పాపం పాకిస్తాన్‌..! మ‌రోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్ | Varun Chakravarthy Takes Fresh Dig At Pakistan With Tea Cup Photograph After T20 World Cup Triumph, Photos Went Viral | Sakshi
Sakshi News home page

T20 WC 2026: పాపం పాకిస్తాన్‌..! మ‌రోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్

Mar 10 2026 7:36 AM | Updated on Mar 10 2026 9:19 AM

Varun Chakravarthy takes fresh dig at Pakistan with Tea Cup photograph after T20 World Cup triumph

ప్రపంచకప్‌తో భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాం«దీనగర్‌ సమీపంలోని మోనుమెంట్‌ కాంప్లెక్స్‌కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్‌ వారసత్వ కట్టడం ‘అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ వద్ద అధికారిక ఫొటో సెషన్‌ నిర్వహించగా...  టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ ప్రపంచకప్‌తో సందడి చేశాడు.

అతను కప్‌తో చేరుకోగానే అభిమానులంతా ‘ఇండియా... ఇండియా...’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత అడాలజ్‌ కట్టడం వద్ద కప్‌ పట్టుకొని ఫొటోలకు ఫొజులివ్వడంతో కెమెరా ట్రిగ్గర్లన్నీ ‘కిస్సిక్‌... కిస్సిక్‌...’ మోత మోగాయి. సుప్రసిద్ధ అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ 500 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది. రాణి రుడాబాయి ఈ అడాలజ్‌ను నిర్మించింది.

ఆమె వాఘెలా సంస్థానదీశుడు రాణా వీర్‌ సింగ్‌ భార్య. రాణా వీర్‌ మరణానంతరం రుడాబాయి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ సమయంలోనే అడాలజ్‌ స్టెప్‌వెల్‌ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్‌ సంస్కృతి, వారసత్వ సంపదలో భాగమైన ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సందర్భంగా విన్నర్స్‌ ట్రోఫీతో భారత జట్టు అప్పటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆ్రస్టేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఫొటోలు దిగారు.  

ట్రోఫీతో ఆలయంలో పూజలు 
అంతకుముందు స్టేడియంలో సంబరాల్లో పాల్గొన్న ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. ఈ సమయంలో కోచ్‌ గంభీర్, కెపె్టన్‌ సూర్యకుమార్, ఐసీసీ చైర్మన్‌ జై షాతో కలిసి స్టేడియం లోపలే ఉన్న హనుమాన్‌ ఆలయానికి ప్రపంచకప్‌ను తీసుకువెళ్లి పూజలు చేశారు.

పూజల అనంతరం మళ్లీ ఎప్పట్లాగే మైదానంలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్ తదితురులు ప్రపంచకప్‌తో దిగిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

పాక్‌ను ట్రోలు చేసిన వరుణ్‌
కాగా విజయోత్సవాల సందర్భంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి  సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్తాన్‌ను వరుణ్ మరోసారి ట్రోల్ చేశాడు. వరుణ్ చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోఫీని పట్టుకుని టీ కప్పుతో సిప్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు.

ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇదే తరహా ఫోటోను ఆసియాకప్‌-2025 విజయనంతరం కూడా అతడు షేర్ చేశాడు. ఆసియా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టు.. ఏసీసీ చైర్మెన్‌, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది.

ఆ సమయంలో వరుణ్ చక్రవర్తి ట్రోఫీ లేకపోయినా, తన బెడ్ పక్కన ఒక 'టీ కప్పు' పెట్టుకుని పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ట్రోఫీని లాక్కోవచ్చు కానీ, ఛాంపియన్ ట్యాగ్‌ను కాదు" అని పరోక్షంగా పాక్‌కు చురకలు అంటించాడు. ఇప్పుడు ఒరిజినల్ వరల్డ్ కప్ ట్రోఫీతో మళ్ళీ అదే విధంగా కాఫీ తాగుతూ ఫోటోను షేర్ చేస్తూ పాక్‌ను ట్రోల్ చేశాడు.
చదవండి: ఐసీసీ ప్రపంచకప్‌ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్‌... కెప్టెన్‌గా మార్క్‌రమ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement