ఐపీఎల్‌ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు! | Karnataka MLAs Want IPL Tickets says We Are VIPs | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు!

Mar 26 2026 7:01 PM | Updated on Mar 26 2026 7:15 PM

Karnataka MLAs Want IPL Tickets says We Are VIPs

కర్టాటక అసెంబ్లీలో KSCAపై విమర్శలు

వీఐపీలు క్యూలో నిలబడలేరు

ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు, స్పెషల్‌ సీటింగ్‌

2026 ఐపీఎల్ సీజన్ (BCCI-IPL 2026) శనివారం  ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  శాసనసభలో  ఒక కీలక ప్రతిపాదన చేశారు. తమ లాంటి వీఐపీలు క్యూలో నిలబడలేరు కాబట్టి ప్రతీ మ్మెల్యేకు  కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఐదు టిక్కెట్లను అందించాలని కోరారు. హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.

హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ కశపనవర్  ప్రతీ ఎమ్మెల్యేకు ఐదు టికెట్లతోపాటు, శాసనసభ్యులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కూడా క్రికెట్‌ సంఘాన్ని కోరడం విశేషం. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంవారు  ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. వారికి అన్ని భద్రతలూ లభిస్తున్నాయి. ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నారు. కానీ వారు ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వారి కుటుంబాలకు ఐపీఎల్‌ టిక్కెట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు విఐపీలు కాబట్టి వారు  క్యూలో నిలబడలేరు వారి  5  టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోయినసారి  ప్రజలతోపాటు క్యూలోనే నిలబడి ఇబ్బందులు పడ్డాం. ఈసారి మాత్రం అలా జరగనివ్వమని  వ్యాఖ్యానించారు.

ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకంలో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని కూడా కశపనవర్ ఆరోపించారు. అందుకే తాము ప్రభుత్వాన్ని అభ్యర్థించాము. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో  లేవనెత్తిన ఈ విషయానికి తాము మద్దు తెలిపామనిఅవసరమైన చర్యలు తీసుకుని ఎమ్మెల్యేలకు కనీసం 5 టిక్కెట్లు జారీ చేయాలని స్పీకర్‌ను కోరామన్నారు.  వాళ్లు ఎవరి మాట వినరు. అంత పెద్దవాళ్లైపోయారు. డబ్బులు వసూలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంటూ  కశపనవర్ కేఎస్‌సీఏపై విమర్శలు గుప్పించారు.

అంతకుముందు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీకి చెందిన ఆర్.అశోక, కేఎస్‌సీఏపై ధ్వజమెత్తారు. నెలకు కేవలం రూ. 1,600 నామమాత్రపు ధరకు వారికి 16.32 ఎకరాలిచ్చాము. వారి దగ్గర కోట్ల రూపాయలున్నాయి కానీ వారు మ్యాచ్ టిక్కెట్ల కోసం తమ నుండి వేల రూపాయలు వసూలు చేసి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం మరో స్టేడియం నిర్మించాలను కుంటోంది. వారికి గుణపాఠం నేర్పాలి అంటూ అసెంబ్లీలో మండిపడ్డారు.

దీనిపై స్పందిస్తూ అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ సంస్థాగత జోక్యం చేసుకోవాలని సూచించారు. ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం తప్పక KSCAతో చర్చలు జరపాలన్నారు.  కొన్నిసార్లు ఎమ్మెల్యేలకు కేవలం ఒక టికెట్‌ మాత్రమే ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు వారి కుటుంబ సభ్యులకు కనీసం నాలుగు టికెట్లైనా ఇవ్వాలని వారికి స్పష్టం చేయాలని ఖాదర్ అన్నారు. 

ఇదీ చదవండి: క్లాస్‌రూంలోనే ప్రొఫెసర్‌ లవ్‌ ప్రపోజ్‌..కట్‌ చేస్తే, వీడియో వైరల్‌
 

డీకే హామీ
ఈ విషయాన్ని KSCA అధికారుల దృష్టికి తీసుకువెళతామని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సభకు హామీ ఇచ్చారు.  అధ్యక్షుడితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తాను. అడిగే హక్కు ఎమ్మెల్యేలకు పూర్తిగా ఉంది, వారికి ఆ ప్రయోజనం దక్కాల్సిందనని డీకే అన్నారు. అంతేకాదు "ఇది 'సమ్రాట్' అశోక్ నుండి వచ్చిన అభ్యర్థన అని తాను వారికి కచ్చితంగా చెబుతానంటూ సరదాకా కామెంట​ చేయడంతో సభలోనవ్వులు పూసాయి. కాగా 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 28వ తేదీ శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్‌ : పెట్రోలు రూ. 5 , డీజిల్‌ రూ. 3 పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement