భారత్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడేందుకు వచ్చింది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఎట్టకేలకు స్వదేశాలకు పయనం అవుతున్నాయి. టీమిండియా నెగ్గిన ఈ మెగా ఈవెంట్లో కరీబియన్ సూపర్–8లోనే నిష్క్రమించింది. దక్షిణాఫ్రికా సెమీస్ ఓడింది. సూపర్–8 మ్యాచ్లు ముగిసి వారం రోజులవుతున్నా... పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో విదేశీ జట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ వైమానిక దాడులతో మొదలైన కుంపటి పశ్చిమాసియాకు పాకింది. తమపై యుద్ధం చేస్తున్న అమెరికా స్థావరాలపై గురిపెట్టిన ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియా గగనతలం మూసివేయడంతో విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్కతాలో కరీబియన్ జట్టు చిక్కుకుంది.
కొందరు ఐపీఎల్ కోసం ఉండిపోగా, మరికొందరు ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో చుట్టూ తిరిగి విండీస్ దీవులకు చేరుకోనున్నారు. మిగిలిపోయిన 12 మంది విండీస్ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున దక్షిణాఫ్రికా జట్టు సభ్యులతో కలిసి జొహన్నెస్బర్గ్ మీదుగా అంటిగ్వా చేరుకోనుంది.


