కేజీబీవీలలో పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలలో పటిష్ట భద్రత

Mar 25 2026 7:07 AM | Updated on Mar 25 2026 7:07 AM

● ముఖ్య ప్రాంతాల్లో కెమెరాలు: పాఠశాల ప్రధాన ద్వారం, కారిడార్లు, డైనింగ్‌ హాల్‌, ఖాళీ ప్రదేశాల్లో హై–డెఫినిషన్‌ సీసీ కెమెరాలను అమర్చారు. ● నిరంతర పర్యవేక్షణ: ఈ కెమెరాల ద్వారా వచ్చే విజువల్స్‌ను స్కూల్‌ ప్రిన్సిపల్‌ కార్యాలయంలోని మానిటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. జిల్లా స్థాయి అధికారులు సైతం వీటిని ఆన్‌లైన్‌ ద్వారా తనిఖీ చేసే సౌకర్యం కల్పించారు. ● భద్రతా సిబ్బందికి తోడు: ఇప్పటికే ఉన్న సెక్యూరిటీకి ఈ డిజిటల్‌ నిఘా అదనపు బలం చేకూర్చనుంది. రాత్రి సమయాల్లో సైతం స్పష్టమైన చిత్రాలను తీసే విధంగా ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను ఎంపిక చేశారు.

– నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో విద్యార్థినుల భద్రతను మరింత మెరుగు రిచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 8 కేజీబీవీల్లో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడంతో పాటు, క్రమశిక్షణను పర్యవేక్షించడం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టారు. 8 కేజీబీవీల పనితీరును జిల్లా కేంద్రంలోని సమగ్రశిక్ష శాఖ కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఏర్పా టు చేసిన మానిటర్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. మంగళవారం జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. సిబ్బంది పనితీరు, విద్యార్థుల ఆహార నాణ్యతను సీసీ కెమెరాల్లో పర్యవేక్షించవచ్చని తెలిపారు. కేజీబీవీ జీసీడీఓ ఇంద్రాణి పాల్గొన్నారు.

నిఘా నీడలో విద్యాలయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement