breaking news
Chittoor District Latest News
-
సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి
ఐరాల: సమాజంలోని ప్రతి హిందువు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని విశిష్ట అతిథి భువనేశ్వరి పీఠం, గన్నవరం శ్రీ కమలానంద భారతిస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని వారపు సంతలో ఆర్ఎస్ఎస్ వంద ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మండల హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుతగా స్వామిజీకి మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక బజారువీధి నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనంలో ఊరేగింపు నిర్వహించారు. స్వామిజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా స్వామిజీ హాజరై మాట్లాడారు. ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూసిన నాడే సమ సమాజ స్థాపన సాధ్యమన్నారు. కులాన్ని ఇంటి వరకే పరిమితం చేయాలని, గడప దాటితే మనమంతా హిందువులమనే భావన అందరిలో ఉండాలని సూచించారు. సమ్మేళనంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. అనంతరం నిర్వహకులు అన్నదానం చేశారు. అతిథి విశ్రాంత ప్రధోనపాధ్యాయుడు సీతాపతినాయుడు, విభాగ్ సహకార్యవాహ ప్రధాన వక్త రెడ్డెప్ప పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
నగరి : అడ్డూఅదుపు లేకుండా తిరుగున్న టిప్పర్లు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మంగళవారం మండలంలోని ఏడుగట్లు గ్రామంలో కేశవరాజకుప్పం మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరువళ్లూరు జిల్లా, పళ్లిపట్టు తాలుకా, గొల్లాల కుప్పంకు చెందిన చెంచుగాన్ (29) మృతిచెందాడు. మృతిని బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చెంచుగాన్ తమిళనాడు పొన్పాడిలోని ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య చాముండేశ్వరి తిరుపతిలోని ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ అక్కడే ఉంటోంది. నూతన సంవత్సర వేడుకలను భార్యతో కలిసి జరుపుకునేందుకు అవసరమైన సరంజామా తీసుకుని మంగళవారం పని ముగించుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళుతున్నట్లు తల్లికి చెప్పి వచ్చాడు. అయితే మార్గ మధ్యంలోనే అతనిని మృత్యువు టిప్పర్ రూపంలో బలిగొంది. కేశవరాజకుప్పం మలుపు వద్ద టిప్పర్ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టడంతో చెంచుగాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. టిప్పర్ వదలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. కాగా చెంచుగాన్కు పిల్లలు లేరు. తల్లిదండ్రులకు చెంచుగాన్ ఒక్కగానొక్క కుమారుడు, కుటుంబానికి అతనే ఆధారం. కన్నీరు పెట్టించిన తల్లిదండ్రుల ఆక్రందన తల్లితండ్రులు తన కుమారుడి మృతదేహాన్ని చూసి పెట్టిన ఆక్రందన అందరినీ కలచివేసింది. టిప్పర్ వదలిపెట్టి డ్రైవర్ పరారు కావడం.. ఎవరూ వచ్చి సమాధానం చెప్పకపోవడంతో మృతుని బంధువులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకున్నారు. మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు, (ఇన్సెట్) చెంచుగాన్ (ఫైల్)టిప్పర్లకు అడ్డుకట్ట ఏదీ జాతీయ రహదారి, రైల్వే పనులంటూ విచ్చలవిడిగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లతో గ్రామీణ రోడ్లు రద్దీగా మారాయి. వీటికి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ‘గ్రామీణ రోడ్లు.. నరకానికి నకళ్లు’ అన్న కథనంతో సాక్షి దినపత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. అయినా అధికారులు గానీ, గ్రావెల్ కాంట్రాక్టర్లు గానీ ఈ మార్గాన్ని బాగుచేయడానికి ఎలాంటి చొరవ చూపలేదు. టిప్పర్లను అదుపు చేయలేదు. ఫలితంగా నేడు ఒక యువకుడు ప్రాణం బలైపోయింది. -
నేడే చివరి రోజు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సబ్సిడీ అదనపులోడ్ క్రమబద్ధీకరణకు బుధవారం చివరి రోజు అని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 6వేల మంది వినియోగదారులు 9వేల కిలోవాట్ల లోడ్ను క్రమబద్ధీకరించుకున్నరన్నారు. తద్వారా సంస్థకు రూ.1.1 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. స్వచ్ఛందంగా గృహ వినియోగదారులు లోడ్ను క్రమబద్ధీకరించుకుంటే సబ్సిడీ 50 శాతం వర్తిస్తుందన్నారు. గిరిజనుల ఆరోగ్య భద్రతే లక్ష్యం పూతలపట్టు(యాదమరి): గిరిజనుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని గువ్వల కాలనీలో గిరిజన వికాసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను దగ్గర చెయ్యడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం ఆయన పలు వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కాగా ఈ వైద్య శిబిరంలో కాలనీ ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, తహసీల్దార్ రమేష్బాబు పాల్గొన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించొద్దు చిత్తూరు అర్బన్: కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను పెట్టుకుని ముందుకు వెళ్లండి.. అని ఎస్పీ తుషార్డూడీ సూచించారు. శాంతిభద్రతల పర్యవేక్షణ, ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి పోలీసుశాఖ పనిచేస్తుందన్నారు. మహిళలపై నేరాల నియంత్రణకే ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా తనను కలిసి చెప్పొచ్చని సూచించారు. న్యూ ఇయర్ పేరిట బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి వాహనాలు నడపడం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల పాటు పోలీసులు అన్నిచోట్ల తనిఖీలు నిర్వహిస్తారన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించకుండా న్యూ ఇయర్ చేసుకోవాలని చెప్పారు. పకడ్బందీగా యూరియా పంపిణీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో రబీ సీజన్కు గాను పంటలకు అవసరమైన 20,183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 5,747 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటికే 6,753 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు యూరియా కొరత రాలేదన్నారు. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే లైసెన్స్లను రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మరో బాధితుడు చిత్తూరు కార్పొరేషన్: తుక్కు మాఫియా బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీఎస్టీ నోటీసులు వస్తుండడంతో అమయాకులు బయటపడుతున్నారు. నగరంలో తోపుడు బండిపై వీధి వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తికి రూ.12.3 కోట్లు ఫెనాల్టీ నోటీసులు జారీ అయిందన్న సమాచారం మంగళవారం సంచలనం రేకెత్తించింది. ఆ వ్యక్తి కోసం సీజీఎస్టీ ఇంటలిజెన్స్ అధికారులు గాలిస్తున్నారని, అయితే నోటీసులు అందుకున్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సంబంధం లేని వ్యక్తులకు రూ.లక్షలు, కోట్లు చెల్లించాలని నోటీసులు రావడంతో వారు షాక్అవుతున్నారు. ఇప్పటికే రూ.400 కోట్లు అక్రమంగా రిటర్న్లో తీసుకునున్నట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించుకున్నారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ట్రెజరీశాఖ డీడీ రామచంద్ర సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్దారులు వార్షిక జీవ న ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. 01–01–2026 నుంచి 28–02–2026 లోపు పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలన్నారు. గడువు తేదీలోపు సమర్పించకపోతే ఏప్రిల్ 1న ఇచ్చే మార్చినెల పెన్షన్ నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని సబ్ ట్రెజరీ ఆఫీసుల్లోనూ సర్టిఫికెట్ అందజేయొచ్చన్నారు. -
భూలోక వైకుంఠం!
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలో వెలసిన శ్రీ కల్యా ణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాము 4 గంటల నుంచే వైకుంఠ ద్వార ప్రవేశానికి భక్తులు పోటెత్తారు. ఎప్పటిలాగే ఆలయంలో ఆగమోక్తంగా పూజలు నిర్వహించారు. ఆ తరువాత వైకుంఠ ద్వారాలకు పూజచేసి తలుపులు తెరిచారు. అనంతరం ఆలయ నిర్వాహకులతో పాటు అర్చకులు, వేద పండితులు ముందుగా వైకుంఠ ద్వార ప్రవేశం చేయగా ఆ తర్వాత సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. తిరుమల వెళ్లలేక.. తుమ్మలగుంటకు తిరుమల వెళ్లి స్వామిని దర్శించలేని భక్తులందరూ తుమ్మలగుంట చేరుకున్నారు. ఆ తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం చేసి గోవింద నామస్మరణలతో భక్తితత్వం పంచుకున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆయన కుటుంబీకులు ఆయం వద్ద భక్తుల హృదయాలను హత్తుకునేలా భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. పుష్పాలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంతో పాటు వైకుంఠ ద్వారాన్ని సుంగదభరిత పుష్పాలు, పరిమళ భరిత పత్రాలతో అలంకరించారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా బ్రహ్మోత్సవాల్లో స్వామి వారు అధిరోహించే సప్త వాహనాలను దర్శించుకుని ఆపై సప్తద్వారాల గుండా ఆనంద నిలయం కింద ఆలయం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెరుచుకున్న సప్త ద్వారాలు భక్తులు రాగానే ఆలయానికి అతి సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సప్త ద్వారాలు తెరుచుకున్నాయి. అర్చక స్వాములు సప్త ద్వారాలు, ఆనంద నిలయం, గరుడ ద్వారానికి పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులందరూ అక్కడ ఏర్పాటు చేసిన సప్తద్వారాలు, ఆనంద నిలయం, గరుడ ద్వారాలను చూసి ఆశ్చర్యపోయారు. 85 వేల మందికిపైగా దర్శనం తిరుమల వెళ్లడానికి స్థానికులకు టోకెన్లు ఇవ్వకపోవడంతో అత్యధిక శాతం మంది భక్తులు తుమ్మలగుంట కు చేరుకున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వదర్శనం కల్పించడంతో సుమారు 85 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించి వైకుంఠ ద్వారంలో ప్రవేశించారు. వీఐపీల దర్శన సమయంలో కూడా సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తుమ్మలగుంటకు పోటెత్తిన భక్తులు సామాన్య భక్తులకు పెద్ద పీట తిరుమల తరహాలో ఆగమశాస్త్రం ప్రకారం వైకుంఠ ద్వారానికి పూజలు చేసి ప్రారంభించారు. అంతకుముందు స్వామి వారి మూలమూర్తికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చన వంటి దైనందిన పూజా కార్యక్రమాలు పూర్తిచేశారు. అనంతరం భక్తులను వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతించారు. క్యూల్లోకి వచ్చిన భక్తులకు ఒక గంటలో స్వామి దర్శనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నప్పటికీ క్యూల్లో ఎక్కడా నిలబడే అవకాశం లేకుండా చేసి, దర్శనం కల్పించారు. -
ఎరువుల దుకాణాలపై దాడులు
పలమనేరు/కాణిపాకం: జిల్లాలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో యూరియా.. లేదయ! అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. ఇది నిజమని తేలడంతో ప్రత్యేక అధికారుల ద్వారా తనిఖీలు చేపట్టారు. ఆ మేరకు పలమనేరు ప్రాంతంలో ప్రత్యేక అధికారి సాలురెడ్డి, ఏవో సునీల్కుమార్రెడ్డి మంగళవారం తనిఖీలు చేశారు. పట్టణంలోని నాగలింగయ్యశెట్టి అండ్ సన్స్, కౌండిన్య ఏఓపీవోలలో ఫామ్–2 లేకుండా ఉన్న రూ.4.87 లక్షల విలువైన 12.5 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. పలు ఎరువుల దుకాణాల్లో ఎరువుల నిల్వ, అమ్మకం రికార్డులను పరిశీలించారు. కాగా సోమవారం బైరెడ్డిపల్లి, వీకోట మండలాల్లో రూ.15 లక్షల విలువజేసే 60 టన్నుల కాంప్లెక్స్ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పుంగనూరు, తవణంపల్లె మండలాల్లోనూ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పలమనేరులో రికార్డులను పరిశీలిస్తున్న అఽధికారులు ఎరువుల దుకాణాలపై దాడులు చేస్తున్న ప్రత్యేక అధికారులు -
ఏటా పెరుగుతున్న ‘క్రైమ్’
●చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా.. మూడు రాష్ట్రాలకు సరిహద్దు. చిన్నపాటి చైన్ స్నాచింగ్ కేసుల్లో కూడా నిందితులు పక్క రాష్ట్రాల వాళ్లే. నేరం పూర్తయిన వెంటనే నిముషాల్లో రాష్ట్ర సరిహద్దు దాటేయొచ్చు. నేరస్తులను పట్టుకోవడం, చోరీకి గురైన సొమ్ము రికవరీ, సైబర్ వలలో వేల కి.మీ ప్రయాణం.. ఇన్ని చేసినా ప్రతీ రోజూ నేరస్తులు జిల్లా పోలీసులకు సరికొత్త సవాళ్లను విసురుతూనే ఉన్నారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది పోలీసుశాఖ విడుదల చేసిన వార్షిక నేర సంక్షిప్త నివేదికలో కొన్ని గణాంకాలు ఆశ్చర్య పరస్తుంటే.. మరికొన్ని పర్వాలేదనిపిస్తున్నాయి. సామాన్య ప్రజల ప్రశాంత జీవనమే పోలీసు ప్రధాన కర్తవ్యమని ఎస్పీ డూడీ చెబుతున్నారు. మంగళవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ 2025 పోలీసుశాఖ పనితీరు తెలిపే నివేదికను మీడియాకు వివరించారు. సంచలనాలు 2015లో జరిగిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు చింటూతో సహా ఐదుగురికి చిత్తూరు కోర్టు ఉరిశిక్ష విధించడం రాష్ట్రంలోనే సంచనాత్మక తీర్పుగా మారింది. ఇక చిన్నపిల్లలపై లైంగిక దాడుల ఘటనల్లో వేర్వేరు కేసుల్లో ఐదుగురికి 20 ఏళ్ల జైలుశిక్ష కూడా పడింది. చిత్తూరు నగర శివారుల్లో ఓ మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు గ్యాంగ్రేప్ చేయడం, ఒడిశా నుంచి కుప్పంకు గంజాయి దిగుమతి చేయడం, రూ.80 వేలు అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం లాంటి ఘటనలు రాష్ట్రంలోనే చర్చనీయాంశమయ్యాయి. చైన్స్నాచింగ్ చేస్తూ పూతలపట్టులో మహిళ మృతికి కారణమైన హేమచంద్ర, సురేష్, మస్తాన్ను పోలీసులు అరెస్టు చేయడం, వి.కోటలో దారిదోపిడీ చేస్తున్న జయపాల్ను అరెస్టు చేసి రూ.3.2 కోట్ల విలువ చేసే బంగారు బిస్కెట్లు సీజ్ చేయడం, గుడిపాలలో యువతులను బెదిరించి లైంగిక దాడులు చేసిన కేసులో జాన్ అలెక్స్ను పట్టుకోవడం కూడా జిల్లా పోలీసులకే సాధ్యం. పెరిగిన నేరాలు నేరం 2024 2025 రోడ్డు ప్రమాదాలు 748 771 మృతులు 402 381 పోక్సో 46 56 మాదకద్రవ్యాలు 49 50 హత్యలు, గొడవలు 857 859 చోరీలు 476 426 ఛేదించినవి 236 207 చోరీకి గురైన సొమ్ము రూ.6.20 కోట్లు రూ.11.52 కోట్లు రికవరీ రూ.2.95 కోట్లు రూ.8.39 కోట్లు సామాన్యులకు అండగా.. గతేడాది మొత్తం 7,034 కేసులు రిపోర్టయితే, ఈ సారి 5,216 నమోదయ్యాయి. దాదాపు 26 శాతం క్రైమ్ రేట్ తగ్గించగలిగాం. రోడ్డు ప్రమాదాల్లో సాంకేతిక తప్పిదాలను సరిచేయడానికి కలెక్టర్తో మాట్లాడుతున్నాం. కొత్త ఏడాదిలో ‘ధైర్యస్పర్శ’ పేరిట ప్రజలు భయపడే కొన్ని ప్రాంతాలను మారుస్తున్నాం. మహిళా భద్రత, పిల్లలపై నేరాల నియంత్రణపై దృష్టి పెడుతున్నాం. గంజాయి, లాటరీ, పేకాటను ఏమాత్రం ఉపేక్షించం. ప్రజలు సహకరించాలి. – తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు. తగ్గిన నేరాలు నేరం 2024 2025 మహిళలపై 507 443 చోరీలు 124 88 మోసాలు 194 152 సైబర్ నేరాలు 30 19 ప్రాపర్టీ నేరాలు 480 466 -
భూలోక వైకుంఠం!
తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు.బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025తిరువీధుల మెరసీ దేవదేవుడు..తిరువీధుల మెరసీ దేవదేవుడు.. గరిమల మించిన సింగారములతోడను.. అని అన్నమయ్య ఆ శ్రీనివాసుడిని కీర్తించాడు. ఆ కీర్తనలు నిజం చేస్తూ మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమల.. చూసిన కనులదే భాగ్యమన్న రీతిలో మెరిసింది. దీనికితోడు అశేష భక్తజన సందోహం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తవత్సలుడిని దర్శించు కుంది. ఈ పర్వదినం రోజున వేంకటాచలపతి స్వర్ణరథంపై ఊరేగుతుండగా భక్తకోటి స్వామివారిని దర్శించుకుని, తన్మయం చెందింది. భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా తిరుమలలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకుంది. – తిరుమల శ్రీవారి ఆలయంలో ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణస్వర్ణరథోత్సవంలో పాల్గొన్న భక్తులువిద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం లోపలి భాగం -
మట్టి..కొల్లగొట్టి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి నేతలు మైనింగ్ మత్తులో జోగుతున్నారు. ఇసుక, మట్టిని ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు. చిత్తూరు మండలం, బండపల్లి రెవెన్యూలోని 194 వెంకటాపురంలో కూటమికి సంబంధించిన వ్యక్తులు మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా కొండను తవ్వేస్తున్నారు. జేసీబీలతో కరిగించేస్తున్నారు. ట్రాక్టర్లతో పట్టణానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ మట్టి రూ.1000కి విక్రయిస్తున్నారు. ఇలా వందల ట్రాక్టర్లు తిప్పేస్తున్నారు. జేసీబీకి లోడ్కు రూ.150 చెల్లించి మిగిలిన ఆదాయాన్ని కూటమి నేతలు జేబులో వేసుకుంటున్నారు. మామిడి తోట అడ్డుగా ఉండడంతో ఈ దోపిడీ ఎవరి కంటా పడడం లేదు. 20 రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా మట్టి దోపిడీ సాగుతోంది. అడవిలో జింకల సంచారం ఉందని, మట్టి తవ్వకాలతో మూగజీవులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి.. మట్టి దోపిడీని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. సేదతీరుతున్న మూగజీవాలకు ఆటంకం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. -
తిరుపతి జిల్లాలో చేర్చే వరకు పోరాటం ఆగదు
కార్వేటినగరం: తమ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపేంత వరకు పోరాటం ఆగదని అఖిల పక్ష నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని గాండ్లమిట్ట కూడలిలో అఖిలపక్ష నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు కార్వేటినగరంలో బాదుడేబాదుడు కార్యక్రమంలో భాగంగా కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా ఇదేమాదిరిగా హామీలిచ్చారన్నారు. అయితే రాష్ట్రంలో నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతున్నప్పటికీ ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలపకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని నెరవేర్చేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రసాద్రెడ్డి, సుబ్రమణ్యంరాజు, గౌతంరాజు, శివలింగం, పయణి పాల్గొన్నారు. ఉపాధి పనులపై విజి‘లెన్స్’! పులిచెర్ల(కల్లూరు): మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలు జరిగాయని గతంలో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కేంద్ర విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు మూడు నెలల క్రితం మండలానికి విజిలెన్స్ అధికారులు విచ్చేశారు. ఆ సమయంలో వర్షాలు పడుతుండడంతో పులిచెర్ల మండలంలోని పాళెంపంచాయతీలో రెండు ఫారంపాండ్లను తనిఖీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అదే విధంగా సామాజిక తనిఖీ బృందం కూడా తనిఖీలు చేపట్టింది. మంగళవారం 106 రామిరెడ్డిగారిపల్లె, పులిచెర్లలో చేసిన పనులను కొలతలు తీశారు. నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. -
మా భూమిపై చల్లా బాబు పెత్తనం ఏంటి?
పలమనేరు: ‘మా భూమిపై చల్లాబాబు, అతని మనషుల పెత్తనం ఏంటి.. తనకు ఆరోగ్యం బాగోలేక కొంత ఆస్తిని అమ్ముకున్నా. దీనిపై మా కుటుంబంలో కోర్టు కేసులున్నాయు. వాటిని మేము తేల్చుకుంటాం. అయినా మా భూములపై పుంగనూరు టీడీపీ ఇన్చార్జి చల్లాబాబు, ఆయన మనుషుల ప్రమేయం ఏంటి..? అని ఓ బాధితురాలు మంగళవారం పలమనేరు ఆర్డీవో భవానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలు.. చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం, గాజులపల్లికి చెందిన లెట్ శంకరరాజు భార్య పరిమళకు పుంగనూరు పరిధిలో భర్త మరణాంతరం హక్కు కలిగిన కొన్ని భూములున్నాయి. బాధితురాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తన చికిత్స కోసం కొంత భూమిని ఇతరులకు విక్రయించుకొంది. దీనిపై ఆమె భర్త మొదటి భార్య కుమారుడైన దినకర్ మదనపల్లి సబ్కోర్టులో కేసు వేశాడు. ఇలా ఉండగా చల్లా బాబుకు చెందిన మనుషులు వెంకటముని, శ్రీకాంత్ అక్కడి తహసీల్దార్ ద్వారా పలమనేరు ఆర్డీవోకు చెప్పించి తమ భూములు రిజిస్ట్రర్ కాకుండా బ్లాక్లిస్ట్లో పెట్టించారని తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తనకు న్యాయం చేయాలని ఆర్డీవోను కోరింది. -
పేదల బతుకులు చితికిపోతున్నాయి బాబూ!
–మాజీ ఉప ముఖ్యమంత్రి ధ్వజం కార్వేటినగరం: బాబు ప్రభుత్వంలో పేదల బతుకులు చితికిపోతున్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేవారు. మంగళవారం పుత్తూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా సూపర్సిక్స్ హామీలను అమలు చేయకపోగా కేవలం ధనంవతులు, ఉన్నవారికే పెద్దపీట వేయడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానం బడుగు, బలహీన వర్గాల పాలిట శాపంగా మారిందన్నారు. 2025లో చంద్రబాబు ప్రభుత్వం అనేక మార్పులకు శ్రీకారం చుట్టి తద్వారా అన్ని వర్గాల వారికి తీరని అన్యాయం, ద్రోహం చేసినట్లు చెప్పారు. వ్యవస్థలను ఎమ్మెల్యేల గుప్పెట్లోకి తీసుకుని పేదలను ముంచేస్తున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీల స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడిచేలా సీఎం చంద్రబాబు డైరెక్షన్ ఇవ్వడం విడ్డూరమన్నారు. సామాన్య ప్రజలు ఎక్కడికెళ్లినా న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన బాధితులను ఏ పార్టీకి చెందిన వారని అధికారులు అడగడం శోచనీయమన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేసి పేదల కడుపుకొట్టేందుకు పూనుకున్నట్లు విమర్శించారు. అన్నదాతల గురించి పట్టించకోకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇసుక, గ్రావెల్ను విచ్చిలవిడిగా సరిహద్దులు దాటిస్తూ దోచుకుంటున్నా అధికారులు ఏం చేయలేకున్నారని ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ నాయకు లు చెప్పినట్లు అడుతున్నాయని ఆక్షేపించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
పుంగనూరు: అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారున్ని ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి పట్టణ సమీపంలోని అరబ్బీ కాలేజీ వద్ద చోటుచేసుకుంది. మండలంలోని గుడిసె బండకు చెందిన వెంకటరమణ కుమారుడు సోమశేఖర్(26) పట్టణంలోని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని రాత్రి ఇంటికి వెళుతుండగా అరబ్బీ కాలేజీ వద్దకు రాగానే ఎదురుగా పుంగనూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సోమశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
కేంద్ర నిధులపై ఆంక్షలేంటి?
జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ధ్వజం చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ఆర్థిక సంఘ నిధుల పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల పై నిబంధనలు పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఏడాదిన్నరగా అక్రమాలు జరుగుతుంటే ఎందుకు విచారణ చెయ్యలేదని ప్రశ్నించారు. స్పరంచుల పదవీ కాలం ముగయనుండడంతో ఇలాంటి చర్యలకు కుట్రపన్నారని ధ్వజమెత్తారు. గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వరాదని, ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు మంజూరు చేయరాదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం జీతాలు లేకుండా పనిచేయడం లేదు కదా అని ప్రశ్నించారు. అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. ఎర్రవారిపాళెంలో రూ.20 లక్షలతో ఆస్పత్రిలో పోస్ట్మార్టం భవనం నిర్మించడానికి అనుమతులిచ్చినా ఎందుకు పనులు చేయలేదని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు సమావేశానికి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వితంతు పింఛన్లు 319, వికలాంగ పింఛన్లు 222 కొత్తగా మంజూరైనట్టు వెల్లడించారు. సీఈఓ రవికుమార్నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ భారతి పాల్గొన్నారు. మొక్కుబడిగా.. స్టాండింగ్ కమిటీ సమావేశమంటే పలు శాఖల అధికారులకు లెక్క లేకుండా పోయింది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి హెచ్ఓడీలు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. చిత్తూరు జిల్లా నుంచి పలువురు అధికారులు హాజరుకాలేదు. దీంతో సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.43 గంటలకు ముగించేశారు. కమిటీల పరంగా జెడ్పీటీసీ సభ్యులు మారాల్సి ఉండగా మారలేదు. హాజరుపట్టికలో మాత్రం సంతకాలు పెట్టేశారు. 4వ కమిటీ సమావేశానికి 1,7 కమిటీలో ఉన్న సభ్యులే ఉన్నారు. సమస్యలపై నిలదీత పలు అంశాల పై జెడ్పీటీసీ సభ్యులు అధికారులను నిలదీశారు. కుప్పంలో కొలమాసపల్లె–నెలిపట్ల రోడ్డు టెండర్ అయినా ఇంతవరకు ఎందుకు పనులు ప్రారంభిచలేదని ప్రశ్నించారు. అలాగే పుంగనూరు, సదుం, పీలేరు, భాకరాపేట దారులు గుంతలుపడినా పట్టించుకోలేదన్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో హంద్రీ–నీవా ప్రాజెక్టు నుంచి ఉపకాలువలు నిర్మించి తద్వారా చెరువులను నింపాలన్నారు. గతంలో ఇంటి స్థలం మంజూరైన వారికి ప్రస్తుతం రుణ సాయం చేస్తారనే అంశాన్ని లేవదీశారు. అలాగే పునాది పనులు పూర్తయిన గృహాలకు సాయం అందిస్తారా..? అని ప్రశ్నించారు. విద్యుత్ అధికారులు తాగునీటి సర్వీసులకు కూడా కరెంటు పోల్స్ ఇవ్వకపోవడమేంటని మండిపడ్డారు. ఆర్డీఎస్ఎస్ పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. పలు ప్రాంతాల్లో కేబుల్స్ పాడైనా మార్చడం లేదన్నారు. పాలసముద్రం మండలంలో అంగన్వాడీ భవనం పూర్తయినా ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. కార్యక్రమంలో పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
చట్టాన్ని అతిక్రమించే పనులొద్దు
చిత్తూరు అర్బన్ : నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు, యువత చట్టాన్ని అతిక్రమించే చర్యలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాదీ నూతన సంవత్సరం అర్ధరాత్రి ఆనందోత్సవాల్లో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే కుటుంబాలు సురక్షితంగా, సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. 31వ తేదీ రాత్రి వేడుకల పేరుతో బైకులపై తిరుగుతూ గోల చేయడం చట్టానికి వ్యతిరేకమన్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు. వీడియో రికార్డింగ్కు వినతి శాంతిపురం: కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం భూ సేకరణలో భాగంగా బుధవారం జరగనున్న పబ్లిక్ హియరింగ్ ప్రక్రియను పూర్తిగా వీడియో తీయాలని బాధిత రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం కుప్పం ఆర్డీవో, శాంతిపురం తహసీల్దార్లకు వారు వినతి పత్రాలను అందించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ విచారణలో రైతుల అభిప్రాయాలు, అధికారుల ప్రకటనలు, ప్రసంగాలను వీడియో రికార్డింగ్ చేసి, మొత్తం వీడియో కాపీని తమకు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూ సేకరణకు కొందరు రైతులు ససేమిర అంటూ హై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అధికారులు నేడు మరో విడత బహిరంగ విచారణ నిర్వహించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
మా భూమి వ్యవహారంలో వారి పెత్తనమా.?
నా భర్త ద్వారా సంక్రమించిన ఆస్తిలో మా కుటుంబంలో ఏమైనా తగరార్లుంటే మేం చూసుకుంటాం. కానీ అధికార పార్టీ నాయకులు ఆర్డీవోకు చెప్పి మా భూములను బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఏంటి. నా ట్రీట్మెంట్కు కావాల్సిన డబ్బులు రాకుండా పోయాయి. దీనికి కారణం కూటమి నాయకులే. మా భూమిపై వీరి పెత్తనం ఏంటి. తనకు న్యాయం కావాలనే ఆర్డీవో వద్దకొచ్చా. – పరిమళ, బాధితురాలు దీనిపై విచారించి న్యాయం చేస్తాం పరిమళ అనే బాధితురాలు తన సమస్యను తెలుపుకుంది. కోర్టు కేసులో ఉన్న ఆస్తిపై బ్లాక్లిస్ట్లో పెట్టారని చెప్పింది. దీనిపై పుంగనూరు తహసీల్దార్ ద్వారా విచారించి ఆమెకు న్యాం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఇందులో రాజకీయ ప్రమేయం లేదు. దీనిపై మానవతా హృదయంతో బాధితురాలికి న్యాయం చేస్తాం. – భవాని,ఆర్డీవో, పలమనేరు -
కాణిపాకంలో పలువురు ప్రముఖులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఆలయ పునఃనిర్మాణ దాతలు, వెండి వాకిలి, బంగారు వాకిలి దాత లు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ ఉన్నారు. వీరికి ఈవో పెంచల కిషోర్, ఆలయ బృందం ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. పండితుల ఆశీర్వచనాలు, ప్రసాదం అందజేశారు. రాష్ట్ర స్థాయి బేస్ క్యాంప్నకు ఎంపిక రొంపిచెర్ల: రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి విక్రాంత్ ఎంపికై నట్లు ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం తిరుపతిలో జరిగిన జోనల్ లెవల్ పోటీలలో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్టు పేర్కొన్నారు. రొంపిచెర్ల బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడని తెలిపారు. విక్రాంత్ ఎంపికకు కృషి చేసిన భవిత పాఠశాల ఉపాధ్యాయులు అములు, మానసను అభినందించారు. త్వరలో విజయవాడలో జరిగే ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో పాల్గొంటారని ఎంఈవో తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత గుడిపాల: తమిళనాడు నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. తమిళనాడు నుంచి ఆంధ్రకు అక్రమంగా బియ్యం సరఫరా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డులోని రెట్టగుంట ఫ్లైఓవర్ వద్ద వేచి ఉన్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో చిత్తూరు రూరల్ మండలం, మాపాక్షి గ్రామానికి చెందిన అరుణ్(45) అనే వ్యక్తి ద్విచక్ర వాహ నంలో బియ్యాన్ని తీసుకువెళుతుండగా పట్టుకున్నామన్నారు. అతన్ని విచారించగా తక్కువ రేటుకు కొనుగోలు చేసి అధిక రేటుకు అమ్ముకుంటున్నట్లు తెలిపాడన్నారు. అతని వద్ద ఉన్న 250 కిలోల బియ్యాన్ని సీజ్ చేసి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పల్లెలు శుభ్రంగా ఉండాలిచిత్తూరు కార్పొరేషన్: పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలన్నారు. సంక్రాంతి పండుగకు గ్రామాలు శుభ్రంగా ఉంచాలన్నారు. వచ్చే నెల 15లోపు స్వచ్ఛరథం సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకోసం పాత రేషన్ సరఫరా వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ పాల్గొన్నారు. -
ముక్కోటికి ముస్తాబు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శోభాయమానంగా అలంకరించారు. ఆలయ అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేకించి వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలు, చలువ పందిళ్లు, రంగవల్లులు, విద్యుత్దీపాలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మంగళవారం వేకువ జాము 12–05 గంటలకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొల్పి, ధనుర్మాస కై ంకర్యాలు నిర్వహించనున్నారు. ఉదయం 1.35 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి వైకుంఠ ద్వారం గుండా అనుమతించనున్నారు. సాయంత్రం 4గంటలకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. 31 బుధవారం వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకొని ఉదయం 6.30 గంటల నుంచి 7.30 వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నాన్నం నిర్వహించనున్నారు. విద్యుత్ దీపకాంతులతో అలరారుతున్న ప్రసన్నుడి ఆలయం -
అట్టహాసంగా చదరంగం పోటీలు
కల్యాణ వెంకన్న ఆలయం వద్దసప్తద్వారాల ఏర్పాటుచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఆర్కే పాఠశాలలో నిర్వహించిన ఏపీ ఓపెన్ చెస్ టోర్నీ అట్టహాసంగా సాగింది. ఈ టోర్నీలో ఏపీ చెస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ఆర్బీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో చదరంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మొత్తం 11 కేటగిరీల్లో సాగిన ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలు నిలిచారు. గెలుపొందిన వారికి రూ.1.29 లక్షల విలువైన నగదు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం విజేతలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, నగదు అందజేశారు. కార్యక్రమంలో చెస్ సంఘం జిల్లా అధ్యక్షుడు బాబుప్రసాద్రెడ్డి, పాఠశాల నిర్వాహకులు రవీంద్ర, కోమల, చెస్ సంఘం సభ్యులు దినేష్, కిశోర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పునర్విభజనం.. అసంబద్ధం
జిల్లాల పునర్విభజన అసంబద్ధంగా జరిగింది. టీడీపీకి అనుకూలంగా మండలాలను ఒకటిగా చేసి, వైఎస్సార్సీపీకి పట్టున్న మండలాలు, నియోజకవర్గాలను ముక్కలు ముక్క లుగా చేసింది. వేర్వేరు జిల్లాల్లోకి కలిపివేసింది. దీంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న నిపుణుల హెచ్చరికలను సైతం తోసిపుచ్చింది. టీడీపీ అసంబద్ధ నిర్ణయాల కారణంగా ప్రజలు ఇక్కట్లుపడక తప్పదని మేధావులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జిల్లాల పునర్విభజన చేపట్టారనే ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు ప్రభుత్వం నియోజక వర్గాలను చిందర వందరగా చేసింది. అసెంబ్లీ ఒకటైతే.. ఆ నియోజక వర్గ పరిధిలోని మండలాలను మరో జిల్లాలోకి చేర్చి గందరగోళానికి తెరతీశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్ని మండలాలు ఒకే నియోజకవర్గంలో ఉండడం, ఆ నియోజక వర్గం ఒకే జిల్లాలో ఉంటేనే పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాల స్వరూపాన్నే మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభీష్టం మేరకు అని చెబుతూ.. చంద్రబాబు ప్రభుత్వం సోమవారం జిల్లాల మార్పులు, చేర్పులు చేపట్టింది. ఈ మార్పులు చేర్పుల్లో పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని సోమల, సదుం, చౌడేపల్లి, పుంగనూరు మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు. అదే పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్షతోనే పుంగనూరు నియోజక వర్గాన్ని ముక్కలు ముక్కలుగా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాను విడగొట్టడంతో నాలుగు డివిజన్లు, 28 మండలాలతో చిత్తూరు చిన్నదిగా మారిపోయింది. గందరగోళంగా తిరుపతి జిల్లా.. తిరుపతి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, చంద్రగిరి నియోజక వర్గాలు ఉండేవి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోకి కొత్తగా కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలుపుతూ కాబినెట్ నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కోట, చిల్లకూరు, గూడూరు మండలాలను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి కలిపారు. ఇదే గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, చిట్టమూరు మండలాలను మాత్రం తిరుపతి జిల్లాలోనే ఉంచారు. అలాగే వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలిపారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు నాలుగు డివిజన్లు, 36 మండలాలను తిరుపతి జిల్లాగా ప్రకటించారు. ఇలా చేయడంతో ప్రతి ఎన్నికల్లోనూ, పాలనాపరమైన సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా -
చిత్తూరుకు ఐపీఎస్ తరుణ్ పహ్వ
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు జిల్లాలో ఆరు నెలల శిక్షణ నిమిత్తం ఐపీఎస్ అధికారి డా.తరుణ్ పహ్వ నియమితులయ్యారు. సోమవారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. హర్యాణ రాష్ట్రం, చర్కీదాద్రీ జిల్లాకు చెందిన తరుణ్ 2020లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గతేడాది ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఆర్నెళ్ల పాటు జిల్లాలో పోలీసు పరిపాలనపై శిక్షణ పొందనున్నారు. జీఎస్టీ మోసంపై ఎస్పీకి ఫిర్యాదు చిత్తూరు అర్బన్: చిత్తూరులో వెలుగు చూసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను (ఐటీసీ) దోచుకోవడంపై సోమవారం ఎస్పీ తుషార్ డూడీకి ఫిర్యాదు చేశారు. సంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు తన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని.. ఓ కంపెనీ స్థాపించి జీఎస్టీ పేరిట భారీగా ఐటీసీ దోచుకోవడంపై విజయ్చక్రవర్తి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఏఐటీయూసీ నాయకుడు నాగరాజన్తో కలిసి ఎస్పీకి వినతిపత్రం అందచేశారు. తనకు ఇందులో సంబంధంలేదని పేర్కొన్నాడు. అయితే బాధిత వ్యక్తి ప్రమేయం లేకుండా రూ.కోట్లలో లావాదేవీలు ఎలా జరిగాయంటూ ఎస్పీ ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీసు గ్రీవెన్స్కు 50 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 50 వినతులు అందాయి. ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. తాగి రోడ్లపైకి వస్తే చర్యలు! చిత్తూరు అర్బన్: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం ఉత్తమమని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. అలాకాదని తప్పతాగి రోడ్లపైకి రావడం, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ న్యూసెన్స్ చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. 31వ తేదీ రాత్రి 9 నుంచి.. తెల్లవారు జాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు గస్తీ ఉంటుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బ్లూకాట్స్, రక్షక్ వాహనాలతో నిత్యం పహారా ఉంటుందన్నారు. వేడుకల పేరిట ఎవ్వరికీ ఇబ్బందులు కలిగించొద్దని.. కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం మంచిదని సూచించారు. డయల్ యువర్ ఎస్ఈకి ఏడు ఫిర్యాదులు చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ ఫిర్యాదులను స్వీకరించారు. సోమల నుంచి ఫోన్లో మాట్లాడుతూ పైకం చెల్లించినా వ్యవసాయ సర్వీసును విడుదల చేయలేదని ఫిర్యాదు చేశారు. అలాగే బార్బర్షాప్నకు విద్యుత్ సబ్సిడీ మంజూరు చేయాలని కోరారు. చిత్తూరులోని మురకంబట్టు, ఆర్వీఎస్ నగర్ నుంచి లోఓల్టేజీ సమస్య ఉందని అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కేబుల్ మార్పు చేయాలని వినియోగదారులు తెలిపారు. యాదమరి నుంచి సోలార్కు నెట్ మీటర్ ఏర్పాటు చేయాలని, బైరెడ్డిపల్లె నుంచి వ్యవసాయ సర్వీసు విడుదల చేయాలని, నిండ్ర నుంచి వ్యవసాయ సర్వీసుకు అంచనా వేయాలని, గంగవరం నుంచి ఓల్టేజీ సమస్య తీర్చాలని ఫిర్యాదులు వచ్చాయి. -
కాళ్లుమొక్కుతాం.. సమస్యలు పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా మీ కాళ్లుమొక్కుతాం.. మా సమస్యలు పరిష్కరించి న్యాయం చేయండి’ అంటూ అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు పాల్గొని ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ ఆన్లైన్ సర్వర్ మొరాయించడంతో ఆఫ్లైన్ విధానంలో అర్జీలను నేరుగా స్వీకరించారు. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి రాష్ట్రంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి కోరారు. ఈ మేరకు ఆ పరిషత్ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైజాగ్ గ్రామీణ, వేములవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 500 ఎకరాలకు పైగా ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
రెండేళ్లుగా.. ఏం చేస్తున్నారు?
పుంగనూరు: ‘తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ప్రతిపక్ష పార్టీలపై కేసులు, అరెస్ట్లు చేయడమే పనిగా పెట్టుకుంది’..అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై తొలిసారిగా వినతులు స్వీకరించారు. ప్రజలతో విడివిడిగా మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్ లేదయ్యా! ప్రజలు చాలా మంది పింఛన్ల కోసమే ఎక్కువగా వినతులు సమర్పించారు. దివ్యాంగ పెన్షన్లు , మూడు చక్రాల సైకిళ్లు కావాలని కోరారు. అలాగే వితంతువులు పెన్షన్లు కావాలని, మహిళలు ఇంటి పట్టాలు కావాలని అభ్యర్థించారు. నక్కబండ ప్రాంతంలో గత ఇరవై రోజులుగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ వాటిని అప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తా అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇకపై ప్రతి సోమవారం ప్రజా వినతులు స్వీకరించి, సమస్యలు పరిష్కరించేందుకు ఒక్కొక్క మండలంలో పర్యటిస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని మండి పడ్డారు. ‘ఈ ప్రభుత్వంలో నలుగురు తపేదారులు ఉన్నారు. వారికి డబ్బులిస్తే సరిపోతుంది. ప్రజా సమస్యలు పరిష్కరించకపోయినా పరవలేదు అనే ధోరణిలో అధికారులు పనిచేస్తే సహించేది లేదు’ అన్నారు. మా పార్టీ కార్యకర్తలే సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తారని హెచ్చరించారు. అప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోతే అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. స్వలాభం కోసమే! టీడీపీ అధికారంలోకి వచ్చినరోజు నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, అధికారులు కలసి స్వలాభం చూసుకుంటున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసం సద్వినియోగం చేయాలని కోరారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వక్ఫ్ బోర్డు మాజీ జిల్లా చైర్మన్ అమ్ము, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇర్ఫాన్, ఎంపీపీ భాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి, కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, కమిషనర్ మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ రాము పాల్గొన్నారు. -
ఆదర్శంగా ఉండాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు ఆదర్శంగా ఉండాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య మహాజన సభ నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల జీవన ప్రమాణాల పెంపునకు అనేక సంక్షేమ పథకాలున్నాయన్నారు. మన డబ్బులు మన లెక్కలు పైన ప్రతి సంఘ సభ్యురాలికి సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో 58 వేల మందిని అక్షరాసులుగా తీర్చిదిద్దేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలుగా అముద, కార్వేటినగరం, కార్యదర్శిగా పూతలపట్టుకు చెందిన ప్రసన్న, కోశాధికారిగా కుప్పానికి చెందిన గౌతమి, ఉపాధ్యక్షురాలుగా యాదమరి చెందిన రజియా, ఉప కార్యదర్శిగా గుడిపాలకు చెందిన సరళాను ఎన్నుకున్నారు. డీపీఎం రవి, ఏపీడీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
హెచ్పీవీతో క్యాన్సర్ కిల్!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సర్వైకల్ క్యాన్సర్ను నియంత్రించే హెచ్పీవీ టీకాను కిశోర బాలికలకు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు శిక్షణ ఇచ్చింది. వైద్యులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు ఉన్న బాలికలను గుర్తించనున్నారు. కాగా ఇప్పటి వరకు వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 53 వేల మంది కిశోర బాలికలు ఉన్నట్టు అంచనా. వారికి ఒక డోసు హెచ్పీవీ టీకా వేస్తే భవిష్యత్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు తలెత్తకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసులు మహిళల్లో రొమ్ము క్యాన్సర్తో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు పెరుగు తున్నాయి. హ్యుమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఇది సోకుతుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల పాటు వృద్ధి చెంది క్యాన్సర్కు కారణమవుతుంది. ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పోతే ప్రమాదమే. అందుకే ప్రభుత్వం బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా వేయాలని నిర్ణయించింది. టీకా జిల్లాకు రాగానే సిబ్బంది 14ఏళ్లు నిండిన బాలికలను గుర్తించనున్నారు. ఎన్సీడీ 4.0లో.. గతనెల రోజులుగా జిల్లాలో ఎన్సీడీ సర్వేను చేపడుతున్నారు. 16 లక్షల మందిని సర్వే చేయాల్సి ఉండగా...ఇప్పటి వరకు 4 లక్షల మందిని సర్వే చేశారు. ఈ సర్వేలో ఇది వరకు ఓరల్ క్యాన్సర్ ఉన్న వారు 160 మంది బయటపడ్డారు. బ్రెస్ట్ క్యాన్సర్ 124 మందికి ఉన్నట్లు గుర్తించారు. సర్వైకల్ క్యాన్సర్ 98 మందికి ఉన్నట్లు నిర్థారించారు. సర్వే పూర్తయితే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్న వారి సంఖ్య 300 దాటొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ఓరల్ క్యాన్సర్లో కూడా మహిళలే అధికంగా ఉంటున్నట్టు సమాచారం. టీకా ఇచ్చేలా.. ముందుగా కిశోర బాలికలకు టీకా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులకు శిక్షణ ముగిసింది. బడిలో చదివే కిశోర బాలికలను గుర్తించాలని ఆదేశించారు. త్వరలో వారికి టీకాలు ఇవ్వనున్నారు. సర్వైకల్ క్యానర్స్ లక్షణాలు యోని నుంచి రక్తస్రావం లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం రుతు క్రమంలో సమస్యలు పీరియడ్స్ ఆగిపోయినా తర్వాత రక్తస్రావం మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలు మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ను కట్టడి చేసేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. అందుకోసం జిల్లాలో 14 ఏళ్లు నిండిన కిశోర బాలికలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాంగంగా సోమవారం సీహెచ్సీ, పీహెచ్సీ వైద్యులకు శిక్షణ పూర్తి చేసింది. బాలికల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన ఈ వ్యాక్సిన్ను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి మహిళలు మూడేళ్లకు ఒకసారి స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాలి. ఈ టెస్టులపై నిర్లక్ష్యం వద్దు. అలాంటప్పుడే ఈ సర్వైకల్ క్యాన్సర్ను గుర్తించగలం. లేకుంటే అది ప్రమాదకరంగా మారుతుంది. ఇక 9 నుంచి 14 ఏళ్ల వయస్సులోని బాలికలు రెండు డోస్ల హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలాగే పెళ్లికి ముందు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడం ఉత్తమం. ఈ విషయలో నిర్లక్ష్యం చేయకండి. బాలికలతో పాటు మహిళలు కూడా సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలి. ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు -
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
గుడిపాల: టిప్పర్ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. సోమవారం ఉదయం 189 కొత్తపల్లెకు చెందిన నేషన్(55) రోడ్డు దాటుతుండగా వేలూరు నుంచి చిత్తూరు వైపునకు వెళ్తున్న ఓ టిప్పర్ లారీ ఢీకొని వెళ్లిపోయింది. తలకు బలమైన గాయం తగలడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నాలుగు టిప్పర్లు సీజ్ నగరి : ఓవర్లోడ్తో వెళుతున్న నాలుగు టిప్పర్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. అధిక లోడ్ టిప్పర్ల కారణంగా రోడ్లు ఛిద్రమవుతున్నట్లు ప్రజల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో ఆర్డీవో సూచనల మేరకు సోమవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సహకారంతో తనిఖీలు నిర్వహించామన్నారు. ఓవర్లోడ్తో వెళ్తుతున్న నాలుగు టిప్పర్లను సీజ్ చేసి రూ. 91,120 జరిమానా విధించామన్నారు. సీజ్చేసిన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. తరచూ తనఖీలు నిర్వహిస్తామని బిల్లుల్లో తేడా వచ్చినా, ఓవర్ లోడ్ అని తేలినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాణిపాకంలో ప్రముఖులు కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి క్షేత్రం సోమవారం ప్రముఖులతో సందడిగా కనిపించింది. పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు స్వామి సన్నిద్ధికి వచ్చారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నీరజ్ తివారీ, పాట్నా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణారెడ్డి, పుల్లా కార్తీక్, కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ ఎస్కినాగి , సందేశ్, ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు, తెలంగాణ రాష్ట్ర ఆర్టీ కమిషన్ శ్రీనివాసులురావు, తెలంగాణ రాష్ణ్ర గవర్నర్ సతీమణి సుధాదేవ్ వర్శ, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర, హిందూపురం ఎంపీ పార్థసారథితో పలువురు ఎమ్మెల్యేలు దర్శించున్నారు. వీరికి ఆలయ ఈవో పెంచలకిషోర్, చైర్మన్ మణినాయుడు, ఏఈవో రవీంద్రబాబు అతిథి మర్యాదలు చేశారు. ఎరువుల దుకాణాల తనిఖీ చిత్తూరు రూరల్ (రూరల్): జిల్లాలోని ఎరువుల దుకాణాలను సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ తనిఖీ బృంద అధికారులు పరిశీలించారు. బంగారుపాళ్యం, వి.కోట, బైరెడ్డిపల్లి, కుప్పం మండలాల్లోని పలు దుకాణాలను బృందం అధికారులు సునీల్, మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, సాలురెడ్డి, వెంకటేశ్వరు తనిఖీ చేశారు. ఎరువులు, క్రయ విక్రయాలపై క్షుణంగా పరిశీలించారు. ఎరువుల నిల్వలను లోతుగా విచారించారు. ఈ తరుణంలో బిల్లులు సక్రమంగా లేని కారణంగా...రూ.15 లక్షల విలువ చేస 60 మెట్రిక్ టన్నుల యూరియాను గుర్తించారు. ఈ తనిఖీ మరో రెండు రోజుల పాటు సాగనుందని వ్యవసాయశాఖ ఆధికారులు తెలిపారు. నేడు జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. ఉదయం 10.30కు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. 1–7 కమిటీ అంశాలైన ఆర్థిక, ప్రణాళిక, పనులు, గ్రామీణభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం అంశాల పై చర్చ ఉంటుందన్నారు. అధికారులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 16 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 91,147 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,400 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే తిరుమలలో చలి తీవ్రత పెరిగిపోయింది. భక్తులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూములు దొరక్క ఉన్న భక్తులు వెయిటింగ్ హాళ్ల వద్ద, టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద చలికి వణుకుతూ కనిపిస్తున్నారు. -
రేపు హిందూ సమ్మేళనం
ఐరాల: మండల కేంద్రంలోని వారపు సంతలో మంగళవారం ఉదయం 10 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మండల హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి నిర్వాహకులు తెలిపారు. విశిష్ట అతిథిగా భువనేశ్వరి పీఠం, గన్నవరం శ్రీకమలానంద భారతి స్వామి హాజరవుతారని తెలిపారు. పెద్ద సంఖ్యలో హిందువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం ముగిసిన తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి యాదమరి: యువత మత్తు పదార్థాలు, గంజాయికి దూరంగా ఉండాలని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఆదివారం మండల పరిది బుడితిరెడ్డిపల్లి గ్రామంలో పశ్చిమ విభాగం సీఐ శ్రీధర్ నాయుడు, స్థానిక పోలీసులతో కలసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులతో పాటు వారి ఇళ్లను తనిఖీలు చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై మత్తు పదార్థాల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పులిచెర్ల(కల్లూరు): చాలా రోజుల తర్వాత ఆదివారం ఒంటరి ఏనుగు మండలంలోకి వచ్చింది. పొలాల్లో ప్రవేశించి పంటలను నాశనం చేసింది. ఏడాదిగా మండలంలో తిష్ట వేసిన ఏనుగుల గుంపును నెల రోజుల క్రితం ఫారెస్టు అధికారులు ఇతర ప్రాంతాలకు మళ్లించారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంటల సాగుకు సిద్ధమయ్యారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మండలంలోని పాళెం పంచాయతీ కోటపల్లెలోని ఒక రైతు మామిడి తోటలోకి ఒంటరి ఏనుగు ప్రవేశించి కొమ్మలను విరిచి వేసింది. దీంతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది. చరిత్రకు సాక్ష్యాలు నాణేలు చౌడేపల్లె : పురాతన నాణేలు, కరెన్సీ నోట్లు ఆయా దేశాల చరిత్ర, నాగరికతను తెలియజేస్తాయి. గత చరిత్ర ఘనతను భావితరాల వారికి అందించాలన్న ఉద్దేశంతో పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యానికి చెందిన సాయికృష్ణ ముందుకు సాగుతున్నాడు. 12 ఏళ్లుగా పురాతన నాణేతలతోపాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను సేకరిస్తున్నాడు. వాటిని పాఠశాలల్లో ప్రదర్శిస్తూ చరిత్రతోపాటు పిల్లలకు స్పూర్తినింపుతున్నాడు. ప్రస్తుతం అతని వద్ద రాజుల కాలంలో వినియోగించిన 26 రకాల నాణేలు, బ్రిటీష్ పాలనలోని నాణేలు, రిపబ్లిక్ పాలనలో ఉన్న ప్రస్తుత కరెన్సీ, రద్దు చేసిన 500, 1000 నోట్లతో సహా 96 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటి తరానికి మన ఘన చరితను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు సాయికృష్ణ వెల్లడించారు. -
నేడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పర్యటన
పుంగనూరు: మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పుంగనూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారని చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. 10 నుంచి సంక్రాంతి సెలవులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆ ఉత్తర్వులు డీఈవో కార్యాలయానికి చేరాయి. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. జనవరి 19 న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖా పరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్మ్డు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవై నా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. స్క్రబ్ టైఫస్..టెన్షన్ – అవగాహన లేక ఆందోళన చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు అధికమయ్యాయి. కేసుల నమోదులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కాలంలో 492 కేసులు నిర్ధారణ కాగా.. నవంబర్ నుంచి ఇప్పటి వరకు 57 కేసులు వచ్చాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కేసులను గుర్తించడంతో పాటు అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఇంటివద్ద అపరిశుభ్రత, పూల, ఇతరచెట్లు ఉండండంతో కొంత మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని వా రి విచారణలో తేలింది. అయితే అత్యధిక మంది రైతులే కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. వ్యవసాయ పొలలాకు వెళ్లేవారు, పశువుల పెంపంకం దారులే ఈ వ్యాధి బారిన పడినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ కట్టడికి శాఖతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థకశాఖ అధికారులు, సిబ్బంది రైతులకు అవగాహన కల్పి స్తే బాగుంటుందని వైద్యశాఖ పేర్కొంటోంది. తద్వారా స్క్రబ్ టైఫస్ కేసులను నివారించవచ్చునని శాఖ భావిస్తోంది. విద్యుత్ బిల్లుల వసూళ్లు రూ.1.35 కోట్లు చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు పనిచేశాయి. దీంతో రెండు జిల్లాల నుంచి 11,200 మంది వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించారు. తద్వారా సంస్థకు రూ.1.25 కోట్లు వచ్చిందని ట్రాన్స్కో ఎస్ఈ లు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్రావు తెలిపారు. సకాలంలో విద్యుత్ బిల్లులను వినియోగదారులు చెల్లించి జరిమానాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్ఎస్యూలో ఇంటర్వ్యూలు తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలకు వా క్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వర్సి టీ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ ఫెలో–1, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ ప్రూఫ్ రీడర్– 4 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు. -
కొత్త బాస్ టీం రెడీ
చిత్తూరు అర్బన్ : శ్రీస్పెషల్ బ్రాంచ్...శ్రీ జిల్లా పోలీసు శాఖలో కీలకమైన విభాగం. పోలీసుశాఖ పరిపాలనతో పాటు స్టేషన్లలో అధికారుల పనితీరు, రాజకీయ పార్టీల పనితీరు, నాయకుల తప్పటడుగులు, శాంతిభద్రతలు ప్రజలకు ప్రశాంతతను ఇస్తోందా..? గంజాయి, మాదక ద్రవ్యాలు, లాటరీ, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎస్పీకి చేరవేయాల్సిన బాధ్యతతో పనిచేయాల్సిన విభాగం స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ). తాము సేకరించిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎస్పీకు చేరవేయాలి. చిత్తూరు కొత్త ఎస్పీగా నాలుగు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన తుషార్ డూడీ పనితీరుపై ఇలా ఉంటుందనే భావనపై ఇప్పటి వరకు స్పష్టమైన సంకేతాలు ఏవీ వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఆయన తొలుత ఎస్బీ విభాగంపై ఫోకస్ చేసి, దాన్ని ప్రక్షాళన చేశారు. జిల్లాలో ఏం జరుగుతున్నా తన దృష్టికి రావాల్సిందేనంటూ ఎస్బీ విభాగాన్ని ప్రక్షాళన చేసి, కొత్త టీంను నియమించుకున్నారు. వాస్తవాలు చేరితే సరి..! ఎస్బీ ప్రక్షాళన పూర్తవడంతో ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై బాధ్యత పెరిగిందనే చెప్పాలి. రాజకీయ పరిస్థితులు పక్కన పెడితే, సామాన్యులకు ఇబ్బందులు కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు ఎస్పీకి చెప్పాల్సిన అవసరం ఎస్బీ విభాగంపై పడింది. అందులోనూ కొత్త కూర్పుతో ఎస్బీను ఏర్పాటు చేసుకున్న ఎస్పీ ఎదుట వాస్తవాలను తప్పనిసరిగా ఉంచాల్సిందే. ఇప్పటికే జిల్లా కేంద్రంలో జరుగుతున్న లాటరీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపి, దీనికి వంత పాడుతున్న సొంతశాఖలోని కొందరిని సాగనంపడానికి విచారణ పూర్తి కావచ్చింది. ఇక గంజాయి, పేకాట క్లబ్బులు, కొన్ని స్టేషన్లలో న్యాయం కోసం వెళితే ప్రైవేటు వ్యక్తుల వద్దకు పంచాయతీలకు పంపడం లాంటి ఘటనలపై ఎస్పీ వాస్తవాలను తెలుసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అలా కాకుండా అధికారికి భయపడో, వాస్తవాలు చెబితే మన ఉనికికి ఇబ్బందా..? అని ఆలోచిస్తే ఎస్పీ నమ్మకం వమ్మువుతుంది. ముందుగా సొంత పోలీసుశాఖను సరిదిద్దుకుని ఆపై ప్రజలకు నమ్మకం కలిగించే దిశగా అడుగులు వేస్తున్న డూడీకు.. స్పెషల్ బ్రాంచ్ ఫీడ్ బ్యాక్ కచ్చితంగా ఇస్తారా లేదా.. షారా మామూలేనా ? అనేది వేచి చూడాల్సిందే. గతంలా ఉండొద్దని.. డూడీ రాక మునుపు ఎస్బీ విభాగంపై అవినీతి ఆరోపణలు లేకున్నా.. వాస్తవాలను అప్పటి ఎస్పీకి చేరవేయడంలో ధైర్యం చేయలేకపోయారనే అపవాదు ఉంది. ప్రధానంగా కానిస్టేబుళ్ల బదిలీల్లో పోలీసు కుటుంబాలు పడ్డ ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్న వాళ్లను, పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నవాళ్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడంపై దుమారం రేగింది. ఇక కొందరు అధికారులు దొంగల నుంచి డబ్బులు తీసుకుని వాటాలు వేసుకున్నారనే ఆరోపణలు, గుట్కా వాహనాల నుంచి మామూళ్లు, లింగ నిర్ధారణపై స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి నిందితులను పట్టించినా.. డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వాస్తవామా కాదా అనే విషయాన్ని గత పోలీస్ బాస్కు చెప్పడంలో ఎస్బీ సాహసం చేయలేదని నింద మిగిలిపోయింది. కొత్తగా వచ్చిన డూడీ.. అసలు జిల్లాలో ఏం జరిగినా తన నోటీసులో ఉండాల్సిందేనంటూ ఎస్బీని ప్రక్షాళన చేశారు. ఇక్కడ పనిచేసిన ఇన్స్పెక్టర్ మనోహర్ను డీసీఆర్బికు, ఎస్ఐ అనిల్ను డీటీసీకు బదిలీ చేస్తూ.. మురళీ మోహన్ను ఎస్బి పగ్గాలు అప్పగించారు. దీంతో ఈ విభాగంలో పారదర్శకత ఉంటుందని నమ్మకం ఉంచారు. -
నకిలీలకు కళ్లెం
– వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చోరీలు, నేరాలు, నకిలీ నంబరు ప్లేట్లతో సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)ను తప్పనిసరి చేసింది. ఇవి వాహన భద్రతను పెంచడమే కాకుండా నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నమోదు కోసం ఇలా.. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కోసం www. siam. in వెబ్సైట్లో వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. వాహన నంబరు, ఛాసిస్ నంబరు వివరాలు పంపాలి. కంపెనీలను బట్టి నంబరు ప్లేట్లు ద్విచక్ర వాహనాలకు రూ.320 నుంచి రూ.500 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.600 పైనే ఉంది. వీటిలో కావాల్సింది ఎంపిక చేసుకుని ఓటీపీ ద్వారా ఆన్లైన్లోనే నగదు చెల్లించాలి. దీని ప్రత్యేకతలు ఇవీ.. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్పై యూనిక్ లేజర్ ఐడీ ఉంటుంది. నకిలీగా మార్చలేని విధంగా దీన్ని రూపొందించారు. ఒకసారి అమర్చితే తొలగించడం సాధ్యం కాదు. నంబర్ ప్లేట్ను స్కాన్ చేయడం ద్వారా పోలీసులకు పూర్తి సమాచారం అందుతుంది. జరిమానా తప్పదు జిల్లాలో ఈ ప్లేట్ ప్రభావం పెద్దగా లేకపోయినా.. పక్కా రాష్రాల్లో హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్లను క్షుణంగా పరిశీలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ రకమైన నంబరు ప్లేట్ లేకపోతే జరిమానాలు పడుతున్నాయి. త్వరలో ఈరకమైన నంబర్ ప్లేట్ జిల్లాలో అమలయ్యే అవకాశాలున్నాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. -
పూత కలవరం
అకాల వర్షాలు, తీవ్రమైన మంచు, చీడ పీడలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా సాధారణంగా నవంబర్, డిసెంబర్లో మామిడి పూత వస్తుంది. ఇప్పటి వరకు పూత రాకపోవడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో పిందెలు రావాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలల్లో కాయలు కోతకు వస్తాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా గతేడాది తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు.. ఈ సారి ఇంకా పూత రాకపోవడంతో అందరిలోనే కలవరం మొదలైంది. విజయపురంలో పూతలేని మామిడి తోట విజయపురం : వాతావరణంలో మార్పులు మామి డి రైతులకు శాపంగా మారాయి. మోంథా తుపాన్ కారణంగా భూమిలో తేమ శాతం పెరిగింది. ఫలితంగా మామిడి చెట్లకు పూత రావడంలో ఆలస్యమవడంతో రైతులు కలవర పడుతున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో మామిడి పూత వచ్చి, ఫిబ్రవరి, మార్చిలలో పిందెలు వచ్చేవి. కానీ డిసెంబర్ నెల చివరి వారం గడస్తున్నా ఇంత వరకు పూత జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మామిడి పూత కోసం రూ. లక్షలు వెచ్చించి రైతులు మందులను పిచికారీ చేయాల్సి వసతవస్తోంది. సూచనలు, సలహాలు ఏవీ? పంటల సీజన్లో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ఉద్యాన శాఖ(హార్టికల్చర్) ఆఫీసర్లు మామిడి తోటలను పట్టించుకోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. వచ్చిన పూత రాలకుండా, కొత్త పూత వచ్చేందుకు తీసుకోవాల్సి న సస్య రక్షణ చర్యలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ జిల్లాలో ఆ దిశగా చర్యలు ఎక్కడా కనిపించడం లేదని, పొలం–పిలుస్తోంది కార్యక్రమాల్లో ఎక్కడ కాని హార్టికల్చర్ అధికారులు కనిపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. దీంతో రైతులే సొంతగా మందులు పిచికారీ చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు మామి డి తోటలను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. లక్ష రూపాయల మందులు కొట్టించా.. నాలుగు ఎకరాల మామిడి తోట సాగు చేస్తున్నా. ఇప్పటి వరకు పూత సరిగా రాలేదు. ఇప్పటికే లక్ష పెట్టి క్లోరిఫై పాస్, సాఫ్ పొడి, ప్లానోఫాస్, మందులను చెట్లకు కొట్టించా. గతేడాది అనుకున్న దిగుబడి రాలే.. ఈసారైనా లాభాలు వస్తాయనుకుంటే పూతే లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. – శరత్, మల్లారెడ్డికండ్రిగ, విజయపురం రైతులకు ఏటా కష్టాలే గత ఏడాదిలో దిగుబడి లేక చాలా నష్టపోయాం. ఈ ఏడాదైనా మంచి దిగుబడి వస్తే, అప్పులను తీర్చుకుంటామని అనుకొన్నా, కానీ ఇంత వరకు పూత లేకపోవడంతో ఆందోళనగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. – సురేష్ రాజు, వడమాలపేట -
‘కుట్టు’కు శఠగోపం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వేల మంది మహిళలు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణలో పాల్గొన్నారు. ఏడాది కిందట చంద్రబాబు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు.ఎమ్మెల్యేలు వెళ్లి ప్రచార ఆర్భాటం చేశారు. ఈ శిక్షణకు జిల్లాలో 9,514 మంది ఇప్పటి వరకు సొంత ఖర్చులతో శిక్షణ పొందారు. వారందరికీ చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చింది. పబ్లిసిటీ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చేతులు దులుపేసుకుంది. ఆర్థిక స్వావలంబనకు టోపీ చంద్రబాబు ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు టోపీ పెట్టింది. ఇంటి పట్టున ఉంటూ పనులను చక్కదిద్దుకుంటూ ఉపాధి పొందేలా అవకాశం కల్పిస్తా మని వేల మంది మహిళలను ఉచిత టైలరింగ్ శిక్షణ పేరుతో మోసగించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తమని చెప్పి నట్టేటముంచారు. ఉచితంగా శిక్షణ పూర్తి చేసిన వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వకుండా మోసగించారు. ఉచితంగా మిషన్లు ఇవ్వనప్పుడు శిక్షణ ఎందుకు ఇప్పించారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రా రంభంలో శిక్షణ పూర్తి చేశాక మహిళలకు ప్రభుత్వం ఉచితంగా మిషన్లు ఇస్తుందని ఎమ్మెల్యేలు ఆర్భాటంగా హామీలు ఇచ్చా రు. ఇప్పుడేమో ఆ హామీలన్నీ నీరుగారా యి. శిక్షణ పొందిన మహిళలకు కనిపిస్తే ఎక్కడ కుట్టు మిషన్లు అడుగుతారోనని ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి పర్యటనకు కనుమరుగయ్యారు. ఎప్పుడిస్తారు...ఎవరిని అడగాలి శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కు ట్టు మిషన్లు ఎప్పుడిస్తారు....ఎవరిని అడ గాలి అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉచితంగా శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు ఇవ్వకుండా మోసగించడం తగదని మహిళలు పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులు నోరు మెదపని పరిస్థితి. దీంతో మహిళలు కుట్టు మిషన్లు ఎప్పుడిస్తారు....ఎవరిని అడగాలనే సందేహంలో ఉన్నారు. ఒక్కరికీ ఉచిత మిషన్ ఇచ్చిందే లేదు..జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఉచిత టైలరింగ్ శిక్షణలో 9,514 మంది పాల్గొనగా, ఇందులో ఒక్కరికీ ఉచితంగా మిషన్ ఇచ్చింది లేదు. ఉచితంగా మిషన్ ఇవ్వకపోగా కనీసం ధ్రువపత్రం సైతం ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో ఈ శిక్షణలో పాల్గొన్న వేల మంది మహిళలను చంద్రబాబు సర్కారు మోసం చేసింది. శిక్షణలో పాల్గొన్న మహిళలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉచిత టైలరింగ్ శిక్షణ విషయంలో మోసగించిన చంద్రబాబు సర్కారుపై మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. -
రైతుల పాట్లు
మామిడి తోటల్లో అరకొరగా పూసిన పూత ఆపేందుకు ఓ వైపు, కొత్తగా పూత వచ్చేందుకు మరో వైపు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పూత రసం పీల్చే నల్లి, పూతను తొలిచే పురుగు ఆశించాయని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ. 40 నుంచి రూ. 50 వేల చొప్పున ఖర్చు చేస్తూ మూడు విడతులుగా మందులు పిచికారీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో అనుకున్న సమయానికి పూత వస్తే ఎకరానికి 5 టన్నుల దిగుబడి లభిస్తుందంటున్నారు. కానీ ఇంత వరకు పూత కనిపించపోవడంతో ఈ ఏడాది కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుందని, ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు కొలుకోవడం కష్టమవుతుందని ఆవేదన చెందుతున్నారు. -
టమోతనారు
గత సంవత్సర కాలంగా టమాట ధరలు పెరుగుతూ తగ్గుతూ ఊగిసలాడుతూ వచ్చాయి. నెల రోజులుగా టమాట ధరలు పుంజుకోవడంతో రైతులు మళ్లీ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం టమాట కిలో ధర రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. రేటు రావడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. .దీంతో అందరూ టమాట నారు కోసం నర్సరీల చుట్టూ తిరుగుతుండడంతో నారుకు గిరాకీ పెరిగింది. నెల రోజుల వరకు నర్సరీల్లో కూడా నారు దొరకని పరిస్థితి రావచ్చని కొంత మంది రైతులు అభిప్రాయపడుతున్నారు. – పులిచెర్ల (కల్లూరు) -
లక్షా 65 వేల హెక్టార్లలో తోటలు
మామిడిపై ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు ప్రతి సంవత్సరం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో సుమారు లక్షా 65 వేల హెక్టార్లలో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. 21 మండలాల్లో మేజర్ క్రాప్ మామిడి ముందున్నది. ఇందులో 65 శాతం తోతాపురి సాగు చేస్తున్నారు. దీంతో పాటు నీలం, బేనిషా, ఖాదర్, మల్లిక, హిమా పసందు సాగులో ఉన్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల వల్ల గతేడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రాక మామిడి రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఈ ఏడాది ఆ నష్టాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నా...వాతావరణ ప్రభావంతో ఇంత వరకు మామిడిలో పూత కనిపించకపోవడంతో ఈ ఏడాది కూడా రైతులు నిరాశ చెందుతున్నారు. -
కంటైనర్ లారీ, బస్సు ఢీ
వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత తిరుపతి క్రైమ్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల, తిరుపతితోపాటు జిల్లాలోని అన్ని ఆలయాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ● తిరుమలలో సుమారు 2వేల మంది, తిరుపతిలో సుమారు 1,500 మంది పోలీసులతో బందోబస్తు పెట్టాం. ● వైకుంఠ ద్వార దర్శనం మొత్తం 10 రోజులపాటు కొనసాగుతుంది. ఈ నెల30, 31 మరియు జనవరి 1 తేదీలలో టోకెన్ ఉన్నవారికి మాత్రమే దర్శనముంటుంది. ● టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతల పరిక్షణకు పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. ● భక్తులు సైతం పోలీసులకు సహకరించాలి. తమతో వచ్చిన పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ముక్కంటి సేవకు పోటెత్తిన భక్తులు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దాదాపు 30 వే ల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కరోజులోనే అన్ని 5,158 వరకు రాహుకేతు పూజలు నిర్వహించబడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా రూ.500, రూ.750 రాహుకేతు పూజలకు భక్తులు అధికంగా తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులు గంటల తరబడి క్యూల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. అనుమానాస్పద ిస్థితిలో వ్యక్తి మృతి చౌడేపల్లె : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లె వద్ద వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు ... బుటకపల్లెకు చెందిన అంజప్ప(56) గ్రామాని కి సమీపంలోని ఆంజనేయస్వామి గుట్ట వద్ద ఓ చెట్టుకు వేలాడుతుండగా గుర్తించిన పశువుల కాపరులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా మృతుడి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి ధర్యాప్తుచేస్తున్నారు. -
అక్రమ గ్రావెల్పై జనం కన్నెర్ర
పుత్తూరు : తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలించే క్రమంలో వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ పాదచారుడిని ఢీకొట్టి ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలకుప్పం గ్రామస్తులు శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రమాదంపై ప్రశ్నించిన మరో వ్యక్తిపైనా దాడి చేసిన డ్రైవర్ తీరుతో ఆగ్రహించిన గ్రామస్తులు పలు టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరి స్థితి నెలకొంది. గ్రామస్తులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ రూరల్ పార్టీ ప్రెసిడెంట్ అన్నాలోకనాథం మాట్లాడుతూ.. ఆంధ్రా నుంచి తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు అతివేగంగా నడపడం ద్వారా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ మాఫియాపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో నడచివెళ్తున్న శివలింగం అనే స్థానికుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, ఒకవేళ జరగరాని ప్రమాదమే జరిగి ఉంటే ఆ కుటుంబానికి దిక్కెవరని ప్రశ్నించారు. పైగా డ్రైవర్లు, క్వారీ యాజమాన్యం వ్యవహార శైలి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. అధికారులు తక్షణం ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులు అక్రమ రవాణా చేస్తున్న క్వారీల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్తులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. పెద్ద పండుగలో ముందుగా గుర్తుకొచ్చేది ఎద్దుల పందేలు. వెదురుకుప్పం మండలం జల్లికట్టుకు ప్రసిద్ధి. ఈ క్రమంలోనే మండలంలోని పచ్చికాపల్లం పంచాయతీ చిన్నపోటుచేనులో ఆదివారం ఎద్దుల పందేలు యువత కేరింతలు... రంకెలేస్తూ దూసుకు
సందడే సందడి చిన్నపోటుచేనుల్లో జరిగిన ఎద్దుల పందేలు కోలాహలంగా ముగిశాయి. పశువులకు పూజ చేసి ఈ పోటీలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎద్దుల పందేలకు వదులుతున్న సమయంలో యువకులు ఈలలు,కేకలు వేసుకుంటూ ఎద్దులపై వేసిన పలకలు తీసుకునేందుకు పోటీపడడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. జల్లికట్టును తిలకించేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎద్దుల పందేలను తిలకించారు. – వెదురుకుప్పం -
అన్నదాతకు ఆసరా
కార్వేటినగరం : గ్రామీణ ప్రాంత ప్రజలకు పాడి పంటలే జీవనాధారం. ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనం, దళారుల మోసాలతో రైతులు వ్యవసాయంలో కష్టాలు చవిచూసినప్పుడు పాడి పశువులు అన్నదాతకు ఆసరాగా నిలిచి ఆదుకుంటున్నాయి. పశుపోషణలో రైతులు సరైన అవగాహన పెంచుకుంటే సంపద వృద్ధి చెందుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. పశు సంవర్థక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారుగా ఆవులు 4,67,507, గేదెలు 35,036, మేకలు 13,80,063, గొర్రెలు 4,38,362 ఉన్నాయి. ఉత్తమ జాతుల ఎంపిక మేలు పాడి పరిశ్రమలో అధిక లాభాలు పొందాలంటే మేలు జాతి పశువులను ఎంచుకోవాలి. అధిక పాలు ఇచ్చే మేలుజాతి ముర్రా గేదె, సంకర జాతి ఆవులను ఆ ప్రాంతాలకు తగ్గట్టు పశువుల జాతులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సంకర జాతి పశువులు ఎంపికకు ప్రాధాన్యం ఇస్తే అధిక లాభాలు సాఽధించవ చ్చు. పశువులకు సీజనల్గా సంక్రమించే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏదైన వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యులను సంప్రదించి చికిత్సలు అందించాలి.పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలు పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు, పశుదాణా, గడ్డిసాగు చేసే యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. రాయితీపై పశువుల కొనుగోలు, పశువుల పాక నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పాడి రైతు లు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధి చెందాలి. – డాక్టర్. ఉమామహేశ్వరి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిణి, చిత్తూరు -
కార్డన్ సెర్చ్ .. 58 వాహనాలు సీజ్
చిత్తూరు అర్బన్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో చిత్తూరు, పలమనే రు, కుప్పం, నగరి సబ్–డివిజన్లలో పోలీసు లు కార్డన్సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు సరిగా లేని 57 ద్విచక్ర వాహనాలు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. 200 లీటర్ల సారాను ధ్వంసం చేసి, వారి నుంచి రూ.13,835 జరిమానా వసూలు చేశారు. చిత్తూరు టూటౌన్ పరిధిలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నేరా లను ముందస్తుగా అరికట్టాలనే ఉద్దేశం, ప్రజ ల్లో భద్రతా ప్రమాణాలకు బలపరిచేలా చేయ డం, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే కార్డన్సెర్చ్ లక్ష్యమని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక వి.కోట : తిరుపతిలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో మండలంలోని నలంద విద్యాసంస్థల విద్యార్థి సంజయ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. స్కూల్ గేమ్స్ పెఢరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ –17 విభాగం రగ్బీ పోటీల్లో తమ పాఠఽశాలలో 9వ తరగతి చదువుతున్న సంజయ్ జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయ న పేర్కొన్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
పలమనేరు : పట్టణ సమీపంలోని టి.వడ్డూరు గ్రామ సమీపంలోని ఓ ఇంట్లో ఓ యువకుడు అనుమా నాస్పదంగా మృతి చెందిన ఘటన శనివా రం వెలుగు చూసింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా మండలంలోని నూనేవారిపల్లికి చెందిన జితేంద్ర (26)గా గుర్తించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమి కంగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా రెండు రోజుల కిందట ఇంట్లో గొడవపడి ఇంటి నుంచి ఇటువైపు వచ్చినట్టుగా సమాచారం. కాగా అతడి సోదరుడు సైతం కోతిగుట్ట హత్యాయత్నం కేసులో కొన్నాళ్ల కిందట అరెస్టు అయిన విషయం తెలిసిందే. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. యువకుడి ఆత్మహత్య కుప్పంరూరల్ : ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుప్పం మండలం, నూలుకుంటలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. నూలుకుంట గ్రామానికి చెందిన కాళీ (35) ఇటీవల ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా నిత్యం కుటుంబంలో కలహాలు చోటు చేసుకునేవి. శనివారం సాయంత్రం కాళీ ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కల్లు గీత కార్మికుడిగా పని చేసే కాళీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళపై యువకుడి దాడి వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం వేమాపురం గ్రామానికి చెందిన కిషోర్ (24) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మ అనే మహిళపై శనివారం దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరీష్ తెలిపారు. చోరీకి విఫలయత్నం పుత్తూరు : పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలోనే వరుసగా మూడు దొంగతనాలు జరగ్గా 105 గ్రాముల బంగారు నగ లు, 400 గ్రాముల వెండి ఆభరణాలను దుండగు లు దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము 2–30 గంటల ప్రాంతంలో స్థానిక నగరం రోడ్డులోని సూర్య ఎలక్ట్రికల్ దుకాణంలోకి ఓ దుండగు ప్రవేశించడానికి విఫలయత్నం చేశాడు. రాడ్ ను ఉపయోగించి రెండు తాళాలు విరగొట్టిన దొంగ మూడవ తాళం తొలగించలేకపోయాడు. దీంతో వెనుదిరిగాడు. ఉదయం షాపు వద్ద జరిగిన దొంగతనం ప్రయత్నాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దొంగ చిత్రాల ఫుటేజీని అందజేశాడు. దొంగతనాల నివారణకు రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
జీఎస్టీ స్కాం!
సాక్షి, టాస్క్ఫోర్స్ : చిత్తూరు కేంద్రంగా సాగుతున్న జీఎస్టీ స్కాం రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. అమాయకులైన పేదల ఐడీ కార్డుతో అధికార పా ర్టీకి చెందిన ఓ నేత అక్రమార్జనే ధ్యేయంగా రూ.కోట్లా ది రూపాయలు కొల్లగొడుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ అండతో అతడిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఎట్టకేలకు ఓ బాఽధితుడు బయటకు వచ్చాడు. నగరానికి చెందిన విజయచక్రవర్తి తనకు జరిగిన అన్యాయం పై ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, ఆర్థికశాఖ మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి, హోంమంత్రి, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్లకు తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం ముదురుతోంది. దీనిపై బాధితుడు కలెక్టర్కు సోమ వారం నేరుగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ముదురుతున్న వివాదం నగరానికి చెందిన విజయచక్రవర్తి 2018లో మదీన స్టీల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేశారు. ఆ సమయంలో వేతనం వేసేందుకు యజమాని అతడి ఆధార్, పాన్కార్డు, తదితర ఐడీ ఫ్రూప్స్ తీసుకున్నాడని బాధితుడు తెలిపాడు. తీరా 2019లో ప్రభుత్వ వైన్షాప్లో ఉద్యోగం రావడంతో అక్కడ పనిమానేశాడన్నారు. ఇటీవల అతడికి విడతల వారీగా మొత్తం రూ.42 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వచ్చాయన్నారు. గతంలో పనిచేసిన యజమానిని సంప్రదించగా తనపై వ్యాపారం చేశానని... అధికారులు మన గుప్పెట్లో ఉన్నారని , ఏమి భయపడవద్దని సర్దిచెప్పి పంపినట్లు చెప్పాడు. సమస్య తీరకపోవడంతో తిరిగీ యజమానిని సంప్రదించగా దురుసుగా ప్రవర్తించాడన్నారు. దీంతో ప్రధానమంత్రి నుంచి వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ వరకు మొత్తం 9 మందికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నోటీసులు ఎక్కడ ? ఇంత జరుగుతున్నా జీఎస్టీ అధికారులు అతడికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న తలెత్తుతోంది. చట్ట ప్రకారం రూ.5 కోట్లు పన్ను అక్రమాలకు పాల్పడితే జీఎస్టీ అధికారులు అరెస్టు వారెంటు నోటీసులు జారీ చేయవచ్చు. కానీ ఇంత వరకు ఈ స్కాం పై ఎటువంటి నోటీసులు జారీ చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో సైతం మనీలాండరింగ్ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదుల పై స్పందించిన కొందరు అధికారుల పై పోలీసు కేసులు, రాజకీయ పలుకుబడితో స్కాందారుడు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. తనకు సరుకు విక్రయించని వ్యాపారుల పై దౌర్జన్యాలకు దిగడం, లారీలో వెళుతున్న లోడ్ను ఆపేయడం, జీఎస్టీ అధికారులు విచారణకు పిలుస్తున్నారని లోడ్ను తీసుకెళ్లడం వంటి జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. సమగ్ర నివేదిక అధికారులు వీటిపై సమగ్ర రిపోర్టు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వాటిని రాష్ట్ర అధికారులతో పాటు ఈడీ, సీబీఐ, ఎన్ఐఏకు పంపనున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అండదండలు ఉండటంతో స్కాందారుడు తప్పించుకు తిరుగుతున్నాడని అధికారుల వాదన. దీంతో కేంద్ర అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నకిలీ కంపెనీల నుంచి రూ.118.70 కోట్లు జిల్లాలో పలు నకిలీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా రూ.118.70 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. వీటి ద్వారా ఐటీసీ కొల్లగొట్టినట్లు తెలుసుకున్నారు. లలిత ట్రేడర్స్ రూ.25.43 కోట్లు, ఆర్పీ ఎంటర్ప్రెజెస్ రూ.15.98 కోట్లు, తాజ్ ట్రేడర్స్ రూ.13.37 కోట్లు, మహాదేవ్ ఎంటర్ప్రెజెస్ రూ.9.54 కోట్లు, ఎంఎఫ్ ఎంటర్ప్రెజెస్ రూ.9.06 కోట్లు, ఐబీ ట్రేడర్స్ రూ.2.04 కోట్లు, రూ.2.16 కోట్లు, ఎఆర్ స్టీల్స్ రూ.3.11 కోట్లు, జెడ్ఎఫ్ ట్రేడర్స్ రూ.4.59 కోట్లు, ముజు మెటల్స్ రూ.5.73 కోట్లు, అబ్రార్ టుడే ఫ్యాషన్ మాల్ రూ.5.36 కోట్లు చేసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. ఇవే కాకుండా మరిన్ని కోట్లు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.రూ.400 కోట్లకు పైగా అక్రమాలు జీఎస్టీ స్కాం దాదాపు రూ.400 కోట్ల వరకు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దీని పై సమగ్ర రిపోర్టు సిద్ధం చేశారు. అమ్మకం, కోనుగోలు చేయకుండా ఐటీసీ క్లెయిమ్ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు వారి విచారణలో తేలింది. గతంలోనూ అక్రమ వ్యాపారంపై రూ.93 కోట్లు జరిమానా, పరిహారం చెల్లించాలని స్కాందారుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై అతడు హైకోర్టులో సవాల్ చేస్తూ కేసు వేశాడు. అది ఇంకా కొనసాగుతోంది. వంద మంది పేదల నుంచి ఐడీ ఫ్రూఫ్స్ సంపాదించి నకిలీ వ్యాపారాలు చేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. ముంబాయి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో లావాదేవీలు జరిపినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నారు. వందల కోట్లు సరుకు కోనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి స్టాక్ పాయింట్లో మాత్రం సరుకు లేదని తెలుసుకున్నారు. -
బాలికను మోసం చేసిన యువకుడు అరెస్టు
పాలసముద్రం : మండలంలో ఓ బాలికను గర్భిణిగా చేసిన యువకుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు శనివారం నగరి డీఎస్పీ మహమద్ అజీజ్ తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ.. మండలంలోని వెంగళరాజుకుప్పం పంచాయతీ ఇందిరానగర్ ఆదిఆంధ్రవాడ గ్రామానికి చెందిన దినేష్ (19) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక శరీరర మార్పులను గమనించి ప్రశ్నించడంతో విషయం వారికి తెలియజేసింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దినేష్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ హనుమంతప్ప, ఎస్ఐ రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
అధికార మదంతో పచ్చనేతల దౌర్జన్యం
సాక్షి టాస్క్ఫోర్స్: తమ పార్టీ అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా.. తమది కాని భూమిని కబ్జా చేయొచ్చా.. ఎంతవరకు న్యాయం..కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడుకునే ప్రయత్నంలో బాధితులపైనే విచక్షణా రహితంగా కూటమి నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన గంగవరం మండలంలోని జరావారిపల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. కీలపట్ల పంచాయతీ జరావారిపల్లి గ్రామానికి చెందిన లేట్ వెంకటస్వామి పేరిట గత 1981వ సంవత్సరంలో సర్వే నెంబర్ 550/4లో విస్తీర్ణం 2.02 ఎకరాల భూమి రెవెన్యూ లెక్కల్లో నమోదై ఉంది. దీనికి సంబంధించిన పట్టా కూడా వెంకటస్వామి కుటుంబీకుల దగ్గర ఉందని చెబుతున్నారు. గత 1998వ సంవత్సరంలో వెంకటస్వామి మరణించడంతో అనువంశికంగా వచ్చే డీకేటీ భూమిని వెంకటస్వామి కుమారుడు చెంగల్రాయులు సాగు చేసుకుంటున్నాడు. అయితే ఆ భూమి తన తండ్రి పేరిటే రికార్డులో ఉంది తప్ప ఇన్నేళ్లు గడుస్తున్నా చెంగల్రాయులు పేరుపైకి పట్టా మార్చుకోలేదు. చెంగల్రాయులు కుటుంబీకులకు అనాదిగా వస్తున్న భూమిపై ఇదే పంచాయతీ గాంధీనగర్ గ్రామానికి చెందిన రెడ్డిశేఖర్ కన్ను పడింది. తమ భూమి ఆనుకునే ఈ భూమి కూడా ఉండటంతో భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని నిర్ణయించుకున్నాడు. గత ఐదేళ్ల కిందట భూమి తమదంటూ చెంగల్రాయులు కుటుంబీకులతో గొడవలు పడిన రెడ్డిశేఖర్ కుటుంబీకులు తీవ్రంగా గాయపరిచారు. అప్పట్లో బాధితులు పలమనేరు కోర్టును ఆశ్రయించగా బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ, పోలీసుల సమక్షంలో భూమిని సర్వే చేసి భూమిని శాశ్వతంగా చెంగల్రాయులు కుటుంబీకులకు అప్పగించారు. ఆ తరువాత భూమిలో మామిడి మొక్కలు నాటుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటంతో భూమిని మళ్లీ ఎలాగైనా కబ్జా చేయాల్సిందేనంటూ రెడ్డిశేఖర్ కంకణం కట్టుకున్నాడు. బాధితులను బెదిరింపులకు గురి చేసి భూమిలో ఉన్న మామిడి చెట్లను జేసీబీతో తొలగించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా అంతలోనే పోలీస్ స్టేషన్కు వచ్చిన రెడ్డిశేఖర్ ప్రభుత్వం మాది , మీరు పట్టించుకోవద్దు అంటూ పోలీసులను సైతం తమ ఎదుటే హెచ్చరించినట్టు బాధితులు తెలిపారు. రెవెన్యూ అధికారులు మాత్రం తమ సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోలేదంటూ వాపోయారు. అధికారులెవరు తమ సమస్యను పట్టించుకోకపోవడంతో భూమి వద్ద మామిడిచెట్ల తొలగింపును అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులు చెంగల్రాయులు, భూలక్ష్మి, సురేష్ ముగ్గురిపై రెడ్డిశేఖర్ కుటుంబీకులు విచక్షణారహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేసి గాయాలపాలు చేశారని తెలిపారు. దాడిలో గాయపడిన బాధితులు పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ భూమిని టీడీపీ నాయకుడు రెడ్డిశేఖర్ కబ్జా చేసి మామిడి చెట్లను తొలగిస్తుంటే అడ్డుకున్నందుకు తీవ్రంగా కొట్టినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంగల్రాయులు, కొడుకు సురేష్ -
ఏఎంసీ చైర్మన్ కారు బోల్తా
పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం బీసీ కాలనీ మలుపులో ఎస్ఆర్పురం ఏఎంసీ చెర్మన్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెరకు తోటలో బోల్తా పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. కేజే పురంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎస్ఆర్పురం ఏఎంసీ చెర్మన్ జయంతి గుండయ్య కారు మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారు పైకప్పు నుజ్జునుజ్జు అయినా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదన్నారు. కొందరు యువకులు పోలీసులు రాకముందే తోటలోని కారును బయటికి తీశారు. పోలీసులు ఏఎంసీ చెర్మన్ కారు అనడంతో వారు కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. -
వైకుంఠ ఏకాదశికి పకడ్బందీ ఏర్పాట్లు
కాణిపాకం : వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం రోజున శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు దర్శనంలో లోటు లేకుండా చూస్తామని కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ తుషా ర్ డూడీ పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాట్ల పై శనివారం వారు సమీక్ష నిర్వహించారు. వారితో పాటు ఎమ్మెల్యే మురళీ మోహన్, ఈవో పెంచలకిషోర్, ఆలయ చైర్మన్ మణి నాయుడు కలసి వివిధ ప్రభుత్వ శాఖలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్తో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం జనవరి 1న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి భారీ ఎత్తున భక్తులు వస్తారన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆల య అధికారులను ఆదేశించామన్నారు. డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆంగ్ల సంవత్సరాది జనవరి 01వ తేదీలలో సుమారు 60 వేల మందికి పైగా భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తు ల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆ మూడు రోజులు అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నామన్నారు. ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ.. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్రాఫి క్ సమస్య తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల పార్కింగ్ సంబంధించి స్థలం పరిశీలించామన్నారు. జిల్లా అధికారుల సమన్వయంతో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మె ల్యే, ఈవో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి, వరుస సెలవులు రావడంతో మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. రద్దీ పెరిగినా భక్తులకు సౌకర్యవంతమై న దర్శనం కలిగించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉదయం 2 నుంచి నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉభయదారులకు దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుందన్నారు. జనవరి 1న ఆర్జిత సేవలు, అంతరాలయ దర్శనం రద్దు చేశామని, రాత్రి 11 గంటల వరకు సామాన్య భక్తులు నిరాటంకంగా స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు. -
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● డీఎంహెచ్ఓ సుధారాణి వార్నింగ్
అక్రమ స్కానింగ్లు, అబార్షన్లు చేస్తే కటకటాలే చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చట్టానికి విరుద్ధంగా అక్రమ స్కానింగ్లు, అబార్షన్లు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని డీఎంహెచ్ఓ సుధా రాణి మండి పడ్డారు. సాక్షి దినపత్రికలో వీటిపై వరుస కథనాలు ప్రచురితమయ్యా యి. కన్నింగ్ స్కానింగ్, అబార్షన్ల అనకొండలు, డెమో డమ్మీ అంటూ వరుస కథనాలతో వైద్య ఆరోగ్యశా ఖ అధికారులను కదిలించాయి. ఈ మేరకు ఓ ప్రకటను విడుదల చేశారు. అక్రమ స్కానింగ్పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామన్నారు. స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు. నిబంధనలు పాటించని, రికార్డులు సక్రమంగా నిర్వర్తించని సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఆర్ఎంపీ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అక్రమ అబార్షన్లకు పా ల్పడితే వైద్యులు, వారికి సహకరించే వ్యక్తుల ను జైలుకు పంపుతామని హెచ్చరించారు. అబార్షన్లు, అక్రమ స్కానింగ్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని డీఎంహెచ్ఓ వెల్లడించారు. నేడు విద్యుత్ బిల్ కేంద్రాలు పనిచేస్తాయ్ చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు అందుబాటులో ఉంటాయని ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, చంద్రశేఖర్రావు తెలిపారు. ఇంత వరకు బిల్లులు చెల్లించని వినియోగదారులు సెలవు రోజున కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వీరితో పాటు హెచ్టీ సర్వీసుదారులు పెండింగ్ మొత్తాలను చెల్లించాలని కోరారు. 30న జెడ్పీ స్టాండింగ్ కమిటీ చిత్తూరు కార్పొరేషన్ : జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల 30న నిర్వహించనున్నట్లు చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 1–7 కమిటీ అంశాలు అయిన ఆర్థిక, ప్రణాళిక, పను లు, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, సీ్త్ర శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం అంశాలపై చర్చ ఉంటుందన్నారు. -
భక్తిశ్రద్ధలతో పడి పూజోత్సవం
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లెలో బురుజుబండపై వెలసిన కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో పడి పూజోత్సవాన్ని శని వారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలోని పద్దెనిమిది మెట్లను వివిధ రకాల పుష్పాలు, నేతి దీపాలు, చందన, కుంకుమ, ఫలాలతో తీర్చిదిద్దారు. ఆలయ మేల్శాంతి నంబూద్రి నారాయణన్ కేరళ సంప్రదాయ పద్ధతులతో ప్రతి మెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అయ్యప్ప స్వాముల భజనలు భక్తులను అలరించాయి. పూజలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. అయ్యప్ప నామ స్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భక్తులకు ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి స్వర్ణలతమ్మ, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి కవితమ్మ, రేణుకమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, అమరనాథ రెడ్డి ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి (ఇన్సెట్) పూజల్లో ఎమ్మెల్యే కుటుంబీకులు ప్రత్యేక అలంకరణలో పడిమెట్లు -
వికసిత్ భారత్కు పిల్లలే పునాది
చిత్తూరు కలెక్టరేట్ : పిల్లలే వికసిత్ భారత్కు పునా ది అని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వీర్బాల్ దివస్ పోస్టర్లను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత భవిష్యత్తుకు మూలస్తంభాలైన బాలలను గౌరవించాలన్నారు. బాలల్లో స్ఫూర్తిని నింపేందుకు వీర్బాల్దివస్ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల వయస్సుకు అనుగుణంగా పెయింటింగ్, వ్యాసరచన, కథలు చెప్పడం, క్విజ్, గ్రూప్ చర్చలు, స్కిట్స్ వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 30వ తేదీ వరకు ర్యాలీలు, ఇతర అవగాహన కార్యక్రమాలు మండల స్థాయిలో చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కార్వే టినగరం డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి పాల్గొన్నారు. శిశు మరణాలను కట్టడి చేద్దాం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో శిశు మరణాలు జరగకుండా చూద్దామని డీసీహెచ్ఎస్ పద్మాంజలి, డీఐఓ హనుమంతరావు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు శిశు మరణాలపై సిబ్బందిని విచారించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. గర్భిణుల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు విధిగా వారిని పర్యవేక్షించాలన్నారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తూ..మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. టీనేజీ గర్భిణులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. హైరిస్క్ కేసుల విషయంలో అలసత్వం వద్దన్నారు. ప్రసవం జరిగే వరకు గర్భిణులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నా రు. శిశు మరణాలను కట్టడి చేయడంలో క్షేత్రస్థాయిలోని వైద్య సిబ్బందే కీలకమని వారు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, వైద్యులు లత, భార్గ వ్, యోగేష్, రమ్య, అనూష, రోజారాణి, వెంకటేశ్వరి, మోహన్బాబు పాల్గొన్నారు. రేపు డయల్ యువర్ ఎస్ఈ చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. జిల్లాలో మొదటిసారి కార్యక్రమాన్ని సీఎండీ ఆదేశాల మేరకు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పై వినియోగదారులు సోమవారం ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేయాలని వివరించారు. 16 మంది వీఏఓలకు ఉద్యోగోన్నతులు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి జిల్లాలో 16 మంది వీఏఓ ( గ్రామ వ్యవసాయ సహాయకులు)లకు ఏఈఓలు(వ్యవసాయ విస్తరణ అధికారులు)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ...జిల్లా వ్యవ సాయశాఖ అధికారి మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి లభించిన అధికారులు 15రోజుల్లో కేటాయించిన స్థానంలో విధుల్లో చేరాలని ఆదేశాలిచ్చారు. -
మార్కులు నమోదు చేయకపోతే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికలో విద్యార్థుల మార్కులను నమోదు చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని డీఈఓ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీ చేసిన షెడ్యూల్ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఈ ప్రణాళిక అమలులో విద్యార్థులకు నిర్వహించే పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. నమోదు చేయని వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. 331 పాఠశాలల్లో 13,065 మంది విద్యార్థుల మార్కులను మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేశారన్నారు. మిగిలిన పాఠశాలల్లో మార్కులను ఎందుకు అప్లోడ్ చేయడం లేదనే అంశం పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. క్షేత్రస్థాయిలో ఇందుకు కారణాలు పరిశీలించిన తర్వాత సబ్జెక్టు టీచర్లపై చర్యలు చేపడుతామని డీఈవో హెచ్చరించారు. -
సాధారణ సాగే కష్టమై
ఏఎంసీ చైర్మన్ కారు బోల్తా ఎస్ఆర్పురం ఏఎంసీ చైర్మన్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కారు ధ్వంసం అయింది.ఈ ఏడాది రబీ సాగు అంత ఆశా జనకంగా లేదు. వరుస తుపాన్ల కారణంగా ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రబీ సాగు అనుకున్నంత ముందుకు సాగడం లేదు. రబీ ప్రారంభమై రెండున్నర నెలలు దాటినా అతి కష్టంపైన సాధారణ సాగులో 40 శాతం దాటింది. గతేడాది ఈ సమయానికి సాధారణ సాగు 28586 హెక్టార్లకుగాను జిల్లాలో 24877 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా ఈ ఏడాది అదే సమయా నికి 11570 హెక్టార్లు మాత్రమే సాగయింది. ప్రస్తుతం వేరుశనగ, మొక్కజొన్న, మినుములు వేసుకునేందుకు అవకాశం ఉన్నా ముందుకు సాగడం లేదు. దీంతో రైతన్నల్లో నిరాశక్తి అలుముకుంది. -
వదిలేశారా?
మైనింగ్ శాఖలో వసూళ్ల దందా దుమారం రేపుతోంది. సర్వం సత్యం జగత్ మయవుతోంది. కాసులు కురిపించేవారిని అందలం ఎక్కిస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై బదిలీ వేటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు జీఎంలపై బదిలీ వేటు పడింది. ఇక్కడే ఏళ్లుగా పాతకుపోయిన కలెక్షన్ కింగ్లను మాత్రం అలాగే వదిలేశారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో 400 క్వారీలున్నాయి. వీటిలో ప్రస్తుతం 150పైగా నడుస్తున్నాయి. అక్రమంగా 140 వరకు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా కూటమి నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. కుప్పం, పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి, చిత్తూరు, జీడీనెల్లూరు, ఎస్ఆర్పురం, పాలసముద్రం, వెదురుకుప్పం, గుడిపాల మండలాల్లో ఈ అక్రమ క్వారీలు పుంజకుంటున్నాయి. వీటి నుంచి కోట్ల విలువ చేసే గ్రానైట్ దిమ్మెలు సరిహద్దులు దాటుతున్నాయి. అయినా పట్టించుకునే వారు కరువుతున్నారు. జిల్లాలో ప్రధానంగా అక్రమ మైనింగ్ పుంజుకుంటోంది. కొందరు కూటమి నేతలు ఇసుక, మట్టి, గ్రానైట్ విచ్చలవిడిగా తవ్వేసుకుంటున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ అక్రమాలకు ఆ శాఖలోని కొందరు అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. అక్రమ మూలాలు నేర్పించి రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకుంటున్నారు. అనుమతులు లేకుండా క్వారీలు తవ్వుకోవడం, తప్పుడు పత్రాలతో గ్రానైట్కు అనుమతులు ఉన్నాయని చెప్పడం, తవ్విన గ్రానైట్ దిమ్మెలను కొలతలు వేసి జిల్లాతో పాటు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విక్రయించేకునేలా చేయడం, సరిహద్దులు దాటించడం, అక్రమ క్వారీలను పట్టుకుంటే.. బండి వదిలి పెట్టేలా చేయించడం, దొంగ బిల్లులు ఇవ్వడం, సంఘం పేరుతో బిల్లులు ఇప్పించడం, పోలీసులు, విజిలెన్స్, ట్రాన్స్ఫోర్ట్, సేల్స్ ట్యాక్స్ వారు టచ్ చేయకుండా కంటి రెప్పలా కాపాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొత్త దరఖాస్తులు వస్తే.. పిండుకుంటున్నారనే ఆరోపణులున్నాయి. స్కెచ్ గీస్తే ఒక రేటు, ఫైల్లో సంతకం పెడితే మరో రేటు, బండి కదలలాంటే ఇంకో రేట్ ఫిక్స్ చేసి దండుకుంటున్నట్టు సమాచారం. మంత్రి బంధువుగా చెప్పుకుంటున్న ఓ అధికారి అంటకాగుతున్న వారిని అంటిపెట్టుకుని ఈ దందా నడిపిస్తున్నారని ఆ శాఖలోని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లాలో అక్రమ క్వారీల నిర్వహణలో ఓ ద్వితీయ స్థాయి అధికారి పాత్ర అంత్యత కీలకమని తెరపైకి వచ్చింది. సాక్షిలో వచ్చిన వరుస కథనాలకు ఆ అధికారిపై విచారణ కూడా జరిగింది. విజిలెన్స్ అధికారులు కూడా జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలు సమర్పించుకున్నారు. ఆపై సీఎంఓ ఆఫీసు నుంచి విచారణ కూడా జరిగింది. ఈ దెబ్బతో కొన్ని అక్రమ గనులు మూసుకున్నాయి. కానీ ఓ అధికారి అక్రమాలకు అడొచ్చిన వారిపై పగబట్టారు. తమకు సహకరించకుండా..ప్రశ్నించే గొంతుపై కత్తి పెట్టారు. పలమనేరు, చిత్తూరు జీఎంలపై బదిలీ వేటు వేయించారు. ఈ బదిలీ వెనుక ముగ్గురు ప్రజాప్రతినిధులున్నారని ఆ శాఖలోని అధికారులు చర్చించుకుంటున్నారు. కానీ పైసా వసూల్ పైచేయిగా ఉన్న అధికారిని మాత్రం వదిలిపెట్టేశారు. దీనిపై ఓ వర్గంలోని కూటమి నేతలు భగ్గుమంటున్నారు. మళ్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పుకొస్తున్నారు. కాగా త్వరలో జిల్లా శాఖలో మరో ఇద్దరిపై బదిలీ వేటు పడనుందని సమాచారం. జిల్లా మైనింగ్శాఖలో సత్యం జగత్ వసూళ్ల సీన్ ఇదీ జరుగుతోంది! -
డెమో డమ్మీ?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో డెమో విభాగం డమ్మీ అవుతోంది. స్కానింగ్ సెంటర్ల పర్యవేక్షణను విస్మరించింది. డెకాయ్ ఆఫరేషన్ను గాలికొదిలేసింది. సెంటర్ నిర్వాహకులతో కుమ్మకై బాధ్యతలను పట్టించుకోకుండా పోయింది. ఓ అధికారి పర్యవేక్షణకు వెళ్లొద్దని హుక్కుం జారీ చేయడంతో ఆె విభాగానికి జ్వరమొచ్చింది. కార్యాలయానికి అతుక్కుపోయి.. విధులను పట్టాలెక్కించింది. తీరా కలెక్టర్ ఆదేశించినా.. డెకాయ్ ఆఫరేషన్కు ముందడుగు పడనంటోంది. చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డెమో విభాగం ఉంది. ఈ విభాగంలో పీసీపీఎన్డీటీ నోడల్ ఆఫీసర్తో పాటు ఐదుగురు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షించడం, డెకాయ్ ఆఫరేషన్ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా వారు పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కన్నెత్తి చూడం! జిల్లాలో 700పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో చాలావరకు నియమనిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నా.. కొన్ని అక్రమాలకు పదును పెడుతున్నాయి. ఒక దానికి అనుమతి తీసుకుని మరో మిషన్ పెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పాత బడిన మిషన్లను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయించేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. దేవుళ్ల బొమ్మలను చూపించి లింగాలను బయటపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా ఈ దందా జోరుగా నడుస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు ఆ శాఖలోని పలువురి సహకారం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వీరు స్కానింగ్ గుట్టు బయటకు పొక్కకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొందరు అధికారులు మండిపడుతున్నారు. అక్రమంగా వెలిసిన స్కానింగ్ సెంటర్లకు కూడా కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో డెమో విభాగం మూగబోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుర్చీలకు అతుక్కుపోయారు! అక్రమ స్కానింగ్ సెంటర్ల ఆట కట్టించాల్సిన అసలైనా అధికారులు కుర్చీలకు అతుక్కుపోయారు. బయటకు కదలకుండా పీసీపీఎన్డీటీ నోడల్ ఆఫీసర్కు సంకెళ్లు పడేశారు. గుడిపాల మండలం బొమ్మసముద్రంలో జరిగిన ఓ అబార్షన్పై ఆ అధికారి తోటపాళ్యంలోని ఓ స్కానింగ్ సెంటర్పై తనిఖీ చేశారు. తనిఖీ చేసినందుకు అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. తనకు తెలియకుండా ఎలా తనిఖీ చేస్తావంటూ ఓ పెద్ద స్థాయి అధికారి చురకలు పెట్టడం గమనార్హం. దీంతో స్కానింగ్ సెంటర్ల పర్యవేక్షణ గాడితప్పింది. అప్పటి నుంచి అడ్డదిడ్డమైన స్కానింగ్లు, అబార్షన్లు జరుగుతున్నా డెమో విభాగం మిన్నకుండిపోతోంది. కలెక్టర్ ఆదేశించినా డెకాయ్ ఆఫరేషన్ వైపు శాఖ కదలడం లేదు. ఆ విభాగానికి సంబంధించిన ఒకరిద్దరూ అధికారులను కదిలిస్తే.. మాకు ఎందుకొచ్చిన తంట.. అని వెనకడుగు వేస్తున్నారు. స్కానింగ్ సెంటర్లపై తనిఖీ చేస్తే.. ఆ అధికారి నుంచి ఇబ్బందులు తప్పవని భయపడుతున్నారు. ఆరోపణలు ఇలా.. జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై పూర్తిగా నిఘా కొరవడుతోంది. అసలు ఆ సెంటర్లను పట్టించుకునే వారే కరువయ్యారు. కొందరు వసూళ్ల మత్తులో పడి తనిఖీచేయడం లేదని అంటున్నారు. ఆ శాఖలో ఓ సిబ్బంది దళారీగా వ్యవహరించి.. వసూళ్ల పర్వాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం. ఒక వేళ తనిఖీకి వెళ్లినా ముందస్తు సమాచారం ఇచ్చేస్తూ.. కంటికి రెప్పలా కాపాడుతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. జిల్లాలో అధ్వాన్నంగా డెమో విభాగం -
ప్రపంచ దేశాలకు దిక్సూచి భారత్
తిరుపతి సిటీ: ప్రపంచ దేశాలకు భారత్ దిక్సూచిగా నిలిచి ప్రశంసలు పొందుతోందని వక్తలు కొనియాడారు. జాతీ య సంస్కృత యూనివర్సిటీలో శుక్రవారం నుంచి 29వ తేదీ వరకు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వల న చేసి, ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత్ గొప్పతనం, సాంస్కృతి సంప్రదాయాలు, విజ్ఞానాన్ని, లక్ష్యాలను, ప్రగతిని చాటి చెప్పేందుకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం సరైన వేదిక అని పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరుసార్లు భారతీయ విజ్ఞాన సమ్మేళం నిర్వహించామని, తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత తొలిసారి సమ్మేళనం నిర్వహించడం శుభపరిణామని తెలిపారు. ఈ సందర్భగా సమ్మేళానికి హాజరైన సీఎం, ఆర్ఎస్ఎస్ చీఫ్, అతిథులను వర్సిటీ అధికారులు ఘనంగా సన్మానించారు. తరువాత సమ్మేళనంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు పరిశీలించి అభినందించారు. కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు సమగ్ర వికాసానికి భారతీయ చింతన అనే భావంతో ఎన్ఎస్యూ, కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మేళనానికి సుమారు 1,250 మంది ప్రత్యేక ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ ఔనత్యాన్ని చాటిచెప్పేలా పలు అంశాలపై వారు ఈ సమ్మేళనంలో పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం సమ్మేళనం ప్రారంభం అనంతరం వర్సిటీలోని చెలికాని అన్నారావు భవన్లో ఎన్ఎస్ఏబీ సభ్యులు, మాజీ డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారత్ విజ్ఞాన్ సమ్మేళనంపై ప్రత్యేక ప్లీనరీ సెషన్ నిర్వహించారు. అనంతరం డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రిక కౌషిక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లాలోని పలు పాఠాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజ్ఞాన సమ్మేళనాన్ని తప్పక వీక్షించాలి తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత యూనివర్సిటీలో నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని విద్యార్థులు తప్పక వీక్షించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. శుక్రవారం వర్సిటీలో ప్రారంభభమైన కార్యక్రమాన్ని ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మేళనంలో ఎగ్జిబిషన్ స్టాళ్లు, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని, ఇవి విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, పరిశోధనాత్మక దృష్టిని మరింత పెంపొందించేలా ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల నుంచి ప్రతిరోజు 3 వేల మంది విద్యార్థులు, వారితోపాటు ఉపాధ్యాయులు, సందర్శించడానికి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని మిగిలిన అన్ని మండలాల నుంచి వీలున్న ప్రతి ఒక్కరూ తప్పక విచ్చేసి ఈ ప్రదర్శనను వీక్షించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. -
ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి
పుంగనూరు: తప్పుడు కేసులు, భూదోపిడీలు, భూ కబ్జాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పుంగనూరు మండల పర్యటనలో భాగంగా కొత్తపల్లె వద్ద ఆయన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సభ్యులతో సమావేశమయ్యారు. ఐటీ వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ భాస్కర్, రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్పూసపాటి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయపాల్, జాయింట్ సెక్రటరీ వేణు, అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ శివ, ఉపాధ్యక్షులు ప్రవీన్, జయచంద్ర, ఉమ్మడి జిల్లాల ఐటీవింగ్ ఇన్చార్జ్ ప్రకాష్రెడ్డి, పార్టీ జిల్లా యూత్ వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డితో పలు విషయాలపై చర్చించారు. టీడీపీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలు, తప్పుడు కేసులు, భూకబ్జాలు, దోపిడీల పై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనపై కూడా ప్రజలకు అవగాహన కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించారు. -
కాకినాడ టూ శబరిమల!
నగరి : కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కి.మీ పాదయాత్ర చేసి అయప్ప స్వామివారిని దర్శించుకోవడం వారి భక్తి పారవశ్యాన్ని చాటిచెబుతోంది. తూర్పుగోదావరి జిల్లా, తణుకు మండలం, మండపాకం గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ, రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానీశంకర్ (44) 18 ఏళ్ల నుంచి తమ యాత్రలను కొనసాగిస్తున్నారు. అర్జున్స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవానీశంకర్ కన్నిస్వామిగా మాలధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. ఇరువురూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఏడాది మళ్లీ ఇద్దరూ కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీశంకర్ 18వ సారి, అర్జున్ స్వామి 36వ సారి యాత్రను కొనసాగించారు. వారి పాదయాత్ర శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భవానీశంకర్ నవంబర్ 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్స్వామి డిసెంబర్ 4న తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు వివరించారు. -
అలరించి..ఆలోచింపజేసి!
సదుం: ఓ చిన్నారి ముద్దులొలికే మాటలతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఆలపించిన గీతం సోషయల్ మీడియాలో వైరల్గా మారింది. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మండలంలో పర్యటించారు. పాలమందలో పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకుడు విజయరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుమార్తె భువిక్షరెడ్డి పెద్దిరెడ్డిపై ఓ గీతాన్ని ఆలపించారు. ఆయన ప్రజలకు అండగా ఉంటారని.. అయ్యప్ప ఆలయాన్ని కట్టించారంటూ అందరినీ ఆలరించేలా ఆలపించారు. ఆ చిన్నారిని పెద్దిరెడ్డి ఆప్యాయంగా అభినందించారు. ఈ గీతాన్ని సోషయల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ చిన్నారి కలికిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతోంది. మద్యం సీజ్ – ఇద్దరి అరెస్ట్ పుంగనూరు: చట్ట వ్యతిరేకంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను, మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కెవి.రమణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఐ సుబ్బరాయుడుకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. పట్టణ సమీపంలో నక్కబండలో కేశవ అనే వ్యక్తి తన చిల్లర అంగడిలో మద్యాన్ని పెట్టుకుని విక్రయిస్తున్నట్టు తెలిసి దాడులు నిర్వహించామన్నారు. అలాగే ఈడిగపల్లె సమీపంలోని శక్తి డాబా వెనుక నుంచి శ్రీనివాసులు అనే వ్యక్తి మద్యాన్ని సరఫరా చేస్తుండగా అతనిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వీరిద్దరి వద్ద నుంచి 76 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, ఇరువురునీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి చిత్తూరు కలెక్టరేట్ : కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాల సూపరింటెండెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూపరిషత్ జిల్లా అధ్యక్షుడు పట్నం సురేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం డీఈవో రాజేంద్రప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ప్రత్యక్ష ప్రోద్భలంతోనే మత ప్రచారం, బలవంతపు ప్రార్థనలు, వసతి గృహంలో మత మార్పిడులు, బయట వ్యక్తుల ప్రవేశం జరుగుతోందన్నారు. దీనిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బాబు తప్పుడు విధానాలే గెలిపిస్తాయి!
పుంగనూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలు, తప్పుడు హామీలతో ప్రజలు విసిగిపోయి వైఎస్సార్సీపీ సమావేశాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారని, వైఎస్సార్సీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయమని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరు మండలంలో శుక్రవారం ఎంపీ రెడ్డెప్పతో కలసి పెద్దిరెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లరాళ్లపల్లె గంగమ్మగుడి వద్ద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో అనేక అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించారని మండిపడ్డారు. మోసాలు చేసి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మేరకు సూపర్–6 ఎక్కడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న ఘనత టీడీపీదేనని ఆరోపించారు. అథోగతిపాలవుతున్న రాష్ట్రాన్ని తిరిగి కాపాడే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి భుజస్కంధాలపై వేసుకోవాలని అవసరం ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి అన్ని హామీలు నేరవేర్చారని గుర్తుచేశారు. రెండేళ్లు కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాటను తూచ తప్పకపాటించారని కొనియాడారు. రెండేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలు గ్రహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్సార్సీపీని గెలిపించే పరిస్థితులను చంద్రబాబు, ఆయన కోటగిరీ రాష్ట్రంలో చేపట్టడం అభినందనీయమన్నారు. ఎంపీపీ భాస్కర్రెడ్డి, పీకేఎం ఉడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, శ్రీనాథరెడ్డి, జిల్లా యూత్వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, ఉమ్మడి జిల్లా ఐటీవింగ్ ఇన్చార్జ్ ప్రకాష్రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు -
వేగంగా కేసుల పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో మోహన్కుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ కోర్టుల్లో నమోదైన కేసుల పట్ల అధికారులు అలసత్వం వహించకూడదన్నారు. ఎప్పటికప్పుడు కోర్టు కేసులపై స్పందించాలన్నారు. పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. 24 గంటల్లోపు ప్రతి అర్జీనీ ఓపెన్ చేసి పరిశీలించాలన్నారు. కరెంట్ సమస్యల పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో 116 సమస్యలను పరిష్కారించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా 11 కేవీ లైన్ సమస్యలు 404లో 50 పరిష్కరించామని, ఎల్టీ లైన్, సర్వీసు లైన్ పరంగా 490 సమస్యలు రాగా అందులో 66 పరిష్కారించినట్టు వెల్లడించారు. ఇంటింటా ఫీవర్ సర్వే చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మాపాక్షిలోని గాజులపల్లెలో శుక్రవారం వైద్య సిబ్బంది ఇంటింటా ఫీవర్ సర్వే చేశారు. గ్రామంలో అబేట్ పిచికారీ చేశారు. జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ జ్వరాల కేసులపై ఆరా తీశారు. స్క్రబ్ టైఫస్ కేసుల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది రామకృష్ణ, నారాయణ, రాణి, హేమలత, సరసమ్మ తదితరులు పాల్గొన్నారు. జనవరి 5 నుంచి ఎఫ్ఏ–3 పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో జనవరి 5 నుంచి ఫార్మేటీవ్ అసెస్మెంట్–3 (ఎఫ్ఏ–3) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీచేశారు. ఆ షెడ్యూల్ మేరకు జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 5వ తరగతి వరకు జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 72,255 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,154 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంట ల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇది లా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది. కల్కి ట్రస్టు ఆక్రమిత భూములపై విచారణకు ఆదేశం వరదయ్యపాళెం: కల్కిట్రస్టు పరిధిలో ఆక్రమిత అటవీ, ప్రభుత్వ డీకేటీ భూముల వివరాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు సూళ్లూరుపేట ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేస్తూ బీఎన్కండ్రిగ, వరదయ్యపాళెం మండల తహసీల్దార్లకు ఉత్తర్వులు పంపారు. ఇటీవల కల్కి ట్రస్టు భూముల ఆక్రమణపై భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్ని వెంకటసుబ్బయ్య, అటవీశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ మేరకు అంజూరు అటవీ ప్రాంతంలో 21 ఎకరాలు, అలాగే వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ప్రభుత్వ డీకేటీ భూముల ఆక్రమణ గురించి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా పెల్లేటి కోట: రాష్ట్ర హైకోర్టు కేంద్రప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా పెల్లేటి రాజేష్కుమార్ను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజేష్కుమార్ తిరుపతి జిల్లా, గూడూరు నియోజకవర్గం, కోటకు చెందిన సీనియర్ న్యాయవాది పెల్లేటి గోపాల్రెడ్డి కుమారుడు. రాజేష్కుమార్ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించినట్లు ఆయన తండ్రి గోపాల్రెడ్డి తెలిపారు. -
ఇదెక్కడి రూల్స్ సామీ!
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. తాము చెప్పిందే వేదమని.. అలాగే నడుచుకోవాలని అధికారుల మెడపై కత్తిపెడుతున్నారు. ఏ మాత్రం అతిక్రమించినా అందరి ఎదుటే వారిపై చిందులు తొక్కడం.. బదిలీ వేటు వేయడం ఇట్టే అలవాటు చేసుకుంటున్నారు. ఇలాంటిదే కుప్పం రెస్కోలో అమలు చేస్తున్నారు. కొత్త విద్యుత్ మీటర్ తీసుకోవాలంటే కూటమి నేతల నుంచి సిఫార్సు లేఖ ఉండాలని హుకుం జారీచేశారు. లేకుంటే కొత్త విద్యుత్ మీటరు ఇవ్వరాదని అధికారులను హెచ్చరిస్తున్నారు. సిఫార్సు లేఖలు సంపాదించలేక.. కూటమి నేతలను ప్రసన్నం చేసుకోలేక సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు తిరిగి తిరిగి అలసిపోతున్నారు. కుప్పం: పరిపాలన పరంగా రాష్ట్రమంతా ఒక విధానాన్ని కొనసాగిస్తుంటే.. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మాత్రం మరో విధంగా ముందుకెళ్తున్నారు. ఇక్కడ కూటమి నేతలు చెప్పిందే వేదంగా అధికారులు సైతం నడుచుకుంటున్నారు. వారి అడుగులకు మడుగులొత్తుతూ పేదల సమస్యలను గాలికొదిలేస్తున్నారు. కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో) పరిధిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఎవరైనా కొత్తగా విద్యుత్ మీటర్ కావాలంటే స్థానికంగా ఉన్న కూటమి నేతల సిఫార్సు లేఖ తీసుకురావాలి. లేదంటే వారి వద్ద నుంచి అధికారులకు ఫోన్లు చేసి చెప్పారు. ఈ నిబంధనను రెస్కోలో తప్పనిసరి చేశారు. సాధారణంగా విద్యుత్ మీటర్ కోసం స్థానికంగా ఉన్న సచివాలయంలో నమోదు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ నోఅబ్జెక్షన్ (ఎన్ఓసీ) సర్టిఫికెట్తో పాటు సంబంధిత అధికార పార్టీ నేతల సంతకాలు తప్పని సరిగా ఉండాలని రెస్కోలో పనిచేస్తున్న పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి లైన్మన్ల వరకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. రెస్కోలో విద్యుత్ మీటర్కు నగదు చెల్లిస్తే మీటర్ను సంబంధిత సిబ్బంది అందిస్తారు. దీనిపై స్థానిక నాయకుల సంతకాలు ఎందుకో అర్థం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. 1 కేవీ విద్యుత్ మీటర్కు 1,700 చెల్లించాలి. దీని ప్రకారం ఎన్ని కేవీలు కావాలంటే అంత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. దీనికి స్థానికంగా ఉన్న నాయకుడి సంతకం ఎందకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని విస్మరించినందుకు గత నాలుగు రోజు క్రితం మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఓ టీడీపీ నేత సబంధిత రెస్కో ఉద్యోగిపై చిందులు తొక్కినట్టు సమాచారం. తమకు తెలియకుండా విద్యుత్ మీటరు ఎలా ఇస్తారంటూ నిలదీసినట్టు తెలుస్తోంది. ఇది పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో సైతం ఈ కొత్త రూల్ అమలు చేస్తున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. కుప్పంలోని రెస్కో సంస్థ పాలన గాడి తప్పుతోంది. గతంలో ఇక్కడ పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) బదిలీపై వెళ్లారు. ఆయన వెళ్లి ఆరు నెలలవుతున్నా ఇంతవరకు ఆ పోస్టును భర్తీ చేయలేదు. రెస్కో పాలనపై ప్రస్తుతం ఉన్న పాలకవర్గం పట్టుకోల్పోయింది. దీంతో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. పాలకవర్గ సభ్యుల్లో సైతం సమన్వయం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెస్కో ఎండీ పోస్టుకు పోటాపోటీ కుప్పం రెస్కో సంస్థ ఎండీ పోస్టుకు తీవ్రమైన పోటీ నెలకొంది. సాధారణంగా ట్రాన్స్కో నుంచి సీనియర్ ఇంజినీరింగ్ అధికారిని ఎండీగా నియమిస్తారు. దీంతో పలువురు ఆశావహులు పోటాపోటీగా తమ ప్రయత్నాల్లో మునిగితేలుతున్నట్టు సమాచారం.గాడితప్పిన రెస్కో పాలన సిఫార్సు లేఖ ఉంటేనే కొత్త విద్యుత్ మీటర్ కొత్త విద్యుత్ మీటర్ కావాలంటే ఎందుకో ఇలా.. -
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధం
శ్రీరంగరాజపురం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని పాతపాళ్యం దళితవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన వరప్రసాద్తోపాటు కుటుంబ సభ్యులు గురువారం క్రిస్మస్ సందర్భంగా చర్చికి వెళ్లారు. అదే సందర్భంలో అకస్మాత్గా షార్ట్ సర్క్యూట్ కారణంగా అతని పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.30 వేల నగదు, 40 గ్రాముల బంగారు ఆభరణాలు, వరి ధాన్యం, బియ్యం, దుస్తులు కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితుడు కోరారు. దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేత శాంతిపురం: పంచాయతీ కేంద్రమైన నడింపల్లిలో తన ఇంటిని దౌర్జన్యంగా కూల్చివేయడంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు మారప్ప తెలిపారు. భూ వివాదంపై కుప్పం కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే జేసీబీతో ఇంటిని కూలదోశారని వాపోయాడు. కోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఆగాలని కోరినా వినిపించుకోకుండా ప్రత్యర్థి పక్షం వారు కూల్చివేశారని చెప్పాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, కోర్టు వివాదంలో ఉన్న ఆస్తిలో ఎవరూ ప్రవేశించ కుండా చూడాలని కోరారు. ప్రభుత్వ కుంట ఆక్రమణ చంద్రగిరి: మండలంలోని ఏ.రంగంపేట సమీపంలో సుమారు రూ.40 లక్షల విలువైన ప్రభుత్వ కుంటను స్థానిక టీడీపీ నేత ఆక్రమించుకుంటున్నాడు. ఆరేపల్లి లెక్క దాఖల సర్వే నంబర్ 142/6లో 30 సెంట్ల కుంట ఉంది. ఇక్కడ గతంలో పురాతన కోనేరు ఉండేది. కాలక్రమేణ కోనేరు పూడిపోవడం, రెవెన్యూ రికార్డుల్లో కుంట భూమిగా నమోదైంది. ఇదే అదునుగా భావించిన పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఆ భూమిపై కన్నేశాడు. రెండు రోజులుగా నిరంతరం మట్టిని తరలించి, కుంటను చదును చేసే పనిలో నిమగ్నమయ్యాడు. విలువైన భూములు ఇలా అన్యాక్రాంతం కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రగిరిలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు చేస్తే, నామమాత్రంగా పనులను అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 60 సవర్ల బంగారం, రూ1.5 లక్షల నగదు చోరీ వెంకటగిరి రూరల్: కుమార్తె ఉన్నత చదువులు కోసం ఇంట్లో దాచి ఉంచిన నగదు, బంగారం ఎవరు లేని సమయం చూసి దుండగలు చోరీ చేశారు. ఈ ఘటన పట్టణంలోని తోలిమిట్టలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం మేరకు..తోలిమిట్టకు చెందిన చీమల కృష్ణమూర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తె ప్రస్తుతం తిరుపతిలో విద్యనభ్యసిస్తూ అక్కడే ఉంది. కుమార్తె బాబోగులు చూసుకునేందుకు బుధవారం తిరుపతికి వెళ్లిన కృష్ణమూర్తి గురువారం ఇంటికి వచ్చి చూసేసరికే గుర్తు తెలియని దుండగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందర వందరగా చేసి ఉన్నారు. అనుమానంతో తాను దాచి ఉంచిన బంగారం, నగదును చూడగా కనిపించలేదు. బాధితుడు ఈ విషయమై పోలీసుల కు సమాచారం అందించాడు. స్థానిక ఎస్ఐ ఏడుకొండలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, క్లూస్టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నట్లు తెలిపారు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు 60 సవర్ల బంగారం, రూ.1.50 లక్షల నగదు చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దగ్ధమైన వస్తువులు -
ఉపాధిలో వేతన వెతలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉపాధి కూలీల అవస్థలు అన్నీఇన్నీ కావు. నాలుగు నెలలుగా వేతనాలు, కూలీలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించి 15 రోజుల్లో జీతాలు అందించేలా చట్టం ఉన్న ప్పటికీ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూలీలకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 15 నుంచి అందని జీతాలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉపాధి కూలీలు పస్తులుండాల్సి వస్తోంది. చంద్రబాబు సర్కారు ఉపాధి కూలీల పట్ల చిన్నచూపు చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఉపాధి కూలీలకు జీతాలు అందడం లేదు. పేరుకుపోయిన బకాయిలు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీల జీతాలు రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఇందుకు కారణం కేంద్రమేనని, బడ్జెట్ విడుదల చేయడం లేదని చంద్రబాబు సర్కారు ప్రచారం చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జీతాలు రాకపోవడంతో ఉపాధి కూలీలు వలస బాట పట్టారు. రామకుప్పం, ఐరాల, పూతలపట్టు మండలాల్లో యంత్రాలతో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్ని చోట్ల కూలీలకు అందాల్సిన నిధులు రానివ్వకుండా నొక్కేసేందుకు పచ్చ నేతలు యంత్రాలతో పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. నత్తనడకన ఉపాధి పనులు గ్రామాల అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తున్నామని డప్పు కొంట్టుకుంటున్న చంద్రబాబు సర్కారు క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు. డ్వామా శాఖ పరిధిలో ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటి వరకు మొత్తం 62,848 పనులు మంజూరు చేశారు. అయితే వీటిలో 17,788 మాత్రమే పూర్తి చేయగలిగారు. ఫీడర్ చానళ్ల పూడిక తీతకు 3,422 పనులను మంజూరు చేయ గా 324 మాత్రమే పూర్తి చేశారు. జిల్లాలో 23,583 ఫామ్పాండ్స్ పనులను మంజూరు చేయగా ఇప్పటి వరకు 6,678 పూర్తి చేసి మిగిలినవి నిలిపివేశారు. ఆర్భాటంగా నిర్వహించిన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2,395 పశువుల పాకలు మంజూరు చేయగా ఇందులో 682 మాత్రమే పూర్తి చేశారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు 6,678 మంజూరు చేయగా 2,283, కంపోస్ట్ గుంతలు 9,791కి 4,769, పశువుల తొట్టెలు 1,788కి గాను 761 పూర్తి చేసి మిగిలిన పనులను నిలిపివేశారు. గ్రామీణ రహదారుల అభివృద్ధిలో జిల్లా వ్యాప్తంగా 1,434 సీసీ రోడ్లను మంజూరు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 127 రోడ్లు మాత్రమే వేయగలిగారు. -
వెంకన్న దర్శనానికి వెళ్తూ..
చౌడేపల్లె: పుంగనూరు మండలం, ప్రసన్నయ్యగారి పల్లెకు చెందిన గుండ్లపల్లి శ్రీరాములు(62) తిరుమలకు పాదయాత్రగా వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. ప్రసన్నగారిపల్లెకు చెందిన గుండ్లపల్లి శ్రీరాములు గ్రామస్తులతో కలిసి ప్రతి యేటా తిరుమలకు పాదయాత్రగా వెళ్లి స్వామిని దర్శించుకునేవారు. ఈక్రమంలో గురువారం ఇంటి వద్ద నుంచి బయలుదేరి కాలినడకన వెళ్తుండగా చౌడపల్లె పోలీస్ స్టేషన్కు సమీపంలోని పెద్దయల్లకుంట్ల వద్ద పుంగనూరు నుంచి చౌడేపల్లెకు వెళ్తున్న ఓ స్కూటర్ ఢీకొంది. శ్రీరాము లు తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. బైక్తోపాటు ఆమినిగుంటకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కిస్మస్ వేడుకల్లో కలెక్టర్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం,కొంగారెడ్డిపల్లిలోని బీటీ మెమోరియల్ చర్చి లో గురువారం జరిగిన కిస్మస్ వేడుకల్లో కలెక్టర్ సుమిత్కుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నా రు. కాసేపు దైవ సందేశాన్ని ఆలకించారు. అనంతరం చర్చి పాస్టర్లు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. తర్వాత శాలువతో సత్కరించారు. కిక్కిరిసిన కాణిపాకం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గురువారం సెలవు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయం భక్తులతో నిండిపోయింది. క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆలయ ఆవరణంలో కూడా భక్తజన సందడి కనిపించింది. భక్తుల తాకిడితో దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆలయ అధికారులకు స్వామి దర్శనం కల్పించారు. రేపు పడిమెట్ల పూజోత్సవం సదుం: మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం పడిమెట్ల పూజోత్సవం నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో ప్రాముఖ్యత కలిగిన పడిమెట్ల పూజోత్సవాన్ని ఆలయ ధర్మకర్త, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విశేషంగా తరలివచ్చే స్వాములు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
అనుభవించక తప్పదు
చేసిన పాపాలు సోమల(సదుం): కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాలను భవిష్యత్లో అనుభవించక తప్పదని, బాబు నీచరాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటరు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. సోమల మండలంలో గురువారం వారు విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన నాయ కులు చేసిన తప్పిదాలు, అరాచకాలను సైతం వైఎస్సార్ సీపీపై నెట్టేసి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. చేసిన పాపాలను రానున్న రోజుల్లో అనుభవించక తప్పదని హెచ్చరించారు. గత ప్రభుత్వ పాలనలో అమలు చేసిన పలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రస్తుతం నిలిపివేశారని, ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేక చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పేదలకు వైద్యం, విద్యను దూరం చేసే ఈ విధానంపై ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. మైనారిటీల సంక్షేమానికి కృషి సోమల: ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మైనారిటీలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఎంపీ మైనారిటీలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే, ఎంపీ తెలిపారు. సోమల ఈద్గా వద్ద మైనారిటీలతో సమావేశం నిర్వహించారు. ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ ఈశ్వరయ్య, నాయకులు అమాసమోహన్, గంగాధర్రాయల్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సరస్వతమ్మ, వైస్ ఎంపీపీలు ప్రభాకర్, సయ్యద్బాషా, కల్యాణ భరత్, దామోదరరాజు పాల్గొన్నారు. -
మన్నిక, నాణ్యతకు ప్రతీకగా భారతి సిమెంట్
నాయుడుపేట టౌన్: మన్నిక, నాణ్యతలకు ప్రతీక భారతి సిమెంట్ అని, ఇది అన్ని వర్గాల వారి మన్ననలు పొందుతోందని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి పాస్టర్ ఆదర్ష్ ప్రీతం కొనియాడారు. నాయుడుపేటలోని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి వద్ద ఆ సంఘం పెద్దలు యువతతో కలిసి పాస్టర్ కేక్ కట్ చేసి భారతి సిమెంట్స్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ ఏటా క్రిస్మస్ వేడకలను భారతి సిమెంట్స్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి అందరితో కలిసి జరుపుకోవడం ఎంతో హర్షణీయమన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భారతి సిమెంట్స్ పరిశ్రమకు సంబంధించి క్యాలెండర్లను ఆవిష్కరించారు. భారతి సిమెంట్స్ కంపెనీ నెల్లూరు జిల్లా డిప్యూటీ మేనేజర్ జేఎన్ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చైర్మన్ కారల్ మధు, కేఎంవీ కళాచంద్ర, సండే స్కూల్ సూపరిండిండెంట్ ప్రేమ్చంద్, భారతి సిమెంట్స్ డీలర్లు కామిరెడ్డి అమరేంద్రరెడ్డి, కరీంబాయి, చెంచయ్య మొదలియార్, వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు బెన్హర్, కాళహస్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం..నిరుపయోగం
అరగొండ బాలికోన్నత పాఠశాలలో సమస్యల తిష్ట అరగొండలో నిరుపయోగంగా ఉన్న బాలికల హైస్కూల్ అదనపు తరగతి గదులు, ఆట స్థలంలో పిచ్చిమొక్కలు తవణంపల్లె: మండలంలోని అరగొండ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అరగొండ బాలికోన్నత పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇక్కడ 193 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియెట్లో 20 మందిదాకా చదువుతున్నారు. హైస్కూల్ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. నీటి సరఫరా సైతం సక్రమంగా లేదు. 20 ఏళ్ల క్రితం జెడ్పీ నిధులతో నిర్మించిన మూడు తరగతి గదులు, ఆట స్థలం, మరుగు దొడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. వీటి చుట్టూ ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. రోడ్డు దాటలేకనే.. అరగొండ బాలికోన్నత పాఠశాలకు రెండు ప్రదేశా ల్లో సుమారు 200 మీటర్ల దూరంలో అదనపు తరగతి గదులు నిర్మించారు. కానీ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఒకే ప్రదేశంలో తరగతులు నిర్వహిస్తున్నారు. మరోచోట ఉన్న తరగతి గదులకు రాకపోకలకు రోడ్డును దాటి వెళ్లాల్సి ఉంది. దీంతో అటువైపు ఎవ్వరూ వెళ్లడం లేదు. గతంలో నుంచే నిరుపయోగం నేను హెచ్ఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లవుతోంది. అంతకుముందు నుంచే మూడు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఆట స్థలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం ఆట స్థలాన్ని వినియోగంలోకి తేవడానికి చర్యలు చేపడుతాం. మౌలిక వసతులు కల్పిస్తే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తా. – మోహన్రెడ్డి, హెచ్ఎం, అరగొండ బాలికోన్నత పాఠశాల -
దేవుడు కనిపించాడు!
దివ్యదర్శన టోకెన్ల క్యూలలో తోపులాట ఆ నగుమోమును చూడాలని.. నిలువెత్తు మూర్తిని దర్శించుకోవాలని.. ఆ అమృతమూర్తిని కనులారా వీక్షించాలని వారంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరునగరికి చేరుకున్నారు. అయితే వారికి ఏడుకొండల వాడి పాదాల చెంతన ఉన్న అలిపిరిలోనే ఆ దేవదేవుడు కనిపించాడు. తోపులాటలో చిన్నా, పెద్దా, వయోవృద్ధులు వర్ణించనలవికానీ అగచాట్లు పడ్డారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో తండ్రీ నిను చూడాలని వచ్చిన మాకు ఇన్ని ఇక్కట్లా అని ఆవేదన చెందారు. పండుగ సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం గురువారం తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్కు భక్తులు అత్యధిక సంఖ్యలో చేరుకున్న దర్శన టోకెన్ల కోసం అష్టకష్టాలు పడ్డారు. నిర్దేశించిన లక్ష్యం కంటే మించి రెండింతల మేరకు భక్త జనం చేరుకోవడంతో క్యూలన్నీ కిక్కిరిసి పోయాయి. దివ్యదర్శన టోకెన్ జారీ కౌంటర్ వద్ద భక్తులు పోటెత్తడంతో నిలువరించే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది చర్యలు ఏమాత్రం ఫలించలేదు. భక్తులు టోకెన్ల కోసం ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాటలు చోటుచేసుకుని అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కంచెలను దాటే ప్రయత్నంలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తుల రద్దీ ఏ మాత్రం దగ్గలేదు. నిర్దేశించిన మేరకు టోకెన్ల జారీ పూర్తి అయిందనే విషయం తెలుసుకున్న పలువురు భక్తులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ నిరుత్సాహంగా ఊసురోమంటూ వెనుదిరిగారు. కాగా ఈ ఘటన చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి ఫొటో గ్రాఫర్ కెమెరాను ఏవీఎస్ఓ లాక్కున్నారు. – తిరుపతి అన్నమయ్యసర్కిల్ -
యూరియా..లేదయ?
రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో ఏ ఎరువుల దుకాణానికి వెళ్లినా కావాల్సినంత యూరియా దొరికేది. సకాలంలో పంటలకు వేసుకునేవారు. కానీ ఇప్పుడు యూరియా కోసం తిరిగి తిరిగి చెప్పులరుగుతున్నా ఎక్కడా దొరకడం లేదు. వచ్చే అరకొర యూరియా ఎక్కడికీ చాలడం లేదు. ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్ఎస్కేలు.. ఫర్టిలైజర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు పాలకులుగానీ.. అటు అధికారులు గానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలమనేరులోని రైతు సమాఖ్య సెంటర్, గ్రోమార్ దుకాణాల వద్ద యూరియా కోసం క్యూకట్టిన రైతులు (ఫైల్) బ్లాక్లో బస్తా యూరియా రూ.500 పైమాటే స్థానికంగా యూరియా దొకరడం లేదు. దీన్ని అదునుగా చేసుకొని కర్ణాటకలో యూరియాను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి ఆటో డ్రైవర్లకు ఇది బాగా కలిసి వస్తోంది. నిత్యం బోర్డర్కు వెళ్లడం.. పది బస్తాలను ఆటోలో తెచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయించడం రివాజుగా మారుతోంది. కర్ణాటకలో బస్తా యూరియా ధర రూ.270 కాగా అది బ్లాక్లో రూ.500 దాటుతోంది. ఎరువుల దుకాణాల్లో నోస్టాక్ జిల్లాలోని ఎరువుల దుకాల్లో యూరియా స్టాకు లేదు. వీరికి హోల్సేల్గా సరఫరాచేసే ఏజెన్సీలు యూరియా కావాలంటే కాంప్లెక్స్ తీసుకోవాలంటూ మెలిక పెట్టాయి. దీంతోపాటు ఇక్కడ ఎమ్మార్పీ రూ.275కి విక్రయించాల్సి ఉండగా..ట్రాన్స్ఫోర్ట్ చార్జీలు అదనంగా ఉంటున్నాయి. దీంతో బస్తా రూ.300పైగా విక్రయించాలి. లేని సమస్యలకెందుకని ఫర్టిలైజర్స్ యూరియాను అసలు కొనడం లేదు. దీనికితోడు ప్రభుత్వం సైతం ఆర్ఎస్కేలు, రైతు సమాఖ్య, గ్రోమార్ సెంటర్లకు మాత్రమే యూరియాను పంపుతోంది. పలమనేరు: జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతు న్న కష్టాలు అన్నీఇన్నీకావు. మొన్నటి దాకా కాంప్లెక్స్ లేదా ఫర్టిలైజర్స్ కొంటేనే యూరియా అమ్మిన ఎరువుల దుకాణదారులు ఇప్పుడు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. హోల్సేల్ కంపెనీల నుంచి డైరెక్ట్గా అందే జిల్లాలోని గ్రామోర్ అవుట్లెట్లు, రైతు సమాఖ్య దుకా ణాలకు వందలాది మంది రైతులు క్యూకడుతున్నారు. వారిని నియంత్రించేందకు పోలీసు బందోబస్తు చేపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వరి నారుమళ్లకు సైతం యూరియా దొరకడం లేదు. ఏపీ రైతుల దెబ్బ కు పక్కనే ఉన్న కర్ణాటకలో సైతం స్టాకు లేకుండా పోయింది. ఉన్న స్టాకును కొందరు బ్లాక్ మార్కెట్లోకి తరలించి స్థానికంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల్లో కావాల్సినంత యూరియా దొరగ్గా కూటమి పాలనలో మాత్రం ఎందుకు యూరియాకు డిమాండ్ వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్కడా యూరియా లేదు జిల్లాలో యూరియా దొరక్క రైతులు పొరుగునే ఉన్న కర్ణాటకకు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ఇక్కడ నెలకొన డిమాండ్ కారణంగా అక్కడ కూడా యూరియా దొరకడం లేదు. ఉన్న యూరియా అంతా ఆంధ్రావాళ్లకే చాలడం లేదు.. ఇక మా వద్ద స్టాకెక్కడుంటుందనే మాట అక్కడి వ్యాపారుల నుంచి వినిపిస్తోంది. భారీగా పెరిగిన వరి సాగు జిల్లాలో గత ఖరీఫ్లోనూ వరిసాగు పెరిగింది. ఈ మధ్య కురిసిన వర్షాలతో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. దీంతో సాధారణ వరిసాగు ఈ రబీలో నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నారుమళ్ల సీజన్ నడుస్తోంది. దీంతోపాటు మొక్కజొన్న, పశుగ్రాసం, మల్బరీ పంటలకు సైతం రైతులు యూరియాను వాడుతున్నారు. జిల్లాలో డిమాండ్ మేరకు యూరియా అలాట్మెంట్ మాత్రం పెరగడం లేదు. గంటల్లో ఖాళీ ఇటీవల జిల్లాలోని రైతుసేవా కేంద్రాల్లో ఒక్కో పంచాయతీకి రూ.250 బస్తాల యూరియా వచ్చింది. ఇది కేవలం గంటల్లో ఖాళీ అయిపోయింది. ఇందులో సింహభాగం కూటమి నేతలకే చేరిపోయింది. ఫలితంగా అవరసమైన రైతులు బ్లాక్లో కర్ణాటక నుంచి అధిక ధరతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లా సమాచారం జిల్లాలో యూరియా నో స్టాక్ దొరకలేదు ఓ బస్తా యూరియా కోసం వారం రోజులుగా పలమనేరు లోని దుకాణాల వద్దకు తిరు గుతున్నా. కానీ ఫలితం లేదు. మొన్నటి దాకా యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనాలన్నారు. దానికి కూడా రెడీ అన్నా ఇప్పుడు యూరియా దొరకడం లేదు. మా బంధువుల ద్వారా కర్ణాటకలోని వడ్డిపల్లికెళ్లి బస్తా యూరియా తెచ్చుకున్నా. – సుబ్బన్న, గొల్లపల్లి, రైతు, పలమనేరు మండలం -
ఘనంగా హనుమాన్ చాలీసా
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో గురువారం హనుమాన్ చాలీసాను ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సంకీర్తనలు, భజనల తో భక్తులను హోలలాడించారు. కార్యక్రమాని కి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వారికి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
వ్యవసాయ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 45 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడం జరిగిందని, ఈ డిసెంబర్ 31వ తేదీలోగా మరో 5 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరుతో 50 వేల సర్వీసుల మార్కును చేరుకోవాలని జిల్లా స్థాయి విద్యుత్ అధికారులకు సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రూఫ్ టాప్ సోలార్పై అవగాహన సంస్థ పరిధిలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా రూఫ్ టాప్ సోలార్ సిస్టంపై వినియోగదారుల్లో అవగాహనను పెంపొందించాలని సీఎండీ సూచించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు మాత్రమే కాకుండా, ఇతర గృహ వినియోగదారులను కూడా సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ’కరెంటోళ్ళ జనబాట’ కార్యక్రమం జరిగిన తీరుపై అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కే.గురవయ్య, కే.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జే.రమణాదేవి, కె. ఆదిశేషయ్య, పీహెచ్ జానకీరామ్, ఎం.మురళీకుమార్, పి. సురేంద్రనాయుడు, జనరల్ మేనేజర్లు కృష్ణారెడ్డి, విజయన్, రామచంద్రరావు, చక్రపాణి, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, ఎస్ఈలు చంద్రశేఖరరావు, రాఘవేంద్రరావు, రమణ, ఇస్మాయిల్ అహ్మద్, శేషాద్రి శేఖర్, ప్రదీప్ కుమార్, సుధాకర్, సంపత్ కుమార్, సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
–త్రుటిలో తప్పిన ప్రమాదం కార్వేటినగరం : చెరకు ట్రాక్టర్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన మండల పరిధిలోని చిన్నకనుమ వద్ధ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ గోవిందస్వామి కథనం మేరకు వివరాలిలా.. బెంగళూరు నుంచి కేఎస్ ఆర్టీసీ బస్సు పుత్తూరుకు వెళుతుండగా ఎస్ఎన్జే షుగర్ ఫ్యాక్టరీకి చెరకు లోడ్తో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. బస్సు డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయట పడ్డారు. ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్కు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనపై ఇంత వరకు ఫిర్యాదు అందలేదని ఏఎస్ఐ గోవిందస్వామి తెలిపారు. తప్పిన ప్రమాదం అసలే ప్రమాదాలకు నిలయంగా ఉన్న చిన్న, పెద్ద కనుమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో కూడా అదే కనుమపై ఇటుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. కనుమకు ఎడమ వైపు సుమారు 30 అడుగుల లోతు లోయ ఉంది. కానీ చెరకు ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో బస్సు ఎడమ వైపు వాలకుండా చెరుకు లోడ్డు ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
నకిలీ వి‘ప’త్తు!
చౌడేపల్లె: పడమటి మండలాల రైతులు టమాట సాగుపై దృష్టి సారించారు. నారుకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నర్సరీ నిర్వాహకులు నకిలీ నారును అంటగడుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో దశలవారీగా టమాట పంటను సాగుచేయనున్నారు. సీజన్ దగ్గరపడుతుండడంతో పలువురు నర్సరీ నిర్వాహకులు విత్తనాలు విత్తి మొలకల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. తక్కువ నీటి సౌకర్యం ఉన్న రైతు కూడా అధిక దిగుబడులు పొందడానికి మార్కెట్లో వెలువడిన కొత్తరకం విత్తనాలపై ఆశపడుతున్నారు. నర్సరీలో ప్రస్తుతం సాహో, సల్లార్, కావేరి, 778, శివంగితోపాటు పలు కొత్త రకం టమాట మొలకలు లభిస్తున్నాయి. ముందుగానే రిజర్వేషన్లు మొలకల కోసం రైతులు ముందుగానే నర్సరీ యజమానుల వద్ద ఒప్పదం కుదుర్చుకుంటున్నారు. ఒక్కొక్క టమాట మొలకను రూ.1.2 పైసల నుంచి రూ.2 వరకు విక్రయిస్తున్నారు. నారు పెంచేందుకు 27 రోజులు పడుతుందని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఎకరం పొలానికి 7 వేల నుంచి 8 వేల టమాట మొలకలు అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు. నకిలీ నారు, నకిలీ విత్తనాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.టమాట నారుకు భలే డిమాండ్ నకిలీల జోరు టమాట మొలకల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు బయట ప్రాంతం నుంచి నారును సరఫరా చేస్తున్నారు. దీంతో నకిలీ విత్తనాలతో తయా రు చేసిన నారు జోరుగా విక్రయిస్తున్నట్టు రైతులు ఆ రోపిస్తున్నారు. అధికారులకు సమాచారం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. -
నరసింహపురంలో కోడి పందేల జోరు
పాలసముద్రం : మండలంలోని నరసింహపురం పంచాయతీ తమిళనాడు సరిహద్దులో బుధవారం కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తమిళనాడు సరిహద్దులో కొన్ని రోజులుగా కోడి పందేలు, పేకాట జోరుగా సాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో కోడి పందేలు, పేకాట జోరుగా సాగుతున్నాయని చెబుతున్నా రు. తిరుమళరాజుపురం (రైస్మిల్) కూడలిలో తమిళనాడు వాసులు కోడి పుంజులతో వచ్చి పందేలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది యువజనోత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ ఎస్వీయూ తిరుపతి సిటీ : దక్షిణాది రాష్ట్రాల యువజనోత్సవాల్లో ఎస్వీయూ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడం ఎంతో గర్వకారణమని ఆ వర్సిటీ వీసీ నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. యువజన ఉత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి యూనివర్సిటీకి వచ్చిన కళాబృందాలను బుధవారం వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ దక్షిణాదిలోనే ఎస్వీ యూనివర్సిటీ ఓవరాల్ చాంపియన్ షిప్ను కై వసం చేసుకోవడం గర్వకారణమన్నారు. వారిని ప్రోత్సహించిన కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ను ప్రత్యేకంగా అభినందించారు. విజేతలు సాధించిన జ్ఞాపికలను యూనివర్సిటీ కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ పత్తిపాటి వివేక్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీసీ డీన్ ప్రొఫెసర్ చెండ్రాయుడు, కల్చరల్ అఫైర్స్ మాజీ డైరెక్టర్ కేఎం భాను, డాక్టర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,583 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,936 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.936 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలి తిరుపతి అన్నమయ్యసర్కిల్: వచ్చే నెలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత తిరుపతి క్రైం: తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో వారు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రుల కమిటీలు సమీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. తిరుమలలో సుమారు 3వేల మంది పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేసినట్లు వివరించారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమతి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. – ఈ ఏడాది 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులు తప్పనిసరిగా నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే హాజరు కావాలని సూచించారు. భక్తులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని తెలిపారు. అదనపు ఎస్పీలు విమనోహరాచారి, శ్రీనివాసులు, డీఎస్పీలు పాల్గొన్నారు. -
వేతన.. యాతన
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన 104 ఉద్యోగులు పల్లెల్లో వైద్యసేవలు అందిస్తున్న ఆపద్బాంధవులకు ఆపదొచ్చింది. 104 అంబులెనన్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువుతోంది. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న వారి జీవితాలు తలకిందులవుతున్నాయి. అదనపు భారం కొండెక్కింది. వేధింపులు తార స్థాయికి చేరాయి. ప్రశ్నిస్తే..వేటు వేస్తున్నారు. ప్రభుత్వ అండదండలతో యాజమాన్యం విడ్డూరంగా వ్యవహరిస్తోంది. వారి పోరు పడలేక ఉద్యోగులు రోడ్డెక్కారు. నిరవధిక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. – చిత్తూరు రూరల్ (కాణిపాకం) జిల్లాలో 729 గ్రామాలకు గాను ’104’ వాహనాలు కేవలం 42 మాత్రమే ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) ఉన్నారు. మొత్తం మీద 93 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ 104 కాంట్రాక్ట్ చేపట్టింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ఉద్యోగులలో 10 శాతం అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంది. కానీ ఆ సిబ్బంది నియామకంలో నిర్వాహకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వీడని వేధింపులు సరిపడా సిబ్బంది లేకపోయినప్పటికీ భవ్య యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తోంది. ఒక ఉద్యోగి చేత ఇద్దరు ఉద్యోగుల పనిని చేయించుకుంటోందని ముండిపడుతున్నారు. రెండు వాహనాలకు ఒక డ్రైవర్కు డ్యూటీ వేయడం. ఒక డీఈఓతో రెండు వాహనాల డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు ఊపి రాడని పరిస్థితి నెలకొంటోంది. రోగులకు సేవలందించడంతో పాటుగా ప్రతి రోజూ వివిధ రికార్డులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరు రకాల రికార్డులు పూర్తి చేయడమే కాకుండా ఎంఓ యాప్ కూడా ఆన్లైన్ చేయాలి. దీనికితోడు ఇటీవల భవ్య యాప్ తీసుకొచ్చి దానిని కూడా ఆన్లైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఫార్మసీ పనులు కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారానే చేయిస్తున్నారు. ఈ తరణంలో ప్రజలకు జరకూడనిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యలని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెలవులు ఏవీ.. కొంతమంది ఉద్యోగులకు ఇంటి వద్ద తల్లిదండ్రులు ఉన్నారు. వారి బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. వా రు వృద్ధాప్యంలో తరచూ అనారోగ్యం పాలవుతుంటా రు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా 104 ఉద్యోగులకు యాజమాన్యం సెలవులు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య ప రిస్థితుల సమయంలో సెలవులివ్వకుండా వేధింపుల కు పాల్పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సెలవు పెట్టినప్పటికీ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఉద్యోగు లు వాపోతున్నారు. సెలవు రోజు వేతనం మాత్రం క ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల హక్కులు సరే మానవ హక్కులను కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల నుంచి కోతలు గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించిన అరబిందో ఇచ్చిన జీతాల కంటే ప్రస్తుతం భవ్య యాజమాన్యం తక్కువ జీతాలు చెల్లిస్తోంది. ఇస్తున్న ఆరకొర జీతాల్లో నుంచి ఉద్యోగులకు ఎలాంటి సమా చారం ఇవ్వకుండా సీనియర్ల నుంచి నెలకు రూ.800 , జూనియర్ల నుంచి నెలకు రూ.500 కోత విధిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు కోత విధిస్తున్నారో. ఎవరు విధిస్తున్నారో సమాధానం చెప్పే వారే లేకుండా పోవడంతో 104 ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏడు నెలలుగా ఉద్యోగులకు పే స్లిప్పులు ఇవ్వకుండా యాజమాన్యం దాగుడు మూతలు ఆడుతోంది. గతంలో ఇచ్చినట్లుగానే భవ్య యాజమాన్యం కూడా జీతాలు సక్రమంగా చెల్లింస్తుందని, అధికారులు ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఈఎస్ఐ, పీఎఫ్ యాజమాన్యం వాటా చెల్లించాల్సి ఉంది. కానీ 104 ఉద్యోగుల నుంచి కంపెనీ వాటా, ఉద్యోగి వాటా రెండూ వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు అభద్రతకు గురవుతున్నారు. నిరసనలు ఇలా... నిబంధనలకు తూట్లు భవ్య యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఉద్యోగులకు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్ద తలకాయల మద్దతుతో రెచ్చిపోతున్న యాజమాన్యం వైఖరిని ప్రశ్నించడం నేరమవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి అధికారిని కలవడానికి ప్రయత్నించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద వేధింపులకు దిగనట్టు సమాచారం. గత నాలుగురోజులుగా చేపడుతున్న ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు నిర్వాహకులు ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తోందని పలువురు వాపోతున్నారు. -
‘ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు’
ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళుతూ..ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచి పెడుతున్న వాహక నౌకసదుం : మంత్రులు ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములను తక్కువ ధరకే పప్పు బెల్లాల్లా పంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదుం మండలంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పెద్దిరెడ్డికి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఠంచన్గా అందించి అన్ని వర్గాలను గత ప్రభుత్వ పాలనలో ఆదుకున్నామని గుర్తు చేశారు. పలు పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ అమలుపై కూటమి నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ తిమ్మారెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, పార్టీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఖమ్రుద్దీన్, మస్తాన్, ధనశేఖర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో బుధవారం క్రిస్మస్ కోలాహలం మొదలైంది. గురువారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవ మందిరాలు, విశ్వాసుల గృహాలు నూతనత్వాన్ని సంతరించుకున్నాయి. త్యాగానికి ప్రతీక అయిన క్రిస్మస్ వేడుకను జరుపుకునేందుకు క్రైస్తవులు సన్నద్ధమయ్యారు. చర్చిలను విద్యుత్ దీపాలతో అలకరించారు. చర్చి లోపలి భాగంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పలుచోట్ల ఏసు జన్మ వృత్తాంతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు క్రైస్తవులు తమ గృహాలను సుందరంగా అలంకరించారు. అర్ధరాత్రి నుంచి ఏసును స్తుతిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ఆరాధనలు, ప్రార్ధనలు నిర్వహించారు. పిల్లలు, యువజనులు క్రీస్తు జనన వృత్తాంతాన్ని వివరించే నాటికలు ప్రదర్శించారు. గురువారం ఉదయం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు జరగనున్నాయి. కాగా క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీలు, చర్చిల అలంకరణ సామగ్రి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జాన్బాస్కో చర్చిలో క్రిస్మస్ ట్రీకాణిపాకం : జిల్లాలో జరుగుతున్న స్కానింగ్, అబార్షన్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. సాక్షి దినపత్రికలో మంగళవారం కన్నింగ్..స్కానింగ్ కథనం ప్రచురితమైంది. అలాగే బుధవారం అబార్షన్ల అనకొండలు పేరిట కథనం వచ్చింది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాతో పాటు అక్రమ స్కానింగ్ గుట్టు రట్టు కావాలని ఆదేశించారు. ఏయే జిల్లాలో అక్రమ స్కానింగ్లు, అబార్షన్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలోని వైద్యులు, ఏఎన్ఎంలు దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని హెచ్చరించారు. అక్రమస్కానింగ్లు ఏ రకంగా జరుగుతున్నాయి..? వారికి ఎవరెవ్వరూ సహకరిస్తున్నారు..? వారికి ఎంటీపీ కిట్లు ఎక్కడ దొరుకుతున్నాయి? అవి ఎలా సరఫరా జరుగుతున్నాయి? ఇందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వ్యక్తుల సహకారం ఏమైనా ఉందా? ఆడిట్ జరుగుతోందా అనే విషయాలపై రాష్ట్ర స్థాయి అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికైనా అబార్షన్లు, అక్రమ స్కానింగ్లు ఆగేనా?.క్రీస్తు జన్మవృత్తాంతం.. జాన్బాస్కో చర్చిలో అలంకరణఅక్రమ స్కానింగ్, అబార్షన్లపై ఆగ్రహం -
క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
పుంగనూరు : క్రిస్మస్ను పురస్కరించుకుని క్రైస్తవులకు బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి విడివిడిగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులతో కలసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్.. శాంతి నెలకొల్పడమే చిత్తూరు అర్బన్ : సమాజంలో శాంతి నెలకొల్పడంతో పాటు ప్రతి ఒక్కరిపై కరుణ, సహనం కలిగి ఉండటమే క్రిస్మస్ పండుగ లక్ష్యమని ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. పరస్పర గౌరవంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మంచి విలువలను పాటించాలని కోరారు. బీఎల్వోల జీతాల పెంపు చిత్తూరు కలెక్టరేట్ : బీఎల్వోల జీతాలను పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వివేక్యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు బుధవారం కలెక్టరేట్కు అందాయి. జిల్లాలోని బీఎల్వోలకు ఇకపై రూ.12 వేలు, బీఎల్వో సూపర్వైజర్లకు రూ.18 వేలు సంవత్సరానికి, స్పెషల్ ఇన్సెంటివ్ ప్రత్యేక డ్రైవ్స్ కార్యక్రమాలకు రూ.2 వేలు చొప్పున అందజేయనున్నారు. పెంచిన జీతాలు ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. పూర్తి సంవత్సరం పనిచేసిన వారికి పూర్తి జీతం, పాక్షికంగా పనిచేసిన వారికి అనుబంధంగా చెల్లింపు ఉంటుందని పేర్కొన్నారు. వరసిద్ధుడికి రూ.1.60 కోట్ల ఆదాయం కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.1,60,25,165 ఆదాయం వచ్చింది. బంగారం 16 గ్రాములు, వెండి 1.650 కిలోలుగా లెక్కకట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.13,316, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.25,720 వచ్చింది. యూఎస్ఏ 636 డాలర్లు, సింగపూర్ 162 డాలర్స్, మలేషియా 23 రింగిట్స్, యూఏఈ 5 దిర్హామ్స్, ఆస్ట్రేలియా 370 డాలర్స్ , సౌదీ 185 రియాల్స్ వచ్చాయి. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, డీఈవోలు సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 28న ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఈనెల 28వ తేదీన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఆర్బీ ప్రసాద్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా చెస్ అసోసియేషన్, ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పోటీలు ఈ నెల 28 వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్ లో జరుగుతాయన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు, ట్రోఫీలు, పతకాలు అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 27 వ తేదీ లోపు www. apchess.org వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9000475799, 9849313676 నంబర్లో సంప్రదించాలని కోరారు. మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి -
పోలీసు శిక్షణను పరిశీలించిన ఎస్పీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని జిల్లా పోలీ సు శిక్షణా కేంద్రం(డీటీసీ)లో కానిస్టేబుళ్లకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ పరిశీలించా రు. కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారికి ఇటీవల శిక్షణ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం డీటీసీలో జరుగుతున్న తరగతులను పరిశీలించి, అభ్యర్థులతో మాట్లాడారు. ఇక్కడ అందుతున్న వసతులు, సదుపాయాలపై ఆరా తీ శారు. అలాగే బోధనా పద్ధతులు, ఉపయోగిస్తున్న పరికరాలు, సిలబస్పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీటీసీ డీఎస్పీ రాంబాబు, ఇన్స్పెక్టర్ అమరనాథరెడ్డి ఉన్నారు. ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వర ఆలయంలో హుండీల ద్వారా రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ బాపిరెడ్డి తెలిపారు. ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. దేవస్థానం ఈఓ బాపిరెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో కానుకలను లెక్కించారు. 19 రోజుల వ్యవధిలో రూ.1.31 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే భక్తులు 25.300 గ్రాముల బంగారం, 352.17 కిలోల వెండి కానుకలుగా సమర్పించారన్నారు. విదేశీ కరెన్సీ అమెరికా 31 డాలర్లు, మలేషియా 13, సింగపూర్ 3, యూఏఈ 2, దిర్హమ్లు. ఇంగ్లాండ్ 2, కెనడా 2 డాలర్లు వచ్చినట్లు తెలిపారు. -
ఆడబిడ్డని చెరువులో పడేశారా?
బంగారుపాళెం : ఆడబిడ్డ భారమని పుట్టిన వెంటనే చెరువులో పడేశారా.. భారం తగ్గించుకుందా మనుకున్నారా..లేక ఇతర కారణాలతో పుట్టిన బిడ్డను వదిలించుకుందామనుకున్నారో.. భూమి మీద పడి కళ్లు తెరవక ముందే, ఆడ శిశువుకు నూరేళ్ల నిండిపోయాయి. నవమాసాలు మోసి కన్నపేగు తెంచకుండానే పుట్టిన బిడ్డను చెరువులో పడేశారు. ఈ సంఘటన మండలంలోని తుంబకుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బిక్కిరెడ్డి చెరువులో శిశువు మృతదేహం తేలాడుతుండగా బుధవారం సాయంత్రం పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆడ శిశువుగా గుర్తించారు. రెండు రోజుల క్రితం పుట్టిన ఆడబిడ్డను చెరువులో పడేసినట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన శిశువు గురించి గ్రామంలో విచారణ చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేక ఇతరులు ఎవరైనా బిడ్డను పడేసి వెళ్లారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు. -
రేసు కుక్కల దాడి
గుడిపాల : రేసు కుక్కల దాడిలో ఆవు దూడ మృతి చెందింది. గుడిపాల మండలం వెప్పాలమానుచేను గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి తమ వ్యవసాయ పొలాల వద్ద దూడను కట్టి ఉంచాడు. ఆ పొలాలకు ఆనుకునే అటవీ ప్రాంతం ఉంది. మంగళవారం రాత్రి రేసు కుక్కలు వచ్చి దూడపై దాడి చేసి చంపేశాయి. గ్రామస్తులు చిరుతపులి దాడి చేసిందని భయాందోళన చెందారు. అటవీశాఖ పారెస్ట్ బీట్ ఆఫీసర్ కుసుమకుమారి సంఘటనా స్ధలాన్ని పరిశీలించి చిరుతపులి దాడి చేయలేదని చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవి రేసుకుక్కలు దాడిచేసినట్లు నిర్ధారించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ సాయిసుధ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి దూడకు పంచనామా చేశారు. రాత్రి వేళల్లో అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద పాడి పశువులను ఉంచొద్దని గ్రామస్తులకు సూచించారు. -
అధికారంలోకి రాగానే పెట్రో ధరలు తగ్గిస్తామన్న పెద్ద బాబు, చిన బాబు ● గుడుపల్లె సభలో చంద్రబాబు హామీ ● యువగళంలో పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలతో నారా లోకేష్ హల్చల్ ● అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా అమలుకాని హామీ ● రెండు జిల్లాల్లో రోజుకు రూ.5.4 కోట్ల
పలమనేరు: ‘పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో పెట్రో ల్, డీజిల్ ధరలు తక్కువ. ఇక్కడ జగన్మోహన్రెడ్డి పెట్రోల్ ధర లు పెంచేశారు. సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం’ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ హామీలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక సరిహద్దులోని పెట్రోల్ బంకుల వద్దకెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ హంగా మా సృష్టించారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక పోయారు. పె ట్రోల్, డీజిల్ ధరలు అలాగే కొనసాగుతున్నాయి. దీనికారణంగా జిల్లా లో రోజుకు వాహనదారుల పై రూ.5.4 కోట్లకుపైనే అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.167.4కోట్లు, ఏడాదికి రూ.2,008.8 కోట్లుదా కా ప్రజలు అదనంగా చెల్లించా ల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.4,017.6 కోట్లు దాకా ప్రజలపై భారం పడింది. పెట్రో ధర తగ్గిస్తామని బాబు కర్రుకాల్చి వాత పెట్టారని పలువురు వాపోతున్నారు. ఆంధ్రలో వెలవెల..కర్ణాటకలో కళకళ చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి ఆనుకొని గండ్రాజుపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. మండల కేంద్రమైన వీకోట టౌన్కు ఆనుకొనే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు కొనసాగుతోంది. అలాగే తిరుపతి జిల్లాలో ఇటు నగరి, పిచ్చాటూరు, సత్యవేడు నుంచి తమిళనాడు సరిహద్దు వెళ్తుంది. అటు నాయుడుపేట నుంచి తమినాడు బోర్డర్ ఉంది. ఆయా సరిహద్దుల్లోని ఆంధ్ర పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. అదే కర్ణాటక, తమినాడు పెట్రోల్ బంకులు కళకళలాడుతున్నాయి. కారణం.. ధరల్లో వ్యత్యాసాలు ఉండడమే. ఒక్క పలమనేరు నియోజకవర్గంలోనే దాదాపు 20 పెట్రోల్ బంకుల దాకా మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్టు మారింది చినబాబు, పెద బాబు హామీల తీరు. రెండేళ్ల క్రితం కర్ణాటక సరిహద్దులో హల్చల్ చేశారు. కర్ణాటకలో పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో క
●పలమనేరులో వ్యాపారం లేక వెలవెలబోతున్న పెట్రోల్ బంకు 6లీటరుకు రూ.8 ఆదా మన రాష్ట్రం కంటే తమిళనాడులో పెట్రోల్ ధర లీటర్కు 8 తక్కువ. మా ప్రాంతం రాష్ట్ర సరిహద్దులో ఉండడంతో అక్కడికి వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం. నగరి నుంచి 14 కి.మీ వెళితే తమిళనాడుకు చెందిన పెట్రోల్ బంక్ ఉంది. అక్కడకు వెళ్తుంటాం. ఫుల్ ట్యాంక్కు రూ.120 దాకా ఆదా అవుతుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఎన్నో హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. కానీ ఇంతవరకు తగ్గించలేదు. – ప్రకాష్, ముడి పల్లి గ్రామం నగరి మండలంఅక్కడే పట్టుకుంటాం మా గ్రామం నుంచి 11 కి.మీ వెళితే నంగళిలో డీజిల్ లీటర్ రూ.90గా ఉంది. మా ట్రాక్టర్కు కర్ణాటకలో ఫుల్ట్యాంకు పట్టించుకొని వస్తుంటాం. డీజిల్ రేట్లు తగ్గిస్తామని మొన్నటి ఎన్నికలకు ముందు కూటమి నాయకులు స్టేట్మెంట్లు కుమ్మరించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ధర మాత్రం తగ్గించలేదు. ఇంకా ఎంతదాకా పోతోందో వీటి ధరలు. – రామాంజులు, చిన్నమనాయినిపల్లి, గంగవరం మండలం -
కూటమిలో కులచిచ్చు
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమిలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరింది. టీడీపీ, జనసేనలో ఒకే సామాజిక వర్గం వారికే గుర్తింపు, పదవులు ఇస్తున్నారని, మి గిలిన బడుగు, బలహీన వర్గ నేతలను కరివేపాకులా వాడుకుంటున్నారంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వా రు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో రెడ్డి సామాజిక వర్గం నేతలంటేనే చాలా చులకనగా చూస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ సామాజిక వర్గం నేతలు ముఖ్యులు.. అదే సామాజిక వర్గంలోని వారికి పదవులు రాకుండా.. అడ్డుకుంటు న్నారంటూ మండిపడుతున్నారు. ఆ రెండు పార్టీల్లో తాము తప్ప మరొకరు ఎదగడానికి వీల్లేకుండా కుట్ర లు చేస్తున్నారని ఆ పార్టీ అధిష్టానానికి లేఖలు రాసినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు తాజా పరిణామాలే నిదర్శనం. టీడీపీ అధిష్టానం తిరుపతి, చి త్తూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించిన వి షయం తెలిసిందే. ఈ పదవులు కట్టబెట్టడంలోనూ కొంత మంది ప్రమేయంతో అధినాయకులు తమకు ఇవ్వకుండా..తమ సామాజిక వర్గం నేతలే అడ్డుకున్నారని చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు కమ్మసామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సీఆర్ రా జన్ బీసీ కావడంతో అతన్ని కొనసాగించలేదని విశ్వసనీయ సమాచారం. పార్టీలో ఎంతటి వారినైనా సీ ఆర్ రాజన్ గట్టిగా మాట్లాడడం, ప్రశ్నించడం వంటి చేస్తున్నారనే కారణంతోనే అతన్ని కొనసాగించలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అ ుుతే సీఆర్ రాజన్ని తొలగించి వేరొకరికి ఇస్తే ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, షణ్ముగరెడ్డి అయితే నోరెత్తడనే ఉద్దేశంతోనే అతనికి అధ్యక్ష పదవిని ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ రాజు కుటుంబానికి మొండిచేయి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన సమయంలో తిరు పతి నుంచి జెండా పట్టిన నాయకుడిగా ఎన్టీఆర్ రాజుకు పేరుంది. నాటి నుంచి నేటి వరకు నందమూరి, నారావారి కుటుంబాన్నే నమ్ముకుని టీడీపీ జెండా మోస్తూనే ఉన్నారు. ఈసారైనా ఆ కుటుంబంలోని శ్రీధర్వర్మకు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని ఆశించారు. అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని టీడీపీలోని బలమైన వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జనసేనలో మాకు స్థానం లేదా? జనసేనలో పవన్ కళ్యాణ్పై అభిమానంతో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా తమకు గుర్తింపు ఇవ్వకుండా.. పదవులకు దూరంగా ఉంచుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో ఒకే సామాజిక వర్గం వారు మాత్రమే పెత్తనం చెలాయించాలని, వేరొకరు పార్టీలో కీలకంగా మారడానికి వీల్లేకుండా పథకం ప్రకారం దూరం పెడుతున్నారనే ప్రచా రం జరుగుతోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఎంఆర్పల్లి పరిధిలో ఓ నాయకుడి నివాసంలో జరిగిన పుట్టిన రోజు విందు వేడుకల్లో జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జనసేనలో తమకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి) పదవులు లేవు, గుర్తింపు లేకుండా చేస్తున్నారని మండిపడినట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. జనసేనలో ప్రధాన సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గం నేతల మధ్య రచ్చ జరగడంతో ఇద్దరు నాయకులు కలుగజేసుకుని సర్దిచెప్పి పంపివేసినట్లు చెప్పారు. టీడీపీ, జనసేనలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరడంతో కొందరు ఈ సమాచారాన్ని అమరావతికి చేరివేసినట్లు బోగట్టా. -
‘సూపర్’ మోసం బాబూ!
పులిచెర్ల (కల్లూరు): సూపర్–6 పేరుతో చంద్రబాబు ప్రజలను వంచించడం బాధాకరమని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాపోయారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సూపర్–6 పేరుతో పలు పథకాలను ప్రవేశపెట్టి తీరా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గిట్టు బాటు ధరలు లేక రైతులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఎన్నికల తర్వాత మండలంలో పెద్దిడ్డి తొలిసారిగా పర్యటించడంతో కార్యకర్తలో జోష్ తెచ్చింది. -
వినూత్నం.. తక్షణ పరిష్కారం!
చిత్తూరు కార్పొరేషన్: సమస్యల పరిష్కారం కోసం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల సీఎండీగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ ఈ కార్యక్రమానికి నాంది పలికారు. మంగళవారం జిల్లాలో కార్యక్రమం ప్రారంభమైంది. ఇక వారంలో రెండు రోజులు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది సంబంధిత సెక్షన్లలో పర్యటించి సమస్యలను గుర్తించి యాప్లో నమోదు చేయనున్నారు. విన్నూత కార్యక్రమం ఎస్పీడీసీఎల్ సీఎండీగా శివశంకర్ ఐఏఎస్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. సంస్కరణల్లో భాగంగా కరెంటోళ్ల జనబాట కార్యక్రమాని ప్రారంభించారు. తొలుత యాప్ను తిరుపతిలో విద్యుత్శాఖ మంత్రి రవికుమార్ చేతుల మీదుగా ఆరంభించారు. అనంతరం డిస్కం(రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) కలెక్టర్ కర పత్రాలను విడుదల చేశారు. మంగళవారం నుంచి అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లారు. సమస్యలు యాప్లో నమోదు ● ప్రతి మండలానికి చెందిన సెక్షన్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. ● ఆయా ప్రాంతాల్లోని 11 కేవీ సహా ఎల్టీ లైన్ల వెంట యంత్రాంగం తనిఖీ చేస్తుంది. ● పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వార్డులు లేదా వీధుల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, కూలిపోయేలా ఉండడం, తీగలు వేలాడడం, పాతవి కావడం, ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలు పగిలిపోవడం, రక్షణ కంచె లేకపోవడం, చేతికందేలా తీగలు ఉండడం వంటి వాటిని పరిశీలిస్తారు. ● ఫొటో తీసి కంపెనీ యాప్లో నమోదు చేస్తారు. ఆలస్యమయ్యే పనులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ● వారంలో మంగళ, శుక్రవారాల్లో ఏఈతో సహా సిబ్బంది సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పర్యటించనున్నారు. ● పనితీరు పరిశీలించడానికి జిల్లా స్థాయిలో జీఎం కృష్ణారెడ్డిని నోడల్ అధికారిగా నియమించారు. -
రాష్ట్ర స్థాయి విజేతలకు అభినందనలు
చిత్తూరు కలెక్టరేట్ : ఇటీవల విశాఖపట్టణం జిల్లాలోని కేడీపేటలో నిర్వహించిన సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి సాప్ట్బాల్ పోటీల్లో గెలుపొందిన పీసీఆర్ పాఠశాల విద్యార్థులను డీఈవో రాజేంద్రప్రసాద్ అభినందించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. సబ్ జూనియర్ సాప్ట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో చదువుతున్న అక్షిత రజిత పతకం సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికై వచ్చే నెల 9 నుంచి హర్యానాలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందన్నారు. హెచ్ఎం పూర్వాణి, శాంతిపురం ఎంఈఓ సెల్వపాండ్యన్, పీడీ దేవా పాల్గొన్నారు. తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 60,764 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,077 మంది భక్తులు తల నీలాలు అర్పించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. -
లోపాలకు తావులేకుండా నిత్య కై ంకర్యాలు
● సమీక్షలో దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిన దేవస్థానంలో స్వామి వారికి నిర్వహించే నిత్య కై ంకర్యాలు ఎలాంటి లోపాలకు తావివ్వకుండా భక్తిప్రపత్తులతో నిర్వహించాలని రాష్ట్ర దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్లాల్ ఆదేశించారు. మంగళవారం కాణిపాకానికి వచ్చిన ఆయన అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆన్లైన్ సేవలు, ఈ–ఆఫీస్, ఈ–ఫైలింగ్, అర్చకుల ప్రమోషన్లు, ఆలయంలో స్వామి వారికి చేసే పూజార్చనలు, సేవలు..ఇత్యాది వాటిపై సమీక్షిస్తూ ప్రధాన అర్చకులకు ఆయన పైవిధంగా సూచించారు. క్యూలలో వెళ్లే భక్తులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, గణేశా అని సంబోధించాలని సూచించారు. తర్వాత ఆన్లైన్ టికెట్ కౌంటర్ల వద్ద భక్తులతో మాట్లాడి సౌకర్యాలను తెలుసుకున్నారు. తొలుత వరసిద్ధి వినాయకస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ఈఓ పెంచలకిషోర్, చైర్మన్ మణినాయుడు ఆయన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ సాగర్బాబు, ఈఈ వెంకట నారాయణ, ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు శివప్రసాద్, ఏఈఓ లు రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, ధనంజయ, సూపరింటెండెంట్, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో రైతు మృతి వి.కోట: విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. మండలంలోని యాలకల్లు పంచాయతీ వైసీ బండపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్యగౌడు కుమారుడు రామయ్యగౌడు (67) వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లాడు. తమ పొలానికి సరఫరా అయ్యే విద్యుత్ వైర్లు రెండూ తెగి చెట్లుపై పడి ఉండడాన్ని గమనించాడు. ఆపై విద్యుత్ సరఫరా లేని సమయంలో వైర్లను సరిచేయడానికి ప్రయత్నించాడు. అతను సరి చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా రావడంతో రామయ్య షాక్కు గురై చెట్టు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని వి.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండుప్రాణాన్ని బలిగొందని రైతులు మండిపడ్డారు. హేత్వికకు ఎలైట్ వరల్డ్ రికార్డులో చోటు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు నగరానికి చెందిన ఒకటవ తరగతి విద్యార్థిని హేత్విక ఎలైట్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. వైఎస్ఆర్టీచర్స్ అసోసియేషన్ రెడ్డిశేఖర్రెడ్డి మనువరాలు హేత్విక ఇటీవల తమిళనాడు రాష్ట్రం వేలూరులో నిర్వహించిన ఎలైట్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో స్పెల్ మారథాన్ అంశంలో పాల్గొంది. ఆ విద్యార్థిని ఈ పోటీల్లో 4 నిమిషాల్లో 50 పదాలను అక్షరదోషాలు లేకుండా మౌఖికంగా చెప్పినందుకు ఈ వరల్డ్ రికార్డు లభించింది. ఇదే విద్యార్థిని నృత్య పదర్శనలోనూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మరో రికార్డును సాధించడం విశేషం. రెండు వరల్డ్ రికార్డులు సాధించిన చిన్నారి హేత్వికను పలువురు అభినందిస్తున్నారు. -
మొగిలి ఘాట్లో లారీ బోల్తా
మొగిలి ఘాట్లో సోమవారం రాత్రి లారీ బోల్తా పడింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2023 జనవరి 30న యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ పలమనేరు సమీపాన కర్ణాటక పరిధిలో ఉన్న పంతాన్హల్లికి చేరుకున్నారు. అక్కడి పెట్రోలు బంకుకు చేరుకుని కర్ణాటక రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలను మీడియాకు చూపారు. సెల్ఫీ తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం కంటే కర్ణాటకలో పెట్రోలు ధరలు తక్కువ ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటకలో ఉన్న ధరలే ఏపీలో కూడా ఉంటాయన్నారు. -
● జిల్లాలో విచ్చలవిడిగా అబార్షన్లు ● మార్కెట్లో జోరుగా కిట్ల విక్రయాలు ● పట్టించుకోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
కాణిపాకం: జిల్లాలో 1,200 పైగా ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. 2 వేల వరకు ఆర్ఎంపీ, నకిలీ వైద్యులున్నారు. వీరిలో చాలామంది వైద్య చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ఇష్టానుసారంగా నాడిపట్టి వైద్యం చేస్తున్నారు. స్కానింగ్లో ఆడ, మగ నిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తున్నారు. దీనికి చిత్తూరు జిల్లా కేంద్రం అడ్డగా మారింది. అలాగే గంగాధరనెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. ఇక్కడికి కర్ణాటక, తమిళనాడు నుంచి అధికంగా వస్తున్నారు. నకిలీ తంత్రం గర్భిణులు మొదటి కాన్పులో ఆడబిడ్డ పుడితే.. రెండో బిడ్డ మగ బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది.. ఏ బిడ్డో తెలుసుకోవాలని చాలా మంది తహతహలాడిపోతుంటారు. ఇందుకు ఖర్చుకు వెనకాడకుండా అక్రమ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆడబిడ్డగా నిర్థారణ అయితే వెంటనే అబార్షన్కు సిద్ధపడిపోతున్నారు. ఈ అబార్షన్లను కొందరు ఆర్ఎంపీలు, నకిలీ వైద్యులు అవకాశంగా మార్చుకుంటున్నారు. రూ.20వేలు తీసుకుని అబార్షన్లు చేసి పంపుతున్నారు. పెళ్లి కాకుండానే గర్భవతులవుతున్న వారికి అబార్షన్లు చేయాలంటే రూ.30వేల వరకు ఫీజు గుంజుతున్నారు. ఈ అబార్షన్లకు క్షేత్ర స్థాయిలోని కొందరు ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, ఆర్ఎంపీల వద్ద పనిచేసే కొందరి సహకారం పుష్కలంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఆడిట్ ఎక్కడా? అబార్షన్లకు సంబంధించి ఏటా ఆడిట్ జరగాలనే నిబంధన ఉంది. అయితే ఆ రకంగా జిల్లాలో జరగడం లేదు. ఇటీవల జరిగిన ఓ సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు గుచ్చి గుచ్చి చెప్పారు. కానీ ఆ రకంగా అధికారుల్లో కదలికలు కనిపించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత మందికి అబార్షన్ చేశారు.? ఎందుకు చేశారు? అనే విషయాలను ఆరా తీయాల్సి ఉంది. ఇక కొన్ని ఆస్పత్రుల్లో అబార్షన్లు చేసి వాటిని రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. కానీ ఆ వివరాలు శుద్ధ అబద్ధమని వైద్యశాఖలోని పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. ఎంటీపీకి కిట్స్ ఎక్కడివి? స్పందించని అధికారులు జిల్లాలో ఇష్టానుసారంగా అబార్షన్లు జరుగుతున్న అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్కానింగ్ సెంటర్లపై తనిఖీ చేస్తున్న పీసీపీఎన్డీటీ అధికారుల కాళ్లను కట్టిపడేశారు. కుర్చీలకు అతుక్కుపోవాలని ఆదేశాలిచ్చారు. దీంతో అబార్షన్ల అనకొండలు హద్దు మీరుతున్నాయి. విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తూ కడుపులోని పిండాన్ని చిదిమేస్తున్నాయి. ఇలానే వదిలేస్తే ఆడ పిల్లల నిష్పత్తి తగ్గిపోతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారో.. లేదో వేచి చూడాలి మరి.పెరుగుతున్న అబార్షన్ల సంఖ్య జిల్లా వ్యాప్తంగా 2024–25లో 32,534 మంది గర్భిణులు నమోదయ్యారు. వీటిలో తొలి గర్భవతులు 12,129, రెండు..అంతకంటే ఎక్కువ గర్భవతులు 20,405గా గుర్తించారు. ఈ కాలంలో 1,691 మంది అబార్షన్ అయ్యారు. 2025–26 (ఏఫ్రిల్ నుంచి డిసెంబర్) 20,824 మంది గర్భిణులుగా లెక్కల్లోకి ఎక్కారు. మొదటి గర్భవతులు 8,007, రెండో సారి.. అంతకంటే ఎక్కువ గర్భవతులు 12,816 మందిగా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు 1,016 మంది అబార్షన్లు చేసుకున్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య పూతలపట్టు, పలమనేరు, పుంగనూరు, జీడీనెల్లూరు నియోజవర్గాల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు గుర్తించినవి మాత్రేమే. దొంగ చాటుగా జరుగుతున్న అబార్షన్లు లెక్కల్లోకి రావడం లేదని అధికారులు అంటున్నారు. అబార్షన్ కిట్లు(ఎంటీపీ) విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. మెడికల్ షాపులు, ఆర్ఎంపీ, నకిలీ వైద్యుల వద్ద కూడా ఈ కిట్లు తేలికగా దొరికుతున్నాయి. వీరికి పలు మెడికల్ ఏజెన్సీల ద్వారా సరఫరా అవుతున్నట్టు ఆ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. గైనిక్ డాక్టర్ చీటీ లేకుండా ఎంటీపీ కిట్లను మెడికల్ షాపు నిర్వాహకులు విక్రయించకూడదు. కానీ కిట్లు విచ్చలవిడిగా లభ్యం కావడంతో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు జరిగిపోతున్నాయి. కిట్ల అమ్మకంపై నిఘా పెట్టాల్సిన జిల్లా జౌషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
డీకే చుట్టూ చర్చ!
చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు డీకే.ఆదికేశవులు నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ పిల్లలైన డీఏ.శ్రీనివాస్, డీఏ.కల్పజ అరెస్టు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆదికేశవులునాయుడుకు సన్నిహితుడైన రఘునాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి కేసులో శ్రీనివాస్, అతని అక్క కల్పజను సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రటకన విడుదల చేసింది. బెంగళూరుకు చెందిన రియలర్ట్ కె.రఘునాథ్ 2019 మేలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే తన భర్త మృతికి కారణం శ్రీనివాస్ తదితరులేనంటూ మృతుడి భార్య మంజుల పోలీసులను ఆశ్రయించారు. తప్పుడు వీలునామా సృష్టించి, తన భర్త చనిపోయేముందు ఆస్తులను బదిలీ చేయాలని బలవంతం చేశారని.. మంజుల ఫిర్యాదు చేశారు. తొలుత బెంగళూరు పోలీసులు, ఆపై సిట్ కేసు నమోదు చేసి శ్రీనివాస్ తదితరులకు క్లీన్చిట్ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మంజుల, ఆమె కుమారుడు రోహిత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు 2022లో కేసును సీబీఐకి అప్పగించారు. కేసు విచారణను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా కల్పజ, శ్రీనివాస్ను సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. ఆదికేశవులు నాయుడు, ఆయన భార్య సత్యప్రభ చిత్తూరుకు చెందిన వాళ్లు కావడం.. ఇక్కడే రాజకీయ పదవులు అనుభవించడంతో ఈ వార్త నగరంలో దావానంలా వ్యాపించింది. శ్రీనివాస్, కల్పజను అరెస్టు చేశారంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక నిందితులు ఇద్దరితో పాటు బెంగళూరు డీఎస్పీ మోహన్ను సైతం అరెస్టు చేసి బెంగళూరు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండు విధించింది. నిందితులు ముగ్గురినీ ఏడు రోజుల పాటు సీబీఐ పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ బెంగళూరు కోర్టు ఆదేశాలు జారీచేసింది. గతవారం ఆదికేశులు నాయుడు సోదరుడు బద్రీనారాయణ మృతి చెందగా, అంత్యక్రియలకు.. పెద్దకర్మకు శ్రీనివాస్, కల్పజ తదితరులు చిత్తూరులో కనిపించారు. తాజాగా వీళ్ల అరెస్టు రాజకీయన వర్గాల్లో టాక్ ఆఫ్ టౌన్గా మారింది. -
జిల్లా సమాచారం
పెట్రోల్ బంకులు 140 బోర్డర్లోని కర్ణాటక పెట్రోల్ బంకులు 40 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చమురు ధరలు చమురు లీటరు ధర రూ. పెట్రోల్ 110.27 డీజిల్ రూ.99కర్ణాటకలో చమురు ధరలు చమురు లీటరు ధర రూ. పెట్రోల్ 102.78 డీజిల్ 90.87 -
కొండెక్కిన కోడిగుడ్డు!
పలమనేరు: ఉన్నట్టుండి కోడిగుడ్ల ధర పెరగడంతో సామాన్యులపై ధరాభారం తప్పడం లేదు. గత నెలలో గుడ్లు హోల్సేల్గా ఒకటి రూ.6 దాకా ఉండగా ఇప్పుడు రూ.7.3 పైసలకు చేరింది. రిటైల్లో రూ.8 దాటింది. జిల్లాలో ఫౌల్ట్రి ఉత్పత్తులు తగ్గడమేగాక బయటి రాష్ట్రాల నుంచి గుడ్ల సరఫరా భారీగా తగ్గుముఖం పట్టడం, ఇదే సమయంలో ఇక్కడి నుంచి బయటి దేశాలకు పెరిగిన ఎగుమతులతోనే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడులో భారీగా తగ్గిన ఉత్పత్తి జిల్లాకు మన ఉత్పత్తులతోపాటు తమిళనాడు నుంచి ఎక్కువగా గుడ్లు వచ్చేవి. అయితే ప్రస్తుతం జిల్లాలో సరాసరి గుడ్ల ఉత్పత్తి 50 నుంచి 60 శాతం దాకా తగ్గింది. దీనికి తోడు తమిళనాడు నుంచి దిగుమతులు పూర్తిగా తగ్గాయి. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణకు తమిళనాడు నుంచి అధికంగా గుడ్లు వెళ్తున్నాయి. దీంతో జిల్లాకు అక్కడి వ్యాపారులు ఓ గుడ్డు రూ.6 ఖర్చవుతోందని, దీన్ని ఇక్కడికి తరలించేందుకు రవాణా చార్జీలతో కలిపి విక్రయిస్తుండడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో స్థానికంగానూ ఉత్పత్తులు లేక ఈ పరిస్థితి నెలకొందని ఫౌల్ట్రీ రైతులు అంటున్నారు. నాణ్యమై గుడ్లు అనుమానమే! పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీలకు నాణ్యమైన గుడ్లు అందడం గగనమేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పేపర్ రేట్ మేరకు గుడ్ల కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బులిస్తుంది. కానీ సంబంధిత కాంట్రాక్టర్లు చిన్నసైజు గుడ్లను దింపడం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రజలు సైతం పోష్టికాహారం కోసం గడ్లు కొనడం ఎక్కువైంది. బేకరీల్లో ఎక్కువగా గుడ్ల వినియోగం ఉంటుంది. డిమాండ్కు సరిపడా సరుకు లేక ధరలు భారీగా పెరిగినట్టు సమాచారం. -
2025–26గర్భిణుల నమోదు, అబార్షన్ల వివరాలు
నియోజకవర్గం గర్భవతుల తొలి రెండు, అంతకంటే అబార్షన్లు సంఖ్య గర్భవతులు ఎక్కువ గర్భవతులు చిత్తూరు 2,708 1,076 1,632 51 జీడీనెల్లూరు 3,450 111 2,269 197 కుప్పం 3,306 1,132 2,174 110 నగరి 1,717 706 1,012 73 పలమనేరు 3,716 1,515 2,201 152 పుంగనూరు 3,118 1,246 1,872 195 పూతలపట్టు 2,809 1,151 1,656 238 -
పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
బంగారుపాళెం: పది పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. మంగళవారం బంగారుపాళెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులకు దిశానిర్ధేశం చేశారు. పదో తరగతి విద్యార్థులు సోషయల్ మీడియా, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. పాఠశాల ఆవరణలోని వంటగది, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయల గురించి హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై 10వ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికపై చర్చించారు. భోదనాంశాలపై ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. ఎంఈఓలు నాగేశ్వర్రావు, రమేష్బాబు పాల్గొన్నారు. అప్పలాయగుంటలో పీవీ సింధు వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామిని మంగళవారం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారి వేణుగోపాల్ దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రోగులకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం చిత్తూరు కలెక్టరేట్ : రోగులకు నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యమని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సీఎంసీ చిత్తూరు క్యాంపస్తో పీపీపీ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. సీఎంసీ చిత్తూరు క్యాంపస్ నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జిల్లా కేంద్రంలోని మిట్టూరు ప్రభుత్వ పాత ప్రసూతి ఆసుపత్రిలో సీఎంసీ వైద్యులను నియమించి వైద్య చికిత్సలు అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మొబైల్ మెడికల్ యూనిట్లతో వైద్యసేవలందించనున్నట్లు తెలిపారు. సీఎంసీ డైరెక్టర్ డా.విక్రమ్ మ్యాథ్యూస్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వైద్యసేవలందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అనంతరం పీపీపీ విధానంలో ఒప్పందపత్రాలను మార్చుకున్నారు. డీఎంహెచ్ఓ డా.సుధారాణి, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్, చిత్తూరు సీఎంసీ క్యాంపస్ అసోసియేట్ డైరెక్టర్ డా.ఉదయ్జకారియా పాల్గొన్నారు. సోలార్ ఈ–సైకిల్ పుత్తూరు పట్టణ పరిధిలోని రాచపాళెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వెంకటేష్ సోలార్ ఈ–సైకిల్ను రూపొందించాడు. కష్టపడే స్వభావం, సృజనాత్మక ఆలోచనలతోనే ఇలాంటివి సాధ్యమని పలువురు అభినందనలు తెలిపారు. వెంకటేష్ మరెన్నో విజయాలు సాధించాలని హెచ్ఎం మంగపతి ఆకాంక్షించారు. – పుత్తూరు -
పాఠశాల స్థలం కబ్జా చేసిన జనసేన నేత
తిరుపతి కల్చరల్: ప్రాథమిక పాఠశాల స్థలాన్ని దౌర్జన్యంగా కబ్జా చేసి దగా చేస్తున్న జనసేన నేత తులసీ ప్రసాద్పై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఐరాల మండపం, దివిటివారి పల్లెకు చెందిన మునికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా, ఐరాల మండలంలోని దివిటివారిపల్లెలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన కొంత స్థలంలో వాటర్ ప్లాంట్ పేరుతో 2017లో జనసేన నేత తులసీప్రసాద్ ఒక భవనం కట్టాడన్నారు. ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పడంతో వారు పనులు అడ్డుకున్నట్టు తెలిపారు. ఆపై అతడు టీడీపీ కార్యర్త సహాయంతో భవనం నిర్మించాడన్నారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో పాఠశాల స్థలంలో ఎలాంటి భవనానలు నిర్మాణం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అప్పటి గ్రామ సర్పంచ్ పాఠశాలకు స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వారిని కలిసి 2023 సెప్టంబర్ 17న భవనాన్ని కూల్చివేశారని తెలిపారు. దీంతో పగ పెంచుకున్న తులసీ ప్రసాద్ కోర్టులో కేసు వేసి పాఠశాల స్థలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా వచ్చిన నిధులు సైతం వినియోగించకుండా కబ్జాదారుడు అడ్డుకున్నాడన్నారు. అక్టోబర్లో అతడు తన మనుషులతో వచ్చి పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, అతని దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు కట్టలేదన్నారు. తహసీల్దార్కు చెప్పినా రాజకీయ ఒత్తిడితో స్పందించలేదని వాపోయారు. పాఠశాల ఆక్రమణపై జిల్లా ప్రభుత్వ అధికారులు స్పందించి తగు విచారణ చేసి పాఠశాల స్థల ఆక్రమణదాడిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
మొగిలి ఘాట్లో లారీ బోల్తా
బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద సోమవారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలు కాగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోలారు నుంచి చైన్నెకి అల్యూమినియం రాడ్లను తరలిస్తున్న లారీ మొగిలి ఘాట్ వద్దకు రాగానే అదుపు తప్పి రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన రైలింగ్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కాలికి గాయమైంది. రహదారిపై లారీ బోల్తాపడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రహదారిపై బోల్తాపడిన లారీని క్రేన్ సహాయంలో రోడ్డు పక్కకు తొగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్కానింగ్!
కన్నింగ్.. కాణిపాకం: జిల్లాలో పలు చోట్ల అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. చిత్తూరు, యాదమరి, నగరి, కుప్పం వంటి ప్రాంతాల్లో ఇలాంటి స్కానింగ్ సెంటర్లు కుప్పలుతెప్పలుగా కొనసాగిస్తున్నారు. ఆయా స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడ, మగ అని తేల్చేస్తున్నారు. ఆపై అబార్షన్లకు రెఫర్లు చేసి కమీషన్లు గుంజుకుంటున్నారు. వీరిని టచ్ చేసే ధైర్యముందా? కలెక్టర్ మందలించినా! అక్రమ స్కానింగ్ కట్టడికి చర్యలు చేపట్టాలని పలుమార్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్ మందలించారు. డెకాయ్ ఆఫరేషన్ చేపట్టాలని, అందు కావాల్సిన ఖర్చులను కూడా భరిద్దామని సూచించారు. అయినా వైద్య శాఖ వెనకడగు వేస్తోంది. అక్రమ స్కానింగ్ సెంటర్ల రట్టు చేసే విషయంలో గుట్టుగా ఉంటోంది. డెమో విభాగం సైతం ముందడుగు వేయడం లేదు. తద్వారా అక్రమ స్కానింగ్ పుంజుకుంటోంది. తమిళనాడులో కేసులు అక్రమ స్కానింగ్, అబార్షన్లపై తమిళనాడు పోలీసులు స్పందిస్తున్నారు. అక్కడ కేసులు నమోదైతే వాటిని తక్షణమే అమలు చేసి అరెస్ట్లు, రిమాండ్కు పంపుతున్నారు. దీంతో తమిళనాడు వాసులు మకాం చిత్తూరు జిల్లాలో పెట్టారు. అక్కడి గర్భిణులను ఇక్కడకు తీసుకొచ్చి అబార్షన్లు చేయిస్తున్నారు. రెండో సంతానం ఆడ బిడ్డ ఉంటే వారిని టార్గెట్ చేస్తున్నారు. స్కానింగ్ చేయించి.. దగ్గరుండి అబార్షన్లు చేయించి పంపిస్తున్నారు. ఇందుకు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20వేలు వసూలు చేస్తున్నారు. అబార్షన్లకు రూ.10వేలు గుంజుగుంటున్నారు. తద్వారా జిల్లాలో ఆడ పిల్లల నిష్ఫత్తి పూర్తిగా పడిపోతోంది. ఆరు నెలల క్రితం చిత్తూరు నగరంలో స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి అక్రమ స్కానింగ్ గుట్టును రట్టుచేశారు. దీనికి సంబంధించి 20 మందిపైగా కేసులు నమోదు చేయించారు. అందులో పలువురు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కానీ ఒకరిద్దరిపై మాత్రమే చర్యలు తీసుకుని మిగిలిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కొంత మందిని వదిలి పెట్టిన కారణంగా వారు మకాం మార్చి చిత్తూరు కలెక్టరేట్కు సమీపంలో ఉన్న ప్రశాంత్నగర్లో గుట్టు స్కానింగ్ను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం వైద్యారోగ్య శాఖలోని పలువురు అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నగరి కేంద్రంలోని ఓ సెంటర్లో అక్రమ స్కానింగ్ నడిపిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. తమిళనాడు సరిహద్దు కావడంతో.. నగరిలో అక్రమ స్కానింగ్ సెంటర్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి అధిక సంఖ్యలో గర్భిణులు ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. గతేడాది అక్రమ స్కానింగ్ చేస్తూ...అబార్షన్లు చేయిస్తున్న ఓ మహిళను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదమరి మండల కేంద్రంలో కూడా ఓ ఆర్ఎంపీ డాక్టర్ అక్రమ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అబార్షన్లు చేయిస్తూ.. వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇందుకు కావాల్సిన మందులు, మాత్రలు స్థానికంగా లభ్యమవుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందింది. అదేవిధంగా కుప్పంలో కూడా అక్రమ స్కానింగ్ ఏళ్ల తరబడి నడుస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులే చెబుతున్నారు. వారిని టచ్ చేస్తే.. బెదిరింపులు వస్తాయని భయపడుతున్నారు. -
మార్పు మొదలైంది!
●చిత్తూరు అర్బన్: ఒక మనిషి ప్రాణం ఎంతో విలువైంది. అతనిపై ఆధారపడి ఓ కుటుంబం ఉంటుంది. అలాంటి వారికి ఏదైనా జరిగితే జీవితంలో కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. కన్నతల్లిదండ్రులకు కర్భశోకం మిగులుతుంది. కట్టుకున్న భార్య, పిల్లలు వీధిన పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఇలాంటి పరిస్థితికి పుల్స్టాప్ పెట్టేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. వాహనదారులకు హెల్మెట్ తప్పని సరి చేసింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తోంది. దశల వారీగా కఠినంగా అమలు చేసేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగానే నో హెల్మెట్.. నో పెట్రోల్..నినాదంతో ముందుకెళ్తోంది. తిరుపతి జిల్లాలో ఇప్పటికే హెల్మెట్ లేకుంటే ద్విచక్ర వాహనాలకు పెట్రోలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో సైతం పోలీసుశాఖ దీన్ని దశల వారీగా అమలు చేయడంతో పాటు వాహన చోదకుల్లో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. మృత్యువాతపడుతున్నా.. ‘బాబు, కొంచెం ఆలోచించండి.. హెల్మెట్లు పెట్టుకోండి. నీతోపాటు నీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా కాపాడినట్లవుతుంది. ఎందుకంటే నీ జీవితం నీ కుటుంబ సభ్యుల జీవనంపై ఆధారపడి ఉంది..’’ అంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు. దీన్ని కొందరు ఏమాత్రం తలకెక్కించుకోవడం లేదు. హెల్మెట్లు ధరించకుండా ద్విచక్రవాహనాలు నడపొద్దని పదే పదే చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో గత మూడేళ్లలో 257 మంది మృత్యువాతపడ్డారు. చనిపోయినవాళ్లల్లో 40 శాతం మంది యువత ఉండడం గమనార్హం. బాధ్యతగా ఫీల్ అవ్వండి ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్లు ధరించాల్సిందే. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్లు లేకుండా వాహనాలను లోపలకు అనుమతించడం లేదు. హెల్మెట్లు పెట్టుకుంటే ప్రమాదం జరిగినపుడు ప్రాణాలతో బయటపడొచ్చు. జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాకుండా ఇదో బాధ్యతగా ఫీల్ అవ్వండి. పోలీసుల కోసం కాదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మా వాళ్లు అవగాహన కల్పిస్తున్నారు. వీలైనంత త్వరలోనే కలెక్టర్తో చర్చించి ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ అమలు చేస్తాం. – తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు అసలు ద్విచక్రవాహనాలు నడిపేవాళ్లు ఎంత మంది హెల్మెట్లు వాడుతున్నారు..? ఎంత మంది వాడడం లేదు..? అనే విషయాలు తెలుసుకోవడానికి డ్రోన్లతో గుర్తిస్తున్నారు. జరిమానాలే లక్ష్యంగా కాకుండా ప్రజల్లో తొలుత చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారి ప్రాణాలు రక్షించుకోవడానికి హెల్మెట్లు వాడాలనే స్వీయ ఆలోచనను తీసుకొస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకోని మైనర్లకు వాళ్ల తల్లిదండ్రుల ఎదుట కౌన్సెలింగ్, రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లు పెట్టుకోకుండా మృతి చెందిన వాళ్లతో మాట్లాడించడం చేస్తున్నారు. తుదిగా కలెక్టర్తో చర్చించి త్వరలోనే హెల్మెట్ లేకుంటే పెట్రోలు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోనున్నారు. -
ధనుర్మాసం.. పుణ్యమార్గం
దళితుడని..శవాన్ని పోనిచ్చేది లేదని! దళితుడి శవాన్ని శ్మశానానికి వెళ్లనిచ్చేది లేదంటూ ఓ అగ్రకులస్తుడు అడ్డుకున్న ఘటన గంగవరంలో చోటు చేసుకుంది. మాసానాం మార్గశిర్షోహం..మార్గశిరం తనకు ఇష్టమైనదని శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతాడు. శ్రీమహావిష్ణువుకు ఈ మాసమంటే అంత్యంత ప్రీతి. సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన నాటి నుంచి మకరరాశిలో ప్రవేశించే వరకు ఉన్న నెలరోజుల కాలమే ధనుర్మాసంగా పిలుస్తారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమై ఆయన్ని చేరుకోవడానికి మార్గం చూపించేదే ఈ మాసం. ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కథనం. తిరుమల: సూర్యడు ధనస్సురాశిలో ప్రవేశించే మహత్తర ఘట్టమే ధనుర్మాసం. ఈ హేమంత సమయాన అందరిలోనూ భక్తిభావం తొణికిసలాడుతుంది. ఈ నెలంతా వైష్ణవాలయాల్లో భక్తులు భక్తిభావంతో పూజలు చేస్తారు. అందుకే ఈ మాసం విశిష్టమైది. శ్రీవేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించేది ధనుర్మాసం. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1.23 గంటలకు ఈ మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై పాశుర పారాయణాన్ని నివేదిస్తున్నారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై సేవ కొనసాగనుంది. ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కై ంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష ప్రసాదాలను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఆండాళ్ తిరుప్పావై పారాయణం ప్రాశస్త్యం భగవంతుని సాన్నిథ్యం పొందాలని ఆకాంక్షించే సాధకులకు గోదాదేవి అనుభవ పూర్వకంగా రచించిన తిరుప్పావై లోకానికే దివ్య సందేశం. 12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ఏకాంతంగా తోమాల, అర్చన, అర్జిత సేవలు ధనుర్మాసం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాల, అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా జనవరి 14వ తేదీ వరకు తోమాల, అర్చన సేవలకు భక్తులను అనుమతించరు. ఈ సేవలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు డిసెంబర్ 29 నుంచి జనవరి 1వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులను అనుమతించరు. -
పేదల ఆశాజ్యోతి జగన్
శ్రీరంగరాజపురం: పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి అని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. సోమవారం ఆయన స్థానిక నాయకులను పరామర్శించి.. మీడియాతో మాట్లాడారు. జగనన్న జన్మదిన వేడుకలు గ్రామాలలో పండుగ వాతావరణంలో జరిగాయన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా జగనన్న అభిమానులు వైభవంగా నిర్వహించడం శుభ సూచకమన్నారు. 2029లో జగనన్న ముఖ్యమంత్రి చేయడమే ప్రజలందరి లక్ష్యమన్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో ఆరు మండలాల నాయకుల సహకారంతో జగనన్న జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయన్నారు. పోలీసు గ్రీవెన్స్కు 50 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరులో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 50 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి ఫిర్యాదునూ ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ‘కరెంటోళ్ల జనబాట’కు శ్రీకారం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. ఈ మేరకు నూతనంగా ప్రారంభించిన కార్యక్రమం అప్లికేషన్ను కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల విద్యుత్ సమస్యలను నేరుగా గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు కరెంటోళ్ల జనబాటను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి మంగళ, శుక్రవారాలు నిర్ధేశిత గ్రామాలు, వార్డుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారన్నారు. విద్యుత్శాఖ ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్, ఈఈ మునిచంద్ర, పీవో రెడ్డెప్ప పాల్గొన్నారు. రెండో రోజు 8,911మందికి చుక్కల మందు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో సోమవారం కూడా పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగింది. రెండో రోజు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 8,911 మంది పిల్లలకు చుక్కల మందు వేశారు. కాగా రెండు రోజులుగా 2,07,438 మందికి పోలీయో చుక్కలు వేసినట్టు డీఐఓ హనుమంతరావు తెలిపారు. జెడ్పీలో కారుణ్య నియమాకాలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లా పరిషత్ పరిధిలో 11 మందికి కారుణ్య నియమాకాలు చేపట్టారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్నాయుడు నియమాక పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. వీటితోపాటు రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. బాధ్యతయుతంగా పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. -
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
బంగారుపాళెం: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్ఎం రాజేంద్ర తెలిపారు. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి బాలికల ఖోఖో పోటీలు నిర్వహించారన్నారు. జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన పాఠశాలకు చెందిన దీప్తి, ఉమేరా, జయశ్రీ, కావ్య కీలక పాత్ర పోషించి జిల్లా జట్టు గెలుపునకు కృషి చేసినట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభచాటి జాతీయ ఖోఖో పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు బాలికలు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా బాలికలను, క్రీడాకారులకు తర్ఫీదునిచ్చిన ఫిజికల్ డైరెక్టర్ మధుబాబును ఉపాధ్యాయులు అభినందించారు. ఇన్చార్జి హెచ్ఎం జనార్దన్రెడ్డి, పీడీలు గిరిజ, సరస్వతి పాల్గొన్నారు. ఖోఖో పోటీలకు ఎంపిక వి.కోట : జూనియర్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మండలంలోని పాముగానిపల్లీ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని జి.లక్ష్మి ఎంపికై నట్లు హెచ్ఎం భాస్కర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లా పొంగూరులోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో లక్ష్మి ఉత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న్నట్లు వివరించారు. ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె రాష్ట్ర ఖోఖో జట్టు తరఫున పాల్గొంటుదన్నారు. పాఠశాల యాజమాన్యం శిక్షణ ఇచ్చిన పీడీ హరిప్రసాద్ను, విద్యార్థిని అభినందించింది. -
సమస్యలు పరిష్కరించండి సారూ!
చిత్తూరు కలెక్టరేట్ : ‘సారూ...మీరే మాకు న్యాయం చేయాలి’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు క్యూ కట్టారు. ఎన్ని సార్లు తిరుగుతున్నా క్షేత్ర స్థాయిలో న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో వివిధ సమస్యలపై 353 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
పారిశుద్ధ్యం మెరుగుపడాలి
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఎంపీ నిధులతో జీడీ నెల్లూరు మండలానికి 63 లక్షల విలువలతో 20 ఈ ఆటోలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఇతర నియోజకవర్గాలకు కూడా ఈ ఆటోలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్, మేయర్ అముద, చూడా చైర్పర్సన్ హేమలత, డీపీఓ సుధాకర్ పాల్గొన్నారు. ● ముస్తాబు కార్యక్రమాన్ని సంక్షేమ వసతిగృహాల్లో అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. ● పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారంపై ఆడిట్ జరపాలని ఆదేశించారు. పీఎంవో, సీఎం, మంత్రుల ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
పోలీసు ఉద్యోగం ఉపాధి కాదు.. బాధ్యత
చిత్తూరు అర్బన్: పోలీసు ఉద్యోగమంటే ఉపాధి మాత్రమే కాదని.. ప్రజల పట్ల బాధ్యతగా ఉంటూ సేవా భావంతో పనిచేయడమని చిత్తూరు ఎస్పీ తుషార్డూడీ అన్నారు. ఎక్కడా వెనకడుగు వేయకుండా శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసులు క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. నాగులు నెలల క్రితం వెలువడ్డ పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన 139 మంది అభ్యర్థులకు సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ ప్రారంభమైంది. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ మాట్లాడుతూ.. సమయపాలన, నిబద్ధతతో పనిచేయడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ బ్యాచ్గా చిత్తూరు అభ్యర్థులు పేరు తెచ్చుకోవాలన్నారు. ఏఎస్పీ రాజశేఖర్రాజు, డీఎస్పీలు సాయినాథ్, రాంబాబు, చిన్నికృష్ణ, మహబూబ్ బాషా, ఇన్స్పెక్టర్లు అమర్నాథ్రెడ్డి, చంద్రశేఖర్, వీరేష్ పాల్గొన్నారు. కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు రేపు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సీనియర్ పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 24న నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మమతారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని సదుం పోలీస్ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలకు వయోపరిమితి లేదని, 85 కేజీల బరువు లోపు ఉండాలని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డుతో రావాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26 నుంచి 28 వరకు కర్నూలు జిల్లా పంచలింగాలలో జరిగే 72వ రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలలో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9490005167, 8555046157 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. -
క్రిస్మస్ వేడుకల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గుడిపాల: ముందస్తుగా జరుపుకున్న క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గుడిపాల మండలం, అరుల్పురం గ్రామంలో సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు తమిళనాడు అధ్యక్షుడు జాషువా అధ్యక్షతన పాస్టర్లు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామచంద్రారెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదలందరికీ దుస్తులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే పేదలందరికీ గుర్తింపు వచ్చిందన్నారు. మాటచెప్తే మడపతిప్పని నాయకుడు జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు..? మీరే గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఏది దొరికితే అవి దోచుకొనే పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. రాబోయే కాలంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ టీడీపీ సూపర్సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని తిప్పి కొట్టాలన్నారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు ప్రెసిడెంట్ జాన్మార్క్, నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ రమేష్ప్రసాద్, బిషప్ ధనరాజ్, కార్పొరేటర్ మధురెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
దళితుడని.. శవాన్ని పోనిచ్చేది లేదని!
గంగవరం: దళిత కులస్తుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు పోనీయకుండా టీడీపీకి చెందిన అగ్రకులస్తుడు అడ్డగించిన ఘటన మండలంలో సోమవారం వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు.. మండలంలోని పసుపత్తూరు పంచాయతీ, వీరశెట్టిపల్లి గ్రామంలో దళిత కులానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యతో మృతి చెందాడు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం కుటుంబీకులు, బంధువులు కలిసి గ్రామ సమీపంలోని శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా పసుపత్తూరు గ్రామానికి చెందిన టీడీపీ అగ్ర కులస్తులు శ్రీనివాసులు, అతని కొడుకు సుబ్బు ఇద్దురూ కలిసి అడ్డుకున్నారు. తమ పశువుల షెడ్డు ఆనుకుని ఉన్న దారిలో పోనివ్వడం కుదరదని బెదిరించారు. తాతల కాలం నుంచి ఈ దారిలోనే శ్మశానానికి, గంగమ్మ ఆలయానికి వెళ్తున్నామని, ఇప్పుడు ఎందుకు వెళ్లనివ్వరో చెప్పాలంటూ దళితులు ప్రశ్నించారు. అప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఈ దారి తమ అధీనంలో ఉందని, శవాన్ని పోనిచ్చే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్నారు. ప్రశ్నించిన దళితులపై పైశాచిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో గణేష్ అనే వ్యక్తితో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. బాధితుల ఫిర్యాదును స్వీకరించకపోగా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసినట్టు వాపోయారు. దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే అధికార పార్టీ నేతలు శవ రాజకీయాలు చేసి తమకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. దీనిపై జిల్లా అధికారులను ఆశ్రయిస్తామని వారు తెలిపారు. -
కొత్తగా సన్నద్ధం!
కార్వేటినగరం: ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో ఆరు పేపర్ల స్థానంలో ఐదు పేపర్లు మాత్రమే అమలు చేయనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు నూతన విధానంలోనే సన్నద్ధమవుతున్నారు. గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మారిన మార్కుల కేటాయింపునకు అనుగుణంగా కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అధికారులు సైతం ఇంటర్ కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి నూతన సంస్కరణలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సంస్కరణల్లో భాగంగా ఇంటర్మీడియెట్ విద్యలో ఇంటర్ విద్యామండలి ఈ ఏడాది నుంచి ఫస్టియర్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గణితం, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాల్లో మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రాల సరళి కూడా మారింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో ఇంటర్ బోర్డు అధికారులు నూతన పరీక్ష విధానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎంపీసీలో ఇలా.. ఎంపీసీ గ్రూపునకు సంబంధించి మొత్తం 500 మార్కులకు గాను ఇందులో రాత పరీక్షకు 470 మార్కులు, ప్రయోగాలకు 30 మార్కులు (ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 15) కేటాయించారు. ఇప్పటి వరకు మ్యాథ్స్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించేవారు (పేపర్–1ఏకు 75, పేపర్–1బీకి 75 మార్కుల చొప్పున మొత్తం 150 మమార్కులు). ఇకపై మొదటి సంవత్సరంలో 100 మార్కులకు మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. పాస్ మార్కులను 35గా నిర్ణయించారు. గతంలో ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60 మార్కులకు ఉండేది. ఆ స్థానంలో ఈ రెండు సబ్జెక్టులను ఒక్కో పేపర్కు 85 మార్కులు ఉండేలా మార్పులు చేశారు. వీటితో పాటు రెండు లాంగ్వేజి సబ్జెక్టులు ఒక్కొక్కటి వంద మార్కులకు ఉంటాయి. బైపీసీలో ఇలా.. బైపీసీలో కొత్తగా బయాలజీ పేపర్ బైపీసీ గ్రూపులో మొత్తం 500 మార్కులు ఉంటాయి. ఇందులో రాత పరీక్షలకు 455 మార్కులు, ప్రాక్టికల్స్కు 45 మార్కులు (ఫిజిక్స్15, కెమిస్ట్రీ15, బయాలజీ15) కేటాయించారు. గతంలో బోటనీ 60, జువాలజీ 60 మార్కులకు ఉండేది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు సబ్జెక్టులు కలిపి 85 మార్కులకు ఒకే ప్రశ్నపత్రం(బయాలజీ) ఇస్తారు. ఇందులో బోటనీకి 43 మార్కులు, జువాలజీకి 42 మార్కులు నిర్ధేంశించారు. అయితే మూల్యాంకనానికి వీలుగా జవాబు పత్రాలు మాత్రం వేర్వేరుగా ఇవ్వనున్నారు. విద్యార్థులు రెండు జవాబు పత్రాల్లో బోటనీ, జువాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు రెండు సబ్జెక్టులను సమన్వయం చేసుకుంటూ చదువుతున్నారు. పాస్ మార్కులు 29గా నిర్ణయించారు. జిల్లాలో ఇంటర్ కళాశాలల వివరాలు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు స్పష్టత వచ్చింది మొదట్లో పేపర్లు తగ్గాయని, మార్కులు పెరిగాయని తెలిసినప్పుడు కాస్త కంగారు పడ్డాం. కానీ మా లెక్చరర్లు కొత్త విధానంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. 100 మార్కుల మ్యాథ్స్ పేపర్, 85 మార్కుల ఫిజిక్స్ పేపర్ రాయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. మా కళాశాలలో కూడా నూతన విధానానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నారు. – నందిని, ఇంటర్ సెకండియర్ విద్యార్థి, బైపీసీ, కార్వేటినగరంఅవగాహన కల్పిస్తున్నాం ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన సంస్కరణలపై విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పించాం. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో 5 పేపర్లు ఉంటాయి. సిలబస్ను కూడా హేతుబద్ధీకరించారు. ఇది జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వ కళాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వీలుగా ఉంటుంది. – రఘుపతి, ఇంటర్ బోర్డు జిల్లా అధికారి -
జగమంత సంబరం
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025బెంగళూరులో వైఎస్ జగన్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పెద్దిరెడ్డినేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. విద్యార్థులకు పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బ్యాండ్ కాంపిటీషన్స్ నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేర కు జారీ చేసిన ఉత్తర్వులు ఆదివారం డీఈఓ కార్యాలయానికి అందాయి. ఆ ఉత్తర్వుల మేరకు 1875లో బకించంద్ర చటర్జీ స్వరపరిచిన జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. జిల్లా స్థాయిలో గెలుపొందే విద్యార్థులు జోన ల్, రాష్ట్రస్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో సూచించారు. పోలియో లేని సమాజానికి సహకరించాలి చిత్తూరు అర్బన్ : పోలియో వ్యాధి లేని సమాజాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సుమిత్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పిల్లలకు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడుతో కలిసి పల్స్పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ నరసింహ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి పాల్గొన్నారు. ముగిసిన రెవెన్యూ క్రీడలు చిత్తూరు కలెక్టరేట్ : రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఆదివారంతో ముగిశాయి. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లు, కలెక్టరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు క్రీడా పోటీ ల్లో పాల్గొన్నారు. నిరంతరం విధుల నిర్వహణలో తల మునకలై ఉండే ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పర్యవేక్షించారు. క్రికెట్, షాట్ పుట్, జావిలిన్ త్రో, టెన్నిస్, చెస్, క్యారమ్స్, పరుగు పందెం క్రీడా పోటీలను నిర్వహించారు. మూడు రోజులపాటు అట్టహాసంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో రెవెన్యూ ఉద్యోగులు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. పోటీల్లో గెలుపొందిన రెవెన్యూ ఉద్యోగులకు జిల్లా కేంద్రంలోని నాగయ్య కళాక్షేత్రం లో సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీవోలు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. అన్న ప్రసాదానికి రూ.10 లక్షల విరాళం వడమాలపేట (పుత్తూరు) : అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణకు హైదరాబాద్కు చెందిన డాక్టర్ చైతన్య ఆరె అనే భక్తుడు రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆదివారం ఆలయ అధికారి ఎ.వేణుగోపాల్కు రూ.10 లక్షల డీడీని అందజేశారు. దాతకు స్వామి దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా సాగిన సంబరాలు అంబరాన్నంటాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జిల్లా అంతటా ఊరువాడా, చిన్నా, పెద్ద తేడా లేకుండా జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నేతలు రక్తదానం, అన్నదానం శిబిరాలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జయహో జగనన్న అంటూ అభిమానులు హోరెత్తించారు. చిత్తూరు కార్పొరేషన్ : అధికారంలో ఉన్నా..లేకున్నా అభిమానులు, కార్యకర్తల్లో అదే జోరు.. అదే హోరు కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. జయహో జగన్.. వన్స్మోర్ జగనన్నా అంటూ అభిమానులు నినదించారు. జగనన్న మళ్లీ నీ పాలన రావాలన్నా అంటూ హోరెత్తించారు. ● చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మంది పాల్గొన్నారు. చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లెలో జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి హాజరై కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. కూటమి పాలనకు భవిష్యత్తు లేదని అధికార మదంతో రెచ్చిపోతున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారనే నమ్మకం ఉందన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కో ఆప్షన్ సభ్యులు అను ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నగరంలోని గిరింపేట డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేక్కట్ చేసి అన్నదానం చేశారు. గుడిపాల మండలం నందు నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ● పలమనేరు నియోజకవర్గంలో పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ కేక్కట్ చేసి అన్నదానం చేశారు. అలాగే వి.కోటలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుతో కలసి మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పారదర్శకమైన పాలనను జగనన్న అందించారన్నారు. గతంలో అందిన సంక్షేమ ఫలాలను ప్రజలు తలచుకుంటున్నారన్నారు. ఎక్కడికి వెళ్లిన సమస్యలే కనపడుతున్నాయన్నారు. ● పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం ముత్యాలమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్కుమార్ పూజలు చేశారు. అనంతరం కేక్కట్ చేసి అన్నదానం చేశారు. ఐరాల, పి.కొత్తకోటలో అన్నదానం చేసి కేక్ కట్ చేశారు. యాదమరిలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి కేక్కట్ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు శ్రీకాంత్రెడ్డి, రామచంద్రారెడ్డి, నాయకులు గౌహతిరెడ్డి, సుధాకర్రెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● గంగాధరనెల్లూరు నియోజకవర్గం జీడీ నెల్లూరు, పాలసముద్రం, కార్వేటినగరం, పెనుమూరులో నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పించారు. అనంతరం కేక్కట్ చేసి అన్నదానం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల పై కేసులు పెట్టడం మాని హామీల అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్బలగన్, ఎంపీపీ లతా, మండల కన్వీనర్లు శేఖర్రాజు, తులసీయాదవ్, వెంకట్రెడ్డి, విజయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుప్పం : ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్సీ భరత్ పలమనేరు : వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుబంగారుపాళెం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, లలిత కుమారి తదితరులుపుంగనూరు : పట్టణంలో కేక్ కట్ చేస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్ప, అనీషారెడ్డి, అలీమ్బాషా జీడీ నెల్లూరులో భారీ కేకును కట్ చేస్తున్న కృపాలక్ష్మి చిత్తూరు : పార్టీ కార్యాలయ ఆవరణలో రక్తదానం చేస్తున్న నాయకులు నిధులు వంకపాలు చిత్తూరు రూరల్(కాణిపాకం) : చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట వంకలో వేసిన మట్టిరోడ్డు ఆదివారం తెగిపోయింది. వివరాల్లోకి వెళితే..వారం కిందట వంకలో మట్టి రోడ్డు వేశారు. ఇందుకు ప్రభుత్వం రూ. 12 లక్షలు మంజూరు చేయగా..జీడీ నెల్లూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నేత ఈ రోడ్డును వేశారు. మొక్కుబడిగా రోడ్డు వేయడంతో రెండు రోజుల్లోనే రోడ్డు అక్కడక్కడా కుంగిపోయింది. పెద్ద పెద్ద చీలికలు పడ్డాయి. నాణ్యతలేని సిమెంట్ పైపులు, పాత పైపులు దింపడంతో నాలుగు రోజు లకే నాణ్యత తేలిపోయిందని గ్రా మస్తులు చెబుతున్నారు. ఆదివారం రోడ్డు మధ్యలో వంక తెగి...మట్టికొట్టుకు పోయింది. ప్రవా హం అంతంత మాత్రంగానే ఉన్న..వేసిన మట్టికొట్టుకుపోవడంతో..రోడ్డు నాణత్యను ప్రశ్నిస్తోంది. కాగా నాణ్యత లేని రోడ్డుపై శనివారం సాక్షి దినపత్రికలో నాణ్యత డొల్ల ..నిధులు గుల్ల అనే శీర్షికన కథనం ప్రచురించింది. రోడ్డు కుంగిన విషయాన్ని ముందస్తుగానే సాక్షి హెచ్చరించింది. అయినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నాణ్యతలేని రోడ్డు వేసి..నిధులు దోచేశారని వారు మండిపడుతున్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్ కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్ తర్వాత ప్రజల మనన్నలు పొందిన గొప్ప వ్యక్తి జగనన్న అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల ఆయన పాలనలో సుభిక్షంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభు త్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు చేయకుండా కేసులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. నగరిలో ర్యాలీగా టవర్క్లాక్ సెంటర్ వద్దకు చేరుకొని, అక్కడ ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా, జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి మాట్లాడారు. పేద ప్రజల గుండె ధైర్యం జగనన్న ఆయన పై అభిమానం వేడుకల్లో కనిపిస్తోందన్నారు. జగనన్న సీఎం చేయడానికి సైనికుల్లా కష్టపడతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు నీలమేఘ, హరి, నియోజకవర్గ పరిశీలకులు రాజారెడ్డి, ఎంపీపీలు భార్గవి, మునివేలు, నాయకులు పాల్గొన్నారు. పుంగనూరు పాతబస్టాండ్ వద్ద కేక్కట్ చేసి అన్నదానం చేశారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప , మున్సిపల్ చైర్మన్ ఆలీంబాషా పాల్గొన్నారు. ఈవీఎంల గోల్మాల్తో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందన్నారు. అధికారంలో వచ్చాక ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదన్నారు. పుంగనూరు మండలంలో ఎంపీపీ భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్కట్ చేసి అన్నదానం చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు హనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవంగా పేరుగాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి దీవెనలకోసం భక్తులు బోయకొండకు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోయకొండలో ఎటు చూసినా జన సంద్రంగా మారింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే సుమారు 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారని అధికారులు వెల్లడించారు. కోర్కెలు తీరిన భక్తులు ిపిండి ,నూనెదీపాలు, దీవెలతో అమ్మ వారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. -
కాసులుపట్టి !
చెరువు మట్టి .. అమరావతి : జిల్లా కేంద్రంలో మట్టి, గ్రావెల్ మాఫి యా రెచ్చిపోతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ లే అవుట్లకు తరలిస్తున్నా రు. ప్రభు త్వ నిబంధనల ప్రకారం గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి అను మతి తీసుకోవాలి. క్యూబిక్ మీటర్ తవ్వకానికి రూ.150 నుంచి రూ.200 వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. ఆ తరువాతే తవ్వకాలు చేపట్టాలి. కానీ, ఇవేమీ జిల్లా కేంద్రంలో కనిపించడం లేదు. అక్రమ మట్టి తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి పచ్చ నేతల జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వానికి చె ల్లించాల్సిన వేల రూపాయల సెస్కు ఎగనామం పెడుతున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో ప్రభుత్వ అధీనంలో ఉన్న చెరువులు, రాళ్ల గుట్టలు, ఎర్రమట్టి దిబ్బలు రోజు రోజుకు కరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని కాజూ రు చెరువులో జేసీబీలతో మట్టి తవ్వి వందల లోడ్లు తరలిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దూరాన్ని బట్టి.. మట్టి రేట్లు స్థానిక పచ్చనేతలు కొంత మంది ఇరిగేషన్ శాఖకు చెందిన కాజూరు చెరువులో నుంచి మట్టి తవ్వుకుపోతున్నారు. జేసీబీలతో వందల లోడ్లు తవ్వి భూమాతకు కన్నీరు పెట్టిస్తున్నారు. తవ్విన మట్టిని జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్ల నిర్మాణం, ఖాళీ స్థలాలను ఎత్తు చేసేందుకు, ఇసుక బట్టీలకు తరలించి అమ్మేస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్ లోడు అయితే రూ.2000 నుంచి రూ.4 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగంపై చంద్రబాబు సర్కారుకు చెందిన నేతలు సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసి చర్యలు తీసుకోకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసేందుకు సాహసం చేయడం లేదని తెలుస్తోంది. ఈ అక్రమ మట్టి తవ్వకాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అడ్డుకట్ట వేస్తారా? మిన్నుకుండి పోతారా ? అనేది వేచి చూడాల్సి ఉంది. కాపలాగా రౌడీలు కాజూరు చెరువులో మట్టి అక్రమ రవాణాను తరలించే సమయంలో బయటి వ్యక్తులు రాకుండా రౌడీలను కాపలా పెట్టారు. ఈ రౌడీలు అటువైపు వెళ్లిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కాజూరు చెరువులో మట్టి దందా కొద్ది రోజులుగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కనీసం పట్టించుకునేవారు కరువయ్యారు. ఆ అక్రమ మట్టి తవ్వకాలపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అక్రమ మట్టి రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదుతో పాటు వాహనాలను సీజ్ చేస్తే తవ్వకాలు ఆగే అవకాశం ఉంది. అయితే ఆ రకమైన చర్యలు చేపట్టడంలో జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆపేవారు.. అడిగేవారే లేరు.. జిల్లా కేంద్రానికి సరిహద్దులో ఉన్న కాజూరు చెరువు కబ్జాకు గురవుతోంది. చిత్తూరు నగరానికి తాగు, సాగునీరు అందించేందుకు గంగినేని, కట్టమంచి, కాజూరు చెరువులు ప్రధానమైనవి. వర్షాకాలంలో ముఖ్యమైన ఈ మూడు చెరువులు నిండితే నగరానికి తాగునీటితో పాటు కింది భాగంలో ఉన్న రైతుల భూములకు నీళ్లందుతాయి. రెవెన్యూ రికార్డుల్లో జడియం చెరువుగా, వాడుకలో కాజూరు చెరువుగా పిలిచే ఈ చెరువు సర్వే నంబర్ 159, 170లో దాదాపు 200 ఎకరాల మేరకు వ్యాపించి ఉంది. కాజూరు, ఇరువారం, కొండ ప్రాంతం, పోతంబట్టు ప్రాంతాల నుంచి ఏడు సప్లై ఛానళ్లు ఉన్నాయి. కాలక్రమేణా వీటిలో ఐదు ఛానళ్లను కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. దీంతో పెద్ద వర్షం కుసినప్పటికీ కాజూరు చెరువులోకి నీరు రావడం లేదు. చెరువు రోడ్డును ఆనుకుని ఉండటం, రోజు రోజుకూ నగరం విస్తరించడంతో కబ్జాదారుల కన్ను కాజూరు చెరువుపై పడింది. చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న కారణంగా ఈ చెరువుపై పచ్చనేతల కబ్జాదారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ తతంగం మొత్తం స్థానిక ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. -
ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా నాల్గవ ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.సుబ్ర మణ్యం తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, సహాయ ఎన్నికల అధికారి రాష్ట్ర కార్యదర్శి రమణ, ఎన్నికల పర్యవేక్షకుడు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఈ.సుబ్రమణ్యం వివరాలను వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు (ఈఈ ఇరిగేషన్, చిత్తూరు), సహాధ్యక్షుడు రాజా (సీటీఓ–2, చిత్తూరు), ఉపాఽ ద్యక్షుడిగా జయచంద్ర(వెటర్నరీ డిపార్ట్మెంట్, చిత్తూరు), బ్రహ్మయ్య(అగ్రికల్చర్, పలమనేరు), కార్యదర్శి గా లోకనాథ్(ఆర్అండ్బీ, చిత్తూరు), సంయుక్త కార్యదర్శులుగా ఉషారాణి(ఎస్సీ వెల్ఫ్ర్, చిత్తూరు), భాస్కర్(ఆర్టీఓ ఆఫీసు, చిత్తూరు), ప్రచార కార్యదర్శిగా నవీన్సాయి(జెడ్పీ, చిత్తూరు), కోశాధికారిగా రామచంద్రయ్య(డీఈఈ ఇరిగేషన్, చిత్తూరు)లు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘం ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాఘువులు, నాయకులు రమేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కొండ చిలువ కలకలం
కార్వేటినగరం : మేజర్ పంచాయతీ కార్వేటినగరం సమీపంలోని పచ్చికాపల్ల మార్గంలోని జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. జగనన్న కాలనీలో వీధి దీపాలు లేక పోవడంతో చీకటిలో ఇంటి ఆవరణానికి భారీ కొండ చిలువ రావడంతో గుర్తించిన ఇంటి యజమాని కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుకొని కొండ చిలువను కొట్టి చంపేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజులుగా కోళ్లు కనిపించడం లేదని, దొంగలు తీసుకెళ్లి ఉంటారని అనుకున్నా స్థానికులు తీరా ఇది కొండచిలువ పనేనని భయ బ్రాంతులకు గురైయ్యారు. జగనన్న కాలనీలో వీధి దీపాలు లేవని మూడు నెలల కిందట కాలనీ సందర్శనకు వచ్చిన జిల్లా కలెక్టర్కు విన్నవించామన్నారు. వెంటనే స్పందించి కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ప్రకృతి సంపద దోచేస్తున్నారు
చంద్రబాబు సర్కారు పాలనలో ప్రకృతి సంపద దోచేస్తున్నారు. కొండలనే కాకుండా చెరువులనూ వదలకుండా మట్టిని అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కబ్జాదారుల ఆగడాలు ఎక్కువైపోయాయి. నిన్నేమో జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉండే కట్టమంచి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడ్డారు. రోజుకు వందల సంఖ్యలో మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురించింది. అలాగే ప్రజలు గ్రీన్ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయడంతో కట్టమంచి చెరువులో మట్టి తవ్వకాలు ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రస్తుతం జిల్లా కేంద్రానికి సరిహద్దులో పలమనేరు రోడ్డులో ఇరువారం వద్ద జాతీయ రహదారికి పక్కనే ఉన్న కాజూరు చెరువులో మట్టి తవ్వకాలు ప్రారంభించారు. టీడీపీ మాజీ ఎంపీకి చెందిన పాఠశాలకు ఆనుకుని ఉన్న దారిలో వందల ట్రాక్టర్లలో మట్టిని ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. -
మహారాజపురంలో అనకొండలు
మహారాజపురం పడమర వైపు మట్టిని తవ్వుతున్న దృశ్యం, తూర్పు వైపు కొండను తవ్వేసిన దృశ్యం సాక్షి టాక్స్ఫోర్సు : చిత్తూరు జిల్లా విజయపురం మండలం మహారాజపురంలో మూడు నెల క్రితం రెండు ప్రైవేటు సంస్థ గ్రావెల్ తరలింపునకు తాత్కాలిక అనుమతి తీసుకుంది. ఒక సంస్థకి 15 వేల క్యూబిక్ మీటర్, మరో సంస్థకు 16 వేల క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ రెండు సంస్థలు మూడు నెలలుగా నకిలీ బిల్లుతో సు మారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పైగా మట్టిని తరలించినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నకిలీ బిల్లుతో తరలిస్తున్న టిప్పర్లలను స్థానిక ప్రజలు పట్టుకొని అధికారులకు పట్టించినా చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. రోజుకి 200 టిప్పర్లు మహారాజపురం కొండపై నిత్యం 10 పొక్లయిన్లు , 200 టిప్పర్లు తిరుగుతున్నాయి. ఒక టిప్పర్లో 12 క్యూబిక్ మీటర్ల చొప్పున రోజుకు 200 టిప్పర్లలో సుమారు 2,400 క్యూబిక్ మీటర్ల మట్టి తరలించేస్తున్నారు. ఈ ప్రకారం ఆ రెండు సంస్థలు తాత్కాలికంగా తీసుకొన్న అనుమతి ప్రకా రం 15 రోజుల్లో మట్టి అంత తరలించేశారు. కానీ మూడు నెలలుగా రోజుకు 40 టిప్పర్లకే ఒరిజినల్ బిల్లులు ఇస్తూ మిగిలిన 160 టిప్పర్లకు నకిలీ బిల్లులతో మట్టిని తరలించేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడు నెలలుగా నకిలీ బిల్లుతో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిస్తుంటే అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎనికల్లో ఇచ్చిన హామీ ఏమైంది. తాము అధికారంలోకి వస్తే, తమిళనాడుకు పిడికెడు మట్టి వెళ్లకుండా చూసుకొంటానని చెప్పిన శాసన సభ్యుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని, ఎన్నికలలో ఇచ్చిన మాట ఏమైందని స్థానిక ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై న అక్రమ క్వారీపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది. దీనిపై వివరణ కోరేందుకు జిల్లా అధికారికి ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. షాడో ఎమ్మెల్యే హస్తం అక్రమ క్వారీ యజమాన్యం వెనుక ఓ షాడో ఎమ్మెల్యే హస్తం బలంగా ఉండడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తరలించేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం గండిపడుతోంది. క్వారీ యజమాన్యం వెనుక షాడో ఎమ్మెల్యే హస్తం ఉండడంతో స్థానిక ప్రజలు, మండల, జిల్లా స్థాయి అధికారులు సైతం వారి వైపు వెళ్లడానికి భయపడుతున్నారు. -
పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తాం
తవణంపల్లె : మండల కేంద్రంలో మునగ ఆకుతో తయారు చేసే పౌడర్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి స్పష్టం చేశారు. శనివారం తవణంపల్లె వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారులతో మునగ పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీదేవి మాట్లాడుతూ.. తవణంపల్లె రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీఓ) భవనంలో ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రైతులు మునగ సాగు చేయడంలో మెలకువలు గురించి వివరించారు. ఉద్యానవన శాఖ ఏడీ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు మునగ సాగుపై అవగాహన కల్పించారు. మాట్లాడుతూ ఆసక్తి కలిగిన రైతులు ఉపాధిహామీ పథకం కింద మునగ సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కేశవులు, ఎల్హెచ్ ఏపీఎం రమణ, ఏపీఎంలు నాగరత్న, ఈశ్వరి, అరుణ, రవి, రవికుమార్, సంగన్న, ఏపీఓ బాల సీసీలు, రైతు ఉత్పత్తిదారులు ,హైదరాబాద్ ఎ–1 ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హెచ్ఎంపై విచారణ
వీకోటప్రభుత్వ పాఠశాల హెచ్ఎంపై చిత్తూరు డీవైఈవో పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఇంటిల్లిపాదికీ సంక్షేమం వరదయ్యపాళెం: ‘మాది తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలంలోని చిన్నపాండూరు గ్రామం. మాది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. నా భర్త తో పాటు ఇద్దరు కుమార్తెలు గురుప్రియ, చంద్రుప్రియ, కుమారుడు వంశీ ఉన్నారు. మాతో పాటు నా భర్త తల్లి రుక్ష్మిణి ఉంది. మేమందరం ఒకే ఇంట్లో ఉంటాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నా భర్తకు రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 చొప్పున ప్రతి సంవత్సరం అందింది. నాకు సున్నా వడ్డీ పథకం కింద రూ.2వేలు, బీఫార్మసీ చదువుతున్న పెద్ద కుమార్తె గురుప్రియ, ఈసీఈ చదువుతున్న ద్వితీయ కుమార్తె చందుప్రియకు జగనన్న విద్యాదీవెన పథకం దారా లబ్ధి చేకూరింది, ఇంటర్మీడి యట్ చదువుతున్న కుమారుడు వంశీకి అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15వేల చొప్పున మా బ్యాంకు ఖాతాలో జమైంది. మా అత్తమ్మ రుక్మిణికి వితంతు పింఛను కింద ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ముట్టింది. ఇలా ఆరుగురు కుటుంబ సభ్యులకు ఏడాదికి రూ.1,07,000, ఆర్థిక సహాయం అందేది. జగనన్న పాలనలో 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు అందుకున్నాం. మా కుటుంబానికి సాయం చేసి, అండగా నిలబడిన జగనన్న వెయ్యేళ్లు వర్ధిల్లాలి. అన్నా నీకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.’’ – భాను కుటుంబం, చిన్నపాండూరు, వరదయ్యపాళెం మండలం -
దారి తప్పుతున్న లాటరీ దర్యాప్తు
చిత్తూరు అర్బన్ : చిత్తూరులో నగరంలో నిషేధిత లాటరీ టికెట్ల ముద్రణ, టికెట్లు విక్రయిస్తున్న నిందితులను పట్టుకోవడంలో ఓ పోలీసు అధికారి వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. నగరంలో విచ్చల విడిగా లాటరీ టికెట్ల విక్రయాలు, దానికి అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంపై ‘సాక్షి’ పత్రికలో ఇటీవల ‘పచ్చ లాటరీ’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ దందాపై ఎస్పీ తుషార్ డూడీ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పెష ల్ బ్రాంచ్ విభాగంతో లాటరీ వ్యవహారంపై కీలక సమాచారం తెప్పించుకున్నారు. ఇందులో సంబంధం ఉన్న వ్యక్తులు, పోలీసులపైనా నిఘా పెట్టారు. దీంతో నెపం తమపై పడుతుందని గ్రహించిన ఖాకీలు ఇటీవల లాటరీ టికెట్ల విక్రయదారులను వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గతంలో లాట రీ టికెట్లు విక్రయించి, ప్రస్తుతం దానిజోలికి వెళ్లకుండా కూలీ పనిచేసుకుంటున్న పేదలపై ఓ ఖాకీ తప్పుడు కేసులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇంట్లో నిద్రపోతున్న ఇద్దరు వ్యక్తులను.. వాళ్ల ఇంటికి వెళ్లి నిద్రలేపి మరీ కేసులు పెట్టారని విమర్శలు ఉన్నాయి. తాము లాటరీ టికెట్లు విక్రయించడంలేదని, కూలీ పనికి వెళుతున్నామని చెబుతున్నా పట్టించుకోకుండా కేసులు పెట్టడంతో పాటు.. ఇద్దరు వ్యక్తుల ఫోన్పే నుంచి డబ్బులను సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పేద విద్యార్థులకు జగనన్న బాసట
తిరుపతి సిటీ : ‘‘తిరుపతి కొర్లగుంటకు చెందిన నిరుపేద కుటుంబం మాది. అమ్మానాన్న ఇద్దరూ భవన నిర్మాణ కూలీలు. నేను, తమ్ముడు ఇద్దరం సంతానం. వారి చేతి కష్టంతో మమ్మలను చదివిస్తూ వచ్చారు. నేను 2019లో నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ పూర్తి చేశాను. గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఫీజు చెల్లించలేనిస్థితిలో ఆశలు వదులుకున్నాను. అమ్మానాన్నతో పాటు నేనూ కొన్ని రోజులు పనికి వెళ్లాను. ఆ సమయంలో జగనన్న 2019లో సీఎం అయిన వెంటనే టీడీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించారు. దీంతో కళాశాల యాజమాన్యం బీటెక్ సర్టిఫికెట్లు ఇచ్చింది. 2020లో తిరుపతిలో మెగా జాబ్మేళాకు ఎంపికై రూ.9 లక్షల ప్యాకేజీ అందుకున్నాను. ఆ కంపెనీ ప్రతినిధులు అమెరికాకు పంపించారు. ప్రస్తుతం నేను రూ.25 లక్షల ప్యాకేజీతో పనిచేస్తున్నాను. ‘‘ మళ్లీ నిన్ను సీఎంగా చూడాలి.. హ్యాపీ బర్త్డే టూ యూ జగనన్న’’ – శ్రావణి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, తిరుపతి -
మారుతున్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
హైకోర్జు జడ్జి జస్టిస్ జయసూర్య చిత్తూరు అర్బన్ : చట్టాల్లో వస్తున్న మార్పులు, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న తీర్పులపై ప్రతీ ఒక్క న్యాయమూర్తి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ నినాల జయసూర్య ఆదేశించారు. శనివారం చిత్తూరు పూర్వపు ఉమ్మడి జిల్లాలోని న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జరిగిన సమావేశంలో జస్టిస్ జయసూర్య మాట్లాడుతూ.. చట్టాల్లో వస్తున్న మార్పులపై జడ్జీలకు పూర్తిస్థాయిలో పట్టు ఉండాలన్నారు. అప్పుడే సరైన తీర్పులు వెలువరించే అవకాశం ఉంటుందన్నారు. క్రిమినల్ చట్టంలో నేరాల తీరు, ప్రాసిక్యూషన్ నియంత్రించడం, సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు శిక్షలపై చర్చించారు. ఇక కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. అనంతరం రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి బి.శ్యాంసుందర్, రిటైర్డు జిల్లా జడ్జి కేపీ బాలాజీ రీసోర్స్ పర్సన్గా వ్యవహరించి పలు అంశాలపై ప్రస్తావించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, న్యాయమూర్తులు సూర్యనారాయణమూర్తి, శ్రీనివాసరావు, భారతి, గురునాథ్, అర్చన, రామ్గోపాల్ పాల్గొన్నారు. -
104 ఉద్యోగులపై వేధింపులు తగదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : 104 ఉద్యోగులపై యాజమాన్య వేధింపులు తగదని 104 ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు విక్టర్ మండి పడ్డారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట శనివారం 104 ఉద్యోగుల సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపులో యాజమాన్యం కోత పెట్టిందన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం వేతనం రూ.18,500 ఇవ్వాలన్నారు. 5 ఏళ్లు సర్వీసు దాటిన వారికి స్లాబ్ మార్చి వేతనాలు చెల్లించాలన్నారు. రద్దు చేసిన క్వాజువల్ లీవులు పునరుద్ధించాలన్నారు. మందులు 104లోనే అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ గిరిధర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సభ్యులు భాస్క ర్, శ్రీకాంత్, మణికంఠ తదితరులున్నారు. -
నేడు పల్స్పోలియో
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం జరగనుంది. 5 ఏళ్ల లోపు పిల్లలకు రెండు చుక్కలు వేయనున్నారు. ఇందు కు గాను 50 పీహెచ్సీ, 15 అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో 2,21,502 మంది ఐదేళ్ల లోపు పిల్లలను గుర్తించారు. 142 రూట్లల్లో 1415 బూత్లను ఏర్పాటు చేశా రు.ఈ బూత్లలో పిల్లలకు చుక్కలు వేసేందుకు 5800 వ్యాక్సినేటర్లను నియమించారు. 2830 మందితో ఇంటింటా పర్యటనకు కేటాయించారు. జిల్లా కేంద్రానికి 7 లక్షలు డోస్లు చేరుకున్నాయి. వీటిని చిత్తూరు జిల్లా తో పాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు కూడా అందజేయనున్నామని డీఐఓ హనుమంతరావు పేర్కొన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి అన్నారు. చిత్తూరు నగరంలో పోలియో చుక్కల కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలసి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి అక్కడ మానవహారం, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ, మేయర్ అముద మాట్లాడుతూ.. పిల్లలందరికీ ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. చుడా చైర్మన్ కఠారి హేమలత, డీఐఓ హనుమంతరావు, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, సూపరింటెండెంట్ ఉషశ్రీ, ఆర్ఎంఓ సంధ్య, వైద్యాధికారులు లోకేష్, ప్రవీణ, గిరి, అనూష పాల్గొన్నారు. -
రైతు బతుకును పండగ చేశాడు
కాణిపాకం: ‘‘రైతు బతుకు జగనన్న పండగ చేశాడు. నేను పుట్టినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి లాగా ఇంత పరితపించే మరో నాయకుడిని చూడలేదు. మాకు ముగ్గురు పిల్లలు. వాళ్లకు పెళ్లయి పిల్లలున్నారు.ఊరు చివరన మాకు 2.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో చెరుకు, వరి పండిస్తున్నాం. అడపాదడపా రాగులు సాగు చేస్తాం. 2019కి ముందు వ్యవసాయ ఆధారిత మందులు, ఎరువుల కోసం తమిళనాడుకు వెళుతున్నాం. 8 కిలోమీటర్ల దూరం ఆటోలో వెళ్లి మందులు, ఎరువులు తెచ్చుకునేవాళ్లం. అప్పట్లో పండించే పంట తెగుళ్ల నుంచి కాపాడుకోలేకపోయాం. పంట ఎత్తిపోతే నష్టపరిహారం కూడా అందించే వారు కాదు. పంటపై తీసుకున్న రుణాలకు రుణమాఫీ కాగాపోగా అప్పుల పాలయ్యాం. 2019 తర్వాత జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. జననేత పాలనలో వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని ఆయన నిరూపించారు. పంట సాగుకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా అందించారు. మా గ్రామ సమీపంలో శ్రీకావేరిరాజుపురం వద్ద రైతు భోరోసా కేంద్రాన్ని నిర్మించారు. ఆర్బీకేలో నాణ్యత గల ఎరువులు, యూరియా, వేరుశనగ, కంది, జనుము, మినుములు, అలసంద వంటి పలు రకాల విత్తనాలను తీసుకున్నాం. యంత్రపరికాలు కూడా అందించారు. రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.13.500 మా బ్యాంకు ఖాతాకే పడేది. సాగు చేసే పంటకు బీమా వసతి కల్పించారు. పంట నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చేవారు. రైతు భరోసా కేంద్రం వచ్చాక పాడి ఆవులకు ఊళ్లోనే వైద్యం చేసేవాళ్లు వచ్చారు. దాణాలు, సీజనల్ వ్యాధుల నివారణకు మందులు ఉచితంగా వేసేవారు. ఫోన్ చేస్తే పశు సంచార వాహనం ఇంటి వద్దకే వచ్చేది. ఇలాంటి గొప్ప సేవలు అందడంతో మేము కూడా కొండత భరోసా వచ్చింది. పేదల అభ్యున్నతే ధ్యేయంగా పాటుపడిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.’’ – రాజేంద్ర, ఎస్కేఆర్పురం, పాలసముద్రం మండలం -
● సకల వర్గాలకు సంక్షేమం అందించిన నేత ● నేడు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగాప్రత్యేక కథనం
మా ఇంటి దీపం వెలిగించాడు శాంతిపురం: ‘‘నాకున్న 1.5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుని భార్య జయంతి, కొడుకు పృథ్విఆదిత్యతో ఉన్నంతలో సంతోషంగా జీవించేవాడిని. మూడేళ్ల క్రితం నా కొడుకు ఆనారోగ్యానికి గురయ్యాడు. నెల రోజుల పాటు మేము ఆస్పత్రుల చుట్టూ తిరిగితే ఊపిరి తిత్తులు తీవ్రమైన ఇన్పెక్షన్కు గురైనట్టు తేల్చారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం గురించి తెలిసినా, నా బిడ్డ ఎదుర్కొంటున్న జబ్బుకు చికిత్సలు చేసే ఆస్పత్రులు స్థానికంగా లేక ఇబ్బంది పడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో వైద్యం కోసం చేసిన ఖర్చులు తమ శక్తికి మించి అయిన వారి సాయం తీసుకున్నా అదీ సరిపోలేదు. నానాటికీ అనారోగ్యం ముదురుతూ శ్వాస తీసుకోవడానికి అల్లాడుతున్న నా చంటి బిడ్డను చూస్తూ ఉండలేక సతమతమయ్యారు. చివరకు బెంగళూరులోని రెయిన్బో అస్పత్రికి తీసుకువెళితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించారు. రూ.10 లక్షలకు పైగా విలువైన చికిత్సలను ఉచితంగా అందించడంతో పృథ్విఆదిత్య గండం నుంచి గట్టెక్కాడు. ఇప్పుడు మూడేళ్ల వయసున్న బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పట్లో తమ కష్టాన్ని, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి అందిన సాయాన్ని తలుచుకుని ధర్మేంద్ర దంపతులు చేతులు జోడించి నాటి సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. మా లాంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి మంచి మనసున్న పాలకులే కావాలి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు.’’ – ధర్మేంద్ర, ఆరిముత్తనపల్లి, శాంతిపురం మండలం తిరుపతి, సాక్షి ప్రతినిధి: సకల వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జనం గుండెల్లో నిలిచిపోయారు. 18 నెలల నేటి చంద్రబాబు ప్రభుత్వ పాలనను, నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనతో పోల్చుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా నాటి సంక్షేమ పాలనను గుర్తుచేసుకుంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకుడిగా అభివర్ణిస్తున్నారు. నాడు ఐదేళ్లలో చేసిన సంస్కరణల గురించి చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చేసి చూపించిన నాయకుడిగా నిలిచిపోయారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలో వేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని మహిళలు కీర్తిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. వలంటీర్లు నియమించి కులమతాలు పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందించారు. నాడు– నేడు ద్వారా ప్రభుత్వ బడులు, ఆస్పత్రులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. విద్యా వ్యవస్థ బాగు కోసం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేశారు. 17 మెడికల్ కళాశాలలు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మాటలు, ప్రకటలతో కాకుండా మహిళా సాధికారతను చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరునే ఇచ్చి సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు. అటువంటి నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
ఉపాధిని రద్దు చేయొద్దు!
చిత్తూరు కార్పొరేషన్: ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని మౌన దీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసే యోచనలో ఉందన్నారు. ఈ పథకానికి వెచ్చించాల్సిన నిధులను 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరించే విధంగా నిబంధనలు మార్చాలని చూస్తున్నట్టు తెలిసిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం గొప్పలు చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా నాయకులు ఓబుల్రాజు, నాయకులు సురేంద్రన్, గిరిధర్ గుప్తా, చిట్టెమ్మ, ప్రసాద్, ప్రతాప్ పాల్గొన్నారు. -
అయ్యో..తులసీ
నగరి : నగరి మండలంలోని ఎం.కొత్తూరు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో విలేజ్ సర్వేయర్ టీ.తులసీరామ్ (29) మృతిచెందాడు. పోలీసులు తెలి పిన సమాచారం మేరకు.. విజయపురం మండలం, కాళికాపురం సచివాలయలో విలేజ్ సర్వేయర్గా తులసీరామ్ విధులు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు డీఎస్ఎస్ఎల్ఆర్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకావడానికి నగరికి స్కూటర్పై వస్తుండగా దేశమ్మ దేవాలయ సమీపం, ఎం.కొత్తూరు మార్గంలో ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన తులసీరామ్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. నగరి మున్సిపాలిటీ నగరిపేటకు చెందిన ఇతను ఇటీవల గుడుపల్లి మండలం, చీకటిపల్లికి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం డిప్యూటేషన్పై కాళికాపురం సచివాలయంలో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకావడానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందాడు. మృతినికి రెండేళ్ల క్రితమే వివాహమైంది. భార్య, ఏడాది వయస్సు గల కుమార్తె ఉంది. నిత్యం సర్వేలు, కాన్ఫరెన్స్లు ఇటీవల బాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు నిత్యం ఏదో ఒక సర్వే, కాన్ఫరెన్స్లు నిర్వహిస్తోంది. వారు కుదురుగా సచివాల యాల్లో ఉండడమే లేదు. ఇలా తిరగడమే నేడు ప్రమాదానికి కారణమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
దాచి పెట్టి దోపిడీ!
సాక్షి టాస్క్ఫోర్స్: ఇసుక దోపిడీలో కూటమి నేతలు పేట్రేగిపోతున్నారు. అక్రమంగా తవ్వకాలు చేసి తెల్లబంగారాన్ని దోచేస్తున్నారు. వంకలో తవ్వకాలు చేసి... ఆపై డప్ చేసి రహదారి కోసమంటూ టిప్పర్లలో తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడ టిప్పర్ ఇసుక లక్షలకు విక్రయి స్తున్నట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ దందాకు అడ్డుకట్టవేసేందుకు అధికార పార్టీ నాయకులే సిద్ధమవ్వడం గమనార్హం. చిత్తూరు మండలం, ముత్తుకూరు రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ తవ్వకాలు చేసి ముత్తుకూరు– తచ్చూరు జాతీ య రహదారి కూడలి సమీపంలో డంప్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ డంప్ను ప్రా రంభించారు. రీచ్ నుంచి డంప్కు రోజుకకు 80 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుక చేరుతోంది. డంప్ నుంచి జేసీబీల ద్వారా టిప్పర్లకు లోడ్ చేస్తున్నారు. రహదారి పేరుతో తరలింపు డంప్ నుంచి గుడిపాల మండలంలో జరిగే రోడ్డుకని తెల్లబంగారాన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు. అయితే గుడిపాల మీదుగా తమిళనాడుకు పట్టుకెళుతున్నారు. తమిళనాడులో డిమాండ్ ఉండడంతో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, పొన్నై, తిరుత్తణి, చైన్నె, సోలింగరం తదితర ప్రాంతాల్లో దళారులను ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా వ్యాపారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అడిగే దమ్ముందా? ఈ ఇసుక అక్రమ వ్యాపారాన్ని ముత్తుకూరుకు చెందిన ఓ నేత, గుడిపాలకు చెందిన మరో నేత కలిసి చేస్తున్నారు. ముత్తుకూరుకు చెందిన ఆ నేతే రీచ్ నుంచి డంప్ ప్రాంతానికి ట్రాక్టర్ల ద్వారా చేర్చడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడుకు తరలించే ప్రక్రియ మొత్తం గుడిపాలకు చెందిన నేత చూసుకుంటున్నాడు. ఈ విషయం మండలంలోని పలువురు నేతలకు తెలియడంతో వారు తిరుగుబావుటా ఎగురవేశారు. గుడిపాలలో ఉండే వ్యక్తులు మా అడ్డాలో అక్రమ ఇసుక వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అధికారులు అడ్డుకునే దమ్ము లేకుంటే అధినేతకు ఫిర్యాదు చేస్తామని టీడీపీలోని ఓ వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు. -
ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవద్దు
చిత్తూరు కలెక్టరేట్: ప్రభుత్వం ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల పేరుతో ఒత్తిడి తేవద్దని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సాయంత్రం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛగా బోధించాల్సిన ఉపాధ్యాయులను రోజుకో స్కీమ్ పేరుతో ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ సెలవు రోజులైన ఆదివారం, రెండో శనివారం, పండుగ రోజుల్లో పనిచేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. అనంతరం డీఈవో రాజేంద్రప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. -
ఆన్లైన్లో తుది మెరిట్లిస్టు జాబితా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది మెరిట్ జాబితాను ఆన్లైన్లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి వెల్లడించారు. సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘గుట్టుగా మెరిట్ లిస్టు’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆమె ప్రొవిజనల్ మెరిట్ లిస్టును తోసిపుచ్చి.. తుది మెరిట్ జాబితాను ఆన్లైన్లో పెట్టిన విషయా న్ని బహిర్గతం చేశారు. ఇక ఏయే పోస్టులను భర్తీ చేస్తున్నారో వెల్లడించారు. స్టాఫ్నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, సపోర్టింగ్ స్టాఫ్, లాస్ట్గ్రేడ్ సర్వీసు పోస్టులను మాత్రమే భర్తీ చేయనన్నట్లు ప్రకటించారు. మిగిలిన పోస్టులు వాయిదా పడ్డాయన్నారు. కాగా తుది మెరిట్లిస్టునుwww.chittoor.ap.gov.in అనే సైట్లో ఈనెల 22వ తేదీ వరకు చూసుకోవచ్చని వెల్లడించారు. టెట్కు 130 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 130 మంది గైర్హాజరయ్యారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 542 మందికి గాను 456 మంది, మధ్యాహ్నం 541 మందికిగాను 497 మంది హాజరయ్యారని చెప్పారు. టెట్ ఐదు కేంద్రాల్లో జరిగిందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం, తిరుమణ్యం రెవెన్యూ అటవీ ప్రాంతంలో క్రూర మృగాల కదలికలను కనుగొనేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి వి.సాయిబాబా తెలిపారు. ఈ నెల 16వ తేదీన తిరుమణ్యం అటవీ ప్రాంతంలో చిరుత మేకలను చంపినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రదేశాన్ని ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చిరుత దాడిలో మేకలు చనిపోలేదని స్పష్టం చేశారు. చిరుత ఒకదాని మీదనే దాడి చేసి, నోటితో కరచి తీసుకెళ్లిపోతుందని వివరించారు. ఈనెల 16న నాలుగు మేకలు మృతి చెందడానికి అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) కారణమై ఉంటాయన్నారు. ఏది ఏమైనా గ్రామస్తుల సంరక్షణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయన వెంట ఫారెస్ట్ రేంజర్ బీ.సుదర్శన్రెడ్డి, ఎఫ్ఎస్ఓ వై.శంకరప్ప, ఎఫ్బీఓ ఎం.మునినాయక్, ఎంపీటీసీ రవి ఉన్నారు. నేడు హైకోర్టు న్యాయమూర్తి సమీక్ష చిత్తూరు అర్బన్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ నినాల జయసూర్య శనివారం చిత్తూరుకు రానున్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో పూర్వపు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న న్యాయమూర్తులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 నుంచి సమావేశం ప్రారంభం కానుంది. -
కొడితే సిక్సే!
రెవెన్యూ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో క్రికెట్, షటిల్ ఇతర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. కలెక్టర్ సుమిత్కుమార్ ఉద్యోగులతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు. కలెక్టరేట్లో మధ్యాహ్నం ఉద్యోగులకు క్విజ్ పోటీలు జరిగాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు నిర్వహించారు. డీఆర్వో మోహన్కుమార్ పోటీలను పర్యవేక్షించారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, పలమనేరు ఆర్డీవో గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. – చిత్తూరు కలెక్టరేట్ బ్యాటింగ్ చేస్తున్న కలెక్టర్క్విజ్ పోటీలు -
దీన్ని ఏమందురు?
నకిలీ మద్యంపై తనిఖీలు సరే.. లీకేజీలకు కారణం? చిత్తూరు అర్బన్: జిల్లాలో మద్యం విక్రయాలపై అధికారులు నియంత్రణ కోల్పోతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో లభిస్తున్న మద్యం బాటిళ్లలో.. కొన్ని లీకేజీలు అవుతున్నాయి. ఇవి కల్తీ మద్యమా..? ఒక కంపెనీ మద్యానికి బదులుగా మరో కంపెనీ మద్యం ఏదైనా మిక్డ్స్ చేస్తున్నారా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. చిత్తూరులో ఇలా.. ఇటీవల చిత్తూరు నగరంలోని తిరుపతి రోడ్డులో ఉన్న ఓ దుకాణంలో మద్యం తీసుకున్న వ్యక్తి, బాటి ల్ మూత నుంచి మద్యం లీకేజీ అవుతుండడాన్ని గమచించారు. ఇదేమిటని దుకాణ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే లీకేజీ అవుతున్న బాటిల్ తీసుకుని, మరో బాటిల్ ఇచ్చి పంపిచేశాడు. కానీ బాటిల్ మూత లీకేజీ అవుతుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. శ్యాంపిల్స్ తీస్తున్న ఎకై ్సజ్ పోలీసులు ల్యాబ్కు వీటిని పంపిస్తే ఇందులో ఏదైనా కల్తీ జరిగిందా..? రసాయనాలు ఉండాల్సిన పరిమాణంకంటే ఎక్కువగా ఉన్నాయా..? అనే రిపోర్టు వస్తుంది తప్ప.. రూ.300 విలువ చేసే మద్యంలో చీప్లిక్కర్ కలిపారా..? అనే నివేదిక రాదు. దీన్ని అలుసుగా చేసుకుని కొందరు వ్యాపారులు మద్యం బాటిళ్ల మూతలను చాకచక్యంగా తొలగించి, అందులో తక్కువ ధర ఉన్న మద్యాన్ని కలుపుతున్నారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. తనిఖీల సమయంలో అధికారులు పూర్తి స్థాయిలో బాటిళ్లను పరీక్షించకుండా, దుకాణ నిర్వాహకులు ఇచ్చే నెలవారి మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తనిఖీలు నామమాత్రం అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో గతేడాది అక్టోబర్లో 104 ప్రైవేటు మద్యం దుకాణాలను బాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక కల్లుగీత సామాజిక వర్గాలకు చెందిన వాళ్లకు మరో పది దుకాణాలను కేటాయించింది. జిల్లాలో నెలకు సగటున రూ.33 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతీ నెలా ఆయా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లలోని అధికారులు దుకాణాలు తనిఖీలు చేసి, అక్కడ ఉన్న ఏదో ఒక మద్యాన్ని తీసుకుని, వాటి నాణ్యత పరీక్షించడానికి ల్యాబ్కు పంపడం వారి విధినిర్వహణలో భాగంగా జరుగుతోంది. కానీ ఎకై ్సజ్ అధికారులు శ్యాంపిల్స్ సేకరించే ప్రక్రియ ఓ యాంత్రికంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా రూ.99 మద్యం తీసుకుని.. రూ.300 ధర ఉన్న బాటిళ్లల్లో పోసి, విక్రయిస్తున్నారని పలువురు మద్యం ప్రియులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
న్యాయ విభాగంలో నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా వైఎస్సార్సీపీ న్యాయ విభాగం కమి టీలో నియమాకాలు చేపడుతూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. జిల్లా అధ్యక్షుడిగా సూర్యప్రతాప్(చిత్తూరు), ఉపాధ్యక్షుడిగా మల్లికార్జునరెడ్డి(పుంగనూరు), విజయకృష్ణారెడ్డి(చిత్తూరు), సురేష్రెడ్డి(జీడీనెల్లూరు), ప్రధాన కార్యదర్శులుగా సఫివుల్లా (చిత్తూరు), హరిబాబు(జీడీనెల్లూరు), ప్రకాష్రెడ్డి(పూతలపట్టు), చంద్రప్ప(కుప్పం), ఉదయభాను(నగరి), మోహన్రెడ్డి(పలమనేరు), హరినాథరెడ్డి(పుంగనూరు), కార్యదర్శులుగా స్టీఫెన్, వాసుదేవరెడ్డి(జీడీనెల్లూరు), మోహన్, ప్రసాద్రెడ్డి (పూతలపట్టు), హరికృష్ణ(కుప్పం), మురళీరాజు(నగరి), జయచంద్రరెడ్డి(జీడీనెల్లూరు), భాస్కర్రెడ్డి(పలమనేరు), ప్రకాష్, అంజిబాబు (పుంగనూరు)లతో పాటు 12 మంది ఈసీ మెంబర్లను నియమించారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
సాక్షి టాస్క్ఫోర్స్ : బంగారుపాళెం మండలం మట్టి అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మట్టి మాఫి యా మండలంలోని కొండలు, గుట్టలను తవ్వేసి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా మొగిలివెంకటగిరి రెవెన్యూ, పాలేరు జగనన్న కాలనీ వద్ద జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గుట్టను 20 రోజుల నుంచి జేసీబీతో తవ్వి మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులేవీ..? మట్టిని తవ్వడానికి మైనింగ్ అనుమతులు తప్పనిసరి. అక్రమార్కులు అధికార పార్టీ నాయకుల అండతో అనుమతులు లేకుండానే మట్టిని తవ్వుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అక్రమార్కుల నుంచి ముడుపులు తీసుకుని మట్టి అక్రమ రవాణా గురించి పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మట్టిని టిప్పర్ల ద్వారా బంగారుపాళెం మీదుగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో దుమ్ము, ధూళి కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నట్టు దుకాణదారులు, ప్రజలు వాపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము వెదజల్లుతోందని చెబుతున్నారు. -
ఆ టీడీపీ కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలి
చిత్తూరు అర్బన్: దర్యాప్తులో ఉన్న కేసు నుంచి తన పేరు తొలగించాలని బెదిరింపులకు దిగిన టీడీపీ కార్పొరేటర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరుకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు శోభారాణి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. చిత్తూరుకు చెందిన టీడీపీ మహిళా కార్పొరేటర్ (న్యాయవాది కూడా) గురువారం రాత్రి వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం, తన చావుకు డీఎస్పీ, సీఐలతో పాటు శోభారాణి కూడా కారణమని చెప్పడం తెలిసిందే. దీనిపై శోభారాణి స్పందిస్తూ తన సోదరుడి ఆత్మహత్య కేసులో ఆ కార్పొరేటర్ను నిందితులిరాలిగా చేరిస్తే, తన పేరు తొలగించాలని దర్యాప్తు అధికారులను బెదిరించడం కేసును పక్కదారి పట్టించడమే అవుతుందని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ పోలీసులను బెదిరిస్తే కేసు ఎందుకు నమోదుచేయరని ప్రశ్నించారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల్లోకి మరోలా సంకేతం వెళుతుందని తెలిపారు. ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు కుప్పం విద్యార్థి కుప్పంరూరల్: కుప్పం డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్లో తృతీయ సంవత్సరం చదువుతున్న పి.రేవంత్ సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎస్వీ యూనివర్సిటీ తరుఫున ఎంపికై నట్లు కళాశాల చైర్పర్సన్ శాంతానాగరాజు చెప్పారు. తిరుపతిలో జరిగిన కాలేజీ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ప్రతిభ కనబర్చి, డిసెంబర్ 25న చైన్నెలో జరిగే పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు పి.రేవంత్ను శుక్రవారం కళాశాల అధ్యాపకులు అభినందించారు. -
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
వెదురుకుప్పం: మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని పోక్సో చట్టం కింద శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. నగరి డీఎస్పీ మహ్మద్ అజీజ్ కథనం మేరకు.. వెదురుకుప్ప మండలం, ఆళ్లమడుగు పంచాయతీకి చెందిన ఓ బాలిక(14) ఆగస్టు 24వ తేదీ 11 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన శంకరయ్య కుమారుడు డి.మురళి (49) బాలిక ఇంటికి వెళ్లాడు. ఆపై బాలికను బెడ్ రూమ్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. భయపడి బాలిక ఎవ్వరికీ చెప్పలేదు. అయితే అప్పుడప్పుడూ బాలికకు కడుపునొప్పి వచ్చేది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. గురువారం తల్లిదండ్రులు బాలికను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించడంతో 22 వారాల గర్భం ఉన్నట్టు తేలింది. అవాకై ్కన బాలిక తల్లిదండ్రులు వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం తన కుమార్తైపె లైంగికదాడికి పాల్పడిన నిందితుడు మురళిపై వెదురుకుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు తెలిసింది. కాగా శుక్రవారం సాయంత్రం దేవళంపేట వద్ద పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడు 2012లో ఓ కేసులో నేరస్తుడని తెలిపారు. డీఎస్పీ వెంట కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఐ నవీన్బాబు ఉన్నారు. -
వైద్యం @ 22!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కోచోట నిత్యం 70 నుంచి 150కి పైగా ఓపీలు నమోదవుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సకాలంలో రావడం లేదు. ఇద్దరు డాక్టర్లులుంటే.. ఒకరు 104 సేవలు చూసుకోవాలి. మకొకరు...ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలి. కానీ ముఖ హాజరు వేసుకుని సర్వేలు, క్షేత్ర తనిఖీల పేరుతో బయటకు వెళ్తున్నారు. సొంత క్లినిక్లో కూర్చుని జేబులు నింపుకుంటున్నారు. లేకుంటే యూనియన్ల పేరుతో దర్జాగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. డెప్యూటేషన్ అంటూ కార్యాలయానికే పరిమితమవుతున్నారు. దీంతో పలు పీహెచ్సీలు ఖాళీగా బోసిపోతున్నాయి. ఈ విషయాలు తెలిసినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బందే డాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఇటీవల చిత్తూరు నగరంలోని చవటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయగా వైద్యులు 10 గంటలు దాటినా రాలేదు. విచారిస్తే ఆ డాక్టర్ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసే ఓ జూనియర్ అధికారి బంధువని తెలిసింది. ఇటీవల ఎంపీ శ్రీరంగరాజుపురం పీహెచ్సీని తనిఖీ చేస్తే డాక్టరు విధుల్లో లేరని గుర్తించి.. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి పూట ఉండరే? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాత్రి పూట కూడా పనిచేసేలా ఆదేశాలున్నాయి. స్టాఫ్ నర్సులు డ్యూటీలో ఉండాలనే నిబంధన ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాత్రి పూట వైద్య సేవలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ప్రసవాలను స్థానికంగానే చేయాలనే లక్ష్యంతో నిర్దేశించింది. కానీ ఆ దిశగా పీహెచ్సీలు పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. పడకేసిన ప్రాథమిక వైద్యం వైద్యానికి డబ్బులా? బాబు ప్రభుత్వం వచ్చాక వైద్య సేవలు తూతూమంత్రంగా మారాయి. పలు కేంద్రాల్లో ఆరోగ్య సేవలకు కాసులు గుంజుకుంటున్నారు. సూది వేస్తే రూ.50, కట్టుకడితే రూ.50 నుంచి రూ.100, సైలెన్బాటిల్ పెడితే రూ.100 నుంచి రూ.200, ల్యాబ్ టెస్ట్కు రూ.100 నుంచి రూ.300 వరకు గుంజుతున్నట్టు సర్వేలో తేలింది. అలాగే ఇక్కడ పలు టెస్టులు చేయాలేమని.. బయట చేసుకోవాలని, దీనికి రూ.600 అవుతుందని చెప్పి వసూలు చేస్తున్నట్లు సర్వేలో పలువురు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో అందిన సేవలకు డబ్బులు అడిగారని సర్వే చేయగా.. 83,160 మంది స్పందించారు. ఇందులో 31,325 మంది(37.67శాతం) డబ్బులు అడిగారని సమాధానమిచ్చారు. ఈ లోపాలతో జిల్లా 22 స్థానంలో నిలిచింది. మొత్తం మీద వైద్య సేవలపై 61.7 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేస్తే.. 38.3 శాతం మంది అసంతృప్తిని వ్యక్తపరిచారు. వీటన్నింటికీ ప్రధాన కారణం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణాలోపమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. మందులు, మాత్రలు ఏవీ? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, మాత్రలు కూడా లేవని గుర్తించింది. చాలా వరకు బయట రాసిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ లోపాలను 30,651 మంది(37.82శాతం) వెల్లడించారు. అలాగే పరిసరాల పరిశుభ్రత పూర్తిగా లోపిస్తోంది. ఈ విషయాన్ని 34,724 (42.65 శాతం) మంది గుచ్చి చెప్పారు. -
పేదల దేవుడు వైఎస్ జగన్
వెదురుకుప్పం : చారిత్రాత్మక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల తలరాతలను మార్చిన దేవుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి ప్రజల అభున్నతికి బాటలు వేశారని కొనియాడారు. నా ఎస్సీ.. నా బీసీ.. నా మైనారిటీ అంటూ బడుగులను అక్కున చేర్చుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్ అని వెల్లడించారు. సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండాలన్న సంకల్పంతో అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా పేదలకు అందించి, పాలనలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. ఏకంగా 31 లక్షల మంది పేదలకు స్థలంతోపాటు ఇల్లు నిర్మించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఏ పథకమైనా పేదల సంక్షేమమే ప్రామాణికంగా తీసుకుని అమలు చేసినట్లు వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగు పరచి పేదల గుండెల్లో కొలువుదీరారని చెప్పారు. జగన్ పుట్టినరోజును ప్రతి పేదవాడి ఇంట్లో పండుగగా భావిస్తున్నారని తెలిపారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గవ్యాప్తంగా జననేత జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంతో కూటమిలో వణుకు మొదలైనట్లు తెలిపారు. -
ఐదుగురి అరెస్ట్
బంగారుపాళెం: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి శుక్రవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని కాటప్పగారిపల్లె వద్ద అక్టోబర్ 15న జాతీయ రహదారిపై కారు (కేఏ05 ఎండీ4456)వేగంగా వెళ్తు డివైడర్ను ఢీకొని రైట్ సైడ్లో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారునిపైకి దూసుకెళ్లింది. ఆపై రహదరి పక్కన కాలువళక్ష బోల్తాపడింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్, కారులో ఉన్నవారు అక్కడి నుంచి పరారయ్యారు. కారును పరిశీలించగా అందులో 9 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 9 మంది ముఠా సభ్యులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులో చిత్తూరు గ్రీమ్స్పేటకు చెందిన రాజశేఖర్(33), నవీన్(34), రాకేష్(30), పునీత్కుమార్(24), ముఖేష్(22)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. చిత్తూరు టౌన్కు చెందిన ఆరీఫ్, కర్ణాటక రాష్ట్రం కటికినహళ్లికి చెందిన సయ్యద్ఫైరోజ్, తిరువణ్ణామలై జిల్లా జమునముత్తూరుకు చెందిన అజిత్, గోవింద్ను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు. జాతీయ స్థాయి పోటీలకు రాజుపల్లె విద్యార్థి పెద్దపంజాణి: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు అండర్–14 విభాగంలో మండలంలోని రాజుపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.చరణ్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయడు జనార్ధనరెడ్డి తెలిపారు. శుక్రవారం విద్యార్థికి అభినందనలు తెలిపారు. పీడీ దొరై పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పచ్చికాపల్లం విద్యార్థులు వెదురుకుప్పం : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు పచ్చికాపల్లం జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థులు హిమజ, పూజిత, హేమంత్, మోక్షిత్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు. ఎంఈఓ దామోదరం, పాఠశాల కమిటీ చైర్మన్ చెంగల్రాయులు, పీడీ చెన్నకేశవులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చిత్తూరు కలెక్టరేట్: పురోగమిస్తున్న విజ్ఞానశాస్త్ర అభివృద్దిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజానికి అవసరమైన కొత్త ఆవిష్కరణలు తయారుచేసే విధంగా ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎంపికై న వారు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొంటారన్నారు. చుడా చైర్పర్సన్ హేమలతో, జిల్లా సైన్స్ అధికారి అరుణ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి తొమ్మిది మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. -
విద్యుత్ షాక్తో ఆవు మృతి
చౌడేపల్లె: విధ్యుతాఘాతానికి గురై ఆవు మృతి చెందిన ఘటన మండలంలోని ఆమినిగుంట పంచాయతీ, సింగిరిగుంట వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. రైతు మోహన్నాయుడు తన ఆవును మేత కోసం గ్రామ సమీపంలోని పంట పొలాల్లోకి తోలుకెళ్లాడు. అక్కడ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసిన కొయ్యలు విరిగి కింద పడడంతో ఆ వైర్లు తగిలి షాక్కు గురై ఆవు మృతిచెందింది. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..! బంగారుపాళెం: అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. సీఐ శ్రీనివాసులు కథనం.. తిరుపతి జిల్లా, బైరాగిపట్టెడకు చెందిన వడ్డె రాజరాజు సమీప బంధువు వి కోటలో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం నాగరాజు అతని అన్నకుమారుడు మణికంఠతో కలసి ద్విచక్ర వాహనం(స్కూటీ)పై వెళ్లారు. ఆపై అంత్యక్రియలు ముగి సిన తరువాత స్కూటీపై తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలో మండలంలోని నలగాంపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున నాగరాజు(55) నిద్రమత్తులో కింద పడ్డాడు. తలకు బ లమైన గాయం తగలడంతో మృతి చెందాడు. చలి మంటలో పడిన వృద్ధుడి మృతి రొంపిచెర్ల: చలిమంటలో పడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్టు ఎస్ఐ తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని బండ మీదపల్లెకు చెందిన మునిశేఖర్ (64) ఈ నెల 2వ తేదీన మద్యం సేవించి వీధిలో వేసిన చలి మంటలో చలి కాచుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మూడు దుకాణాల్లో చోరీ చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని మూడు దుకాణాల్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. కట్టమంచిలోని ఓ ద్విచక్ర వాహన షోరూమ్, సూపర్ మార్కెట్, సిమెంటు దుకాణాల్లో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. దాదాపు రూ.50 వేల వరకు నగదు చోరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తప్పుడు సాక్ష్యంపై విచారణ చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ జంట హత్యల కేసులో న్యాయ స్థానంలో తప్పుడు సాక్ష్యం చెప్పిన కేసు విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తూ చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు – ప్రత్యేక మహిళా కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి డా.ఎన్.శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. కేసు విచారణలో భాగంగా తప్పుడు సాక్ష్యం చెప్పిన ఘటనలో 14 మంది శుక్రవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. వీళ్లల్లో ఏడుగురు రాత పూర్వక సంజాయిషీని న్యాయమూర్తికి అందించారు. మరో ఏడుగురు కొంత సమయం అడగడంతో వచ్చే నెల 2వ తేదీ వరకు సమయమిస్తూ, అదే రోజు కేసు విచారణ చేయనున్నట్లు ప్రకటించారు. సాఫ్ట్బాల్ పోటీలకు ప్రకాష్ ఐరాల: జాతీయస్థాయి సబ్ జూనియర్స్ సాఫ్ట్బాల్ పోటీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రకాష్ ఎంపికై నట్లు హెచ్ఎం వాసుదేవన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రకాష్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు వెల్లడించారు. పాకాల: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లి గ్రామంలోని నీటి ట్యాంకు కింద మృతదేహం కుళ్లిపోయి, కనిపించింది. మృతుడు వచ్చిన ద్విచక్ర వాహనం మండలంలోని పదిపుట్లబైలు సమీపంలో పంటపొలాల్లో పడి ఉంది. దీనిపై ఈ నెల 16న పాకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా స్కూటరిస్ట్ అడ్రస్ను తెలుసుకుని పీలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెల్డింగ్ షాపు యజమాని, మృతుని తల్లి ఇరువురూ స్కూటర్ వద్ద దొరికిన ఆధార్కార్డుతో మృతుడు చిత్తూరు జిల్లా, బంగారుపాళెం మండలం, జి.కురూపపల్లికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు డి.చిట్టిబాబుగా (24)గా గుర్తించారు. మృతుడు పీలేరులోని ఓ వెల్డింగ్ షాపులో హెల్పర్గా పనిచేసేవాడు. ఈ నెల 15 రాత్రి వెల్డింగ్ షాపు ఓనరు ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలు దేరాడు. -
‘సర్వే’శ్వరా?
ఇంటింటికీ వెళ్తూనే ఉండండి చిత్తూరు కలెక్టరేట్ : సచివాలయ ఉద్యోగులతో చంద్రబాబు ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పూటకొక సర్వే పేరుతో ఇంటింటికీ తిప్పుతోంది. తాజాగా మరో కొత్త సర్వేకు శ్రీకారం చుట్టడంపై పలువురు ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఈ సర్వేను నెల రోజుల్లో పూర్తి చేయాలంటూ ఆదేశాలివ్వడంపై మండిపడుతున్నారు. మూలిగే నక్కపై.. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఒక రకంగా వారిని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పది మంది చేయాల్సిన పనిని ఒకరికి అప్పగించి తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే 14 సర్వేలు, బీఎల్ఓ విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులపై మరో సర్వే భారం మోపింది. ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. సమగ్ర కుటుంబ, ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించాల్సి ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబంలోని ప్రతి సభ్యుని వివరాలను సేకరించాలి. ఈ నెల 15న సర్వే ప్రారంభించి జనవరి 12కు పూర్తి చేయాలి. సర్వేలో సేకరించాల్సిన సమాచారం వంద శాతం ఈ–కేవైపీ తప్పనిసరి. ప్రతి వ్యక్తి ఆధార్ ద్వారా వెరిఫై చేయాలి మొబైల్ యాప్ సమాచారాన్ని డిజిటల్గా నమోదు చేయాలి వ్యక్తిగత డేటా, కుటుంబ స్థాయి డేటా సేకరించాలి పేరు, లింగ (జెండర్), పుట్టిన తేదీ, ఆధార్ సేకరణ తప్పనిసరి మొబైల్ నంబరు– ఒక నంబరు ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. ప్రస్తుత చిరునామాను డాక్యుమెంట్ ఆధారంతో చెక్ చేయాలి నైపుణ్యాలు, వృత్తి, ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ రిపోర్ట్, డాక్యుమెంట్ల ద్వారా నిర్ధారణ చేసుకోవాలి. ఇంటి వివరాలు– నీటి సరఫరా, ఎల్పీజీ, విద్యుత్, టాయ్లెట్, రూఫ్ వంటివాటిని సర్వేయర్ వెరిఫై చేయాలి. ఇంటి యజమాని (హౌజ్హోల్డ్) కలిగి ఉన్న ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ సామగ్రి, పశువులు, తదితర వివరాల నమోదు చేయాలి. జిల్లా సమాచారం -
సమరశంఖమై!
సంతకమే.. చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువత, విద్యార్థులు చంద్రబాబు సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు లక్షలాది మంది మద్దతుగా నిలిచారు. అన్ని వర్గాలతో పాటు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి చంద్రబాబు సర్కార్ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులే దాదాపు... లక్షల మంది సంతకాలు చేశారంటే చంద్రబాబు సర్కారుపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన కూటమి సర్కార్పై సమరశంకం పూరించారు. వైద్య విద్యను గ్రామీణ, పట్టణ, పేద విద్యా ర్థులకు అందని ద్రాక్షగా మార్చేందుకు కుట్ర చేపన్నుతున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన వెల్లువ పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థులు పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. అప్పట్లోనే వీటి నిర్మాణానికి రూ.8500 కోట్లు వెచ్చించారు. అందులో మూడు వేల కోట్ల మేర ఖర్చుచేసి ఐదు మెడికల్ కళాశాలను ప్రారంభించారు. వందల సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు ప్రారంభమైన కళాశాలల్లో వైద్య విద్యనభ్యసిస్తున్నారు. మరో 12 వైద్య కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్ని పూర్తి కావొచ్చాయి. అయితే చంద్రబాబు సర్కారు వాటి నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా పీపీపీకి మొగ్గు చూపుతోంది. పీపీపీ విధానంతో ప్రైవేట్కు అప్పగించడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విధానాన్ని యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైద్య సీట్లు వద్దంటూ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడంపై భగ్గుమంటోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైద్య కళాశాలలను నిర్వీర్యం చేస్తోందని పెదవి విరుస్తోంది. -
గుట్టుగా మెరిట్ లిస్ట్?
కాణిపాకం: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అనుమతుల్లేకుండా ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీకి జిల్లా అధికారులు దరఖాస్తులు ఆహ్వనించారు. ఆపై స్క్రూట్నీ ప్రక్రియ తర్జన భర్జన నడుమ సాగించారు. తీరా కొన్ని పోస్టులకు మాత్రమే రాష్ట్ర శాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ గుట్టుగా జరిపిస్తున్నారు. ప్రొవిజన్ల్ మెరిట్లిస్టు జాబితాను ఆన్లైన్లో గోప్యంగా ఉంచారు. ఫైనల్ మెరిట్ లిస్టును గురువారం రాత్రికి పూర్తి చేశారు. ఆ ఫైల్ను శుక్రవారం కలెక్టర్ ముందు ఉంచనున్నారు. ఈ భర్తీపై అభ్యర్థుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఎన్హెచ్ఎం పోస్టులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అక్టోబర్లో దరఖాస్తులు ఆహ్వానించారు. మెడికల్ ఆఫీసర్ 13 పోస్టులు, స్టాఫ్ నర్సు 20 పోస్టులు, ఫైన్సాన్స్ కమ్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్ –1, ల్యాబ్ టెక్నీషియన్ –3, ఫిజియోథెరపిస్ట్– 1, ఆడియో మెట్రిషియన్– 2, శానిటరీ అటెండర్– 2, సపోర్టింగ్ స్టాఫ్– 4, సెక్యూరిటీ గార్డు –2, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్– 8 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు గాను మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చాయి. గోప్యమెందుకో? వచ్చిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నెల రోజులపాటు స్క్రూట్నీ చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు స్క్రూట్నీ ప్రక్రియను ముగించారు. 9వ తేదీ రాత్రి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును ఆన్లైన్లో పెట్టారు. అయితే ఆ జాబితాను బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. మీడియా, ఆ శాఖలోని పలువురు అధికారులకు కూడా తెలియకుండా ప్రొవిజనల్ మెరిట్లిస్టును నడిపించారు. ఈ నెల 14 వరకు అభ్యంతరాల స్వీకరణ చేయగా.. 18వ తేదీ రాత్రికి ఫైనల్ మెరిట్ లిస్టు సిద్ధం చేశారు. శుక్రవారం ఈ ఫైల్ను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లనున్నారు. అయితే ప్రొవిజన్ మెరిట్ లిస్టు ఆన్లైన్లో ఉంచిన విషయాన్ని గుర్తించలేకపోయామని పలువురు అభ్యర్థులు మదన పడుతున్నారు. పత్రిక ప్రకటన లేకుండా ఆన్లైన్లో ఎలా ఉంచారని వారు ప్రశ్నిస్తున్నారు. సిఫార్సు లేఖలకు తలొంచారా? ఎన్హెచ్ఎం పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం నుంచి సిఫార్సు లేఖలు 500పైగా సిఫార్సు లేఖలు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ లేఖలకు అధికారులు తలొంచారా.. లేదా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్నాయి. రెండు జిల్లాల్లో ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖకు ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నిజమైతే పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారే అవకాశాలున్నాయి.జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఎన్హెచ్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అభ్యర్థుల్లో అనుమానాలు పోస్టుల భర్తీ విషయంలో ముందుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రాష్ట్ర శాఖ అనుమతి తీసుకోలేదు. దరఖాస్తులు ఆహ్వానించిన విషయం పై అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. ఆపై ఫైల్ను తీసుకుని విజయవాడకు పరుగులు పెట్టారు. జిల్లా అధికారుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. చాలా పోస్టుల భర్తీపై కోతలు పెట్టారు. కొన్ని పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతులిచ్చారు. ఆ పెండింగ్ వివరాలను కూడా శాఖ అధికారులు ఇంతవరకు బయట పెట్టలేదు. కోటి ఆశాలతో దరఖాస్తు చేసుకుంటే.. ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
ఆర్థిక సంఘం నిధులు విడుదల
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాకు రూ.28.52 కోట్లు రాగా 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులను కేటాయించారు. జిల్లాలో 696 గ్రామ పంచాయతీలుండగా వాటిలో పలు కారణాలతో 13 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 683 పంచాయతీలకు నిధులను జమచేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మొదట ఆన్టైడ్ కింద రూ.11.4 కోట్లు, టైడ్ నిధి కింద రూ.17.11 కోట్లు కలిపి మొత్తం రూ.28.52 కోట్లను విడు దల చేశారు. వీటిని పంచాయతీల్లో విద్యుత్ చార్జీలు, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, శ్మశానవాటికల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఆ లెక్చరర్ను సస్పెండ్ చేయండి కార్వేటినగరం: డైట్ కళాఽశాలలో పనిచేస్తున్న ఆ లెక్చరర్ను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. డైట్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సురేష్ కొంతమంది లెక్చరర్లతో గ్రూపులు కట్టి లైంగికంగా వేధిస్తున్నారని, దసరా సెలవులకు ముందు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా మెసేజీలు పెట్టి ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నట్టు ప్రిన్సిపల్కు లిఖిత పూర్వకంగా ఫి ర్యాదు చేశారు. పలు మార్లు తీరు మార్చుకోవా లని ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో ప్రిన్సిపల్ వరలక్ష్మి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఆ మేరకు సురేష్ ను డైట్ కళాశాల నుంచి వెంటనే రిలీవ్ చేయా లని ఆదేశించారు. రిలీవ్ చేసి సస్పెండ్ చేయా లని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డొంక కదులుతోంది! – అవినీతి కేసులో సర్వేయర్, వీఆర్ఓ పుంగనూరు: స్థానిక గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములు రూ.20 వేలు లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో తాజాగా మండల సర్వేయర్తో పాటు ఆ గ్రామ వీఆర్ఓపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. రెండవ రోజు కూడా ఏసీబీ అధికారులు పుంగనూరులో మకాం వేశారు. మండల సర్వేయర్, వీఆర్ఓను విచారణకు రావాలని ఆదేశించగా.. వారు రాకపోవడంతో ఇద్దరిపైనా కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. కాగా తహసీల్దార్, సర్వేయర్ ఇద్దరూ సెలవులో వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలను సరికొత్త సంస్కరణలతో నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని ఇంటర్ బోర్డు ఈఆర్టీడబ్ల్యూ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ చాణుక్యుడు తెలిపారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలను కొత్త సంస్కరణలతో నిర్వహించనుందన్నారు. గురువారం అధికారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్తో స్థానిక విజయం ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రామాణిక విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇన్విజలేటర్లు, పర్యవేక్షక సిబ్బంది, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. డీఐఈఓ రఘుపతి మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, పారదర్శకంగా పరీక్షలు రాసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక ఐరాల: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలని ఆర్జేడీ శ్యామూల్ ఆదేశించారు. గురువారం మండలంలోని ఎం.పైపల్లె జెడ్పీ హైస్కూల్ను ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల అభ్యస సామర్థ్యాలపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. వంద రోజల ప్రణాళికతో పాటు అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పబ్లిక్ పరీక్షలకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నపత్రాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ప్రతి రోజూ ఓ పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించాలని, పరీక్ష అనంతరం జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి విద్యార్థుల సామర్థ్యాలు గుర్తించాలని ఆదేశించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం వైస్.గేటులోని ప్రాథమిక పాఠశాలకు కేంద్ర విద్యాశాఖ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్) రావడంతో పాఠశాలను ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. ఎంఈఓ–2 భానుప్రసాద్, ఏసీఎంఓ మధుసూదన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాన్ని వినియోగించుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్: వినియోగదారులు హక్కు ల పరిరక్షణ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. గురువారం నగరంలోని ఎన్పీఎస్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర, పరిష్కారం’ అంశంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ నష్టం జరిగినప్పుడు నేరుగా వినియోగదారుడే రూ.5లక్షల వరకు ఫీజు లేకుండా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చనన్నారు. నాణ్యత ప్రమాణాలులేని వస్తువులు, సేవా సంస్థల లోపంతో నష్టం వాటిలినప్పుడు ప్రశ్నించేతత్వం ఉండాలని ఏపీ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు రాజారెడ్డి తెలిపారు. మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఉషాదేవి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం–2019 విశిష్టమైందన్నారు. ఆన్లైన్ వ్యాపారంలో కూడా నష్టం జరుగుతోందని, వాటి పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, కళాశాల వినియోగదారుల క్లబ్ కో–ఆర్డినేటర్ రమాదేవి, ఫోరం సభ్యుడు సలీం పాల్గొన్నారు. -
అవగాహన లోపం.. ప్రజలకు కన్నీటి శాపం!
నక్కబండలో తాగునీటికి కటకట పుంగనూరు: అధికారుల అలసత్వం కారణంగా పది రోజులుగా ప్రజలు తాగునీటి కోసం అల్లాడాల్సి వస్తోంది. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని నక్కబండ ఏరియాలో 1,550 కుటుంబాలున్నాయి. ఇక్కడ పైపులైన్ల మరమ్మతుల పేరుతో పబ్లిక్ కొళాయిలను పెరికేశారు. డబ్బు కడితేనే కొళాయిలు వేస్తామంటూ మున్సిపల్ అధికారులు, కొంత మంది చోటీ టీడీపీ తెగేసి చెబుతున్నారు. దీంతో స్థానికులు పది రోజులుగా సరిపడా నీళ్లులేక అల్లాడుతున్నారు. దీనిపై మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంతమాత్రం ఆలోచించలేరా? మండల పరిధిలోని నక్కబండను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోకి చేర్పించారు. 1,550 కుటుంబాలు కలిగిన నక్కబండలో ముస్లిం మైనార్టీలు, దళితులు అధి క సంఖ్యలో నివాసం ఉన్నారు. ఆ ప్రాంతంలో మంచినీటి సర ఫరా ఇబ్బందిగా ఉందంటూ ప్రజలు పలుమార్లు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత పది రోజుల క్రితం నక్కబండలోని అన్ని పైపులైన్లను జేసీబీలతో తొలగించారు. కొత్త పైపులైన్లు వేసే కార్యక్రమం చేపట్టారు. ఒక్కొక్క ప్రాంతంలో మరమ్మతులు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలేదు. అన్ని వీధుల్లోని పైపులైన్లు, పబ్లిక్ కొళాయిలు పెరికివేశారు. దీంతో నీటి సమస్య తలెత్తింది. డబ్బు కడితేనే కనెక్షన్ మున్సిపల్ అధికారులు కొళాయి కనెక్షన్కు ఒక్కొక్కరూ రూ.7,500 చెల్లించాలని, లేకపోతే మంచినీటి సరఫరా చేయలేమని తెగేసి చెప్పారు. తాము కూలీలమని, బీపీఎల్ పథకం కింద రూ.500 చెల్లిస్తామని చెప్పినా అధికారులకు మనసు కరగలేదు. దీని కారణంగా పది రోజులుగా ఆ ప్రాంతంలో మంచినీరు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీ అభిమానులకు ఇబ్బందులు నక్కబండ ప్రాంతంలో ముస్లిం, మైనారిటీలు, దళితుల్లో ఎక్కువభాగం వైఎస్సార్సీపీ అభిమానులే. మున్సిపల్ అధికారులు కావాలనే నక్కబండ వాసులను వేధిస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా పబ్లిక్ కొళాయిలను కూడా పెరికివేయడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడం, ఆ ప్రాంత వాసుల ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. టీడీపీ చోటా నేతల దంద నక్కబండ ప్రాంతంలో ఓ టీడీపీ చోటా నాయకుడు దంద చేస్తున్నాడని, ఇద్దరు ఫిట్టర్లను నియమించి, వారి వద్ద నుంచి ఇంటికి రూ.100 చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మున్సిపల్ చైర్మన్ చర్చలు నక్కబండ ప్రాంతంలో తాగునీటి సమస్య ఏర్పడడంతో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా గురువారం కమిషనర్ మధుసూదన్రెడ్డితో పాటు ఆ ప్రాంత వాసులతో సమావేశమయ్యారు. అక్కడ ఉన్న పేదకూలీలందరికీ రూ.500తో కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ పరిశీలించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ అధికారుల ఓవర్ యాక్షన్ కారణంగా వందలాది కుటుంబాలకు తాగునీటి సమస్య ఏర్పడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. -
విధులకెళ్లి.. విగత జీవివయ్యావా తల్లీ!
పూతలపట్టు( యాదమరి): ‘పండు..డ్యూటీకి వెళ్తున్నా.. రేపు ఇంటికి రాగానే చిత్తూరులో షాపింగ్కు వెళ్దాం. అక్కడ నీకేమి కావాలో తీసిస్తా..’ అని చెప్పి విధులకు వెళ్లావు కదమ్మా.. ఇప్పుడు విగత జీవిగా మారావా తల్లీ అంటూ ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు .. పెనుమూరు మండలం, గుత్తావాండ్ల వూరు గ్రామానికి చెందిన వెంకటేష్నాయుడు భార్య గాయత్రి(30) పూతలపట్టు మండలం, పేటమిట్టలో ఓ కర్మాగారంలో విధులు నిర్వర్తిస్తోంది. బుధవారం యథావిధిగా విధులకు హాజరైంది. రాత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో తన సహచర ఉద్యోగినులతో పాటు స్వగ్రామానికి బయల్దేరింది. రంగంపేట క్రాస్ వద్ద పీలేరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఐషర్ వాహనం వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న గాయత్రితో పాటు.. మౌనిక, జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు గాయత్రి మార్గమధ్యంలో మృతి చెందింది. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూతలపట్టు సీఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. కుటుంబ పోషణ కోసం విధులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా.. అమ్మా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
బెల్టుషాప్పై దాడి
శ్రీరంగరాజుపురం: మండలంలోని కొత్తపల్లిమిట్ట ప్రాంతంలో ఉన్న బెల్టుషాపుపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 42 మద్యం బాటిళ్లు పట్టుపడ్డాయి. బెల్టుషాపు నిర్వహిస్తున్న భారతి అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. విద్యుద్దీపాల కోసం రూ.8 లక్షలు గుడిపాల: చిత్తూరు–వేలూరు రహదారిలోని మద్రాస్ క్రాస్ రోడ్డు నుంచి తమిళనాడు సరిహద్దు గొల్లమడుగు వరకు రోడ్డు పక్కన విద్యుత్ దీపాలు వేయడానికి కలెక్టర్ రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు ఆర్అండ్బీ ఎస్ఈ సురేష్బాబు తెలిపారు. గురువారం ఆ రహదారిని ఆయన పంచాయతీరాజ్ ఈఈతో చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.8 లక్షలు మంజూరు చేశారన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 50 వీధిలైట్లు అవసరమవుతాయన్నారు. పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్నాయుడు, ఎంపీడీఓ శిరీషా తదితరులు పాల్గొన్నారు. -
● కూలుస్తూ..తొలగిస్తూ!
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముందస్తు నోటీసులు ఇచ్చిన విగ్రహాలు, ఆలయాలతో పాటు పలు కట్టడాల తొలగింపును గురువారం నుంచి అధికారులు ప్రారంభించారు. తహసీల్దార్ రవికుమార్, సీఐ మల్లికార్జున్, జాతీయ రహదారి అధికారులు పోలీసు బలగాలతో ఉదయం నుంచే తొలగింపు పనులు ప్రారంభించారు. నేత్రదేవత ఆలయ ఆర్చి, కాకవేడు కూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం, ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రహరీగోడ, వీకేఆర్ పురం వద్ద గల ఓంశక్తి ఆలయ ప్రహరీ, నత్తం కండ్రి వద్ద గల శక్తి ఆలయ ప్రహరీలు, బస్ షెల్టర్లను ప్రొకై ్లన్లు, హిటాచీలు, క్రేన్ల సాయంతో తొలగించేశారు. కీళపట్టు వద్ద ఉన్న ఆంజేయ స్వామి ఆలయ తొలగింపులో నిర్వాహకులు ఆలయంలోని వస్తువులు పూర్తిగా తీసుకోలేదని, నాలుగు రోజులు సమయం ఇవ్వాలని, భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అలాగే పెకళించి మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటామని తహసీల్దార్కు విన్నవించుకున్నారు. దీంతో వారికి నాలుగు రోజుల సమయం కేటాయించారు. మిగిలిన నిర్మాణాల తొలగింపును జాతీయరహదారి అధికారులు చకచకా కానిచ్చేశారు. – నగరి -
నా ప్రాణం పోయినా.. పది మందీ బతకాలి!
● శ్రీనివాస్రెడ్డి అవయవదానం ● పలువురికి పునర్జన్మ వి.కోట: ‘నా ప్రాణం పోయినా పది మందీ బతకాలి’ అన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్లాడు. అందుకే బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యుఒడికి చేరినా.. ఆయన కుటుంబ సభ్యులు తన అడుగు జాడల్లోనే నడిచి పదుగురికి పునర్జన్మనిచ్చారు. వివరాలు.. మండలంలోని కొంగాటం పంచాయతీ, చింతల ఎల్లాగరానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రతాప్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డి(61) ఈ నెల 15వ తేదీ రాత్రి బైక్ పై వెళుతూ రాజపేటరోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. బెంగళూరులోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం బ్రెయిన్డెడ్కు గురయ్యాడు. కుటుంబ సభ్యలు గురువారం బెంగళూరుకు చేరుకుని శ్రీనివాసులు రెడ్డికి చెందిన గుండె, లివర్, కిడ్నీలు, కళ్లు, పాంకియాట్రీస్ను ఇతరులకు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఇతని అంత్యక్రియలు శుక్రవారం మండలంలోని చింతఎల్లాగరంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఎందుకు గైర్హాజరవుతున్నారు? చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి విద్యార్థులు దాదాపు వెయ్యి మందికిపైగా క్లాసులకు గైర్హాజరవుతున్నారని, వారు ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలని హెచ్ఎంలను డీఈఓ రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఆయన గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదోతరగతి విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించగా సీ, డీ గ్రూపు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులు 15,239 మంది ఉండగా 1,477 మంది గైర్హాజరవుతున్నారన్నారు. వీరందరూ ఎందుకు పాఠశాలలకు హాజరు కావడంలేదని సంబంధిత హెచ్ఎంలను ప్రశ్నించామన్నారు. వీరిలో ఎక్కువగా తవణంపల్లె, పూతలపట్టు, పలమనేరు ఇతర మండలాల వారు ఉన్నారన్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విషయం తెలుసుకోవాలని ఆదేశించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి పెనుమూరు(కార్వేటినగరం): పదో తరగతిలో వంద శాతం పలితాలు సాధించేలా విద్యాబోధన కొనగాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ సూచించారు. గురువారం పెనుమూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, గుడ్యానంపల్లి ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు అద్యధిక మార్కులతో వంద శాతం ఫలితాలు సాఽధించేలా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అదే విదంగా ఎమ్మార్సీకి వెళ్లి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. కొనసాగుతున్న టెట్ చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో టెట్ పరీక్షలు 9వ రోజు కొనగాయి. గురువారం ఉదయం 250 మందికి గాను 242 మంది, మధాహ్నం 85 మందికిగాను 68 మంది హాజరైనట్టు డీఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు. -
ప్రజలు క్షమించరు బాబూ!
చిత్తూరు రూరల్(కాణిపాకం): మెడికల్ కళాశాలలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు క్షమించరని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీ వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే 107, 108 జీవోలను రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలంన్నిటినీ నిర్వహిస్తామని మంగళగిరి పాద యాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తుంగలో తొక్కడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజారోగ్య రంగాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోని పది నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం జీ.వో నెంబర్ 590ని జారీ చేసినట్టు తెలిపారు. వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. నాయకులు గోపీనాథ్, మణి, దాసరి, చంద్ర, విజయగౌరీ, రమాదేవి, పెద్దరెడ్డి కవిత, జబిలబి, కుమారి, కోమల, బాలాజీరావు, లతారెడ్డి, గుర్రప్ప, రఘు, మునిరత్నం ఫైరోజ్, ప్రవీణ్కుమార్, వసంత్, రమ్య, చైతన్యశ్రీ, భార్గవ్ పాల్గొన్నారు. -
అవినీతి తిమింగలాలు
పుంగనూరు: పుంగనూరు రెవెన్యూలో అవినీతి తిమింగలాలు పట్టుబడ్డాయి. 20 సెంట్ల భూమి సర్వే చేసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.35 వేలు ఒప్పందం చేసుకుని, రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా గ్రామ సచివాలయ సర్వేయర్ను ఏసీబీ పట్టుకుంది. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఏసీబీ అడిషినల్ ఎస్పీ విమలకుమారి కథనం.. మండలంలోని మంగళం గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములును అదే గ్రామానికి చెందిన రైతు ఉమాశంకర్ 20 సెంట్ల పొలాన్ని సర్వేచేసి, సర్టిఫికెట్ ఇవ్వమని కోరారు. దీనిపై సర్వేయర్ రూ.50 వేలు ఇస్తే సర్వేచేసి, రెవెన్యూ సర్టిఫికెట్ ఇస్తామని, లేకపోతే చేసేది లేదని తెగేసి చెప్పాడు. అంత డబ్బు ఇవ్వలేనని రైతు ఉమాశంకర్ చెప్పాడు. పలు మార్లు రెవెన్యూ అధికారుల వద్దకు తిరిగినా ఫలితం లేకపోయింది. ఎలాగైన రెవెన్యూ అధికారుల అవినీతిని బయటపెట్టాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో రైతు ఉమాశంకర్ సర్వేయర్ వద్దకు వెళ్లి రూ.35 వేలకు బేరం కుదుర్చుకున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు ఉమాశంకర్ తహసీల్దార్ కార్యాలయంలో రూ.20 వేలు సర్వేయర్ శ్రీరాములుకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు పలురకాల ఫైళ్లను పరిశీలించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా సర్టిఫికెట్లను జారీచేసే అధికారం తహసీల్దాకు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయ అధికారులు కలసి సర్వేయర్ శ్రీరాములుతో ఈ పని చేయిస్తున్నారా?..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నిందితుడ్ని అదుపులోనికి తీసుకున్నారు. ఫోన్పేలోనే నేరుగా లంచాలు రైతులను బహిరంగంగా లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలోనే లంచాలు తీసుకున్నట్టు విమర్శలున్నాయి. ఈ మేరకు పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదే కోణంలో ఇద్దరు వీఆర్వోలు లంచాలను ఫోన్ పేలో వేసుకోగా కలెక్టర్ వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే ఏసీబీ దాడుల్లో సర్వేయర్ దొరకడం చర్చనీయాంశమైంది. పుంగనూరులో అవినీతి అనకొండలు పుంగనూరు రెవెన్యుశాఖలో అవినీతి తిమింగలాలు పాతుకుపోయాయి. గత ఏడేళ్ల క్రితం ఆర్ఐగా పనిచేస్తున్న ఉదయ్కుమార్ని ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అలాగే తహసీల్దార్ రెడ్డెప్పను కూడా అరెస్ట్ చేశారు. లంచాలు అడిగితే ఫిర్యాదు చేయండి పుంగనూరులోని ప్రభుత్వ అధికారులు ఎవరైన ఏ పనికై నా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అడిషినల్ ఎస్పీ విమలకుమారి తెలిపారు. ఫిర్యాదు చేసే వ్యక్తుల పేర్లను రహస్యంగా ఉంచుతామన్నారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకారం అందిస్తే ఉత్సాహంగా పనిచేసి అవినీతి అధికారుల భరతం పడుతామని తెలిపారు. అవినీతిపై 9440446190, 1064 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


