిడి రకం ధరలు (రూ.లల్లో) తోతాపురి 2–8 బేనీషా 9–15 కాదర్ 15–30 పులేరా 4–15 కాలేపాడు 15–25 నీలం 10–15 మార్కెటింగ్ శాఖ అధికారుల వివరాల మేరకు గత ఐదేళ్లుగా మామిడి ధరల వివరాలు.(రూ.కేజీలల్లో) సంవత్సరం బేనీషా పులేరా తోతాపురి కాలేపాడు నీలం కాదర్ 2019–20 35 9–12 17–20 24 21 20–40 2020–21 45 17–25 22–25 35 33 22–35 2021 –22 16 –35 12–20 12–55 35–40 12 57–60 2022–23 35–40 12–15 24–75 30–35 25 27–30 కష్టాలు.. నష్టాలే మిగిలాయి.. మామిడి తోటను ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడాం. కొన్నేళ్లుగా మంచి ఫలితం ఉండేది. లాభాలొచ్చాయి. తోతాపురి కేజీ రూ.75వరకు అమ్ముకున్నాం. ఈసారి కష్టాలు..నష్టాలు అనుభవించాం. చాలు ఈ పంట అని వదిలించుకుంటున్నాం. అందుకే ఎకరాలో మామిడి తోటలో పంటను తొలగించాం. ప్రత్యామ్నాయంగా పంట వేయాలని అనుకుంటున్నాం. – కుమార్, తుమ్మింద, చిత్తూరు మండలం పెట్టుబడి రాలేదు.. ఏటా పెట్టుబడి వేలల్లో పెట్టి అలసిపోతున్నాం. ఈసారి పెట్టుబడి చూస్తే రూ.60 వేలు దాటింది. దిగుబడి బాగనే వచ్చిన..పెట్టుబడికి తగట్టు ఆదాయం ఉండాలి. అప్పుడే రైతు కోలుకుంటాడు. ఆ రకంగా రైతుకు ఫలితం లేదు. తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నష్టాలను గుర్తించాలి. రైతును ఆదుకోవాలి. లేకుంటే ప్రత్యామ్నాయం తప్ప వేరేమార్గం లేదు. – కొత్తూరు బాబు నాయుడు, రైతు నాయకుడు, చిత్తూరు మండలం -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
శ్రీరంగరాజపురం : మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట దీపిక కళ్యాణ మండపంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ స్థాయిలో రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఇన్చార్జి కృపాలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి మండలానికి చెందిన దివాకర్, శ్రీను, మదన్కుమార్, వెదురుకుప్పం మండలం నుంచి ధనరాజ్ వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ఏడాదికే కూటమి పాలన అరాచకం, దౌర్జన్యం తట్టుకోలేక టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి రావడం శుభ పరిణామమన్నారు. రానున్న రోజుల్లో మరింత చేరికలు ఉంటాయన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్ మణి, మాజీ కన్వీనర్ అనంతరెడ్డి, జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయబాబు, కుప్పయ్య, సర్పంచ్ డిల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు కోటిరెడ్డిబాబు, నాయకులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చౌడేపల్లె : పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం కాటిపేరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాటిపేరికు చెందిన సుబ్రమణ్యం(45) కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్థాపం చెంది పురుగుమందు తాగి అపస్మారకస్థితిలో వెళ్లగా కుటుంబ సభ్యులు గుర్తించి 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి పుంగనూరు(చౌడేపల్లె) : పట్టణంలోని అంబేడ్కర్ భవనం సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు బుధవారం స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వివరాలపై ఆరా తీశారు. మృతుడు బిక్షాటన చేసుకుంటూ అంబేడ్కర్ సర్కిల్ వద్ద తలదాచుకునేవాడని తెలిపారు. మృతదేహాన్ని పుంగనూరు ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పుంగనూరు పోలీసులను సంప్రదించాలని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. విచారణ నివేదిక.. తప్పుల తడక చిత్తూరు రూరల్ (కాణిపాకం) : తన కుమార్తె శ్రీదుర్గ మృతి విషయంలో విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ నాయకులు షణ్ముగం ఆరోపించారు. చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన కుమార్తె శ్రీదుర్గ రోడ్డు ప్రమాదానికి గురై జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తే.. సరైన చికిత్స అందక మృతి చెందిందని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానని ఆయన పేర్కొన్నారు. -
కోడె దూడల ఉత్పత్తి
తవణంపల్లె : జిల్లాలో అత్యధిక జన్యు సామర్థ్యం కలిగిన విత్తనపు కోడె దూడలను ఉత్పత్తి చేస్తున్నట్లు జిల్లా పశు సంతతి పరిశీలన కేంద్రం డీడీ డాక్టర్ వాసు తెలిపారు. బుధవారం తవణంపల్లె, గుడిపాల, పెనుమూరు మండలాల్లోని అత్యధిక జన్యు సామర్థ్యం కలిగిన 10 కోడె దూడలను సేకరించి నకరేకల్ వీర్య కేంద్రానికి పంపినట్లు తెలిపారు. పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి మరింత చేయూత ఇస్తున్నట్లు వివరించారు. పాల దిగుబడి పెంచే లక్ష్యంగా ఆరోగ్యకరమైన, ధృఢమైన సంకరజాతి పశుసంపదను ఉత్పత్తి చేయడంలో జిల్లా పశు సంతతి పరిశీలన కేంద్రం ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. డీడీతో పాటు వెటర్నరీ డాక్టర్ రామయోగానందారెడ్డి, డాక్టర్ మౌనిక, సూపర్వైజర్ శివకుమార్ పాల్గొన్నారు. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,126 మంది స్వామివారిని దర్శించుకోగా 24,720 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
– తాళం వేసిన ఇళ్లే టార్గెట్ నగరి : తాళం వేసి ఉన్న ఇల్లు, ఆఫీసుల్లో చొరబడి చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ ధరన్సాయి (35)ను నగరి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విక్రమ కథనం మేరకు గత నెల 8వ తేదీన కొండచుట్టు మండపం ఏరియాలో లాయర్ లోకేష్ ఆఫీసులో అర్ధరాత్రి, గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి లక్ష రూపాయల నగదు, రెండు మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. ఈ విషయమై లోకేష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. అందిన సమాచారం మేరకు ఓంశక్తి గుడి వద్ద నిఘా పెట్టిన పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ధరన్సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడన్నారు. అతడి వద్ద నుంచి చోరీ చేసిన నగదులో రూ. 75 వేల రూపాయలు, రూ. 40 వేల రూపాయల విలువ చేసే రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. అతడిపై గతంలో తిరుత్తణిలో చోరీ కేసు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ విజయ నాయక్, సిబ్బంది లోకనాథం, గోపి, సత్య, గజేంద్ర, అశోక్, రమేష్ను అభినందించారు. -
ఆర్అండ్బీలో బదిలీలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ఆర్అండ్బీ, నేషనల్ హైవే (ఎన్హెచ్) పరిధిలో పలువురిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్అండ్బీ జిల్లా ఎస్ఈగా సురేష్బాబును నియమించారు. కర్నూలులో ఈఈగా ఉన్న ఆయనను జిల్లా ఇన్చార్జి ఎస్ఈగా నియమించారు. చిత్తూరు ఎన్హెచ్ డీఈ కృష్ణయ్యను అనంతపురం ఎన్హెచ్ సర్కిల్ ఇంచార్జి ఈఈగా బదిలీ చేశారు. సబ్ డివిజన్ డీఈగా ఉన్న సత్యమూర్తిని టెక్కలి ఇన్చార్జి ఆర్అండ్బీ ఈఈగా బదిలీ చేశారు. ఏఈగా ఉన్న సుజాతను ఉద్యోగోన్నతిపై చిత్తూరు ఎన్హెచ్ డీఈగా నియమించారు. విద్యుత్ గ్రీవెన్స్లను వెంటనే పరిష్కరించాలి చిత్తూరు కార్పొరేషన్ : సకాలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. బుధవారం చిత్తూరు అర్బన్ డివిజన్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలో పలు సమస్యలను వినియోగదారులు తెలియజేశారు. బిల్లు రివిజన్ సమస్యను కొత్తపల్లె నుంచి, వాణిజ్య సర్వీసు నుంచి గృహ సర్వీసుకు మార్పు చేయాలని ఓబనపల్లె నుంచి, విద్యుత్ సర్వీసుకు ఉన్న మొబైల్ నంబర్ను మార్పు చేయాలని మురకంబట్టుకు చెందిన వినియోగదారుడు ఫిర్యాదులు చేశారు. వీటిని అప్పటికప్పుడు మార్పు చేసినట్లు ఈఈ తెలిపారు. కార్యక్రమంలో డీఈ ప్రసాద్, టెక్నికల్ ఏఈ మాధురి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని రెండు న్యాయస్థానాలకు ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులోని ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ న్యాయస్థానానికి వీఆర్.రామకృష్ణ, 6వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానానికి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎం.బాలాజీని నియమించింది. మూడేళ్ల పాటు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు. ముగిసిన డీఎస్సీ పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత నెల 6వ తేదీ నుంచి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు బుధవారంతో ముగిశాయ్. చిత్తూరు డీఈఓ వరలక్ష్మి, తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ పరీక్షలను పకడ్బందీగా పర్యవేక్షించారు. చిత్తూరు జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు మొత్తం 33,181 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 30,952 మంది హాజరయ్యారు. మిగిలిన 2,229 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు మొత్తం 21,340 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 19,550 మంది హాజరయ్యారు. మిగిలిన 1,790 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. -
రసాభాసగా తడుకు ప్రజాభిప్రాయ సేకరణ
పుత్తూరు : మండల పరిధిలోని తడుకు సచివాలయం వద్ద బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా ముగిసింది. సర్పంచ్ వెంకటేశు అధ్యక్షతన సభ నిర్వహించారు. పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ మాట్లాడుతూ.. తడుకు రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 182/పి లోని 6 హెక్టార్లు ఆర్.మధుసూదన్రావు రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ వారికి, సర్వే నంబర్ 507/2 లోని 2.520 హెక్టార్లు శ్రీకనకదుర్గ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలకు ఇ–వేలం ద్వారా బిల్డర్లుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందుకు గాను లీజు జారీ చేయడానికి గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి స్థితిగతులు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తడుకు పంచాయతీ ఎంపీటీసీ సుబ్బరత్నమ్మ భర్త గంగాధరం మాట్లాడడానికి ప్రయత్నించగా క్వారీ సిబ్బంది అడ్డుకున్నారు. బలవంతంగా సచివాలయం గదిలోకి తీసుకెళ్లి తాము పరిష్కరిస్తామంటూ గంటకు పైగా నిర్భందించారు. అనంతరం పట్టుబట్టి బయటకు వచ్చిన గంగాధరం ఆర్డీఓ రామ్మోహన్కు వినతిపత్రం అందజేసి, క్వారీలకు అనుమతి ఇవ్వరాదంటూ కోరారు. అలాగే గుంతకల్లు, తాడిపత్రి నుంచి వచ్చిన పర్యావరణ వేత్తల బృందాన్ని సైతం మాట్లాడడానికి సాక్ష్యాత్తు పొల్యూషన్ ఈఈ రాజశేఖర్ అనుమతించలేదని గ్రామస్తులు ఆరోపించారు. పర్యావరణవేత్తల బృందానికి, క్వారీ యజమానుల సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ గందరగోళం మధ్యనే సభను ముగించారు. కార్యక్రమంలో పొల్యూషన్ ఏడీ మధన్మోహన్రెడ్డి, ఏఈ శశికళ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
వైఎస్సార్సీపీ కార్యకర్తల కష్ట సుఖాల్లో తోడుగా అండగా ఉంటామని, కేసులకు భయపడొద్దని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి, ఎమ్మెల్యేలు గుట్టలు, కొండలని తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, అదేనా సంపద సృష్టించడం అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ సామాజిక వర్గంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.1500 చొప్పున ఇస్తానన్న బాబు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం దారుణమని దుయ్యబట్టారు, నవరత్నాలు పథకం ద్వారా జగనన్న సంక్షేమ పథకలూ అందిస్తే చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలను దారుణంగా మోసం చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ జెండా ఎత్తిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. -
నేడు కృత్రిమ పరికరాల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ కళాశాల ప్రాంగణంలో గురువారం ఉదయం 11 గంటలకు 977 మంది విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ పరికరాల పంపిణీ చేయనున్నట్లు బుధవారం డీఆర్వో మోహన్కుమార్ విలేకరులకు తెలిపా రు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాందాస్ అథాలే, జిల్లా ఇంచార్జి మంత్రి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఉద్యోగ మేళాలో 67 మంది ఎంపిక చిత్తూరు కలెక్టరేట్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ కళాశాలలో నిత్యం ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన సుధ డిగ్రీ కళాశాల చైర్మన్ శ్రీధర్ అన్నారు. బుధవారం నగరంలోని సీఎంటీ రోడ్డులోని ఆ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికలకు పేరొందిన కంపెనీలు పాల్గొన్నాయన్నారు. మేళాలో 105 మంది పాల్గొనగా అందులో 67 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. పలు కంపెనీల ప్రతినిధులు, అధ్యాపకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. 5న సచివాలయ ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈనెల 5వ తేదీన బదిలీల ఉత్తర్వులు పంపనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని భావించి 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. నేరుగా ఈ మెయిల్ ద్వారా బదిలీ అయిన సచివాలయ ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు పంపనున్నారు. వివిధ ప్రాంతాలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీ అయినప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగిస్తున్నారు. బదిలీ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని అధికారులు సూచిస్తున్నారు. -
కీరమంద యూపీ స్కూల్ అప్గ్రేడ్
బంగారుపాళెం : మండలంలోని కీరమంద యూపీ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయ్యిందని ఎంఈఓ నాగేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గత నెల పాఠశాల పునఃప్రారంభం నుంచే హైస్కూల్గా మార్పు చేసి తరగతులు బోధించాలంటూ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. కీరమందలో 1961లో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయగా అటు తరువాత 2002లో ప్రాథమికోన్నత పాఠశాల, 2025లో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయ్యిందని తెలిపారు. విద్యార్థులకు ఊరట ప్రాథమికోన్నత విద్య తరువాత 9, 10 తరగతులు చదివేందుకు కొదలమడుగు, కీరమంద గ్రామ పంచాయతీల పరిధిలోని విద్యార్థులు సుమారు 8 కిలో మీటర్ల దూరంలోని ఎగువ రాగిమానుపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గానీ, లేదా టేకుమంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వచ్చేది. బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ఆటోలను ఆశ్రయిస్తూ అష్టకష్టాలు పడేవారు. ప్రస్తుతం కీరమందలోనే యూపీ స్కూల్ అప్గ్రేడ్ కావడంతో విద్యార్థులకు కష్టాలు తప్పాయి. -
సీసీఆర్ఛీ
● కార్డుల జారీలో తీవ్ర జాప్యం ● కౌలు రైతుల కష్టాలు ● జిల్లా వ్యాప్తంగా లక్ష్యం 4,200సీసీఆర్ కార్డులు ● జారీ చేసినవి 594 కార్డులు ● రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం ● కూటమి ప్రభుత్వ తీరుపై కౌలు రైతుల ఆగ్రహం పొలం పనుల్లో కౌలు రైతుగుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రభుత్వం కౌలు రైతుల ను గుర్తించి వెంటనే అందరికీ సీసీఆర్ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. లేని పక్షంలో గతేడాది ఇచ్చిన కార్డులను రెన్యువల్ చేయాలి. వ్యవసాయమే ఆధారంగా బతికే కౌలు రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – రమేష్, కౌలురైతు, నిండ్ర మామిడి సాగులో నష్టపోయాం మామిడి తోటలు కౌలుకు సాగుచేశాం. కాపు కోతకు వచ్చే దశలో గిట్టుబాటు ధర లేదు. ఫ్యాక్టరీల వద్ద టోకెన్లకు తిరిగి తిరిగి కాళ్లరిగిపోతున్నాయి. దీంతో తోటల్లోనే కాయలు అలాగే వదిలేస్తున్నాం. ఇంకా 50 ట్రాక్టర్ల కాయలున్నాయి. టోకెన్లు త్వరగా ఇప్పిస్తే లాభాలు రాకపోయి నా నష్టాలైనా తగ్గించుకుంటాం. బ్యాంకులో రుణాలు పొందడానికి సీసీఆర్ కార్డులు కూడా లేవు. – ధనంజయ రెడ్డి, కౌలు రైతు, కలికిరిండ్ల, కార్వేటినగరం మండలం లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేస్తాం కౌలు రైతులు సీసీఆర్ కా ర్డుల కోసం అభ్యర్థనలు చే శారు. కౌలు రైతుల విషయంలో దీనికి ఎంతో ప్రా ధాన్యం ఉంది. గత ఏడాది అందరికీ కార్డులు అందించాం. ఈ ఏడాది కొందరి కి అందజేశాం. త్వరలో ప్రభుత్వం లక్ష్యం మేరకు కౌలుదారులను రైతు సేవా కేంద్రాల ద్వారా గుర్తించి వారికి సాగు హక్కు పత్రాలైన సీసీఆర్ కార్డులు అందజేస్తాం. – రాఘవేంద్ర యాదవ్, వ్యవసాయ అధికారి, నగరి మండలం నగరి : వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు సంక్షేమం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పంట సాగు రైతులకు అందించే సీసీఆర్ (పంటసాగు హక్కుపత్రం) కార్డుల జారీ నత్తనడకన సాగుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కౌలు రైతులకు ఈ కార్డులతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని అటకెక్కించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకూ ఈ పథకం ఊసేలేదు. ఇక పంటల సాగు చేపట్టే రైతులకు ఇచ్చే సీసీఆర్ కార్డుల జారీలోనూ జాప్యం నెలకొనడంతో కౌలు రైతులు మండిపడుతున్నారు. సీసీఆర్ కార్డుతో ప్రయోజనాలు కౌలు రైతులకు ఈ గుర్తింపు కార్డులు ఉంటేనే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం లభిస్తుంది. ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల జారీకి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుండటంతో కౌలు రైతులంతా సీసీఆర్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సీసీఆర్ కార్డు తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సీసీఆర్ కార్డుల జారీ మాత్రం జిల్లాలో సజావుగా సాగకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.సీసీఆర్ఛీజిల్లా సమాచారం జిల్లాలోని పంచాయతీలు : 697 జిల్లాలోని గ్రామాలు : 822 2024లో ఇచ్చిన సీసీఆర్ కార్డులు : 4200 2025లో నిర్దేశించిన సీసీఆర్ కార్డులు : 4200 ఇప్పటి వరకు ఇచ్చిన కార్డులు : 594 బ్యాంకు రుణాలు అందక జిల్లా వ్యాప్తంగా గతేడాది 4200 సీసీఆర్ కార్డులు జారీ చేయగా, ఈ ఏడాది కూడా 4200 కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు కేవలం 594 కార్డులు మాత్రమే జారీ చే శారు. అంటే రెండున్నర నెలల్లో నిర్దేశించిన లక్ష్యంలో కేవ లం 14 శాతం మాత్రమే సీసీఆర్ కార్డులు జారీ చేయడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గుర్తించిన మేరకు కౌలు రైతులు అందరికీ ఈ సీసీఆర్ కార్డులు జారీ చేయగా ఈ ఏడాది కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో బ్యాంకు రుణాల ఊసే లేదు. దీంతో ఖరీఫ్ పెట్టుబడుల కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. -
కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం
● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు గంగవరం: బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును అదే మార్గంలో వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గంగవరం ఫ్లైఓవర్ పైన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. అర్బన్ సీఐ ప్రసాద్ తెలిపిన వివరాలు.. పలమనేరు పట్టణం, ఆర్కే స్ట్రీట్లో నివాసం ఉంటున్న మస్తాన్(44), గంగవరం మండలం, మేలుమాయి క్రాస్కు చెందిన రితిక(20) ఇద్దురూ కలిసి ద్విచక్ర వాహనంలో బయలుదేరి వెళ్లారు. గంగవరం బైపాస్లో రాంగ్ రూట్లో నిర్లక్ష్యంగా బైక్ను నడుపుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అదే దారిలో బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును అదే మార్గంలో అజాగ్రత్తగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మస్తాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా వెనుక కూర్చున్న యువతికి తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బైక్తో పాటు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కేసు దర్యాప్తులో ఉంది. ఆటో బోల్తా: ఏడుగురికి తీవ్ర గాయాలు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దర్శనానంతరం స్వగ్రామానికి భక్తులతో వెళ్తున్న ఆటో చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని జూనియర్ కళాశాల సమీపంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. సోమల మండలం, నంజంపేటకు చెందిన కొందరు ఆటోలో బోయకొండకు వెళ్లారు. గంగమ్మను దర్శించుకొని ఇంటికి బయలు దేరారు. జూనియర్ కళాశాల సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న అహమ్మద్, విజయ్, రమణ, పాపయ్యతోపాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్లో 12 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 78,730 మంది స్వామివారిని దర్శించుకోగా 28,940 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.30 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
పుంగనూరు(చౌడేపల్లె): న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 18 రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ కార్మికుల నిరసనలకు వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చి సంఘీభావం ప్రకటించింది. మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్మికులతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయకుండా ఆరాచకాలు, అక్రమాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో, గొంతెత్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. సూపర్ –6ను అమలు చేయాల్సిన ప్రభుత్వం ప్రజలను మోసగించిందన్నారు. కార్మిక సంఘ నాయకుడు శ్రీరాములు, కౌన్సిలర్లు సాజిదాబేగం, రేష్మా, వైఎస్సార్సీపీ నాయకులు ఇర్ఫాన్, కొండవీటి నరేష్, ఖాదర్బాషా, రాజేష్, కార్మికులు కుమార్, గోపి, దౌలత్, సంతోష్, శివకుమార్, మోహన్, సోము, వెంకట్రమణ, యూసుఫ్, జావహార్అలి పాల్గొన్నారు. భిక్షాటన అనే పదాన్ని తొలగించారు చిత్తూరు రూరల్ (కాణిపాకం): దాసరుల కుల ధ్రువీకరణ పత్రంలో భిక్షాటన అనే పదాన్ని తొలగించడం స్వాగతించదగ్గ విషయమని దాసరి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రంలో దాసరులకు భిక్షాటన అనే పదాన్ని చేర్చే వారని, ఈ పదం తమ మనో భావాలనులను దెబ్బతీసే విధంగా ఉండేదన్నారు. ముఖ్యమంత్రి ఈ పదాన్ని తొలగించేలా చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. దాసరి రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు వెంకట రమణ, సుబ్బయ్య, జయచంద్ర, శేఖర్, మధు పాల్గొన్నారు. -
మొక్కుబడిగా ఏపీ ఓపెన్ స్కూల్ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఏపీ ఓపెన్ స్కూల్ సమావేశం మొక్కుబడిగా సాగింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిర్వహించిన మొదటి సమావేశాన్ని జిల్లా లోని 22 ప్రైవేట్ స్టడీ సెంటర్ల నిర్వాహకులు బాయ్కాట్ చేశారు. ఈ సమావేశం నిర్వహణకు ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి ప్రత్యేక అధికారి నరహింహరావు హాజరయ్యారు. అయితే జిల్లాలోని ప్రైవేట్ స్టడీ సెంటర్ నిర్వాహకులు ఒక్కరు సైతం హాజరుకాలేదు. అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థల కో ఆర్డినేటర్లతోనే తూతూమంత్రంగా సమావేశం నిర్వహించేశారు. సంబంధిత 22 సెంటర్లలో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు చేసేదిలేదంటూ పలువురు స్టడీ సెంటర్ల నిర్వాహకులు వెల్లడించారు. చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం మధ్యలో చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ వరం లాంటిదని డీఈఓ వరలక్ష్మి, రాష్ట్ర కో–ఆర్డినేటర్ నరసింహరావులు తెలిపారు. డీఈవో కార్యాలయంలో ఏఐ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ పదో తరగతిలో చేరేందుకు 14 సంవత్సరాలు, ఇంటర్కు 15 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యి ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులను చేసుకోవాలని చెప్పారు. ఏడీ–2 వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
చదువుకు దారేది?
పూర్తిగాని అండర్ పాస్ రోడ్డు ● దారి లేక పాఠశాలకు వెళ్లని విద్యార్థులు ● 24 గంటల్లో తాత్కాలిక పనులు పూర్తిచేస్తామని హామీ రొంపిచెర్ల: జాతీయ రహదారుల అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. దారిలేక పాఠశాలకు హాజరుకాలేని దుస్థితి రొంపిచెర్ల మండలం, బండకిందపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. మదనపల్లె నుంచి రంగంపేట వరకు నేషనల్ హైవే రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అధికారులు టెండర్లు నిర్వహించి పనులు చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణంలో బండకిందపల్లె యూపీ పాఠశాల ముంపునకు గురికాగా.. ప్రభుత్వం రూ.37 లక్షలు నష్ట పరిహారంగా మంజూరు చేసింది. అధికారులు నేషనల్ హైవే రోడ్డు పక్కనే తరగతి గదులను నిర్మించారు. సుమారు 54 మంది విద్యార్థులు రోజూ వచ్చి వెళ్లేవారు. పాఠశాలలో నలగురు ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నారు. ఇంతవరకు రోడ్డు పైనే దాటుకుని విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే వారు. రోడ్డు పనులు పూర్తి కావడంతో రోడ్డు మీద దాటే అవకాశం లేకుండా పోయింది. అండర్ పాస్ రోడ్డు వేయాల్సిన అధికారులు దానిని విస్మరించడంతో విద్యార్థులు రెండు కిలో మీటర్ల దూరం చుట్టుతిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు జేసీకి, ఎంపీడీఓ, ఎంఈఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు అండర్ పాస్ పనులను పట్టించుకోక పోవడంతో మంగళవారం విద్యార్థులను పాఠశాలకు పంపకుండా తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులు రాక పోవడంతో చేసేది లేక ఖాళీగానే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే పాఠశాలకు విద్యార్థులు రాక పోవడంతో వంట గది కూడా మూత పడింది. విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాసులు, తహసీల్దార్ అమరనాఽథ్ బండకిందపల్లె పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, నేషనల్ హైవే సూపర్వజర్ విజయకుమార్తోనూ మాట్లాడారు. అండర్ పాస్ పనులను తాత్కలికంగా 24 గంటల్లో పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తామని నేషనల్ హైవే సూపర్వైజర్ హామీ ఇచ్చారని తహసీల్దార్ తెలిపారు. -
త్వరలో సంఘాలకు సారథులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పల్లె ప్రాంతాల్లోని రైతులకు అండగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు త్వరలో సారథులు రాబోతున్నారు. ప్రస్తుతం పర్సన్ ఇన్చార్జ్లుగా సంబంధిత శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. వారి స్థానంలో త్రిసభ్య కమిటీలను నియమించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) పరిధిలో 75 సహకార సంఘాలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక త్రీమెన్ కమిటీలను రద్దుచేసి సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించింది. వీరు తగినంతమంది లేక మూడు, నాలుగు సంఘాలకు ఒకరిని చొప్పున నియమించడంతో సక్రమంగా పర్యవేక్షించలేకపోతున్నారు. వీరి గడువు ముగిసింది. మళ్లీ ఆరు నెలలకు పెంచాలి. ఈ దఫా నెల రోజులే పొడిగించారు. ఈ సమయంలో త్రిసభ్య కమిటీల నియామకాన్ని కొలిక్కి తీసుకురానున్నారు. పోటాపోటీగా ఆశావహులు ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలకు త్రిసభ్య కమిటీలో చైర్మన్, డైరక్టర్లుగా నియమించేందుకు మూడు నెలల క్రితమే ఆశావహుల పేర్లు తీసుకున్నారు. ఎమ్మెల్యేలే జాబితాలను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. కొన్నిచోట్ల కూటమి నేతల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఇన్నాళ్లు వాటిని పక్కన పెట్టేశారు. కమిటీలో పేర్లున్న ఆశావహులంతా ఈ పదవుల కోసం రెండు నెలలుగా వేచి చూస్తున్నారు. వచ్చే నెలాఖరులోగా సంఘాలన్నింటికీ కమిటీలు వేయబోతున్నారు. తర్వాత ఎన్నికలు నిర్వహించినా అప్పుడు కూడా వీరినే అధ్యక్షులుగా కొనసాగించేలా అభ్యర్థులను ఎంపికచే యాలని, తేడాలుంటే ఇప్పుడే సరిదిద్ది మరో సారి జాబితాను పునఃపరిశీలన చేసుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ఈ విషయంలో కూటమి నేతల్లో లుకలుకలు మొదలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
టమాట బాక్సు రూ.450
పలమనేరు: టమాట ధరలు ఎట్టకేలకు పెరుగుతున్నాయి. పలమనేరు మార్కెట్లో 15 కిలోల బాక్సు మంగళవారం రూ.450 దాకా పలికింది. సూపర్ఫైన్ రకం(తొలి కోతలు) రూ.500 దా టింది. ఆ మేరకు పెద్దపంజాణి మండలానికి చెందిన రైతు క్రిష్ణారెడ్డి తోటలోని టమాటాలు రూ. 500 పలికాయి. అయితే వైరస్ కారణంగా పంట దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఈ మాత్రం ధరలున్నా టమాటా రైతులకు మేలు కలిగినట్టేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇటీవల టీచర్ల బదిలీలు నిర్వహించిన విషయం విధితమే. అయితే ఈ బదిలీల్లో పలువురు టీచర్లు తమకు అన్యాయం జరిగిందని విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. సంబంధిత టీచర్ల అభ్యర్థనలను రెండు రోజుల క్రితం రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నష్టపోయిన 25 మంది టీచర్ల అభ్యంతరాలు(గ్రీవెన్స్)ను పరిష్కరించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
జాతీయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరుకలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం అందజేసే జాతీయ ఉత్తమ టీచర్ల అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఈ అవార్డులకు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హత, ఆసక్తి ఉన్న టీచర్లు ఈ నెల 13వ తేదీలోపు ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.nationalawardstoteachers.education.gov.in అనే వెబ్సైట్లో సమగ్ర వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. డిజిటల్ సర్వే సిస్టమ్ పరిశీలన కుప్పం: కుప్పం నియోజకవర్గంలో టాటా సంస్థ చేపడుతున్న డిజిటల్ సర్వే సిస్టమ్ పనితీరును రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కృష్ణాబాబు పరిశీలించారు. బుధ, గురువారాలు సీఎం చంద్రబాబు కుప్పం వంద పడకల ఆస్పత్రిలో టాటా సంస్థ డిజిటల్ సర్వే సిస్టమ్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన కంగుంది పీహెచ్సీలో సర్వే పనితీరును పరిశీలించారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీరపాండ్యన్, కలెక్టర్ సుమిత్కుమార్, డీయెన్సీ మెనేజర్ కమలేష్ పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు!
● ఇంటింటికీ వెళ్లాలంటే భయం ● మామిడికి గిట్టుబాటు ధర కల్పించలేదు ● కనీసం కాయలను కొనుగోలు చేయని వైనం ● పింఛన్లు, తల్లికి వందనంలో కోతపై లబ్ధిదారుల ఆగ్రహం అడుగడుగునా అక్రమాలే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక, మట్టి, గ్రావెల్, మైనింగ్ అక్రమ తవ్వకాలు, అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అక్రమార్కులు రాత్రింబవళ్లు జేసీబీల, ఇటాచీలు, లారీలు, టిప్పర్లతో ప్రకృతి సంపదను తరలించి సొమ్ముచేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అక్రమార్కులకు అధికారులు తోడయ్యారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకడం లేదు. ఉచిత ఇసుక గురించి పట్టించుకునే ఎమ్మెల్యేలు, అధికారులు కరువయ్యారు. కూటమి నేతలు ప్రభుత్వ, పోరంబోకు, కాలువ, చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి సొంతం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. వేరొకరి అనుభవంలో ఉన్నా.. దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. ఇదేమిటని అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. ఇలా ఏడాది పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలను నిలదీసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికీ వెళ్లటానికి ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సుపరిపాలన పేరుతో ఇంటింటికీ వెళ్లడానికి టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గు బులు పట్టుకుంది. ఏడాది పాలనలో పథకాలు అమలు చేయకపోవటం, ఉమ్మడి జిల్లాలో మామి డి రైతులు ఆగ్రహంగా ఉండడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదు. అధినేత చంద్రబాబు ఆదేశించినట్లు ఇంటింటికీ వెళ్లినప్పుడు స్థానికులు నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? అనేదానిపై ఎమ్మెల్యేలు అధికారులు, స్థానిక టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ఏడాది పాలన వైఫల్యాలపై ‘చంద్రబా బు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపట్టనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ కార్యక్రమానికి ముందే సుపరిపాలన పేరుతో ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించి, ప్రారంభించేశారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నేడు కుప్పంలో పర్యటించనున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికీ వెళ్లనున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. పథకాలు అడగరా? ఏడాది కూటమి పాలనలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పింఛన్లు తొలగించిన వారే సుమారు 32 వేల మంది ఉన్నారు. వాటి స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అతీగతి లేదు. పింఛను కోల్పోయిన వారు, కొత్తగా ఆశిస్తున్నవారు ఎమ్మెల్యేలను నిలదీస్తారని ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్ కార్డులు లేవు, ఉన్న కార్డులకు పూర్తి స్థాయిలో సరుకులు ఇవ్వటం లేదు. కేవలం బియ్యం మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది ప్రభుత్వం. మరో వైపు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది ప్రారంభమై ఖరీఫ్ సీజన్ మొదలైనా పైసా విదల్చలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, ఇతరత్రా హామీలు అమలు చేయకపోవటంపై లబ్ధిదారులు అసంతృప్తితో ఉన్నారు. భయపెడుతున్న మామిడి చిత్తూరు, తిరుపతి జిల్లాలో గత కొంత కాలంగా రైతులు మామిడి దిగుబడులను అమ్ముకోలేక వారు ఎదుర్కొంటున్న అవస్తలు వర్ణనాతీతం. మామిడి దిగుబడులతో రోజుల తరబడి ఫ్యాక్టరీల ముందు వేచి ఉన్నా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించలేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం పదే పదే చెప్పినా ఫలితం కనిపించలేదు. అధికారులు ఆదేశించినా ఫ్యాక్టరీ యాజమాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో మామిడి రైతులు చేసేది లేక కడుపు మండి చెట్లను నరికేసుకుంటున్నారు. మరి కొందరు కాయలను రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళితే రైతులు విరుచుకుపడుతారన్న భయం టీడీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. -
మద్దతు ధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
● తొలుత కిలోకి రూ.12, ఆపై రూ.6 ప్రకటించిన వైనం ● క్షేత్రస్థాయిలో కిలో రూ.3 కూడా దక్కక రైతుల ఆవేదన ● అయినా సరే కాయ కొనడానికి ముందుకురాని ఫ్యాక్టరీలు ● అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పంట అమ్మడానికి అగచాట్లు ● నిద్రాహారాల్లేక ఫ్యాక్టరీల ఎదుట ఎదురుచూపులు ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దయనీయ పరిస్థి ఇంటికి పోయే పరిస్థితి లేదు కాణిపాకం నుంచి గుడిపాల సరిహద్దులో ఉన్న ఫ్యాక్టరీకి కాయలు తెస్తే రూ.5వేలు బాడుగ. ఒక్కరోజు అయినా..రెండు రోజులు..మూడు రోజులు అయినా ఇదే రేటు. ఇక్కడకు కాయలు తెస్తే.. అన్లోడింగ్ అయ్యేందుకు ఐదు రోజులు పడుతోంది. అంతవరకు ఓపికతో ఉండాల్సిందే. ఇంటికి పోను.. రాను అంటే కుదరదు. – రవి, బొమ్మసముద్రం, ఐరాల మండలం టోకెన్లు అమ్ముకుంటున్నారు వారం పది రోజులుగా తిండీనీళ్లు లేకుండా రోడ్లపై అవస్థలు పడుతున్నాం. రాత్రి సమయాల్లో అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కుమ్మకై ్క దొడ్డి దారిన టోకెన్లు అమ్ముకుని డైరెక్టుగా 10, 20 వాహనాలు లోపలకు పంపించేస్తున్నారు. ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దోమల బెడదతో నిద్రాహారాలు లేకుండా మేము అవస్థలు పడుతుంటే కొందరు మాత్రం దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. – బాబునాయుడు, జీడీనెల్లూరు కన్న బిడ్డల్లా సాకినాం సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాపాడు కున్నాం. కన్నబిడ్డల్లా గా పండించాం. ఇప్పు డు మామిడి పంట మొ త్తం కిలోమీటర్ల మేర రోడ్లపై పడి ఉంది. నాలుగైదు రోజుల నిరీక్షణలతో టార్ఫాలిన్పట్ట వేడికి లోలోపలే కుళ్లిపోయి, జ్యూసు లా రోడ్లపై కారిపోతోంది. అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రత్యేక చొరవ చూపించాలి. – శ్రీనివాసరెడ్డి పెనుమూరు మండలం చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం మామిడి పంట ఆశించిన స్థాయిలో దిగుబడినిచ్చింది. ఇందులో తోతాపురి రకం నుంచి గుజ్జు (పల్ఫ్)ను తయారుచేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఫలితంగా ప్రతీ ఏటా దాదాపు 40 వేల హెక్టార్లలో తోతాపురి మామిడి రకాన్ని రైతాంగం సాగుచేస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మొదలైంది. కానీ మామిడిని కొనడానికి ఏ ఒక్క ఫ్యాక్టరీ ముందుకు రావడం లేదు. ఒకవేళ కొన్నా కిలోకు సగటున రూ.4 –5 చెల్లిస్తున్నారు. ర్యాంపుల వద్ద కిలో రూ.3 మాత్రమే పలుకుతోంది. చేతికొచ్చిన పంట అమ్ముకోలేక, ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర లభించక అన్నదాతకు గుండెకోత మిగులుతోంది. చేజేతులా కోల్పోతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఫ్యాక్టరీలు మామిడిని కొనకపోవడంతో రైతు కంట కన్నీళ్లు ఆగడం లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల బయట రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం కిలోకు రూ.6 చెల్లించాలని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకునే దిక్కులేదు. ముందుగా ఫ్యాక్టరీ వద్దకు రైతు వచ్చి టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ నంబర్ వస్తే తప్ప మామిడిని లోపలకు తీసుకెళ్లడానికి వీల్లేదు. రెండు రోజులు అలాగే ఉంచేస్తే 40 శాతం పంట పనికిరాదు. చిన్నపాటి వర్షం పడితే వంద శాతం పంట రోడ్డుపై పడేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో టోకెన్ల కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిల్చోవడం, తోపులాటలు, పోలీసులు–ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదాలు.. ఇవన్నీ ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమలు ఉంటే ఇప్పటి వరకు 30 వరకు ఫ్యాక్టరీలు మాత్రమే తెరుచుకున్నాయి. 80 శాతం వరకు ఫ్యాక్టరీలు, కూటమి ప్రభుత్వ అనుకూలురు చేతుల్లో ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో గరిష్టంగా కిలో మామిడి రూ.23కు అమ్ముడం కొసమెరుపు. ‘మద్దతు’లేక..అగచాట్లు పడలేక చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. మామిడి పంటను ఫ్యాక్టరీలకు అమ్ముదామని పంటను తీసుకొచ్చిన రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కిలో మామిడికి రూ.12 గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఫ్యాక్టరీలు చెప్పడంతో, కిలోకు రూ.8 ఫ్యాక్టరీలు చెల్లించాలని, మిగిలిన రూ.4 ప్రభుత్వమే భరిస్తుందని.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్నెన్నాయుడు ప్రకటించారు. కానీ ఫ్యాక్టరీలు కూడా ఈ ధరలు పాటించలేదు. కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఖరాకండిగా చెప్పేస్తున్నాయి. కొన్ని చోట్ల కిలో రూ.3 సైతం చెల్లిస్తున్నారు. ప్రభుత్వ హామీలన్నీ నీటిమీద రాతలేనని తేలిపోయాయి. సీజన్ ముగుస్తున్నా ఇప్పటి వరకు రైతుకు మద్దతు ధర అందలేదు. -
జనావాసాల్లోకి ఏనుగులు
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పాళెం పంచాయతీలో తిష్ట వేసిన 14 ఏనుగుల గుంపు చుట్టు పక్కల పొలాల్లో రోజూ ఏదోఒకచోట పంటలపై పడి తీవ్ర నష్టం కలిగిస్తోంది. రోజూ మామిడి తోపుల్లో కాయలు తింటూ కొమ్మ లను విరిచేయడం, కంచె కూసాలను, డ్రిప్ పై పులను నాశనం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా మంగళవారం తెల్లవారు జామున పాళెం పంచాయతీలోని జూపల్లె, కోటపల్లె గ్రా మాల్లోకి ప్రవేశించి ఇళ్ల ముందర ఉన్న అరటి చెట్లను ధ్వంసం చేశాయి. రోడ్ల పైన తిరు గుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఏనుగులను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు కుప్పం: సీఎం చంద్రబాబు నాయుడు బుధ వారం కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. సోమ వారం జిల్లా పోలీసు యంత్రాగంతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటించే ప్రాంతాల్లో పోలీసు బలగాలను అధికంగా మోహరించాలన్నారు. సమీక్షలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివనందకిషోర్, కుప్పం డీఎస్పీ పార్థ సారిథి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సీఎం కుప్పం పర్యటనలో మార్పు శాంతిపురం: సీఎం చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన ఒక్క రోజు ఆలస్యంగా ప్రారంభంకానుంది. మంగళవారం ఇక్కడికి రావాల్సిన ఆయన బుధవారం విచ్చేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం 12.30కి సీఎం తుమ్మిశి వద్ద ఉన్న హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వచ్చి 12.50కి తులసినాయనపల్లి వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూలు వద్దకు చేరుకుని బహిరంగసభ, పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.35కు తిమ్మరాజుపల్లి చేరుకుని రాత్రి 7 గంటల వరకూ ఇంటింటికీ వెళ్లి 26 కుటుంబాలను నేరుగా కలవనున్నారు. గురువారం ఉదయం 10.35కు కుప్పం ఏరియా ఆస్పత్రి చేరుకుని టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15కు కడపల్లి వద్ద తన నివాసంలో అధికారిక సమిక్ష నిర్వహిస్తారు. 2.30 నుంచి 4 గంటల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అనంతరం తిరుగు ప్రయాణంలో తుమ్మిశి వద్ద హెలీప్యాడ్ చేరుకుని బెంగళూరుకు వెళ్తారని తెలిపారు. -
ఊరుబడంటే అలుసా?
చిత్తూరు రూరల్(కాణిపాకం): తమ పిల్లల చదువుకు ఊరు బడంటే ఒప్పుకుంటామని.. లేకుంటే తమిళనాడులోని ప్రభుత్వ బడికి పంపుతామని పిల్లల తల్లిదండ్రులు రోడెక్కారు. చిత్తూరు మండలం, అనంతాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విలీ నంపై మంగళవారం పిల్లల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 24 మంది విద్యార్థులు ఉన్నా రన్నారు. ఈ పాఠశాలను విలీనం చేయడంతో పిల్లలంతా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న బీఎన్ఆర్ పేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. చిత్తూరు తిరుత్తణి జాతీయ రహదారి మీదుగా పిల్లలు బడికి వెళ్లాలని, భారీ వాహనాల రాకపోకల నడుమ ఈ ప్రయాణం అత్యంత ప్రమాదకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు. విలీనం మాకొద్దని.. ఊరుబడే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అధికారులు స్పందించకుంటే కి.మీ పరిధిలో ఉన్న తమిళనాడులోని ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపుతామని స్పష్టం చేశారు. కావాలంటే రేషన్ కార్డులు కూడా రద్దు చేసుకోమని వారు ఆగ్రహానికి గురయ్యారు. గ్రామస్తులు భానుచందర్, సుదీర్, శశికళ, అరుణాయాకాంబరం, తంగమని, మురళి, బాబు, వాణి, రామన్, నదియా పాల్గొన్నారు. -
గందరగోళంగా సర్వేయర్ల బదిలీలు
● ముడుపులు తీసుకుని బదిలీలు చేశారని వెల్లువెత్తిన ఆరోపణలు ● తప్పిదాల కారణంగా రెండు గంటల పాటు ఆగిన కౌన్సెలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ సచివాలయ సర్వేయర్ అసిస్టెంట్ల బదిలీలు గందరగోళంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సర్వే అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించారు. చిత్తూరు సర్వే శాఖ ఏడీ జయరాజ్ ఆధ్వర్యంలో సర్వే అసిస్టెంట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి సర్వేశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళంగానే సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న 398 సర్వేయర్ అసిస్టెంట్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. చాలా మందికి అన్యాయం జరగడంతో కలెక్టరేట్ భవనంలో అరుపులు.. కేకలు వినిపించాయి. న్యాయం చేయాలంటూ పలువురు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ముడుపుల ఆరోపణలు సర్వే అసిస్టెంట్ల బదిలీల్లో పలవురుకి అనుకూలమైన స్థానాలను కేటాయించేందుకు సర్వే శాఖ అధికారులు ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో పోస్టింగ్ నిమిత్తం ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల వరకు స్వీకరించారని కౌన్సెలింగ్కు విచ్చేసిన సర్వే అసిస్టెంట్లు ఆరోపించారు. జిల్లాల పునర్విభజన కారణంగా ఆయా జిల్లాల సర్వే అసిస్టెంట్లకు ప్రత్యేకంగా బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాలి. అయితే సర్వే శాఖ అధికారులు అలా చేయకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వే అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ప్రదర్శించి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. దీంతో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 120 మంది తిరుపతి జిల్లాకు బదిలీ అయినట్టు సమాచారం. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న సర్వే అసిస్టెంట్లు చిత్తూరు జిల్లాకు బదిలీ కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ పరిశీలించి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. సీనియారిటీ జాబితాలో అవకతవకలు సీనియారిటీ జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసుకోవాల్సిన సర్వే శాఖ అలసత్వం వహించింది. ఆ జాబితా రూపకల్పనలో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఒకే ర్యాంక్ను ఇద్దరు సర్వేయర్లకు కేటాయించారు. అలా ఎలా కేటాయిస్తారని సర్వే అసిస్టెంట్లు అధికారులను ప్రశ్నించారు. కనీసం జాబితా ప్రచురించకుండా కౌన్సెలింగ్ నిర్వహించారని ఆరోపించారు. ఈ తప్పిదాల కారణంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సెలింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకు నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏడీ ప్రకటించారు. సీనియారిటీ జాబితాలో తప్పిదాలు చోటుచేసుకున్నాయని స్వయంగా ఏడీనే ప్రకటించారు. దీంతో రెండు గంటల పాటు కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించేటప్పుడు సీనియారిటీ, ఖాళీల జాబితాలను ఎందుకు ప్రదర్శించలేదని సర్వే అసిస్టెంట్లు ప్రశ్నిస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● రూ.1.5 లక్షల విలువచేసే 4 ద్విచక్ర వాహనాల స్వాధీనం నగరి : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ తిరుత్తణికి చెందిన సర్గుణన్(50)ని నగరి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఏకాంబరకుప్పం పరిసర ప్రాంతాల్లో గత మూడు నెలలుగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల వరుస చోరీలపై ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు నిఘా పెట్టారు. తమిళనాడు సరిహద్దులో వా హనాల రాకపోకలు రికార్డు అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చోరీదారులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇ టీవల ఇద్దరిని అరెస్టు చేయగా సోమవారం మరో అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. సీఐ విక్రమ్ మాట్లాడుతూ ముందస్తు సమాచారంతో మండ పం జంక్షన్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టు తెలిపారు. విచారణలో అతను గత కొంత కాలంగా నగరి మున్సిపాలిటీ, ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్ వద్ద నాలుగు మోటార్ సైకిళ్లను దొంగలించినట్లు తెలిసిందన్నారు. అతని వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువ చేసే 4 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్టు చెప్పారు. ముద్దాయిపై గతంలో తిరుత్తణి రైల్వే పోలీసు స్టేషన్లో కేసు ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది సురేష్, సత్య, గజేంద్ర, అశోక్, లోకనాథం, రమేష్ను అభినందించారు. -
సిఫారసుకే పెద్దపీట
మతలబు ఏంటీ? ఇంజినీర్ సహాయకుల బదిలీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 664 మందికి బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆది, సోమవారాలతో కలిపి మొత్తం 469 మందికి మాత్రమే కౌన్సెలింగ్ చేపట్టారు. మిగిలిన 195 మందికి చేయలేదు. సీఎం కార్యక్రమం ఉండడంతో వీటిని అనధికారికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. హడావిడిగా ఈ ప్రక్రియను ముగించి అధికారులు వెళ్లిపోయారు. మిగిలిన వారికి ఎప్పుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తారో అనే విషయం పై సృష్టత లేదు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లో కౌన్సెలింగ్ చేపట్టనున్నట్టు సమాచారం. చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ ఇంజినీర్ సహాయకుల బదిలీల్లో సిఫారసుకే పెద్దపీట వేశారు. ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వారికి చెప్పిన చోటుకు బదిలీ చేశారు. ఏ పలుకుబడీ లేని వారి పరిస్థితి దారుణంగా మారింది. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో సోమవారం రెండో రోజు జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఉద్యోగులు ఆరోపించారు. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారికి ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. తమశాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగులని ఏమాత్రం గౌరవం లేకుండా ఎస్ఈ కార్యాలయ సిబ్బంది హేయ్, రేయ్, చెప్పింది చేసి పో అంటూ ఏకవచనంతో మాట్లాడుతూ వారితో అమర్యాదగా ప్రరవర్తించారని ఇంజినీరింగ్ సహాయకులు అసహనం వ్యక్తం చేశారు. ర్యాంకులు పట్టించుకోరు తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యోగాలు ఎలా కేటాయించారో అలాగే బదిలీలు చేపట్టాలని, జాబితాలు సిద్ధం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అయినా అధికారులు వాటిని పట్టించుకోలేదు. ప్రతిభను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. సీనియారిటీ జాబితా లేకుండానే ఏ శాఖలో అయినా సీనియారీ జాబితా ప్రదర్శించి దా ని ఆధారంగానే బదిలీలు చేస్తారని, అయితే సచివాల య ఉద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీనియారిటీ జాబితా రూపొందించకుండా ప్రాంతాలను కోరుకోమని, వాటి ని ఫారంలో నింపి వెళ్లిపోవాలని సూచించడం నిబంధనలకు విరుద్ధమని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచి ర్యాంకు ఉన్నా దూరంగానే పోస్టింగ్ పలుకుబడి లేని ఉద్యోగుల పరిస్థితి దయనీయం అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల అసహనం ముగిసిన కౌన్సెలింగ్లెటర్లు ఉన్నవారికి ప్రాధాన్యం ఎమ్మెల్యే లెటర్లు ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. సిఫార్సు ఉన్నవారికి వారు కావాల్సిన స్థానం కోరుకోండి అంటూ అడిగి మరీ వారికి సహకరించారు. మరికొందరి విషయంలో ఎమ్మెల్యేలు నేరుగా ఫోన్లు చేసి పేర్లు సిఫార్సు చేయడం గమనార్హం. పంచాయతీరాజ్ ఇన్చార్జి ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి ఈఈ రామ్మోహన్, మదనపల్లె ఈఈ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే ఏ మాత్రం పలుకుబడి లేని వారికి అడిగిన చోటు కాకుండా ఇష్టం వచ్చిన చోటుకు బదిలీ చేశారు. -
ఆలయ స్థలం స్వాధీనం
ఐరాల: ఆక్రమణకు గురైన శ్రీకృష్ణ భజన మందిరం ఆలయానికి సంబంధించిన స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మండలంలోని అగరంపల్లె శ్రీకృష్ణ భజన మందిరం ఆలయానికి సంబంధించిన సర్వే నం.365, 366లో అదే గ్రామానికి చెందిన పీ.దొరస్వామి, పీ.మధు ఆక్రమించుకుని రేకుల షె డ్డు, పెంకుటిళ్లు నిర్మించుకున్నారు. గుంటూరు దేవదాయ, ధర్మాదాయ శాఖ ట్రిబ్యూనల్ వారి ఆదేశాల మేరకు జిల్లా ఏసీ చిట్టెమ్మ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖాల ఆధ్వర్యంలో ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ లోకేశ్వరి పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి బంగారుపాళెం: గుర్తుతెలియని వాహనం ఢీకొ ని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని పాలేరు వద్ద చైన్నె–బెంగళూరు జాతీ య రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. బెంగళూరు నగరం కేజీ హళ్లి కి చెందిన సెల్వరాజ్ కుమారుడు శ్యామ్ జయకర్(37) ద్విచక్ర వాహనంపై చిత్తూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో పాలేరు వద్ద గుర్తుతెలియ ని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయశంకర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. యువతి ఆత్మహత్య పుంగనూరు(చౌడేపల్లె): తల్లిదండ్రులు దూరమయ్యారని మనస్తాపం చెందిన ఓ యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పట్టణంలోని సుబేదారు వీధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. సుబేదారువీధిలో నివాసం ఉన్న షేక్వలిబాషా సుమారు పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అతని భార్య రెండేళ్ల క్రితం మరో వివాహం చేసుకుంది. ఆమె కుమారుడు ఖాజా, కుమార్తె హసీనా తోపాటు మరో చెల్లి నివాసమున్నారు. తండ్రి మృతి చెందడం, తల్లి మరొక వివాహం చేసుకొని దూరమవ్వడంతో హసీనా (19) మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని యువతి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమి త్తం శవాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పచ్చమేత
● బియ్యం అక్రమ రవాణాలో బరితెగించిన టీడీపీ నేతలు ● పీడీఎస్ బియ్యంతో పాటు టీడీపీ నేతల అరెస్ట్ ● సుమారు రూ.6 లక్షల విలువ చేసే 13 టన్నుల బియ్యం స్వాధీనం నగరి : అక్రమ రవాణాకు సిద్ధం చేసి ఉంచుకున్న 13 టన్నుల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరి మున్సిపాలిటీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ విక్రమ్ కథనం మేరకు.. ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు రేషన్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం నగరి మున్సిపల్ పరిధి కీళపట్టు వద్ద తిరుత్తణి బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న జోర్ ఎంజాయ్ హోటల్ పక్కన ఖాళీ ప్రదేశంలో పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కాగా సమాచారం అందింది. సీఐ తన సిబ్బందిని వెంటబెట్టుకుని రెవెన్యూ అధికారులు, వీఆర్వోతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నాలుగు చిన్న వాహనాలు, ఒక ఐచర్లో లోడ్ చేసి ఉంచిన 13 టన్నుల బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నాయకుడు అమృతరాజ్ నాడార్ అలియాస్ టీఆర్ఎస్(62), వై.ధనుష్ (19), డీ.బోస్ (20), ఎన్.రోహిత్ (18), వీ.దినేష్ (23), గజేంద్రన్ (20), రాజేష్ అలియాస్ రాజు (25) మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నగరి, నారాయణవనం, పుత్తూరు, పిచ్చాటూరు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం సేకరించుకుని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. వీరు ఎక్కడకు పంపుతున్నారు.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న చైన్ లింక్ను పూర్తి స్థాయిలో కూపీలాగి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పట్టుకున్నవి ప్రభుత్వ ముద్రతో సీలు ఉన్న బస్తాలే పోలీసులు సోమవారం పట్టుకున్న పీడీఎస్ బస్తాలన్నీ ప్రభుత్వ ముద్రతో సీలున్న బస్తాలే కావడంతో గోడౌన్ నుంచి వచ్చాయా.. రేషన్ షాపుల నుంచి వచ్చాయా అనే అంశాలపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మద్యం రాసిన మరణ శాసనం
మద్యానికి బానిసై..కుటుంబానికి దూరమై..! ● కన్నీళ్లు మిగుల్చుతున్న ఘటనలు బంగారుపాళెం: వేళాపాళా లేని మద్యం విక్రయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. తాగుడు మానేయయని ఇంట్లో వారు ఒత్తిడి చేస్తే మందు బాబులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మద్యం రాసిన మరణ శాసనానికి ఇటీవల జిల్లాలో ముగ్గురు బలయ్యారు. బంగారుపాళెంలో.. పలమనేరు మండలం, జగమర్లకు చెందిన సుధాకర్, అతని భార్య పల్లవి బంగారుపాళెం మండలం, నలగాంపల్లెలో ఓ రైతు మామిడితోటలో కాపలాగా ఉంటున్నారు. ఈ నెల 22వ తేదీ పల్లవి భర్త మద్యం సేవించి ఇంటికి వెళ్లడంతో ప్రశ్నించింది. ఈ విషయమై భార్యాభర్తలు గొడవలు పడ్డారు. మొదట భర్త సుధాకర్ విషం తాగాడు. భార్య పల్లవి భయపడి ఆమె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ భర్త సుధాకర్ కోలుకున్నాడు. భార్య పల్లవి(23) ఈ నెల 26వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందింది. పాలసముద్రంలో భార్యను చంపిన భర్త పులిచర్లకు చెందిన కార్తీక్, ప్రమీల దంపతులు. ఏడాది క్రితం పాలసముద్రం మండలం తిరుమలరాజపురానికి వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన భర్త కార్తీక్ మద్యం తాగి రావడంతో భార్య ప్రమీల అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య కొడవ సాగింది. కార్తీక్ తాగిన మత్తులో భార్యను తలపై కట్టెతో కొట్టడంతో ఆమె మృతి చెందింది. అతిగా మద్యం సేవించి.. బంగారుపా ళెం దళితవాడకు చెందిన వినాయకం అనే యువకు డు మద్యాని కి బానిసయ్యాడు. దీంతో భార్య దూరమైంది. మే 4వ తేదీ అతిగా మద్యం సేవించి ఓ వైన్ షాప్ వద్దే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి ఘటనలు జిల్లా లో చోటు చేసుకుంటునే ఉన్నాయి.