breaking news
Sports
-
నేపాల్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో సంచలనం
నేపాల్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్లో సంచలనం నమోదైంది. సుదుర్ పశ్చిమ్ రాయల్స్తో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన తుది పోరులో లుంబిని లయన్స్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో లయన్స్ రాయల్స్ను చిత్తు చేసి టైటిల్ను కైవసం చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. కిరీటీపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో సుదుర్ పశ్చిమ్ రాయల్స్, లుంబిని లయన్స్ పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. రోహిత్ పౌడెల్ హ్యాట్రిక్ సహా ట్రంపెల్మన్ (2.1-0-3-3), షేర్ మల్లా (4-0-18-3), తిలక్ భండారి (4-0-26-1) చెలరేగడంతో 19.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది.రోహిత్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో చివరి మూడు బంతులకు దీపేంద్ర సింగ్, దీపక్ బొహారా, పూనీత్ మెహ్రా వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. రాయల్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఇషాన్ పాండే (33) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. మిగతా వారిలో దీపేంద్ర సింగ్ (13), హర్మీత్ సింగ్ (10), కుగ్గెలిన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని లయన్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ దినేశ్ అధికారి (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లయన్స్ గెలుపును ఆదిలోనే ఖరారు చేశాడు. డి ఆర్కీ షార్ట్ 14, నిరోషన్ డిక్వెల్లా 11, రోహిత్ పౌడెల్ 16 పరుగులు చేసి లయన్స్ గెలుపుతో భాగమయ్యారు. రాయల్స్ బౌలర్లలో హేమంత్ ధామి 2 వికెట్లు పడగొట్టగా.. దీపేంద్ర ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీయడంతో పాటు టోర్నీ ఆధ్యాంతం రాణించిన రూబెన్ ట్రంపెల్మన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ అవార్డులు లభించాయి. -
హైదరాబాద్ పికిల్బాల్ లీగ్.. ఛాంపియన్గా 'క్రెడికాన్ మావెరిక్స్'
హైదరాబాద్: హైదరాబాద్ పికిల్బాల్ లీగ్ (HPL) తొలి సీజన్ అత్యంత ఉత్సాహంగా ముగిసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని 'ది లీగ్' వేదికగా జరిగిన తుది పోరులో క్రెడికాన్ మావెరిక్స్(Credicon Mavericks) జట్టు అఖండ విజయం సాధించి, తొలి సీజన్ ఛాంపియన్గా నిలిచింది. ఆల్ స్టార్స్ జట్టుతో జరిగిన ఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. పోరు హోరాహోరీగా సాగి, ఏడో సెట్ అయిన నిర్ణయాత్మక టై-బ్రేకర్ వరకు వెళ్ళింది. అక్కడ మావెరిక్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి, 4–3 తేడాతో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ విజయంతో హెచ్పీఎల్ చరిత్రలో తొలి టైటిల్ విజేతలుగా క్రెడికాన్ మావెరిక్స్ జట్టు తమ పేరును లిఖించుకుంది.సుమారు 2,000 మంది పికిల్బాల్ క్రీడాభిమానులు ఈ అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ను వీక్షించడానికి వచ్చారు. ఇది హైదరాబాద్లో పికిల్బాల్ క్రీడపై పెరుగుతున్న ఆసక్తిని, ఈ లీగ్ ఎంత వేగంగా ప్రజాదరణ పొందుతుందో తెలియజేస్తుంది. విజేతగా నిలిచిన క్రెడికాన్ మావెరిక్స్ జట్టు ట్రోఫీతో పాటు రూ. 6 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది. రన్నరప్గా నిలిచిన ఆల్ స్టార్స్ జట్టు తమ అద్భుత ప్రదర్శన తర్వాత రూ. 3 లక్షల నగదు బహుమతిని అందుకుంది.చివరి రాత్రి క్రీడ, వినోదం కలగలిసి సాగింది. మ్యాచ్ మధ్యలో ప్రముఖ గాయకుడు లక్కీ అలీ, అతని బృందం ప్రదర్శించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తొలి సీజన్ విజయవంతంపై స్పందిస్తూ, సెంటర్ కోర్ట్ స్పోర్ట్ & ఎంటర్టైన్మెంట్, హైదరాబాద్ పికిల్బాల్ లీగ్ కో ఫౌండర్ యశ్వంత్ బియ్యాల మాట్లాడుతూ.. "ఈ ఫైనల్స్, హెచ్పీఎల్ ముఖ్య లక్షణాలైన.. ఉత్కంఠ, సామాజిక అనుబంధం, వినోదం అన్నింటినీ బలంగా చూపించింది" అని అన్నారు. ఆల్ స్టార్స్ జట్టుకు చెందిన సమీర్ వర్మ 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్' అవార్డును గెలుచుకున్నారు. -
కోల్కతా మెస్సీ ఈవెంట్ : టికెట్ ధరలు వాపసు
కోల్కతా, సాక్షి: కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ లెజెండ్ లియెనెల్ మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. తమ అభిమాన క్రీడాకారుడిని చూడటానికి వచ్చేందుకు నిర్వహణా లోంపతో జనం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదీ 20 నిమిషాల్లోనే లియోనెల్ మెస్సీ వేదిక నుండి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. చివరికి పోలీసుల జోక్యంతోవారిని అదుపు చేశారు. అయితే ఎంతో ఖరీదు పెట్టి టికెట్లను కొని, దూర ప్రాంతాలనుంచి వచ్చినప్పటికీ, కనీసం మెస్సీ ముఖం కూడా చూడలేకపోయామని చాలామంది అభిమానులు ఆగ్రమం వ్యక్తం చేశారు.టికెట్ డబ్బులు వాపసుమరోవైపు లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేశారు. కోల్కతాలో విలేకరులతో మాట్లాడుతూ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అంతేకాదు అభిమాలను టికెట్ రుసుమును నిర్వాహకులు వెనక్కి ఇస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ రీఫండ్ ఎలా జరుగుతుంది అనేది పరిశీలించాలన్నారు.చదవండి: రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్#WATCH | Kolkata: On the Chaos at Messi's Kolkata event, Additional Director General (ADG) Law and Order Jawed Shamim says, "There is normalcy now. The second part is the investigation; the FIR has been lodged, and the chief organiser has been arrested... I'm telling you, they… pic.twitter.com/GRqz03wPvp— ANI (@ANI) December 13, 2025 దీనిపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్కతా క్రీడాభిమానులకు ఇదొక చీకటి రోజుగా వ్యాఖ్యానించారు. నిర్వాహక లోపం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనీ, దీనికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే ముందుజాగ్రత్తలు తీసుకోని పోలీసు అధికారును సస్పెండ్ చేయాలని కూడా అన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, దోషులను అరెస్టు చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపసు ఇవ్వాలని, స్టేడియం ,ఇతర బహిరంగ ప్రదేశాలకు జరిగిన నష్టానికి నిర్వాహకులపై ఛార్జీలు విధించాలని, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని గవర్నర్ అన్నారు.ఇదీ చదవండి: 90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే! -
సంజూ చేసిన తప్పు ఏంటి.. ఎందుకు బలి చేస్తున్నారు?: ఉతప్ప
ఈ ఏడాది ఆసియాకప్తో టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ శుభ్మన్ గిల్.. దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికి టీ20ల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. గిల్ తన చివరి పది మ్యాచ్లలో 181 పరుగులు మాత్రమే చేశాడు.అతడి స్ట్రైక్-రేట్ 140 కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ అతడి పేలవ ఫామ్ కొనసాగుతోంది. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టీ20ల్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్న సంజూను కాదని మరి గిల్కు ఛాన్స్ ఇచ్చారు. గిల్ పునరాగమనం ముందువరకు టీ20ల్లో భారత్ ఓపెనింగ్ జోడీ అభిషేక్-సంజూ శాంసన్ ఉండేవారు. కానీ గిల్ రాకతో సంజూకు ప్లేయింగ్ ఎలెవన్లోనే చోటు లేకుండాపోయింది. అలా అని గిల్ రాణిస్తున్నాడా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్మెంట్పై భారత మాజీ కెప్టెన్ రాబిన్ ఊతప్ప ప్రశ్నల వర్షం కురిపించాడు.శాంసన్ చేసిన తప్పేంటి?"సంజూ శాంసన్ చేసిన తప్పు ఏంటి? ఎందుకు అతడికి అవకాశమివ్వడం లేదు? అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జోడీ టీ20ల్లో అద్భుతాలు చేశారు. అటువంటి ఓపెనింగ్ జోడీని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఈ సిరీస్కు ముందు సూర్యకుమార్ మాట్లాడుతూ.. సంజూకు అవకాశం రాకముందే శుభ్మన్ టీ20 జట్టులో భాగంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు.ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ సంజూ అవకాశం వస్తే ఏమి చేశాడో మనందరికి తెలుసు. ఓపెనర్గా వచ్చి వరుసగా మూడు సెంచరీలు బాదాడు. ప్రస్తుత యువ క్రికెటర్లలో అందరికంటే ముందు సంజూనే చేశాడు. ఆ తర్వాత అభిషేక్, తిలక్ వర్మ సెంచరీలు సాధించారు. ఓపెనర్గా సంజూ తనను తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శర్మ సంజూనే విజయవంతమైన ఓపెనర్గా ఉన్నాడు. అయినప్పటికి అతడిని ఓపెనర్గా తప్పించారు. ఆ తర్వాత అతడిని మిడిల్ ఆర్డర్కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఆపై నెమ్మదిగా జట్టు నుండి తొలగించారు. మరోసారి అడుగుతున్న అతడు చేసిన తప్పు ఏంటి? కచ్చితంగా ఓపెనింగ్ స్దానాన్ని అతడు అర్హుడు.ప్రస్తుతం శుభ్మన్ టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. తన శైలికి విరుద్దంగా ప్రయత్నించి విఫలమవుతున్నాడు. మొదటిలో అభిషేక్తో పోటీపడానికి ప్రయత్నిస్తున్నాడని నేను భావిస్తున్నాను. తడు బ్యాటింగ్ చేసే విధానం ఇది కాదు. అతడు క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకుంటాడు. 15 నుంచి 20 బంతులు ఆడిన తర్వాత అతడిని ఆపడం ఎవరి తరం కాదు. తానంతంట తానే ఔట్ అవ్వాలి. అలా ఆడితే గిల్కు టీ20కు సరిపోతుంది" అని ఉతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. -
రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని(Lionel Messi) కోల్కతా విజిట్ గందరగోళానికి దారితీసింది. తమ అభిమాన స్టార్ ప్లేయర్ను కళ్లారా చూడాలని తరలి వచ్చిన ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ ఎదురైంది. శనివారం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీని వీక్షించడానికి జనం వేలాదిగా చేరుకున్నారు. నిర్వహణ లోపంతో అభిమానులు నియంత్రణకోల్పోయి హింసకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫలితంగా సాల్ట్ లేక్ స్టేడియం వెళ్లిన మెస్సీ కేవంల నిమిషాల్లో అక్కడ నుంచి వెళ్లిపోవడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. రూ12 వేలు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే కనీసం తమ అభిమాన మెస్సీ మొఖాన్ని కూడా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మెస్సీ సమయాన్ని వృధా చేశారని అసహనం వ్యక్తం చేశారు. #WATCH | Kolkata, West Bengal: A fan of star footballer Lionel Messi says, "It was really disappointing, we came all the way from Darjeeling for this... We couldn't even see him properly, and that was the most disappointing thing I have ever witnessed..." https://t.co/Ce4kNu8dBH pic.twitter.com/dgBSOIMEoG— ANI (@ANI) December 13, 2025డార్జిలింగ్ నుంచి వచ్చిన మహిళా అభిమాని, తాను రూ. 12,000 కు టికెట్ కొనుగోలు చేశానని, కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న టాలిస్మాన్ను చూడలేకపోయానని ఆరోపించారు.కాగా గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం తెల్లవారుజామున కోల్ కత్తాకు చేరుకున్నారు. మెస్సీ ఇండియాలో మూడు రోజులు పాటు, నాలుగు నగరాల్లో పర్యటించ నున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. అయితే మెస్సీ కోలక్తా టూర్ సందర్బంగా ఏర్పడిన గందరగోళంలో పట్టరాలి ఆగ్రహంతో అభిమానులు స్టేడియంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. గ్రౌండ్లోకి కుర్చీలు విరగ్గొట్టారు బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్ యత్నించారు. దీంతో జనాన్ని చెదర గొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అభిమానులు టెంట్ను మరియు గోల్ పోస్ట్ను కూడా ధ్వంసం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేసినట్టు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ వెల్లడించారు. కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. అంతేకాదు నిర్వాహకులు టికెట్ రుసుమును అభిమానులకు తిరిగి చెల్లిస్తారని కూడా హామీ ఇచ్చారు. -
చిన్నస్వామిలో ఆడనున్న విరాట్ కోహ్లి.. ఎప్పుడంటే?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మ్యాచ్లకు అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రసాద్ ఎంపికైన వారం రోజులకే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం గమనార్హం. కాగా ఐపీఎల్-2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు.ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణను నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక క్రికెట్ మ్యాచ్ కూడా జరగలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చిన్నస్వామి మైదానంలో అభిమానులు సందడి నెలకోనుంది.ఐపీఎల్-2026 సీజన్కు ముందే టీమిండియా స్టార్, ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లి ఈ మైదానంలో ఆడనున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి చిన్నస్వామి మైదానంలో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అంతకంటే ముందే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీ మ్యాచ్లు జరగనున్నట్లు సమాచారం. వానికి వాస్త విజయ్ హజారే ట్రోఫీ (VHT) 2025-26 గ్రూపు-డి మ్యాచ్లకు బెంగళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉంది. గ్రూపు-డిలో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ప్రాతినిథ్యం వహించే ఢిల్లీ జట్టు కూడా ఉంది. కోహ్లి, పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడుతుండడంతో అలూర్ వంటి చిన్న వేదికలో మ్యాచ్లు నిర్వహిస్తే భద్రత, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ ఆడే మ్యాచ్లను అలూర్ నుంచి చిన్నస్వామికి తరలించాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ హాజారే టోర్నీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో ఆంధ్ర జట్టుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs SA: గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్కు ఊహించని షాక్! -
సీఎం రేవంత్ జోరు కొనసాగేనా..?
మెస్సీ రాక.. మెస్సీ రాక.. ఇది గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. మెస్సీ హైదరాబాద్కు రానున్న తరుణంలో ఇది ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అదే సమయంలో అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీతో సీఎం రేవంత్ మ్యాచ్. ఇదే కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరి ఆటవిడుపు గురించి సరదాగా మాట్లాడుకుంటే..మెస్సీతో మ్యాచ్ను సీఎం రేవంత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. అందుకే ఆయన తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫుట్బాల్ ప్రాక్టీస్ను చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు రేవంత్. అందుకోసం యూనివర్శిటీకి చెందిన ఫుట్బాల్ క్రీడాకారులతో తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. మెస్సీ మొత్తంగా స్టేడియంలో ఉండే సమయం 20 నిమిషాలే. అందులో సీఎం రేవంత్తో ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆడతారు. అయినప్పటికీ దీన్ని సీఎం రేవంత్ సరదాగా తీసుకోవడం లేదు. సీరియస్గానే తీసుకున్నట్లున్నారు. అందుకోసమే ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నారు. ఇక్కడ స్థానిక ఫుట్బాల్ క్రీడాకారులకు సీఎం రేవంత్ దీటుగానే బదులిస్తూ తన కిక్లతో అలరిస్తున్నారు. అంతే కాకుండా తన పాస్లతో కూడా ఆకట్టుకుంటున్నారు రేవంత్. అదే జోరు కొనసాగేనా..?నేటి ఐదు నిమిషాల మెస్సీతో మ్యాచ్లో రేవంత్ జోరు కొనసాగిస్తారా..? అనేది చూడాలి. రాష్ట్ర ఫుట్బాల్ ప్లేయర్లను పరుగులు పెట్టించిన రేవంత్.. మెస్సీని ఎంతవరకూ ధీటుగా ఎదుర్కొంటారో చూడాలి. మెస్సీతో గేమ్ అంటే మామూలు కాదు.. ఆ విషయం రేవంత్కు తెలుసు. అందుకే అంత ప్రాక్టీస్ చేశారు రేవంత్,.ఫుట్బాల్ మ్యాచ్ కోసం టెక్నికల్గా పుంజుకుని మరీ తన వార్మప్ మ్యాచ్లను కొనసాగించారు రేవంత్. ఒకవేళ పొరపాటను మెస్సీతో గేమ్లో రేవంత్ పైచేయి సాధించారంటే ఏమవుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. చాలా స్పల్ప సమయం పాటు జరిగే మ్యాచ్ కాబట్టి పెద్దగా అంచనాలు ఉండకపోవచ్చు. కానీ ఆ ఐదు నిమిషాల్లోనే రేవంత్ అద్భుతం చేసి మెస్సీని ఆశ్చర్యపరుస్తాడా? అనేది ఫుట్బాల్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. -
హైదరాబాద్కు మెస్సీ.. పూర్తి షెడ్యూల్ ఇదే
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపటిలో హైదరాబాద్కు మెస్సీ చేరుకోనున్నాడు. కోల్కతా స్టేడియంలో ఉద్రిక్త నెలకొన్ని నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియంతో పాటు మెస్సీ ప్రయాణించే మార్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్పై ఓ లుక్కేద్దాం.హైదరాబాద్లో మెస్సీ షెడ్యూల్కోల్కతా నుంచి మెస్సీ 4 గంటల సమయంలో హైదరాబాద్లో అడుగుపెట్టనున్నాడు. శంషాబాద్ విమానశ్రాయం నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గోనున్నాడు. అనంతరం హోటల్లో విశ్రాంతి తీసుకోన్నాడు.👉ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు.👉7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది.👉8:6 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిచ్పైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.👉8:6 నిమిషాలకు మెస్సీ ఎంట్రీ ఉండనుంది.👉8:8 నిమిషాలకు మెస్సీ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.👉 8:10 నిమిషాలకు హార్డ్ స్టాప్ ఉండనుంది👉8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్👉8:15 నిమిషాలకు పిల్లలతో కలిసి మెస్సీ గ్రూపు ఫోటో దిగనున్నాడు.👉8:18 నిమిషాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైదానంలో రానున్నారు.👉8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి పరేడ్ వాక్లో పాల్గోనున్నారు.👉రాత్రి 9 గంటల సమయంలో మెస్సీకి సన్మానం చేయనున్నారు.👉ఆ తర్వాత మెస్సీ హైదరాబాద్ నుంచి వెళ్లిపోనున్నాడు.చదవండి: IND vs SA: 'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు' -
'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్తో నానా తంటాలు పడుతున్నాడు. దాదాపు రెండేళ్లగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన సూర్య.. 2025లో మాత్రం ఘోరంగా విఫలయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఈ ముంబై ఆటగాడు తీవ్ర నిరాశపరుస్తున్నాడు.తొలి టీ20లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన సూర్య.. రెండో టీ20లో ఐదు పరుగులే చూసి పెవిలియన్కు చేరాడు. టీ20 ప్రపంచకప్-2026కు ముందు అతడి పూర్ ఫామ్ టీమ్మెనెజ్మెంట్ను తెగ కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శలు గుప్పించాడు. కెప్టెన్ అంటే టాస్లు వేయడం, ఫీల్డ్ను సెట్ చేయడం కాదని పరుగులు కూడా చోప్రా అన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు."సూర్య.. భారత జట్టుకు కెప్టెన్ అన్న విషయం మర్చిపోకూడదు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను రోటేట్ చేయడం, వ్యూహాలు రచించడమే కాదు. బ్యాట్తో కూడా రాణించాలి. టాప్ ఫోర్లో బ్యాటింగ్కు వస్తుందున ఖచ్చింగా పరుగులు చేయాలి. ఈ ఏడాది అతడు చాలా మ్యాచ్లు ఆడాడు.అయినా అతడి ఆట తీరు మారలేదు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 18 మ్యాచ్లు ఆడి కేవలం 15 సగటు మాత్రమే కలిగి ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా మరీ ఘోరంగా ఉంది. ఒక్క అర్థ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్కు ముందు, తర్వాత కూడా అతడి ఫామ్లో ఎటువంటి మార్పు కన్పించలేదు. మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి పరుగులు సాధించకపోతే జట్టుకు ఎల్లప్పుడూ అదే భారంగానే ఉంటుంది. ఇదే ఫామ్తో టీ20 ప్రపంచకప్లో ఎలా రాణిస్తారు. కాబట్టి కెప్టెన్తో పాటు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా తన ఫామ్ను అందుకోవాల్సిన అవసరముందని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్కు ఊహించని షాక్! -
సాల్ట్లేక్ స్టేడియంలో మెస్సీ ఫ్యాన్స్ రచ్చ..
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ముగిసింది. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినప మోహన్ బగన్ మెస్సీ ఆల్ స్టార్స్ వర్సెస్ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్ను, కూర్చీలను మైదానంలోకి విసిరి రచ్చ రచ్చ చేశారు. ఫ్లెక్సీలు ద్వంసం చేస్తూ, బ్యారికేడ్లను దాటుకుంటూ మైదానంలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ గందరగోళ పరిస్ధితుల నేపథ్యంలో మెస్సీ టీమ్ను సొరంగం గుండా బయటకు పంపించారు. మెస్సీ మైదానంలో కేవలం ఐదు నిమిషాల మాత్రమే ఉన్నాడు. అతడిని చూసేందుకు బెంగాల్ పక్కరాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉండేది. కానీ మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ తీవ్రనిరాశకు గురయ్యారు. ఈవెంట్ నిర్వహకులపై అభిమానులు మండిపడుతున్నారు. అంతకుముందు శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా అవిష్కరించారు. -
గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్కు ఊహించని షాక్!
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ముల్లాన్పూర్లో ఎదురైన ఘోర పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్న భారత జట్టు శనివారం నెట్ ప్రాక్టీస్లో పాల్గోనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల సిరీస్ 1-1 సమంగా ఉంది. సిరీస్ ఆధిక్యం పెంచుకునేందుకు మూడో టీ20ల్లో భారత్ తమ తుది జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టీ20ల్లో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.సంజూకు చోటు!గిల్ స్దానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది గిల్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చేంతవరకు భారత ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ, శాంసన్లు ఆరంభించేవారు. ఓపెనర్గా సంజూ మూడు సెంచరీలు కూడా బాదాడు.అయితే గిల్ రీ ఎంట్రీతో శాంసన్ ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. ప్రధాన జట్టులో ఉన్నప్పటికి చాలా మ్యాచ్లకు బెంచ్కే పరిమితమవుతున్నాడు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వస్తున్నాయి. గిల్ కోసం సంజూను బలి చేస్తారా? అని మాజీలు సైతం మండిపడుతున్నారు. ఈ క్రమంలో శాంసన్ను మళ్లీ తుది జట్టులోకి తీసుకు రావాలని గంభీర్ నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ టీ20ల్లో గిల్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడిని టీ20ల నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మరి నిజంగానే గంభీర్.. మూడో టీ20 నుంచి గిల్ను తప్పిస్తాడా? అని తెలియాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే.మూడో టీ20 కోసం భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: GOAT Tour India 2025: 70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్ ఇదే! -
70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్ ఇదే!
మెస్సీ.. మెస్సీ.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం ది గోట్ టూర్లో భాగంగా భారత్కు చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు కోల్కతా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది. తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్ట్కు తరలివచ్చారు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ జట్టు సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా ఇండియా టూర్కు వచ్చారు. ది గోట్ రాకతో కోలకతా సాకర్ సిటీని తలపిస్తోంది. ఎక్కడ చూసిన మెస్సీ కటౌట్లే కన్పిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ.. కోల్కతా లేక్ టౌన్లోని శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెస్సీతో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గోన్నారు.అయితే తన విగ్రహాం ఏర్పాటుపై మెస్సీ చాలా సంతోషంగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ మంత్రి, శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ తెలిపారు. "మేము ఇప్పటికే మెస్సీ మేనేజర్తో మాట్లాడాము. ఈ రోజు మెస్సీని కలుస్తాము. తన విగ్రహాన్ని నిర్మించేందుకు అతడు అనుమతి ఇచ్చాడు.తన విగ్రహంపై కూడా మెస్సీ సంతోషంగా ఉన్నాడు. ఇది చాలా పెద్ద విగ్రహం. 70 అడుగుల ఎత్తు ఉంది. ప్రపంచంలో మెస్సీకి ఇంత పెద్ద విగ్రహం మరొకటి లేదు. అతడి రాకతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారని" సుజిత్ బోస్ ఎఎన్ఐతో పేర్కొన్నారు.City of Joy welcomes the G.O.A.T Lionel Messi enters a packed Salt Lake Stadium #MessiInIndia #Messi𓃵 pic.twitter.com/zGdlRFQPUL— Kamit Solanki (@KamitSolanki) December 13, 2025 -
మెస్సీ వస్తున్నాడని.. హనీమూన్ రద్దు
కోల్కతా: మెస్సీ మేనియాతో ఇండియా ఊగిపోతోంది. అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రాక సందర్భంగా దేశవ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా చేరుకున్న మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అతడు వస్తున్న దారి వెంబడి నిలబడి సందడి చేశారు. అతడు బస చేసి హోటల్ ముందు గుమిగూడారు. ఇక కోల్కతా నగరంలో ఎక్కడ చూసినా మెస్సీ అభిమానుల కోలాహలం కనిపించింది.మధ్యాహ్నం 2 గంటలకు లియోనెల్ మెస్సీ.. (Lionel Messi ) సాల్ట్ లేక్ స్టేడియంలో సందడి చేయనున్నారు. దీంతో ఈ ఉదయం నుంచే అభిమానులు భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మెస్సీని చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ తరలివచ్చారు. నేపాల్ నుంచి కూడా కొంత మంది అభిమానులు కోల్కతా చేరుకోవడం విశేషం. కొత్తగా పైళ్లైన ఓ జంట తమ హనీమూన్ను సైతం వాయిదా వేసుకుని మెస్సీని చూసేందుకు వచ్చింది.సాల్ట్ లేక్ స్టేడియం వద్ద కొత్త జంట ఏఎన్ఐ వార్తా సంస్థలతో మాట్లాడింది. "గత శుక్రవారం నా పెళ్లి జరిగింది. మెస్సీ వస్తున్నాడని తెలిసి హనీమూన్ ప్లాన్ను రద్దు చేసుకున్నాను. మెస్సీ పర్యటనే నాకు ముఖ్యం. నేను 2010 నుంచి అతడిని అనుసరిస్తున్నాన''ని నవవధువు తెలిపారు. ఆమె భర్త కూడా మెస్సీ అభిమాని కావడంతో ఇద్దరు అతడిని చూడటానికి వచ్చారు. ''ఈ మధ్యనే మాకు పెళ్లయింది. మెస్సీ ఇండియా పర్యటన కారణంగా హనీమూన్ రద్దు చేసుకున్నాం. ఎందుకంటే ముందుగా మేము మెస్సీని చూడాలనుకున్నాము. అతడిని చూడటానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. పది పండేన్నేళ్లుగా అతడిని ఫాలో అవుతున్నామ''ని కొత్త పెళ్లి కొడుకు మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. చదవండి: 70 అడుగుల విగ్రహం.. మెస్సీ ఫస్ట్ రియాక్షన్ ఇదే!మెస్సీని చూడటం నా కలమెస్సీని దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూడడం తన చిరకాల స్వప్నమని నేపాల్ (Nepal) నుంచి వచ్చిన అభిమాని చెప్పాడు. ''నేను నేపాల్ నుండి వచ్చాను. మెస్సీని చూడటం నా కలల్లో ఒకటి. మా దేశం తరపున భారతదేశానికి ధన్యవాదాలు. కేవలం మెస్సీని చూడటానికే టిక్కెట్లు కొన్నాను. నన్ను ఇక్కడికి రావడానికి అనుమతించి, నా కలను నిజం చేసిన నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, సోదరుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మెస్సీని చూడటానికి కాలేజీ ఎగ్గొట్టి ఎంతో దూరం నుంచి కోల్కతాకు వచ్చాను. మెస్సీని చూడటానికి అడ్డుపడితే నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాన''ని అన్నాడు. #WATCH | West Bengal | Fans of star footballer Lionel Messi line up outside the Salt Lake stadium in Kolkata for the first leg of his G.O.A.T. Tour India 2025. pic.twitter.com/Fa1POGEje2— ANI (@ANI) December 13, 2025 -
భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం..! నలుగురిపై వేటు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అస్సాంకు చెందిన నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురు ప్లేయర్లను అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకుర్లగా అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ACA) గుర్తించింది.దీంతో వారిపై ఏసీఎ సస్పెన్షన్ వేటు వేసింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు లక్నోలో జరిగిన లీగ్ మ్యాచ్లలో ఈ నలుగురు.. సహచర ఆటగాళ్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంట. ఈ విషయాన్ని అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సనాతన్ దాస్ ధ్రువీకరించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ నలుగురిపై గువహతిలోని క్రైమ్ బ్రాంచ్లో ఎఫ్ఐఆర్ కూడా నమైంది. ఈ విషయంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం. సస్పెండ్ అయిన వారిలో అభిషేక్ ఠాకూర్.. ఈ ఏడాది రంజీ సీజన్లో అస్సాం తరపున రెండు మ్యాచ్లు ఆడారు. మిగితా ప్లేయర్లు దేశీయ క్రికెట్లో వివిధ స్థాయిల్లో అస్సాంకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా క్రికెటర్ రియాన్ పరాగ్ సైతం అస్సాంకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.చదవండి: మెస్సీ కోసం హానీమూన్ మానుకున్న జంట -
సెమీఫైనల్లో భారత్
చెన్నై: ఆతిథ్య భారత జట్టు స్క్వాష్ ప్రపంచకప్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. జోష్నా చినప్ప 7–4, 7–4, 7–2తో టీజెన్ రసెల్పై గెలుపొందగా, అభయ్ సింగ్ 7–1, 7–6, 7–1తో డెవాల్స్ వాన్ నికెర్క్పై గెలిచాడు. అనాహత్ సింగ్ 7–3, 7–3, 7–4తో హేలీ వార్డ్ను చిత్తు చేసింది. సెమీస్లో ఈజిప్్టతో భారత్ తలపడుతుంది. క్వార్టర్స్లో ఈజిప్ట్ 3–0తో ఆ్రస్టేలియాపై గెలుపొందింది. లీగ్ దశలో భారత జట్టు స్విట్జర్లాండ్, బ్రెజిల్లపై విజయంతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో భారత్ 2023లో గెలిచిన కాంస్య పతకమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. -
భారత్కు పదో స్థానం
సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు పదో స్థానంతో ముగించింది. శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 1–2 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున కనిక సివాచ్ (41వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... స్పెయిన్ తరఫున నటాలియా విలనోవా (16వ నిమిషంలో), ఎస్తెర్ కనాలెస్ (36వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ తొలి క్వార్టర్లో ఇరు జట్ల ప్లేయర్లు హోరాహోరీగా పోరాడినా... ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్ ఆరంభంలోనే నటాలియా గోల్ చేయడంతో స్పెయిన్ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టు నుంచి కొన్ని చక్కటి ప్రయత్నాలు కనిపించినా... ఫినిషింగ్ లోపం కారణంగా అవి గోల్స్గా మారలేకపోయాయి. మూడో క్వార్టర్లో సోనమ్ చక్కటి గోల్ సాధించినా... స్పెయిన్ వీడియో రిఫరల్ ద్వారా ఆ గోల్ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఈ క్రమంలోనే స్పెయిన్ మరో గోల్తో ఆధిక్యాన్ని మరింత పెంచుకోగా... కాసేపటికి కనిక పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి భారత్ ఖాతా తెరిచింది. ఇక ఆఖరి క్వార్టర్లో స్పెయిన్ ఆధిక్యాన్ని కాపాడుకోగా... భారత జట్టు మరో గోల్ సాధించలేక ఓటమి వైపు నిలిచింది. -
సలీల్ అరోరా సూపర్ సెంచరీ
అంబి (మహారాష్ట్ర): పంజాబ్ యువ బ్యాటర్ సలీల్ అరోరా (45 బంతుల్లో 125 నాటౌట్; 9 ఫోర్లు, 11 సిక్స్లు) సూపర్ సెంచరీతో చెలరేగినా... పంజాబ్ జట్టుకు పరాజయం తప్పలేదు. దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ‘సూపర్ లీగ్’ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... అతడు లేని లోటును అరోరా భర్తీ చేశాడు. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్న చందంగా చెలరేగిపోయాడు. మిగిలిన వారి నుంచి చెప్పుకోదగ్గ తోడ్పాటు లభించకపోయినా... అరోరా ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో అతడు 39 బంతుల్లోనే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. కెపె్టన్ ప్రభ్సిమ్రన్ సింగ్ (10), హర్నూర్ సింగ్ (13), సాన్వీర్ సింగ్ (10), రమణ్దీప్ సింగ్ (8) విఫలం కాగా... అన్మోల్ ప్రీత్ సింగ్ (23), నమన్ ధిర్ (27) ఫర్వాలేదనిపించారు. జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాలకృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జార్ఖండ్ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెపె్టన్ ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ సింగ్ (18; 1 ఫోర్, 2 సిక్స్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. సాధించాల్సిన రన్రేట్ కొండంత ఉన్న జార్ఖండ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుమార్ కుశాగ్ర (42 బంతుల్లో 86 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... చివర్లో అనుకూల్ రాయ్ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు), పంకజ్ కుమార్ (18 బంతుల్లో 39 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్స్లు) ధాటిగా ఆడారు. జార్ఖండ్ బ్యాటర్లలో రాబిన్ మింజ్ (2) మినహా తక్కిన వాళ్లంతా రెండొందల పైచిలుకు స్ట్రయిక్ రేట్తో పరుగులు రాబట్టడం విశేషం. ఐపీఎల్ మినీ వేలానికి ముందు యువ ఆటగాళ్లు తమ పవర్హిట్టింగ్తో ఫ్రాంచైజీల దృష్టిలో పడే ప్రయత్నంలో ఉన్నారు. అంకిత్ కుమార్ అర్ధసెంచరీ ‘సూపర్ లీగ్’ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్లో హరియాణా జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రర్ (39 బంతుల్లో 37 నాటౌట్; 1 ఫోర్), శుభమ్ గర్వాల్ (27 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. దీపక్ హుడా (0), కునాల్ సింగ్ రాథోడ్ (4), కరణ్ లాంబా (1), కెపె్టన్ మానవ్ సుతార్ (15) విఫలమయ్యారు. హరియాణా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాంత్ భరద్వాజ్, అన్షుల్ కంబోజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హరియాణా 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్ కుమార్ (41 బంతుల్లో 60; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో మెరవగా... అర్ష్ రంగా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు), పార్థ్ వత్స్ (29 బంతుల్లో 27; 1 ఫోర్ 1 సిక్స్) రాణించారు. ఆదివారం జరగనున్న తదుపరి మ్యాచ్ల్లో ముంబైతో హరియాణా, ఆంధ్రతో పంజాబ్, హైదరాబాద్తో రాజస్తాన్, మధ్యప్రదేశ్తో జార్ఖండ్ తలపడతాయి. -
హైదరాబాద్లో హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్
సాక్షి, హైదరాబాద్: మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్కు హైదరాబాద్ వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే క్వాలిఫయింగ్ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఇందులో భాగంగా క్వాలిఫయింగ్ మ్యాచ్లు హైదరాబాద్ సహా మూడు నగరాలు శాంటియాగో (చిలీ), ఇస్మయిలియా (ఈజిప్ట్)లలో నిర్వహిస్తారు. ప్రపంచకప్కు అర్హత సంపాదించేందుకు భారత్కు ఇది ఆఖరి అవకాశం. ఇంగ్లండ్, స్కాట్లాండ్, కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియాలతో భారత్ క్వాలిఫయింగ్ పోటీలు ఆడనుంది.హైదరాబాద్ అంచెలో ఎనిమిది జట్ల మధ్య క్వాలిఫయింగ్ పోటీలు మార్చి 8 నుంచి 14 వరకు జరుగుతాయి. ఈ క్వాలిఫయర్స్ నుంచి టాప్–3 జట్లు ప్రధాన ప్రపంచకప్కు అర్హత పొందుతాయి. బెల్జియం, నెదర్లాండ్స్ జట్లు ప్రపంచకప్కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తాయి. పురుషుల విభాగంలో ఇదివరకే భారత్ ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఆసియా కప్లో విజేతగా నిలువడంతోనే భారత్కు ప్రపంచకప్ బెర్తు లభించింది. -
తరుణ్ పరాజయం
కటక్: ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్, టాప్ సీడ్ తరుణ్ మన్నేపల్లి పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తరుణ్ 9–21, 20–22తో మొహమ్మద్ యూసుఫ్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తరుణ్ తొలి గేమ్లో తేలిపోయినా... రెండో గేమ్లో ప్రత్యరి్థకి గట్టిపోటీ ఇచ్చాడు. భారత్కే చెందిన రౌనక్ చౌహాన్, కిరణ్ జార్జి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్స్లో రౌనక్ 21–19, 22–20తో శంకర్ ముత్తుస్వామి (భారత్)పై, కిరణ్ జార్జి 21–11, 21–17తో రితి్వక్ (భారత్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు టైటిల్ ఖాయమైంది. భారత్కు చెందిన నలుగురు క్రీడాకారిణులు ఉన్నతి హుడా, ఇషారాణి బారువా, తాన్యా హేమంత్, తస్నిమ్ మీర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
హైదరాబాద్కు మెస్సీ ‘కిక్’
ఓ మారడోనా... ఓ పీలే... ఓ డుంగా... ఓ రొనాల్డిన్హో... వీళ్ల సరసన నిలిచేందుకు తాజాగా అర్జెంటీనా సూపర్స్టార్ మెస్సీ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (జీఓఏటీ) టూర్ ఆఫ్ ఇండియా’లో ఓ పండుగలా దిగి వస్తున్నాడు. అభిమానుల్ని ‘కిక్’ ఎక్కించనున్నాడు. అతి కొద్దిమంది ఎంపిక చేసిన వారితో కలిసి విందు కూడా చేయబోతున్నాడు. ఫొటోలు దిగబోతున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ ఇంత తీరిగ్గా భారత్కు రావడం ఇదే మొదటిసారి. గతంలో 14 ఏళ్ల క్రితం వచ్చాడు. కానీ వచ్చిన పని మాత్రమే చూసుకొని (అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి) వెళ్లాడు. కానీ ఇప్పుడలా కాదు... పని గట్టుకొని మరీ తన భారతీయ అభిమాన గణాన్ని అలరించేందుకే వస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: మెస్సీ... మెస్సీ... మెస్సీ... కొన్ని రోజులుగా బంగారం ధరల కంటే, స్టాక్ మార్కెట్ సూచీల కంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కంటే కూడా పతాక శీర్షికల్లో ఎక్కుతున్న పేరిది. అందరి నోటా ఇదే మాట. ఏ నలుగురు క్రీడాభిమానులు కలిసినా ఇదే ముచ్చట. అధికార వర్గాలు, పోలీస్ బందోబస్తు (4 నగరాలకు సంబంధించి) ఏర్పాట్లు కూడా అతని కోసమే! అయితే ఎవరీ మెస్సీ! ఎందుకంత క్రేజ్? క్రికెట్ మతమైన భారత్లో ఓ ఫుట్బాల్ స్టార్ను ఇంతలా తలకెక్కించుకుంటారా! అంటే... అవును మరి... అతను ఆడే ఆట ఫుట్బాల్కు మన దేశంలో ప్రాచుర్యం లేకపోవచ్చు. కానీ అతను ఆడే మ్యాచ్లకు మాత్రం దేశం, రాష్ట్రం, మతంతో సంబంధం లేకుండా అభిమాన హారతులిస్తారు. నిజానికి అతను ఆడితే లోకమే చూస్తుంది. ఆ లోకంలో మనమూ ఉన్నాం. అందుకే ఆ క్రేజ్!గతంలో వచ్చి ఏం చేశాడు జగద్విఖ్యాత ఫుట్బాలర్ మెస్సీ 2011లోనూ భారత్కు వచ్చాడు. కానీ ఇది ప్రైవేట్ లేదంటే స్పాన్సర్, చారిటీ కోసం కాదు. క్రికెట్ క్రేజీ భారత్లో ఫుట్బాల్కు ప్రాచుర్యం కల్పించేందుకు ‘ఫిఫా’ ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు లయోనల్ వచ్చాడు. కోల్కతాలో సాల్ట్లేక్ మైదానంలో వెనుజులాతో జరిగిన ఈ మ్యాచ్లో మెస్సీ టీమ్ అర్జెంటీనా 1–0తో జయభేరి మోగించింది. ఈ అంతర్జాతీయ ‘ఫిఫా’ మ్యాచ్ ముగిసిన వెంటనే మరే కార్యక్రమం పెట్టుకోకుండానే అక్కడి (కోల్కతా) నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. అప్పటికి, ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు జట్టులో ఒకడు. ఇప్పుడు అతడొక్కడే ఆకాశమంత ఆనందం!డే–1 ఫస్ట్ హాఫ్ కోల్కతా మెస్సీ ఈవెంట్కు పెట్టిన పేరు ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’. నాలుగు నగరాల్లో ముందుగా అడుగు పెట్టేది కోల్కతాలో. అక్కడ తన 70 అడుగుల విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ ప్రత్యక్షంగా వెళ్లి రిబ్బన్ కట్ లాంటివి కాకుండా... వర్చువల్గా బస చేసిన హోటల్ నుంచే తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటాడు. తర్వాత 10 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు జరిగే ‘యువభారతి క్రీడాంగణ్’ సత్కారానికి వెళ్తాడు. ఆ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వచ్చిన చిన్నారులతోనూ కాసేపు ముచ్చటిస్తాడుఎవరిని కలుస్తాడు: ‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్సౌరభ్ గంగూలీ, సీఎం మమతా బెనర్జీలతోపాటు పలువురు సెలబ్రిటీలను మెస్సీ కలుసుకుంటాడు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల దాకా సాల్ట్లేక్ మైదానాన్ని మోతేక్కిస్తాడు.డే–1 సెకండ్ హాఫ్ హైదరాబాద్ మొదటి రోజే అక్కడి నుంచి సాయంత్రం 4 కల్లా మెస్సీ నేరుగా హైదరాబాద్కు చేరుకుంటాడు. విరామం లేకుండా బిజిబిజీగా షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని రాత్రి 7 గంటలకు ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులతో కలిసి ‘గోట్ కప్’ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతాడు. ఎవరిని కలుస్తాడు: ఫలక్నుమా ప్యాలెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే విందులో మెస్సీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతారు. డే–2 ముంబై పర్యటనలో రెండో రోజంతా వాణిజ్య రాజధాని ముంబైలో మెస్సీ బిజీబిజీగా గడుపుతాడు. వాంఖెడేలో చారిటీ మ్యాచ్ ఆడతాడు. ఇందులో క్రికెట్ స్టార్స్ తదితరులతో కలిసి చారిటీ మ్యాచ్ బరిలోకి దిగుతాడు. తర్వాత ఫ్యాషన్ షోలో స్వయంగా పాల్గొని ర్యాంప్ వాక్ చేయనున్నాడు. ఇది ముగిసిన వెంటనే ఖతర్–2022 ప్రపంచకప్ సాకర్కు సంబంధించిన వేలం జరుగుతుంది. ఇందులో మెస్సీ ఈ మెగా ఈవెంట్లో వేసుకున్న జెర్సీలు, కిట్లను వేలం వేయనున్నారు. ఎవరిని కలుస్తాడు: సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్, ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్లతో చారిటీ మ్యాచ్, బాలీవుడ్ స్టార్స్ జాన్ అబ్రహాం, కరీనా కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులతో ర్యాంప్ వాక్ చేస్తాడు.డే–3 ఢిల్లీ మూడో రోజు మెస్సీ దేశ రాజధానికి విచ్చేస్తాడు. ఇక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించే ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమంలో ప్రతిభావంతులైన భారత చిన్నారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగమవుతాడు. ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఢిల్లీ వాసుల్ని అలరించనున్నాడు. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో కలిసి పెనాల్టీ కిక్ షోలో పాల్గొంటాడు. సాకర్ ప్రియుల్ని ఉత్సాహపరిచే ఈవెంట్లలో భాగమవుతాడు. ఎవరిని కలుస్తాడు: ప్రముఖ సెలబ్రిటీలను కలిసాక... మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని ఫుట్బాల్ ముచ్చటలో భాగమవుతాడు.» దేశంలో సాకర్ దిగ్గజం గడిపేది 72 గంటలే! కానీ.... ఈ కాస్త సమయంలోనే తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్ని కవర్ చేయడమే అతిపెద్ద విశేషం. » కోల్కతా (తూర్పు), హైదరాబాద్ (దక్షిణ), ముంబై (పశ్చిమ), ఢిల్లీ (ఉత్తర) నగరాల్లో ఊపిరి సలపని బిజీ బిజీ షెడ్యూల్లో పాల్గొననున్నాడు. » నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాటామంతీ కలిపాక ఆఖర్లో ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే భేటీతో ఈ పర్యటన ముగుస్తుంది. » భారత టెస్టు, వన్డే కెప్టెన్శుబ్మన్ గిల్... దర్మశాలలో 14న మ్యాచ్ ముగిసిన వెంటనే తన ఫేవరెట్ ఫుట్బాలర్ను కలుసుకోనున్నాడు. » ఈ పర్యటన పూర్తిగా భారత సాకర్ ప్రియుల్ని అలరించడానికే తప్ప సీరియస్ ఫుట్బాల్ మ్యాచో, లేదంటే ఫ్రెండ్లీ మ్యాచో ఆడేందుకు మాత్రం కాదు. » ఫ్యాన్స్కు ఇది కాస్త లోటే అయినా... బోలెండత వినోదాన్ని ఈ నాలుగు నగరాల్లో పంచనున్నాడు. » కోల్కతాలో 78 వేల సీటింగ్ సామర్థ్యమున్న సాల్ట్లేక్ స్టేడియం కిక్కిరిసిపోనుంది. »‘గోట్ టూర్’ మొదలవుతోందే బెంగాల్లో... శనివారం ఉదయమే స్టేడియమంతా నిండిపోతోంది. 45 నిమిషాల పాటు మెస్సీ స్టేడియంలో సరదాగా ఆడుతూ పాడుతూ చేసే కిక్స్, ఫ్రీ కిక్స్ ముమ్మాటికి సాకర్ క్రేజీ బెంగాలీలను ఊపేయనున్నాయి. 60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి...సింగరేణి ఆర్ఆర్9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ ఈ రెండు జట్ల మధ్య 15 నిమిషాల పాటు సరదా మ్యాచ్ జరుగుతుంది. 39 వేల సీటింగ్ సామర్థ్యమున్న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ఇప్పటికే 27 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. నేటి ఉదయం కల్లా హౌజ్ ఫుల్ అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. మెస్సీతో ఫొటో సెషన్ కోసం ఇప్పటికే 60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి రిజిస్టర్ చేయించుకున్నారని..., ఈ 60 మందితో మెస్సీ ఫొటోలు దిగుతారని హైదరాబాద్ గోట్ టూర్ సలహాదారు పార్వతి రెడ్డి తెలిపారు.Hello, Messi fans of Bengal and India.First exclusive video of Messi from Kolkata Airport, shared by me.Follow me for every update on the GOAT’s Kolkata tour, I’ll guide everyone on where to go to see Messi.#MessiInIndia#Messi #GOATTourIndia #GOAT #FCBarcelona pic.twitter.com/clG27zZCWt— Arjya : ) (@ArjyaNeel) December 12, 2025 -
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం.. ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో బహ్రెయిన్ ఫాస్ట్ బౌలర్ అలీ దావూద్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్లో రెండో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసి రికార్డుల్లోకెక్కాడు. తాజాగా నేపాల్లో జరిగిన మ్యాచ్లో దావూద్ 19 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మలేసియా బౌలర్ స్యాజ్రుల్ ఇద్రుస్ పేరిట ఉన్నాయి. ఓ వరల్డ్కప్ క్వాలిఫయర్ మ్యాచ్లో ఇద్రుస్ కేవలం 8 పరుగులే ఇచ్చి దావూద్ లాగే 7 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇద్రుస్, దావూద్ మాత్రమే ఇప్పటివరకు ఓ మ్యాచ్లో 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెహ్రెయిన్, భూటాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ సిరీస్లో భాగంగా జరిగిన మూడో టీ20లోనే దావూద్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెహ్రెయిన్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భూటాన్.. దావూద్ ధాటికి లక్ష్యానికి 36 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో బెహ్రెయిన్ మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లోనూ బెహ్రెయిన్ ఘన విజయాలు సాధించింది. తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్లో 61 పరుగుల తేడాతో గెలుపొందింది. -
నిప్పులు చెరిగిన సిరాజ్.. డిఫెండింగ్ ఛాంపియన్కు చుక్కలు
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగాడు. 3.5 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.సిరాజ్ విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 18.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్తో పాటు చామా మిలింద్ (4-0-36-2), త్యాగరాజన్ (4-0-27-2), నితిన్ సాయి యాదవ్ (3-0-26-1), అర్ఫాజ్ అహ్మద్ (1-0-7-1) సత్తా చాటారు.స్టార్లతో నిండిన ముంబై ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (29), హార్దిక్ తామోర్ (29), సూర్యాంశ్ షేడ్గే (28), సాయిరాజ్ పాటిల్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రహానే (9), సర్ఫరాజ్ ఖాన్ (5), రఘువంశీ (4), అంకోలేకర్ (3), తనుశ్ కోటియన్ (2), తుషార్ దేశ్పాండే (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ డకౌటయ్యాడు.అనంతరం స్వల్ప ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లు అమన్ రావ్ (29 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (40 బంతుల్లో 75; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరి ధాటికి హైదరాబాద్ 11.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సూపర్ లీగ్ పోటీల్లో భాగంగా జరిగింది. -
భారీగా తగ్గిన ధర!.. మళ్లీ కేకేఆర్కే వెంకటేశ్ అయ్యర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా డిసెంబరు 16న వేలంపాట నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ (KKR) అత్యధికంగా రూ. 63.30 కోట్ల పర్సుతో రంగంలోకి దిగనుంది.పదమూడు ఖాళీలువేలానికి ముందు తమ జట్టులోని అత్యంత ఖరీదైన ఆల్రౌండర్లు వెంకటేశ్ అయ్యర్ (27.75 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు)ను వదులుకోవడంతో కేకేఆర్ పర్సులో భారీగా సొమ్ము చేరింది. ఇక ఆ జట్టులో పదమూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆరు విదేశీ ప్లేయర్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.మాక్ వేలంఇదిలా ఉంటే.. గతంలో మాదిరే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈసారి కూడా మాక్ వేలం నిర్వహించాడు. ఇందులో పది ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్ పేరు వేలంలోకి రాగానే... చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అతడి కోసం పోటీపడ్డాయి.భారీగా తగ్గిన ధర!.. ఇంతలో కేకేఆర్ కూడా రంగంలోకి దిగింది. చెన్నై, ముంబైలతో పోటీపడి ఎట్టకేలకు వెంకటేశ్ అయ్యర్ను దక్కించుకుంది. అయితే, గతేడాది పేలవ ప్రదర్శన దృష్ట్యా ఈసారి వెంకీ ధర ఆరు కోట్లు తగ్గిపోయింది. మాక్ వేలంలో కేకేఆర్ అతడిని రూ. 17.5 కోట్లకు కొనుక్కుంది. కాగా 2025లో పదకొండు మ్యాచ్లలో కలిపి కేవలం 142 పరుగులే చేశాడు. సీజన్ మొత్తంలో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ను కేకేఆర్ ఏకంగా రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. గతేడాది అతడు ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) తరఫున పేలవంగా ఆడాడు. ఐదు మ్యాచ్లలో కలిపి 90 పరుగులే చేశాడు. రెండు వికెట్లు తీశాడు. అయితే, ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మాక్ వేలంలో కేకేఆర్ లివింగ్స్టోన్ను కొనుక్కోవడం గమనార్హం.చదవండి: ఆసియా కప్- 2025: భారత్ ఘన విజయం -
వేల కోట్ల సంపాదన.. అతడికి ఆ పేరెలా వచ్చిందంటే?
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అతడు ఆరాధ్య ఆటగాడు. భారత్లో క్రికెట్ మతంలాంటిదే అయినా.. మెస్సీకి కూడా ఇక్కడ చాలా మందే అభిమానులు ఉన్నారు.హైదరాబాద్ పర్యటన ఇలా‘ది గోట్ టూర్’లో భాగంగా మెస్సీ భారత్కు రానుండటంతో వారంతా అతడిని నేరుగా చూడాలని ఆశపడుతున్నారు. ఇక ముందుగా ప్రణాళికలో లేకపోయినా.. చివరి నిమిషంలో మెస్సీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఈ లెజెండరీ ప్లేయర్ స్వయంగా వెల్లడించాడు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చి.. అక్కడి నుంచి తాజ్ ఫలక్నుమా ప్యాలెస్కు మెస్సీ చేరుకోనున్నాడు. రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియానికి వచ్చి ఫ్యాన్స్ను కలవడంతో పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తిర విషయాలు మీకోసం..ఆమె గుర్తుగా ఆకాశంలోకి చూస్తూ..👶అర్జెంటీనాలోని సాంటా ఫేలో గల రొసారియోలో 1987, జూన్ 24న మెస్సీ జన్మించాడు.👶నాలుగేళ్ల వయసులోనే తన మొదటి క్లబ్ గ్రాండోలిలో జాయిన్ అయ్యాడు. అన్నట్లు అక్కడ కోచ్ మెస్సీ వాళ్ల నాన్న జోర్జ్ మెస్సీ.👶ఫుట్బాల్ ప్లేయర్గా మెస్సీ ఎదగడంలో వాళ్ల నానమ్మ సెలియా ప్రభావం ఎక్కువ. అతడితో పాటు మ్యాచ్లకు హాజరవుతూ అతడిని ప్రోత్సహించేవారామె. ఆమె గుర్తుగా గోల్ సాధించిన ప్రతిసారి ఆకాశం వైపు చూపిస్తూ మెస్సీ తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు.👶ఏడేళ్ల వయసులో మెస్సీ వెనెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్లో చేరాడు.👶పదేళ్ల వయసులో మెస్సీకి హార్మోన్ డెఫిషియెన్సీ ఉన్నట్లు తేలగా.. చికిత్సతో దానిని అధిగమించాడు.వారిద్దరు.. వారికి ముగ్గురు 👩❤️💋👨తన చిన్ననాటి స్నేహితురాలు అంటోనెలా రొకజోను మెస్సీ పెళ్లి చేసుకున్నాడు. 👨👩👦👦ఈ జంటకు ముగ్గురు కుమారులు థియాగో, మెటేయో, సీరో సంతానం.🫂అర్జెంటీనా ఫుట్బాల్ జట్టులోని సహచరుడు సెర్గియో అగురో మెస్సీకి ప్రాణ స్నేహితుడుఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?🖤మెస్సీ ఒంటిపై పచ్చబొట్లు ఎక్కువే. అయితే, ఇవన్నీ అతడి కుటుంబ సభ్యులకు చెందినవే. భార్య కళ్లు, కుమారుల పేర్లు, వారి హస్త ముద్రలు, తన తల్లి చిత్రాన్ని టాటూలుగా వేయించుకున్నాడు మెస్సీ.💰ప్రపంచంలోని సుసంపన్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు. అతడి నెట్వర్త్ విలువ 2025 నాటికి రూ. ఏడు వేల కోట్ల రూపాయలు అని అంచనా!🎶అన్నట్లు లియోనల్ మెస్సీకి ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?.. అతడి తల్లి ఫేవరెట్ సింగర్ లియోనల్ రిచ్చీ పేరు మీదుగా లియోనల్గా మెస్సీకి ఆమె నామకరణం చేశారు.చిరస్మరణీయ విజయం🌟మెస్సీ అత్యధికంగా ఎనిమిదిసార్లు బాలన్ డిఓర్ అవార్డులు గెలుచుకున్నాడు.🥇2008 బీజింగ్ ఒలింపిక్స్లో అర్జెంటీనా తరఫున మెస్సీ గోల్డ్ మెడల్ గెలిచాడు.⚽🏆మెస్సీ కెరీర్లో చిరస్మరణీయ విజయం.. అర్జెంటీనా సారథిగా 2022లో ఫిఫా వరల్డ్కప్ గెలవడం.It was 3:30AM Saturday morning people in the streets lined up, welcoming Messi as his car passes by. Thank You India.🙏🇮🇳pic.twitter.com/MtsLgvnSer— Messi Fanatic (@MessiFanatic_) December 12, 2025 -
గంభీర్, సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ను ఘనంగా ఆరంభించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. ముల్లన్పూర్ వేదికగా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లోనూ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగం చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది.ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. వన్డౌన్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పంపించింది మేనేజ్మెంట్. సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అక్షర్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (17)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్ పాండ్యా (20), జితేశ్ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 162 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో పరాజయం ఖరారైంది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్.. టీమిండియా నాయకత్వ బృందాన్ని విమర్శించాడు. ‘‘అక్షర్ మీ జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ ఇలాటి భారీ ఛేదన సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్లో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అక్షర్ బ్యాటింగ్ చేయగలడు. కానీ అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్ కంటే ముందు అభిషేక్ శర్మ అవుటై ఉంటే.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ను పంపించారనుకోవచ్చు.కానీ ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్తో పాటు మరో లెఫ్టాండర్ అక్షర్ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థమే కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ల తీరును స్టెయిన్ తప్పుబట్టాడు.కాగా సిరీస్ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. తమ జట్టులో ఓపెనింగ్ జోడీ మాత్రమే ఫిక్స్డ్గా ఉంటుందని పేర్కొన్నాడు. మిగతా వారంతా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తమ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.అయితే, టీ20 ఓపెనర్గా గిల్ను పంపడం కోసం.. ఫామ్లో ఉన్న సంజూ శాంసన్పై వేటు వేశారు. కానీ టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి గిల్ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో భారీ విజయం సాధించింది. తాజా మ్యాచ్లో సఫారీలు గెలిచి.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేశారు. -
ఆసియా కప్- 2025: భారత్ ఘన విజయం
ఆసియా క్రికెట్ మండలి మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో ఏకంగా 234 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.దుబాయ్లో ఐసీసీ అకాడమీ వేదికగా భారత్- యూఏఈ (IND vs UAE) మ్యాచ్తో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 433 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.దంచికొట్టిన భారత బ్యాటర్లుఇందులో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ది కీలక పాత్ర. పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక వన్డౌన్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (69), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన విహాన్ మల్హోత్రా (69) అర్ధ శతకాలతో సత్తా చాటగా.. వేదాంత్ త్రివేది (38) కూడా రాణించాడు.ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్), కనిష్క్ చౌహాన్ (12 బంతుల్లో 28) దంచికొట్టారు. అయితే, కెప్టెన్, ఓపెనర్ ఆయుశ్ మాత్రే (4) మాత్రం నిరాశపరిచాడు. ఇక యూఏఈ బౌలర్లలో యుగ్ శర్మ, ఉద్దిశ్ సూరి చెరో రెండు వికెట్లు తీయగా.. షాలోమ్ డిసౌజా, కెప్టెన్ యాయిన్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.కుదేలైన యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్ఇక భారత్ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు కెప్టెన్ యాయిన్ రాయ్ (17), షాలోమ్ డిసౌజా (4).. వన్డౌన్ బ్యాటర్ అయాన్ మిస్బా (3) విఫలమయ్యారు. నాలుగో స్థానంలో ఆడిన ముహమూద్ రేయాన్ ఖాన్ (19) కూడా నిరాశపరిచగా.. అహ్మద్ హుదాదాద్ డకౌట్ అయ్యాడు.మిగతా వారిలో నూరుల్లా ఆయోబి 3 పరుగులకే పెవిలియన్ చేరగా.. ఐదో నంబర్ బ్యాటర్ పృథ్వీ మధు (50), ఉద్దిశ్ సూరి (106 బంతుల్లో 78 నాటౌట్) గట్టి పోరాటం చేశారు. వీరికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ సలే అమీన్ (20 నాటౌట్) తన వంతు ప్రయత్నం చేశాడు.234 పరుగుల తేడాతో జయభేరిఅయితే, భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 199 పరుగులకే యూఏఈ పరిమితమైంది. ఫలితంగా యువ భారత్ 234 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ రెండు వికెట్లు తీయగా.. కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్ తదుపరి డిసెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనుంది.చదవండి: వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్యVaibhav Sooryavanshi moves. The action responds. 😮💨A classy grab from our Boss Baby 👏 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/5w0MUUWzzZ— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025 -
ప్చ్.. సారీ వైభవ్ సూర్యవంశీ!
ఆసియా క్రికెట్ మండలి ఆధ్వర్యంలో అండర్-19 ఆసియా కప్-2025 టోర్నమెంట్కు శుక్రవారం తెరలేచింది. గ్రూప్-‘ఎ’ మ్యాచ్లో భాగంగా యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE).. భారత యువ జట్టును ఢీకొట్టింది. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.56 బంతుల్లోనే సెంచరీఓపెనర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (4) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఓ దశలో డబుల్ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, ఉద్దిశ్ సూరి బౌలింగ్లో బౌల్డ్ కావడంతో వైభవ్ సునామీ ఇన్నింగ్స్కు తెరపడింది.మొత్తంగా ఈ మ్యాచ్లో 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. తొమ్మిది ఫోర్లు, పద్నాలుగు సిక్సర్ల సాయంతో 171 పరుగులు సాధించాడు. అతడికి తోడు ఆరోన్ జార్జ్ (69), విహాన్ మల్హోత్రా (69).. వేదాంత్ త్రివేది (38), అభిజ్ఞాన్ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్) రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరు సాధించింది.ప్చ్.. సారీ వైభవ్ సూర్యవంశీ!ఇదిలా ఉంటే.. యూత్ వన్డేల్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఓ సెంచరీ బాదాడు. ఇటీవల ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై 52 బంతుల్లోనే శతక్కొట్టి రికార్డు సృష్టించాడు. అయితే, తాజాగా వైభవ్ ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో సాధించిన శతకానికి మాత్రం యూత్ వన్డేల్లో చోటు దక్కదు.కారణం ఇదేఅండర్-19 ఆసియా కప్లో అసోసియేట్ జట్లతో జరిగే మ్యాచ్లకు యూత్ వన్డే హోదా లేదు. అందుకే యూఏఈపై వైభవ్ సాధించిన సెంచరీకి రికార్డుల్లో స్థానం లేకుండా పోయింది. అయితే, తదుపరి (డిసెంబరు 14)న పాకిస్తాన్తో జరిగే ఆసియా కప్ మ్యాచ్లో గనుక వైభవ్ సెంచరీ బాదితే అది రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆసియా కప్ టోర్నీలో టెస్టు హోదా కలిగిన జట్ల మధ్య జరిగే మ్యాచ్లకు మాత్రమే యూత్ వన్డే హోదా ఉంటుంది.ఇప్పటికే మూడు శతకాలుఇదిలా ఉంటే.. ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ మ్యాచ్లలో అసోసియేట్ జట్లతో జరిగిన మ్యాచ్లకు మాత్రం యూత్ వన్డే స్టేటస్ ఉంటుంది. అంటే.. ప్రపంచకప్ టోర్నీలో యూఏఈతో భారత్ ఆడే మ్యాచ్ల రికార్డులు పరిగణనలోకి వస్తాయి.ఇక సీనియర్ టీ20 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే మూడు శతకాలు సాధించాడు. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున.. ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో యూఏఈపైనా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర మీదా వైభవ్ శతక్కొట్టాడు.A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025 -
వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్య
టీమిండియా ఆల్ ఫార్మాట్ ఆల్రౌండర్గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జడ్డూ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు.స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్ (IND vs SA)లు ముగించుకున్న జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. జడ్డూ భార్య, గుజరాత్ మంత్రి రివాబా సోలంకి (Rivaba) తన భర్తను ప్రశంసించే క్రమంలో టీమిండియాను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.ఇంటికి దూరంగా ఉన్నా క్రికెటర్గా ఉన్న తన భర్త విదేశాలకు వెళ్లడం సహజమని.. అయితే, జట్టులోని మిగతా అందరిలా తన భర్త కాదని తెలిపారు. ఎక్కడున్నా నైతిక విలువలు కోల్పోడంటూ రివాబా వ్యాఖ్యానించారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదని చెప్పుకొచ్చారు.ద్వారకలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబా తన భర్త రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నా భర్త.. క్రికెటర్ రవీంద్ర జడేజా.. లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా అంటూ ఆట నిమిత్తం వివిధ దేశాలు తిరగాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆయన ఎలాంటి చెడు వ్యసనాలకు ఆకర్షితుడు కాలేదు.వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారుఆయనకు తన బాధ్యతలు ఏమిటో తెలుసు. కానీ మిగతా జట్టంతా అలా కాదు. వాళ్లు ఎన్నో దుర్గుణాలు కలిగి ఉంటారు. అయినా వారిపై ఎవరూ ఎలాంటి ఆంక్షలు విధించలేరు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే విధంగా.. ‘‘నా భర్త పన్నెండు ఏళ్లు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కావాలంటే ఆయన ఎలాంటి చెడ్డ పనైనా చేసి ఉండవచ్చు. కానీ నైతిక విలువలు అంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసు’’ అంటూ జడ్డూపై రివాబా ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్కాగా.. రివాబా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదు.. కానీతన భర్తను మెచ్చుకోవడంలో తప్పు లేదని.. అయితే, అందుకోసం మిగతా అందరి ఆటగాళ్ల వ్యక్తిత్వాలను కించపరచడం సరికాదని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉన్న వారు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జడేజా క్రికెటర్గా అత్యుత్తమ స్థాయికి ఎదగడంలో అతడి తల్లి పాత్ర కీలకం. ఈ విషయాన్ని జడ్డూనే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇక తన అక్క కూడా తన విజయానికి బాటలు వేసిన వారిలో ఒకరని గతంలో ప్రశంసించాడు.కుటుంబంలో విభేదాలు?ఇదిలా ఉంటే.. జడ్డూ తండ్రి, అక్క కాంగ్రెస్ పార్టీలో ఉండగా.. భార్య రివాబా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రివాబా వచ్చిన తర్వాత జడ్డూ తమను పూర్తిగా దూరం పెట్టాడని అతడి తండ్రి ఆరోపించగా.. జడ్డూ మాత్రం భార్యకు మద్దతు తెలిపాడు.ఒకవైపు మాటలు మాత్రమే విని ఇంటర్వ్యూ చేయడం సరికాదని.. తన భార్యను తప్పుబట్టే విధంగా వ్యవహరిస్తే ఎవరినీ సహించబోనని మీడియాకు వార్నింగ్ ఇచ్చాడు జడ్డూ. కాగా జడేజా అక్కకు రివాబా స్నేహితురాలు. ఈ క్రమంలోనే జడ్డూ- రివాబాలకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి బాటలు వేసింది. వీరికి కుమార్తె నిధ్యానా ఉంది.చదవండి: దురభిమానం.. నైతిక విలువలు పాతరేస్తున్నారు"मेरे पति (रवींद्र जडेजा , क्रिकेटर)को लंदन , दुबई, ऑस्ट्रेलिया जैसे अनेकों देशों में खेलने के लिए जाना होता है फिर भी आज दिन तक उन्होंने कभी व्यसन नहीं किया क्योंकि वो अपनी जवाबदारी को समझते हैं @Rivaba4BJP जी , शिक्षा मंत्री गुजरात सरकार #Rivabajadeja #ravindrajadeja pic.twitter.com/OyuiPFPvVa— राणसिंह राजपुरोहित (@ransinghBJP) December 10, 2025 -
కోర్టు చెప్పినా మారరా?.. హెచ్సీఏపై టీసీఏ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి జరుగుతూనే ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. ప్రీమియర్ లీగ్ పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తే హెచ్సీఏ అధికారులను బయట తిరగనివ్వబోమని హెచ్చరించింది. హెచ్సీఏలో అక్రమాల గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది.అండర్ -14 టీమ్ అనే ప్రస్తావన లేదుఈ సందర్భంగా.. ‘‘ప్రీమియర్ లీగ్ పేరుతో మళ్లీ మోసం చేయాలని చూస్తే హెచ్సీఏ అధికారులను బయట తిరగ నివ్వం. ప్రీమియర్ లీగ్ కూడా TCA నిర్వహిస్తుంది. అండర్ 14 సెలక్షన్ పేరుతోనూ అవినీతి కి పాల్పడ్డారు. 3500 మంది క్రీడాకారులను ఇబ్బంది పెట్టారు. BCCIలో అసలు అండర్ -14 టీమ్ అనే ప్రస్తావన లేదు.అయినా సెలక్షన్కు అని పిలిచి జింఖాన గ్రౌండ్ లో కనీసం సౌకర్యాలు కల్పించలేదు. సొంతం గా అసోసియేషన్లు పెట్టుకొని.. 15 మంది ని సెలెక్ట్ చేయడానికి ఐదు వేల మంది ని నిలబెట్టారు. HCA అవకతవకలపై హ్యూమన్ రైట్స్తో పాటు డీజీపి కి ఫిర్యాదు చేస్తాం. ఎన్నిసార్లు కోర్టు మొట్టకాయలు వేసినా HCA తీరులో మార్పు లేదు. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం’’ అని టీసీఏ పేర్కొంది.BCCI గుర్తింపు కోసంటీసీఏ జనరల్ సెక్రటరీ గురువా రెడ్డి మాట్లాడుతూ.. BCCI గుర్తింపు కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి సుమోటోగా HCAపై విచారణ జరపాలి. BCCI నిబంధనలను HCA పాటించడం లేదు’’ అని పేర్కొన్నారు. ఇక అడ్వకేట్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్ పేరిట పిల్లల్ని, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. ఈ విషయంపై జాతీయ, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తున్నాం’’ అని తెలిపారు.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు? -
Asia Cup 2025:: భారత్ 433 పరుగుల భారీ స్కోర్
అండర్-19 ఆసియాకప్లో భాగంగా దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసిది. యువసంచలనం, టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్ను వైభవ్ అందుకున్నాడు. మొత్తంగా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓ దశలో డబుల్ సెంచరీ చేసేలా వైభవ్ కన్పించాడు. దూకుడుగా ఆడే క్రమంలో తన వికెట్ను కోల్పోయాడు.వైభవ్తో పాటు ఆరోన్ జార్జ్(69), విహాన్ మల్హోత్రా(69) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో అభిజ్ఞాన్ కుండు(32), కన్షిక్ చౌహన్(28) మెరుపులు మెరిపించారు. వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) మాత్రం సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. యూఏఈ బౌలర్లలో యూగ్ శర్మ, సూరి తలా రెండు వికెట్లు సాధించాడు. కాగా యూత్ వన్డేల్లో భారత్ 400 ప్లస్ పైగా పరుగులు సాధించడం ఇదే మూడో సారి. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?[node:field_tags]A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025 -
నితీశ్ రెడ్డి హ్యాట్రిక్.. అయినా తప్పని ఓటమి
దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో టీమిండియా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్.. శుక్రవారం మధ్యప్రదేశ్తో జరిగిన సూపర్ లీగ్ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో దుమ్ములేపాడు.తొలుత బ్యాటింగ్లో 25 పరుగులతో సత్తాచాటిన నితీశ్.. అనంతరం బౌలింగ్లో హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు. 19.1 ఓవర్లలో కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర ఇన్నింగ్స్లో శ్రీకర్ భరత్(39), నితీశ్ రెడ్డి(25) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఎంపీ బౌలర్లలో శివమ్ శుక్లా నాలుగు వికెట్లు పడగొట్టగా.. త్రిపురేష్ మూడు, రాహుల్ బాథమ్ రెండు వికెట్లు సాధించారు.నితీశ్ హ్రాట్రిక్ షో..113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్కు నితీశ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. మూడో ఓవర్ వేసిన నితీశ్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి ఎంపీని కష్టాల్లోకి నెట్టాడు. నితీష్ బౌలింగ్లో తొలి వికెట్గా హర్ష్ గవాలి క్లీన్ బౌల్డ్ కాగా.. ఆ తర్వాత డెలివరీకి హర్ప్రీత్ సింగ్ రిక్కీ భుయ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఇక చివరగా నితీశ్ ఎంపీ కెప్టెన్ రజత్ పాటిదార్ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రిషబ్ చౌహన్(47), రాహుల్ బాథమ్(35 నాటౌట్) ఆచితూచి ఆడుతూ మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఆంధ్రపై 4 వికెట్ల తేడాతో ఎంపీ ఘన విజయం సాధించింది.చదవండి: Asia Cup: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో
అండర్-19 ఆసియాకప్ 2025ను టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా యూఏఈతో జరుగుతున్న తొలి మ్యాచ్లో సూర్యవంశీ భారీ సెంచరీతో చెలరేగాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు వైభవ్ చుక్కలు చూపించాడు.తొలుత కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తనదైన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లోనే తన రెండో యూత్ వన్డే సెంచరీ మార్క్ను వైభవ్ అందుకున్నాడు.సెంచరీ పూర్తి అయిన తర్వాత కూడా తన జోరును కొనసాగించాడు. అతడి దూకుడు చూస్తే సునాయసంగా డబుల్ సెంచరీ మార్క్ను అందుకుంటాడని అంతాభావించారు. స్పిన్నర్ ఉద్దీష్ సూరి బౌలింగ్లో అనవసరంగా రివర్స్ స్కూపు షాట్కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. ఓవరాల్గా 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఏడాది అతడికి అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది ఆరో సెంచరీ కావడం విశేషం.ఈ మ్యాచ్లో భారీ స్కోర్ దిశగా భారత్ సాగుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి భారత యువ జట్టు 4 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసింది. విధ్వంసంకర సెంచరీతో మెరిసిన వైభవ్.. ఆరోన్ జార్జ్ తో కలిసి 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్ అయూష్ మాత్రే(4) సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు.చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్A century in no time...just 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝗼𝗼𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 things! 💯 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/3N140FhcRV— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025 -
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగాట్
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంది. ఒలింపిక్స్లో పతకం గెలవాలనే తన కలను నేరవేర్చుకునేందుకు మనసు మార్చుకుంటున్నట్లు ఫొగాట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా 31 ఏళ్ల వినేశ్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్లో తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. పతకం ఖాయమైన వేళ అనుహ్యంగా ఆమెపై వేటు పడింది. 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో నిర్దేశించిన బరువు కంటే వినేష్ ఫొగాట్ 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో ఆమెపై వేటు వేశారు. దీంతో ఆమె తన ఒలింపిక్ కల నేరవేరకుండానే భారత్కు తిరిగిచ్చింది. ఆ తర్వాత ఉమ్మడి రజత పతకం ఇవ్వాలని వినేష్ ఫొగాట్.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసింది. అయితే సీఏఎస్ వినేష్ ఫొగాట్ అభ్యర్థనను సీఏఎస్ తోసిపుచ్చడంతో ఆమెకు తీవ్ర నిరాశే ఎదురైంది.ఈ క్రమంలో ఆమె రి సోషల్ మీడియా వేదికగా టైర్మెంట్ ప్రకటిస్తూ అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత ఫొగాట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేసి జులనా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎంపికైంది. ఇప్పుడు లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది."పారిస్ ఒలింపిక్స్తో నా రెజ్లింగ్ జర్నీ ముగిసిందా అని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఆ ప్రశ్నకు ఇప్పటివరకు నేను సమాధానం చెప్పలేకపోయాను. నేను రెజ్లింగ్ మ్యాట్, ఆ ఒత్తిడి, నా లక్ష్యాల నుంచి కొన్నాళ్లపాటు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. నేను ఇప్పటికీ ఈ క్రీడను(రెజ్లింగ్) ప్రేమిస్తున్నాను" అని రిటైర్మెంట్ యూటర్న్ ప్రకటనలో ఫోగాట్ పేర్కొంది. -
విండీస్తో రెండో టెస్టు.. న్యూజిలాండ్ ఘన విజయం
వెల్లింగ్టన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకెండ్ టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బ్లాక్క్యాప్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. డెవాన్ కాన్వే(28), కేన్ విలియమ్సన్(16) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ మొదటి ఇన్నింగ్స్లో 205 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో షాయ్ హోప్(47) టాప్ స్కోరర్గా నిలవగా.. క్యాంప్బెల్(44) , కింగ్(33) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిక్నర్ నాలుగు, రే మూడు వికెట్లు సాధించారు.అనంతరం కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ను 278/9 వద్ద ముగించింది. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డ పేసర్ టిక్నర్ బ్యాటింగ్కు రాలేదు. మిచెల్ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.దీంతో తొలి ఇన్నింగ్స్లో కివీస్కు 73 పరుగుల ఆధిక్యం లభించింది. కరీబియన్ బౌలర్లలో అండర్సన్ ఫిలిప్ 3, రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్లో విండీస్ కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్ జాకబ్ డఫీ 5 వికెట్లు పడగొట్టి కరేబియన్ల పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మిచెల్ రే మూడు వికెట్లు సాధించాడు. కవీమ్ హోడ్జ్(35) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో విండీస్ ఆతిథ్య జట్టు ముందు కేవలం 56 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మౌంట్ మంగునూయ్ వేదికగా డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs SA: ‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు? -
‘సూర్య’ గ్రహణం వీడేది ఎప్పుడు?
టీ20 వరల్డ్కప్-2026కు కౌంట్డౌన్ మొదలైంది. మరో 55 రోజుల్లో భారత్, శ్రీలంక వేదిలకగా ఈ మెగా టోర్నమెంట్ షూరూ కానుంది. ఈ పొట్టి ప్రపంచకప్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఇద్దరు ప్లేయర్ల పేలవ ఫామ్ భారత జట్టు మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. అందులో ఒకరు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాగా.. మరొకరు అతడి డిప్యూటీ శుభ్మన్ గిల్.టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో వీరిద్దరూ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు.సూర్యకు ఏమైంది..?ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్గా పేరున్న సూర్యకుమార్.. 2025లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2025లో రాణించినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో పూర్తిగా తేలిపోయాడు. కెప్టెన్గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఈ ఏడాది ఇప్పటివరకు 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సంవత్సరం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతడి టాప్ స్కోర్ 38 పరుగులగా ఉంది. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్కు వస్తున్న సూర్య తన చెత్త ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారుతున్నాడు. తనపై తనకే నమ్మకం లేక ఒక మ్యాచ్లో మూడో స్ధానంలో.. మరో మ్యాచ్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వస్తున్నాడు. ఒకప్పుడు సూర్య క్రీజులో ఉంటే బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడేవారు. కానీ ఇప్పుడు అతడి వీక్నెస్ను పసిగట్టిన బౌలర్లు.. అతడిని చాలా ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్కు ముందు భారత్ ఇంకా 8 మ్యాచ్లు ఆడనుంది. సౌతాఫ్రికాతో మూడు, న్యూజిలాండ్తో ఐదు టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్లలో సూర్య తిరిగి తన ఫామ్ను అందుకోవాల్సి ఉంది. లేదంటే భారత్కు బ్యాటింగ్ కష్టాలు తప్పవు. ఈ సిరీస్లో తొలి టీ20లో కేవలం 12 పరుగులు చేసిన సూర్యకుమార్.. రెండో టీ20లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. మూడో మ్యాచ్లోనైనా ఈ ముంబై ఆటగాడు తన బ్యాట్కు పనిచెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.గిల్ ఢమాల్..ఇక మొన్నటివరకు టీ20 ప్రపంచకప్ ప్రణాళికలలో అస్సలు శుభ్మన్ గిల్ లేడు. టీ20ల్లో భారత జట్టు ఓపెనర్లగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఉండేవారు. కానీ ఆసియాకప్ 2025కు ముందు గిల్ను టీ20ల్లో అనూహ్యంగా తీసుకొచ్చారు. అంతేకాకుండా అప్పటివరకు వైస్ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ను తప్పించి ఆ బాధ్యతలను గిల్కు బీసీసీఐ అప్పగించింది.అయితే ఆల్ఫార్మాట్గా గిల్కు పేరు ఉన్నప్పటికి.. తన టీ20 రీ ఎంట్రీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆసియాకప్, ఆస్ట్రేలియా సిరీస్తో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20ల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టీ20ల కనీసం తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజూ శాంసన్ను తప్పించి మరి అతడికి ఓపెనర్గా అవకాశమిచ్చారు. కానీ అతడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాపరుస్తున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాబోయో మ్యాచ్లలోనైనా కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరూ తమ ఫామ్ను అందుకుంటారో లేదో చూడాలి.చదవండి: IND Vs SA: అర్ష్దీప్ 13 బంతుల ఓవర్.. గంభీర్ రియాక్షన్ వైరల్ -
అర్ష్దీప్ 13 బంతుల ఓవర్.. గంభీర్ రియాక్షన్ వైరల్
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో 51 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు అయింది. ముఖ్యంగా బౌలింగ్లో అయితే మెన్ ఇన్ బ్లూ పూర్తిగా తేలిపోయింది. ఒక్క వరుణ్ చక్రవర్తి తప్ప మిగితా బౌలర్లు అందరూ అట్టర్ప్లాప్ అయ్యారు. స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ అయితే దారుణ ప్రదర్శన కనబరిచాడు. పదేపదే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ సఫారీ బ్యాటర్లకు టార్గెట్గా మారాడు. అస్సలు ఏ మాత్రం రిథమ్లో కన్పించలేదు.ఒక ఓవర్లో 13 బంతులుప్రోటీస్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన అర్ష్దీప్ తన చెత్త బౌలింగ్తో అందరికి చిరాకు తెప్పించాడు. 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1.. ఆ ఓవర్లో అర్ష్దీప్ వేసిన బంతుల వరుస ఇది. ఈ పంజాబీ పేసర్ తన ఓవర్ను పూర్తిచేసేందుకు ఏకంగా 13 బంతులు వేయాల్సి వచ్చింది. తొలి బంతిని డికాక్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదగా... మిగతా 5 లీగల్ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. డగౌట్లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం అర్ష్దీప్పై సీరియస్ అయ్యాడు. ఇదేమి బౌలింగ్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.చెత్త రికార్డు..అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక బంతులు వేసిన ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్-ఉల్-హక్ రికార్డును అర్ష్దీప్ సమం చేశాడు. నవీన్ గత ఏడాది హరారేలో జింబాబ్వేపై ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. అయితే భారత్ తరపున ఈ చెత్త ఫీట్ సాధించిన తొలి బౌలర్ మాత్రం అర్ష్దీపే కావడం గమనార్హం.Gautam Gambhir angry at Arshdeep as he bowled 7 wide bowls in an over 💀 pic.twitter.com/EqUa7nFqW5— ••TAUKIR•• (@iitaukir) December 11, 2025చదవండి: నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్ -
'డబ్ల్యూటీసీ ఫైనల్స్.. మా అంచనాలను అందుకున్నాయి'
దుబాయ్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ టెస్టు క్రికెట్లో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయిలో ఉండాలని తాము ఆశించామని... మూడు ఫైనల్ మ్యాచ్లు కూడా తమ అంచనాలను అందుకున్నాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీఈఓ సంజోగ్ గుప్తా అభిప్రాయ పడ్డారు. 2025లో జరిగిన ఫైనల్స్ కోసం లార్డ్స్ స్టేడియం పూర్తిగా నిండిపోవడం ఐసీసీ చరిత్రలో నిలిచిపోయే క్షణమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరగ్గా... వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి."డబ్ల్యూటీసీ ఫైనల్స్ అంటే మిగతా టెస్టుల తరహాలో కాదు. ఈ ఫార్మాట్లో రెండేళ్ల శ్రమ తర్వాత రెండు అత్యుత్తమ జట్లు తలపడే సందర్భం. టెస్టు క్రికెట్ విలువ ఏమిటో ఈ మ్యాచ్లు చూపించాయి. డబ్ల్యూటీసీ మొదలు పెట్టినప్పుడు మేం ఆశించిన స్పందన ఇక్కడ వచ్చింది. మా అంచనాలు ఫైనల్స్ అందుకున్నాయి. లార్డ్స్లో జరిగిన ఫైనల్లో భారత్ గానీ ఇంగ్లండ్ గానీ ఆడలేదు. అయినా సరే స్టేడియం నిండిపోయింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్పై అభిమానులు ఎంత ఆసక్తిని ప్రదర్శించారో ఇది చూపించింది. అన్నింటికి మించి డబ్ల్యూటీసీ ఫైనల్కు మరో ఆరు నెలల సమయం ఉన్నా కూడా ఎవరు ఫైనల్ చేరతారనే చర్చ అన్ని జట్లలో కనిపిస్తోంది. దీనికి అర్హత సాధించే క్రమంలో ద్వైపాక్షిక టెస్టు సిరీస్ల ప్రాధాన్యం ఎంతో పెరిగింది" అని సంజోగ్ వ్యాఖ్యానించారు.చదవండి: నేను.. అతడే ఈ ఓటమికి కారణం! ప్రతీసారి కూడా: సూర్యకుమార్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చింది. బుధవారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో భారత్ను దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో సఫారీలు ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు.తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్((46 బంతుల్లో 7 సిక్స్లు, 5 ఫోర్లతో 90) విధ్వంసం సృష్టించగా.. డొనవాన్ ఫెరీరా(16 బంతుల్లో 30), మిల్లర్(12 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో సౌతాఫ్రికా బౌలర్ల దాటికి భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ బార్ట్మన్ 4 వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. ఎంగిడీ, సిప్లమా, జాన్సెన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది.ఆల్టైమ్ రికార్డు బ్రేక్..ఇక ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. టీ20ల్లో టీమిండియాపై సఫారీలకు ఇది పదమూడో విజయం.ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ రెండు జట్లు భారత్పై ఇప్పటివరకు 12 సార్లు టీ20 విజయాలు నమోదు చేశాయి. తాజా గెలుపుతో ఈ రెండు జట్లను సౌతాఫ్రికా అధిగమించింది.భారత్పై అత్యధిక టీ20 విజయాలు సాధించిన జట్లుదక్షిణాఫ్రికా-13ఆస్ట్రేలియా-12ఇంగ్లాండ్-12న్యూజిలాండ్-10వెస్టిండీస్10చదవండి: నేను.. అతడే ఈ ఓటమికి కారణం! ప్రతీసారి కూడా: సూర్యకుమార్ -
నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్ పూర్తిగా తేలిపోయింది. 214 పరుగుల లక్ష్య చేధనలో 19.1 ఓవర్లలో 162 రన్స్కే టీమిండియా కుప్పకూలింది.భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 62) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5), శుభ్మన్ గిల్(0), అభిషేక్ శర్మ(17) వంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. సఫారీ పేసర్ బార్ట్మాన్ 4 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, జాన్సెన్, సిప్లమా తలా రెండు వికెట్లు సాధించారు.అంతకుముందు క్వింటన్ డికాక్(90) చెలరేగడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఈ విజయంతో సిరీస్ను 1-1తో ప్రోటీస్ సమం చేసింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యామని అతడు చెప్పుకొచ్చాడు.అభిషేక్ ఒక్కడే కాదు.."ఈ మ్యాచ్లో టాస్ గెలవడం మినహా ఏదీ మాకు అనుకూలించలేదు. టాస్ గెలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ తీసుకుని ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్ సమయానికి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే తొలుత బౌలింగ్ తీసుకున్నాము. కానీ ఆరంభంలోనే ఈ వికెట్పై ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. ఆ తర్వాత ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలో మా బౌలర్లు గ్రహించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది నేర్చుకునే ప్రక్రియ. మేము ఈ ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాము. తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం. మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. మా మొదటి ప్లాన్ విఫలమైనప్పుడు.. వెంటనే మా సెకెండ్ ప్లాన్ను అమలు చేయలేకపోయాము. కానీ సౌతాఫ్రికా బౌలర్లు మాత్రం రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఉన్నప్పటికి ఎలా బౌలింగ్ చేయాలో మాకు చూపించారు. మా తదుపరి మ్యాచ్లో వారిని మేము అనుసరిస్తాము.బ్యాటింగ్లో నేను, శుభ్మన్ ఇంకొంచెం బాధ్యత తీసుకోవాల్సింది. అభిషేక్ అద్భుతంగా ఆడుతున్నాడు, కానీ ప్రతిసారీ అతనిపైనే ఆధారపడలేము. శుభ్మన్ తొలి బంతికే అవుటయ్యాడు. ఆ సమయంలో నేను ఎక్కువ క్రీజులో ఉండి, ఛేజింగ్ బాధ్యతను నా భుజాలపై వేసుకోవాల్సింది. ఇక అన్ని ఫార్మాట్లలోనూ అక్షర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్లో అతడిని ప్రమోట్ చేశాము. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్లో మా ప్లాన్ విజయవంతం కాలేదు. ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అయినప్పటికి మా తదుపరి మ్యాచ్లో గట్టిగా కమ్బ్యాక్ ఇస్తాం. ధర్మశాలలో కలుద్దాం" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: యువ భారత్కు ఎదురుందా! -
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ పోటీలకు సింధు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలకు స్టార్ ఆటగాళ్లతో భారత్ సిద్ధమైంది. ఫిబ్రవరి 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) గురువారం ప్రకటించింది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీల్లో మహిళల విభాగంలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్కాగా... పురుషుల విభాగంలో టీమిండియా రెండుసార్లు కాంస్య పతకాలు సాధించింది. ‘ర్యాంకింగ్, ప్రదర్శన, అనుభవం ఆధారంగా జట్లను ఎంపిక చేశాం. మహిళల జట్టును రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధు ముందుండి నడిపిస్తుంది’ అని ‘బాయ్’ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల జట్టులో భారత నంబర్వన్, ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్తోపాటు ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, రైజింగ్ స్టార్స్ ఆయుశ్ శెట్టి, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి ఉన్నారు. భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, రక్షిత శ్రీ, మాళవిక బన్సోద్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ప్రియా కొంజెంగ్బమ్, శ్రుతి మిశ్రా, తనీషా క్రాస్టో. భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్ మన్నేపల్లి, సాతి్వక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, సాయిప్రతీక్, హరిహరన్. -
యువ భారత్కు ఎదురుందా!
దుబాయ్: యువ ఆటగాళ్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసే మరో టోర్నమెంట్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా నేటి నుంచి అండర్–19 ఆసియా కప్ వన్డే టోర్నమెంట్కు తెరలేవనుంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్లో నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో యువ భారత జట్టు తలపడనుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ పోరులో ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఐపీఎల్ సహా దేశవాళీ టోర్నీల్లో విధ్వంసక సెంచరీలతో ఇప్పటికే స్టార్గా ఎదిగిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో అండర్–19 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ టోర్నీ మన ప్లేయర్లకు రిహార్సల్గా ఉపయోగపడనుంది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ‘హ్యాండ్ షేక్’ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో... ఇటీవల జరిగిన పురుషుల సీనియర్ ఆసియాకప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో భారత ప్లేయర్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. ‘హ్యాండ్ షేక్పై ప్లేయర్లు ఏమీ చెప్పలేరు. టీమ్ మేనేజర్ ఆనంద్ దాతర్కు బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు అందుతాయి. ఒకవేళ కరచాలనం చేయకూడదని భారత జట్టు నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని మ్యాచ్ రిఫరీకి ముందే తెలుపుతాం’ అని ఓ అధికారి తెలిపారు. క్రీడల్లో రాజకీయాలకు తావులేదని తెలిసినా... బోర్డు నిర్ణయం మేరకే నడుచుకుంటామని ఆయన అన్నారు. భారత్ బరిలోకి దిగుతున్న గ్రూప్ ‘ఎ’లోనే దాయాది పాకిస్తాన్ కూడా ఉండగా... ఇరు జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లతో పాటు యూఏఈ, మలేసియా జట్లు కూడా గ్రూప్ ‘ఎ’లో ఉన్నాయి. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక జట్లు గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడుతున్నాయి. భారత్ బలంగా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున, దేశవాళీల్లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగే ఆయుశ్ మాత్రే యంగ్ ఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీలో వరుస సెంచరీలతో చెలరేగిన మాత్రేపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మొత్తం టోర్నమెంట్కు ప్రధాన ఆకర్షణ అయిన వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సీనియర్ క్రికెట్లోనే తన దూకుడుతో ప్రకంపనలు సృష్టిస్తున్న వైభవ్... ముస్తాక్ అలీ టోర్నీలో శతకం బాదిన అతి పిన్నవయసు్కడిగా రికార్డు సృష్టించాడు. 15 మందితో కూడిన భారత జట్టులో ఈ ఇద్దరూ సీనియర్ స్థాయిలో వేర్వేరు ఫార్మాట్లలో కలిపి 30కి పైగా మ్యాచ్లు ఆడారు. వాటిలో 9 శతకాలు తమ పేరిట లిఖించుకున్నారు. ఈ నయా జనరేషన్ జోరును మిగిలిన జట్లు ఏమాత్రం అడ్డుకుంటాయో చూడాలి. వైస్ కెపె్టన్ విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞ, హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జి కూడా బ్యాటింగ్లో భారీ ఇన్నింగ్స్లు ఆడగల సమర్థులే. ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్కు మినహా... ఇతర జట్లకు 50 ఓవర్ల ఆటలో పెద్దగా అనుభవం లేదు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన సెమీఫైనల్కు చేరడం దాదాపు ఖాయమే. భారత అండర్–19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెపె్టన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, అభిజ్ఞ కుండు, హర్వంశ్ సింగ్, యువరాజ్ గోహిల్, కనిష్క చౌహాన్, ఖిలాన్ పటేల్, నమన్ పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జి. -
ప్రొ హాకీ లీగ్ విజేతలకు ఒలింపిక్ బెర్త్
న్యూఢిల్లీ: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పాల్గొనే హాకీ జట్లను ఎంపిక చేసే ప్రక్రియను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గురువారం వెల్లడించింది. విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో 12 జట్ల చొప్పున పోటీ పడనుండగా... ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా పాల్గొననుంది. ఇక మిగిలిన 11 జట్లను ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్, ఐదు కాంటినెంటల్ చాంపియన్షిప్ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ‘ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ 2025–26, 2026–27 సీజన్లలో విజేతగా నిలిచిన జట్లు విశ్వక్రీడలకు ఎంపికవుతాయి. ఒకవేళ రెండు సీజన్లలో ఒకే జట్టు విజేతగా నిలిస్తే... రెండో సీజన్లో రన్నరప్గా నిలిచిన జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుంది. కాంటినెంటల్ చాంపియన్షిప్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు కూడా విశ్వక్రీడలకు అర్హత పొందుతాయి. ఒకవేళ కాంటినెంటల్ చాంపియన్షిప్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అప్పటికే ప్రొ లీగ్ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంటే... తదుపరి స్థానంలో ఉన్న జట్టుకు ఆ అవకాశం దక్కుతుంది’ అని ఎఫ్ఐహెచ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 2028 ఆరంభంలో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లను సైతం నిర్వహించనున్నారు. ఇందులో పురుషుల, మహిళల విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొననున్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు కూడా ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంటాయి. -
గెట్.. సెట్... కిక్
న్యూఢిల్లీ: పురుషుల జట్లకు నిర్వహించే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీపై ఒకవైపు సందిగ్ధత కొనసాగుతున్నా... మరోవైపు ఇండియన్ ఉమెన్స్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) 2025–2026 సీజన్ ఫుట్బాల్ టోర్నమెంట్ తేదీలను అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించింది. కోల్కతాలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఈనెల 20న ఈ లీగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది మే 10వ తేదీ వరకు జరిగే ఈ లీగ్లో 8 జట్లు పోటీపడుతున్నాయి. ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ (కోల్కతా), గర్వాల్ యునైటెడ్ ఎఫ్సీ (న్యూఢిల్లీ), గోకులం కేరళ ఎఫ్సీ (కోజికోడ్), కిక్స్టార్ట్ ఎఫ్సీ (బెంగళూరు), నీతా ఫుట్బాల్ అకాడమీ (కటక్), సెసా ఫుట్బాల్ అకాడమీ (సిర్కయిమ్, గోవా), సేతు ఎఫ్సీ (మదురై), శ్రీభూమి ఎఫ్సీ (కోల్కతా) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. తొలి మ్యాచ్లో సేతు ఫుట్బాల్ క్లబ్తో కిక్స్టార్ట్ ఎఫ్సీ జట్టు తలపడుతుంది. తొలి అంచె డిసెంబర్ 20 నుంచి జనవరి 9వ తేదీ వరకు... రెండో అంచె ఏప్రిల్ 20 నుంచి మే 10వ తేదీ వరకు జరుగుతుంది. ఒక్కో జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. అత్యధిక పాయింట్లు సాధించిన జట్టుకు టైటిల్ లభిస్తుంది. లీగ్లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఐడబ్ల్యూఎల్–2కు పడిపోతాయి. ఐడబ్ల్యూఎల్–2లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఐడబ్ల్యూఎల్కు ప్రమోట్ అవుతాయి. కోల్కతాకు చెందిన ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీ జట్టు 2024–2025 ఐడబ్ల్యూఎల్ చాంపియన్గా నిలిచింది. తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్కు తొలి టైటిల్ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల సౌమ్య గత ఐడబ్ల్యూఎల్ సీజన్లో 9 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ చేసిన భారత ప్లేయర్గా నిలిచింది. గోకులం కేరళ ఎఫ్సీ జట్టుకు ఆడిన ఉగాండా ప్లేయర్ ఫాజిలా ఇక్వాపుట్ 24 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలువగా... ఈస్ట్ బెంగాల్ జట్టుకు చెందిన ఘనా ప్లేయర్ ఎల్షాదాయ్ అచీమ్పోంగ్ 10 గోల్స్తో రెండో స్థానంలో, సౌమ్య 9 గోల్స్తో మూడో స్థానంలో నిలిచారు. -
న్యూజిలాండ్కు ఆధిక్యం
వెల్లింగ్టన్: సొంతగడ్డపై వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 24/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 74.4 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కేన్ విలియమ్సన్ (37; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (25; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్ల ధాటికి కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా... మిచెల్ హే చివరి వరకు పోరాడి జట్టుకు 73 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించాడు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ బ్లెయిర్ టిక్నెర్ బ్యాటింగ్కు రాలేదు. కరీబియన్ బౌలర్లలో అండర్సన్ ఫిలిప్ 3, రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. జాన్ క్యాంప్బెల్ (14), అండర్సన్ ఫిలిప్ (0) అవుట్ కాగా... బ్రాండన్ కింగ్ (15 బ్యాటింగ్; 3 ఫోర్లు), కవెమ్ హడ్జ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న విండీస్ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, మిచెల్ రే చెరో వికెట్ పడగొట్టారు. -
క్వార్టర్స్లో తరుణ్
కటక్: ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్, టాప్ సీడ్ తరుణ్ మన్నేపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ తరుణ్ 21–16, 12–21, 21–11తో భారత్కే చెందిన గోవింద్ కృష్ణపై గెలుపొందాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జి, రిత్విక్సంజీవి, శంకర్ ముత్తుస్వామి, రౌనక్ చౌహాన్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో శంకర్ 21–8, 19–21, 21–15తో ఆర్య (భారత్)పై, కిరణ్ జార్జి 21–12, 21–18తో డెండి ట్రియాన్సి (ఇండోనేసియా)పై, రిత్విక్ 15–21, 21–6, 21–17తో సిద్ధాంత్ గుప్తా (భారత్)పై, రౌనక్ 21–18, 19–21, 21–17తో వరుణ్ కపూర్పై గెలుపొందారు. శ్రియాన్షి పరాజయం మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ శ్రియాన్షి వలిశెట్టి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శ్రియాన్షి 18–21, 18–21తో తాన్యా హేమంత్ (భారత్) చేతిలో ఓడిపోయింది. భారత్కే చెందిన ఉన్నతి హుడా, అనుపమ, తస్నిమ్ మీర్, తన్వీ శర్మ, అన్మోల్, ఇషారాణి బారువా కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. పురుషుల డబుల్స్ విభాగంలో అరిగెల భార్గవ్ రామ్–గొబ్బూరి విశ్వతేజ్ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో భార్గవ్ రామ్–విశ్వతేజ్ ద్వయం 18–21, 24–22, 21–17తో నితిన్–వీరంరెడ్డి వెంకట హర్షవర్ధన్ నాయుడు (భారత్) జంటపై గెలిచింది. -
యువరాజ్, హర్మన్ కౌర్ స్టాండ్ల ఆవిష్కరణ
న్యూ చండీగఢ్లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) నిర్మించిన ఈ మహరాజా యద్విoద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇదే తొలి పురుషుల అంతర్జాతీయ మ్యాచ్. గతంలో ఐపీఎల్ మ్యాచ్లతో పాటు మూడు నెలల క్రితం భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండు వన్డేలు జరిగాయి. గురువారం టి20 సందర్భంగా రెండు కొత్త స్టాండ్లను ఆవిష్కరించారు. వన్డే, టి20 వరల్డ్ కప్ల విజేత, మాజీ స్టార్ యువరాజ్ సింగ్తో పాటు ఇటీవల భారత్కు వరల్డ్ కప్ను అందించిన మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేర్లతో ఈ స్టాండ్లను ఏర్పాటు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ స్టేడియంలో ఇప్పటికే మరో మాజీ స్పిన్నర్ హర్భజన్ పేరిట పెవిలియన్ ఉంది. -
తిలక్ పోరాడినా... తప్పని ఓటమి
తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ తర్వాతి పోరులో సునాయాసంగా తలవంచింది. పేలవ బౌలింగ్తో 22 అదనపు పరుగులు ఇచ్చి మరీ ప్రaత్యర్థి భారీ స్కోరుకు కారణమైన జట్టు బ్యాటింగ్లోనూ తేలిపోయింది. బ్యాటింగ్లో డికాక్ మెరుపులతో పాటు మంచులో కూడా పట్టు తప్పకుండా వేసిన బౌలింగ్తో సఫారీలు పైచేయి సాధించారు. హైదరాబాదీ తిలక్ వర్మ ఒంటరి పోరాటం మినహా ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. న్యూ చండీగఢ్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ 1–1తో సమమైంది. గురువారం జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... చివర్లో డొనొవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. భారత్ ఏకంగా 22 ఎక్స్ట్రాలు ఇవ్వగా, ఇందులో 16 వైడ్లు ఉన్నాయి. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, బార్ట్మన్కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది.సమష్టి ప్రదర్శన... ఓపెనర్ డికాక్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను దూకుడుగా మొదలు పెట్టగా, హెన్డ్రిక్స్ (8) విఫలమయ్యాడు.అర్ష్ దీప్ ఓవర్లో 4, 6 కొట్టిన డికాక్ బుమ్రా ఓవర్లో మరో సిక్స్ బాదాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. మార్క్రమ్ (26 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్లు) నెమ్మదిగా ఆడగా, జోరు కొనసాగిస్తూ డికాక్ 26 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్స్లతో) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుణ్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన మార్క్రమ్ అదే ఓవర్లో వెనుదిరిగాడు. మరోవైపు అర్ధ సెంచరీ తర్వాత డికాక్ తాను ఆడిన తర్వాతి 19 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. అయితే సెంచరీకి చేరువైన దశలో కీపర్ జితేశ్ చురుకుదనం కారణంగా డికాక్ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. బ్రెవిస్ (14) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... ఫెరీరా, మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరును అందించింది. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ఫెరీరా రెండు సిక్సర్లు బాదాడు. తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా తర్వాతి 10 ఓవర్లలో 123 పరుగులు రాబట్టింది. ఓపెనర్లు విఫలం... శుబ్మన్ గిల్ (0) తాను ఆడిన తొలి బంతికే వెనుదిరగ్గా, 2 సిక్స్లు బాదిన అభిషేక్ శర్మ (17) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. సూర్యకుమార్ (5) వైఫల్యాల బాట కొనసాగగా, మూడో స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ (21) పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఫోర్, సిక్స్తో ఖాతా తెరిచిన తిలక్ ఆ తర్వాత కూడా నాలుగు బంతుల వ్యవధిలో రెండు సిక్స్లు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు. ఎన్గిడి బౌలింగ్లో మరో సిక్స్తో 27 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 20; 1 సిక్స్) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత తిలక్, జితేశ్ శర్మ (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కలిసి గెలిపించేందుకు పోరాడినా లాభం లేకపోయింది. 14 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ 9 బంతుల వ్యవధిలో 5 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. సఫారీలు ఒకే ఒక వైడ్ వేయడం విశేషం! స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (రనౌట్) 90; హెన్డ్రిక్స్ (బి) వరుణ్ 8; మార్క్రమ్ (సి) అక్షర్ (బి) వరుణ్ 29; బ్రెవిస్ (సి) తిలక్ (బి) అక్షర్ 14; ఫెరీరా (నాటౌట్) 30; మిల్లర్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–156, 4–160. బౌలింగ్:అర్ష్ దీప్ 4–0–54–0, బుమ్రా 4–0–45–0, వరుణ్ 4–0–29–2, అక్షర్ 3–0–27–1, పాండ్యా 3–0–34–0, దూబే 2–0–18–0. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 17; గిల్ (సి) హెన్డ్రిక్స్ (బి) ఎన్గిడి 0; అక్షర్ (సి) హెన్డ్రిక్స్ (బి) బార్ట్మన్ 21; సూర్యకుమార్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 5; తిలక్ (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 62; పాండ్యా (సి) బ్రెవిస్ (బి) సిపామ్లా 20; జితేశ్ (సి) బార్ట్మన్ (బి) సిపామ్లా 27; దూబే (బి) బార్ట్మన్ 1;అర్ష్ దీప్ (సి) మిల్లర్ (బి) బార్ట్మన్ 4; వరుణ్ (సి) మార్క్రమ్ (బి) బార్ట్మన్ 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 162. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–32, 4–67, 5–118, 6–157, 7–158, 8–162, 9–162, 10–162. బౌలింగ్: ఎన్గిడి 3.1–0–26–2, యాన్సెన్ 4–0–25–2, సిపామ్లా 4–0–46–2, ఫెరీరా 1–0–14–0, బార్ట్మన్ 4–0–24–4, లిండే 3–0–23–0.అర్ష్దీప్ 13 బంతుల ఓవర్! 6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1...అర్ష్ దీప్ సింగ్ వేసిన ఒక ఓవర్లో 13 బంతుల వరుస ఇది! దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో 11వ ఓవర్ వేసినఅర్ష్ దీప్ ఏకంగా 7 వైడ్లు వేశాడు. తొలి బంతిని డికాక్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదగా... మిగతా 5 లీగల్ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. -
డికాక్ విధ్వంసం.. రెండో టీ20లో టీమిండియా చిత్తు
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో డొనోవన్ ఫెరియెరా (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రీజా హెండ్రిక్స్ 8, కెప్టెన్ మార్క్రమ్ 29, బ్రెవిస్ 14 పరుగులకు ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచి తడబడింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేయడంతో 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓట్నీల్ బార్ట్మన్ 4, ఎంగిడి, జన్సెన్, సిపాంమ్లా తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చారు. భారత ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లలో జితేశ్ శర్మ 27, అక్షర్ పటేల్ 21, హార్దిక్ 20, అభిషేక్ శర్మ 17, సూర్యకుమార్ 5, అర్షదీప్ 4, దూబే ఒక పరుగు చేశారు. శుభ్మన్ గిల్, వరుణ్ చక్రవర్తి డకౌటయ్యారు.ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్లో డికాక్ (90), బౌలింగ్లో ఓట్నీల్ బార్ట్మన్ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ సిరీస్లోని మూడో టీ20 ధర్మశాల వేదికగా డిసెంబర్ 14న జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. తొందరపాటు చర్యతో.. -
ఈసారి గోల్డెన్ డకౌట్.. అతడిని ఎందుకు బలి చేస్తున్నారు?
భారత టీ20 జట్టు ఓపెనర్గా శుబ్మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో గిల్తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూకు ఓపెనర్గా మొండిచేయిఆసియా కప్-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్ (Shubman Gill). దీంతో అభిషేక్ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్ (Sanju Samson)ను మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్లలో గిల్ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.ఈసారి గోల్డెన్ డక్తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్లోనూ సంజూకు ఓపెనర్గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్కు పెద్దపీట వేసింది. అయితే, కటక్ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లో ముల్లన్పూర్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.వరుసగా వైఫల్యాలుసఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్ మొదటి వికెట్గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).ఈ స్థాయిలో గిల్ విఫలమవుతున్నా.. హెడ్కోచ్ గౌతం గంభీర్, మేనేజ్మెంట్ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్గా గిల్ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా, బ్యాటర్గా మెరుగ్గా ఆడుతున్న గిల్ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్ మ్యాచ్లో టీమిండియా పవర్ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్తో పాటు.. అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్డౌన్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పంపింది.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం! -
డికాక్ విధ్వంసం.. సౌతాఫ్రికా భారీ స్కోరు
టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో.. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏకంగా 213 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు సౌతాఫ్రికా బ్యాటింగ్కు దిగగా.. ఆదిలోనే రీజా హెండ్రిక్స్ (8) అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్ తొలి బంతికే అతడిని బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడంతో డికాక్ సెంచరీ మిస్సయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో లేని పరుగుకు యత్నించి మూల్యం చెల్లించాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ వేగంగా స్పందించి డికాక్ను రనౌట్ చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు.ఇక డికాక్కు తోడుగా కెప్టెన్, వన్డౌన్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ (26 బంతుల్లో 29) ఓ మోస్తరుగా రాణించాడు. రెండో వికెట్కు డికాక్తో కలిసి 83 పరుగులు జోడించాడు. చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ (14)విఫలం కాగా.. ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్ (12 బంతుల్లో 20) ధనాధన్ దంచికొట్టి అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. భారత్కు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. డికాక్ను వికెట్ కీపర్ జితేశ్ శర్మ రనౌట్ చేశాడు. ఎక్స్ట్రాల రూపంలో సౌతాఫ్రికాకు భారత్ 22 పరుగులు సమర్పించుకుంది.ఇక భారత పేసర్లలో అర్ష్దీప్ సింగ్ అత్యధికంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చుకోగా.. పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా 45 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లలో 34, శివం దూబే రెండు ఓవర్లలో 18 పరుగులు ఇవ్వగా.. వరుణ్ పూర్తి కోటాలో 29 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు.. అక్షర్ మూడు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు. -
చరిత్ర సృష్టించిన క్వింటన్ డికాక్.. కానీ
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో భారత జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్లోనే.. అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్గా రికార్డు సాధించాడు. టీమిండియాతో తాజా టీ20 సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ సందర్భంగా డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు.ముల్లన్పూర్ వేదికగారెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టుల్లో సఫారీలు 2-0తో వైట్వాష్ చేయగా.. వన్డేల్లో టీమిండియా 2-1తో గెలిచింది. అనంతరం కటక్లో జరిగిన తొలి టీ20లో భారత్ గెలవగా.. తాజాగా గురువారం నాటి రెండో టీ20కి ముల్లన్పూర్ ఆతిథ్యమిస్తోంది.పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్ కాగా.. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సఫారీ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) వేగంగా ఆడే ప్రయత్నంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.క్వింటన్ డికాక్ జోరుఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ మాత్రం జోరు కొనసాగించాడు. సఫారీ ఇన్నింగ్స్లో తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో మూడో బంతికి ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు ముందుకుసాగాడు.12 ఇన్నింగ్స్లోనేఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో టీమిండియాపై అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. డికాక్ కంటే ముందు వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఘనత సాధించారు. అయితే, ఇందుకు పూరన్కు 20 ఇన్నింగ్స్.. బట్లర్కు 24 ఇన్నింగ్స్ అవసరం కాగా.. డికాక్ 12 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. తొందరపాటు చర్యతోకానీ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు పరుగుకు యత్నించి డికాక్ రనౌట్ అయ్యాడు. పదహారో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో షాట్ బాదేందుకు ప్రయత్నించి అతడు విఫలం కాగా.. బంతిని అందుకున్న కీపర్ జితేశ్ శర్మ స్టంప్స్కు గిరాటేశాడు. దీంతో డికాక్ రనౌట్ అయ్యాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ రీఎంట్రీలో డికాక్ చేసిన స్కోర్లు వరుసగా.. 1, 23, 7, 0, 0, 90 (46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు). వరుస వైఫల్యాల తర్వాత ఫామ్లోకి వచ్చిన డికాక్.. ఇలా తొందరపాటు చర్యతో భారీ మూల్యమే చెల్లించాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్ భారతి! -
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు ఎగిరి గంతేసే శుభవార్త. ఇటీవల సౌతాఫ్రికాతో వరుస సెంచరీలతో దుమ్ములేపిన ఈ రన్మెషీన్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నాడు. అయితే, ఈసారి టీమిండియా తరఫున కాకుండా.. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లి ఆడనున్నాడు.ప్రాబబుల్స్లో కోహ్లి పేరుఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) గురువారం ధ్రువీకరించింది. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తమకు స్వయంగా తెలిపాడని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) తాజా సీజన్ ప్రాబబుల్స్లో కోహ్లి పేరును చేర్చింది. దీని గురించి డీడీసీఏ వర్గాలు ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..‘‘తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని విరాట్ కోహ్లి (Virat Kohli) డీడీసీఏకు సమాచారం ఇచ్చాడు. క్రికెట్లో అతడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. రిషభ్ పంత్ కూడాఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ సెంచరీలు బాదాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్గా ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాడు. అయితే, అతడు ఈ దేశీ టోర్నీలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు మరింత స్ఫూర్తి పొందుతారు’’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. కోహ్లితో పాటు మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు కూడా ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. ఈసారి ఈ ఇద్దరు ఢిల్లీ తరపున మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.గంభీర్- అగార్కర్ ఒత్తిడి వల్లేనా?కోహ్లి వరల్డ్క్లాస్ బ్యాటర్. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాత.. అత్యధిక సెంచరీలు (84) బాదిన రెండో ఇంటర్నేషనల్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు.సౌతాఫ్రికాతో వన్డేల ద్వారా సూపర్ ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. నిజానికి కొత్తగా నిరూపించుకునేది ఏమీ లేదు. అయితే, వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో ఉండాలంటే నిబంధనల ప్రకారం.. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దేశీ క్రికెట్ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.ముఖ్యంగా హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంలో పంతం పట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరు రో- కోల గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రోహిత్ను అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. వరల్డ్కప్ ప్లాన్లో భాగంగానే ఇలా చేశామని అగార్కర్ చెప్పడం ఇందుకు నిదర్శనం.అంతేకాదు అంతకుముందు వీరిద్దరు కలిసి రో-కో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతూ హవా చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని దేశీ టోర్నీల్లో ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. రో-కో దేశీ క్రికెట్ ఆడాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్: ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టువిరాట్ కోహ్లి, రిషభ్ పంత్, దేవ్ లక్రా, యుగళ్ సైనీ, దివిజ్ మెహ్రా, సుజల్ సింగ్, రజ్నీశ్ దాదర్, అమన్ భార్తి, గోవింద్ మిట్టల్, సుమిత్ బెనీవాల్, శుభమ్ దూబే, కేశవ్ దబాస్, రాహుల్ చౌదరి, సమర్థ్ సేత్, శివమ్ త్రిపాఠి, అన్మోల్ శర్మ, శివమ్ గుప్తా, లక్షయ్ తరేజా, మనన్ భరద్వాజ్, రౌనక్ వాఘేలా, మయాంక్ గుసైన్, కేశవ్ ఆర్సింగ్,, లక్ష్మణ్, దివాన్ష్ రావత్, ప్రణవ్ రాజ్వన్షీ, ప్రన్షు విజయరణ్.చదవండి: వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమి
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమిముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్లో డికాక్ (90), బౌలింగ్లో ఓట్నీల్ బార్ట్మన్ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా 5 మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఓటమి అంచుల్లో టీమిండియా19వ ఓవర్లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత శివమ్ దూబే (1), ఆతర్వాత అర్షదీప్ సింగ్ను (4), వరుణ్ చక్రవర్తి (0) ఔటయ్యారు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 162 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉంది. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా14.2వ ఓవర్- 118 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. సిపాంమ్లా బౌలింగ్లో బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (20) ఔటయ్యాడు. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-4తిలక్ వర్మ 18 బంతులలో 32, హార్దిక్ పాండ్యా 4 పరుగులు.. విజయానికి 60 బంతుల్లో 133 పరుగులు అవసరం👉7.3: బార్ట్మాన్ బౌలింగ్లో హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన అక్షర్ పటేల్ (21). స్కోరు: 67-4 (7.4)👉పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 51-3 (6)👉 3.5: మార్కో యాన్సెన్ బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగిన సూర్య (5). స్కోరు: 32-3 (4).👉1.6: మార్కో యాన్సెన్ బౌలింగ్లో కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ (8 బంతుల్లో 17). స్కోరు: 19-2 (2).👉మరో ప్రయోగం.. వన్డౌన్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్👉0.5: మరోసారి శుబ్మన్ గిల్ విఫలం.. ఎంగిడి బౌలింగ్లో హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్. గత మ్యాచ్లో నాలుగు పరుగులు చేసిన గిల్... భారత్ స్కోరు: 9-1 (1)సౌతాఫ్రికా భారీ స్కోరు.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?👉డికాక్ మెరుపులు (46 బంతుల్లో 90- 5 ఫోర్లు, 7 సిక్సర్లు).. రాణించిన డొనోవాన్ (16 బంతుల్లో 30 నాటౌట్), మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్)👉భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి రెండు, అక్షర్ పటేల్కు ఒక వికెట్👉సౌతాఫ్రికా స్కోరు: 213-4.. టీమిండియా లక్ష్యం 214 టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్👉ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా భారీస్కోరు: 213-4👉16.1: అక్షర్ పటేల్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా పెవిలియన్ చేరిన డెవాల్డ్ బ్రెవిస్ (14)👉15.1: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డికాక్ రనౌట్. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా👉15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156-2 👉11.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగిన మార్క్రమ్ (29) 👉10.3: వంద పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా👉పది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 90-1 👉8.3: హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న క్వింటన్ డికాక్.👉పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 53-1👉4.1: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సఫారీ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) అవుట్👉ముల్లన్పూర్ స్టేడియంలో టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్టాండ్ ఆవిష్కరణఎలాంటి మార్పులూ లేవుటాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మాట్లాడుతూ.. ‘‘ఈ మైదానం అద్భుతమైనది. ఇక్కడ మేము ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాము. పురుషుల క్రికెట్లో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదేనని తెలిసి సంతోషంగా ఉంది.ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మేము తొలుత బౌలింగ్ చేస్తాం. వికెట్ బాగుంది. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు.సంజూకు మరోసారి మొండిచేయికాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓపెనర్గా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (4) విఫలమైనా యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. గిల్ రాకతో ఓపెనింగ్ స్థానం కోల్పోయిన సంజూ శాంసన్ (Sanju Samson).. వికెట్ కీపర్గానూ ప్లేయింగ్ ఎలెవన్లోకి రాలేకపోయాడు. అతడి స్థానంలో తొలి టీ20లో ఆడిన జితేశ్ శర్మ (Jitesh Sharma)నే మేనేజ్మెంట్ కొనసాగింది. దీంతో సంజూకు మరోసారి మొండిచేయి ఎదురైంది.మూడు మార్పులతో బరిలోకిమరోవైపు.. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తుదిజట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నట్లు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, బార్ట్మన్లను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు. మరోసారి తేమ ప్రభావం చూపనుందని.. ఒకవేళ తాము టాస్ గెలిచినా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. ఆల్ ఫార్మాట్ సిరీస్లుకాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఈ ఆల్ ఫార్మాట్ సిరీస్లలో భాగంగా తొలుత టెస్టు సిరీస్లో సఫారీలు దుమ్ములేపారు. అనూహ్య రీతిలో పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై 2-0తో వైట్వాష్ చేశారు. అయితే, వన్డే సిరీస్ను 2-1తో గెలిచి భారత్ ఇందుకు ధీటుగా బదులిచ్చింది. ఇక కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలుపొందిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మాన్.చదవండి: వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు -
టీ20 ప్రపంచకప్-2026: టికెట్ల అమ్మకం.. బిగ్ అలెర్ట్
పొట్టి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు సంబంధించి టికెట్ల విక్రయం గురువారం మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 నిమిషాలకు టికెట్లు లైవ్లోకి రానున్నాయి.ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్ టికెట్ ధరను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వంద రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి అధికారిక భాగస్వామి బుక్మైషోలో టికెట్ల విక్రయం జరుగనుంది.కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీ-2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్తో మ్యాచ్తో ఫిబ్రవరి 7న ఈ ఐసీసీ టోర్నీకి తెరలేవనుంది. అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా భారత్- అమెరికాతో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెడుతుంది.భారత్లో వాంఖడేతో పాటు.. చెన్నైలోని చెపాక్ స్టేడియం, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం.. శ్రీలంకలోని ఎస్ఎస్సీ కొలంబో, ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికలుగా ఉన్నాయి.ఈడెన్ గార్డెన్స్లో అతి తక్కువగా రూ. 100 నుంచే టికెట్ లభించనుండగా.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రూ. 150తో ధర మొదలుకానుంది. అహ్మదాబాద్లోనూ రూ. 100 టికెట్ అందుబాటులో ఉంది. చెపాక్లో అత్యధికంగా రూ. 2 వేల ధరతో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. -
వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్-2026 ఎడిషన్కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఆడబోయే తమ యువ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్కు ఒలీవర్ పీక్ సారథ్యం వహించనున్నాడు.ఇక వరల్డ్కప్ ఆడే ఆసీస్ యువ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లకు కూడా చోటు దక్కడం విశేషం. అంతేకాదు ఈ టీమ్లో ఇద్దరు శ్రీలంక సంతతి, చైనా సంతతికి ఓ ఆటగాడికి కూడా సెలక్టర్లు చోటివ్వడం గమనార్హం.పాల్గొనే జట్లు ఇవేకాగా వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు అండర్-19 మెన్స్ వరల్డ్కప్ (ICC U19 Mens World Cup 2026) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఐసీసీ టోర్నీకి నమీబియా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక పాల్గొంటుండగా.. గ్రూప్-బి నుంచి భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికా పోటీపడతాయి.కెప్టెన్ ఎవరంటే?ఇక గ్రూప్-సి నుంచి ఇంగ్లండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, జింబాబ్వే.. అదే విధంగా గ్రూప్-డి నుంచి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తాజాగా తమ జట్టును ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్న ఆసీస్కు లెఫ్టాండర్ బ్యాటర్ ఒలీవర్ పీక్ సారథిగా వ్యవహరించబోతున్నాడు.భారత్తో ఫైనల్లో సత్తా చాటిసౌతాఫ్రికాలో 2024లో జరిగిన వరల్డ్కప్ టోర్నీలో ఒలీవర్ (Oliver Peake) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 120 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత్తో ఫైనల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆస్ట్రేలియా టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.అంతేకాదు పందొమిదేళ్ల ఈ కుర్ర బ్యాటర్ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏకంగా ప్రపంచకప్ జట్టు కెప్టెన్గా ప్రమోషన్ కొట్టేశాడు.అండర్-19 ప్రపంచకప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుఒలీవర్ పీక్ (కెప్టెన్), కేసీ బార్టన్, నాడెన్ కూరే (శ్రీలంక సంతతి), జేడెన్ డ్రేపర్, స్టీవెన్ హోగన్, థామస్ హోగన్, బెన్ గోర్డాన్, జాన్ జేమ్స్ (భారత సంతతి), చార్లెస్ లాచ్మండ్, అలెక్స్ లీ యంగ్ (చైనా సంతతి), విల్ మలాజ్జుక్, నితేశ్ సామ్యూల్ (శ్రీలంక సంతతి), హేడెన్ షీలర్, ఆర్యన్ శర్మ (భారత సంతతి), విలియం టేలర్.చదవండి: జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు -
ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్ భారతి!
భారత్లో క్రికెట్కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో క్రికెట్ ఓ మతం లాంటిది. అందుకే మిగతా ఏ క్రీడలకు లభించని క్రేజ్ ఈ ఆటకు మాత్రమే ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రసార మాధ్యమాలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయి.అనూహ్య రీతిలోముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే టోర్నీలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా దండిగా ఆదాయం పొందాలనే యోచనతో ఉంటాయి. అయితే, అనూహ్య రీతిలో కొన్నాళ్ల క్రితం ఐసీసీ మీడియా హక్కులను వదులుకునేందుకు జియో హాట్స్టార్ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.భారత్లో ఐసీసీ మ్యాచ్ల స్ట్రీమింగ్ హక్కుల కోసం రెండేళ్ల క్రితం.. నాలుగేళ్ల కాలానికి గానూ జియో హాట్స్టార్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని విలువ దాదాపు మూడు బిలియన్ డాలర్లకు పైమాటే. అయితే, టీ20 మెన్స్ ప్రపంచకప్-2026కు ముందు తాము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఈ సంస్థ ఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.రేసులోకి ప్రసార్ భారతి!ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో హాట్స్టార్ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటు.. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్వీడియో వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లను ఐసీసీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేసులోకి ఊహించని విధంగా ప్రసార్ భారతి (ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ) దూసుకువచ్చింది. పూర్తి హక్కులు దక్కించుకోలేకపోవచ్చుఈ విషయం గురించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మొత్తానికి మొత్తంగా ఐసీసీ మీడియా హక్కులను ప్రసార్ భారతి దక్కించుకోలేకపోవచ్చు. అయితే, బ్రేకప్ విధానంలో కొన్ని మ్యాచ్లను ప్రసారం చేసే వీలు ఉండవచ్చు.ఉదాహరణకు టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్లు.. లేదంటే ఫార్మాట్లకు అతీతంగా టోర్నమెంట్ల వారీగా మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందవచ్చు. ఏదో ఒక విధంగా ఐసీసీ మీడియా హక్కులలో భాగం కావడమే సంస్థ లక్ష్యం.దూర్దర్శన్, డీడీ ఫ్రీడిష్.. ఓటీటీ ప్లామ్ఫామ్లు.. ఇలా వివిధ వేదికల ద్వారా మ్యాచ్ల ప్రసారానికి ఆసక్తిగా ఉన్నాము. ముందుగా చెప్పినట్లు మొత్తం ప్యాకేజీ మేము దక్కించుకోలేకపోవచ్చు. అయినప్పటికీ బిడ్డింగ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్లనైనా ప్రసారం చేసే హక్కులు పొందాలని భావిస్తున్నాము’’ అని తెలిపినట్లు ఇన్సైడ్స్పోర్ట్ వెల్లడించింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే! -
15 ఏళ్ల తర్వాత మాట నిలబెట్టుకున్న సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన అరంగేట్రానికి దోహదపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్ నిలబెట్టుకున్నానని తెలిపాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు?.. అతడికి సచిన్ ఇచ్చిన మాట ఏంటి?!ఆ మ్యాచ్లో ప్రదర్శన ఆధారంగాటీమిండియా తరఫున 1989 నవంబరులో సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అంతకంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా తరఫున సచిన్ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టాడు.అతడి త్యాగంతో సెంచరీఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ ఇటీవలే స్వయంగా వెల్లడించాడు. ఢిల్లీతో మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా (Rest Of India) తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్ సింగ్ (Gursharan Singh) విరిగిన చేతితోనే బ్యాటింగ్కు వచ్చి.. సచిన్కు సహకారం అందించాడు. ఫలితంగా సచిన్ శతకం పూర్తి చేసుకోవడం.. తద్వారా టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురుశరణ్ సింగ్ త్యాగానికి ప్రతిగా.. సచిన్ అతడికి ఓ మాట ఇచ్చాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్ అవుతావుఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘రిటైర్ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్ఫిట్ మ్యాచ్లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్లో గురుశరణ్కు నేను ఓ మాట ఇచ్చాను.‘గుశీ.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్ అవుతావు. అలా నువ్వు రిటైర్ అయ్యి బెన్ఫిట్ మ్యాచ్ కోసం ఆటగాళ్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతాను’ అని చెప్పాను. అన్నట్లుగానే అతడి కోసం బెన్ఫిట్ మ్యాచ్ ఆడాను.పదిహేనేళ్ల తర్వాత‘గుశీ.. న్యూజిలాండ్లో నీకు ఓ మాట ఇచ్చాను కదా! పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నా’ అని చెప్పాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి. ‘ఆరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’ అని ఈరోజు సగర్వంగా నేను చెప్పగలను’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే! -
ఇండియాలో మెస్సీ.. షెడ్యూల్ ఇదిగో
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత్ పర్యటనపై క్రీడాభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడు రోజుల 'ద గోట్ టూర్'లో భాగంగా డిసెంబర్ 13న భారత గడ్డపై ఆయన అడుగుపెడతారు. కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ మహా నగరాల్లో మెస్సీ పర్యటిస్తారు. పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొని, ఫ్రెండ్లీ మ్యాచ్లు కూడా ఆడతారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలను ఆయన కలుస్తారు. కోల్కతాలో మొదలు పెట్టి ఢిల్లీలో ఆయన పర్యటన ముగుస్తుంది. మెస్సీతో పాటు రొడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), ఉరుగ్వే లెజండరీ స్టైకర్ లూయిస్ సువాలెజ్ కూడా ఇండియాకు వస్తున్నారు.తమ అభిమాన ఫుట్బాల్ క్రీడాకారులను ప్రత్యక్షంగా చూసేందుకు ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెస్సీని దూరం నుంచి చూడడమే తప్పా దగ్గరకు వెళ్లి ఫొటో తీసుకునే అవకాశం సామాన్యులకు ఉండదు. ఎందుకంటే మెస్సీతో ప్రత్యేకంగా ఫొటో దిగాలంటే దాదాపు 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 100 మందికి మాత్రమే. మెస్సీ రాక కోసం తెలుగు అభిమానులు అమితాసక్తితో వేచివున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అతడు ఆడే మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ మ్యాచ్ వీక్షించాలంటే టిక్కెట్ తప్పనిసరి. వీటి ధరలు రూ.1750 నుంచి రూ.13500 వరకు ఉన్నాయి.మరోవైపు లియోనల్ మెస్సీ (Lionel Messi) షెడ్యూల్పై ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అతడు ఎప్పుడు ఎక్కడికి వెళతాడనే సమాచారం కోసం ఆన్లైన్లో శోధిస్తున్నారు. వారి కోసం మెస్సీ ఫుల్ షెడ్యూల్ను ఇక్కడ ఇస్తున్నాం. మెస్సీ షెడ్యూల్ ఇలా...డిసెంబర్ 13, కోల్కతాఉదయం 1:30: కోల్కతాకు రాకఉదయం 9:30 నుండి 10:30 వరకు: అభిమానులతో ముఖాముఖిఉదయం 10:30 నుండి 11:15 వరకు: మెస్సీ విగ్రహం వర్చువల్గా ప్రారంభోత్సవంఉదయం 11:15 నుండి 11:25 వరకు: యువ భారతికి రాకఉదయం 11:30: షారుఖ్ ఖాన్ యువ భారతికి రాకమధ్యాహ్నం 12:00: సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టేడియానికి రాకమధ్యాహ్నం 12:00 నుండి 12:30 వరకు: ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, సంభాషణమధ్యాహ్నం 2:00: హైదరాబాద్కు బయలుదేరడండిసెంబర్ 13, హైదరాబాద్సాయంత్రం 4: శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాక, తాజ్ ఫలకనుమా ప్యాలెస్కు పయనం, మెస్సీతో మీట్ అండ్ గ్రీట్రాత్రి 7: ఉప్పల్ స్టేడియానికి రాక, అభిమానులకు పలకరింపు, ఫ్రెండ్లీ మ్యాచ్, చిన్నారులకు మెస్సీ ఫుట్బాల్ చిట్నాలు, సన్మానం, రాత్రికి ఫలకనుమా ప్యాలెస్లో బస, మర్నాడు ఉదయం ముంబైకు పయనం.చదవండి: ర్యాంప్పై మెస్సీ నడకడిసెంబర్ 14, ముంబైమధ్యాహ్నం 3:30: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్లో పాల్గొనడంసాయంత్రం 4:00: సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్సాయంత్రం 5:00: వాంఖడే స్టేడియంలో కార్యక్రమం, సెలబ్రిటీలతో ఛారిటీ ఫ్యాషన్ షోడిసెంబర్ 15, న్యూఢిల్లీప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశంమధ్యాహ్నం 1:30 గంటలకు: అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం, మినర్వా అకాడమీ ఆటగాళ్లకు సన్మానం -
దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. శాంసన్కు మరోసారి నో ఛాన్స్!
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈమ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే కటక్లో ఆడిన జట్టునే రెండో టీ20కు కూడా భారత్ కొనసాగించే అవకాశముంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన జితీశ్ శర్మను వికెట్ కీపర్గా కొనసాగించాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. కటక్ టీ20లో ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చిన జితీశ్.. కేవలం 5 బంతుల్లో పది పరుగులు చేశాడు. అతడిని ఫినిషర్గా ఉపయోగించుకోవాలని హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ టాపర్డర్లో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే తప్ప సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టం. ఇక తొలి టీ20లో విఫలమైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఈ మ్యాచ్లో రాణించాల్సిన అవసరముంది. సూర్య గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్కప్-2026కు ముందు అతడి ఫామ్ టీమ్ మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. కనీసం ఈ సిరీస్లో నైనా సూర్య తన రిథమ్ను తిరిగి అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇక తొలి టీ20లో ఘోర ఓటమి చవిచూసిన పలు మార్పులు చేసే అవకాశముంది.తుది జట్లు(అంచనా)భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, ఎన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, కేశవ్ మహారాజ్/జార్జ్ లిండే, లుథో సిపమ్లా. -
సాక్షి టీమ్కు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు
జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేతగా సాక్షి టీవీ నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో టీవీ-9ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సాక్షి.. తొలి జేపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. తుది పోరులో ప్రత్యర్ధి జట్టు నిర్ధేశించిన 92 పరుగుల లక్ష్యాన్ని సాక్షి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఊదిపడేసింది. ఓపెనర్లు చైతన్య(21), రమేశ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 60) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీవీ-9.. 19.4 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. సాక్షి బౌలర్లలో రమేశ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శ్రీనాథ్ రెండు, శ్రీను, అగ్ని ఓ వికెట్ సాధించారు.ఈ ఏడాది సీజన్ను సాక్షి టీవీ అజేయంగా ముగించింది. ఆడిన నాలుగు మ్యాచ్లలోనూ విజయ ఢంకా మోగించింది. ఈ సీజన్ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రమేష్ (190 పరుగులు) ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు కూడా అతడికే లభించింది.సాక్షి టీమ్కు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలుజర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేత అయిన సాక్షి టీవీ జట్టు కు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితెలియజేశారు . క్రీడా స్ఫూర్తితో ఈ లీగ్ లో పాల్గొన్న అన్ని మీడియా సంస్థలను మంత్రి అభినందించారు. నిత్యం వార్తల సేకరణలో ఉంటూ బిజీ షెడ్యూల్ గడిపే జర్నలిస్టు లకు ఇలాంటి క్రీడలు ఉల్లాసాన్నిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో మీడియా మిత్రులకు ఇలాంటి క్రీడలపై ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు. -
ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!
ఐపీఎల్-2026 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలం కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. అయితే ఈసారి వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు అవుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత ఏడాది జెడ్డాలో జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు రిషబ్ పంత్ను భారీ మొత్తం రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర. అయితే ఈసారి కూడా ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్రాంచైజీల వద్ద మొత్తం పర్స్ విలువ రూ. 230 కోట్లకు పైగా ఉంది.పర్స్ బ్యాలెన్స్ అత్యధికం ఏ జట్టుదంటే?ఐపీఎల్-2026 మినీ వేలంలో అత్యధిక పర్స్ వాల్యూ కోల్కతా నైట్రైడర్స్(64.30 కోట్లు) వద్ద ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ (43.40 కోట్లు), సన్రైజర్స్ హైదరాబాద్ (25.50 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 22.95 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ (21.80 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(16.40 కోట్లు), రాజస్థాన్ రాయల్స్(16.05 కోట్లు), గుజరాత్ టైటాన్స్(12.90 కోట్లు), పంజాబ్ కింగ్స్ (11.50 కోట్లు), ముంబై ఇండియన్స్(2.75 కోట్లు) ఉన్నాయి. అత్యధికంగా కేకేఆర్ జట్టులో అత్యధికంగా 13 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అత్యల్పంగా పంజాబ్ కింగ్స్లో నాలుగు స్ధానాల్లో ఖాళీలు ఉన్నాయి.గ్రీన్పై కాసుల వర్షం!ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. గాయం కారణంగా గత సీజన్కు దూరమయ్యాడు. అయితే సాధారణంగా ఆల్-రౌండర్ అయిన గ్రీన్, ఈసారి వేలంలో తన పేరును 'బ్యాటర్ల' విభాగంలో నమోదు చేసుకున్నాడు.దీంతో వేలంలో మొదటి సెట్లలోనే అతడు పేరు వస్తుంది. మొదటిలో ఫ్రాంచైజీల వద పర్స్ మొత్తం ఫుల్గా ఉండడంతో అతడి కోసం పోటీ పడడం ఖాయం. గ్రీన్ను సొంతం చేసుకునేందుకు కోల్కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశముందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.కేకేఆర్ సరైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. గత సీజన్ వరకు జట్టులో ఉన్న ఆండ్రీ రస్సెల్ను కేకేఆర్ విడుదల చేసింది. ఆ తర్వాత అతడు ఏకంగా ఐపీఎల్కే రిటైర్మెంట్ ప్రకటించి కేకేఆర్ పవర్ కోచ్గా ఎంపికయ్యాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని గ్రీన్తో భర్తీ చేయాలని కేకేఆర్ భావిస్తోంది.సీఎస్కే కూడా సామ్ కుర్రాన్ను రాజస్తాన్కు ట్రేడ్ చేయడంతో వారికి కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం. కాబట్టి చెన్నై కూడా అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత రిపోర్ట్లు ప్రకారం.. అతడు వేలంలో రూ. 20 కోట్లకు పైగా ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రీన్ చివరగా ఐపీఎల్ 2024లో ఆర్సీబీ తరపున ఆడాడు. ఆ సీజన్లో 255 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.బిష్ణోయ్ కోసం ఎస్ఆర్హెచ్ స్కెచ్!కామెరూన్ గ్రీన్తో పాటు టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయే ఛాన్స్ ఉంది. గత సీజన్ వరకు లక్నోలో భాగంగా ఉన్న బిష్ణోయ్ను సదరు ఫ్రాంచైజీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో స్పిన్ బౌలర్ల అవసరమున్న ఫ్రాంచైజీల అతడి కోసం పోటీ పడనున్నాయి.ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఎస్ఆర్హెచ్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ ఒకరు లేరు. జీషన్ అన్సారీ ఉన్నప్పటికి అతడికి అంతర్జాతీయ స్దాయిలో అనుభవం లేదు. కాబట్టి బిష్ణోయ్ను తమ జట్టులోకి తీసుకోవాలని కావ్య మారన్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా సీఎస్కే కూడా పోటీ పడే అవకాశముంది. ఎందుకంటే సీఎస్కేలో లెగ్ స్పిన్నర్ ఒక్కరూ కూడా లేదు. జడేజాను సైతం సీఎస్కే వదులుకుంది. మతీషా పతిరానా కోసం కూడా ఎస్ఆర్హెచ్ ప్రయత్నించే ఛాన్స్ ఉంది. మహ్మద్ షమీ స్దానాన్ని అతడితో భర్తీ చేయాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తుందంట.పృథ్వీషాపై సీఎస్కే కన్ను..ఇక గత సీజన్లో అన్సోల్డ్గా మిగిలిపోయిన పృథ్వీ షా.. ఈసారి మాత్రం ఫ్రాంచైజీలను ఆకర్షించే అవకాశం ఉంది. పృథ్వీషా ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ముంబై నుంచి మహారాష్ట్రకు మకాంను మార్చిన పృథ్వీ.. ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. అతడిని సీఎస్కే సొంతం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే అతడితో సీఎస్కే యాజమాన్యం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దూకడైన ఆటకు పృథ్వీ పెట్టింది పేరు.వెంకటేశ్ అయ్యర్కు షాక్ తప్పదా?ఇక కేకేఆర్ మాజీ ఆల్రౌండర్, మధ్యప్రదేశ్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్కు మరోసారి షాక్ తగిలే అవకాశముంది. గత సీజన్లో అయ్యర్ను రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ అయ్యర్ తన ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో అతడిని నైట్రైడర్స్ వేలంలోకి విడిచిపెట్టింది. అయితే అయ్యర్ వేలంలోకి వచ్చినప్పటికి భారీ ధర దక్కే అవకాశం లేదు. ఎందుకంటే అతడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ప్రభావం వేలంపై ఆడే అవకాశముంది. -
అప్పట్లో హైదరాబాద్ ఫుట్బాల్ టీమ్.. ఓ రేంజ్!
ఫుట్బాల్ దిగ్గజం, ఆల్టైమ్ గ్రేట్ లయోనల్ మెస్సీ మన భాగ్యనగరానికి వస్తున్నాడు. ఈ ప్రకటన వచ్చిన నాటి నుంచి అతడి రాకపై పలు రకాలుగా చర్చ.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీతో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. అతడి ఈవెంట్ కోసం భారీ ధరతో టికెట్లున్నా వెనక్కి తగ్గకుండా అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడిపోతున్నారు. శనివారం జరిగే ఈ షో కోసం టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో ఉప్పల్ స్టేడియం హౌస్ఫుల్ కావడం ఖాయం. కానీ మెస్సీ మాయ 3 గంటల్లో ముగిసిపోతుంది. ఆ తర్వాత మన వద్ద అసలైన ఫుట్బాల్ ఏమిటో కనిపిస్తుంది. ఒక అసాధారణ ఆటగాడిపై అభిమానం ఉండటం సరే కానీ.. మన వద్ద ఆటకు ఏమాత్రం ఆదరణ ఉందనేది ఆసక్తికరం. మెస్సీ షో కారణంగా ఇక్కడ మున్ముందు ఏదైనా మార్పు కనిపిస్తుందా అనేది చర్చనీయాంశం. ఎస్ఏ రహీమ్, నయీముద్దీన్, తులసీదాస్ బలరామ్, పీటర్ తంగరాజ్, షాహిద్ వసీమ్, మొహమ్మద్ హబీబ్, షబ్బీర్ అలీ, జుల్ఫికర్ అలీ.. ఒకరా, ఇద్దరా ఎంతో మంది హైదరాబాద్ దిగ్గజాలు భారత ఫుట్బాల్ను సుదీర్ఘ కాలం నడిపించారు. 1950వ, 1960వ దశకాల్లో భారత జట్టు మొత్తం హైదరాబాద్ ఆటగాళ్లతోనే కనిపించేది. మన సిటీ పోలీస్ టీమ్ అంటే దేశంలోని ఏ జట్టుకైనా హడల్. సంతోష్ ట్రోఫీ, డ్యురాండ్ కప్, రోవర్స్ కప్.. టోర్నీ ఏదైనా విజేత హైదరాబాద్ జట్టు మాత్రమే. ఒలింపిక్స్ క్రీడల్లో భారత అత్యుత్తమ ప్రదర్శనగా నాలుగో స్థానం 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో వచ్చింది. ఈ టీమ్లో ఎనిమిది మంది హైదరాబాద్ ఆటగాళ్లు ఉండటం విశేషం.మొత్తంగా 1948 నుంచి చూస్తే మన నగరం నుంచి 14 మంది ఒలింపియన్లు, 21 అంతర్జాతీయ ఫుట్బాలర్లు, 9 మంది కోచ్లు తమ ప్రతిభతో భారత ఫుట్బాల్పై చెరగని ముద్ర వేశారు. ఇదంతా ఘనమైన గతం. 1980వ దశకంలోకి వచ్చేసరికి ఆటలో ఆ కళ తప్పింది. వేర్వేరు కారణాలతో ఆటగాళ్ల ప్రదర్శన స్థాయి పడిపోతూ వచ్చింది. హైదరాబాద్ పోలీస్ టీమ్ కూడా బలహీనంగా మారిపోవడంతో ఫలితాలు రావడం ఆగిపోయాయి. ఆపై బెంగాల్, కేరళ జట్లు ఆటలో పూర్తిగా ఆధిపత్యం సాధించడం మొదలైంది. వీటికి తోడు గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాలు కూడా బలంగా దూసుకొచ్చాయి. మెలమెల్లగా హైదరాబాద్ ఫుట్బాల్ చివరి దశకు వచ్చేసింది. కనీసం ప్రతిభాన్వేషణ లేకపోవడం, టోరీ్నల నిర్వహణ జరగకపోవడంతో సహజంగానే ఇక్కడ ఫుట్బాల్ మరింతగా దిగజారిపోయింది.1962లో ఏషియన్ గేమ్స్లో ఎస్ఏ రహీమ్ జట్టు ఐఎస్ఎల్తో పెరిగిన ఆసక్తి.. దాదాపు రెండు దశాబ్దాల పాటు హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ (Football) నామ్కే వాస్తేగానే నడిచింది. అయితే అదృష్టవశాత్తూ కొత్త తరంలో మళ్లీ ఆటపై కాస్త ఆసక్తి పెరగడంతో పాటు అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ముఖ్యంగా పలు కార్పొరేట్ స్కూల్స్ ఫుట్బాల్ను ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా టీమ్లు తయారు చేసి జాతీయ స్థాయి పోటీల్లో బరిలోకి దించడంతో మళ్లీ హైదరాబాద్ పేరు వినిపించడం మొదలైంది. ప్రతిష్టాత్మక ఐ–లీగ్లో నగరానికి చెందిన ‘శ్రీనిధి’ దక్కన్ ఫుట్బాల్ క్లబ్ సత్తా చాటుతూ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ టీమ్ ఉండటం కూడా ఇక్కడి ఆటకు గుర్తింపు తెచ్చింది. ఈ టీమ్లో నేరుగా స్థానిక ఆటగాళ్లు లేకపోయినా హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) ఇక్కడ అందరిలో ఆసక్తిని పెంచడంలో సఫలమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ఐఎస్ఎల్ మ్యాచ్లకు వచ్చిన ఆదరణే అందుకు నిదర్శనం. దీంతో పాటు పలు ఫుట్బాల్ క్లినిక్లు, క్యాంప్ల ద్వారా హెచ్ఎఫ్సీ యువ ఆటగాళ్లకు మంచి అవకాశాలు కల్పించింది. దురదృష్టవశాత్తూ ఆర్థిక పరమైన కారణాలతో ఐఎస్ఎల్కు హెచ్ఎఫ్సీ దూరమైనా.. అది ఇక్కడ ఉన్నన్నాళ్లు మంచి ప్రభావం చూపగలిగింది.1960 రోమ్ ఒలింపిక్స్లో భారత జట్టు ప్రైవేట్ క్లబ్ల చొరవతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పదే పదే ఫుట్బాల్పై తన ఆసక్తిని ప్రదర్శిస్తున్నా గ్రౌండ్ లెవల్లో పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. తెలంగాణ జట్టు జూనియర్ స్థాయిలో విజయం సాధించి వచ్చి సీఎంను కలిసిన తర్వాత ఆయన ఆటను అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంను ఫుట్బాల్కు కేంద్రంగా మారుస్తామని చెప్పినా.. మైదానం ఎప్పటిలాగే సౌకర్యాల లేమితో కనిపిస్తోంది. జింఖానా మైదానంలో కూడా చాలా పరిమితంగానే ఆడేందుకు అవకాశం లభిస్తోంది. ఏళ్లుగా టోర్నీల నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఇలాంటి స్థితిలో ‘శ్రీనిధి’ యాజమాన్యం ఆటకు అండగా నిలుస్తోంది. అక్కడి మైదానాల్లో ప్రాక్టీస్, టోర్నీల నిర్వహణతో పాటు కుర్రాళ్లకు అవకాశాలు కల్పిస్తూ ఫుట్బాల్ను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ ఫుట్బాల్ సంఘం సొంత డబ్బులతోనే ఆటను రక్షించే ప్రయత్నం చేస్తుండటం సానుకూల అంశం. పాతబస్తీలోని చారిత్రాత్మక అబ్బాస్ క్లబ్, బొల్లారం క్లబ్లతో పాటు కొన్ని పాత క్లబ్లు మాత్రమే ఇంకా ఆటను బతికిస్తున్నాయి. దేశంలో ఎక్కడ టోర్నీ జరిగినా తమ జట్లను పంపి ఆయా క్లబ్కు ఫుట్బాల్తో తమ బంధాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం తలచుకుంటే.. గత ఏడాది సెసెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం ఫుట్బాల్ను ప్రోత్సహిస్తామంటూ ఇంటర్ కాంటినెంటల్ కప్ను నిర్వహించింది. భారత్తో పాటు సిరియా, మారిషస్ జట్లు ఇందులో పాల్గొన్నాయి. టోర్నీ నిర్వహణ సమయంలో కూడా ప్రభుత్వం బాగా హడావిడి, ప్రచారం చేసింది. ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రికి ఈ ఆటపై ఉన్న ఆసక్తి కనిపించింది. కానీ ఒక్కసారి టోర్నీ ముగియగానే అంతా గప్చుప్. ఇప్పుడు మెస్సీ రాకను కూడా ప్రభుత్వం ఒక పెద్ద ప్రచార కార్యక్రమంలా చూస్తోంది. నిజాయితీగా చూస్తే ఈ ప్రైవేట్ కార్యక్రమంతో ఒరిగేదేమీ ఉండదు. మెస్సీ కూడా తన పరిమితుల్లో కొద్దిసేపు స్వల్పంగా పెనాల్టీలు ఆడి ఒక నాలుగు పాస్లు ఇచ్చి మమ అనిపిస్తాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ప్రోగ్రాం మన ఫుట్బాల్ను మార్చేయదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఫుట్బాల్ రాతను మార్చాలనుకుంటే అది అసాధ్యమేమీ కాదు. ఆటను అభివృద్ధి చేయాలంటే ఏర్పాటు చేయాల్సిన మౌలిక సౌకర్యాలు చాలా ఉన్నాయి. ఆపై ప్రతిభను ప్రోత్సహిస్తూ టోర్నీల నిర్వహణ ఒక క్రమంలో జరగాలి. దీనికి చాలా సమయం పడుతుంది. ఒక బృహత్ లక్ష్యంతో పని చేస్తే భారత ఫుట్బాల్లో మరోసారి నాటి హైదరాబాద్ మెరుపులు కనిపిస్తాయి. -
ఐపీఎల్లో బ్యాన్.. కట్ చేస్తే! ఆ ఆటగాడికి కోట్లు కుమ్మరించిన కావ్య మారన్
ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. ఐపీఎల్ బ్యాన్ ఎదుర్కొంటున్న బ్రూక్కు సన్రైజర్స్ ఎలా ఆఫర్ చేసిందా అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి కథనం చదవాల్సిందే.ఇంగ్లండ్కు చెందిన 'ది హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం సన్రైజర్స్ లీడ్స్ (గతంలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్) తమ రిటెన్షన్ పక్రియను మొదలు పెట్టింది. ఈ క్రమంలో సన్రైజర్స్ హ్యారీ బ్రూక్ను ఏకంగా 4,70,000 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 5.62 కోట్లు) వెచ్చించి రిటైన్ చేసుకుంది.పేరు మార్పు..ది హాండ్రెడ్ లీగ్ 2025 సీజన్కు ముందు నార్తరన్ సూపర్చార్జర్స్ ఫ్రాంచైజీలో 49% వాటాను సన్రైజర్స్ హైదరాబాద్ యజమానులైన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. మిగితా 1 శాతం వాటా యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది.కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గత నెలలో నార్తరన్ సూపర్చార్జర్స్ పేరును సన్రైజర్స్ లీడ్స్గా మార్చారు. ఇక బ్రూక్ విషయానికి వస్తే.. 2021 నుంచి సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో ఉన్నాడు. ఆ తర్వాత 2024లో కెప్టెన్గా అతడు ఎంపికయ్యాడు. ఫ్రాంచైజీ తరపున లీడింగ్ రన్స్కోరర్గా బ్రూక్ కొనసాగుతున్నాడు. రాబోయో సీజన్లో కూడా అతడు జట్టును ముందుండి నడిపించనున్నాడు. 'ది హండ్రెడ్' లీగ్ 2026 వేలం వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.ఐపీఎల్ నిషేధంహ్యార్ బ్రూక్ ప్రస్తుతం ఐపీఎల్ నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్-2025 వేలంలో బ్రూక్ను రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ నుంచి తప్పుకొంటున్నట్లు బ్రూక్ తెలిపాడు.అయితే బీసీసీఐ రూల్ ప్రకారం.. సరైన కారణాలు లేకుండా ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి వైదొలిగితే వారిపై నిషేధం పడుతోంది. ఈ క్రమంలోనే బ్రూక్పై బీసీసీఐ వేటు వేసింది. హ్యారీ బ్రూక్ 2028 వేలం వరకు ఐపీఎల్కు దూరంగా ఉండాల్సిందే.చదవండి: BCCI: శుభ్మన్ గిల్కు మరో బిగ్ ప్రమోషన్..! -
BCCI: శుభ్మన్ గిల్కు మరో బిగ్ ప్రమోషన్..!
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు మరో బిగ్ ప్రమోషన్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్దమైంది. 2025/26 సీజన్కు సంబంధించిన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గిల్‘ఏ ప్లస్’ కేటగిరీకి పదోన్నతి పొందే అవకాశం ఉంది.డిసెంబర్ 22న జరగనున్న బీసీసీఐ 31వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆటగాళ్ల కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం గిల్ ప్రమోషన్పై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. గిల్ ప్రస్తుతం గ్రేడ్-ఎలో ఉన్నాడు. అందుకు గాను ప్రతీ ఏటా రూ. 5 కోట్లను జీతంగా అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ‘ఏ ప్లస్’ కేటగిరీలో గిల్కు చోటు దక్కితే ప్రతీ ఏటా ఇకపై రూ.7 కోట్లు వార్షిక వేతనం తీసుకోనున్నాడు. ప్రస్తుతం గ్రేడ్ A+ కేటగిరీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ,రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అయితే రో-కో ద్వయం కేవలం ఒక్క ఫార్మాట్లో ఆడుతుండడంతో వారిని గ్రేడ్-ఎకు డిమోట్ చేసే అవకాశముంది.శుభ్మన్ గిల్ రైజ్శుభ్మన్ గిల్.. అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే భారత జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్లో రోహిత్ శర్మ నుంచి టెస్టు జట్టు పగ్గాలను చేపట్టిన గిల్.. ఇంగ్లండ్ గడ్డపై అదరహో అనిపించాడు. అతడి నాయకత్వంలోని భారత జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో డ్రా చేసింది.ఆ తర్వాత అక్టోబర్లో వన్డే కెప్టెన్గా కూడా గిల్ బాధ్యతలు చేపట్టాడు. అంతేకాకుండా టీ20ల్లో భారత వైస్ కెప్టెన్గా గిల్ ఉన్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత గిల్ను టీమిండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా బీసీసీఐ నియమించనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్పై కన్ను? -
పీసీబీ సంచలన నిర్ణయం.. స్టార్ క్రికెటర్పై సస్పెన్షన్ ఎత్తివేత
అత్యాచార ఆరోపణలతో సస్పెన్షన్కు గురైన పాకిస్తాన్ బ్యాటర్ హైదర్ అలీపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎత్తేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఆడేందుకు అతడికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) ఇచ్చింది. హైదర్ అలీతో పాటు మొత్తం 9 మంది ఆటగాళ్లకు పీసీబీ బుధవారం ఎన్ఓసీలు ఇచ్చింది. పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున 35 టి20లు, మూడు వన్డేలు ఆడిన హైదర్ అలీ... పాకిస్తాన్ షాహీన్స్ జట్టు తరఫున ఇంగ్లండ్లో పర్యటించిన సమయంలో... ఇంగ్లండ్లో పుట్టిన పాకిస్తానీ మహిళ అతడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాంచెస్టర్ పోలీసులు సరైన ఆధారాలు లేని కారణంగా సెప్టెంబర్ 25న ఈ కేసును మూసివేశారు. దీంతో అతడిపై మోపిన ఆరోపణలు అబద్ధం అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో హైదర్ అలీ బీపీఎల్లో ఆడేందుకు అనుమతివ్వాలని పీసీబీని కోరగా... అందుకు బోర్డు అంగీకారం తెలిపింది. హైదర్ అలీతో పాటు మొహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సాహబ్జాదా ఫర్హాన్, ఫహీమ్ అష్రఫ్, హుసేన్ తలత్, ఖ్వాజా నఫా, ఎహెసానుల్లాకు పీసీబీ నిరభ్యంతర పత్రాలు ఇచ్చింది. ఇక సీనియర్ ప్లేయర్ ఉమ్రాన్ అక్మల్ అభ్యర్థనను మాత్రం బోర్డు తిరస్కరించింది.చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్పై కన్ను? -
రోహిత్ తిట్టకపోతేనే బాధపడతా.. నా డ్రీమ్ అదే: జైశ్వాల్
వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న జైశ్వాల్.. సిరీస్ డిసైడర్లో మాత్రం తన సత్తాను చూపించాడు. తొలి వన్డే సెంచరీ మార్క్ను అతడు అందుకున్నాడు.అయితే జైశ్వాల్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించడంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మది కీలక పాత్రంట. ఈ విషయాన్ని జైశ్వాల్ స్వయంగా తనంతట తానే వెల్లడించాడు. రోహిత్ యువ ఆటగాళ్లకు ఎంతో సపోర్ట్గా ఉంటాడని, ఒకవేళ జూనియర్లను మందలించిన అందులో ప్రేమ, ఆప్యాయత ఉంటాయని జైశూ తెలిపాడు.కాగా రోహిత్ శర్మ మైదానంలో జూనియర్లు తప్పు చేస్తే అప్పుడప్పుడు తిడుతూ ఉంటాడు. ఇటువంటి సంఘటనలు చాలా అతడి కెప్టెన్సీలో చాలా చోటు చేసుకున్నాయి. మిస్ ఫీల్డ్ చేసినప్పుడు, బౌలింగ్, బ్యాటింగ్ సరిగ్గా చేయినప్పుడు రోహిత్ తన నోటికి పనిచెప్పే వాడు. కానీ వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరము లేదని ఓ ఇంటర్వ్యూలో జైశ్వాల్ స్పష్టం చేశాడు."రోహిత్ భాయ్ మమ్మల్ని మందలించిన ప్రతిసారి అందులో చాలా ప్రేమ, అప్యాయత ఉంటుంది. నిజానికి రోహిత్ తిట్టక పోతానే ఏం జరిగింది? ఎందుకు మందలించడం లేదు? నేను చేసిన పనికి ఆయన బాధపడ్డాడా? అన్న అభద్రతాభావం ఏర్పడుతుంది.రోహిత్, విరాట్ కోహ్లిలు డ్రెస్సింగ్ రూమ్లో ఉండడం మాలాంటి యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేకూరుతోంది. వారు గేమ్ గురుంచి చర్చిస్తారు. వారి అనుభవాలను పంచుకుంటారు. వారు గతంలో చేసిన తప్పిదాలను మేము చేయకుండా ఉండడానికి సలహాలు ఇస్తారు.రో-కో మాతో ఉంటే మేమంతా రిలాక్స్డ్గా ఉంటాము. వైజాగ్ వన్డేలో రోహిత్ భాయ్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేశాడు. రోహిత్ భాయ్ నన్ను ప్రశాతంగా, సమయం తీసుకోమని సూచించాడు. తానే రిస్క్ తీసుకుంటానని చెప్పాడు. రోహిత్ లాంటి చాలా అరుదుగా ఉంటారు. అదేవిధంగా విరాట్ పాజీ(కోహ్లి) కూడా టార్గెట్ను చిన్న చిన్న లక్ష్యాలగా చేసుకుని చేధించాలని చెప్పారు. ఇక భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది నాకల. అంతేకాకుండా వస్తే భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడానికి కూడా నేను సిద్దంగా ఉన్నానని 'అజెండా ఆజ్ తక్' సదస్సులో జైశ్వాల్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్పై కన్ను? -
కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్పై కన్ను?
ఐపీఎల్-2026 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను మొత్తం పది ఫ్రాంచైజీలు సిద్దం చేసుకుంటున్నాయి.గతేడాది సీజన్లో ఆరోస్ధానానికి పరిమితమైన సన్రైజర్స్ హైదరాబాద్ సైతం వేలంలో చాకచాక్యంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ మినీ ఆక్షన్కు ముందు ఎస్ఆర్హెచ్ దాదాపు తమ కోర్ టీమ్ను అంటిపెట్టుకుంది.అయితే మహ్మద్ షమీ లాంటి కీలక పేసర్ను లక్నోకు సన్రైజర్స్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్-2025లో షమీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ కారణంతోనే అతడిని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు వేలంలో అతడి స్ధానాన్ని మరో ఫ్రంట్ లైన్ సీమర్తో భర్తీ చేయాలని ఎస్ఆర్హెచ్ యోచిస్తోంది.పతిరానపై కన్ను..సన్రైజర్స్ హైదరాబాద్ పర్స్లో 25.50 కోట్లు ఉన్నాయి. కనిష్టంగా ముగ్గురు, గరిష్టంగా పది మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే షమీ స్ధానాన్ని మినీ వేలంలో స్వదేశీ పేసర్తో భర్తీ చేయడం కష్టం. వేలంలో చెప్పుకోదగ్గ స్వదేశీ ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేరు. అందుకే శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరానాపై ఎస్ఆర్హెచ్ కన్నేసినట్లు తెలుస్తోంది. పతిరానా గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ మినీ వేలానికి ముందు అతడిని సీఎస్కే విడిచిపెట్టింది.దీంతో అతడిపై వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది. పతిరానా కోసం అవసరమైతే తమ పర్స్లో ఉన్న సగం మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సన్రైజర్స్ సిద్దమైనట్లు సమాచారం. ఐపీఎల్ పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికి.. సీఎస్కే లెజెండ్ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన పేస్ బౌలింగ్ బ్యాటర్లను కట్టడి చేయగలడు. అంతేకాకుండా ఈ జూనియర్ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు. దీంతో అతడిని ఎలాగైనా కొనుగోలు చేసి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా ఉపయోగించుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితావిదేశీ ఆటగాళ్లు (6): పాట్ కమిన్స్✈️ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్✈️ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్✈️, కమిందు మెండిస్✈️, ఇషాన్ మలింగ✈️, బ్రైడన్ కార్స్✈️.దేశీయ ఆటగాళ్లు (9): అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, స్మరణ్ రవిచంద్రన్, జీషన్ అన్సారీ.SRH విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాఅభినవ్ మనోహర్, ఆడమ్ జంపా✈️, అథర్వ తైడే (వికెట్ కీపర్), రాహుల్ చాహర్, సచిన్ బేబీ, సిమర్జీత్ సింగ్, వియాన్ ముల్డర్✈️.చదవండి: బీసీసీఐ కీలక సమావేశం.. -
బీసీసీఐ కీలక సమావేశం..
టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి... కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కాంట్రాక్ట్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 22న జరగనున్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆటగాళ్ల కాంట్రాక్టులతో పాటు... మహిళల దేశవాళీ క్రికెట్ చెల్లింపుల విషయంలో ప్రధానంగా చర్చ సాగనుంది. మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి ఏజీఎం ఇదే. ఇప్పటి వరకు కోహ్లి, రోహిత్ ‘ఏ ప్లస్’ కేటగిరీలో ఉండగా... ఇప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్లోనే ఆడుతున్న కారణంగా ఈ ఇద్దరినీ అందులో నుంచి తొలగించే అవకాశం ఉంది. కొత్త ‘ఏ ప్లస్’ కాంట్రాక్టు జాబితాలో ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు... టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ చోటు దక్కించుకోనున్నాడు. ఆన్లైన్లో జరగనున్న ఈ ఏజీఎంలో మహిళల దేశవాళీలో టోర్నీల మ్యాచ్ ఫీజులు, అంపైర్లు, రిఫరీల జీతభత్యాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.ఇక బోర్డు డిజిటల్ సొత్తుకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. ప్రస్తుతం మిథున్ మన్హాస్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతుండగా... రఘురామ్ భట్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: జోరు కొనసాగించాలని... -
మెస్సీ@ తాజ్ ఫలక్నుమా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రానున్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాతబస్తీలోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ హోటల్లో బస చేయనున్నారు. అక్కడ నుంచే ఆయన తన బృందంతో కలిసి ఉప్పల్ స్టేడి యానికి వెళ్లి.. సీఎం రేవంత్రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఆపై ప్యాలెస్కు తిరిగి వచ్చి, ఎంపిక చేసిన ప్రముఖులను కలుసుకుంటారని తెలిసింది. శనివారం మెస్సీ పర్యటన నేపథ్యంలోపోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 1894లో నిజాం నిర్మించిన ఫలక్నుమా ప్యాలెస్, 2010లో తాజ్ ఫలక్నుమా హోటల్గా మారింది. 2014 నవంబర్లో సల్మాన్ఖాన్ సోదరి అరి్పత ఖాన్ వివాహం ఇందులోనే జరిగింది. 2017 నవంబర్లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు తాజ్ ఫలక్నుమాలోనే విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మెస్సీ కూడా అందులోనే బస చేయనుండటంతో ఈ ప్యాలెస్ పేరు అంతర్జాతీయ స్పోర్ట్స్ సర్కిళ్లలోనూ మారుమోగనుంది. శనివారమే హైదరాబాద్ రానున్న మెస్సీ, ఆయన టీమ్ నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి తాజ్ ఫలక్నుమా హోటల్కు వెళ్లి బస చేస్తుంది. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ బృందం తిరిగి నేరుగా హోటల్కే వెళుతుందని సమాచారం. శనివారం రాత్రి ఫలక్నుమా ప్యాలెస్లోనే బస చేసే మెస్సీ, ఆదివారం అక్కడ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి తిరుగు ప్రయాణమవుతారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆయన పర్యటనలో మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. హైదరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, జి.సుదీర్బాబులతో పాటు నగర ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్లు మెస్సీ పర్యటనలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఓ పక్క మెస్సీతో పాటు ఆయన బృందం, మరోపక్క సీఎం రేవంత్రెడ్డి సహా ఇతర ప్రముఖులు స్టేడియం వద్దకు రావడానికి, తిరిగి వెళ్లడానికి రూట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఓ సవాల్గా తీసుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. పాస్లు, టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియం పరిసరాల్లోకి అనుమతించనున్నారు. -
జోరు కొనసాగించాలని...
ముల్లాన్పూర్: సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఐదు మ్యాచ్ల సిరీస్లో శుభారంభం చేసిన భారత క్రికెట్ జట్టు... గురువారం దక్షిణాఫ్రికాతో రెండో టి20 ఆడనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా మరో తొమ్మిది మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. ఇందులోనే జట్టు బలాబలాలు, కూర్పును సరిచూసుకోవాలని భావిస్తున్న టీమ్ మేనేజ్మెంట్ కటక్లో ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్ బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్లో బంతి కాస్త ఆగి వస్తున్న పిచ్పై మన టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ధనాధన్ ఆటతో మంచి స్కోరు చేసిన టీమిండియా... కట్టుదిట్టమైన బౌలింగ్తో మెరిపించింది. దక్షిణాఫ్రికా టి20 చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుందంటే... అందులో మన బౌలర్ల ప్రతిభ ఎంతో ఉంది.ఇప్పుడు అదే జోరు సాగిస్తూ రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్లో మరింత ఆధిక్యం సాధించాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ భావిస్తుండగా... తొలి మ్యాచ్లో తేలిపోయిన దక్షిణాఫ్రికా ఈ పోరులో సత్తా చాటి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. టాపార్డర్ రాణించేనా! పిచ్, ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూకుడే పరమావధిగా దూసుకెళ్తున్న భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై అందరి దృష్టి నిలవనుంది. ముల్లాన్పూర్లో మంచి అనుభవం ఉన్న ఈ పంజాబ్ చిన్నోడు సొంతగడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో సిక్స్ల వర్షం కురిపించిన అభిõÙక్... అదే పరాక్రమం కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక భారత వన్డే, టెస్టు రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గత మ్యాచ్లో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండగా... మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కీలకం కానున్నారు. పరిస్థితులను బట్టి గేర్లు మార్చే సత్తా వీరిలో పుష్కలం. ఇక గాయం నుంచి కోలుకొని గత మ్యాచ్ ద్వారా పునరాగమనం చేసిన పాండ్యా... తన విలువ ఏంటో చాటుకున్నాడు. అటు బంతితో ఇటు బ్యాట్తో విజృంభించిన హార్దిక్ నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి ప్రదర్శన ఆశిస్తోంది. శివమ్ దూబే, జితేశ్ శర్మ ఫినిషర్ల బాధ్యత నిర్తర్తించనున్నారు. గత మ్యాచ్ ద్వారానే మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డు సృష్టించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్లో కీలకం కానున్నారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. మార్పుల్లేకుండా సఫారీ జట్టు... స్టార్లతో నిండి ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కటక్ పిచ్పై ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకొని రెండో మ్యాచ్లో పూర్తిస్థాయిలో దుమ్మురేపాలని సఫారీలు భావిస్తున్నారు. డికాక్, మార్క్రమ్, స్టబ్స్, బ్రేవిస్, మిల్లర్, యాన్సెన్ రూపంలో ఆ జట్టులో ప్రతిభకు కొదవ లేకపోవడంతో తొలి మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. తొలి స్పెల్లో అర్ష్ దీప్ కట్టిపడేయడంతో వెనుకంజలో పడ్డ సఫారీలు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. దీంతో అతడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ‘ప్రొటీస్’ కసరత్తులు ప్రారంభించారు. ఇక మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు పరుగుల వేగాన్ని నియంత్రిస్తుండటంతో... దానికి విరుగుడు కనిపెట్టాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఓపెనర్లు, మార్క్రమ్, డికాక్లో ఒకరు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే... మిగిలిన వాళ్లు ధనాధన్ షాట్లతో స్కోరు వేగం పెంచగల సమర్థులే. బౌలింగ్లో ఎంగిడి, నోర్జే, యాన్సెన్ మరోసారి కీలకం కానున్నారు. తొలి మ్యాచ్లో ఎంగిడి భారత టాపార్డర్ పని పట్టాడు. ఊరించే బంతులతో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి అతడిని జాగ్రత్తగా ఎదుర్కోక తప్పదు. యాన్సెన్ వికెట్లు తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇచ్చాడు. ఎటొచ్చి సఫారీ స్పిన్నర్లనే మనవాళ్లు మరోసారి టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ పురుషుల మ్యాచ్. గతంలో ఐపీఎల్ మ్యాచ్లతో పాటు... రెండు మహిళల మ్యాచ్లకు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. పిచ్ అటు బ్యాటర్లతో పాటు ఇటు పేసర్లకు సహకరించనుంది. మంచు ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చు. -
యువ భారత్కు కాంస్యం
చెన్నై: సొంతగడ్డపై జరిగిన పురుషుల జూనియర్ అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన కాంస్య పతక మ్యాచ్లో రోహిత్ సారథ్యంలోని యువ భారత జట్టు 4–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున అంకిత్ పాల్ (49వ నిమిషంలో), మన్మీత్ సింగ్ (52వ నిమిషంలో), శార్దానంద్ తివారి (57వ నిమిషంలో), అన్మోల్ ఎక్కా (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. అర్జెంటీనా జట్టుకు నికోలస్ రోడ్రిగెజ్ (3వ నిమిషంలో), సాంటియాగో ఫెర్నాండెజ్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఒకదశలో 0–2తో వెనుకబడి ఓటమి వైపు పయనిస్తున్న యువ భారత జట్టు చివరి 11 నిమిషాల్లో ఒక్కసారిగా విజృంభించింది. ఏకంగా నాలుగు గోల్స్ చేసి అద్భుత విజయాన్ని సాధించింది. భారత్ చేసిన నాలుగు గోల్స్లో మూడు పెనాల్టీ కార్నర్ల ద్వారా, ఒకటి పెనాల్టీ స్ట్రోక్ ద్వారా రావడం విశేషం. మ్యాచ్ మొత్తంలో భారత్కు ఏడు పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్... అర్జెంటీనా జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించాయి. 46 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత జట్టు కాంస్య పతకం సాధించడం ఇదే తొలిసారి. 2001లో, 2016లో విజేతగా... 1997లో రన్నరప్గా నిలిచిన భారత్ 2005, 2021, 2023లలో కాంస్య పతక మ్యాచ్ల్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. నాలుగో ప్రయత్నంలో భారత జట్టు కాంస్య పతక మ్యాచ్లో నెగ్గడం విశేషం.ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 5 లక్షలు... కోచింగ్ బృందంలోని వారికి రూ. 2 లక్షల 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. జర్మనీ 8వ సారి... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ‘షూటౌట్’కు దారితీసిన ఫైనల్లో జర్మనీ 3–2 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టును ఓడించి ఎనిమిదోసారి టైటిల్ను సొంతం చేసుకుంది. గతంలో జర్మనీ 1982, 1985, 1989, 1993, 2009, 2013, 2023లలో కూడా విజేతగా నిలిచింది. -
క్రికెట్ తర్వాతే ఏదైనా: స్మృతి
న్యూఢిల్లీ: తన జీవితంలో క్రికెట్ కంటే ఇష్టమైనది మరొకటి లేదని భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్లో పాల్గొన్న సందర్భంగా స్మృతి మాట్లాడుతూ ... ‘నేను క్రికెట్ కంటే ఎక్కువ ప్రేమించే విషయం ప్రపంచంలో మరొకటి లేదు. భారత జెర్సీ వేసుకోవడం కన్నా పెద్ద గౌరవం ఏం ఉంటుంది. అది నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. సమస్యలన్నీ పక్కనపెట్టి లక్ష్యంపై దృష్టి సారించేందుకు ఉపకరిస్తుంది. చిన్నప్పుడు బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి నా మదిలో ఎప్పుడూ ప్రపంచ చాంపియన్గా ఎదగాలనే కోరిక ఉండేది. అది ఇటీవల నిజమైంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ నెగ్గడం మా జీవితంలో అతిగొప్ప క్షణం. ట్రోఫీ హస్తగతం అయిన సమయంలో కన్నీళ్లు ఆగలేదు’ అని స్మృతి వివరించింది. -
రోహిత్ వెనకాలే కోహ్లి
దుబాయ్: ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేసిరీస్లో దంచికొట్టిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్సెంచరీతో 302 పరుగులు చేసిన 37 ఏళ్ల కోహ్లి... తాజా ర్యాంకింగ్స్లో 773 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్కు చేరాడు. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ 781 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరి మధ్య 8 పాయింట్ల అంతరమే ఉంది. గాయం కారణంగా సఫారీలతో సిరీస్కు దూరమైన శుబ్మన్ గిల్ (723 పాయింట్లు) ఐదో ర్యాంక్లో ఉండగా... కేఎల్ రాహుల్ (649 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 12వ ర్యాంక్లో నిలిచాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ కుల్దీప్ (655 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్లో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (710 పాయింట్లు) ‘టాప్’లో కొనసాగుతున్నాడు. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ (913 పాయింట్లు), బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి (782 పాయింట్లు) అగ్రస్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా (879 పాయింట్లు) ‘టాప్’లో ఉండగా... యాషెస్ సిరీస్లో విజృంభిస్తున్న మిచెల్ స్టార్క్ (852 పాయింట్లు) మూడో స్థానాలు మెరుగు పరుచుకొని మూడో ర్యాంక్కు చేరుకున్నాడు. -
‘షూటౌట్’లో భారత్దే పైచేయి
సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు 9–10 స్థానాల కోసం పోటీపడనుంది. నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైన జ్యోతి సింగ్ బృందం వర్గీకరణ మ్యాచ్ల్లో రాణిస్తోంది. వేల్స్తో జరిగిన మ్యాచ్లో 3–1 గోల్స్ తేడాతో నెగ్గిన టీమిండియా... ఉరుగ్వేతో జరిగిన మరో వర్గీకరణ మ్యాచ్లో మాత్రం ‘షూటౌట్’లో విజయాన్ని అందుకుంది. నిర్ణీత సమయంలోనే గెలవాల్సిన భారత జట్టు మ్యాచ్ చివరి నిమిషంలో గోల్ సమర్పించుకొని ఆటను ‘షూటౌట్’ వరకు తీసుకెళ్లింది. మ్యాచ్ 19వ నిమిషంలో మనీషా చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 60వ నిమిషం వరకు ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి సెకన్లలో ఉరుగ్వేకు గోల్ ఇచ్చింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. ‘షూటౌట్’లో భారత్ తరఫున పూర్ణిమ యాదవ్, ఇషిక, కనిక సివాచ్ వరుసగా మూడు గోల్స్ చేశారు. మరోవైపు ఉరుగ్వే తరఫున తొలి షాట్ను అగస్టీనా గోల్గా మలచగా... జస్టినా రెండో షాట్ను.. సోల్ మార్టినెజ్ తీసుకున్న మూడో షాట్ను... సోల్ మిస్కా కొట్టిన నాలుగో షాట్ను భారత గోల్కీపర్ నిధి అడ్డుకుంది. దాంతో భారత్ నాలుగో షాట్ను తీసుకోకుండానే విజయాన్ని ఖరారు చేసుకుంది. 9–10వ స్థానాల కోసం స్పెయిన్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరోవైపు క్వార్టర్ ఫైనల్స్లో నెదర్లాండ్స్ 8–2తో ఇంగ్లండ్పై, బెల్జియం 4–1తో అమెరికాపై, చైనా 5–3తో ఆ్రస్టేలియాపై, అర్జెంటీనా 2–1తో జర్మనీపై గెలుపొంది సెమీఫైనల్లోకి అడుగు పెట్టాయి. సెమీఫైనల్స్లో బెల్జియంతో నెదర్లాండ్స్; చైనాతో అర్జెంటీనా పోటీపడతాయి. -
ఆ చూపు ప్రపంచంకప్పు దాకా..
కూతురు అంధురాలుగా పుడితే వదిలి వెళ్లిపోయే తండ్రి ఉండొచ్చుగాని తల్లి ఉండదు. అస్సాం అంధ క్రికెటర్ సిము దాస్ని తల్లి అంజు దాస్ ఒక్కతే ఎన్నో కష్టాలతో పెంచింది. ఫలితంగా ఇవాళ కూతురు భారత జట్టు తరఫున ప్రపంచ కప్పు సాధించిన విజేతగా నిలిచింది. ఆమెకు అస్సాం ప్రభుత్వం 10 లక్షల నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఇదంతా ఆ తల్లి ఓర్పుకు దొరికిన ప్రతిఫలం.నవంబర్ 23, ఆదివారం రోజు అంజు దాస్ ఎప్పట్లాగే పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమె అస్సాంలోని నగావ్ జిల్లా కొతియటోలి అనే పల్లెలో వంట మనిషిగా, పని మనిషిగా జీవిస్తోంది. ఇల్లు మరికాస్త దూరంలో ఉందనగా ఊళ్లో ఉన్న కుర్రాళ్లంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు ఎదురు వచ్చారు. ‘అక్కా. నీ కూతురు సాధించింది. మనం వరల్డ్ కప్ గెలిచాం’ అని మెచ్చుకోలుగా వాళ్లు మాట్లాడుతుంటే అంజుదాస్ కళ్ల నుంచి ధారాపాతంగా ఆనందబాష్పాలు రాలిపడ్డాయి.→ ఆమె కూతురు విజేతఅంధ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి మొట్ట మొదటిసారి ‘టి 20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ విమెన్’ను కొలంబోలో నవంబర్ 11 నుంచి 23 తేదీల మధ్య నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా సహా మన పొరుగున ఉన్న దేశాలతో కలిపి మొత్తం ఆరు దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా జట్టు అప్రతిహతంగా సాగి ఫైనల్స్లో నేపాల్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ జట్టులో అంజుదాస్ కూతురు సిము దాస్ ఉంది. ఇండియా గెలవడానికి టోర్నమెంట్లో మొత్తం 68 విలువైన పరుగులు చేసింది. అస్సాం మారుమూల పల్లెలో నిలువ నీడ లేని కుటుంబం నుంచి కేవలం తల్లి అందించిన ప్రోత్సాహంతో సిము దాస్ ఈ అద్భుతం సాధించింది. ఆ ప్రయాణం అంతా గుర్తుకొచ్చి అంజుదాస్ కళ్లు వర్షించాయి.→ ప్రధానే స్పందించారుఅంధ మహిళల జట్టు సభ్యులు వరల్డ్ కప్తో ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆ తర్వాత అస్సాంకు సిము దాస్ చేరుకుంటే ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆ వెంటనే ఒక తెల్లవారు జామున ప్రధాని నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ వచ్చింది. ‘నువ్వు సిము దాస్ను కలిశావా’ అని ప్రధాని అడిగారు. ‘వెంటనే కలిసి ఆమెకు కావాల్సిన సాయం చేయి’ అన్నారు. అప్పటికి బిశ్వ శర్మకు సిము దాస్ గురించి తెలియదు. ఆగమేఘాల మీద తెలుసుకుని ఆమెకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. అస్సాం గవర్నర్ ఆమెను తన నివాసానికి ఆహ్వానించి మరో లక్ష రూపాయల నజరానా ఇచ్చారు. ఇన్ని ప్రశంసలు సిము దాస్ గెలుపుకు. కాదు కాదు ఆమె తల్లి గెలుపునకు.→ తండ్రి పారిపోతే...అంజుదాస్కు వివాహం అయ్యాక మొదట కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంధుడే కాదు బధిరుడు కూడా. రెండవసారి కుమార్తె పూర్తి అంధత్వంతో పుట్టింది. కూతురు అంధత్వ వార్త విన్న వెంటనే భర్త మొత్తం కుటుంబాన్ని వదిలేసి పారిపోయాడు. వాళ్లకు ఇల్లు కూడా లేదు. ఊరిపెద్ద తన పొలంలో చిన్న గుడిసె వేసుకోమన్నాడు. ఆరోజు నుంచి నేటి వరకూ వాళ్లు ఆ గుడిసెలోనే ఉన్నారు. ఊరి ఉపాధ్యాయుడు సిమును చదివించమని సూచించడంతో తల్లి ధైర్యం చేసి గువహతిలో అంధ బాలికల స్కూల్లో చేర్చించింది. అక్కణ్ణుంచి సిము ఢిల్లీ వరకూ వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. 2022లో క్రికెట్లో ప్రవేశించిన వెంటనే ప్రతిభ చూపుతూ జాతీయ జట్టుకు ఎంపికై ట్వంటీ ట్వంటీ కప్ గెలుపులో కీలకపాత్ర పోషించింది.→ అమ్మ లేకపోతే...‘అమ్మ లేకపోతే నేను లేను. ఆమె తన జీవితం మొత్తం పోరాడుతూనే ఉంది. నేటికీ మా అన్నయ్యకు ఆమె సేవలు చేస్తోంది. మా కోసమే ఆమె బతికింది. నేను ఆమె కోసమే గెలిచాను. ఇంకా ఆడతాను. మా అమ్మను సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక’ అంది సిము దాస్. -
భారతదేశంలో ‘ఫినో’ టెకిలా ఆవిష్కరణ
క్రికెట్ మైదానంలో తన దూకుడు బ్యాటింగ్తో ఆకట్టుకున్న ‘సిక్సర్ కింగ్’ యువరాజ్ సింగ్ ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్నారు. తన అల్ట్రా-ప్రీమియం టెకిలా బ్రాండ్ ‘ఫినో(Fino)’ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేయడం ద్వారా స్పిరిట్ విభాగంలోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ స్పిరిట్ ఇప్పటికే అభిమానులు, విలాసవంతమైన పానీయాల ప్రియులను ఆకర్షించినట్లు కంపెనీ తెలిపింది.యువరాజ్ సింగ్ భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ బ్రాండ్ను ప్రారంభించారు. ఫినో నాలుగు అల్ట్రా-ప్రీమియం టెకిలా వేరియంట్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రతి బాటిల్ ధర రూ.10,000 కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. భారతదేశంలో సగటు నెలవారీ జీతం రూ.25,000 నుంచి రూ.32,000 మధ్య ఉన్నందున చాలా మంది వినియోగదారులు కేవలం ఒక బాటిల్ టెకిలా కోసం దాదాపు ఒక నెల ఆదాయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఈ అత్యధిక ధర ఈ బ్రాండ్ను కేవలం లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్కే పరిమితం చేసింది. ఫినో స్పిరిట్లను 100% బ్లూ వెబర్ అగావే నుంచి రూపొందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ -
కోహ్లి ఒక్కడే మిస్ అయ్యాడు.. మిగతా ముగ్గురూ..!
ఐసీసీ తాజాగా (డిసెంబర్ 10) విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆసీస్, ఇంగ్లండ్ ప్లేయర్ల హవా కొనసాగింది. తాజాగా ఇరు జట్ల మధ్య యాషెస్ రెండో టెస్ట్ (పింక్ బాల్) జరగడమే ఇందుకు కారణం. ఆ టెస్ట్లో 8 వికెట్లతో చెలరేగిన ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ ఏకంగా మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. అదే మ్యాచ్లో బ్యాటింగ్లో ఇరగదీసిన ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అగ్రపీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.ఇదే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఓ మోస్తరు ప్రదర్శనలు చేసిన ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్ వికెట్కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ ఓ స్థానం మెరుగుపర్చుకొని 17వ స్థానానికి చేరాడు. టాప్-10లో ఉండిన ఆసీస్, ఇంగ్లండ్ బ్యాటర్లలో ట్రవిస్ హెడ్, హ్యారీ బ్రూక్ తలో రెండు స్థానాలు కోల్పోయి 4, 7 స్థానాలకు పడిపోయారు.తాజాగా విండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించిన కేన్ విలియమ్సన్ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లెక్కన చూస్తే.. టెస్ట్ల్లో ఫాబ్-4గా పిలువబడే వారిలో విరాట్ కోహ్లి మినహా మిగతా ముగ్గురు టాప్-3లో (రూట్, కేన్, స్టీవ్) ఉన్నారు. విరాట్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ర్యాంకింగ్స్లో అతని పేరే లేదు.ఈ వారం బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారీగా లబ్ది పొందిన వారిలో రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, జాక్ క్రాలే, షాయ్ హోప్, జస్టిన్ గ్రీవ్స్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. విండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రచిన్, లాథమ్ భారీ సెంచరీలతో కదంతొక్కి 15, 34 స్థానాలకు ఎగబాకగా.. ఆదే మ్యాచ్లో సెంచరీ, డబుల్ సెంచరీతో చెలరేగిన హోప్, గ్రీవ్స్ 48, 60 స్థానాలకు ఎగబాకారు.ఇంగ్లండ్తో రెండో యాషెస్ టెస్ట్లో బ్యాట్తోనూ రాణించిన మిచెల్ స్టార్క్ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకగా.. అదే మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించిన జాక్ క్రాలే 6 స్థానాలు మెరుగుపర్చుకొని 45వ స్థానానికి ఎగబాకాడు.బౌలింగ్ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్లో స్టార్క్తో (3 స్థానాలు ఎగబాకి) పాటు కీమర్ రోచ్ (5 స్థానాలు ఎగబాకి), బ్రైడన్ కార్స్ (4 స్థానాలు ఎగబాకి), జకరీ ఫౌల్క్స్ (9 స్థానాలు ఎగబాకి) లబ్ది పొందారు. అత్యుత్తంగా న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ 76 స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరాడు. టాప్-2 బౌలర్లుగా బుమ్రా, మ్యాట్ హెన్రీ కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, జడేజా, కుల్దీప్ వరుసగా 12 నుంచి 14 స్థానాల్లో ఉన్నారు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా, జన్సెన్, స్టోక్స్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో ఇద్దరు భారత ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్య తలో స్థానం మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు. -
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడిని ఔట్ చేసే అవకాశం ఉన్నా ప్రత్యర్ధి ఆటగాడు ఔట్ చేయకుండా వదిలేశాడు. దీనికి కారణం ఏంటంటే.. సదరు ఆటగాడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్కీపర్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా వదిలేశాడు.విషయాన్ని అర్దం చేసుకున్న బ్యాటర్ తరఫున టీమ్, మరో బంతి చూసి ఆ ఆటగాడిని రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పిలిపించుకుంది. క్రికెట్ చరిత్రలో అరుదుగా జరిగే ఇలాంటి ఘటన ప్రస్తుతం జరుగుతున్న ఇంట్నేషనల్ టీ20 లీగ్-2025లో జరిగింది.A RARE INCIDENT IN CRICKET 🤯- Batter was struggling in the ILT20, so Nicholas Pooran decided not to get him out when he had the opportunity for a stumping. pic.twitter.com/x2Ikca0VnL— Johns. (@CricCrazyJohns) December 10, 2025ఈ లీగ్లో భాగంగా నిన్న (డిసెంబర్ 9) డెజర్ట్ వైపర్స్-ఎంఐ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వైపర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్ హోల్డన్ పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్కీపర్ నికోలస్ పూరన్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా హోల్డన్ను ఔట్ చేయలేదు. బంతిని కనెక్ట్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న హోల్డన్ మరికొద్ది సేపు క్రీజ్లో ఉంటే బంతులు వృధా చేయించవచ్చన్నది అతని ప్లాన్.అయితే పూరన్ ప్లాన్ను పసిగట్టిన వైపర్స్ కెప్టెన్ ఫెర్గూసన్ హోల్డన్ను రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పిలిపించుకున్నాడు. ఈ తతంగం ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జరిగింది. అప్పటికి వైపర్స్ స్కోర్ (118/1) చాలా తక్కువగా ఉండింది. హోల్డన్ క్రీజ్ను వీడాక కాస్త పుంజుకున్న వైపర్స్ స్కోర్ అంతిమంగా 159 పరుగులకు చేరింది.ఈ స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఎంఐ ఎమిరేట్స్ తడబడింది. ఓ దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ఈ జట్టు ఒకే ఓవర్లో (19) మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై పరాజయంపాలైంది. ఆఖరి ఓవర్లో గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో అర్వింద్ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే అర్వింద్ డైరెక్ట్ త్రోతో ఘజన్ఫర్ను రనౌట్ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. 19వ ఓవర్లో 3 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్ పేన్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
మీడియా క్రికెట్లో దూసుకుపోతున్న సాక్షి టీమ్.. ఫైనల్లో టీవీ9తో అమీతుమీ
జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ పోటీలు గత నాలుగు రోజులుగా హైదరాబాద్లో సందడిగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో సాక్షి టీమ్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తొలి రోజు బిగ్ టీవీతో జరిగిన నాకౌట్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతో విజయదుందుబి మోగించారు.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బిగ్ టీవీ టీమ్.. 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా సాక్షి టీమ్ కేవలం 12.5 ఓవర్లలో రెండే వికెట్లో కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాక్షి టీమ్కు చెందిన సతీష్ 48 పరుగులు చేయగా.. రమేష్ 47 పరుగులు చేసి సత్తా చాటారు. ఈ విజయంతో సాక్షి సెమీస్లోకి అడుగు పెట్టింది.బుధవారం జరిగిన సెమీస్లో సాక్షి టీమ్ మరోసారి సత్తా చాటింది. వీ6తో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే విజయం సాధించి విజయపరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వీ6ను సాక్షి 104 పరుగులకు కట్టడి చేసింది. సాక్షి బౌలర్లలో రామకృష్ణ, అనిల్, రమేష్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 2 వికెట్లు తీశారు.అనంతరం చేధనకు దిగిన సాక్షి టీమ్ కేవలం 12.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. రమేష్ 83 పరుగులు చేసి ఒంటిచేత్తో సాక్షిని గెలిపించాడు. బౌలింగ్లోనూ 2 వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ గెలుపుతో సాక్షి టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగే ఫైనల్లో సాక్షి టీమ్ టీవీ9తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
క్రికెట్ చరిత్రలో కవలలు.. మరో కొత్త జోడీ
క్రికెట్ చరిత్రలో చాలామంది అన్నదమ్ములున్నారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే కవలలు ఉన్నారు. పురుషుల క్రికెట్లో కవలలు అనగానే ముందుగా గుర్తొచ్చేది వా బ్రదర్స్ (స్టీవ్-మార్క్). వీరిద్దరు ఆస్ట్రేలియా తరఫున కలిసి 108 టెస్ట్లు, 214 వన్డేలు ఆడారు. ఇందులో 35000కు పైగా పరుగులు చేశారు.పురుషుల క్రికెట్లో మరో ట్విన్స్ జోడీ జేమ్స్ మరియు హేమిష్ మార్షల్. వీర్దిదరు న్యూజిలాండ్ తరఫున కొన్నేళ్ల పాటు టెస్ట్, వన్డే క్రికెట్ కలిసి ఆడారు. వీరిద్దరు కూడా వా సోదరుల మాదిరే కుడి చేతి వాటం బ్యాటర్లు. వీరిద్దరిలో తేడాను కనుక్కోవడం చాలా కష్టం.ఇటీవలికాలంలో కనిపిస్తున్న మరో కవలల జోడీ ఓవర్టన్ బ్రదర్స్ (క్రెయిగ్-జేమీ). జేమీ మరియు క్రెయిగ్ ఓవర్టన్ కలిసి ఇంగ్లండ్ తరఫున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడారు. వీరిద్దరు వా, మార్షల్ సోదరులలాగే ఒకే స్టయిల్ కలిగి ఉన్నారు. జేమీ, క్రెయిగ్ ఇద్దరూ ఫాస్ట్ బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్లు. వీరిద్దరిలో తేడా కనిపెట్టడం చాలా కష్టం. పురుషుల క్రికెట్ తొలినాళ్లలో మరో ట్విన్స్ జోడీ ఉండింది. వారి పేర్లు అలెక్, ఎరిక్ బెడ్సర్. ఈ ఇద్దరు కవలలు 1946-1955 మధ్యలో ఇంగ్లండ్లో వివిధ స్థాయిల పోటీల్లో పాల్గొన్నారు. అలెక్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సైతం ఆడగా.. ఎరిక్ దేశవాలీ పోటీలకే పరిమితమయ్యాడు.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ మరియు కేట్ బ్లాక్వెల్ కవలలు. ఈ ఇద్దరూ కలిసి ఆడారు. అలెక్స్ ఆసీస్ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించింది.మహిళల క్రికెట్లో మరో కవలల జోడీ ఉంది. ఈ జోడీ కూడా ఆస్ట్రేలియాకే చెందింది కావడం విశేషం. ఇక్కడ మరో విశేషమేమిటంటే వీరు ట్విన్స్ కాదు. ట్రిప్లెట్స్ (ముగ్గురు). ఫెర్నీ, ఇరేన్, ఎస్సీ షెవిల్ అనే ఈ ముగ్గురు 20వ శతాబ్దం ఆరంభంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించారు.ప్రస్తుతం క్రికెట్కు సంబంధించి ట్వన్స్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. పురుషుల జింబాబ్వే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు కవలలు ఎంపికయ్యారు. వీరిద్దరూ అదే దేశానికి చెందిన మాజీ ఆటగాడు ఆండీ బ్లిగ్నాట్ కుమారులు కావడం మరో విశేషం.బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానమే మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ. ఈ ఇద్దరు త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది మంది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి. -
జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు
జింబాబ్వే క్రికెట్ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, గై విటల్-ఆండీ విటల్, గావిన్ రెన్నీ-జాన్ రెన్నీ, పాల్ స్ట్రాంగ్-బ్రియాన్ స్ట్రాంగ్ లాంటి జోడీలు జింబాబ్వే క్రికెట్ ఉన్నతికి దోహదపడ్డాయి.తాజాగా మరో కవలల జోడీ జింబాబ్వే జట్టుకు ఎంపికైంది. ఈ జోడీ అండర్-19 ప్రపంచకప్ ఆడే జింబాబ్వే జట్టులో స్థానం సంపాధించింది. ఈ ట్విన్ బ్రదర్స్ గతంలో జింబాబ్వే సీనియర్ జట్టుకు ఆడిన ఆండీ బ్లిగ్నాట్ కొడుకులు కావడం విశేషం. బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానం మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.కాగా, అండర్ 19 ప్రపంచకప్ 16వ ఎడిషన్కు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జింబాబ్వే చాలా ముందుగానే జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు కెప్టెన్గా యువ పేసర్ సింబరాషే ముడ్జెంగెరె నియమితులయ్యాడు. 2024 U19 వరల్డ్కప్ ఆడిన బ్యాట్స్మన్ నాథనియెల్ హ్లాబంగానా కూడా జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది.జింబాబ్వే U19 వరల్డ్కప్ 2026 జట్టు సింబరాషే ముడ్జెంగెరె (c), కియన్ బ్లిగ్నాట్, మైఖేల్ బ్లిగ్నాట్, లీరోయ్ చివౌలా, టటెండా చిముగోరో, బ్రెండన్ సెంజెరె, నాథనియెల్ హ్లాబంగానా, టకుడ్జ్వా మకోని, పానాషే మజాయి, వెబ్స్టర్ మధిధి, షెల్టన్ మజ్విటోరెరా, కుపక్వాషే మురాడ్జి, బ్రాండన్ న్డివేని, ధ్రువ్ పటేల్, బెన్నీ జూజే -
నైతిక విలువలు పాతరేస్తున్నారు
ఒకప్పుడు ప్రేమ.. పెళ్లి.. అత్యంత వ్యక్తిగత విషయాలుగా ఉండేవి. అయితే, ఇప్పుడు సెలబ్రిటీలు మొదలు సాధారణ వ్యక్తులూ తమ జీవితంలోని అతి ముఖ్యమైన ఈ రెండు విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ఫాలోవర్లు, అభిమానులను కూడా తమ సంతోషంలో భాగం చేయాలనే ఉద్దేశంతో కొందరు.. హోదాను, రిలేషన్షిప్ స్టేటస్ను చాటి చెప్పుకొనేందుకు మరి కొంతమంది ఇలాంటి పోకడలకు పోతున్నారు.అయితే, నెట్టింట ఇందుకు సానుకూల కామెంట్ల కంటే.. ప్రతికూల, చెత్త కామెంట్లే ఎక్కువసార్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలపై శ్రుతిమించిన స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా- ఆపై రద్దు నేపథ్యంలో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ ఇందుకు నిదర్శనం.కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ..ఆరేళ్లుగా వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. హల్ది, సంగీత్, మెహందీ అంటూ స్మృతి- పలాష్ ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. సహచర ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తదితరులు కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ, అతడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.‘ప్రైవేటు సంభాషణ’ బహిర్గతంఅయితే, అనూహ్య రీతిలో స్మృతి- పలాష్ పెళ్లి వాయిదా పడింది. వివాహ తంతుకు కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆ వెంటనే పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ పరిణామాలు సందేహాలకు తావిచ్చాయి. ఇందుకు తోడు ఓ అమ్మాయి పలాష్ తనతో చాట్ చేశాడంటూ ‘ప్రైవేటు సంభాషణ’ను బహిర్గతం చేసింది.ఇంకేముంది.. సోషల్ మీడియాలో చిన్నగా అంటుకున్న ఈ ‘మంట’ దావానంలా వ్యాపించింది. మెజారిటీ మంది పలాష్ను తప్పుపడితే.. మరికొంత మంది స్మృతిని కూడా ట్రోల్ చేశారు. ఆరేళ్ల ప్రేమలో అతడి గురించి ఏమీ తెలియలేదా?.. పెళ్లికి ముందు రోజు రాత్రే.. ‘అఫైర్’ ఉందని తెలిసిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.పలాష్ అక్కపైనా ట్రోలింగ్మరోవైపు.. పలాష్పై తీవ్ర స్థాయిలో నెగటివ్ కామెంట్లు వచ్చాయి. దెబ్బకు అతడు బృందావనంలోని ఓ ఆశ్రమానికి వెళ్లి సేదదీరాడు. ఈ విషయంలో కాబోయే వధూవరులతో పాటు ట్రోలింగ్కు గురైన మరో వ్యక్తి పాలక్ ముచ్చల్. పలాష్ అక్క, బాలీవుడ్ సింగర్గా ప్రాచుర్యం పొందిన పాలక్ సమాజ సేవలోనూ ముందే ఉంటుంది.ఎంతో మంది చిన్నారులకు తన ఎన్జీవో ద్వారా గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా నిలిచింది పాలక్. అయితే, పలాష్ వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తూ పాలక్ను కూడా కొంత మంది విపరీతపు వ్యాఖ్యలతో ట్రోల్ చేశారు. డబ్బు, అందం ఉందన్న కారణంగానే స్మృతి వెంటపడమని సలహా ఇచ్చిందని.. అసలు విషయం బయటపడేసరికి ఆస్పత్రి పాలయ్యాడంటూ తమ్ముడికి సానుభూతి వచ్చేలా చేయాలని చూసిందని ఇష్టారీతిన ఆమెను నిందించారు.గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తినిజానికి ప్రేమ- పెళ్లి.. స్మృతి- పలాష్లకు సంబంధించినది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా అతిగా జోక్యం చేసుకునే వీలు ఉండకపోవచ్చు. నిజానికి స్మృతి మీద ఉన్న అభిమానం.. అనేకంటే దురభిమానమే పాలక్ మీద కామెంట్ల దాడికి కారణమైందని చెప్పవచ్చు. మరోవైపు.. పలాష్కు మద్దతు పలికేవాళ్లు స్మృతిని తక్కువ చేసేలా మాట్లాడటం తెలిసిందే. ఆఖరికి తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఇరువురూ స్పందించి.. తమ గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేసేదాకా వచ్చింది.తప్పు ఎటువైపు ఉన్నా.. బాధితులు వారేమొత్తం మీద తప్పు ఎటువైపు ఉందో తెలియకపోయినా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడేది అమ్మాయిలే అన్నది ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. నైతిక విలువలకు పాతరేసి మహిళలను కించపరిచే ఈ ‘సంస్కృతి’ని నీచమైనదిగా అభివర్ణించవచ్చు. ఇలాంటి ట్రోల్స్ వేసే వాళ్లలో చాలామందికి తమ వ్యక్తిగత జీవితంపై ఓ అవగాహనా, స్పష్టత ఉండదు.స్మృతి, సమంత, శోభితఅయినప్పటికీ పక్కవాళ్ల జీవితంలోకి చొచ్చుకుపోయి మరీ ఇలా దిగజారుడుగా వ్యవహరిస్తారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సినీ హీరోయిన్ సమంతపై కూడా కొంతమంది నీచంగా కామెంట్లు చేశారు. ఆమె పాత జీవితాన్ని తెర మీదకు తెస్తూ మోసగత్తెగా అభివర్ణిస్తూ రాక్షసానందం పొందారు.అంతేకాదు.. సమంత మాజీ భర్త నాగ చైతన్యపై కూడా విడాకుల సమయంలో.. అతడి రెండో పెళ్లి విషయంలోనూ విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా అక్కడ చైతూ భార్య శోభిత ధూళిపాళ వాళ్లకు ప్రధాన టార్గెట్గా మారింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఇటు శోభిత.. అటు సమంత.. ఇలా ఇద్దరు మహిళలు బాధితులుగా మారారు. మరోవైపు.. సెలబ్రిటీలను ఫాలో చేస్తూ వారి అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసే పాపరాజీలపై టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.తన ప్రేయసి, మోడల్ మహీక శర్మను తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారని.. కాస్తైన బుద్ధి ఉండాలంటూ పాపరాజీలకు పాండ్యా చురకలు అంటించాడు. కాగా హార్దిక్ పాండ్యాతో డేటింగ్ మొదలుపెట్టిన నాటి నుంచి మహీకపై నెట్టింట ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. మహీక, ధనశ్రీ, నటాషామరోవైపు.. హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ను సైతం అతడి దురభిమానులు వదిలిపెట్టలేదు. డబ్బు కోసమే ప్రేమ నటించి, పిల్లాడిని కని భారీ స్థాయిలో భరణం గుంజాలనే స్కెచ్ వేసిందని ఆమెపై నిందలు వేశారు.ఇక టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మపై కూడా ‘గోల్డ్ డిగ్గర్’ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే స్త్రీ అనే అర్థంలో) అంటూ నీచస్థాయిలో ట్రోల్ చేశారు. ఇతరులతో పోల్చుకోవడం, ఈర్ష్య, అసూయ.. ముఖ్యంగా తరతరాలుగా మెదళ్లలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలమే మహిళల పట్ల సోషల్ మీడియాలో వికృత వాంతి రూపంలో బయటకు వస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కొంతమంది మహిళలు సైతం ఇలాంటి ట్రోల్స్కు మద్దతు పలకడం విషాదకరం.చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే? -
సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్గా, ఓవరాల్గా 33వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు.హార్దిక్కు ముందు రోహిత్ శర్మ (205), సూర్యకుమార్ యాదవ్ (155), విరాట్ కోహ్లి (124) భారత్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. రోహిత్ మినహా అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఒక్కరు కూడా సిక్సర్ల డబుల్ సెంచరీ చేయలేదు.హార్దిక్ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్) కటక్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్, కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ గౌరవప్రదమైన స్కోర్ (175/6) చేయగలిగింది.అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై చిత్తైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. తద్వారా భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్, దూబే చెరో వికెట్ సాధించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన హార్దిక్ పాండ్యాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 డిసెంబర్ 11న ముల్లాన్పూర్లో జరుగనుంది. -
రెండో స్థానానికి దూసుకొచ్చిన విరాట్.. రోహిత్ తగ్గేదేలే..!
ఐసీసీ తాజాగా (డిసెంబర్ 10) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేయడంతో భారీగా రేటింగ్ పాయింట్లు సాధించి రెండు స్థానాలు ఎగబాకాడు. గత వారం ర్యాంకింగ్స్లో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదే సిరీస్లో రెండు మెరుపు అర్ద శతకాలు సాధించిన మరో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.రోహిత్కు విరాట్కు మధ్య కేవలం 7 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 773 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ ఏడాది రో-కో టాప్-2లో ముగిస్తారు. మిగతా భారత బ్యాటర్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం కోల్పోయి 10వ స్థానంలో పడిపోయాడు.సౌతాఫ్రికా సిరీస్లో రాణించిన తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ 2 స్థానాలు ఎగబాకి 12వ ప్లేస్కు చేరుకోగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వరుసగా 99, 100 స్థానాల్లో నిలిచారు. ఈ వారం ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లతో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. డికాక్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి ఎగబాకగా.. మార్క్రమ్ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 25వ స్థానానికి చేరాడు. బ్రీట్జ్కే ఓ స్థానం మెరుగుపర్చుకొని 29కి, బవుమా 3 స్థానాలు మెరుగుపర్చుకొని 37వ స్థానానికి చేరారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. రషీద్ ఖాన్, ఆర్చర్ టాప్-2 బౌలర్లుగా కొనసాగుతున్నారు. కుల్దీప్ మినహా టాప్-10లో ఒక్క భారత బౌలర్ కూడా లేడు. రవీంద్ర జడేజా 16, సిరాజ్ 21, షమీ 23, అక్షర్ పటేల్ 33, వాషింగ్టన్ సుందర్ 81, హార్దిక్ పాండ్యా 95, వరుణ్ చక్రవర్తి 100 స్థానాలకు పడిపోగా.. అర్షదీప్ సింగ్ 29 స్థానాలు మెరుగుపర్చుకొని 66వ స్థానానికి, హర్షిత్ రాణా 13 స్థానాలు మెరుగుపర్చుకొని 80వ స్థానానికి ఎగబాకారు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్జాయ్, సికందర్ రజా, నబీ టాప్-3లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా 10, 11 స్థానాల్లో ఉన్నారు. -
దినేశ్ కార్తీక్కు మరో కీలక పదవి
టీమిండియా మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ కోసం పురుషుల లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్గా ఎంపికయ్యాడు. హండ్రెడ్ లీగ్లో డీకే ఏ ఫ్రాంచైజీతో అయిన పని చేయడం (కోచ్గా) ఇదే మొదటిసారి.డీకే 2025 ఐపీఎల్ సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్గా చేరి, ఆ జట్టు మొదటి సారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పోర్ట్ఫోలియోతో లండన్ స్పిరిట్తోనూ జతకట్టాడు.లండన్ స్పిరిట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ (ఆర్సీబీ డైరెక్టర్ కూడా) డీకేను స్వాగతిస్తూ.. ఈ టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్ లండన్ స్పిరిట్లో చేరడం ఆనందకరం. అతని ఆలోచన విధానం ప్రత్యేకం. పొట్టి ఫార్మాట్లో డీకేకు ఉన్న అనుభవం, అతని ఉత్సాహం మా ఆటగాళ్లకు అమూల్యమవుతుందని అన్నారు. లండన్ స్పిరిట్తో ఒప్పందం అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. లార్డ్స్లో ఇంగ్లీష్ సమ్మర్ గడపనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే గ్రౌండ్లో నేను భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. చివరి టెస్ట్ కూడా ఇక్కడే ఆడాను. లండన్ స్పిరిట్తో కొత్త ప్రయాణం ప్రారంభించడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు. 40 ఏళ్ల దినేశ్ కార్తీక్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అలాగే ఐపీఎల్లో ప్రారంభ సీజన్ (2008) నుంచి 2024 ఎడిషన్ వరకు ఆడాడు. ఈ మధ్యలో అతను వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 257 మ్యాచ్లు ఆడాడు. -
సెలక్ట్ కాకుండా అడ్డుకుంటావా?.. కోచ్పై క్రికెటర్ల పాశవిక దాడి!
భారత క్రికెట్లో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. తాము జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుకున్నాడనే అనుమానంతో యువ క్రికెటర్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కోచ్ను చితకబాది.. అతడిని తీవ్రంగా గాయపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్డీటీవీ కథనం ప్రకారం.. పుదుచ్చేరి అండర్-19 క్రికెట్ కోచ్ వెంకటరామన్ (Venkataraman)కు తీవ్ర గాయాలయ్యాయి. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (CAP) పరిసరాల్లోనే ముగ్గురు స్థానిక క్రికెటర్లు అతడిపై దాడికి పాల్పడ్డారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025)కి తమను ఎంపిక చేయకుండా.. సెలక్టర్లను ప్రభావితం చేశాడనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.హత్యాయత్నం కింద నిందితులపై కేసుఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. హత్యాయత్నం కింద నిందితులపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ప్రాక్టీస్ సెషన్లో భాగంగా నెట్స్లో ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్న వేళ.. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు అతడిపై దాడికి దిగారు.విరిగిన భుజం, ఇరవై కుట్లుక్రికెట్ బ్యాట్తో కొట్టి వెంకటరామన్ను గాయపరిచారు. ఈ ఘటనలో అతడి భుజానికి (విరిగినట్లు అనుమానం), పక్కటెముకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తలపై బలంగా కూడా కొట్టడంతో నుదుటిపై దాదాపు 20 కుట్లు పడ్డాయి. ఈ ఘటన గురించి పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నిందితులను కార్తికేయన్, అర్వింద్రాజ్, సంతోష్ కుమారన్గా గుర్తించినట్లు తెలిపారు.అత్యంత హింసాత్మకంగాప్రస్తుతం అసోసియేషన్లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఉన్నవారి సాయంతో నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో వెంకటరామన్ తీవ్రంగా గాయపడ్డారని.. అత్యంత హింసాత్మకంగా అతడిపై దాడి చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సదరు అధికారి పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.కాగా ఈ ఘటనపై క్రికెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటమే కాకుండా.. కోచ్పై దాడి చేయడాన్ని పుదుచ్చేరి అసోసియేషన్ అధికారులు ఖండించారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఏదేమైనా ఈ అనూహ్య పరిణామంతో సెలక్షన్ కమిటీలో కీలకంగా వ్యవహరించే ‘పెద్దలు’ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్రస్థాయి కోచ్లకు కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.స్కామ్ చేశారా?అయితే, సెలక్షన్ విషయంలో పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ అవకతవలకు పాల్పడిందనే ఆరోపణలూ ఉన్నాయి. స్థానిక క్రికెటర్లను కాదని.. బయటి నుంచి వచ్చిన వారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు జారీ చేయించేసి.. వాటి ద్వారా లోకల్ కోటాలో ఇతరులను ఎంపిక చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఈ కారణంగా రంజీ ట్రోఫీ 2021 సీజన్ నుంచి ఐదుగురు అర్హులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందని తన నివేదికలో వెల్లడించింది.చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు -
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ ఓటమి
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2025 ఎడిషన్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ (MI Emirates) మిశ్రమ ఫలితాలను చవి చూస్తుంది. తొలి మ్యాచ్లో గల్ఫ్ జెయింట్స్పై ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టు.. రెండో మ్యాచ్లో షార్జా వారియర్స్పై ఘన విజయం సాధించింది. తాజాగా డెసర్ట్ వైపర్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒత్తిడికిలోనై సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఛేదనలో ఓ దశలో పటిష్టంగా ఉండిన ఎంఐ లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వైపర్స్ బౌలర్ డేవిడ్ పేన్ 19వ ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చి 3 వికెట్లు తీసి ఎంఐని భారీ దెబ్బేశాడు. చివరి ఓవర్లో ఎంఐ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. అయితే చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో అర్వింద్ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే ఘజన్ఫర్ను రనౌట్ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు.19వ ఓవర్లో 3 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్ పేన్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వైపర్స్ ఇన్నింగ్స్లో మ్యాక్స్ హోల్డన్ (42 రిటైర్డ్ ఔట్) టాప్ స్కోరర్ కాగా.. ఫకర్ జమాన్ (35) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ఘజన్ఫర్ 2, ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ తీశారు.ఎంఐ ఇన్నింగ్స్లో టామ్ బాంటన్ (34) టాప్ స్కోరర్ కాగా.. పూరన్ (31), ముహమ్మద్ వసీం (24), పోలార్డ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వైపర్స్ బౌలర్లలో పేన్ 4, తన్వీర్ 2, ఫెర్గూసన్, సామ్ కర్రన్ తలో వికెట్ తీశారు. -
న్యూజిలాండ్కు భారీ షాక్
వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్ బ్లెయిర్ టిక్నర్ దారుణంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కివీస్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్ (NZ vs WI)తో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత ఐదు టీ20ల సిరీస్ను 3-1తో గెలిచిన న్యూజిలాండ్.. వన్డే సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అనంతరం క్రైస్ట్చర్చ్ వేదికగా తొలి టెస్టులో కివీస్ విజయం సాధించే దిశగా పయనించగా.. అద్భుత పోరాటంతో విండీస్ మ్యాచ్ను డ్రా చేసుకుంది.205 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్కు దిగింది. కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక 75 ఓవర్లు ఆడి కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది.నాలుగు వికెట్లతో చెలరేగిన టిక్నర్ విండీస్ ఓపెనర్లు జాన్ కాంప్బెల్ (44), బ్రాండన్ కింగ్ (33) ఓ మోస్తరుగా రాణించగా.. షాయీ హోప్ (48) కూడా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు. ఇక కివీస్ బౌలర్లలో పేసర్లు బ్లెయిర్ టిక్నర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మైకేల్ రే మూడు వికెట్లు పడగొట్టాడు.మరోవైపు.. జేకబ్ డఫీ ఒక వికెట్ తీయగా.. స్పిన్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) సైతం ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్ టెయిలెండర్ ఆండర్సన్ ఫిలిప్ (5) రనౌట్ రూపంలో కివీస్కు ఓ వికెట్ దక్కింది. నొప్పితో విలవిల్లాడుతూఇదిలా ఉంటే.. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 66వ ఓవర్లో మైకేల్ రే బంతితో రంగంలోకి దిగగా.. ట్రవిన్ ఇమ్లాచ్ ఫైన్ లెగ్ దిశగా బాల్ను గాల్లోకి లేపాడు. ఇంతలో ఫీల్డర్ టిక్నర్ బంతిని ఆపే క్రమంలో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో తన ఎడమ భుజం (Shoulder Injury)పై భారం మొత్తం పడగా.. నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో పడుకుండిపోయాడు.ఏడ్చేసిన బౌలర్!దీంతో కివీస్ శిబిరంలో ఆందోళన చెలరేగగా.. టిక్నర్ పరిస్థితి చూసి బౌలర్ మైకేల్ దాదాపుగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతలో ఫిజియో వచ్చి టిక్నర్ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లగా.. అటు నుంచి అటే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టిక్నర్ ఎడమ భుజం విరిగినట్లు వార్తలు వస్తున్నాయి.మరోవైపు.. బుధవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 9 ఓవర్లలో కివీస్ 24 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ టామ్ లాథమ్ 7, డెవాన్ కాన్వే 16 పరుగులతో క్రీజులో నిలిచారు. విండీస్ కంటే కివీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా తొలిరోజు ఆతిథ్య న్యూజిలాండ్దే పైచేయి కాగా.. టిక్నర్ గాయం ఆందోళనకరంగా పరిణమించింది. చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు -
Ashes: మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును బుధవారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్తో తిరిగి ఆసీస్ టీమ్తో చేరినట్లు వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఈ ఒక్క మార్పు (కమిన్స్ చేరిక) జరిగినట్లు తెలిపింది.2-0తో ఆధిక్యంలో ఆసీస్ కాగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో దుమ్ములేపుతోంది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన కంగారూలు.. రెండో టెస్టులోనూ విజయం సాధించారు. బ్రిస్బేన్ వేదికగా పింక్ బాల్తో (డే- నైట్ మ్యాచ్) జరిగిన ఈ మ్యాచ్లోనూ ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేశారు.అదరగొట్టారుఇంగ్లండ్తో తొలి టెస్టులో మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి మిచెల్ స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. నాలుగో ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ (83 బంతుల్లో 123)తో ఓపెనర్గా వచ్చిన ట్రవిస్ హెడ్ (Travis Head) ఇరగదీశాడు. ఇక రెండో టెస్టులోనూ స్టార్క్ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఆ ఇద్దరూ దూరంఇదిలా ఉంటే.. ఆసీస్ పేసర్ జోష్ హాజల్వుడ్ (Josh Hazlewood)... ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ‘యాషెస్’ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. కండరాల గాయంతో ఇప్పటికే జరిగిన రెండు టెస్టులకు దూరమైన హాజల్వుడ్ మిగిలిన మూడు మ్యాచ్లకు సైతం అందుబాటులో ఉండబోడని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ మెక్డొనాల్డ్ మంగళవారం వెల్లడించాడు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు అతడు ఫిట్నెస్ సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ‘ఈ సిరీస్కు హాజల్వుడ్ దూరమయ్యాడు. ఇక ఇప్పుడు అతడి దృష్టి అంతా టీ20 వరల్డ్కప్ పైనే’ అని మెక్డొనాల్డ్ అన్నాడు. డిసెంబరు 17 నుంచి అడిలైడ్ వేదికగామరోవైపు.. గాయంతో తొలి రెండు మ్యాచ్లూ ఆడని రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్... డిసెంబరు 17 నుంచి అడిలైడ్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్లో బరిలోకి దిగనున్నాడు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ రెండు మ్యాచ్ల్లో ఆసీస్కు సారథిగా వ్యవహరించగా... కమిన్స్ రాకతో అతడు కేవలం బ్యాటర్గా బరిలోకి దిగనున్నాడు.గత రెండు టెస్టుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేయగా... ఇప్పుడు కమిన్స్ రాకతో కంగారూల పేస్ బలం మరింత పేరగనుంది. ఇక ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన వుడ్... మిగిలిన మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటనప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు -
చరిత్ర సృష్టించిన బుమ్రా.. అంపైర్ తప్పు చేశాడా?
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 సందర్భంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ వంద వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్గా రికార్డు సాధించాడు.175 పరుగులుకటక్ వేదికగా సౌతాఫ్రికా (IND vs SA T20Is)తో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ కుప్పకూలినా హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్)కు తోడు తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు స్కోరు చేయగలిగింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రాణించిన బౌలర్లుభారత బౌలర్లలో పేసర్లు అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh), జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు.. పేస్బౌలింగ్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ మ్యాచ్లో సఫారీ స్టార్, టాప్ రన్ స్కోరర్ డెవాల్డ్ బ్రెవిస్ (22)ను అవుట్ చేయడం ద్వారా.. బుమ్రా వంద వికెట్ల క్లబ్లో చేరాడు. అదే విధంగా.. కేశవ్ మహరాజ్ (0)ను కూడా పెవిలియన్కు పంపాడు.Boom boom, Bumrah! 🤩😎Wicket number 100 in T20Is for #JaspritBumrah! Simply inevitable 👏🇮🇳#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/MuSZfrfh3L— Star Sports (@StarSportsIndia) December 9, 2025అంపైర్ తప్పు చేశాడా?సఫారీ జట్టు ఇన్నింగ్స్లో బుమ్రా పదకొండో ఓవర్లో బరిలోకి దిగగా.. రెండో బంతిని బ్రెవిస్ ఎదుర్కొన్నాడు. ఫుల్ స్వింగ్తో బంతిని వేసే క్రమంలో బుమ్రా క్రీజు లైన్ దాటేసినట్లుగా కనిపించింది. దీంతో ఫ్రంట్-ఫుట్ నోబాల్ కోసం చెక్ చేయగా.. బుమ్రా షూ భాగం క్రీజు లోపలే ఉన్నందున దానిని ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. అయితే, ఈ విషయంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో పరిశీలించకుండానే బ్రెవిస్ను థర్డ్ అంపైర్ పెవిలియన్కు పంపి తప్పు చేశాడంటూ సౌతాఫ్రికా జట్టు అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే.. బుమ్రా కంటే ముందుగా.. అర్ష్దీప్ టీమిండియా తరఫున టీ20లలో వంద వికెట్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.టెస్టు, వన్డే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లు వీరేలసిత్ మలింగ (శ్రీలంక)టిమ్ సౌతీ (న్యూజిలాండ్)షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్)జస్ప్రీత్ బుమ్రా (ఇండియా).చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్At least show us another angle pic.twitter.com/NjDZ2lcxQT— Werner (@Werries_) December 9, 2025 -
సంజూ శాంసన్ పెద్దన్న లాంటోడు.. సై అంటే సై!
సంజూ శాంసన్.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మీదే చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 ఓపెనర్గా శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో సంజూ స్థానం గల్లంతైంది. ఒకవేళ తుదిజట్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు చోటు దక్కినా.. వన్డౌన్లో... ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపి యాజమాన్యం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి.ఫలితంగా.. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ స్థానాన్ని జితేశ్ శర్మ(Jitesh Sharma) భర్తీ చేశాడు. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గానూ రాణించడం అతడికి అదనపు ప్రయోజనంగా మారింది. కాబట్టే సంజూ కంటే జితేశ్ వైపే తాము మొగ్గుచూపుతున్నట్లు టీమిండియా నాయకత్వ బృందం సంకేతాలు ఇచ్చింది కూడా!వికెట్ కీపర్గా జితేశ్కే పెద్ద పీటఇక సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ సంజూ (Sanju Samson)ను కాదని జితేశ్ను ఆడించింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా వికెట్ కీపర్గా జితేశ్కే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై జితేశ్ శర్మ స్పందించాడు.నాకు పెద్దన్న లాంటివాడు‘‘నిజం చెప్పాలంటే.. సంజూ నాకు పెద్దన్న లాంటివాడు. ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. జట్టుకు కూడా అదే మంచిది. భారత్లో టాలెంట్కు కొదవలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.సంజూ భయ్యా గొప్ప ప్లేయర్. ఆయనతో నేను పోటీ పడాల్సి ఉంటుంది. అప్పుడే నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతాను. మేము ఇద్దరం టీమిండియాకు ఆడాలనే కోరుకుంటాం. మేము సోదరుల లాంటి వాళ్లం. మా అనుభవాలను పరస్పరం పంచుకుంటాం.టీమిండియాలో స్థానం కోసం సై అంటే సై!అతడు నాకు చాలా సాయం చేశాడు. సలహాలు ఇస్తాడు. ఒకవేళ అతడితోనే నాకు పోటీ అంటే.. బెస్ట్ ఇచ్చి ఢీకొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను’’ అని 32 ఏళ్ల జితేశ్ శర్మ.. 31 ఏళ్ల సంజూ గురించి చెప్పుకొచ్చాడు. 𝙄. 𝘾. 𝙔. 𝙈. 𝙄6⃣, 4⃣, 6⃣Hardik Pandya 🤝 Jitesh Sharma Updates ▶️ https://t.co/tiemfwcNPh#TeamIndia | #INDvSA | @hardikpandya7 | @jiteshsharma_ | @IDFCFIRSTBank pic.twitter.com/806L1KmQac— BCCI (@BCCI) December 9, 2025భారత్ ఘన విజయంకాగా కటక్ వేదికగా మంగళవారం తొలి టీ20లో టీమిండియా సౌతాఫ్రికాను 101 పరుగులతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో జితేశ్ ఎనిమిదో స్థానంలో వచ్చి 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు నాలుగు డిస్మిసల్స్లో భాగమై కీపర్గానూ సత్తా చాటాడు.మరోవైపు.. ఓపెనర్ గిల్ (4) విఫలమయ్యాడు. కాగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపు హాఫ్ సెంచరీ (28 బంతుల్లో 59 నాటౌట్)కి తోడు.. బౌలర్లు రాణించడంతో టీమిండియాకు విజయం సాధ్యమైంది. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ముందంజ వేసింది. చదవండి: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు: సూర్యకుమార్Total dominance from Team India! 💥🇮🇳#SouthAfrica suffer their lowest T20I score as #India storm to a 101-run win their 3rd highest margin of victory against SA to go 1–0 up in the series! 💪#INDvSA 👉 2nd T20I 👉 11th DEC, 6 PM onwards pic.twitter.com/uwoZvWJa6Y— Star Sports (@StarSportsIndia) December 9, 2025 -
‘నిన్ను తప్పిస్తారన్న ఆలోచనే ఉండదు.. కానీ ఇక్కడ అలా కాదు’
టీమిండియా స్టార్ శుబ్మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటర్గా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి బౌలింగ్లో మార్కో యాన్సెన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో గిల్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లలో ఓపెనర్గా గిల్ కంటే మెరుగైన రికార్డు ఉన్నా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను కావాలనే బలి చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ షాన్ పొలాక్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిన్ను తప్పిస్తారన్న ఊహే ఉండదుక్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో ఇలాంటి వాళ్లు ఎలా ఆడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి అక్కడ.. జట్టులో ప్రధాన ఆటగాడు అతడే. అతడిని జట్టు నుంచి తప్పిస్తారన్న ఊహ కూడా ఉండదు. కాబట్టి ఒత్తిడీ తక్కువే.కానీ ఇక్కడ అలా కాదుకానీ టీమిండియాకు వచ్చే సరికి కథ మారుతుంది. ఇక్కడ జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. కాబట్టి బ్యాటర్ మైండ్సెట్ మారిపోతుంది. కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. బాగా ఆడకుంటే జట్టులో స్థానం గల్లంతు అవుతుందనే ఆందోళన ఉంటుంది.కనీసం ఒక్క హాఫ్ సెంచరీఅయితే, శుబ్మన్ గిల్ విషయం మాత్రం ఇందుకు భిన్నం. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లలో మెరుగైన స్కోరు సాధించకపోవడం అతడిని నిరాశపరిచి ఉండవచ్చు. ప్రతి మూడు- నాలుగు మ్యాచ్లలో అతడు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా చేయాలి.లేదంటే విమర్శలు తప్పవు. ఐపీఎల్లో మాదిరి ఇక్కడా ఉంటుంది అనుకోవడం పొరపాటు. వరుసగా విఫలమైతే ఇక్కడ మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చు’’ అని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు. వరుస మ్యాచ్లలో ఫెయిలైనాకాగా టీమిండియా టెస్టు, వన్డే సారథి అయిన గిల్ను.. టీ20లలోనూ కెప్టెన్గా చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే వరుస మ్యాచ్లలో ఫెయిలైనా అవకాశాలు ఇస్తూనే ఉంది. అయితే, ఇందుకోసం సంజూ బలికావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 స్కోర్లు👉వేదిక: బారాబతి స్టేడియం, కటక్, ఒడిశా.👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 175/6(20)👉సౌతాఫ్రికా స్కోరు: 74(12.3)👉 ఫలితం: 101 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై భారత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్, ఒక వికెట్).చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్ -
అతడొక అద్భుతం.. నమ్మబుద్ధికాలేదు: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో టీమిండియాకు శుభారంభం లభించింది. కటక్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్లో భారత జట్టు సఫారీలను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆరంభంలో తడబడినా.. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరచడంతో మెరుగైన స్కోరు సాధించింది.50- 50 అనుకున్నాంఅనంతరం బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్యాన్ని కాపాడుకుని సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో విజయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందించాడు. ‘‘టాస్ సమయంలో గెలుపు అవకాశాలు 50- 50 అనుకున్నాం. ఏదేమైనా తొలుత బ్యాటింగ్ చేయడం సంతోషంగా అనిపించింది.48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఆ తర్వాత తేరుకుని 175 పరుగులు చేయగలిగాము. హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్, తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. చివర్లో జితేశ్ శర్మ (Jitesh Sharma)కూడా తన వంతు పాత్ర పోషించాడు.నమ్మశక్యం కాని విషయంతొలుత మేము 160 పరుగుల వరకు చేయగలుగుతామని అనుకున్నాం. అయితే, 175 పరుగులు సాధించడం అన్నది నమ్మశక్యం కాని విషయం. 7-8 మంది బ్యాటర్లలో ఇద్దరు- ముగ్గురు పూర్తిగా విఫలమైనా.. మిగిలిన నలుగురు రాణించి దీనిని సుసాధ్యం చేశారు.టీ20 క్రికెట్లోని మజానే ఇది. తదుపరి మ్యాచ్లో మా బ్యాటర్లంతా మెరుగ్గా ఆడతారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాము. టీమిండియా టీ20 ప్రయాణం గొప్పగా సాగుతోంది.అర్ష్దీప్, బుమ్రా పరిపూర్ణమైన బౌలర్లు. మేము టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే వాళ్లిద్దరే బౌలింగ్ అటాక్ ఆరంభించేవారు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా తన స్థాయి ఏమిటో మరోసారి చూపించాడు. Hard-hit Pandya is back in business! 🙌💪Two mammoth maximums in the same over and the crowd in Cuttack begins to chant his name. 🤩#INDvSA, 1st T20I, LIVE NOW 👉 https://t.co/tqu4j7Svcm pic.twitter.com/VYKUx3OhVT— Star Sports (@StarSportsIndia) December 9, 2025అతడొక అద్భుతం.. నిజంగా అద్భుతం చేశాడు. ఏదేమైనా అతడిని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అతడి బౌలింగ్ పట్ల కూడా నేను సంతోషంగా ఉన్నాను’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.టాపార్డర్ విఫలంకాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టాస్ ఓడిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ (17), శుబ్మన్ గిల్ (4) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.ఆదుకున్న హార్దిక్ఇలాంటి దశలో తిలక్ వర్మ (32 బంతుల్లో 26), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 23) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. హార్దిక్ పాండ్యా మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 59)తో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో శివం దూబే (9 బంతుల్లో 11), జితేశ్ శర్మ (5 బంతుల్లో 10 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 12.3 ఓవర్లలో కేవలం 74 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. ప్రొటిస్ జట్టు బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (14 బంతుల్లో 22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.చదవండి: విరిగిన చెయ్యితోనే బ్యాటింగ్.. అతడి వల్లే టీమిండియా సెలక్ట్ అయ్యాను: సచిన్ -
చాంప్స్ కీ స్టోన్, సెయింట్ ఫ్రాన్సిస్ జట్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా వార్షిక లీగ్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పురుషుల విభాగంలో కీ స్టోన్ బాస్కెట్బాల్ అకాడమీ... మహిళల విభాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ జట్టు విజేతలుగా నిలిచాయి. ఫైనల్స్లో కీ స్టోన్ జట్టు 75–66తో టైటాన్స్పై గెలుపొందింది. మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనే వరకు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా... ఆఖర్లో జోరు పెంచిన కీ స్టోన్ జట్టు... కీలక పాయింట్లు ఖాతాలో వేసుకొని విజేతగా అవతరించింది. మ్యాచ్ ఆరంభంలో టైటాన్స్ చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఒకదశలో 12–3తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత తేరుకున్న కీ స్టోన్ ప్లేయర్లు సత్తాచాటి జట్టును పోటీలోకి తెచ్చారు. కీ స్టోన్ అకాడమీ తరఫున సహర్ష్ 21 పాయింట్లతో విజృంభించగా... సుభాశ్ 17, ప్రీతమ్ 10 పాయింట్లు సాధించారు. క్రిష్య, ఆర్యన్ చెరో 8 పాయింట్లు సాధించగా... ప్రతీక్ 5, కార్తీక్ 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. టైటాన్స్ తరఫున సల్మాన్ 16 పాయింట్లతో టాప్లో నిలవగా... నందిత్ 12, సూర్య 111, క్రిస్ 11, విక్కీ 10 పాయింట్లు సాధించారు. మహిళల విభాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ జట్టు 57–55 పాయింట్లతో నిజాం బాస్కెట్బాల్ జట్టుపై గెలిచింది. సెయింట్ ఫ్రాన్సిస్ తరఫున పరీ 17 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించింది. సంహిత 14, సానియా 11, హిబా 6, రేఖ 5 పాయింట్లు సాధించారు. నిజాంబాస్కెట్బాల్ జట్టు తరఫున అమిత 16, జాహ్నవి 14, శ్రుతి 10, లాస్య 9, ఖుష్బూ 6 పాయింట్లు సాధించారు. -
ర్యాంప్పై మెస్సీ నడక
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్సీ భారత్ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇన్నాళ్లు ఫుట్బాల్ మైదానంలో అతని కిక్లు, పాస్లు చూసిన అభిమానులు ముంబైలో మాత్రం కొత్త మెస్సీని చూడబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆటలో అలరించిన అతను ఓ ప్రత్యేక ఫ్యాషన్ షోలో ర్యాంప్పై నడకతో ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. ‘జీఓఏటీ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఇండియా టూర్’లో భాగంగా మెస్సీ ఈ వారాంతంలో భారత్లో పర్యటించనున్నాడు. దీనికి సంబంధిన ఏర్పాట్లన్నీ ఇది వరకే పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి భారత అభిమానుల్ని అలరించనున్నాడు. పర్యటనలో తొలిరోజు 13న ముందుగా కోల్కతాలో అడుగుపెట్టే మెస్సీ అక్కడి నుంచి అదే రోజు హైదరాబాద్కు విచ్చేస్తాడు. ఆ మరుసటి రోజు ఆదివారం ముంబై చేరుకుంటాడు. సోమవారం ఢిల్లీలో జరిగే కార్యక్రమాలతో అతని పర్యటన ముగుస్తుంది. ఆఖరి రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకుంటాడని నిర్వాహకులు షెడ్యూల్ను విడుదల చేశారు. కోల్కతాలో వర్చువల్గా... కోల్కతాలో క్రికెట్తో పాటు ఫుట్బాల్ అంటే చెవికోసుకుంటారు. విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అర్జెంటీనా దివంగత దిగ్గజం మారడోనా అంటే పడిచచ్చేంత అభిమానం కోల్కతా వాసులది. ఇప్పుడు మెస్సీ అంటే కూడా అదే స్థాయిలో ప్రాణమిస్తారు. కాబట్టి కోల్కతా పోలీసులు కోల్కతాలో మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వర్చువల్గా ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలరీత్యానే హోటల్ నుంచే ఈ ఆవిష్కరణ ఉంటుందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం బిజిబిజీగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటాడు. హైదరాబాద్లో.... ‘గోట్’ పాన్ ఇండియా టూర్ను దేశం నలువైపులా కవర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పున కోల్కతా నుంచి దక్షిణాన హైదరాబాద్, పశి్చమాన ముంబై, ఉత్తరాన ఢిల్లీ నగరాలకు వస్తాడు. హైదరాబాద్లో సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడు. ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ‘గోట్ కప్’లో పాల్గొంటాడు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి కిక్లు కొట్టనున్నారు. ప్రధానితో ఢిల్లీలో... హైదరాబాద్ నుంచి నేరుగా ఆదివారం ముంబైకి వెళ్లి అక్కడ క్లబ్ సహచరుడు స్వారెజ్, అర్జెంటీనా సహచరుడు రోడ్రిగోలతో కలిసి ఫ్యాషన్ షోలో పాల్గొంటాడు. చివరగా ఢిల్లీ చేరుకొని ప్రధాని మోదీతో భేటీ అవుతాడు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పూర్తయ్యాక అదే రోజు రాత్రి స్వదేశానికి బయలుదేరతాడు. -
వేలం బరిలో 350 మంది
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు సంబంధించిన వేలం కార్యక్రమంలో పాల్గొనే ప్లేయర్ల జాబితా సిద్ధం అయింది. ఈ నెల 16న అబుదాబి వేదికగా ఈ వేలం జరగనుంది. 77 స్థానాల కోసం మొత్తం 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు కాగా... 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంఛైజీలు కలిసి గరిష్టంగా 77 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అందులో 31 విదేశీ ప్లేయర్ల స్థానాలు కాగా... 46 భారత ఆటగాళ్లవి. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చివరి నిమిషంలో వేలం జాబితాలోకి రాగా... ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్, న్యూజిలాండ్ ప్లేయర్ డెవాన్ కాన్వే, భారత ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి వాళ్లు వేలం జాబితాలో ఉన్నారు. మొదట 1390 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోగా... అందులో ఫ్రాంచైజీల ఆసక్తి మేరకు 350 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఒక్కో సెట్లో పది మంది చొప్పున 35 సెట్ల పాటు వేలం సాగనుంది. ఈ జాబితాలో 238 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అత్యధిక ప్రాథమిక ధర రూ. 2 కోట్లతో మొత్తం 40 మంది వేలంలో ఉండగా... ప్రాథమిక ధర రూ. 30 లక్షలతో 227 మంది పోటీలో ఉన్నారు. » టీమిండియా ప్లేయర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ తమ ప్రాథమిక ధరను రూ. 75 లక్షలుగా నిర్ణయించుకున్నారు. పృథ్వీ షా 2018 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడగా... 2025 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో అతడిని ఏ జట్టూ తీసుకోలేదు. ఇక సర్ఫరాజ్ 2021 సీజన్ నుంచి ఐపీఎల్ ఆడలేదు. » 2025 సీజన్కు ముందు రికార్డు స్థాయిలో రూ. 23.75 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ను కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ వేలానికి వదిలేసింది. అతడు ప్రాథమిక ధర రూ. 2 కోట్లతో వేలానికి రానున్నాడు. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో రాణిస్తున్న కునాల్ చండేలా, అశోక్ కుమార్లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశాలున్నాయి. » పది ఫ్రాంచైజీల్లో అత్యధికంగా కోల్కతా నైట్రైడర్స్ దగ్గర రూ. 64.3 కోట్లు అందుబాటులో ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ రూ. 43.4 కోట్లతో రెండో స్థానంలో ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 25.5 కోట్లతో మూడో స్థానంలో ఉంది. » వేలంలో ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా 21 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇందులో జేమీ స్మిత్, అట్కిన్సన్, లివింగ్స్టోన్, బెన్ డకెట్ వంటి వారు ఉన్నారు. » ఆ్రస్టేలియా పేస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం అన్నీ ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది. గ్రీన్, స్మిత్తో పాటు ఇన్గ్లిస్, షార్ట్, కూపర్, వెబ్స్టర్ వంటి 19 మంది ప్లేయర్లు ఆ్రస్టేలియా నుంచి ఈ వేలం బరిలో ఉన్నారు. » డికాక్, మిల్లర్లతో పాటు దక్షిణాఫ్రికా నుంచి 15 మంది వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో నోర్జే, ఎంగిడి, కోట్జీ, ముల్డర్ తదితరులు ఉన్నారు. » వెస్టిండీస్ నుంచి అల్జారీ జోసెఫ్, షామర్ జోసెఫ్, షై హోప్, రోస్టన్ ఛేజ్ సహా 9 మంది ఆటగాళ్లు వేలం బరిలో ఉన్నారు. » శ్రీలంక నుంచి హసరంగ, దునిత్ వెల్లలాగె, తీక్షణ, నిసాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా సహా 12 మంది ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. » న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, కాన్వే సహా మొత్తం 16 మంది ప్లేయర్లు వేలం బరిలో ఉన్నారు. » అఫ్గానిస్తాన్ నుంచి రహ్మనుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్ సహా మొత్తం 10 మంది ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.అంకెల్లో...వేలంలో ఉన్న మొత్తం ఆటగాళ్లు 350 భారత క్యాప్డ్ ఆటగాళ్లు 16 విదేశీ క్యాప్డ్ ఆటగాళ్లు 96 భారత అన్క్యాప్డ్ ఆటగాళ్లు 224 విదేశీ అన్క్యాప్డ్ ఆటగాళ్లు 14ప్రాథమిక ధర ఆటగాళ్ల సంఖ్య రూ. 2 కోట్లు 40 రూ. 1.50 కోట్లు 9 రూ. 1.25 కోట్లు 4 రూ. 1 కోటి 17 రూ. 75 లక్షలు 42 రూ. 50 లక్షలు 4 రూ. 40 లక్షలు 7 రూ. 30 లక్షలు 227 -
కోల్కతాలో చెప్టెగయ్ పరుగు
కోల్కతా: టాటా స్టీల్ ప్రపంచ 25 కిలోమీటర్ల రన్కు దిగ్గజాలు కూడా సై అంటున్నారు. ఈ 25 కిలోమీటర్ల పరుగులో ఇప్పటికే 23 వేల మంది పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్, మరో మూడుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన జొషువా చెప్టెగయ్ (ఉగాండా) కూడా కోల్కతా ఈవెంట్లో పరుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మహిళల డిఫెండింగ్ చాంపియన్ సుతుమ్ అసిఫా కెబెడే సైతం 25కె రన్పై ఆసక్తి కనబరిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21న ఈ రేసు జరుగుతుందని ప్రమోటర్స్ ప్రొకామ్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వరకు నమోదైన 1 గంటా 11.08 నిమిషాల రికార్డును బ్రేక్ చేసిన రన్నర్కు ప్రైజ్మనీకి అదనంగా 25 వేల డాలర్లు (రూ.22.46 లక్షలు) బోనస్గా అందజేస్తామని ప్రోకామ్ సంస్థ తెలిపింది. కాగా ఈవెంట్ మొత్తం ప్రైజ్మనీ 1,42, 214 డాలర్లు (రూ.కోటి 28 లక్షలు). ఈ మొత్తాన్ని మహిళలు, పురుషుల విజేతలకు సమానంగా బహూకరించనున్నారు. 29 ఏళ్ల ఉగాండ రన్నర్ చెప్టెగయ్ సుదీర్ఘ పరుగు పందెంలో ఎదురేలేని చాంపియన్. మూడుసార్లు 10 వేల మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. 5కె, 10కె పరుగులు కలుపుకొని నాలుగుసార్లు ప్రపంచ రికార్డులు నమోదు చేశాడు. గతేడాది ఢిల్లీ హాఫ్ మారథాన్, ఈ ఏడాది బెంగళూరులో జరిగిన వరల్డ్ 10కె రన్లోనూ ఈ ఉగాండా రన్నర్ విజేతగా నిలిచాడు. తొలిసారిగా భారత్లో 25కె రన్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. పురుషుల విభాగంలో చెప్టెగయ్తో పాటు అల్ఫొన్స్ ఫెలిక్స్ సింబు (టాంజానియా) సహా ఇథియోపియన్ రన్నర్ హేమనొట్ అలివ్, లెసోతొకు చెందిన టెబెలో రమకొంగొన తదితర మేటి అథ్లెట్లు కోల్కతా ఈవెంట్కు విచ్చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇథియోపియన్ మహిళా రన్నర్ అసిఫా కెబెడె పదేళ్ల క్రితమే 25కె పరుగులో ప్రపంచ రికార్డు సృష్టించింది. బెర్లిన్లో 2015లో జరిగిన ఆ ఈవెంట్లో రికార్డు నెలకొల్పిన ఆమె 2023లో కోల్కతాలో జరిగిన ఈవెంట్లోనూ మరో రికార్డు సాధించింది. మేటి అథ్లెట్లు పాల్గొననుండటంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. -
హార్దిక్ సూపర్ షో
భారత జట్టులోకి కొంత విరామం తర్వాత పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా తన వాడిని, స్థాయిని ప్రదర్శించాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకొని వచ్చి అంచనాలకు తగినట్లుగా చెలరేగుతూ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలమైన వేళ పాండ్యా మెరుపులతో భారీ స్కోరు నమోదు చేసిన భారత్... ఆ తర్వాత దక్షిణాఫ్రికాను 75 బంతుల్లోనే 74 పరుగులకు కుప్పకూల్చింది. టీమిండియా పటిష్ట బౌలింగ్ను ఎదుర్కోలేక సఫారీలు పూర్తిగా చతికిలపడటంతో ఆట ఏకపక్షంగా మారిపోయింది. దాంతో బారాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాపై భారత్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ మైదానంలో గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టి20 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కటక్: దక్షిణాఫ్రికాతో మొదలైన టి20 సిరీస్లో అలవోక విజయాన్ని అందుకొని భారత్ 1–0తో ముందంజ వేసింది. బారాబతి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన తొలి టి20లో భారత్ 101 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఆటతో చెలరేగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. టి20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. డెవాల్డ్ బ్రెవిస్ (22) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 గురువారం ముల్లాన్పూర్లో జరుగుతుంది. ఓపెనర్లు విఫలం... భారత్ స్కోరు ఒకదశలో 17/2, ఆపై 48/3... 14 ఓవర్లు ముగిసేసరికి 104/5... ఈ క్రమాన్ని చూస్తే భారత్ భారీ స్కోరు చేయడం అసాధ్యమనిపించింది. కానీ చివర్లో ఒక్క పాండ్యా బ్యాటింగ్తో అంతా మారిపోయింది. ఆఖరి 6 ఓవర్లలో భారత్ 71 పరుగులు సాధించగలిగింది. భారత ఇన్నింగ్స్కు సరైన ఆరంభం లభించలేదు. పునరాగమనంలో శుబ్మన్ గిల్ (4) ఇన్నింగ్స్ మూడు బంతులకే పరిమితం కాగా, ఎన్గిడి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సూర్యకుమార్ (12) తర్వాతి బంతికి వెనుదిరిగాడు. పవర్ప్లేలో జట్టు 40 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ (17) జోరు ఎక్కువ సేపు సాగలేదు. ఈ దశలో తిలక్ వర్మ (32 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 23; 1 సిక్స్) కలిసి కొద్దిసేపు పట్టుదల కనబర్చారు. అయితే వీరిద్దరు నెమ్మదిగా ఆడుతూ 31 బంతుల్లో 30 పరుగులే జోడించగలిగారు. అయితే పాండ్యా వచ్చీ రాగానే మహరాజ్ ఓవర్లో 2 సిక్సర్లు బాది ఆటకు ఊపు తెచ్చాడు. తర్వాత నోర్జే ఓవర్లోనూ అతను 2 ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్లో శివమ్ దూబే (11) అవుటైన తర్వాత పాండ్యా దూకుడు కొనసాగింది. సిపామ్లా వేసిన 19వ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన పాండ్యా...నోర్జే వేసిన 20వ ఓవర్లోనూ 6, 4 కొట్టి 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టపటపా... ఛేదనలో దక్షిణాఫ్రికా మొదటి నుంచే తడబడింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డికాక్ (0)ను అవుట్ చేసిన అర్‡్షదీప్, తన తర్వాతి ఓవర్లో స్టబ్స్ (14)ను వెనక్కి పంపాడు. అక్షర్ తన తొలి బంతికే మార్క్రమ్ (14) బౌల్డ్ చేయగా, పాండ్యా కూడా తన తొలి బంతికే మిల్లర్ (1) ఆట కట్టించాడు. తర్వాతి ఓవర్లో వరుణ్ బంతిని ఆడలేక ఫెరీరా (5) కీపర్కు క్యాచ్ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా 50/5 వద్ద నిలిచింది. రెండు సిక్స్లు బాదిన యాన్సెన్ (12) కూడా వరుణ్ బంతికే బౌల్డ్ కాగా... మరో ఎండ్లో కొన్ని చక్కటి షాట్లతో బ్రెవిస్ పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే బ్రెవిస్ను చక్కటి బంతితో బుమ్రా డగౌట్కు పంపడంతో దక్షిణాఫ్రికా ఆశలు కోల్పోయింది.101అంతర్జాతీయ టి20ల్లో బుమ్రా వికెట్ల సంఖ్య. అర్ష్ దీప్ సింగ్ (107) తర్వాత వంద వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా బుమ్రా నిలిచాడు.100 అంతర్జాతీయ టి20ల్లో హార్దిక్ పాండ్యా సిక్సర్ల సంఖ్య. కోహ్లి, సూర్యకుమార్, రోహిత్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న నాలుగో భారత ఆటగాడిగా పాండ్యా నిలిచాడు.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) యాన్సెన్ (బి) సిపామ్లా 17; గిల్ (సి) యాన్సెన్ (బి) ఎన్గిడి 4; సూర్యకుమార్ (సి) మార్క్రమ్ (బి) ఎన్గిడి 12; తిలక్ (సి) యాన్సెన్ (బి) ఎన్గిడి 26; అక్షర్ (సి) ఫెరీరా (బి) సిపామ్లా 23; పాండ్యా (నాటౌట్) 59; దూబే (బి) ఫెరీరా 11; జితేశ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–17, 3–48, 4–78, 5–104, 6–137. బౌలింగ్: ఎన్గిడి 4–0–31–3, యాన్సెన్ 4–0–23–0, సిపామ్లా 4–0–38–2, నోర్జే 4–0–41–0, మహరాజ్ 2–0–25–0, ఫెరీరా 2–0–13–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) అభిషేక్ (బి) అర్ష్ దీప్ 0; మార్క్రమ్ (బి) అక్షర్ 14; స్టబ్బ్ (సి) జితేశ్ (బి) అర్ష్ దీప్ 14; బ్రెవిస్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 22; మిల్లర్ (సి) జితేశ్ (బి) పాండ్యా 1; ఫెరీరా (సి) జితేశ్ (బి) వరుణ్ 5; యాన్సెన్ (బి) వరుణ్ 12; మహరాజ్ (సి) జితేశ్ (బి) బుమ్రా 0; నోర్జే (బి) అక్షర్ 1; సిపామ్లా (సి) అభిషేక్ (బి) దూబే 2; ఎన్గిడి (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 1; మొత్తం (12.3 ఓవర్లలో ఆలౌట్) 74. వికెట్ల పతనం: 1–0, 2–16, 3–40, 4–45, 5–50, 6–68, 7–68, 8–70, 9–72, 10–74. బౌలింగ్: అర్ష్ దీప్ 2–0–14–2, బుమ్రా 3–0–17–2, వరుణ్ 3–1–19–2, అక్షర్ 2–0–7–2, పాండ్యా 2–0–16–1, దూబే 0.3–0–1–1. -
శ్రీనివాస్ ‘ట్రిపుల్’ ధమాకా... క్యారమ్ ప్రపంచకప్లో స్వర్ణాలన్నీ భారత్కే
సాక్షి, హైదరాబాద్: క్యారమ్ ప్రపంచకప్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు శ్రీనివాస్ ‘ట్రిపుల్’ ధమకా సాధించాడు. మాల్దీవులులో జరిగిన ఈ మెగా ఈవెంట్లో అతను మూడు పతకాలు సాధించడం విశేషం. స్విస్ లీగ్ ఈవెంట్లో కాంస్యం నెగ్గిన ఈ సీనియర్ ప్లేయర్... పురుషుల డబుల్స్లో అభిజిత్ త్రిపాంకర్తో కలిసి టైటిల్ సాధించాడు. పురుషుల వ్యక్తిగత ఫైనల్లో ప్రశాంత్ మోరే చేతిలో ఓడిపోవడంతో రజతం సాధించాడు. టైటిల్ పోరులో హైదరాబాదీ ప్లేయర్ 25–5, 11–25, 18–25తో ప్రశాంత్ మోరె చేతిలో కంగుతిన్నాడు. తద్వారా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో శ్రీనివాస్ ప్రపంచకప్లో కీలక పాత్ర పోషించాడు. బంగారు పతకాలన్నీ భారత జట్టుకే లభించడం మరో విశేషం. పురుషుల డబుల్స్లో స్వర్ణంతో పాటు రజతం కూడా భారత జోడీలకే దక్కాయి.దీంతో భారత్ 7 పసిడి పతకాలు సహా 4 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం 14 పతకాలు నెగ్గింది. -
కుప్పకూలిన సౌతాఫ్రికా.. కటక్ మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ
కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో కేవలం 74 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ మ్యాచ్లో 101 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివ దూబే చెరో వికెట్ తీశారు.అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 17, శుభ్మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23, శివమ్ దూబే 11, జితేశ్ శర్మ 10 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్ పడగొట్టాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండో టీ20 ముల్లాన్పూర్ వేదికగా గురువారం జరగనుంది. -
హార్దిక్ విధ్వంసం.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 9) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. ఇన్నింగ్స్ మధ్య వరకు తడబడినప్పటికీ హార్దిక్ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన హార్దిక్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్ వేగాన్ని పెంచాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ 17, శుభ్మన్ గిల్ 4, సూర్యకుమార్ యాదవ్ 12, తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23, శివమ్ దూబే 11, జితేశ్ శర్మ 10 (నాటౌట్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్ పడగొట్టాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్కీపర్),అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే -
ఒక్కో ఫార్మాట్కు ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్న "పెద్ద తలకాయ"..!
భారత పురుషుల క్రికెట్కు సంబంధించిన ఓ పెద్ద తలకాయ ఒక్కో ఫార్మాట్లో ఒక్కో ఆటగాడిని బలి తీసుకుంటున్నాడు. బీసీసీఐ అండదండలు పూర్తిగా ఉన్న ఆ పెద్ద తలకాయ టీమిండియాలో చెప్పిందే వేదం. భారత జట్టులో అతనేమనుకుంటే అది జరిగి తీరాల్సిందే. అతడి అండదండలుంటే ఏ స్థాయి క్రికెట్ ఆడకపోయినా నేరుగా భారత తుది జట్టులోకి వస్తారు. అతడి ఆశీస్సులుంటే సాధారణ ఆటగాడు కూడా కెప్టెన్ అయిపోతాడు. భారత పురుషుల క్రికెట్ను శాశించే ఆ శక్తికి మరో పెద్ద తలకాయ మద్దతు కూడా ఉంది. వీరిద్దరూ తలచుకుంటే అనర్హులను అందలమెక్కిస్తారు. అర్హుల కెరీర్లను అర్దంతరంగా ముగిస్తారు. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తారు. వారు చేసే ప్రతి పనికి వారి వద్ద ఓ సమర్దన స్క్రిప్ట్ ఉంటుంది. వారి జోలికి వెళ్లాలంటే మాజీలు, మాజీ బీసీసీఐ బాస్లు కూడా హడలిపోతారు. అంతలా వారు చెలరేగిపోతున్నారు.వీరి ప్రస్తావన మరోసారి ఎందుకు వచ్చిందంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాల్టి నుంచి (డిసెంబర్ 9) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. కటక్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో అందరూ ఊహించిన విధంగానే శుభ్మన్ గిల్ ఓపెనర్గా రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతోనే టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన గిల్.. గాయం నుంచి కోలుకోగానే నేరుగా తుది జట్టులో చోటు సంపాదించాడు.వాస్తవానికి గిల్ స్థానం సంజూ శాంసన్ది. సంజూ గత కొంతకాలంగా ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సౌతాఫ్రికా సిరీస్లోనూ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అయితే గిల్ కోసం పైన చెప్పుకున్న పెద్ద తలకాయలు సంజూ కెరీర్ను బలి చేస్తున్నారు. నేరుగా మెడపై కత్తి పెట్టకుండా తొలుత స్థానచలనం చేసి గేమ్ను మొదలుపెట్టారు. ఆతర్వాత ప్రణాళిక ప్రకారం జట్టులో స్థానాన్నే గల్లంతు చేస్తున్నారు.ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రక్రియ మొదలైంది. రెండో టీ20 తర్వాత సంజూకు అవకాశమే ఇవ్వలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లోనూ అదే కొనసాగింది. సంజూను శాశ్వతంగా జట్టు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఎవరికైనా ఇట్టే అర్దమవుతుంది. ఓ దశలో సదరు పెద్ద తలకాయల్లో మొదటివాడు సంజూ కెరీర్కు పూర్తి భరోసా ఇచ్చినట్లు నటించాడు. 21 సార్లు డకౌటైనా తుది జట్టులో ఉంటావని నమ్మించాడు.తీరా చూస్తే.. తన అనూనయుడికి అవకాశం ఇవ్వడం కోసం సంజూ కెరీర్నే బలి చేస్తున్నాడు. సదరు పెద్ద తలకాయకు తనకు సరిపోని ఆటగాళ్ల కెరీర్లతో ఆటాడుకోవడం కొత్తేమీ కాదు. దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతోనే మైండ్ గేమ్ ఆడాడు. వారంతట వారే టెస్ట్, టీ20 కెరీర్లను అర్దంతరంగా ముగించుకునేలా చేశాడు. టీ20ల్లో గిల్ కోసం సంజూ కెరీర్ను పణంగా పెట్టిన ఆ పెద్ద తలకాయ.. మరో అనర్హమైన బౌలర్ కోసం షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్ను అంపశయ్యపై పెట్టాడు. ఇకనైనా ఈ పెద్ద తలకాయ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ గౌరవం పోతుంది. -
క్రికెట్పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన టీ20 టోర్నమెంట్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ లీగ్ 2024లో సాధించిన 12 బిలియన్ డాలర్ల అపారమైన బ్రాండ్ విలువ 2025లో అనూహ్యంగా 20% పతనమై 9.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం ఈ పతనం 2020లో కొవిడ్-19 సమయంలో ఎదురైన పతనానికి దాదాపు సమానంగా ఉంది. ఈ పరిస్థితి కేవలం ఆర్థిక ఒత్తిడులనే కాకుండా కార్పొరేట్ దిగ్గజాల స్పాన్సర్షిప్ వ్యూహాలు, మీడియా రైట్స్ డైనమిక్స్, రెగ్యులేటరీ మార్పుల ప్రభావంతో ముడిపడి ఉంది. రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్షిప్లపై ప్రభుత్వ నిషేధం, మీడియా కన్సాలిడేషన్ వంటి కీలకమైన కార్పొరేట్ అంశాలు లీగ్ను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీశాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.భౌగోళిక ఒత్తిడులు2025 ఐపీఎల్ సీజన్కు ముందు భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఆపరేషన్ సిందూర్), భారత క్రికెట్ బోర్డు (BCCI) భద్రతా కారణాల వల్ల ప్లేఆఫ్లతో సహా అనేక మ్యాచ్లను తాత్కాలికంగా నిలిపేశారు. ఐపీఎల్ ఆదాయాలపై, కార్పొరేట్ విశ్వాసంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ అంతరాయం కారణంగా స్పాన్సర్షిప్ డీల్స్లో 15-20% తగ్గుదల కనిపించింది.దీనికి తోడు మెగా-ఆక్షన్ కారణంగా ఫ్రాంచైజీల స్క్వాడ్ల్లో వచ్చిన గణనీయమైన మార్పులు టీమ్ పెర్ఫార్మెన్స్లను దెబ్బతీశాయి. ఉదాహరణకు, గతంలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ ఏకంగా 24 శాతం తగ్గి 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అనిశ్చితి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ROI) ఆధారంగా పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ ఇన్వెస్టర్లను లీగ్కు దూరం చేసింది.రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్షిప్లుఐపీఎల్ ఆర్థిక వ్యవస్థలో స్పాన్సర్షిప్లు కీలకం. అయితే, 2025లో ప్రభుత్వం అమలు చేసిన రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్షిప్లపై నిషేధం లీగ్కు అతిపెద్ద దెబ్బగా మారింది. ఈ బ్యాన్ వల్ల ఐపీఎల్కు రూ.1,500–రూ.2,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు అంచనా.రియల్-మనీ గేమింగ్ కంపెనీలైన డ్రీమ్11, మై11సర్కిల్ వంటి కంపెనీలు ఐపీఎల్ జెర్సీలు, మ్యాచ్ స్పాన్సర్షిప్లలో భారీగా పెట్టుబడులు పెట్టేవి. ఉదాహరణకు, డ్రీమ్11 జెర్సీ స్పాన్సర్షిప్ నుంచి రూ.350 కోట్లను ఉపసంహరించుకుంది. ఇది కేవలం ఐపీఎల్కే కాకుండా మొత్తం భారత క్రికెట్ పరిశ్రమపై ప్రభావం చూపింది.ఈ నిషేధం కారణంగా ఇతర కార్పొరేట్ బ్రాండ్లు (ఆటో, ఫిన్టెక్, హెల్త్కేర్) కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, బడ్జెట్ కోతలు, ఆర్ఓఐ ఒత్తిడి నేపథ్యంలో స్పాన్సర్లు దీర్ఘకాలిక ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ వంటి అగ్ర ఫ్రాంచైజీలు కూడా 9% తగ్గుదలను చూశాయి.బ్రాడ్కాస్టింగ్ రైట్స్లో పోటీ లోపంకార్పొరేట్ ప్రభావం ఐపీఎల్ బ్రాండ్ విలువను ప్రభావితం చేసిన మరో కీలక అంశం మీడియా రైట్స్. 2023-2027 సీజన్లకు రూ.48,390 కోట్లతో విక్రయించిన మీడియా రైట్స్లో డిస్నీ స్టార్, వియాకామ్18 మెర్జర్ (జియోస్టార్) వల్ల మోనోపాలీ ఏర్పడింది. ఇది గతంలో ఉన్న ఆక్షన్ను అంతం చేసి బిడ్డింగ్ పోటీని తగ్గించింది. ఫలితంగా ప్రతి మ్యాచ్ విలువ సుమారు రూ.115 కోట్లకు పరిమితమై ఐపీఎల్ మొత్తం విలువను దెబ్బతీసింది.ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు వ్యూయర్షిప్ను పెంచినప్పటికీ, మోనిటైజేషన్ సామర్థ్యాన్ని తగ్గించాయి. కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఈ మెర్జర్ వల్ల ద్వారా ప్రయోజనం పొందినప్పటికీ ఐపీఎల్ ఎకోసిస్టమ్ మొత్తంగా నష్టపోయింది.పునరుద్ధరణకు మార్గాలురియల్-మనీ గేమింగ్పై ఆధారపడకుండా ఈస్పోర్ట్స్, హెల్త్కేర్, గ్లోబల్ టెక్ వంటి కొత్త రంగాల నుంచి స్పాన్సర్షిప్లను ఆకర్షించాలి.ఫ్రీ స్ట్రీమింగ్ మోడల్తో పాటు ప్రత్యేకమైన కంటెంట్, ప్రీమియం ఫీచర్ల ద్వారా మోనిటైజేషన్ మార్గాలను అన్వేషించాలి.భవిష్యత్ సీజన్ల్లో మీడియా రైట్స్ కోసం పోటీని పెంచడానికి బీసీసీఐ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ -
శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన
డిసెంబర్ 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధన కొనసాగనున్నారు. వన్డే ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన తర్వాత భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇదే.పలాష్ ముచ్చల్తో పెళ్లి పెటాకులైన తర్వాత మంధన ఎదుర్కోనున్న తొలి పరీక్ష కూడా ఇదే. వరల్డ్కప్ స్టార్ షఫాలీ వర్మ ఈ జట్టులో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. అలాగే వరల్డ్కప్ సెమీఫైనల్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్, వరల్డ్కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ లాంటి వరల్డ్కప్ స్టార్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్కీపర్ల కోటాలో రిచా ఘోష్, జి కమలిని జట్టులో ఉన్నారు. కొత్తగా శ్రీ చరణి, వైష్ణవి శర్మ జట్టులోకి వచ్చారు.షెడ్యూల్..తొలి టీ20- డిసెంబర్ 21, ఆదివారం, విశాఖపట్నంరెండో టీ20- డిసెంబర్ 23, మంగళవారం, విశాఖపట్నం మూడో టీ20- డిసెంబర్ 26, శుక్రవారం, తిరువనంతపురం నాలుగో టీ20- డిసెంబర్ 28, ఆదివారం, తిరువనంతపురం ఐదో టీ20- డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం -
‘అతడి త్యాగం.. నా సెంచరీ.. టీమిండియాకు సెలక్ట్ అయ్యాను’
సచిన్ టెండుల్కర్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో శతక శతకాలు సాధించిన ధీరుడిగా అతడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. రెండున్నర దశాబ్దాల కెరీర్లో టీమిండియా తరఫున లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి క్రికెట్ గాడ్గా నీరాజనాలు అందుకున్నాడు సచిన్.అయితే, తాను టీమిండియాకు ఎంపికయ్యే క్రమంలో సహచర ఆటగాడు ఒకరు తన కోసం చేసిన త్యాగం గురించి సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తాజాగా వెల్లడించాడు. అది 1989- 90 దేశీ క్రికెట్ సీజన్. ముంబైలోని వాంఖడే వేదికగా ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా- ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి.సచిన్ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్రెస్టాఫ్ ఇండియాకు ఆడుతున్న సచిన్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇంతలో తొమ్మిదో వికెట్ పడింది. అప్పటికి బ్యాటింగ్కు రావాల్సిన ప్లేయర్ గాయపడ్డాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్ గురుశరణ్ సింగ్ (Gursharan Singh). అతడు బ్యాటింగ్కు వస్తేనే సచిన్ తన శతక మార్కును అందుకోగలడు.సచిన్ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్ చేసేందుకు గురుశరణ్ సిద్ధమయ్యాడు. అతడి సహకారంతో సచిన్ సెంచరీ (103) పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్ ద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టు తరఫున అరంగేట్రానికి బాటలు వేసుకున్నాడు.అతడి త్యాగం.. నా సెంచరీనాటి ఈ ఘటన గురించి సచిన్ టెండుల్కర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘1989లో నేను ఇరానీ ట్రోఫీ ఆడుతున్న సమయం. టీమిండియా సెలక్షన్ కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ మ్యాచ్లో నేను 90 పరుగులు పూర్తి చేసుకుని సెంచరీ దిశగా పయనిస్తున్నా.ఇంతలో తొమ్మిదో వికెట్ పడింది. నేను శతకం పూర్తి చేసుకుని జట్టు పరువు పోకుండా కాపాడాలని అనుకున్నా. కానీ బ్యాటింగ్కు రావాల్సిన గురుశరణ్ చెయ్యి విరిగింది. అయినప్పటికీ.. అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ రాజ్ సింగ్ దుంగర్పూర్ .. గురుశరణ్ను నాకు మద్దతుగా నిలవాల్సిందిగా కోరారు.టీమిండియాకు సెలక్ట్ అయ్యానుఆయన మాట ప్రకారం గురుశరణ్ క్రీజులోకి వచ్చాడు. అతడి సాయంతో నేను సెంచరీ పూర్తి చేసుకుని.. టీమిండియాకు సెలక్ట్ అయ్యాను కూడా!.. ఆ తర్వాత గురుశరణ్ కూడా భారత జట్టుకు ఆడాడు. ఆరోజు గురుశరణ్ చూపిన ధైర్యం, ఔదార్యం మరువలేనివి.డ్రెసింగ్రూమ్లో నేను గురుశరణ్కు అందరి ముందు ధన్యవాదాలు తెలిపాను. విరిగిన చెయ్యితో బ్యాటింగ్ చేయడం అంత తేలికేమీ కాదు. నా సెంచరీ పూర్తైందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. ఆ సమయంలో అతడు చూపిన ధైర్యం, జట్టు కోసం పడిన తాపత్రయం నా హృదయాన్ని మెలిపెట్టాయి’’ అని సచిన్ టెండుల్కర్.. గురుశరణ్ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.మ్యాచ్ ఓడినా..కాగా నాటి ఇరానీ కప్ మ్యాచ్లో ఢిల్లీ విధించిన 554 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెస్టాఫ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 209 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో గురుశరణ్ సాయంతో ఆఖరి వికెట్కు సచిన్ మరో 36 పరుగులు జోడించగలిగాడు. ఇక 245 పరుగులకు రెస్టాఫ్ ఇండియా ఆలౌట్ కాగా.. ఢిల్లీ 309 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, మ్యాచ్ ఓడినా.. వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా సచిన్కు టీమిండియా నుంచి పిలుపు అందింది.చదవండి: టీమిండియాకు ఆల్రౌండర్లు కావలెను! -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. సంజూకు మొండిచెయ్యి
కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా ఇవాళ (డిసెంబర్ 9) భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగే ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్లో ముందుగా ఊహించినట్టుగానే శుభ్మన్ గిల్ బరిలోకి దిగాడు. దీంతో సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. వికెట్కీపర్ బ్యాటర్ కోటాలో జితేశ్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా తరఫున నోర్జే చాలాకాలం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్కీపర్),అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే -
భారత ఆటగాడి కోటాలో ఐపీఎల్ వేలంలోకి ఎంటరైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం జరిగింది. ఓ విదేశీ ఆటగాడు భారతీయ ఆటగాడి కోటాలో వేలంలోకి ప్రవేశించాడు. భారత్లో (ఢిల్లీలో) పుట్టి, ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో భాగంగా ఉన్న 29 ఏళ్ల నిఖిల్ చౌదరి 2026 సీజన్ వేలంలోకి చివరి నిమిషంలో భారత ఆటగాడి కోటాలో ఎంట్రీ ఇచ్చాడు.ఆస్ట్రేలియాలో టాస్మానియా తరఫున పూర్తి స్థాయి ఫస్ట్క్లాస్ ఆడుతూ, బిగ్బాష్ లీగ్లో హోబార్ట్ హరికేన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఖిల్.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలిచాడు. ఊహించని ఈ పరిణామం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు.ఓ ఆటగాడు విదేశీ లీగ్ల్లో ఆడుతూ, ఐపీఎల్లో దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలవడం ఇదే మొదటిసారి. లెగ్ స్పిన్ ఆల్రౌండర్ అయిన నిఖిల్ వేలంలో సెట్ 35లో (ఆల్రౌండర్లు) షార్ట్లిస్ట్ అయ్యాడు. షార్ట్లిస్ట్ అయిన 350 మంది ఆటగాళ్ల జాబితాలో నిఖిల్ పేరు ప్రత్యేకంగా నిలిచింది. టీమిండియాకు ఆడాలన్నదే అతని కల, కానీ..!నిఖిల్కు చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలన్నదే కల. ఢిల్లీలో పుట్టి పెరిగిన అతను.. శుభ్మన్ గిల్తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు. అయితే COVID-19 సమయంలో నిఖిల్ పర్యాటకుడిగా వెళ్లి ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయాడు.దీంతో అతని కెరీర్కు పుల్స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. అయితే నిఖిల్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలనుకున్న తన కలను సజీవంగానే ఉంచుకున్నాడు. అందులో భాగంగా అతను ఆస్ట్రేలియా తరఫున తన కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు. నిరంతర సాధన చేస్తూ 2023–24 సీజన్లో హోబార్ట్ హరికేన్స్ తరఫున బిగ్ బాష్ లీగ్ ఆడే అవకాశం దక్కించుకున్న నిఖిల్.. తొలి సీజన్లోనే ఆకట్టుకున్నాడు. ఫలితంగా అతనికి ఈ ఏడాదే టాస్మానియా తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం కూడా దక్కింది. అరంగేట్రం మ్యాచ్లోనే నిఖిల్ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. గత నెలలో బ్యాటర్గానూ సత్తా చాటి, న్యూ సౌత్ వేల్స్పై శతకంతో విరుచుకుపడ్డాడు. -
క్యాన్సర్ను జయించి మళ్లీ బరిలోకి దిగనున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్ (Nic Maddinson) తన జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలును జయించి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్కు ఈ ఏడాది ప్రారంభంలో టెస్టిక్యులర్ క్యాన్సర్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను తొమ్మిది వారాలు కెమోథెరపీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను క్యాన్సర్ను పూర్తిగా జయించి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్ త్వరలో ప్రారంభం కానున్న (డిసెంబర్ 14) బిగ్బాష్ లీగ్ 2025-26 కోసం సిడ్నీ థండర్తో ఒప్పందం చేసుకున్నాడు. క్యాన్సర్పై పోరాటంలో భాగంగా మాడిన్సన్ గత సీజన్ (బీబీఎల్ 2024-25) మొత్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సిడ్నీ థండర్తో బీబీఎల్ జర్నీని కొత్తగా ప్రారంభించనున్నాడు. థండర్తో ఒప్పందం అనంతరం మాడిన్సన్ మాట్లాడుతూ.. కొన్ని వెనుకడుగులు ఉన్నా కుటుంబం, స్నేహితులు, క్లబ్ ఇచ్చిన మద్దతుతో మళ్లీ ముందుకు వచ్చాను. ఈ సీజన్లో జట్టుకు తనవంతు సాయం చేసి, గత సీజన్ కంటే ఓ మెట్టు పైకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని అన్నాడు.మాడిన్సన్ థండర్తో జతకట్టడంపై ఆ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోపెలాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో మాడిన్సన్ తప్పక ప్రభావం చూపుతాడని ఆశాభావంగా ఉన్నాడు. 33 ఏళ్ల మాడిన్సన్ బిగ్బాష్ లీగ్లో ఇప్పటివరకు మూడు జట్లకు (సిడ్నీ సిక్సర్స్ (7 సీజన్లు), మెల్బోర్న్ స్టార్స్ (3), మెల్బోర్న్ రెనెగేడ్స్ (3)) ప్రాతినిథ్యం వహించాడు. సిడ్నీ థండర్ అతని నాలుగో జట్టు. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన మాడిన్సన్ ఆసీస్ తరఫున 2013-18 మధ్యలో 3 టెస్ట్లు, 6 టీ20లు ఆడాడు. మాడిన్సన్ 2014 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున కూడా 3 మ్యాచ్లు ఆడాడు. బిగ్బాష్ లీగ్ మినహా అతను ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. -
సంజూకు సరిపడా ఛాన్సులు.. ఇకపై: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సంజూ శాంసన్కు వరుస అవకాశాలు వచ్చాయి. అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా టీ20 ఓపెనర్గా ఈ కేరళ బ్యాటర్ అదరగొట్టాడు. వికెట్ కీపర్గా సేవలు అందిస్తూ.. టాపార్డర్లో రాణించాడు. ఈ క్రమంలో మూడు శతకాలు బాది జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.విఫలమైనా.. అయితే, ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) తిరిగి రావడంతో.. సంజూ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. అభిషేక్కు జోడీగా వస్తున్న గిల్ చాలాసార్లు విఫలమైనా.. యాజమాన్యం మాత్రం అతడికే మద్దతుగా నిలుస్తోంది. భవిష్య కెప్టెన్గా అతడికి పెద్ద పీట వేస్తూ ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లిస్తోంది.మరోవైపు.. గిల్ రాకతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం దక్కినా.. బ్యాటింగ్ ఆర్డర్లో ఎప్పుడు రావాలో తెలియని పరిస్థితి. ఓసారి వన్డౌన్లో.. మరోసారి ఐదో స్థానంలో మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్కు పంపిస్తోంది.సంజూపై వేటు వేసి.. జితేశ్కు చోటుఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరిగా ఐదో స్థానంలో వచ్చి విఫలమైన సంజూ (4 బంతుల్లో 2)ను.. ఆ తర్వాత మేనేజ్మెంట్ తప్పించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత సంజూపై వేటు వేసి.. వికెట్ కీపర్ కోటాలో జితేశ్ శర్మను ఆడించింది.ఈ క్రమంలో తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్లోనూ సంజూకు మొండిచేయి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. సంజూ కంటే తమకు గిల్ ఎక్కువని సూర్య చెప్పకనే చెప్పాడు.గిల్కే పెద్దపీట వేస్తామన్న సూర్యసౌతాఫ్రికాతో కటక్ వేదికగా తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంజూ టాపార్డర్లో రాణిస్తాడు. అయితే, జట్టులో ఓపెనర్లు కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి.నిజానికి సంజూ ఓపెనర్గా అదరగొట్టాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గతేడాది శ్రీలంక పర్యటనలో గిల్ ఓపెనర్గా ఉన్నాడు. సంజూ కంటే ముందు అతడే జట్టుతో ఉన్నాడు. కాబట్టి గిల్ తన స్థానంలోకి తిరిగి వచ్చేందుకు వందశాతం అర్హుడు.కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాముసంజూకు మేము కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము. అతడు కూడా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు అదొక సానుకూలాంశం. మూడు- ఆరు వరకు ఏ స్థానంలో ఆడేందుకైనా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు.టాపార్డర్లో ఆడుతూనే.. అవసరం వచ్చినపుడు మిడిల్ ఆర్డర్లోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం మా జట్టుకు అదృష్టం లాంటిదే. తుదిజట్టులో స్థానం ఇంత మంది ఆటగాళ్లు పోటీపడటం.. సెలక్షన్ విషయంలో మాకు ఇలాంటి తలనొప్పి ఉండటం ఎంతో బాగుంటుంది. వరల్డ్కప్ ఆశలు ఆవిరేనా?మా జట్టుకు ఉన్న వైవిధ్యమైన ఆప్షన్లను ఇది సూచిస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రయోగాల పేరిట సంజూను పక్కనపెట్టడం చూస్తుంటే.. ఈసారి కూడా అతడికి వరల్డ్కప్లో ఆడే అవకాశం ఇవ్వరనే అనిపిస్తోంది. చదవండి: వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
పునర్జన్మ పొందిన 'గిల్లీ దండ'.. ఇప్పుడు లీగ్గా..!
స్పెయిన్లోని గలీషియా గ్రామాలు, పట్టణాల్లో శతాబ్దాల నాటి ప్రాచీణ ఆట మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. బిల్లార్డా (గిల్లీ దండ) అనే ఈ ఆట ఇప్పుడు 'లీగా గలేగా డి బిల్లార్డా' అనే లీగ్ రూపంలో అక్కడి ప్రజల ముందుకు రానుంది. ఈ ఆట సాంప్రదాయ వారసత్వాన్ని ఆధునిక క్రీడాస్ఫూర్తితో కలిపి ముందుకు తీసుకెళ్తోంది. బిల్లార్డా అంటే ఏమిటి..?ఈ ఆటలో రెండు కర్రలు ఉపయోగిస్తారు. చిన్న కర్ర (బిల్లార్డా) నేలపై ఉంచుతారు. పెద్ద కర్రతో దానిని కొట్టి గాల్లోకి ఎగరేస్తారు. లక్ష్యం.. బిల్లార్డాను దూరంగా కొట్టి, దశలవారీగా గోల్ లైన్ దాటించడం. ఈ ఆటను భారత దేశంలో గిల్లీ దండ అని పిలుస్తారు. ఈ ఆటలో నైపుణ్యం, ఖచ్చితత్వం, వ్యూహం అవసరం. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ పోటీలు ఉత్సాహభరితంగా, సామూహికంగా సాగుతాయి. సంప్రదాయ ఆటలు 21వ శతాబ్దంలో కూడా ఎలా నిలదొక్కుకుంటాయో బిల్లార్డా చూపిస్తోంది. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, గ్రామీణ గుర్తింపును తిరిగి పొందే ఉద్యమని ఔత్సాహికులు అంటున్నారు. 'లీగా గలేగా డి బిల్లార్డా' ఇప్పుడు పోటీ లీగ్గా మారి, జానపద క్రీడలు కూడా కాలానుగుణంగా మార్పులు స్వీకరించి కొత్త తరాలను ప్రేరేపించగలవని నిరూపిస్తోంది. -
ఛీ.. ఇదేం బుద్ధి?: హార్దిక్ పాండ్యా ఆగ్రహం
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోపమొచ్చింది. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ పాపరాజీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త యాంగిల్స్లో ఫొటోలు తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారంటూ మండిపడ్డాడు. అసలేం జరిగిందంటే..భార్య నటాషా స్టాంకోవిక్కు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మళ్లీ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. మోడల్ మహీక శర్మతో అతడు కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. తన పుట్టినరోజు (అక్టోబరు 11) సందర్భంగా మహీక (Mahieka Sharma)తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించాడు. ఇక అప్పటి నుంచి జిమ్ మొదలు బీచ్ వరకు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు.కాగా పాపరాజీల వల్ల మహీక శర్మ ఇటీవల అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె రెస్టారెంట్ నుంచి మెట్లు దిగి వస్తున్న క్రమంలో కింద ఉన్న పాపరాజీలు కెమెరాలు క్లిక్మనిపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ హార్దిక్ పాండ్యా తీవ్ర స్థాయిలో పాపరాజీల తీరుపై మండిపడ్డాడు.తీయకూడని యాంగిల్లో ఫొటో..‘‘ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే జీవితాన్ని నేను ఎంచుకున్నాను. అందువల్ల అందరూ నన్ను గమనిస్తూ ఉంటారని తెలుసు. కానీ రోజు కొంతమంది హద్దులు దాటేశారు. మహీక బాంద్రా రెస్టారెంట్లో మెట్లు దిగి వస్తున్నపుడు తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారు. అసలు ఇలాంటి వాటికి ఏ మహిళా అర్హురాలు కాదు.ప్రైవేట్ మూమెంట్అంత ఘోరంగా తనను ఫొటో తీశారు. ప్రైవేట్ మూమెంట్ను ఫొటో తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారు. మీ చెత్త సంచనాల కోసం తనని ఇబ్బంది పెట్టారు. మీ హెడ్లైన్స్ కోసం ఇతరుల గౌరవ, మర్యాదలు పణంగా పెడతారా? ప్రతి మహిళ తనదైన శైలిలో జీవించేందుకు అర్హురాలు.అలాగే ప్రతి ఒక్కరికి తాము చేసే పనుల్లో కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. మీడియా సోదరులకు నా విజ్ఞప్తి. మీ వృత్తిని నేను గౌరవిస్తాను. మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తాను. కానీ మీరు కొంచెం పద్ధతైన పనులు చేయండి.కాస్త మానవత్వం చూపండిప్రతీ విషయాన్ని క్యాప్చర్ చేయాల్సిన పనిలేదు. ప్రతీ యాంగిల్లోనూ ఫొటో తీయాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో కాస్త మానవత్వం చూపండి. థాంక్యూ’’ అంటూ పాపరాజీల తీరును హార్దిక్ పాండ్యా ఏకిపారేశాడు. ఇకనైనా బుద్ధిగా వ్యవహరించాలంటూ చురకలు అంటించాడు.కాగా గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా... ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరిస్తూ.. ఒక్కోసారి వారి అనుమతి లేకుండానే ఫొటోలు తీసి వివిధ మాధ్యమాలకు అమ్ముకునే ఫొటోగ్రాఫర్లను పాపరాజీలు అంటారు.చదవండి: చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్ -
'మహా' విషాదం.. క్రికెట్ బంద్..!
ఒడిశాలోని కటక్ నగరంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టి20 మ్యాచ్ మంగళవారం రాత్రి జరగనుంది. స్థానిక బారామతి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ టికెట్ల కోసం నాలుగు రోజుల క్రితం అభిమానులు పోటెత్తారు. టికెట్లు దక్కించుకునేందుకు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు అభిమానులు వెనుకాడలేదని స్థానిక మీడియా వెల్లడించింది. క్రికెట్ అంటే పిచ్చా అనేంతగా ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడ్డారు. కటక్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నువాగర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. కారణం 21 ఏళ్ల క్రితం జరిగిన ఓ విషాదం.ఏం జరిగింది?జగత్సింగ్పూర్ జిల్లాలోని నువాగర్ గ్రామం (Nuagarh village) ఒకప్పుడు క్రికెట్కు ప్రసిద్ధి. ఆ ఊరి ప్రజలకు క్రికెట్ అంటే ఇష్టం. 2004 ముందు వరకు గ్రామస్తులు నిరంతరం క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తూ ఉండేవారు. దీంతో ఆ ఊరిలో ఎప్పుడు చూసినా క్రికెట్ సందడి కనిపించేది. అంతేకాదు నువాగర్ గ్రామానికి ప్రత్యేకంగా ఉత్కల్మణి క్రికెట్ క్లబ్ పేరుతో ఒక జట్టు కూడా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంది. 2004, మార్చి 1 ముందు వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ రోజు నువాగర్ గ్రామం చరిత్రలో దుర్దినంగా మిగిలిపోయింది.కేంద్రపార జిల్లా మహాకలపాడలో స్థానిక టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 2004, మార్చి 1న ఉత్కల్మణి క్రికెట్ క్లబ్ (Utkalmani youth club) జట్టు పడవలో బయలుదేరింది. 15 మంది ఆటగాళ్లు, మరో ఏడుగురు కలిసి పయనమయ్యారు. బహాకుడా ఘాట్ సమీపంలో దురదృష్టవశాత్తు పడవ ప్రమాదానికి గురవడంతో 13 మంది క్రికెటర్లు మహానదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఊహించని విషాదంతో నువాగర్ గ్రామం దిగ్బ్రాంతికి గురైంది. అప్పటివరకు స్థానికంగా క్రికెట్కు కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఆ ఊరిలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. క్రికెట్కు ఫుల్స్టాప్ పడింది. ఆ దుర్ఘటన తర్వాత తమ ఊరిలో క్రికెట్ ఆడరాదని గ్రాస్తులంతా నిర్ణయం తీసుకున్నారని నువాగర్ మాజీ సర్పంచ్ సుధాల్ స్వాన్ మీడియాకు తెలిపారు.పెళ్లైన 6 నెలలకే..పడవ ప్రమాదంలో చనిపోయిన 13 మంది ఆటగాళ్ల పేరుతో 2007లో స్మారక స్థూపం (memorial pillar) ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘటన రోజాలిని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె భర్త బిశ్వజిత్ రే ఈ ప్రమాదంలో చనిపోయాడు. వారిద్దరికీ పెళ్లయి అప్పటికే ఆరు నెలలు మాత్రమే అయింది. ''నా భర్త కుడిచేతి వాటం బ్యాటర్, మీడియం పేస్బౌలర్. అప్పుడప్పుడు వికెట్ కీపర్గానూ ఉండేవాడు. క్రికెట్పై ఉన్న మక్కువే అతడి ప్రాణాలు తీసింది. చనిపోయిన 13 మంది క్రీడాకారుల కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం రూ. 25 వేలు చొప్పున సహాయం అందించింద''ని రోజాలిని గుర్తు చేసుకున్నారు.క్రికెట్ చూడకూడదనుకున్నాంఇదే దుర్ఘటనలో చనిపోయిన ప్రదీప్ పరిడా కుటుంబానికి దాదాపు ఇదే పరిస్థితి. ఏడాది ముందే అతడికి పెళ్లైంది. ''నదిలో మునిగి చనిపోయిన 13 మందిలో నా భర్త కూడా ఉన్నాడు. నాతో పాటు, ఆరు నెలల కూతురిని వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయాడు. మా ఊరిలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత క్రికెట్ చూడకూడదని నిర్ణయించుకున్నామ''ని ప్రదీప్ భార్య టికీ చెప్పారు. చదవండి: హెచ్సీఏ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం -
చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్
సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. ఓ క్రికెటర్ దేశవాలీ అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూసి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం పొందాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్.. ఏమిటా స్టోరీ..?బరోడాకు చెందిన 26 ఏళ్ల వికెట్కీపర్ బ్యాటర్ అమిత్ పాసి తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నిన్ననే తన దేశవాలీ అరంగేట్రం (టీ20) చేశాడు. తొమ్మిదేళ్లు నిరీక్షించినందుకు అతనికి మంచి ప్రతిఫలమే దక్కింది. తొలి మ్యాచ్లోనే (SMATలో సర్వీసెస్పై) వరల్డ్ రికార్డు సెంచరీ చేశాడు.టీ20 అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా పాకిస్తాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ (2015) ప్రపంచ రికార్డును సమం చేశాడు. పాసి, బిలాల్ ఇద్దరూ టీ20 అరంగేట్రాల్లో 114 పరుగులు చేశారు. టీ20 అరంగేట్రంలో ఓ ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్ ఇదే.ఏళ్ల తరబడి అవకాశం కోసం ఎదురుచూసినా ఫలితం దక్కకపోవడంతో పాసి ఓ దశలో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్ వైపు మళ్లాలని అనుకున్నాడు. కొద్ది రోజులు ఆ ప్రయత్నం కూడా చేశాడు. జితేశ్ శర్మ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో ఎట్టకేలకు పాసి కల నెరవేరింది.అరంగేట్రం మ్యాచ్తోనే హీరో అయిపోయాడు. 24 బంతుల్లో అర్ద సెంచరీ చేసి కేవలం 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా అరంగేట్రంలో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.పాసి ఉదంతం క్రీడలో అయినా జీవితంలో అయినా నిరీక్షణ అవసరమన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆశ కోల్పోకుండా పట్టుదలతో ఎదురుచూసే వారికి పాసికి వచ్చినట్లే అవకాశాలు వస్తాయి. పాసికి 2016–17 సీజన్లో బరోడా అండర్–19 జట్టులో చోటు దక్కినా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రతి సీజన్లో జట్టుకు ఎంపికైనా, తుది పదకొండులో అవకాశాలు రాలేదు. స్థానిక స్థాయిలో నిరంతరం రాణించినా, సీనియర్ స్థాయి అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. పాండ్యా సోదరులు హార్దిక్, కృనాల్ ప్రోత్సాహంతో పాసి ఆశ కోల్పోకుండా నిరంతర ప్రయత్నం చేశాడు. పాండ్యా సోదరులు పాసి గురించి తెలిసి ఎదురుపడిన ప్రతిసారి ధైర్యం చెప్పేవారు. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సిద్ధంగా ఉండాలని హార్దిక్ ఇచ్చిన సలహా అతనికి ప్రేరణగా నిలిచింది.ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు ప్రతిఫలం దక్కింది. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ చేసిన పాసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ధోనిని ఆరాధించే పాసి, అతనిలాగే దూకుడైన ఆటతీరుతో బ్యాటింగ్ చేస్తాడు. పాసి కుటుంబం ఉత్తర్ప్రదేశ్లోని రాయబరేలీ నుంచి నాలుగు దశాబ్దాల క్రితం వడోదరాకు వలస వెళ్లింది. అతని కుటుంబానిది గుజరాత్లో నీటి సరఫరా చేసే వ్యాపారం. ఆర్థికంగా పాసికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అతడి అన్నయ్య కూడా స్థానిక స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. ప్రస్తుతం అతను కూడా కుటుంబ వ్యాపారంలో భాగంగా ఉన్నాడు. మొత్తంగా చూస్తే పాసి ఉదంతం అవకాశాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూసే వారికి ఓ ప్రేరణగా నిలుస్తుంది. అవకాశాలు ఆలస్యంగా వచ్చినా, పట్టుదల, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం ఉంటే ఒకే ఇన్నింగ్స్ జీవితాన్ని మార్చేస్తుందని పాసి కథ సూచిస్తుంది. -
టీమిండియాకు ఆల్రౌండర్లు కావలెను!
ముఖ్యమైన ప్రకటన.. టీమిండియాకు ఆల్రౌండర్లు కావలెను. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో నాణ్యమైన ఆల్రౌండర్ల లోటు కన్పిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సుందర్ వంటి వారు ఉన్నప్పటికి.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ల విభాగంలో భారత్ చాలా వెనకబడి ఉంది. ఒక్క హార్ధిక్ పాండ్యా తప్ప చెప్పుకోదగ్గ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత లేరు. అయితే హార్దిక్ ఫిట్నెస్ సమస్యల వల్ల ఎప్పుడు జట్టులో ఉంటాడో.. ఎప్పుడు బయట ఉంటాడో తనకే తెలియదు. నితీశ్ కుమార్ రెడ్డిని మూడు ఫార్మాట్లలో ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నప్పటికి.. ఆశించినంతమేర ఫలితాలు మాత్రం రావడం లేదు. మొదటిలో అతడిపై నమ్మకం ఉంచిన గంభీర్ అండ్ కో.. ఇప్పుడు ఎక్కువగా స్పెషలిస్ట్ బ్యాటర్గానే పరిగణిస్తోంది. టీ20 సెటాప్లో భాగంగా ఉన్న శివమ్ దూబే పరిస్థితి కూడా అంతంతమాత్రమే. SENA దేశాలతో పోలిస్తే మనం చాలా వెనకబడి ఉన్నాము. గతంలో కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ వంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు ప్రపంచ క్రికెట్నే శాసించారు. కచ్చితంగా అటువంటి ఆల్రౌండర్లు భారత జట్టుకు అవసరం.ఆల్రౌండర్ల ఉపయోగాలు ఏంటి?జట్టు సమతుల్యంగా ఉండాలంటే కచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు కావాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సేనా దేశాల విజయాలలో ఆల్రౌండర్లదే కీలక పాత్ర. ఒక్క ఆస్ట్రేలియాలోనే మిచెల్ మార్ష్, గ్రీన్, అబాట్, స్టోయినిష్ వంటి అద్బుతమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు. నిజమైన ఫాస్ట్-బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోతే, జట్టు కూర్పు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. టీమిండియా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. ప్రతీ మ్యాచ్కు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక ఒక సమస్యగా మారింది. అదనపు బ్యాటర్ను ఆడిస్తే బౌలింగ్ బలహీనపడుతుంది. ఐదుగురు బౌలర్లతో ఆడితే బ్యాటింగ్ లైనప్ బలహీనంగా మారుతుంది. ఈ అసమతుల్యత కారణంగానే భారత్ విదేశాల్లో కీలక మ్యాచ్లు, టెస్ట్ సిరీస్లలో ఓడిపోయింది. భారత జట్టులో స్పిన్ ఆల్రౌండర్లు ఎక్కువగా ఉండడంతో ఎవరికి అవకాశమివ్వాలో తెలియక టీమ్ మెనెజ్మెంట్ తలలు పట్టుకుంటుంది. జడేజా, అక్షర్ వంటి వారు ఉపఖండ పిచ్లోపై రాణిస్తున్నప్పటికి విదేశీ గడ్డపై బంతితో సత్తాచాటలేకపోతున్నారు. దీంతో విదేశీ పర్యటనలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ల లోటు స్పష్టంగా కన్పిస్తోంది.శార్ధూల్ రీ ఎంట్రీ ఇస్తాడా?బీసీసీఐ సెలక్టర్లు మరోసారి శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆల్రౌండర్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అసవరముంది. శార్ధూల్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి దేశవాళీ క్రికెట్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఫార్మాట్లకు అతీతంగా ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అతడు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే లార్డ్ ఠాకూర్ మరోసారి సత్తా చాటుతున్నప్పటికీ.. ఇప్పట్లో తిరిగి పునరాగమనం చేసే సూచనలు కన్పించడం లేదు.అయితే, ఠాకూర్ మాత్రం కూడా వన్డే ప్రపంచకప్-2027లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. అతడితో పాటు రాజ్ అంగద్ బవా, సూర్యాంశ్ షెడ్గే వంటివారిపై కూడా సెలక్టర్లు దృష్టిసారించాల్సి ఉంది. అండర్-19 ప్రపంచకప్లో రాజ్ అంగద్ బవా బంతితో పాటు బ్యాట్తో కూడా అద్భుతంగా రాణించాడు. సూర్యాంశ్కు కూడా సీమ్-బౌలింగ్ ఆల్రౌండర్గా రాణించే సత్తా ఉంది. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
విధ్వంసకర ఇన్నింగ్స్!.. సన్నీ లియోన్ ఫొటో షేర్ చేసిన అశ్విన్
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో తమిళనాడు జట్టుకు చెందిన ఓ ఆటగాడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 333కు పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో సన్నీ లియోన్ (Sunny Leone) ఫొటో షేర్ చేశాడు.అసలు.. ఆ ఆటగాడికి.. అశూ ఈ పోస్ట్ పెట్టడానికి సంబంధం ఏమిటి అంటారా?!... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో భాగంగా తమిళనాడు జట్టు సోమవారం సౌరాష్ట్రతో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. టాస్ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ విశ్వరాజ్ జడేజా మెరుపు అర్ధ శతకం (39 బంతుల్లో 70)తో చెలరేగగా.. సమ్మార్ గజ్జార్ (42 బంతుల్లో 66) ధనాధన్ దంచికొట్టాడు. తమిళనాడు బౌలర్లలో సీలం బరాసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇసక్కిముత్తు రెండు వికెట్లు తీశాడు. ఆర్. రాజ్కుమార్, సన్నీ సంధు చెరో వికెట్ దక్కించుకున్నారు. సాయి సుదర్శన్ మెరుపు శతకంఇక సౌరాష్ట్ర విధించిన 184 లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు 18.4 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్, టీమిండియా స్టార్ సాయి సుదర్శన్ మెరుపు శతకం (55 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో దుమ్ములేపాడు.తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులుమరోవైపు.. ఎనిమిదో స్థానంలో వచ్చిన బౌలర్ సన్నీ సంధు (Sunny Sandhu) కేవలం తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగానే తమిళనాడు... సౌరాష్ట్రపై మూడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.అసలు విషయం ఇదీ!ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. నటి సన్నీ లియోన్ ఫోటోకు.. చెన్నైలోని సంధు స్ట్రీట్ ఫోటోను జతచేసి షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. అశూ ఇలాంటి పోస్ట్ చేశాడని ఎందుకు చర్చించుకున్నారు. అయితే, అంతలోనే మరికొంత మంది అశూ పోస్ట్ వెనుక ఉన్న అర్థాన్ని పసిగట్టారు. సౌరాష్ట్రతో మ్యాచ్లో అద్భుతంగా రాణించిన సన్నీ సంధును ప్రశంసించే క్రమంలోనే అశూ ఈ మేరకు పోస్ట్ పెట్టాడని, దీనిని తాము సులభంగానే డీకోడ్ చేశామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అశూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే? 👀 👀 pic.twitter.com/BgevYfPyPJ— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 9, 2025 -
ఇంగ్లండ్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
యాషెస్ సిరీస్ 2025-26లో వరుస ఓటములతో సతమవుతున్న ఇంగ్లండ్కు మరో భారీ షాక్ తగిలింది. ఈ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఎడమ మోకాలి గాయం కారణంగా యాషెస్ సిరీస్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు.ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వుడ్ మోకాలి గాయం బారిన పడ్డాడు. దీంతో ఆ టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స (knee surgery) చేయించుకుని దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.పూర్తి ఫిట్నెస్ సాధించడంతో అతడిని ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ఎంపిక చేసింది. అయితే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడికి మళ్లీ ఎడమ మోకాలి గాయం తిరగబెట్టింది. అతడు కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించారు.మూడేళ్ల తర్వాత.. ఇక వుడ్ స్థానంలో యార్క్షైర్ పేసర్ మ్యాథ్యూ ఫిషర్ ను జట్టులోకి తీసుకున్నారు. మ్యాథ్యూ ఫిషర్ ఇంగ్లండ్ జట్టుకు ఎంపిక కావడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఫిషర్ 2022లో ఇంగ్లండ్ తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఒకే మ్యాచ్ ఆడి ఒక్క వికెట్ సాధించాడు.ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అయితే అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అని చెప్పాలి. ఎందకంటే ఇప్పటికే బ్యాకప్ పేసర్లగా మ్యాథ్యూ పాట్స్ (Matthew Potts), జోష్ టంగ్ (Josh Tongue) వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ కూడా గాయం కారణంగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం 0-2 తేడాతో వెనకంజలో ఉంది.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
భారత్- సౌతాఫ్రికా మధ్య మంగళవారం కటక్ వేదికగా తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్తో టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నారు.టెస్టు సారథి గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా సఫారీలతో రెండో టెస్టు, వన్డే సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోలుకుని పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించిన గిల్.. నేరుగా తుదిజట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.మరోవైపు.. ఆసియా కప్-2025 టోర్నీ సందర్భంగా గాయపడిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)చాన్నాళ్ల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. జితేశ్ శర్మకే ప్రాధాన్యంఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన అభిప్రాయాలు పంచుకున్నాడు. గిల్ రాకతో సంజూ శాంసన్పై వేటు తప్పదన్న పఠాన్.. వికెట్ కీపర్గా జితేశ్ శర్మకే తొలి ప్రాధాన్యం దక్కుతుందని పేర్కొన్నాడు.శివం దూబేకు నో ఛాన్స్అదే విధంగా.. హార్దిక్ వల్ల ఓ ఆల్రౌండర్కు మొండిచేయి తప్పదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇక ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ- శుబ్మన్ గిల్ ఉంటారన్న అతడు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్తో పాటు.. వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడని పేర్కొన్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యాతో పాటు అక్షర్ పటేల్ తుదిజట్టులో ఉంటాడన్న ఇర్ఫాన్ పఠాన్.. శివం దూబేకు ఛాన్స్ ఉండదని అభిప్రాయపడ్డాడు.ఇర్ఫాన్ ఓటు అర్ష్కేఇక పేసర్ల కోటాలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్కు చోటు దక్కుతుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అయితే, గత కొంతకాలంగా యువ పేసర్ హర్షిత్ రాణా కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని.. అతడికి గనుక మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వాలని భావిస్తే అర్ష్పైనే వేటు పడుతుందని అంచనా వేశాడు.ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలనని హర్షిత్ ఆస్ట్రేలియా గడ్డ మీద నిరూపించుకున్నాడని.. కాబట్టి యాజమాన్యం అతడి వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాను మాత్రం అర్ష్దీప్కే ఓటు వేస్తానని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా వెల్లడించాడు.సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
చరిత్ర సృష్టించిన రస్సెల్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఎవరీకి సాధ్యం కాని రికార్డును సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 5000 ప్లస్ రన్స్, 500 ప్లస్ వికెట్లు, 500 ప్లస్ సిక్సర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా రస్సెల్ రికార్డులెక్కాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో భాగంగా దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రస్సెస్ ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో రస్సెల్ అబుదాబి నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్లో 6 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే లీగ్లో 500 టీ20 వికెట్ల మైలు రాయిని కూడా రస్సెల్ అందుకున్నాడు. ఇప్పుడు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సిక్సర్ల ఘనతను అందుకున్నాడు.ఇక ఈ ఏడాది జూలైలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రస్సెల్.. ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే రస్సెల్ అనూహ్యంగా ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. మినీ వేలానికి ముందు కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ కరేబియన్ యోదుడు వేలంలోకి వస్తాడని భావించారు. కానీ అంతలోనే రస్సెల్ క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకొని అందరికి షాకిచ్చాడు. అతడిని కేకేఆర్ యాజమాన్యం పవర్ కోచ్గా నియమించింది. ఐపీఎల్-2026లో కేకేఆర్ బ్యాక్రూమ్ స్టాప్లో రస్సెల్ భాగం కానున్నాడు.టీ20ల్లో 500 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..రషీద్ ఖాన్ – 500 మ్యాచ్లు, 681 వికెట్లుడ్వేన్ బ్రావో – 582 మ్యాచ్లు, 631 వికెట్లుసునీల్ నరైన్ – 569 మ్యాచ్లు, 602 వికెట్లుఇమ్రాన్ తాహిర్ – 446 మ్యాచ్లు, 570 వికెట్లుషకీబ్ అల్ హసన్ – 462 మ్యాచ్లు, 504 వికెట్లుఆండ్రీ రస్సెల్ – 576 మ్యాచ్లు, 500 వికెట్లుచదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
హెచ్సీఏ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
సాక్షి, సికింద్రాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైఫల్యం మరోసారి బయటపడింది. జింఖానా మైదానం వద్ద అండర్ 14 సెలక్షన్ కోసం క్రికెట్ క్రీడాకారులు బారులు తీరారు. ఉదయం నుంచి వీరిని ఎండలో నిల్చోబెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెలక్షన్ సభ్యులు చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కనీసం గ్రౌండ్లోకి కూడా అనుమతించకుండా రోడ్డుపై ఎండలో నిల్చోబెట్టారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ యాజమాన్యం తమకేమీ పట్టదన్నట్లు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం. -
చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్ బుమ్రా..
భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 మంగళవారం(డిసెంబర్ 9) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సఫారీలతో వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. తొలి టీ20కు ముందు బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల క్లబ్లో చేరేందుకు బుమ్రా ఒకే ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.అరుదైన రికార్డుపై కన్ను..కటక్ టీ20లో బుమ్రా వికెట్ సాధిస్తే వంద వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టిస్తాడు. ఈ పేస్ గుర్రం ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్లలలో వంద వికెట్లను పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 80 మ్యాచ్లు ఆడి 99 వికెట్లు సాధించాడు. అయితే భారత తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అర్ష్దీప్ సింగ్ 105 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్లో అర్ష్దీప్ను కూడా బుమ్రా అధిగమించే అవకాశముంది. అదేవిధంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి బుమ్రాకు 18 వికెట్లు మాత్రమే అవసరం. బుమ్రా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 221 మ్యాచ్లు ఆడి 482 వికెట్లు సాధించాడు.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
‘రూ.830 కోట్లు కేటాయించాం.. 1191 పోస్టులు ఖాళీ’
న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సిబ్బంది తక్కువగా ఉందనే విషయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అంగీకరించారు. త్వరలోనే వీటిని పూర్తి చేసి ‘సాయ్’ను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. గత ఆగస్టులో క్రీడలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ‘సాయ్’ (SAI)లో నిధుల కొరత ఉందని, తగినంత సిబ్బంది కూడా లేదని తమ నివేదికలో వెల్లడించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ లోక్సభలో ఎంపీ ఆడూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నపై మాండవీయ స్పందించారు. ‘ప్రభుత్వం ఈ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. స్పోర్ట్స్ అథారిటీలో మొత్తం 1191 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కొన్నింటికి సంబంధించిన నియామక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బడ్జెట్లో ‘సాయ్’కు రూ.830 కోట్లు కేటాయించాం. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మా వద్దకు వచ్చిన ప్రతిపాదనలను బట్టి ఈ నిధులు ఇస్తాం. అయితే ఏడాది మధ్యలో కూడా అవసరమైతే తగిన పరిశీలన అనంతరం అదనపు నిధులు కూడా ఇస్తాం’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి గణాంకాలు తాము నమోదు చేయడం లేదని... అయితే పోటీలు, శిక్షణ సమయంలో వారికి సరైన, సురక్షిత వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని కూడా మాండవీయ పేర్కొన్నారు. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
‘అంపైర్లు నన్ను తప్పించాలనే అలా చేశా’
లండన్: ఏడాది క్రితం బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా సస్పెన్షన్కు గురయ్యాడు. కౌంటీ క్రికెట్లో సర్రే తరఫున ఆడుతున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. సీజన్లో అతను ఆడిన ఈ ఏకైక నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్లో (సోమర్సెట్తో) షకీబ్ రెండు ఇన్నింగ్స్లలో కలిపి మొత్తం 63.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. అలసిపోయాను..అయితే తీవ్ర అలసట వల్ల ఉద్దేశపూర్వకంగానే తాను ‘చకింగ్’కు పాల్పడ్డానని, అంపైర్లు తనను బౌలింగ్ నుంచి తప్పించాలని కోరుకున్నట్లు షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) వెల్లడించాడు. ‘ఆ ఒక్క మ్యాచ్లోనే నేను దాదాపు 70 ఓవర్లు బౌలింగ్ చేశాను. నేను ఆడిన టెస్టుల్లో కూడా ఎప్పుడూ ఇన్ని ఓవర్లు వేయలేదు. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ (BAN Vs PAK)తో రెండు టెస్టులు ఆడి వచ్చాను. చాలా అలసిపోయాను. అందుకే కావాలనే అలా సందేహాస్పద రీతిలో బౌలింగ్ చేస్తూ పోయాను. అంపైర్లు ఎలాంటి హెచ్చరిక కూడా లేకుండా నన్ను బౌలింగ్ నుంచి తప్పించారు. ఆ తర్వాత జరిగిన పరీక్షలో కూడా నేను విఫలమయ్యాను. మరోసారి సర్రేకు వెళ్లిపోయానుఅనంతరం మళ్లీ రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసి సాధారణ స్థితికి రావడంతో మరోసారి సర్రేకు వెళ్లిపోయాను’ అని షకీబ్ గుర్తు చేసుకున్నాడు. సర్రే మ్యాచ్ తదనంతర పరిణామాల్లో సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా ముందుగా బంగ్లా క్రికెట్ బోర్డు, ఆపై ఐసీసీ కూడా షకీబ్పై నిషేధం విధించాయి. అయితే బౌలింగ్ యాక్షన్కు సంబంధించి తొలి రెండు పరీక్షల్లో విఫలమైన షకీబ్...మూడో పరీక్షలో మాత్రం సఫలమయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ బౌలింగ్ చేసేందుకు అతనికి అనుమతి లభించింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలోకానీ బంగ్లాదేశ్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత ఏడాది భారత్తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అతడిని జాతీయ జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే, తాను పూర్తిస్థాయిలో రిటైర్ కాలేదని.. సొంత ప్రజల ముందు ఆడి ఆటకు స్వస్తి పలకాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
మిచెల్ మార్ష్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆసీస్ దేశవాళీ డొమెస్టిక్ టెస్ట్ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ అనంతరం ఫస్ట్-క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు మార్ష్ తెలిపాడు.డొమాస్టిక్ క్రికెట్లో మార్ష్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి జాతీయ జట్టు తరపున టెస్టు క్రికెట్ ఆడేందుకు మాత్రం సిద్దంగా ఉన్నానని మిచెల్ స్పష్టం చేశాడు."ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. పెర్త్ స్కార్చర్స్, వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో నా ప్రయాణం ఒక అద్భుతం. భవిష్యత్తులో కూడా డబ్ల్యూఏ కోసం ఏమి చేయడానికైనా సిద్దమని" ఓ ప్రకటనలో మార్ష్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్లో పెర్త్ స్కార్చర్స్కు మార్ష్ నాయకత్వం వహిస్తున్నాడు. పెర్త్ స్కార్చర్స్ యాజమాన్యంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ కూడా భాగంగా ఉంది."వైట్బాల్ క్రికెట్లో తనను నిరూపించుకున్న మార్ష్.. టెస్టుల్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. దాదాపు నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్కు దూరంగా ఉన్న 2023 యాషెస్ సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. తన పునరాగమన మ్యాచ్లో సెంచరీ చేసి దుమ్ములేపాడు. ఆ తర్వాత అతడు తన ఫామ్ను కోల్పోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మార్ష్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసింది. అతడు చివరగా గతేడాది డిసెంబర్లో భారత్పై చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. షెఫీల్డ్ షీల్డ్లో మార్ష్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 2744 పరుగులతో పాటు 82 వికెట్లు పడగొట్టాడుచదవండి: Ashes Test series: ఆస్ట్రేలియాకు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్ -
ఆస్ట్రేలియాకు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
యాషెస్ సిరీస్ 2025-26లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజల్వుడ్ హ్యామ్స్ట్రింగ్, కాలి మడమ గాయం కారణంగా మిగిలిన సిరీస్ మొత్తాన్ని దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ ధ్రువీకరించాడు. టీ20 ప్రపంచకప్-2026 సమయానికి జోష్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.ఈ స్టార్ రైట్ఆర్మ్ పేసర్ గత నెలలో షెఫీల్డ్ షీల్డ్లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడుతున్నప్పుడు తొడ కండరాల గాయం బారినపడ్డాడు.. దీంతో మ్యాచ్ మధ్యలోనే హాజిల్వుడ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం చిన్నదే, యాషెస్ ఆరంభ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని అంతా భావించారు. కానీ స్కాన్లో గాయం తీవ్రమైనది తేలింది. దీంతో అతడు మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అయితే అతడు తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో కనీసం ఆఖరి మూడు టెస్టులకైనా అందుబాటులో వస్తాడని టీమ్మెనెజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. కానీ ప్రాక్టీస్ సెషన్లలో అతడి కాలి మడమకు గాయమైంది. దీంతో ఇప్పుడు అతడు పూర్తిగా సిరీస్ నుంచే వైదొలిగాడు."జోష్ హాజిల్వుడ్ దురదృష్టవశాత్తు యాషెస్ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇది నిజంగా చాలా చాలా బాధాకరం. ఈ సిరీస్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని మేము అనుకున్నాం. హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి కోలుకునే క్రమంలో కాలి మడమకు గాయమైంది. అతడు తిరిగి పునరావసంకు వెళ్లనుర్నాడు. టీ20 ప్రపంచకప్కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాము అని డోనాల్డ్ పేర్కొన్నాడు. అదేవిధంగా మూడో టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి రానున్నట్లు డోనాల్డ్ స్పష్టం చేశాడు.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
ఐపీఎల్-2026 వేలంలో బిగ్ ట్విస్ట్..! ఫైనల్ లిస్ట్ ఖరారు
ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేలంలో పాల్గోనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం కోసం మొత్తం 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 350 మంది షార్ట్లిస్ట్ అయినట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. ఈ లిస్ట్లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన 35 మంది ఆటగాళ్లు ఉండటం గమనార్హం. సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తొలుత తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో మొదటి ప్రకటించిన జాబితాలో అతడు పేరు లేదు. కానీ చివరి నిమిషంలో తన మనసును మార్చుకుని వేలంలో పాల్గోవాలని నిర్ణయించుకున్నాడు.దీంతో కొన్ని ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు డి కాక్ను తుది జాబితాలో చేర్చారు. డికాక్ తన బేస్ ధరను 50 శాతం తగ్గించుకున్నాడు. కనీస ధర రూ. రూ.కోటి రూపాయలతో అతడు వేలం బరిలోకి దిగనున్నాడు. ఈ 35 మంది క్రికెటర్లలో శ్రీలంక, సౌతాఫ్రికా ప్లేయర్లతో పాటు భారత దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇక వేలానికి సంబంధించిన విదివిధానాలు బీసీసీఐ ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలను మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.వేలం రూల్స్ ఇవే..ఈ మినీ వేలం మొదట క్యాప్డ్ (Capped) ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. ఇందులో బ్యాటర్లు, ఆల్-రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉంటారు. తరువాత అన్క్యాప్డ్ (Uncapped) ఆటగాళ్లతో పూర్తి రౌండ్ కొనసాగుతుంది.మొదటి 70 మంది ఆటగాళ్ల పేక్లు పూర్తయిన తర్వాత మిగిలిన ప్లేయర్ల కోసం యాక్సిలరేటెడ్ రౌండ్ను నిర్వహించనుంది. చివగా తొలి మూడు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాళ్లు ఆఖరిలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే ఈసారి మార్క్యూ లిస్ట్ రౌండ్ ఉండదు. తొలి రౌండ్లో కెమెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, డేవిడ్ మిల్లర్ వంటి విదేశీ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. అదే విధంగా వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్కు కూడా భారీ ధర దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ వేలంలో అన్ని జట్లు కలిపి మొత్తం 77 స్లాట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 విదేశీ స్థానాలు ఉన్నాయి.ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్లువిదేశీ ఆటగాళ్లు: అరబ్ గుల్ (ఆఫ్ఘనిస్తాన్), మైల్స్ హమ్మండ్ (ఇంగ్లండ్), డాన్ లాటెగాన్ (ఇంగ్లండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎస్టర్హూజెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బయాండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), డిసురి లంకాల్ (పెర్నాగెసల్ వెల్సాల్ లంకా), డిసురి లంకాల్ (శ్రీలంక), అకీమ్ అగస్టే (వెస్టిండీస్).భారత ఆటగాళ్లు: సాదేక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యష్రాజ్ పుంజా, సాహిల్ పరాఖ్, రోషన్ వాఘ్సారే, యష్ డిచోల్కర్, అయాజ్క్ వల్కర్, ధుర్మిల్త్ ఖాన్, ధుర్మిల్త్ ఖాన్ పురవ్ అగర్వాల్, రిషబ్ చౌహాన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన్ షెకావత్.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
టీమిండియాకు భారీ షాక్..!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పాండ్యా.. తిరిగి మంగళవారం కటక్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న తొలి టీ20ల్లో ఆడనున్నాడు.పునరాగమనంలో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే ముందు పాండ్యా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగమయ్యాడు. ఈ టోర్నీలో బరోడా తరపున రెండు మ్యాచ్లు ఆడాడు. ఈ రెండింటిలోనూ అతడు తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేశాడు.ఎడమ క్వాడ్రిసెప్స్(తొడ కండరాలు) గాయం నుంచి పాండ్యా పూర్తిగా కోలుకున్నట్లు కన్పిస్తున్నాడు. హార్దిక్ షెడ్యూల్ ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం రెండు మ్యాచ్లు సరిపోతాయని నిర్ణయించింది. దీంతో పాండ్యా నేరుగా తొలి మ్యాచ్ జరిగే కటక్కు చేరుకున్నాడు.బారాబతి స్టేడియంలో ఈ ఆల్రౌండర్ ఒంటరిగా ట్రైనింగ్ పాల్గోన్నాడు. వార్మప్, స్ట్రెచింగ్, రన్నింగ్ డ్రిల్స్తో పాటు, త్రోడౌన్ స్పెషలిస్టులు నువాన్ సెనెవిరత్నే, దయానంద్ గారానితో కలిసి 20 నిమిషాలు బౌలింగ్ చేశాడు.ప్రాక్టీస్కు దూరం!ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికి.. సోమవారం జరిగిన భారత్ చివరి ప్రాక్టీస్ సెషన్కు హార్దిక్ గైర్హాజరయ్యాడు. దీంతో అతడు మళ్లీ గాయపడ్డాడా? అన్న ఆందోళన అభిమానులలో నెలకొంది. అయితే హార్దిక్కు ఎటువంటి గాయం లేదని, ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే శిక్షణకు దూరమయ్యాడని క్రిక్ బజ్ తెలిపింది. టీ20 ప్రపంచకప్-2026కు సమయం అసన్నమవుతుండడంతో హార్దిక్ లాంటి అద్భుతమైన ఆటగాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే బౌలింగ్ చేసే క్రమంలో పాండ్యా కాస్త ఆసౌకర్యంగా కన్పించడాని, అందుకే ట్రైనింగ్ సెషన్కు దూరంగా ఉన్నాడని మరి కొన్ని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం హార్దిక్ ట్రైనింగ్ స్కిప్పై ఎటువంటి ప్రకటన చేయలేదు.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్ -
కుటుంబం తోడుగా... ప్రతిభే నిచ్చెనగా...
వేలు పట్టి నడక నేర్పించిన నాన్నే... చేయి పట్టుకొని రేసింగ్కు తీసుకెళ్లాడు. పిల్లలకు కిక్ ఇచ్చే గో కార్టింగ్ రేసులో రయ్ రయ్ మనిపించే తనయుని ఉత్సాహాన్ని కళ్లారా చూశాక తండ్రి తన కుమారుడి తపనే తన తపన అనుకున్నాడు. ఏడేళ్ల ప్రాయం నుంచి టీనేజ్కొచ్చాక ఫార్ములావన్లో అరంగేట్రం చేసే వరకు ప్రతి పైసా తండ్రే వెచ్చించాడు. ఇలా తండ్రి ఆడమ్ చేయూత, లాండో నోరిస్ రాతను మార్చింది. ఎఫ్1 చాంపియన్ను చేసింది. సాక్షి క్రీడా విభాగంఇప్పుడు ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ మంతా నోరిస్ వైపే చూస్తోంది. తాజా ఎఫ్1 వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్గా అతను ఘనతకెక్కాడు. 18 ఏళ్ల తర్వాత మెక్లారెన్ రేసింగ్ టీమ్ను విజేతగా నిలిపాడు. చివరిసారిగా హామిల్టన్ 2008లో మెక్లారెన్కు టైటిల్ అందించాడు. దిగ్గజ రేసర్ హామిల్టన్, తాజా చాంపియన్ నోరిస్ ఇద్దరు బ్రిటన్ డ్రైవర్లే కావడం గమనార్హం. ఇక మెక్లారెన్ టీమ్ను కాకుండా దేశం గురించే చెప్పుకుంటే బ్రిటన్ తరఫున 11వ ఫార్ములావన్ చాంపియన్ నోరిస్. 26 ఏళ్ల వయసులో తొలి టైటిల్ సాధించాడు. ఆఖరి రేసుదాకా ఉత్కంఠ రేపినా... స్టార్ రేసర్ వెర్స్టాపెన్ వెనకే ఉండి (రెండో స్థానం) వెంటాడినా తను మాత్రం తక్కువేం కాదని, సర్క్యూట్లో దిగితే తగ్గేదే లేదని తన విజయంతో చాటి చెప్పాడు. బాల్యంలోనే రేసింగ్ బాట ఏడేళ్ల పసి ప్రాయంలో రేసింగ్ బాట పట్టిన నోరిస్ తాజాగా ఏడో సీజన్లో ప్రపంచ చాంపియన్గా నిలవడం విశేషం. నోరిస్ తండ్రి ఆడమ్ కోటీశ్వరుడు కావడంతో డబ్చుకు కొదవేం లేదు. పైగా ధైర్యం కూడా ఎక్కువే! లేదంటే కోట్లకు వారసుణ్ని ఏ తండ్రి అయిన ప్రమాదకర రేసింగ్కు తీసుకెళ్తాడా. కానీ ఆడమ్ చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టుకొని మరీ కార్టింగ్కు పరిచయం చేశాడు. అలా మొదలైన ప్రయాణంలో ఓ ఏడాది గడిచేసరికే చిన్న చితక పోటీల్లో గెలవడం కూడా మొదలుపెట్టాడు. ఇలా మూడు, నాలుగేళ్లు గడిచే సరికి 11 ఏళ్ల వయసులో ‘ఎంఎస్ఏ బ్రిటిష్ క్యాడెట్ కార్ట్ చాంపియన్షిప్’లో పోటీలకు దిగాడు. మెరుపు వేగం అందిపుచ్చుకొని పలుమార్లు విజేతగా నిలిచాడు. లాండో నోరిస్ రోజు రోజుకి కాదు... కానీ రేసు రేసుకి జోరు పెంచుతున్నాడు. టీనేజ్లో పాల్గొన్న పోటీల్లో తన సత్తా జూనియర్ రేసింగ్ జట్లను ఆకట్టుకునేలా చేసింది. 14 ఏళ్లకే అవార్డు కూడా... నోరిస్కు బాగా తెలిసిన ప్రపంచం రేసింగ్. తనని దూసుకెళ్లేలా చేస్తున్న ప్రపంచం కూడా రేసింగే! అందుకేనేమో అతని ‘వేగం’ అంతే వేగంగా అవార్డును తెచ్చిపెట్టింది మరి! 14 ఏళ్ల టీనేజ్లోనే నోరిస్ తొలి అవార్డు అందుకున్నాడు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన సర్ జాకీ స్టివార్ట్ చేతుల మీదుగా 2013లో ఆ ఏడాదికి సంబంధించి ‘ఆటో స్పోర్ట్’ అవార్డు అందుకున్నాడు. ఇలా అవార్డుతో పాటు ఆ రేసు, ఈ రేసు గెలుచుకుంటూ సర్క్యూట్పై దుమ్మురేపే ప్రతిభనే ఆలంబనగా చేసుకొని రేసర్లంతా కలలు గనే ఎఫ్1 గడప తొక్కాడు. 2018, జనవరిలో 18 ఏళ్ల నోరిస్ మెక్లారెన్ రేసింగ్ టీమ్ సభ్యుడయ్యాడు. టీమ్ సీఈవో బ్రౌన్ ఆ యువ రేసర్కు అవకాశమివ్వాలని నిర్ణయించాడు. అప్పటికే సీనియర్గా ఉన్న డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో స్థానంలో రేసు మొదలుపెట్టిన నోరిస్ ఆ తర్వాత కొంతకాలానికి పోల్ పొజిషన్లు సాధిస్తూ ముందంజ వేశాడు. అలా ఏకబికిన ఏడేళ్ల పాటు తన టీమ్ మెక్లారెన్ పెట్టిన నమ్మకానికి న్యాయం చేస్తూ ఏ సీజన్లోనూ, ఏ రేసులోనూ నమ్మకం కోల్పోకుండా తన రేసింగ్ జోరు చూపాడు. ఎట్టకేలకు తనకు అవకాశమిచ్చిన మెక్లారెన్ను గెలిపించాడు. ఎఫ్1 అరంగేట్రం నుంచి టైటిల్ గెలిచేదాకా మెక్లారెన్ రేసింగ్ జట్టుతోనే తన ఏడేళ్ల పయనం మొత్తానికి ఇలా విజయవంతంగా సాగిపోతోంది.వాడికేమో ఇష్టం, నాకేమో కష్టం ఎవరో చెబితేనో... సరదాకో రేసింగ్కు వెళ్లలేదు. ఎంతో ఇష్టపడే కార్టింగ్ కార్ స్టీరింగ్ పట్టాడు. మా ఆడమ్ (నోరిస్ నాన్న) కూడా ప్రోత్సహించాడు. దీని వల్ల ఏడేళ్ల ప్రాయం నుంచి ఇప్పటి వరకు నా కుమారుడిని మిస్ అవుతూనే ఉన్నా. మొదట్లో కార్టింగ్ అంటూ ఇంటికి దూరంగా... సర్క్యూట్కు దగ్గరగా ఎక్కువ సమయం గడిపాడు. అనంతరం జూనియర్ స్థాయి పోటీల కోసమని అటు ఇటూ తిరిగాడు. కొన్నేళ్లుగా ప్రొ సర్క్యూట్ రేసర్గా మరింత బిజీ అయిపోయాడు. ఏం చేస్తాం. వాడికేమో అదే ఇష్టం. వాణ్నిలా రోజులు, నెలల తరబడి విడిచి ఉండటం నాకేమో కష్టం. –నోరిస్ తల్లి సిస్కా -
SMAT: సూపర్ లీగ్కు హైదరాబాద్, ఆంధ్ర జట్లు
దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సూపర్ లీగ్ దశకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్లలో ఓడినా... ఈ రెండు టీమ్లు ముందంజ వేయడంలో సఫలమయ్యాయి. గ్రూప్ ‘బి’లో ఆడిన 7 మ్యాచ్లలో 5 గెలిచి, 2 ఓడిన హైదరాబాద్ మొత్తం 20 పాయింట్లతో అగ్ర స్థానం సాధించగా, గ్రూప్ ‘ఎ’లో ఆడిన 7 మ్యాచ్లలో 5 గెలిచి, 2 ఓడిన ఆంధ్ర 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫై అయ్యాయి.సోమవారం జరిగిన చివరి లీగ్లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో చండీగఢ్ చేతిలో పరాజయం పాలైంది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్ రెడ్డి (43; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అమన్ రావు (33; 2 ఫోర్లు, 2 సిక్స్లు), తనయ్ త్యాగరాజన్ (27; 2 సిక్స్లు) రాణించారు. అనంతరం చండీగఢ్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు సాధించింది. సత్యనారాయణ రాజుకు 4 వికెట్లువిదర్భతో లక్నోలో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర 19 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా విదర్భ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అమన్ మోఖడే (35 బంతుల్లో 50; 7 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (41; 2 సిక్స్లు) రాణించగా... ఆంధ్ర బౌలర్ సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. పైలా అవినాశ్ (44; 3 ఫోర్లు, 2 సిక్స్లు), రికీ భుయ్ (26; 2 సిక్స్లు) మినహా అంతా విఫలమయ్యారు. యశ్ ఠాకూర్ 4 వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు. పుణేలో ‘సూపర్ లీగ్’ మ్యాచ్లుటోరీ్నలో భాగంగా ‘సూపర్ లీగ్’ దశకు చేరిన 8 జట్లను 2 గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్లతో ఆంధ్ర తలపడనుండగా... గ్రూప్ ‘బి’లో ముంబై, రాజస్తాన్, హరియాణాలతో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్లు వరుసగా ఈ నెల 12, 14, 16 తేదీల్లో జరుగుతాయి. రెండు గ్రూప్ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు 18న ఫైనల్లో తలపడతాయి. ‘సూపర్ లీగ్’ మ్యాచ్లు పుణేలో నిర్వహిస్తారు.చదవండి: SMAT 2025: సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం -
చికిత ‘పసిడి’ గురి
తైపీ ఓపెన్ వరల్డ్ సిరీస్ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల అండర్–21 కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత చాంపియన్గా అవతరించింది. చైనీస్ తైపీలోని తావోయువాన్ సిటీలో జరిగిన ఈ టోరీ్నలో చికిత ఫైనల్లో 148–141 పాయింట్ల తేడాతో జిట్మున్ ఖెమనిత్ (థాయ్లాండ్)పై గెలుపొందింది. సెమీఫైనల్లో చికిత 147–145తో యోన్సియో కాంగ్ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్ ఫైనల్లో 149–138తో సియోయూన్ కాంగ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్లో జ్యోతి సురేఖ 149–143తో సో చేవన్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ కూడా కాంస్యం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతక మ్యాచ్లో అభిషేక్ వర్మ 148–146తో మార్కో బ్రునో (ఇటలీ)పై గెలిచాడు. మహిళల రికర్వ్ అండర్–21 కాంస్య పతక మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కొండపావులూరి యుక్తశ్రీ 5–6తో షు యాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. -
ఇక ధనాధన్ షురూ...
టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఇప్పటి వరకు 32 టి20లు ఆడితే 26 గెలిచి, 4 మాత్రమే ఓడిపోయింది. ఇలాంటి అద్భుత ఫామ్ మాత్రమే కాదు జట్టులో అనూహ్య మార్పులేమీ లేకుండా చాలా కాలంగా ఒకే పటిష్టమైన బృందంతో సాగుతోంది. మరోవైపు భారత్ చేతిలో టి20 వరల్డ్కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా 9, గెలిచి 16 ఓడిపోయింది.పైగా నిలకడ లేని టీమ్తో పదే పదే మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఐదు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై తమ స్థాయిని ప్రదర్శించేందుకు టీమిండియా సిద్ధం కాగా... వచ్చే టి20 వరల్డ్ కప్కు ముందు ఇక్కడ ఐదు మ్యాచ్లు ఆడటం సన్నాహకంగా ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు. కటక్: భారత గడ్డపై చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్లు జరుగుతుండగా... టెస్టుల్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్ విజయంపై గురి పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా వరల్డ్ కప్ బరిలోకి దిగడానికి ముందు భారత్ 10 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్తో కూడా ఐదు టి20 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పటికే సిద్ధమైన జట్టును అన్ని రకాలుగా పరీక్షించుకోవడంతో పాటు స్వల్ప లోపాలేమైనా ఉంటే సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్లు అవకాశం కల్చిస్తాయి. మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్ ఫలితంకంటే కూడా తమ జట్టును పునరి్నరి్మంచుకోవటంపై దృష్టి పెట్టింది. ఇలాంటి సమీకరణాల మధ్య బారాబతి స్టేడియంలో నేడు తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. గిల్, పాండ్యా సిద్ధం... ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ గెలిచిన తర్వాత భారత్ ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతోంది. సంచలన ఎంపికలు ఏమీ లేవు కాబట్టి తుది కూర్పుపై కూడా స్పష్టత ఉంది. గాయాల నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ గిల్, హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. కాబట్టి వీరిద్దరు ఆడటం ఖాయం. అభిషేక్ శర్మతో పాటు గిల్ ఓపెనింగ్ చేయనుండగా సూర్య, తిలక్ వర్మ స్థానాలపై ఎలాంటి సందేహం లేదు. వికెట్ కీపర్గా సంజూ సామ్సన్, జితేశ్ శర్మలలో ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. రెగ్యులర్ స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఉంటారు. అక్షర్ పటేల్తో పాటు ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ పోటీలో ఉన్నాడు. పేస్ ఆల్రౌండర్ కావాలంటే హర్షిత్ రాణాకు కూడా అవకాశం దక్కవచ్చు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ మాత్రమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. పూర్తి స్థాయిలో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాతి నుంచి సూర్య ఆడిన 15 ఇన్నింగ్స్లలో 15.33 సగటుతో కేవలం 184 పరుగులే చేశాడు. అంతకుముందు నుంచి కలిపి చూస్తే గత 20 ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ చేయకుండా పూర్తిగా విఫలయ్యాడు. ప్రస్తుత స్థితిలో అతని స్థానానికి వచ్చిన ముప్పేమీ లేకున్నా... ఈ సిరీస్లోనైనా స్థాయికి తగినట్లుగా చెలరేగాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బ్రెవిస్పై దృష్టి... దక్షిణాఫ్రికా టీమ్ పరిస్థితి ఇటీవల అంతంత మాత్రంగానే ఉంది. ఆ్రస్టేలియా, పాకిస్తాన్ల చేతిలో సిరీస్లు ఓడటంతో పాటు నమీబియా చేతిలో మ్యాచ్ కూడా కోల్పోయింది. పైగా ఇంగ్లండ్తో జరిగిన టి20లో 300కు పైగా పరుగులిచ్చి ఇలాంటి చెత్త రికార్డు నమోదు చేసిన పెద్ద జట్టుగా నిలిచింది. దూకుడైన ఆటగాడు డేవిడ్ మిల్లర్, పేసర్ నోర్జే గాయాల నుంచి కోలుకొని పునరాగమనం చేయడం సానుకూలాంశం కాగా కెప్టెన్గా మళ్లీ బాధ్యతలు తీసుకున్న మార్క్రమ్ మెరుగైన ఫామ్లో ఉండటం కలిసి రావచ్చు. ఇప్పటికీ తుది జట్టు విషయంలో టీమ్లో గందరగోళమే ఉంది. అయితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించగల డెవాల్డ్ బ్రెవిస్పై మాత్రం అందరి దృష్టీ ఉంది. ఐపీఎల్తో పాటు ఇటీవల వన్డేల్లో కూడా అతని దూకుడు కనిపించింది. బ్రెవిస్ చెలరేగితే సఫారీలకు మంచి గెలుపు అవకాశం ఉంటుంది. యాన్సెన్ ఆల్రౌండ్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిచ్, వాతావరణం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమంగా అనుకూలించే అవకాశం ఉన్న స్పోరి్టంగ్ పిచ్. ప్రతీ ఆటగాడు సత్తా చూపించేందుకు సరైంది. అయితే ఇక్కడా మంచు ప్రభావం చాలా ఉంది కాబట్టి టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన ఉన్నా మ్యాచ్కు ఇబ్బంది లేకపోవచ్చు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, గిల్, తిలక్, జితేశ్ శర్మ/సామ్సన్, పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షిత్/సుందర్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెన్డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బాష్/లిండే, యాన్సెన్, మహరాజ్, ఎన్గిడి, మహరాజ్. -
కరుణ్ నాయర్కు అక్కడ కూడా చుక్కెదురు
పేలవ ఫామ్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన టీమిండియా అవకాశాన్ని చేజార్చుకున్న కరుణ్ నాయర్.. తాజాగా అదే ఫామ్ లేమి కారణంగా దేశవాలీ అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఇటీవలే విదర్భ నుంచి తన సొంత జట్టు కర్ణాటక పంచన చేరిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో దారుణంగా విఫలమై జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ టోర్నీలో తొలి 6 మ్యాచ్ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన కరుణ్.. త్రిపురతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్ నుంచి తప్పించబడ్డాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు మంచి ఫామ్లో ఉండిన కరుణ్ పొట్టి ఫార్మాట్కు వచ్చే సరికి చాలా ఇబ్బంది పడ్డాడు. కరుణ్ గత ఎడిషన్ SMAT ఫామ్ ఇందుకు భిన్నంగా ఉండింది. గత ఎడిషన్లో విదర్భకు ఆడిన కరుణ్ 6 ఇన్నింగ్స్ల్లో 177.08 స్ట్రయిక్రేట్తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. కరుణ్ను ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కూడా కాకముందే కరుణ్ ఇంత చెత్త ప్రదర్శనలు చేయడం ఢిల్లీ యాజమాన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.కరుణ్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై అదరగొట్టి (40 బంతుల్లో 89 పరుగులు), ఆతర్వాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు. అయినా కరుణ్పై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నమ్మకముంచి రీటైన్ చేసుకోవడం ఆశ్చర్యకరం.ఇదిలా ఉంటే, కరుణ్ లేని మ్యాచ్లో కర్ణాటకపై త్రిపుర సంచలన విజయం సాధించింది. సూపర్ ఓవర్లో ఆ జట్టు కర్ణాటకకు షాకిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు తలో 197 పరుగులు చేయగా.. సూపర్ ఓవర్లో త్రిపుర ఊహించని విధంగా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేయగా.. కర్ణాటక వికెట్ కోల్పోయి 18 పరుగులకే పరిమితమైంది. దీంతో త్రిపుర సంచలన విజయం నమోదు చేసింది. -
సాయి సుదర్శన్ విధ్వంసకర శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ-2025లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన మ్యాచ్లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా తమిళనాడు 3 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. సాయి సుదర్శన్ ఒంటిచేత్తో తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు వరుసగా ఔటైనా, టెయిలెండర్ సన్నీ సంధు (30) సాయంతో తన జట్టును గెలిపించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. విశ్వరాజ్ జడేజా (70), సమ్మద్ గజ్జర్ (66) మెరుపు అర్ద శతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో వీరిద్దరు మినహా ఎవరూ రాణించలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో సిలంబరసన్ 3, ఎసక్కిముత్తు 2, సన్నీ సంధు, రాజ్కుమార్ తలో వికెట్ తీశారు.అనంతరం ఛేదనలో తమిళనాడు కూడా తడబడింది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే సాయి సుదర్శన్ ఒక్కడు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలుత రిత్విక్ ఈశ్వరన్ (29), ఆఖర్లో సన్నీ సంధు సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. సుదర్శన్ దెబ్బకు తమిళనాడు 18.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జయదేవ్ ఉనద్కత్ (4-0-30-3), అంకుర్ పవార్ (3.4-0-26-2) తమిళనాడు ఆటగాళ్లను ఇరుకున పెట్టినప్పటికీ సాయి సుదర్శన్ వారిపై ఎదురుదాడి చేసి విజయం సాధించాడు. -
షమీ చేసిన నేరం ఏంటి.. ఎందుకు రీఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు..?
భారత క్రికెట్లో షమీ ఉదంతం ఇటీవలికాలంలో తరుచూ హాట్ టాపిక్గా మారుతుంది. అతను దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా.. అతని అనుభవం టీమిండియాకు అవసరమైనా, సెలెక్టర్లు ఫిట్నెస్, ఇతరత్రా కారణాలు చెప్పి అవకాశాలు ఇవ్వడం లేదు. షమీని పక్కకు పెట్టడానికి పై కారణాలు కాకుండా చర్చించుకోలేని వేరే కారణముందన్నది చాలా మందికి తెలుసు. అయినా ఎవరూ నోరు విప్పే సాహసం చేయలేరు. ఓ ఆటగాడి కెరీర్ను ఆటతో ముడిపెట్టకూడని విషయాల పేర్లు చెప్పి నాశనం చేయడం సమంజసం కాదని కొన్ని గొంతులకు వినిపిస్తున్నా, వాటిని పట్టించుకునే నాథుడు లేడు. ఆటగాడిగా షమీకి అన్యాయం జరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. భారత సెలెక్టర్ల వద్ద మాత్రం దాన్ని సమర్దించుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి.సెలెక్టర్లు చెబుతున్న కారణాల్లో ప్రధానమైంది షమీ ఫిట్గా లేడని. వాస్తవానికి వారి ఈ సమర్దనలో అర్దమే లేదు. ఒకవేళ షమీ నిజంగా ఫిట్గా లేకపోతే దేశవాలీ టోర్నీల్లో ఎలా అనుమతిస్తారు. అనుమతించినా.. నిజంగా ఫిట్గా లేకపోతే అతనెలా రాణించలడు. ఈ ఒక్క విషయం చాలు సెలెక్టర్లు వేరే ఏదో కారణం చేత షమీని టీమిండియాను ఎంపిక చేయడం లేదన్న విషయం అర్దం అవడానికి. సౌతాఫ్రికా టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందే షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన చేశాడు. వాస్తవానికి షమీ కాకుండా వేరే ఏ బౌలర్ అయినా అలాంటి ప్రదర్శన చేసుంటే ఖచ్చితంగా టీమిండియాలో చోటు దక్కేది. కానీ అక్కడుంది షమీ కాబట్టి అలా జరగలేదు. అలాంటి ప్రదర్శనలు మరిన్ని పునరావృతం చేసినా షమీకి ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కదు. కారణం బహిరంగ రహస్యమే.షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చూపిస్తున్న రెండో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం షమీ వయసు 35. అంతర్జాతీయ క్రికెట్లో ఈ వయసు దాటిన తర్వాత కూడా సంచలన ప్రదర్శనలు చేసిన పేసర్లు చాలామంది ఉన్నారు. ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఆండర్సన్ 40 ఏళ్ల వయసులోనూ ఏం చేశాడో జగమంతా చూసింది. అలాంటిది షమీకి 35 ఏళ్లకే వయసైపోయిందనడం ఎంత వరకు సమంజసం. వయసైపోయిన వాడికి అంతర్జాతీయ క్రికెట్ అయినా, దేశవాలీ క్రికెట్ అయినా ఒకటే కదా. దేశవాలీ క్రికెట్లో వయసైపోయినా రాణిస్తున్నవాడు, అంతర్జాతీయ క్రికెట్లో రాణించలేడా..? ఏదో కారణం చెప్పాలని ఇలాంటి పొంతనలేని కారణాలు చెబుతున్నారు కానీ, అసలు కారణం వేరన్న విషయం చాలామందికి తెలుసు.షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చెబుతున్న మరో కారణం యువకులకు అవకాశాలు ఇవ్వడం. వాస్తవానికి యువకులకు అవకాశాలు ఇస్తే ఎవ్వరూ కాదనరు. జట్టులో సీనియర్లు తురుచూ విఫలమవుతున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలకు పోవాలి. అయితే ఇక్కడ పరిస్థితి వేరు. కావాలని షమీని పక్కకు పెట్టడానికి అనర్హమైన, టీమిండియాలో పెద్ద తలకాయ అండదండలున్న ఓ పేసర్ను యువత పేరుతో ఫ్రేమ్లోకి తెచ్చారు. అతని కంటే చిన్నవాడు, అతని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ టాలెంట్ ఉన్నా మరో పేసర్కు మాత్రం అవకాశాలు ఇవ్వరు. పెద్దల అండదండలున్న పేసర్ ఎన్ని మ్యాచ్ల్లో విఫలమైనా, మళ్లీమళ్లీ తుది జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. వాస్తవానికి ఆటగాళ్ల శారీరక కదలికలు, ఫిట్నెస్, ఫామ్ను బట్టి వయసు ప్రస్తావన వస్తుంది. ఈ మూడు బాగుంటే వయసుతో పనేముంది. పై మూడు అంశాల్లో షమీ పర్ఫెక్ట్గా ఉన్నా వయసు పేరు చెప్పి టీమిండియాకు ఎంపిక చేయకపోవడం ఎంత వరకు సమంజసం.ఇన్ని కారణాలు చెప్పి షమీని టీమిండియాకు ఎంపిక చేయకున్న సెలెక్టర్లు అంతిమంగా ఒక్క విషయం ఆలోచించాలి. షమీ స్థానంలో అతనిలా రాణిస్తున్న ఎవరినైనా ఎంపిక చేయకపోతే నష్టపోయే భారత జట్టే. అర్హులు జాతీయ జట్టులో లేకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. షమీ లాంటి ఉదంతాలు జరగడం భారత క్రికెట్కు మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే హర్భజన్ సింగ్, ఛతేశ్వర్ పుజారా లాంటి టీమిండియా మాజీలు షమీకి మద్దతుగా గళం విప్పారు. షమీ చేసిన నేరం ఏంటని బహిరంగంగా ప్రశ్నించారు. భారత సెలెక్టర్లు ఇకనైనా పంతాలు పక్కకు పెడితే భారత క్రికెట్కు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. -
వరల్డ్కప్ స్ట్రీమింగ్ నుంచి తప్పుకున్న హాట్స్టార్..!
2026 టీ20 వరల్డ్కప్కు ముందు ఐసీసీకి ఊహించని షాక్ తగిలింది. మెగా టోర్నీ స్ట్రీమింగ్ నుంచి జియో హాట్స్టార్ తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఆర్దిక సమస్యల కారణంగా హాట్స్టార్ ఈ డీల్ను వదులుకోనున్నట్లు సమాచారం.జియో హాట్స్టార్ భారత్లో స్ట్రీమింగ్ హక్కుల కోసం నాలుగేళ్లకు 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని ఐసీసీతో కుదుర్చుకుంది. ఇంకా రెండేళ్లు మిగిలుండగానే హాట్స్టార్ ఈ డీల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియా చెబుతుంది. హాట్స్టార్ అధికారికంగా తప్పుకుంటే ఈ రెండేళ్లు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు సోనీ పిక్చర్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.కాగా, జియో హాట్స్టార్ స్పోర్ట్స్ కాంట్రాక్టుల కారణంగా గత రెండేళ్లుగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తుంది. భారత ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లపై నిషేధం విధించడంతో ప్రకటనదారులు కరువు కావడం ఇందుకు ఓ కారణంగా తెలుస్తుంది. దీని వల్ల $840 మిలియన్ లోటు ఏర్పడిందని అంచనా. దీనికి తోడు డాలర్ రేటు కూడా పెరగడం హాట్స్టార్పై అదనపు భారం పడేలా చేసిందని సమాచారం.ఒకవేళ హాట్స్టార్ వరల్డ్కప్ స్ట్రీమింగ్ నుంచి తప్పుకుంటే భారతలో క్రికెట్ అభిమానుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. మెగా టోర్నీలో మ్యాచ్లు వీక్షించేందుకు డబ్బులు చెల్లించి కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, 2026 టీ20 వరల్డ్కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగునున్న విషయం తెలిసిందే. -
న్యూజిలాండ్కు 'ట్రిపుల్' షాక్
స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్కు ట్రిపుల్ షాక్ తగిలింది. డిసెంబర్ 10 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగబోయే రెండో టెస్ట్కు ముందు ఏకంగా ముగ్గురు స్టార్ బౌలర్లు గాయపడ్డారు. మ్యాట్ హెన్రీ కాఫ్ ఇంజ్యూరితో, నాథన్ స్మిత్ సైడ్ స్ట్రెయిన్తో, మిచెల్ సాంట్నర్ గ్రోయిన్ ఇంజ్యూరితో మిగతా రెండు టెస్ట్లకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్రౌండర్ క్రిస్టియన్ క్లార్క్, ఫాస్ట్ బౌలర్ మైఖేల్ రే, గ్లెన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. స్మిత్, హెన్రీ తొలి టెస్ట్ సందర్భంగా గాయపడగా.. సాంట్నర్ ఇదే గాయం కారణంగా తొలి టెస్ట్కు కూడా దూరంగా ఉన్నాడు. పై ముగ్గురితో పాటు కొత్తగా మరో ఎంపిక కూడా జరిగింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన టామ్ బ్లండెల్కు కవర్గా మిచ్ హేను కూడా జట్టులోకి తీసుకున్నారు.కాగా, క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. విండీస్ బ్యాటర్లు అసమాన పోరాటపటిమతో 531 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్ను డ్రా చేసుకున్నారు.షాయ్ హోప్ సూపర్ సెంచరీ (140).. జస్టిన్ గ్రీవ్స్ అజేయ డబుల్ సెంచరీ (202).. కీమర్ రోచ్ (233 బంతుల్లో 58 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో విండీస్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్ గెలిచినట్లే. విండీస్ యెధుల పోరాటాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం కీర్తించింది. -
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఝలక్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజ్ను టీమిండియాకు జరిమానాగా విధించారు.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది. ఆ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లోని మిగతా టీ20లు డిసెంబర్ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ -
గిల్ వచ్చేశాడు.. సంజూ శాంసన్కు మళ్లీ నిరాశే..!
డిసెంబర్ 9 నుంచి కటక్ (ఒడిషా) వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్మన్ గిల్ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్ చేరుకున్నాడు.గిల్ మెడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్ రాకతో టీమిండియాకు ఓపెనింగ్ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్కు జోడీగా గిల్ బరిలోకి దిగితే సంజూ శాంసన్కు మళ్లీ నిరాశ తప్పదు.మిడిలార్డర్లో ఆడించాల్సి వస్తే మేనేజ్మెంట్ జితేశ్ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్గా అయితేనే సక్సెస్ కాగలడని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇది ఆసీస్ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.మేనేజ్మెంట్ దగ్గర మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం జితేశ్ శర్మ రూపం మంచి ఆప్షన్ ఉంది. జితేశ్ మంచి ఫినిషర్గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.గిల్ ఆకలితో ఉన్నాడు: గంభీర్గిల్ గాయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రెండు రోజుల ముందే అప్డేట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిశాక గంభీర్ మాట్లాడుతూ.. అవును, గిల్ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్గా, ఫైన్గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో మెడ గాయానికి గురైన గిల్.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్గా ఉన్న గిల్.. టీ20ల్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్ సింగ్ -
ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో విండీస్ వీరుడి విధ్వంసం
దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో విండీస్ వీరుడి రోవ్మన్ పావెల్ (Rovman Powell) విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్కు ఆడుతున్న పావెల్.. నిన్న (డిసెంబర్ 7) అబుదాబీ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 96 పరుగులు చేశాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని సెంచరీ కూడా పూర్తైయ్యేది. పావెల్ మెరుపులకు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 52; ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.క్యాపిటల్స్ ఇన్నింగ్స్లో పావెల్, కాక్స్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.టాబీ ఆల్బర్ట్, సెదిఖుల్లా అటల్ తలో 8, షయాన్ జహంగీర్ 14 పరుగులకు ఔటయ్యారు. నైట్రైడర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అజయ్ కుమార్, పియూశ్ చావ్లా తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలోనూ నైట్రైడర్స్ తడబడింది. వకార్ సలామ్ఖీల్ (3.3-0-29-4), మహ్మద్ నబీ (4-0-12-2), డేవిడ్ విల్లే (3-0-13-2), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3-0-22-2) ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో ఫిల్ సాల్ట్ (27) టాప్ స్కోరర్గా నిలువగా.. విధ్వంసకర వీరులు లివింగ్స్టోన్ (16), రూథర్ఫోర్డ్ (19), రసెల్ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
కీలక పదవికి ఎంపికైన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్కు (Venkatesh Prasad) కీలక పదవి దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎన్నికల్లో ఈ మాజీ పేసర్ ఘన విజయం సాధించారు. ఆదివారం (డిసెంబర్ 7) జరిగిన ఎన్నికల్లో ప్రసాద్ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెల్ దాదాపు అన్ని పదవులను గెలుచుకుంది. ప్రసాద్ బ్రిజేశ్ పటేల్ మద్దతు పొందిన కేఎన్ శాంత్ కుమార్పై 191 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రసాద్కు 749, శాంత్ కుమార్కు 558 ఓట్లు వచ్చాయి. మరో భారత మాజీ క్రికెటర్ సుజిత్ సోమసుందర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వినోద్ శివప్పపై ఆయన 719-588 ఓట్ల తేడాతో గెలుపొందారు.కార్యదర్శి హోదాను సంతోష్ మీనన్ తిరిగి దక్కించుకున్నాడు. ఈఎస్ జైరామ్పై 675-632 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ట్రెజరర్ పోస్ట్ను బీఎన్ మధుకర్ దక్కించుకున్నాడు. ఎంఎస్ వినయ్పై 736-571 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇలా దాదాపుగా ప్రతి పదవిని వెంకటేశ్ ప్రసాద్ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెలే దక్కించుకుంది.ప్రధాన ఫలితాలు - అధ్యక్షుడు: వెంకటేష్ ప్రసాద్ – 749 ఓట్లు - ఉపాధ్యక్షుడు: సుజిత్ సోమసుందర్ – 719 ఓట్లు - కార్యదర్శి: సంతోష్ మెనన్ – 675 ఓట్లు - జాయింట్ సెక్రటరీ: బీకే రవి – 669 ఓట్లు - ఖజాంచి: బీఎన్ మధుకర్ – 736 ఓట్లు మేనేజింగ్ కమిటీ సభ్యులు - లైఫ్ మెంబర్స్: వీఎం మంజునాథ్, సైలేష్ పోల, అవినాష్ వైద్య - ఇన్స్టిట్యూషన్ మెంబర్స్: కల్పనా వెంకటాచార్, ఆశిష్ అమర్లాల్ జోన్ ప్రతినిధులు - మైసూరు – శ్రీనివాస్ ప్రసాద్ - శివమొగ్గ – డీఎస్ అరుణ్ - తుమకూరు – సీఆర్ హరీష్ - ధార్వాడ – వీరాణ సవిడి - రాయచూర్ – కుశాల్ పటిల్ - మంగళూరు – శేఖర్ శెట్టి ముఖ్యాంశాలు - ప్రసాద్ ప్యానెల్ వారి మేనిఫెస్టోలో చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ ప్రధాన క్రికెట్ మ్యాచ్లు జరగాలని స్పష్టంగా పేర్కొంది. - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ వేడుకలో జరిగిన దుర్ఘటన తర్వాత అక్కడ పెద్ద మ్యాచ్లు జరగలేదు. - ఈ ఎన్నికల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియం నుంచి తరలిపోవడానికి అనుమతించం. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని అన్నారు. డీకే వెంకటేశ్ ప్రసాద్ ప్యానెల్కు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. -
సౌతాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్పై వేటు?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఆతిథ్య వేదికకు చేరుకుని ప్రాక్టీస్ను మొదలు పెట్టాయి. టెస్టు సిరీస్ను సౌతాఫ్రికా సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్ను మాత్రం మెన్ ఇన్ బ్లూ తమ ఖాతాలో వేసుకుంది.ఇప్పుడు టీ20 సిరీస్ను కూడా సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. కటక్ టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించాలని సూర్యకుమార్ నాయకత్వంలోని భారత్ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. దీంతో తొలి మ్యాచ్ కోసం టీమిండియా ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం.టైమ్స్ ఆఫ్ ఇండియా' నివేదిక ప్రకారం.. తొలి టీ20 కోసం బారాబాతి స్టేడియంలోని పిచ్ను ఎర్రమట్టితో తాయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వికెట్ స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశముంది. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశముంది.సుందర్పై వేటు..గత కొన్ని మ్యాచ్లగా మూడో స్పిన్నర్గా ఉన్న వాషింగ్టన్ సుందర్పై వేటు పడనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు ఛాన్స్ ఉంది. ఎలాగో మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉంటాడు. గాయం నుంచి పాండ్యా కోలుకుని తిరిగొచ్చాడు.ఇక సీమర్లగా అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశముంది. ఒకవేళ అవసరమైతో దూబేతో బౌలింగ్ చేయిస్తారు లేదా స్పెషలిస్ట్ బ్యాటర్గా ఉపయోగించుకుంటారు. అయితే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు చోటు దక్కకపోవచ్చు. భారత ఇన్నింగ్స్ను శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ప్రారంభించనుండగా.. మూడు నాలుగు స్ధానాలలో సూర్యకుమార్, తిలక్ వర్మ బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. ఇక వికెట్ కీపర్గా సంజూ శాంసన్ను ఆడించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకట్రెండు మ్యాచ్లలో శాంసన్ విఫలమైతే.. జితీశ్ శర్మ వైపు టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్చదవండి: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన! -
రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన!
టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ దేశవాళీ వన్డే టోర్నీలో రెండు లేదా మూడు మ్యాచ్లలో కోహ్లి ఆడే అవకాశముంది. రోహిత్ శర్మ మాత్రం పూర్తి స్దాయిలో అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోయేషిన్కు తెలియజేసినట్లు సమాచారం.అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడితోనే రో-కో ద్వయం విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సముఖత చూపించారని వార్తలు వచ్చాయి. చాలా మంది మాజీలు కూడా వారిద్దరూ అద్బుతమైన ఫామ్లో ఉన్నారని, డొమాస్టిక్ క్రికెట్ ఆడాలని ఒత్తిడి తీసుకురావడమేంటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశాడు."విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలన్నది రోహిత్, కోహ్లిల వ్యక్తిగత నిర్ణయం. అంతే తప్ప కచ్చితంగా ఆడాలని వారిని ఎవరూ ఆదేశించలేదు" అని సదరు అధికారి స్పష్టం చేశారు. కాగా రో-కో ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్లో దుమ్ములేపారు. దీంతో వన్డే ప్రపంచకప్-2027లో వారిద్దరూ ఆడడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్-కోహ్లి ఉన్నారా లేదా అన్నది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ వారిద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, వారి అనుభవం డ్రెస్సింగ్ రూమ్లో అవసరమని గంభీర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ENG vs AUS: 'చెత్త బౌలింగ్.. చెత్త బ్యాటింగ్.. చెత్త కెప్టెన్' -
'చెత్త బౌలింగ్.. చెత్త బ్యాటింగ్.. చెత్త కెప్టెన్'
యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ వరుసగా రెండో మ్యాచ్లో ఓడిపోయింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చూవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-2 తేడాతో స్టోక్స్ సేన వెనకబడింది.తొలి టెస్టుతో పోలిస్తే బ్రిస్బేన్లో బ్యాటింగ్ పరంగా ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఆసీస్ బ్యాటర్లను ఇంగ్లీష్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ విమర్శల వర్షం కురిపించారు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరుస్తుందని, తిరిగి కమ్బ్యాక్ చేయాలంటే అద్భుతం జరిగాలని ఆయన అభిప్రాయపడ్డారు."బ్రిస్బేన్లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కనబరించింది. ఈ చెత్త బ్యాటింగ్, బౌలింగ్తో వారు యాషెస్ ట్రోఫీ కాదు కదా, పైన ఉన్న కప్పును కూడా గెలవలేరు. ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ చెత్తగా ఉంది. పదే పదే షార్ట్ పిచ్ బంతులు వేయడం, ఎక్కువగా వైడ్ వేసి భారీగా పరగులు సమర్పించుకున్నారు.అంతేకాకుండా బ్రిస్బేన్లో క్యాచ్లు కూడా జారవిడిచారు. నాలుగేళ్లగా ఆస్ట్రేలియాను ఓడించిడానికి ఇంగ్లండ్ ఒక బ్లూప్రింట్ సిద్ధం చేసింది. అయినప్పటికి కంగారులపై పై చేయి సాధించలేకపోతున్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్లు ఎవరూ మాట వినరు. తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు. టెస్ట్ క్రికెట్ గురించి తమకు మాత్రమే తెలుసు అని వాళ్లు అనుకుంటున్నారు. ప్రతీసారి దూకుడుగా ఆడాలని కెప్టెన్ చెబుతుంటాడు. టెస్టు క్రికెట్ అంటే దూకుడుగా ఆడడం కాదు.. ఓపిక, సహనం రెండూ ఉండాలి. కానీ మా జట్టులో అది కన్పించడం లేదు. బాజ్ బాల్ అట్టర్ ప్లాప్ అయ్యింది. హ్యారీ బ్రూక్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. అదేవిధంగా ఓలీ పోప్ సైతం తన వికెట్ను ఈజీగా సమర్పించుకుంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్ తిరిగి కోలుకోవడం కష్టమే" అని బాయ్కాట్ పేర్కొన్నారు.చదవండి: IPL 2026: యువ సంచలనంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి? -
భువనేశ్వర్కు చేరుకున్న టీమిండియా (వీడియో)
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. వన్డే సిరీస్ను మాత్రం సొంతం చేసుకుంది. మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు టీ20 సిరీస్పై కన్నేసింది. భారత్-సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కటక్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఆదివారం రాత్రి భువనేశ్వర్కు చేరుకున్నాయి. ప్రోటీస్, భారత్ జట్లకు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మహంతి స్వాగతం పలికారు. వైజాగ్ నుంచి అర్ష్దీప్, నితీశ్ కుమార్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు భువనేశ్వర్ చేరుకోగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి వారు ముంబై నుంచి నేరుగా జట్టులో కలిశారు. ఇరు జట్లు సోమవారం బారాబతి స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్కు హాజరు కానున్నారు. స్టేడియం, హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పంకజ్ లోచన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక గాయం కారణంగా టెస్టు, వన్డే సిరీస్కు దూరమైన స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు టీ20ల్లో ఆడనుండడం ఖాయం. మరోవైపు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఇప్పటికే ఫిట్నెస్ సాధించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ములేపాడు. ఇప్పుడు అదే జోరును సఫారీలపై కొనసాగించాలని ఈ బరోడా ఆటగాడు ఉవ్విళ్లూరుతున్నాడు. వన్డే సిరీస్కు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20లకు అందుబాటులోకి వచ్చాడు.సఫారీలతో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ. So Sanju Samson reached Cuttack. Today Kerala will be playing without Sanju Samson. This reminds me off 90s Indian team without Sachin. I don't think we will cross 100 without Sanju pic.twitter.com/tiuPi1TAj0— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) December 8, 2025 -
రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. జాతీయ జట్టు తరపున తిరిగి మూడు ఫార్మాట్లలో ఆడాలని భావిస్తున్నట్లు షకీబ్ తెలిపాడు. సొంత ప్రజలు ముందు రిటైర్మెంట్ అవ్వాలనే తన కోరికను అతడు వ్యక్తం చేశాడు.కాగా గతేడాది భారత పర్యటన తర్వాత టెస్ట్, టీ20లకు షకీబ్ వీడ్కోలు పలికిన షకీబ్.. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. కానీ షకీబ్ వివాదాలలో చిక్కుకోవడంతో వన్డేలకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ స్టార్ ఆల్రౌండర్ ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు.గతేడాది మే నుంచి ఇప్పటివరకు అతడు ఇప్పటివరకు బంగ్లాదేశ్కు తిరిగి రాలేదు. ఓ హత్య కేసులో అతడి పేరిట ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వివాదంలో అతడు చిక్కుకున్నప్పటికి పాకిస్తాన్, భారత్లలో జరిగిన టెస్ట్ సిరీస్లలో మాత్రం పాల్గోనున్నాడు.ఆ తర్వాత అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోవడంతో షకీబ్ విదేశాల్లోనే ఉండిపోయాడు. షకీబ్ ఆ పార్టీ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోయిన్ అలీతో 'బీర్డ్ బిఫోర్ వికెట్' పాడ్కాస్ట్లో షకీబ్ అల్ హసన్ పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను అతడు వెల్లడించాడు."నేను ఇంకా అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్ కాలేదు. ఈ విషయాన్ని మొదటిసారి వెల్లడిస్తున్నా. తిరిగి బంగ్లాదేశ్కు వెళ్లి పూర్తి స్ధాయిలో వన్డే, టెస్ట్, టీ20 సిరీస్ ఆడి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. సొంత ప్రజల ముందు అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలుకుతా. ఫిట్గా ఉండేందుకే టీ20 లీగ్స్లో ఆడుతున్నా అని షకీబ్ పేర్కొన్నాడు. మరి అతడి కోరికను బంగ్లా క్రికెట్ బోర్డు నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.చదవండి: IPL 2026: యువ సంచలనంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి? -
యువ సంచలనంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి?
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఓ యువ సంచలనం అద్భుత ప్రదర్శలనతో అన్ని ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీపై అతడు ఇన్నింగ్స్ అభిమానులను, టాలెంట్ స్కౌట్స్ను సైతం ఆశ్చర్యపరిచింది.ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా అతడిది. తన విధ్వంసకర బ్యాటింగ్తో దేశవాళీ క్రికెట్లో నయా ఫినిషర్గా పేరు గాంచాడు. అతడే రాజస్తాన్ పవర్ హిట్టర్ 21 ఏళ్ల ముకుల్ చౌదరి.ఢిల్లీపై అద్బుతం.. ఎవరీ ముకుల్ చౌదరి?రాజస్తాన్లోని ఝుంఝునుకు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఫస్ట్ క్లాస్, సీనియర్ టీ20 క్రికెట్ మ్యాచ్లు ఇప్పటివరకు పెద్దగా ఆడకపోయినప్పటికి.. అండర్-23 టోర్నీల్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఢిల్లీపై విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో 176 పరుగుల లక్ష్య చేధనలో రాజస్తాన్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయం అని భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన ముకల్ అద్భుతం చేశాడు.ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగి తన జట్టును ఒంటి చేత్తే గెలిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 1 ఫోర్లు, 7 సిక్స్లతో 62 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముకుల్ 2023లో రాజస్తాన్ సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. కానీ అతడికి పెద్దగా అవకాశాలు లభించలేదు. అతడు ఇప్పటివరకు మూడేసి చొప్పున ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్లు ఆడాడు.లీడింగ్ రన్ స్కోరర్గా..ముకుల్ ఇటీవల ముగిసిన అండర్ 23 వన్డే టోర్నమెంట్లో రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 147గా ఉంది. అదేవిధంగా టోర్నమెంట్లో అత్యధికంగా 34 సిక్సర్లు బాదాడు. ఈ ప్రదర్శనలతో సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని అతడు ఆకర్షించాడు. దీంతో దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఆడే అవకాశం చౌదరికి లభించింది.ఈసారి మాత్రం తన వచ్చిన అవకాశాన్ని అతడు అందిపుచ్చుకున్నాడు. పేస్, స్పిన్ రెండింటినీ అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అంతేకాకుండా అతడి షాట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది.ముంబై కన్ను..కాగా ఈ యువ సంచలనంపై ముంబై ఇండియన్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. నవంబర్ ఆఖరి వారంలో అతడు ముంబై నిర్వహించిన ట్రయల్స్కు హాజరైనట్లు సమాచారం. రియాన్ రికెల్టన్కు బ్యాకప్ వికెట్ కీపర్-బ్యాటర్గా ముకుల్ను తీసుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు టాలెంట్ స్కౌట్స్ కూడా అతడి బ్యాటింగ్ వీడియోలను పరిశీలిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.చదవండి: చాలా చాలా బాధగా ఉంది.. మా సత్తా ఏంటో చూపిస్తాం: స్టోక్స్ -
నమీబియా క్రికెట్ జట్టు సలహాదారుగా కిర్స్టెన్
దక్షిణాఫ్రికాకు చెందిన భారత మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ను నమీబియా పురుషుల క్రికెట్ జట్టు సలహాదారుగా నియమించుకుంది. హెడ్ కోచ్ క్రెయిగ్ విలియమ్స్తో కలిసి నమీబియా జట్టు కోసం ఆయన పనిచేయనున్నారు. త్వరలోనే జరిగే టి20 ప్రపంచకప్ వరకు కాంట్రాక్టు కుదిరినట్లు నబీబియా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘నమీబియాలాంటి నిబద్ధత గల జట్టుతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కొంతకాలంగా నమీబియా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. నాకున్న కోచింగ్ అనుభవంతో ఆ జట్టు మరింత రాటుదేలేందుకు, వచ్చే ప్రపంచకప్లో రాణించేందుకు కృషి చేస్తాను’ అని కిర్స్టెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సఫారీ మాజీ ఓపెనర్ 2004లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యారు. 2007లో భారత హెడ్ కోచ్గా నియమితులయ్యారు. ఆయన కోచింగ్లోనే ధోని సేన 2011లో జరిగిన వన్డే వరల్డ్కప్ను సాధించి, రెండోసారి (1983 తర్వాత) విశ్వవిజేతగా నిలిచింది.తదనంతరం దక్షిణాఫ్రికా సహా పలు జాతీయ జట్లకు హెడ్కోచ్గా వ్యవహరించారు. ఐపీఎల్ సహా విశ్వవ్యాప్తంగా జరిగే టి20 లీగ్ల్లోనూ పలు ఫ్రాంచైజీలకు కోచ్గా, మెంటార్గా కిర్స్టెన్ పనిచేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలలో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా టి20 ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: ‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’... -
చాలా చాలా బాధగా ఉంది.. మా సత్తా ఏంటో చూపిస్తాం: స్టోక్స్
ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్లో ఆ్రస్టేలియా జట్టు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసి 2–0తో ముందంజ వేసింది. ‘డే అండ్ నైట్’ టెస్టుల్లో తమ ఆధిపత్యం కొనసాగించిన కంగారూలు... ప్రఖ్యాత ‘గాబా’ స్టేడియంలో ఇంగ్లండ్కు అటు బ్యాట్తో, ఇటు నోటితో గట్టిగా బదులిచ్చారు.ఇంగ్లండ్ నిర్దేశించిన 65 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో ఆసీస్ అలవోకగా 69 పరుగులు చేసి గెలిచింది.గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తూ ఆసీస్ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేసిన ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ను స్మిత్ బ్యాట్తో బదులిచ్చాడు. ఈ ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో స్మిత్ ‘గాబా’లో వెయ్యి టెస్టు పరుగులు పూర్తి చేసుకున్నాడు.ట్రావిస్ హెడ్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 134/6తో నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 75.2 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ ముందు ఇంగ్లండ్ కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచిగల్గింది.ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ స్పందించాడు. తమ జట్టు మరింత నిలకడగా ఆడాల్సిన అవసరం ఉందని అతడి తెలిపాడు.మా ఓటమికి కారణమిదే?"చాలా బాధగా ఉంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాము. కీలక సమయంలో మేము ఒత్తడిని తట్టుకోలేకపోవడం వల్లే ఓడిపోయాము. తొలి టెస్టులో కూడా మేము ప్రత్యర్ధిపై పట్టు సాధించాము. కానీ చిన్న చిన్న తప్పిదాల వల్ల పెర్త్ టెస్టును కోల్పోయాము. ఇప్పుడు గబ్బాలో కూడా అదే తప్పు చేశాము. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికి ఓడిపోతుండడం మాకు చాలా చాలా బాధపడుతున్నాము. మా ఆటగాళ్లు మానసికంగా మరింత సిద్దంగా కావాలి. ఆస్ట్రేలియా వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముంది. క్లిష్ట సమయాల్లో మరింత పోరాట పటిమను చూపించాలి. ఆస్ట్రేలియాకు మేము ధీటైన సమాధానమిస్తాము. మాకు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం 2-0 తో వెనకబడి ఉన్నాము. కానీ మిగిలిన మ్యాచ్లలో గెలిచి సిరీస్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము.ఆస్ట్రేలియా గడ్డపై ఆడేందుకు బలహీనులకు చోటు లేదని అందరూ అంటుంటారు. కచ్చితంగా మాది బలహీనమైన జట్టు కాదని నిరూపించుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: ‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’... -
మెస్సీ ఖాతాలో మరో ట్రోఫీ
ఫ్లోరిడా: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనెల్ మెస్సీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. మేజర్ లీగ్ సాకర్ (ఎంఎల్ఎస్) కప్లో మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్ మయామి జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన తుదిపోరులో ఇంటర్ మయామి క్లబ్ 3–1 గోల్స్ తేడాతో వాంకోవర్ క్లబ్పై విజయం సాధించింది. ఇంటర్ మయామి జట్టు తరఫున మెస్సీ అన్నీ తానై వ్యవహరించాడు. ఫైనల్లో ఈ స్టార్ ఆటగాడు గోల్ చేయలేకపోయినా... సహచరులు గోల్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఎనిమిదో నిమిషంలో వాంకోవర్ జట్టు ఆటగాడు ఎడైర్ ఒకాంపో ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో మయామి జట్టు ముందంజ వేయగా... ఆ తర్వాత రోడ్రిగో డె పాల్ (71వ నిమిషంలో), టాడియో అల్లెండె (90+6వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. వాంకోవర్ జట్టు తరఫున అలీ అహ్మద్ (60వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఈ సీజన్లో మెస్సీకిది మూడో మేజర్ లీగ్ టైటిల్ కాగా... ఓవరాల్గా కెరీర్లో 47వది. ‘మూడేళ్ల క్రితం ఎంఎల్ఎస్ టైటిల్ గెవాలని కలగన్నా... అది ఈ రోజు సాధ్యమైంది. సీజన్ ఆసాంతం జట్టు మొత్తం కలిసికట్టుగా ఆడింది. ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆటగాళ్లందరూ దీనికి అర్హులు’ అని మెస్సీ పేర్కొన్నాడు. ఇంటర్ మయామి క్లబ్కు ఇదే తొలి ఎంఎల్ఎస్ టైటిల్ కాగా... మెస్సీకి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కింది. జర్మనీ దిగ్గజ ఆటగాడు థామస్ ముల్లర్ వాంకోవర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... చాన్నాళ్ల తర్వాత ముల్లర్పై మెస్సీ ఆధిపత్యం కనబర్చగలిగాడు. గతంలో పలుమార్లు ముల్లర్ కారణంగా అర్జెంటీనా జట్టు ప్రధాన టోర్నీల్లోపరాజయం పాలైంది. 2010 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్, 2014 వరల్డ్కప్ ఫైనల్లో ముల్లర్ సారథ్యంలోని జర్మనీ జట్టు... అర్జెంటీనాపై విజయం సాధించింది. ఇలా ఇప్పటి వరకు పలు కీలక టోర్నీల్లో మెస్సీపై ముల్లర్దే ఆధిపత్యం కాగా... ఎట్టకేలకు ఎంఎల్ఎస్ కప్లో మెస్సీ బదులు తీర్చుకున్నాడు. -
‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’...
సాక్షి, విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో విజయం సాధించడంలో సీనియర్లతో పాటు... యువ ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టి20, టెస్టు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ , ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లి ఈ మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకోగా... రోహిత్ శర్మ రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. గంభీర్కు సీనియర్ ఆటగాళ్లకు మధ్య సయోధ్య కుదరడం లేదనే వార్తల నేపథ్యంలో... సిరీస్ విజయం అనంతరం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో రోహిత్, కోహ్లి ప్రాధాన్యత... పేస్ ఆల్రౌండర్గా హర్షిత్ రాణా రాణించడం... వాషింగ్టన్ సుందర్కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వడం వంటి వివరాలు అతడి మాటల్లోనే... » కోహ్లి, రోహిత్ నాణ్యమైన ప్లేయర్లు. వాళ్లు ప్రపంచశ్రేణి ఆటగాళ్లు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ఇలాంటి అనుభజు్ఞలు డ్రెస్సింగ్ రూమ్లో ఉండటంతో జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. » వాళ్లు చక్కగా ఆడుతున్నారు. సుదీర్ఘకాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నా. 50 ఓవర్ల ఫార్మాట్లో వాళ్లిద్దరూ చాలా ముఖ్యం. » పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉంటే... జట్టు ఎంపికలో వెసులుబాటు ఉంటుంది. అందుకే హర్షిత్ రాణా వంటి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఎనిమిదో స్థానంలో బ్యాట్తో పరుగులు చేయగల ప్లేయర్ ఉంటే ఏ జట్టుకైనా మేలే కదా. అలాంటి ఆటగాడు జట్టులో సమతూకాన్ని తీసుకువస్తాడు. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ముగ్గురు ప్రధాన పేసర్లు జట్టులో ఉండటం తప్పనిసరి. రాణా పేస్ ఆల్రౌండర్గా మరింత పరిణతి సాధిస్తే అది టీమ్కు బాగా ఉపయోగ పడుతుంది. ఆ దిశగా అతడిని ప్రోత్సహిస్తున్నాం. » బుమ్రా అందుబాటులో లేకున్నా... అర్‡్షదీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఈ ముగ్గురికి వన్డే క్రికెట్లో పెద్దగా అనుభవం లేకపోయినా... వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకొని చక్కటి ఫలితాలు రాబట్టారు. » వన్డే క్రికెట్లో స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలని నేను అనుకోవడం లేదు. పరిస్థితులకు తగ్గట్లు ఆటగాళ్లంతా సిద్ధంగా ఉండటం మేలు. టెస్టు క్రికెట్లో అయితే ప్రతి స్థానానికి ప్రత్యేకమైన ఆటగాళ్లు ఉండటం మంచిది, కానీ, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనింగ్ జోడీ మినహా తక్కిన స్థానాలకు ఆ అవసరం లేదు. » వాషింగ్టన్ సుందర్నే తీసుకుంటే అతడు ఏ స్థానంలోనైనా చక్కగా ఒదిగిపోగలడు. విదేశాల్లో చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. మూడో స్థానంలో, ఐదో స్థానంలో, ఎనిమిదో స్థానంలో ఇలా ఎక్కడ అవసరమైతే అక్కడ బ్యాటింగ్ చేసేందుకు చిరునవ్వుతో సిద్ధంగా ఉంటాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే ఎంతో బాగుంటుంది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. » ఇటీవలి కాలంలో మ్యాచ్ ఫలితాలను నిర్ణయించడంలో టాస్ కీలకం అవుతోంది. మొదట బౌలింగ్ చేయడంలో, ఆ తర్వాత బౌలింగ్ చేయడంలో చాలా తేడా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో మన బౌలర్లకు బంతిపై సరిగ్గా పట్టు చిక్కలేదు. ఇక రెండో ఇన్నింగ్స్లో మన బ్యాటర్ల ప్రతాపం అందరూ చూశారు. » వన్డే సిరీస్ ఫలితాలపై మంచు ప్రభావం చూపింది కానీ... టి20 సిరీస్కు ఆ ఇబ్బంది ఉండదు. రెండు ఇన్నింగ్స్లు సాయంత్రం తర్వాతే ప్రారంభమవుతాయి కాబట్టి ఇద్దరికీ పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయి. -
నాకొద్దు... లావైపోతా!
సాక్షి, విశాఖపట్నం: టెస్టుల్లో పోగుట్టుకున్న సిరీస్ తాలూకు ప్రతిష్టను భారత్ వెంటనే విశాఖ తీరంలో వన్డే సిరీస్తో నిలబెట్టుకుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో విన్నర్స్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చిన ఆటగాళ్లంతా హోటల్కు చేరాక కూడా సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ కేక్ కోసి ‘కింగ్’ కోహ్లి నోటిని తీపి చేశాడు. తర్వాత అక్కడే ఉన్న ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మకూ కేక్ ముక్కను తినిపించబోయాడు. వెంటనే ఏమాత్రం మొహమాటం లేకుండా రోహిత్ ‘ప్లీజ్... నాకొద్దు. దీన్ని తింటే తిరిగి లావెక్కిపోతా’నంటూ జైస్వాల్ ప్రయత్నాన్ని వారించాడు. దీంతో అక్కడున్న సహచరులంతా పెద్దగా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లెక్కలేనన్ని లైక్స్, రీట్వీట్స్తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. కేక్ చిన్న ముక్కే అయినా రోహిత్ కఠినమైన డైట్కు ఇబ్బంది కలగొచ్చనే బెంగతోనే ‘హిట్మ్యాన్’ సున్నితంగా తిరస్కరించాడు. కోహ్లిలాగే కేవలం వన్డేలకే పరిమితమైన ఈ స్టార్ ఓపెనర్, మాజీ విజయవంతమైన కెప్టెన్ గత కొంతకాలంగా ఫిట్నెస్పైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. వన్డే వరల్డ్కప్ (2027)కు దాదాపు ఏడాదిన్నర ఉండటంతో నోటిని డైట్ క్రమశిక్షణతో కట్టిపడేశాడు. దీనివల్లే అతను ఏకంగా 11 కిలోల బరువుతగ్గాడు. ఇంట్లో నోటిని అదుపులో పెట్టుకున్న ఈ దిగ్గజ బ్యాటర్ క్రీజులో మాత్రం బ్యాట్కు పనిచెబుతున్నాడు. ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా భారీషాట్లతో చెలరేగిపోతున్నాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లోనూ రోహిత్ రెండు అర్ధసెంచరీలను సాధించాడు. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలిచింది. సిరీస్ కైవసం చేసుకుంది.


