breaking news
Sports
-
ఓటమి అంచుల నుంచి...
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో అమెరికా యువ తార, 2023 చాంపియన్ కోకో గాఫ్ రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా)తో 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ చివరి క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ కోకో గాఫ్ 2–6, 7–6 (9/7), 6–2తో గెలిచింది. రెండో సెట్ టైబ్రేక్లో కోకో గాఫ్ 5–6తో, 6–7తో ఓటమి ప్రమాదాన్ని ఎదుర్కొంది. అయితే ఈ రెండుసార్లు కోకో పాయింట్లు గెలిచి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత టైబ్రేక్లో పైచేయి సాధించి మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో మాత్రం కోకో గాఫ్ పూర్తి ఆధిపత్యం చలాయించి ఆండ్రీవా ఆట కట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్స్లో పెగూలా (అమెరికా)తో సబలెంకా (బెలారూస్); రిబాకినా (కజకిస్తాన్)తో కోకో గాఫ్ తలపడతారు. సెమీస్లో జ్వెరెవ్, ఖచనోవ్ పురుషుల సింగిల్స్లో టాప్ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), అన్సీడెడ్ ఖచనోవ్ (రష్యా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 6–2, 7–5, 6–1తో గెలుపొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 6–2, 7–5, 3–2తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం) గాయం కారణంగా వైదొలిగాడు. -
‘పోరాటం కొనసాగిస్తా’
చెన్నై: భారత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ తన పోరాటాన్ని వదలడం లేదు. దేశవాళీ క్రికెట్లో తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడుతూ మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో పాటు తన ఫిట్నెస్ను కూడా చూపిస్తున్నాడు. తాజాగా ఈస్ట్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ గెలుచుకోవడంలో షమీ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికిప్పుడు ఆట నుంచి తప్పుకునే ఉద్దేశం అతనిలో కనిపించడం లేదు. ఎన్నో రకాలుగా తాను ప్రేరణ పొందుతున్నానని, భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో మెరుగైన ప్రదర్శనపై గురి పెట్టినట్లు షమీ చెప్పాడు. ‘కెరీర్లో నేను ప్రస్తుతం ఉన్న దశలో నాకు నేనే స్ఫూర్తిని పొందడం ఎంతో అవసరం. నేను ఆటపై మరింత దృష్టి పెట్టే దిశగా ప్రేరణ పొందేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అలా చేయకుంటే మన ఆలోచనా ధోరణిదే తప్పు. ప్రస్తుతం ఏ స్థాయిలో ఆడుతున్నా సరే, మన దృష్టి, లక్ష్యం అంతా మరింత పైస్థాయికి చేరడం గురించే ఉండాలి’ అని షమీ వ్యాఖ్యానించాడు. స్థాయి ఏదైనా ఒకటే... గత గురువారమే తన 36వ పుట్టిన రోజు జరుపుకున్న షమీ... ఏ స్థాయిలోనైనా కష్టపడేందుకు తాను సిద్ధమని వెల్లడించాడు. ‘క్రికెట్లో ఒక టీమ్కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమైన తర్వాత అది ఏ స్థాయి అనేది అనవసరం. బాగా ఆడాలనే కసి, పోరాడేతత్వం సహజంగానే వస్తాయి. మానసికంగా కూడా నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నా. ఏ స్థాయిలో మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు పట్ల నా బాధ్యత నెరవేరుస్తా’ అని అతను చెప్పాడు. దులీప్ ట్రోఫీలో ఫైనల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అనుకూలంగా లేని పిచ్పై కూడా ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఉండటం వల్లే రాణించగలిగానని షమీ పేర్కొన్నాడు. ‘నేను కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. బౌన్స్ తక్కువగా ఉండే ఇలాంటి పిచ్పై సాంప్రదాయ స్వింగ్ కూడా పెద్దగా ఫలితం ఇవ్వదు. కాబట్టి లైన్ అండ్ లెన్త్కు కట్టుబడి ఉండటంపైనే దృష్టి పెట్టా. అప్పుడు వికెట్లు తీసేందుకు అవకాశం కలిగింది. పరిస్థితులు అనుకూలంగా లేని చోటనే అసలైన సవాల్ ఎదురవుతుంది. ఎంతో శ్రమిస్తే గానీ వికెట్ దక్కదు. అలాంటి పక్కా వ్యూహంతోనే రషీద్ వికెట్ దక్కింది’ అని ఈ పేసర్ తన వ్యూహాన్ని వివరించాడు. ఈ విజయం ప్రత్యేకం... తన 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ గెలుచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని అతను అన్నాడు. ఈ గెలుపు కోసం టీమ్లో తనతో పాటు ఇతర ఆటగాళ్లంతా ఎంతో శ్రమించారని షమీ అభిప్రాయపడ్డాడు. ‘ఈస్ట్ జోన్ చాలా సంవత్సరాల తర్వాత దులీప్ ట్రోఫీ నెగ్గింది. అదీ నా 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం చాలా సంతృప్తినిచ్చింది. నా మొదటి మ్యాచ్లో ఎంత కష్టపడ్డానో ఇప్పుడు కూడా అలాగే కష్టపడ్డా. మేం ఎంత బాగా ఆడామో అంతా చూశారు. జట్టులోని ప్రతీ సభ్యుడు తన వంతు పాత్ర పోషించారు. కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వీరంతా ఇప్పటికే ఐపీఎల్ తదితర టోర్నీల ద్వారా మంచి అనుభవం గడించారు. ఒత్తిడి లేకుండా పరిణతితో ఆడుతున్నారు. ముఖ్యంగా వైభవ్లో తన వయసుకు తగిన అమాయకత్వం ఉండటమే కాదు, తొందరగా నేర్చుకోవాలనే తపన కూడా కనిపిస్తోంది. నా కెరీర్ ఎంత ఉందో నీ వయసు అంతే ఉంది అంటూ అతడితో సరదాగా మాట్లాడేవాడిని’ అని షమీ తన అనుభవాన్ని వివరించాడు. నాకు తెలిసింది ఆట మాత్రమే... టీమిండియా తరఫున మార్చి 2025లో తన చివరి మ్యాచ్ ఆడిన షమీ... 2023 తర్వాత టెస్టు క్రికెట్లో బరిలోకి దిగలేదు. కెరీర్ చివరి దశలో ఉన్న షమీ తనకు ఇటీవల లభిస్తున్న మద్దతుపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘నాపై చాలా మంది చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞుడను. ఇలాంటి మద్దతు లభించడం చాలా బాగుంది. కష్టపడి పని చేయడమే నాకు తెలిసింది. ఆపై అంతా దేవుడి చేతుల్లోనే ఉంది’ అని షమీ వ్యాఖ్యానించాడు. సుమారు 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 197 మ్యాచ్లు ఆడిన షమీ మొత్తం 462 వికెట్లు పడగొట్టాడు. -
అనాహత్పై ఆశలు
న్యూఢిల్లీ: భారత యువ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ ఆసియా క్రీడల్లో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ వరుస టైటిల్స్ సాధిస్తున్న 18 ఏళ్ల అనాహత్ .. జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. తద్వారా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 19 నుంచి జరగనున్న ఆసియా క్రీడల మహిళల స్క్వాష్ సింగిల్స్లో అనాహత్కు మూడో సీడ్ దక్కింది. ఇక పురుషుల సింగిల్స్లో భారత ప్లేయర్ అభయ్ సింగ్ రెండో సీడ్గా బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జూలై 13 నాటి ర్యాంకింగ్ల ఆధారంగా ఆసియా క్రీడల నిర్వాహకులు గురువారం ‘సీడ్’లు కేటాయించారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఏషియన్ గేమ్స్లో బంగారు పతకం గెలిచిన ప్లేయర్లు 2028 ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించనున్నారు. దీంతో ఈ గేమ్స్లో పోటీ మరింత తీవ్రతరం కానుంది. జూనియర్ ప్రపంచ చాంపియన్ టైటిల్ నెగ్గిన తొలి భారత ప్లేయర్గా రికార్డు సృష్టించిన అనాహత్... ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనాహత్కు ఏషియన్ గేమ్స్లో మలేసియా ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ శివసంగరి సుబ్రమణియం, జపాన్కు చెందిన ఆరో ర్యాంకర్ సతోమి వతనాబెతో ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన లండన్ క్లాసిక్ క్వార్టర్ ఫైనల్లో శివసంగరి చేతిలో అనాహత్ ఓటమి పాలైంది. కాగా... అనాహత్ ప్రస్తుత ఫామ్ కొనసాగిస్తే సింగిల్స్లో ఇప్పటి వరకు భారత్కు అందని ద్రాక్షలా ఊరిస్తున్న పసిడి పతకం ఈసారి దరిచేరే అవకాశాలున్నాయి. ఇక మహిళల సింగిల్స్లో పోటీ పడుతున్న మరో భారత ప్లేయర్ తన్వీ ఖన్నాకు ఏడో సీడ్ లభించింది. పురుషుల సింగిల్స్లో అభయ్కు రెండో సీడ్ దక్కగా... వీర్ చొత్రాని నాలుగో సీడ్గా బరిలోకి దిగనున్నాడు. వరుసగా ఏడోసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న సీనియర్ ప్లేయర్ జోష్నా చినప్ప... మిక్స్డ్ డబుల్స్, మహిళల టీమ్ ఈవెంట్లలో పోటీపడనుంది. అభయ్, వీర్, సెంథిల్కుమార్, సూరజ్ కుమార్ చంద్లతో కూడిన భారత పురుషుల జట్టుకు టాప్ సీడ్ దక్కగా... అనాహత్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు మూడో సీడ్గా బరిలోకి దిగనుంది. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు, మిక్స్డ్ డబుల్స్ జోడీ పసిడి పతకాలు గెలిచాయి. -
తొమ్మిది రోజుల ముందే...
టోక్యో: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కాకపోయినా... కొన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి. జపాన్ వేదికగా ఈ నెల 19 నుంచి ఏషియన్ గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉండగా... బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్రికెట్, హాకీ, మోడర్న్ పెంటాథ్లాన్ క్రీడల్లో పోటీలు ముందే మొదలవుతున్నాయి. ప్రధాన పోటీల ప్రారంభానికి తొమ్మిది రోజుల ముందు గురువారం పురుషుల బాస్కెట్బాల్లో ఖతార్ జట్టు ఇరాన్పై విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన ఈ పోరులో ఖతార్ 59–35 పాయింట్ల తేడాతో ఇరాన్ను చిత్తు చేసింది. ఒలింపిక్స్ కన్నా ఎక్కువ మంది అథ్లెట్లు ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. 43 క్రీడాంశాల్లో 17 వేల మందికి పైగా అథ్లెట్లు, క్రీడాధికారులు భాగస్వాములు కానున్నారు. సెపె్టంబర్ 19న క్రీడల ఆరం¿ోత్సవం నిర్వహించనుండగా... మరుసటి రోజు నుంచి పతక పోటీలు జరుగుతాయి. 1994 తర్వాత తొలిసారి జపాన్ ఈ క్రీడలకు ఆతిథ్యమిస్తుండగా... అనేక క్రీడాంశాల్లో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు ఈ పోటీలు అర్హత ప్రమాణాలు కానున్నాయి. అయితే ప్రస్తుతం జపాన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అథ్లెట్లకు ఇబ్బందులు తప్పేలాలేవు. మంగళవారం భారీ వర్షం కారణంగా అథ్లెట్ల ప్రాక్టీస్కు తీవ్ర అంతరాయం వాటిల్లింది. అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు కొనసాగనున్నాయి. భారత యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మర్ యూ జిది, ఫిలిప్పైన్ టెన్నిస్ సంచలనం అలెగ్జాండ్రా ఇయాలా ఈ క్రీడల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. -
భారత జట్టు సాధన మొదలు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై టి20 సిరీస్కు భారత్ సన్నద్ధమైంది. ఆదివారం నుంచి జరిగే 3 మ్యాచ్ల టి20 సిరీస్లో అఫ్గానిస్తాన్తో భారత్ తలపడుతుంది. జింబాబ్వేపై 3–0తో సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా బరిలోకి దిగుతున్న టి20 సిరీస్ ఇదే. ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ముగ్గురు ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి తమ ఫిట్నెస్ను నిరూపించుకున్నారు. ఈ ముగ్గురు మ్యాచ్ ఫిట్గా ఉన్నారని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నిర్ధారించింది. భారత జట్టులోని 10 మంది సభ్యులు గురువారం సుదీర్ఘ సమయం పాటు సాధనలో పాల్గొన్నారు. హెడ్ కోచ్ గంభీర్, స్పిన్ బౌలింగ్ కోచ్ బహుతులే పర్యవేక్షణలో స్పిన్నర్లు సుందర్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత నెట్ బౌలర్ల సహాయంతో సుందర్ బ్యాటింగ్ కూడా చేశాడు. ఇతర నెట్స్లో అక్షర్, బిష్ణోయ్ల బౌలింగ్లో సంజు సామ్సన్, అభిషేక్ శర్మ దూకుడైన షాట్లు ఆడుతూ తమ ప్రాక్టీస్ను కొనసాగించారు. బుమ్రా, నితీశ్ శుక్రవారం జట్టుతో చేరతారు. పేస్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఈ సెషన్కు గైర్హాజరయ్యాడు. భారత్లో అతని వర్కింగ్ వీసా గడువు ముగిసిందని, దక్షిణాఫ్రికాకు వెళ్లి రెన్యువల్ చేయించుకున్న తర్వాత తిరిగి వస్తాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. మరో వైపు టీమిండియా ఫిజియో కమలేశ్ జైన్పై బీసీసీఐ వేటు వేసింది. గత కొన్ని నెలలుగా భారత క్రికెటర్లంతా తరచుగా గాయాలబారిన పడుతుండటంతో కమలేశ్ వైఫల్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ బోర్డు అతడినితప్పించింది. హర్షిత్ స్థానంలో యశ్ ఠాకూర్... కండరాల గాయంతో భారత జట్టుకు దూరమైన పేసర్ హర్షిత్ రాణా కోలుకోలేదు. సీఓఈలో రీహాబిలిటేషన్లో ఉన్న అతనికి ఇప్పుడు కొత్తగా మరో గాయమైంది. దాంతో అఫ్గనిస్తాన్తో సిరీస్తో పాటు ఆసియా క్రీడలకు కూడా హర్షిత్ దూరమయ్యాడు. అతని స్థానంలో యశ్ ఠాకూర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇటీవల జింబాబ్వేతో సిరీస్లో అరంగేట్రం చేసిన ఠాకూర్ 2 టి20లు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఆదివారం ఢిల్లీలో తొలి టి20 మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశ రాజధానిలో ‘బ్రిక్స్’ సమావేశం కారణంగా స్థానిక పోలీసులు భద్రత కలిగించడం కష్టమవుతుంది కాబట్టి మ్యాచ్ను వాయిదా వేయాలనే చర్చ జరిగినా... పోలీసులతో ఢిల్లీ క్రికెట్ సంఘం చర్చల అనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. -
స్టార్ ఆటగాళ్లతో బ్రెజిల్ రాక
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత్లో భారత జట్టుతో జరిగే అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొనే బ్రెజిల్ ఫుట్బాల్ జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన బ్రెజిల్ జట్టులో స్టార్ ఆటగాళ్లు వినిసియస్ జూనియర్, రఫినా, మార్కినోస్లను ఎంపిక చేయడం విశేషం. ఇటీవల జరిగిన ప్రపంచకప్లో వినిసియస్ నాలుగు గోల్స్ సాధించి బ్రెజిల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియం వేదికగా అక్టోబర్ 3న భారత్, బ్రెజిల్ సీనియర్ జట్ల మధ్య తొలిసారి ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. భారత్తో మ్యాచ్కు ముందు బ్రెజిల్ జట్టు ఆ్రస్టేలియాలో పర్యటిస్తుంది. బ్రెజిల్, ఆ్రస్టేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 25న తొలి మ్యాచ్, సెపె్టంబర్ 29న రెండో మ్యాచ్ జరుగుతుంది. -
Womens Asia Cup 2026: షఫాలీ మెరుపులతో ఫైనల్కు భారత్
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు అజేయ ప్రదర్శన కొనసాగింది. లీగ్ దశలో ఎదురులేకుండా సాగిన టీమ్ సెమీఫైనల్లోనూ మరో బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్ను 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించింది.అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులకే పరిమితమైంది. షోర్నా (22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, దీప్తి శర్మ 3, నందని 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టి20ల్లో 50 వికెట్లు (29 మ్యాచ్ల్లో) పూర్తి చేసుకుంది. నేడు పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో హర్మన్ప్రీత్ బృందం ఆడుతుంది. నాలుగు లైఫ్లు... స్మృతి మంధాన (2) తొందరగానే వెనుదిరిగినా, షఫాలీ ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టింది. సుల్తానా ఓవర్లో వరుసగా ఆమె రెండు సిక్స్లు కొట్టగా, పవర్ప్లేలో స్కోరు 45 కు చేరింది. నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టిన షఫాలీ 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత సుల్తానా ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన షఫాలీ తర్వాతి బంతికి వెనుదిరిగింది. షఫాలీ వర్మకు ఏకంగా 4 లైఫ్లు లభించడం భారత్కు కలిసొచ్చింది. ఆమె స్కోరు 6, 11, 56 వద్ద సులువైన క్యాచ్లు వదిలేసిన బంగ్లా ఫీల్డర్లు... 50 వద్ద కూడా సులువైన రనౌట్ అవకాశాన్ని చేజార్చారు. ఛేదనలో ఏ దశలోనూ బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగలేదు. తొమ్మిది పరుగుల వ్యవధిలో తొలి రెండు వికెట్లు కోల్పోయిన జట్టు... కొంత విరామం తర్వాత 17 పరుగుల వ్యవధిలో తర్వాతి 3 వికెట్లు చేజార్చుకొని కోలుకోలేకపోయింది.10 ఆసియా కప్ చరిత్రలో భారత జట్టు ఫైనల్కు చేరడం ఇది పదోసారి కావడం విశేషం. 2004 నుంచి 2008 వరకు వన్డే ఫార్మాట్లో నాలుగుసార్లు ఆసియా కప్ జరగ్గా నాలుగుసార్లూ భారత జట్టే విజేతగా నిలిచింది. 2012 నుంచి 2024 వరకు టి20 ఫార్మాట్లో ఆసియా కప్ నిర్వహించారు. భారత జట్టు మూడుసార్లు (2012, 2016, 2022) టైటిల్ నెగ్గి, రెండుసార్లు (2018, 2024) రన్నరప్గా నిలిచింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) షోర్నా (బి) సుల్తానా 2; షఫాలీ (సి) (సబ్) ఫర్జానా (బి) సుల్తానా 64; ప్రతీక (సి) దిలారా (బి) రాబియా 20; హర్మన్ప్రీత్ (నాటౌట్) 24; రిచా (స్టంప్డ్) నిగార్ (బి) నాహిదా 21; దీప్తి (సి) రాబియా (బి) మారుఫా 13; భారతి (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–9, 2–59, 3–92, 4–128, 5–149, 6–149. బౌలింగ్: మారుఫా 4–0–40–1, సుల్తానా 3–0–30–2, నాహిదా 4–0–25–1, రాబియా 4–0–22–1, ఫహీమా 4–0–21–0, షోర్నా 1–0–10–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: దిలారా (సి) క్రాంతి (బి) దీప్తి 21; జువేరియా (సి) రిచా (బి) శ్రీచరణి 14; శోభన (బి) దీప్తి 18; నిగార్ (సి) నందని (బి) ప్రేమ 19; షోర్నా (నాటౌట్) 22; షర్మీన్ (బి) దీప్తి 1; ఫహీమా (సి) ప్రేమ (బి) నందని 14; రాబియా (హిట్వికెట్) (బి) నందని 0; ఎక్స్ట్రాలు 0; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 109. వికెట్ల పతనం: 1–26, 2–35, 3–66, 4–76, 5–83, 6–109, 7–109. బౌలింగ్: క్రాంతి 2–0–13–0, నందని 2–0–10–2, శ్రీచరణి 4–1–14–1, షఫాలీ 4–0–25–0, ప్రేమ 4–0–21–1, దీప్తి 4–0–26–3. -
షఫాలీ విధ్వంసం.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?
మహిళల ఆసియా కప్ 2026లో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్లో ఆడిన జట్లనే యధాతథంగా కొనసాగించారు.షఫాలీ విధ్వంసంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓ మోస్తరు స్కోర్కే (149-6) పరిమితమైంది. స్టార్ ప్లేయర్, ఓపెనర్ స్మృతి మంధన (2) త్వరగా ఔటైనా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగింది. మిగతా ప్లేయర్లలో ప్రతీకా రావల్ 20 (24 బంతుల్లో ఫోర్, సిక్సర్), కెప్టెన్ హర్మన్ప్రీత్ 24 (నాటౌట్), రిచా ఘోష్ 21 (16 బంతుల్లో 2 సిక్సర్లు), దీప్తి శర్మ 13 (6 బంతుల్లో ఫోర్, సిక్సర్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా అక్తర్ 2, రబెయా ఖాన్, మరుఫా అక్తర్, నహిద అక్తర్ తలో వికెట్ పడగొట్టారు.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), దీప్తి శర్మ, భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(w), ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మబంగ్లాదేశ్: దిలారా అక్తర్, జువైరియా ఫెర్దౌస్, శోభనా మోస్తరీ, నిగర్ సుల్తానా(w/c), షర్మిన్ అక్తర్, షోర్నా అక్తర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్తర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్తర్చదవండి: ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం.. మూడో టెస్ట్లోనూ పాక్కు మూడినట్టే..! -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో టీమిండియాను ఇబ్బందిపెట్టిన ప్లేయర్
ఇటీవల భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషా ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్ట్) అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్ముద్తో కలిసి దినుషా ఈ అవార్డు కోసం పోటీ పడనున్నాడు.ప్రస్తుతం దినుషా పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. భారత్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో అతడు ఏకంగా 420 పరుగులు (140 సగటు) చేశాడు. భారత్తో సిరీస్కు ముందు దినుషా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. తన టెస్టు కెరీర్లో తొలి ఐదు ఇన్నింగ్స్ల్లో అతడి ఖాతాలో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే ఉంది.అయితే భారత్తో సిరీస్లో మాత్రం దినుషా పూర్తిగా భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. గాలేలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన సెంచరీ సాధించిన దినుషా.. రెండో ఇన్నింగ్స్లోనూ 84 పరుగులతో రాణించాడు. అయితే ఆ మ్యాచ్లో శ్రీలంక 165 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్లో 0-1తో వెనుకబడిన శ్రీలంకకు రెండో టెస్టులో దినుషా అండగా నిలిచాడు.ఒకే టెస్టులో రెండు సెంచరీలుకొలంబోలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక టెస్టులో దినుషా మరోసారి చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 162 బంతుల్లో 103 పరుగులు.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు గంటలకు పైగా క్రీజులో నిలిచి 264 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తద్వారా శ్రీలంకను ఓటమి నుంచి కాపాడాడు.రాబిన్సన్ విషయానికొస్తే.. ఆగస్ట్ నెలలో పాకిస్తాన్తో జరిగిన రెండు టెస్టుల్లో అతడు 16 వికెట్లు పడగొట్టాడు. రాబిన్సన్ ప్రదర్శనల కారణంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.మరోవైపు బంగ్లా ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్ముద్ ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేశాడు. డార్విన్లో జరిగిన మ్యాచ్లో 9 వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..? -
ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం.. మూడో టెస్ట్లోనూ పాక్కు మూడినట్టే..!
స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే తొలి రెండు టెస్ట్లను గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్లోనూ భారీ విజయం సాధించేలా కనిపిస్తుంది.ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 133 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 453 పరుగుల భారీ స్కోర్ చేసి, 320 పరుగుల ఆధిక్యం సాధించింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు (ఎమిలియో గే (60), హ్యారీ బ్రూక్ (75), డాన్ లారెన్స్ (65), జేమీ స్మిత్ (69), ఓల్లీ రాబిన్సన్ (50)) ఆటగాళ్లు అర్ద సెంచరీలు సాధించారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ మెరుపు ఇన్నింగ్స్ (32 నాటౌట్) ఆడాడు. మిగతా ప్లేయర్లలో బెన్ డకెట్ 11, జోర్డన్ కాక్స్ 4, కెప్టెన్ రూట్ 8, అట్కిన్సన్ 19, టంగ్ 15 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో రజావుల్లా 4, మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ అలీ తలో రెండు, మొహమ్మద్ అబ్బాస్ ఓ వికెట్ తీశారు.133 పరుగులకే కుప్పకూలిన పాక్అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్లో 133 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు ఓల్లీ రాబిన్సన్ (3-15), జోఫ్రా ఆర్చర్ (3-25), జోష్ టంగ్ (4-42) ధాటికి పేకమేడలా కూలింది.పాక్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు (సౌద్ షకీల్ (43), మొహమ్మద్ అబ్బాస్ (21), రజావుల్లా (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్గా చెప్పుకునే బాబర్ ఆజం 7 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా ప్లేయర్లలో సైమ్ అయూబ్ 0, అజాన్ అవైస్ 9, అబ్దుల్లా షఫీక్ 3, షాన్ మసూద్ 5, ఘాజీ ఘోరి 4, మొహమ్మద్ ఇమ్రాన్ 5 పరుగులు మాత్రమే చేశారు.చదవండి: ఫిన్ అలెన్కు జాక్పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు -
టీమిండియా బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..!
మహిళల ఆసియా కప్ 2026లో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్లో ఆడిన జట్లనే యధాతథంగా కొనసాగించారు.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), దీప్తి శర్మ, భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(w), ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మబంగ్లాదేశ్: దిలారా అక్టర్, జువైరియా ఫెర్దౌస్, శోభనా మోస్తరీ, నిగర్ సుల్తానా(w/c), షర్మిన్ అక్తర్, షోర్నా అక్టర్, ఫాహిమా ఖాతున్, నహిదా అక్టర్, రబెయా ఖాన్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్టర్చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..? -
ENG vs PAK: ఫిక్సింగ్ ఆరోపణలు.. నోటీసులు జారీ!
సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ క్రికెట్ గురించి రోజుకో కొత్త వార్త తెరమీదకు వస్తోంది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్కు పాక్ జాతీయ సైబర్ నేర దర్యాప్తు సంస్థ (NCCIA) నోటీసులు ఇచ్చిందని తాజా సమాచారం.ఏడుగురిని తప్పించి..కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా... పాక్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. మూడో టెస్టుకు ముందు ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది.కోచింగ్ స్టాఫ్పైనా వేటుఅంతేకాదు టెస్టు హెడ్కోచ్ పదవి నుంచి సర్ఫరాజ్ అహ్మద్ను అర్ధాంతరంగా తప్పించిన పాక్ బోర్డు.. బౌలింగ్ కోచ్గా ఉమర్ గుల్ను తొలగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన మిస్బా ఉల్ హక్ సెలక్టర్ పదవికి రాజీనామా చేశాడు.ఇదిలా ఉంటే.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గాయం సాకు చూపి రెండో టెస్టులో బ్యాటింగ్ చేయకుండా తప్పించుకున్నాడని.. ఫిక్సింగ్లో భాగంగానే ఇలా చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజ్వాన్ సైతం క్రమశిక్షణను ఉల్లంఘించాడని పాక్ మీడియాతో కథనాలు వచ్చాయి.నక్వీ ఆదేశాలతోనే?ఈ క్రమంలో తాజాగా జియో టీవీ మరో బాంబు పేల్చింది. ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్లకు NCCIA నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. అధికారులు వీరిద్దరిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించినట్లు పేర్కొంది. కాగా NCCIA పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ పరిధిలో ఉంటుంది. ఈ శాఖకు మోసిన్ నక్వీ మంత్రి అన్న సంగతి తెలిసిందే.అంతేకాదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా నక్వీనే చైర్మన్. ఈ నేపథ్యంలో NCCIA ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్లకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీరిద్దరితో పాటు మరో పాక్ క్రికెటర్ను కూడా అధికారులు విచారించనున్నట్లు సమాచారం. ఫిక్సింగ్ అనుమానాలుఇదిలా ఉంటే.. లార్డ్స్లో ఇంగ్లండ్తో రెండో టెస్టు తర్వాత పాక్ బోర్డు ఇమామ్, రిజ్వాన్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిక్సింగ్కు సంబంధించిన ఆధారాలు మొబైల్లో ఉన్నాయని.. అందుకే NCCIA సైతం ఆ దిశగా విచారణ మొదలుపెట్టిందనే ప్రచారం జరుగుతోంది.చదవండి: గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..?
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అనుకోని సమస్య ఎదురైంది. సిరీస్లోని తొలి మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ను, భద్రతా కారణాల దృష్ట్యా ఒక రోజు వెనక్కి జరిపే అంశాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.తొలి టీ20 షెడ్యూలైన సెప్టెంబర్ 13నే ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు (BRICS Summit) జరుగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా బలగాల మోహరింపు, వీఐపీ రాకపోకలు, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్లలో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే మ్యాచ్ను ఒక రోజు వాయిదా వేసి సెప్టెంబర్ 14న నిర్వహించాలని నిర్వహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. సంబంధిత అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే, తొలి టీ20తో పాటు భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మొత్తం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగనుంది. తొలి టీ20 మినహా మిగతా మ్యాచ్ల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఒకవేళ తొలి మ్యాచ్ను వాయిదా వేయాల్సి వస్తే.. మిగతా మ్యాచ్ల షెడ్యూల్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. చదవండి: ఫిన్ అలెన్కు జాక్పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు -
దంచికొట్టిన డుప్లెసిస్.. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు..!
యూరపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఆరంభ ఎడిషన్లో (2026) సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ (42) చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో రోట్టర్డామ్ డాకర్స్కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 అర్ద సెంచరీల సాయంతో 300కు పైగా పరుగులు చేశాడు. తద్వారా ఈ టోర్నీలో 300 పరుగుల మార్కును దాటిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు.గ్లాస్గో కాస్మిక్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో డుప్లెసిస్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతడి జట్టు 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డుప్లెసిస్తో పాటు ఓపెనింగ్ చేసిన రస్సీ వాన్ డర్ డస్సెన్ డకౌట్ కాగా.. మైఖేల్ లెవిట్ 19, విక్రమ్జిత్ సింగ్ 33, హెన్రిచ్ క్లాసెన్ 30 (నాటౌట్), డేవిడ్ వీస్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఖర్లో క్లాసెన్ బ్యాట్ ఝులిపించాడు (3 సిక్సర్లు). కాస్మిక్ బౌలర్లలో తైమాల్ మిల్స్ 2, డేవిడ్సన్, లివింగ్స్టోన్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను తలో 19 ఓవర్లకు కుదించారు.కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోట్టర్డామ్ డాకర్స్ నాలుగు, గ్లాస్గో కాస్మిక్ చివరి స్థానంలో ఉన్నాయి. ఎడిన్బర్గ్ కాసిల్ రాకర్స్ టాప్ ప్లేస్లో ఉండగా.. ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్, బెల్ఫాస్ట్ వోల్వ్స్, డబ్లిన్ గార్డియన్స్ రెండు, మూడు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఫిన్ అలెన్కు జాక్పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు -
ఒక్క పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు
టీమిండియా స్టార్ మానవ్ సుతార్ అదరగొట్టాడు. వార్విక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు గ్లామోర్గాన్తో మ్యాచ్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మానవ్ సుతార్ మూడు వికెట్లు పడగొట్టాడు.అరంగేట్రంలోనే అదుర్స్కాగా రాజస్తాన్కు చెందిన 24 ఏళ్ల మానవ్ సుతార్ ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అఫ్గానిస్తాన్తో స్వదేశంలో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్లో ఏడు వికెట్లు తీసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీలంకతో ఇటీవల జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ సత్తా చాటాడు.ఇప్పటికి మొత్తంగా మూడు టెస్టులు ఆడిన మానవ్ సుతార్ 23 వికెట్లు పడగొట్టడంతో పాటు.. 79 పరుగులు సాధించాడు. ఇక శ్రీలంక పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన మానవ్.. కౌంటీ చాంపియన్షిప్ -2026 ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లాడు. వార్విక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు గ్లామోర్గాన్తో మ్యాచ్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.69 పరుగులకే ఆలౌట్ఇరుజట్ల మధ్య కార్టిఫ్లో మంగళవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గ్లామోర్గాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 69 పరుగులకే కుప్పకూలింది. వార్విక్షైర్ బౌలర్లలో ఇథాన్ బాంబర్ ఐదు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ ఎడ్ బర్నార్డ్ మూడు వికెట్లు కూల్చాడు. మానవ్ సుతార్, ఒలివిర్ హనాన్ డాల్బీ చెరో వికెట్ పడగొట్టారు.ఈసారి 65 పరుగులకే కుప్పకూలిందిఅనంతరం వార్విక్షైర్ తమ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో గ్లామెర్గాన్ కంటే 322 పరుగుల ఆధిక్యం సంపాదించిన వార్విక్షైర్.. గ్లామెర్గాన్ను ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో మరోసారి బ్యాటర్లు విఫలం కావడంతో గ్లామోర్గాన్ 65 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా వార్విక్షైర్ ఇన్నింగ్స్ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.వార్విక్షైర్ బౌలర్లలో కెప్టెన్ ఎడ్ బార్నార్డ్ ఈసారి ఐదు వికెట్లు కూల్చగా.. మానవ్ సుతార్, ఒలివర్ తలా రెండు.. క్రిస్ వోక్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో మానవ్ సుతార్ మొత్తంగా 2.3 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్What a spell 🪄🐻 #YouBears pic.twitter.com/uEnQTrFixs— Bears (@WarwickshireCCC) September 9, 2026 -
ఫిన్ అలెన్కు జాక్పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు
న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ జాక్పాట్ కొట్టాడు. బిగ్బాష్ లీగ్లో అతడికి భారీ మొత్తం లభించనుంది. మెల్బోర్న్ స్టార్స్తో మూడేళ్ల ఒప్పందం చేసుకున్న అలెన్.. తొలి సీజన్లోనే కనీసం 6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు అందుకోనున్నాడు. బిగ్బాష్ లీగ్ చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన కాంట్రాక్ట్.కొద్ది రోజుల ముందే ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అడిలైడ్ స్ట్రయికర్స్తో 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లకు (ఏడాది కాంట్రాక్ట్) ఒప్పందం చేసుకొని, బిగ్బాష్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా అలెన్ స్టోక్స్ రికార్డును బద్దలు కొట్టాడు.27 ఫిన్ అలెన్కు ఫ్రాంచైజీ క్రికెట్లో విధ్వంసకర వీరుడిగా పేరుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని లీగ్ల్లో అతడు మెరుపులు మెరిపించాడు. అలెన్ ఖాతాలో ఇప్పటికే 7 టీ20 సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది అలెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బీబీఎల్లోనే పెర్త్ స్కార్చర్స్ తరఫున సుడిగాలి శతకం బాదాడు. అలాగే మేజర్ లీగ్ క్రికెట్లో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే శతక్కొట్టి, పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. గత ఎడిషన్ ఐపీఎల్లోనూ అదరగొట్టాడు. కేకేఆర్ తరఫున 11 మ్యాచ్ల్లో 214.11 స్ట్రైక్రేట్తో 349 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 47 బంతుల్లోనే సెంచరీ చేయడంతో పాటు.. గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లో 93 పరుగులు చేశాడు. మెల్బోర్న్ స్టార్స్ జట్టులో అలెన్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, పీటర్ సిడిల్ వంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఉన్నారు.మెల్బోర్న్ స్టార్స్ జట్టు..ఫిన్ అలెన్, ఆస్టిన్ అన్లెజార్క్, హిల్టన్ కార్ట్రైట్, సామ్ హార్పర్, లియామ్ హ్యాచర్, క్యాంప్బెల్ కెల్లవే, గ్లెన్ మ్యాక్స్వెల్, టాడ్ మర్ఫీ, టామ్ రోజర్స్, పీటర్ సిడిల్, మార్కస్ స్టోయినిస్, మిచ్ స్వెప్సన్.చదవండి: గెలుపు జోష్లో హల్చల్ చేసిన ఇషాన్, వైభవ్ -
ODI WC 2027: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడా? లేదా?... ఇప్పటికీ ఈ విషయంపై స్పష్టత రాలేదు. భారత జట్టును 2023లో వన్డే వరల్డ్కప్ ఫైనల్కు చేర్చిన ఈ లెజెండరీ బ్యాటర్.. 2025లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.అయితే, అనూహ్య రీతిలో చాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు వన్డే పగ్గాలు అప్పగించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్.. వన్డే జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కానీ గత కొంతకాలంగా రోహిత్ వన్డే రిటైర్మెంట్పై కూడా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు.. అతడు 2027 వరల్డ్కప్ ఆడతాడని తమకు కచ్చితంగా చెప్పలేదంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో రోహిత్ శర్మ.. ‘non-committal?’ (నిబద్ధత లేదా అన్న అర్థంలో) అనే అక్షరాలు రాసి ఉన్న టీ-షర్టు ధరించడం వైరల్గా మారింది. జట్టు తరఫున ఆడేందుకు తాను పూర్తి నిబద్ధతో ఉన్నానని హిట్మ్యాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల ఇంగ్లండ్లో జరిగిన లార్డ్స్ వన్డే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో చివరి మ్యాచ్ అనే ప్రచారం జరుగగా.. బ్యాట్తోనే హిట్మ్యాన్ ఇందుకు సమాధానం ఇచ్చాడు. ప్రఖ్యాత లార్డ్స్లో శతక్కొట్టి మరీ.. విమర్శకుల నోళ్లు మూయించాడు. అయితే, సెలక్టర్లే లీకులు ఇచ్చి మరీ ఈ వదంతులు వ్యాప్తి చేయించారన్న వార్తలు వచ్చాయి.ఇలాంటి తరుణంలో రోహిత్ ఇలాంటి టీ షర్టు ధరించడం విశేషం. ఇదిలా ఉంటే.. గురువారం నాటి ఈవెంట్లో ఓ ప్రేక్షకుడు.. ‘మీరు వన్డే వరల్డ్కప్-2027 ఆడతారా?’ అన్న ప్రశ్న అడుగగా.. ‘‘అక్టోబరు 2027కు ఇంకా చాలా సమయం ఉంది. అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం’’ అని 39 ఏళ్ల రోహిత్ శర్మ బదులిచ్చాడు. కాగా సౌతాఫ్రికా-జింబాబ్వే- నమీబియా వన్డే వరల్డ్కప్ తాజా ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. Aa raha hai Hitman! 🤩Family Full House With Rohit Sharma!Shuru ho raha hai 19th September se raat 9:30 baje, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par.@ImRo45 #RohitSharma #FamilyFullHouse #ComingSoon #SonyTV pic.twitter.com/HIaw43il3d— sonytv (@SonyTV) September 8, 2026 -
గెలుపు జోష్లో హల్చల్ చేసిన ఇషాన్, వైభవ్
దులీప్ ట్రోఫీ 2026 టైటిల్ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. సౌత్ జోన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రా అయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఆ జట్టు విజేతగా నిలిచింది. ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడం ఇది మూడోసారి. పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇషాన్ కిషన్ నేతృత్వంలో ఈ జట్టు చాంపియన్గా అవతరించింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026టైటిల్ గెలిచిన తర్వాత ఈస్ట్ జోన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా కెప్టెన్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ స్టంప్స్ చేతబట్టి భాంగ్రా డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. జట్టు కోచ్ రతన్ కుమార్, సహాయక సిబ్బంది, ఇతర ఆటగాళ్లతో కలిసి ఇషాన్, వైభవ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గెలుపును ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.బ్యాట్తోనూ అదరగొట్టిన ఇషాన్ కిషన్టైటిల్ గెలిచాక తనదైన శైలిలో చిందులేసిన ఇషాన్, ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడంలోనూ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో అతడు భారీ డబుల్ సెంచరీ (270), హాఫ్ సెంచరీ (80) సాయంతో 350 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్లో తన జట్టు భారీ స్కోర్ (708) చేయడానికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ స్కోరే (ఆధిక్యం) ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడానికి కారణమైంది. బ్యాట్తో తన అద్భుత ప్రదర్శన కారణంగా ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సౌత్ జోన్ తరఫున తొలి ఇన్నింగ్స్లో అద్బుత పోరాటం (99) చేసిన ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. తిలక్ అంతకుముందు సెమీఫైనల్లో అద్భుత శతకంతో మెరిశాడు. చదవండి: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్. -
ఐదేళ్ల తర్వాత 'స్పెషల్ ఫీట్' సాధించిన వివాదాస్పద బౌలర్
ఇంగ్లండ్ వివాదాస్పద బౌలర్ బ్రైడన్ కార్స్ ఐదేళ్ల తర్వాత ఓ స్పెషల్ ఫీట్ సాధించాడు. తన కౌంటీ జట్టు డర్హమ్ తరఫున ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. కార్స్ 2021లో చివరిగా డర్హమ్ తరఫున రెడ్బాల్ క్రికెట్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.తాజా మ్యాచ్లో కార్స్ 72 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. కార్స్ ధాటికి మిడిల్సెక్స్ తొలి ఇన్నింగ్స్లో 203 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 65 మ్యాచ్లు ఆడిన కార్స్.. మొత్తం ఆరు ఐదు వికెట్ల హాల్స్ సహా 196 వికెట్లు పడగొట్టాడు.నైట్క్లబ్ వివాదంతో ఇంగ్లండ్ జట్టుకు దూరంఇటీవల ఓ నైట్క్లబ్లో జరిగిన ఘటనతో కార్స్ వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోల్లో కార్స్ చేతులకు బేడీలు ఉన్న దృశ్యాలు కనిపించాయి. అతడి వెంట డర్హమ్ సహచరులు మాథ్యూ పాట్స్, బెన్ స్టోక్స్ కూడా ఉన్నట్లు వీడియోల్లో కనిపించింది.ఈ ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దర్యాప్తు చేస్తుంది. అనంతరం పాకిస్తాన్తో జరిగే టెస్టు సిరీస్కు ఎంపికైన కార్స్పై చర్యలు తీసుకుని, జట్టు నుంచి తప్పించింది.కార్స్ను తప్పించినప్పటికీ.. స్వదేశంలో పాక్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు అద్భుత ప్రదర్శనలు చేస్తుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి రెండు టెస్ట్లను గెలిచి, ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఎడ్జ్బాస్టన్ వేదికగా మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్లోనూ పాక్ పేలవ ప్రదర్శన చేస్తూ, క్లీన్ స్వీప్ పరాభవం అంచున ఉంది. చదవండి: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్ -
దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకుంది. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి చాంపియన్గా అవతరించింది. కెప్టెన్గా, ఆటగాడిగా ఈ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. సౌత్ జోన్ సారథిగా వ్యవహరించిన తిలక్ వర్మ బ్యాటర్గా రాణించినప్పటికీ.. కెప్టెన్గా మాత్రం చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆 Congratulations to the Ishan Kishan-led East Zone on winning their third #DuleepTrophy title 👏👏#EZvSZ | @ishankishan51 pic.twitter.com/u6D4UvOTEp— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్ ఆదివారం మొదలైంది. టాస్ గెలిచి తొలి రెండురోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ జట్టు.. మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఇషాన్ డబుల్ సెంచరీటాపార్డర్లో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44).. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) అదరగొట్టారు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270)తో కదం తొక్కాడు. మరోవైపు.. కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101).. అనుకుల్ రాయ్ (45), ఎండీ కౌనియన్ ఖురేషి (40) రాణించారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ తిలక్ వర్మ 99 పరుగులు చేయగా.. దేవదత్ పడిక్కల్ 62 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో సీవీ మిలింద్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్కు తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్ ఆడించకుండా..ఆ తర్వాత సౌత్కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బుధవారమే బ్యాటింగ్కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.ఇషాన్ 80 పరుగులు చేయగా.. శిఖర్ మోహన్ 52 పరుగులతో రాణించాడు. ఇక ఆఖరిదైన గురువారం నాటి ఐదో రోజు ఆటలో ఆల్రౌండర్ ఖురేషి అజేయ శతకం (116)తో రాణించగా.. అనుకుల్ రాయ్ హాఫ్ సెంచరీ (64) సాధించాడు. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా 46 పరుగులు చేశాడు.మ్యాచ్ డ్రా.. ఈస్ట్దే టైటిల్ఈ క్రమంలో 388 పరుగుల వద్ద ఏడు వికెట్ల నష్టానికి ఈస్ట్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా మొత్తంగా 760 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. దీంతో ఆఖరి రోజు ఆట కాబట్టి సౌత్ జోన్ ‘డ్రా’కు అంగీకరించింది. నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లోనూ ఈస్ట్ ఆధిక్యంలో ఉన్నందున ట్రోఫీ ఈస్ట్ జోన్కే దక్కింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026 -
ధురంధర్ 3.0! పాకిస్తాన్ జట్టులో ఇండియన్ ఏజెంట్?
ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూసిన పాక్ జట్టు.. ఇప్పుడు ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ అదే దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పాక్ జట్టు ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 133 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు సీనియర్ ఆటగాళ్లు అబ్ధుల్లా షఫీక్, షాన్ మసూద్ కూడా విఫలమయ్యారు. కొత్తగా జట్టులోకి వచ్చిన అజాన్ అవైస్, ఘాజీ ఘోరీ వంటి యువ ఆటగాళ్లు సైతం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాగా తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటమి చవిచూడడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టులో ఏకంగా ఏడు మార్పులు చేసిన సంగతి తెలిసిందే.ఆటగాళ్లతో పాటు కోచ్లు సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్ను ఉన్నపళంగా స్వదేశానికి రప్పించి పీసీబీ అవమానపరిచింది. వారి స్ధానంలో ఆఖరి టెస్టు కోసం వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్తో పాటు ఆష్లే నాఫ్కేలను ఇంగ్లండ్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపించింది. ఈ సాహసోపేతమైన నిర్ణయం కూడా బెడిసికొట్టిందే అని చెప్పాలి. పాక్ జట్టు ఆట తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. అదే తడబాటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మైక్ హెస్సన్పై పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హెస్సన్ ఇక ఇండియన్ ఏజెంట్ అని అతడు పరోక్షంగా ఆరోపించాడు. పాక్ క్రికెట్ పతనానికి అతడే కారణమని లతీఫ్ విమర్శించాడు."విదేశీ కోచ్ల విషయంలో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. బాబ్ వూల్మర్ నుంచి మిక్కీ ఆర్థర్ వరకు ఎంతో విధేయతతో పాక్ క్రికెట్కు తమ సేవలను అందించారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. కానీ ఐపీఎల్లో పనిచేసి మన బ్యాక్రూమ్ స్టాఫ్లో చేరిన ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ అనుమానం ఉంటుంది. మనం భారత్ను అడ్డుకోవాలని చూస్తుంటే, వారు లోపల నుంచి మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే భావన నాకు ఎప్పుడూ కలుగుతోంది.నేను అనవసరంగా ఎవరిపైన నిందలు వేయాలనుకోవడం లేదు. అయితే ఎవరినైనా కోచ్లగా నియమించుకునే ముందు వారి బ్యాక్ గ్రౌండ్ ను సరిగ్గా పరిశీలించాలి. వారికి భారత్తో ఏదో ఒక సంబంధం ఉండి ఉండవచ్చు. మనం భారత క్రికెట్కు ఎలాంటి హానీ చేయలేదు. కానీ ఐపీఎల్ నుంచి వచ్చి ఎవరైనా మన క్రికెట్ను నాశనం చేసే అవకాశం ఉంది. ఈ విధంగానే కోచ్లు లేదా ఇతర సభ్యులు ఏజెంట్లుగా మారతారు. గతంలో పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్లు, కోచ్లు కూడా మన వ్యవస్థలోకి చొరబడ్డారని" లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా న్యూజిలాండ్కు చెందిన మైఖేల్ హెస్సన్ గతంలో ఆర్సీబీ జట్టుకు 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్'గా సుదీర్ఘకాలం పనిచేశారు. విరాట్ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్కు అతడితో మంచి అనుబంధం ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు -
అఫ్గాన్కు దబిడిదిబిడే.. టీమిండియా పేస్ గుర్రం వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు భారీ శుభవార్త అందింది. పేస్ గుర్రం, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులో చేరేందుకు సిద్దమయ్యాడు. తాజాగా బెంగళూరులోని బీసీసీఐ ఎక్సలెన్స్లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో అతడి ఉత్తీర్ణత సాధించినట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది. కాగా ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో బుమ్రా మోకాలి గాయానికి గురయ్యాడు. దీంతో అతడు ఇంగ్లండ్ నుంచి వచ్చాక బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేరాడు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని సెలక్టర్లు భావించారు. కానీ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో లంక టూర్కు దూరమయ్యాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ సిరీస్తో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కింది. కానీ బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకుంటానే మైదానంలోకి అడుగుపెడతాడని సెలక్లర్లు స్పష్టత చేశారు. ఇప్పుడు బుమ్రా ఫిట్నెస్ టెస్టుల్లో పాస్ కావడంతో బీసీసీఐ వైద్య బృందం నుంచి అతడికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అదేవిధంగా ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డిలు సైతం ఫిట్నెస్ క్లియరెన్స్లు పొందారు. అయితే ఫిట్నెస్ టెస్టులో విఫలమైన పేసర్ హర్షిత్ రాణా.. అఫ్గానిస్తాన్తో సిరీస్తో పాటు ఆసియాక్రీడలకు దూరమయ్యాడు. అతడి స్ధానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్కు సెలక్టర్లు అవకాశమిచ్చారు.అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ -
గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరొందిన యువ పేసర్ హర్షిత్ రాణా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ ఢిల్లీ బౌలర్.. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు.మరోసారి గాయంఈ క్రమంలో హర్షిత్ రాణా గాయం నుంచి కోలుకోవడంతో అఫ్గాన్తో సిరీస్కు టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫిట్నెస్ ఆధారంగా టీ20 సిరీస్ ఆడతాడని పేర్కొన్నారు. కానీ హర్షిత్ రాణా మరోసారి గాయపడ్డాడు. మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకునే క్రమంలో సోమవారం బౌలింగ్ చేస్తున్న సందర్భంగా హర్షిత్కు మరోసారి తొడ కండరాలు పట్టేసినట్లు సమాచారం. దీంతో అఫ్గానిస్తాన్తో సిరీస్తో పాటు ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు.హర్షిత్ స్థానంలో అతడేఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ధ్రువీకరించింది. హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్ను అఫ్గాన్తో టీ20 సిరీస్తో పాటు.. ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటన విడుదల చేసింది.ఇరవై ఏడేళ్ల యశ్ ఠాకూర్ కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం పేసర్. విదర్భకు చెందిన ఈ యువ బౌలర్ ఇటీవలే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్,, ఇప్పటికి రెండు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 మ్యాచ్లు ఆడిన యశ్ ఠాకూర్.. మొత్తంగా 81 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఐపీఎల్లో ఇప్పటికి 22 మ్యాచ్లు ఆడిన యశ్ ఠాకూర్ 27 వికెట్లు కూల్చాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్కు ఆడాడు యశ్. గోల్డెన్ ఛాన్స్ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే భారత టీ20 జట్టు సారథిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. తాజాగా హర్షిత్ రాణా దూరం కావడంతో అఫ్గాన్తో టీ20 సిరీస్తో పాటు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టుకు ఆడే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.ఆసియా క్రీడలు-2026 టోర్నీకి భారత జట్టు (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సింగ్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్.చదవండి: ‘జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఆడతాడు’ -
పాకిస్తాన్ను మట్టికరిపించి సెమీ ఫైనల్లో భారత్
మహిళల జూనియర్ ఆసియా కప్ టోర్నీలో భారత హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. దాయాది పాకిస్తాన్ను ఏకంగా 19-0 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఆసియా కప్ టోర్నీ సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఆది నుంచే భారత్ ఆధిపత్యంచైనాలోని మోకీ వేదికగా గురువారం నాటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్- పాక్ యువ జట్లు తలపడ్డాయి. ఆట మొదలైన ఏడో నిమిషంలోనే పూజా సాహూ గోల్ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రోషిణి ఐంద్, తనుశ్రీ దినేశ్ కదూ, సుఖ్వీర్ కౌర్, సనికా చంద్రకాంత్ మనే కూడా గోల్స్ సాధించారు.దీంతో ఆది నుంచే భారత్ ఆధిపత్యం కొనసాగించింది. ఇక 23వ నిమిషంలో మనే తన రెండో గోల్ కొట్టగా.. తనూజ తొప్పూ, పూజా మాలిక్, పూర్ణిమా యాదవ్ కూడా గోల్స్ సాధించారు. ఫలితంగా ఆట తొలి అర్ధ భాగంలోనే భారత్ 10-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.ఇక రెండో అర్ధ భాగంలోనూ భారత మహిళా జట్టు జోరు కొనసాగించింది. మాలిక్ హ్యాట్రిక్ గోల్స్తో దుమ్ములేపగా.. సుప్రియా రెండుసార్లు గోల్ కొట్టింది. క్రిష్ణా శర్మ, బినిమా ధన్, రోషిణి కూడా అద్భుత ఆట తీరు కనబరుస్తూ పాకిస్తాన్ను మరింత కష్టాల్లోకి నెట్టారు. ఏకపక్ష విజయంఆఖరి నిమిషంలో రోషిణి మరోసారి గోల్ కొట్టడంతో భారత్ పాక్పై 19-0 గోల్స్ తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. తద్వారా భారత మహిళా హాకీ జూనియర్ జట్టు ఆసియా కప్ సెమీ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. కాగా మహిళల జూనియర్ హాకీ ఆసియా కప్ 2023, 2024 ఎడిషన్లలో భారత జట్టు విజేతగా నిలిచింది. తాజా ఎడిషన్లోనూ చాంపియన్గా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. కాగా తాజా సెమీ ఫైనల్లో భారత్... సౌత్ కొరియా- మలేషియా మధ్య మ్యాచ్ విజేతతో తలపడుతుంది. ఇక గ్రూప్ దశలో భారత్ ఇప్పటికే జపాన్, మలేషియా, సౌత్ కొరియాలను ఓడించి టాపర్గా నిలిచింది.పాకిస్తాన్తో మ్యాచ్లో గోల్స్ కొట్టిన భారత ప్లేయర్లుపూజా సాహూ (7వ నిమిషం), రోషిణి ఐంద్ (9, 60+ నిమిషం), తనుశ్రీ దినేశ్ కదూ (11వ నిమిషం), సుఖ్వీర్ కౌర్ (13వ నిమిషం), సనికా చంద్రకాంత్ మనే (13, 23వ నిమిషం), మధూ సిదార్ (16, 39వ నిమిషం), గీతా యాదవ్ 18వ (నిమిషం), తనూజ తొప్పూ (25వ నిమిషం), పూజా మాలిక్ (27, 49, 51వ నిమిషం), పూర్ణిమా యాదవ్ (33వ నిమిషం), సుప్రియ (40, 54వ నిమిషం), క్రిష్ణ శర్మ (48వ నిమిషం), బినిమా ధన్ (55వ నిమిషం).చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్! -
పాక్ క్రికెటర్లకు ఘోర అవమానం.. శరణార్థులనుకొని
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పోర్ట్స్మౌత్లోని ఓ హోటల్లో బస చేసిన పాక్ యువ ఆటగాళ్లను అక్రమ శరణార్థులుగా పొరబడిన నిరసనకారులు..వారుంటున్న హోటల్ను చుట్టుముట్టడం తీవ్ర కలకలం రేపింది.అసలేం జరిగిందంటే?పోర్ట్స్మౌత్ నగర సమీపంలోని 'మారియట్' హోటల్లో పాక్ జట్టు బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఆటగాళ్లు బస్సు దిగి హోటల్లోకి వెళ్లడాన్ని చూసిన కొందరు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేశారు. వారంతా ఆశ్రయం కోసం వచ్చిన అక్రమ శరణార్థులని భావించిన దాదాపు 40 మందికి పైగా నిరసనకారులు వెంటనే హోటల్ ముట్టడికి దిగారు.తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు, స్థానిక ‘రిఫార్మ్ యూకే’ పార్టీ కౌన్సిలర్ నిరసనకారులకు నచ్చజెప్పారు. అక్కడ ఉన్నది శరణార్థులు కాదని, పాకిస్తాన్ అండర్-19 క్రికెటర్లని స్పష్టం చేశారు. నిజం తెలుసుకున్న నిరసనకారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా పాకిస్తాన్ సీనియర్ పురుషుల జట్టు కూడా ఇంగ్లండ్లోనే ఉండడం గమనార్హం. బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.కాగా ఈ ఘటనపై ‘స్టాండ్ అప్ టు రేసిజం’ వ్యవస్థాపకుడు మైఖేల్ బ్రాడ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శరణార్థులపై ఉన్న ద్వేషం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని మండిపడ్డారు. చదవండి: 'జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఫామ్లోకి వస్తాడు' -
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్రౌండర్లు వచ్చేస్తున్నారు?
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు డబుల్ గుడ్ న్యూస్ అందింది. స్టార్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో వీరిద్దరూ పాసైనట్లు వార్తలు వస్తున్నాయి.వీరిద్దరూ గురువారం (సెప్టెంబర్ 10) ఢిల్లీలో భారత జట్టుతో కలవనున్నట్లు క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన సుందర్ ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా తొడ కండరాల గాయం బారిన సుందర్.. ఈ కారణంగానే శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు.లంకతో తొలి టెస్టు సమయానికి అతడు కోలుకుంటాడని సెలక్టర్లు భావించినప్పటికి.. సీఓఈ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించకపోవడంతో భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక నితీశ్ విషయానికి వస్తే.. అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు అతడు దూరమయ్యాడు. అనంతరం ఈ ఆంధ్ర ఆల్రౌండర్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో దాదాపు ఒకటిన్నర నెలలుగా పునరావాసం పొంది పూర్తి ఫిట్నెస్ను సాధించాడు.మరోవైపు యువ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా అఫ్గానిస్తాన్తో సిరీస్కు దూరం కానున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన హర్షిత్ రాణా కూడా హ్యామ్స్ట్రింగ్ గాయంతోనే బాధపడుతున్నాడు. సెలక్టర్లు అతడు కోలుకుంటాడని భావించి అఫ్గానిస్తాన్తో సిరీస్కు ఎంపిక చేశారు. కానీ అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోయినట్లు తెలుస్తోంది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. అఫ్గాన్-భారత్ మధ్య సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. -
47 ఏళ్ల వయసులో సంచలనం.. భువనేశ్వర్, మలింగ రికార్డు బ్రేక్
కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో గయానా వారియర్స్ తిరిగి పుంజుకుంది. గురువారం ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్ను 4 వికెట్ల తేడాతో గయానా చిత్తు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన వారియర్స్.. ఈ విజయంతో తమ అగ్రస్ధానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.ఇక ఈ మ్యాచ్లో గయానా కెప్టెన్ ఇమ్రాన్ తహీర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ 47 వయస్సులోనూ బంతితో అద్భుతం చేశాడు. తన స్పిన్ వలలో చిక్కుకుని సెయింట్ లూసియా కింగ్స్ విలవిల్లాడారు. తహీర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ మెహది హసన్ మిరాజ్ మూడు వికెట్లు సాధించాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా 18.5 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలింది.కింగ్స్ ఇన్నింగ్స్లో కమిల్ పూరన్(43), ఓబస్ పీనార్(35) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని వారియర్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. గయానా బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(37), క్వెంటిన్ శాంప్సన్(37) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక 47 వయస్సులోనూ అద్భుతంగా రాణిస్తున్న తహీర్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా టీ20ల్లో తహీర్కు ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం.భువీ రికార్డ్ బ్రేక్ఈ అద్భుత ప్రదర్శనతో తహీర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక ఐదు వికెట్ల ఘనత సాధించిన జాబితాలో తహీర్ రెండో స్ధానానికి ఎగబాకాడు. తహీర్కు ఇది ఆరో ఫైవ్ వికెట్ హాల్. దీంతో దిగ్గజ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగ, రషీద్ ఖాన్,షాహీన్ షా అఫ్రిది, షకీబ్ అల్ హసన్లను తహీర్ అధిగమించాడు. వీరంతా ఐదుసార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించారు. కాగా జాబితాలో నమీబియా మాజీ పేసర్ డేవిడ్ వీస్(7) అగ్రస్ధానంలో ఉన్నాడు.Imran Tahir picked 5/17 in the CPL at the age of 47. 🤯 pic.twitter.com/yIG2qsZXcG— Mufaddal Vohra (@mufaddal_vohra) September 10, 2026 -
'జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఫామ్లోకి వస్తాడు'
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టెస్టు సెంచరీ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులోనూ బాబర్ తీవ్రంగా నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అతనికి ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ క్రమంలో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన బాబర్, యంగ్ పేసర్ జోష్ టంగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.అంతకుముందు లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ అతడు దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. లార్డ్స్ ఓటమి తర్వాత ఎడ్జ్బాస్టన్ టెస్టు కోసం పాక్ తమ తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేసింది. అందులో ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లే ఉండటం గమనార్హం. ఈ కీలక టెస్టులో బాబర్ సీనియర్ ఆటగాడిగా జట్టును ముందుండి నడిపిస్తాడని పీసీబీ భావించినప్పటికీ, అతడి ప్రదర్శనలో ఎలాంటి మార్పు రాలేదు.బాబర్ ఆజం టెస్టు ఫార్మాట్లో మూడంకెల స్కోరును అందుకుని మూడేళ్లకు పైగా అవుతోంది. అతడు చివరిసారిగా డిసెంబర్ 2022లో కరాచీ వేదికగా న్యూజిలాండ్పై సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి బాబర్ తడబాటు కొనసాగుతూనే ఉంది. ఫామ్ లేమి కారణంగా 2024లో ఇంగ్లండ్తో జరిగిన హోమ్ సిరీస్ మధ్యలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. "బాబర్.. ఇకనైనా నువ్వు మారవా?" అంటూ ఓ యూజర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశాడు. "జింబాబ్వేతో మ్యాచ్ పెట్టండి.. మా కింగ్ ఫామ్లోకి వస్తాడు" అంటూ మరికొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.చదవండి: ఏషియన్ గేమ్స్.. భారత జట్టులో కీలక మార్పు -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు
చెపాక్ వేదికగా సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అసాధరణ ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కిన ఇషాన్(270).. రెండో ఇన్నింగ్స్లో వన్డే తరహాలో మెరుపులు మెరిపించాడు. కేవలం 98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 80 పరుగులు చేశాడు.ఈ భారత వికెట్ కీపర్ బ్యాటర్ మొత్తంగా రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 350 పరుగులు చేశాడు. తద్వారా 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒక మ్యాచ్లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా కూడా కిషన్ నిలిచాడు. ఇంతకుముందు భారత మాజీ క్రికెటర్ రామణ్ లంబా చేసిన 320 పరుగులే అత్యధికంగా ఉండేది. 1987లో భిలాయ్ వేదికగా వెస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో నార్త్ జోన్ తరపున లంబా ఈ ఫీట్ సాధించాడు. తాజా నాక్తో లంబాను అధిగమించి కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.అడుగు దూరంలోఇక ఈ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సౌత్జోన్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్కు నేడు చివరి రోజు కాగా... ప్రస్తుతం ఈస్ట్ ఓవరాల్గా 584 పరుగులు ముందంజలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయం కాబట్టి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకున్న ఈస్ట్ విజేతగా నిలవడం లాంఛనమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 212 పరుగులు చేసింది. తిలక్ వర్మ 99 అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 242/6తో బుధవారం ఆట కొనసాగించిన సౌత్జోన్ తమ మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ (99; 9 ఫోర్లు) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా, సీవీ మిలింద్ (43; 7 ఫోర్లు) రాణించాడు. ఈస్ట్కు తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత సౌత్కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బ్యాటింగ్కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.చదవండి: పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం -
ఏషియన్ గేమ్స్.. భారత జట్టులో కీలక మార్పు
జపాన్ వేదికగా ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్-2026కు ముందు భారత మహిళల జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆమె స్థానంలో ఓపెనర్ ప్రతీకా రావల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.కాగా భారత మిడిలార్డర్లో కీలక ప్లేయర్ అయిన జెమీమా, 'ది హండ్రెడ్' టోర్నమెంట్లో ఆడుతున్న సమయంలో తొడ కండరాల గాయానికి గురైంది. ఆమె ఇంకా ఆ గాయం నుంచి కోలుకోలేదు. ఈ కారణంగానే దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్కు కూడా జెమీమా దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో ఆసియా కప్లోనూ రోడ్రిగ్స్ స్థానంలో ప్రతీకాకే చోటు దక్కింది. ఇప్పుడు ఏషియన్ గేమ్స్లోనూ సత్తాచాటేందుకు ప్రతీకా సిద్దమవుతోంది.ప్రతీక విషయాన్ని వస్తే.. ఈ ఆసియాకప్లోనే ఆమె థాయిలాండ్పై ఆమె తన టీ20 అరంగేట్రం చేసింది. రావల్ కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్కు వస్తుంది. ఈ టోర్నీలో ఇంకా ఆమె తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మూడు మ్యాచ్లలో 36 పరుగులు చేసింది.అయితే వన్డేల్లో మాత్రం ఆమెకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటికే 50 ఓవర్ల క్రికెట్లో భారత్ తరపున ప్రతీకా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్లు ఆడింది. ఇంగ్లండ్లో జరిగే వన్డే కప్లో వార్విక్షైర్ తరఫున ఆడేందుకు సిద్దమవుతున్న సమయంలో ప్రతీకాకు భారత టీ20 జట్టు నుంచి పిలుపు వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె తిరిగి టీ20 క్రికెట్ మ్యాచ్ ఆడింది.ఆసియా క్రీడల కోసం భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్), జి కమలిని (వికెట్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్ శ్రీ చరణి, నందిని శర్మ.చదవండి: పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం -
పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా జట్టు తొలి వన్డేలో నమీబియాపై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 99 పరుగుల తేడాతో గెలిచింది. ఇటీవల జరిగిన ముక్కోణపు టీ20 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా... బుధవారం నమీబియాతో తొలి వన్డేలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిరీ్ణత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (126 బంతుల్లో 150; 17 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. టోనీ డి జోర్జి (84 బంతుల్లో 72; 7 ఫోర్లు, 1 సిక్స్) అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 190 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. హెర్మన్ అరంగేట్ర వన్డేలో సెంచరీ చేసిన ఐదో దక్షిణాఫ్రికా ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు కొలిన్ ఇంగ్రామ్, తెంబా బవుమా, రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీజ్కె ఈ ఘనత సాదించారు. డెవాల్డ్ బ్రేవిస్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్), కార్బిన్ బాష్ (39 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపల్మెన్ 68 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.అనంతరం వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం వాటిల్లింది. ఆ తర్వాత మైదానం సిద్ధంగా లేకపోవడంతో ఆట తిరిగి ప్రారంభమయ్యేందుకు ఆలస్యమైంది. దీంతో నమీబియా లక్ష్యాన్ని 31 ఓవర్లలో 262 పరుగులుగా నిర్దేశించారు. ఛేదనలో నమీబియా 31 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులకు పరిమితమైంది. మలన్ క్రుగెర్ (60 బంతుల్లో 34; 1 ఫోర్), జేజే స్మిత్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో ప్రెనేలన్ సుబ్రాయెన్ 29 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది.చదవండి: ఇప్పుడు టి20 శైలికి మారిపోతా! -
ఇప్పుడు టి20 శైలికి మారిపోతా!
చెన్నై: దులీప్ ట్రోఫీలో సౌత్జోన్ కెప్టెన్గా రెండు మ్యాచ్లు ఆడిన ఠాకూర్ తిలక్ వర్మ మూడు ఇన్నింగ్స్లలో వరుసగా 116 నాటౌట్, 51 నాటౌట్, 99 పరుగులు (మొత్తం 266) చేశాడు. టి20 స్పెషలిస్ట్గానే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న తిలక్... ఫస్ట్ క్లాస్ ఆట శైలికి తగినట్లుగా తన బ్యాటింగ్ను ప్రదర్శించాడు. దులీప్ ట్రోఫీ సెమీస్, ఫైనల్ మ్యాచ్ కలిపి 461 బంతులు ఎదుర్కొన్న అతను... ఫైనల్ మ్యాచ్లో పరిస్థితికి అనుగుణంగా ఆడుతూ ఒకదశలో వరుసగా 63 బంతులపాటు బౌండరీ కొట్టకుండా నియంత్రణ కూడా ప్రదర్శించాడు. దీనికి ముందు భారత ‘ఎ’ జట్టుకు కూడా తిలక్ కెప్టెన్గా వ్యవహరించాడు. ‘నా వ్యక్తిగత ఫామ్ చాలా బాగుంది. ఈ ప్రదర్శనతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చానని భావిస్తున్నా. ఈ మ్యాచ్లో కాస్త ముందుగానే దూకుడు ప్రదర్శించగలిగేవాడిని. కానీ పరిస్థితులకు, జట్టు అవసరాలకు తగినట్లు ఆడటమే ముఖ్యం. నాతో పాటు అవతలి ఎండ్లో మరో బ్యాటర్ నిలిస్తే సెషన్లవారీగా ఆడుతూ డ్రా కోసం ప్రయత్నించేవాడిని. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం ఈస్ట్కు మేలు చేసుంది. భారత ‘ఎ’ జట్టుకు, ఇప్పుడు సౌత్జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం వల్ల ఇతర యువ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించింది. సారథిగా నేను ఎదుగుతున్నాననే భావన కలిగింది. కొన్ని సార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడే కెప్టెన్గా నా బాధ్యత మరింత పెరుగుతుంది’ అని తిలక్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 13 నుంచి అఫ్గానిస్తాన్తో జరిగే టి20 సిరీస్లో భారత జట్టును గెలిపించడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు తిలక్ వెల్లడించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి ఒక్కసారిగా టి20లకు మారడం తనకు కష్టమేమీ కాదని, సిరీస్కు సిద్ధంగా ఉన్నానని అతను చెప్పాడు.‘ఇప్పుడు నా బ్యాటింగ్ గేర్లు మార్చి దూకుడు ప్రదర్శిస్తా. నా ఆటపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు అఫ్గానిస్తాన్తో సిరీస్ గెలవడమే లక్ష్యం. ఎరుపు రంగు బంతి మ్యాచ్ నుంచి టి20లకు మారడం అంత సులువు కాదు. అయితే సిరీస్కు ముందు ప్రాక్టీస్ కోసం నాకు రెండు రోజుల సమయం లభిస్తోంది. నా ఆట శైలిని మార్చుకునేందుకు ఇది సరిపోతుంది’ అని తిలక్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 64 టి20 మ్యాచ్లు ఆడిన తిలక్ 145.18 స్ట్రయిక్రేట్తో 1645 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతను మరో 5 వన్డేల్లో కూడా బరిలోకి దిగాడు. -
హాట్ కేకుల్లా...
ఆక్లాండ్: టీమిండియాతో వచ్చే నెలలో జరుగనున్న సిరీస్ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు టికెట్ల అమ్మకం ప్రారంభించింది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఐదు టి20లు, ఐదు వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. న్యూజిలాండ్తో భారత్ పూర్తి స్థాయి సిరీస్లు ఆడనుండటం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్లు వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. టికెట్ల విక్రయం ప్రారంభించిన రెండు రోజుల్లోనే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 22న క్రైస్ట్చర్చ్లో తొలి టి20 జరగనుంది. ఆ తర్వాత 24న అక్కడే రెండో మ్యాచ్... 27న వెల్లింగ్టన్లో మూడో మ్యాచ్... 30న ఆక్లాండ్లో నాలుగో మ్యాచ్ జరుగుతాయి. నవంబర్ 1న హామిల్టన్ వేదికగా జరగనున్న చివరి మ్యచ్తో పొట్టి సిరీస్ ముగియనుంది. ‘క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగే రెండో టి20 మ్యాచ్ టికెట్లు దాదాపు అయిపోయాయి. మిగిలిన మ్యాచ్ల టికెట్లు కూడా వేగంగా అమ్ముడవుతున్నాయి. ఈడెన్ పార్క్లో అధిక డిమాండ్ ఉంది. 2019లో టీమిండియా న్యూజిలాండ్లో పర్యటించిన అనంతరం ఇంత పెద్ద మొత్తంలో టికెట్ల కోసం పోటీ కనిపించలేదు. దీంతో మైదానంలోని పై అంతస్తును కూడా అభిమానుల కోసం అందుబాటులోకి తేనున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. టి20 సిరీస్ అనంతరం నవంబర్ 4న ఆక్లాండ్లో తొలి వన్డే... 7న వెల్లింగ్టన్లో రెండో వన్డే... 10న హామిల్టన్లో మూడో వన్డే నిర్వహించనున్నారు. నవంబర్ 13, 15న జరగనున్న చివరి రెండు వన్డే మ్యాచ్లు మౌంట్ మాంగనీలో జరుగుతాయి. అనంతరం నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. క్రైస్ట్చర్చ్లో నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుతో ఈ పర్యటన ముగియనుంది. -
తొలి రౌండ్లోనే మానవ్ పరాజయం
న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) మకావ్ చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. తొలి రోజు మంగళవారం భారత నంబర్వన్ ర్యాంకర్ మనుశ్ షా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... బుధవారం భారత రెండో ర్యాంకర్, ప్రపంచ 47వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ కూడా మొదటి రౌండ్లోనే ఓటమి చవిచూశాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అలెక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో మానవ్ 12–14, 4–11, 11–9, 3–11తో పరాజయం పాలయ్యాడు. 24 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో మానవ్ తన సర్వీస్లో 18 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్లో 12 పాయింట్లు సాధించాడు. తొలి రౌండ్లో ఓడిన మానవ్కు 8,000 డాలర్ల (రూ. 7 లక్షల 58 వేలు) ప్రైజ్మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చాంపియన్స్ లెవెల్ టోర్నీని కేవలం సింగిల్స్ విభాగాల్లోనే నిర్వహిస్తారు. -
భారత ‘ఎ’ జట్టులో షేక్ రషీద్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా జట్టు... భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో... త్వరలో ఇరు దేశాల ‘ఎ’ జట్ల మధ్య అనధికారిక టెస్టు, వన్డే సిరీస్లు జరగనున్నాయి. వీటి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం వేర్వేరుగా జట్లను ప్రకటించింది. సుదీర్ఘ ఫార్మాట్ కోసం ప్రకటించిన భారత ‘ఎ’ జట్టులో ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్కు చోటు దక్కింది. ప్రస్తుతం చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో రషీద్ సౌత్ జోన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక గాయం కారణంగా చాన్నాళ్లుగా మైదానానికి దూరంగా ఉన్న సీనియర్ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక వన్డేలకు ఎంపిక చేశారు. 32 ఏళ్ల పాండ్యా ఐపీఎల్ అనంతరం గ్రౌండ్లో అడుగు పెట్టలేదు. ఇటీవలే ఫిట్నెస్ సాధించిన పాండ్యా... ఈ సిరీస్ ద్వారా తిరిగి పోటీ క్రికెట్ ప్రారంభించనున్నాడు. భారత్ ‘ఎ’, ఆ్రస్టేలియా ‘ఎ’ జట్ల మధ్య ఈ నెల 22 నుంచి పాండిచ్చేరి వేదికగా తొలి అనధికారిక టెస్టు జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 29 నుంచి అక్కడే రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్లు ముగిసిన అనంతరం పాండిచ్చేరిలోనే అక్టోబర్ 6, 9, 11న వరుసగా మూడు అనధికారిక వన్డేలు నిర్వహించానున్నారు. దాదాపు అదే సమయంలో భారత సీనియర్ జట్టు వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. సుదీర్ఘ ఫార్మాట్లో భారత ‘ఎ’ జట్టుకు దేవదత్ పడిక్కల్ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న పడిక్కల్ నిలకడైన ప్రదర్శనతో మూడో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. గాయం కారణంగా లంక పర్యటనకు దూరమైన సాయి సుదర్శన్... ఈ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. లంక సిరీస్లో అద్వితీయ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పడిక్కల్... ఆస్ట్రేలియా ‘ఎ’పై ఎలా ఆడతాడనేది కీలకం. ఇక వన్డే ఫార్మాట్లో భారత ‘ఎ’ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించనుండగా... పడిక్కల్ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.సుదీర్ఘ ఫార్మాట్కు భారత ‘ఎ’ జట్టు: దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), అమన్ మోఖడే, ఆయుశ్ పాండే, యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుషాగ్ర, షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్, తుశార్ దేశ్పాండే, అన్షుల్ కంబోజ్, ప్రఫుల్ హింగే, ఎన్ జగదీశన్, నచికేత్ భుటే, వైశాక్. వన్డే ఫార్మాట్కు భారత ‘ఎ’ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్, కుమార్ కుషాగ్ర, నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, ప్రభ్సిమ్రన్సింగ్, గుర్జపనీత్ సింగ్, యశ్ ఠాకూర్. -
ఫేవరెట్గా భారత్
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్తో హర్మన్ప్రీత్ కౌర్ బృందం తలపడుతుంది. లీగ్ దశలో మూడు విజయాలతో భారత మహిళలు అజేయంగా నిలవగా... రెండు చిన్న జట్లపై విజయాలతో బంగ్లాదేశ్ సెమీస్కు చేరింది. ఓవరాల్గా బలాబలాలను బట్టి చూస్తే బంగ్లాదేశ్పై భారత బృందం ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. థాయ్లాండ్తో మ్యాచ్లో మిడిలార్డర్ కొంత తడబడినా... తర్వాతి రెండు మ్యాచ్లలో టీమ్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్లుగా షఫాలీ, స్మృతి దూకుడైన ఆటతో ఇన్నింగ్స్కు సరైన పునాది వేస్తున్నారు. జెమీమా గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ప్రతీక రావల్ మూడు మ్యాచ్లలోనూ విఫలం కావడం ఒక్కటే ఇప్పుడు జట్టుకు కాస్త ఆందోళన కలిగించే అంశం. హర్మన్ప్రీత్, దీప్తి శర్మ, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ మిడిలార్డర్లో రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించగలరు. భారత బౌలింగ్ మరింత పదునుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, దీప్తి, ప్రేమ రావత్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడే యగలరు. పేసర్లు క్రాంతి, నందని శర్మ కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు కాబట్టి తుది జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరోవైపు బంగ్లాదేశ్ బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. దియానా, జువేరియా, నిగార్, షర్మిన్ భారత్పై ఏమాత్రం ప్రభావం చూపించగలరనేది సందేహమే. అయితే బౌలింగ్ కొంత మెరుగ్గా ఉండటం జట్టుకు సానుకూలాంశం. ముఖ్యంగా పేసర్ మారుఫా తన స్వింగ్తో చెలరేగిపోగల సమర్థురాలు. సుల్తానా, నాహిదా ఆమెకు సహకరించాల్సి ఉంది. వేడి వాతావరణం కొనసాగుతుండగా, ఈ టోర్నీలో పిచ్లు స్పిన్కు బాగా అనుకూలిస్తున్నాయి. బంగ్లాదేశ్ చేతిలో చివరిసారిగా 2023లో ఓడిన భారత్... ఆ తర్వాత వరుసగా 8 మ్యాచ్లలో గెలిచింది. స్మృతి మరో 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొత్త రికార్డు నెలకొల్పుతుంది. -
సెమీఫైనల్లో భారత్... చైనీస్ తైపీపై 15–0తో జయభేరి
మోకి (చైనా): డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడుతోన్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 15–0 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ అన్మోల్ ఎక్కా ఆరు గోల్స్ (25వ, 29వ, 32వ, 33వ, 45వ, 51వ నిమిషాల్లో)... ఆర్యన్ మూడు గోల్స్ (17వ, 52వ, 53వ నిమిషాల్లో), హర్పాల్ రెండు గోల్స్ (48వ, 53వ నిమిషాల్లో) చేశారు. గురుసేవక్ సింగ్ (22వ ని.లో), ప్రభ్దీప్ సింగ్ (18వ ని.లో), అజీత్ యాదవ్ (35వ ని.లో), అర్జున్ సంతోష్ హర్గుడె (28వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు మ్యాచ్ల్లో గెలిచి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని 10 పాయింట్లతో టాప్ ర్యాంక్లో... దక్షిణ కొరియా 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. పూల్ ‘బి’ నుంచి పాకిస్తాన్, మలేసియా జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో మలేసియాతో భారత్; పాకిస్తాన్తో దక్షిణ కొరియా తలపడతాయి. మరోవైపు భారత మహిళల జట్టు చైనాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో పాకిస్తాన్తో భారత్; హాంకాంగ్తో చైనీస్ తైపీ; బంగ్లాదేశ్తో జపాన్; మలేసియాతో దక్షిణ కొరియా పోటీపడతాయి. -
జో రూట్ మరో ఘనత
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్ మరో ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక టెస్ట్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ వా (168), రికీ పాంటింగ్ (168)ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి చేరాడు. పాకిస్తాన్తో ఇవాళ మొదలైన మూడో టెస్ట్తో రూట్ (169) ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (200), జేమ్స్ ఆండర్సన్ (188) మాత్రమే రూట్ కంటే ముందున్నారు. పరుగుల విషయంలో సచిన్ను (15921) వెంటాడుతున్న రూట్ (14208).. ఇప్పుడు మ్యాచ్ల విషయంలోనూ అతడి రికార్డును చెరిపి వేసే దిశగా ముందుకు సాగుతున్నాడు.కుప్పకూలిన పాక్ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో 133 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు ఓల్లీ రాబిన్సన్ (3-15), జోఫ్రా ఆర్చర్ (3-25), జోష్ టంగ్ (4-42) ధాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది.పాక్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు (సౌద్ షకీల్ (43), మొహమ్మద్ అబ్బాస్ (21), రజావుల్లా (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్గా చెప్పుకునే బాబర్ ఆజం 7 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా ప్లేయర్లలో సైమ్ అయూబ్ 0, అజాన్ అవైస్ 9, అబ్దుల్లా షఫీక్ 3, షాన్ మసూద్ 5, ఘాజీ ఘోరి 4, మొహమ్మద్ ఇమ్రాన్ 5 పరుగులు మాత్రమే చేశారు.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు గెలిచి ఇంగ్లండ్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. చదవండి: నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ పేసర్లు -
శీతల్ దేవి సంచలనం.. భారత్కు రెండు స్వర్ణాలు
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో శీతల్, కజకిస్థాన్కు చెందిన ఐజాడా సెయ్దాన్ను షూట్ఆఫ్లో ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.ఈ టోర్నీలో శీతల్కు ఇది రెండో పతకం. టోమన్ కుమార్తో కలిసి కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆమె ఇప్పటికే కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక పోరులో భారత జోడీ ఇరాక్కు చెందిన సారా అల్ హమీద్, అబ్బాస్ కదిమ్ జోడీని 157-145తో ఓడించింది.మరోవైపు పారాలింపిక్ ఛాంపియన్ హర్విందర్ సింగ్ కూడా భారత్కు స్వర్ణ పతకం అందించాడు. భావనతో కలిసి రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చైనాకు చెందిన లియాంగ్ కియురోంగ్, షియా లెయ్ జోడీని 6-0తో ఓడించారు.భావన రికర్వ్ మహిళల వ్యక్తిగత విభాగంలో మరో కాంస్య పతకం సాధించింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో సరిత చైనాకు చెందిన వాంగ్ హ్యూటింగ్పై 141-140తో విజయం సాధించి కాంస్యం గెలిచింది.కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో టోమన్ కుమార్ కూడా కాంస్య పతకం సాధించాడు.ఈ టోర్నీలో టోమన్కు ఇది రెండో పతకం.మొత్తంగా చివరి రోజున భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి, టోర్నీలో పతకాల సంఖ్యను 13కు పెంచుకుంది.చదవండి: అల్కరాజ్కు ఊహించని షాక్.. సెమీస్ చేరకుండానే అవుట్ -
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ పేసర్లు
ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న నామమాత్రపు మూడో టెస్ట్లో ఇంగ్లండ్ పేసర్లు చెలరేగిపోయారు. ఇవాళే ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, పాక్ ఆటగాళ్ల భరతం పట్టింది. పేసర్లు ఓలీ రాబిన్సన్ (3-15), జోఫ్రా ఆర్చర్ (3-25), జోష్ టంగ్ (4-42) నిప్పులు చెరిగే బంతులతో పాక్ ఇన్నింగ్స్ను పేకమేడలా కూల్చారు. వీరి దెబ్బకు ఆ జట్టు 133 పరుగులకే కుప్పకూలింది.పాక్ ఇన్నింగ్స్లో కేవలం ముగ్గురు (సౌద్ షకీల్ (43), మొహమ్మద్ అబ్బాస్ (21), రజావుల్లా (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్గా చెప్పుకునే బాబర్ ఆజం 7 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా ప్లేయర్లలో సైమ్ అయూబ్ 0, అజాన్ అవైస్ 9, అబ్దుల్లా షఫీక్ 3, షాన్ మసూద్ 5, ఘాజీ ఘోరి 4, మొహమ్మద్ ఇమ్రాన్ 5 పరుగులు మాత్రమే చేశారు.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు గెలిచి ఇంగ్లండ్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ క్రికెట్లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే ఏడుగురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయారు. ఆటగాళ్ల క్రమశిక్షణ, ప్రవర్తనపై పీసీబీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆటగాళ్ల ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించినట్లు నివేదికలు వచ్చాయి.మరోవైపు సిరీస్ మధ్యలో జరిగిన మార్పుల గురించి తనను ముందుగా సంప్రదించలేదని ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం పేర్కొనడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. చదవండి: ఓలీ రాబిన్సన్ 'సెంచరీ'.. 100 ఏళ్లలో అత్యుత్తమం -
ఆసీస్ సిరీస్కు భారత జట్టులోకి సర్ప్రైజ్ ఎంట్రీ
త్వరలో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగనున్న రెండు ఫార్మాట్ల సిరీస్కు భారత జట్లను ఇవాళ ప్రకటించారు. మల్టీ డే మ్యాచ్లకు దేవదత్ పడిక్కల్, వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్లుగా ఎంపిక కాగా.. మల్టీ డే ఫార్మాట్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఓ ఆసక్తికర ఎంపిక జరిగింది.దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న విదర్భ ఆల్రౌండర్ నచికేత్ భూటేకు ఊహించని అవకాశం దక్కింది. నచికేత్ తొలిసారి భారత ఎ జట్టుకు ఎంపికయ్యాడు. గత రంజీ సీజన్లో 29 వికెట్లతో అదరగొట్టిన ఈ 26 ఏళ్ల ఆటగాడి కెరీర్పై ఓ లుక్కేద్దాం.రైట్ఆర్మ్ మీడియం పేసర్, రైట్హ్యాండ్ బ్యాటర్ అయిన నచికేత్.. కొత్త బంతితో అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేయడంలో దిట్ట. అలాగే లోయర్ ఆర్డర్లో కీలక బ్యాటర్ కూడా. 2018-19లో విదర్భ అండర్-19 జట్టు వినూ మన్కడ్ ట్రోఫీ సాధించడంలో నచికేత్ కీలకపాత్ర పోషించాడు. అనంతరం అండర్-23 స్థాయిలోనూ తన ప్రతిభ చాటాడు.2019-20 సీకే నాయుడు ట్రోఫీలోనూ నచికేత్ కీలక ప్రదర్శనలు చేశాడు. ఆ సీజన్లో అతడు 8 మ్యాచ్ల్లో 25 వికెట్లు తీసి తన జట్టు టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించాడు.2021లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా సీనియర్ దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన నచికేత్.. ఆ తర్వాత లిస్ట్ ఎ, ఫస్ట్క్లాస్ క్రికెట్లో కూడా అరంగేట్రం చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడిన నచికేత్ 50 వికెట్లు సాధించాడు. గత రంజీ సీజన్లో 29 వికెట్లు తీసిన నచికేత్ విదర్భ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. బ్యాటింగ్లోనూ నచికేత్ ఈ సీజన్లో (2 అర్ద సెంచరీల సాయంతో 196 పరుగులు) రాణించాడు. ఈ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొనే సెలెక్షన్ కమిటీ అతన్ని ఆసీస్ ఎతో సిరీస్కు ఎంపిక చేసింది.కాగా, ఆసీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్లలో మరో ఆశ్చర్యకర ఎంపిక కూడా జరిగింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను వన్డే జట్టుకు ఎంపిక చేశారు. హార్దిక్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ఎంపిక చేయలేదు. రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు భారత పర్యటనకు వస్తోంది. సెప్టెంబరు 22- అక్టోబరు 11 వరకు జరిగే ఈ రెండు సిరీస్లకు పుదుచ్చేరి వేదిక.ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టులకు భారత-‘ఎ’ జట్టుఅమన్ మోఖడే, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్పాండే, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే, నారాయణన్ జగదీశన్ (వికెట్ కీపర్), నచికేత్ భూటే, వి వైశాక్* (ఫిట్నెస్ ఆధారంగా).ఆసీస్ ‘ఎ’తో అనధికారిక వన్డేలకు భారత-‘ఎ’ జట్టుప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధిర్, హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా), ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), గుర్జప్రీత్ సింగ్, యశ్ ఠాకూర్.చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు -
584 పరుగుల ఆధిక్యం.. టైటిల్కు అడుగు దూరంలో ఈస్ట్జోన్!
దులీప్ ట్రోఫీని అందుకునేందుకు ఈస్ట్జోన్ జట్టు అడుగుదూరంలో నిలిచింది. సౌత్జోన్తో జరుగుతున్న ఫైనల్లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 51 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కుమార్ కుషాగ్ర (34), ఖురేషీ (26) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈస్ట్జోన్ 584 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో ఈస్ట్జోన్ గెలుపు లాంఛనమే. ఐదోరోజు ఉదయం సెషన్లో వేగంగా బ్యాటింగ్ చేసి సౌత్జోన్ ముంగిట 650 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్గా ఉంచే అవకాశముంది. ఇంత టార్గెట్ ఛేదించడం అసాధ్యం కాబట్టి మ్యాచ్ డ్రా అవనుంది. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ విజేతగా నిలవనుంది. దీంతో 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీలో ఫైనల్ చేరిన ఈస్ట్జోన్ చాంపియన్గా నిలిచేందుకు అడుగుదూరంలో ఉంది.Photo Credit: BCCI Twitterతొలి ఇన్నింగ్స్ మాదిరే రెండో ఇన్నింగ్స్ను వేగంగా ఆరంభించిన ఈస్ట్జోన్కు ఓపెనర్లు వైభవ్ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) శుభారంభం అందించలేకపోయారు. అయితే మిడిలార్డర్లో శిఖర్ మోహన్ (52), కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), కుమార్ కుషాగ్ర (34) రాణించడంతో ఈస్ట్జోన్ 200 పరుగుల మార్క్ను దాటింది. సౌత్జోన్ బౌలర్లలో సిరాజ్, త్రిపురానా విజయ్, నిదీష్, షేక్ రషీద్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) సెంచరీ చేజార్చుకోగా, పడిక్కల్ (62), సీవీ మిలింద్ (43) పర్వాలేదనిపించారు. ముఖేశ్కుమార్ 3 వికెట్లు తీయగా, షమీ, ఖురేషీ, శికర్ మోహన్లు తలా 2 వికెట్లు పడగొట్టారు.MD Nidheesh breaks the partnership 👏He gets the crucial wicket of East Zone captain Ishan Kishan who played yet another superb knock of 80(98) 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/j9C01OLgmB— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు! -
ఓలీ రాబిన్సన్ 'సెంచరీ'.. 100 ఏళ్లలో అత్యుత్తమం
పాకిస్తాన్తో ఇవాళ మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో సైమ్ అయూబ్ను ఔట్ చేయడంతో అతడు టెస్ట్ల్లో 100 వికెట్లు (24వ టెస్ట్లో) పూర్తి చేశాడు. తద్వారా గత 100 ఏళ్లలో అతి తక్కువ సగటుతో (19.34) 100 వికెట్లు పూర్తి చేసిన బౌలర్గా నిలిచాడు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా 20 కంటే తక్కువ సగటుతో 100 వికెట్లు పూర్తి చేసినప్పటికీ.. అతడి సగటు రాబిన్సన్ సగటు కంటే కాస్త ఎక్కువగా (19.79) ఉంది. మొత్తంగా గడిచిన 100కు పైగా సంవత్సరాల్లో రాబిన్సన్, బుమ్రా మినహా 20 కంటే తక్కువ సగటులో 100 వికెట్లు తీసిన బౌలరే లేడు.చివరిగా ఇంగ్లండ్కే చెందిన సిడ్నీ బార్న్స్ 1901-1914 మధ్యలో 20 కంటే తక్కువ సగటుతో (16.43) 100 వికెట్లు పూర్తి చేశాడు. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు మాత్రమే 20 కంటే తక్కువ సగటుతో 100 వికెట్లు పూర్తి చేశారు. ఈ జాబితాలో సిడ్నీ బార్న్స్ టాప్లో ఉండగా.. రాబిన్సన్, బుమ్రా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.అద్భుతమైన పునరాగమనం2026లో టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత 32 ఏళ్ల రాబిన్సన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతడు, పాకిస్తాన్తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 8 వికెట్లు తీసి మరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ప్రస్తుతం పాక్తో జరుగుతున్న మూడో టెస్ట్లో రాబిన్సన్ మరోసారి చెలరేగడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాబిన్సన్ (2-8)తో పాటు జోఫ్రా ఆర్చర్ (2-18), జోష్ టంగ్ (2-8) నిప్పులు చెరగడంతో పాక్ 64 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో ఉంది. సౌద్ షకీల్ (29), మొహమ్మద్ ఇమ్రాన్ (1) క్రీజ్లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్ -
షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు!
మహిళల ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు హాంకాంగ్పై విజయం సాధించడం ద్వారా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే పాక్ సెమీస్ బెర్తు కంటే పాక్ ప్లేయర్స్ ధరించి షూస్(Footwear)కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. నష్రా సంధు, ఐమన్ ఫాతిమా కోహ్లి వన్8 బ్రాండ్ షూతో కనిపించినప్పటికీ, జట్టులో దాదాపు అందరు ప్లేయర్లు ఇదే బ్రాండ్ షూను ధరించినట్లు తెలుస్తోంది.పాక్ జట్టులో ప్రతీ మహిళా ప్లేయర్ ‘వన్8’ (one8) బ్రాండ్ షూనే ధరించారు. ఈ ‘వన్8’ ఫుట్వేర్ బ్రాండ్ మరెవరిదో కాదు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఇదే ‘వన్8’ షూకు సహ యజమానిగా ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేనప్పటికీ, పాక్ ఆటగాళ్లు తమ సొంత బ్రాండ్ను వదిలేసి టీమిండియా ఐకాన్ ప్లేయర్కు చెందిన బ్రాండ్తో అసోసియేట్ అవ్వడమే ఇక్కడ విశేషం. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన అభిమానులు.. ‘‘పాక్ ఆటగాళ్లకు సొంత బ్రాండ్ అనేది లేదు. తాము ధరించే షూస్పై కూడా భారత్ బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ మన భారత్ బ్రాండ్.’’ అని కామెంట్లు చేయడం ఆసక్తి కలిగించింది.కోహ్లీతో అనుబంధం దృష్ట్యా ‘వన్8’ కంపెనీ షూస్తో పాటు దుస్తులు, ఇతర క్రీడా ఉత్పత్తులను అందించే స్పోర్ట్స్వేర్ బ్రాండ్గా విస్తరించింది. ఈ బ్రాండ్ను తన పోర్ట్ఫోలియోలో కలిగి ఉన్న అగిలిటాస్, వన్8ను కోహ్లీతో కలిసి స్థాపించిన స్పోర్ట్స్వేర్ లేబుల్గా అభివర్ణిస్తుంది. అంతేకాదు కోహ్లి ‘వన్8’ పార్టనర్ ‘అగిలిటాస్’లో పెట్టుబడిదారుడు కూడా. కోహ్లి ఈ కంపెనీలో 400 మిలియన్లు పెట్టుబడి పెట్టడం జరిగింది.సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 72 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్ (47), ఆయేషా జఫర్ (26), ఫాతిమా సనా (24 నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్ జాయ్లీన్ కౌర్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం హాంకాంగ్ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్ (30) టాప్ స్కోరర్గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది.Many players of Pakistan women team was wearing @one8world shoes in asia cup match.I have following questions 1. Products registered in india can't be exported to pak ,so did this deal happened in Dubai? Where matches are being played2.Aisi kya majburi thi @one8world pic.twitter.com/GkVdg3BfUG— varun (@mystic_varunn) September 7, 2026 देखिए पाकिस्तानी महिला क्रिकेटर ईमान फातिमा विराट कोहली के One8 ब्रांड के जूते पहने हुए हैं। 👀पाकिस्तानी खिलाड़ी भी वो अपने खुद के देश के ब्रांड्स से ज्यादा कोहली के ब्रांड पर भरोसा करती हैं।कुछ फैंस कह रहे हैं कि उसने ये जूते स्मृति के किट बैग से चुराए हैं🤣 pic.twitter.com/n5zMtQicDR— Indian🇮🇳 (@singh31919) September 9, 2026Read: ఏ బౌలర్ను వదల్లేదు.. భీకర ఫామ్లో ఇషాన్ కిషన్! -
ఆటగాళ్ల వేలం పూర్తి.. సీజన్-2 కూడా హైదరాబాద్లోనే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రీడా ఉత్సాహాన్ని నింపిన ‘సెంటర్ కోర్ట్ పికిల్బాల్ లీగ్’ (సీసీపీఎల్) రెండో సీజన్కు కూడా మళ్లీ హైదరాబాదే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆటగాళ్ల వేలం పూర్తయింది. థాయిలాండ్లోని ఫుకెట్ వేదికగా సెప్టెంబరు 3 నుంచి 6 వరకు నిర్వహించిన సీజన్-2 ఆటగాళ్ల వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. గత ఏడాది 'హైదరాబాద్ పికిల్బాల్ లీగ్' (హెచ్పీఎల్) పేరిట 8 ఫ్రాంచైజీ జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పుడు 'సీసీపీఎల్'గా మరింత ఆకర్షణీయంగా రెండో సీజన్కు సిద్ధమైంది. ఈ లీగ్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది.ముగిసిన ఆటగాళ్ల వేలం..రిటెన్షన్ల హంగామాపుకెట్లోని 'కోకోనట్ పికిల్బాల్ సెంటర్'లో రెండో సీజన్ కోసం క్రీడాకారుల వేలం నిర్వహించారు. దీనికి ముందే పలు ఫ్రాంచైజీలు తమ కీలక ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాయి. గత సీజన్ చాంపియన్ మ్యావెరిక్స్ జట్టు శ్రీకర్ మొతుకూరిని అట్టిపెట్టుకోగా, రన్నరప్ ఆల్ స్టార్స్ జట్టులోకి సమీర్ వర్మ తిరిగి వచ్చాడు. మిఖిల్ తుమ్మలపల్లి, వివేక్ రెడ్డి తమ పాత ఫ్రాంచైజీల తరఫునే బరిలోకి దిగనున్నారు. కరుణేష్ రెడ్డి, అభయ వేమూరి, గోపీనాథ్ రెడ్డి కూడా రిటెయిన్ ఆటగాళ్ల జాబితాలో నిలిచారు.పూర్తి కొత్త జట్టుతోమరోవైపు.. చార్జర్స్ జట్టు మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అమలు చేసింది. ఒక్కరిని కూడా రిటెయిన్ చేసుకోకుండా నేరుగా ఫుల్ బడ్జెట్తో వేలంలోకి దిగి కొత్త జట్టును నిర్మించుకుంది. రిటెన్షన్ తర్వాత మిగిలిన స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు వేలంలో పోటాపోటీగా తలపడ్డాయి.ఆరు వారాల్లో రెండో సీజన్"లీగ్ ప్రస్థానం హైదరాబాద్లోనే ప్రారంభమైంది. ఇక్కడి నుంచే ఫ్రాంచైజీ ఆధారిత పికిల్బాల్ లీగ్ సామర్థ్యాన్ని గుర్తించాం. తొలి సీజన్ అనుభవాలతో రెండో సీజన్ ను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం" అని సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు యశ్వంత్ బియ్యాల తెలిపారు. మరో సహ వ్యవస్థాపకుడు విక్రాంత్ రావు మాట్లాడుతూ.. ఆటగాళ్ల రిటెన్షన్లు, ప్రీ-ఆక్షన్ పిక్స్ ద్వారా ఈ సీసన్లో ఫ్రాంచైజీల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో స్పష్టమైందని పేర్కొన్నారు. పుకెట్లో వేలం ప్రక్రియ పూర్తి కావడంతో లీగ్ ప్రారంభానికి ఆరు వారాల సమయం ఉంది. జట్లన్నీ సమాయత్తమవ్వడానికి ఇది సరైన సమయమని నిర్వాహకులు వెల్లడించారు. -
ఏ బౌలర్ను వదల్లేదు.. భీకర ఫామ్లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్లో ఉన్నాడు. సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్లో వన్డే తరహా బ్యాటింగ్తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.త్రిపురానాను దంచికొట్టాడు..ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్జోన్, ఆ తర్వాత సౌత్జోన్ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY— Johns. (@CricCrazyJohns) September 9, 2026Read: ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్! -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్
సౌతాఫ్రికా యువ ఓపెనర్ జోర్డన్ హెర్మన్ చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు సమం చేశాడు. నమీబియాతో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో 24 ఏళ్ల హెర్మన్ భారీ సెంచరీతో కదంతొక్కాడు. తద్వారా తన దేశానికే చెందిన సహచర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీతో కలిసి వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.ఈ మ్యాచ్లో హెర్మన్ 126 బంతుల్లో 150 పరుగులు (17 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా.. బ్రీట్జ్కీ 2025 ఫిబ్రవరి 10న న్యూజిలాండ్తో లాహోర్లో జరిగిన తన వన్డే అరంగేట్రంలో 148 బంతుల్లో 150 పరుగులు చేశాడు. వన్డే అరంగేట్రంలో బ్రీట్జ్కీ, హెర్మన్ మినహా ఎవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. ఈ ఘనత సాధించిన ఇద్దరూ సౌతాఫ్రికన్లే కావడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 27 పరుగులకే ఓపెనర్ కానర్ ఎస్టర్హుయిజన్ (10) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ అయిన హెర్మన్, టోనీ డి జోర్జి (72) కలిసి భారీ స్కోర్కు బలమైన పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 166 బంతుల్లో 190 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత సౌతాఫ్రికా స్కోర్ కాస్త నెమ్మదించింది. స్వల్ప వ్యవధిలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోవడంతో కాస్త తడబాటుకు లోనైంది. అయినా 47వ ఓవర్లో 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. 46.4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 302-5గా ఉంది. జేసన్ స్మిత్ (4), కార్బిన్ బాష్ (7) క్రీజ్లో ఉన్నారు. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపల్మన్ 4 వికెట్లతో సత్తా చాటాడు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం సౌతాఫ్రికా నమీబియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న తొలి వన్డేనే ఇది. దీనికి ముందు నమీబియాలోనే జరిగిన టీ20 ట్రై సిరీస్లో సౌతాఫ్రికా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: వైభవ్ సూర్యవంశీకి షాక్ -
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
ఆస్ట్రేలియా-‘ఎ’తో సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. మల్టీ డే మ్యాచ్లకు దేవదత్ పడిక్కల్ను కెప్టెన్గా ఎంపిక చేసిన మెన్స్ సెలక్షన్ కమిటీ.. వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తాడని తెలిపింది.హార్దిక్ పాండ్యాకు చోటుఇక ఆసీస్-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డేలలో తలపడే భారత-‘ఎ’ జట్టులో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా చోటు దక్కడం విశేషం. అయితే, ఫిట్నెస్ ఆధారంగా అతడు జట్టులోకి వస్తాడని బోర్డు వెల్లడించింది. గాయాల బెడదకాగా హార్దిక్ పాండ్యా వివిధ గాయాల కారణంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు అతడు దూరమయ్యాడు. అయితే, ఆసీస్-‘ఎ’తో వన్డే సిరీస్ సందర్భంగా అతడు తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది.రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారత పర్యటనకు వస్తోంది. సెప్టెంబరు 22- అక్టోబరు 11 వరకు జరిగే ఈ రెండు సిరీస్లకు పుదుచ్చేరి వేదిక. ఆస్ట్రేలియా- ‘ఎ’తో అనధికారిక టెస్టులకు భారత-‘ఎ’ జట్టుఅమన్ మోఖడే, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్పాండే, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే, నారాయణన్ జగదీశన్ (వికెట్ కీపర్), నచికేత్ భూటే, వి వైశాక్* (ఫిట్నెస్ ఆధారంగా).ఆసీస్-‘ఎ’తో అనధికారిక వన్డేలకు భారత-‘ఎ’ జట్టుప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధిర్, హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా), ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), గుర్జప్రీత్ సింగ్, యశ్ ఠాకూర్.భారత్-‘ఎ’ వర్సెస్ ఆసీస్-‘ఎ’ సిరీస్ షెడ్యూల్అనధికారిక టెస్టు సిరీస్👉సెప్టెంబరు 22-25: తొలి మల్టీ డే మ్యాచ్- పుదుచ్చేరి👉సెప్టెంబరు 29- అక్టోబరు 2: రెండో మల్టీ డే మ్యాచ్- పుదుచ్చేరిఅనధికారిక వన్డే సిరీస్👉అక్టోబరు 6: తొలి వన్డే- పుదుచ్చేరి👉అక్టోబరు 9: రెండో వన్డే- పుదుచ్చేరి👉అక్టోబరు 11: మూడో వన్డే- పుదుచ్చేరి.చదవండి: సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్బ్లాక్! -
వైభవ్ సూర్యవంశీకి షాక్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో అతడు రెండు స్థానాలు కోల్పోయి 49వ స్థానానికి పడిపోయాడు. ఇదే సమయంలో అతడి ఐపీఎల్ జట్టు (రాజస్థాన్ రాయల్స్) సహచరుడు, దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ లుహాన్ డ్రి ప్రిటోరియస్ ఏకంగా 61 స్థానాలు మెరుగుపర్చుకొని 44 స్థానానికి ఎగబాకాడు.ఇటీవల ముగిసిన నమీబియా ట్రై-సిరీస్లో ప్రిటోరియస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు మ్యాచ్ల్లో 56.50 సగటుతో, 179.37 స్ట్రైక్రేట్తో 226 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ప్రిటోరియస్ మెరుపుల కారణంగా సౌతాఫ్రికా ట్రోఫీని కైవసం చేసుకుంది.భారీ జంప్ కొట్టిన మరో సౌతాఫ్రికన్ప్రిటోరియస్తో పాటు నమీబియా ట్రై సిరీస్లో చెలరేగిన మరో దక్షిణాఫ్రికా ఆటగాడు కానర్ ఎస్టర్హుయిజన్ కూడా ర్యాంకింగ్స్లో భారీ జంప్ కొట్టాడు. ఈ సిరీస్లో 126 పరుగులు చేసిన అతడు, ఏకంగా 65 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్కు చేరుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్.కాగా, టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తన టీ20 టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. పాక్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తమ రెండు, మూడు స్థానాలను కాపాడుకున్నారు. మరో టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.బౌలర్ల విభాగంలో రషీద్ ఖాన్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి అత్యుత్తమంగా ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. చదవండి: 300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్ -
ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్!
టీమిండియా జట్టు అక్టోబర్ చివర్లో న్యూజిలాండ్లో పర్యటించనుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య రెండు నెలల పాటు టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఆరేళ్ల తర్వాత భారత్ న్యూజిలాండ్లో పర్యటించనుండడంతో ఇప్పటినుంచే టికెట్ల హడావిడి మొదలైంది. గత రెండు వారాల్లోనే 50వేల టికెట్లు అమ్ముడైనట్లు న్యూజిలాండ్ క్రికెట్ పేరేంటింగ్ బాడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.మొదట క్రికెట్ నేషన్ సభ్యులు, స్కై కస్టమర్లు, ఏఎన్జెడ్ కస్టమర్ల కోసం రెండు వారాల ప్రీ సేల్ విండో ఇచ్చారు. ఆగస్టు 24న క్రికెట్ నేషన్ ప్రీ సేల్ మొదలైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. తర్వాత అభిమానుల కోసం కూడా టికెట్లను ఓపెన్ చేశారు. ముందుగానే సభ్యత్వం తీసుకున్న వారికి 15 శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. భారత్ సిరీస్ కోసం టికెట్లపై డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన బోర్డు, ఆగస్టులోనే అభిమానులను ప్రీ రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. పబ్లిక్ టికెట్ సేల్స్ మొదలైన తర్వాత కూడా బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి.క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్లో అక్టోబర్ 24న జరిగే రెండో టీ20కు ఇప్పటికే 75 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మైదానంలో భారత్ రెండు టీ20లు ఆడనుంది. అక్టోబర్ 22, 24 తేదీల్లో ఆ మ్యాచ్లు జరగనున్నాయి. హాగ్లీ ఓవల్లో మ్యాచ్లకు ఎప్పుడూ కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులు వస్తారని న్యూజిలాండ్ క్రికెట్ మార్కెటింగ్ హెడ్ టిమ్ ఎల్లిస్ చెప్పారు. కానీ ఒక మ్యాచ్కు ఇంత ముందుగానే మూడు వంతులకుపైగా టికెట్లు అమ్ముడవడం చాలా స్పెషల్ అని అన్నారు. సుమారు 9 వేల మంది సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో నవంబర్ చివర్లో రెండో టెస్ట్ కూడా జరగనుంది.Photo Credit: Twitterరోహిత్, కోహ్లి క్రేజ్..కివీస్ గడ్డపై టీమిండియాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో, తమ అభిమాన క్రికెటర్లను చివరిసారి చూసుకోవాలని అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. 🚨 50,000+ tickets already sold for New Zealand’s home summer of cricket 🇳🇿🏏The India series is driving the madness Christchurch’s 2nd T20I is already 75% sold, while Eden Park has opened its 6th tier for the first time since India’s 2019 tour.The demand for India in NZ is… pic.twitter.com/1i1xu2VHCp— Mid Wicket (@Thinkerr_11) September 9, 2026 Read: ఈస్ట్జోన్దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్! -
300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్
సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మరో మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్లోనూ సత్తా చాటి, మ్యాచ్ మొత్తంలో 300 పరుగులు పూర్తి చేశాడు. త్రిపురణ విజయ్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది ఈ ఘనత సాధించాడు. నాలుగో రోజు టీ విరామం సమయానికి ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ 48, శిఖర్ మోహన్ 34 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. సిరాజ్, త్రిపురణ విజయ్కు తలో వికెట్ దక్కింది.తృటిలో సెంచరీ చేజార్చుకున్న తిలక్అంతకుముందు తిలక్ వర్మ ఒంటరిపోరాటం చేయడంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తిలక్కు చామ మిలింద్ (43) సహకరించడంతో సౌత్ జోన్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. దీనికి ముందు దేవ్దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్లో పడిక్కల్, తిలక్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలో 2 వికెట్లు తీశారు.ఇషాన్ డబుల్ ధమాకాఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.ఈస్ట్జోన్దే టైటిల్సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. చదవండి: సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్ -
అల్కరాజ్కు ఊహించని షాక్.. సెమీస్ చేరకుండానే అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా నంబర్వన్ ప్లేయర్, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ అసాధారణ ఆటతీరు కనబరిచి అల్కరాజ్ను బోల్తా కొట్టించాడు. నాలుగు గంటల 28 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ షెల్టన్ 6–7 (5/7), 6–1, 6–3, 1–6, 7–6 (10/7)తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ను ఓడించి ఈ టోర్నీలో రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.కాగా 2023లో తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న షెల్టన్... సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. గతంలో అల్కరాజ్తో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన షెల్టన్ నాలుగో ప్రయత్నంలో తొలి విజయం రుచి చూశాడు. షెల్టన్ తన కెరీర్లో టాప్–3 ర్యాంకర్పై గెలుపొందడం కూడా ఇదే తొలిసారి. అల్కరాజ్తో జరిగిన మ్యాచ్లో షెల్టన్ తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోయాడు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా రెండు సెట్లు గెలిచాడు.అనంతరం అల్కరాజ్ తేరుకొని నాలుగో సెట్ను దక్కించుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఇద్దరూ ప్రతి పాయింట్కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 6–6తో సమం కావడంతో ‘సూపర్ టైబ్రేక్’ అనివార్యమైంది. కీలకమైన సూపర్ టైబ్రేకర్లో షెల్టన్ తొలుత పది పాయింట్లు సాధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. షెల్టన్, అల్కరాజ్ మ్యాచ్ యూఎస్ ఓపెన్ చరిత్రలో ఆలస్యంగా ముగిసిన మ్యాచ్గా గుర్తింపు పొందింది. అమెరికా కాలమానం ప్రకారం షెల్టన్, అల్కరాజ్ మ్యాచ్ మంగళవారం రాత్రి గం. 11:05 నిమిషాలకు మొదలై బుధవారం తెల్లవారుజామున గం 3:33 నిమిషాలకు ముగిసింది.అంతకుముందు 2022లో అల్కరాజ్, యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 7న బుధవారం రాత్రి గం. 9:35కు మొదలై సెప్టెంబరు 8న గురువారం తెల్లవారుజామున గం. 2:50 నిమిషాలకు ముగిసింది. టియాఫో మూడోసారి... సెమీఫైనల్లో అమెరికాకే చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫోతో షెల్టన్ ఆడనున్నాడు. దాంతో ఒక అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆడటం ఖాయమైంది. అమెరికాకే చెందిన ప్రపంచ 46వ ర్యాంకర్ అలెక్స్ మిచెల్సన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టియాఫో 5–7, 3–6, 7–5, 6–3, 7–6 (10/6)తో గెలుపొంది మూడోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్కు చేరాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో టియాఫో తొలి రెండు సెట్లను కోల్పోయి... ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకోవడం విశేషం. 2022 సెమీఫైనల్లో అల్కరాజ్ చేతిలో, 2024 సెమీఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో ఓడిపోయిన టియాఫో ఈసారి షెల్టన్పై గెలుస్తాడా లేదా వేచి చూడాలి. షెల్టన్, టియాఫోలలో ఎవరు గెలిచినా వారి కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్ అవుతుంది. కొత్త వరల్డ్ నంబర్వన్ రిబాకినా.. సెమీస్లో పెగులామహిళల సింగిల్స్లో రిబాకినా (కజకిస్తాన్) సెమీఫైనల్ చేరుకొని తొలిసారి వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ అందుకుంది. క్వార్టర్ ఫైనల్లో రిబాకినా 3–6, 6–1, 6–4తో కిన్వెన్ జెంగ్ (చైనా)పై నెగ్గింది. మరో క్వార్టర్ ఫైనల్లో పెగూలా (అమెరికా) 3–6, 6–4, 6–3తో ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. -
సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్
చెపాక్ వేదికగా సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్జోన్ విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ 708 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. అందుకు బదులుగా తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ సెంచరీ మిస్సౌత్జోన్ జట్టులో తిలక్ వర్మ (99), దేవదత్ పడిక్కల్ (62) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆ జట్టు 300 మార్కును దాటగలిగింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్కు 300 పరుగులకు పైగా భారీ ఆధిక్యం లభించింది. అంతేకాకుండా సౌత్జోన్ ఫాలో-ఆన్ కూడా దాటలేకపోయింది. వైభవ్ విఫలంఅయినప్పటికీ ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సౌత్జోన్కు ఫాలోఆన్ ఇవ్వకుండా.. వారే రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించేందుకు మైదానంలోకి దిగారు. అయితే ఈస్ట్జోన్ తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ వికెట్లను కోల్పోయింది. సిక్కోలు కుర్రాడి దెబ్బమూడు పరుగులు చేసిన ఈశ్వరన్ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్కు పంపగా.. యువ సంచలనం వైభవ్ను సిక్కోలు కుర్రాడు త్రిపురాన విజయ్ అవుట్ చేశాడు.ఇన్నింగ్స్ ఆరువ ఓవర్లో విజయ్ తొలి బంతిని ఔట్సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్.. ఫ్రంట్ఫుట్కు వచ్చి ఓవర్ కవర్స్ దిశగా భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ అయ్యి అతడి బ్యాట్ను దాటుకుంటూ వికెట్ కీపర్ జగదీశన్ చేతికి వెళ్లింది. వెంటనే జగదేశన్ స్టంప్స్ను గిరాటేశాడు. అప్పటికి క్రీజు బయట ఉండడంతో 8 పరుగులు చేసిన వైభవ్ స్టంపౌట్గా వెనుదిరిగాల్సి వచ్చింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో కూడా విజయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్కోచ్గా వస్తా? -
ఈస్ట్జోన్దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్!
దులీప్ ట్రోఫీని ఈసారి ఈస్ట్ జోన్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్లో సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. ఇదే సమయంలో జట్టులో సభ్యుడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా చరిత్ర సృష్టించనున్నాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 15 ఏళ్లు కావడంతో, అత్యంత పిన్న వయస్సులో దులీప్ ట్రోఫీ నెగ్గిన జట్టలోని ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటికే టోర్నీలో సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన వైభవ్, కప్ను ఈస్ట్జోన్ సొంతం చేసుకుంటే మాత్రం పైన చెప్పుకున్న ఘనత కూడా వైభవ్ ఖాతాలో చేరనుంది.డ్యాన్స్ చేసిన వైభవ్..ఇక మ్యాచ్లో సౌత్జోన్ ఇన్నింగ్స్ సందర్భంగా త్రిపురానా విజయ్ వికెట్ పడినప్పుడు వైభవ్ సూర్యవంశీ డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 708 పరుగులు చేసిన ఈస్ట్జోన్కు పోటీ ఇచ్చే క్రమంలో సౌత్జోన్ తరఫున ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మతో పాటు దేవదత్ పడిక్కల్, సీవీ మిలింద్ కాస్త ప్రతిఘటించారు. తాను ఒక ఎండ్లో పాతుకుపోయినప్పటికీ, మరో ఎండ్లో మాత్రం వరుసగా వికెట్లు పడడంతో వైభవ్ ఉబ్బితబ్బియయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన త్రిపురానా విజయ్ కెప్టెన్తో ఏర్పడిన సయన్వయ లోపంతో రనౌట్గా వెనుదిరిగాడు. ఖురేషీ వేసిన ఆఫ్స్టంప్ బంతిని తిలక్ వర్మ కట్షాట్ ఆడాడు. తనవైపు వచ్చిన బంతిని అభిజిత్ సర్కార్ వేగంగా అందుకొని అంతే వేగంతో వికెట్ కీపర్ ఇషాన్ వైపు విసిరాడు. అప్పటికే తిలక్ సింగిల్ తీయాలా వద్దా అనే డైలమాలోనే ముందుకు పరిగెత్తాడు. దీంతో కాస్త లేటుగా రనప్ అందుకున్న త్రిపురానా విజయ్ స్ట్రైక్ ఎండ్కు చేరేలోపే ఇషాన్ వికెట్లను గిరాటేయడంతో అతడు రనౌట్ అయ్యాడు. విజయానికి చేరువ కావడంతో సంతోషం పట్టలేని వైభవ్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం కెమెరాలకు చిక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీ సాధించగా, కుమార్ కుషాగ్ర (101) సెంచరీ చేశాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థసెంచరీలు సాధించారు. సౌత్జోన్ బౌలర్లలో త్రిపురానా విజయ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌత్జోన్ 107.3 ఓవర్లలో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా, పడిక్కల్ (62) అర్థసెంచరీ సాధించాడు. ఈస్ట్జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.Excellent reflex catch and run out ⚡️Top-fielding efforts bring wickets for East Zone 👌South Zone are 322/8 Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/FKDmQcDYG3— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: ‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’ -
ఇదేమి బ్యాటింగ్ బ్రో.. 25 బంతులాడి డకౌటా?
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2లో డర్హమ్ తరపున ఆడుతున్న భారత వెటరన్ మయాంక్ అగర్వాల్ అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా మిడిలెక్స్తో జరుగుతున్న మ్యాచ్లో మయాంక్ తీవ్ర నిరాశపరిచాడు. సెకెండ్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన అగర్వాల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందిపడ్డాడు. 25 బంతులు ఎదుర్కొన్న ఈ కర్ణాటక బ్యాటర్.. తన ఇన్నింగ్స్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. 19 ఏళ్ల మిడిలెక్స్ బౌలర్ సెబాస్టియన్ మోర్గాన్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి మయాంక్ ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 35 ఏళ్ల మయాంక్ అగర్వాల్ చివరిగా 2022లో శ్రీలంకపై చివరి మ్యాచ్ ఆడాడు. మొత్తంగా అతడు భారత జట్టుకు 21 టెస్టు మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 36 ఇన్నింగ్స్లలో అగర్వాల్ 41.33 సగటుతో 1,488 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. అతడి కెరీర్ బెస్ట్ స్కోర్ 243 పరుగులగా ఉంది.ఈ డబుల్ సెంచరీని 2019లో హోల్కర్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్పై సాధించాడు. ఐపీఎల్-2026లో కూడా అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అంతకుముందు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అగర్వాల్ ఆడాడు.చదవండి: పాపం తిలక్ వర్మ.. ఒక్క పరుగు చేసి ఉంటే? -
‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’
యూఎస్ ఓపెన్లో చెక్ రిపబ్లిక్ స్టార్ ప్లేయర్, ఆరో సీడ్ లిండా నొస్కోవా పోరాటం క్వార్టర్ ఫైనల్స్తోనే ముగిసింది. మహిళల సింగిల్స్లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో సబలెంకా చేతిలో 7–6 (7/1), 4–6, 7–6 (10/7)తో ‘సూపర్ టైబ్రేక్’లో నొస్కోవా ఓటమి చవిచూసింది. ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన నొస్కోవా యూఎస్ ఓపెన్ కూడా గెలిచి రెండో గ్రాండ్స్లామ్ను అందుకోవాలని చూసింది. కానీ ఆమె కల నెరవేరలేదు. మ్యాచ్ ఓటమి అనంతరం నొస్కోవా మాట్లాడుతూ.. ‘ఒక మూడు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉంటాను. ఈ మూడు రోజులు పీకలదాకా మందు తాగి జరిగింది ఒక పీడకలలా మరిచిపోవాలనుకుంటున్నా. 21 ఏళ్లు కావడంతో నాకు మందు తాగేందుకు అనుమతి ఉందని నేను అనుకుంటున్నా’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.Photo Credit: Twitter‘న్యూయార్క్ అంటే చాలా ఇష్టం. ఎలాగూ యూఎస్ ఓపెన్లో నా ప్రయాణం ముగిసింది కాబట్టి ఇక్కడి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నా. నాకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లు చూపించే ప్రేమ, ఆప్యాయతతో రాబోయే కొన్ని గంటల్లోనే ఓటమి బాధను మరిచిపోతాననుకుంటా’ అని వెల్లడించింది.ఇక వరుసగా ఆరో ఏడాది యూఎస్ ఓపెన్లో సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2024, 2025లలో యూఎస్ ఓపెన్లో విజేతగా నిలిచిన సబలెంకా 2023లో ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. 2022, 2021లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించింది. కానీ నొస్కోవాతో పోరులో సబలెంకాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరకు సబలెంకా 2 గంటల 22 నిమిషాల పోరాటం తర్వాత విజయాన్ని అందుకుంది. Photo Credit: Twitterనిర్ణయాత్మక మూడో సెట్లో సబలెంకా 2–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది. అయితే కెరీర్లో నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచిన అనుభవం సబలెంకాకు ఉపయోగపడింది. వెనుకంజలో ఉన్నా ఆందోళన చెందకుండా ఆడిన సబలెంకా ఏడో గేమ్లో నొస్కావా సర్వీస్ను బ్రేక్ చేసి, ఎనిమిదో గేమ్లో తన సర్వీస్ను కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ టైబ్రేక్’ అనివార్యమైంది. ‘సూపర్ టైబ్రేక్’లో తొలుత పది పాయింట్లు సాధించిన ప్లేయర్ విజేత అవుతారు. సూపర్ టైబ్రేక్ ఆరంభంలో ఇద్దరు 3–3తో సమంగా నిలిచాక... సబలెంకా వరుసగా మూడు పాయింట్లు గెలిచి 6–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు 10–7తో ‘సూపర్ టైబ్రేక్ను సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. 11 straight wins at Grand Slam level.Linda Noskova had a summer to remember 👏 pic.twitter.com/OLjo0spg6f— US Open Tennis (@usopen) September 8, 2026Linda Noskova after her loss with Sabalenka:"I will do something. I'm going to stay for, like, three more days. I'm going to get drunk and forget about this, I guess (laughter). I'm old enough to do that, thankfully."BTW, great personality!#tennis #usopen26…— Carlo Galati (@CarloGalati) September 8, 2026చదవండి: ఆఫ్గన్తో టీ20 సిరీస్.. టీమిండియాకు బ్యాడ్న్యూస్! -
708 పరుగులు.. అయినా నో డిక్లరేషన్.. తెలివిలేదా?
దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో అతి భారీ స్కోరు సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సౌత్ జోన్తో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో.. ఇషాన్ కిషన్ సేన సమిష్టిగా రాణించింది.ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందిస్తే.. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) భారీ స్కోరు దిశగా పునాది వేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం పట్టుదలగా ముందుకు సాగాడు.270 పరుగులుఈ క్రమంలో ద్విశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగినప్పటికీ.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. ఇషాన్కు తోడుగా కుమార్ కుశాగ్రా శతకం (101)తో చెలరేగాడు.I.C.Y.M.I2️⃣7️⃣0️⃣ runs3️⃣3️⃣4️⃣ balls3️⃣0️⃣ fours7️⃣ sixes8️⃣0️⃣.8️⃣3️⃣ SRWatch 🎥 highlights of Ishan Kishan's marathon knock 👌👌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/An6sT09tfu— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026708 పరుగులు చేసి ఆలౌట్మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (45) ఎండీ కౌనేన్ ఖురేషి (40) రాణించగా.. టెయిలెండర్ మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్ ఈ మేరకు సమిష్టిగా రాణించి రెండు రోజులు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసింది. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్ 163 ఓవర్లు ఆడి 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.తెలివిలేదా?.. నిజానికి రెడ్బాల్ మ్యాచ్లో ఫలితం తేలాలంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఈ స్థాయి భారీ స్కోరు సాధించడం కంటే.. కాస్త ముందుగానే డిక్లేర్ చేసి.. ఫలితం సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇషాన్ కిషన్ మాత్రం జట్టు ఆలౌట్ అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయించాడు. ఇందుకు రెండు రోజులు తీసుకున్నాడు.నిబంధనల ప్రకారమే తెలివిగానిజానికి ఇలా చేయడం ద్వారా మ్యాచ్ డ్రా అవుతుందే తప్ప ఫలితం తేలదు. అయినా ఇషాన్ ఎందుకిలా చేశాడు?.. ఇషాన్ మాత్రమే కాదు.. ఆ స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా ఇలాగే చేస్తాడు. ఎందుకంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రెడ్బాల్ క్రికెట్ నిబంధనల ప్రకారం..రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్ కోసం టెస్టు మాదిరే ఐదు రోజులు కేటాయిస్తారు. అయితే, ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే గనుక తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసేందుకే మొగ్గుచూపింది.336 పరుగులకే ఆలౌట్.. ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమేఇక సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 709 పరుగులు చేస్తేనే మ్యాచ్పై ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. బుధవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా తొలి ఇన్నింగ్స్లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఫలితంగా ఈస్ట్ జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక బుధవారం ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. గురువారం ఒక్కరోజు మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడించకుండా డ్రా చేసుకునేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి దులిప్ ట్రోఫీ-2026 విజేతగా ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు.చదవండి: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే? -
పాపం తిలక్ వర్మ.. ఒక్క పరుగు చేసి ఉంటే?
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్జోన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి విధించిన ఫాలో-ఆన్ మార్కును సౌత్జోన్ అందుకోలేకపోయింది. ఫాలో-ఆన్కు 173 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ జట్టుకు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.పాపం తిలక్ వర్మఈ తుది పోరులో సౌత్జోన్ కెప్టెన్ తిలక్ వర్మ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు సహచర బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నా.. తిలక్ మాత్రం బాధ్యతాయుతమైన నాక్తో జట్టును ముందుకు నడిపించాడు. అయితే దురదృష్టవశాత్తూ తిలక్ తన 9వ ఫస్ట్క్లాస్ సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయాడు. ఈ హైదరాబాదీ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కౌనైన్ ఖురైషీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అతడితో పాటు దేవ్దత్త్ పడిక్కల్(62), సీవీ మిలింద్(43), జగదీశన్(32) రాణించారు. ఈస్ట్జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు, ఖురేషీ, మహ్మద్ షమీ, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ డ్రా అయితే ఏ జట్టుకు అయితే తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం లభిస్తుందో ఆ టీమ్నే విజేతగా నిర్ణయిస్తారు.చదవండి: వెస్టిండీస్తో సిరీస్.. టీమిండియాలోకి ఆర్సీబీ కెప్టెన్? -
ఆఫ్గన్తో టీ20 సిరీస్.. టీమిండియాకు బ్యాడ్న్యూస్!
స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే వారు ఫిట్నెస్ క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.సుందర్ ఒక్కడే.. హర్షిత్ డౌట్!ఆఫ్గన్తో టీ20 సిరీస్కు మరో మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ నలుగురి ఆటగాళ్లకు సంబంధించి ఫిట్నెస్పై కీలక అప్డేట్ వచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ క్లియరెన్స్ తీసుకొని టీ20 సిరీస్కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హర్షిత్ రానా ఫిట్గా ఉన్నట్లు సమాచారమున్నప్పటికీ అతడికి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు బుమ్రా, నితీశ్రెడ్డిలు మాత్రం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) మెడికల్ టీం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది."సుందర్ ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీం నుంచి క్లియరెన్స్ పొందాడు. సెప్టెంబర్ 4న నిర్వహించిన సిములేషన్ ఎక్సర్సైజ్లో సుందర్ క్లియరెన్స్ పొందాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7న బుమ్రా, నితీశ్రెడ్డి, హర్షిత్ రానాలు మ్యాచ్ సిములేషన్కు పంపించాము. అయితే సిములేషన్లో ఈ ముగ్గురికి సంబంధించిన రిజల్ట్లో తేడాలు ఉన్నట్లు గుర్తించాం. అందుకే ఇవాళ మరోసారి ఈ ముగ్గురిని సిములేషన్ ఎక్సర్సైజ్కు పంపాలని నిర్ణయించాం. ఆ తర్వాత ఈ ముగ్గురి ఫిట్నెస్ క్లియరెన్స్కు సంబంధించిన రిపోర్ట్ వివరాలను వెల్లడిస్తాం" అని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధుల బృందం తెలిపింది.బుమ్రా దూరం.. నితీశ్ కూడా!ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు బుమ్రా అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ రానా మాత్రం ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించడంతో ఆఫ్గన్తో టీ20 సిరీస్కు రెడీ అవుతున్నాడు. ఇక ఆల్రౌండర్ నితీశ్ కుమార్రెడ్డి మాత్రం ఆఫ్గన్తో టీ20 సిరీస్ ఆడడని, అతడిని నేరుగా ఆసియా గేమ్స్లో ఆడేందుకు పంపించనున్నట్లు సీవోఈ మరో ప్రకటనలో తెలిపింది.ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా మోకాలి గాయానికి గురైన బుమ్రా లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ సిరీస్కు ముందే హర్షిత్ రానా కూడా కండరాల గాయంతో రీహాబిలిటేషన్ సెంటర్కు వచ్చేశాడు. నితీశ్రెడ్డి కూడా కండరాల గాయంతోనే ఇంగ్లండ్తో పాటు లంక సిరీస్కు దూరమయ్యాడు. ఈ ముగ్గురితో పాటు పాండ్యా, వరుణ్ చక్రవర్తి కూడా గాయాల నుంచి కోలుకుంటున్నారు.🚨 UPDATE ON BUMRAH, NITISH & HARSHIT 🚨- Harshit Rana is fully fit and should be play in T20I series against Afghanistan.- Jasprit Bumrah is unlikely for T20i series against Afghanistan.- Nitish Kumar Reddy is doubtful for T20i series against Afghanistan & he is most… pic.twitter.com/pisBr2amZL— M A N U. (@Manu_1845) September 9, 2026చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్కోచ్గా వస్తా? -
IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్కోచ్గా వస్తా?
ఐపీఎల్-2027 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తమ కొత్త హెడ్కోచ్ను ఎంపిక చేసే పనిలో పడింది. హేమాంగ్ బదానీ, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ ఆటగాళ్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. మేనేజ్మెంట్ మాత్రం విదేశీ కోచ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్తో సీఎస్కే యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మోర్గాన్ ఈ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. కోచ్గా బాధ్యతలు స్వీకరించడానికి ఏకంగా రూ. 18 నుండి 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు 'రేవ్స్పోర్ట్స్'కథనం పేర్కొంది.కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయి లో గానీ, ఫ్రాంచైజీ క్రికెట్లో గానీ కోచ్గా పనిచేసిన ఎలాంటి అనుభవం మోర్గాన్కు లేదు. అయినప్పటికి అతడు ఈ స్థాయిలో భారీ వేతనం అడగడం సీఎస్కే అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోచింగ్ అనుభవం లేని మోర్గాన్కు రూ. 20 కోట్లు ఇవ్వడం కంటే.. ఇప్పటికే జట్టుతో పనిచేస్తున్న ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ మైఖెల్ హస్సీని హెడ్కోచ్గా ప్రమోట్ చేయడమే బెటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫిట్నెస్ సమస్యల వల్ల ఐపీఎల్కు గుడ్బై చెప్పే యోచనలో ఉన్న దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని హెడ్కోచ్గా నియమిస్తే బాగుంటుందని మరికొందరు సూచిస్తున్నారు.కాగా కోచ్గా అనుభవం లేకపోయినా.. మోర్గాన్ కెప్టెన్గా మాత్రం ఇంగ్లండ్కు 2019 వన్డే వరల్డ్కప్ను అందించాడు. అంతేకాకుండా ఐపీఎల్లో కేకేఆర్ను రన్నరప్గా నిలిపాడు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో అతడి దిట్ట. అయితే అతడి భారీ డిమాండ్కు సీఎస్కే మేనేజ్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.చదవండి: Asia Cup: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు -
పసిడి పతకాలే లక్ష్యంగా...
బెంగళూరు: పసిడి పతకమే లక్ష్యంగా భారత మహిళల, పురుషుల హాకీ జట్లు జపాన్లో జరిగే ఆసియా క్రీడలకు బయలుదేరాయి. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 4 వరకు ఐచి–నగోయా నగరాల్లో ఆసియా క్రీడలు జరగనుండగా... భారత జట్లు మంగళవారం పయనమయ్యాయి. ఇటీవల జరిగిన హాకీ వరల్డ్కప్లో ఐదో స్థానంలో నిలిచిన సలీమా టెటె సారథ్యంలోని భారత మహిళల జట్టు... ఏషియన్ గేమ్స్లో స్వర్ణం గెలిచి తద్వారా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలని భావిస్తోంది. ఈ జట్టుకు జోయర్డ్ మరీనె హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. 1974లో నిర్వహించిన మొదటి మహిళల హాకీ ప్రపంచకప్లో సెమీఫైనల్కు చేరిన టీమిండియా... ఆ తర్వాత ఇటీవలే అత్యుత్తమంగా ఐదో స్థానంలో నిలిచింది. ‘పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆసియా క్రీడలకు బయలుదేరుతున్నాం. ప్రతి టోర్నమెంట్లో కొత్త సవాల్లు ఎదురువడం సహజం. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం అనే నమ్మకముంది’ అని కెపె్టన్ సలీమా వెల్లడించింది.ఇటీవలి కాలంలో నేషన్స్ కప్, వరల్డ్కప్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం తమ ఆటతీరుకు నిదర్శనమని ఆమె చెప్పింది. ‘మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఆసియా గేమ్స్లో అగ్రస్థానంలో నిలవడం ద్వారా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్నకు అర్హత సాధించాలనుకుంటున్నాం. అందుకు కావాల్సిన విధంగా ఆడుతాం. క్రమశిక్షణ, నిలకడ ముఖ్యం. ప్రతీ మ్యాచ్లో దీన్ని కొనసాగించాలనుకుంటున్నాం. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలం’ అని సలీమా వివరించింది. పటిష్ట జట్టుతో..ఆతిథ్య జపాన్, థాయ్లాండ్, సింగపూర్, ఇండోనేసియా, ఉజ్బెకిస్తాన్లతో కలిసి భారత మహిళల జట్టు పూల్ ‘బి’ నుంచి పోటీపడనుంది. సెపె్టంబర్ 20న ఉజ్బెకిస్తాన్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం 21న ఇండోనేసియాతో, 23న థాయ్లాండ్తో, 25న జపాన్తో, 27న సింగపూర్తో తలపడనుంది. పూల్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు సెమీఫైనల్ చేరుతాయి. ఈ నెల 30న సెమీఫైనల్ ... అక్టోబర్ 2న ఫైనల్ జరుగుతుంది. ఈ క్రీడల కోసం కెపె్టన్ సలీమా టెటె సారథ్యంలో 20 మందితో కూడిన జట్టును ప్రకటించారు. అందులో సవితతో పాటు బిచ్చూ దేవి గోల్ కీపర్లు కాగా... ఇషిక, సుశీలా చాను, లాల్థన్లువాంగి, జ్యోతి, శిల్పి రూపంలో ఐదుగురు డిఫెండర్లు... నిక్కీ ప్రధాన్, సాక్షి రాణా, సునెలితా టొప్పో, సలీమా టెటె, నేహా, దీపిక సొరెంగ్ రూపంలో ఆరుగురు మిడ్ఫీల్డర్స్... లాల్రెమ్సియామి, రుతుజా, నవ్నీత్, దీపిక, ఇషిత, బల్జీత్ కౌర్, బ్యూటీ డుంగ్డుంగ్ రూపంలో ఏడుగురు ఫార్వర్డ్స్గా ఉన్నారు. ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో రజతం నెగ్గిన టీమిండియా... నేషన్స్ కప్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు అజేయంగా నిలిచింది. అమెరికా, జపాన్, ఉరుగ్వే, చిలీ, న్యూజిలాండ్ను మట్టికరిపించి టైటిల్ కైవసం చేసుకుంది. -
ధోనితో ఉన్న ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా?
టీమిండియా క్రికెటర్లకు సంబంధించి చాట్ జీపీటీ ద్వారా చేసిన పాత ఫోటోల ప్రయోగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మన ప్రస్తుతం క్రికెటర్లు 80వ దశకంలో ఇలా ఉండేవారంటూ పెట్టిన చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి.ఇందులో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, టీ20 స్పెషలిస్టు సంజు శాంసన్, టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ, విధ్వంసకర వీరుడు అభిషేక్ శర్మ చాట్ జీపీటీ ఫోటోల ద్వారా నాటి ట్రెండ్ను గుర్తుకు తెచ్చారు!PC: Star Sports Xవీరిని గుర్తుపట్టడం కష్టమే!స్టార్ స్పోర్ట్స్ కన్నడ ధోనితో సంజూ.. గిల్, హార్దిక్ పాండ్యాలతో శ్రేయస్ అయ్యర్.. అభిషేక్ శర్మతో వైభవ్ సూర్యవంశీ కలిసి ఉన్న ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. ఇందులో సంజూ, శ్రేయస్ అయ్యర్ను తప్ప మిగతా వారందరినీ సులువుగానే గుర్తుపట్టొచ్చు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. PC: Star Sports Xముందు స్వదేశంలో.. ఆ తర్వాత జపాన్లోఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ వేదికగా టీమిండియా- అఫ్గాన్ మధ్య సెప్టెంబరు 13,15, 17 తేదీల్లో ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఇక్కడ అఫ్గాన్ బోర్డు టీమిండియాకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఇక ఈ సిరీస్ తర్వాత వీరంతా ఆసియా క్రీడలు-2026 టోర్నీతో బిజీ కానున్నారు.మరోవైపు.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదని సమాచారం. ఫలితంగా అఫ్గాన్తో టీ20 సిరీస్కు అతడు దూరమయ్యాడు. కాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత టీ20 జట్టు జపాన్లో ఆసియా క్రీడల్లో పాల్గొనే సమయంలో.. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో వన్డే జట్టు స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్ ఆడనుంది. చదవండి: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు -
ఏకంగా రూ. 130 కోట్లు!.. ఎవరు ఎంత చెల్లిస్తారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చే రెండేళ్ల పాటు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లకు సంబంధించి మూడు సంస్థలను అసోసియేట్ స్పాన్సర్లుగా ఎంచుకుంది.క్యాంపా కోలా, ఎస్బీఐ లైఫ్తో పాటు చాట్ జీపీటీతో బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలలో ప్రారంభమయ్యే వెస్టిండీస్తో సిరీస్ మొదలు 2028 మార్చి కొనసాగే ఈ కాంట్రాక్ట్లో భారత్ 35 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది.ఈ స్పాన్సర్షిప్ విలువ సుమారు రూ.130 కోట్లుగా ఉందని ప్రకటించిన బీసీసీఐ... గతంతో పోలిస్తే ఇది దాదాపు 44 శాతం ఎక్కువ అని ప్రకటించింది. విడివిడిగా బోర్డు వివరాలు వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఒక్కో మ్యాచ్కు క్యాంపా కోలా రూ.1.31 కోట్లను చెల్లించనుండగా... ఎస్బీఐ లైఫ్, చాట్ జీపీటీ మ్యాచ్కు రూ.1.20 కోట్లు చొప్పున చెల్లిస్తాయి.ఇదీ చదవండిమెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తమ టీ20 లీగ్ టోర్నీ ‘బిగ్బాష్‘ను 15 సీజన్ల పాటు నిర్వహించింది. ఇప్పటి వరకు టోరీ్నకి సొంతదారుగా సీఏనే వ్యవహరించింది. జట్లతో పాటు టోర్నీల నిర్వహణ, ఆటగాళ్ల ఎంపికవంటి అంశాలన్నీ స్వయంగా బోర్డు పర్యవేక్షణలోనే జరిగాయి. అయితే ఇప్పుడు లీగ్లో ప్రైవేట్ సంస్థలను భాగస్వాములను చేయాలని సీఏ నిర్ణయించింది. లీగ్లో ప్రైవేట్ పెట్టుబడుల అనుమతికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈ క్రమంలో ముందుగా మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులో 100 శాతం వాటా అమ్మకానికి పచ్చ జెండా ఊపింది. ఆటగాళ్ల చెల్లింపులు, టీమ్ విలువ, క్రికెటర్స్ అసోసియేషన్తో సంప్రదింపులు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రాకపోయినా సీఏ ముందుకు వెళ్లడం ఆసీస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇవన్నీ తేలిన తర్వాతే బిగ్ బాష్కు సంబంధించిన ఎంఓయూలపై ఒప్పందం కుదరవచ్చని తెలుస్తోంది. -
వెస్టిండీస్తో సిరీస్.. టీమిండియాలోకి ఆర్సీబీ కెప్టెన్?
ఈ ఏడాది అక్టోబర్లో భారత క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా లభించనుంది. ఒకవైపు జపాన్లో జరిగే ఆసియా క్రీడలులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఒక భారత జట్టు బరిలోకి దిగుతుండగా.. స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్లో మరో జట్టు తలపడనుంది. ఏషియన్ గేమ్స్లో నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు సెప్టెంబర్ 28న క్వార్టర్స్, అక్టోబర్ 1న సెమీఫైనల్స్ ఆడనుంది. పతక పోరు (ఫైనల్, మూడో స్థానం మ్యాచ్) అక్టోబర్ 3న జరగనుంది.ఇదే సమయంలో వెస్టిండీస్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత్లో పర్యటించనుంది. తొలి రెండు వన్డేలు సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరగనుండగా.. ఆఖరి వన్డే అక్టోబర్ 3న షెడ్యూల్ అయింది. అయితే భారత్ ఒకవేళ ఆసియా క్రీడల్లో ఫైనల్/మెడల్ రౌండ్కు అర్హత సాధిస్తే.. అక్టోబర్ 3న ఒకే రోజు వేర్వేరు వేదికలపై రెండు భారత జట్లు ఆడే అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది.శ్రేయస్ అయ్యర్ దూరంకాగా ఆసియా క్రీడల బాధ్యతల కారణంగా స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్కు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ పేరును బీసీసీఐ సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాటిదార్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో కూడా అతడు దుమ్ములేపాడు. శ్రేయాస్ లాగే మిడిలార్డర్లో రాణించే సత్తా పాటిదార్ ఉంది.మరోవైపు ఆసియా క్రీడల కోసం పయనమవుతున్న భారత క్రీడాకారుల బృందానికి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు. భారత అథ్లెట్లు, క్రికెట్ జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పసిడి పతకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఆసియా క్రీడలకు భారత పురుషల జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ. -
ఏషియన్ గేమ్స్.. టీమిండియా బసపై బీసీసీఐ కీలక ప్రకటన!
ఆసియా క్రీడల్లో ఆటగాళ్లకు కల్పించే వసతి సౌకర్యాలు బాగా లేవని, భారత క్రికెటర్లు అలాంటి చోట ఉండటానికి ఇష్టపడటం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై క్రీడల నిర్వాహక కమిటీ అవసరమైతే ప్లేయర్లు తమకు నచి్చన హోటళ్లలో ఉండవచ్చంటూ వెసులుబాటు కూడా కల్పించింది.అయితే ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు స్పష్టతనిచ్చింది. టీమిండియా ఆటగాళ్లు నిర్వాహకులు కలి్పంచిన వసతి సౌకర్యాలనే వాడుకుంటారని, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. జపాన్లోని నగోయాలో నిర్వాహకులు మెరుగైన సౌకర్యాలే కల్పిస్తారని నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. "విదేశీ పర్యటనల్లో మనకు లభించే ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు ఇప్పుడు ఉండకపోవచ్చనేది వాస్తవం. అయితే నిర్వాహకులు ఎలాంటి వసతి కల్పించినా మన ఆటగాళ్లు అక్కడే ఉంటారు. అద్భుతంగా కాకపోయినా అవి సౌకర్యంగానే ఉంటాయని నమ్ముతున్నాం. నగోయాలో ఉండే వసతి, వారు ఎంచుకున్న చిన్న తరహా హోటల్ గదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూశాం. అవి బాగానే ఉన్నాయి. కాబట్టి టీమిండియా ఆటగాళ్లు వాటినే వాడుకుంటారు. ఇక్కడ మేం ప్రత్యేకంగా తీసుకోవాలనుకున్నా ఎలాంటి పెద్ద హోటల్స్ లేవు. ఈవెంట్కు చాలా దూరంలో ఉండే ఒసాకా లేదా టోక్యోలలో బస చేయడానికి అవకాశం లేదు" అని శుక్లా పేర్కొన్నారు. అయితే వసతికంటే పిచ్, గ్రౌండ్, డ్రెస్సింగ్ రూమ్వంటి అంశాల విషయంలోనే తమకు కొంత సమస్య అనిపించిందని, దీనిని సమావేశంలో నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చామని శుక్లా అన్నారు. చదవండి: Asia Cup: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు -
టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఖరారు
మహిళల ఆసియాకప్-2026లో భారత జట్టు సెమీఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. మంగళవారం యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్తో బంగ్లాదేశ్ తలపడనుంది.ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ను యూఏఈ బౌలర్లు దెబ్బతీశారు. సురక్ష కొట్టె (3/11), ఇందుజ నందకుమార్ (2/21) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో షార్మిన్ అక్తర్ (31 బంతుల్లో 38; 3 ఫోర్లు), నహిదా అక్తర్ (26 బంతుల్లో 16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి 7వ వికెట్కు 42 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేయగలిగింది.అనంతరం 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ, బంగ్లా బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా స్పిన్నర్ రబేయా ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా, మరుఫా అక్తర్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్.. మ్యాచ్లను ఎక్కడ చూడాలంటే? -
భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్.. మ్యాచ్లను ఎక్కడ చూడాలంటే?
భారత్, అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఈ నెల 13 నుంచి జరుగనున్న మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెపె్టంబర్ 13, 15, 17న వరుసగా మూడు టి20 మ్యాచ్లు జరుగనున్నాయి.ఈ సిరీస్ భారత్లో జరుగుతున్నప్పటికీ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు దీనికి ఆతిథ్యమివ్వనుంది. ‘భారత్–అఫ్గానిస్తాన్ టి20 సిరీస్... సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేయనుంది. ‘ఫెస్టివల్ ఆఫ్ స్పోర్ట్స్’లో ఇది రసవత్తర సిరీస్గా నిలుస్తుంది’ అని సోనీ పిక్చర్స్ అధికారి రాజేశ్ కౌల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా పలువురు అఫ్గానిస్తాన్ ప్లేయర్లు స్టార్లుగా ఎదగగా... ఇప్పుడు టీమిండియాపై వారు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది కీలకం. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, తిలక్ వర్మ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉండగా... పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఫిట్నెస్ సాధిస్తేనే జట్టులో ఉండనున్నారు. మరోవైపు ఇబ్రహీం జద్రాన్ నాయకత్వంలోని అఫ్గానిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్, రహా్మనుల్లా గుర్బాజ్, సాదిఖుల్లా అటల్, అజ్మతుల్లా, గుల్బదీన్ నైబ్, నబీ వంటి ప్రతిభావంతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్తో సిరీస్ ఆడేందుకు ఆతృతగా ఉన్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్ అన్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన జట్లలో ఒకటైన టీమిండియాతో సిరీస్ ద్వారా తమ ప్రతిభ చాటుకునే అవకాశం అఫ్గాన్ ప్లేయర్లకు లభిస్తుందని ఆయన వెల్లడించారు.చదవండి: గంటల వ్యవధిలో మరో పాక్ ప్లేయర్పై ఐసీసీ చర్యలు -
భారత పారా ఆర్చర్లకు ఐదు పతకాలు
అహ్మదాబాద్: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్–3 టోర్నిలో భారత ఆర్చర్లు ఐదు పతకాలతో మెరిశారు. మంగళవారం భారత ఆర్చర్లు రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తోమన్ కుమార్–శ్యామ్ సుందర్ స్వామి (భారత్) 152–139తో అబ్బాస్–అన్వర్ (ఇరాక్)లపై గెలిచి బంగారు పతకం నెగ్గారు. పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో హరి్వందర్ సింగ్–విజయ్ సుంది (భారత్) 6–2 (34–37, 36–31, 38–34, 35–31) సెట్ పాయింట్ల తేడాతో డేవిడ్ ఇవాన్–డెనిస్ ఇవాన్ (స్లొవేకియా)లపై విజయం సాధించి పసిడి పతకం గెలిచారు. మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భావన–పూజ (భారత్) 0–6 (23–34, 33–35, 30–31) సెట్ పాయింట్ల తేడాతో లియాంగ్ కియురోంగ్–చెన్ యు (చైనా) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకున్నారు. మిక్స్డ్ టీమ్ డబ్ల్యూ1 రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో స్వాతి–ఆదిల్ మొహమ్మద్ నాజిర్ అన్సారి (భారత్) 1–5 (31–38, 33–37, 33–33) సెట్ పాయింట్లతో సర్కా ముసిలోవా–డేవిడ్ డ్రహోన్స్కయ్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి పాలై రజత పతకం కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత డబ్ల్యూ1 కాంస్య పతక మ్యాచ్లో స్వాతి 6–2 (28–25, 27–27, 26–26, 26–24) సెట్ పాయింట్లతో ఎలీనా క్రుతోవా (కజకిస్తాన్)పై గెలిచింది. -
మళ్లీ ‘బ్లూ’ జెర్సీతో...
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా భారత హాకీ జట్టుకు గుర్తింపుగా ఉన్న ‘బ్లూ’ జెర్సీని వదిలి ఇటీవల ప్రపంచకప్లో మన టీమ్ కాషాయం రంగు జెర్సీతో బరిలోకి దిగింది. దాంతో ఈ అంశం వివాదాస్పదం కాగా, హాకీ ఇండియా (హెచ్ఐ)లో విభేదాలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు ఇప్పుడు మళ్లీ పాత రంగుకే ఓటు వేసింది. ఆసియా క్రీడల్లో మన టీమ్ ఎప్పటిలాగే నీలిరంగు జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ తిర్కీ ఖరారు చేశారు. ‘ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు కిట్ రంగు విషయంలో మా ప్రాధాన్యత వెల్లడించాలని ఒలింపిక్ సంఘం కోరింది. మేం తొలి ప్రాధాన్యతంగా నీలి రంగును ఎంపిక చేసుకున్నాం. కాషాయం రంగు శాశ్వతం కాదని, మున్ముందు మారవచ్చని వరల్డ్ కప్ సమయంలోనే నేను చెప్పాను. ఇప్పుడు నీలి రంగు మళ్లీ వచ్చింది. భారత హాకీ టీమ్ ‘బ్లూ’తో బరిలోకి దిగుతుంది’ అని తిర్కీ స్పష్టం చేశారు. వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగిన టర్ఫ్లు నీలి రంగులో ఉండటంతో మన జెర్సీ రంగు కలిసిపోయి ఆటగాళ్లకు ఇబ్బంది అవుతుందని భావిస్తూ రంగు మార్చామంటూ నాడు హెచ్ఐ వివరణ ఇచ్చింది. కానీ దీనిపై అన్ని వైపులనుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ కప్ను ఎనిమిదో స్థానంతో ముగించిన భారత జట్టుకు ఆసియా క్రీడలకు కీలకం కానున్నాయి. ఇక్కడి ప్రదర్శనను బట్టి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు జట్టు అర్హత సాధించేందుకు అవకాశం ఉంది. -
సబలెంకా శ్రమించి...
న్యూయార్క్: ‘హ్యాట్రిక్’ యూఎస్ ఓపెన్ టైటిల్ దిశగా బెలారూస్ స్టార్ సబలెంకా మరో అడుగు ముందుకు వేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/1), 4–6, 7–6 (10/7)తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆరో సీడ్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్)పై అద్భుత విజయం సాధించింది. తద్వారా వరుసగా ఆరో ఏడాది యూఎస్ ఓపెన్లో సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2024, 2025లలో యూఎస్ ఓపెన్లో విజేతగా నిలిచిన సబలెంకా 2023లో ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. 2022, 2021లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచిన నొస్కోవాతో జరిగిన పోరులో సబలెంకాకు తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. చివరకు సబలెంకా 2 గంటల 22 నిమిషాల పోరాటం తర్వాత విజయాన్ని అందుకుంది. నిర్ణాయక మూడో సెట్లో సబలెంకా 2–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది. అయితే కెరీర్లో నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచిన అనుభవం ఆమెకు పనికొచి్చంది. వెనుకంజలో ఉన్నా... ఆందోళన చెందకుండా ఆడిన సబలెంకా ఏడో గేమ్లో నొస్కావా సర్వీస్ను బ్రేక్ చేసి, ఎనిమిదో గేమ్లో తన సర్వీస్ను కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ టైబ్రేక్’ అనివార్యమైంది. ‘సూపర్ టైబ్రేక్’లో తొలుత పది పాయింట్లు సాధించిన ప్లేయర్ విజేత అవుతారు. సూపర్ టైబ్రేక్ ఆరంభంలో ఇద్దరు 3–3తో సమంగా నిలిచాక... సబలెంకా వరుసగా మూడు పాయింట్లు గెలిచి 6–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు 10–7తో ‘సూపర్ టైబ్రేక్ను సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో మాజీ విజేత, నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) గెలుపొంది క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కోకో గాఫ్ 93 నిమిషాల్లో 6–1, 6–4తో ఇవా జోవిచ్ (అమెరికా)పై, రిబాకినా 66 నిమిషాల్లో 6–1, 6–4తో 2018, 2022 చాంపియన్, 13వ సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై గెలుపొందారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఐదో సీడా మిరా ఆండ్రీవా (రష్యా)తో కోకో గాఫ్; కిన్వెన్ జెంగ్ (చైనా)తో రిబాకినా తలపడతారు.జ్వెరెవ్ ముందంజ...పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 28వ సీడ్ అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం), అన్సీడెడ్ ప్లేయర్లు ఖచనోవ్ (రష్యా), బోటిక్ వాన్ డె జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో జ్వెరెవ్ 6–2, 6–2, 7–6 (7/3)తో లూసియానో దర్దెరి (ఇటలీ)పై, బ్లాక్స్ 6–3, 4–6, 7–5, 7–5తో 24వ సీడ్ ఫ్రాన్సిస్కో సెరున్డోలో (అర్జెంటీనా)పై, ఖచనోవ్ 3 గంటల 50 నిమిషాల్లో 7–5, 4–6, 6–7 (6/8), 6–1, 6–4తో 14వ సీడ్ లెర్నర్ టియెన్ (అమెరికా)పై, జాండ్షుల్ప్ 5 గంటల 13 నిమిషాల్లో 3–6, 6–7 (0/7), 7–6 (9/7), 7–6 (7/3), 6–4తో అలెక్స్ గియా (ఫ్రాన్స్)పై గెలుపొందారు. గియాతో జరిగిన మ్యాచ్లో జాండ్షుల్ప్ మూడో సెట్లో రెండు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం విశేషం. సెమీఫైనల్లో బంగ్లాదేశ్దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో యూఏఈపై నెగ్గింది. 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్ల ద్వారా బంగ్లాదేశ్ సెమీస్ చేరింది. గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానం దక్కించుకున్న టీమిండియాతో గురు వారం జరిగే సెమీఫైనల్లో ... గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ ఆడుతుంది. -
గంటల వ్యవధిలో మరో పాక్ ప్లేయర్పై ఐసీసీ చర్యలు
మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్తాన్ ప్లేయర్లకు వరుస షాక్లు తగులుతున్నాయి. మైదానంలో అతి చేసినందుకు ఇద్దరు ప్లేయర్లపై ఐసీసీ గంటల వ్యవధిలో చర్యలు తీసుకుంది. భారత్తో మ్యాచ్లో ఓవరాక్షన్ చేసినందుకు నిన్న ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించగా.. నిన్న హాంకాంగ్ చైనాతో మ్యాచ్లో అతి చేసినందుకు ఇవాళ గుల్ ఫెరోజాపై కూడా అవే చర్యలు (మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్) తీసుకుంది.ఫెరోజా నిరసనహాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేయగా.. ఫెరోజా వన్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన ఆమె.. అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించకుండా నిరసన తెలిపింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇలా చేయడం నిబంధనల ఉల్లంఘణ కిందికి వస్తుంది. దీంతో రిఫరి ఫెరోజాపై చర్యలు తీసుకున్నారు. ఫాతిమా ఓవరాక్షన్భారత్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో ఫాతిమా సనా చాలా అతి చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత పెవిలియన్కు దారి చూపిస్తూ దురుసుగా ప్రవర్తించింది. దీనిపై ఐసీసీ సీరియస్గా రియాక్ట్ అయ్యింది. ఫాతిమా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్దారించి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా, అలాగే ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను జత చేసింది.ఇదిలా ఉంటే, భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక సెమీస్కు చేరుకున్నాయి. ఇవాళ బంగ్లాదేశ్-యూఏఈ మ్యాచ్ విజేతతో భారత్ సెమీస్లో తలపడుతుంది. పాకిస్తాన్, శ్రీలంక రెండో సెమీస్లో పోటీపడతాయి. భారత్ మ్యాచ్ సెప్టెంబర్ 10న, శ్రీలంక-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగునున్నాయి. చదవండి: పాక్తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు! -
షమీకి వార్నింగ్
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చారు. సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో బంతి స్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో షమీతో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లందరినీ అంపైర్ హెచ్చరించారు.మ్యాచ్ మూడో రోజు చివరి సెషన్లో (60వ ఓవర్) ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మ బంతిని పరిశీలించారు. బంతిని మెరిపించేందుకు ఆటగాళ్లు (ఈస్ట్ జోన్) అతిగా చెమటను ఉపయోగించవద్దని సూచించారు. నిబంధనల ప్రకారం బంతి స్వభావాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చడం నిషేధం.కాగా, ఈస్ట్ జోన్ బౌలర్లు పాత బంతితోనూ రివర్స్ స్వింగ్ రాబట్టి సౌత్ జోన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా షమీ (2-17), ముకేశ్ కుమార్ (2-36) అద్బుతంగా బౌలింగ్ చేసి సౌత్ జోన్ను కష్టాల్లోకి నెట్టారు. వీరి ధాటికి సౌత్ జోన్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 242 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది. సౌత్ జోన్ను కెప్టెన్ తిలక్ వర్మ (56 నాటౌట్) గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.చదవండి: నిప్పులు చెరిగిన షమీ.. సౌత్జోన్ కకావికలం -
భారత హాకీ జట్టు జెర్సీ మార్పు..?
భారత హాకీ జట్ల జెర్సీ రంగుపై నెలకొన్న చర్చకు తెరపడింది. త్వరలో (సెప్టెంబర్ 18 నుంచి) ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సంప్రదాయ నీలం రంగు జెర్సీతోనే బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ప్రపంచకప్లో హాకీ ఇండియా కాషాయం రంగు జెర్సీని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ చర్య అప్పట్లో వివాదాస్పదమైంది. భారత మాజీ కెప్టెన్ వీరెన్ రాస్కిన్హా సహా పలువురు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే జెర్సీ రంగు మార్పునకు విజిబులిటి కారణమని హాకీ ఇండియా వివరణ ఇచ్చింది. నీలం రంగు సింథటిక్ టర్ఫ్తో కలిసిపోయే అవకాశం ఉండటంతో ఆటగాళ్లను స్పష్టంగా గుర్తించేందుకు ప్రత్యామ్నాయ రంగును ఎంచుకున్నట్లు తెలిపింది.నీలం రంగే ముద్దుఆసియా క్రీడల నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం జట్టు జెర్సీపై హాకీ ఇండియా అభిప్రాయాన్ని కోరగా, నీలం రంగును తొలి ఎంపికగా, కాషాయాన్ని రెండో ఎంపికగా సూచించినట్లు హాకీ ఇండియా కోశాధికారి శేఖర్ మనోహరన్ తెలిపారు.చదవండి: వీరంగం సృష్టించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ -
మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు ప్రమోషన్
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) మూడో సీజన్ కోసం ఆస్ట్రేలియా చాంపియన్స్ జట్టు తమ కెప్టెన్గా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను ఎంపిక చేసింది. కాగా ఈ జట్టుకు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ యజమానిగా ఉన్నాడు. మూడో సీజన్లో తనతో పాటు పునీత్ సింగ్ కూడా జట్టు యజమానిగా వ్యవహరించనున్నట్లు పాంటింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. "మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వడమే గాక గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడుతుండడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. అంతేకాదు మా ఆటతీరుతో అభిమానులను అలరించబోతున్నామన్న విషయం సంతోషం కలిగిస్తుంది" అని వార్నర్ చెప్పుకొచ్చాడు. పాంటింగ్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియన్ చాంపియన్స్ జట్టులో భాగం కావడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. పునీత్తో పాటు జట్టుతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా. డేవిడ్ నాయకత్వంలో మా జట్టు అద్భుత ప్రదర్శన చేసి అభిమానులను అలరిస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు. ఇక వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)టోర్నీ మూడో సీజన్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి యూఏఈ ఆతిథ్యమివ్వనుంది. అయితే ఈ టోర్నీ యూకే వెలుపల జరగడం ఇదే తొలిసారి. లెజెండ్స్ క్రికెట్ లీగ్ మూడో సీజన్లో వార్నర్తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో, షాహిద్ అఫ్రిది, మోయిన్ అలీ, మహ్మదుల్లా సహా ఇతర క్రికెటర్లు ఆడనున్నారు. ఇక మూడో సీజన్కు బంగ్లాదేశ్ చాంపియన్లను చేర్చడం ద్వారా డబ్ల్యూసీఎల్ తన అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని విస్తరించింది. మొదటి సీజన్లో పాక్ను ఓడించి ఇండియా లెజెండ్స్ చాంపియన్గా నిలవగా, రెండో సీజన్లో సౌతాఫ్రికా లెజెండ్స్ టైటిల్ నెగ్గారు.Read: పాక్తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు! -
పోరాడుతున్న తిలక్ వర్మ
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల అతి భారీ స్కోర్ చేయగా.. సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది (మూడో రోజు ఆట ముగిసే సమయానికి). ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆ జట్టు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది.129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌత్ జోన్ను తిలక్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్మరణ్ రవిచంద్రన్తో కలిసి ఐదో వికెట్కు 45 పరుగులు, శ్రేయస్ గోపాల్తో కలిసి ఆరో వికెట్కు 66 పరుగులు జోడించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తిలక్ 56, చామ మిలింద్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.సౌత్ జోన్ ఇన్నింగ్స్లో దేవ్దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. రికీ భుయ్ 1, నారాయణ్ జగదీశన్ 32, షేక్ రషీద్ 27, స్మరణ్ రవిచంద్రన్ 23, శ్రేయస్ గోపాల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్, ఖురేషి చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.చదవండి: పాక్తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు! -
దుమ్మురేపిన దీప్తి శర్మ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ దుమ్మురేపింది. ఆసియా కప్ 2026లో అదిరిపోయే ప్రదర్శనలు చేస్తున్న ఆమె, బౌలర్ల ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. మరో భారత బౌలర్ శ్రీ చరిణి టాప్ ర్యాంక్ను కాపాడుకోగా.. మరే భారత బౌలర్ టాప్-10లో లేరు.బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత బ్యాటర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ, హర్మన్ప్రీత్ 5, 7, 10 స్థానాలను నిలబెట్టుకున్నారు. ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ సైతం టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది.పిసినారి దీప్తిఆసియా కప్లో దీప్తి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోకేవలం 1.90 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. థాయ్లాండ్పై 3/0, హాంకాంగ్-చైనాపై 3/9, పాకిస్తాన్పై 2/5 గణాంకాలతో చెలరేగింది.భరతం పట్టిన స్పిన్నర్లుతాజాగా జరిగిన మ్యాచ్లో భారత స్పిన్నర్లు పాక్ ప్లేయర్ల భరతం పట్టారు. శ్రీ చరణి, ప్రేమ రావత్ చెరో మూడు వికెట్.. దీప్తి రెండు వికెట్ల చెలరేగి పాక్ ఇన్నింగ్స్ను 55 పరుగులకే కుప్పకూల్చారు. ఆతర్వాత బ్యాటర్లు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ అప్పటికే సెమీస్కు అర్హత సాధించింది. ఇవాళ బంగ్లాదేశ్-యూఏఈ మ్యాచ్ విజేతతో భారత్ సెమీస్లో తలపడుతుంది. మరోవైపు పాకిస్తాన్, శ్రీలంక రెండో సెమీస్లో పోటీపడతాయి. భారత్ మ్యాచ్ సెప్టెంబర్ 10న, శ్రీలంక-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగునున్నాయి.చదవండి: క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం! -
పాక్తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ల మధ్య శత్రుత్వం అంతకంతకూ పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఒక ప్రచార వీడియోను రూపొందించిది. ఆ వీడియోల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), గిల్గిట్ బాల్టిస్తాన్లను భారతదేశ సరిహద్దులో భాగంగా చూపించింది. ఈ వీడియోను ఏసీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది."మా దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. ఘనమైన చరిత్ర, సంస్కృతి, ఉమ్మడి అభిరుచి కలిగిన రెండు దేశాలను ఏకం చేసే సిరీస్ ఇది. ఇవి కేవలం మ్యాచ్లు కాదు. స్వదేశంలోని లక్షలాది మంది ప్రజల ఆశలు, గర్వాన్ని మోసుకుంటూ ఆఫ్గన్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టనుంది."అని రాసుకొచ్చింది.ఇప్పటికే ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినగా, తాజాగా ఆఫ్గన్ క్రికెట్ బోర్డు చేపట్టిన చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ మ్యాప్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలకు దిగలేదు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఈ విషయాన్ని లేవనెత్తేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.నిత్యం సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులతో సహా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ తాజా వివాదం తలెత్తింది. దేశంలో జరుగుతున్న ఘోరమైన దాడులకు కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తున్న తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (TTP)కు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపిస్తోంది. సాంస్కృతిక, క్రీడా వేదికలతో సహా సాఫ్ట్ పవర్ ద్వారా ఇటువంటి ఘర్షణలు మరింతగా వ్యక్తమయ్యే అవకాశం ఉందని భారత్ తెలిపింది. ఇక భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య జరగనుంది. మ్యాచ్లన్నీ ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి వన్డే ఈ నెల 13న, రెండో టీ20 15న, మూడో టీ20 17న జరగనున్నాయి.A series the nation has been eagerly awaiting. 🤩A series that will once again bring together two nations with deep-rooted history, culture, and a shared passion for the game.🤜🤛These are more than just matches. They are encounters of passion, excitement, and significance,… pic.twitter.com/Q8h7MYX1yf— Afghanistan Cricket Board (@ACBofficials) September 6, 2026Read: నిప్పులు చెరిగిన షమీ.. సౌత్జోన్ కకావికలం -
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత్కు రెండు స్వర్ణాలు
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత పారా ఆర్చర్లు అదరగొట్టారు. పోటీల చివరి దశకు చేరుకున్న సమయంలో భారత్ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం చేరాయి.పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి జోడీ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఇరాక్కు చెందిన అబ్బాస్ కదీమ్, అన్వర్ అల్దావూద్ జోడీపై 152-139తో ఘన విజయం సాధించింది.పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో పారాలింపిక్స్లో రెండుసార్లు పతకాలు సాధించిన హర్విందర్ సింగ్, విజయ్ సుండి జోడీ కూడా బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. తొలి సెట్లో వెనుకబడిన భారత జోడీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని స్లోవేకియా జోడీపై 6-2తో విజయం సాధించింది.మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భావన, పూజా జోడీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఈ జోడీ చైనా జోడీ చేతిలో ఓటమి పాలైంది.చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే.. -
నిప్పులు చెరిగిన షమీ.. సౌత్జోన్ కకావికలం
దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్ తరఫున ఆడుతున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సౌత్జోన్తో ఫైనల్లోనూ చెలరేగుతున్నాడు. సెమీఫైనల్లో ఐదు వికెట్లు తీసిన షమీ ఫైనల్లో బంతులో నిప్పులు చెరిగాడు. 11 ఓవర్లు వేసిన షమీ 4 మెయిడెన్లు సహా 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ముఖేశ్ కుమార్ కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన షమీని ఎదుర్కోవడంలో సౌత్జోన్ బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సౌత్జోన్ జట్టు 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (37), శ్రేయస్ గోపాల్ (13) క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్జోన్ జట్టు 163 ఓవర్లలో 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీతో మెరవగా, కుమార్ కుశాగ్ర (101) సెంచరీతో రాణించగా, అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థశతకాలతో రాణించారు. త్రిపురణ విజయ్ నాలుగు వికెట్లతో మెరిశాడు.ఇటీవలే షమీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.చదవండి: చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో! -
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం!
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. బీబీఎల్ జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం చేసినట్లు సీఏ మంగళవారం ధ్రువీకరించింది.కన్నేసిన ఐపీఎల్ ఓనర్లు?మెల్బోర్న్ రెనెగేడ్స్ పురుషుల, మహిళల జట్ల యాజమాన్యంలో వంద శాతం వాటాను అమ్ముకునేందుకు అంగీకారం తెలిపినట్లు సీఏ పేర్కొంది. బీబీఎల్, మహిళల బీబీఎల్ 2027-28 సీజన్ నుంచి మెల్బోర్న్ జట్టుకు కొత్త యజమానులు రానున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని పలు ఫ్రాంఛైజీల యజమానులు బీబీఎల్లోనూ జట్లను సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పలు విదేశీ లీగ్లలో పెట్టుబడులుకాగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో జట్లన్నీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలవే అన్న సంగతి తెలిసిందే. డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్టౌన్, సన్రైజర్స్ ఈస్టర్న్కేప్, జొబర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, పర్ల్ రాయల్స్.. ఐపీఎల్లో వరుసగా లక్నో, ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, రాజస్తాన్ ఫ్రాంఛైజీలకు చెందిన జట్లు.ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్ వంటి పలు లీగ్లలోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఓనర్లు జట్లు కలిగి ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనతో బీబీఎల్లోనూ తమ వాటాను విస్తరించే అవకాశం ఉంది. నాశనానికి నాంది!ఇదిలా ఉంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం పట్ల అభిమానులు మండిపడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బీబీఎల్ నాశనమైపోతుందని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.కమిన్స్ ఏమన్నాడంటే..మరోవైపు.. ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని స్వాగతించాడు. ‘‘ప్రైవేటీకరణ ద్వారా క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా బీబీఎల్కు అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, ఆసీస్ కెప్టెన్గా నాకు టెస్టు క్రికెట్ అత్యంత ముఖ్యం’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.భారత్లో తొలి మ్యాచ్ఇదిలా ఉంటే.. బీబీఎల్కు ఆదరణ పెంచే క్రమంలో భారత్లో మ్యాచ్ నిర్వహించేందుకు సీఏ సిద్ధమైన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 2026-27 సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది. డిసెంబరు 12న జరిగే సీజన్ ఆరంభ మ్యాచ్లో పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడనున్నాయి. ఈ నిర్ణయానికి సంబంధించి జూలైలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు -
చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో!
ఫుట్బాల్ స్టార్ ప్లేయర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరు దాదాపు ఒకేసారి కెరీర్ను ప్రారంభించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ప్రత్యర్థులుగా ఈ ఇద్దరు ఎదురుపడ్డ సందర్భాలు చాలా తక్కువ. దిగ్గజాలుగా పేరు పొందిన తర్వాత అసలు ఎదురుపడిందే లేదు. కనీసం ఫ్రెండ్లీ మ్యాచ్లో కూడా వీరి ఆటను ఎంజాయ్ చేసే అదృష్టం అభిమానులకు కలగలేదు. 2026 ఫిఫా ప్రపంచకప్ సమయంలోనూ వాళ్లిద్దరికీ ఇదే చివరి ప్రపంచకప్ అని ప్రచారం జరగడంతో ఈసారైనా వాళ్లిద్దరు ఎదురుపడితే చూడాలని అభిమానులు భావించారు. కానీ పోర్చుగల్ ప్రిక్వార్టర్స్కే పరిమితం కావడంతో ఆ అవకాశం దక్కలేదు.Photo Credit: Twitterఅయితే ఎట్టకేలకు ఆ అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మెస్సీ, రొనాల్డో కలిసి మైదానంలో మ్యాచ్ ఆడనున్నారు. అయితే ప్రత్యర్థులుగా ఇద్దరు తలపడుతున్నారనుకుంటే పొరపాటే అవుతుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ఒకే జట్టుకు ఆడుతుండడం విశేషం. అర్జెంటీనా మాజీ ఆటగాడు, మాంచెస్టర్ యునైటెడ్ ఫార్వార్డ్ ప్లేయర్ కార్లోస్ టెవెజ్ బొకారో జూనియర్స్ తరఫున వీడ్కోలు మ్యాచ్ ఆడనున్నాడు. కార్లోస్ టెవెజ్ విజ్ఞప్తి మేరకు మెస్సీ, రొనాల్డోలు కలిసి ఈ మ్యాచ్ ఆడనున్నారు. ఇద్దరు కలిసి ఒకే జెర్సీలో ఒక జట్టుకు ఆడనున్నారు. డిసెంబర్లో జరగనున్న ఫేర్వెల్ మ్యాచ్కు బ్యూనస్ ఎయిర్స్లోని లా బాంబోనెరా వేదిక కానుంది. ఇదే విషయాన్ని కార్లోస్ టెవెజ్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నాడు.Photo Credit: Twitter"లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు ఒకే టీమ్కు ఆడుతుంటే చూడాలనేది నా కల. వాళ్లిద్దరు గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) ఆటగాళ్లే. నా ఫేర్వెల్ మ్యాచ్ సందర్భంగా మెస్సీ, రొనాల్డోతో మాట్లాడాను. ముఖ్యంగా క్రిస్టియానోను కలిసినప్పుడు నువ్వు, మెస్సీ నా ఫేర్వెల్ మ్యాచ్లో ఒక టీమ్కు ఆడాలనేది నా కోరిక. చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఈ అద్భుత క్షణాన్ని ప్రపంచమంతా మరోసారి చూడగలుగుతుంది. నేను చెప్పగానే రొనాల్డో ఒప్పుకున్నాడు. ఆ వెంటనే మెస్సీ ఎదుట నా ప్రపోజల్ పెట్టాను. అతడు కూడా ఒప్పుకోవడంతో వీళ్లిద్దరు కలిసి ఆడే మ్యాచ్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా" అని కార్లోస్ టవెజ్ పేర్కొన్నాడు.Photo Credit: Twitterఎవరీ కార్లోస్ టెవెజ్?2004లో అర్జెంటీనా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన టెవెజ్ 76 మ్యాచ్లు ఆడి 13 గోల్స్ చేశాడు. 2004 ఒలింపిక్స్లో స్వర్ణ పతకం, సమ్మర్ ఒలింపిక్స్ గోల్డెన్ బూట్ విజేత అయిన అతను, రెండు ఫిఫా ప్రపంచ కప్లు , ఒక ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్, నాలుగు కోపా అమెరికా టోర్నమెంట్లలో అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహించాడు. అతనికి మూడుసార్లు 'సౌత్ అమెరికన్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్' ,రెండుసార్లు 'ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అర్జెంటీనా' , ఒకసారి 'అర్జెంటీనా స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాలు లభించాయి. జూన్ 2022లో ప్రొఫెషనల్ ఫుట్బాల్కు కార్లోస్ టెవెజ్ వీడ్కోలు పలికాడు. ఇటీవలే మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు గుడ్బై చెప్పగా, రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.🚨Carlos Tevez reveals Cristiano Ronaldo and Lionel Messi have agreed to play together in the same team for his farewell game in December 2026 at La Bombonera in Buenos Aires.🗣️Carlos: “It has always been my dream to see Cristiano and Leo playing for one team. They’re the two… pic.twitter.com/WwVZG7ZBkW— Casmir (@wydcasmir) September 6, 2026🚨🎙️ Carlos Tevez:“It has always been my dream to see Cristiano and Leo playing for the same team. They’re the two greatest players of all time. I contacted them, especially Cristiano and told him :‘Cristiano, I want you and Leo on the same side for my farewell. Let the world… pic.twitter.com/aulpzDviSc— TCR. (@TeamCRonaldo) September 7, 2026Read: రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం -
వీరంగం సృష్టించిన ముంబై ఇండియన్స్ బ్యాటర్
షేర్-ఎ పంజాబ్ టీ20 లీగ్ 2026లో ఐపీఎల్ ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ రెండు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడగా.. తాజాగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ నమన్ ధిర్ తన రెండో శతకంతో బీభత్సం సృష్టించాడు.ఈ టోర్నీలో అమృత్సర్ సూర్మాస్కు సారథ్యం వహిస్తున్న నమన్.. మోహాలీ కింగ్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో శివాలెత్తిపోయాడు. కేవలం 64 బంతుల్లో 16 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో ఏకంగా 173 పరుగులు చేశాడు. నమన్ వీరంగం సృష్టించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సూర్మాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 279 పరగుల (7 వికెట్ల నష్టానికి) రికార్డు స్కోర్ చేసింది.సూర్మాస్ జట్టులో నమన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జస్ప్రీత్ సింగ్ (41) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. సహజ్ ధవన్ 1, రాహుల్ కుమార్ 13, అభిషేక్ శర్మ 13, అభయ్ చౌదరి 20, ఆకాశ్ పాండే 4 పరుగులు చేసి ఔటయ్యారు. మోహాలీ బౌలర్లలో ఆయుశ్ గోయల్ 4 వికెట్లతో రాణించగా.. హర్ప్రీత్ బ్రార్, హర్ష్దీప్ సింగ్, తేజ్ప్రీత్ సింగ్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ టోర్నీలో మరో ఐపీఎల్ ఆటగాడు రమన్దీప్ సింగ్ (కేకేఆర్), టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సత్తా చాటుతున్నారు. రమన్దీప్ సింగ్ 6 మ్యాచ్ల్లో 4 మెరుపు అర్ద శతకాలతో చెలరేగగా.. అభిషేక్ శర్మ 2, శుభ్మన్ గిల్ ఓ హాఫ్ సెంచరీతో రాణించారు. చదవండి: రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం -
అద్భుత ఫామ్ను కొనసాగించిన పడిక్కల్
టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో (టెస్టు సిరీస్లో) వరుసగా రెండు సెంచరీలు సాధించిన అతడు.. ప్రస్తుతం జరుగుతన్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో కీలకమైన అర్ద సెంచరీతో సత్తా చాటాడు.ఈస్ట్ జోన్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగిన పడిక్కల్, తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన పరుగులు సాధించాడు. కేవలం 65 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. మొత్తం 104 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు.పడక్కిల్ అర్ద సెంచరీతో రాణించినప్పటికీ.. సౌత్ జోన్ కష్టాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు టీ విరామం సమయానికి ఆ జట్టు కేవలం 176 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (1), నారాయణ్ జగదీశన్ (32), పడిక్కల్ (62), షేక్ రషీద్ (27), స్మరణ్ రవిచంద్రన్ (23) ఔట్ కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ (18), శ్రేయస్ గోపాల్ (2) క్రీజ్లో ఉన్నారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో చేసిన స్కోర్కు సౌత్ జోన్ ఇంకా 532 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు. చదవండి: వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్ను ఒప్పించి మరీ! -
రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం
షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్లో మొహలీ కింగ్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రమన్దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తాజాగా సోమవారం లుధియానా లయన్స్తో జరిగిన మ్యాచ్లో రమన్దీప్ విధ్వంసంతో మొహలీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లుధియానా లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అర్జున్ రాజ్పుత్ (46 బంతుల్లో 78), అభిజిత్ గార్గ్ (48 బంతుల్లో 78) రాణించడంతో లుధియానా భారీ స్కోరు చేసింది. మొహాలీ కింగ్స్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీయగా, రమన్దీప్ సింగ్ 2, ఆయుశ్ గోయల్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన మొహాలీ కింగ్స్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలుపొందింది. రమన్దీప్ (35 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, అన్మోల్ప్రీత్ సింగ్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్కు 41 బంతుల్లోనే 86 పరుగులు జోడించడంతో మొహాలీ విజయం దిశగా పరిగెత్తింది. బౌలింగ్లో రెండు వికెట్లు, బ్యాటింగ్లో 85 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్తో మెరిసిన రమన్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆరు మ్యాచ్ల్లో మొహలీ కింగ్స్కు ఇది నాలుగో విజయం కాగా, పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 5 మ్యాచ్ల్లో మూడు ఓటములతో లుధియానా ఐదో స్థానంలో కొనసాగుతోంది.ఇక రమణ్దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్దీప్కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్రౌండర్ భావిస్తున్నాడు.85(34) with the bat.🌟2/31 (4) with the ball.🤛Ramandeep Singh owned the game from start to finish. A true all-round Masterclass. 💜🔥 pic.twitter.com/s0HyFEbJcS— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) September 7, 2026Read: కసితీరా బాదిన అభిషేక్.. గిల్పై ప్రతీకారం! -
వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్ను ఒప్పించి మరీ!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శించిన వాళ్లకు ఆటతో పాటు నాయకత్వ నైపుణ్యాలతోనూ అదిరిపోయేలా కౌంటర్ ఇస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. కాగా రెడ్బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేనప్పటికీ పదిహేనేళ్ల వైభవ్కు బీసీసీఐ కీలక బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే.అపుడే వైస్ కెప్టెన్గానా?ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2026 టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్కు వైభవ్ను డిప్యూటీగా నియమించింది. దీంతో చిన్న వయసులోనే, అనుభవం లేని వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎలా నియమిస్తారని భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.అయితే, వైభవ్ అటు ఆటగాడిగా రాణిస్తూనే.. తన నాయకుడిగానూ తానేం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. సెంట్రల్ జోన్తో సెమీ ఫైనల్లో ఇషాన్ గైర్హాజరీలో వైభవ్ ఒకరోజు మొత్తం కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది.708 పరుగులకు ఆలౌట్ఇక టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ సౌత్ జోన్తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో.. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 708 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా సౌత్ జోన్ తమ బ్యాటింగ్ మొదలుపెట్టింది.సందిగ్దంలో జట్టుఈ నేపథ్యంలో ఆరో ఓవర్లో ఈస్ట్ జోన్ పేసర్ ముకేశ్ కుమార్ వేసిన రెండో బంతిని సౌత్ జోన్ ఓపెనర్ రికీ భుయ్ బౌండరీ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు. అయితే, లెంగ్త్ను తప్పుగా అంచనా వేసిన రికీ షాట్ ఆడటంలో విఫలం కాగా.. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా బంతిని క్యాచ్ పట్టి.. అప్పీలు చేశాడు.ఇషాన్ను ఒప్పించిన వైభవ్అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న కెప్టెన్ ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. ‘రివ్యూ తీసుకో.. పర్లేదు’ అంటూ సలహా ఇచ్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం బంతి ముందుగా బ్యాట్ను తాకిందా? లేదంటే ప్యాడ్కు తాకిందా? అనే సందేహంలో ఉన్నారు.అయితే, ఇషాన్ కిషన్ వైభవ్ మాట మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లగా.. రికీ భుయ్ అవుటైనట్లు తేలింది. దీంతో ఈస్ట్ జోన్ సంబరాలు అంబరాన్నంటాయి. వైభవ్ సూర్యవంశీని ఇషాన్, ముకేశ్తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా దులిప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు🗣️ Take it...take itVaibhav Sooryavanshi 🤝 ReviewThe vice-captain urges the captain to take the review, and it turns out to be successful 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/MmtESDSnMy— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026 -
నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్ లోనావాలాలో సుమారు 3.86 ఎకరాల భూమిని దాదాపు రూ.70 కోట్లకు కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ డేటాను విశ్లేషించిన జాప్కీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ లావాదేవీ మూడు కన్వేయన్స్ డీడ్ల ద్వారా సెప్టెంబర్ 4న నమోదైంది. మొత్తం విలువ రూ.69.99 కోట్లు. ఈ ఆస్తులను నందన్ ధనంజయ్ మెహతా, వివస్వత్ ధనంజయ్ మెహతాల నుంచి కొనుగోలు చేశారు.పుణె జిల్లా లోనావాలాలోని హెచ్ వార్డులో నాలుగు సిటీ సర్వే నంబర్లలో మొత్తం 1.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. ఇందులో దాదాపు 3.09 ఎకరాలను పూర్తి యాజమాన్య హక్కుతో కొనుగోలు చేయగా, ఈ భూమిపై సుమారు 2,100 చదరపు అడుగుల నిర్మాణం కూడా ఉంది. అదనంగా, మరో రెండు స్థలాల్లో 50% వాటాను కూడా తెందుల్కర్ దక్కించుకున్నారు.ఈ మూడు డీడ్ల విలువలు వరుసగా రూ.63.69 కోట్లు, రూ.4.56 కోట్లు, రూ.1.75 కోట్లుగా ఉన్నాయి. కొనుగోలుదారు స్టాంప్ డ్యూటీ కింద సుమారు రూ.4.20 కోట్లు చెల్లించారు. మొత్తం లావాదేవీ ఆధారంగా చదరపు అడుగుకు సగటున రూ.4,168 చొప్పున ధర లెక్కించబడింది. ముంబై, పుణె నగరాల సంపన్నుల సెకండ్ హోమ్ డెస్టినేషన్గా మారిన లోనావాలాలో ఇటీవలి కాలంలో ప్రముఖులు భారీగా ఆస్తి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలోని బాంద్రాలో అత్యంత ఖరీదైన బంగ్లా కలిగిన తెందుల్కర్, తాజా కొనుగోలుతో తన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను మరింత విస్తరించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
అతడు పోతేనే పాక్ క్రికెట్ బాగుపడుతుంది: ఆసీస్ దిగ్గజం
ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి నుంచి వరుస ఉదంతాలు పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్, కోచ్లతో విభేదాలు, ముందస్తు సమాచారం లేకుండా ఆటగాళ్లను తొలగించడం వంటి వివాదాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ జాసన్ గిలెస్పీ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. పాకిస్తాన్ టెస్టు జట్టుకు గిలెస్పీ కొంతకాలం కోచ్గా సేవలందించిన సంగతి తెలిసిందే. తాను కోచ్గా ఉన్న సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని భావించినప్పటికీ, చీఫ్ సెలెక్టర్గా అకీబ్ జావెద్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గిలెస్పీ పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు నుంచి నష్ట పరిహారం కింద తనకు వేల డాలర్లు రావాల్సి ఉందని వెల్లడించాడు. పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిలెస్పీ మాట్లాడుతూ.. ‘‘అకిబ్ జావేద్ నియామకం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచే పాకిస్తాన్ క్రికెట్తో నాకున్న అనుబంధం చెడిపో సాగింది. పాక్ జట్టు ఇప్పుడీ స్థితిలో ఉందంటే దానికి అకిబ్ జావెద్ కారణం. టెస్టు కోచ్గా ఎంపికైనప్పుడు జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని కలలు కన్నాను. కానీ అకిబ్ జావెద్ రాకతో టెస్టు జట్టు కోచ్గా ఆటగాళ్లను, సిబ్బందిని పర్యవేక్షించడం, ఎంపికలో పాత్ర పోషించడం.. ఇలా అన్నింటిలోనూ ఏ మాత్రం ప్రాధాన్యత లేని స్థితికి పడిపోయాను. అతడితో అనుభవం నన్ను పూర్తిగా నిరుత్సాహపరిచింది. కోచింగ్పైనే విరక్తి కలిగించింది. మానసికంగానూ నాపై ప్రభావం చూపించింది. అసలు ఇంకా క్రీడలో ఎందుకు కొనసాగాలన్న పరిస్థితి ఎదురైంది. కోచ్గా వచ్చిన తర్వాత నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. చీఫ్ సెలెక్టర్గా ఎంపికైన అకిబ్ జావెద్ నన్ను అవమానించాడు. నా స్థాయిని పూర్తిగా తగ్గించాడు. అకిబ్కు చైర్మన్ మోసిన్ నఖ్వీతో పాటు బోర్డు మద్దతు ఉంది. అందుకే అతడిని ఎవరు ఏమీ చేయలేరని ధీమాగా ఉన్నాడు. అయితే నష్టపరిహారం కింద నాకు ఇవ్వాల్సిన వేల డాలర్లను ఇప్పటివరకు చెల్లించలేదు. అయితే ఈ విషయాన్ని నేను విడిచిపెట్టదలచుకోలేదు. ఈ విషయంలో ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. తెర ముందు పీసీబీ కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం అకిబ్ జావెద్ ఒక నియంత పాత్రను పోషిస్తున్నాడు. అకిబ్ జావెద్ ఉన్నంతకాలం పాకిస్తాన్ క్రికెట్ మరింత దారుణంగా తయారవుతుందే తప్ప ముందుకు వెళ్లదు. అసలు చైర్మన్, బోర్డులోని సభ్యులు, చీఫ్ సెలెక్టర్ తమ డెస్కుల వద్ద కూర్చుని కెప్టెన్ను ఎన్నుకోవడం అర్థరహితం. అకిబ్ జావెద్ వెళ్లిపోతేనే పాక్ క్రికెట్ మళ్లీ గాడిన పడుతుంది. అప్పటివరకు ఇంతే’’ అని ముగించాడు.Jason Gillespie brutally COOKS Pakistan selector Aaqib Javed"Aaqib is still chairman of selectors. He's kept his job. He's had a crack at Gary Kirsten and I, blaming us for where Pakistan cricket is where it is. Gary and I haven't even been there for two years.""Yet, he has… pic.twitter.com/kIEWfzPvQk— Brutal Truth (@sarkarstix) September 8, 2026చదవండి: కసితీరా బాదిన అభిషేక్.. గిల్పై ప్రతీకారం! -
IND vs AFG: టీమిండియాకు శుభవార్త
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అఫ్గాన్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడు అందుబాటులోకి వచ్చాడని జాతీయ మీడియా వెల్లడించింది.కాగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు భారత్లో టీమిండియాకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియాతో సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో అఫ్గాన్ జట్టు మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోఇక ఈ సిరీస్కు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులోకి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ హర్షిత్ రాణా, ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ గాయాల నుంచి కోలుకుని తిరిగి వచ్చారు.మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన వాషీ!అయితే, ఫిట్నెస్ ఆధారంగానే ఈ నలుగురు అఫ్గాన్తో సిరీస్లో ఆడతారా? లేదా? అనేది తేలుతుందని బోర్డు పేర్కొంది. ఇండియా టుడే కథనం ప్రకారం.. వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కానీ, బుమ్రా, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి మ్యాచ్ ఫిట్నెస్ సాధించారా? లేదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు యాజమాన్యం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గౌతం గంభీర్ మార్గదర్శనంలో టీ20 ఫార్మాట్లో అతడు కీలక ప్లేయర్గా మారాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలోనూ అతడికి ప్రాధాన్యం దక్కుతోంది. పెరిగిన ప్రాధాన్యందిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆఫ్ స్పిన్ సేవల కోసం యాజమాన్యం వాషీని వాడుకుంటోంది. వన్డేల్లోనూ సీనియర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కంటే ఈ చెన్నై చిన్నోడికే ప్రాధాన్యం ఇస్తోంది.అయితే, ఇటీవల యూకే పర్యటనలో వాషీ గాయపడ్డాడు. తొడకండరాల గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందిన వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని.. అఫ్గాన్తో టీ20 సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. గాయం వల్ల 26 ఏళ్ల వాషీ శ్రీలంక పర్యటనకు దూరం కాగా.. అతడి స్థానంలో దేశవాళీ క్రికెట్ వీరుడు, 33 ఏళ్ల సారాంశ్ జైన్ టెస్టు సిరీస్కు ఎంపికై అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు టీమిండియాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి (ఫిట్నెస్ ఆధారంగా), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (ఫిట్నెస్ ఆధారంగా), వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, జస్ప్రీత్ బుమ్రా (ఫిట్నెస్ ఆధారంగా), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా (ఫిట్నెస్ ఆధారంగా).చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు -
కసితీరా బాదిన అభిషేక్.. గిల్పై ప్రతీకారం!
భారత వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చూశాం. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు పంజాబ్ క్రికెట్ లీగ్లో ప్రత్యర్థులుగా మారిపోయారు. షేర్-ఇ- పంజాబ్ టీ20లీగ్లో అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మన్స్కు కెప్టెన్గా ఉండగా, గిల్ ఫజిల్కా ఫాల్కన్స్కు నాయకత్వం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఈ రెండు జట్లు తలపడగా, అభిషేక్ శర్మ బౌలింగ్ను గిల్ చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అభిషేక్ శర్మ బౌలింగ్కు రాగా, అప్పటికే గిల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక అభిషేక్ బౌలింగ్లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన గిల్, మూడో బంతిని బౌండరీ, ఐదో బంతిని సిక్సర్గా మలిచాడు. దీంతో ఓవర్లో వైడ్ సహా 16 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కూడా సిక్సర్ కొట్టి అభిషేక్కు సెండాఫ్ ఇవ్వాలనుకున్నప్పటికీ, సీన్ రివర్స్ అయింది. అభిషేక్ వేసిన ఆఖరి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ గాల్లోకి లేపగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధిర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్ (35 బంతుల్లో 67) ఇన్నింగ్స్కు తెరపడింది. గిల్తో పాటు ప్రాన్షు ప్రతాప్ (40), సన్వీర్ సింగ్ (40) రాణించడంతో ఫజిల్కా ఫాల్కన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం అమృత్సర్ ఇన్నింగ్స్ సమయంలో తన వంతు రావడంతో అభిషేక్ రెచ్చిపోయాడు. సహజ్ ధావన్తో కలిసి ఓపెనింగ్ ఆరంభించిన అభిషేక్ (15 బంతుల్లోనే 49; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ దెబ్బకు అమృత్సర్ సూర్మన్స్ 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అభిషేక్ ఔటైనప్పటికీ, రాహుల్ కుమార్ (35 బంతుల్లో 53 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్లో గిల్ (67 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ, అభిషేక్ (49) సుడిగాలి ఇన్నింగ్స్తో టీమిండియా కెప్టెన్ను డామినేట్ చేశాడు. ఈ విజయంతో అమృత్సర్ సూర్మన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.Abhishek Sharma doing what he does best in the latest round of Sher-E-Punjab T20 League 🔥🔥 pic.twitter.com/UoxZsJxbOn— Cricbuzz (@cricbuzz) September 8, 2026SHUBMAN GILL vs ABHISHEK SHARMA 😍- Incredible battle at Sher-E-Punjab T20 league, The quality of the league. pic.twitter.com/LrTXT8cXgt— Johns. (@CricCrazyJohns) September 8, 2026Read: తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్! -
తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్!
ఈస్ట్ జోన్తో దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో సౌత్ జోన్ కఠిన సవాలు ముంగిట నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. మొదటి ఇన్నింగ్స్లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.టీమిండియా స్టార్లతో కళఈ క్రమంలో సౌత్ జోన్ ఈస్ట్ జోన్కు బదులిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్కు ఇషాన్ కిషన్.. సౌత్ జోన్కు తిలక్ వర్మ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్లో వైభవ్ సూర్యవంశీ, మహ్మద్ షమీ వంటి స్టార్లు ఉండగా.. సౌత్ జోన్లో దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ సోషల్ మీడియా పోస్టు వైరల్గా మారింది. కెప్టెన్ తిలక్ వర్మ తనను తుదిజట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణమేంటో తనకు అర్థం కావడం లేదన్న అర్థంలో అతడు వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..రంజీ వీరుడుదేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ఆడుతున్న కరుణ్ నాయర్.. 2025-26 రంజీ సీజన్లో 13 ఇన్నింగ్స్లో కలిపి 699 పరుగులు సాధించాడు. మొత్తంగా ఇప్పటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 26 శతకాల సాయంతో 9374 పరుగులు రాబట్టాడు.దురదృష్టవశాత్తూ.. తుదిజట్టు నుంచి తీసేశాఅయితే, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో భాగంగా నార్త్ జోన్తో జరిగిన సెమీ ఫైనల్ తుదిజట్టులో కరుణ్ నాయర్కు చోటు దక్కలేదు. ఈ విషయం గురించి కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘కరుణ్ దురదృష్టవంతుడు. ఈసారి అతడికి అవకాశం ఇవ్వలేకపోతున్నాము. ప్రత్యర్థి జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున.. నేను కొడిమెల హిమతేజను తుదిజట్టుకు ఎంచుకున్నా.యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి కదా!.. కరుణ్ నాయర్ ఇప్పటికే దేశీ క్రికెట్లో తానేంటో నిరూపించుకున్నాడు. కానీ ఈసారి దురదృష్టవశాత్తూ అతడికి అవకాశం దక్కడం లేదు’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. సౌత్ జోన్ కోచ్ మాత్రం కరుణ్ నాయర్ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేడని పేర్కొన్నాడు.శతకంతో కదంతొక్కిఇలాంటి తరుణంలో సౌత్ జోన్ను వీడి.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీస్ ఎలెవన్ తరఫున ఛత్తీస్గడ్తో మ్యాచ్ ఆడాడు కరుణ్ నాయర్. ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా 183 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 104 పరుగులు సాధించాడు. ఓవైపు ఈస్ట్ జోన్ బ్యాటర్లు సౌత్ జోన్ బౌలింగ్ను చితక్కొడుతున్న వేళ కరుణ్ నాయర్ సెంచరీతో ఈ మేరకు కదం తొక్కాడు.అర్థం కావడమే లేదుఈ పరిణామాల నేపథ్యంలో క్రిక్ఇన్ఫో జర్నలిస్టు ఒకరు.. ‘‘దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆడే తుదిజట్టు నుంచి తప్పించిన మరుసటి రోజే కరుణ్ నాయర్ ప్రి-సీజన్ రెడ్బాల్ పోటీలో అద్భుతమైన శతకం సాధించాడు.కరుణ్ జట్టుతో ఉండి ఉంటే సౌత్జోన్ 708 పరుగుల మైలురాయిని కాస్త సులువుగానే చేరుకునేది. అయినా అతడిని తుదిజట్టు నుంచి ఎందుకు తప్పించారో అస్సలు అర్థం కావడం లేదు’’ అని ట్వీట్ చేశారు.తిలక్ను టార్గెట్ చేసిన కరుణ్!ఇందుకు స్పందనగా.. ‘‘అర్థం కావడం లేదు అనే పెద్ద పెద్ద మాటలు అవసరం లేదేమో!’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని కరుణ్ నాయర్ జోడించాడు. ఈ నేపథ్యంలో.. తనను ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారంటూ పరోక్షంగా తిలక్ వర్మను టార్గెట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: టీమిండియాతో టీ20.. జపాన్ జట్టు ప్రకటన -
IND vs AUS: భారత జట్టులో మార్పులు.. ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియాతో తలపడే అండర్-19 జట్లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మార్పులు చేసింది. రోహిత్ యాదవ్ను తప్పించి.. అతడి స్థానంలో యూత్ వన్డే, యూత్ టెస్టులకు ఇద్దరు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.అవును.. అది నిజమేకాగా దేశీ క్రికెట్లో బెంగాల్కు ఆడుతున్న లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్. వయసుకు సంబంధించి అతడు పత్రాలు సమర్పించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.‘‘ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో రాజ్కోట్, అహ్మాదాబాద్ వేదికలుగా జరిగే మ్యాచ్లకు సంబంధించి భారత అండర్-19 జట్టు నుంచి రోహిత్ వైదొలిగాడు. తన వయసుకు సంబంధించిన సరైన సమాచారం ఇవ్వలేకపోయినందున జట్టు నుంచి తప్పుకొన్నాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.ఇద్దరికి అవకాశంఇక రోహిత్ యాదవ్ నిష్క్రమణ నేపథ్యంలో జూనియర్ క్రికెట్ కమిటీ ఇద్దరు కొత్త ఆటగాళ్లను ఆసీస్తో సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఆసీస్తో యూత్ వన్డేలకు సౌరాష్ట్ర ఆటగాడు ఆర్యన్ సావ్సానీ, యూత్ టెస్టులకు హర్యానా ప్లేయర్ తన్మయ్ బలోడాను ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా సెప్టెంబరు 18- అక్టోబరు 8 మధ్య భారత్- ఆసీస్ మధ్య మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు జరుగుతాయి.ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డేలకు భారత అండర్-19 జట్టు (అప్డేటెడ్)లక్ష్యా రాయ్చందాని (కెప్టెన్), యశ్వర్దన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ భగేల్ (వికెట్ కీపర్),ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్రా ఓజా, అర్జున్ రాజ్పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), వి.యశ్వీర్, శవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్యా పటేల్, ఆర్యన్ సావ్సానీ.యూత్ టెస్టులకు భారత అండర్-19 జట్టు (అప్డేటెడ్)యశ్వర్దన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్యా రాయ్చందాని (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుశాగ్రా ఓజా, మనాల్ చౌహాన్, కుశ్ పటేల్, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), అభిప్రాయ్ బిస్వాస్ (వికెట్ కీపర్), ఇషాన్ ఓమ్, అయాన్ అక్రం, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్, తన్మయ్ బలోడా.చదవండి: టీమిండియాతో ఏకైక టీ20.. జట్టును ప్రకటించిన జపాన్ -
టీమిండియాతో టీ20.. జట్టును ప్రకటించిన జపాన్
టీమిండియాతో చారిత్రక మ్యాచ్కు జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు కెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు తెలిపింది. భారత్తో ప్రతిష్టాత్మక మ్యాచ్కు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ క్రికెటర్లతో కూడిన సమతూకమైన జట్టును సెలక్ట్ చేసినట్లు జేసీఏ వెల్లడించింది.‘స్పోర్ట్ 75’ పేరుతోకాగా భారత్- జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారి ఇరుదేశాల పురుషుల క్రికెట్ జట్ల మధ్య ఈ మ్యాచ్ను ఏర్పాటు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాన మంత్రి సానే టకై చీ మధ్య ఇటీవలే ఒక సమావేశం జరిగింది. ఈ క్రమంలో ‘స్పోర్ట్ 75’ పేరుతో రూపొందుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భారత్- జపాన్ మధ్య క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూ ఈ టీ20 మ్యాచ్ను ఏర్పాటు చేశారు.జపాన్లోని సానో అంతర్జాతీయ మైదానంలో ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 22న ఏకైక టీ20 మ్యాచ్ జరుగనుంది. టీమిండియా- భారత్ మధ్య జరిగే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే.. తమ టీ20 చరిత్రలో టీమిండియా ఇప్పటి వరకు 19 జట్లతో తలపడగా.. జపాన్ 20వ జట్టు కానుంది.టీమిండియాతో ఏకైక టీ20 మ్యాచ్కు జపాన్ జట్టు ఇదేకెండెల్ కడోవాకీ ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, కొయి కుబోటా, వటారు మియాచి, రియో సకురనో-థామస్, అలెక్స్ శిరాయి-పాట్మోర్, షోమా సుగయా-స్లేటర్, డెక్లాన్ సుజుకి, ఇబ్రహీం తకహషి, మకొటో తానియమా, లచ్లాన్ యమామొటో, అలెస్టెర్ కడోవాకీ-ఫ్లెమింగ్, జేక్ కుసుడ-నైర్, సుయోషి తకడా.కీలక ఆటగాళ్లుకాగా కెప్టెన్, 30 ఏళ్ల కెండెల్ టాపార్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. గతేడాది నుంచి ఇప్పటిదాకా జపాన్ తరఫున 451 పరుగులు చేసిన అతడు.. టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక ఇబ్రహీం తకహషి మిడిలార్డర్ బ్యాటర్,. 2025 నుంచి ఇప్పటి వరకు 248 పరుగులు చేయడంతో పాటు.. 20 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. చార్లీ హరా హింజే లెఫ్టార్మ్ స్పిన్నర్గా సేవలు అందిస్తున్నాడు. గతేడాది కాలంలో అతడు 21 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక పేస్ విభాగంలో రియో సుకురనో-థామస్, డెక్లాన్ సుజుకి కీలకం. చదవండి: నష్రా సంధుకు ఆరు వికెట్లు... సెమీ ఫైనల్లో పాకిస్తాన్ -
‘ఆమె ఒప్పుకొంటే సరే.. లేదంటే విడాకులే’
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్కు మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ మాజీ క్రికెటర్కు మంచి మార్కులే పడుతున్నా.. టెస్టుల్లో మాత్రం ఇప్పటికే ఎన్నో ఘోర పరాభవాలు చవిచూశాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత్ 1-0తో సిరీస్ గెలిచినా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2027 చేరాలంటే.. న్యూజిలాండ్ రూపంలో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంది.రేసులో ఆ పేరు కూడాకివీస్ పర్యటనలో గనుక టీమిండియా అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతే గంభీర్పై విమర్శలు తప్పవు. ఇక గంభీర్ గనుక మరోసారి విఫలమైతే అతడి స్థానంలో హెడ్కోచ్ రేసులో వీవీఎస్ లక్ష్మణ్ ముందు వరుసలో ఉన్నాడు. గతంలో ఆశిష్ నెహ్రా పేరు సైతం ప్రముఖంగా వినిపించింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఆశిష్ నెహ్రా తాజాగా ఈ విషయంపై స్పందించాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రాకు టీమిండియా హెడ్కోచ్ కావాలనే ఆశయం ఉందా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ..అంతపెద్ద మాటలు వద్దు‘‘నేనసలు ఆశయం అనే పదాన్ని ఉపయోగించాలనుకోవడం లేదు. నేనెప్పుడూ ముందుగా ఇలాంటి ప్రణాళికలు రచించుకోను. ఏదేమైనా టీమిండియా హెడ్కోచ్ అవడం గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు నేనేమీ ప్లాన్ చేసుకోలేదు. భవిష్యత్తులో పదవి వరిస్తే మాత్రం కాదనకపోవచ్చు.ప్రస్తుతం నాకున్న పనితో సంతోషంగా ఉన్నాను. గుజరాత్ టైటాన్స్ కోచ్గా నేను విజయవంతమయ్యానని చాలా మంది అంటూ ఉంటారు. అయితే, కేవలం కోచ్ వల్ల ఏమీ కాదు. జట్టు ప్రదర్శన బాగుంటేనే విజయాలు వరిస్తాయి. ముఖ్యంగా కెప్టెన్, కోచ్ మధ్య సమన్వయం ఉంటే అంతా సజావుగా సాగిపోతుంది.ఆమె ఒప్పుకోవాలి.. లేదంటే విడాకులేటీమిండియా హెడ్కోచ్ కావాలనే కోరిక ప్రస్తుతానికి లేదు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ముందుగా హై కమిషన్.. అంటే నా భార్య (రుష్మా నెహ్రా)ను సంప్రదిస్తా. ఆమెకు చెప్పకుండా ఏమైనా చేశానంటే విడాకులు ఇచ్చేస్తుంది. ఎందుకంటే టీమిండియా షెడ్యూల్ బిజీగా ఉంటుంది.ఏడాదిలో ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి’’ అని భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఆశిష్ నెహ్రా మార్గదర్శనంలో.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అరంగేట్రంలోనే చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 2023లో హార్దిక్ సారథ్యంలో.. 2026 సీజన్లో శుబ్మన్ గిల్ నాయకత్వంలో ఫైనల్కు చేరింది. చదవండి: నష్రా సంధుకు ఆరు వికెట్లు.. సెమీ ఫైనల్లో పాకిస్తాన్ -
జూనియర్ డేవిస్కప్ ఫైనల్స్ టోర్నీ బరిలో హృతిక్ కటకం
ప్రతిష్టాత్మక జూనియర్ డేవిస్కప్ వరల్డ్ టీమ్ టెన్నిస్ ఫైనల్స్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) జూనియర్ బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్లో టాప్–3లో ఉన్న తవీష్ పహ్వా (హరియాణా), రిభవ్ సరోహ (చండీగఢ్), హృతిక్ కటకం (తెలంగాణ) ఈ మెగా టోర్నిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. కోచ్గా కర్ణాటకకు చెందిన రాణా బెనర్జీ వ్యవహరిస్తారు. నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈ టోర్నీ జరగనుంది. భారత్తోపాటు ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఈజిప్్ట, స్పెయిన్, ఫ్రాన్స్, హంగేరి, ఇటలీ, జపాన్, కజకిస్తాన్, మొరాకో, సెర్బియా, అమెరికా, వెనిజులా జట్లు ఈ టోర్నిలో పాల్గొంటాయి. ఈ ఏడాది మే నెలలో కజకిస్తాన్లో జరిగిన ఆసియా–ఓసియానియా క్వాలిఫయింగ్ టోర్నిలో నాలుగో స్థానంలో నిలవడం ద్వారా భారత జట్టు డేవిస్కప్ ఫైనల్స్ టోర్నికి అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నిలోనూ తవీష్, రిభవ్, హృతిక్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 16 ఏళ్ల హృతిక్ జూనియర్ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్నాడు. గత నెలలో ఈజిప్్టలో జరిగిన ఐటీఎఫ్ జె100 డకాలియా టోర్నీ సింగిల్స్ విభాగంలో హృతిక్ రన్నరప్గా నిలిచాడు. -
నష్రా సంధుకు 6 వికెట్లు.. సెమీఫైనల్లో పాకిస్తాన్
దుబాయ్: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నిలో పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరింది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 72 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్ (47), ఆయేషా జఫర్ (26), ఫాతిమా సనా (24 నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్ జాయ్లీన్ కౌర్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం హాంకాంగ్ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్ (30) టాప్ స్కోరర్గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది. తొలి మ్యాచ్లో థాయ్లాండ్పై నెగ్గి... భారత్ చేతిలో చిత్తయిన పాక్, ఈ గెలుపుతో గ్రూప్ ‘ఎ’ నుంచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించింది. నేడు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్లో యూఏఈ జట్టుతో బంగ్లాదేశ్ తలపడుతుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్కు చేరుతుంది. -
అల్కరాజ్ గెలుపు గర్జన
న్యూయార్క్: గాయం నుంచి కోలుకున్నాక బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ దూసుకుపోతున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ స్పెయిన్ స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 20వ సీడ్ టామీ పాల్ (అమెరికా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అల్కరాజ్ 6–4, 6–3, 6–4తో గెలుపొందాడు. 2 గంటల 21 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఏ దశలోనూ అల్కరాజ్కు ఇబ్బంది ఎదురుకాలేదు. మణికట్టు గాయంతో నాలుగు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న అల్కరాజ్ యూఎస్ ఓపెన్తో పునరాగమనం చేశాడు. టామీ పాల్తో జరిగిన మ్యాచ్లో అల్కరాజ్ 33 విన్నర్స్ కొట్టాడు. 32 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ ప్రపంచ మాజీ నంబర్వన్ తన సర్వీస్ను ఒక్కసారి మాత్రమే కోల్పోయాడు. సెమీఫైనల్లో చోటు కోసం అమెరికా ఆశాకిరణం, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ తో అల్కరాజ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ 6–2, 6–3, 6–4తో సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు. 1 గంట 52 నిమిషాల పోరులో షెల్టన్ 12 ఏస్లు సంధించాడు. తన సర్వీస్ను ఒక్కసారీ కోల్పోని ఈ అమెరికా ప్లేయర్ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు 2021 చాంపియన్, ఏడో సీడ్ మెద్వెదెవ్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. 11వ సీడ్ టియాఫో (అమెరికా) 7–6 (7/1), 6–4, 7–6 (8/6)తో మెద్వెదెవ్ను ఓడించి ఈ టోర్నీలో నాలుగోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ అలెక్స్ మిచెల్సన్ (అమెరికా) 7–6 (8/6), 6–4, 6–4తో ఎచ్వెరీ (అర్జెంటీనా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నిలో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాడు.స్వియాటెక్ అవుట్మహిళల సింగిల్స్లో ఎనిమిదో సీడ్, 2022 చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. 121వ ర్యాంకర్ కిన్వెన్ జెంగ్ 7–5, 6–3తో ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత స్వియాటెక్ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), ఆరో సీడ్ నొస్కోవా (చెక్ రిపబ్లిక్), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో పెగూలా 6–3, 6–4తో సొరానా కిర్స్టియా (రొమేనియా)పై, నొస్కోవా 7–5, 5–7, 6–4తో 11వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్)పై, ఆండ్రీవా 5–7, 6–4, 6–3తో పొటపోవా (ఆ్రస్టియా)పై గెలుపొందారు. -
పాక్లో భారత జట్ల పర్యటనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
పాకిస్తాన్లో వచ్చే ఏడాది జరగనున్న సౌత్ ఏషియన్ ఫెడరేషన్ (SAF) గేమ్స్కు భారత్ తమ బృందాన్ని పంపేందుకు సమ్మతి తెలిపినట్లు ఆ దేశ మీడియా చెప్పుకుంటుంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో జరిగే క్రీడా పోటీలకు భారత బృందం నిజంగానే వెళ్తుందా అని భారతీయులు చర్చించుకుంటున్నారు.SAF గేమ్స్లో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఖాలిద్ మెహమూద్ వెల్లడించినట్లు 'ది న్యూస్ పాకిస్తాన్' అనే వార్తా సంస్థ పేర్కొంది.ది న్యూస్ పాకిస్తాన్ కథనం ప్రకారం.. దక్షిణాసియా ఒలింపిక్ అసోసియేషన్కు సంబంధించిన ఉన్నతస్థాయి సమావేశంలో భారత్కు ప్రాతినిధ్యం ఉందని మెహమూద్ తెలిపారు. భారత్ నుంచి ఎంత మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారు.. ఏయే క్రీడాంశాల్లో బరిలోకి దిగుతారు.. అనే వివరాలు వచ్చే ఏడాది జనవరిలో వెల్లడించే అవకాశం ఉందని ఆయన అన్నారు.SAF గేమ్స్లో క్రికెట్, హాకీ సహా 28 క్రీడాంశాలు ఉంటాయి. భారత హాకీ జట్టు చివరిగా 2006లో పాక్లో పర్యటించగా.. భారత క్రికెట్ జట్టు చివరిగా 2008లో పాక్లో పర్యటించింది. చదవండి: టీమిండియా ప్లేయర్పై పాక్ అభిమానుల అభ్యంతరకర వ్యాఖ్యలు -
వరుసగా రెండో మ్యాచ్లో శుభ్మన్ గిల్ విధ్వంసం
భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ స్వరాష్ట్రంలో జరుగుతున్న షేర్ ఎ పంజాబ్ టీ20 లీగ్లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలోకి ఆలస్యం ఎంట్రీ ఇచ్చిన అతడు, వరుసగా రెండో మ్యాచ్లో (ఫాజిల్కా ఫాల్కన్స్ కెప్టెన్) దుమ్మురేపాడు. నిన్న లుథియానా లయన్స్తో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 40 పరుగులు చేసిన గిల్.. ఇవాళ అమృత్సర్ సూర్మాస్తో జరుగుతున్న మ్యాచ్లో మరింత రెచ్చిపోయి 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. గిల్ తన టీమిండియా సహచరుడు, బెస్ట్ ఫ్రెండ్ అయిన అభిషేక్ శర్మ (అమృత్సర్ సూర్మాస్ కెప్టెన్) బౌలింగ్లో (నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి) ఔటయ్యాడు. రెగ్యులర్గా బ్యాటింగ్లో ఓపెనింగ్ చేసే అభిషేక్ ఈ మ్యాచ్లో బౌలింగ్లో ఓపెనింగ్ చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడు.. తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 37 పరుగులకు 2 వికెట్లు తీశాడు. అభిషేక్ గిల్ వికెట్తో పాటు అన్షుల్ చౌదరి వికెట్ తీశాడు.ఈ మ్యాచ్లో అమృత్సర్ సూర్మాస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 13.4 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. గిల్ (67), విహాన్ మల్హోత్రా (5), అన్షుల్ చౌదరి (0), ప్రన్షు ప్రతాప్ (40) ఔట్ కాగా.. సన్వీర్ సింగ్ (7), ఎయిష్ రావ్ (0) క్రీజ్లో ఉన్నారు. సూర్మాస్ బౌలర్లలో నమన్ ధిర్, సాహిల్ ఖాన్ కూడా తలో వికెట్ తీశారు. కాగా, షేర్ ఎ పంజాబ్ టోర్నీలో గిల్, అభిషేక్తో పాటు ప్రభ్సిమ్రన్ సింగ్, అర్షదీప్ సింగ్ తదితర టీమిండియా ప్లేయర్లు పాల్గొంటున్నారు. 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ప్రస్తుతం రమన్సింగ్ నేతృత్వంలోని మొహాలీ కింగ్స్ టాప్ ప్లేస్లో ఉంది. గిల్ సారథ్యంలోని ఫాల్కన్స్ నాలుగులో, అభిషేక్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సూర్మాస్ చివరి స్థానంలో ఉన్నాయి.చదవండి: శుభ్మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం -
దేశానికి పతకం తీసుకొస్తే లైంగిక వేధింపులతో స్వాగతం!
దక్షిణాఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన '2026 ఐపీఎఫ్ వరల్డ్ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ల'లో జూనియర్ మహిళల 47 కేజీల విభాగంలో భారత్కు చెందిన 21 ఏళ్ల అథ్లెట్ కీయా కునాల్ బెనర్జీ రజత పతకాన్ని సాధించింది. పోటీ సమయానికి కేవలం 45.70 కేజీల బరువున్న కీయా, తన శరీర బరువుకు మూడు రెట్ల కంటే ఎక్కువ బరువైన 140 కేజీల డెడ్లిఫ్ట్ను ఎత్తి సంచలనం సృష్టించింది. పవర్లిఫ్టింగ్ రంగంలో తన అద్భుత ప్రదర్శనతో భారతదేశానికి కీర్తి తెచ్చిన ఆమెకు కొంతమంది ఆన్లైన్ వేధింపులతో స్వాగతం పలకడం కలకలం రేపింది. ఆమె ఘనతను పొగడాల్సింది పోయి ఆన్లైన్ వేదికగా ఆమె పేరిట నకిలీ ఖాతాలు వెలిశాయి. అంతటితో ఆగకుండా కొంతమంది ఆమె ముఖాన్ని, శరీరాన్ని ఏఐ సాయంతో అసభ్యకరరీతిలో మార్ఫింగ్ చేసి వాటిని వైరల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. జాతి వివక్ష వ్యాఖ్యలతో ఆమెను మానసికంగా ఒత్తిడికి లోనయ్యేలా చేశారు.ఇదే విషయమై కీయా కునాల్ మాట్లాడుతూ.. "పవర్లిఫ్టింగ్ అనేది నన్ను నేను సవాలు చేసుకోవడానికి మాత్రమే తప్ప సోషల్ మీడియా ప్రచారం కోసం కాదు. ఆటలో పోటీ పడి గెలవడమే తప్ప ఇలాంటి వేధింపులతో వచ్చే పేరు, ఫాలోవర్లు నాకొద్దు. నా అనుమతి లేకుండా ఏఐ చిత్రాలను సృష్టించడం దారుణం. డెడ్లిఫ్ట్ ఇష్టపడే ఒక సాధారణ అమ్మాయిగా బతికే ప్రశాంతమైన జీవితం మాత్రమే నాకు కావాలి. ప్లీజ్ నన్ను స్వేచ్ఛగా బతకనివ్వండి" అని కీయా కునాల్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేసింది.ఇక కీయా కునాల్ పాల్గొన్న టోర్నమెంట్ విషయానికొస్తే..ఫ్రాన్స్కు చెందిన ఇనెస్ హెర్బాక్స్ 165 కేజీలతో స్వర్ణం సాధించగా, ఐర్లాండ్కు చెందిన బ్లాత్నైడ్ ఓడ్వైర్ కూడా 140 కేజీలే ఎత్తినప్పటికీ, నియమాల ప్రకారం ఓ'డ్వైర్ను అధిగమించి కీయా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 140 కేజీల డెడ్లిఫ్ట్తో పాటు స్కౌట్లో 90 కేజీలు, బెంచ్ ప్రెస్లో 50 కేజీలు.. మొత్తం కలిపి 280 కేజీల బరువును ఎత్తి ఓవరాల్ విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది. పవర్లిఫ్టింగ్లో భారత్కు పతకం తీసుకొచ్చి దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసిన కీయా కునాల్కు సంతోషంతో స్వాగతం పలకాల్సింది పోయి నరక కూపంలోకి నెట్టేశారు.वज़न 47 किलो Deadlift 140 किलो !ये हैं Keyaa Banerji!IPF World Championships में 140 KG वजन उठाकर Junior Silver Medal जीतकर Keyaa ने देश का नाम रोशन किया है।ये सिर्फ एक मेडल नहीं, बल्कि मेहनत, अनुशासन और हौसले की जीत है।जब कोई युवा अपने सपने को जुनून बना लेता है, तो… pic.twitter.com/s91X2i3e2U— Ashok Kumar IPS (@AshokKumar_IPS) September 3, 2026Keyaa Banerjee breaks silence on social media fake accounts and impersonation#KeyaaBanerjee #Powerlifting #IndianPowerlifting #IndiaSports pic.twitter.com/iEa7dlZiJo— Sports Today (@SportsTodayofc) September 7, 2026Read: సీపీఎల్లో నబీ విధ్వంసం.. ఆ జట్టుకు వరుస విజయాలు! -
సౌతాఫ్రికాకు షాక్.. చిచ్చరపిడుగు ఔట్
నమీబియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు సౌతాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆటగాళ్లు లుహాన్ డ్రి ప్రిటోరియస్, ఆండిలే సిమెలేన్ గాయాల కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో క్రికెట్ సౌతాఫ్రికా వీరికి ప్రత్యామ్నాయాలను ప్రకటించింది.ప్రిటోరియస్ స్థానంలో కార్బిన్ బోష్, సిమెలేన్ స్థానంలో మ్యాథ్యూ బ్రీట్జ్కే జట్టులోకి వచ్చారు. నమీబియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 9 నుంచి విండ్హోక్లో (నమీబియా) ప్రారంభం కానుంది.చిచ్చరపిడుగు ఔట్నమీబియా సిరీస్కు ప్రిటోరియస్ లాంటి చిచ్చరపిడుగు దూరం కావడం సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. తాజాగా నమీబియాలోనే జరిగిన టీ20 ట్రై-సిరీస్లో అతను అద్భుతంగా రాణించాడు. 179.37 స్ట్రైక్రేట్తో 226 పరుగులు చేసి టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. నమీబియాపై అతడు ఓ సెంచరీ కూడా సాధించాడు.కాగా, రెగ్యులర్ కెప్టెన్లు ఎయిడెన్ మార్క్రమ్, టెంబా బవుమా నమీబియా సిరీస్కు అందుబాటులో లేకపోవడంతో బ్జోర్న్ ఫోర్టుయిన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.సిరీస్ షెడ్యూల్సెప్టెంబర్ 9: తొలి వన్డేసెప్టెంబర్ 11: రెండో వన్డేసెప్టెంబర్ 13: మూడో వన్డేచదవండి: ఆ ఒక్కటి జింబాబ్వే కొంపముంచింది; ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా -
టీమిండియా ప్లేయర్పై పాక్ అభిమానుల అభ్యంతరకర వ్యాఖ్యలు
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్తాన్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ మరో వివాదానికి దారితీసింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ పేసర్ క్రాంతి గౌడ్పై పాక్ అభిమానులు లింగ వివక్షతో కూడిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది.The people are a reflection of the country 🤡 pic.twitter.com/4WzNwWfy96— Out Of Context Cricket (@GemsOfCricket) September 6, 2026టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న క్రాంతి గౌడ్ను ఉద్దేశించి కొందరు ప్రేక్షకులు (పాకిస్తాన్కు చెందిన వారుగా అనుమానం) ఆమె లింగం, రూపురేఖలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు వినిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఇలాంటి చెత్త ప్రవర్తన పాకిస్తాన్ అభిమానులకు మాత్రమే సాధ్యమని అంటున్నారు. మహిళా క్రీడాకారిణులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదయోగ్యం కాదని కొందరు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే, ఆసియా కప్ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించుకున్న పాక్ కెప్టెన్ -
సీపీఎల్లో నబీ విధ్వంసం.. ఆ జట్టుకు వరుస విజయాలు!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2026లో అఫ్గానిస్తాన్ సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ చెలరేగుతున్నాడు. టీమిండియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో నబీ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లీగ్లో భాగంగా మహ్మద్ నబీ గయానా అమెజాన్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం సెంట్కిట్స్ అండ్ నేవిస్ పాట్రియాట్స్తో జరిగిన మ్యాచ్లో గయానా వారియర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో మహ్మద్ నబీ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తొలుత బౌలింగ్లో 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో పాటు, ఆ తర్వాత బ్యాటింగ్లో 25 పరుగులు నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇదే మ్యాచ్లో మరో ఆఫ్గన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ (39) కూడా కీలక ఇన్నింగ్స్తో మెరిశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ అండ్ నేవీ పాట్రియాట్స్ 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అలిక్ అథనజే (52) అర్థసెంచరీ సాధించగా, కైల్ మేయర్స్, దాసున్ షనక చెరో 20 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అనంతరం గయానా వారియర్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గుర్బాజ్, నబీలతో పాటు షెయ్ హోప్ (38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంట్కిట్స్ బౌలర్లలో నవిన్ బిడాయిసె 2 వికెట్లు తీశాడు.రికార్డు బద్దలయ్యేనా?ఈ సీజన్లో గయానా అమెజాన్ వారియర్స్కు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. 2019 సీపీఎల్ సీజన్లోనూ గయనా అమెజాన్ వారియర్స్ ఫైనల్లో బార్బడోస్ చేతుల్లో ఓటమికి ముందు వరుసగా 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరి తాజా సీజన్లో గయానా జట్టు ఆ రికార్డును బ్రేక్ చేయడంతో పాటు టైటిల్ కొల్లగొడుతుందేమో చూడాలి.41 year old Mohammed Nabi picked 4/17 in the CPL. 🤯 pic.twitter.com/TXshweqawc— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2026చదవండి: ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే! -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
సౌత్ జోన్తో జరుగుతున్న దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెన్నై వేదికగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ భారీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ 708 పరుగుల మేర అతి భారీ స్కోరు సాధించింది. An innings of pure class 👌Watch 🎥 snippets of Ishan Kishan's fantastic double century so far 💯💯Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ | @ishankishan51 pic.twitter.com/jOndIaA5Uo— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం మొదలైంది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ సూపర్ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ భారీ అర్ధ శతకం (85)తో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ డబుల్ సెంచరీసౌత్ జోన్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఇషాన్.. డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గాయపడి మైదానం వీడాడు. అయితే, జట్టుకు అవసరమైన మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. శతక్కొట్టిన కుశాగ్రాట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ త్రిపురాన విజయ్ బౌలింగ్లో స్మరణ్ రవిచంద్రన్కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ కిషన్ మారథాన్ ఇన్నింగ్స్కు తెరపడింది. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101), అనుకూల్ రాయ్ (45), ఎండీ కొనియన్ ఖురేషి (40) రాణించారు. టెయిలెండర్లలో మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ముకేశ్ కుమార్ డకౌట్ అయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురాణ విజయ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చామా మిలింద్, శ్రేయస్ గోపాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్కు ఒక వికెట్ దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు నమన్ ఓజా పేరిట ఉండేది. సెంట్రల్ జోన్ తరఫున 2014లో నార్త్ జోన్తో మ్యాచ్ సందర్భంగా అతడు 217 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా ఇషాన్ 270 పరుగులు సాధించి నమన్ ఓజాను అధిగమించాడు.చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించిన పాక్ కెప్టెన్! -
ఆసీస్తో సిరీస్కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. అతడి రీఎంట్రీ
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. ఆసీస్తో తలపడే ఈ జట్టులో పదహారు మంది సభ్యులకు చోటు ఇచ్చినట్లు సోమవారం వెల్లడించింది. గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించిన తెంబా బవుమా కెప్టెన్గా తిరిగి వచ్చాడు.అయితే, సౌతాఫ్రికా పేస్ సంచలనం కగిసో రబడ మాత్రం జట్టుకు దూరమయ్యాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు ఆసీస్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. రబడ పూర్తిగా కోలుకోవాలంటే కనీసం 9- 10 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.మరోవైపు.. స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు దూరమయ్యాడు. అయితే, రెండు, మూడో వన్డేలకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు గల కారణాన్ని మాత్రం క్రికెట్ సౌతాఫ్రికా గోప్యంగా ఉంచింది.ఇదిలా ఉంటే.. గెరాల్డ్ కోయెట్జి దాదాపు మూడేళ్ల తర్వాత ఆసీస్ సిరీస్ సందర్భంగా వన్డేల్లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. వన్డే వరల్డ్కప్- 2023లో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా అతడు ప్రొటిస్ జట్టు తరఫున చివరి వన్డే ఆడాడు. ఇక కోయెట్జితో పాటు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించారు.డికాక్, మిల్లర్ ప్రస్తుతం సౌతాఫ్రికా కాంట్రాక్టు ప్లేయర్లు కాదు. అయితే, వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు వీరికి అవకాశం ఇచ్చినట్లుతెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో కోయెట్జి సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా సెప్టెంబరు 24-30 మధ్య ప్రొటిస్- ఆసీస్ జట్లు మూడు మ్యాచ్ల సిరీస్లో తలపడతాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సౌతాఫ్రికా జట్టుతెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కోయెట్జి, క్వింటన్ డికాక్, టోనీ డి జోర్జి, బిజోర్న్ ఫార్చూన్. మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్. -
10 ఏళ్లకే టైటిల్ గెలిచిన మెస్సీ తనయుడు
ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పుత్రోత్సాహంతో పొంగిపోతుంటాడు. అతడి రెండో కుమారుడు మటియో మెస్సీ 10 ఏళ్ల వయసులోనే ఇంటర్ మయామి అకాడమీకి నేపుల్స్ కప్ టైటిల్ (కెప్టెన్గా) అందించి వార్తల్లో నిలిచాడు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్శిస్తుంది. ముఖ్యంగా మెస్సీ ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంటుంది.దీని గురించి తెలిసిన తర్వాత వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ సోషల్మీడియాను హోరెత్తిస్తున్నారు. నేపుల్స్ కప్ విజయం తర్వాత ట్రోఫీతో మటియో పోజులిచ్చిన వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ట్రోఫీని చేత పట్టుకుని చిరునవ్వుతో కనిపించిన మటియోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మటియో మెస్సీ సెప్టెంబర్ 11న తన 11వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.కాగా, లియోనల్ మెస్సీకి మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు థియాగోకు ప్రస్తుతం 13 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు సిరో వయసు 8 ఏళ్లు. మటియో వీరిద్దరి మధ్యవాడు.ఇదిలా ఉంటే, లియోనెల్ మెస్సీ కొద్ది రోజుల కిందటే అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన మెస్సీ.. ఇటీవల ముగిసిన 2026 ఎడిషన్లో తన జట్టును రన్నరప్గా నిలిపాడు. చదవండి: కెవిన్ పీటర్సన్కు కీలక బాధ్యతలు -
ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే!
టీమిండియాతో టీ20 సిరీస్ను అఫ్గానిస్తాన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పసికూనలం కాదని ఇప్పటికే నిరూపించుకున్న అఫ్గానిస్తాన్ టీమిండియాతో సిరీస్కు బలమైన జట్టుతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు తమ వద్ద ఉన్న బలమైన బ్యాటింగ్, బౌలింగ్ అస్త్రాలను టీమిండియాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ఎంపిక చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 13న) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు తుది కూర్పు ఎలా ఉంటుందనేది ఒకసారి పరిశీలిద్దాం.ఓపెనర్లుగా ఆ ఇద్దరే..తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రహ్మనుల్లా గుర్బాజ్, కెప్టెన్ ఇబ్రహీం జద్రన్లు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. తమ జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని అందించే బాధ్యతను ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తీసుకోనున్నారు. మరోవైపు రహ్మనుల్లా గుర్బాజ్కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉండడంతో అతని నుంచి భారీ ఇన్నింగ్స్లు వచ్చే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ కూడా మంచి ఫామ్లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. ఇక వన్డౌన్లో దర్విష్ రసూలీ బ్యాటింగ్ చేసే అవకాశముంది. కొంతకాలంగా టీ20ల్లో ఆఫ్గన్కు కీలక బ్యాటర్గా మారిన రసూలీ 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఇందులో నాలుగు హాఫ్సెంచరీలు ఉన్నాయి.మిడిలార్డర్ ఇలా..సాదిఖుల్లా అటల్ను బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో పంపవచ్చు. అటల్ 29 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన గుల్బదిన్ నైబ్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావొచ్చు. 2024 టీ20 సిరీస్లో నైబ్ తన బ్యాట్తో భారత జట్టును ఇబ్బంది పెట్టాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అజ్మతుల్లా ఉమర్జయ్ ఆరో స్థానంలో, సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ ఏడో స్థానంలో రానున్నారు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తమ ఫినిషింగ్ టచ్తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇక జట్టు ఐకాన్ ప్లేయర్ రషీద్ ఖాన్తో పాటు నూర్ అహ్మద్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్లే.బౌలింగ్ దళం..అఫ్గానిస్తాన్కు స్పిన్ బౌలింగ్ ప్రధాన ఆయుధం. ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ త్రయం భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. తొలి టీ20కి ఈ ముగ్గురు అందుబాటులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జట్టులో ఏకైక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్గా ఫజల్ ఫరూఖీ ఉండవచ్చు. అతడికి తోడుగా అజ్మతుల్లా, గుల్బదిన్ నైబ్లు కూడా బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టొచ్చు. ఆల్రౌండర్ మహ్మద్ నబీ తన ఆఫ్ స్పిన్తో ఇబ్బందిపెట్టగల సత్తా ఉన్నవాడే. మొత్తం మీద అఫ్గానిస్తాన్ జట్టు పేపర్పై మాత్రం బలంగా కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో ఓటములను అంత త్వరగా ఒప్పుకోని అఫ్గానిస్తాన్ జట్టు సొంతగడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న టీమిండియాను ఏ మేరకు నిలువరించగలదనేది చూడాలి.తొలి టీ20కి అఫ్ఘనిస్తాన్ తుది జట్టు అంచనా:రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రన్ (కెప్టెన్), దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జయ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, ఫజల్ ఫరూకీ, నూర్ అహ్మద్.Read: రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ -
షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించుకున్న పాక్ కెప్టెన్
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా భారత్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఓవరాక్షన్ చేసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత పెవిలియన్కు దారి చూపిస్తూ దురుసుగా ప్రవర్తించింది.దీనిపై ఐసీసీ సీరియస్గా స్పందించింది. ఫాతిమా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్దారించి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అలాగే ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా జత చేసింది.ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.5 ప్రకారం, బ్యాటర్ ఔటైన తర్వాత అతడిని లేదా ఆమెను అవమానించేలా ప్రేరేపించే భాష, చర్యలు, సంజ్ఞలు చేయడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఈ నిబంధన కింద ఫాతిమాపై లెవల్-1 ఉల్లంఘన నమోదైంది.ఇది గత 24 నెలల్లో ఫాతిమా చేసిన రెండో నేరంగా ఐసీసీ పేర్కొంది. దీంతో ఆమె డీమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరింది. 2025 ఆగస్టు 6న డబ్లిన్లో ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లోనూ ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ లభించింది.కాగా, శనివారం జరిగిన ఈ మ్యాచ్లో షఫాలీ వర్మ దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే ఫాతిమా సనా వేసిన రెండో ఓవర్ మూడో బంతికి షఫాలీ ఆమెకే తిరిగి క్యాచ్ ఇచ్చి ఔటైంది. క్యాచ్ పట్టిన అనంతరం ఫాతిమా షఫాలీ ఓవరాక్షన్ చేసింది. ఫాతిమా ఎంత రెచ్చగొట్టేలా ప్రవర్తించినా, షఫాలీ స్పందించకపోవడం కొసమెరుపు. ఆ మ్యాచ్లో పాక్ భారీ ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, ఫాతిమా బంతితో రాణించి మూడు వికెట్లు పడగొట్టింది.ఇదిలా ఉంటే, ఆసియా కప్లో పాక్కు ఇవాళ హాంగగ్కాంగ్ చైనాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే, ఆ జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. గ్రూప్-ఏ నుంచి భారత్ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి ఇదివరకే సెమీస్కు చేరింది. గ్రూప్-బి నుంచి శ్రీలంక సైతం ఇదిరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో బెర్త్ కోసం బంగ్లాదేశ్, యూఏఈ పోటీపడుతున్నాయి. చదవండి: 250 రిటైర్డ్ హర్ట్.. చరిత్రలో మూడో బ్యాటర్గా ఇషాన్ కిషన్ -
అక్కడ శ్రేయస్ అయ్యర్.. ఇక్కడ శుబ్మన్ గిల్!
దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారత పురుషుల క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకేరోజు ‘టీమిండియా’ రెండు మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీ20 జట్టు.. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో వన్డే జట్టు ప్రత్యర్థులతో అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఒకేరోజు టీమిండియా రెండు మ్యాచ్లుఇంతకీ ఆరోజు ఎప్పుడంటారా?.. అక్టోబరు 3. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా- విండీస్ మధ్య సెప్టెంబరు 27, 30.. అక్టోబరు 3న వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూ చండీగఢ్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య అక్టోబరు 3న మూడో వన్డే జరుగనుంది. మరోవైపు.. జపాన్ వేదికగా ఆసియా క్రీడలు-2026 టోర్నీ అక్టోబరు 3న ముగియనుంది. అదే రోజు పురుషుల క్రికెట్లో కాంస్య పతక పోరుతో పాటు ఫైనల్ జరుగనుంది.ఇక గత ఎడిషన్లో స్వర్ణం సాధించిన టీమిండియా.. ఈసారి నేరుగా ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2023లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు చైనాలో పసిడి పతకం గెలవగా.. ఈసారి పూర్తిస్థాయిలో రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత టీ20 జట్టు జపాన్కు వెళ్లనుంది.గతంలోనూ ఇదే తరహాలోస్థాయిని బట్టి చూస్తే టీమిండియా ఈసారి కూడా ఫైనల్ ఆడటం లాంఛనమేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు భారత్లో గిల్ కెప్టెన్సీలో వన్డే జట్టు.. అటు జపాన్లో టీ20 జట్టు అక్టోబరు 3న మ్యాచ్లు ఆడనున్నాయి. కాగా 1998, సెప్టెంబరు 12న కూడా ఇలాంటి ఘటనే జరిగింది.నాడు కౌలలంపూర్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే, అజయ్ జడేజా, వీవీఎస్ లక్ష్మణ్లతో కూడిన భారత జట్టు.. కెనడాను 112 పరుగుల తేడాతో ఓడించింది. అదే రోజు.. మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో టొరంటో వేదికగా సహారా ఫ్రెండ్షిప్ కప్లో భాగంగా టీమిండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడింది. ఇందులో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, నవజోత్ సింగ్ సిద్ధు, జవగళ్ శ్రీనాథ్, అజిత్ అగార్కర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. నాటి ఈ మ్యాచ్లో భారత్ పాక్పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.చదవండి: ఇషాన్ కిషన్కు గాయం! -
కెవిన్ పీటర్సన్కు కీలక బాధ్యతలు
ఇంగ్లండ్ క్రికెట్కు సంబంధించి ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్కు కీలక బాధ్యతలు దక్కాయి. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్ పురుషుల వైట్బాల్ జట్లకు అతడిని స్పెషలిస్ట్ మెంటర్గా నియమించారు. వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీ వరకు ఆయన జట్టుతో కలిసి పనిచేయనున్నారు.పీటర్సన్కు తొలి అసైన్మెంట్ ఆస్ట్రేలియా పర్యటన కానుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలోనూ జట్టుతో పనిచేస్తారు. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్తో జరిగే స్వదేశీ సిరీస్లకు కూడా అందుబాటులో ఉంటారు. కేపీ తన బ్యాటింగ్ అనుభవంతో ఆటగాళ్లకు సూచనలను అందిస్తారు.2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. జింబాబ్వే, నమీబియా సహ ఆతిథ్య దేశాలుగా వ్యవహరించనున్నాయి. పీటర్సన్ జన్మస్థలం దక్షిణాఫ్రికానే కావడం ఈ నియామకానికి ప్రాధాన్యత తీసుకొచ్చింది.బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ వైట్బాల్ కోచింగ్ బృందంలో పీటర్సన్ భాగం కానున్నారు. ఈ బృందంలో మార్కస్ ట్రెస్కోథిక్, టిమ్ సౌథీ, సారా టేలర్, జీతన్ పటేల్ కూడా ఉన్నారు. గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు మెంటర్గా పనిచేసిన అనుభవం పీటర్సన్కు ఉంది.కాగా, పీటర్సన్ 2014లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు. 12 ఏళ్ల తర్వాత అతడు మళ్లీ ఇంగ్లండ్ సెటప్లోకి రానున్నాడు. చదవండి: 250 రిటైర్డ్ హర్ట్.. చరిత్రలో మూడో బ్యాటర్గా ఇషాన్ కిషన్ -
రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు నిదీశ్ వేసిన బంతి పొత్తి కడుపు కింద భాగంలో బలంగా తాకింది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయిన ఇషాన్ స్క్వేర్ లెగ్ రీజియన్ దిశగా పరిగెత్తి అక్కడే కూర్చుండిపోయాడు. ఫిజియో వచ్చి ఇషాన్ గాయాన్ని పర్యవేక్షించాడు. అదే సమయంలో ఫిజియోతో వచ్చిన డాక్టర్ ‘రెస్ట్ తీసుకో’ అని సలహా ఇచ్చాడు. కానీ ఇషాన్ మాత్రం తాను బ్యాటింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన ఇషాన్ డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. 270 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన మరో 30 బంతుల్లో 250 మార్క్ను చేరుకున్నాడు. ఆ తర్వాత నొప్పి తిరగబెట్టడంతో ఇషాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి ఇషాన్తో మాట్లాడాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. మరి మిగతా మ్యాచ్కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా? ఉండడా అనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించి అందరి మన్ననలు పొందాడు.అయితే స్కోరు కార్డుపై మాత్రం ఇషాన్ రిటైర్డ్ హర్ట్ అయినట్లు ప్రదర్శించడంతో అతడు మళ్లీ బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఈస్ట్జోన్ 650 పరుగుల మార్క్ను దాటడంతో తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశం లేకపోలేదు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్కు చేరడం గమనార్హం. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్జోన్ తాజాగా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈస్ట్జోన్ 650 పరుగుల మార్క్ను దాటడంతో సౌత్జోన్ అంత స్కోరు చేయాలన్నా రెండు రోజులు పడుతుంది. ఇప్పటికే రెండు రోజుల ఆట ముగియడం, మరో మూడు రోజులు ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ఛాంపియన్గా నిలిచే అవకాశం ఉంది.Ishan Kishan brings up his 2️⃣0️⃣0️⃣ in style 💯💯 🙌What a magnificent knock from the East Zone captain so far 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/2NaE6qG4VK— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026Doctor: rest loIshan: century laga deta hu 💀🙏Ishan Kishan during a Duleep Trophy match, sarcastically noting an apparent injury with "oops🤕" before adding he recovered quickly and is batting well. pic.twitter.com/5eZraPJVix— CricketIndian_🚩🇮🇳 (@CricketIndian_) September 7, 2026 That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026చదవండి: భారత్తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్ -
250 రిటైర్డ్ హర్ట్.. చరిత్రలో మూడో బ్యాటర్గా ఇషాన్ కిషన్
సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడికి కుమార్ కుషాగ్రా (101), శికర్ మోహన్ (85), అభిమన్యు ఈశ్వరన్ (72), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45) కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది.రెండో రోజు టీ విరామ సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసింది. మొహమ్మద్ ఖురేషి (6 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. టీ విరామానికి ముందు అనుకూల్ రాయ్ ఔటయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్, చామ మిలింద్ తలో 2 వికెట్లు తీయగా.. షేక్ రషీద్కు ఓ వికెట్ దక్కింది. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో కదంతొక్కిన ఇషాన్ కిషన్ పలు అరుదైన ఘనతలు సాధించాడు. రామన్ లాంబా (320), అన్షుమన్ గైక్వాడ్ (216), చటేశ్వర్ పుజారా (256), యశస్వి జైస్వాల్ (209) తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్గా, 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో 250 పరుగుల మార్కును తాకిన మూడో బ్యాటర్గా నిలిచాడు.డబుల్ సెంచరీకి ముందే ఇషాన్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 4000 పరుగులు కూడా పూర్తి చేశాడు. 2014లో ఈ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన ఇషాన్.. ఇప్పటివరకు 10 సెంచరీలు, 19 అర్ద సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత మ్యాచ్లో ఇషాన్ 250 పరుగుల తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బంతి పొత్తి కడుపులో బలంగా తాకడం వల్ల ఇషాన్ అసౌకర్యానికి గురయ్యాడు. అప్పుడే అతడు రిటైర్డ్ హర్ట్గా వెళ్తాడని అంతా అనుకున్నారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్లో నిలబడిన ఇషాన్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా డబుల్ సెంచరీ, 250 మార్కును కూడా తాకాడు.చదవండి: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్లతో -
పాక్ సెలక్టర్ పదవికి రాజీనామా.. టీమిండియాపై ప్రశంసలు!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పీసీబీ పెద్దలు విదేశీ కోచ్ల విషయంలో ఒకలా.. దేశీ కోచ్ల విషయంలో మరోలా వ్యవహరిస్తారని ఆరోపించాడు. ఆటగాళ్లు, కోచ్లు మార్పు విషయంలో పీసీబీ తొందరపాటు చర్యలు తీసుకుంటోందని మండిపడ్డాడు.పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభంఅదే సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం క్రమపద్ధతిలో ముందుకు వెళ్తూ రోజురోజుకీ తమ జట్టును మరింతగా అభివృద్ధి చేసుకుంటోందని మిస్బా ప్రశంసించాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిపోగానే.. ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది యాజమాన్యం.అంతేకాదు.. టెస్టు జట్టు హెడ్కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను పదవుల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను వైట్బాల్ కోచ్ మైక్ హసన్ చేపట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపం చెందిన మిస్బా ఉల్ హక్ పాక్ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకొన్నాడు.వారి విషయంలో మాత్రం ఉదారంగా ఉంటారుఈ క్రమంలో స్థానిక టెలివిజన్ షోలో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్లో విదేశీ కోచ్లు, దేశీ కోచ్లను వేర్వేరుగా చూస్తారు. విదేశీ కోచ్ల పట్ల యాజమాన్యం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంది. అదే దేశీ కోచ్ల విషయంలో మాత్రం ప్రతీ దానికి విమర్శలు వస్తాయి.విదేశీ కోచ్లకు అధికారాలు ఎక్కువే ఇస్తారు. కానీ జవాబుదారీతనంలో మాత్రం వారు వెనుకే ఉంటారు. అదే స్థానిక కోచ్లు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ ప్రతికూల ఫలితాలు వస్తే ఇక తిట్ల వర్షమే. నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తారు కూడా!ఇక ఒకటీ రెండు మ్యాచ్ల తర్వాత ఆటగాళ్లను తొలగించడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతోంది. దీని వల్ల ఆటగాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఒత్తిడిలోనూ రాణించేలా వారికి ఊతం ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తూ మనవాళ్లకు తొందర, హడావుడి ఎక్కువ.టీమిండియాపై ప్రశంసలునిజానికి పాక్ యువ క్రికెటర్లు చాలా మంది ఎక్కువగా వైట్బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. రెడ్బాల్ క్రికెట్ ఆడేలా వారిని ప్రోత్సహించాలి. ఫోర్-డే మ్యాచ్లు మాత్రమే ఉంటే సరిపోదు. దేశీ క్రికెట్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి.90వ దశకం తర్వాత బీసీసీఐ క్రమక్రమంగా జట్టులో మార్పులు చేస్తూ వస్తోంది. లోపాలు సరిచేసుకుంటూ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటోంది. అంతేతప్ప తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవడం లేదు’’ అని మిస్బా ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.చదవండి: శుబ్మన్ గిల్ మెరుపులు -
భారత్తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్-ఉర్-రహ్మాన్ బౌలింగ్లో చెలరేగడంతో బార్బడోస్ ట్రైడెంట్స్ 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా కింగ్స్పై విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్తాన్ జట్టు టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ముజీబ్ ఉర్ రహ్మాన్ ఫామ్లోకి రావడం ఆ జట్టు బలాన్ని పెంచడంతో తనతో జాగ్రత్తగా ఉండాలని భారత బ్యాటర్లకు హెచ్చరికలు పంపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగుల సాధారణ స్కోరు చేసింది. కమిల్ పూరన్ (37) టాప్ స్కోరర్గా నిలవగా, రోస్టన్ చేజ్ (34) పర్వాలేదనిపించాడు. బార్బడోస్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్ 3 వికెట్లు తీయగా, డానియల్ సామ్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ ట్రడెంట్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలుపొందింది. క్వింటన్ డికాక్ (47 నాటౌట్), రివాల్డో క్లార్క్ (36 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించగా, ఓపెనర్లు జాకరీ కార్టర్ (32), బ్రాండన్ కింగ్ (22) రాణించారు. సెయింట్ లూసియా బౌలర్లలో రోస్టన్ చేజ్, జాషువా బిషప్లు చెరొక వికెట్ తీశారు. మూడు వికెట్లతో మెరిసిన ముజీబ్ ఉర్ రహ్మాన్కు "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కింది.ఇక అఫ్గానిస్తాన్, టీమిండియా మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 13న తొలి టీ20, 15న రెండో టీ20, 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి.Two for the price of one! ☝️ Mujeeb ur Rahman gets two in the over!🇧🇧 x 🇱🇨#CPL26 #BTvSLK #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/Mv9ufmSPgq— CPL T20 (@CPL) September 7, 2026Read: క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్! -
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్లతో
చెపాక్ స్టేడియం వేదికగా సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ 270 బంతుల్లో తన రెండో ఫస్ట్క్లాస్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 26 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఫస్ట్క్లాస్ క్రికెట్లో కిషన్ అత్యధిక స్కోర్ 273గా ఉంది. రంజీ ట్రోఫీ (2016–17) మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై ఢిల్లీపై అతడు ఈ స్కోర్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.122 ఓవర్లు ముగిసే సరికి ఈస్ట్జోన్ 5 వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో కిషన్(204)తో పాటు అనుకుల్ రాయ్(30) ఉన్నాడు. సౌత్ జోన్ బౌలర్లు ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఈస్ట్జోన్కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించారు. అనంతరం ఫస్ట్ డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్(85) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలో ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్.. తనదైన శైలిలో మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కుమార్ కుషాగ్ర (101)తో కలిసి ఐదో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు ఆటలో కుషాగ్ర ఔటైనప్పటికి కిషన్ మాత్రం తన జోరును కొనసాగిస్తున్నాడు.చదవండి: స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్ విమర్శలు -
తమ్మినేని అమ్మాజీ గురి అదుర్స్!
శ్రీకాకుళం: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు, శ్రీకాకుళం రూరల్ మండలం సనపలవానిపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని అమ్మాజీ షూటింగ్ విభాగంలో జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నఅమ్మాజీ ఇటీవల నిర్వహించిన ఏపీ పోలీస్ మీట్ షూటింగ్ పోటీల్లో రజత పతకం సాధించి సత్తా చాటారు. ఓవైపు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూనే, మరోవైపు షూటింగ్ క్రీడపై ఆసక్తితో నిరంతరం సాధన చేసి పోటీల్లో కచ్చితమైన గురితో అద్భుత ప్రదర్శన కనబరిచారు. తన ప్రతిభతో మూడు రజత పతకాలను కైవసం చేసుకుని శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారు. గతంలో కూడా జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో ఎనిమిది పతకాలు సాధించి ప్రశంసలు అందుకున్నారు. అభినందనల వెల్లువ.. తాజాగా నిర్వహించిన పోటీల్లో మూడు పతకాలు సాధించిన తమ్మినేని అమ్మాజీని పోలీస్ అధికారులు, సహచర సిబ్బంది, కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందించారు. విధి నిర్వహణతో పాటు క్రీడా రంగంలోనూ ప్రతిభ కనబరుస్తూ పతకం సాధించడం అభినందనీయమని ప్రశంసించారు. మహిళా పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తూ, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. చదవండి: 8వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్ -
స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్ విమర్శలు
భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రాపై టీమిండియా స్టార్ స్మృతి మంధాన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన స్మృతి వంటి ప్లేయర్ను విమర్శించడం సరికాదని మండిపడుతున్నారు. జట్టు కోసం ఇప్పటికే ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఎంతో చేసిందని.. ఆమె వల్లే జట్టు గెలిచిన సందర్భాలను మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు.రెండు ప్రపంచ రికార్డులుఆసియా మహిళల టీ20 కప్-2026లో భాగంగా హాంకాంగ్తో మ్యాచ్లో స్మృతి మంధాన అదరగొట్టిన సంగతి తెలిసిందే. విధ్వసంకర శతకంతో చెలరేగిన ఆమె.. తద్వారా మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్గా నిలిచింది. అంతేకాదు... మొత్తంగా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా మిథాలీ రాజ్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టింది.పాక్తో మ్యాచ్లో విఫలం అయితే, ఆ తర్వాత పాకిస్తాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో మాత్రం స్మృతి మంధాన విఫలమైంది. పాక్ విధించిన 56 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (9).. వన్డౌన్ బ్యాటర్ ప్రతికా రావల్ (4) దారుణంగా విఫలమయ్యారు.దీంతో భారత్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (18), దీప్తి శర్మ (12) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇదిలా ఉంటే.. పాక్తో మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతికే స్మృతి అవుటయ్యే పరిస్థితి (క్యాచ్ అవుట్) వచ్చింది. అయితే, అంపైర్ నిర్ణయంతో ఆమెకు లైఫ్ లభించింది.ఈ నేపథ్యంలో స్మృతి దంచికొడుతుందనుకుంటే.. 11 బంతులు ఎదుర్కొని తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించింది. పాక్ కెప్టెన్ సనా ఫాతిమా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయి పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో కామెంటేటర్గా ఉన్న అంజుమ్ చోప్రా స్మృతిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.అంజుమ్ విమర్శలు‘‘గత మ్యాచ్లో సెంచరీ చేసిన ప్లేయర్ (స్మృతి) ఈసారి తొలి బంతికే అవుటయ్యేది. అంపైర్కు స్పష్టత లేకపోవడం వల్ల బతికిపోయింది. కానీ నిజానికి ఆమె అప్పుడే అవుటయ్యేది. కామెంట్రీ బాక్సులో స్టంప్ మైకు ఆడియోలో బంతి బ్యాట్ను తాకిన శబ్దాన్ని మనం స్పష్టంగా విన్నాము కదా’’ అని అంజుమ్ చోప్రా పేర్కొంది.అదే విధంగా.. ‘‘ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. ఆ తర్వాత కూడా ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 56 పరుగుల లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ కూడా త్వరగా పెవిలియన్ చేరింది. ప్రతీసారీ కెప్టెన్ వచ్చి పరుగులు చేయాలా?’’ అని అంజుమ్ చోప్రా టాపార్డర్ను విమర్శించింది. ఈ నేపథ్యంలో స్మృతి అభిమానులు అంజుమ్ చోప్రా తీరును విమర్శిస్తున్నారు. ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన స్మృతి లాంటి దిగ్గజాన్ని తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదంటూ హితవు పలుకుతున్నారు.చదవండి: టీమిండియాపై విజయం.. పాక్ క్రికెట్కు శాపంగా మారింది! -
క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్!
యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. గాయం నుంచి కోలుకున్న అల్కరాజ్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్లో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్స్లో రెండో సీడ్ అల్కరాజ్ 6-4, 6-3, 6-4తో అమెరికాకు చెందిన 20వ సీడ్ టామీ పాల్ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. రెండు గంటల 20 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 33 విన్నర్లు సంధించి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 8వ ర్యాంకర్ బెంజమిన్ షెల్టన్ను ఎదుర్కోనున్నాడు. ఇక షెల్టన్ మూడో రౌండ్లో 6-2, 6-3, 6-4తో స్టిఫానోస్ సిట్సిపాస్ను వరుస సెట్లలో ఖంగుతినిపించి అల్కరాజ్తో పోరుకు సిద్ధమయ్యాడు.Photo Credit: Twitterఅయితే క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తాను తలపడబోయే ప్రత్యర్థిని తప్పుగా ఊహించడం ఆసక్తి రేపింది. టామీ పాల్తో మ్యాచ్ ముగిసిన తర్వాత అల్కరాజ్ సెట్ (యూఎస్ ఓపెన్లో మ్యాచ్లు జరిగే ప్రదేశం)కు వెళ్లాడు. 2003 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆండీ రాడిక్ క్వార్టర్స్లో అల్కరాజ్ ఎదుర్కోబోయే చాలెంజర్ గురించి ప్రశ్న అడిగాడు. "మీరు షెల్టన్ లేదా సిట్సిపాస్లో ఒకరితో క్వార్టర్స్ ఆడనున్నారు. మరి ఇద్దరిలో ఎవరితో ఆడడం మీకు ఇష్టం" అని ప్రశ్నించాడు. అయితే ఆండీ రాడిక్ ప్రశ్న పూర్తి కాకముందే.. అతడి ముందు ఉన్న పేపర్ను పరిశీలించిన అల్కరాజ్.. "ఓరి దేవుడా, ఇది నేను ఊహించలేదు. మెద్వెదెవ్ లేదా టియాఫోల్లో ఒకరితో తలపడతానని భావించాను. కానీ ఇక్కడ వేరే పేర్లున్నాయి.’’ అని పేర్కొన్నాడు. Photo Credit: Twitterతాను ఒకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా తన పరిస్థితి తయారైందని అల్కరాజ్ చెప్పడంతో స్టూడియోలో ఉన్నవారంతా గొల్లుమని నవ్వారు. అల్కరాజ్, ఆండీ రాడిక్ వీడియో సంభాషణ వైరల్గా మారింది. ఇక ఫ్రాన్స్కు చెందిన టియాఫో డానిల్ మెద్వదెవ్ను ఓడించి క్వార్టర్స్లో అలెక్స్ మిచెల్సెన్తో పోటీకి సిద్ధమయ్యాడు.టామీ పాల్ను ఓడించి క్వార్టర్స్లో అడుగుపెట్టిన కార్లోస్ అల్కరాజ్ కొన్ని రికార్డులు సాధించాడు. యూఎస్ ఓపెన్లో క్వార్టర్స్ చేరడం అల్కరాజ్కు ఇది ఐదో సారి. హార్డ్ కోర్టుపై అల్కరాజ్కు ఇది వరుసగా 18వ విజయం కాగా, యూఎస్ ఓపెన్లో ఇది వరుసగా 11వ విజయం. ఓవరాల్గా అల్కరాజ్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ఇది 15వ సారి.Undeniable.Carlos Alcaraz dispatches Paul 6-4, 6-3, 6-4 to reach the quarterfinals! pic.twitter.com/9BycpgCDQZ— US Open Tennis (@usopen) September 6, 2026 Alcaraz didn't know he was playing Shelton or Tsitsipas next at the US Open:Carlos: "I thought.. I thought.. Oh my God I thought I was playing Medvedev or Tiafoe. Oh my God." 😭😭😭“You gonna watch the match?"Carlos: "For sure I'm gonna watch it." 😭 pic.twitter.com/P4eRQBzOkp— The Tennis Letter (@TheTennisLetter) September 6, 2026Read: సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు -
8వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్
నమీబియా వేదికగా జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. ఆదివారం విండ్హోక్ వేదికగా జరిగిన ఫైనల్లో జింబాబ్వేను 48 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక జింబాబ్వే చతికల పడింది.జింబాబ్వే ఆల్రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ ఒంటరి పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. లక్ష్య చేధనలో 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి రజా సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన ఎవాన్స్.. సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఎవాన్స్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 సిరీస్ / ఓ టోర్నమెంట్ ఫైనల్లో 6వ స్ధానం లేదా ఆ తర్వాత స్ధానంలో బ్యాటింగ్కు దిగి అర్ధసెంచరీ చేసిన తొలి ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్ ప్లేయర్గా ఎవాన్స్ నిలిచాడు.ఇప్పటివరకు ఐసీసీ టెస్టు హోదా ఉన్న ఏ జట్టు ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్గా అయితే 6వ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు అత్యధిక స్కోర్ చేసిన రికార్డు నేపాల్కు చెందిన బసీర్ అహ్మద్ పేరిట ఉంది. క్వాడ్రాంగులర్ టీ20 సిరీస్ ఫైనల్లో కువైట్పై నేపాల్ తరఫున అతడు 80 పరుగులు చేశాడు. -
సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు
చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్ నెగ్గిన భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ రెడ్డి-చిరాగ్ శెట్టికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. "చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్స్గా నిలిచినందుకు మీకు అభినందనలు. మీ కమ్బ్యాక్ నిజంగా ఒక అద్భుతం. మీ పట్టుదల, దృడ సంకల్పం, పోరాట స్ఫూర్తి యావత్ దేశానికి గర్వకారణం. రాబోయే సంవత్సరాల్లోనూ మీ జోడీ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on becoming the first Indians to win the China Masters Super 750 title with a spectacular comeback. Your grit, resilience, and fighting spirit have made the entire nation proud. Wishing you both many more… pic.twitter.com/Rm9Ia0Vzew— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2026ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్కు చేరింది.Read: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
రింకూ సింగ్ అట్టర్ ప్లాప్.. అయినా టైటిల్ కొట్టేశాడు
యూపీ టీ20 లీగ్-2026 విజేతగా రింకూ సింగ్ సారధ్యంలోని మీరట్ మేవరిక్స్ నిలిచింది. ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో లక్నో ఫాల్కన్స్ను 94 పరుగుల తేడాతో చిత్తు చేసిన మీరట్.. రెండో యూపీ టీ20 టైటిల్ను ముద్దాడింది. ఈ తుది పోరులో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ ఓపెనర్ దివ్యాన్ష్ జోషి(40 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 105) విధ్వంసకర సెంచరీతో కదం తొక్కాడు. అయితే కెప్టెన్ రింకు సింగ్ ఈ మ్యాచ్లో 2 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. లక్నో బౌలర్లలో అభినందన్ సింగ్ మూడు, భువనేశ్వర్ కుమార్, అజిత్ వర్మ, విప్రజ్ నిగమ్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో ఫాల్కన్స్ 16 ఓవర్లలోనే 109 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్ విశాల్ చౌదరి నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు.కేకేఆర్ కెప్టెన్గా రింకూ?ఇక మీరట్ను జట్టును రెండో సారి ఛాంపియన్గా నిలపడంతో కేకేఆర్ కెప్టెన్సీ రేసులోకి రింకూ దూసుకొచ్చాడు. గత రెండు సీజన్లలో అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అయితే అతడు ఇటీవల ఆల్ఫార్మాట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కోల్కతా కెప్టెన్సీ పోస్ట్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో కేకేఆర్ యాజమాన్యం తమ జట్టు పగ్గాలను ఎవరికి అప్పగిస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితుల బట్టి తదుపరి కేకేఆర్ కెప్టెన్గా రింకూ సింగ్నే ఎంపిక చేసే అవకాశముంది. అతడు ఈ యూపీ టీ20 లీగ్లో జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లకు సారథ్యం వహించి 9 విజయాలు అందించాడు.చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్ప్లాప్ ప్లేయర్కు చోటు -
51 ఏళ్ల హీరోయిన్తో టీమిండియా స్టార్ డేటింగ్?!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. వరుస గాయాల కారణంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతడు చాన్నాళ్లుగా పునరావాసం పొందుతున్నాడు. ఈ క్రమంలో ముంబై నుంచి కొంతకాలం పాటు బెంగళూరుకు పూర్తిగా మకాం మార్చాడనే వార్తలు వచ్చాయి.ముందుగా నటాషాఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించిన ఈ బరోడా ప్లేయర్.. పెళ్లికి ముందే తండ్రయ్యాడు. ఆ తర్వాత కుమారుడు అగస్త్య సమక్షంలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో హార్దిక్- నటాషా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ప్రస్తుతం మహీకతో రిలేషన్షిప్అయితే, కొంతకాలానికే తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు హార్దిక్- నటాషా ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో హార్దిక్ అభిమానులు నటాషాపై సోషల్ మీడియా వేదికగా విద్వేష విషం చిమ్మారు. డబ్బు కోసమే ప్రేమ, పిల్లాడు, పెళ్లి అంటూ ఆమెను అవమానించారు.ఇక నటాషాతో విడిపోయిన కొన్ని నెలల వ్యవధిలోనే మరో మోడల్ మహీక శర్మతో ప్రేమలో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా ప్రకటించాడు. ఇద్దరూ వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు విడుదల చేశాడు. దీంతో నటాషాపై కాస్త ట్రోలింగ్ తగ్గి.. ఈసారి మహీకను టార్గెట్ చేశారు చాలామంది. అయినా వీరి బంధం ఇప్పటి వరకైతే సజావుగా కొనసాగుతోంది.51 ఏళ్ల హీరోయిన్తో డేటింగ్ అంటూఇలాంటి తరుణంలో 32 ఏళ్ల హార్దిక్ పాండ్యా... తాజాగా 51 ఏళ్ల బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్తో డేటింగ్ చేస్తున్నాడనే వదంతులు వ్యాపించాయి. తాజ్ మహల్ ప్యాలెస్లో హార్దిక్- అమీషా కలిసి కనిపించడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.The way Ameesha Patel put her hand on Hardik Pandya’s shoulder during the party at a hotel in Bengaluru. 👀All the Reddit rumours seem to be coming true. pic.twitter.com/VJ7945fHus— Sonu (@Cricket_live247) September 5, 2026నిజమే రొమాంటిక్గానే చేయి వేశానుఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్.. ‘‘హార్దిక్ పాండ్యా భుజం మీద అమీషా పటేల్ చేయి వేసిన తీరు చూస్తుంటే రెడిట్ రూమర్లు నిజమే అనిపిస్తోంది’’ అంటూ వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే అర్థంలో కామెంట్ చేశాడు. ఇందుకు అమీషా పటేల్ గట్టిగానే బదులిచ్చింది.సదరు యూజర్ పోస్టును తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘అవును అది నిజమే యార్!! (వ్యంగ్యంగా).. నేను రొమాంటిక్గానే అతడిపై చేయి వేశాను కదా!.. నాకు తెలిసి నీతో కనీసం ఒక్క అమ్మాయి కూడా స్నేహం చేసి ఉండదేమో!..ఇలాంటి చెత్త పోస్ట్ చేసేముందు కనీసం ఒక్క అమ్మాయితోనైనా స్నేహం పెంచుకో.. అప్పుడే నీకు అన్నీ అర్థమవుతాయి’’ అంటూ అమీషా పటేల్ ఘాటుగా స్పందించింది. తద్వారా తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేసింది.చదవండి: ‘అందమైన సాయంత్రం.. చెన్నైలో మాకు మరో కుటుంబం’ -
మళ్లీ చీఫ్ గెస్ట్ అతడే.. భారత్ గెలిస్తే ట్రోఫీ తీసుకుంటుందా?
భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 విజేతగా నిలిచి ఏడాది అవుతున్నప్పటికీ, ట్రోఫీ ఇంకా వారి చేతికి అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆ ట్రోఫీని అందుకోకపోవడంతో.. అది ఇప్పటికీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉండిపోయింది.అయితే ఇప్పుడు భారత మహిళల జట్టుకు అటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశముంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న మహిళల ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా నఖ్వీ హాజరుకానున్నట్లు సమాచారం. గతంలో జరిగినట్లుగానే విజేతలకు ట్రోఫీని స్వయంగా అందించాలని నఖ్వీ భావిస్తున్నారు. ప్రస్తుత భారత జట్టు ఫామ్ను చూస్తుంటే మరోసారి ఆసియా విజేతగా నిలిచేందుకు ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే నఖ్వీ చేతుల మీదగా భారత అమ్మాయిల జట్టు ట్రోఫీ తీసుకుంటుందా లేదా? మెన్స్ టీమ్ మాదిరిగానే బాయ్కట్ చేస్తుందో వేచి చూడాలి. ఏదేమైనప్పటికి ఆసియాకప్లో మరోసారి హైడ్రామా చోటు చేసుకోవడం ఖాయమన్పిస్తోంది.కాగా ఈ టోర్నీలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. టీమిండియా ఇప్పటికే తమ సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్ షేక్ చేసుకోలేదు. ఈ రెండు జట్లు ఫైనల్కు చేరినా ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్ప్లాప్ ప్లేయర్కు చోటు -
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. అట్టర్ప్లాప్ ప్లేయర్కు చోటు
సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్తో సతమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 2023 నుంచి కనీసం ఒక్కసారి కూడా మూడంకెల స్కోర్ను సాధించలేదు. అయినప్పటికి క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్లు మాత్రం అతడిపై నమ్మకం ఉంచుతున్నారు. ప్రోటీస్ సిరీస్లో కూడా విఫలమైతే అతడిని పూర్తిగా జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశముంది. ఇక సౌతాఫ్రికా కండీషన్స్ను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ బౌలర్లకు సెలక్టర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్కు దూరమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మైఖేల్ నెసర్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా యువ ఆటగాళ్లు కూపర్ కానలీ, మాథ్యూ కుహ్నెమాన్లు కూడా ప్రోటీస్ టూర్కు ఎంపికయ్యారు. కాగా 2018లో జరిగిన వివాదాస్పద సిరీస్ తర్వాత ఆసీస్ టెస్టు మ్యాచ్ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. గతంలో కేవలం ఐదుగురు ఆటగాళ్లు కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, మిచెల్ స్టార్క్, స్మిత్ మరియు రెన్షా - మాత్రమే పర్యటన జట్టులో చోటు దక్కించుకున్నారు.2018 నాటి బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత ఆసీస్ జట్టు టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికాకు వెళ్లడం ఇదే తొలిసారి. అప్పటి పర్యటనలో ఉన్న పాట్ కమిన్స్, హేజిల్వుడ్, స్టార్క్, స్మిత్, రెన్షా మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు. ఈ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నెసర్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, వెబ్స్టర్చదవండి: 'టీమిండియాపై విజయం.. పాక్ క్రికెట్కు శాపంగా మారింది' -
'టీమిండియాపై విజయం.. పాక్ క్రికెట్కు శాపంగా మారింది'
పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ వరుస ఓటములతో తీవ్ర విమర్శలపాలవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.జట్టు ప్రస్తుత పతనానికి 2021 టీ20 ప్రపంచకప్లో భారత్పై సాధించిన విజయమే ప్రధాన కారణమని యూసుఫ్ అభిప్రాయపడ్డాడు. ఆ చారిత్రత్మక విజయంతో పాక్ జట్టులో తీవ్రమైన నిర్లక్ష్యం, అతి విశ్వాసం పెరిగిపోయాయని అతడు అన్నాడు.కాగా దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లను అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. టీ20 ప్రపంచకప్లలో పాక్పై భారత్కు అదే తొలి విజయం కావడం గమనార్హం."2021లో భారత్పై మనం గెలిచిన ఆ ఒక్క మ్యాచ్ ఈ రోజు మనల్ని దెబ్బతీసింది. ఎందుకంటే ఆ విజయం తర్వాత తాము ఏదో గొప్ప విజయం సాధించేశామని మనోళ్లు ఫీలయ్యారు. అందువల్ల భవిష్యత్ ప్లానింగ్, ఆటను మెరుగుపరుచుకోవడంపై శ్రద్ధ పెట్టలేకపోయారు. మనం అత్యుత్తమంగా రాణిస్తున్న సమయంలో ఎంతో వినయంగా ఉండాలి. అహంకారంతో ప్రవర్తిస్తూ, ఇతరుల పట్ల అగౌరవంగా ఉంటే సమస్యలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో సరిగ్గా అదే జరుగుతోంది అని యూసఫ్ పేర్కొన్నాడు.అదేవిధంగా కెప్టెన్సీ మార్పు గురుంచి ఈ లెజెండరీ క్రికెటర్ మాట్లాడాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ కెప్టెన్ కావాలని ప్రయత్నించేవారు. ఇది కూడా పాక్ జట్టు ప్రస్తుత పరిస్థితికి గల ఒక కారణం. మన జట్టు గత కొంతకాలంగా దారుణ ప్రదర్శన చేస్తోంది. పీసీబీ మద్దతు ఇచ్చినా, కోచ్లు మారినా ఆటగాళ్లలో బాధ్యతారాహిత్యం మారలేదు" అని అతడు చెప్పుకొచ్చాడు.చదవండి: శుభ్మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం -
శుభ్మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ని ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నమెంట్లో ఫాజిల్కా ఫాల్కన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్.. ఆదివారం మొహాలీ వేదికగా లుధియానా లయన్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఫాల్కన్స్కు శుబ్మన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తన టీమిండియా సహచరుడు, స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో శుబ్మన్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్.. 7 ఫోర్లు, ఒక సిక్సర్తో 40 పరుగులు చేశాడు.ఉత్కంఠ పోరుఅనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లుధియానా లయన్స్ విజయానికి కేవలం ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. మాధవ్ పఠానియా (37 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో లుధియానా గెలుపునకు 19 పరుగులు అవసరం కాగా.. 17 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. మరో ఒక్క పరుగు చేసి ఉంటే ఈ మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసేది. ఫాల్కన్స్ బౌలర్లలో విహాన్ మల్హోత్రా, దత్తా తలా రెండు వికెట్లు చొప్పున తీశారు.చదవండి: ఆ ఒక్కటి జింబాబ్వే కొంపముంచింది; ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా -
సబలెంకా జోరు
న్యూయార్క్: తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్వన్ సబలెంకా జోరు కొనసాగిస్తోంది. వరుసగా ఆరో ఏడాది ఈ బెలారూస్ స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 6–3, 6–4తో ప్రపంచ 96వ ర్యాంకర్ టేలర్ టౌన్సెండ్ (అమెరికా)ను ఓడించింది. 75 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సబలెంకా రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. 2021, 2022లలో సెమీఫైనల్ చేరిన సబలెంకా 2023లో రన్నరప్గా నిలిచింది. 2024, 2025లలో విజేతగా నిలిచి ఈసారి ‘హ్యాట్రిక్’ టైటిల్పై గురి పెట్టింది. మరోవైపు రెండో సీడ్ రిబాకినా (కజకిస్తాన్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఐదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.ఫ్రిట్జ్, కొబోలి అవుట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్–10లోని మరో ఇద్దరు సీడెడ్ క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. ఐదో సీడ్, ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ఫ్లావియో కొబోలి (ఇటలీ), తొమ్మిదో సీడ్, 2024 రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) మూడో రౌండ్లోనే నిష్క్రమించారు. ఫ్రాన్సిస్కో సెరెన్డోలో (అర్జెంటీనా) 3 గంటల 40 నిమిషాల్లో 3–6, 4–6, 6–3, 6–4, 6–4తో టేలర్ ఫ్రిట్జ్ను... అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం) 6–7 (4/7), 6–3, 6–0, 6–3తో కొబోలిను ఓడించి తమ కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 17వ సీడ్ జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) కూడా మూడో రౌండ్లోనే వెనుదిరిగాడు. గత నాలుగేళ్లు యూఎస్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఓడిన 14వ సీడ్ లెర్నర్ టియెన్ (అమెరికా) 3 గంటల 24 నిమిషాల్లో 6–3, 1–6, 6–7 (2/7), 6–3, 6–4తో మెన్సిక్పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. జ్వెరెవ్ మూడు సెట్లలోనే... తొలి రెండు రౌండ్ మ్యాచ్ల్లో ఐదు సెట్లలో గట్టెక్కిన టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లో మాత్రం వరుస సెట్లలో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. జ్వెరెవ్ 6–2, 7–6 (7/2), 6–2తో టబిలో (చిలీ)పై నెగ్గాడు. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫ్రాన్స్ ప్లేయర్, ప్రపంచ 87వ ర్యాంకర్ ఆర్థర్ గియా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ‘లక్కీ లూజర్’ హోదాలో తొలిసారి యూఎస్ ఓపెన్లో ఆడుతున్న 21 ఏళ్ల గియా మూడో రౌండ్లో 3 గంటల 55 నిమిషాల్లో 7–6 (9/7), 3–6, 4–6, 6–3, 6–2తో మైకేల్ జెంగ్ (అమెరికా)పై గెలిచాడు. వాస్తవానికి గియా క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ నిశేష్ బసవారెడ్డి చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయాడు. అయితే మెయిన్ ‘డ్రా’లోని 19వ సీడ్, 2022 రన్నరప్ కాస్పర్ రూడ్ గాయంతో చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్ల్లో ఓడిన ఉత్తమ ర్యాంక్ ప్లేయర్గా గియాకు ‘లక్కీ లూజర్’గా మెయిన్ ‘డ్రా’లో అవకాశం కల్పించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–ఇవాన్ లియుటారెవిచ్ (బెలారూస్) ద్వయం 4–6, 7–5, 4–6తో ఆర్థర్ ఫెరీ–జోషువా పారిస్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
60 ఏళ్ల తర్వాత...
మోంజా: ఆరు దశాబ్దాల నిరీక్షణ ముగిసింది. ఫార్ములావన్ రేసింగ్ ఇటాలియన్ గ్రాండ్ప్రిలో ఇటలీకే చెందిన డ్రైవర్ విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన ఇటాలియన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటలీకి చెందిన 20 ఏళ్ల కిమీ ఆంటోనెల్లి చాంపియన్గా నిలిచాడు. 19వ స్థానం నుంచి రేసును ఆరంభించిన ఆంటోనెల్లి నిర్ణీత 53 ల్యాప్లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 51 నిమిషాల 15.281 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 1966లో లుడోవికో స్కార్ఫియోటి తర్వాత ఇటాలియన్ గ్రాండ్ప్రిలో టైటిల్ సాధించిన ఇటలీ డ్రైవర్గా ఆంటోనెల్లి గుర్తింపు పొందాడు. అత్యంత వెనుక స్థానంలో నుంచి రేసును ప్రారంభించి విజేతగా నిలిచిన రెండో డ్రైవర్గా ఆంటోనెల్లి ఘనత వహించాడు. 1983లో యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ప్రిలో జాన్ వాట్సన్ (మెక్లారెన్–ఫోర్డ్) 22వ స్థానం నుంచి రేసును ఆరంభించి అగ్రస్థానం పొందాడు. ఈ సీజన్లో ఆంటోనెల్లికిది ఏడో విజయం. 23 రేసుల సీజన్లో 13 రేసులు ముగిశాక ఆంటోనెల్లి 267 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నాడు. -
భారత్ 11... మలేసియా 1
మోఖి (చైనా): జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 11–1తో గెలిచింది. భారత్ తరఫున పూజ సాహూ, గీత యాదవ్, పూర్ణిమ, సనిక రెండేసి గోల్స్ చేయగా... బినిమా, క్రిష్ణ శర్మ, సుఖ్వీర్ కౌర్ తలా ఒక గోల్ చేశారు. మలేసియా జట్టు తరఫున నూర్ ఏకైక గోల్ చేసింది. మరోవైపు జపాన్తో జరిగిన మ్యాచ్ను భారత పురుషుల జట్టు 3–3తో ‘డ్రా’ చేసుకుంది. -
శ్రీలంక హ్యాట్రిక్ విజయం
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో శ్రీలంక జట్టుకిది ‘హ్యాట్రిక్’ విజయం. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేసింది. శోభన (34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. శ్రీలంక బౌలర్లలో ప్రబోద 3 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షిత (37 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడి జట్టును గెలిపించింది. నేడు జరిగే మ్యాచ్లో హాంకాంగ్తో పాకిస్తాన్ ఆడుతుంది. -
ఆ ఒక్కటి జింబాబ్వే కొంపముంచింది; ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా
జింబాబ్వే, నమీబియాలతో జరిగిన ట్రై సిరీస్ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. ఆదివారం విండ్హొక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికా 48 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (29 బంతుల్లో 53), డెవాల్డ్ బ్రెవిస్ (32), కన్నోర్ ఎస్తర్హుజిన్ (32) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో న్యూమన్ నైమూరి, బ్రాడ్ ఎవన్స్ చెరో 2 వికెట్లు తీయగా, సికందర్ రజా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్ ఎవన్స్ (31 బంతుల్లో 56 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలం కావడం జింబాబ్వే కొంపముంచింది. సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్, బోర్న్ ఫోర్టున్ చెరో 3 వికెట్లు తీయగా, ఈథన్ బోస్క్ 2 వికెట్లు పడగొట్టాడు. మెరుపు అర్థసెంచరీ సాదించిన జోర్డాన్ హెర్మన్ "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు సొంతం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్ల్లో 226 పరుగులు చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎగరేసుకుపోయాడు.🚨 MATCH RESULT 🚨#TheProteas seal a commanding 48 run victory over Zimbabwe to clinch the T20I Tri-Series title in Namibia! 🇿🇦🏆A statement finish from South Africa as they get their hands on the trophy! 💪#Unbreakable pic.twitter.com/6c1TqCqSDe— Proteas Men (@ProteasMenCSA) September 6, 2026Read: సంజూను కూరలో కరివేపాకులా తీసేశాడు! -
సంజూను కూరలో కరివేపాకులా తీసేశాడు!
కేరళ క్రికెట్ లీగ్ 2026లో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్కు ఘోర అవమానం ఎదురైనట్లు తెలుస్తోంది. శనివారం టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజంటేషన్ వేడుకలో శాంసన్తో చేతులు కలపడానికి భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నిరాకరించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో నిజమెంత? ఏఐ వీడియోనా అనేది పక్కనబెడితే శ్రీశాంత్ చర్య మాత్రం హాట్టాపిక్గా మారిపోయింది.విషయంలోకి వెళితే.. ప్రజంటేషన్ సందర్భంగా అప్పటికే శాంసన్ వెళ్లి స్టేజీపై ట్రోఫీ పక్కనే నిల్చున్నాడు. ఈలోగా స్టేజీ మీదకు వచ్చిన శ్రీశాంత్ శాంసన్ వైపు కన్నెత్ని కూడా చూడలేదు. అటుపై శాంసన్ పక్కనే నిల్చున్న మిగతా అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ శాంసన్తో షేక్ హ్యాండ్ కాదు కదా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట క్షణాల్లో వైరలయ్యాయి. అయితే దీనిపై అటు శ్రీశాంత్ కానీ.. ఇటు సంజూ కానీ ఇప్పటివరకైతే స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం కామెంట్లతో రెచ్చిపోయారు. "సంజూ శాంసన్ను శ్రీశాంత్ కూరలో కరివేపాకులా తీసేశాడు.. ఇది దారుణ అవమానం" అని పేర్కొన్నారు.ఇక కేరళ క్రికెట్ లీగ్ 2026 టైటిల్ను త్రిసూర్ టైటాన్స్ ఎగరేసుకుపోయింది. శనివారం రాత్రి కాలికట్ గ్లోబల్స్టార్స్తో జరిగిన ఫైనల్లో త్రిసూర్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలికట్ గ్లోబల్స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అఖిల్ స్కారియా (45), అశ్విన్ ఆనంద్ (40) రాణించారు. త్రిసూర్ బౌలర్లలో అబ్దుల్ రమీస్ 3 వికెట్లు తీయగా, ఆనంద్ జోసెఫ్, శరత్ ప్రసాద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన త్రిసూర్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అహమ్మెద్ ఇమ్రాన్ (69) అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, సంజీవ్ సతీషన్ (29) రాణించాడు. కాలికట్ బౌలర్లలో జోస్ పెరైల్, అఖిన్ సతార్, ఇన్బుల్ అఫ్తాబ్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. మహ్మద్ అజారుద్దీన్ (11 మ్యాచ్ల్లో 596 పరుగులు) టోర్నీ టాప్ స్కోరర్గా నిలవగా, నిఖిల్ మాలిక్ (11 మ్యాచ్ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ భారత జట్టులో టీ20, వన్డేల్లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే, ఇంగ్లండ్ సిరీస్కు దూరంగా ఉన్న శాంసన్ అఫ్గానిస్తాన్తో సిరీస్కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది.Any problems between Sreesanth and Sanju Samson?👀There seems to be some talk about a possible ego clash following Sreesanths recent interview.Only they know whats really happening🤷♂️#SanjuSamson @BCCI pic.twitter.com/ndNri2Tabm— Morvin Edward (@morvinedward) September 6, 2026చదవండి: 'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది! -
'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది!
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ జట్టు తరఫున ఆడుతున్న 31 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో చాలా సీనియర్ ఆటగాడు. 2019 దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ఇండియా-ఏ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ ఇండియా-ఏ తరఫున మాత్రం పెద్దగా రాణించలేదు. దేశవాళీ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా 2021 జనవరిలో అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. అలా 2021 నుంచి 2026 దాకా టెస్టుల్లో అరంగేట్రం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే వస్తున్నాడు అభిమన్యు ఈశ్వరన్. ఇక్కడ మరో విచిత్రమైన విషయమేంటంటే.. అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 2021 నుంచి అతడి కళ్ల ముందే 11 మంది ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఒక రకంగా అభిమన్యు ఈశ్వరన్ టాలెంట్ను తొక్కసినట్లేననిపిస్తోంది. ఇప్పటివరకు అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 197 ఇన్నింగ్స్ల్లో 8,545 పరుగులు సాధించాడు. ఇందులో 38 అర్థసెంచరీలు, 27 సెంచరీలు ఉన్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటే ఇదేనేమో!చెన్నై వేదికగా జరుగుతున్న తాజా దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ ఈస్ట్జోన్కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ మరోసారి ఆకట్టుకున్నాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు సాధించాడు. ప్రస్తుతం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ జట్టు 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (63 నాటౌట్) క్రీజులో ఉన్నారు.Meet Abhimanyu Easwaran 🥲>31-year-old Abhimanyu Easwaran was born in Dehradun, Uttarakhand.>At the age of 10, he moved to Kolkata and started his cricket journey.>In the 2019 Duleep Trophy final, he smashed a brilliant century.>After that, he was named in the India A squad.… pic.twitter.com/ryHD2qxmTn— Sam (@cricsam02) September 6, 2026చదవండి: సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్జోన్దే -
సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్జోన్దే
చెన్నై చిదంరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సౌత్జోన్తో మొదలైన ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (75 బంతుల్లో 63 నాటౌట్) క్రీజులో ఉన్నారు. సౌత్జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు తీయగా, త్రిపురాణా విజయ్ ఒక వికెట్ పడగొట్టాడు.వైభవ్ మాస్.. అభిమన్యు, శిఖర్ క్లాస్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్జోన్కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (86 బంతుల్లో 72 పరుగులు) మరో ఎండ్లో నింపాదిగా ఆడాడు. వైభవ్ ఔటయ్యాకా బరిలోకి దిగిన శ్రీకర్ మోహన్ (120 బంతుల్లో 85 పరుగులు) కూడా తనదైన శైలి బ్యాటింగ్తో అలరించాడు. అభిమన్యు, సుదీప్ కుమార్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగిన్పటికీ, శిఖర్కు జత కలిసిన ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. సౌత్జోన్ బౌలింగ్ను చీల్చి చెండాడిన ఇషాన్ అర్ధసెంచరీ మార్క్ చేరుకున్నాడు. శిఖర్ ఔటైనప్పటికీ, కుమార్ కుషాగ్ర వేగంగా ఆడి పరుగులు రాబట్టాడు. ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఇషాన్ కిషన్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది పదో సెంచరీ. అనంతరం కాసేపటికే కుమార్ కుషాగ్ర కూడా అర్థసెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే బ్యాడ్లైట్ కారణంగా అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.💯 for Ishan Kishan 👏He brings it up in style 💥The East Zone captain leading from the front with a superb knock 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/ql9el4G60Q— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026చదవండి: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా!
భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో హెజి టింగ్-రెన్ గ్జియాంగ్ జోడీపై విజయం సాధించింది. చైనా గోడను బద్దలుకొట్టిన ఈ జోడికి ఇదే తొలి చైనా మాస్టర్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో వరుసగా రెండుసార్లు (2023, 2025లో) రన్నరప్గా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మూడో దఫాలో మాత్రం చాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్ జోడీకి ఇది రెండో టైటిల్ కాగా, ఇటీవలే సింగపూర్ ఓపెన్ సూపర్-750 టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలోనూ ఈ జంట ఫైనల్కు చేరింది.మ్యాచ్ జరిగింది ఇలా..మ్యాచ్ ఆరంభం నుంచి మంచి ఈజ్తో కనిపించినప్పటికీ సాత్విక్-చిరాగ్ ద్వయం తొలి గేమ్ను కోల్పోయారు. అయితే రెండో గేమ్లో మాత్ర ఫుంజుకున్న ఈ జంట 21-13తో చైనా జోడికి చెక్ పెట్టారు. ఇక కీలకమైన మూడో గేమ్లో మాత్రం మొదట తడబడడంతో ఈసారి కూడా రన్నరప్కే పరిమితమవుతారేమోననిపించింది. ఒక దశలో 11-9తో వెనుకబడిన సాత్విక్ జంట విజృంభించి 16-16తో స్కోరును సమం చేసింది. ఈ దశలో ఒక్కసారిగా చెలరేగిపోయిన సాత్విక్, చిరాగ్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా 21-17తో గేమ్ను ముగించడంతో పాటు మ్యాచ్ను గెలిచారు. 2023, 2025 సీజన్లలో ఫైనల్కు చేరినప్పటికీ రన్నరప్కే పరిమితమైన సాత్విక్, చిరాగ్ ద్వయం ఈసారి మాత్రం టైటిల్ గెలుపే లక్ష్యంగా ఆటను కొనసాగించారు. ఇన్నాళ్లు చైనా ఫోబియాను ఎదుర్కొన్న ఈ జంట అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ చాంపియన్స్గా నిలిచారు.WATCH SATWIK & CHIRAG WINNING THE CHINA MASTERS 2026 TITLE! 🏆🤩- Second BWF Super 750 Title for duo! 🇮🇳BEAT CHINA AT HOME IN THE FINAL! 🔥🔥🔥 pic.twitter.com/ZCEdec0mLR https://t.co/CWOqWu1y7f— The Khel India (@TheKhelIndia) September 6, 2026Read: కౌంటీల్లో చెలరేగుతున్నాడు; సెలెక్టర్లకు చెన్నై చిన్నోడి వార్నింగ్! -
కౌంటీల్లో చెలరేగుతున్నాడు; సెలెక్టర్లకు చెన్నై చిన్నోడి వార్నింగ్!
కౌంటీ క్రికెట్లో తమిళనాడు క్రికెటర్ సాయి కిషోర్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. గ్లౌసెష్టర్షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్పిన్నర్ సాయి కిషోర్ అద్భుత బౌలింగ్తో తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. డెర్బీషైర్తో జరిగిన మ్యాచ్లో సాయి కిషోర్ 20 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టడంతో గ్లౌసెష్టర్షైర్ 213 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఓవరాల్గా ఏడు వికెట్లు తీసిన సాయి కిషోర్ (తొలి ఇన్నింగ్స్లో రెండు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు) డెర్బీషైర్ పాలిట సింహస్వప్నమయ్యాడు. అతడి ధాటికి 319 పరుగుల ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 105 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో సాయి కిషోర్ 18 ఓవర్లు వేస్తే అందులో 12 మెయిడెన్ ఓవర్లు కావడం విశేషం.దేశవాళీలో ఇటీవలీ రంజీ ట్రోఫీలో నిలకడను ప్రదర్శించిన సాయి కిషోర్ కౌంటీ క్రికెట్లోనూ అదే జోరును చూపిస్తున్నాడు. తాజాగా తన ప్రదర్శనతో సాయి కిషోర్ బీసీసీఐ సెలెక్టర్లకు తన ఎంపిక గురించి హెచ్చరికలు పంపాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు, ఎడమచేతి వాటం స్పిన్నర్గా ఉండటం, ఇంగ్లండ్ పరిస్థితుల్లోనూ రాణించే సామర్థ్యం.. ఇవన్నీ అతడికి కలిసొచ్చే అంశాలని చెప్పొచ్చు. సీనియర్ల వీడ్కోలుతో భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు యువ ప్లేయర్ల కోసం టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత టెస్టు జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో సాయి కిశోర్ కీలక ఎంపికగా మారే అవకాశం ఉంది. అతడి బౌలింగ్ శైలి కూడా గంభీర్ విధానాలకు తగినట్లుగా ఉండడం ఆసక్తికర విషయం. రాబోయే రోజుల్లో టీమిండియా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్లు ఆడనుంది. మరి కౌంటీల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సాయి కిషోర్ టీమిండియాకు ఎంపికవుతాడా లేదా అనేది చూడాలి.SAI KISHORE: 18-12-20-5 🤯🔥- One of the best spells in this County Championship, he is bowling his heart out. pic.twitter.com/qpY6gqe1IJ— Johns. (@CricCrazyJohns) September 6, 2026చదవండి: ‘మా అక్కలు ప్లాన్ చేస్తే మేము ఆచరిస్తాం’ -
‘మా అక్కలు ప్లాన్ చేస్తే మేము ఆచరిస్తాం’
మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి తన ప్రదర్శనతో అదరగొడుతుంది. శనివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన శ్రీ చరణి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసింది. మ్యాచ్లో చేసిన ప్రదర్శనకు గానూ శ్రీ చరణి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకుంది. అవార్డు తీసుకున్న అనంతరం శ్రీ చరణి మాట్లాడింది. ‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. మహిళల క్రికెట్ ఆడుతూ దేశానికి సేవ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నా. అయితే ప్రతీ మ్యాచ్కు జట్టులోని స్పిన్నర్లమంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. నాతో పాటు ప్రేమ రావత్, దీప్తి శర్మ, రాధా యాదవ్ కలిసి మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేయాలనేది చర్చించుకుంటాం. దీప్తి, రాధా దీదీలు చెప్పే ప్రతి సలహాను మైదానంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. 50 వికెట్ల మార్క్కు ఒక్క వికెట్ దూరంలోఎ ఉన్నప్పటికీ, వాటిని నేను పట్టించుకోను. బౌలింగ్పైనే నా దృష్టంతా పెట్టాలనుకుంటున్నా. ఇక నాతో పాటు బౌలింగ్లో వికెట్లు తీసిన ప్రేమ రావత్కు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఆమెది సహజమైన ప్రతిభ. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ సమానంగా ఉంటాయి. బౌలర్లకు సహకరించే వికెట్పై సుమారు 120 పరుగులు అనేది మంచి స్కోరు కింద లెక్కే. ఇకపై కూడా నా ప్రదర్శనను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే పాకిస్తాన్పై భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైంది. మునీబా అలీ (13), షావల్ జుల్ఫికర్ (14) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. శ్రీ చరణి, ప్రేమ రావత్లు చెరో 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత జట్టు 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. హర్మన్ ప్రీత్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా 3 వికెట్లు పడగొట్టింది.Read: ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్? -
ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్?
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలోనూ సత్తాచాటుతున్నాడు. సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు సౌత్ జోన్తో జరుగుతున్న తుది పోరులోనూ అదరగొట్టాడు.టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను సైతం ఈ చిచ్చరపిడుగు వదల్లేదు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 44 పరుగులు చేసి సౌత్ జోన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.తిలక్ మాస్టర్ ప్లాన్అయితే దూకుడుగా ఆడుతూ డేంజర్గా మారుతున్న వైభవ్ను అడ్డుకోవడానికి వైభవ్ను కట్టడి చేసేందుకు సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశాడు. వైభవ్ దగ్గరకు వెళ్లి, "ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావు?" అంటూ చిన్నగా మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు.తిలక్ విసిరిన ఈ మాటల వలలో పడ్డ వైభవ్, ఒక్కసారిగా ఏకాగ్రత కోల్పోయాడు. తర్వాతి బంతికే భారీ పుల్ షాట్కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో వైభవ్ ఆధిపత్యానికి తెరపడింది. తిలక్ వర్మ వేసిన ఈ మాస్టర్ ప్లాన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోందితుది జట్లుఈస్ట్ జోన్: అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ, కుమార్ కుషాగ్రా, సుదీప్ కుమార్ ఘరామి, శిఖర్ మోహన్, ఇషాన్ కిషన్(కెప్టెన్), మహ్మద్ కౌనైన్ ఖురైషి, అనుకుల్ రాయ్, మహమ్మద్ షమీ, అభిజిత్ కె సర్కార్, ముఖేష్ కుమార్సౌత్ జోన్: రికీ భుయ్, నారాయణ్ జగదీషన్(వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షేక్ రషీద్, తిలక్ వర్మ(కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, శ్రేయస్ గోపాల్, త్రిపురాన విజయ్, మహ్మద్ సిరాజ్, చామ వి మిలింద్, మహ్మద్ నిధీష్చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్Tilak Verma vs Vaibhav Suryavanshi. pic.twitter.com/YIDfgF0qps— Ishan's Fan (@Ishanworld32) September 6, 2026 4️⃣,6️⃣,4️⃣Vaibhav Sooryavanshi on the charge with some delightful shots 🔥The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026 -
పాకిస్తానే బెస్ట్ టీమ్.. అందుకే 55 పరుగులకే ఆలౌటైంది!
మహిళల ఆసియాకప్-2026లో దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ ఘోర పరాభవం తర్వాత పాకిస్తాన్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమ జట్టు చిత్తు చిత్తుగా ఓడినప్పటికీ, ఆసియాకప్ టోర్నీలోనే అత్యుత్తమ జట్టు పాకిస్తానేనంటూ అతడు అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ మ్యాచ్లో పాక్ బ్యాటర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. శ్రీచరణి, ప్రేమా రావత్, దీప్తి శర్మ వంటి స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని పాక్ బ్యాటింగ్ లైనప్ మొత్తం విలవిల్లాడింది. ఓపెనర్లు మునీబా(13), షవాల్ జుల్ఫికర్(14) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ తమ జట్టును రియాజ్ వెనకేసుకురావడం హాస్యాస్పదంగా మారింది."మా జట్టులోని ప్లేయర్లందరికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. కానీ వారు తమను తాము నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. భారత్తో జరిగిన మ్యాచ్లో చేసిన తప్పులపై చర్చించి, తదుపరి హాంకాంగ్తో మ్యాచ్లో వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఈ ఆసియాకప్ ట్రోఫీని గెలిచే అత్యుత్తమ జట్టు ఇప్పటికీ పాకిస్తానేనని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూఏఈ పరిస్థితులు మాకు బాగా తెలుసు. మా జట్లు ఇక్కడ చాలా క్రికెట్ ఆడాయి అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రియాజ్ పేర్కొన్నాడు. కాగా రియాజ్ వ్యాఖ్యలకు భారత ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. 'నిజంగానే పాక్ బెస్ట్ టీమ్.. అందుకే 55 పరుగులకు ఆలౌటైంది' ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. సిరాజ్ను సైతం వదల్లేదు
చెన్నై వేదికగా సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్లో తనదైన శైలిలో సూర్యవంశీ విరుచుకుపడ్డాడు. సౌత్జోన్కు ప్రాతనిధ్యం వహిస్తున్న స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను సైతం వైభవ్ వదల్లేదు. 7వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో వైభవ్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో 14 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్గా 37 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 44 పరుగులు చేశాడు. మరోసారి షార్ట్ లెంగ్త్ డెలివరీకే వైభవ్ తన వికెట్ను కోల్పోయాడు. సీవీ మిలింద్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద సూర్యవంశీ దొరికిపోయాడు. ఇక ఈస్ట్జోన్ 21 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది.తుది జట్లుఈస్ట్ జోన్: అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ, కుమార్ కుషాగ్రా, సుదీప్ కుమార్ ఘరామి, శిఖర్ మోహన్, ఇషాన్ కిషన్(కెప్టెన్), మహ్మద్ కౌనైన్ ఖురైషి, అనుకుల్ రాయ్, మహమ్మద్ షమీ, అభిజిత్ కె సర్కార్, ముఖేష్ కుమార్సౌత్ జోన్: రికీ భుయ్, నారాయణ్ జగదీషన్(వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షేక్ రషీద్, తిలక్ వర్మ(కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, శ్రేయస్ గోపాల్, త్రిపురాన విజయ్, మహ్మద్ సిరాజ్, చామ వి మిలింద్, మహ్మద్ నిధీష్చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్4️⃣,6️⃣,4️⃣Vaibhav Sooryavanshi on the charge with some delightful shots 🔥The 50-run stand also comes up between Vaibhav and Abhimanyu Easwaran 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/0XLR4LI50R— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026 -
పాక్ క్రికెట్లో కలకలం.. ఆటగాళ్ల మొబైల్స్ లాక్కున్న పీసీబీ!
పాకిస్తాన్ క్రికెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంగ్లండ్తో మూడో టెస్టుకు ముందు ఉన్నపళంగా జట్టులోని ఏడుగురు ఆటగాళ్లను, ఇద్దరు కోచ్లను తొలగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు .. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్బాస్టన్ టెస్టుకు ముందు పీసీబీ తమ జట్టు సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.మూడో టెస్టు ముగిసే వరకు ఆ మొబైల్ ఫోన్లు పీసీబీ వద్దే ఉంటాయని పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ చర్యకు గల కారణం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ విషయంపై పీసీబీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ప్రొఫెషనల్ క్రికెట్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా వాడకూడదని చెప్పే హక్కు బోర్డుకు లేదు. సాధారణంగా ఆటగాళ్లు స్టేడియానికి వచ్చేటప్పుడు తమ ఫోన్లను సంబంధిత అధికారులకు అందజేస్తారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత వాటిని తిరిగి తీసుకుంటారు. కానీ పీసీబీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూసింది. దీంతో మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా వంటి స్టార్ ప్లేయర్లతో సహా ఏడుగురిని పీసీబీ స్వదేశానికి తిరిగి పిలిపించింది. వీరితో పాటు కోచ్లు సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్లపై కూడా బోర్డు వేటు వేసింది. పీసీబీ తీసుకున్న ఈ హఠాత్తు నిర్ణయాలపై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగానే, జట్టు సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకుంటూ పీసీబీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
టీమిండియా ప్లేయర్ విధ్వంసం.. 6 ఫోర్లు, 8 సిక్సలతో వీర విహారం
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్లో మొహాలీ కింగ్స్ మరో సంచలన విజయం సాధించింది. శనివారం మొహాలీ వేదికగా జలంధర్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో మొహాలీ గెలుపొందింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన జలంధర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మొహాలీ బ్యాటర్లలో విశ్వనాథ్ సింగ్(40), కెప్టెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్(37), హర్జస్ సింగ్(37) రాణించారు. మొహాలీ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్, హర్ష్దీప్ సింగ్, తేజ్ప్రీత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.రమణ్దీప్ మెరుపులుఅనంతరం లక్ష్య చేధనలో మొహాలీ కింగ్స్ కెప్టెన్ రమణ్దీప్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన రమణ్దీప్.. ప్రత్యర్ది బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్స్లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడితో పాటు అన్మోల్ప్రీత్ సింగ్(29 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 178 పరుగుల లక్ష్యాన్ని మొహాలీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంతో మొహాలీ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది. ఇక రమణ్దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్దీప్కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్రౌండర్ భావిస్తున్నాడు. -
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
మహిళల ఆసియాకప్-2026లో పాకిస్తాన్కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాక్ ఘోర పరాజయం పాలైంది. మరోసారి దాయాది జట్టుపై హర్మన్ సేన ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు భారత బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. ముఖ్యంగా పాక్ బ్యాటర్లు భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడారు. శ్రీచరణి, ప్రేమా రావత్ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును దెబ్బతీశారు. వీరిద్దరితో పాటు దీప్తి శర్మ రెండు, షెఫాలీ వర్మ ఓ వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్ల విషయానికి వస్తే.. ఓపెనర్లు మునీబా(13), షవాల్ జుల్ఫికర్(14) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.బ్యాటింగ్లో విఫలమైన కెప్టెన్ ఫాతిమా సనా.. బౌలింగ్లో మాత్రం మూడు వికెట్లు పడగొట్టింది. అయినప్పటికి ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 8.4 ఓవర్లలో చేధించింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఫాతిమా స్పందించింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని సనా చెప్పుకొచ్చింది."ఈ ఓటమి మమ్మల్ని ఎంతగానో బాధించింది. మ్యాచ్లో కనీసం ఒక్క భాగస్వామ్యం కూడా నెలకొల్పలేకపోయాం. ఇన్నింగ్స్ ఆరంభం నుండి ముగిసే వరకు పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. కొత్త పిచ్ కావడంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. బోర్డుపై మంచి స్కోరు ఉంచి, మా బౌలింగ్ బలాన్ని వాడుకోవాలనుకున్నాం.కానీ మా ప్రణాళికలను మైదానంలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. నేను బౌలింగ్లో రాణించినా, జట్టు ఓడిపోయినప్పుడు ఆ ప్రదర్శనకు ఏ విలువా ఉండదు. అదే జట్టు గెలిచి ఉంటే ఆ సంతోషం వేరుగా ఉండేది. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. మా తదుపరి మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి సెమీఫైనల్కు అర్హత సాధిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సనా పేర్కొంది. కాగా పాక్ తమ తదుపరి మ్యాచ్లో సెప్టెంబర్ 7న హాంకాంగ్తో తలపడనుంది.చదవండి: IND vs PAK: ఆడింది చాలు పో!.. పాక్ కెప్టెన్ ఓవరాక్షన్? -
ఆడింది చాలు పో!.. పాక్ కెప్టెన్ ఓవరాక్షన్?
మహిళల ఆసియాకప్-2026లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది.స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమా రావత్ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు దీప్తి శర్మ రెండు, షెఫాలీ వర్మ ఓ వికెట్ సాధించింది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు మునీబా అలీ(13), షవాల్ జుల్ఫికర్(14) మినహా మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి 8.4 ఓవర్లలో చేధించింది.ఫాతిమా ఓవరాక్షన్కాగాస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా దాటికి టాపార్డర్ బ్యాటర్లు షెఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (9), ప్రతీక రావల్ (4) పెవిలియన్ చేరారు.అయితే షెఫాలీని ఔట్ చేసిన అనంతరం ఫాతిమా ఓవరాక్షన్ చేసింది. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సనా.. షెఫాలీకి గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించింది. ఆ బంతిని షెఫాలీ లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించింది. కానీ బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దీంతో పాక్ కెప్టెన్ ఈజీ రిటర్న్ క్యాచ్ అందుకుంది. వెంటనే ఫాతిమా షెఫాలీ వైపు చేయి చూపిస్తూ "ఇక ఆడింది చాలు వెళ్లు" అన్నట్లుగా సైగలు చేస్తూ సెండాఫ్ ఇచ్చింది.కానీ షెఫాలీ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్గా మైదానం వీడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాక్ కెప్టెన్కు ఎందుకంత పొగరు? అని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇదే మ్యాచ్లో పాక్ ఓపెనర్ మునీబాను షెఫాలీ క్లీన్ బౌల్డ్ చేసినప్పటికి ఎలా సెలబ్రేషన్స్ చేసుకోవడం గమనార్హం. కానీ పాక్ కెప్టెన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది.Fatima Sana turning up the heat despite the scoreline. 🥵 Watch India vs Pakistan LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldWomensAsiaCup2026 #NotAGentlemansGame pic.twitter.com/j2ohXqlZSV— Sony Sports Network (@SonySportsNetwk) September 5, 2026 -
భారీ మైలురాయిని తాకనున్న షమీ
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తన కెరీర్లో ఓ భారీ మైలురాయిని తాకనున్నాడు. ఆదివారం సౌత్ జోన్తో మొదలయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్ అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100వ మ్యాచ్ కానుంది. ఈ టోర్నీలో షమీ ఈస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.షమీ ఇప్పటివరకు 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 382 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ 8-90గా (ఇన్నింగ్స్లో) ఉంది. ప్రస్తుత దులీప్ ట్రోఫీలో షమీ ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు.ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షమీ రీఎంట్రీ కోసం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా టీమిండియా సెలెక్టర్లు అతడిని కనికరించడం లేదు. 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు ముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (అతడి రంజీ జట్టు అసోసియేషన్) షమీని సత్కరించింది. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంతకం చేసిన 100వ నంబర్ జెర్సీని బహుకరించింది. ఈస్ట్ జోన్ సహచరులు కూడా సంతకాలు చేసిన జెర్సీని షమీకి బహుకరించారు.MOHAMMED SHAMI 100* 🇮🇳- A special gift from Cricket Association of Bengal for Mohammed Shami.Indian legend will be playing his 100th First Class matches tomorrow. pic.twitter.com/SVwDBKsL9p— Johns. (@CricCrazyJohns) September 5, 2026షమీ తన 100వ మ్యాచ్పై స్పందిస్తూ, ఈ ప్రయాణం హార్డ్ వర్క్, సవాళ్లు, నేర్చుకోవడం, మరచిపోలేని జ్ఞాపకాలతో సాగిందని అన్నాడు. ఈ ప్రత్యేక మైలురాయికి తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్లు, సహచరులు, అభిమానులతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ మ్యాచ్లో చరిత్ర సృష్టించిన షఫాలీ.. సరికొత్త ప్రపంచ రికార్డులు -
పాకిస్తాన్ మ్యాచ్లో చరిత్ర సృష్టించిన షఫాలీ.. సరికొత్త ప్రపంచ రికార్డులు
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా నిన్న జరిగిన గ్రూప్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో 6 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 12 పరుగులు చేసిన ఆమె.. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు (2182 బంతులు) పూర్తి చేసిన బ్యాటర్గా నిలిచింది. ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలిస్సా హీలీ పేరిట ఉండేది.22 ఏళ్ల 220 రోజుల వయసులో 3000 టీ20 పరుగులు పూర్తి చేసిన షఫాలీ, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది. పై రెండు ప్రపంచ రికార్డులే.2019లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన షఫాలీ, 3000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత మహిళా క్రికెటర్గానూ నిలిచింది. ఆమెకు ముందు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఈ ఘనత సాధించారు.భారత్ ఘన విజయందుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా పాక్ను 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్ దశలో మూడు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించి అజేయంగా సెమీఫైనల్కు చేరింది.చెలరేగిన స్పిన్నర్లుఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు శ్రీచరణి (4-0-7-3), ప్రేమా రావత్ (4-0-9-3), దీప్తి శర్మ (3.1-0-5-2), షఫాలీ వర్మ (3-0-10-1) చెలరేగిపోయారు. చదవండి: శ్రీ చరణి ప్రపంచ రికార్డు.. 55 పరుగులకే పాక్ ఆలౌట్ -
ప్రిక్వార్టర్స్లో అల్కరాజ్
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ దూసుకుపోతున్నాడు. మూడో రౌండ్లో అలవోక విజయంతో అతను ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఈ పోరులో అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–4, 6–1తో వు యిబింగ్ (చైనా)పై ఘన విజయం సాధించాడు. 2 గంటల 20 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో అల్కరాజ్ 6 ఏస్లు, 21 విన్నర్లు కొట్టాడు. 2021 చాంపియన్, ఏడో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) కూడా ముందంజ వేశాడు. మూడో రౌండ్లో అతను 6–4, 6–4, 6–4తో ఆర్థర్ రిండర్నెక్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. పురుషుల విభాగంలో 8వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా), 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫో (అమెరికా), సిట్సిపాస్ (గ్రీస్) కూడా ప్రిక్వార్టర్స్కు చేరగా... 15వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్తాన్) మూడో రౌండ్లో ఓడి నిష్క్రమించాడు. షెల్టన్ 7–6 (7/3), 6–7 (5/7), 6–3, 6–4 స్కోరుతో డెనిస్ షపలోవ్ (కెనడా)పై, టియాఫో 6–4, 6–2, 6–4తో వలెంటైన్ వాకెరట్ (మొనాకో)పై, సిట్సిపాస్ 2–6, 6–1, 7–6 (7/3), 6–1తో జిరి లెహెకా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందారు. బబ్లిక్ను 6–4, 3–6, 6–7 (4/7), 6–1, 6–3తో టామీ పాల్ (అమెరికా) ఓడించాడు. సెరెనా–వీనస్ జోడి ఓటమి మహిళల సింగిల్స్లో వింబుల్డన్ చాంపియన్, 6వ సీడ్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరగా, 9వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) మూడో రౌండ్లో ఓడి వెనుదిరిగింది. నొస్కోవా 6–2, 6–7 (6/8), 6–2తో యాన్ లీ (అమెరికా)ను, స్వితోలినా (ఉక్రెయిన్) 3–6, 6–2, 3–6తో అనా కలినస్కియా (రష్యా) చేతిలో ఓటమిపాలైంది. మహిళల డబుల్స్ అమెరికా స్టార్ సిస్టర్స్ వీనస్ విలియమ్స్–సెరెనా విలియమ్స్ తొలి రౌండ్లోనే ‘సూపర్ టైబ్రేక్’లో ఓడి వెనుదిరిగారు. మాయా జాయింట్ (ఆ్రస్టేలియా)–హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడి 6–3, 6–7 (6/8), 7–6 (10/7)తో వీనస్–సెరెనాపై విజయం సాధించారు. బాంబ్రీ, నికీ జోడీల నిష్క్రమణ... పురుషుల డబుల్స్లో భారత ప్లేయర్ నికీ పునాచా –గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్) ద్వయం మొదటి రౌండ్లోనే ఓడింది. నికీ–ఎస్కోబర్ 6–7 (3/7), 7–6 (7/4), 2–6 స్కోరుతో నీల్ ఒబర్లీట్నర్ (ఆస్ట్రియా)–పెట్ర్ నౌజా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయంపాలైంది. మరో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ కూడా తొలి రౌండ్ను దాటలేకపోయాడు. బాంబ్రీ–మైకేల్ వీనస్ (అమెరికా) ద్వయం 6–7 (4/7), 6–7 (3/7)తో ర్యాన్ సెగెర్మన్–పాట్రిక్ ట్రాక్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. -
అనాహత్ ఓటమి
లండన్: ప్రతిష్టాత్మక లండన్ స్క్వాష్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) గోల్డ్ ఈవెంట్లో భాగంగా శనివారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్ 4–11, 4–11తో ఐదో ర్యాంకర్ శివసంగరి సుబ్రమణ్యం (మలేసియా) చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్స్లో ప్రపంచ 11వ ర్యాంకర్ను చిత్తుచేసిన 18 ఏళ్ల అనాహత్ క్వార్టర్స్లో అదే జోరు కొనసాగించలేక టోర్నీ నుంచి నిష్క్ర మించింది. ఆసియా క్రీడలకు ముందు ఈ నెల 12 నుంచి ఖతార్ క్లాసిక్ టోర్నీలో అనాహత్ బరిలోకి దిగనుంది. -
భారత జట్ల బోణీ
మోఖి (చైనా): జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు బోణీ కొట్టాయి. శనివారం డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల జట్టు 14–0 గోల్స్ తేడాతో ఇండోనేసియాను చిత్తుచేయగా... మహిళల జట్టు 4–1 గోల్స్తో దక్షిణ కొరియా పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత్ గోల్స్ వర్షం కురిపించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ప్రభ్దీప్ సింగ్ 5 గోల్స్తో విజృంభించగా... కెపె్టన్ అన్మోల్ ఎక్కా 4 గోల్స్ సాధించాడు. అజీత్ యాదవ్ మూడు గోల్స్తో మెరవగా... హర్పాల్, మౌర్య చెరో గోల్ కొట్టారు. మహిళల మ్యాచ్లో సనిక, పూర్ణిమ యాదవ్, పూజ, మధు ఒక్కో గోల్చేశారు. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్లో నేడు జపాన్తో భారత పురుషుల జట్టు, మలేసియాతో మహిళల జట్టు తలపడనున్నాయి. -
ఈస్ట్ జోన్ X సౌత్ జోన్
చెన్నై: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్తో సౌత్ జోన్ అమీతుమీకి సిద్ధమైంది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టులో భారత ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, మొహమ్మద్ సిరాజ్తో పాటు రికీ భుయ్, షేక్ రషీద్, జగదీశన్, స్మరణ్, శ్రేయస్ గోపాల్ ఉన్నారు. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ ఆడడం లేదని సారథి తిలక్ మ్యాచ్కు ముందు రోజు వెల్లడించాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన కావెరప్ప స్థానంలో హైదరాబాద్ ఆల్రౌండర్ సీవీ మిలింద్కు సౌత్ జోన్ జట్టులో చోటు దక్కింది. మరోవైపు ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్జోన్లో 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సెమీఫైనల్లో దంచికొట్టిన అతడు ఫైనల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. వందో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తనలో వాడి తగ్గలేదని చాటుతుండగా... ముకేశ్ కుమార్, అభిజిత్ సర్కార్ అతడికి అండగా నిలుస్తున్నారు. -
చైనా మాస్టర్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ
భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ 2026 టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రియాన్ అయూబ్–టాన్ వీ కియోంగ్ జోడీని 21-15, 18-21, 21-11తో ఓడించింది.65 నిమిషాల పాటు సాగిన పోరులో భారత జోడీ తొలి గేమ్ను పూర్తి ఆధిపత్యంతో గెలిచినా, రెండో గేమ్లో కీలక దశలో పాయింట్లు కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్లో సాత్విక్–చిరాగ్ పూర్తిగా పుంజుకుని, ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించారు.ఫైనల్లో చైనా జోడీతో పోరుఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ చైనాకు చెందిన హీ జీ టింగ్–రెన్ జియాంగ్ యు జోడీని ఎదుర్కోనుంది. చైనా మాస్టర్స్లో సాత్విక్-చిరాగ్కు ఇది మూడో ఫైనల్. 2023, 2025లో వారు రన్నరప్గా నిలిచారు. కాబట్టి ఈసారి టైటిల్ సాధిస్తే వారి తొలి చైనా మాస్టర్స్ టైటిల్ అవుతుంది.చదవండి: గంజాయి వాసన వస్తుందని మ్యాచ్ను ఆపిన సబలెంకా


