ఇంటిలెక్క తేలుద్దాం | - | Sakshi
Sakshi News home page

ఇంటిలెక్క తేలుద్దాం

Mar 21 2026 5:02 AM | Updated on Mar 21 2026 5:02 AM

● గృహ గణన (ఏప్రిల్‌ 1 నుంచి మే 31) : వచ్చే నెల ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు నిర్వహించే మొదటి దశలో హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌న్‌ చేపట్టనున్నారు. ఇందులో జిల్లాలోని ప్రతి ఇంటికీ ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. ● సేకరించే వివరాలు : ఇంటి కట్టడం తీరు, ఫ్లోరింగ్‌, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ వినియోగం, గృహోపకరణాలు (ఏసీ, ఫ్రిజ్‌, టీవీ, ఇంటర్నెట్‌), వాహనాలు వంటి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ● డిజిటల్‌ నమోదు : సేకరించిన వివరాలను పాత పద్ధతిలో కాకుండా, కంప్యూటర్‌ మెయింటెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌శ్రీ (సీఎంఎంఎస్‌) ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ● జనాభా లెక్కల సేకరణ: గృహగణన పూర్తయిన తర్వాత రెండో దశలో జిల్లాలోని వ్యక్తుల వివరాల ను సేకరిస్తారు. కుటుంబ సభ్యుల సంఖ్య, వయ స్సు, విద్య, ఉపాధి వంటి గణాంకాలను సేకరించి జాతీయ స్థాయి అభివృద్ధి ప్రణాళికల రూపకల్ప నకు వీటిని ఆధారంగా తీసుకుంటారు. జన గణన సజావుగా సాగేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ప్రధాన సెన్సస్‌ అధికారిగా వ్యవహరిస్తారు. అదనపు సెన్సస్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా సెన్సస్‌ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) బాధ్యతలు నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. జనగణన అనేది కేవలం అంకెలు మాత్రమే కాదని, రాబోయే పదేళ్ల కాలానికి అవసరమైన సంక్షేమ పథకాలు, విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు ఇది ఆధారం. గృహ సందర్శనకు వచ్చే సిబ్బందికి ప్రజలందరూ సహకరించి, సరైన వివరాలను అందించాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది. మొదటి దశ గృహ గణన పూర్తయిన తర్వాత, రెండో దశలో ప్రధాన జనాభా గణన ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు మొదటి దశ ‘గృహ గణన’

రెండో దశలో జనాభా లెక్కల సేకరణ

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో

శిక్షణ పూర్తి

డిజిటల్‌ పద్ధతిలో వివరాల నమోదు

దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే

‘జనగణన–2027’ ప్రక్రియకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈసారి రెండు దశల్లో గణనను నిర్వహించనున్నారు. గ్రామ, పట్టణ స్థాయిల నుంచి జాతీయ స్థాయి వరకు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఈ గణాంకాలు దోహదపడనున్నాయి. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించడం ఆనవాయితీ. అయితే 2021లో నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. చివరి సారిగా 2011లో జనాభా లెక్కల సేకరణ చేయగా, ప్రస్తుతం కొత్తగా సేకరణకు చర్యలు చేపట్టారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో 2027 జనగణన ప్రక్రియకు సంబంధించి ముందస్తు కసరత్తు వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ గణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది.

మొదటి దశ :

రెండో దశ :

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా సమాచారం

మొత్తం జనాభా 5732,66చ.కి.మీ

జిల్లా విస్తీర్ణం 16,43,224

రెవెన్యూ డివిజన్‌లు 4

అర్బన్‌ జనాభా 3,13,898

రూరల్‌ జనాభా 13,29,326

అసెంబ్లీ నియోజకవర్గాలు

5 (పూర్తి), 2 (పాక్షికం)

మండలాలు 28

రెవెన్యూగ్రామాలు 762

ఎస్సీలు 3,61,461

ఎస్టీలు 44,367

‘జనగణన’కు కసరత్తు

పకడ్బందీగా చేస్తాం

జిల్లా వ్యాప్తంగా జనగణన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఉన్నతాధికారులు ఇచ్చిన షెడ్యూల్‌, నియమ, నిబంధనల ప్రకారం ఈ కసరత్తు చేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇందుకు ప్రత్యేక సిబ్బంది, పర్యవేక్షణకు అధికారులను నియమించారు. జనగణన ప్రక్రియపై ఇటీవలే శిక్షణ పూర్తి చేశాం. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నాం. – సుమిత్‌ కుమార్‌ గాంధీ, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement