breaking news
Sports
-
‘ఆస్ట్రేలియాలో కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడు’
వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టు సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. తదుపరి ఆస్ట్రేలియా (India Tour Of Australia 2025)లో పర్యటించనుంది. కంగారూ జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 19 నుంచి టీమిండియా ఆసీస్ టూర్ ప్రారంభం కానుండగా... దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేయనున్నారు.అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాకు ఆడిన రో- కో.. ఆ తర్వాత అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక గతేడాదే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు కూడా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు మేటి బ్యాటర్లు.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు.ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలోఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్గా రోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలో మాజీ కెప్టెన్లు రోహిత్- కోహ్లి కలిసి ఆడనున్నారు.కాగా రోహిత్పై వేటు వేసిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లి వన్డే వరల్డ్కప్-2027 ఆడటం గురించి తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రో-కో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరో నాలుగైదేళ్లు ఢోకా లేదు‘‘దయచేసి విరాట్ ఫిట్నెస్ గురించి ఎవరూ ఏమీ అడగకండి. ఫిట్నెస్ విషయంలో అతడొక గురు. అతడు ఏం చేసినా మిగతా వాళ్లు ఫాలో అయిపోతారు. కాబట్టి విరాట్ కోహ్లి ఫిట్నెస్ గురించి మనమేమీ ఆందోళన పడాల్సిన పనిలేదు.అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం అతడి కంటే ఫిట్గా ఉన్న మరొక ప్లేయర్ ఎవరూ లేరు. అయితే, కోహ్లి బ్యాట్చేతపట్టి ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుతాడా అని నేను ఎదురుచూస్తున్నా.చాలా రోజులుగా అభిమానులతో పాటు నేనూ అతడి ఆటను మిస్సవుతున్నాను. వన్డేల్లో కోహ్లి ఇంకా ఎంతో సాధించగలడు. ఇంకొన్నేళ్లు ఆడగల సత్తా అతడికి ఉంది. కనీసం మరో నాలుగైదేళ్లు కోహ్లి వన్డేలు ఆడతాడని నేను నమ్ముతున్నా.కేవలం ఆడటమే కాదు.. తనదైన శైలిలో ఆధిపత్యం కూడా చూపిస్తాడని విశ్వసిస్తున్నా. ఆస్ట్రేలియాలో అతడి ఆట కోసం ఎదురుచూస్తున్నా. ఇక రోహిత్ విషయంలోనూ నేను ఇదే చెప్తా.కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడుఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు దిగ్గజాలు భారీ స్కోర్లు సాధించి టీమిండియాను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా కోహ్లికి ఇష్టమైన ప్రత్యర్థి. మూడు వన్డేల్లో కలిపి అతడు కనీసం రెండు శతకాలైనా బాదుతాడని అనుకుంటున్నా’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య వన్డే, టీ20 సిరీస్లు జరుగనున్నాయి.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్ -
పాక్పై 11 వికెట్లు.. సౌతాఫ్రికా బౌలర్ అరుదైన ఘనత
లాహోర్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో సౌతాఫ్రికా స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల సహా మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసి ఓ అరుదైన ఘనత సాధించాడు.ఓ టెస్ట్ మ్యాచ్లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో సౌతాఫ్రికన్ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ముత్తుసామికి ముందు హగ్ టేఫీల్డ్ (1952లో ఆస్ట్రేలియాపై 13/165), హగ్ టేఫీల్డ్ (1957లో ఇంగ్లండ్పై 13/192), కేశవ్ మహారాజ్ (2018లో శ్రీలంకపై 12/283), పాల్ ఆడమ్స్ (2003లో బంగ్లాదేశ్పై 10/106) మాత్రమే ఈ ఘనత సాధించారు.ముత్తుసామి ప్రదర్శనల కారణంగా ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా నిలబడగలిగింది. తొలి ఇన్నింగ్స్లో పాక్ను 378 పరుగులకు పరిమితం చేసిన ముత్తు.. రెండో ఇన్నింగ్స్లో మరింతగా చెలరేగి ప్రత్యర్దిని 167 పరుగులకే మట్టుబెట్టాడు. ఈ ఇన్నింగ్స్లో ముత్తుసామితో పాటు సైమన్ హార్మర్ (14.1-3-51-4) కూడా సత్తా చాటాడు.పాక్ ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్లా షఫీక్ (41), సౌద్ షకీల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మరో ఇద్దరు (రిజ్వాన్ (14), నౌమన్ అలీ (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులు ఆధిక్యం సాధించిన పాక్.. రెండో ఇన్నింగ్స్ స్కోర్ కలుపుకుని సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలోనే తడబడింది. 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 3, వియాన్ ముల్దర్ డకౌటయ్యారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ర్యాన్ రికెల్టన్ (29), టోనీ డి జోర్జీ (16) ఆచితూచి ఆడుతూ నిదానంగా లక్ష్యాన్ని కరిగిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్ 2 వికెట్ల నష్టానికి 51 పరుగులుగా ఉంది. గెలుపుకు 226 పరుగుల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో చెలరేగిన నౌమన్ అలీ రెండో ఇన్నింగ్స్లోనూ ప్రభావం చూపుతున్నాడు. సౌతాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు నౌమన్ ఖాతాలోనే పడ్డాయి.శతక్కొట్టిన జోర్జిఅంతకుముందు టోనీ డి జోర్జి బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 269 పరుగులు చేయగలిగింది. ఓ పక్క సహచరులంతా విఫలమైన జోర్జి మాత్రం పట్టుదలతో ఆడి తన జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో జోర్జితో పాటు ర్యాన్ రికెల్టన్ (71) ఒక్కడే రాణించారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. నౌమన్కు సాజిద్ ఖాన్ (3/98) సహకరించాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు సౌతాఫ్రికా 109 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు. ఇమామ్ ఉల్ హక్ (93), సల్మాన్ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: రేపటి నుంచి దేశీయ క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం -
మరో వివాదంలో HCA.. టాలెంట్ ఉన్న వాళ్లను తొక్కేస్తున్నారు!?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం రేపింది. ఈ విషయంపై అసోసియేషన్తో పలువురు క్రికెటర్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు అందింది. అండర్- 16, అండర్- 19, అండర్-23 లీగ్ మ్యాచ్లలో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం తాజాగా బయటపడినట్లు సమాచారం. వయసు ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు కూడా నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్లలో ఎంట్రీ ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ విషయంలో గతంలో ఆరుగురు ప్లేయర్లను గుర్తించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వారిపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఎక్కువ వయసున్న ఆటగాళ్లలో తక్కువ వయసున్న విభాగంలో ఆడేందుకు HCA అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. దీని వల్ల ప్రతిభావంతులైన ఆటగాళ్లకు నష్టం వాటిల్లుతుందన్న సంగతి తెలిసినా HCA తమ తీరు మార్చుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో.. అవినీతికి పాల్పడుతూ టాలెంట్ లేని ప్లేయర్లను ఆడిస్తున్న HCA అధికారులపై చర్యలు తీసుకోవాలని అనంతరెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా గత కొన్నాళ్లుగా HCA వివిధ అంశాల్లో అవినీతికి పాల్పడిన తీరు.. అసోసియేషన్పై విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.చదవండి: యువ క్రికెటర్లకు HCA బంపరాఫర్.. ఆలస్యం చేయకండి -
కెప్టెన్ అంటే ఇలాగే ఉండాలి.. అందరూ అతడిని గౌరవిస్తారు: గంభీర్
టీమిండియా టెస్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)పై హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్గా అతడు తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణుడయ్యాడని.. అతడికి వంక పెట్టేందుకు ఏమీ లేదని కొనియాడాడు. తనకు ఉన్న నైపుణ్యాలతోనే గిల్ టెస్టు సారథి అయ్యాడని.. అలాగే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడని పేర్కొన్నాడు.సారథిగా తొలి ప్రయత్నంలోనేకాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. సారథిగా తొలి ప్రయత్నంలోనే ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడ్డాడు. బ్యాటర్గా, కెప్టెన్గా రాణించి ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేశాడు.విండీస్ను వైట్వాష్ చేసి తొలి విజయంఇక తాజాగా వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసి.. కెప్టెన్గా గిల్ తొలి సిరీస్ విజయాన్ని రుచిచూశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే వన్డే కెప్టెన్సీ నుంచి దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించిన భారత క్రికెట్ యాజమాన్యం.. గిల్కు పగ్గాలు అప్పగించింది.ఫేవటెరిజం లేదుఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. విండీస్పై విజయానంతరం గంభీర్ స్పందించాడు. ‘‘అతడిని అచ్చంగా అతడిలా ఉండనివ్వడమే మేము చేసిన మంచిపని. టెస్టు లేదంటే వన్డే కెప్టెన్గా అతడిని ఎంపిక చేయడంలో ఎలాంటి ఫేవటెరిజం లేదు. ఇందుకు వందశాతం గిల్ అర్హుడు.ఎన్నో ఏళ్లుగా అతడు కఠినంగా శ్రమిస్తున్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు కెప్టెన్ ఇప్పటికే కఠిన సవాలు ఎదుర్కొని.. అతడు సారథిగా పాసయ్యాడు. నాణ్యమైన జట్టుపై బ్యాటర్గా, కెప్టెన్గా రాణించాడు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ 2027 గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం సరికాదు.అందరూ అతడిని గౌరవిస్తారుప్రతి మ్యాచ్లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ముఖ్యం. సొంతగడ్డపై మాకిది కీలకమైన సిరీస్. ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం. నిజానికి ఇంగ్లండ్లో టెస్టులు ఇంతకంటే కష్టంగా ఉండేవి. ఇదే విషయాన్ని గిల్తో నేను చాలాసార్లు చెప్పాను.రెండున్నర నెలల పాటు అక్కడ గిల్ అత్యంత కఠినమైన సవాలును ఎదుర్కొన్నాడు. ఇంతకంటే అతడు ఇంకేం చేయాలి? డ్రెసింగ్రూమ్లో అందరూ అతడిని గౌరవిస్తారు. సరైన పనులు చేసినందుకు అతడికి ఇవన్నీ దక్కాయి. మాటల కంటే చేతలు ముఖ్యం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.నాకు ఆ అవసరం ఉందిఇక ఒత్తిడిని తట్టుకునేందుకు గిల్ కోసం మెంటల్ కండిషనింగ్ కోచ్ను నియమిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ముందైతే నాకు అతడి అవసరం ఉంది’’ అంటూ నవ్వులు చిందించాడు. గెలిచినప్పుడు జట్టుకు ప్రశంసలు దక్కుతాయన్న గౌతీ.. ఓడినప్పుడు మాత్రం ఆటగాళ్లు కుంగిపోకుండా చూసుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్ -
పాక్ను మడతపెట్టిన ముత్తుసామి.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
లాహోర్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో (Pakistan vs South Africa) సౌతాఫ్రికా స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 5 సహా మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. ముత్తుసామి (17-1-57-5) ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. అతనికి సైమన్ హార్మర్ (14.1-3-51-4), రబాడ (10-0-33-1) సహకరించారు.పాక్ ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్లా షఫీక్ (41), సౌద్ షకీల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మరో ఇద్దరు (రిజ్వాన్ (14), నౌమన్ అలీ (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (109 పరుగులు) కలుపుకుని పాక్ సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.శతక్కొట్టిన జోర్జిఅంతకుముందు టోనీ డి జోర్జి (Tony de Zorzi) బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 269 పరుగులు చేయగలిగింది. ఓ పక్క సహచరులంతా విఫలమైన జోర్జి మాత్రం పట్టుదలతో ఆడి తన జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో జోర్జితో పాటు ర్యాన్ రికెల్టన్ (71) ఒక్కడే రాణించారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. నౌమన్కు సాజిద్ ఖాన్ (3/98) సహకరించాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు సౌతాఫ్రికా 109 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు. ఇమామ్ ఉల్ హక్ (93), సల్మాన్ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్ -
యువ క్రికెటర్లకు HCA బంపరాఫర్.. ఆలస్యం చేయకండి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) యువ మహిళా క్రికెటర్లకు బంపరాఫర్ ఇచ్చింది. భారత అండర్-19 వుమెన్ జట్టులో చోటు కోసం పోటీపడే సువర్హావకాశం కల్పించింది. ఇందుకోసం అక్టోబరు 15, 16 తేదీల్లో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇందులో సత్తా చాటిన మహిళా క్రికెటర్లు 2025-26 సీజన్కు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే టోర్నీల్లో భాగం కావొచ్చని హెచ్సీఏ ఈ సందర్భంగా తెలిపింది. ఇక పోటీల్లో పాల్గొనాలనుకునే మహిళా క్రికెటర్లకు ఉండాల్సిన అర్హతలను కూడా మంగళవారం వెల్లడించింది. ప్రతి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ నోటిఫికేషన్ గురించి స్థానిక ప్లేయర్లకు సమాచారం అందించాలని ఆదేశించింది.రిజిస్ట్రేషన్ వివరాలు👉అక్టోబరు 15 2025న ఉదయం తొమ్మిది గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభం👉మధ్యాహ్నం 12- సాయంత్రం 5 గంటలకు వరకు ట్రయల్స్👉అక్టోబరు 16న కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్, ట్రయల్స్ ప్రక్రియవేదిక👉ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (RGICS), ఉప్పల్, హైదరాబాద్.నోట్: జిల్లాల నుంచి వచ్చే క్రికెటర్లు అక్టోబరు 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోనట్లయితే.. అక్టోబరు 16న ఉప్పల్లో ఉదయం 9- సాయంత్రం ఐదు గంటల వరకు రిపోర్టు చేయవచ్చు.అర్హత👉01.09.2006న లేదంటే ఆ తర్వాత జన్మించిన మహిళా క్రికెటర్లకు మాత్రమే ఈ అవకాశంప్లేయర్లు పాటించాల్సిన నిబంధనలు👉ఉప్పల్లోని RGICSలో గేట్ 1 వద్ద ప్లేయర్లంతా రిపోర్టు చేయాలి.👉ప్రతీ ప్లేయర్ తమ క్రికెట్ కిట్, తెలుపు రంగు దుస్తులు వెంట తెచ్చుకోవాలి.👉 గుర్తింపు పత్రాలను తప్పక తీసుకురావాలి.1. పుట్టినరోజును ధ్రువీకరించే బర్త్ సర్టిఫికెట్ ఒరిజినల్ డిజిటల్ కాపీ, దానితో పాటు జిరాక్స్ ఫొటోకాపీని తీసుకురావాలి.2. ఒరిజినల్ ఫుల్ సైజ్ ఆధార్ కార్డుతో పాటు.. దాని జిరాక్స్ ఫొటోకాపీ కూడా తెచ్చుకోవాలి.3. ఒక పాస్పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలి.చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్పై గంభీర్ ఫైర్ -
రేపటి నుంచి దేశీయ క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం
రేపటి నుంచి (అక్టోబర్ 15) దేశీయ క్రికెట్ మహా సంగ్రామం రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ఇది 91వ ఎడిషన్. ఇందులో మొత్తం 38 జట్లు పోటీపడనున్నాయి. 28 రాష్ట్రాలకు చెందిన జట్లు (కొన్ని రాష్ట్రాలకు సంబంధించి రెండుకు మించి జట్లు ఉన్నాయి), 4 కేంద్ర పాలిత ప్రాంతాల జట్లు, అలాగే సర్వీసెస్, రైల్వేస్ జట్లు పాల్గొంటున్నాయి.గత సీజన్లో విదర్భ విజేతగా, కేరళ రన్నరప్గా నిలిచాయి. తొలి మ్యాచ్లో ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. రేపు మొత్తం 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ టోర్నీ కోసం దాదాపుగా అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించాయి. ఈసారి టోర్నీకి చాలామంది టీమిండియా స్టార్లు అందుబాటులో ఉన్నారు.రంజీ ట్రోఫీ 2025-26లో ఆడనున్న కీలక ఆటగాళ్లు..ముంబై- శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్కేరళ- సంజూ శాంసన్కర్ణాటక- మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్జార్ఖండ్- ఇషాన్ కిషన్హైదరాబాద్- తిలక్ వర్మబీహార్- వైభవ్ సూర్యవంశీబెంగాల్- మహ్మద్ షమీఉత్తరప్రదేశ్- రింకూ సింగ్అస్సాం- రియాన్ పరాగ్కాగా, రంజీ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు ముంబై గెలుచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు 42 సార్లు ఛాంపియన్గా నిలిచింది. ముంబై తర్వాత కర్ణాటక/మైసూర్ అత్యధికంగా 8 టైటిళ్లు సాధించింది. ఆతర్వాతి స్థానాల్లో ఢిల్లీ (7), మధ్యప్రదేశ్/హోల్కర్ (5), బరోడా (5), సౌరాష్ట్ర (2), విదర్భ (2), బెంగాల్ (2), తమిళనాడు/మద్రాస్ (2), రాజస్తాన్ (2) జట్లు ఉన్నాయి.చదవండి: కింగ్ కోహ్లి వచ్చేశాడు..! -
చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం నుంచి ఇప్పటికి వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత క్రికెటర్గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేరిట ఉండేది. వెస్టిండీస్తో రెండో టెస్టు (IND vs WI 2nd Test) సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఏడు వికెట్ల తేడాతో జయభేరిప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా టీమిండియా స్వదేశంలో విండీస్తో రెండు మ్యాచ్లు ఆడింది. తొలుత అహ్మదాబాద్లో వెస్టిండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. ఢిల్లీలో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.కేఎల్ రాహుల్తో కలిసితద్వారా విండీస్తో టెస్టు సిరీస్ను భారత్ 2-0తో వైట్వాష్ చేసింది. ఇక వెస్టిండీస్తో రెండో టెస్టులో జురెల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 79 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో ఆరు పరుగులతో అజేయంగా నిలిచి.. కేఎల్ రాహుల్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.సరికొత్త చరిత్రకాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ధ్రువ్ జురెల్ గతేడాది ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారణంగా కొన్నిసార్లు బెంచ్కే పరిమితమైన జురెల్.. ఇప్పటికి ఏడు టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 761 పరుగులు సాధించాడు.ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం నుంచి భారత్ తరఫున ఆడిన ఏడు టెస్టుల్లోనూ విజయం సాధించిన జట్లలో భాగమైన తొలి ఆటగాడిగా జురెల్ నిలిచాడు. అంతకు ముందు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అరంగేట్రం (2013) నుంచి వరుసగా ఆరు టెస్టుల్లో గెలిచిన భారత జట్టులో భాగమయ్యాడు.భారత్ తరఫున వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్లు గెలిచిన క్రికెటర్లు👉ధ్రువ్ జురెల్- 7👉భువనేశ్వర్ కుమార్- 6👉కరుణ్ నాయర్- 4👉వినోద్ కాంబ్లీ- 4👉రాజేశ్ చౌహాన్- 4. చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు -
కింగ్ కోహ్లి వచ్చేశాడు..!
భారత క్రికెట్ అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) భారత్లో (ఢిల్లీ) ల్యాండయ్యాడు. విరాట్ గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి లండన్లో ఉంటున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కోహ్లి భారత్కు రావడం ఇదే మొదటిసారి.THE AURA OF KING KOHLI..!!!! 🐐- The Arrival of Virat Kohli at home in Delhi. 👑pic.twitter.com/fevrsiSB7L— Tanuj (@ImTanujSingh) October 14, 2025ఇవాళ (అక్టోబర్ 14) ఉదయం కోహ్లి న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం స్వల్ప తోపులాట కూడా జరిగింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణg మార్మోగిపోయింది. ప్రస్తుతం ఎక్స్లో #ViratReturns అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.త్వరలో ఆస్ట్రేలియాలో జరుగబోయే సిరీస్ కోసం కోహ్లి ఢిల్లీ నుంచి బయల్దేరతాడు. విరాట్తో పాటు రోహిత్ శర్మ కూడా వెళ్తాడని సమాచారం. మిగతా సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే మ్యాచ్లు అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో జరుగనున్నాయి.విరాట్ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసీస్తో వన్డే సిరీస్ ద్వారా కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లికి ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ తర్వాత కోహ్లి భవిష్యత్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ (ఆసీస్ సిరీస్ తర్వాత) ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్పై గంభీర్ ఫైర్ కోహ్లితో పాటు రోహిత్ కూడా టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. కోహ్లి, రోహిత్ల ఆట చూసేందుకు అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోహ్లి, రోహిత్ల నుంచి భారీ ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు. -
‘మీ ఇద్దరిని వేదనకు గురిచేశా.. వీలైతే నన్ను క్షమించండి’
టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ మాట మార్చాడు. భారత దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh), అతడి తల్లి షబ్నమ్ను చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరుతున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.కాగా చండీగఢ్కు చెందిన యోగ్రాజ్ సింగ్ గతంలో షబ్నమ్ను వివాహం చేసుకున్నాడు. వీరికి యువరాజ్ సింగ్, జొరావర్ సంతానం. అయితే, పితృస్వామ్య భావజాలం కలిగిన యోగ్రాజ్.. షబ్నమ్ను ఇంట్లో పెట్టి తాళం వేసినంత పనిచేశాడు. ఆమె తరఫు బంధువులను కూడా ఇంట్లోకి రానివ్వలేదు.అంతేకాదు.. క్రికెటర్గా తీర్చిదిద్దే క్రమంలో యువరాజ్ సింగ్ను కూడా ఎంతో కష్టపెట్టాడు. ఒకానొక సమయంలో అతడి శిక్షణ తట్టుకోలేక యువీ చనిపోతాడని తన తల్లి హెచ్చరించినా కరుణించలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యోగ్రాజ్ సింగ్ స్వయంగా ఈ విషయాలు వెల్లడించాడు.మీరే నా పరువు. తల చుట్టూ దుపట్టా ఉండాలిఅంతేకాదు.. తాను ఎవరి విషయంలోనూ పశ్చాత్తాపపడే పనిచేయలేదని కూడా యోగ్రాజ్ (Yograj Singh) వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. మహిళలకు స్వాతంత్ర్యం అవసరం లేదని.. వారికి కుటుంబ బాధ్యతలు అప్పగిస్తే అంతా అస్తవ్యస్తమైపోతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తన రెండో భార్య నీనా, కూతురు అమీకి.. ‘మీరే నా పరువు. తల చుట్టూ దుపట్టా ఉండాలి. లేదంటే నా ప్రాణం పోయినట్లే’ అని హెచ్చరిక చేసినట్లు కూడా వెల్లడించాడు.మీ ఇద్దరిని వేదనకు గురిచేశా.. వీలైతే నన్ను క్షమించండిఅయితే, తాజాగా ఫైవ్వుడ్ పాడ్కాస్ట్లో యోగ్రాజ్ సింగ్ మాట్లాడుతూ.. తన ప్రవర్తన పట్ల ముఖ్యంగా యువీ, అతడి తల్లి విషయంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ‘‘నా జీవితంలో చేసినవన్నీ తప్పులే. అయితే, నా ఆత్మగౌరవం, కుటుంబ పరువు కోసమే అన్నీ చేశాను.ఈ క్రమంలో జీవితంలోని ఎన్నో జ్ఞాపకాలను తుడిచివేశాను. గురు (దేవుడు) చెప్పిన మాటలే విన్నాను. అయితే, ఇప్పుడు చేతులు జోడించి క్షమాపణలు అడుగుతున్నా.నా వల్ల ఇబ్బందులకు గురైన ప్రతి ఒక్కరినీ క్షమించమని కోరుతున్నా. కుటుంబ సభ్యులైనా, బయటి వ్యక్తులైనా నా వల్ల బాధపడి ఉంటే సారీ. నా పిల్లల్ని క్షమాపన కోరుతున్నా. ముఖ్యంగా నా భార్య.. యువీ తల్లిని.. నన్ను క్షమించాలని వేడుకుంటున్నా.తప్పంతా నాదే. నా సహచర ఆటగాళ్లు, స్నేహితుల విషయంలోనూ నోటికొచ్చినట్లు మాట్లాడాను. క్రికెట్లో, సినిమాల్లో ఎవరినైనా తిట్టి ఉంటే సారీ. మీరంతా నన్ను క్షమించండి.నాలో తప్పులు, అవలక్షణాలు మాత్రమే ఉన్నాయినాలో ఎలాంటి గొప్ప గుణాలు లేవు. కేవలం నాలో తప్పులు, అవలక్షణాలు మాత్రమే ఉన్నాయి. జీవితంలో నేను ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఇకపై కలలో కూడా మరోసారి తప్పులను పునరావృతం చేయను. నేను నిశ్చితంగా నిద్రపోతాను. నాకు ఇప్పుడు మందులు అక్కర్లేదు.నేను చనిపోయినపుడు ఆ గురు నన్ను చూసి గర్విస్తే చాలు’’ అని యోగ్రాజ్ సింగ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇటీవల తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యానని.. అప్పుడే అందరి విలువా తెలిసిందని తెలిపాడు. తన మాజీ భార్య షబ్నమ్, ప్రస్తుత భార్య నీనాలను ‘మాతా’గా అభివర్ణించిన యోగ్రాజ్ సింగ్.. తన కుమారుల్లో ‘గురు’ను చూసుకుంటున్నానని ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా యోగ్రాజ్ సింగ్ 1980-81 మధ్యకాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, అతడి కుమారుడు యువరాజ్ సింగ్ భారత క్రికెట్ చరిత్రలో ఉత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా భారత్ టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 గెలవడంలో యువీది కీలక పాత్ర.చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60 ఏళ్లు.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే! -
PAK vs SA: రమీజ్ రాజా ‘చీప్’ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా (Ramiz Raja) మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. పాక్ వెటరన్ ఆటగాడు నొమన్ అలీ (Noman Ali)ని ఉద్దేశించి చవకబారు వ్యాఖ్యలు చేశాడు. దీంతో సొంత జట్టు అభిమానులే రమీజ్ రాజాపై మండిపడుతున్నారు. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా పాక్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆదివారం లాహోర్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది.బాబర్ ఆజం విఫలంఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93), కెప్టెన్ షాన్ మసూద్ (76), సల్మాన్ ఆఘా (93) రాణించగా.. మాజీ సారథి బాబర్ ఆజం (Babar Azam) 23 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో పాక్ 378 పరుగులకు ఆలౌట్ అయింది.కాగా సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మేర్ బౌలింగ్లో బాబర్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే, ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ ముందుగా నాటౌట్ ఇవ్వగా.. సౌతాఫ్రికా ఆఖరి నిమిషంలో రివ్యూకు వెళ్లింది. ఇందులో బంతి ముందుగా ప్యాడ్ను తాకినట్లు (లెగ్ స్టంప్ ఎగిరినట్లు) తేలింది. ఫలితంగా థర్డ్ అంపైర్ బాబర్ను అవుట్గా ప్రకటించాడు.రివ్యూతో గట్టెక్కాడుఇక అంతకు ముందు ఒక పరుగు వద్ద ఉన్న వేళ బాబర్ ఆజం రివ్యూతో గట్టెక్కాడు. ముతుసామి వేసిన బంతిని ఆడటంలో బాబర్ విఫలం కాగా.. ప్రొటిస్ బౌలర్లు మాత్రం అప్పీలు చేశారు. ఈ క్రమంలో బంతిని బ్యాట్ను తాకలేదని భావించిన బాబర్ రివ్యూకు వెళ్లగా.. అతడికి అనుకూల ఫలితం వచ్చింది.కచ్చితంగా డ్రామాకు తెరతీస్తాడుఈ విషయం గురించి కామెంట్రీలో రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘‘ఇది అవుటే అనిపిస్తోంది. ఒకవేళ నిర్ణయం తనకు అనుకూలంగా లేకుంటే అతడు కచ్చితంగా డ్రామాకు తెరతీస్తాడు’’ అని నోరుపారేసుకున్నాడు. అయితే, అప్పటికి తన మైకు ఆన్లో ఉందని రమీజ్ రాజాకు తెలియకపోవడం గమనార్హం.ఇక తాజాగా మరోసారి రమీజ్ రాజా తమ జట్టు ఆటగాడిని టార్గెట్ చేశాడు. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 269 పరుగులకే ఆలౌట్ చేయడంలో పాక్ స్పిన్నర్ నొమన్ అలీది కీలక పాత్ర. ఈ లెఫ్టార్మ్ బౌలర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.అచ్చంగా వెల్డింగ్ గ్లాస్లా ఉన్నాయిఅయితే, ఈ మ్యాచ్లో నొమన్ అలీ సన్గ్లాసెస్ ధరించి బౌలింగ్ చేశాడు. ఈ విషయం గురించి కామెంట్ చేస్తూ.. ‘‘ఫ్యాన్సీ గ్లాసెస్ ధరించాడు నొమన్ అలీ. ఇవైతే అచ్చంగా వెల్డింగ్ గ్లాస్లా ఉన్నాయి’’ అంటూ చీప్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్గా సేవలు అందించిన నీ దృష్టిలో ఆటగాళ్లంటే ఇంత చిన్నచూపా. నీ కెరీర్లో అంత గొప్పగా ఏం సాధించావని ఇంతగా బిల్డప్ ఇస్తున్నావు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 18 ఓవర్లు ముగిసేసరికి పాక్.. తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు -
సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్పై గంభీర్ ఫైర్
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్లకు టీమిండియా పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)ను ఎంపిక చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Goutham Gambhir) అండదండలతోనే అతడికి సెలక్టర్లు అవకాశమిచ్చారని అశ్విన్, కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రికెటర్లు మండిపడ్డారు.అంతేకాకుండా చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రాణాను ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. రాణా జట్టులోకి మెరిట్ ప్రాతిపదికన వచ్చాడనీ, అతడి ఎంపికలో ఎవరి జోక్యం లేదని గౌతీ తెలిపాడు. ఒక యువ క్రికెటర్ ఇలా ట్రోల్ చేయడం సరికాదని వారించాడు."నిజంగా ఇది సిగ్గు చేటు.. మీ యూట్యూబ్ ఛానల్స్ నడపడానికి 23 ఏళ్ల ఒక క్రికెటర్ను టార్గెట్ చేస్తారా? అతడి తండ్రి మాజీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మెనో, ఓ మాజీ క్రికెటరో, ఎన్నారైనో కాదు. అతడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు. కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. అతడి ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశాము. భారత క్రికెట్కు మంచి జరిగేలా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది. మీ యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ కోసం అతడిని ఏమీ అనకండి. మీరు నన్ను విమర్శించినా పర్వాలేదు. వాటిని నేను హ్యాండిల్ చేసుకోగలను. కానీ ఒక యువ క్రికెటర్ను టార్గెట్ చేయడం సరికాదు. భవిష్యత్తులో మీ బిడ్డ కూడా దేశం తరపున ఆడవచ్చు. అప్పుడు ఇలానే ఎవరైనా ట్రోల్ చేస్తే అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? దయచేసి ఇకనైనా మారండి" అంటూ వెస్టిండీస్తో రెండో టెస్టు విజయానంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ ఫైరయ్యాడు.చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు.. -
అన్ని ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాము.. సంతోషంగా ఉంది: గిల్
శుభ్మన్ గిల్.. టీమిండియా కెప్టెన్గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను భారత్ చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో గిల్ సారథ్యంలో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.ఢిల్లీ టెస్టులో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. యశస్వి జైశ్వాల్(175), శుభ్మన్ గిల్(129), సాయిసుదర్శన్(87) బ్యాటింగ్లో సత్తాచాటగా.. కుల్దీప్ యాదవ్( 8 వికెట్లు), జడేజా(4 వికెట్లు), జస్పీత్ బుమ్రా (4) బౌలింగ్లో మాయ చేశారు. ఇక విజయంపై మ్యాచ్ అనంతరం గిల్ స్పందించాడు. తన నాయకత్వ అనుభవం, జట్టు వ్యూహాలపై గిల్ మాట్లాడాడు."భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. కెప్టెన్గా తొలి సిరీస్ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఆటగాడితో కలిసి పనిచేయడం, జట్టును నడిపించడం వంటివి నేను నేర్చుకుంటున్నాను.పరిస్థితులకు తగ్గ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను. కొన్ని సందర్భాల్లో ధైర్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని సార్లు ఎక్స్-ఫాక్టర్ ఆటగాళ్లను రంగం దించాల్సి వవస్తుంది. ఏ ఆటగాడైతే పరుగులు లేదా వికెట్లు అందించగలడో వారిని ఎక్స్-ఫాక్టర్గా ఉపయోగించుకోవాలి" అని గిల్ చెప్పుకొచ్చాడు.ఫాలో-ఆన్ నిర్ణయం గురించి మాట్లాడుతూ.. "విండీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మేము సుమారు 300 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. ఐదో రోజున వికెట్లు తీయడం కష్టం అవుతుందనే భావించి ఫాలో-ఆన్ ఆడించాము. మేము 500 పరుగులు చేసినా.. ఆఖరి రోజు ఆటలో వికెట్లు పడగొట్టడం కష్టమవుతుందని ఫాలో ఆన్ను అమలు చేశాము.నితీష్ రెడ్డి గురించి మాట్లాడుతూ .. నితీష్కు ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. విదేశాల్లో మాత్రమే కాదు, ఇక్కడ పిచ్లపై కూడా అతడిని అలవాటు చేయాలని చూస్తున్నాము. విదేశీ గడ్డపై మ్యాచ్లను గెలవడంలో మాకు సహాయపడతారని భావించే కొంతమంది ఆటగాళ్లను మేము ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాము. ఎందకంటే అక్కడ గెలవడం మాకు ఎల్లప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది. నేను బ్యాటింగ్కు వెళ్లినప్పుడు కేవలం బ్యాటర్గానే ఆలోచిస్తాను. నేను 3-4 ఏళ్ల వయసు నుంచి బ్యాటింగ్ చేస్తున్నాను. క్రీజులోకి వెళ్లిన ప్రతీసారి జట్టును గెలిపించడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచించలేదు. ఫ్లైట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు నవ్వుతూ గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు.. -
IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు..
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా ఖాతాలో తొలి టెస్టు సిరీస్ విజయం చేరింది. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను గిల్ సేన 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.121 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి రోజు తొలి సెషన్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 58 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలవగా.. సుదర్శన్(39) రెండో ఇన్నింగ్స్లోనూ సత్తాచాటాడు. అంతకుముందు యశస్వి జైశ్వాల్, గిల్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 518/5 డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అయితే రెండో ఇన్నింగ్స్లో విండీస్ బ్యాటర్లు పోరాడారు. క్యాంప్బెల్, హోప్లు సెంచరీలతో సత్తాచాటడంతో సెకెండ్ ఇన్నింగ్స్లో కరేబియన్ జట్టు 390 పరుగులు చేయగల్గింది. దీంతో విండీస్ 121 పరుగుల టార్గెట్ను భారత్ ముందు ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ చేధించింది.సౌతాఫ్రికా వరల్డ్ రికార్డు సమం..ఇక ఈ మ్యాచ్లో అద్బుతమైన విజయం సాధించిన భారత్ ఓ వరల్డ్ రికార్డును సమం చేసింది. ఒకే జట్టుపై వరుసుగా అత్యధిక టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా సరసన టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికా టీమ్ విండీస్(1998-24)పై వరుసగా 10 సార్లు టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది.భారత్ కూడా వెస్టిండీస్ (2002-25)పై 10 సార్లు టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల తర్వాత ఆస్ట్రేలియా ఉంది. విండీస్పై ఆసీస్ ఇప్పటివరకు 9 సార్లు టెస్టు సిరీస్లలో పై చేయి సాధించింది.చదవండి: అర్జున్ టెండూల్కర్కు గుడ్ న్యూస్.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు -
వెస్టిండీస్ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన 121 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో గిల్ సేన క్లీన్ స్వీప్ చేసింది.63/1 ఓవర్ నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ సాయిసుదర్శన్(39), కెప్టెన్ గిల్(13) వికెట్ను కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్(58 నాటౌట్), ధ్రువ్ జురెల్(6 నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ఫినిష్ చేశారు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ ఛేజ్ రెండు, వారికన్ ఓ వికెట్ సాధించారు. కెప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇదే తొలి సిరీస్ విజయం. సెంచరీలతో మెరిసిన హోప్, క్యాంప్బెల్..కాగా ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఫాల్ ఆన్ ఆడిన వెస్టిండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో అద్బుతమైన పోరాటం కనబరిచింది. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (199 బంతుల్లో 115; 12 ఫోర్లు, 3 సిక్స్లు), షై హోప్ (214 బంతుల్లో 103; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో కరేబియన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓ దశలో భారత్ ముందు మెరుగైన టార్గెట్ను ఉంచేలా కన్పించిన విండీస్ బ్యాటర్లు.. మరోసారి కుల్దీప్ యాదవ్ స్పిన్ మయాజాలానికి చిత్తు అయ్యారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను ముగించింది.అంతకుముందు టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 518 రన్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అంతకుముందు టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 518 రన్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది.భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (175), శుభ్మన్ గిల్(129) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు ఇన్నింగ్స్లు కలిపి 8 వికెట్ల పడగొట్టాడు. అతడితో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా రాణించారు.చదవండి: అర్జున్ టెండూల్కర్కు గుడ్ న్యూస్.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు -
అర్జున్ టెండూల్కర్కు గుడ్ న్యూస్.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం గోవా క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్కు చోటు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు అర్జున్ సిద్దమయ్యాడు. అతడు చివరిసారిగా దేశీయ స్థాయిలో డిసెంబర్ 2024లో ఆడాడు.ఆ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టులో భాగమైనప్పటికి.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను గతేడాది నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్తో ఆడాడు.ముంబై టూ గోవా..కాగా 2022-23 దేశవాళీ క్రికెట్ సీజన్కు ముందు ముంబై నుంచి గోవాకు తన మకాంను మార్చిన అర్జున్.. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ ఆ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 17 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో 37 వికెట్లు, 532 పరుగులు సాధించాడు. తన రంజీ ట్రోఫీ కెరీర్ తొలి మ్యాచ్లోనే రాజస్థాన్పై అద్భుత శతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అర్జున్ లిస్ట్ ఎ క్రికెట్లో 25, టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరపున అతను ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. రాబోయో రంజీ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడాలని జూనియర్ టెండూల్కర్ భావిస్తున్నాడు.గోవా 2025/26 సీజన్ ఎలైట్ గ్రూప్లో భాగంగా ఉంది. అక్టోబర్ 15న తమ తొలి మ్యాచ్లో చండీగఢ్తో గోవా తలపడనుంది. ఆ తర్వాత మ్యాచ్లలో కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, కేరళతో ఆడనున్నాడు. ఈ టోర్నీలో గోవా క్రికెట్ జట్టుకు దీప్రాజ్ గావోంకర్ నాయకత్వం వహిస్తాడు. అదేవిదంగా కొత్త సీజన్కు ముందు ఢిల్లీ నుంచి గోవాకు తన మకాంను మార్చుకున్న స్టార్ ఆల్రౌండర్ లలిత్ యాదవ్కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.గోవా జట్టు: దీప్రాజ్ గాంకర్ (కెప్టెన్), లలిత్ యాదవ్ (వైస్ కెప్టెన్), సుయాష్ ప్రభుదేశాయ్, మంథన్ ఖుత్కర్, దర్శన్ మిషాల్, మోహిత్ రెడ్కర్, సమర్ దుబాషి, హేరంబ్ పరబ్, వికాస్ సింగ్, విషెస్ ప్రభుదేశాయ్, ఇషాన్క్ బఖార్, కశ్యాంత్ గడేకర్, రాజ్షేన్డ్ గడేకర్ అభినవ్ తేజ్రానా.చదవండి: IND vs AUS: టీమిండియాతో తొలి వన్డే.. ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ -
టీమిండియాతో తొలి వన్డే.. ఆస్ట్రేలియాకు ఊహించని షాక్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్వదేశంలో టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది. మొదట వన్డే సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో భారత్-ఆసీస్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు ఆసీస్కు భారీ షాక్ తగిలింది. మొదట వన్డేకు ప్లేయర్లు ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. రిపోర్ట్స్ ప్రకారం.. తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వనుండడంతో స్పిన్నర్ జంపా న్యూ సౌత్ వేల్స్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడంట. దీంతో అడిలైడ్, సిడ్నీలలో జరిగే రెండు, మూడో వన్డేల కోసం తిరిగి జట్టులోకి చేరనున్నాడు. మరోవైపు ఇంగ్లిష్ కాలి కండరాల గాయం నుంచి కోలుకోలేదు.ఈ క్రమంలోనే అతడు పెర్త్ వన్డేకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక వీరిద్దరి స్ధానాలను మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్లతో ఆసీస్ సెలక్టర్లు భర్తీ చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఫిలిప్ ఆసీస్ తరపున వన్డే అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి.ఆస్ట్రేలియా ఫస్ట్-ఛాయిస్ కీపర్ అలెక్స్ కారీ భారత్తో వన్డేలకు ఎంపికైనప్పటికి.. యాషెస్కు సిద్ధం కావడానికి షెఫీల్డ్ షీల్డ్ గేమ్లో పాల్గోనేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు వన్డే సిరీస్ నుంచి వైదొలిగనట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫిలిప్ వికెట్ కీపర్గా తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు.భారత్తో తొలి వన్డేకు ఆసీస్ జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్చదవండి: ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్గా రికీ భుయ్ -
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ వేలం?
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలాన్ని భారత్లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తున్నట్లు సమాచారం. గత రెండు సీజన్లకు సంబంధించిన వేలాన్ని దుబాయ్, సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా కండక్ట్ చేశారు.క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఈ క్యాష్రిచ్ వేలాన్ని భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. ఇంకా ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (GC) దీనిపై సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.అదేవిధంగా ఈ మినీ అక్షన్ను డిసెంబర్ 13 నుండి 15 మధ్య నిర్వహించే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే గతేడాది మాత్రం బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్, అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షా విదేశీ పర్యటన కారణంగా కాస్త ముందుగానే(నవంబర్ 24, 25 తేదీల్లో) వేలం జరిగింది.కాగా ఐపీఎల్ వేలం ఇప్పటివరకు ఎక్కువసార్లు బెంగళూరులోనే జరిగింది. మొత్తం 7 సార్లు ఈ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అక్షన్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చింది. అయితే గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అహ్మదాబాద్ అత్యంత ప్రాధాన్యతగల వేదికగా అవతరించింది. 2022లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు అరంగేట్రం నుంచి గత నాలుగు ఐపీఎల్ ఫైనల్స్లో అహ్మదాబాద్ వేదికగానే జరిగింది. దీంతో ఈసారి బీసీసీఐ మినీ వేలాన్ని మొదటిసారిగా అహ్మదాబాద్లో నిర్వహించే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఇప్పటివరకు ఐపీఎల్ వేలం జరిగిన వేదికలు🔹 2008 – ముంబై🔹 2009 – గోవా🔹 2010 – బెంగళూరు🔹 2011 – బెంగళూరు🔹 2012 – బెంగళూరు🔹 2013 – చెన్నై🔹 2014 – బెంగళూరు🔹 2015, 2016, 2017, 2018 – బెంగళూరు.🔹 2019 – జైపూర్🔹 2020 – కోల్కతా🔹 2021 – చెన్నై🔹 2022 – బెంగళూరు🔹 2023 – దుబాయ్ (UAE)🔹 2024 – జెడ్డా (సౌదీ అరేబియా)చదవండి: గెలుపు వాకిట్లో భారత్ -
హరియాణా గెలుపుబాట
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో హరియాణా స్టీలర్స్ తమ వరుస పరాజయాల పరంపరకు బ్రేకులేసింది. సోమవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్లో హరియాణా 39–32తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై గెలుపొందింది. ఐదు పరాజయాల తర్వాత స్టీలర్స్ పట్టుదలగా ఆడి ఈ మ్యాచ్ నెగ్గింది. హరియాణా తరఫున రెయిడర్ శివమ్ (12 పాయింట్లు) కీలకపాత్ర పోషించాడు. 13 సార్లు కూతకెళ్లిన అతను 11 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్ను టాకిల్ చేసి మరో పాయింట్ గెలిచాడు. రెయిడర్ వినయ్ (4), ఆల్రౌండర్ సాహిల్ నర్వాల్ (3) మెరుగ్గా ఆడగా... డిఫెండర్లలో కెపె్టన్ జైదీప్ (6), రాహుల్ (4), హర్దీప్ (3) రాణించారు. పట్నా జట్టులో రెయిడర్ అయాన్ (17) ఒంటరి పోరాటం చేశాడు. 24 సార్లు కూతకెళ్లిన అయాన్ 15 పాయింట్లు తెచ్చిపెట్టాడు. టాకిల్లోనూ 2 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో డిఫెండర్ నవ్దీప్ (4) మినహా ఇంకెవరూ చెప్పుకోదగిన ప్రదర్శనే ఇవ్వలేకపోయారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో యూపీ యోధాస్ 40–24తో యూ ముంబాపై విజయం సాధించింది. యోధాస్ జట్టులో రెయిడర్ గుమన్ సింగ్ (12) అదరగొట్టాడు. సహచరుల్లో భవాని రాజ్పుత్ (5), మహేందర్ సింగ్ (4), హితేశ్ (4) ఆషు సింగ్ (3) రాణించారు. యూ ముంబా జట్టులో రెయిడర్లు సందీప్ (7), అజిత్ చౌహాన (5) ఆకట్టుకున్నారు. నేడు ఇదే వేదికపై జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్తో గుజరాత్ జెయంట్స్, యూపీ యోధాస్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్గా రికీ భుయ్
సాక్షి, విశాఖపట్నం: రేపటి నుంచి మొదలయ్యే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర క్రికెట్ జట్టును ప్రకటించారు. రికీ భుయ్ సారథ్యంలో ఆంధ్ర జట్టు ఈ సీజన్లో పోటీపడనుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆంధ్ర జట్టు ఈనెల 15 నుంచి జరిగే తమ తొలి మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ జట్టుతో కాన్పూర్లో తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో ఆంధ్ర, ఉత్తరప్రదేశ్లతోపాటు బరోడా, తమిళనాడు, నాగాలాండ్, ఒడిశా, విదర్భ, జార్ఖండ్ జట్లున్నాయి. ఆంధ్ర రంజీ జట్టురికీ భుయ్ (కెప్టెన్, విశాఖపట్నం), కోన శ్రీకర్ భరత్ (విశాఖపట్నం), అభిషేక్ రెడ్డి (చిత్తూరు), షేక్ రషీద్ (గుంటూరు), కరణ్ షిండే (కర్నూలు), పీవీఎస్ఎన్ రాజు (తూర్పు గోదావరి), కేవీ శశికాంత్ (విశాఖపట్నం), సౌరభ్ కుమార్ (గెస్ట్ ప్లేయర్), వై.పృథ్వీరాజ్ (విజయనగరం), టి.విజయ్ (శ్రీకాకుళం), ఎస్.ఆశిష్ (విశాఖపట్నం), అశ్విన్ హెబ్బర్ (నెల్లూరు), రేవంత్ రెడ్డి (నెల్లూరు), కె.సాయితేజ (తూర్పు గోదావరి), చీపురపల్లి స్టీఫెన్ (తూర్పు గోదావరి), వై.సందీప్ (కృష్ణా). -
తొలి టైటిల్ వేటలో...
ఒడెన్స్: ఈ ఏడాది అందని ద్రాక్షగా ఊరిస్తున్న డబుల్స్ టైటిల్ కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో ప్రయత్నం చేయనుంది. నేడు మొదలయ్యే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగనుంది. ఆరో సీడ్గా పోటీపడుతున్న సాత్విక్–చిరాగ్ జోడీ తొలి రౌండ్లో క్రిస్టోఫర్ గ్రిమ్లే–మాథ్యూ గ్రిమ్లే (స్కాట్లాండ్) ద్వయంతో తలపడుతుంది. పురుషుల డబుల్స్లో భారత్ నుంచి మరో జంట పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల సాత్విక్–చిరాగ్ ద్వయం వరుసగా చైనా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీల్లో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో, సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో, ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో, మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ సెమీఫైనల్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీ డెన్మార్క్ ఓపెన్లోనూ టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి బరిలో ఉన్నారు. ప్రపంచ 28వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి తొలి రౌండ్లో టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లో ఎన్హట్ నుగుయెన్ (ఐర్లాండ్)తో ఆడతారు. మహిళల సింగిల్స్లో భారత్ నుంచి కేవలం అన్మోల్ ఖరబ్ మాత్రమే పోటీపడుతోంది. గతవారం ఆర్క్టిక్ ఓపెన్లో సెమీఫైనల్ చేరిన అన్మోల్ తొలి రౌండ్లో ఏడో సీడ్ పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేసియా)తో తలపడనుంది. మహిళల డబుల్స్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ పాండా... సెల్వం కవిప్రియ–సిమ్రన్... మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల... లక్షిత–మోహిత్ జగ్లాన్ జోడీలు పోటీపడతాయి. 3 డెన్మార్క్ ఓపెన్ టోర్నీ చరిత్రలో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పడుకోన్ (1980లో), కిడాంబి శ్రీకాంత్ (2017లో)... మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వల్ (2012లో) చాంపియన్స్గా నిలిచారు. -
వెన్నెల, జ్ఞానదత్తు శుభారంభం
గువాహటి: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ క్రీడాకారులు టంకర తలశిల జ్ఞానదత్తు, కలగోట్ల వెన్నెల తొలి రౌండ్లో విజయాలు సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 17 ఏళ్ల జ్ఞానదత్తు 5–15, 15–7, 15–7తో మిలాన్ మెస్టెర్హాజి (హంగేరి)పై... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వెన్నెల 15–1, 15–6తో సియోఫ్రా ఫ్లిన్ (ఐర్లాండ్)పై గెలుపొందారు. ‘నేను తొలిసారి ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడుతున్నాను. దాంతో తొలి గేమ్లో కాస్త ఒత్తిడికి గురయ్యా. యూరోప్ ప్లేయర్తో రెండోసారి తలపడ్డా. దాంతో యూరోప్ ఆటగాళ్ల ఆటతీరును అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా. రెండో గేమ్ నుంచి నేను సహజశైలిలో ఆడి విజయాన్ని అందుకున్నా’ అని ఈ మెగా ఈవెంట్లో టీమ్ విభాగంలో తొలిసారి కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న జ్ఞానదత్తు వ్యాఖ్యానించాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్కే చెందిన కోడె విష్ణుకేదార్–మంచాల కీర్తి ద్వయం కూడా గెలుపు బోణీ కొట్టింది. తొలి రౌండ్లో విష్ణు–కీర్తి జోడీ 15–7, 15–8తో మొస్లెనా కొరామా–ఒబపోంబా అదుమింటా (ఘనా) జంటపై గెలిచింది. -
ఘనా ఐదోసారి...
అక్రా: వచ్చే ఏడాది జరిగే పురుషుల ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు ఆఫ్రికా జోన్ నుంచి ఘనా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికాక్వాలిఫయింగ్లో భాగంగా గ్రూప్ ‘ఐ’ విజేత హోదాలో ఘనా జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారైంది. కోమోరోస్ జట్టుతో ‘డ్రా’ చేసుకుంటే ప్రపంచకప్ బెర్త్ ఖాయమయ్యే పరిస్థితిలో ఘనా జట్టు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్లో టోటెన్హమ్ జట్టుకు ఆడే మొహమ్మద్ కుడుస్ 47వ నిమిషంలో గోల్ చేసి ఘనా జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2026 ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. ఇప్పటికి 19 జట్లు అర్హత పొందాయి. ఇందులో ఆతిథ్య దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో జట్లకు నేరుగా అర్హత దక్కింది. ఆఫ్రికా జోన్ నుంచి 9 జట్లకు అవకాశం ఉండగా... ఇప్పటికి ఐదు జట్లు (మొరాకో, ట్యూనిషియా, ఈజిప్్ట, అల్జీరియా, ఘనా) బెర్త్లు దక్కించుకున్నాయి. ఐదోసారి ప్రపంచకప్ ఆడనున్న ఘనా జట్టు 2010లో క్వార్టర్ ఫైనల్ చేరి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. -
జపాన్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత జోష్నా చినప్ప
అంచనాలకు మించి రాణించిన భారత స్క్వాష్ స్టార్ జోష్నా చినప్ప తన కెరీర్లో 11వ అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ను సాధించింది. యోకోహామాలో సోమవారం ముగిసిన జపాన్ ఓపెన్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్ చాలెంజర్ టోర్నీలో 39 ఏళ్ల జోష్నా చాంపియన్గా నిలిచింది. 38 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ప్రపంచ 117వ ర్యాంకర్ జోష్నా 11–5, 11–9, 6–11, 11–8తో ప్రపంచ 53వ ర్యాంకర్, మూడో సీడ్ హయా అలీ (ఈజిప్్ట)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో జోష్నా 11–7, 11–1, 11–5తో ప్రపంచ 73వ ర్యాంకర్, నాలుగో సీడ్ రాణా ఇస్మాయిల్ (ఈజిప్్ట)పై గెలుపొందింది. తాజా టైటిల్తో జోష్నా ప్రపంచ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్–100లోకి వచ్చింది. ఈ టోర్నీలో 117వ ర్యాంక్ హోదాలో బరిలోకి దిగిన జోష్నా విజేతగా నిలవడంతో ఆమె ఖాతాలో 300 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. తాజా ర్యాంకింగ్స్లో ఆమె ఏకంగా 30 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంక్లో నిలిచింది. 22 ఏళ్ల తనఅంతర్జాతీయ కెరీర్లో జోష్నా 2016లో కెరీర్ బెస్ట్ 10వ ర్యాంక్కు చేరుకుంది. ఓవరాల్గా 187 టోర్నీల్లో పోటీపడ్డ జోష్నా మొత్తం 428 మ్యాచ్లు ఆడింది. ఇందులో 253 మ్యాచ్ల్లో గెలిచి, 175 మ్యాచ్ల్లో ఓడిపోయింది. -
IND Vs WI: గెలుపు వాకిట్లో భారత్
వెస్టిండీస్పై రెండో టెస్టు గెలిచేందుకు, సిరీస్ను క్లీన్స్వీప్ చేసేందుకు భారత్ 58 పరుగుల దూరంలోనే ఉంది. ఆఖరి రోజు లంచ్ బ్రేక్కు ముందే ఈ లాంఛనం పూర్తి చేసేందుకు సిద్ధమైంది. అంతకుముందు వెస్టిండీస్ చాన్నాళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు క్రికెట్లో పోరాడింది. నిర్జీవమైన పిచ్పై ఓవర్నైట్ బ్యాటర్లు క్యాంప్బెల్, షై హోప్ ఇద్దరు శతకాల మోత మోగించడంతో భారత్ లక్ష్యఛేదనకు దిగాల్సి వచి్చంది. ఫలితంగా మ్యాచ్ ఐదో రోజుకు చేరింది. న్యూఢిల్లీ: భారత్ ఆఖరి టెస్టులో గెలుపు వాకిట నిలిచింది. మంగళవారం ఉదయం ఆ లాంఛనాన్ని పూర్తిచేస్తే చాలు టీమిండియా రెండు టెస్టుల సిరీస్ను 2–0తో క్లీన్స్వీప్ చేస్తుంది. ఎట్టకేలకు వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలర్లకు పని పెట్టారు. రెండో ఇన్నింగ్స్లో కఠిన సవాళ్లు విసిరారు. తొలి టెస్టును మూడే రోజుల్లో ముగించిన ఆతిథ్య జట్టు... స్పిన్కు అచ్చొచ్చే ఢిల్లీ పిచ్ ఈసారి నిర్జీవంగా మారడంతో వికెట్లు తీసేందుకు చెమటోడ్చింది.పేసర్లు బుమ్రా (3/44), సిరాజ్ (2/43), స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/104), రవీంద్ర జడేజా (1/102), వాషింగ్టన్ సుందర్ (1/80) సమష్టిగా రాణించారు. స్పిన్ త్రయం 5, పేస్ ద్వయం 5 ఇలా చెరో సగం వికెట్లతో ప్రత్యర్థి జట్టును కూల్చారు. దీంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 118.5 ఓవర్లలో 390 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (199 బంతుల్లో 115; 12 ఫోర్లు, 3 సిక్స్లు), షై హోప్ (214 బంతుల్లో 103; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలు సాధించారు. అనంతరం 121 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (8) అవుటవ్వగా, కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 25 బ్యాటింగ్; 2 ఫోర్లు), సాయి సుదర్శన్ (47 బంతుల్లో 30 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లున్న భారత్ విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి. కదంతొక్కిన హోప్, క్యాంప్బెల్ ఓవర్నైట్ స్కోరు 173/2తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్ బ్యాటర్లు క్యాంప్బెల్, హోప్ కదంతొక్కారు. పేస్, స్పిన్ బౌలింగ్పై యథేచ్చగా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఓపెనర్ క్యాంప్బెల్ టెస్టు క్రికెట్లో తొలి సెంచరీ ముచ్చటను తీర్చుకున్నాడు. జడేజా ఓవర్లో భారీ సిక్సర్తో క్యాంప్బెల్ శతకాన్ని సాధించగా, షై హోప్ కూడా సెంచరీ దిశగా సాగిపోయాడు. దీంతో ఈ సెషన్లో భారత బౌలర్లకు కఠిన పరీక్ష తప్పలేదు. క్యాంప్బెల్ను జడేజా ఎల్బీగా అవుట్ చేయడంతో మూడో వికెట్కు 177 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. హోప్కు కెపె్టన్ రోస్టన్ చేజ్ జతవ్వగా... విండీస్ 252/3 స్కోరు వద్ద లంచ్ విరామానికెళ్లింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ కొత్త బంతిని తీసుకుంది. నింపాదిగా ఆడుతున్న హోప్ కూడా శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చేజ్ (72 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో పాతుకుపోవడంతో నాలుగో వికెట్ భాగస్వామ్యం కూడా సాఫీగా సాగిపోయింది. ఈ దశలో సిరాజ్... హోప్ను క్లీన్బౌల్డ్ చేసి 59 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. గ్రీవెస్ అర్ధశతకం తర్వాత కుల్దీప్ మ్యాజిక్కు స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కూలాయి. మొదట ఇమ్లాచ్ (13)ను అవుట్ చేసిన కుల్దీప్ తర్వాతి ఓవర్లో చేజ్, పియర్ (0)లను బోల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 300 దాటాక బుమ్రా నిప్పులు చేరగడంతో వారికెన్ (3), ఫిలిప్ (2)లు నిష్క్రమించారు. దీంతో 311 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కూలింది. ఇక ఆఖరి వికెటే కదా ఆలౌట్ తేలికే అనుకుంటే... మిడిలార్డర్ బ్యాటర్ జస్టిన్ గ్రీవెస్ (85 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు) మొండిగా పోరాడాడు. దీంతో రెండో సెషన్ నుంచి ఆఖరి సెషన్ వరకు గ్రీవెస్, జేడెన్ సీల్స్ (67 బంతుల్లో 32; 1 ఫోర్, 1 సిక్స్)తో భాగస్వామ్యమే లాక్కొచ్చింది. గ్రీవెస్ అర్ధసెంచరీ పూర్తయిన తర్వాత... సీల్స్ను బుమ్రా అవుట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. చివరి వికెట్కు సీల్స్, గ్రీవెస్ ఏకంగా 79 పరుగులు జోడించడం విశేషం. భారత్ ముందు వంద పైచిలుకు లక్ష్యానికి, ఐదో రోజు పొడిగింపునకు ఈ భాగస్వామ్యమే కారణమైంది.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్: 248; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్బెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 115; తేజ్ చందర్పాల్ (సి) గిల్ (బి) సిరాజ్ 10; అతనేజ్ (బి) సుందర్ 7; షై హోప్ (బి) సిరాజ్ 103; చేజ్ (సి) సబ్–పడిక్కల్ (బి) కుల్దీప్ 40; ఇమ్లాచ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 12; గ్రీవెస్ (నాటౌట్) 50; పియర్ (సి) నితీశ్ రెడ్డి (బి) కుల్దీప్ 0; వారికెన్ (బి) బుమ్రా 3; ఫిలిప్ (సి) జురేల్ (బి) బుమ్రా 2; సీల్స్ (సి) సుందర్ (బి) బుమ్రా 32; ఎక్స్ట్రాలు 16; మొత్తం ( 118.5 ఓవర్లలో ఆలౌట్) 390. వికెట్ల పతనం: 1–17, 2–35, 3–212, 4–271, 5–293, 6–298, 7–298, 8–307, 9–311, 10–390. బౌలింగ్: సిరాజ్ 15–3–43–2, జడేజా 33–10–102–1, సుందర్ 23–3–80–1, కుల్దీప్ 29–4–104–3, బుమ్రా 17.5–5–44–3, జైస్వాల్ 1–0–3–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఫిలిప్ (బి) వారికెన్ 8; రాహుల్ (బ్యాటింగ్) 25; సాయి సుదర్శన్ (బ్యాటింగ్) 30; ఎక్స్ట్రాలు 0; మొత్తం (18 ఓవర్లలో వికెట్ నష్టానికి) 63. వికెట్ల పతనం: 1–9. బౌలింగ్: సీల్స్ 3–0–14–0, వారికెన్ 7–1–15–1, పియర్ 6–0–24–0, చేజ్ 2–0–10–0. -
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
సాక్షి, విశాఖపట్నం: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్పై దక్షిణాఫ్రికా కష్టపడి గెలిచింది. లక్ష్యఛేదనలో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న సఫారీ జట్టును మరిజన్ కాప్ (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రయాన్ (69 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటంతో గట్టెక్కించారు. దీంతో దక్షిణాఫ్రికా ఆఖరి ఓవర్దాకా పోరాడి 3 బంతులు మిగిలి ఉండగా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై నెగ్గింది. సఫారీకిది వరుసగా మూడో విజయం కాగా... బంగ్లాదేశ్కు మూడో పరాజయం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్జానా హక్ (30; 3 ఫోర్లు), రుబియా హైదర్ (25) తొలి వికెట్కు 53 పరుగులతో చక్కని ఆరంభాన్నిచ్చారు. వీళ్లిద్దరు అవుటయ్యాక... టాపార్డర్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు), కెపె్టన్ నిగార్ సుల్తానా (42 బంతుల్లో 32; 5 ఫోర్లు) కుదురుగా ఆడి మరో పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్కు 77 పరుగులు జోడించారు. షర్మిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆఖర్లో షోర్న అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడింది. రీతూ మోనీ (8 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి వేగంగా పరుగులు జతచేసింది. సఫారీ బౌలర్లలో ఎంలాబా 2 వికెట్లు, డి క్లెర్క్, ట్రయాన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే బ్రిట్స్ (0) వికెట్ కోల్పోగా... లారా వోల్వార్ట్ (56 బంతుల్లో 31; 5 ఫోర్లు), అనికె బాష్ (35 బంతుల్లో 28; 6 ఫోర్లు) జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. అయితే 20 పరుగుల వ్యవధిలో క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరితో పాటు డెర్క్సెన్ (2), సినాలో జాఫ్టా (4) నిష్క్రమించారు. దీంతో 78/5 స్కోరు వద్ద సఫారీకి పరాజయం తప్పదనిపించింది. ఈ దశలో మరిజన్ కాప్, ట్రయాన్ ఆరో వికెట్కు 85 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా గెలుపు ట్రాక్లో పడింది. ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తయ్యాక అవుటయ్యారు. అయితే డిక్లెర్క్ (29 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసింది. భారత్ చేతుల్లోంచి మ్యాచ్ను లాగేసినట్లే కీలకమైన పరుగులతో బంగ్లాదేశ్తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇంకో 3 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా అక్తర్ 2, రబియా ఖాన్, ఫాహిమా, రీతు మోని తలా ఒక వికెట్ తీసి సఫారీని ఇబ్బంది పెట్టారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది. -
ప్రపంచ స్కేటింగ్ చాంపియన్షిప్కు తెలంగాణ యువకుడి ఎంపిక
నవంబర్ 7 నుంచి 15 వరకు ఖజకిస్తాన్లో జరగనున్న జూనియర్ వరల్డ్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్షిప్కు తెలంగాణ యువకుడు ప్రణవ్ మాదవ్ సురపనేని ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISAI) అధికారికంగా ప్రకటించింది. ISAI అధ్యక్షుడు అమితాబ్ శర్మ ఓ లేఖ ద్వారా ప్రణవ్ ఎంపికను ధృవీకరించారు.ఆ లేఖలో అమితాబ్ ప్రణవ్ ఇటీవలి ప్రదర్శనలను కొనియాడాడు. ప్రణవ్ వరల్డ్ చాంపియన్షిప్ అర్హతకు అవసరమైన టైమింగ్ను క్లాక్ చేసి, దేశానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. తెలంగాణ నుంచి వరల్డ్ చాంపియన్షిప్కు అర్హత సాధించిన ఏకైక అథ్లెట్ ప్రణవ్ అని తెలిపారు.ప్రణవ్ ఎంపికను పురస్కరించుకుని, అతనికి ప్రోత్సాహం అందించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీని కోరారు. వింటర్ స్పోర్ట్స్ను ప్రోత్సహిస్తూ, ప్రతిభావంతులైన అథ్లెట్లను పెంపొందించడంలో మీ సహకారం అమూల్యమైందని లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్కు ప్రాతినిథ్యం వహించనున్న ప్రణవ్కు శుభాకాంక్షలు తెలిపారు. -
పాక్ క్రికెట్ దిగ్గజం కన్నుమూత
పాకిస్తాన్ క్రికెట్కు మూలపురుషులుగా నిలిచిన మహ్మద్ బ్రదర్స్లో ఒకరైన వజీర్ మహ్మద్ (95) ఇవాళ (అక్టోబర్ 13) యునైటెడ్ కింగ్డమ్లోని బర్మింగ్హామ్లో తుదిశ్వాస విడిచారు. వయో భారం కారణంగా వజీర్ కన్నుమూశారు. 1952లో భారత్, పాక్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సిరీస్లో పాల్గొన్న వజీర్, అప్పటి నుంచి 1959 వరకు 20 టెస్టులు ఆడి 801 పరుగులు చేశారు.వజీర్ తన కెరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్ను భారత్తోనే ఆడారు. ఆ మ్యాచ్లో అతను కేవలం 12 పరుగులు మాత్రమే చేసి, రెండు ఇన్నింగ్స్ల్లో వినూ మన్కడ్ బౌలింగ్లో ఔటయ్యారు. వజీర్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 105 మ్యాచ్ల్లో 11 సెంచరీలు, 26 అర్ధ సెంచరీల సాయంతో 4930 పరుగులు చేశారు.వజీర్ పాక్కు ప్రాతినిథ్యం వహించిన నలుగురు మహ్మద్ బ్రదర్స్లో ఒకరు. వజీర్ సోదరుడు హనీఫ్ మహ్మద్ క్రికెట్ ప్రపంచానికి సుపరిచితుడు. హనీఫ్ 2016 ఆగస్టు 11న 81 ఏళ్ల వయసులో కన్నుమూశారు.వజీర్ మరణించే సమయానికి నీల్ హార్వీ, ట్రెవర్ మెక్మహన్ తర్వాత మూడవ అతిపెద్ద వయస్సు గల టెస్ట్ క్రికెటర్గా ఉన్నారు. -
CWC 2025: బంగ్లాదేశ్తో మ్యాచ్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇవాళ (అక్టోబర్ 13) బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేసింది. షర్మిన్ అక్తర్ (50), షోర్నా అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నిగార్ సుల్తానా (32), ఫర్జానా హాక్ (30), రూబ్యా హైదర్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేసినా.. చాలా నిదానంగా ఆడారు. వీరిలో ఫర్జానా మ్యాచ్ను చూసే వారికి విసుగు తెప్పించింది. 30 పరుగులు చేసేందుకు ఆమె ఏకంగా 76 బంతులు ఆడింది. రూబ్యా హైదర్ సైతం తాను చేసిన 25 పరుగుల కోసం 52 బంతులను ఎదుర్కొంది. హాఫ్ సెంచరీ చేసినా, షర్మిన్ అక్తర్ కూడా 77 బంతులు ఆడింది. నిగార్ సుల్తానా 42 బంతుల్లో 32 పరుగులు చేసింది. ఆఖర్లో రితూ మోనీ 8 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. షోర్నా, రీతూ ఆఖర్లో వేగంగా ఆడకపోయుంటే బంగ్లాదేశ్ స్కోర్ 200 కూడా దాటేది కాదు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లో ట్రయాన్, నదినే డి క్లెర్క్ తలో వికెట్ తీశారు.కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా నాలుగు, బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండగా.. బంగ్లాదేశ్ 3 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. సౌతాఫ్రికా కొద్ది రోజుల కిందట జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియాపై విజయం సాధించింది. చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు -
పాక్తో తొలి టెస్ట్.. తడబడుతున్న సౌతాఫ్రికా.. రికెల్టన్, జోర్జి రాణించినా..!
లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో (Pakistan vs South Africa) పర్యాటక సౌతాఫ్రికా జట్టు తడబడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. ర్యాన్ రికెల్టన్ (71), టోనీ డి జోర్జి (81 నాటౌట్) అర్ద సెంచరీలు చేసినా పెద్ద స్కోర్ సాధించేలా కనిపించడం లేదు. రికెల్టన్, జోర్జి క్రీజ్లో ఉన్నప్పుడు సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసేలా కనిపించింది.అయితే 26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 174 పరుగుల వద్ద రికెల్టన్.. 192 పరుగుల వద్ద ట్రిస్టన్ స్టబ్స్ (8).. 193 పరుగుల వద్ద డెవాల్డ్ బ్రెవిస్ (0).. 200 పరుగుల వద్ద కైల్ వెర్రిన్ (2) వికెట్లు కోల్పోయింది.ఆట ముగిసే సమయానికి టోనీ డి జోర్జితో పాటు సెనురన్ ముత్తుసామి (6) క్రీజ్లో ఉన్నాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు సౌతాఫ్రికా ఇంకా 162 పరుగులు వెనుకపడి ఉంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ మార్క్రమ్ 20, వియాన్ ముల్దర్ 17 పరుగులకు ఔటయ్యారు. వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బ కొట్టాడు. సాజిద్ ఖాన్, సల్మాన్ అఘా తలో వికెట్ తీశారు.అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకు ఆలౌటైంది. నలుగురు భారీ అర్ద సెంచరీలు చేసినా, ఆ జట్టు నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. సెనూరన్ ముత్తుసామి 6 వికెట్లు తీసి పాక్ను దెబ్బ కొట్టాడు. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు. పాక్ ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా తలో 93 పరుగులు, కెప్టెన్ షాన్ మసూద్ 76, వికెట్కీపర్ రిజ్వాన్ 75 పరుగులు చేశారు. కాగా, సౌతాఫ్రికా జట్టు 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్, అనంతరం 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం పాక్లో పర్యటిస్తుంది. చదవండి: సారా టెండుల్కర్కు అర్జున్, సానియా స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్ -
సారా టెండుల్కర్కు అర్జున్, సానియా స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కుటుంబం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డాక్టర్ అంజలి (Anjali)ని పెళ్లాడిన సచిన్కు.. కుమార్తె సారా, కుమారుడు అర్జున్ సంతానం.అర్జున్ తండ్రి బాటలో క్రికెట్ను కెరీర్గా ఎంచుకుని.. ఆల్రౌండర్గా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అయితే, సారా (Sara Tendulkar) మాత్రం భిన్నమైన దారిలో పయనిస్తోంది. న్యూట్రీషనిస్ట్గా, మోడల్గా రాణిస్తున్న సారా బయో మెడికల్ సైంటిస్ట్ కూడా!!.28వ వసంతంలోకి అడుగుఅంతేకాదు తండ్రి సచిన్ టెండుల్కర్ నిర్వహిస్తున్న ఫౌండేషన్లో సారా డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే.. సారా అక్టోబరు 12న 28వ వసంతంలో అడుగుపెట్టింది.ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ సారా చిన్ననాటి ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘చిరునవ్వులతో పాటు కలలూ కలిసి పంచుకున్నాం. సారా.. నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడూ గర్వపడేలా చేస్తావు. హ్యాపీ బర్త్డే!.. ఇలాగే ప్రకాశిస్తూ ఉండు’’ అంటూ కుమార్తెకు ఆశీర్వాదాలు అందజేశాడు.కాబోయే మరదలు స్పెషల్ విషెస్ఇక అభిమానులు సైతం సారాకు విషెస్ తెలియజేయగా.. తమ్ముడు అర్జున్, కాబోయే మరదలు సానియా చందోక్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్ట్లను సారా ఇన్స్టా స్టోరీలో షేర్ చేయగా వైరల్గా మారాయి. అక్క సారాకు బూర్జ్ ఖలీఫాను చూపిస్తున్నట్లుగా ఉన్న ఫొటోను పంచుకున్న అర్జున్.. పుట్టినరోజు శుభాకాంక్షలు అని విషెస్ చెప్పాడు.అర్జున్తో సానియా ఎంగేజ్మెంట్మరోవైపు.. తన బెస్ట్ఫ్రెండ్ సారాను ఆలింగనం చేసుకున్న సానియా చందోక్.. ‘‘నా ఫేవరెట్కు హ్యాపీ బర్త్డే’’అంటూ హార్ట్ ఎమోజీ జతచేసింది. కాగా ముంబైలోని బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా. ఇటీవలే ఆమెకు, అర్జున్కు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ స్వయంగా ధ్రువీకరించాడు.అయితే, అత్యంత సన్నిహితుల నడుమ జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. ఇదిలా ఉంటే.. అక్క సారా కంటే ముందే తమ్ముడు అర్జున్ పెళ్లికి సిద్ధం కావడం విశేషం. మరోవైపు.. సారాకు ప్రాణ స్నేహితురాలైన సానియా.. అర్జున్ కంటే వయసులో దాదాపు ఏడాది పెద్దది. కాగా సచిన్ కంటే అంజలి ఐదేళ్లు పెద్దవారన్న విషయం తెలిసిందే. ఇక సారా ఇటీవలే ముంబైలో వెల్నెస్ సెంటర్ పైలేట్స్ స్టూడియోను ఏర్పాటు చేయగా.. సచిన్- అంజలి దంపతులు కాబోయే కోడలితో కలిసి పూజలు చేశారు.చదవండి: కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్!.. వీరి సీక్రెట్ ఇదే -
IND VS WI: విండీస్ బ్యాటర్ల అనూహ్య ప్రతిఘటన.. ఫలితం చివరి రోజే..!
న్యూఢిల్లీ టెస్ట్లో భారత్ గెలుపు కోసం చివరి రోజు వరకు ఆగాల్సి వచ్చింది. చివరి సెషన్లో విండీస్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు (18 ఓవర్లు) చేసింది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 58 పరుగులు చేయాల్సి ఉంది.స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (8) ఆదిలోనే ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (25 నాటౌట్), సాయి సుదర్శన్ (30 నాటౌట్) భారత్ను విజయం దిశగా తీసుకెళ్తున్నారు. జైస్వాల్ వికెట్ వారికన్కు దక్కింది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా 2 మ్యాచ్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటంఅంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్ను ఉంచారు.క్యాంప్బెల్, హోప్ వీరోచిత శతకాలుతొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది విండీస్కు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.దీనికి ముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.చదవండి: కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్!.. వీరి సీక్రెట్ ఇదే -
కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్!
సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)ను టీమిండియాకు ఆడే స్థాయికి చేర్చడంలో అతడి తండ్రి నౌషద్ ఖాన్ (Naushad Khan)ది కీలక పాత్ర. పెద్ద కొడుకు సర్ఫరాజ్తో పాటు చిన్నోడు ముషీర్ ఖాన్ను తన శిక్షణలో రాటుదేలేలా చేశాడు నౌషద్. తానే స్వయంగా కోచింగ్ ఇస్తూ ఇద్దరు కుమారులను మేటి క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నాడు.అధిక బరువు, ఫిట్నెస్ లేమిఅయితే, ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించినా సర్ఫరాజ్ ఖాన్కు టీమిండియా ఎంట్రీ అంత సులువేం కాలేదు. ముఖ్యంగా అతడి అధిక బరువు, ఫిట్నెస్ లేమిపై తరచూ విమర్శలు వచ్చేవి. ఎట్టకేలకు గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికి ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం.ఆరువారాల్లోనే ఏకంగా పది కిలోల బరువు తగ్గిఅయితే, ఆస్ట్రేలియా పర్యటనతో పాటు ఇంగ్లండ్ టూర్లోనూ సెలక్టర్లు సర్ఫరాజ్ను పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్పై మరింత దృష్టి సారించిన 27 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం ఆరువారాల్లోనే ఏకంగా పది కిలోల బరువు తగ్గడం విశేషం. మొత్తంగా రెండునెలల్లోనే 17 కిలోలు తగ్గిపోయాడు. ఇందుకు ప్రధాన కారణం అతడి తండ్రి నౌషద్ ఖాన్.కుమారులకు కోచ్గా ఉన్న నౌషద్ ఖాన్.. ఫిట్నెస్ విషయంలోనూ వారికి ఆదర్శంగా ఉండాలని భావించాడు. అందుకే సర్ఫరాజ్తో కలిసి కఠినమైన డైట్ పాటించి ఆరు నెలల్లోనే ఏకంగా 38 కిలోల బరువు తగ్గాడు. 122 కేజీల బరువు నుంచి 84 కిలోలకు చేరుకుని గుర్తు పట్టనంతగా మారిపోయాడు. ఈ క్రమంలో నెట్స్లో బౌలింగ్ చేస్తున్న నౌషద్ ఖాన్ వీడియో తాజాగా వైరల్గా మారింది.సర్ఫరాజ్, నౌషద్ ఖాన్ ఫాలో అయిన డైట్ ఇదేగతంలో నౌషద్ ఖాన్ మాట్లాడుతూ.. తాము రోటీ, అన్నం తినడం పూర్తిగా మానేశమని తెలిపాడు. అదే విధంగా ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, సలాడ్లు, బ్రకోలి, దోసకాయలు ఎక్కువగా తింటున్నామని తెలిపాడు.అదే విధంగా కాల్చిన చేపలు, చికెన్, ఉడికించిన కోడిగుడ్లు, అవకాడోలు ఎక్కువగా తిన్నామని నౌషద్ ఖాన్ వెల్లడించాడు. రోటీ అన్నంతో పాటు చక్కెరను పూర్తిగా పక్కనపెట్టామని.. మైదాతో తయారయ్యే బేకరీ పదార్థాలను కూడా డైట్ నుంచి పూర్తిగా తొలగించినట్లు వెల్లడించాడు.ఏకంగా 38 కిలోలు ఇక ఆరునెలల్లోనే ఏకంగా 38 కిలోలు తగ్గడం గురించి 55 ఏళ్ల నౌషద్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్ 11- అక్టోబరు 11 వరకు.. ఆరు నెలల కాలంలో నేను అనుకున్నది సాధించాను. 20-25 ఏళ్ల క్రితం చేయాలనుకున్న పనులను ఇపుడు నేను పూర్తి చేయగలను. మా కుటుంబం మొత్తం బరువు తగ్గే మిషన్లో ఉంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా సర్ఫరాజ్ ఖాన్ చివరగా గతేడాది న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే! View this post on Instagram A post shared by Naushad Khan (@97cricketofficial) -
స్వల్ప ఛేదన.. టీమిండియాకు ఆదిలోనే షాక్
121 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (8) తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాది జోరుమీదున్నట్లు కనిపించినప్పటికీ.. ఆతర్వాతి ఓవర్లోనే ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో ఆండర్సన్ ఫిలిప్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. జైస్వాల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (14), సాయి సుదర్శన్ (17) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియాను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు.12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ వికెట్ నష్టానికి 39 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 82 పరుగులు చేయాల్సి ఉంది.విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటంఅంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్ను ఉంచారు.తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే... -
నితీశ్ రెడ్డి జట్టులో ఎందుకు?.. ఆల్రౌండర్ అంటే ఇదేనా?: మాజీ క్రికెటర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ (Dodda Ganesh) విమర్శించాడు. నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) విషయంలో మేనేజ్మెంట్ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. అతడికి బౌలింగ్ చేసే అవకాశమే ఇవ్వనపుడు ఆల్రౌండర్గా ఎలా తీర్చిదిద్దుతారని ప్రశ్నించాడు.నాలుగు ఓవర్లు మాత్రమేగాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే జట్టుకు దూరమైన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. తాజాగా వెస్టిండీస్తో టెస్టులతో పునరాగమనం చేశాడు. అహ్మదాబాద్లో తొలి టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకున్న 22 ఏళ్ల ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్.. తొలి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు.మొత్తంగా పదహారు పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయని నితీశ్ రెడ్డి.. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్కే రాలేదు. అంతేకాదు.. ఈ మ్యాచ్లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. ఇక తాజాగా ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. రెండు ఇన్నింగ్స్లోనూ అసలు బౌలింగ్కే రాలేదు.54 బంతుల్లో 43 పరుగులుటీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీశ్ రెడ్డి.. 54 బంతుల్లో 43 పరుగులు చేసి నిష్క్రమించాడు. అయితే, బౌలర్గా మాత్రం అతడు రంగంలోకి దిగలేదు. ఇక విండీస్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్తోనూ ఓ ఓవర్ వేయించిన మేనేజ్మెంట్ నితీశ్ సేవలు మాత్రం వాడుకోలేదు.నితీశ్ రెడ్డి జట్టులో ఎందుకు?.. ఆల్రౌండర్ అంటే ఇదేనా?ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘‘నితీశ్ రెడ్డికి అసలు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకుండానే అతడిని ఆల్రౌండర్గా ఎలా సన్నద్ధం చేస్తున్నారు?.. ఇలా అయితే ఆల్రౌండర్ పాత్రకు తను ఎలా న్యాయం చేయగలడు’’ అని మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు.ఆల్రౌండర్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యంఇదిలా ఉంటే.. నితీశ్ సేవలను ఉపయోగించుకునే విషయంలో విమర్శలు రాగా.. వెస్టిండీస్ రెండో టెస్టుకు ముందు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే స్పందించిన విషయం తెలిసిందే‘‘బ్యాటింగ్ చేయగల అరుదైన సీమ్ బౌలర్. అతడి నైపుణ్యాల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. తన బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాలో (సెంచరీ) చూపించాడు. అయితే, విదేశీ గడ్డ మీదే తన సేవలు ఎక్కువగా ఉపయోగించుకుంటాం. తనను పూర్తిస్థాయి ఆల్రౌండర్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’’ అని డష్కాటే స్పష్టం చేశాడు.పోరాట పటిమ కనబరిచిన విండీస్ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఢిల్లీలో శుక్రవారం మొదలైన టెస్టులో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసింది భారత్. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుబ్మన్ గిల్ (129 నాటౌట్) శతక్కొట్టగా.. సాయి సుదర్శన్ 87 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. నితీశ్ రెడ్డి 43, ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేశారు. ఫలితంగా 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు కుప్పకూలగా.. భారత్ ఫాలో ఆన్ ఆడించింది. అయితే, రెండో ఇన్నింగ్స్ విండీస్ బ్యాటర్లు అద్భుత పోరాటం చేసి.. టీమిండియాకు 121 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (115), షాయీ హోప్ 103 పరుగులతో రాణించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో విండీస్కు ఇన్నింగ్స్ పరాజయం తప్పింది.చదవండి: World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే... -
విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
న్యూఢిల్లీ టెస్ట్లో విండీస్ బ్యాటర్లు అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించారు. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్లో ఊహించని రీతిలో ప్రతిఘటించారు. తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్ను ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: IND VS WI 2nd Test: చెలరేగిపోతున్న మియా భాయ్..! -
IND VS WI: చెలరేగిపోతున్న మియా భాయ్..!
టీమిండియా ఆటగాడు, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) (మియా భాయ్) ఈ ఏడాది టెస్ట్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో 5 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన సిరాజ్.. ప్రస్తుతం స్వదేశంలో విండీస్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోనూ అదే తరహా ప్రదర్శనలు కొనసాగిస్తున్నాడు.ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో 7 వికెట్లు తీసిన మియా.. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో తన మూడో వికెట్ (షాయ్ హోప్) తీసిన అనంతరం సిరాజ్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ వికెట్తో సిరాజ్ ఈ ఏడాది (2025) టెస్ట్ల్లో లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 37 వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డు సాధించే క్రమంలో సిరాజ్ జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని (26) అధిగమించాడు. సిరాజ్, ముజరబానీ తర్వాత ఈ ఏడాది టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా మిచెల్ స్టార్క్ (29), నాథన్ లియోన్ (24) ఉన్నారు.భారత్-విండీస్ రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో విండీస్ ఫాలో ఆన్ ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్ను ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు -
World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీస్ చేరాలంటే...
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Women's ODI WC 2025)లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. విశాఖపట్నం వేదికగా తొలుత సౌతాఫ్రికా వుమెన్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన హర్మన్సేన.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లోనూ ఓటమిని చవిచూసింది.ఓపెనర్లు సూపర్హిట్విశాఖలో ఆస్ట్రేలియా మహిళా జట్టు (IND W vs AUS W)తో మ్యాచ్లో 330 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఫలితంగా మూడు వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు ప్రతికా రావల్ (75), స్మృతి మంధాన (Smriti Mandhana- 80) గొప్ప ఆరంభం అందించారు.మిగతావారిలో వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 38, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 22, జెమీమా రోడ్రిగెస్ 33, రిచా ఘోష్ 32 పరుగులతో ఓ మోస్తరుగా రాణించారు. అయితే, ఆసీస్ బౌలర్ల ధాటికి లోయర్ ఆర్డర్ వేగంగా పతనమైంది. అమన్జోత్ కౌర్ 16 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. దీప్తి శర్మ (1), స్నేహ్ రాణా (8), క్రాంతి గాడ్ (1), శ్రీ చరణి (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది.అనాబెల్ సదర్లాండ్కు ఐదుఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. సోఫీ మొలినక్స్ మూడు వికెట్లు పడగొట్టింది. మిగిలిన వారిలో మేగన్ షట్, ఆష్ల గార్డ్నర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ అలిసా హేలీ ఆకాశమే హద్దుగా చెలరేగింది.హేలీ విధ్వంసంకేవలం 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించింది. 142 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రీచరణి బౌలింగ్లో స్నేహ్ రాణాకు క్యాచ్ ఇవ్వడంతో హేలీ సునామీ ఇన్నింగ్స్కు తెరపడింది. ఆమెకు తోడుగా మరో ఓపెనర్ ఫోబే లిచ్ఫీల్డ్ 40, వన్డౌన్లో వచ్చిన ఎలిస్ పెర్రీ 47, ఆష్లే గార్డ్నర్ 45 పరుగులతో రాణించారు. ఆఖర్లో కిమ్ గార్త్ (14) సిక్సర్బాది ఆసీస్ విజయాన్ని ఖరారు చేసింది.It took another moment of brilliance to stop Alyssa Healy! 🙌Shree Charani ends her spell with 3 wickets, while Sneh Rana takes a stunner 🔥Will this wicket be the turning point of the match? 👀Catch the LIVE action ➡https://t.co/qAoZd44TEs#CWC25 👉 #INDvAUS | LIVE NOW… pic.twitter.com/NMKHPYlZ8q— Star Sports (@StarSportsIndia) October 12, 2025వరుసగా రెండు ఓటములు..కాగా వన్డే వరల్డ్కప్-2025లో భారత జట్టు ఇప్పటికే నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తొలుత శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్సేన.. ఆ తర్వాత దాయాది పాకిస్తాన్ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసింది.అనంతరం సౌతాఫ్రికా, ఆసీస్ చేతుల్లో వరుస ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్లలో మెరుగైన ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు విజయాలతో ఉన్న భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి.సెమీస్ చేరాలంటే..ఆస్ట్రేలియా (7), ఇంగ్లండ్ (6) తర్వాత హర్మన్సేన పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక భారత్ తదుపరి ఇంగ్లండ్ (అక్టోబరు 19), న్యూజిలాండ్ (23), బంగ్లాదేశ్ (అక్టోబరు 26) జట్లతో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్లలో గెలిస్తే నెట్రన్రేటుతో పనిలేకుండా టాప్-4లో నిలిచి.. నేరుగా సెమీస్లో అడుగుపెడుతుంది హర్మన్సేన.ఒకవేళ ఇంగ్లండ్ చేతిలో ఓడితే మాత్రం.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్లపై భారత జట్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. తద్వారా మరో నాలుగు పాయింట్లు సాధించి.. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో సెమీస్కు దూసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కంటే నెట్రన్రేటు పరంగా మెరుగ్గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.చదవండి: ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా -
IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో వెస్టిండీస్ ఆటగాళ్లు జాన్ క్యాంప్బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) ఓ అరుదైన ఘనత సాధించారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన ఈ ఇద్దరూ.. 51 ఏళ్ల తర్వాత ఓ రికార్డును తిరగరాశారు.1974లో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు భారత గడ్డపై ఓ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేశారు. 51 ఏళ్ల తర్వాత క్యాంప్బెల్, హోప్ ఆ ఫీట్ను పునరావృతం చేశారు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) గార్డన్ గ్రీనిడ్జ్ (107), క్లైవ్ లాయిడ్ (163) సెంచరీలు చేశారు.ఓవరాల్గా చూసిన భారత గడ్డపై (భారత్పై) ఓ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇద్దరు విండీస్ బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారే. 1974కు ముందు 1948-49లో కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో ఎవర్టన్ వీక్స్ (101), క్లైడ్ వాల్కాట్ (108) సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే ఆలౌటై, ఫాలో ఆన్ ఆడుతున్న విండీస్ రెండో ఇన్నింగ్స్లో అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తుంది. వాస్తవానికి తొలి టెస్ట్ తరహాలోనే ఈ మ్యాచ్లోనూ విండీస్ ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలవుతుందని అంతా అనుకున్నారు.అయితే క్యాంప్బెల్ (115), హోప్ (103) సూపర్ సెంచరీలతో అసమానమైన పోరాటపటిమ కనబర్చి తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. వీరిద్దరు మూడో వికెట్కు 187 పరుగులు జోడించి, టీమిండియా బ్యాటర్లను రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగేలా చేశారు.నాలుగో రోజు టీ సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసి 91 ఆధిక్యంలో ఉంది. జస్టిన్ గ్రీవ్స్ (35), జేడన్ సీల్స్ (18) టీమిండియా బౌలర్ల సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్లో భారత బౌలర్లు కుల్దీప్ 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఇన్నింగ్స్లో విండీస్, కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: Vaibhav Suryavanshi: వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ.. -
హెడ్ కోచ్గా శివనారాయణ్ చంద్రపాల్.. ఆ జట్టుకు ఇక తిరుగు లేదు
‘ది నేపాల్ ప్రీమియర్ లీగ్’ (NPL) సెకెండ్ సీజన్కు రంగం సిద్దమవుతోంది. ఈ మెగా ఈవెంట్ నవంబర్ 17 నుండి డిసెంబర్ 13 వరకు జరుగుతుంది. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ జనక్పూర్ బోల్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ శివనారాయణ్ చంద్రపాల్ను తమ జట్టు ప్రధాన కోచ్గా జనక్పూర్ నియమించింది.ఈ విషయాన్ని జనక్పూర్ బోల్ట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మొదటి సీజన్లో జనక్పూర్ హెడ్ కోచ్గా పనిచేసిన పుబుడు దస్నాయకే స్ధానాన్ని చాందర్పాల్ భర్తీ చేయనున్నాడు. అయితే తొలి సీజన్లోనే ఛాంపియన్గా నిలిపినప్పటికి.. దస్నాయకేను ఎందుకు తప్పించారో సదరు ఫ్రాంచైజీ వెల్లడించలేదు. చంద్రపాల్ కోచింగ్లో తమ జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని జనక్పూర్ బోల్ట్స్ థీమా వ్యక్తం చేసింది.విలక్షణమైన బ్యాటింగ్ శైలితో ప్రసిద్ధి గాంచిన చంద్రపాల్.. వరల్డ్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శివనారాయణ్ అంతర్జాతీయ క్రికెట్లో 20,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. టెస్ట్లలో 11,867, వన్డేలలో 8,778 పరుగులు చేశాడు. రెండు దశాబ్దాలకు పైగా విండీస్ క్రికెట్కు తన సేవలను అందించాడు.అదేవిధంగా కోచ్గా కూడా చంద్రపాల్ను అనుభవం ఉంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో జమైకా తలైవాస్తో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత యూఎస్ఎ మహిళల జాతీయ జట్టుకు ప్రధాన కోచ్గా తన సేవలను అందించాడు. ఇప్పుడు మరోసారి తన అనుభవాన్ని పంచుకునేందుకు చంద్రపాల్ సిద్దమయ్యాడు.చదవండి: ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా -
ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) మైదానంలో ఎంతో కూల్గా ఉంటాడు. బాల్తోనే ప్రత్యర్థి జట్టు బ్యాటర్లతో మాట్లాడతాడు. పదునైన యార్కర్లతో, బౌన్సర్లతో వారిని బోల్తా కొట్టిస్తాడు. అయితే, తాజాగా బుమ్రా కూడా కాస్త సహనం కోల్పోయాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా- వెస్టిండీస్ (IND vs WI 2nd Test) మధ్య శుక్రవారం మొదలైన రెండో టెస్టు.. నాలుగో రోజు ఆటకు చేరుకుంది. 173/2 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టిన విండీస్.. భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.జాన్ క్యాంప్బెల్ సెంచరీఇక ఆదివారం 87 పరుగులతో క్రీజులో నిలిచిన విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (John Campbell)... సెంచరీ (115) సాధించాడు. అయితే, క్యాంప్బెల్ 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ బుమ్రా అతడిని వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నట్లు కనిపించింది.ఎల్బీడబ్ల్యూ కాదుఅయితే, ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇలింగ్వర్త్ మాత్రం తల అడ్డంగా ఉపుతూ ఎల్బీడబ్ల్యూ (Leg Before Wicket) ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో టీమిండియా రివ్యూకి వెళ్లింది. అయితే, రీప్లేలో అల్ట్రాఎడ్జ్ స్పైక్ వచ్చింది. కానీ బంతి ముందుగా ప్యాడ్స్ లేదంటే బ్యాట్ను తాకిందా అనేది స్పష్టంగా తెలియలేదు. బంతి అటు బ్యాట్కు.. ఇటు ప్యాడ్కు అత్యంత సమీపంగా ఉన్నట్లు కనిపించడంతో నిర్ణయం తీసుకోవడం కష్టమైంది.ఈ నేపథ్యంలో థర్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ ఇన్సైడ్ ఎడ్జ్ ఉందని.. ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండవచ్చని స్పష్టం చేశాడు. దీంతో టీమిండియా రివ్యూ కోల్పోయింది.ఇది అవుట్ అని మీకూ తెలుసుఈ క్రమంలో బుమ్రా తిరిగి బౌలింగ్కు వెళ్లే సమయంలో.. ‘‘ఇది అవుట్ అని మీకూ తెలుసు. కానీ సాంకేతికత కూడా దానిని నిరూపించలేదు కదా!’’ అంటూ నవ్వుతూనే అంపైర్కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. కాగా విండీస్ రెండో ఇన్నింగ్స్ 55వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.ఇక ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 93 ఓవర్ల ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తద్వారా 33 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు టీమిండియా 518/5 వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. విండీస్ 248 పరుగులకు ఆలౌట్ అయింది.pic.twitter.com/fDtB3GBWPV— crictalk (@crictalk7) October 13, 2025చదవండి: జైస్వాల్ అంటే గిల్కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్Trapped! 🕸#RavindraJadeja gets the all-important wicket of centurion #JohnCampbell. 💪Catch the LIVE action 👉 https://t.co/WbUGnskEdz#INDvWI 👉 2nd Test, Day 4 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/eHUVezgNs2— Star Sports (@StarSportsIndia) October 13, 2025 -
ఆరేసిన సౌతాఫ్రికా స్పిన్నర్.. విలవిల్లాడిన పాక్ బ్యాటర్లు
సొంతగడ్డపై ప్రపంచ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టులో పాక్ 378 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 313/5 ఓవర్ నైట్ స్కోర్తో అదనంగా 65 పరుగులు సాధించి ఆలౌటైంది. ఓ దశలో పాకిస్తాన్ నాలుగు వందలకు పైగా సాధిస్తుందని భావించారు.కానీ స్పిన్నర్ ముత్తుసామి దెబ్బకు ఆతిథ్య జట్టు ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను త్వరగా ముగించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. అతడి స్పిన్ దాటికి పాక్ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. పాక్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ (153 బంతుల్లో 93; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ షాన్ మసూద్ (147 బంతుల్లో 76; 9 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (140 బంతుల్లో 75; 2 ఫోర్లు, 2 సిక్స్లు), సల్మాన్ ఆఘా (145 బంతుల్లో 93 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (2) విఫలం కాగా... ఇమామ్తో కలిసి షాన్ మసూద్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ జంట రెండో వికెట్కు 161 పరుగులు జోడించడంతో పాకిస్తాన్కు శుభారంభం దక్కింది. రెండేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న ఇమామ్... చక్కటి షాట్ సెలెక్షన్తో ఆకట్టుకున్నాడు. అయితే షాన్ మసూద్ అవుటైన అనంతరం ఒకే స్కోరు వద్ద పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయింది.199 పరుగుల వద్ద ఇమామ్ ఉల్ హక్తో పాటు సౌద్ షకీల్ (0), బాబర్ ఆజమ్ (23) వెనుదిరిగారు. దీంతో పాక్ జట్టు 199/5తో కష్టాల్లో పడింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా... హర్మెర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో ప్రత్యర్ధి పైచేయి సాధించే అవకాశం ఇవ్వకుండా వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా మెరుగ్గా ఆడారు. చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా? -
మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే!
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి, కోచ్ యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను మగ అహంకారినని ఇప్పటికే స్పష్టం చేసిన ఈ మాజీ క్రికెటర్.. మహిళల గురించి మరోసారి అనుచిత కామెంట్లతో వార్తల్లోకెక్కాడు. ఇంటి పెత్తనం ఆడవాళ్ల చేతిలో పెడితే.. అంతా అస్తవ్యస్తమైపోతుందని పేర్కొన్నాడు.అందుకే విడాకులుఇటీవల ఎస్ఎమ్టీవీతో మాట్లాడిన యోగ్రాజ్ సింగ్.. యువీ తల్లి షబ్నమ్తో తన విడాకుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తాను పితృస్వామ్య భావజాలం కలిగిన వ్యక్తినని.. అందుకే షబ్నమ్ తనతో ఇమడలేకపోయిందని తెలిపాడు. అంతేకాదు.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసినంత పనిచేశానని.. ఈ క్రమంలోనే సఖ్యత చెడి విడాకులు తీసుకున్నామని పేర్కొన్నాడు.అంతేకాదు.. యువీని ఉత్తమ ఆల్రౌండర్గా తీర్చిదిద్దే క్రమంలో.. అతడిని కఠినంగా శ్రమించేలా చేశానన్న యోగ్రాజ్.. ఒకవేళ యువీ తన పిల్లల్ని గనుక అప్పగిస్తే వారికీ అదే గతి పట్టిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా హైబ్రో స్టూడియోస్తో మాట్లాడిన యోగ్రాజ్.. మహిళల స్వాతంత్ర్యం గురించి అవాకులు చెవాకులు పేలాడు.బిడ్డను ఆ దేవుడే రక్షిస్తాడు‘‘మహిళలకు నేను అత్యంత గౌరవం ఇస్తా. అయితే, పురుషులు, మహిళకలకంటూ వేర్వేరు బాధ్యతలు ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నపుడు బిడ్డను ఆ దేవుడే రక్షిస్తాడు. తన లోపల ఏం జరుగుతుందో ఆ మహిళకు ఏం తెలుస్తుంది.దేవుడే ఆమెనూ కాపాడతాడు. బిడ్డ భూమ్మీదకు రాగనే ఏడుస్తాడు. ఎందుకంటే.. అప్పుడే ఆ దేవుడు బిడ్డ వేలిని విడిచిపెడతాడు. ప్రేమైక భాషలో చెప్పాలంటే.. దేవుడు ఆ బిడ్డను తండ్రి చేతుల్లో పెడతాడు. నీ బిడ్డ రాతను నువ్వే రాయమని చెప్తాడు. తల్లికీ కొన్ని బాధ్యతలు ఇస్తాడు.అలా చేయనివాడు తండ్రే కాడుఏడుస్తున్న బిడ్డను తల్లి హత్తుగానే.. బిడ్డ ఏడుపు ఆపేస్తుంది. మాతృమూర్తికి ఉన్న శక్తి అది. ఆ తర్వాత మాత్రం అంతా తండ్రే చూసుకుంటాడు. బిడ్డ రాతను రాసి.. అతడు లేదంటే ఆమెను ప్రయోజకురాలిని చేస్తాడు. అలా చేయనివాడు తండ్రే కాడు.మా అమ్మకి 19.. నాన్నకు 60ఇక తల్లి ఇంటి పనులు చుసుకుంటుంది. ఇంటి యజమాని తండ్రి. ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది. ఈ సూత్రాన్ని అనుసరిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. మా అమ్మ మా నాన్న కంటే వయసులో 42 ఏళ్లు చిన్నది. అమ్మకు 19 ఏళ్లు ఉన్నపుడు 60 ఏళ్ల వయసులో ఉన్న మా నాన్నతో పెళ్లి చేశారు.అయినా సరే వారి మధ్య ప్రేమకు కొదవలేదు. అసలు అలాంటి ప్రేమను నేను ఎక్కడా చూడలేదు. ఒకరి కోసం ఒకరు బతికారు. ఒకరంటే ఒకరు పడిచచ్చిపోయేవారు. అయితే, మా అమ్మ ఒక స్త్రీగా తన పని చేయడం.. నా తండ్రి పురుషుడిగా బాధ్యతలు నిర్వర్తించడం వల్లే ఇది సాధ్యమైంది.తల చుట్టూ దుపట్టా ధరించాల్సిందేఇక నా కుటుంబంలోనే నేనే యజమానిని. కిట్టీ పార్టీలు ఉండకూడదు. మహిళ కచ్చితంగా తన తల చుట్టూ దుపట్టా ధరించాల్సిందే. పెద్దలు పెట్టిన ప్రతీ నిబంధనను వారు పాటించాలి. చాలా మంది నన్ను తప్పుగా అనుకోవచ్చు.నా పరువు మీరేఏదేమైనా మా ఇంట్లో ఒక్కరూ నా మాట జవదాటరు. నా భార్య, కూతురితో ఒకే మాట చెప్పాను. ‘నా పరువు మీరే’ దానిని ఎప్పటికీ దిగజార్చవద్దు అని హెచ్చరిక చేశాను. ఒకవేళ అదే జరిగతే నా ప్రాణమే పోతుందని చెప్పా. ఇందులో తప్పేమైనా ఉందా?’’ అంటూ యోగ్రాజ్ సింగ్ మరోసారి నిస్సిగ్గుగా తన పితృస్వామ్య భావజాలాన్ని బయటపెట్టడమే కాక.. దానిని సమర్థించుకున్నాడు కూడా! రెండో పెళ్లికాగా యువీ తల్లితో విడాకుల తర్వాత యోగ్రాజ్ సింగ్ నీనా బుంధేల్ అనే పంజాబీ నటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. ఇక షబ్నమ్తో యోగ్రాజ్కు కుమారులు యువరాజ్, జొరావర్ కలిగారు.ఇక టీమిండియా తరఫున 1980- 81 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన చంఢీగడ్ యోగ్రాజ్ సింగ్.. ఒక టెస్టులో 10 పరుగులు, ఆరు వన్డేల్లో కలిపి ఒక పరుగు చేశాడు. టెస్టుల్లో ఒక వికెట్, వన్డేల్లో నాలుగు వికెట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.చదవండి: వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. రిలేషన్షిప్లో ఉన్నా! -
ఢిల్లీ టెస్టు.. భారత్కు ధీటుగా బదులిస్తున్న వెస్టిండీస్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియా(Teamindia)తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్తో పోరాడుతోంది. ఫాలో ఆన్లో విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి కరేబియన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.ప్రస్తుతం ఫాలో ఆన్లో వెస్టిండీస్ ఇంకా 28 పరుగులు వెనకబడి ఉంటుంది. క్రీజులో షాయ్ హోప్(92), కెప్టెన్ రోస్టన్ ఛేజ్(23) ఉన్నారు. ఫస్ట్ సెషన్లో విండీస్ 79 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 115 పరుగులు చేసిన క్యాంప్బెల్.. రవీంద్ర జడేజా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అంతకుముందు పర్యాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాల్ ఆన్ గండాన్ని విండీస్ తప్పంచుకోలేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 82 పరుగులిచ్చి 5 వికెట్లు, రవీంద్ర జడేజా 46 పరుగులిచ్చి 3 తీశారు. వీరిద్దరితో బుమ్రా, సిరాజ్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది.చదవండి: Vaibhav Suryavanshi: వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ.. -
వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ..
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన భారత అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ క్రికెట్ అసోయేషిన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్కు గాను బీహార్ టీమ్ వైస్ కెప్టెన్గా సూర్యవంశీ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీకి బీసీఎ సెలక్టర్లు సోమవారం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించారు.ఈ జట్టు కెప్టెన్గా సకిబుల్ గని ఎంపికగా.. అతడికి డిప్యూటీగా వైభవ్ వ్యవహరించనున్నాడు. బిహార్ జట్టు తమ తొలి మ్యాచ్లో అక్టోబర్ 15న అరుణాచల్ ప్రదేశ్తో తలపడనుంది. పియూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. రాబోయే దేశీయ సీజన్కు జట్టును ఎంపిక చేయడానికి రాష్ట్రంలో తగినంత మంది సెలెక్టర్లు లేరని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అందుకే జట్టు ప్రకటన ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.ఐపీఎల్లో అదరగొట్టి..వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులో భారత అండర్-19 జట్టు తరపున మెరుగైన ప్రదర్శన చేసి రాజస్తాన్ రాయల్స్ స్కౌట్స్ దృష్టిలో పడ్డాడు. దీంతో ఐపీఎల్-2025 వేలంలో వైభవ్ను రూ. 1.1 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. అయితే రాజస్తాన్ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో దుమ్ములేపాడు. వైట్బాల్, రెడ్ బాల్ సిరీస్లు రెండింటిలోనూ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఇప్పుడు ఏకంగా రంజీ ట్రోఫీ వంటి టోర్నీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం దక్కింది.బిహార్ జట్టుపీయూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సకీబుల్ గని (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అర్నవ్ కిషోర్, ఆయుష్ లోహరుక, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సాకిబ్ హుస్సేన్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు కుమార్, ఖలిద్.చదవండి: జైస్వాల్ అంటే గిల్కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్ -
జైస్వాల్ అంటే గిల్కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)భారీ శతకం బాదాడు. మొత్తంగా 258 బంతులు ఎదుర్కొనని 175 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తన కెరీర్లో మూడో డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో ఘోర తప్పిదం చేశాడు.ఇరవై ఐదు పరుగుల దూరంలోఅనవసరపు పరుగుకు యత్నించిన జైసూ.. రనౌట్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాడు. ద్విశతకానికి ఇరవై ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఢిల్లీ వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.భారత్ తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో జేడన్ సీల్స్ (Jayden Seals) బౌలింగ్లో జైస్వాల్.. బంతిని మిడాఫ్ దిశగా బాదగా.. అది నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, అప్పటికే సింగిల్ కోసం జైసూ క్రీజును వీడగా.. మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) మాత్రం పరిస్థితిని అంచనా వేసి తన స్థానం నుంచి కదిలినా మళ్లీ యథాస్థితికి వచ్చాడు.తలబాదుకుంటూఇంతలో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా అప్పటికే బంతిని అందుకున్న విండీస్ వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్.. దానిని వికెట్లకు గిరాటేయగా.. జైసూ రనౌట్ అయ్యాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన జైస్వాల్ తలబాదుకుంటూ మైదానం వీడాడు.ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు గిల్ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్కు దిగారు. జైస్వాల్ అంటే గిల్కు అసూయ అని.. అందుకే అతడు రన్ కోసం పిలుపునిచ్చినా సరైన సమయంలో స్పందించలేదని నిందిస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు.జైస్వాల్ అంటే గిల్కు అసూయా?‘‘నితీశ్ రెడ్డి కోసం గిల్ పరిగెడతాడు. కానీ జైస్వాల్ కోసం సింగిల్ తీయడు. ఎందుకిలా?.. ఎందుకంటే.. జైస్వాల్ అంటే గిల్కు అసూయ!.. అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా?వారి విషయంలోనూ ఇలాగే చేశారురోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలోనూ మీరు ఇలాగే చేశారు. చాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరూ కలిసికట్టుగా జట్టును గెలిపించారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇద్దరూ ట్రోఫీని ముద్దాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.ఇక ఇప్పుడు మీరేమో మళ్లీ జైస్వాల్- గిల్ల గురించి ఇలాంటి ప్రచారమే మొదలుపెట్టారు. వాళ్లిద్దరు స్నేహితులు. ఇద్దరూ ఒకే జట్టుకు ఆడుతున్నారు. ఈ రనౌట్ విషయంలో తప్పు ఎవరిదైనా.. డ్రెసింగ్రూమ్లో వాళ్లిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో కూడా చూడండి.అసహనం ప్రదర్శించాడంతేఈ ఘటన తర్వాత కూడా వాళ్లిద్దరు ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నారు. అసలేం జరిగిందో అర్థంకాక జైస్వాల్ అసహనం ప్రదర్శించాడంతే. ఫ్యాన్స్ ఆర్మీలే ఇలాంటి గొడవలు సృష్టిస్తాయి. కలిసికట్టుగా కాకుండా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఆడతారని కామెంట్లు చేస్తారు. గిల్- జైస్వాల్ల ప్రయాణం ఇప్పుడే మొదలైంది. దయచేసి ఇలాంటి ట్రోలింగ్ ద్వారా వారి కెరీర్పై ప్రభావం పడేలా చేయకండి. వాళ్లిద్దరు కలిసి భారత క్రికెట్ను ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడండి’’ అంటూ ఆకాశ్ చోప్రా ట్రోలర్స్పై మండిపడ్డాడు.కాగా విండీస్తో రెండో టెస్టులో గిల్ అజేయ శతకం (129) సాధించిన తర్వాత.. ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌట్ అయిన వెస్టిండీస్.. ఫాలో ఆన్ ఆడుతోంది.చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా? -
ENG vs NZ: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
ఇంగ్లండ్తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శాంట్నర్ ఉదర శస్త్రచికిత్స కారణంగా ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యాడు.అదేవిధంగా ముఖ గాయం కారణంగా ఆసీస్ సిరీస్కు దూరంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర కూడా కోలుకున్నాడు. దీంతో అతడికి ఈ జట్టులో చోటు దక్కింది. అయితే ఈ సిరీస్కు యువ పేసర్ బెన్ సీర్స్ను గాయం కారణంగా సెలక్టర్లు పక్కన పెట్టారు. మరోవైపు వెటరన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ జట్టులో లేడు.అతడు టీ20ల తర్వాత జరగనున్న వన్డే సిరీస్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. కివీస్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న విలియమ్సన్.. ప్రస్తుతం కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. విలియమ్సన్ చివరగా న్యూజిలాండ్ తరపున ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. కాగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ ఆక్టోబర్ 19 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా ప్రారంభం కానుంది.సిరీస్ వివరాలు:మొదటి టీ20 – అక్టోబర్ 18, క్రైస్ట్చర్చ్రెండో టీ20 – అక్టోబర్ 20, వెల్లింగ్టన్మూడో టీ20 – అక్టోబర్ 22, ఆక్లాండ్న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్)చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా? -
భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా?
వారిద్దరూ వరల్డ్ క్రికెట్లో పవర్ ఫుల్ జోడీ. ఒకరేమో తన యార్కర్లతో బ్యాటర్లకు చుక్కలు చూపించే ఫాస్ట్ బౌలర్.. మరొకరు తన బ్యాటింగ్తో బౌలర్లకు చెమటలు పట్టించే డేంజరస్ ప్లేయర్. ముఖ్యంగా ఈ జంటకు ప్రత్యర్ధి భారత్ అయితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. అతడు రెండేళ్ల కిందట తన బౌలింగ్తో వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియాకు గుండె కోత మిగల్చగా.. ఇప్పుడు అతడి భార్య మెరుపు బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించింది. ఈపాటికే ఆ స్టార్ జంట ఎవరన్నది మీకు ఆర్ధమై ఉంటుంది. వారిద్దరూ ఎవరో కాదు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు మిచెల్ స్టార్క్, అతడి భార్య అలీసా హీలీ. ఆసీస్ మెన్స్ టీమ్లో స్టార్క్ కీలక సభ్యునిగా కొనసాగుతుంటే.. మహిళల జట్టు కెప్టెన్గా హీలీ వ్యవహరిస్తోంది.హీలీ సూపర్ సెంచరీ..మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో హీలీ అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు దారుణ ప్రదర్శన కనబరిచిన అలిస్సా .. భారత్పై మాత్రం విశ్వరూపాన్ని చూపించింది. 331 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. కేవలం 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్లతో 142 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ నుంచి లాగేసుకుంది. ఆమె ఇన్నింగ్స్కు భారత అభిమానులు సైతం ఫిదా అయిపోయారు. ఆమె విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆసీస్ లక్ష్యాన్ని 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ వరల్డ్కప్లో ఆసీస్కు ఇది వరుసగా మూడో విజయం. అంతేకాకుండా మహిళల వన్డేలో అత్యధిక పరుగులు చేధించిన జట్టుగా కంగారులు నిలిచారు.కెప్టెన్గా అదుర్స్..ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా 2023లో హీలీ నియమించబడింది. అయితే అంతకుముందు చాలా మ్యాచ్లలో తాత్కాలిక కెప్టెన్గా ఆమె వ్యవహరించింది. మాగ్ లానింగ్ రిటైర్మెంట్ తర్వాత ఫుల్ టైమ్ కెప్టెన్గా హీలీ బాధ్యతలు స్వీకరించింది. ఆమె కెప్టెన్సీలో 55 మ్యాచ్లు ఆడిన ఆసీస్..42 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇప్పుడు వన్డే ప్రపంచకప్లో టైటిల్ ఫేవరేట్గా ఆసీస్ బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.ప్రేమించి పెళ్లాడి..మిచెల్ స్టార్క్, హీలీది ప్రేమ వివాహం. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత వీరు 2016లో పెళ్లి చేసుకున్నారు. సిడ్నీకి చెందిన వీరిద్దరికి 9 ఏళ్ల వయస్సు నుంచే పరిచయం ఉంది. వారిద్దరూ అండర్-10 క్రికెట్ టోర్నీల్లో ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించేవారు. 15 ఏళ్ల వరకు ఒకే టీంకు ఆడిన వీరు అనంతరం విడిపోయారు. పురుషుల జట్టుకు ఆడేందుకు స్టార్క్ వెళ్లగా... మహిళల జట్టుకు ఆడేందుకు హేలీ సిద్ధమైంది. 2013లో స్టార్క్ హేలీపై తన ప్రేమను బయటపెట్టాడు. అందుకు హీలీ కూడా ఓకే చెప్పడంతో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. -
ఒకే ఒక తప్పు.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్పై మూడు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 331 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు.ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ అలీసా హీలీ(142) అద్భుత శతకంతో మెరిసింది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు, దీప్తి శర్మ, అమన్ జ్యోత్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 80) ప్రతికా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 75) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆసీస్ బౌలర్ సదర్లాండ్ 5 వికెట్లతో సత్తాచాటింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది. తొలుత బ్యాటింగ్లో అదనంగా కొన్ని పరుగులు సాధించి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది అని ఆమె చెప్పుకొచ్చింది."ఈ మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణించాము. కానీ ఆఖరిలో మా రిథమ్ను కోల్పోయాము. అదనంగా మరో 30–40 పరుగులు చేసింటే మేమే విజయం సాధించేవాళ్లం. చివరి 6–7 ఓవర్లలో వికెట్లు వరుసగా కోల్పోవడం వల్ల మేము అనుకున్న టార్గెట్ను సెట్ చేయలేకపోయాము.ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికి మేము సరిగా ఉపయోగించుకోలేకపోయాం. గత మూడు మ్యాచ్ల్లో మేం మిడిల్ ఓవర్లలో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. కానీ లోయరార్డర్ బాధ్యత తీసుకొని జట్టును గట్టెక్కించింది.కానీ ఈ రోజు మాత్రం 40 ఓవర్ల వరకు మా బ్యాటింగ్ బాగుంది. చివరి ఓవర్లలో మేము మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాము. ఆటలో ఇలాంటివి సహజంగా జరగుతూనే ఉంటాయి. ప్రతి మ్యాచ్లో 100 శాతం రాణించడం సాధ్యం కాదు. కానీ తిరిగి ఎలా పుంజుకున్నామన్నది ముఖ్యం. తదుపరి రెండు మ్యాచ్లు మాకు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్లో మేము ఓటమిపాలైనప్పటికి మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. చరణి ప్రదర్శనపై మాట్లాడుతూ.. ఆమె నిజంగా అద్భుతం. జట్టుకి అవసరమైనప్పుడు ప్రతీసారి చరణి ముందుంటుంది. హీలీ లాంటి బ్యాటర్కి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగింది. ఆమెపై మాకు చాలా నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితులలోనైనా మాకు వికెట్ అందించగలదు. మా జట్టు కాంబనేషన్ గురించి ఎటువంటి చర్చ అవసరం లేదు. ఎందుకంటే ఈ కాంబినేషన్తోనే మేం విజయాలు సాధించాం. ఒకట్రెండు ఓటములతో ఈ కాంబినేషన్ సరి కాదని నేను అనుకోవడం లేదు. మా తదుపరి మ్యాచ్లపై దృష్టిపెడతాము అని హర్మన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొంది.చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
మహిళల ప్రపంచకప్-2025లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఆదివారం వైజాగ్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 331 పరుగుల భారీ లక్ష్య చేధనలో కంగారుల కెప్టెన్ అలీసా హీలీ అద్భుత సెంచరీతో చెలరేగింది.107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 142 పరుగులు చేసిన హీలీ.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఫలితంగా భారీ టార్గెట్ను ఆసీస్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. హీలీతో పాటు లీచ్ ఫీల్డ్(40), పెర్రీ(47), గార్డనర్(45) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.భారత బౌలర్లు ఆఖరిలో పోరాడినప్పటికి జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.ఆసీస్ వరల్డ్ రికార్డు..ఈ విజయంతో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక జట్టులో 2024లో దక్షిణాఫ్రికాపై 302 పరుగుల టార్గెట్ను ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్లో లంక కెప్టెన్ చమారి అటపత్తు (195* పరుగులు) భారీ శతకంతో మెరిసింది. అయితే తాజా మ్యాచ్తో లంక ఆల్టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది.మహిళల వన్డే క్రికెట్లో హైయిస్ట్ ఛేజింగ్లు ఇవే..1.ఆస్ట్రేలియా-భారత్(ప్రత్యర్ధి)-331/7 2.శ్రీలంక - దక్షిణాఫ్రికా (ప్రత్యర్ధి) -302/4 3.ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ (ప్రత్యర్ధి)-289 4.ఆస్ట్రేలియా-భారత్ (ప్రత్యర్ధి)-283 5.ఆస్ట్రేలియా -భారత్ (ప్రత్యర్ధి)-282చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ఆసియాలో తొలి బ్యాటర్ -
మ్యాచ్ హోరాహోరీ... పుణేరిదే విక్టరీ
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో ఇప్పటికే ప్లేఆఫ్స్కు చేరిన దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో పుణేరి పైచేయి సాధించింది. స్కోర్లు సమమైన ఈ మ్యాచ్లో పల్టన్ జట్టు ‘టైబ్రేక్’ రెయిడ్లతో గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే పోటాపోటీగా సాగింది. దీంతో నిరీ్ణత సమయం ముగిసేసరికి 38–38తో స్కోరు సమమైంది. పుణేరి రెయిడర్లలో పంకజ్ (7), ఆదిత్య షిండే (6), మోహిత్ (5) క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టారు. ఆల్రౌండర్, కెపె్టన్ అస్లామ్ ఇనామ్దార్ (6)తో పాటు, డిఫెండర్ గౌరవ్ ఖత్రి (4) కూడా రాణించాడు. దబంగ్ తరఫున రెయిడర్ అజింక్య పవార్ 10 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో డిఫెండర్ సౌరభ్ (6), ఆల్రౌండర్ నవీన్ (5), నీరజ్ నర్వాల్ (4) అదరగొట్టారు. మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన టైబ్రేక్లో పుణేరి రెయిడర్లు అందరూ పాయింట్లు తెచ్చిపెట్టడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఈ విజయంతో పట్టికలో టాప్–2 స్థానాలు తారుమారు అయ్యాయి. అగ్రస్థానంలో ఉన్న దబంగ్ రెండో స్థానానికి, రెండో స్థానంలో ఉన్న పుణేరి పల్టన్ అగ్రస్థానానికి ఎగబాకింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 43–32తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది. ఆల్రౌండర్ అలీ రెజా (18) చెలరేగాడు. రెయిడింగ్లో 16 పాయింట్లు, టాకిల్తో 2 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా సహచరుల్లో రెయిడర్ ఆశిష్ మలిక్ (7), డిఫెండర్ దీపక్ శంకర్ (6)సైతం పోటీపడి పాయింట్లు తెచ్చారు. బెంగాల్ జట్టు రెయిడర్లలో కెపె్టన్ దేవాంక్ (13), హిమాన్షు నర్వాల్ (7) రాణించారు. నేడు జరిగే పోటీల్లో పట్నా పైరేట్స్తో హరియాణా స్టీలర్స్, యూ ముంబాతో యూపీ యోధాస్ తలపడతాయి. -
కోకోదే పైచేయి
అవుహాన్ (చైనా): ఆద్యంతం నిలకడగా రాణించిన అమెరికా టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ ఈ ఏడాది తన ఖాతాలో రెండో టైటిల్ను జమ చేసుకుంది. ఈ సీజన్లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచిన కోకో గాఫ్... ఆదివారం ముగిసిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో చాంపియన్గా నిలిచింది. అమెరికాకే చెందిన ప్రపంచ 6వ ర్యాంకర్ జెస్సికా పెగూలాతో జరిగిన తుది పోరులో కోకో గాఫ్ 6–4, 7–5తో గెలుపొందింది. 1 గంట 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కోకో నాలుగు ఏస్లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన కోకో గాఫ్కు 5,96,000 డాలర్ల (రూ. 5 కోట్ల 28 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.2 చైనా ఆతిథ్యమిస్తున్న రెండు డబ్ల్యూటీఏ– 1000 టోర్నీల్లో (బీజింగ్ ఓపెన్, వుహాన్ ఓపెన్) విజేతగా నిలిచిన రెండో ప్లేయర్ కోకో గాఫ్. గతంలో ఫ్రాన్స్ ప్లేయర్ కరోలినా గార్సియా (2017లో) మాత్రమే ఈ ఘనత సాధించింది.9 హార్డ్ కోర్టులపై తాను ఆడిన తొమ్మిది టోర్నీల ఫైనల్స్లోనూ కోకో గాఫ్ చాంపియన్ కావడం విశేషం. -
యువ భారత్ జోరు
జొహర్ (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి పోరులో బ్రిటన్ను చిత్తు చేసిన యువభారత్... రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 4–2 గోల్స్ తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. భారత్ తరఫున అర్ష్ దీప్ సింగ్ (2వ నిమిషంలో), పీబీ సునీల్ (15వ నిమిషంలో), అరిజిత్సింగ్ హుండల్ (26వ నిమిషంలో), రోషన్ కుజుర్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గస్ నెల్సన్ (41వ నిమిషంలో), ఎయిడెన్ మ్యాక్స్ (52వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే ప్రత్యర్థి డిఫెన్స్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ అర్‡్షదీప్ గోల్ సాధించడంతో యువ భారత జట్టు ఖాతా తెరిచింది. న్యూజిలాండ్ కీపర్ బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా... రెండోసారి అవకాశం దక్కించుకున్న అర్‡్షదీప్ విజయవంతంగా బంతిని నెట్లోకి పంపాడు. తొలి క్వార్టర్ ఆఖర్లో వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సునీల్ సది్వనియోగం చేసుకోవడంతో భారత జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో క్వార్టర్లో అరైజీత్ సింగ్ హుండల్ గోల్తో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది. ఎట్టకేలకు 41వ నిమిషంలో న్యూజిలాండ్ తొలి గోల్ నమోదు చేసుకుంది. ఇక చివరి క్వార్టర్లో మరో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని రోషన్ కుజుర్ గోల్గా మలచగా... ఆఖర్లో న్యూజిలాండ్ మరో గోల్ చేసినా లాభం లేకపోయింది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత జట్టు... తదుపరి మ్యాచ్లో మంగళవారం దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. -
వారెవ్వా వాలెంటిన్...
షాంఘై: ఊహకందని ప్రదర్శనతో ఆద్యంతం అదరగొట్టిన మొనాకో టెన్నిస్ ప్లేయర్ వాలెంటిన్ వాచెరోట్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో ప్రపంచ 204వ ర్యాంకర్ వాలెంటిన్ చాంపియన్గా అవతరించాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో రెండు మ్యాచ్ల్లో గెలిచి మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన వాలెంటిన్... మెయిన్ ‘డ్రా’లోనూ మెరిపించాడు. ఫైనల్లో వాలెంటిన్ 4–6, 6–3, 6–3తో ఆర్థర్ రిండెర్నీచ్ (నెదర్లాండ్స్)పై గెలుపొంది తన కెరీర్లో తొలి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన వాలెంటిన్కు 11 లక్షల 24 వేల 380 డాలర్ల (రూ. 9 కోట్ల 97 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘కంటి నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి. జరిగింది నమ్మశక్యంగా లేదు. ఏటీపీ సర్క్యూట్లో నాకిది నాలుగో సీజన్ మాత్రమే. నా విజయం వెనుక నా శిక్షణ సిబ్బంది పాత్ర ఎంతో ఉంది’ అని ఏటీపీ సర్క్యూట్లో టైటిల్ నెగ్గిన తొలి మొనాకో ప్లేయర్గా గుర్తింపు పొందిన వాలెంటిన్ వ్యాఖ్యానించాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో వాలెంటిన్ 7–6 (7/4), 6–3తో నిశేష్ బసవరెడ్డి (అమెరికా)పై, రెండో రౌండ్లో 4–6, 7–6 (7/5), 6–4తో లియామ్ డ్రాక్సెల్ (కెనడా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో వాలెంటిన్ 6–3, 6–4తో లాస్లో జెరె (సెర్బియా)పై, రెండో రౌండ్లో 3–6, 6–3, 6–4తో 14వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై, మూడో రౌండ్లో 6–0, 3–1తో 20వ సీడ్ టామస్ మఖాచ్ (చెక్ రిపబ్లిక్–రిటైర్డ్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 7–6 (7/1), 6–4తో 27వ సీడ్ టాలన్ గ్రీక్స్పూర్ (నెదర్లాండ్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 2–6, 7–6 (7/4), 6–4తో 10వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై, సెమీఫైనల్లో 6–3, 6–4తో నాలుగో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. 5 కెరీర్లో తొలి టైటిల్ ‘మాస్టర్స్ సిరీస్’ టోర్నీని సాధించిన ఐదో ప్లేయర్గా వాలెంటిన్ నిలిచాడు. గతంలో రొబెర్టో కార్రెటెరో, అల్బెర్ట్ పొరా్టస్, క్రిస్ వుడ్రఫ్, జాకుబ్ మెన్సిక్ ఈ ఘనత సాధించారు. 3 క్వాలిఫయర్ హోదాలో ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన మూడో ప్లేయర్గా వాలెంటిన్ నిలిచాడు. గతంలో రొబెర్టో కార్రెటెరో (స్పెయిన్; 1996లో హంబర్గ్ ఓపెన్), అల్బెర్ట్ పొరా్టస్ (స్పెయిన్; 2001లో హంబర్గ్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. 204 ఏటీపీ మాస్టర్స్ సిరీస్ (1990లో) టోర్నీలు ప్రవేశపెట్టాక మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన అతి తక్కువ ర్యాంకర్గా వాలెంటిన్ (204వ ర్యాంక్) గుర్తింపు పొందాడు. -
IND vs WI 2nd Test: మనదే పైచేయి
కుల్దీప్, జడేజాలు తిప్పేయడంతో తొలి ఇన్నింగ్స్లో 250 పరుగుల్లోపే ఆలౌటైన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో ప్రతిఘటిస్తోంది. గత టెస్టులో వన్డే ఓవర్ల కోటా (50)ను ఆడలేకపోయిన కరీబియన్ బ్యాటర్లు ఆశ్చర్యకరంగా ఫిరోజ్షా కోట్లా స్పిన్ ట్రాక్పై పోరాటం కనబరుస్తున్నారు. దీంతో భారత జట్టు క్లీన్స్వీప్ ఆలస్యమవుతోంది. నాలుగో రోజుకు చేరిన ఈ టెస్టు ఫలితానికి భారత్ ఇంకా 8 వికెట్ల దూరంలో ఉండగా... ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి విండీస్ 97 పరుగులు చేయాల్సి ఉంది.న్యూఢిల్లీ: పడేశారు... కానీ పడగొట్టాల్సిన పని ఇంకా మిగిలే ఉంది. భారత స్పిన్నర్లు ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్లో కూల్చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్లో కరీబియన్లు మన స్పిన్ ట్రాక్పై... మన స్పిన్నర్లకు సవాలు విసురుతున్నారు. దీంతో ఈ సిరీస్లో క్లీన్స్వీప్ విజయం కోసం నాలుగో రోజూ కూడా భారత బౌలర్లు శ్రమించాల్సిన అవసరం వచ్చింది. మూడో రోజు ఆటలో కుల్దీప్ యాదవ్ 82 పరుగులిచ్చి 5 వికెట్లు, రవీంద్ర జడేజా 46 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. ఖరి పియర్ (23; 3 ఫోర్లు), ఫిలిప్ (24 నాటౌట్; 2 ఫోర్లు) కాసేపు ప్రతిఘటించారు. అనంతరం ఫాలోఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్ క్యాంప్బెల్ (87 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్లు), షై హోప్ (66 బ్యాటింగ్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయంగా రాణించారు. సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు. కుల్దీప్ ఉచ్చులో పడి... ఓవర్నైట్ స్కోరు 140/4తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన వెస్టిండీస్ను ఆరంభంలోనే కుల్దీప్ దెబ్బకొట్టాడు. ఓవర్నైట్ బ్యాటర్లు షై హోప్ (36; 5 ఫోర్లు), ఇమ్లాచ్ (21; 3 ఫోర్లు)లను తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీని నుంచి తేరుకోకముందే గ్రీవెస్ (17; 3 ఫోర్లు)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లో సిరాజ్... వారికెన్ (1)ను క్లీన్బౌల్డ్ చేయడంతో 35 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయింది. అప్పుడు విండీస్ స్కోరు 175/8 కావడంతో ఇక లాంఛనమే మిగిలుందనిపించింది. కానీ పియర్, ఫిలిప్, సీల్స్ (13; 3 ఫోర్లు) దాదాపు 250 పరుగుల దాకా లాక్కొచ్చారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248 ఆలౌట్ (81.5 ఓవర్లలో); వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్బెల్ (బ్యాటింగ్) 87; తేజ్ చందర్పాల్ (సి) గిల్ (బి) సిరాజ్ 10; అతనేజ్ (బి) సుందర్ 7; షై హోప్ (బ్యాటింగ్) 66; ఎక్స్ట్రాలు 3; మొత్తం (49 ఓవర్లలో 2 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–17, 2–35. బౌలింగ్: సిరాజ్ 6–2–10–1, జడేజా 14–3–52–0, సుందర్ 13–3–44–1, కుల్దీప్ 11–0–53–0, బుమ్రా 4–2–9–0, జైస్వాల్ 1–0–3–0. -
330 సరిపోలేదు.. భారత్పై ఆసీస్ గ్రాండ్ విక్టరీ
స్టార్ బ్యాటర్ స్మృతి ఫామ్లోకి వచ్చింది. ప్రతీక, జెమీమా కూడా రాణించారు. 330 పరుగుల భారీ స్కోరు నమోదైంది. పిచ్ బ్యాటింగ్కు కాస్త అనుకూలంగానే ఉన్నా... ఈ భారీ స్కోరును కాపాడుకోవచ్చని భారత మహిళలు భావించారు. కానీ అటువైపు ఉన్నది ఆస్ట్రేలియా... కెప్టెన్ అలీసా హీలీ నేతృత్వంలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. చివర్లో కొన్ని అవకాశాలు సృష్టించుకొని భారత్ పట్టు బిగించినట్లు కనిపించినా... ప్రత్యర్థి విజయాన్ని ఆపడానికి అవి సరిపోలేదు. దాంతో గత మ్యాచ్ తరహాలోనే గెలుపునకు చేరువైనట్లు కనిపించినా... మరో ఓటమితో టీమిండియాకు నిరాశ తప్పలేదు. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: సొంతగడ్డపై మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్కు మరో నిరాశజనక ఫలితం ఎదురైంది. ఆదివారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. అన్ని వరల్డ్కప్లలో కలిపి భారత్కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు స్మృతి మంధాన (66 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్స్లు), ప్రతీక రావల్ (96 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు తొలి వికెట్కు 24.3 ఓవర్లలో 155 పరుగులు జోడించారు. ఆ్రస్టేలియా బౌలర్ అనాబెల్ సదర్లాండ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం ఆ్రస్టేలియా 49 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు సాధించి గెలిచింది. మహిళల వన్డేల చరిత్రలో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (107 బంతుల్లో 142; 21 ఫోర్లు, 3 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. భారత్ తమ తర్వాతి పోరులో ఈ నెల 19న ఇంగ్లండ్తో ఇండోర్లో తలపడుతుంది. నేడు విశాఖపట్నంలో జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. భారత ఓపెనర్లు ప్రతీక, స్మృతి ఇన్నింగ్స్ను జాగ్రత్తగా మొదలు పెట్టారు. ఫలితంగా తొలి 7 ఓవర్లలో 26 పరుగులే వచ్చాయి. పవర్ప్లే తర్వాత 11–15 ఓవర్లలో భారత్ 15 పరుగులే చేసింది. ఓపెనర్లు ధాటిని పెంచడంతో 21–24 మధ్య 4 ఓవర్లలోనే 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46 పరుగులు రావడం విశేషం. ఎట్టకేలకు స్మృతిని అవుట్ చేసి మోలినే ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకోగా, 30 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 192/1కు చేరింది. అయితే తర్వాతి బంతికే ప్రతీక వెనుదిరగ్గా, హర్మన్ప్రీత్ (22; 3 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగింది. అయితే జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు), రిచా ఘోష్ (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు ప్రదర్శిస్తూ స్కోరును 300 దాటించారు.వీరిద్దరు ఐదో వికెట్కు 34 బంతుల్లో 54 పరుగులు జత చేశారు. అయితే ఆఖర్లో భారీ షాట్లకు యత్నించి భారత బ్యాటర్లు వరుసగా వెనుదిరిగారు. 36 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ మరో 7 బంతుల ముందే ముగిసింది. ఓపెనర్ల దూకుడు... భారీ ఛేదనలో ఆసీస్కు ఓపెనర్లు హీలీ, లిచ్ఫీల్డ్ ఘనమైన ఆరంభం అందించారు. క్రాంతి ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్తో హీలీ దూకుడు కనబర్చగా, అమన్జోత్ ఓవర్లో లిచ్ఫీల్డ్ 4 ఫోర్లు బాదింది. తొలి వికెట్కు వీరిద్దరు 68 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. అయితే లిచ్ఫీల్డ్తో పాటు తక్కువ వ్యవధిలో బెత్ మూనీ (4), అనాబెల్ సదర్లాండ్ (0) అవుటయ్యారు. కానీ మరోవైపు హీలీ ఎక్కడా తగ్గకుండా ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ను నడిపించింది. ఈ క్రమంలోనే 84 బంతుల్లో ఆమె శతకం పూర్తి చేసుకుంది. ఆసీస్ విజయానికి చేరువవుతున్న దశలో ఒక్కసారిగా భారత బౌలర్లు పైచేయి సాధించారు. ఫలితంగా 38 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఒత్తిడిని అధిగమించి ఆసీస్ ఒక ఓవర్ ముందే గెలిచింది.112 స్మృతి 5 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు పట్టిన ఇన్నింగ్స్ల సంఖ్య. మహిళల వన్డేల్లో అందరికంటే వేగంగా ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే ఇన్నింగ్స్లో ఒకే ఏడాది 1000 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా కూడా స్మృతి గుర్తింపు పొందింది.331 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. శ్రీలంక జట్టు (302 దక్షిణాఫ్రికాపై 2024లో) పేరిట ఉన్న రికార్డును ఆస్ట్రేలియా అధిగమించింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) పెరీ (బి) సదర్లాండ్ 75; స్మృతి (సి) లిచ్ఫీల్డ్ (బి) మోలినే 80; హర్లీన్ (సి) సదర్లాండ్ (బి) మోలినే 38; హర్మన్ప్రీత్ (సి) మోలినే (బి) షుట్ 22; జెమీమా (సి) మూనీ (బి) సదర్లాండ్ 33; రిచా (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 32; అమన్జోత్ (సి) మోలినే (బి) గార్డ్నర్ 16; దీప్తి (సి) మూనీ (బి) మోలినే 1; స్నేహ్ (నాటౌట్) 8; క్రాంతి (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 1; శ్రీచరణి (బి) సదర్లాండ్ 0; ఎక్స్ట్రాలు 24; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 330. వికెట్ల పతనం: 1–155, 2–192, 3–234, 4–240, 5–294, 6–309, 7–320, 8–327, 9–330, 10–330. బౌలింగ్: గార్త్ 5–0–35–0, షుట్ 6.1–0–37–1, యాష్లే గార్డ్నర్ 7–0–40–1, మోలినే 10–1–75–3, సదర్లాండ్ 9.5–0–40–5, తాలియా మెక్గ్రాత్ 4.5–0–43–0, అలానా కింగ్ 6–0–49–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 142; లిచ్ఫీల్డ్ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 40; ఎలీస్ పెరీ (నాటౌట్) 47; మూనీ (సి) రోడ్రిగ్స్ (బి) దీప్తి 4; సదర్లాండ్ (బి) శ్రీచరణి 0; యాష్లే గార్డ్నర్ (బి) అమన్జోత్ 45; తాలియా మెక్గ్రాత్ (ఎల్బీ) (బి) దీప్తి 12; మోలినే (ఎల్బీ) (బి) అమన్జోత్ 18; కిమ్ గార్త్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో 7 వికెట్లకు) 331. వికెట్ల పతనం: 1–85, 2–168, 3–170, 4–265, 5–279, 6–299, 7–303. బౌలింగ్: అమన్జోత్ 9–0–68–2, క్రాంతి 9–1–73–0, స్నేహ్ రాణా 10–0–85–0, శ్రీచరణి 10–1–41–3, దీప్తి 10–0–52–2, హర్మన్ప్రీత్ 1–0–10–0. -
IND VS AUS: టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్లో (India vs Australia) భారత్పై ఆస్ట్రేలియా మహిళలు 3 వికెట్ల తేడాతో గెలిచారు. నిర్ణీత 49 ఓవర్లలో 331 పరుగులు చేసి టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్కు వరుసగా ఇది రెండవ ఓటమి.తొలుత టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది. 96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో అలీస్సా హీలీ: 142 పరుగులు (107 బంతుల్లో) చేసి తన అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్ను గెలిపించింది దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది.ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, అయితే చివరి ఓవర్లలో ఆసీస్ విజయం సాధించింది. భారత్ మంచి స్కోరు చేసినా, హీలీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ను ఆసీస్ చేతుల్లోకి తీసుకెళ్లింది. -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. ఆసియాలో తొలి బ్యాటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) ఓ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో (WTC) 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆసియా బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 12) మొదలైన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్లో 23 పరుగులు చేసి ఔటైన బాబర్.. 2 పరుగుల వద్ద 3000 పరుగుల మైలురాయిని తాకాడు. గత మూడేళ్లుగా విఫలమవుతున్నా బాబర్ ఈ ఘనత సాధించడం విశేషం. బాబర్ కంటే అన్ని విభాగాల్లో బలమైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కూడా డబ్ల్యూటీసీలో 3000 పరుగుల మైలురాయిని తాకలేకపోయారు.ఆసియాలో అత్యధిక డబ్ల్యూటీసీ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాబర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాబర్కు అతి సమీపంగా టీమిండియా ఆటగాళ్లు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఉన్నారు. కోహ్లి, రోహిత్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి, బాబర్ను ఈ విభాగంలో అధిగమించే అవకాశం వారికి లేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2019లో పరిచయమైన విషయం తెలిసిందే.డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-6 ఆసియా బ్యాటర్లుబాబర్ ఆజమ్- 3021శుభ్మన్ గిల్- 2826రిషబ్ పంత్- 2731రోహిత్ శర్మ- 2716కరుణరత్నే- 2642విరాట్ కోహ్లి- 2617డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-8 బ్యాటర్లుజో రూట్- 6080స్టీవ్ స్మిత్- 4278మార్నస్ లబూషేన్- 4225బెన్ స్టోక్స్- 3616ట్రవిస్ హెడ్- 3300ఉస్మాన్ ఖ్వాజా- 3288జాక్ క్రాలే- 3041బాబర్ ఆజమ్- 3021పాకిస్తాన్-సౌతాఫ్రికా మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. లాహోర్లోని గడాఫీ స్టేడియం ఈ మ్యాచ్ ఇవాళ ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.పాక్ ఇన్నింగ్స్లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్లో ఉన్నారు.మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
జైస్వాల్తో ఓవరాక్షన్.. విండీస్ ప్లేయర్కు భారీ షాక్
న్యూఢిల్లీ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పట్ల దురుసుగా ప్రవర్తించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్కు (jayden Seales) ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 29వ ఓవర్లో సీల్స్ ఓవరాక్షన్ చేశాడు. ఫాలో త్రూ చేసే క్రమంలో బంతిని జైస్వాల్పైకి ప్రమాదకరంగా విసిరాడు. బంతి జైస్వాల్ ప్యాడ్స్పై బలంగా తాకింది. దీన్ని సీరియస్గా పరిగణించిన ఐసీసీ సీల్స్కు ఓ డీమెరిట్ పాయింట్ అలాట్ చేయడంతో పాటు అతని మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.9 నిబంధన ప్రకారం ఓ ఆటగాడు బంతిని లేదా ఏదైన క్రికెట్ సమాగ్రిని ఇతర ఆటగాళ్లపైకి కానీ వారి సమీపంలోకి కాని విసరకూడదు. ఇలా చేస్తే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుంది.సీల్స్ విషయంలోనూ ఇదే జరిగింది. పైగా సీల్స్ తాను చేసిన పనిని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని జైస్వాల్ పైకి విసరలేదని రిఫరీ పైక్రాఫ్ట్కు వివరించాడు. రనౌట్ చేసే ప్రయత్నంలో అలా జరిగిందని అన్నాడు. సీల్స్ వాదనను సైతం పరిగణలోకి తీసుకున్న ఐసీసీ పలుమార్లు సదరు సన్నివేశాన్ని పరిశీలించి, సీల్స్దే తప్పిదమని పేర్కొంది. జైస్వాల్ అప్పటికే క్రీజ్లో ఉన్నా సీల్స్ అనవసరంగా బంతిని విసిరాడని నిర్దారించింది. అందుకే అతనికి ఓ డీమెరిట్ పాయింట్తో పాటు మ్యాచ్ ఫీజ్లో కోత విధించింది. 24 వ్యవధిలో సీల్స్కు ఇది రెండో డీమెరిట్ పాయింట్. ఈ మధ్యలో అతను మరో తప్పు చేస్తే నిషేధానికి గురయ్యే ప్రమాదముంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా పోరాడుతోంది. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్బెల్ (87), షాయ్ హోప్ (66) అసమానమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5) చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
IND VS AUS: చెలరేగిన మంధన.. టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో (India vs Australia) టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది.96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది. వీరిద్దరు ఔటయ్యాక స్కోర్ కాస్త నెమ్మదించింది. హర్లీన్ డియోల్ (38), కెప్టెన్ హర్మన్ప్రీత్ (22), జెమీమా రోడ్రిగెజ్ (33), రిచా ఘోష్ (32), అమన్జోత్ కౌర్ (16) అడపాదడపా మెరుపులు మెరిపించారు. టెయిలెండర్లు దారుణంగా విఫలమయ్యారు. వీరు కూడా తలో చేయి వేసి ఉంటే టీమిండియా ఇంకాస్త భారీ స్కోర్ చేసుండేది. 21 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 5 వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ తలా ఒకటి, శ్రీ చరణి డకౌటయ్యారు. స్నేహ్ రాణా 8 పరుగులతో అజేయంగా నిలిచింది.ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్ల్యాండ్ 5 వికెట్లతో సత్తా చాటగా.. సోఫీ మోలినెక్స్ 3, మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో మంధన పలు రికార్డులు నెలకొల్పింది. 18 పరుగుల స్కోర్ వద్ద ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆమె.. వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది.అలాగే అర్ద సెంచరీ తర్వాత వన్డేల్లో 5000 పూర్తి చేసుకున్న మంధన.. బంతులు, ఇన్నింగ్స్ల పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్లు, 5569 బంతులు అవసరమయ్యాయి. ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29 ఏళ్లు) సొంతం చేసుకున్న ప్లేయర్గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.చదవండి: భారత్తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం -
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. రాణించిన పాక్ బ్యాటర్లు
రెండు టెస్ట్లు, మూడు టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 12) తొలి టెస్ట్ మొదలైంది. లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో (Pakistan vs South Africa) పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు పాక్ బ్యాటర్లు తలో చేయి వేయడంతో పాక్ మంచి స్కోర్ సాధించింది. ఆట ముగిసే సమయానికి పాక్ 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్లో ఉన్నారు.పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
భారత్తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో (India vs West Indies) పర్యాటక వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. ఒటమి ఖరారు చేసుకొనే, రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఊహించిన విధంగానే 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్యాంప్బెల్ 87, హోప్ 66 పరుగులతో అజేయంగా ఉన్నారు. వీరిద్దరు మూడో వికెట్కు అజేయమైన 138 పరుగులు జోడించారు. విండీస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్నరైన్ చంద్రపాల్ను (10) సిరాజ్.. అలిక్ అథనాజ్ను (7) వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశారు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే పతనమైంది. 41 పరుగులు చేసిన అథనాజ్ టాప్ స్కోరర్ కాగా.. చంద్రపాల్ (34), జాన్ క్యాంప్బెల్ (10), షాయ్ హోప్ (36), టెవిన్ ఇమ్లాచ్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17), ఖారీ పియెర్ (23), ఆండర్సన్ ఫిలిప్ (24 నాటౌట్), జేడన్ సీల్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజాతో పాటు సిరాజ్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
IND VS AUS: అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది.తొలుత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఆతర్వాత కొద్ది నిమిషాలకే వన్డేల్లో 5000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకుంది. 1000 పరుగుల మార్కును సిక్సర్తో తాకిన మంధన.. 5000 పరుగుల మైలురాయిని కూడా సిక్సర్తోనే అందుకుంది.బంతులు, ఇన్నింగ్స్ల పరంగా మంధన ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్లు, 5569 బంతులు అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డులు స్టెఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్లు), సూజీ బేట్స్ (6182 బంతులు) పేరిట ఉండేవి.ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29) సొంతం చేసుకున్న ప్లేయర్గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.ఈ మ్యాచ్లో మంధన 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటైంది. ప్రస్తుత ప్రపంచకప్లో మంధనకు ఇదే తొలి అర్ద సెంచరీ (4 మ్యాచ్ల్లో).వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/1గా ఉంది. మంధన ఔట్ కాగా.. ప్రతిక రావల్ (68), హర్లీన్ డియోల్ (12) క్రీజ్లో ఉన్నారు. మంధన వికెట్ సోఫీ మోలినెక్స్కు దక్కింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్కప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్తో చేరుకోవడం మరో విశేషం.వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/0గా ఉంది. ఓపెనర్లు మంధన 49, ప్రతిక రావల్ 40 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.మంధన@18మంధన ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మార్కును 18 పరుగుల వద్ద చేరుకుంది. 1000 పరుగుల మార్కును ఆమె 18వ ఇన్నింగ్స్లో చేరుకుంది. మంధన జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్లోనూ భారత్కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్లో ఆసీస్ పాక్పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్లో ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
CWC 2025: ఆస్ట్రేలియాతో సమరం.. టీమిండియా బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 12) ఆసక్తికర సమరం జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు వైజాగ్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు (Team India) వన్డేల్లో టాస్ కోల్పోవడం ఇది వరుసగా ఆరోసారి. తుది జట్లు..ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్/వికెట్కీపర్), ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణికాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్లోనూ భారత్కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్లో ఆసీస్ పాక్పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో తొలి జట్టు
సౌతాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు (South Africa) సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 147 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జట్టు నాలుగు వరుస మ్యాచ్ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చలేదు.సౌతాఫ్రికా కెప్టెన్ల మార్పు యాదృచ్చికంగా జరిగింది. 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జింబాబ్వేతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమాకు (Temba Bavuma) విశ్రాంతి కల్పించారు. ఆ సిరీస్కు కేవశ్ మహారాజ్ (Keshav Maharaj) కెప్టెన్గా ఎంపిక కాగా.. తొలి టెస్ట్లో అతను గాయపడ్డాడు. దీంతో రెండో టెస్ట్కు దూరమయ్యాడు. మహారాజ్ స్థానంలో రెండో టెస్ట్లో కెప్టెన్గా వియాన్ ముల్దర్ (Wiaan Mulder) వ్యవహరించాడు.తాజాగా పాకిస్తాన్ పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. ఈ సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ బవుమా అందుబాటులోకి రావాల్సింది. అయితే ఇంగ్లండ్తో ఇటీవల జరిగిన వైట్ బాల్ సిరీస్ సందర్భంగా బవుమా గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో ఎయిడెన్ మార్క్రమ్కు (Aiden Markram) పాకిస్తాన్ సిరీస్కు కెప్టెన్గా ఎంపిక చేశారు.పాక్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఇవాళే (అక్టోబర్ 12) ప్రారంభమైంది. లాహోర్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో మార్క్రమ్ కెప్టెన్గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.53 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 2 వికెట్ల నష్టానికి 188 పరుగులుగా ఉంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), కెప్టెన్ షాన్ మసూద్ (76) ఔట్ కాగా.. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (86), బాబర్ ఆజమ్ (21) క్రీజ్లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ప్రెనెలన్ సుబ్రాయన్, కగిసో రబాడకు తలో వికెట్ దక్కింది.చదవండి: IND vs WI: కుల్దీప్ మాయాజాలం.. 248 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ -
స్టార్ ప్లేయర్కు గాయం.. వీల్ చైర్పై గ్రౌండ్ బయటకు! వీడియో వైరల్
బంగ్లాదేశ్తో మూడో వన్డేకు అఫ్గానిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రహమత్ షా కాలి పిక్క కండరాల గాయం కారణంగా సిరీస్లోని ఆఖరి వన్డేకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. శనివారం అబుదాబి వేదికగా జరిగిన రెండో వన్డేలో రహమత్ షా కాలి పిక్క కండరాలు పట్టేశాయి.ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోయింది. దీంతో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రిటైర్ట్ హార్ట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత చివరి వికెట్ పడిన తర్వాత జట్టుకు తన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో రహమత్ నొప్పిని భరిస్తూనే తిరిగి బ్యాటింగ్కు వచ్చాడు.కానీ కేవలం ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న రహమత్.. క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో అఫ్గాన్ జట్టు ఫిజియో నిర్మలన్ థనబలసింగం వెంటనే మైదానంలోకి పరుగెత్తి వచ్చి మళ్లీ చికిత్స అందించాడు. కానీ నొప్పి ఎక్కువగా ఉండడంతో రహ్మత్ను వీల్చెయర్లో మైదానం బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధిచిన వీడియోను అఫ్గాన్ క్రికెట్ ఎక్స్లో షేర్ చేసింది. కాగా అతడి గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది"దురదృష్టవశాత్తు రహమత్ గాయపడ్డాడు. అతడిని రేపు(ఆదివారం) స్కానింగ్ తీసుకువెళ్తాము. రిపోర్ట్స్ బట్టి అప్డేట్ ఇస్తాము. ఏదేమైనప్పటికి అతడు కొంతకాలం ఆటకు దూరంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను"అని థనబలసింగం మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.అతడు ఈ నెలలో జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఇది అఫ్గాన్ గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ప్రస్తుతం అఫ్గాన్ జట్టులో రహమత్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే రహ్మత్ షా 4,000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి అఫ్గాన్ బ్యాటర్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్పై 81 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే అఫ్గాన్ సొంతం చేసుకుంది.చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారిPure dedication from @RahmatShah_08, who put his body on the line for his country, walking out to bat when he could barely walk. 👏👏#AfghanAtalan | #AFGvBAN2025 | #GloriousNationVictoriousTeam pic.twitter.com/BYdM8akhzz— Afghanistan Cricket Board (@ACBofficials) October 11, 2025 -
కుల్దీప్ మాయాజాలం.. 248 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్
వెస్టిండీస్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 248 పరుగులకే కుప్పకూలింది.కనీసం ఫాల్ ఆన్ కూడా కరేబియన్ జట్టు దాటలేకపోయింది. 140/4 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఛేజ్ సేన అదనంగా 108 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు. అతడి బౌలింగ్ను ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. మూడో రోజు ఆట ఆరంభం నుంచే యాదవ్ బంతితో మాయ చేశాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా మూడు, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలా వికెట్ సాధించారు. భారత్కు తొలి ఇన్నింగ్స్లో 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మరోసారి విండీస్ బ్యాటింగ్కు దిగనుంది. ఇన్నింగ్స్ తేడాతో భారత్ గెలిచేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కనీసం రెండో ఇన్నింగ్స్లోనైనా టీమిండియాకు విండీస్ పోటీ ఇస్తుందో లేదో ఎదురు చూడాలి.అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 518 పరుగుల భారీస్కోరు వద్ద క్లేర్ చేసింది. యశస్వి జైశ్వాల్ (177), శుభ్మన్ గిల్(129) భారీ శతకాలతో కదం తొక్కగా..నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు), సాయిసుదర్శన్(87) రాణించారు.చదవండి: మా బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్: బ్రియన్ లారా -
మా బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్: బ్రియన్ లారా
ఢిల్లీ అరుణ్ జేట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఓ దశలో సులువుగా డబుల్ సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన జైశ్వాల్.. అనుహ్యంగా 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యి పెవిలియన్కు చేరాడు.ఈ మ్యాచ్లో విండీస్ బౌలర్లను జైశూ ఉతికారేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 22 ఫోర్లు ఉన్నాయి. కాగా ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ను వీక్షించిన వెస్టిండీస్ దిగ్గజాలు బ్రియన్ లారా, సర్ వివ్ రిచర్డ్స్ జైశ్వాల్ బ్యాటింగ్కు పిధా అయిపోయారు. రెండో రోజు ఆట అనంతరం జైశ్వాల్ను లారా కలిశాడు.ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. లారా జైస్వాల్ను అభినందిస్తూ.. "బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్ ష అంటూ సరదాగా అన్నాడు. దానికి జైస్వాల్ నవ్వుతూ "ట్రై చేస్తున్నా సర్!" అని సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది.కష్టాల్లో విండీస్..కాగా ఈ మ్యాచ్లో కూడా విండీస్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బౌలర్లు తేలిపోగా.. ఇప్పుడు బ్యాటర్లు కూడా తీవ్ర నిరాశపరిచారు. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విండీస్ ఫాల్ ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 102 పరుగులు చేయాలి.Team's interests above all 🙌Two special partnerships 🤝High praise from Brian Lara 👏Yashasvi Jaiswal recounts a magnificent innings in Delhi and shares insights on his approach ✨ - By @Moulinparikh #TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19— BCCI (@BCCI) October 12, 2025చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి -
వెస్టిండీస్తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా గుడ్ న్యూస్ అందింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) వైద్య బృందం అప్డేట్ ఇచ్చింది. అతడి గాయం అంత తీవ్రమైనది కాదని మెడికల్ టీమ్ వెల్లడించింది.సుదర్శన్ ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మూడో రోజు ఆటకు కూడా ఈ తమిళనాడు బ్యాటర్ దూరంగా ఉండనున్నాడు. రెండో రోజు ఆట సందర్భంగా సుదర్శన్ గాయపడిన సంగతి తెలిసిందే.అసలేమి జరిగిందంటే?రవీంద్ర జడేజా బౌలింగ్లో ఔట్సైడ్ ఆఫ్ దిశగా పడిని విండీస్ ఓపెనర్ క్యాంప్బెల్ బలంగా స్వీప్ చేశాడు. ఈ క్రమంలో షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్ బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆ బంతి నేరుగా అతని చేతుల్లోకి వెళ్లడం , ఆ వేగంలో కూడా సుదర్శన్ విడిచిపెట్టుకుండా అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు.ఈ క్యాచ్ను అందుకునే క్రమంలో బంతి అతడి చిటికెన వేలు తాకింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడి స్దానంలో సబ్స్ట్యూట్గా దేవదత్త్ పడిక్కల్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే బ్యాటింగ్కు సుదర్శన్ వస్తాడో రాడో ఇంకా క్లారిటీ లేదు.అయితే వెస్టిండీస్ మాత్రం తమ తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్కు చేరువైంది. 209 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే విండీస్ ఫాలో ఆన్ గండం తప్పించుకునేటట్లు కన్పించడం లేదు. విండీస్ ఫాల్ ఆన్కు ఇంకా 105 పరుగుల వెనుకంజలో ఉంది.చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి -
‘కంగారు’ పడతారా? పెట్టిస్తారా
విశాఖ స్పోర్ట్స్: ఐసీసీ వుమెన్ వరల్డ్ కప్లో అత్యంత రసవత్తరమైన పోరుకు విశాఖ వైఎస్సార్ స్టేడియం సిద్ధమైంది. వరుసగా మూడుసార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో గత రన్నరప్ భారత్ ఆదివారం డే–నైట్ మ్యాచ్లో ఢీకొట్టనుంది. ఈ పోరు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఐదు పాయింట్లతో ఆ్రస్టేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గత మ్యాచ్లో ఓటమిపాలైన భారత జట్టు, ఈ మ్యాచ్లో విజయం సాధించి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. జట్టు కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఆటగాళ్లు శనివారం ప్రాక్టీస్లో శ్రమించారు. మంధాన రికార్డుపై దృష్టి భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్లో మరో 58 పరుగులు చేయగలిగితే.. వన్డేల్లో 5,000 పరుగుల మార్కును చేరుకోనుంది. టాస్ గెలిస్తే బౌలింగ్కు అనుకూలం విశాఖలో వర్షాల కారణంగా పిచ్ కొద్దిగా తడిగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గుచూపే అవకాశం ఉంది. మిథాలీరాజ్ స్టాండ్, కల్పన ఎంట్రీల ప్రారంభం భారత మాజీ కెపె్టన్ మిథాలీరాజ్ పేరిట ఒక స్టాండ్ను, ఆంధ్ర మహిళా క్రికెటర్ కల్పన పేరిట ఒక ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ స్టాండ్, ప్రవేశద్వారాలను ప్రారంభించనున్నారు. -
వెంకటేశ్కు కీలక పదవి.. ఆంధ్ర అండర్–23 జట్టు మేనేజర్గా ఎంపిక
ఆంధ్ర అండర్–23 పురుషుల క్రికెట్ జట్టుకు వై.వెంకటేశ్ మేనేజర్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్లకు మీడియా మేనేజర్గా కొనసాగుతున్న వెంకటేశ్... ఈ సీజన్లో అండర్–23 జట్టుతో కలిసి పనిచేయనున్నాడు.భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్లకు అతడు ఆంధ్ర జట్టు మేనేజర్గా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రతినిధులు శనివారం వెంకటేశ్ను అభినందించారు. కొత్త పాత్రలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.చదవండి: BAN vs AFG: ఐదేసిన రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన అఫ్గాన్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి
వెస్టిండీస్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా జోరు కొనసాగుతోంది. రెండో రోజు ఆటలోనూ పర్యాటక జట్టుపై భారత్ ఆధిపత్యం చెలాయించింది. 318/2 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న యశస్వి జైశ్వాల్ అనుహ్యంగా రనౌటై తన వికెట్ను కోల్పోయాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, ధ్రువ్ జురెల్ కెప్టెన్ గిల్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్ 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. యశస్వి జైశ్వాల్ (177), శుభ్మన్ గిల్(129) భారీ శతకాలతో కదం తొక్కగా..నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు), సాయిసుదర్శన్(87) రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.భారత్ సరికొత్త రికార్డు..అయితే తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో విశ్వరూపం ప్రదర్శించిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. గత 65 ఏళ్లలో వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్లో తొలి ఐదు వికెట్లకు వరుసగా 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. టాప్-5 బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్ వరుసగా ఐదు వికెట్లకు ఏభైకి పైగా పార్ట్నర్షిప్స్ నెలకొల్పారు. తొలి వికెట్కు రాహుల్-జైస్వాల్ 58, రెండో వికెట్కు జైస్వాల్-సాయి సుదర్శన్ 193, మూడో వికెట్కు జైస్వాల్-శుభ్మన్ గిల్ 69, నాలుగో వికెట్కు శుభ్మన్ గిల్-నితీష్ కుమార్ రెడ్డి 91, ఐదో వికెట్కు శుభ్మన్ గిల్-ధ్రువ్ జురెల్ 102 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు.అప్పుడు ఆసీస్.. ఇప్పుడు భారత్1960లో గబ్బా వేదికగా వెస్టిండీస్తో జరిగిన అరుదైన టై టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఐదు వికెట్లకు ఏభైకి పైగా పార్ట్నర్షిప్స్ను నెలకొల్పింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు భారత్ ఈ ఫీట్ సాధించింది.మూడో సారి..టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ ఈ ఘనతను సాధించడం ఇది మూడోసారి. 1993లో ముంబైలో ఇంగ్లండ్, 2023లో అహ్మదాబాద్ వేదికగా ఆసీస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్ ఈ ఫీట్ సాధించింది. కానీ విండీస్పై మాత్రం ఇదే తొలిసారి.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా -
ఏయ్.. ఏమి చేస్తున్నావు! సీరియస్ అయిన రోహిత్ శర్మ(వీడియో)
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సిద్దమవుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్ ప్రస్తుతం ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్క్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడు భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది.హిట్మ్యాన్ శివాజీ పార్క్లో ప్రాక్టీస్ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓ అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. శివాజీ పార్క్ వచ్చిన ఓ చిన్నారి అభిమాని రోహిత్ను కలిసేందుకు ప్రయత్నించాడు.రోహిత్ వద్దకు వెళ్లే క్రమంలో ఆ యంగ్ ఫ్యాన్తో సెక్యూరిటీ సిబ్బంది కాస్త దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని గమనించిన రోహిత్ సెక్యూరిటీపై సీరియస్ అయ్యాడు. వారిపై గట్టి అరుస్తూ అతన్ని తనవద్దకు పంపించాలని సూచించాడు. దీంతో హిట్మ్యాన్ వద్దకు వెళ్లిన ఆ యువ అభిమాని సెల్పీ తీసుకుని ఖుషీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రోహిత్ శర్మ మనసు బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలే భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి రోహిత్ను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను వన్డే సారథిగా, అతడికి డిప్యూటీగా శ్రేయస్ అయ్యర్ను సెలక్టర్లు నియమించారు.గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగిన తర్వాత భారత్ తరపున రోహిత్కు ఇదే తొలిమ్యాచ్. ఆసీస్ టూర్ కోసం రోహిత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ మాజీ కెప్టెన్ గతంతో పోలిస్తే చాలా ఫిట్గా కన్పిస్తున్నాడు.చదవండి: టీమిండియాపై ఓవరాక్షన్.. కట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన ఐసీసీpic.twitter.com/dx0Bn2dp6D— Ro³ (@45__rohan) October 10, 2025 -
టీమిండియాపై ఓవరాక్షన్.. కట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన ఐసీసీ
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గురువారం భారత్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న చోట నాడిన్ డి క్లెర్క్ అద్బుతం చేసింది. కేవలం 54 బంతుల్లోనే 84 పరుగులు చేసి ప్రోటీస్కు మరుపురాని విజయాన్ని అందించింది.అయితే గెలుపు జోష్లో ఉన్న సౌతాఫ్రికా స్టార్ బౌలర్ నోన్కులులెకో మ్లాబాకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. తమ ప్రవర్తన నియమావళిని ఉల్లఘించినందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది.ఆమె మ్యాచ్ ఫీజులో ఎటువంటి కోత విధించనప్పటికి.. ఓ డిమెరిట్ పాయింట్ మాత్రం ఆమె ఖాతాలో చేరింది. 24 నెలల్లో ఇది ఆమెకు మొదటి డీమెరిట్ పాయింట్ కాబట్టి సౌతాఫ్రికా మెనెజ్మెంట్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అసలేమి జరిగిందంటే?ఈ మ్యాచ్లో మ్లాబా తన స్పిన్ మ్యాజిక్తో భారత టాపార్డర్ను దెబ్బతీసింది. స్మృతి మంధాన, హర్లీన్ డియోల్ను వెంటవెంటనే పెవిలియన్కు పంపింది. అయితే 17వ ఓవర్లో హర్లీన్ డియోల్ను ఔట్ చేసిన తర్వాత మ్లాబా ఆమె వైపు చూస్తూ “గుడ్బై” అంటూ తన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసింది.ఆమె మరీ అంత దూకుడుగా వ్యవహరించికపోయినప్పటికి.. ఐసీసీ మాత్రం ఆమె ప్రవర్తను కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆమెను ఐసీసీ మందలించింది. ఈ మెగా టోర్నీలో మ్లాబా ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి 6 వికెట్లు పడగొట్టింది.చదవండి: BAN vs AFG: ఐదేసిన రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన అఫ్గాన్ -
ఐదేసిన రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన అఫ్గాన్
బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ వైటావాష్కు అఫ్గానిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. శనివారం అబుదాబి వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ను 81 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే అఫ్గాన్ సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టు 44.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(140 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 95) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు నబీ(22), ఘజన్ఫర్(22) పర్వాలేదన్పించారు.మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచారు. బంగ్లా బౌలర్లలో కెప్టెన్ మెహది హసన్ మిరాజ్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. టాంజిమ్ హసన్ షకీబ్, రిషాద్ హోస్సేన్ తలా రెండు వికెట్లు సాధించారు.రషీద్ మయాజాలం..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. స్పిన్నర్ రషీద్ ఖాన్ ధాటికి విల్లవిల్లాడింది. బంగ్లాదేశ్ 28.3 ఓవర్లలో కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. 8.3 ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.అతడితో ఒమర్జాయ్ మూడు, ఖరోటీ ఒక్క వికెట్ సాధించారు. బ్యాటింగ్లో సంచలన ప్రదర్శన కనబరిచిన జద్రాన్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే అక్టోబర్ 14న అబుదాబి వేదికగా జరగనుంది.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా -
బెంగళూరు బుల్స్ జోరు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో ప్లేఆఫ్స్ రేసులో పడేందుకు బెంగళూరు బుల్స్ జోరు పెంచుతోంది. ఈ సీజన్లో ఏడో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో టాప్–5లో నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆల్రౌండ్ ప్రదర్శనతో జైపూర్ పింక్పాంథర్స్పై ఘనవిజయం సాధించింది. బుల్స్ 47–26తో రెండుసార్లు చాంపియన్ అయిన జైపూర్ను చిత్తు చేసింది. బెంగళూరు ఆల్రౌండర్ అలీరెజా మిర్జాయిన్ ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. 22 సార్లు కూతకెళ్లిన అతను 12 పాయింట్లను తెచ్చిపెట్టాడు. కెప్టెన్, డిఫెండర్ యోగేశ్ (8) జైపూర్ రెయిడర్లను వణికించాడు. రెయిడర్లను 8 సార్లు విజయవంతంగా టాకిల్ చేశాడు. అతనితో పాటు డిఫెన్స్లో దీపక్ శంకర్ (5), సంజయ్ (3) రాణించారు. రెయిడర్లలో ఆశిష్ మాలిక్ (5), ఆకాశ్ షిండే (4)లు అదరగొట్టారు. పింక్పాంథర్స్ జట్టులో రెయిడర్లు అలీ సమది (9), వినయ్ (6) ఆకట్టుకున్నారు. కానీ సహచరుల నుంచి మద్దతు లేకపోవడంతో టాకిల్లో పదేపదే వెనుకబడింది. ఈ సీజన్లో జైపూర్ జట్టుకు ఇది ఏడో పరాజయం!ప్లేఆఫ్స్ చేరిన పుణేరి పల్టన్మాజీ చాంపియన్ (2023) పుణేరి పల్టన్ 12వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్లో పుణేరి జట్టు 36–23తో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. రెయిడర్ పంకజ్ మోహితే (9), కెప్టెన్ అస్లామ్ ఇనామ్దార్ (7), ఆల్రౌండర్ గుర్దీప్ (5), డిఫెండర్ విశాల్ భరద్వాజ్ (4) క్రమం తప్పకుండా పాయింట్లు చేసి పుణేరి పల్టన్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తలైవాస్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ (6), అరుళ్ (4), నితీశ్ కుమార్ (3) రాణించారు. లీగ్లో 14 పోటీలాడిన పుణేరి 11 మ్యాచ్ల్లో గెలిచి కేవలం 3 మ్యాచ్ల్లోనే ఓడింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ జట్లు నేడు జరిగే తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. మరో పోరులో బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ పోటీపడుతుంది. -
నాట్ సీవర్ సెంచరీ
కొలంబో: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో నాట్ సీవర్ బ్రంట్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు 89 పరుగుల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించింది. బ్యాటింగ్లో విరోచిత శతకం సాధించిన కెప్టెన్ బ్రంట్ (117 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్లు), బౌలింగ్తో 2 వికెట్లు పడగొట్టింది. టాస్ నెగ్గిన లంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. టాపార్డర్లో అమీ జోన్స్ (11), బ్యూమోంట్ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు), హీథర్నైట్ (47 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. ఇలాంటి స్థితిలో నాట్ సీవర్ బ్రంట్ ఒంటరి పోరాటం చేసింది. సోఫియా డన్క్లే (18), ఎమ్మా లాంబ్ (13), చార్లీ డీన్ (19)లతో కలిసి జట్టు స్కోరును నడిపించింది. 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసింది. లంక బౌలర్లలో ఇనోక రణవీర 3 వికెట్లు పడగొట్టగా, ఉదేశిక ప్రబోధని, సుగంధిక కుమారి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ హాసిని పెరిర (60 బంతుల్లో 35; 3 ఫోర్లు), మిడిలార్డర్లో హర్షిత సమరవిక్రమ (37 బంతుల్లో 33; 5 ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడారు. మిగతా వాళ్లంతా ఇంగ్లండ్ బౌలింగ్కు తలొంచారు. నీలాక్షిక సిల్వా (23) మినహా ఇంకెవరూ రెండు పదుల స్కోరైనా చేయలేకపోయారు. సోఫి ఎకిల్స్టోన్ (10–3–17–4) తన మ్యాజిక్ స్పెల్తో లంకను కూల్చేసింది. నాట్ సీవర్, చార్లీ డీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఆడిన మూడు గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలువగా, ఇంకా బోణీ చేయలేకపోయిన శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. లంక మూడు మ్యాచ్ల్లోనూ ఓడింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: అమీ జోన్స్ రనౌట్ 11; బ్యూమోంట్ (సి)హర్షిత (బి) సుగంధిక 32; హీథర్నైట్ (సి) విహంగ (బి) ఇనొక 29; నాట్ సీవర్ (సి) నీలాక్షిక (బి) ప్రబోధని 117; సోఫియా (సి) అండ్ (బి) కవిశా 18; ఎమ్మా లాంబ్ (బి) ఇనొక 13; క్యాప్సీ (స్టంప్డ్) సంజీవని (బి) ఇనొక 0; చార్లీ డీన్ (సి) విహంగ (బి) ప్రబోధని 19; సోఫి ఎకిల్స్టోన్ (స్టంప్డ్) సంజీవని (బి) సగంధిక 3; లిన్సే స్మిత్ నాటౌట్ 5; లారెన్ బెల్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–24, 2–49, 3–109, 4–146, 5–168, 6–168, 7–206, 8–216, 9–252. బౌలింగ్: ప్రబోధని 9–0–55–2, సుగంధిక 10–0–66–2, చమరి 5–0–21–0, ఇనొక 10–1–33–3, విహంగ 8–0–42–0, కవిశా 8–0–34–1. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (సి) క్యాప్సీ (బి) సోఫి 35; చమరి (బి) సోఫి 15, విష్మీ (బి) చార్లీ డీన్ 10; హర్షిత (సి) బెల్ (బి) సోఫి 33; కవిశా (బి) సోఫి 4; నీలాక్షిక (సి)హీథర్నైట్ (బి) క్యాప్సీ 23; అనుష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) నాట్ సీవర్ 10; విహంగ (సి) చార్లీ డీన్ (బి) నాట్ సీవర్ 3; సుగంధిక (బి) చార్లీ డీన్ 4; ప్రబోధని (సి) నాట్ సీవర్ (బి) లిన్సే స్మిత్ 0; ఇనొక నాటౌట్ 3; ఎక్స్ట్రాలు 24; మొత్తం (45.4 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–37, 2–95, 3–98, 4–103, 5–116, 6–134, 7–145, 8–157, 9–157, 10–164. బౌలింగ్: లారెన్ బెల్ 8–1–32–0, లిన్సే స్మిత్ 8.4–1–22–1, నాట్ సీవర్ 5–0–25–2, చార్లీ డీన్ 9–1–47–2, అలైస్ క్యాప్సీ 5–1–15–1, సోఫి 10–3–17–4. -
పాకిస్తాన్ x దక్షిణాఫ్రికా
లాహోర్: ప్రధాన ప్లేయర్లు లేకుండానే దక్షిణాఫ్రికా జట్టు... పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా, స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ గాయాల కారణంగా ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సఫారీ జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహిస్తున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సర్కిల్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాకు ఇదే తొలి మ్యాచ్ కాగా... ఈ సారి కూడా మెరుగైన ఆరంభం దక్కించుకోవాలని చూస్తోంది. ఇరు జట్లు పేస్ బౌలింగ్కు పెట్టింది పేరు కాగా... ఇటీవలి కాలంలో పాకిస్తాన్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. గత డబ్ల్యూటీసీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలవగా... పాకిస్తాన్ జట్టు ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. మార్క్రమ్ సారథ్యంలోని సఫారీ జట్టు... వరుసగా 11 విజయాలు సాధించి ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండగా... గత 12 మ్యాచ్ల్లో పాకిస్తాన్ మూడింట మాత్రమే నెగ్గింది. మార్క్రమ్, రికెల్టన్, ముల్డర్, బ్రేవిస్, వెరినె, యాన్సన్తో సఫారీ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా... పాకిస్తాన్ జట్టు షాన్ మసూద్, బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్లను నమ్ముకుంది. పరిమిత ఓవర్లలో జట్టుకు దాదాపు దూరమైన బాబర్ ఆజమ్, రిజ్వాన్ సుదీర్ఘ ఫార్మాట్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది కీలకం. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు మొదట టెస్టులు, ఆతర్వాత టి20లు, అనంతరం వన్డేలు ఆడనుంది. -
యువ భారత్ శుభారంభం
జొహర్ బహ్రు (మలేసియా): భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు... సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్లో శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పోరులో రోహిత్ సారథ్యంలోని యువ భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో గ్రేట్ బ్రిటన్ను చిత్తుచేసింది. కెప్టెన్ రోహిత్ (45వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్తో విజృంభించగా... రణ్వీత్ సింగ్ (23వ నిమిషంలో) ఓ గోల్ సాధించాడు. గ్రేట్ బ్రిటన్ తరఫున మైఖేల్ రొయ్డెన్ (26వ నిమిషంలో), కాడెన్ డ్రాసే (46వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా... ఏ జట్టూ ఖాతా తెరవలేకపోయింది. మ్యాచ్ 13వ నిమిషంలో భారత జట్టుకు తొలి పెనాల్టీ కార్నర్ అవకాశం రాగా... దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 16వ నిమిషంలో వచ్చిన మరో అవకాశాన్ని కూడా గోల్గా మలచలేకపోయింది. రెండో క్వార్టర్ మధ్యలో గుర్జ్యోత్ సింగ్ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ బంతిని రణ్వీత్కు అందించగా... అతడు దాన్ని గోల్పోస్ట్లోకి పంపి భారత్కు మొదటి గోల్ అందించాడు. కాసేపటికే ఇంగ్లండ్ స్కోరు సమం చేయగా... మూడో క్వార్టర్లోనూ ఇరు జట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. 45వ నిమిషంలో బ్రిటన్ స్ట్రయికర్లు చేసిన ప్రయత్నాల్ని భారత గోల్కీపర్ ప్రిన్స్దీప్ సింగ్ సమర్థవంతంగా అడుకున్నాడు. అదే సమయంలో రోహిత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంతో భారత్ ఆధిక్యం రెట్టింపు కాగా... తర్వాతి నిమిషంలోనే పెనాల్టీ స్ట్రోక్ను వినియోగించుకున్న గ్రేట్ బ్రిటన్ స్కోరును మరోసారి సమం చేసింది. ఇక చివరి క్వార్టర్లో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కించుకున్న భారత్... మూడోదాన్ని గోల్గా మలచి విజయంతో మ్యాచ్ను ముగించింది. టోర్నీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. -
చాంపియన్ కాస్పరోవ్
సెయింట్ లూయిస్ (అమెరికా): భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ క్లచ్ చెస్ లెజెండ్స్ మ్యాచ్లో రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన పోరులో 62 ఏళ్ల కాస్పరోవ్ 13–11 పాయింట్ల తేడాతో ఆనంద్పై గెలుపొందాడు. అధికారికంగా ఆనంద్, కాస్పరోవ్ చివరిసారి 1995లో న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ 107వ అంతస్తులో క్లాసికల్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీపడ్డారు. కాస్పరోవ్ 10.5–7.5తో ఆనంద్పై గెలిచి ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ దక్కించుకున్నాడు. కాస్పరోవ్ 30 ఏళ్ల తర్వాత కూడా అదే ఆటతీరు చూపెట్టాడు. ఈ పోరులో మొత్తం 12 గేమ్లు నిర్వహించాల్సి ఉండగా... చివరి రెండు బ్లిట్జ్ గేమ్లకంటే ముందే కాస్పరోవ్ గెలిచాడు. విజేత కాస్పరోవ్కు 70 వేల డాలర్లు (రూ. 62 లక్షలు), రన్నరప్ ఆనంద్కు 50 వేల డాలర్లు (రూ. 44 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. ఈ పోరు నిబంధనల ప్రకారం తొలి రోజున గేమ్లో గెలిస్తే ఒక పాయింట్... ‘డ్రా’ చేసుకుంటే అర పాయింట్ కేటాయించారు. రెండో రోజు జరిగిన గేమ్లో గెలిస్తే 2 పాయింట్లు... ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ ఇచ్చారు. మూడో రోజు శనివారం గేమ్ గెలిచిన వారికి 3 పాయింట్లు కేటాయించారు. ‘ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పలేను... కానీ విజయం సాధిస్తానని ఊహించలేదు. చాలా మంది అభిమానులు ఈ మ్యాచ్ను ఫాలో అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఇది చాలా ప్రధాన్యత సంతరించుకుంది. రెండో గేమ్ అనంతరం రిలాక్స్ అయ్యాను. నా అంచనాలకు మించి రాణించాను’ అని కాస్పరోవ్ అన్నాడు. -
సెమీఫైనల్లో అన్మోల్ పరాజయం
వాంటా (ఫిన్లాండ్): భారత రైజింగ్ షట్లర్ అన్మోల్ ఖరబ్... అర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్లో పరాజయం పాలైంది. చక్కటి ఆటతీరుతో సెమీస్ వరకు చేరిన అన్మోల్... ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 62వ ర్యాంకర్ అన్మోల్ 10–21, 13–21తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్ యామగుచి చేతిలో ఓడింది. 29 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఫరీదాబాద్కు చెందిన 18 ఏళ్ల టీనేజ్ షట్లర్ అన్మోల్... యామగుచి ఎదుట నిలువలేకపోయింది. వరుస గేమ్ల్లో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. రెండు గేమ్ల్లోనూ అన్మోల్ కాస్త పోరాటం కనబర్చినా... జపాన్ స్టార్ అనుభవం ముందు అది సరిపోలేదు. తొలిసారి సూపర్–500 టోర్నమెంట్లో సెమీస్కు చేరిన అన్మోల్ అక్కడితోనే వెనుదిరిగింది. ఈ ప్రదర్శనతో అన్మోల్కు 18,050 డాలర్ల (సుమారు 16 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. -
భారత్కు కాస్త 'కంగారు'
మహిళల క్రికెట్లో భారత జట్టు స్థాయిని చూపించే మ్యాచ్కు నేడు విశాఖ వేదిక అవుతోంది. దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమి తర్వాత అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు భారత్ సై అంటోంది. ఇటీవల ఇదే జట్టుతో జరిగిన వన్డే సిరీస్ను కోల్పోయినా... పోరు హోరాహోరీగా సాగింది. అయితే వరల్డ్ కప్కు ముందు అసాధారణంగా కనిపించిన హర్మన్ సేన మెగా టోర్నీలో ఒక్కసారిగా ఫామ్ కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికే సఫారీల చేతిలో ఓడిన నేపథ్యంలో సెమీస్ రేసులో నిలవాలంటే పెద్ద జట్టుపై గెలుపు తప్పనిసరి. మరో వైపు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్ తమ ఎనిమిదో టైటిల్ వేటలో భారీ విజయాన్ని ఆశిస్తోంది. విశాఖపట్నం, సాక్షి క్రీడా ప్రతినిధి: వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు నేడు కీలక మ్యాచ్కు సన్నద్ధమైంది. వైజాగ్లోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నేడు జరిగే లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత మహిళల బృందం తలపడుతుంది. రెండు విజయాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవి చూడగా...రెండు మ్యాచ్లు గెలిచిన కంగారూలు శ్రీలంకతో మ్యాచ్ రద్దు కావడంతో కీలకమైన రెండు పాయింట్లు సాధించే అవకాశం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్కు ముందు ఒక స్టాండ్కు మిథాలీ రాజ్ పేరు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ముగ్గురు చెలరేగితేనే...వరల్డ్ కప్లో ఆడిన మూడు మ్యాచ్లలో స్మృతి చేసిన స్కోర్లు 8, 23, 23...హర్మన్ ప్రీత్ వరుసగా 21,19, 9 పరుగులు చేయగా...ఒక మ్యాచ్లో 32 పరుగులు చేసిన జెమీమా మరో రెండు సార్లు డకౌటైంది. మన జట్టులోని ముగ్గురు స్టార్ బ్యాటర్ల స్కోర్లను కలిపి చూస్తే 9 ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. వరల్డ్ కప్ టైటిల్పై భారీ ఆశలు పెట్టుకున్న భారత జట్టుకు ఈ స్థితి ఆందోళనకరంగా మారింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో పూర్తిగా తడబడ్డ హర్మన్ 9 పరుగుల కోసం 23 బంతులు ఆడగా, స్మృతి తొలి బౌండరీ కొట్టేందుకు 21 బంతులు తీసుకుంది. జెమీమా 3 సార్లూ లెఫ్టార్మ్ స్పిన్నర్ బౌలింగ్లోనే అవుట్ కావడం ఆమె బలహీనతను చూపిస్తోంది. ఈ ముగ్గురితో పాటు ప్రతీక, హర్లీన్ కూడా అంతంతమాత్రం ప్రదర్శనే చేశారు. ప్రతీసారి లోయర్ ఆర్డర్ జట్టును ఆదుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దక్షిణాఫ్రికాతో ఇన్నింగ్స్ రిచాలో ఆత్మవిశ్వాసం పెంచగా... దీప్తి, అమన్జోత్ కూడా కీలకం కానున్నారు. గత మ్యాచ్ చివర్లో డి క్లెర్క్ చెలరేగే వరకు మన బౌలర్లంతా చక్కటి బౌలింగ్ చేశారు. ఐదుగురు రెగ్యులర్ బౌలర్లతో పాటు హర్మన్ కూడా నాలుగు ఓవర్లు వేసింది. అందుకే ప్రత్యా మ్నాయంగా ఆరో బౌలర్ అవసరం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసిన ఆంధ్ర బౌలర్ శ్రీచరణి నిరూపించుకునేందుకు ఇది మరో మంచి అవకాశం.ఒకరిని మించి మరొకరు...ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్ అందుకు ఉదాహరణ. పాక్ బలహీన జట్టే అయినా 76 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా 200పైగా పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో చెలరేగి భారీ విజయం సాధించడం ఆసీస్కే చెల్లింది. కివీస్పై 326 పరుగులు చేసిన ఆ జట్టు...అంతకు ముందు భారత్పై చివరి వన్డేలో ఏకంగా 412 పరుగులు నమోదు చేసిన విషయం మరచిపోవద్దు. టోర్నీలో ఇప్పటికే మూనీ, గార్డ్నర్ శతకాలు నమోదు చేశారు. మిగతా ప్రధాన బ్యాటర్లు ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. హీలీ, పెరీ తమ స్థాయికి తగినట్లుగా చెలరేగితే భారత్కు కష్టాలు తప్పవు. సదర్లాండ్ రూపంలో చక్కటి ఆల్రౌండర్ జట్టులో ఉంది. పిచ్, వాతావరణంగత మ్యాచ్ తరహాలోనే బ్యాటింగ్కు అనుకూలం. మంచి బౌన్స్ కూడా ఉండటంతో షాట్లకు అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. ఆదివారం కూడా కావడంతో స్టేడియం పూర్తి సామర్థ్యం మేరకు నిండే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి, ప్రతీక, హర్లీన్, జెమీమా, దీప్తి, అమన్జోత్, రిచా ఘోష్, స్నేహ్, క్రాంతి, శ్రీచరణి.ఆస్ట్రేలియా: అలీసా హీలీ (కెప్టెన్), లిచ్ఫీల్డ్, ఎలైస్ పెరీ, మూనీ, సదర్లాండ్, గార్డ్నర్, తాహిలా, వేర్హామ్, గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్. -
'శుబ్' శతకం
అనుకున్నట్లే రెండో రోజూ భారత్ జోరు కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్తో కరీబియన్లను కష్టాల్లోకి నెట్టేసింది. మొదట కెప్టెన్ శుబ్మన్ గిల్ శతకంతో భారీ స్కోరులో భాగమయ్యాడు. 500 పైచిలుకు స్కోరు వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన భారత్... బౌలింగ్తోనూ అదరగొట్టింది. రెండో రోజే స్పిన్ తిరగడంతో భారత కెప్టెన్ గిల్... జడేజా, కుల్దీప్లతో అనుకున్న ఫలితాలు సాధించాడు.న్యూఢిల్లీ: ఈ రెండో టెస్టును కూడా ముందే ముగించేందుకు భారత్ సిద్ధమైంది. రెండో రోజు ఆటలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బ్యాటింగ్లో శుబ్మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్లు కరీబియన్ బౌలర్లపై సులువుగా పరుగులు రాబట్టారు. తర్వాత రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు స్పిన్ ఉచ్చును బిగించారు. తద్వారా క్లీన్స్వీప్నకు రాచబాట వేశారు. కెప్టెన్ గిల్ (196 బంతుల్లో 129 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అలిక్ అతనేజ్ (84 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) భారత బౌలర్లను ఎక్కువసేపు ఎదుర్కొన్నాడు. జడేజా 3 వికెట్లు తీశాడు. జైస్వాల్ రనౌట్డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం తన క్రితం రోజు స్కోరుకు 2 పరుగులే జతచేసి రనౌటయ్యాడు. దీంతో శనివారం 318/2 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటకొనసాగించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సారథి గిల్ పరుగుకు ఉపక్రమించి వెనకడుగు వేయడంతో జైస్వాల్ నిష్క్రమించాల్సి వచ్చింది. నిరాశకు లోనైన యశస్వి తలకొట్టుకొని అసహనంగా క్రీజు వీడాడు. తర్వాత గిల్కు జతయిన నితీశ్ వన్డే తరహా ఆటతీరుతో ధాటిగా పరుగులు సాధించాడు. శుబ్మన్ అర్ధసెంచరీని పూర్తిచేసుకోగా... జట్టు స్కోరు తొలిసెషన్లోనే 400 పరుగులు దాటింది. క్రీజులో పాతుకుపోయిన నితీశ్ను లంచ్ విరామానికి ముందు వారికెన్ అవుట్ చేశాడు. క్రీజులోకి ధ్రువ్ జురేల్ రాగా 427/4 స్కోరు వద్ద తొలిసెషన్ ముగిసింది. శతక్కొట్టిన సారథిరెండో సెషన్లో పూర్తిగా భారత బ్యాటర్ల జోరే కొనసాగింది. జురేల్ అండతో గిల్ టెస్టుల్లో పదో సెంచరీ సాధించాడు. అడపాదడపా బౌండరీతతో పరుగులు సాధించడంతో భారత్ స్కోరు సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో జట్టు స్కోరు 500 పరుగుల్ని దాటింది. ఐదో వికెట్కు 102 పరుగులు జోడించాక జురేల్ను చేజ్ అవుట్ చేయడంతోనే గిల్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆదిలోనే క్యాంప్బెల్ (10) వికెట్ను కోల్పోయినా... చాలాసేపు పోరాడింది. తేజ్ నారాయణ్ చందర్పాల్ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), అతనేజ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. జట్టు స్కోరు 87 వద్ద తేజ్ను జడేజా అవుట్ చేశాకే భారత్కు పట్టు దొరికింది. పరుగు తేడాతో అతనేజ్, చేజ్ (0) వికెట్లను స్పిన్నర్లు పడగొట్టేశారు. షై హోప్ (31 బ్యాటింగ్; 5 ఫోర్లు), ఇమ్లాచ్ (14 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది.స్కోరు వివరాలుభారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ రనౌట్ 175; రాహుల్ (స్టంప్డ్) ఇమ్లాచ్ (బి) వారికెన్ 38; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికెన్ 87; శుబ్మన్ (నాటౌట్) 129; నితీశ్ రెడ్డి (సి) సీల్స్ (బి) వారికెన్ 43; జురేల్ (బి) చేజ్ 44; ఎక్స్ట్రాలు 2; మొత్తం (134.2 ఓవర్లలో) 518/5 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–58, 2–251, 3–325, 4–416, 5–518. బౌలింగ్: సీల్స్ 22–2–88–0, ఫిలిప్ 17–2–71–0, గ్రీవెస్ 14–1–58–0, పియర్ 30–2–120–0, వారికెన్ 34–6–98–3, చేజ్ 17.2–0–83–1.వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్: క్యాంప్బెల్ (సి) సుదర్శన్ (బి) జడేజా 10; తేజ్ (సి) రాహుల్ (బి) జడేజా 34; అతనేజ్ (సి) జడేజా (బి) కుల్దీప్ 41; షై హోప్ (బ్యాటింగ్) 31; చేజ్ (సి) అండ్ (బి) జడేజా 0; ఇమ్లాచ్ (బ్యాటింగ్) 14; ఎక్స్ట్రాలు 10; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 140. వికెట్ల పతనం: 1–21, 2–87, 3–106, 4–107. బౌలింగ్: బుమ్రా 6–3–18–0, సిరాజ్ 4–0–9–0, జడేజా 14–3–37–3, కుల్దీప్ 12–3–45–1, సుందర్ 7–1–23–0. -
టీ20 క్రికెట్లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. పసికూన నమీబియా చేతిలో టీ20 వరల్డ్కప్-2024 రన్నరప్ సౌతాఫ్రికాకు ఘోర పరాభావం ఎదురైంది. శనివారం విండ్హోక్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో దక్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో నమీబియా ఓడించింది.నమీబియా విజయానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరమ్వగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జేన్ గ్రీన్(30 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాది నమీబియా మ్యాచ్ను మలుపు తిప్పిన గ్రీన్.. చివరి బంతికి ఫోర్ బాది మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 135 పరుగుల లక్ష్యాన్ని నమీబియా 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఏ ఫార్మాట్లోనైనా సౌతాఫ్రికాపై నమీబియాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.నమీబియా బ్యాటర్లలో గ్రీన్తో పాటు గెర్హార్డ్ ఎరాస్మస్(21), కుర్గర్(18),ట్రంపెల్మాన్(11) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్, సీమ్లైన్ తలా రెండు వికెట్లు సాధించగా.. ఫోర్టిన్, కోయిట్జీ చెరో వికెట్ సాధించారు.తేలిపోయిన ప్రోటీస్ బ్యాటర్లు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని తిరిగొచ్చిన క్వింటన్ డికాక్(1) తీవ్ర నిరాశపరిచాడు. అతడితో పాటు స్టార్ బ్యాటర్లు రీజా హెండ్రిక్స్(7), ఫెరీరా(4) విఫలమయ్యారు.సఫారీ బ్యాటర్లలో జే స్మిత్(31) టాప్ స్కోరర్గా నిలవగా.. హెర్మన్(23), ఫోర్టిన్(19) పర్వాలేదన్పించారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్ మూడు, మాక్స్ హీంగో రెండు, ఎరాస్మస్, షికాంగో, స్మిత్ తలా వికెట్ సాధించారు. నమీబియా ఇటీవలే టీ20 ప్రపంచకప్-2026కు ఆర్హత సాధించింది. కాగా ఓ అసోసియేట్ సభ్య దేశం చేతిలో సౌతాఫ్రికా టీ20 మ్యాచ్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.చదవండి: నాకైతే ఆడాలని ఉంది.. కానీ అది నా చేతుల్లో లేదు: జడేజా -
నాకైతే ఆడాలని ఉంది.. కానీ అది నా చేతుల్లో లేదు: జడేజా
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. జడ్డూ అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికి సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.గతేడాది టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2009 నుంచి భారత్ తరఫున వన్డే క్రికెట్ ఆడుతున్న జడేజా అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకోవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు.ప్రస్తుతం విండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ ఈ సౌరాష్ట్ర క్రికెటర్ అదరగొడుతున్నాడు. ఫిట్నెస్ పరంగా కూడా అతడు చాలా మెరుగ్గా ఉన్నాడు. ఆసీస్ సిరీస్కు ఎంపిక చేయకపోవడంతో వన్డే ప్రపంచ కప్-2027లో జడేజా ఆడుతాడో లేదో సందిగ్ధంగా మారింది. అయితే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ మాత్రం జడేజా తమ ప్రణాళిలకలలో ఉన్నాడని జట్టు ప్రకటన సందర్భంగా చెప్పుకొచ్చాడు. తాజాగా జడేజా కూడా ప్రపంచకప్లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు."వన్డే ప్రపంచ కప్-2027లో ఆడాలనుకుంటున్నాను. కానీ అది నా చేతుల్లో లేదు. సెలక్షన్ కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆసీస్ టూర్కు జట్టు ఎంపికకు ముందు సెలక్టర్లు, కెప్టెన్ నాతో మాట్లాడారు. వారి చెప్పిన కారణాలు నాకు అర్థమయ్యాయి. కానీ వన్డే ప్రపంచకప్ గెలవడం మా అందరి కల" అని జడేజా విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.చదవండి: అది నేను ఎప్పటికీ మర్చిపోలేను: గంభీర్ -
అది నేను ఎప్పటికీ మర్చిపోలేను: గంభీర్
గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్కోచ్గా వైట్ బాల్ క్రికెట్లో విజయవంతమైనప్పటికి.. సంప్రాదాయ ఫార్మాట్లో ఇంకా తన మార్క్ చూపించలేదు. టీ20 వరల్డ్కప్-2024 విజయం రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా బాధ్యతలు చేపట్టిన గంభీర్కు ఆరంభంలోనే ఘోర పరాభావం ఎదురైంది.సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ వైట్ వాష్కు గురైంది. 1933లో టీమిండియా స్వదేశంలో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడినప్పటి నుంచి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఉన్న సిరీస్లో వైట్ వాష్ అవ్వడం ఇదే తొలిసారి.ఈ ఘోర ఆ ప్రతిష్టను భారత జట్టు గంభీర్ కోచింగ్లో మూటకట్టుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ట్రోఫీలోనూ టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3-1 తేడాతో భారత్ కోల్పోయింది.దీంతో గంభీర్ను కోచ్ పదవి నుంచి తప్పించాలని చాలా మంది మాజీలు సూచించారు. అయితే ఆ తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సమం చేయడంతో గంభీర్ను విమర్శించే వాళ్ల సంఖ్య కాస్త తగ్గింది. ఇటీవలే ఆసియాకప్ను కూడా భారత్ సొంతం చేసుకుంది.ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో తలపడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన గిల్ సేన.. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ విజయం దిశగా సాగుతోంది. అయితే రెండో రోజు ఆట సందర్భంగా గౌతమ్ గంభీర్ అధికారిక బ్రాడ్క్రాస్టర్ స్టార్ స్పోర్ట్స్కు గౌతీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కివీస్ సిరీస్ వైట్వాష్ కావడంపై అతడు స్పందించాడు."న్యూజిలాండ్తో సిరీస్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఓటమిని మా బాయ్స్కు ఇప్పటికి గుర్తు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు గతాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఏ జట్టును కూడా తేలికగా తీసుకూడదని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. న్యూజిలాండ్ను ఈజీగా ఓడించగలమని అందరూ అనుకున్నారు.కానీ ఊహించని ఫలితం మాకు ఎదురైంది. నేను కోచ్గా ఉన్న లేకపోయినా న్యూజిలాండ్పై ఓటమిని డ్రెస్సింగ్ రూమ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ అనుభవం భవిష్యత్తులో జట్టుకు ఎంగతగానో ఉపయోగపడుతోంది" అని గంభీర్ పేర్కొన్నాడు. -
రెండో రోజు ముగిసిన ఆట.. జడేజా స్పిన్ మ్యాజిక్
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న సెకెండ్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ అటు బ్యాట్తో, ఇటు బంతితో అదరగొట్టింది. ఓవర్నైట్ స్కోరు 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది.భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ (177) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్(129) శతక్కొట్టాడు. వీరిద్దరితో పాటు ధ్రువ్ జురెల్ (44), నితీశ్ రెడ్డి (43), సాయిసుదర్శన్(87) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ 3 వికెట్లు తీయగా కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ పడగొట్టాడు.జడేజా మ్యాజిక్..అనంతరం బ్యాటింగ్కు దిగిన విండీస్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కరేబియన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం విండీస్ ఇంకా భారత్ కంటే 378 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో టెవిన్ ఇమ్లాచ్(14), షాయ్ హోప్(31) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బ తీశాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.చదవండి: IND vs WI: శుబ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్మన్ రికార్డు బ్రేక్ -
యంగ్(టె)స్ట్ సూపర్స్టార్ దొరికాడు!
జీవితంలో ఏదోటి సాధించాలని ప్రతి ఒక్కరు కల (Dream) కంటారు. కానీ కొంతమంది మాత్రమే స్వప్నాలను సాకారం చేసుకుంటారు. అహరహం శ్రమించే వారు.. కష్టాలు, నష్టాలను ఓర్చుకునే వారే మాత్రమే తాము అనుకున్నది సాధిస్తారు. పేదరికం బెదిరించినా, అవరోధాలు అడ్డుగా నిలిచినా అదరక బెదరక లక్ష్యసాధనకై ముందుకుసాగే వారు మాత్రమే విజేతలవుతారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. మనం చెప్పుకోబోతున్న యువ క్రికెటర్ కూడా అలాంటి వాడే!క్రికెటర్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి 10 ఏళ్ల లేత ప్రాయంలో స్వంత ఊరిని వదిలిపెట్టాడు. ఉత్తరప్రదేశ్లోని తన స్వస్థలం సూర్యవాన్ను విడిచిపెట్టి బరువైన బ్యాగ్తో పాటు అంతకంటే బరువైన కలను తనతో మోసుకుంటూ ముంబై మహా నగరానికి చేరుకున్నాడు. మొదట ఒక పాల దుకాణం పైకప్పుపై నివసించాడు. అక్కడి నుంచి ఒక్కో అడుగు వేస్తూ తానెంతో ప్రేమించే ఆటకు దగ్గరయ్యాడు. దీని కోసం ఏం చేయాల్సి వచ్చినా వెనుకాడలేదు, వెనుదిరగలేదు. ఆజాద్ మైదాన్ (Azad Maidan) సమీపంలో పానీ పూరీ అమ్మాడు. గ్రౌండ్స్మెన్తో పరిచయం పెంచుకుని వారితో కలిసి ఒకే టెంట్ పంచుకున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడేవాడు.సంకల్ప శుద్ధి, శ్రమకు సరైన సమయంలో గైడెన్స్ దొరికితే సక్సెస్ దానంతట అదే వస్తుంది. యశ్వసి జైస్వాల్ (Yashasvi Jaiswal) విషయంలో అదే జరిగింది. అవును ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఈ యువ స్టార్ క్రికెటర్ గురించే. కోచ్ జ్వాలా సింగ్ రూపంలో అతడికి సరైన సమయంలో చేయూత దొరికింది. యశస్విలో భవిష్యత్ క్రికెటర్ను చూసిన ఆయన.. జైస్వాల్కు అన్నివిధాలా అండగా నిలిచాడు. శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆశ్రయం, ఆహారంతో పాటు నమ్మకాన్ని కల్పించాడు. ఆయన మార్గదర్శకత్వంలో జైస్వాల్ ఆట పదును తేలింది. అక్కడి నుంచి అతడి ఆటే సందేశం అయింది.బ్యాటింగ్ ఆపలేదుయశస్వి జైస్వాల్ను ప్రత్యేకంగా నిలబెట్టింది అతడు ఆడే షాట్లు లేదా టైమింగ్ మాత్రమే కాదు.. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలని సంకల్పం. వైఫల్యానికి జైస్వాల్ భయపడేవాడని కోచ్ జ్వాలా సింగ్ తరచూ చెబుతుండేవారు. ఫెయిల్యూర్కు భయపడి అతడు ఎప్పుడూ బ్యాటింగ్ ఆపలేదు. మ్యాచ్ తర్వాత మ్యాచ్ ఆడుతూ ప్రతి బంతిని ఎదుర్కొన్నాడు. స్కూల్ క్రికెట్, ముంబై అండర్-16, అండర్-19, తర్వాత ఇండియా అండర్-19 తరపున పరుగులు చేస్తూనే ఉన్నాడు. 2018లో అండర్-19 ఆసియా కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2020 నాటికి అండర్-19 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు పానీ పూరీ (pani puri) అమ్మిన అదే బాలుడు ఇప్పుడు ప్రతి స్కౌట్ సంతకం చేయాలనుకునే పేరుగా మారిపోయాడు.అన్స్టాపబుల్ ప్లేయర్దేశీయ క్రికెట్లో ముంబై తరఫున జైస్వాల్.. అన్స్టాపబుల్ ప్లేయర్గా మారిపోయాడు. సెంచరీలు సంఖ్య పెరగడంతో అతడి ఫస్ట్ క్లాస్ సగటు 60 దాటింది. రన్స్ సాధించడమే చేయడమే కాదు.. బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2020 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ యంగ్ ప్లేయర్ను ₹2.4 కోట్లకు దక్కించుకుంది. నమంత్రపు సిరి అతడిని ఏమాత్రం మార్చలేదు. ఆకర్షణ కంటే ఆటకే ఎక్కువ విలువనిచ్చాడు. తన స్వప్నం పూర్తిగా సాకారం కాలేదన్న సత్యాన్ని గమనించి టీమిండియా పిలుపు కోసం ఎదురు చూశాడు.తొలి మ్యాచ్లోనే భారీ సెంచరీ2023, జూలై 12.. యశస్వి జైస్వాల్ జీవితంలో మరపురాని రోజు. ఈ రోజున వెస్టిండీస్తో ప్రారంభమైన మ్యాచ్తో టీమిండియా తరపున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. తొట్ట తొలి మ్యాచ్లోనే భారీ సెంచరీ (171)తో క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించాడు. అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసి ముందుకు సాగుతున్నాడు. తన తొలినాళ్లలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) లాగానే, జైస్వాల్ ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లలో ఆడాడు. దక్షిణాఫ్రికా మినహా, అతడు అన్ని చోట్లా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.జైసూ జైత్రయాత్ర2024లో ఇంగ్లాండ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో జైసూ జైత్రయాత్ర చేశాడు. 40 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు. ఒకే టెస్ట్ సిరీస్లో 700 పరుగులు పైగా సాధించిన తొలి ఆసియా ఓపెనర్గా రికార్డుకెక్కాడు. భారత టెస్ట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా భారత్లో వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో 175 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. చిన్న వయసులో ఎక్కువ టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. గత రెండేళ్లుగా టెస్టుల్లో జైస్వాల్ హవా కొనసాగుతోంది. తన అరంగేట్రం తర్వాత జో రూట్ మినహా ఎవరూ అతడి కంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేయలేదు. జైసూ చేసిన ఏడు సెంచరీల్లో 4 ఆసియా వెలుపల వచ్చాయి. సచిన్ టెండూల్కర్ తర్వాత అతడే యంగెస్ట్ టెస్ట్ సూపర్స్టార్ అన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా ఫామ్లో ఉన్నప్పటికీ.. జైస్వాల్ కంటే వయసులో అతడు మూడేళ్లు పెద్డోడు. టెస్టుల్లో కంటే వన్డేల్లో గిల్ బ్యాటింగ్ యావరేజ్ మెరుగ్గా ఉంది.చదవండి: తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!దిగ్గజాల సరసన చోటు!23 ఏళ్ల ఎడంచేతి బ్యాటర్ లాంగ్ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నాడు. పాతిక టెస్టులకే దాదాపు 50 శాతం బ్యాటింగ్ సగటుతో 7 సెంచరీలు, 12 అర్ధసెంచరీలు బాదాడు. ఇదే స్థిరత్వం కొనసాగిస్తే టెస్ట్ క్రికెట్లో దిగ్గజాల సరసన అతడికి చోటు దక్కడం ఖాయం. టీమిండియా టాప్-5 టెస్ట్ బ్యాటర్ల పేర్ల జాబితాలో ఎడమచేతి వాటం ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే జైస్వాల్ తన కెరీర్ను ముగించే సమయానికి ఈ లిస్ట్ కచ్చితంగా మారుతుందని స్పోర్ట్స్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆజాద్ మైదాన్ కుర్రాడు ఇప్పటికే చాలా దూరం వచ్చాడు. ఇంకెంత దూరం ప్రయాణిస్తాడో, ఎన్ని మైలురాళ్లు (Milestones) అందుకుంటాడో చూడాలి!Another stellar performance ✨Yashasvi Jaiswal with yet another superb Test innings 😎Scorecard ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/oDGP8iq6Le— BCCI (@BCCI) October 11, 2025 -
శుబ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్మన్ రికార్డు బ్రేక్
ల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన గిల్.. 177 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.గిల్కు ఇది తన కెరీర్లో పదో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్పై నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేసిన గిల్, ఇప్పుడు విండీస్పై కూడా అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అతడి సంచలన బ్యాటింగ్ ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 518 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అతడితో పాటు జైశ్వాల్(175) సూపర్ సెంచరీతో మెరిశాడు. కాగా సెంచరీతో సత్తాచాటిన గిల్ రికార్డుల మోత మోగించాడు.గిల్ రికార్డుల పంట..ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ హిస్టరీలో ఇప్పటివరకు 71 మ్యాచ్లు ఆడిన గిల్ 2826 పరుగులు సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(2731) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో పంత్ను గిల్ అధిగమించాడు.కెప్టెన్గా అత్యంత వేగంగా 5 టెస్ట్ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్గా శుబ్మన్ నిలిచాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ను అధిగమించాడు. బ్రాడ్మన్ ఈ ఫీట్ సాధించడానికి 13 ఇన్నింగ్స్లు అవసరమవ్వగా.. గిల్ కేవలం కేవలం 12 ఇన్నింగ్స్లలోనే నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో అలిస్టర్ కుక్(9), గవాస్కర్(10) తొలి రెండు స్దానాల్లో ఉన్నాడు.ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. కోహ్లి 2017, 2018లో చెరో ఐదు సెంచరీలు చొప్పున చేశాడు. ఇప్పుడు ఈ ఏడాదిలో గిల్కు ఇది ఐదో టెస్టు సెంచరీ. 2025లో గిల్ మరో సెంచరీ సాధిస్తే కోహ్లి ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.చదవండి: IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్.. -
రెండేళ్ల కిందట మ్యాచ్ ఫిక్సింగ్.. కట్ చేస్తే! ఇప్పుడు పాక్ తరపున అరంగేట్రం
సౌతాఫ్రికా-పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లహోర్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లహోర్ టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది.ఈ మ్యాచ్తో 38 ఏళ్ల లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. కాగా 2022లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రుజువు కావడంతో రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. బుకీలు తనను సంప్రదించినప్పటికి పీసీబీ ఆంటీ-కరప్షన్ విభాగానికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆసిఫ్పై అనర్హత వేటు పడింది.గతేడాది అతడిపై పీసీబీ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో ఆడిన అఫ్రిది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడికి సౌతాఫ్రికాతో టెస్టులకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడిని జట్టులోకి తీసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అయినపప్పటికి టీమ్ మెనెజ్మెంట్ ఏకంగా తుది జట్టులోనే చోటు ఇచ్చి అందరిని ఆశ్చర్చపరిచింది. అసిఫ్ అఫ్రిది 39 ఏళ్ల మరో స్పిన్నర్ నమాన్ అలీతో బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు.ఆసియాకప్-2025కు దూరమైన స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు కూడా ఈ తుది జట్టులో చోటు దక్కింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో షాహీన్ షా అఫ్రిది, హసన్ అలీ పాక్ జట్టుకు కీలకం కానున్నారు. కాగా ఈ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27లో భాగంగా జరగనుంది.సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు పాక్ తుది జట్టుఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీ, నౌమన్ అలీ, ఆసిఫ్ అఫ్రిది. -
ముచ్చటగా మూడోసారి పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu)... బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (BWF) అథ్లెట్స్ కమిషన్లో మూడోసారి చోటు దక్కించుకుంది. 2025 నుంచి 2029 నవంబర్ వరకుగానూ బీడబ్ల్యూఎఫ్ శుక్రవారం సభ్యుల పేర్లను వెల్లడించింది. సింధు 2017 నుంచి కమిషన్లో కొనసాగుతోంది. ఇక 2020 బీడబ్ల్యూఎఫ్ సమగ్రత అంబాసిడర్గానూ ఉంది. తాజాగా అన్ సె యంగ్ (కొరియా), దోహా హానీ (ఈజిప్ట్), జియా యి ఫ్యాన్ (చైనా), డెబోరా జిల్లే (నెదర్లాండ్స్)తో కలిసి సింధు అథ్లెట్స్ కమిషన్కు ఎంపికైంది. ఎలాంటి పోటీ లేకపోవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతి నిర్ణయ ప్రభావం వారిపైనే‘బీడబ్ల్యూఎఫ్నకు అథ్లెట్లే కీలకం. మేం తీసుకునే ప్రతి నిర్ణయ ప్రభావం వారిపైనే పడుతుంది. బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు దోహదపడుతుంది. కొత్త సభ్యులకు శుభాకాంక్షలు. వీరి చేరికతో కమిషన్ మరింత బలోపేతం అవుతుంది. మనందరం కలిసి బ్యాడ్మింటన్ను ప్రపంచంలోని ప్రముఖ క్రీడల్లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేయాలి. భవిష్యత్తు కార్యచరణ రూపొందించడంలో వారి సహకారాన్ని ఆశిస్తున్నాము’ అని బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు ఖున్యింగ్ పటామా లీస్వాడ్రకుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెట్స్ కమిషన్ బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్కు సంప్రదింపుల సంస్థగా పనిచేస్తుంది. టోర్నమెంట్ల నియమ నిబంధనలు, అథ్లెట్ల సంక్షేమం, అంతర్జాతీయ సర్క్యూట్లో ఎదురయ్యే సవాళ్లు ఇలా పలు కీలక అంశాలపై కమిషన్ సూచనలు చేయనుంది. ప్రస్తుతం కమిషన్లో ఐదుగురు సభ్యులు ఉండగా... కో అప్షన్ మెంబర్ను ఎంపిక చేయడం ద్వారా ఆ సంఖ్యను ఆరుకు పెంపొందించుకునే అవకాశం బీడబ్ల్యూఎఫ్నకు ఉంది. కొత్తగా ఏర్పడిన కమిషన్... త్వరలో చైర్మన్ను ఎన్నిక చేసుకోనుంది. ఇదీ చదవండి: భారత జట్టులో శ్రీజ, స్నేహిత్ భువనేశ్వర్: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ నెల 15 వరకు భువనేశ్వర్ వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సురావజ్జుల స్నేహిత్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు స్టార్ ప్లేయర్లు మనికా బత్రా, దియా చిటాలే, స్వస్తిక ఘోష్, మానవ్ ఠక్కర్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య, ఆసియా టేబుల్ టెన్నిస్ యూనియన్, భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నాయి. చైనా, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ సహా మొత్తం 22 దేశాలకు చెందిన 500 మందికి పైగా ప్లేయర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటికే భారత్కు చేరుకున్న పలువురు అంతర్జాతీయ స్టార్లు ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టు 2026లో లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్షిప్నకు అర్హత సాధించనుంది. భారత జట్టు: మహిళల విభాగం: ఆకుల శ్రీజ, మనిక బత్రా, దియా చిటాలే, యశస్విని, స్వస్తిక ఘోష్. పురుషుల విభాగం: మానవ్ ఠక్కర్, మనుశ్ షా, స్నేహిత్, అంకుర్ భట్టాచార్య, పాయస్ జైన్. -
IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్..
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా (Teamindia) కు ఊహించని షాక్ తగిలింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్(Sai Sudharsan)కు గాయపడ్డాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తుండగా సుదర్శన్ చేతి వేలికి బంతి బలంగా తాకింది.7 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్లో రెండో బంతిని జాన్ క్యాంప్బెల్కు ఔట్సైడ్ ఆఫ్ దిశగా సంధించాడు. ఆ బంతిని క్యాంప్బెల్ స్లాగ్ స్వీప్ ఆడాడు. షాట్ కనక్ట్ అయినప్పటికి బంతి షార్ట్ లెగ్లో ఉన్న సుదర్శన్ చేతిలోకి వెళ్లింది. బంతి చేతికి బలంగా తాకినప్పటికి సుదర్శన్ మాత్రం అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి బ్యాటర్తో పాటు మైదానంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. అయితే బంతిని అందుకునే క్రమంలో అతడి చిటికెన వేలుకు గాయమైంది. దీంతో నొప్పితో అతడు విల్లవిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడు నొప్పి తగలేదు.ఆఖరికి ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడి గాయం తీవ్రత తెలియాల్సి ఉంది. సుదర్శన్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.టీమిండియా భారీ స్కోర్..ఇక తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. రెండో రోజు ఆటలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(175), శుబ్మన్ గిల్(129 నాటౌట్) అద్బుత సెంచరీలతో చెలరేగారు. సుదర్శన్(87, జురెల్ (44) ఔట్, నితీష్(43), రాహుల్(38) రాణించారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. రోస్టన్ ఛేజ్ మరో వికెట్ పడగొట్టాడు.చదవండి: శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్What a grab by Sai Sudharsan! Unbelievable 🤯Sunil Gavaskar in the commentary background: 'He caught it, he caught iitttt!pic.twitter.com/7cVpUn48mo— GillTheWill (@GillTheWill77) October 11, 2025 -
ఇదొక ఊహించని పరిణామం.. తప్పు అతడిదే: కుంబ్లే
టెస్టుల్లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించాడు టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal). వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా ముచ్చటగా మూడోది పూర్తి చేస్తాడనుకుంటే ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు.25 పరుగుల దూరంలోఢిల్లీలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా.. అనవసరపు పరుగు కోసం యత్నించి జైసూ మూల్యం చెల్లించాడు. 175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయి డబుల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.జేడన్ సీల్స్ (Jayden Seales) బౌలింగ్లో బంతిని మిడాఫ్ దిశగా జైసూ బంతిని బాదగా.. అది నేరుగా ఫీల్డర్ దగ్గరకు వెళ్లింది. అయితే అప్పటికే పరుగు కోసం క్రీజు వీడిన జైస్వాల్.. మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ శుబ్మన్ గిల్కు పిలుపునిచ్చాడు. కానీ ఫీల్డర్ చేతికి బంతి చిక్కడంతో జాగ్రత్త పడ్డ గిల్ కాస్త ముందుకు కదిలినా మళ్లీ తన స్థానంలోకి వచ్చేశాడు.గిల్కు మద్దతుగా కుంబ్లేఇంతలో జైసూ వెనక్కి పరిగెత్తగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో జైసూ- గిల్ తీరుపై విమర్శలు వస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాత్రం గిల్కు మద్దతుగా నిలిచాడు. స్వీయ తప్పిదంతోనే జైస్వాల్ వికెట్ పారేసుకున్నాడని అభిప్రాయపడ్డాడు.‘‘ఇదొక ఊహించని పరిణామం. జైస్వాల్ వంటి ప్రతిభావంతమైన ఆటగాడు ఇలా చేస్తాడని ఎవరైనా అనుకుంటారా?.. తన షాట్ బాగానే ఆడానని జైస్వాల్ భావించి ఉంటాడు. ఏదేమైనా పరుగుకోసం వెళ్లాలనేది జైస్వాల్ నిర్ణయం.తప్పంతా అతడిదేఇందులో నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ఆటగాడి (గిల్) తప్పేమీ లేదు. ఎందుకంటే జైసూ మిడాఫ్ ఫీల్డర్కు నేరుగా బంతిని అందించినట్లయింది. ఆ సమయంలో పరుగుకు తీయడానికి అసలు అవకాశమే లేదు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో కుంబ్లే పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రెండో రోజు ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. గిల్ 196 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
వెస్టిండీస్తో రెండో టెస్టు.. టీమిండియా భారీ స్కోరు.. డిక్లేర్డ్
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా.. ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) శతకంతో చెలరేగడంతో భారత్ ఈ మేర స్కోరు సాధ్యమైంది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా భారత్ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ రెండు మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో తొలుత అహ్మదాబాద్లో ఇరుజట్లు తలపడగా.. టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జైస్వాల్ భారీ శతకంఇక ఢిల్లీలో శుక్రవారం రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలు కాగా.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) ఊహించని విధంగా స్టంపౌట్ కాగా.. యశస్వి జైస్వాల్ మాత్రం భారీ శతకంతో విరుచుకుపడ్డాడు.తొలి టెస్టు సెంచరీ మిస్మరోవైపు.. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ (87)కెరీర్లో తొలి టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన టీమిండియా.. శనివారం ఆట మొదలైన కాసేపటికే మూడో వికెట్ కోల్పోయింది.జైసూ రనౌట్175 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి జైస్వాల్ రనౌట్ అయి.. డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, కెప్టెన్ గిల్ నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి 43, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేసి.. అర్ధ శతకాలు పూర్తి చేసుకోకుండానే వెనుదిరిగారు.𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx— Star Sports (@StarSportsIndia) October 11, 2025గిల్ నిలకడగాఇక గిల్ మొత్తంగా 196 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ రాహుల్, సాయి, నితీశ్ రెడ్డి వికెట్లు తీయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ జురెల్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) శతకంతో మెరిశాడు. 177 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది పదో సెంచరీ కావడం విశేషం.ఆరునెలలు తిరిగే లోపేఅంతేకాదు.. ఈ ఏడాది గిల్కు ఐదో టెస్టు శతకం. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. 2017, 2018లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇక టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టి ఆరునెలలు తిరిగే లోపే గిల్ ఈ ఫీట్ సాధించడం మరో విశేషం.𝗚𝗶𝗹𝗹. 𝗚𝗹𝗼𝗿𝘆. 𝗚𝗿𝗲𝗮𝘁𝗻𝗲𝘀𝘀. 🙌@ShubmanGill reaches a brilliant century, guiding #TeamIndia towards a huge total, inching closer to the 500 mark! 🏏💪Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports &… pic.twitter.com/vIWGDISIcx— Star Sports (@StarSportsIndia) October 11, 2025ఇంగ్లండ్ పర్యటనలో నాలుగుకాగా జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్థానంలో గిల్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల్లో భాగంగా గిల్ నాలుగు శతకాలు బాదాడు.అంతేకాదు ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 269 పరుగులు సాధించి.. ఈ వేదిక మీద డబుల్ సెంచరీ సాధించిన భారత తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఇక టీమిండియా తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో అహ్మదాబాద్లో తొలి టెస్టు జరుగగా.. భారత్.. విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అనంతరం ఢిల్లీ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్తొలిరోజు రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసిన భారత జట్టు.. శనివారం నాటి రెండో రోజు ఆటలో తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల భారీ స్కోరు వద్ద ఉన్న వేళ డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. గిల్ 196 బంతుల్లో 129 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175) భారీ శతకం సాధించగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (87) గొప్పగా రాణించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38, ఆల్రౌండర్ నితీశ్ కుమార్రెడ్డి 43, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ జొమెల్ వారికన్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
అతడు సెహ్వాగ్లా కానేకాదు!.. సూపర్ ప్లేయర్: మాజీ క్రికెటర్
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)పై భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్తో రెండో టెస్టులో జైసూ శతక్కొట్టిన తీరు అద్భుతమని కొనియాడాడు. చాలా మంది జైసూను.. విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)తో పోలుస్తారన్న ఆకాశ్ చోప్రా.. అది నిజం కాదన్నాడు.ఏడో సెంచరీసెంచరీతో తన టెస్టు అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్న జైస్వాల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆరు సెంచరీలు బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. విండీస్తో రెండో టెస్టు సందర్భంగా శుక్రవారం ఏడో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపికగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించుకున్న ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి.. 253 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 173 పరుగులు చేశాడు.మొదటి బంతి నుంచే హిట్టింగ్ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘చాలా మంది జైస్వాల్ను తరచూ వీరేందర్ సెహ్వాగ్తో పోలుస్తూ ఉంటారు. కానీ అతడు సెహ్వాగ్ కంటే భిన్నమైన ప్లేయర్.వచ్చామా.. మొదటి బంతి నుంచే హిట్టింగ్ ఆడాలి అన్నట్లుగా సెహ్వాగ్ అప్రోచ్ ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలపై దూకుడు ప్రదర్శిస్తూ కుదిరితే లంచ్లోపే సెంచరీ కొట్టేయాలని వీరూ భావించేవాడు.జైస్వాల్ అలా కాదుకానీ జైస్వాల్ అలా కాదు. అతడి మైండ్సైట్ సెహ్వాగ్ కంటే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం టెస్టుల్లో మాత్రమే అతడికి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడంపైనే అతడి దృష్టి ఉంది.పిచ్ ఒకవేళ బాగుంటే.. బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా ఉన్నా.. నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించడం మొదలుపెడతాడు. ఓపికగా ఆడుతూ.. అవసరమైనపుడు మాత్రమే షాట్లు బాదుతూ అనుకున్న పనిని పూర్తి చేస్తాడు.ప్రతి బంతిని షాట్ బాదాలన్న ఇగో ఏమాత్రం లేదు. భోజనానికి ముందు ఓపికగా ఆడిన జైసూ.. ఆ తర్వాత అటాకింగ్ మొదలుపెట్టాడు. ప్రత్యర్థిని బెంబెలెత్తించి భారీ శతకం సాధించాడు’’ అని ఆకాశ్ చోప్రా జైస్వాల్ను ప్రశంసించాడు.రనౌట్కాగా తొలిరోజు అదరగొట్టిన జైస్వాల్.. శనివారం రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన ఈ 23 ఏళ్ల బ్యాటర్.. డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక శనివారం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 116 ఓవర్లలో.. నాలుగు వికెట్ల నష్టానికి 427 పరుగుల మేర భారీ స్కోరు చేసింది.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
నితీశ్ రెడ్డికి ప్రమోషన్.. ధనాధన్ దంచికొట్టి.. అంతలోనే..
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా (IND vs WI) అదరగొడుతోంది. రెండు మ్యాచ్ల సిరీస్ను వైట్వాష్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన గిల్ సేన.. లక్ష్యం దిశగా పయనిస్తోంది. శనివారం నాటి రెండో రోజు ఆట భోజన విరామ సమయానికి 116 ఓవర్లలో.. నాలుగు వికెట్ల నష్టానికి 427 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.కాగా అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. ఢిల్లీలో విండీస్తో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. తొలిరోజు ఆటలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 318 పరుగులు చేసి ఆధిక్యం ప్రదర్శించింది.డబుల్ సెంచరీ మిస్ చేసుకు న్న జైసూఈ క్రమంలో 318/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 173 పరుగులతో ఆట మొదలుపెట్టిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).. మరో రెండు పరుగులు జతచేసి దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. దీంతో డబుల్ సెంచరీ చేయకుండానే జైసూ (175) నిష్క్రమించాడు.నితీశ్ రెడ్డి ధనాధన్అయితే, కెప్టెన్ శుబ్మన్ గిల్ నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ జోరు కనబరిచిన ఈ విశాఖ కుర్రాడు.. తృటిలో అర్ధ శతకాన్ని చేజార్చుకున్నాడు. 54 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. విండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ అద్భుత బంతితో నితీశ్ రెడ్డిని వెనక్కి పంపాడు.𝗕𝗶𝗴 𝗵𝗶𝘁, 𝗯𝗶𝗴 𝗶𝗺𝗽𝗮𝗰𝘁! 🙌#NitishKumarReddy hits a massive six, firing up the crowd as #TeamIndia builds momentum. 🔥Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/OZzBhNROPF— Star Sports (@StarSportsIndia) October 11, 2025 ఐదో నంబర్కు ప్రమోట్ అయిటీమిండియా తొలి ఇన్నింగ్స్ 108.3వ ఓవర్లో వారికన్ బౌలింగ్లో జేడన్ సీల్స్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రెడ్డి పెవిలియన్ చేరాడు. కాగా బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో నంబర్కు ప్రమోట్ అయి.. ధనాధన్ దంచికొట్టి ఇలా అతడు వెనుదిరగడం అభిమానులన నిరాశపరిచింది.ఇక లంచ్ బ్రేక్ సమయానికి గిల్ 75 పరుగులు, ధ్రువ్ జురెల్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు అంటే తొలి రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ శతకం (87) చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇక విండీస్ తీసిన నాలుగు వికెట్లలో మూడు వారికన్ ఖాతాలోనే ఉన్నాయి. జైసూ రనౌట్తో విండీస్కు మరో కీలక వికెట్ దక్కింది.చదవండి: గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!Leading from the front! 👑Captain @ShubmanGill brings up a classy half-century - crossing 1000 runs as skipper in international cricket! 💥Catch the LIVE action 👉 https://t.co/tg7ZEVlTSH#INDvWI 👉 2nd Test, Day 2 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/CDjnnehzO6— Star Sports (@StarSportsIndia) October 11, 2025 -
వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసిన హార్దిక్ పాండ్యా.. రిలేషన్షిప్లో ఉన్నా!
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. మహీక శర్మ (Mahieka Sharma) అనే మోడల్తో అతడు డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ హార్దిక్ పాండ్యా మహీకతో దిగిన వ్యక్తిగత ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.చేతిలోన చెయ్యేసిబీచ్ ఒడ్డున నిలబడి మహీకతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోలతో పాటు.. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను హార్దిక్ పంచుకున్నాడు. తద్వారా తాను మహీకతో రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పకనే చెప్పాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.కాగా హార్దిక్ పాండ్యా శనివారం 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇలా పుట్టినరోజుకు ఒకరోజు ముందే అంటే శుక్రవారమే మహీక శర్మతో కలిసి హార్దిక్ ట్రిప్పునకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరు ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన దృశ్యాలు నిన్న వైరల్ అయ్యాయి.గతంలో నటాషా స్టాంకోవిక్ను ప్రేమించిన హార్దిక్ ఇక హార్దిక్ పాండ్యా షేర్ చేసిన ఫొటోల్లో కుమారుడు అగస్త్యతో కలిసి ఉన్న చిత్రం కూడా ఉండటం విశేషం. కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించిన హార్దిక్ పాండ్యా కోవిడ్ సమయంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లైన కొన్ని నెలల్లోనే కుమారుడు అగస్త్య జన్మించాడు.విడాకులుఅయితే, 2023, ఫిబ్రవరి 14న హార్దిక్ నటాషాకు ఊహించని బహుమతి ఇచ్చాడు. ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ ఏర్పాటు చేశాడు. హిందూ- క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరిద్దరు మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేశారు. అయితే, గతేడాదే అనూహ్య రీతిలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు హార్దిక్- నటాషా.ఇప్పుడిలా హార్దిక్ పాండ్యా మరోసారి ప్రేమలో పడ్డాడు. కాగా టీమిండియా తరఫున చివరగా ఆసియా టీ20 కప్-2025 ఆడిన ఈ పేస్ ఆల్రౌండర్.. ఈ టోర్నీ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అతడు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం ఇలా వ్యక్తిగత జీవితాన్ని హార్దిక్ పాండ్యా గర్ల్ఫ్రెండ్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.చదవండి: యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని! -
గిల్పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే!
వెస్టిండీస్తో రెండో టెస్టులో భారీ శతకంతో కదంతొక్కిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శనివారం నాటి రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. ద్విశతకానికి పాతిక పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా భారత్- వెస్టిండీస్ (IND vs WI) మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది.తొలిరోజు భారత్దేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ భారీ శతకం బాదాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan- 87) రాణించాడు.జైసూ డబుల్ సెంచరీ మిస్ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. జైస్వాల్ 173, కెప్టెన్ శుబ్మన్ గిల్ 20 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక శనివారం ఆట సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవాలని భావించిన జైస్వాల్ తన తొందరపాటు చర్యతో రనౌట్ అయ్యాడు.గిల్ తప్పా?టీమిండియా తొలి ఇన్నింగ్స్ 92వ ఓవర్లో విండీస్ పేసర్ జేడన్ సీల్స్ బంతితో రంగంలోకి దిగాడు. అతడి బౌలింగ్లో రెండో బంతికి మిడాఫ్ దిశగా జైసూ బాదిన బంతి నేరుగా ఫీల్డర్ చెంతకు చేరింది. అయితే, ఇంతలోనే జైస్వాల్ పరుగు కోసం క్రీజు వీడగా.. గిల్ మాత్రం పరిస్థితికి తగ్గట్టుగా నాన్-స్ట్రైకర్ ఎండ్లోనే ఉండిపోయాడు.Yashasvi Jaiswal (runout) seems to have developed a habit of taking off for a run even when the ball goes straight to the fielder. He really needs to learn from this —When you're on a big score, what's the rush for a single? 🤦♂️pic.twitter.com/asdamXT1zj— Sporttify (@sporttify) October 11, 2025 తల బాదుకున్న జైసూదీంతో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా.. అప్పటికే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ దానిని వికెట్లకు గిరాటేశాడు. ఫలితంగా తన ఓవర్నైట్ స్కోరుకు కేవలం రెండు పరుగులు జతచేసి రనౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన జైసూ.. కోపంలో తలబాదుకుంటూ క్రీజును వీడాడు.తప్పు నీదేఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతుండగా.. కొంతమంది గిల్ను తప్పుబడుతున్నారు. అయితే, చాలా మంది మాత్రం.. ‘బంతి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లినా తొందరపడి పరుగుకు రావడం జైసూ తప్పు. అతడికి ఇదొక అలవాటుగా మారింది. 175 పరుగులు చేసిన నీకు ఈ రిస్కీ సింగిల్ అవసరమా? ఇది నీ స్వీయ తప్పిదం’’ అంటూ జైస్వాల్ను విమర్శిస్తున్నారు.కాగా జైస్వాల్ తొలి ఇన్నింగ్స్లో మొత్తంగా 258 బంతులు ఎదుర్కొని 22 ఫోర్ల సాయంతో 175 పరుగులు సాధించాడు. వంద ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని! -
నాలో దూకుడు అలాగే ఉంది.. కానీ: గంభీర్ కామెంట్స్ వైరల్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇప్పటికీ దూకుడు అలాగే ఉందని.. మైదానంలో తనను తాను ఇలా ఆవిష్కరించుకోవడం తన సహజమైన భావోద్వేగం అని తెలిపాడు. అయితే, వయసు పెరుగుతున్న దృష్ట్యా ఇంట్లో వాళ్ల కోసం కొన్నిసార్లు తనను తాను సంభాళించుకుంటున్నానని తెలిపాడు.కోహ్లితోనూ గొడవటీమిండియాకు ఆడిన రోజుల్లో గంభీర్ ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో క్రికెట్ ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేవాడు. అంతేకాదు.. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తోనూ.. ఈ వరల్డ్కప్ విన్నర్ గొడవ పడిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ‘ఢిల్లీ బాయ్స్’ గంభీర్- కోహ్లి రెండుసార్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా వచ్చిన తర్వాత పాత పగలు పక్కనపెట్టి కోహ్లితో కలిసిపోయాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్వయంగా వీరిద్దరు చెప్పడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్స్కు తెరపడింది.ఎప్పుడూ గంభీరంగానేఇక గంభీర్ డగౌట్లోనూ ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడి ముఖంలో అమావాస్యకో.. పున్నమికో గానీ నవ్వు కనిపించదు. ఎప్పుడూ సీరియస్గా ఉండే గంభీర్పై ఈ విషయంలో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి.నేను మారలేదుఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన గౌతం గంభీర్ తన వ్యవహారశైలి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాలో ఇప్పటికీ ఆ దూకుడు అలాగే ఉంది. నేను మారలేదు. అగ్రెసివ్గా ముందుకు వెళ్లాలనుకున్నపుడు గొడవ పడటమే నాకు ముందుగా గుర్తుకువస్తుంది.ఇంట్లో పిల్లలు ఉన్నారుఅయితే, వయసు పెరిగింది కాబట్టి.. నా మనసు.. ‘ఇంట్లో పిల్లలు ఉన్నారు’ కదా అని హెచ్చరిస్తుంది’’ అంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో బిజీగా ఉంది.రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. శుక్రవారం మొదలుపెట్టిన రెండో టెస్టులోనూ జోరు కనబరుస్తోంది. టీమిండియా- వెస్టిండీస్ రెండో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా గంభీర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. టీమ్ డిన్నర్ఇక ఈ మ్యాచ్కు ముందు గౌతీ తన ఇంట్లో టీమిండియాకు డిన్నర్పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా,ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ సహా కోచ్లు ర్యాన్ టెన్ డష్కాటే, మోర్నీ మోర్కెల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గంభీర్ పార్టీకి హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్కు పగ్గాలు అప్పగించడంపై గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గౌతీ టీమ్ డిన్నర్ ఇవ్వడం గమనార్హం. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని.. ఎవరూ రావొద్దని వార్నింగ్!
టీమిండియా మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్ (Yograj Singh)తన విడాకులకు గల కారణాన్ని వెల్లడించాడు. తాను పెట్టిన కఠినమైన నిబంధనల వల్లే.. షబ్నమ్ (Shabnam)తో తన పెళ్లి పెటాకులైందంటూ కుండబద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు ఆడిన యోగ్రాజ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.యువీ భవిష్యత్తు కోసమేభారత్కు తొలి వరల్డ్కప్ అందించిన కపిల్ దేవ్ (Kapil Dev) వల్లే తన కెరీర్ నాశనమైందని భావించిన యోగ్రాజ్.. తన కుమారుడి రూపంలో టీమిండియాకు అత్యుత్తమ ఆల్రౌండర్ను అందించాలని భావించాడు. ఇందుకోసం క్రమశిక్షణ పేరిట తన కొడుకు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించానని యెగ్రాజ్ ఇటీవలే వెల్లడించాడు.ఒకానొక దశలో తన తల్లి యువీ మానసిక స్థితి గురించి చాలా భయపడిపోయిందని.. మనుమడి పట్ల దయ చూపాలని కోరిందని యోగ్రాజ్ తెలిపాడు. అయినా తన మనసు కరగలేదని.. యువీ భవిష్యత్తు కోసమే కఠినంగా ఉన్నానంటూ తనను తాను సమర్థించుకున్నాడు. తాజాగా ఎస్ఎమ్టీవీకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో యువీ తల్లి షబ్నమ్తో తన విడాకులకు గల కారణం గురించి వెల్లడించాడు.ఒక రకంగా ఇంట్లో పెట్టి తాళం వేసినట్లు చేశా‘‘విదేశీయుల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో నేను చదువుకున్నా. మా నాన్న క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. నేను అదే మిగిలిన వాళ్లపై ప్రయోగించాను. నా భార్య షబ్నమ్తోనే ఇది మొదలుపెట్టాను.నా అనుమతి లేకుండా బయటకు వెళ్లవద్దని ఆదేశించా. ఒక రకంగా ఇంట్లో పెట్టి తాళం వేసినట్లు చేశా. ఇక తన కుటుంబ సభ్యులు ఎవరూ మా ఇంటికి రావొద్దని హెచ్చరించా. ఒకవేళ ఎవరైనా దారి తప్పి వచ్చినా వాళ్లు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వద్దని కచ్చితంగా చెప్పేశా.వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పామాకు కుమారుడు జన్మించిన తర్వాత.. నాలో దాగి ఉన్న కసినంతా బయటకు తీసి.. నా కొడుకుని లెజెండ్గా తీర్చిదిద్దుతా అని మా అమ్మకు చెప్పాను. నన్ను తప్పుగా చూపించే ప్రయత్నం చేసిన కపిల్ దేవ్ వంటి వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు నా కుమారుడిని అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించుకున్నా.అందుకే కష్టపెట్టైనా సరే వాడిని అత్యుత్తమ ఆల్రౌండర్ని చేశా. ఏదేమైనా పితృస్వామ్య భావజాలం గల నాతో షబ్నమ్ ఇమడలేకపోయింది. యువీ, తన తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్లిన రోజు.. నా జీవితంలో తొలిసారిగా ఏడ్చాను.నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా. నాకు నటన రాదు. అందుకే నా పరిస్థితి ఇలా అయింది. మా వాళ్లు నన్ను ఓ పిచ్చోడు అనుకున్నారు’’ అని యోగ్రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశాఇక గతంలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘యువీ తల్లిని పెళ్లి చేసుకుని తప్పు చేశా. నేనొక రైతుని. ఆమె వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది. నాకున్న మగ అహంకారంతో ఆమెను పంజరంలో బంధించినట్లు చేశా.అది ఆమెకు నచ్చలేదు. అయినా సర్దుకుపోయేది. కానీ ఒకానొక దశలో మా ఇద్దరికీ అస్సలు పడలేదు.అందుకే విడిపోవాల్సి వచ్చింది’’ అని యెగ్రాజ్ సింగ్ తెలిపాడు. కాగా షబ్నమ్- యోగ్రాజ్లకు యువరాజ్ సింగ్తో పాటు జొరావర్ సంతానం. విడాకుల తర్వాత యోగ్రాజ్ నీనా బుంధేల్ అనే నటిని పెళ్లి చేసుకోగా.. వీరికి కుమారుడు, కుమార్తె జన్మించారు. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
పోరాడి ఓడిన హైదరాబాద్ బ్లాక్హాక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్లో భాగంగా గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ 10–15, 14–16, 15–17తో ఢిల్లీ తూఫాన్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ లీగ్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన ఢిల్లీ జట్టు మూడో మ్యాచ్లో తొలి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ మొత్తంలో హైదరాబాద్ 39 పాయింట్లు సాధించగా... ఇందులో సొంత సరీ్వస్లో 10 పాయింట్లు, స్పైక్ షాట్లతో 17 పాయింట్లు వచ్చాయి. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ శివసేనా రెడ్డి ఈ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హైదరాబాద్ బ్లాక్హాక్స్ యజమాని కంకణాల అభిõÙక్ రెడ్డి వీరిద్దరికి స్వాగతం పలికి ఆటగాళ్లను పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని... దేశంలోని పలు నగరాల్లో జరగాల్సిన ఈ సీజన్ పీవీఎల్ పోటీలు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మొత్తం హైదరాబాద్లోనే నిర్వహించడానికి చొరవ తీసుకున్న హైదరాబాద్ జట్టు యజమాని అభిక్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. మరో మ్యాచ్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ 12–15, 15–12, 15–12, 16–14తో డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్పై గెలిచింది. -
ఈ నెల 31న పీకేఎల్ ఫైనల్
న్యూఢిల్లీ: హోరాహోరీ పోరాటాలతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ ఫైనల్ ఈ నెల 31న జరగనుంది. శనివారం నుంచి ఢిల్లీ అంచె పోటీలు ప్రారంభం కానుండగా... లీగ్ దశ ముగిసిన అనంతరం ప్లే ఆఫ్స్ కూడా ఢిల్లీలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం పీకేఎల్ నిర్వాహకులు ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 23తో లీగ్ దశకు తెరపడనుండగా... పాయింట్ల పట్టికలో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు చేరుతాయి. జట్ల మధ్య మరింత పోటీ పెంచేందుకు... తాజా సీజన్ నుంచి పీకేఎల్లో పలు మార్పులు చేశారు. ఈ నెల 25 నుంచి జరగనున్న ‘ప్లే ఇన్స్’లో పట్టికలో 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు నిలిచిన జట్లు తలపడతాయి. అందులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్లో అడుగు పెడుతుంది. అక్టోబర్ 26 నుంచి 29 వరకు ప్లే ఆఫ్స్ జరుగుతాయి. తొలి రోజు ఎలిమినేటర్–1, మినీ క్వాలిఫయర్... మరుసటి రోజు ఎలిమినేటర్–2, క్వాలిఫయర్–1 నిర్వహిస్తారు. అక్టోబర్ 28న ఎలిమినేటర్–3, 29న క్వాలిఫయర్–2 నిర్వహిస్తారు. ఇందులో మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు ఈ నెల 31 శుక్రవారం జరగనున్న ఫైనల్కు అర్హత సాధిస్తాయి. తాజా సీజన్లో మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా... అభిమానుల్లో ఆసక్తి పెంపొందించేందుకే ఎక్కువ జట్లు ప్లే ఆఫ్స్ చేరే విధంగా టోర్నీని మార్చారు. దీంతో హోరాహోరీ పోరాటాలు పెరగడంతో పాటు... ప్రతి జట్టుకు ఫైనల్కు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఫైనల్ నిర్వహించనుండటం ఇది నాలుగోసారి. ఇక ఈ సీజన్లో విజృంభిస్తున్న దబంగ్ ఢిల్లీ జట్టు... ఇప్పటికే టాప్–8 చోటు ఖాయం చేసుకుంది. -
ప్లే ఆఫ్స్కు దబంగ్ ఢిల్లీ
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో అదరగొడుతున్న దబంగ్ ఢిల్లీ ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ను ఖరారు చేసుకుంది. తద్వారా తాజా సీజన్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. సీజన్ ఆరంభం నుంచి తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న దబంగ్ ఢిల్లీ శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. రెయిడర్లు రాణించడంతో దబంగ్ ఢిల్లీ 39–33 పాయింట్ల తేడాతో గుజరాత్పై గెలుపొందింది. దబంగ్ ఢిల్లీ తరఫున అక్షిత్ ధుల్ 12 పాయింట్లతో సత్తా చాటాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున హిమాన్షు 11 పాయింట్లు సాధించాడు. అశు మలిక్ గైర్హాజరీలో అక్షిత్ సూపర్ రెయిడ్లతో చెలరేగడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ 23 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... జెయింట్స్ 16కే పరిమితమైంది. ట్యాక్లింగ్లో గుజరాత్ 15 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... ఢిల్లీ 10 పాయింట్లు సాధించింది. తాజా సీజన్లో 14 మ్యాచ్లాడిన ఢిల్లీ 12 విజయాలు, 2 పరాజయాలతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో నిలిచింది. శనివారం నుంచి పీకేఎల్ పోటీలు ఢిల్లీ వేదికగా జరగనుండగా... సొంతగడ్డపై అడుగుపెట్టకముందే ఢిల్లీ జట్టు ‘ప్లే ఆఫ్స్’ బెర్తు ఖరారు చేసుకుంది. గుజరాత్ జెయింట్స్ 13 మ్యాచ్ల్లో 4 విజయాలు, 9 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. మరోమ్యాచ్లో యు ముంబా 48–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై నెగ్గింది. యు ముంబా తరఫున సందీప్ కుమార్ 13, అజిత్ చవాన్ 12 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ వారియర్స్ తరఫున దేవాంక్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో యు ముంబా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా... బెంగాల్ వారియర్స్ 9వ స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా శనివారం బెంగళూరు బుల్స్తో జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
Richa Ghosh: ఫినిషర్!
భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లలో రిచా ఘోష్ 30 సిక్సర్లతో మూడో స్థానంలో ఉంది. హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మాత్రమే ఆమెకంటే ముందుండగా... వారిద్దరు 155, 111 వన్డేలు ఆడారు. రిచా ఇప్పటికి 46 వన్డేలు మాత్రమే ఆడింది. ఆమె వన్డేల్లో అరంగేట్రం చేసిన 2021 నుంచి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రిచాకంటే ఎక్కువ సిక్స్లు బాదారు. మిడిలార్డర్లో ఆడుతూ ఫీల్డర్ల పరిమితులు లేని సమయంలో 22 ఏళ్ల రిచా చూపిస్తున్న దూకుడు ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతోంది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కూడా అలవోకగా నాలుగు సిక్సర్లు బాది తన సత్తాను మళ్లీ చూపించింది. వన్డేల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధసెంచరీ (26 బంతుల్లో), టి20ల్లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు తన పేరిట లిఖించుకున్న రిచా తక్కువ వ్యవధిలో జట్టులో కీలకంగా మారింది. -సాక్షి క్రీడా ప్రతినిధి సరిగ్గా ఏడాది క్రితం రిచా ఘోష్ 12వ తరగతి పరీక్షల కారణంగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నుంచి తప్పుకుంది. అటు తానియా భాటియా, ఇటు ఉమ ఛెత్రివంటి వికెట్ కీపర్లతో తీవ్రంగా పోటీ ఉండి కొంత కాలం ఆటకు దూరమైతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉన్న స్థితిలో కూడా రిచా తనంతట తాను తప్పుకుంది. తన ఆటపై రిచాకు ఉన్న నమ్మకం, ఎలాగైనా స్థానం కాపాడుకోగలననే విశ్వాసం ప్రదర్శించిన ఆమె మళ్లీ జట్టులోకి తిరిగొచ్చింది. ఇప్పుడు రిచా కీపింగ్కంటే కూడా అలవోకగా భారీ షాట్లు కొట్టి ఆమె బ్యాటింగే భారత్కు ప్రధాన బలంగా మారింది. ఫినిషర్గా నిరూపించుకొని... 1, 2, 3, 4, 5, 6, 7, 8... రిచా 46 వన్డేల తన స్వల్ప కెరీర్లో ఇలా ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్కు దిగడం విశేషం. రెండేళ్ల క్రితం ఆ్రస్టేలియాతో జరిగిన వన్డేలో కోచ్ అమోల్ మజుందార్ ప్రయోగాత్మకంగా మూడో స్థానంలో ఆడిస్తే 96 పరుగులతో (రిచా అత్యధిక స్కోరు) అదరగొట్టింది. అయితే టీమ్ కూర్పు, చివర్లో మన బలహీనతలను దృష్టిలో ఉంచుకుంటూ రిచాను కోచ్ మిడిలార్డర్కు మార్చడంతో పాటు ఫినిషర్ బాధ్యతలు అప్పగించారు. 2025 డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్లో గుజరాత్పై బెంగళూరు 202 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంలో రిచా ఆడిన ఇన్నింగ్స్ (27 బంతుల్లో 64 నాటౌట్) కూడా మజుందార్ ఆలోచనకు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుత వరల్డ్ కప్లోనే దాని ప్రభావం కనిపించింది. దక్షిణాఫ్రికాపై కుప్పకూలే స్థితి నుంచి జట్టుకు మెరుగైన స్కోరు అందించిన రిచా... అంతకుముందు పాకిస్తాన్తో మ్యాచ్లోనూ 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్లతో అజేయంగా 35 పరుగులు చేసింది. కీపింగ్ నైపుణ్యంపై దృష్టి పెట్టి... కెరీర్ ఆరంభంలో తన బ్యాటింగ్తోనే రిచా భారత జట్టులోకి వచ్చింది. ఆమె దూకుడుపై సెలక్టర్లకు ఉన్న నమ్మకమే అందుకు కారణం. మూడు మ్యాచ్లలో మరో కీపర్ జట్టులో ఉండగా, ఆమె స్పెషలిస్ట్ బ్యాటర్గా బరిలోకి దిగింది. నిజాయితీగా చెప్పాలంటే రిచా కీపింగ్లో చాలా బలహీనంగా ఉండేది. దేశవాళీలో ఆమె ఎక్కువగా కీపింగ్ చేయకపోవడం కూడా అందుకు కారణం. బెంగాల్ తరఫున ఆడినప్పుడు జట్టులో అప్పటికే స్థిరంగా ఉన్న సీనియర్ కీపర్లు ఉండటంతో ఆమెకు అవకాశాలు రాలేదు. దాంతో రిచా మీడియం పేస్ బౌలింగ్ కూడా చేసేది. అయితే టి20ల్లో బ్యాటర్గా తనకు గుర్తింపు వచ్చిన తర్వాత మాజీ పేసర్ జులన్ గోస్వామి ఇచ్చిన సలహాలు, సూచనలతో కీపింగ్ను మెరుగు పర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఫలితంగా తన తొలి వన్డేలోనే పాకిస్తాన్పై ఐదుగురు బ్యాటర్లను అవుట్ చేసి కీపర్గానూ నిరూపించుకుంది. అయితే మూడేళ్ల క్రితం ఫిట్నెస్ సరిగా లేకపోవడంతో రిచా వన్డే, టి20 జట్లలో స్థానం కోల్పోయింది. 19 ఏళ్ల అమ్మాయి అధిక బరువు, కీపర్గా కదలికలు కష్టం కావడం చిన్న విషయం కాదు. దీనిని ఆమె వెంటనే అర్థం చేసుకుంది. పూర్తిగా ఫిట్నెస్పైనే దృష్టి పెట్టి తనను తాను కొత్తగా కనిపించేలా చేసుకుంది. కొద్ది రోజులకే మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోగలిగింది. చిన్న వయసులోనే రికార్డులతో... 16 ఏళ్లకే భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన రిచా తక్కువ వ్యవధిలోనే టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ ఆడేసింది. ఆ తర్వాత ఆమె అండర్–19 వరల్డ్ కప్ బరిలోకి దిగడం విశేషం. 2023 జనవరిలో జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో రిచా కీలక పాత్ర పోషించింది. డబ్ల్యూపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ సాధించడంలో కూడా రిచా బ్యాటింగ్ ప్రధాన కారణంగా నిలిచింది. రిచా విధ్వసంకర బ్యాటింగ్ నైపుణ్యమే ‘బిగ్బాష్ లీగ్’లో హోబర్ట్ హరికేన్స్... ‘హండ్రెడ్’ లీగ్లో బర్మింగ్హామ్ ఫోనిక్స్, లండన్ స్పిరిట్ జట్ల తరఫున ఆడే అవకాశం కల్పించాయి. పరిస్థితులను బట్టి తన ఆటను మార్చుకోగలనని కూడా దక్షిణాఫ్రికాతో పోరులో రిచా నిరూపించింది. మహిళల వన్డేల్లో 100కు పైగా స్ట్రయిక్ రేట్ అంటే అసాధారణ విషయం. ఇదే జోరును మున్ముందూ కొనసాగించగలిగితే రిచా సుదీర్ఘ కాలం భారత జట్టు తరఫున అద్భుత ప్రదర్శనలు ఇవ్వగలదు. చిన్నప్పుడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన రోజుల నుంచి నాకు సిక్సర్లు కొట్టడం అంటే చాలా ఇష్టం. అదే ఇప్పుడు నా ఆటలో కనిపిస్తుందని నమ్ముతాను. అయితే అలాంటి దూకుడైన షాట్లే కాకుండా అన్ని రకాల పరిస్థితుల్లోనూ బాగా బ్యాటింగ్ చేయగలననే నమ్మకం నాకుంది. భారీ షాట్లు ఆడబోయి పలు కీలక సమయాల్లో అవుటయ్యా. సిక్స్లు కొట్టడం మాత్రమే కాదు. జట్టును గెలిపించడం ముఖ్యం అని అర్థమైంది. అందుకే నా సాంకేతికంగా నా ఆటలో మార్పులు చేసుకొని గ్రౌండ్ షాట్లు కూడా చాలా ఆడుతున్నాను. -రిచా ఘోష్ -
న్యూజిలాండ్ బోణీ
గువాహటి: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో మాజీ చాంపియన్ న్యూజిలాండ్ ఆలస్యంగా బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన కివీస్ జట్టు శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు సుజీ బేట్స్ (29; 6 సిక్స్లు), ప్లిమర్ (4), అమెలియా కెర్ (1) విఫలమవడంతో 38 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి. ఈ దశలో కెప్టెన్ సోఫీ డివైన్ (85 బంతుల్లో 63; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రూక్ హాలిడే (104 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్కు 112 పరుగులు జోడించడంతో కివీస్ కుదురుకుంది. అయితే 29 పరుగుల వ్యవధిలో వీళ్లిద్దరు అవుటయ్యాక న్యూజిలాండ్ మళ్లీ తడబడింది. ఆఖరి ఓవర్లలో మ్యాడీ గ్రీన్ (25; 3 ఫోర్లు), జెస్ కెర్ (0), రోజ్మేరీ (2), ఇసాబెల్లా గేజ్ (12) వికెట్లను కోల్పోయింది. ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్ 3 వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫాహిమా ఖాతూన్ (34; 2 ఫోర్లు), రబియా ఖాన్ (25; 2 ఫోర్లు) రాణించారు. జెస్ కెర్, లీ తహుహు చెరో 3 వికెట్లు తీయగా, రోజ్మేరీకి 2 వికెట్లు దక్కాయి. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టుతో శ్రీలంక తలపడుతుంది. -
జైస్వాల్ కదంతొక్కడంతో...
రెండో టెస్టు తొలిరోజే... ఓపెనర్ యశస్వి జైస్వాల్ దృష్టి ద్విశతకంపై పడితే, భారత జట్టు అడుగులు క్లీన్స్వీప్పై పడ్డాయి. ఓవర్లు పడుతున్నా... బౌలర్లు అదేపనిగా మారినా... సెషన్లు పూర్తయినా... భారత బ్యాటర్ల ఆట మాత్రం మారనేలేదు. నిలకడగానే కొనసాగింది. జైస్వాల్తో పాటు వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టాడు. ఇద్దరు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా చివరి టెస్టు మొదలైన రోజే అలవోకగా 300 పైచిలుకు పరుగుల్ని సాధించింది. న్యూఢిల్లీ: తొలిటెస్టులో మూడు పదుల స్కోరుతో సరిపెట్టుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెడుతున్నాడు. సాయి సుదర్శన్తో చెప్పుకోదగ్గ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జైస్వాల్ అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. అతని జోరు రెండో రోజు కొనసాగినా, లేదంటే సహచరుల్లో ఒకరిద్దరు రాణించినా టీమిండియా ఈ టెస్టులోనూ ఇన్నింగ్స్ విజయానికి అవసరమైన స్కోరును అవలీలగా చేస్తుంది. ఇదే జరిగితే 1–0 ఆధిక్యంతో శుక్రవారం మొదలైన ఆఖరి టెస్టు చివరకు 2–0తో వెస్టిండీస్ను వైట్వాష్ చేయడం ఈ రోజే దాదాపు ఖాయమవుతుంది! ఏడు సార్లు టాస్కు వెళ్లిన భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలిసారి టాస్ గెలిచాడు. మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంతో... తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (253 బంతుల్లో 173 బ్యాటింగ్; 22 ఫోర్లు) అజేయ శతకం సాధించగా... సాయి సుదర్శన్ (165 బంతుల్లో 87; 12 ఫోర్లు) సెంచరీని చేజార్చుకున్నాడు. భారత్ కోల్పోయిన రెండు వికెట్లు విండీస్ స్పిన్నర్ జోమెల్ వారికెన్ ఖాతాలో చేరాయి. శుభారంభంతో... బ్యాటింగ్ మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) ఓపెనింగ్ వికెట్కు 58 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. క్రీజులో ఉన్నంత సేపు కాస్త దూకుడు ప్రదర్శించిన రాహుల్ అలాగే ఆడేందుకు యత్నించి వారికెన్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో తొలి సెషన్లో జైస్వాల్కు సాయి సుదర్శన్ జతయ్యాడు. గత టెస్టులో విఫలమైన సుదర్శన్ తాపీగా ఆడుతూ జైస్వాల్కు అండగా నిలిచాడు. దీంతో కరీబియన్ బౌలర్లకు ఈ సెషన్లో మరో సాఫల్యం సాధ్యమవలేదు. 94/1 వద్ద భారత్ లంచ్ విరామానికి వెళ్లింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ 100 పరుగులు దాటగా, యశస్వి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతనితోపాటు సుదర్శన్ కూడా క్రీజులో పాతుకుపోవడంతో భారత్కు పరుగులు, కరీబియన్కు కష్టాలు తప్పలేదు. సగటున ఓవర్కు 3.5 పైచిలుకు రన్రేట్తో పరుగులు రావడంతో 41వ ఓవర్లోనే జట్టు స్కోరు 150 దాటగా... కాసేపటికే సాయి సుదర్శన్ 87 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. భాగస్వామ్యం బలపడటంతో ఈ సెషన్లో వెస్టిండీస్కు వికెట్ భాగ్యమే కరువైంది. జైస్వాల్ 145 బంతుల్లో టెస్టుల్లో ఏడో శతకాన్ని పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. రెండో సెషన్ 220/1 స్కోరు వద్ద ముగిసింది. ఆఖరి సెషన్లోనూ జోరు... ఓపెనర్ జైస్వాల్, సుదర్శన్ ఇద్దరు పరుగులు చక్కబెడుతూ స్కోరు బోర్డును సాఫీగా లాగిస్తుండగా ఎట్టకేలకు ఈ సెషన్లో వెస్టిండీస్ శిబిరానికి కాస్త ఊరటగా ఒక వికెట్ దక్కింది. సెంచరీ దిశగా పరుగు పెడుతున్న సాయి సుదర్శన్ను వారికెన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రెండో వికెట్కు 193 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జైస్వాల్కు కెప్టెన్ శుబ్మన్ గిల్ (68 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) జతయ్యాడు. ఈ జోడీ కూడా పాతుకుపోయిందే తప్ప ఏ దశలోనూ పడిపోలేదు. 82 ఓవర్లయ్యాక కొత్తబంతి తీసుకున్నారు. కానీ ఓపెనర్ యశస్వి, కెప్టెన్ శుబ్మన్ ఆ బంతి ప్రయోజనాన్ని ఇవ్వకుండా క్రీజ్ను అట్టిపెట్టుకొని పరుగులు సాధించారు. యశస్వి 150 పరుగులు పూర్తి చేసుకొని డబుల్ సెంచరీపై కన్నేశాడు. ప్రత్యర్థి జట్టు రోజంతా కలిపి రెండే వికెట్లు తీసినా... మూడు సెషన్లలో 90 ఓవర్ల కోటా పూర్తి చేసిన విండీస్ బౌలర్లు ఒక్క వైడ్ గానీ, నోబాల్ గానీ వేయలేదు. దీంతో ఎక్స్ట్రాల రూపంలో భారత్కు ఒక్క పరుగైనా రాలేదు. స్కోరు బోర్డులో ఉన్న 318 పరుగులు బ్యాటర్లు బాదినవే! తొలిరోజు ఆట ముగిసే సరికి జైస్వాల్, గిల్ అజేయంగా నిలిచారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బ్యాటింగ్) 173; రాహుల్ (స్టంప్డ్) ఇమ్లాచ్ (బి) వారికెన్ 38; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికెన్ 87; శుబ్మన్ గిల్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 0; మొత్తం (90 ఓవర్లలో 2 వికెట్లకు) 318. వికెట్ల పతనం: 1–58, 2–251. బౌలింగ్: సీల్స్ 16–1–59–0, ఫిలిప్ 13–2–44–0, గ్రీవెస్ 8–1–26–0, పియర్ 20–1–74–0, వారికెన్ 20–3–60–2, రోస్టన్ చేజ్ 13–0–55–0. -
ఆసియాకప్ ట్రోఫీ ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే! నఖ్వీ పోస్ట్ ఊస్టింగ్?
2025 ఆసియా కప్.. ఈ ఖండాతర టోర్నీ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఎడిషన్గా నిలిచింది. షేక్ హ్యాండ్ వివాదం మొదలు ఆసియా కప్ ట్రోఫీ వరకూ ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠను రేపింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టే వ్యవహరించింది. తొలుత షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి నిరాకరించిన భారత్.. ఆ తర్వాత ఏసీసీ చైర్మెన్, పీసీబీ చీఫ్ మోహ్సన్ నఖ్వీ(mohsin naqvi) చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి సముఖత చూపలేదు. నక్వీ తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని పట్టుబట్టినప్పటికి బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ అందుకు అంగీకరించలేదు.దీంతో నఖ్వీ స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విజేతల పతకాలను కూడా తీసుకెళ్లడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పటికి ఇంకా ట్రోఫీని భారత్కు అతడు అందజేయలేదు. ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్లోని ఏసీసీ ఆఫీస్లో ఉంది. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని ఏసీసీ అధికారులకు నఖ్వీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడం, ఇంకా అందజేయకపోవడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవనెత్తునుంది. అంతేకాకుండా ఐసీసీ డైరెక్టర్ పదవి నుండి అతడిని తొలిగించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది.నఖ్వీ ఏసీసీ చైర్మెన్తో పాటు ఐసీసీ డైరెక్టర్ గానూ కొనసాగుతున్నాడు. కాగా ఐసీసీ చైర్మెన్గా జై షా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నఖ్వీ డైరక్టర్ పదవి ఊడిపోవడం ఖాయమని ప్రచారం సాగుతోంది."ఆసియాకప్ టోర్నీకి అధికారిక హోస్ట్గా ఉన్న బీసీసీఐకి ట్రోఫీని పంపడానికి నిరాకరించే హక్కు నఖ్వీకి లేదు. అతడు ట్రోఫీని భారత్కు ఇప్పటికే పంపించాల్సింది. కానీ అందుకు అతడు ఒప్పుకోవడం లేదు. కాబట్టి అందుకు నఖ్వీ భారీ మూల్యం చెల్లించుకోనున్నాడు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: ఐపీఎల్లో అదరగొట్టాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఊహించని జాక్ పాట్ -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఊహించని జాక్ పాట్
ఢిల్లీ యువ సంచలనం, పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య రెడ్బాల్ క్రికెట్లో అరంగేట్రానికి సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం ఎంపిక చేసిన 24 మంది సభ్యుల ఢిల్లీ జట్టులో ఆర్యకు చోటు దక్కింది. రంజీ ట్రోఫీ జట్టుకు ఆర్య ఎంపిక కావడం ఇదే తొలిసారి. గతేడాది ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)తో వెలుగులోకి వచ్చిన ఆర్య.. ఈ ఏడాది ఐపీఎల్లో విధ్వంసం సృష్టించాడు.ఐపీఎల్-2025లో అద్బుతమైన సెంచరీతో ఆర్య చెలరేగాడు. ఆ తర్వాత భారత-ఎ జట్టుకు కూడా వైట్ బాల్ క్రికెట్లో ఆర్య ప్రాతినిథ్యం వహించాడు. ఆసీస్-ఎపై కూడా మూడెంకెల స్కోరు అతడు అందుకున్నాడు. ఇప్పుడు రెడ్బాల్ క్రికెట్లో కూడా సత్తాచాటాలని ప్రియాన్ష్ ఉవ్విళ్లూరుతున్నాడు.ఇక రాబోయే రంజీ సీజన్లో ఢిల్లీ జట్టుకు ఆయూష్ బదోని ప్రాతినిథ్యం వహించనున్నాడు. యువ ఆటగాడు యష్ ధుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అంతేకాకుండా సీనియర్ ప్రో నితీష్ రాణా తిరిగి జట్టులోకి వచ్చాడు. గతేడాది సీజన్లో యూపీకి ప్రాతినిథ్యం వహించిన రాణా.. తన మనసు మార్చుకుని తిరిగి ఢిల్లీకి ఆడనున్నాడు.యుష్ దోసేజా, వైభవ్ కండ్పాల్, మనీ గ్రెవాల్ వంటి డీపీఎల్ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. ఢిల్లీ జట్టు తమ తొలి మ్యాచ్లో హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 18వరకు హైదరాబాద్ వేదికగా జరగనుంది.రంజీ ట్రోఫీకి ఢిల్లీ జట్టు: ఆయుష్ బదోని (కెప్టెన్), యశ్ ధుల్ (వైస్ కెప్టెన్), అర్పిత్ రాణా, సనత్ సాంగ్వాన్, అనుజ్ రావత్, సుమిత్ మాథుర్, శివమ్ శర్మ, రౌనక్ వాఘేలా, నవదీప్ సైనీ, సిమర్జీత్ సింగ్, మనీ గ్రేవాల్, సిద్ధాంత్ శర్మ, ధ్రువ్ రజవాణి, ధృవ్ రజవాణి, ప్రణయ్త్వ్ కౌశిక్, దోసెజా, రాహుల్ దాగర్, హృతిక్ షోకీన్, ప్రియాంష్ ఆర్య, తేజస్వి దహియా, వైభవ్ కంద్పాల్, రోహన్ రాణా, ఆర్యన్ రాణా (ఫిట్నెస్కు లోబడి).చదవండి: రోహిత్కే కాదు.. నాకు ద్రవిడ్కు ఇలానే జరిగింది: సౌరవ్ గంగూలీ -
సంజూ శాంసన్ రీ ఎంట్రీ..
రంజీ ట్రోఫీ 2025–26 సీజన్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా కేసీఎ కీలక నిర్ణయం తీసుకుంది. సచిన్ బేబీ స్థానంలో మహమ్మద్ అజారుద్దీన్ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యాడు.అదేవిధంగా గత సీజన్కు దూరంగా ఉన్న సంజూ శాంసన్(Sanju Samson) తిరిగి జట్టులోకి వచ్చాడు. సంజూ జట్టుకు ఎంపికైనప్పటికి కేరళ ఆడే తొలి మ్యాచ్కు దూరంగా ఉండే అవకాశముంది. ఆక్టోబర్ 15 నుంచి 18 వరకు కేరళ-మహారాష్ట్ర జట్లు తలపడనున్నాయి.ఇదే సమయంలో సంజూ ఆసీస్ పర్యటనకు వెళ్లనున్నాడు. ఆసీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో శాంసన్ సభ్యునిగా ఉన్నాడు. ఆసీస్ నుంచి తిరిగొచ్చాక పూర్తి స్ధాయిలో తన రాష్ట్ర జట్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశముంది.వైస్ కెప్టెన్గా అపరాజిత్..ఇక రాబోయే రంజీ సీజన్కు ముందు తమిళనాడు ఆటగాడు బాబా అపరాజిత్ కేరళ క్రికెట్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అతడికి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వైస్ కెప్టెన్గా అపరాజిత్ ఎంపికయ్యాడు. ఎం డి నిధీష్, సల్మాన్ నిజార్, వత్సల్ గోవింద్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.రంజీ ట్రోఫీకి కేరళ జట్టుమహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్), బాబా అపరాజిత్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, రోహన్ ఎస్ కున్నుమ్మల్, వత్సల్ గోవింద్ శర్మ, అక్షయ్ చంద్రన్, సచిన్ బేబీ, సల్మాన్ నిజార్, అంకిత్ శర్మ, నిధీష్ ఎండి, బాసిల్ ఎన్పి, అహమ్మద్ ఇమ్రాన్, షోన్ రోజర్, అభిషేక్చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్కు సారీ చెప్పిన పృథ్వీ షా -
రోహిత్కే కాదు.. నాకు ద్రవిడ్కు ఇలానే జరిగింది: సౌరవ్ గంగూలీ
భారత వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టారు.రోహిత్ను కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ను వన్డే కెప్టెన్గా ఉద్దేశపూర్వకంగానే తొలగించారనే వాదనను గంగూలీ తోసిపుచ్చాడు. ప్రతీ కెప్టెన్కు కెరీర్ ఎండ్ సమయంలో ఇలా జరుగుతుందని దాదా అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఇకపై వన్డే జట్టులో ప్లేయర్గా కొనసాగనున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్-2027లో హిట్మ్యాన్ ఆడుతాడో లేదో ఇంకా స్పష్టత లేదు."రోహిత్తో మాట్లాడిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఉద్దేశపూర్వకంగా అయితే అతడిని తప్పించి ఉండరు. రోహిత్, సెలక్టర్ల మధ్య పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు చోటు చేసుకుందని అనుకుంటున్నా. రోహిత్ ఒక అద్భుతమైన కెప్టెన్. అతడు భారత్కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ను అందించాడు.వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా రోహిత్ ముందంజలో ఉన్నాడు. ఇక్కడ రోహిత్ కెప్టెన్సీ, ఫెర్మామ్మెన్స్ సమస్య కాదు. 2027 నాటికి రోహిత్కు 40 ఏళ్లు వస్తాయి. క్రికెట్లో వయస్సు పరంగా అది చాలా ఎక్కవ నంబర్. కెరీర్ ఆఖరిలో ప్రతీ కెప్టెన్కు ఇలానే జరుగుతోంది. నాకు,ద్రవిడ్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. శుబ్మన్ గిల్ కూడా 40 ఏళ్ల వయస్సులో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాడు. జేంటిల్మ్యాన్ గేమ్లో ప్రతీ ఒక్కరు ఏదో రోజున తమ కెరీర్ను ముగించాల్సిందే. గిల్ను కెప్టెన్గా ప్రమోట్ చేయడం సరైన నిర్ణయమే. అతడు ఇంగ్లండ్ టూర్లో అద్భుతంగా జట్టును నడిపించాడు. కెప్టెన్గా గిల్ ఎదిగే వరకు రోహిత్ ఆడుతూనే ఉండవచ్చు" ఓ ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్గా శార్ధూల్ ఠాకూర్.. సర్ఫరాజ్ ఖాన్ రీ ఎంట్రీ! నో సూర్య కుమార్? -
కెప్టెన్గా శార్ధూల్ ఠాకూర్.. సర్ఫరాజ్ ఖాన్ రీ ఎంట్రీ! నో సూర్య కుమార్?
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా జమ్మూ కాశ్మీర్తో జరిగే తొలి మ్యాచ్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఎంపికయ్యాడు. గాయం కారణంగా బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్కు దూరమైన స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.బీసీసీఐ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రావడంతో సర్ఫరాజ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీమిండియా టీ20 కెప్టెన్, ముంబైకర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుండడంతో జమ్మూతో మ్యాచ్కు దూరమయ్యాడు. మహారాష్ట్రతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ గేమ్లో పాల్గొన్న చాలా మంది ఆటగాళ్లు ఈ 16 మంది సభ్యుల జట్టులో ఉన్నారు. రాబోయే దేశీయ సీజన్కు ముందు ముంబై కెప్టెన్ పదవికి రాజీనామా చేసిన అజింక్య రహానె కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. జమ్మూతో మ్యాచ్కు ముంబై సెలక్టర్లు బలమైన జట్టును ప్రకటించారు.సీనియర్ ఆటగాళ్లతో పాటు అయూష్ మాత్రే, తనీష్ కొటియన్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా భారత టీ20 స్టార్ శివమ్ దూబే సైతం జమ్మూతో మ్యాచ్కు ఎంపికయ్యాడు. కానీ తొలి మ్యాచ్లో దూబే ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆసీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో దూబే భాగంగా ఉన్నాడు. కాగా రాబోయో రంజీ ట్రోఫీ సీజన్లో అక్టోబర్ 15-18 వరకు శ్రీనగర్ వేదికగా ముంబై, జమ్మూ కాశ్మీర్ జట్లు తలపడనున్నాయి.జమ్మూతో మ్యాచ్కు ముంబై జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే, సిద్ధేష్ లాడ్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, తుషార్ దేశ్పాండే, సిల్వెస్టర్ డిసౌజా, హార్దిక్ తమోర్ , ఇర్ఫాన్ ఉమీర్, ముషీర్ ఖాన్, అఖిల్ హెర్వాడ్కర్, రాయ్స్టన్ డయాస్చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్కు సారీ చెప్పిన పృథ్వీ షా -
‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’
టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే యోగ్రాజ్.. తాజాగా మరోసారి తన ‘బోల్డ్ కామెంట్స్’తో తెరమీదకు వచ్చాడు. ఈసారి యువీ కెరీర్ గురించి కాకుండా.. తమ వ్యక్తిగత జీవితాల గురించి యోగ్రాజ్ మాట్లాడటం విశేషం.యువీకి కోచ్గా వ్యవహరించిన యోగ్రాజ్ చిన్ననాటి నుంచే అతడికి చుక్కలు చూపించేవాడట. క్రికెటర్గా తాను అనుకున్న శిఖరాలకు చేరుకోలేకపోయానన్న కసిని కుమారుడి మీద తీర్చుకున్నట్టు గతంలో పలు సందర్భాల్లో చెప్పిన యోగ్రాజ్.. మరోసారి ఈ విషయం గురించి మాట్లాడాడు.ఏదో ఒకరోజు యువీ చచ్చిపోతాడని..లక్ష్యం దిశగా నడిపించేందుకు ఒక రకంగా యువీని హింసించానన్న యోగ్రాజ్.. తన తల్లి మరణశయ్యపై ఉన్నపుడు మనుమడి గురించి బెంగపడిందని తెలిపాడు. ఒకవేళ ఇలాగే ప్రవర్తిస్తే ఏదో ఒకరోజు యువీ చచ్చిపోతాడని బాధ పడిందని.. అయినా తన మనసు మాత్రం కరుగలేదన్నాడు. యువీని ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా తీర్చిదిద్దడం కోసమే అలా చేశానని పేర్కొన్నాడు.వాడు నన్ను బాపూ అని పిలిచాడుఇక యువీ పిల్లల గురించి ప్రస్తావన రాగా.. ‘‘నా మనుమడు ఓరియోన్ పుట్టిన రెండేళ్ల తర్వాత వాడిని చూశాను. వాడికి ఒక్క ముక్క పంజాబీ కూడా మాట్లాడటం రాదని యువీ నాతో చెప్పాడు. అయితే, ఆ తర్వాత రెండు సెకన్లలోనూ వాడు నన్ను బాపూ అని పిలిచాడు.ఇప్పటికీ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడితే నన్ను బాపూ అనే అంటాడు. నిజానికి యువీ- హాజిల్ కీచ్లకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే, వారికి ఓరియోన్తో పాటు కుమార్తె ఆరా కూడా జన్మించింది. కానీ వాళ్ల పిల్లల్ని నాతో ఎక్కువగా కలవనివ్వరు.యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తాఏదేమైనా యువీ గనుక తన పిల్లల్ని నాకు ఒక్కసారి అప్పగిస్తే.. వారి తండ్రికి పట్టిన గతే వాళ్లకూ పడుతుంది. నిప్పులో కాలిస్తేనే కదా బంగారం మెరుపు బయటపడేది. కాబట్టి నేను యువీ మాదిరే అతడి పిల్లల విషయంలోనూ ఎలాంటి దయా, కరుణా చూపను.నా గురించి తెలుసు కాబట్టే నన్ను యువీ దూరం పెట్టాడు. పిల్లలతో కలవనివ్వడు. ఏదేమైనా ఓరియోన్ నా తండ్రి పునర్జన్మే అని నా కొడుకు- కోడలు చెప్పడం సంతోషాన్నిచ్చింది. నా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను’’ అని యోగ్రాజ్ ఎస్ఎమ్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడు యువీకాగా యువీ స్కేటర్ కావాలని అనుకుంటే.. అతడి తండ్రి యోగ్రాజ్ మాత్రం యువీని క్రికెటర్ చేయాలనే సంకల్పంతో ఉండేవాడు. అందుకు తగ్గట్టుగానే యువీని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా తీర్చిదిద్దాడు. టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలవడంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ యువీది కీలక పాత్ర.ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన యువీ తన అంతర్జాతీయ కెరీర్లో టీమిండియా తరఫున 40 టెస్టుల్లో 1900, 304 వన్డేల్లో 8701, టీ20లలో 1177 పరుగులు సాధించాడు. ఇక లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. యువీ తల్లి షబ్నమ్కు విడాకులు ఇచ్చిన యోగ్రాజ్.. ఆ తర్వాత నీనా బుంధేల్ అనే నటిని పెళ్లి చేసుకున్నాడు. ఇక యువీ కెరీర్ త్వరగా ముగిసిపోవడానికి కారణం దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని యోగ్రాజ్ పదే పదే ఆరోపిస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే.చదవండి: మోసగాడినే అయితే.. నాతో కాపురం ఎలా చేసింది?.. నాలుగున్నరేళ్లు అలా.. -
డబుల్ సెంచరీకి చేరువలో జైశ్వాల్.. తొలి రోజు భారత్దే
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్(West Indies)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా దుమ్ములేపుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.యశస్వికి ఇది 7వ టెస్టు సెంచరీ. జైశ్వాల్ 173 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 22 ఫోర్లు ఉన్నాయి. క్రీజులో జైశ్వాల్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్(20) ఉన్నాడు. అంతకుముందు యువ ఆటగాడు సాయిసుదర్శన్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు.165 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసిన సుదర్శన్.. తృటిలో తన తొలి టెస్టు సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. స్పిన్నర్ వారికన్ బౌలింగ్లో వికెట్ల ముందు సుదర్శన్ దొరికిపోయాడు.వీరిద్దరితో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్(38) రాణిచాడు. అయితే రాహుల్ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో జైశ్వాల్-సాయిసుదర్శన్ రెండో వికెట్కు 193 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుదర్శన్ ఔటయ్యాక జైశ్వాల్ గిల్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక విండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా తేలిపోయారు. కాగా తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: ఇంకెంతకు దిగజారుతావు?.. నఖ్వీ ఓవరాక్షన్ మామూలుగా లేదు -
ఇంకెంతకు దిగజారుతావు?.. నఖ్వీ ఓవరాక్షన్ మామూలుగా లేదు
ఆసియాకప్-2025 ట్రోఫీ వివాదానికి ఇప్పటిలో ఎండ్కార్డ్ పడేలా లేదు. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరిగి దాదాపు వారాలు అవుతున్నప్పటికి ట్రోఫీ ఇంకా టీమిండియా చేతికి రాలేదు. ఈ ట్రోఫీ విషయంలో ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెనక్కి తగ్గడం లేదు.ఇప్పటికే తన చేతుల మీదగానే ట్రోఫీ ప్రధానం చేయాలని మొండిపట్టుతో ఉన్నాడంట. కాగా ఆసియాకప్ ఫైనల్లో విజయం తర్వాత విన్నింగ్ ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత్ ఇష్టపడలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. ఏసీసీ చైర్మెన్ ఎవరంటే వారే ట్రోఫీని విజేతకు అందించాలి.కానీ నఖ్వీ ఏసీసీ చీఫ్తో పాటు పీసీబీ చైర్మెన్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడంతో ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరిచింది. అతడికి బదులుగా యూఏఈ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ల చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని భారత్ తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ ఒప్పుకోలేదు. తీసుకుంటే తన నుంచే తీసుకోవాలని పట్టుబట్టాడు. టీమిండియా ప్లేయర్లు కూడా వెనక్కి తగ్గకుండా గ్రౌండ్లోనే కూర్చోవడం పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది. దీంతో ఘోర అవమానంగా భావించిన నఖ్వీ.. స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విన్నర్స్ మెడల్స్ను తీసుకువెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. అయితే ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు నఖ్వీ అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు. ట్రోఫీ ఇంకా నఖ్వీ వద్దే ఉంది."ప్రస్తుతం ఆసియాకప్ ట్రోఫీ దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. అక్కడి అధికారులకు మొహ్సిన్ నఖ్వీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని అతడు సూచించాడు. ఎప్పుడైనా కానీ భారత జట్టుకు లేదా బీసీసీఐకి ట్రోఫీ తనే అందజేస్తానని ఏసీసీ అధికారులకు నఖ్వీ చెప్పినట్లు" పీసీబీ చీఫ్ సన్నిహితుడు ఒకరు పిటిఐకు తెలిపారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న సమావేశాల్లో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్కు సారీ చెప్పిన పృథ్వీ షా -
హార్ట్బ్రేక్.. చేజారిన టెస్టు తొలి సెంచరీ
వెస్టిండీస్తో రెండో టెస్టు (IND vs WI)లో టీమిండియా వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan)కు చేదు అనుభవం ఎదురైంది. అద్భుతమైన ఇన్నింగ్స్తో సెంచరీ దిశగా పయనించిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. తొలి టెస్టు శతకానికి పదమూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. దీంతో సాయితో పాటు అతడి అభిమానుల హార్ట్బ్రేక్ అయింది.జైస్వాల్ భారీ శతకంభారత్- వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) భారీ శతకంతో మెరిశాడు. అతడికి జతగా వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా అదరగొట్టాడు.193 పరుగుల భాగస్వామ్యంఈ ఇద్దరు లెఫ్టాండర్లు కలిసి రెండో వికెట్కు 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 165 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు రాబట్టిన సాయి సుదర్శన్.. విండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా సాయి టెస్టుల్లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.ఇక తొలిరోజు 83 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో వారికన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జైసూ 151, కెప్టెన్ శుబ్మన్ గిల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్ సందర్భంగా సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున నాలుగు మ్యాచ్లు ఆడిన ఈ చెన్నై చిన్నోడు 234 పరుగులు సాధించాడు. చదవండి: దిగ్గజాల సరసన యశస్వి జైస్వాల్.. భారత రెండో బ్యాటర్గా.. At his clinical best! 🧿#SaiSudharsan makes batting look easy as he brings up his half-century! 🙌Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/yhYag1I0if— Star Sports (@StarSportsIndia) October 10, 2025 -
'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్కు సారీ చెప్పిన పృథ్వీ షా
ముంబై, మహారాష్ట్ర రంజీ ట్రోఫీ వార్మాప్ మ్యాచ్లో ముషీర్ ఖాన్-పృథ్వీ షా(Prithvi Shaw) మధ్య చోటు చేసుకున్న వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. ముషీర్కు పృథ్వీ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. "పృథ్వీ షా తన తప్పును తెలుసుకుని ముషీర్కు క్షమాపణలు చెప్పాడు. పృథ్వీ అతడితోతో నేను నీకు అన్నయ్య లాంటివాడిని అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవు. అంతా బాగానే ఉంది" మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్ వర్గాలు వెల్లడించాయి.అసలేమి జరిగిందంటే?రంజీ ట్రోఫీ 2025-26 సీజన్కు ముందు ముంబై, మహారాష్ట్ర జట్లు ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మహారాష్ట్ర తరపున ఆడిన పృథ్వీ షా(181) భారీ సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఆట ముగిస్తుందన్న సమయంలో పృథ్వీ.. ముషీర్ ఖాన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు.ముషీర్ వికెట్ తీసిన తర్వాత "థాంక్యూ" అని కాస్త వ్యంగ్యంగా అన్నాడు. దీంతో పృథ్వీ షా కోపంతో ఊగిపోయాడు. ముషీర్ను బ్యాట్తో కొట్టేందుకు అతడు వెళ్లాడు. అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.అయితే ఈ వ్యవహరంపై ముంబై క్రికెట్ అసోయేషిన్, మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్(MCA) సీరియస్ అయ్యాయి. ఈ రెండు క్రికెట్ అసోయేషిన్లు విచారణకు ఆదేశించాయి. అంతలోనే ముషీర్కు పృథ్వీ సారీ వివాదాన్ని ముగించాడు. అయినప్పటికి తమ క్రమశిక్షణ నియమావళిని ఉల్లఘించినందుకు మహారాష్ట్ర క్రికెట్ అసోయేషిన్ ఏదైనా చర్య తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.ముంబై క్రికెట్ అసోసియేషన్తో విబేధాల కారణంగా పృథ్వీ షా తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. రాబోయో రంజీ సీజన్ కోసం మహారాష్ట్ర జట్టులో పృథ్వీకి చోటు దక్కింది.చదవండి: దిగ్గజాల సరసన యశస్వి జైస్వాల్.. భారత రెండో బ్యాటర్గా.. -
శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. దిగ్గజాల సరసన
వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతక్కొట్టాడు. ఢిల్లీ వేదికగా శుక్రవారం నాటి తొలిరోజు ఆట సందర్భంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 145 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. భారత తొలి ఇన్నింగ్స్ యాభైవ ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసి జైసూ.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు.కాగా టెస్టు కెరీర్లో జైస్వాల్కు ఇది ఏడో శతకం కావడం విశేషం. ఈ క్రమంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అరుదైన క్లబ్లో చేరాడు. 24 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన దిగ్గజాల సరసన నిలిచాడు. టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత రెండో బ్యాటర్గా జైసూ చరిత్రకెక్కాడు.ఇక 23 ఏళ్ల జైస్వాల్ 2023లో వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసి.. తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయిన జైసూ.. తాజాగా మరోసారి సెంచరీతో మెరిశాడు.ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. వైట్వాష్పై గురిపెట్టింది. రెండో టెస్టు తొలిరోజు టీ బ్రేక్ సమయానికి 58 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులకే నిష్క్రమించగా.. జైసూ 162 బంతుల్లో 111, వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 132 బంతుల్లో 71 పరుగులతో క్రీజులో ఉన్నారు.24 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లు వీరే🏏డాన్ బ్రాడ్మన్ (ఆస్ట్రేలియా)- 12🏏సచిన్ టెండుల్కర్ (ఇండియా)-11🏏గ్యారీ సోబర్ఫీల్డ్ (వెస్టిండీస్)- 9🏏జావేద్ మియాందాద్ (పాకిస్తాన్), గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), యశస్వి జైస్వాల్ (ఇండియా)-7.చదవండి: విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రాWhat a player! 👏@ybj_19 joins South African icon #GraemeSmith to score the most Test tons (7) by an opener aged 23 or younger! 🙌Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/aig46QChOd— Star Sports (@StarSportsIndia) October 10, 2025 -
నిజమే!.. ‘ప్రియురాలి’తో హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన అతడు.. ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరమయ్యాడు.ఈ క్రమంలో తనకు దొరికిన విరామ సమయాన్ని హార్దిక్ పాండ్యా ‘ప్రియురాలి’తో గడుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ బరోడా ఆల్రౌండర్ గతంలో నటాషా స్టాంకోవిక్ అనే సెర్బియా మోడల్తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే కుమారుడు అగస్త్యకు ప్రాణం పోసిన ఈ జంట.. కోవిడ్ సమయంలో అత్యంత సన్నిహితుల నడుమ దండలు మార్చుకున్నారు.కుమారుడు జన్మించిన మూడేళ్లకు అంటే.. 2023, ఫిబ్రవరి 14న ఉదయ్పూర్లో హార్దిక్- నటాషా మరోసారి ఘనంగా వివాహం చేసుకున్నారు. హిందూ- క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం మరోసారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఆ తర్వాత ఏడాదికే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు.విడాకులు తర్వాత హార్దిక్- నటాషా కుమారుడు అగస్త్య బాధ్యతను సమంగా పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్.. సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆమెతోనూ కటీఫ్ చెప్పిన హార్దిక్.. మోడల్ మహీక శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.ఇందుకు బలం చేకూరుస్తూ మహీకతో కలిసి ఒకే కారులో ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన హార్దిక్.. ఆమె చేయిని పట్టుకుని ముందుకు నడిపించాడు. ఆ సమయంలో ఇద్దరూ నలుపు రంగు వస్త్రాల్లో.. ఒకే రకమైన జాకెట్ ధరించి.. వైట్ షూస్ వేసుకుని ట్విన్నింగ్ లుక్తో కనిపించారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘ఇద్దరూ ఒకేలా ఉన్నారే’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో విడాకుల సమయంలో నటాషాను అనవసరంగా తప్పుబట్టామని.. హార్దిక్ను వెనకేసుకువచ్చిన వాళ్లు ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 31 ఏళ్ల హార్దిక్ పాండ్యా.. ఇప్పటి వరకు 11 టెస్టులు, 94 వన్డేలు, 120 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ రైటార్మ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. టెస్టుల్లో 532, వన్డేల్లో 1904, టీ20లలో 1860 పరుగులు సాధించడంతో పాటు.. ఆయా ఫార్మాట్లలో 17, 91, 98 వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
విండీస్తో రెండో టెస్ట్.. అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతను అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 71 ఇన్నింగ్స్ల్లో ఈ అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్ భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) (68 ఇన్నింగ్స్లు) జైస్వాల్ కంటే వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 51 ఓవర్లలో తర్వాత వికెట్ నష్టానికి 198 పరుగులు చేసింది. జైస్వాల్ 145 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా సాయి సుదర్శన్ (58) క్రీజ్లో ఉన్నాడు.అంతకుముందు కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్కు దక్కింది. అతడి బౌలింగ్లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా -
పాక్ దిగ్గజం వసీం అక్రమ్కు క్రెడిట్ ఇచ్చిన అర్ష్దీప్ సింగ్
టీమిండియాలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారాడు అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh). ముఖ్యంగా టీ20లలో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరొందిన 26 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్... ఇటీవలే సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యంత వేగంగా వంద వికెట్ల క్లబ్లో చేరిన ఫాస్ట్బౌలర్గా చరిత్ర లిఖించాడు.అత్యధిక వికెట్లు వీరుడిగా..కేవలం 64 ఇన్నింగ్స్లోనే వంద వికెట్లు సాధించిన అర్ష్.. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా నిలిచాడు. 2022లో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 65 టీ20లు, 9 వన్డేలు ఆడిన ఈ పంజాబీ ఆటగాడు.. ఆయా ఫార్మాట్లలో 101, 14 వికెట్లు పడగొట్టాడు.ఇక ఇటీవల ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టెస్టు జట్టుకు అర్ష్దీప్ ఎంపికైనా.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. తదుపరి ఆస్ట్రేలియా టూర్లో భాగంగా వన్డే, టీ20లలో అర్ష్ బిజీకానున్నాడు. ఈ నేపథ్యంలో బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బుమ్రాతో పాటు పాక్ దిగ్గజానికి క్రెడిట్ ఇచ్చిన అర్ష్దీప్బౌలర్గా తాను విజయవంతం కావడానికి టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ కారణమని అర్ష్దీప్ సింగ్ పేర్కొన్నాడు. బుమ్రాతో డ్రెసింగ్రూమ్ షేర్ చేసుకోవడం తనకు దక్కిన ఆశీర్వాదమంటూ హర్షం వ్యక్తం చేశాడు. తన బౌలింగ్ శైలికి కారణం బుమ్రానే అని తెలిపాడు.అదే విధంగా.. ‘‘యూట్యూబ్లో అందుబాటులో ఉన్న లెఫ్టార్మ్ పేసర్ల వీడియోలన్నీ చూసేశాను. ఒక్కరి వీడియో కూడా మిస్ కాలేదు. యార్కర్లు చూడాలనిపిస్తే.. కచ్చితంగా వసీం అక్రం వీడియోలే చూస్తాను. అందులో ఆయన దృష్టి మొత్తం స్టంప్స్పై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది.ఆ ఇద్దరు కూడా..ఇన్-స్వింగర్లు, రివర్స్ స్వింగర్లను బాగా ఆస్వాదిస్తా’’ అని అర్ష్దీప్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్తో పాటు శ్రీలంక పేస్ లెజెండ్ లసిత్ మలింగల వీడియోల ద్వారా ఒకే శైలిలో భిన్నంగా ఎలా బంతులు సంధించాలో తెలుకున్నానని అర్ష్దీప్ తెలిపాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్ -
ఐపీఎల్ 2026కు సంబంధించి బిగ్ అప్డేట్
ఐపీఎల్ 2026కు (IPL 2026) సంబంధించి బిగ్ అప్డేట్ తెలుస్తుంది. ఈ సీజన్ వేలం డిసెంబర్ 13–15 మధ్య తేదీల్లో జరగనుందని సమాచారం. బీసీసీఐతో చర్చించిన ఫ్రాంచైజీల ప్రతినిధులు ఈ తేదీలను సూచించారని తెలుస్తుంది. ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్దే తుది నిర్ణయంగా ఉంటుంది.రిటెన్షన్కు ఇదే డెడ్లైన్..!అన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా తమ రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. విడుదల చేయబోయే ఆటగాళ్ల పేర్లను అంతకుముందే ఖరారు చేయాలి.ఈసారి వేలం భారత్లోనే..?గత రెండు సీజన్లలో (2023 దుబాయ్, 2024 జెడ్డా) విదేశాల్లో జరిగిన వేలం, ఈసారి భారత్లోనే జరిగే అవకాశముంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్లో భారీ మార్పులు..?చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్తాన్ రాయల్స్ (RR) గత సీజన్లో అట్టడుగు స్థానాల్లో ముగించడంతో వచ్చే సీజన్కు ముందు భారీ మార్పులకు ఆస్కారముంటుంది.సీఎస్కే.. దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి లాంటి లోకల్ వెటరన్లను వదిలించుకోవచ్చు. అశ్విన్ ఎలాగూ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి, అతనికి ఇస్తున్న రూ. 9.75 కోట్లను కూడా వేలంలో వాడుకోవచ్చు.రాజస్తాన్ విషయానికొస్తే.. వేలానికి ముందే ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్ సంజూ శాంసన్ను ట్రేడింగ్ విండో ఆప్షన్ ద్వారా విడుదల చేసే అవకాశముంది. ఇతర ఫ్రాంచైజీలు ఏవైనా సంజూపై ఆసక్తి కనబరిస్తే.. ట్రేడింగ్ జరగవచ్చు.ఆర్ఆర్ యాజమాన్యం సంజూతో పాటు వనిందు హసరంగ, మహీష్ తీక్షణను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి విషయంలో కుమార సంగక్కర (కోచ్) కీలకపాత్ర పోషిస్తాడు.వెంకటేష్ అయ్యర్పై వేటుగత సీజన్ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో రూ. 23.75 కోట్ల ధర దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ వదిలించుకోవచ్చు. గత సీజన్లో అతను దారుణంగా విఫలమయ్యాడు.గ్రీన్కు భారీ ధర..?ఈ సీజన్ వేలంలో ఆసీస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కెమారూన్ గ్రీన్కు భారీ ధర దక్కే అవకాశం ఉంది. గత సీజన్లో గాయంతో మిస్ అయిన గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. చదవండి: విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా -
విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా
వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రంగంలోకి దిగకుండానే ఓ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్తో టెస్ట్ల్లో హాఫ్ సెంచరీ (50 మ్యాచ్లు) పూర్తి చేసిన అతను.. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్లు ఆడిన తొలి ఫాస్ట్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫాస్ట్ బౌలర్ మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్లు ఆడలేదు.31 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు భారత్ తరఫున 50 టెస్ట్లు, 89 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. 2016 జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసి మూడు ఫార్మాట్లలో 467 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ తొలిసారి టాస్ గెలిచాడు.లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్కు దక్కింది. అతడి బౌలింగ్లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: 'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు -
నిరాశపరిచిన కేఎల్ రాహుల్.. లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?
ఢిల్లీ వేదికగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య శుక్రవారం (అక్టోబరు 10) రెండో టెస్టు (IND vs WI 2nd Test) మొదలైంది. అరుణ్జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన భారత జట్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill).. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ టీమిండియాకు శుభారంభం అందించారు.ఈసారి నిరాశపరిచిన కేఎల్ రాహుల్అయితే, గత మ్యాచ్లో సెంచరీ సాధించిన రాహుల్ ఈసారి మాత్రం కాస్త నిరాశపరిచాడు. 54 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. విండీస్ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ జొమెల్ వారికన్ తన తొలి ఓవర్లోనే అద్భుతమైన బంతితో రాహుల్ను బోల్తా కొట్టించాడు.Shifting gears! ⚙After a steady start, @klrahul unwinds with an elegant punch down the ground. ⚡Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/CpSkK3IJXi— Star Sports (@StarSportsIndia) October 10, 2025స్టంపౌట్గాటీమిండియా తొలి ఇన్నింగ్స్లో పద్దెనిమిదవ ఓవర్ మూడో బంతికి వారికన్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో వెంటనే బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ బెయిల్స్కు గిరాటేశాడు. pic.twitter.com/iNdmtNK9e6— crictalk (@crictalk7) October 10, 2025 దీంతో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే దురదృష్టవశాత్తూ స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 58 పరుగుల స్కోరు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.లంచ్ బ్రేక్ సమయానికి స్కోరెంతంటే?ఇక తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులో ఓపికగా ఆడుతున్నాడు. తొలిరోజు నాటి భోజన విరామ సమయానికి జైసూ 78 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 40 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇక వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ 36 బంతుల్లో మూడు ఫోర్లు బాది 16 పరుగులతో జైసూతో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా శుక్రవారం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 28 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో టీమిండియా విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో త్తుగా ఓడించి.. రెండుమ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తుది జట్లు..టీమిండియాయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహహ్మద్ సిరాజ్వెస్టిండీస్: జాన్ క్యాంప్బెల్, తగ్నరైన్ చందర్పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్ -
ఇదొక తప్పుడు నిర్ణయం: టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) పెదవి విరిచాడు. అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని టీమిండియా సెలక్టర్లు ఓ ఆటగాడి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించాడు. వెస్టిండీస్తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.మూడు వన్డేలు, ఐదు టీ20లుఇందులో భాగంగా అక్టోబరు 19 నుంచి ఆసీస్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు... 15న ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. న్యూఢిల్లీ నుంచి రెండు విడతలుగా మన ప్లేయర్లు పెర్త్కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా... ఆసీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే వన్డే, టీ20 జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.సంజూ శాంసన్ను కాదని...అయితే, వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్కు తోడుగా.. ధ్రువ్ జురెల్ను వన్డేలకు తొలిసారి ఎంపిక చేశారు సెలక్టర్లు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్పై వేటు వేసి.. టెస్టుల్లో ఇరగదీస్తున్న జురెల్ను ఆసీస్ టూర్కు ఎంచుకున్నారు.అతడి ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది.. కానీఈ నేపథ్యంలో కైఫ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ‘‘ఇటీవలి కాలంలో ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా వెస్టిండీస్తో తొలి టెస్టులో శతకంతో మెరవడం విశేషమే. అతడి ఆట తీరు ఎంతో గొప్పగా ఉంది.భారత క్రికెట్కు ఆశాకిరణం అతడు. ప్రతి మ్యాచ్లోనూ చితక్కొట్టగల నైపుణ్యాలు అతడికి ఉన్నాయి. కానీ వన్డేల్లో సంజూ శాంసన్ను కాదని జురెల్ను ఎంచుకోవడం తప్పుడు నిర్ణయం. ఎందుకంటే.. సంజూ సాధారణంగానే లోయర్ ఆర్డర్లో ఆడతాడు.వన్డేల్లో సంజూ గొప్ప ఆప్షన్ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. కాబట్టి జురెల్ కంటే వన్డేల్లో సంజూ గొప్ప ఆప్షన్ అవుతాడు. లోయర్ ఆర్డర్లో ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సంజూ భేష్. సిక్సర్లు బాదగలడు. ఒకవేళ ఆసీస్తో వన్డేలో అతడిని ఆడిస్తే.. ఆడం జంపా బౌలింగ్లో హిట్టింగ్ ఆడగల సత్తా అతడికి ఉంది. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో సంజూ టాప్-10లో ఉన్న సంగతి మర్చిపోవద్దు.ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితులకు సంజూ ఐదు లేదంటే ఆరో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. జురెల్ ఇటీవల మంచి ఫామ్లో ఉన్నాడు. అందుకోసం సంజూ వంటి నిలకడగా ఆడే బ్యాటర్లను పక్కన పెట్టడం సరికాదు. వన్డే జట్టులో చోటుకు అతడు అర్హుడు’’ అని కైఫ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్తో టీ20 సిరీస్కు మాత్రం సెలక్టర్లు సంజూను ఎంపిక చేయడం గమనార్హం.రోహిత్పై వేటు వేసి.. గిల్కు పగ్గాలుఇక ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య పెర్త్ వేదికగా అక్టోబరు 19న తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ నుంచి భారత వన్డే జట్టుకు కూడా శుబ్మన్ గిల్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ టూర్లో టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేసిన గిల్ను... తొలిసారి వన్డే జట్టుకు సారథిగా ఎంపిక చేశారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లి చాన్నాళ్ల తర్వాత తిరిగి మైదానంలో దర్శనమివ్వనున్నారు. కాగా వన్డే సారథిగా రోహిత్ను ఇప్పుడే తప్పించడాన్ని కైఫ్ ఇప్పటికే తప్పుబట్టిన విషయం తెలిసిందే.చదవండి: అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్ -
'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు
భారత క్రికెట్ జట్టును టీమిండియా (Team India) అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఓ ప్రైవేట్ సంస్థ (BCCI) ఎంపిక చేసే జట్టును భారత జట్టు లేదా టీమిండియా అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ (PIL) దాఖలు చేశారు.బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ఇండియా లేదా భారత్ పేరును వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా చేసి జాతీయ గుర్తింపు పొందడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.సమాచార హక్కు చట్టం (RTI) ఆధారంగా బీసీసీఐకి ప్రభుత్వ గుర్తింపు లేదా నిధులు లేవని పేర్కొన్నారు. జాతీయ చిహ్నాలు, జెండా, పేరు వాడకం ద్వారా 1950 చట్టం, 2002 ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రసార్ భారతి వంటి జాతీయ ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును ‘టీమిండియా’ పేరుతో ప్రసారం చేయడం సరికాదని పేర్కొన్నారు.ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తిప్పికొట్టింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలా ఈ పిటిషన్ను కోర్టు సమయాన్ని వృథా చేసే చర్యగా అభివర్ణించారు.ఈ జట్టు విశ్వ వేదికపై భారత్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. అలాంటప్పుడు టీమిండియా లేదా భారత జట్టని ఎందుకు పిలవకూడదని న్యాయమూర్తి తుషార్ గెడెలా పిటిషనర్ను ప్రశ్నించారు.క్రీడా జట్లను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేస్తారా..? కామన్వెల్త్, ఒలింపిక్స్లో పాల్గొనే జట్లను ప్రభుత్వమే ఎంపిక చేస్తుందా అని ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ ప్రశ్నించారు. మీ ఇంట్లో జాతీయ జెండా ఎగురవేయడం నిషేధమా అని నిలదీశారు. దేశ పేరు, జాతీయ చిహ్నాల వాడకం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. క్రీడా వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ప్రమాదకరమని హెచ్చరించారు. దేశానికి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలని అక్షింతలు వేశారు. ఈ పిటిషన్ను విచారణకు అర్హం కాదని కొట్టి పారేశారు.ఈ తీర్పుతో టీమిండియా అనే పేరు చట్టబద్ధంగా కొనసాగించవచ్చని, బీసీసీఐ జట్టు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు -
అందుకే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. తనొక అద్భుతం: భారత కెప్టెన్
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్ను అనూహ్య రీతిలో భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితం రాబట్టలేకపోయింది. సౌతాఫ్రికా బ్యాటర్ నదినె డి క్లెర్క్ (Nadine de Klerk) అద్భుత ఆట తీరుతో టీమిండియా నుంచి మ్యాచ్ను లాగేసుకుని.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే తమ జట్టును విజయతీరాలకు చేర్చింది.ఈ నేపథ్యంలో అనూహ్య ఓటమిపై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందించింది. టాపార్డర్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణం అని పేర్కొంది. ఇకపై తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉందని.. భారీ స్కోర్లు సాధించడంపై దృష్టి పెడతామని పేర్కొంది.251 పరుగులకు ఆలౌట్ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 (ICC Women's ODI World Cup) టోర్నీలో భాగంగా భారత్ విశాఖ వేదికగా గురువారం సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి ఫెయిల్ఓపెనర్లలో ప్రతికా రావల్ (37) ఫర్వాలేదనిపించగా.. స్మృతి మంధాన (23) మరోసారి నిరాశపరిచింది. ఇక వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియెల్ (13)తో పాటు నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ (9) కూడా విఫలమైంది. రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్జెమీమా రోడ్రిగెస్ డకౌట్ కాగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ 13 పరుగులకే వెనుదిరిగింది. ఇలాంటి క్లిష్ట దశలో వికెట్ కీపర్ రిచా ఘోష్ విధ్వంసకర ఇన్నింగ్స్ (77 బంతుల్లో 94)తో జట్టును ఆదుకోగా.. స్నేహ్ రాణా (24 బంతుల్లో 33) ఆమెకు సహకరించింది.A game-changing fifty by Richa Ghosh, her 7th in ODIs & first in CWC! 🔥Will she & Sneh Rana steer Team India over the 250-run mark?Catch the LIVE action ➡ https://t.co/qUAtuPmsC2#CWC25 👉 #INDvSA | LIVE NOW on Star Sports & JioHotstar! pic.twitter.com/r1SyLR4ieB— Star Sports (@StarSportsIndia) October 9, 202584 పరుగులతో అజేయంగాఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే చుక్కెదురైంది. తజ్మిన్ బ్రిట్స్ డకౌట్ కాగా.. సునే లూస్ 5 పరుగులకే అవుటైంది. మరో ఓపెనర్, కెప్టెన్ వొల్వార్ట్ 70 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ నదినే డి క్లెర్క్ 54 బంతుల్లోనే 84 పరుగులతో అజేయంగా నిలిచి.. హర్మన్సేన హార్ట్ బ్రేక్ చేసింది.టాపార్డర్లో మేము బాధ్యత తీసుకోలేకపోయాంఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్లో మేము బాధ్యత తీసుకోలేకపోయాం. వ్యూహాలు మార్చుకోవాలి. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాలి. ఇదొక సుదీర్ఘ టోర్నమెంట్.ఏదేమైనా ఈ మ్యాచ్ మాకు కఠినంగా తోచింది. ఎన్నో పాఠాలు నేర్పింది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. ఈ మ్యాచ్లో ఇరుజట్లు గొప్పగా ఆడాయి. మా టాపార్డర్ కుప్పకూలినా 250కి పైగా స్కోరు చేయడం శుభపరిణామమే.అయితే, ఆఖర్లో క్లెర్క్ అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను తమ జట్టు వైపు తిప్పేసింది. విశాఖ పిచ్ బాగుంది. సౌతాఫ్రికా విజయానికి అర్హమైన జట్టే’’ అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. ఇక రిచా ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అత్యద్భుతంగా ఆడింది. రిచా హిట్టింగ్ ఈ మ్యాచ్లో మాకు అతిపెద్ద సానుకూలాంశం. తనిలాగే ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం’’ అని హర్మన్ పేర్కొంది.చదవండి: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు -
సన్రైజర్స్ యాజమాన్యంతో గొడవ.. పదవి నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ దిగ్గజం
దిగ్గజ ఆల్రౌండర్, మాజీ ఇంగ్లండ్ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) (ఐపీఎల్) సిస్టర్ ఫ్రాంచైజీ అయిన నార్త్రన్ సూపర్ ఛార్జర్స్తో (ద హండ్రెడ్ లీగ్) బంధాన్ని తెంచుకున్నాడు. గత రెండు సీజన్లుగా సూపర్ ఛార్జర్స్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న ఫ్లింటాఫ్.. యాజమాన్యంతో విభేదాల కారణంగా పదవి నుంచి వైదొలిగాడు. సూపర్ ఛార్జర్స్ యాజమాన్యానికి ఫ్లింటాఫ్కు పారితోషికం విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తుంది. సన్రైజర్స్ యాజమాన్యం సూపర్ ఛార్జర్స్ను ఓవర్టేక్ చేశాక ఫ్లింటాఫ్కు జీతం పెంచుతామని మాట ఇచ్చారట. అయితే ఈ పెంపు నామమాత్రంగా ఉండటంతో ఫ్లింటాఫ్ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ విషయాన్ని యాజమాన్యం వద్ద ప్రస్తావించినా పెద్దగా పట్టించుకోకపోవడడంతో కోచ్ పదవికి రాజీనామా చేశాడు. సూపర్ ఛార్జర్స్ ఆఫర్ చేసే దానికంటే నా సేవలకు చాలా విలువైనవని ఫ్రాంచైజీని వీడాక ఫ్లింటాఫ్ అన్నాడు. 47 ఏళ్ల ఫ్లింటాఫ్ గత రెండు సీజన్లలో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్కు హెడ్ కోచ్గా పని చేశాడు. ఈ రెండు సీజన్లను ఆ జట్టు నాలుగు, మూడు స్థానాలతో ముగించింది.కాగా, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమైన సన్ గ్రూప్ ఈ ఏడాదే నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఫ్రాంచైజీని పూర్తిగా సొంతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీలో 100 శాతం వాటా హక్కులను కావ్యా మారన్ (Kavya Maran) నేతృత్వంలోని సన్ గ్రూప్ దక్కించుకుంది. సన్ గ్రూప్కు ఐపీఎల్, హండ్రెడ్ లీగ్ల్లోనే కాకుండా సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ ఓ ఫ్రాంచైజీ ఉంది. దాని పేరు సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్.ఫ్లింటాఫ్కు కొత్త ఆఫర్లు..?నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన ఫ్లింటాఫ్కు త్వరలో కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హండ్రెడ్ లీగ్లోని మాంచెస్టర్ ఒరిజినల్స్ (త్వరలో మాంచెస్టర్ సూపర్జెయింట్స్), ట్రెంట్ రాకెట్స్ జట్లకు హెడ్ కోచ్లు లేరు. ఈ రెండిటిలో ఏదో ఒక ఫ్రాంచైజీ ఫ్లింటాఫ్కు కోచ్ పదవి ఆఫర్ చేసే అవకాశం ఉంది. చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..! -
విండీస్తో రెండో టెస్ట్.. ఎట్టకేలకు టాస్ గెలిచిన శుభ్మన్ గిల్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాల్టి నుంచి (అక్టోబర్ 10) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా శుభ్మన్కు ఇది తొలి టాస్ విజయం. అతను టెస్ట్ కెప్టెన్ అయ్యాక వరుసగా ఆరు మ్యాచ్ల్లో టాస్లు ఓడాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించింది. విండీస్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కింగ్, జోహన్ లేన్ స్థానాల్లో టెవిమ్ ఇమ్లాచ్, ఆండర్సన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్లు..వెస్టిండీస్: జాన్ క్యాంప్బెల్, తేజ్నరైన్ చందర్పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..! -
క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం జరిగింది. తొలిసారి ఓ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన ఎనిమిదో నంబర్ ప్లేయర్లు అర్ద సెంచరీలు చేశారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు.వన్డే ప్రపంచకప్ 2025లో (CWC 2025) భాగంగా భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) మధ్య జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్కు చెందిన ఎనిమిదో నంబర్ ప్లేయర్ రిచా ఘెష్ (Richa Ghosh), సౌతాఫ్రికా తరఫున ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నదినే డి క్లెర్క్ (Nadine de Klerk) అర్ద సెంచరీలు చేశారు.ఘోష్, క్లెర్క్ ఈ అర్ద సెంచరీలను వారివారి జట్లు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా, ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడింది. స్వల్ప తేడాతో సెంచరీ సైతం మిస్ అయ్యింది. స్నేహ్ రాణాతో కలిసి (33) అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్కు ఫైటింగ్ స్కోర్ను అందించింది.క్లెర్క్ విషయానికొస్తే.. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 142 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి, మ్యాచ్పై ఆశలు దాదాపుగా వదులుకుంది. ఈ దశలో ఎనిమిదో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగిన క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు).. సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుని, తన జట్టుకు అపుకూప విజయాన్నందించింది. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్పై సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్లెర్క్ కారణంగా తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
IND Vs SA: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) ఓ ఆసక్తికర పోరు జరిగింది. భారత్, సౌతాఫ్రికా జట్లు వైజాగ్ వేదికగా హోరాహోరీగా తలపడ్డాయి. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు నదినే డి క్లెర్క్ (Nadine de Klerk) (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్.. క్లో ట్రయాన్ (49) సహకారంతో సౌతాఫ్రికాను గెలిపించింది. లక్ష్యానికి కొద్ది దూరంలో (41 పరుగులు) ట్రయాన్ ఔట్ కాగా.. చివర్లో క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉండి, 24 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ముగించింది.క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. వన్డే క్రికెట్ చరిత్రలో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో, ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఐదో వికెట్ పడిన తర్వాత 171 పరుగులు జోడించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ (159) పేరిట ఉండేది.సౌతాఫ్రికా హ్యాట్రిక్ఈ గెలుపుతో సౌతాఫ్రికా హ్యాట్రిక్ సాధించింది. ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికాకు భారత్పై ఇది వరుసగా మూడో విజయం. ఈ గెలుపుకు మరో ప్రాధాన్యత కూడా ఉంది. వన్డేల్లో భారత్ చేతిలో వరుసగా ఐదు ఓటముల తర్వాత సౌతాఫ్రికాకు లభించిన తొలి విజయం ఇది.రిచా ఘోష్ చారిత్రక ఇన్నింగ్స్ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి, రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్ రాణా (33) సహకారంతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. ప్రస్తుత ప్రపంచకప్లో భారత్కు ఇది తొలి ఓటమి. అంతకుముందు భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్లపై విజయాలు సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
పరుగుల ఫన్డుగ
విశాఖ స్పోర్ట్స్ : రెండు పులులు బరిలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఒకరిపై ఒకరు పంజా విసురుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? విశాఖ వేదికగా జరిగిన మహిళల క్రికెట్ మ్యాచ్లో టీం ఇండియా బ్యాటర్ రిచా ఘోష్, సఫారీ బ్యాటర్ నాడిన్ డి క్లర్క్ తమ ప్రదర్శనతో ఆ ప్రశ్నలకు బదులిచ్చారు. నువ్వా నేనా అన్నట్టు ఫ్లడ్లైట్ల వెలుగుల్లో వీరిద్దరూ పరుగుల వరద సృష్టించారు. మ్యాచ్కు ముందు విశాఖలో వరుణుడు కాసేపు ఆనందపు జల్లులు కురిపించాడు. దీంతో తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన దక్షిణాఫ్రికా టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అనుకున్నట్టే టాప్ ఆర్డర్లు ఒక్కక్కరిగా పెవిలియన్కు చేరుకున్నారు. వంద పరుగులకే టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఇలాంటి సమయంలో రిచా ఘోష్ సివాంగిలా విరిచుకుపడింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అంతవరకు పట్టు బిగించామన్న దక్షిణాఫ్రికాకు చెమటలు పట్టించింది. 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 94 పరుగులు సాధించింది. ఆఖరి ఓవర్ భారీ సిక్స్కు ప్రయత్నించి దురదృష్టవశాత్తూ క్యాచ్ఔట్గా వెనుతిరిగింది. అయితే అప్పటికే భారత్ స్కోరు 251 చేరింది.భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడపడ్డారు. 81 పరుగులకే 5 కీలక వికెట్లు చేజార్చుకున్నారు. ఈ క్రమంలో భారత్ విజయం నల్లేరుమీద నడకే అనున్నారంతా... కానీ అప్పుడు సివంగిలా నాడిన్ డి క్లర్క్ ఎదురుదాడికి దిగింది. ఒంటి చేత్తో భారీ లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసింది. కేవలం 54 బంతుల్లో 84 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించడంతో సఫారీల విజయ సంబరాలు అంబరాన్నంటాయి. -
చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) 28 ఏళ్ల కిందటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్లో 32 బంతుల్లో 23 పరుగులు చేసిన మంధన ఈ క్యాలెండర్ ఇయర్లో (2025) పరుగుల సంఖ్యను 982కు (17 ఇన్నింగ్స్ల్లో) పెంచుకుంది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (Belinda Clark) పేరిట ఉండేది. క్లార్క్ 1997 క్యాలెండర్ ఇయర్లో 970 పరుగులు చేసింది. ఈ విభాగంలో మంధన, క్లార్క్ తర్వాత సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు. మంధన వన్డేల్లో ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలమైనా, అంతకుముందు అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది మంధన ఖాతాలో నాలుగు వన్డే శతకాలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో నంబర్ ప్లేయర్ నదినే డి క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది.భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్, క్లో ట్రయాన్ (49) సహకారంతో మ్యాచ్ను గెలిపించింది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సిన దశలో క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్ను ముగించింది. అంతకుముందు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (70) రాణించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్ రాణా (33) సహకారంతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఈ మ్యాచ్ను చేజార్చుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన రిచా ఘోష్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా -
దేశవాళీ క్రికెట్లో కోహ్లి, రోహిత్!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడనుండగా... దానికి ముందు ఈ ఇద్దరు స్టార్లు విజయ్ హజారే ట్రోఫీలో కనీసం మూడు మ్యాచ్లు ఆడే అవకాశాలున్నాయి. టెస్టు, టి20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు... కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం భారత జట్టు వన్డేలు ఆడకపోగా... ఆస్ట్రేలియాతో పర్యటన కోసం రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు అప్పగించి... కోహ్లి, రోహిత్ను ప్లేయర్లుగా ఈ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తుండగా... ఆలోపు టీమిండియా ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడేది లేకపోవడంతో... ఫామ్, ఫిట్నెస్ కాపాడుకు నేందుకు దేశవాళీల్లో ఆడాలని భావిస్తున్నట్లు సమాచారం. ‘జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న ప్రతీ ఆటగాడు అందుబాటులో ఉన్న సమయంలో దేశవాళీల్లో ఆడాల్సిందే’అని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించిన నేపథ్యంలో ఈ ఇద్దరు బరిలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. ‘డిసెంబర్ 6న విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికా తో టీమిండియా చివరి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మధ్య దాదాపు ఐదు వారాల సమయం ఉంది. విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభమవుతుంది. కివీస్తో సిరీస్కు ముందు ముంబై, ఢిల్లీ జట్లు విజయ్ హజారేలో ఆరేసి మ్యాచ్లు ఆడనున్నాయి. వాటిలో కనీసం మూడిట్లో రోహిత్, కోహ్లి ఆడొచ్చు’ అని బోర్డు అధికారి వెల్లడించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరిచాడు. ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్ ‘ఎ’ మ్యాచ్లు, విజయ్ హజారే వంటి టోర్నీల్లో ఆడుతూ ఫామ్ కొనసాగించుకోవచ్చని పేర్కొన్నాడు.