breaking news
Siddipet
-
ఇళ్లను వేగంగా నిర్మించండి
● మొదట పూర్తి చేసిన వారికిసొంత ఖర్చుతో గృహ ప్రవేశం చేయిస్తా ● రెవెన్యూ డివిజన్ అంశాన్నిసీఎం దృష్టికి తీసుకెళ్తా ● భువనగిరి ఎంపీ చామల చేర్యాల(సిద్దిపేట): ‘ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలి. మొదట పూర్తి చేసిన వారికి నా సొంత ఖర్చుతో గృహ ప్రవేశం చేయిస్తా’నని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కల్యాణి గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండల పరిధిలోని పలు గ్రామాలకు మంజూరైన 636 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను కలెక్టర్ హైమావతి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఇంటి నిర్మాణ ప్రగతి మేరకు పది రోజులకు ఒకసారి బిల్లు చెల్లింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అలాగే ఈ నెల 14న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన రైతుల భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భూమి సమస్యలున్న రైతులు వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. అలాగే చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ అంశాన్ని సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి డివిజన్ ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ దామోదర్రావు, ఆర్డీవో సదానందం, జెడ్పీ సీఈఓ రమేష్, ప్రత్యేక అధికారి, ఏడి గ్రౌండ్ వాటర్ నాగరాజు, నాలుగు మండలాల లబ్ధిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నాచగిరికి పాలకమండలి నియామకం
వర్గల్(గజ్వేల్): నాచారం దేవస్థాన పాలక మండలి ఖరారైంది. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాచగిరి ఆలయ కమిటీ ధర్మకర్తలుగా పల్లెర్ల రవీందర్, జగ్గయ్యగారి శేఖర్, దేశపతి ఉషశ్రీ, గాల కిష్టయ్య, పద్మ, జగ్గన్నగారి సురేందర్రెడ్డి, జేఎస్ తిరుమల్రావు, రుద్ర శ్రీహరి, కె. శ్రీనివాస్, చంద నాగరాజులతో కూడిన కమిటీని దేవాదాయశాఖ ఏర్పాటు చేసింది. చైర్మన్గా జగ్గయ్యగారి శేఖర్ను ఎన్నుకోనున్నట్లు, పాలకమండలి ప్రమాణస్వీకారం శుక్రవారం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగు వర్సిటీ ప్రతిభాపురస్కారానికి రమేశ్లాల్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారానికి ప్రముఖ పేరణీ నృత్యకారుడు రమేశ్లాల్ ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలో రమేశ్లాల్ను కవులు సన్మానించారు. ఈ సందర్భంగా ఐత చంద్రయ్య మాట్లాడుతూ పేరణీ విభాగంలో రమేశ్లాల్కు ప్రతిభా పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. కవులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కవులు ఎన్నవెళ్లి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహారావు, కాల్వ రాజయ్య, నల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకుఅండగా ఉంటాం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి జగదేవ్పూర్(గజ్వేల్): కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. జగదేవ్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చిరంజీవి సోదరుడు సంతోష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నర్సారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డిలతో కలిసి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రూ.24 వేల ఆర్థిక సహాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆపద సమయంలో అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, మండల నాయకులు ఉన్నారు. -
రింగ్ రోడ్డు మ్యాప్ సిద్ధం చేయండి
హుస్నాబాద్: రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్లానింగ్ మ్యాప్ సిద్ధం చేయాలని కలెక్టర్ హైమావతి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులకు ఆయా శాఖల అధికారులు అనుమతులు ఇచ్చి టెండర్ విధానం పూర్తి చేయాలన్నారు. రోడ్డుకిరువైపులా చెట్లు తొలగించడం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఆదేశించారు. అంతకపేటలో 220 కేవీ విద్యుత్ జంక్షన్ కోసం 10 ఎకరాల స్థలం రెడీగా ఉందని విద్యుత్ అధికారులు వెంటనే ఆయా అనుమతులు తీసుకోవాలన్నారు. ఉమ్మాపూర్ గుట్టల వద్ద నిర్మించే ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు రాగానే ఇంజనీరింగ్ అధికారులకు అందిస్తామని తెలిపారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు కాలువల భూ సేకరణ ప్రక్రియ పూర్తవుతోందని తెలిపారు. హుస్నాబాద్ డిగ్రీ కళాశాలలో పీజీ ఎం.కామ్ కోర్సుకు 60 సీట్లు మంజూరు అయ్యాయన్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేసేలా ఎంపీడీఓ, మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. 150 పడకల ఆస్పత్రి, కోహెడలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు, కాలువల భూ సేకరణ పనుల పై అధికారులతో చర్చించారు. -
శుక్రవారం
4-7-2025కార్మికుల ఆస్పత్రికి సుస్తీ డిస్పెన్సరీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. – 4లోపగలు కూలీ.. రాత్రి చోరీ చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ సదానందం వెల్లడించారు. – 4లోSimultaneously Printed at Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam | Warangal -
శంకుస్థాపన చేసి రెండేళ్లు..
● కాచాపూర్లోని మత్తడి వాగుపై వంతెన కలేనా? కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని కాచాపూర్లో మత్తడి వాగుపై వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. టెండర్ ప్రకియ సైతం పూర్తయినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాత్కాలికంగా ఉన్న మట్టి రోడ్డుపై నుంచి చిన్న వర్షానికే నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రతిఏటా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డుతో కలిపి వంతెన నిర్మాణానికి రూ.కోటి వ్యయంతో అప్పటి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్కుమార్ శంకుస్థాపన చేశారు. సదరు కాంట్రాక్టర్ కనీసం పిల్లర్లకు గుంతలు కూడా తీయలేదు. దీంతో వంతెనా నిర్మాణం కలగానే మిగిలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలే తప్ప అమలు చేయడం లేదని వాపోతున్నారు. -
తాత్కాలిక పనులతోనే సరి..
హుస్నాబాద్ రూరల్: భారీ వర్షం పడితే సిద్దిపేట నుంచి హుస్నాబాద్కు రాకపోకలు బంద్ అవుతుంటాయి. 365డీజీ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా హుస్నాబాద్కు సమీపంలో రేణుక ఎల్లమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాగులోనే తాత్కాలికంగా కొంత మట్టి పోసి దాని మీది నుంచే రాకపోకలు సాగుతున్నాయి. భారీ వర్షం పడితే సిద్దిపేట నుంచి హన్మకొండకు సైతం రాకపోకలు నిలిచిపోతుంటాయి. సిద్దిపేటకు రాకపోకలు సాగించాలంటే కొత్తపల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా వెళ్లాల్సివస్తోంది. భారీ వర్షాలు కురవకముందే పనులు పూర్తి చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.రేణుక ఎల్లమ్మ వాగు -
దాటేదెలా?
వాగులువానొస్తే.. రాస్తా బంద్● లోలెవల్ వంతెనలతో ప్రజల అవస్థలు ● రోడ్లపై నిలుస్తున్న వరద ● రాకపోకలకు తప్పని అంతరాయం ● ఆందోళనలో సమీప గ్రామాల ప్రజలు జిల్లాలోని పలు లోలెవల్ వంతెనలతో వానాకాలంలో రాకపోకలకు తిప్పలు తప్పడంలేదు. భారీ వర్షాలకు ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిలపైకి పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండటంతో స్థానికుల బాధలు అన్నీఇన్నీకావు. ప్రతీఏటా వరద ఉధృతికి చెరువులు, వాగులు పొంగిపొర్లి తక్కువ ఎత్తులో ఉన్న వంతెనలపై ప్రవహిస్తున్నాయి. వరద తీవ్రత తెలియక కొందరు అత్యవసర పరిస్థితులో దాటే ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీటిపై హైలెవల్ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తొలుగుతాయని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట మిరుదొడ్డి మండలం అల్వాల శివారు కూడవెల్లి వాగులో పిల్లర్ల దశలోనే నిలిచిన పనులుకానరాని మోక్షం.. ప్రాణాలే పణం మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని అల్వాల శివారు కూడవెల్లి వాగుపై ఉన్న హైలెవల్ వంతెన నిర్మాణానికి ఆర్అండ్బీ రూ.4కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకోసం జూలై6, 2015న నిర్మాణానికి శంకుస్థాసన చేశారు. స్థల వివాదం కారణంగా పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. దీంతో ఏళ్లు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. ప్రస్తుతం ఉన్న లోలెవల్ బ్రిడ్జి పైనుంచి వరద పోటెత్తుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. భారీ వర్షాలకు పలు మార్లు రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయి. మూడేళ్ల క్రితం వాగు దాటుతున్న క్రమంలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతై మృతిచెందారు. -
నీటి ఎత్తిపోతలను ప్రారంభించండి
గజ్వేల్: మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీటి ఎత్తిపోతలను ప్రారంభించి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను నింపాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఆయువుపట్టుగా ఉన్న కాళేశ్వరంను రైతులకు ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాళేశ్వరంపై విషప్రచారం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎక్కడికక్కడా ఎండగడతామని హెచ్చరించారు. ఎత్తిపోతలను ప్రారంభించకపోతే రాజీవ్రహదారిని రైతుల ఆధ్వర్యంలో దిగ్భంధిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలపైప్రత్యేక దృష్టి గజ్వేల్: విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు గజ్వేల్ విద్యుత్ శాఖ డీఈ భానుప్రకాశ్ అన్నారు. గురు వారం కొడకండ్ల, బూర్గుపల్లి గ్రామాల్లో పర్య టించారు. ఈ సందర్భంగా రైతులతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు తమ ఇబ్బందులను తెలియజేయగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ సెక్షన్ ఏఈ సత్యం పాల్గొన్నారు. -
పనులు సాగక.. భగీరథ అందక
మంచినీటికి తప్పని కష్టాలు● మల్లన్నసాగర్ పైప్లైన్ల పనులు పూర్తయితేనే సరఫరా ● 16కిలోమీటర్ల మేర పనులకు 400 మీటర్లు పెండింగ్ ● బిల్లుల చెల్లింపుల్లో జాప్యమే కారణం ● సమస్య పరిష్కారానికి అధికారయంత్రాంగం దృష్టిజిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీటి కష్టాలు అంతా ఇంతా కాదు. సగానికిపైగా నీటి సరఫరా తగ్గడంతో జనం అల్లాడుతున్నారు. ప్రత్యేకించి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సమస్య తీవ్ర రూపం దాల్చింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ఇతర సమస్యల కారణంగా ఈ రెండు నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నుంచి ప్రత్యేకంగా వేస్తున్న పైప్లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. – గజ్వేల్ -
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదాం
గజ్వేల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక ఎన్నికల ఇన్చార్జి నవాబ్ ముజాహిద్ పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నవాబ్ ముజాహిద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని సూచించారు. టీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్ మాట్లాడుతూ విభేదాలకు తావు లేకుండా పార్టీ గెలుపునకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నదని, ఇదే గెలుపునకు సోపానమన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మడుపు భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, మార్కెట్ కమీటీల చైర్మన్లు వంటేరు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయమెహన్, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు నవాబ్ ముజాహిద్ గజ్వేల్లో పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం -
రజకులను ఎస్సీలో చేర్చాలి
సిద్దిపేటరూరల్: రజకులను ఎస్సీ కమ్యూనిటీలో చేర్చేలా సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కు పంపాలంటూ రాష్ట్ర చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజక కులస్తులు ఎన్నో ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నామన్నారు. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే భావిస్తున్నారు తప్పా.. సంక్షేమాన్ని మరిచారన్నారు. రాష్ట్రంలో 26లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఎస్సీ వర్గంగా గుర్తింపు పొందిన క్రమంలో తమ రాష్ట్రంలో కూడా ఎస్సీలుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంతోష్, కార్యదర్శి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘సాంస్కృతిక’ సలహాదారుగా దరువు అంజన్న
దుబ్బాకటౌన్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు కమిటీ సభ్యుడిగా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ జేఏసీ చైర్మన్ దరువు అంజన్న నియామకమాయ్యరు. 20 మంది సభ్యులతో ఉన్న కమిటీలో అంజన్న ఉండడం విశేషం. కౌన్సెలింగ్కు 470 మంది హాజరునంగునూరు(సిద్దిపేట): రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్కు బుధవారం 470 మంది విద్యార్థు లు హాజరయ్యారు. ఈసందర్భంగా అధ్యాపకులు ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించి ఐడీ, పాస్వర్డు అందజేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ కౌన్సెలింగ్కు హజరవుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అభినవ్, షెహబాజ్, రాజు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. రోశయ్య విగ్రహ ఏర్పాటు అభినందనీయం జిల్లా ఆర్యవైశ్య మహసభ ప్రశాంత్నగర్(సిద్దిపేట): హైదరాబాద్లో ఈ నెల 4న ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణను ఆహ్వానిస్తున్నామని జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు తెలిపారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని మహాసభ నాయకులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు మాట్లాడారు. రోశయ్య పదహారు సార్లు ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. రోశయ్య జయంతిని ఆధికారికంగా నిర్వహించడం, విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు గంప శ్రీనివాస్, తణుకు ఆంజనేయులు, కాసం నవీన్ కుమార్, యాసాల వెంకట్ లింగం, మంచాల శ్రీనివాస్, మంకాల నాగారాణి, హేమలత, సముద్రాల హరినాథ్, డాక్టర్ మంకాల నవీన్ కుమార్, గంప కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎంపీ హామీ ఏమాయె.. చేర్యాల(సిద్దిపేట): పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయిస్తానన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి హామీ ఇప్పటికీ నెరవేరలేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్మావో అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చామల ఎంపీగా బాధ్యతలు చేపట్టి 15నెలలు గడిచినా రెవెన్యూ డివిజన్ అంశం మర్చిపోయారన్నారు. సంక్షేమ, అభివృద్ధి పనుల పేరుతో చేర్యాల ప్రాంతానికి వచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రజలు, ప్రజా స్వామ్యవాదులు, మేధావులు ఖండిచాలన్నారు. ఇచ్చిన మాట మరిచిన ఎంపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి బండకింది అరుణ్కుమార్, కొమురవెల్లి మండల కార్యదర్శి తాడూరి రవీందర్, పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, నాయకులు పోలోజు శ్రీహరి, బోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వాహన విడిభాగాల వేలంసిద్దిపేటకమాన్: కమిషనరేట్ పరిధిలోని పోలీసు వాహనాలకు వినియోగించిన టైర్లు, బ్యాటరీలు, విడిభాగాలను వేలం వేయనున్నట్లు సీపీ అనురాధ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 8న సీఏఆర్ హెడ్ క్వార్టర్లో ఉదయం 9.30 గంటలకు వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొ నే వారు 9గంటల వరకు చేరుకోవాలన్నారు. వేలంపాట పూర్తి కాగానే డబ్బు చెల్లించి వస్తువులు తీసుకెళ్లవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఏఆర్ ఎస్ఐ వెంకటేశం, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణికుమార్, ఏఆర్ కానిస్టేబుల్ విజయ్ను సంప్రదించాలని సూచించారు. -
అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు
మూడు రోజులుగా నరకయాతన ● ‘సిగాచీ’ పేలుడు మిగిల్చిన పెనువిషాదంఅయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిల్చిన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డికొనసాగుతున్న సహాయక చర్యలు● అందుబాటులో హెల్ప్డెస్క్ ● కలెక్టర్ ప్రావీణ్య పటాన్చెరు టౌన్: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రిస్క్యూ ఆపరేషన్, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సహాయక బృందాలకు మార్గదర్శనం చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వారి కుటుంబ సభ్యులకు భోజనం, తాత్కాలిక నివాసం, రవాణా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. బాధితులు వారివారి స్వగ్రామాలకు వెళ్లేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేశామన్నారు. ఒడిశా, బిహార్ రాష్ట్రాల అధికారులు కూడా సహాయక చర్యలు అందిస్తున్నారన్నారు. 18 మృతదేహాలు అప్పగింత ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను అప్పగించామని కలెక్టర్ తెలిపారు. డీఎన్ఏ ఫలితాల కోసం 18 నమూనాలు పెండింగ్లో ఉండగా, ఇంకా సేకరించాల్సిన రెండు మృతదేహాల నమూనాలు ఉన్నాయని తెలిపారు. డీఎన్ఏ ద్వారా ఐదుగురు నమూనాలు వారి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలతో పాటు తక్షణ సాయం రూ.లక్ష అందజేశామన్నారు. తాత్కాలిక ఆర్థిక సహాయం 18 మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, గాయపడిన 34 మందికి రూ.50 వేలు చొప్పున, మిస్సింగ్ అయిన 10 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున తాత్కాలిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. బాధిత కుటుంబాలు లేదా వారి బంధువులు సమాచారం కోసం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్ 08455276155ను సంప్రదించవచ్చు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా వారి అవసరాలపై సత్వర స్పందించడానికి సిబ్బంది కార్యాలయ పని వేళల్లో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.క్యాంపులో బిక్కుమంటూ.. బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్క్లో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్డెస్క్కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. -
స్నేహితుడి ఆచూకీ కోసం..
పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం ఒడిశా నుంచి పటాన్చెరుకు వచ్చారు 28 సంవత్సరాల దీపక్. తన స్నేహితులతో కలిసి ఇస్నాపూర్లోని ఓ గదిని అద్దెకుంటున్నాడు. మూగ్గురు మూడు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. మూడు నెలల క్రితమే దీపక్ ఈ సిగాచీ పరిశ్రమలో చేరారు. సోమవారం ఉదయమే పనికి వెళ్లిన దీపక్ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఒక్కడే ఇక్కడ ఉండటంతో ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎవరూ ఇక్కడ లేరు. దీపక్తో పాటు అద్దె గదిలో ఉంటున్న తన స్నేహితులు సునాముద్దీన్, బవుజీలు ఇతర స్నేహితులు ఇప్పుడు దీపక్ ఆచూకీ కోసం పరిశ్రమ వద్దకు వచ్చి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అడిగితే అధికారుల నుంచి స్పందన లేదని సునాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
పాఠశాలల్లో ఎన్నో వసతులు
బెజ్జంకి(సిద్దిపేట): ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తుందని విద్యాశాఖ మానిటరింగ్ అధికారి భాస్కర్ అన్నారు. మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో ప్రి ప్రైమరీ తరగతులు, క్రీడా పరికరాలను ఎంఈఓ మహతిలక్ష్మితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజులలో పాఠశాలలకు కంప్యూటర్లను కూడా ఇవ్వనున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం తిరుపతి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీరాములు, హైస్కూల్ హెచ్ఎం నాగవేణి, రవీందర్, శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, దేవయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవతోనే ప్రత్యేక గుర్తింపు కోహెడ(హుస్నాబాద్): ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా, ఉత్తమ సేవలందిస్తే ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఏసీపీ సదానందం అన్నారు. మంగళవారం రాత్రి కోహెడ పీఎస్లో ఏఎస్ఐ ఎడ్ల పవన్కుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడారు. పవన్కుమార్ 42 యేళ్లుగా అంకిత భావంతో సేవలందించడం హర్షణీయమన్నారు. ఏఎస్ఐ దంపతులను ఘనంగా సత్కరించి బహుమతిని అందించారు. కార్యక్రమంలో ఎస్ఐ అభిలాష్, సీఐ శ్రీను, కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట ఎస్ఐలు అభిలాష్, మహేశ్, విజయ్భాస్కర్, ఏఎస్ఐలు కనకయ్య, తిలక్ తదితరులు పాల్గొన్నారు. మేలైన దిగుబడులు దుబ్బాకటౌన్: రైతులు పంట సాగులో మెళకువలు పాటిస్తే మేలైన దిగుబడులు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక రైతువేదికలో ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు ఎల్ఆర్జీ 52 కంది విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విత్తనాలు ఎండు తెగులును తట్టుకుంటాయని, అధిక దిగుబడులు పొందవచ్చని చెప్పారు. విత్తనాలను ఏక పంటగా లేదా పొలం గట్లపై వేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓలు సంతోష్, హరీశ్, సురేందర్ తదితరులున్నారు. ఆయిల్పామ్తో లాభాలు చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులు ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయశాఖ అధికారి జయంత్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని అల్లీపూర్ తదితర గ్రామాల్లో ఆయిల్పామ్ సాగుపై రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ సంప్రదాయ నూనెగింజల కంటే 4 నుంచి 5 రెట్ల అధిక దిగుబడి ఉంటుందని, నాలుగు అంతర పంటలు సాగుచేసి మూడింతల ఆదాయం పొందవచ్చని సూచించారు. ఒక్కసారి సాగుచేస్తే 35 యేళ్ల వరకు దిగుబడి ఇస్తుందని, రైతులు వరికి బదులుగా ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. వైద్య వృత్తి గొప్పది ప్రశాంత్నగర్(సిద్దిపేట): వైద్య వృత్తి చాలా గొప్పదని, వారిని ప్రజలు దేవుళ్లతో సమానంగా భావిస్తారని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని డాక్టర్లను, సిద్దిపేట కాంగ్రెస్ కౌన్సిలర్ రియాజొద్దిన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటం కేవలం డాక్టర్లకు మాత్రమే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు గుండు రవితేజ తదితరులు పాల్గొన్నారు. సీఏం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు కోహెడ(హుస్నాబాద్): ఉద్యమ కవి, గాయకుడు నేర్నాల కిషోర్ను రాష్ట్ర టూరిజం, భాషా సాంస్కృతికశాఖ సలహాదారుడిగా సీఏం రేవంత్రెడ్డి ప్రకటించటం హర్షణీయమ ని మండల కళాకారుల ప్రతినిధి పొన్నాల అశోక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకశాలు కల్పించాలని కోరా రు. సీఎం, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరాంకు కృతజ్ఞతలు తెలిపారు. -
శక్తివంచన లేకుండా కృషి చేస్తా..
ములుగు(గజ్వేల్): ఉపాధ్యాయుల సమస్యలపై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి చెప్పారు. ములుగు మండలం తున్కిబొల్లారం ఆర్అండ్ఆర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన హెచ్ఎం బి.రంగారావు ఉద్యోగ విరమణ అభినందన సభకు ఆయన ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా అన్ని కార్పొరేట్ ఆస్పపత్రులలో వర్తింప జేసే విధంగా ఉపాధ్యాయులకు త్వరలోనే హెల్త్ కార్డులు అందజేయనున్నామన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇప్పిస్తామని, అందులో ఎస్జీటీ ఉపాధ్యాయులు లాభపడే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వంగ మహేందర్రెడ్డి, ఎంఈఓలు ఉదయ్బాస్కర్రెడ్డి, మాధవరెడ్డి, పీఆర్టీయూ నేతలు ఇంద్రసేనారెడ్డి, శశిధర్శర్మ, రాధిక, శ్రీనివాస్రెడ్డి, జ్యోతి, వీణమ్మ, రామనర్సయ్య, శ్రీనివాస్, మనోహర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, బాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
ట్రేడ్ లైసెన్సుల ప్రక్రియ వేగవంతం
దుబ్బాక: మున్సిపాల్టీలో వాణిజ్య, వ్యాపార సముదాయాలకు జారీచేసే ట్రేడ్ లైసెన్సుల ప్రక్రియను వేగవంతం చేయాలని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ వాత్సవ్ ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ల జారీ ప్రక్రియ, భువన్ యాప్ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే వివరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్ రమేశ్ కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతర ఆయన మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్సుల దరఖాస్తులపై అవగాహన కల్పించాలన్నారు. భువన్యాప్లో భవనాలు, వాణిజ్య, వ్యాపారాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, అనిల్రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు. సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ శ్రీవాత్సవ్ -
భోజనశాలలు పూర్తి చేయరూ!
అసంపూర్తిగా నిర్మాణాలు● ఏళ్లు గడుస్తున్నా సాగని పనులు ● పర్యవేక్షించని అధికారులు ● ఐదింటికి గాను పూర్తయింది ఒక్కటే ● కోతులతో విద్యార్థుల ఇక్కట్లుఆరుబయటే భోజనాలు తింటూ ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల కోసం భోజనశాలల నిర్మాణాలు చేపట్టారు. కాని నిధుల కొరతతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు ముందుకుసాగడం లేదు. విద్యార్థులు ఆరుబయటే తింటూ ఇబ్బందులు పడుతున్నారు. తొగుట(దుబ్బాక): మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం డైనింగ్ హాళ్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కొక్క హాల్ నిర్మాణం కోసం రూ.14 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. తొగుట, కాన్గల్, వెంకట్రావుపేట, ఎల్లారెడ్డిపేట, ఘనపురం, గుడికందుల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 658 మంది చదువుకుంటున్నారు. చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు హాళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు పనులు సక్రమంగా పూర్తి చేయలేకపోయారన్న ఆరోపణలున్నాయి. వెంకట్రావుపేట, ఎల్లారెడ్డిపేట పాఠశాలల్లో గోడలు నిర్మించి పైకప్పు రేకులు వేశారు. గుడికందుల పాఠశాలలో పిల్లర్ల స్థాయిలో పనులు నిలిచిపోయాయి. ఒక్క తొగుట పాఠశాలలో పనులు పూర్తిచేసి గత యేడాది జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడులు మండలంలోని అన్ని గ్రామాల్లో కోతుల బెదడ పెరిగింది. ఆరుబయట భోజనాలు చేసే విద్యార్థులపై కోతులు దాడికి దిగుతున్నాయి. దీంతో విద్యార్థులు భోజనం చేసే వరకు ఉపాధ్యాయులు కాపలాగా ఉండాల్సిన పరిస్థితి. విద్యార్థులను గాయపరిచి ప్లేట్లు ఎత్తుకుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనశాలల నిర్మాణాలు పూర్తిచేసి ఇబ్బందులు తొలగించాలని వారు కోరారు. -
వానాకాలం జరభద్రం
హుస్నాబాద్: పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పిలుపునిచ్చారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా 5వ వార్డులో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో టైర్లు, పాత కుండల్లో ఉన్న నీటిని పార బోశారు. ఇంటింటికీ తిరుగుతూ సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. 9వ వార్డులో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ వానాకాలం దృష్ట్యా ఇంటిలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించు కోవాలన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్లం, పర్యావరణ అధికారి రవి కుమార్, వార్డు అధికారులు, మెప్మా రిసోర్స్పర్సన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ -
రెండు రోజుల్లో కాలేజీకి రోడ్డు
హుస్నాబాద్రూరల్: పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డును రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ‘కాలేజీకి రోడ్డు నిర్మించరూ..?’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను పనుల వివరాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో డీఈ మహేశ్ ఆధ్వర్యంలో మంగళవారం పనులు ప్రారంభించారు. దరఖాస్తుల ఆహ్వానం గజ్వేల్రూరల్: మోడల్స్కూల్లో విద్యార్థులకు హిందీ బోధించేందుకు గెస్ట్ టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వన్నెస మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గంటల ప్రాతిపదికన బోధించేందుకు ఆసక్తికల అభ్యర్థులను గురువారం పాఠశాలలో డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. ఉపాధ్యాయుల కృషి వల్లే.. కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కృషివల్లే విద్యార్థుల సంఖ్య పెరిగిందని మండల విద్యాధికారి బచ్చలి సత్తయ్య అన్నారు. కుకునూరుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు చేరడంపై హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులను మంగళవారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు డిక్షనరీలు అందజేశారు. కార్యక్రమంలో సీఆర్పీ సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్
సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు. స్థానిక 43వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు లక్ష్మి స్థలాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట మున్సిపల్ డీఈ ప్రేరణ, హౌసింగ్ అధికారి దివ్య, మున్సిపల్ అధికారి శ్రీనాథ్, వార్డు కౌన్సిలర్ పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. ఇళ్లు రానివారు ఆందోళన చెందొద్దు ప్రశాంత్నగర్(సిద్దిపేట): లిస్టులో పేరు రానివారు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ఇందిరమ్మ ఇళ్లకు మంగళవారం వారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా డబుల్ బెడ్రూంలు రూం ఇస్తామని చెప్పి కాలయాపన చేశారన్నారు. నాయకుల సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కష్టపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, ముద్దం లక్ష్మి, రియాజొద్దిన్, కలీమొద్దిన్, పయ్యావు ఎల్లం యాదవ్, మధు, నజ్జు, హర్షద్, వహాబ్, రజిని, సంతోష, సాయి, ప్రతాప్, రాకేశ్, రాజు, షాబొద్దిన్, మెరుగు రాజు తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇళ్లు దుబ్బాకటౌన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బురాణి శ్రీకాంత్ అన్నారు. ధర్మాజీపేట వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణకి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఈ జాహ్నవి, వార్డు అధికారులు రమేశ్, మాజీ కౌన్సిలర్ స్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వైద్యులు ప్రజల ప్రాణాలు రక్షించే దేవుళ్లు
చేర్యాల(సిద్దిపేట): వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించే దేవుళ్లని సీఐ ఎల్.శ్రీను ప్రశంసించారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. యశోద ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైద్యులు తమ వ్యాపారం కోసమే కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ నీరేష్, పీఎస్ఐ సమత, ఎంఈఓ కిష్టయ్య, వైద్యులు శ్రీకాంత్, పరమేశ్వర్, సంతోష్కుమార్, రఘునందన్, సతీశ్, బాలకిషన్, శ్రీకాంత్, నాయకులు ఆగంరెడ్డి, కళావతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సీఐ శ్రీను -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధి పంతుల్తండా గ్రామ పరిధిలోని తారాచంద్తండాలో సోమవారం తాగునీటి కోసం గిరిజన మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు అందించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేదిలేక ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. వాగులో నీరులేకపోవడంతో ఉన్న బోరు నుంచి నీరు రావడంలేదన్నారు. మరోవైపు భగీరథ నీరు సరిగ్గా రాకపోవడంతో నిత్యం తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.ఖాళీ బిందెలతో నిరసన -
పాశమైలారంలో భారీ పేలుడు ● మరుభూమిగా ఘటనా స్థలం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి కోసం వస్తే ఏకంగా ఉసురే తీసేసింది సిగాచీ పరిశ్రమ. సోమవారం ఈ కంపెనీలో జరిగిన విస్ఫోటనం బతుకుదెరువుకోసం వలస వచ్చిన వారి జీవితాలను బుగ్గిపాలు చేసింది. పేలుడు ధాటికి దూరంగా ఎగిరిపడ్డ కార్మికుల మృతదేహాలతో..చిధ్రమైన శరీరభాగాలతో, కూలిన శిథిలాలతో సిగాచీ మరుభూమిని తలపించింది. తమ వారి ఆచూకీ కోసం బాధితుల ఆక్రందనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతిల్లింది. ఈ పారిశ్రామికవాడలో కార్మికుల కుటుంబాలు కోల్పోతున్నా పరిశ్రమ యాజమాన్యానికి మాత్రం సాధారణమేనని తరచూ జరిగే ప్రమాదాలు నిరూపిస్తూనే ఉన్నాయి. అనుభవాలు, ప్రమాద పాఠాల నుంచి యాజమాన్యాలు, ప్రభుత్వాలు గుణపాఠం నేర్వవని మరోసారి ఈ ప్రమాదంతో రుజువైంది. సోమవారం ఉదయం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. పారిశ్రామిక వాడలో విషాదం ఉదయమే తమ ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుసుకున్న బాధిత కార్మికుల కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. కుటుంబసభ్యుల ఆచూకీ లభించకపోవడంతో కార్మికుల కుటుంబసభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. తమ వారు ఏమయ్యారో తెలియకపోవడంతో వారు అధికారుల చుట్టూ తిరిగారు. అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. దీంతో పాశమైలారం పారిశ్రామికవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. కాలినగాయాలతో బాధపడుతున్న తమ ఆత్మీయులను చూసి బోరున విలపించారు. కళ్లముందే విగత జీవులుగా మారిన తమ వారిని చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. తమ వారి జాడ ఎక్కడైనా లభిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.వారంతా రోజు మాదిరిగానే విధుల్లోకి వచ్చారు. తమ తోటి కార్మికులు, ఉద్యోగులకు శుభోదయం చెప్పుకున్నారు. అప్పుడప్పుడే ఎవరికివారు తాము పని చేసే స్థలాల్లో నిమగ్నమవుతున్నారు. ఒక్కసారిగా మృత్యువు పేలుడు రూపంలో కబళించింది. ఉన్నపళంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పొగ పూర్తిగా కమ్ముకోవడంతో చుట్టూ చీకటి. అగ్నికీలలకు దేహాలు ఆహుతైపోయాయి. శరీరభాగాలకు మంటలు అంటుకున్నాయి. మరికొందరి శరీరాలు మాడి మసైపోయాయి. ఎటు చూసినా హాహాకారాలు. ప్రమాదం నుంచి బయటపడేందుకు ఆర్తనాదాలు.. సిగాచీ పరిశ్రమల్లో రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించి భీతావహ వాతావరణం ఇది. ఎక్కడపడితే అక్కడ కార్మికుల శవాలు. కాలి బూడిదై.. మసైపోయిన శరీర భాగాలు. ఇలా పేలుడు జరిగిన ప్రదేశం పూర్తిగా మరుభూమిని తలపించింది.సిగాచీ పరిశ్రమ ఎదుట భీతావహం తమ వారి ఆచూకీ కోసం విలపించిన బాధిత కుటుంబ సభ్యులుఉపాధి కోసం వచ్చి అనంత లోకాలకు.. వారంతా పొట్ట చేతబట్టుకుని వచ్చిన నిరుపేద కుటుంబాలే. ఉపాధి కోసం వందల కిలోమీటర్లు నుంచి వచ్చిన కార్మికులే అధికం. బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి భార్యాబిడ్డలతో వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. చాలీ చాలని జీతాలున్నప్పటికీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కార్మికుల కుటుంబాల్లో ఈ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పొట్ట చేతబట్టుకుని వచ్చిన తమ వారిని మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధి కోసం వస్తే ఉసురే పోయిందని విలపిస్తున్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించకపోవడంతో వారు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. -
యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం
పటాన్చెరు టౌన్: యాజమాన్యం నిర్లక్ష్యం..ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రలకు మెరుగైన వైద్యంతోపాటు రూ.50లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి ఎమ్మెల్యే గూడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజి ఇక్బాల్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 30 ఏళ్లుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎన్నడూ కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి..ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షలపరిహారం ఇవ్వాలి ఒకరికి ఉద్యోగం కల్పించాలి అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం -
పోలీసుల ఓవరాక్షన్
బాధిత కుటుంబాల పట్ల దురుసు ప్రవర్తన పటాన్చెరు: ‘నా భర్త ఎక్కడ’అంటూ కొందరు మహిళలు గుండలవిసేలా విలపించారు. ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త పేరు ఆస్పత్రిలో చేరిన వారి జాబితాలో లేదు. చనిపోయిన వారి జాబితాలో కూడా లేదని చెబుతున్నారు. మరి ఎక్కడున్నారు..? చెప్పాలి అంటూ బాధితులు తమ వారి ఆచూకీ కోసం కలియదిరుగుతుంటే లోపలికి రాకూడదంటూ పోలీసులు వారి పట్ల అమానవీయంగా దురుసుగా వ్యవహరించారు. అనిత, సంజీవ్లాల్ అనే మహిళలు పోలీసులతో వాదిస్తూ పోలీసులపై రాయి ఎత్తి పట్టి తిట్టిపోశారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన మావాళ్లు ఇంటికి తిరిగి రాలేదు. పొద్దున్నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా..అని ఓ మహిళ వాపోయింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్ఫోటనంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబీకుల పరిస్థితి ఇది. -
అప్పుడే మేల్కొనుంటే..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్ లేక.. పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవీ.. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ప్రమాదం జరిగాక హడావుడి సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్బీఆర్గానిక్స్ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నాడు ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు మృతి.. ఇదే తరహాలో ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో ఘటన.. -
ఉద్యమకారుల శాంతియుత దీక్ష
చేర్యాల(సిద్దిపేట): తెలంగాణ ఉద్యమకారులు శాంతియుత దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పటి వరకు హామీలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యమకారుల గుర్తించి, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు, ప్రతి నెల రూ.25వేల పెన్షన్, ఉచిత వైద్యం, బస్పాస్, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. దీక్షలను పరిరక్షణ కమిటీ కన్వీనర్ పందిళ్ళ నర్సయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. దీక్షలో ఉద్యమకారులు అంబటి నర్సయ్య, ఆడెపు వెంకయ్య, అంబటి అంజయ్య, అందె అశోక్, బండోజు భాస్కర్, ఎండీ.జహురద్దీన్, సంజీవరెడ్డి, మంగోలు చంటి, మంచాల కొండయ్య పాల్గొనగా వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.హామీలు నెరవేర్చాలని డిమాండ్ -
అంధకారంలో డబుల్బెడ్రూంలు
వీధిలైట్లు వెలగక చిమ్మచీకట్లో డబుల్ బెడ్రూం కాలనీ● కాలనీల్లో చిమ్మచీకట్లు ● వెలుగని వీధిలైట్లు ● ఎవరికీ పట్టడంలేదంటూ ప్రజల ఆవేదన దుబ్బాక: పట్టణంలోని డబుల్ బెడ్రూం కాలనీల్లో వీధిలైట్లు వెలగక చిమ్మచీకట్లు అలుముకున్నాయి. కొన్ని రోజులుగా అంధాకారం నెలకొంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పట్టణంలోని బల్వంతాపూర్ రోడ్డులో నిర్మించిన 850 డబుల్ బెడ్రూంలలో నివసించే ప్రజలు సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని 60, 61, 62 బ్లాక్లలో వీధిలైట్లు వెలుగక పోవడంతో చాలరోజులుగా రాత్రి అయ్యిందంటే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కొన్ని బ్లాక్లలో వీధిలైట్లు రాత్రి, పగళ్లు నిరంతరం వెలుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.ఇప్పటికై న సంభందిత అధికారులు దృష్టి సారించి అంధకారంలో ఉన్న కాలనీల్లో వీధిలైట్లకు మరమ్మతులు చేయాలని డబు ల్ బెడ్రూం కాలనీ వాసులు కోరుతున్నారు. -
మెరుగుబడినాయ్..
సిద్దిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగు ● కేంద్ర విద్యా శాఖ తాజా నివేదిక విడుదల ● రాష్ట్రంలో సిద్దిపేటకు 4వ, సంగారెడ్డికి 8, మెదక్కు 25వ ర్యాంక్ అభ్యసన ఫలితాలు, చదువుల నాణ్యత, మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్, అందుబాటులో బడులు–పిల్లల రక్షణ, విద్యాపరిపాలన విభాగాల్లో 74 సూచికలను పరిగణనలోకి తీసుకుని 600 మార్కులకు గ్రేడింగ్ ఇచ్చారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా 2023–24లో రాష్ట్రంలో సిద్దిపేట 276 మార్కులతో 4వ, సంగారెడ్డి 268 మార్కులతో 8వ, మెదక్ 244 మార్కులతో 25వ ర్యాంక్లు సాధించాయి. 2022–23లో ప్రశిష్ట మూడవ కేటగిరిలో ఉండగా 2023–24లో రెండవ కేటగిరిలోకి అప్గ్రేడ్ అయ్యాయి. డిజిటల్ లెర్నింగ్లో వెనుకబాటు డిజిటల్ లెర్నింగ్లో ప్రభుత్వ బడులు వెనుకబాటులో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. పలు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పలు పాఠశాలలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి బోధిస్తున్నారు. పాఠ్యంశాలు డిజిటల్ బోధన అందడం లేదు. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ బోధన అందిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పలు పాఠ్యంశాలు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగానే కళ్ల ముందు కదలాడుతూ బోధిస్తుంది. ఇలా విద్యా వ్యవస్థల్లో మార్పులు తీసుకవస్తే మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. అభ్యసన ఫలితాలు గతంతో పోలిస్తే మెరుగుపడి సిద్దిపేట, సంగారెడ్డి వంద మార్కులు దాటాయి. మెదక్ జిల్లా వందలోపే మార్కులు వచ్చాయి. బడులు అందుబాటులో లేక.. అందుబాటులో బడులు– పిల్లల రక్షణ విభాగంలోనూ ఉమ్మడి మెదక్ జిల్లా వెనుకబడ్డాయి. పలు చోట్ల ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో దాదాపు రెండు నుంచి ఐదు కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆ కేటగిరిలో 35 మార్కులకు గాను మెదక్ జిల్లాకు 9, సిద్దిపేటకు 15, సంగారెడ్డికి 14 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయటంలో ఈ రెండు విభాగాలు కీలకమవటంతో వీటిల్లో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా జిల్లా యంత్రాంగాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు గతంతో పోలిస్తే మెరుగుపడింది. కేంద్ర విద్యాశాఖ 2023–24 పెర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండక్స్(పీజీఐ) నివేదికను ఇటీవల విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23 కంటే పుంజుకున్నాయి. సర్కారు బడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. దీంతో మెరుగు పడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3,105 ప్రభుత్వ పాఠశాలలో 1.80లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట2023–24లో మార్కులు ఇలా.. జిల్లా అభ్యసన చదువుల మౌలిక డిజిటల్ అందుబాటులో విద్యా పరిపాలన ఫలితాలు నాణ్యత వసతులు లెర్నింగ్ బడులు–పిల్లల రక్షణమెదక్ 97 43 29 10 09 56 సిద్దిపేట 110 51 29 16 15 55 సంగారెడ్డి 120 43 28 11 14 53 -
సివిల్స్కు ఉచిత శిక్షణ
సిద్దిపేట ఎడ్యుకేషన్: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్లో సివిల్స్కు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సిద్దిపేట వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ లు తెలిపారు. ఉచిత సివిల్స్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం సిద్దిపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ కళాశాల ఆవరణలో ఆవిష్కరించి మాట్లాడారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు జూలై 7 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 13 న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. ఎస్సీ లకు 75, ఎస్టీలకు 10 , బీసీలకు 15 శాతం సీట్లు, ఇందులో మహిళలకు 33 శాతం, పీడబ్ల్యూడీ వారికి 5 శాతం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నారు. వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించరాదన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నరేష్, మహేష్, రవికిరణ్, రాజేష్, సంజీవ్, వెంకటేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ -
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరండిమంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో బీటెక్ ఈసీఈ, సీఎస్ఈ, ఐటీ, ఏఐ కోర్సులు ప్రతీ విభాగంలో 60 సీట్లకు గాను మొత్తం 240 సీట్లు మంజూరు అయ్యాయన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మొదటి సంవత్సరం ప్రారంభమవుతున్న కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. విద్యార్థులు కౌన్సెలింగ్లో ప్రథ మ ప్రాధాన్యతగా హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలకు ఆప్షన్ ఇవ్వాలని మంత్రి కోరారు.ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభంగజ్వేల్: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. అక్కారం, బెజుగామ, పిడిచెడ్, ఆహ్మదీపూర్, శేర్పల్లి, కొల్గూర్, అనంతరావుపల్లి, దాచారం, బూర్గుపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులను త్వరగా పూర్తి చేసి, గృహ ప్రవేశాలకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ముగిసిన పాలిసెట్ కౌన్సెలింగ్నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పాలిసెట్ కౌన్సెలింగ్ ముగిసిందని రాజగోపాల్పేట కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ చెప్పారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ డిప్లొమా ప్రవేశం కోసం నిర్వహించిన సర్టిఫికెట్ల పరీశీలనకు ఇప్పటి వరకు 700 మంది హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఐడీ, పాస్వర్డు అందజేశామని తెలిపారు. ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకునేలా అవగాహన కల్పించామన్నారు. కౌన్సెలింగ్లో అభినవ్, షెహబాజ్, రాజు, రామకృష్ణ, శ్రీనివాస్రెడ్డి, కవిత, శ్రీనివాస్, విజయ్కుమా ర్, రాజమౌళి, మధుబాబు పాల్గొన్నారు. -
3వ రోజుకు చేరిన సైకిల్యాత్ర
గజ్వేల్రూరల్: హుస్నాబాద్ పేరును భార్గవపురంగా మార్చాలని సామాజిక ఉద్యమకారుడు పిడిశెట్టి రాజు కోరారు. ఈ మేరకు చేపట్టిన సైకిల్యాత్ర 3వ రోజు గజ్వేల్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలంలో తమ గ్రామం పేరు భార్గవపురంగా ఉండేదని, శ్రీరేణుకాదేవి(ఎల్లమ్మతల్లి) కుమారుడైన భార్గవరాముడు(పర్శరాముడు) పేరున భార్గవపురం అని పేరు వచ్చినట్లు తెలిపారు. నిజాంల కాలంలో గ్రామం పేరును హుస్నాబాద్గా మార్చారని, గ్రామ మూలాలు మరచిపోకుండా ఉండాలనేదే తమ ఉద్దేశమన్నారు. పేరు మార్చాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం ఇచ్చే వరకు సైకిల్యాత్ర కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కరవు జిల్లాగా ప్రకటించాలి
సిద్దిపేటఅర్బన్: జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కార్మిక, కర్షక భవన్లో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చుక్క రాములు హాజరై మాట్లాడారు. సాగు చేసే సమయంలో వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు మొలవక రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు ఎండిపోయి సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే జిల్లాను యూనిట్గా తీసుకొని కరవు జిల్లాగా ప్రకటించాలని కోరారు. కరవు నివారణ చర్యలు చేపట్టి నష్ట పరిహారం అందించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయని, పథకాలను పారదర్శకంగా అమలు చేసి నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, యాదగిరి, రవికుమార్, బాలనర్సయ్య, అరుణ్, శ్రీనివాస్, రవీందర్, శారద, శిరీష, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు -
దరఖాస్తుల ఆహ్వానం
బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ ప్రశాంత్నగర్(సిద్దిపేట): వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు, అందుకు దరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ తెలిపారు. హైదరాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ తరగతులు జూలై 27 నుంచి అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు జూలై 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జూలై 12న నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు చేసుకోండిప్రశాంత్నగర్(సిద్దిపేట): 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, ఆదర్శ, కేజీబీవీలు, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 13లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసిన ఫారంలను జూలై 15లోగా జిల్లా విద్యాశాఖ అధాకారి కార్యాలయంలో అందించాలన్నారు. లక్కీ డ్రా పద్ధతిలో సీట్ల ఎంపిక...సిద్దిపేటరూరల్: 2025–26 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారిని విద్యార్థుల ఎంపిక డ్రా నిర్వహించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందిస్తామన్నారు. విద్యార్థులను డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తామని, వారిని సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్లలోని ఎంపిక చేసిన స్కూల్లలో వసతితో కూడిన ఉచిత విద్యను అందిస్తామని ఆమె వివరించారు. ఒకటో తరగతికి 225 మంది దరఖాస్తు చేసుకోగా.. 87 విద్యార్ధులను ఎంపిక చేశారు. 5 తరగతికి 132 విద్యార్ధులకుగాను 89 మంది విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కవిత, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి 20మంది ఎంపికసిద్దిపేటజోన్: జూలై 1 ,2వ తేదీల్లో హకీంపేట క్రీడాపాఠశాల రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలకు సిద్దిపేట జిల్లా నుంచి 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 24న సిద్దిపేట గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో క్రీడా పాఠశాలల్లో నాల్గవ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లా స్థాయిలో ఎంపిక నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి ఎంపిక చేసినట్టు తెలిపారు. బాలుర విభాగంలో ఆత్రేయ, రేవంత్ నాయక్, విశ్వాన్, శ్రేయన్, అక్షిత్, అభినవ్, చరణ్, సుస్వాంత్, రక్షిత్ కుమార్, మనిత్లు బాలికల విభాగంలో ప్రనిషి, వేద సహిత, దేవాన్సీ, హర్షిత, గాయత్రి, రష్మిత, చరిష్మా, కృతికలు ఎంపికయ్యారన్నారు. ఎంపిక అయిన వారు జూలై ఒకటిన ఉదయం10 గంటలకు స్టేడియం ప్రాంగణంలో సంబంధించిన పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఇంజినీరింగ్లో ఉచిత శిక్షణ గజ్వేల్రూరల్: సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో డేటా ఇంజినీర్ కోర్సులో యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు భగవాన్ శ్రీసత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. గజ్వేల్లో శనివారం వారు మాట్లాడుతూ 2022–2025 మధ్య బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీ టెక్, ఎంటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసిన వారు ఈ శిక్షణలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో ని సత్యసాయి స్కిల్ సెంటర్లో బేసిక్, అడ్వా న్స్డ్ పైథాన్, ఎస్క్యూఎల్, బీఐ టూల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్లో 90 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు కల్పించడంలో సహకారం ఉంటుందని చెప్పారు. ఆసక్తి గలవారు 4లోగా www.rethu.aiలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 90523 72023 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
ఇన్చార్జీల పాలన ఇంకెన్నాళ్లు..?
మల్లన్న ఆలయంలో రెగ్యులర్ ఈవో ఎక్కడ..? ● వారంలో ఒకటి, రెండూ రోజులు మాత్రమే ఆలయానికి.. ● ఏడాదికి రూ.20 కోట్లకుపైగా ఆదాయం ● అయినా.. భక్తుల ఇబ్బందులు పట్టవా..?కొమురవెల్లి(సిద్దిపేట): తెలంగాణతో ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి రెగ్యులర్ ఈవో నియామకం కలగానే మిగిలిపోయింది. డిప్యూటీ కమిషనర్ క్యాడర్ కలిగిన ఆలయానికి అసిస్టెంట్ కమిషనర్లకు ఇన్చార్జీలు ఇచ్చి దేవాదా య శాఖ కాలం వెళ్లదీస్తోంది. 2020లో ఈవో వెంకటేశ్ బదిలీపై వెళ్లగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్న బాలాజీకి మల్లన్న ఆలయానికి ఇన్చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బాలాజీ 2024 డిసెంబర్లో పదవీ విరమణ పొంవడంతో హైదరాబాద్ దేవాదాయశాఖ కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న రామాంజనేయులుకు మల్లన్న ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2025 ఏప్రిల్లో రామాంజనేయులు అదనపు బాధ్యతలు తొలగించి హైదరాబాద్లో చిక్కడపల్లి వెంకటేశ్వర్ల స్వామి ఆలయ ఈవో అన్నపూర్ణకు కొమురవెల్లి మల్లన్న ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఇన్చార్జిగా ఈవోలుగా నియమితులైనవారు బహుముఖ బాధ్యతలు నిర్వహించలేక సతమతం అవుతున్నారు. వారంలో ఒకటి, రెండు రోజులు మత్రమే ఆలయానికి రావడంతో ఆలయంలో అభివృద్ధి పనులు కుంటు పడి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ప్రతి యేటా స్వామి వారిని సుమారు రూ.కోటికిపై భక్తులు దర్శించుకుంటారు. ఎక్కడా లేని విధంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు నెలల పాటు కొనసాగుతాయి, దీంతో స్వామి వారికి సంవత్సరానికి సుమారు రూ.20 కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఆలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడం దురదృష్టకరమని భక్తులు వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని అంటున్నారు. -
ప్రతిభకు పురస్కారం
సిద్దిపేటఅర్బన్: సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో హైదరాబాద్ రీజియన్ స్థాయిలో సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం 5వ స్థానంలో నిలిచింది. 74 పాఠశాలలకు గాను సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం ఐదో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రిన్సిపాళ్ల సమ్మేళనంలో పాఠశాల ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్ కేంద్రీయ విద్యాలయ సమితి కమిషనర్ విధి పాండే చేతులు మీదుగా బహుమతి, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ ఈ అవార్డు వెనుక సిద్దిపేట కేంద్రీయ విద్యాలయం నిలవడంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. అలాగే ఈ విద్యాసంవత్సరం 9వ తరగతిలో ఒక సీటు, పదవ తరగతిలో ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. జూలై 10వ తేదీలోగా అర్హత కలిగిన విద్యార్థులు దరఖా స్తు చేసుకోవాలని, కేంద్రీయ విద్యాలయ మార్గదర్శకాల మేరకు సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.కేంద్రీయ విద్యాలయానికి 5వ స్థానం -
గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిందే కాంగ్రెస్
● గౌరవెల్లిని 95శాతం పూర్తి చేశాం ● నిర్వాసితులను మోసం చేసిన పొన్నం ● మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ ధ్వజంహుస్నాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గౌరవెల్లి ప్రాజెక్టు 95 శాతం పూర్తి చేశామని, ప్రాజెక్టును అడ్డుకోవడానికి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిందే కాంగ్రెస్ నాయకులని మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నలుగురు మంత్రుల పర్యటనలో అవాకులు, చెవాకులు, ఉపన్యాసాలే తప్పఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తాము మంజూరు చేసిన పనులకు శంకుస్ధాపనలు చేయడం గొప్పనా అని ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ఎకరాకు రూ.30 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్.. మంత్రి అయిన తర్వాత రూ.17 లక్షలు ఇచ్చి నిర్వాసితులను నిండా మోసం చేశారని మండిపడ్డారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయకుండా పీజీ మెడికల్ కళాశాల ఏలా సాధ్యమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బాలికల జూనియర్ కళాశాల, మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్ర భవనం, సమీకృత కార్యాలయాల భవనం, పాలిటెక్నిక్ కళాశాల, ఏసీపీ కార్యాలయం తమ హయాంలో పూర్తి చేశామన్నారు. ఇంజనీరింగ్ కళాశాల తరగతుల నిర్వాహణకు తాము కట్టించిన పాలిటెక్నిక్ కళాశాల గతైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్ కోసం మంత్రి అనుచరుడు చందాలు వసూలు చేసిన డబ్బులు ఎక్కడున్నాయ ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో హన్మకొండ మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
లక్ష్యాలను సాధించాలి
సిద్దిపేటరూరల్: నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ కే.హైమవతి అధికారులను ఆదేశించారు. శనివారం వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో సమీక్షించారు. వారికి కేటాయించిన లక్ష్యాలపై సమాలోచన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖలు వారికి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆయిల్పాం సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనులను అధికారులు పర్యవేక్షించాలని కోరారు. మండల స్థాయిలో పెండింగ్లో ఉన్న పనులను జూలై 15వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులను ప్రోత్సహించాలని కోరారు. చివరగా ఉద్యాన దర్శిని పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఏఓ రాధిక, ఉద్యాన శాఖ అధికారి సువర్ణ, మత్స్య శాఖ అధికారి మల్లేశం, పశుసంవర్ధక శాఖ అధికారి కొండల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి మొక్క బతకాలి వనమహోత్సవ లక్ష్యాన్ని అధికారులు తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా గ్రామపంచాయతీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ముందస్తు కార్యాచరణతో లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గుర్తించిన వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటాలన్నారు. సకాలంలో ఫర్టిలైజర్, నీటిని అందిస్తే మొక్కలు ఏపుగా పెరిగే ఆస్కారం ఉందన్నారు. పెట్టిన ప్రతి మొక్క బతకాలని, అధికారులు తరచూ పర్యవేక్షించాలని కోరారు. ఉద్యానవన శాఖలో 1,335 ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటికి 428 రైతుల నుంచి 748 ఎకరాల్లో పలు రకాల తోటల పెంచేందుకు సిద్ధం చేశారని, ఆగస్టు లోపు పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడవచ్చని, బహిరంగ ప్రదేశాలలో చెత్త, డ్రైనేజీలు పొంగడం లాంటిది ఉన్నట్లయితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ–2025 గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో సీఈవో రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, పంచాయతీ రాజ్ ఈఈ లు శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. ఆయిల్పామ్ రైతులకు ప్రోత్సాహం జూలై 15లోగా పెండింగ్ పనులు పూర్తి కలెక్టర్ కె.హైమావతి మాట్లాడుతున్న కలెక్టర్ హైమావతి -
కల్యాణలక్ష్మికి ‘గెజిటెడ్’ గ్రహణం
● సంతకాలు చేసేందుకు గెజిటెడ్ అధికారుల నిరాసక్తత ● కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలుమిరుదొడ్డి(దుబ్బాక): కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకుంటున్న లబ్ధిదారులకు ఆదిలోనే హంసపాదెదురవుతోంది. అన్ని అర్హతలు కలిగిన పత్రాలను సమకూర్చినప్పటికీ వాటిని ధ్రువపర్చి సంతకాలు చేయాల్సిన గెజిటెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. దీంతో లబ్ధిదారులు నిరాశా నిస్పృహాలకు గురవుతున్నామని కల్యాణ లక్ష్మి బాధితుఉలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మొగుళ్ళ ఐలవ్వ, మొగుళ్ల లక్ష్మి, భూపల్లి పద్మలు తమ తమ కూతుళ్లకు గత ఐదు నెలల క్రితం వివాహాలు జరిపించారు. కల్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తులు చేసుకుందామంటే గెజిటెడ్ అధికారులు సంతకాలు పెట్టకుండా తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన జరిపాక అర్హులుగా గుర్తించి సంతకాలు చేయాల్సిన గెజిటెడ్ అధికారులు ససేమిరా అంటుండటంతో నిత్యం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు. కాగా జిల్లాలో కొన్ని సందర్భాల్లో కల్యాణ లక్ష్మి పథకాన్ని పక్కదారి పట్టించడంతో పలువురిపై కేసులు నయోదైనట్లు గుర్తించిన అధికారులు ధ్రువ పత్రాలపై సంతకాలు చేయడానికి గెజిటెడ్ అధికారులు వెనకంజ వేస్తున్నట్లు సమాచారం. -
పెండింగ్ కేసులపై సత్వర నిర్ణయం
సిద్దిపేటకమాన్: జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులలో పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో కలెక్టర్ హైమావతి, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలతో శనివారం ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులలో పెండింగ్ కేసులలో పోలీసు శాఖ తరపున తీసుకోవాల్సిన చర్యల గురించి తగు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక కోర్టు భవనాల స్థల సేకరణపై జిల్లా కలెక్టర్తో చర్చించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ జిల్లా సీనియర్ జడ్జి జయప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఏసీపీలు రవీందర్రెడ్డి, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, సైదా, ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి -
బదిలీలు, పదోన్నతుల కోసం కృషి
వర్గల్(గజ్వేల్): ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే సత్తా కలిగిన ఏకై క సంఘం పీఆర్టీయూ అని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శనివారం మండల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన వర్గల్ మండలం గౌరారం ఫంక్షన్హాల్లో చౌదరిపల్లి జెడ్పీహైస్కూల్ హెచ్ఎం ఇటిక్యాల వెంకట్రెడ్డి ఉద్యోగ విరమణ సభకు ఆయన హాజరయ్యారు. వెంకట్రెడ్డి దంపతులకు జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రయోజనాలే లక్ష్యంగా 50 సంవత్సరాలుగా పీఆర్టీయూ కృషి చేస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ఇప్పిస్తామని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసే విధంగా కృషి చేస్తామని, షరతులు లేకుండా అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందేలా హెల్త్ కార్డులు ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ఆదరాసుపల్లి శశిధర్శర్మ, ఎంఈఓ సునీత, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హామీ -
అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది
ఉత్తమ డీఐఈఓగా రవీందర్రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: ఉత్తమ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. ఇటీవల హైదరాబాద్లో ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణ, బోర్డు డైరెక్టర్ కృష్ణఆదిత్య నుంచి రవీందర్రెడ్డి ఉత్తమ డీఐఈఓ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక కార్యాలయంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, జిల్లాలో ఇంటర్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానన్నారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యలు ఈ నెల 30లోగా పరిష్కరిస్తాననన్నారు. అధ్యాపకులు నిబద్ధతతో పనిచేయాలని, విద్యార్థుల భవిష్యత్ను ఉత్తమంగా తీర్చిదిద్దుతూ మంచి ఫలితాలను సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అధ్యాపకులు తమ సమస్యలు తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించేందకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పరస్పర సహకారంతో కళాశాలల్లో చక్కని వాతావరణం నెలకొనేలా కృషిచేయాలని కోరారు. సెక్రటరీ సూచన మేరకు గెస్ట్ లెక్చరర్ల సమస్యలను త్వరలోనే పరిఽష్కరిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్–2152 రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవయ్య, జిల్లా ఇన్చార్జి మల్లికార్జున్శర్మ, జిల్లా సెక్రటరీ చంద్రమోహన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టులో ప్రారంభిస్తాం
ఆయిల్పామ్ ఫ్యాక్టరీని నంగునూరు(సిద్దిపేట): రాష్ట్రంలోనే అత్యంత కెపాసిటీ కల్గిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని వ్యవశాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ఆగస్టు మొదటి వారంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. శుక్రవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలసి తుమ్మల నంగునూరు మండలం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణం పనులపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం, సాగు చేస్తున్న రైతుల వివరాలు, ఫ్యాక్టరీ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల నాలుగు జిల్లాల నుంచి ఆయిల్పామ్ గింజలను సేకరించి ప్యాకింగ్ ఇక్కడే చేస్తారని ముగ్గురు మంత్రులకు వ్యవసాయ మంత్రి వివరించారు. అనంతరం మాట్లాడుతూ నర్మేటలో నిర్మిస్తున ఫ్యాక్టరీ 120 టన్నుల కెపాసిటీ కలిగి ఉందన్నారు. తెలంగాణకు గుండె కాయలా ఉన్న ఈప్రాంతంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందన్నారు. రిఫైనరీ కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. నాడు గ్రౌండ్ లేవల్లో ఉన్న పనులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పనులు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, వ్యవసాయ, ఉద్యాన, ఆయిల్ఫెడ్ అధికారులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఫ్యాక్టరీని ఆకస్మికంగా పరిశీలించిన మంత్రులు -
పీజీ ఎంట్రెన్స్కు ఉచిత కోచింగ్
సిద్దిపేటఎడ్యుకేషన్: కెమిస్ట్రీ సబ్జెక్ట్తో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఫార్మా రంగంలో మంచి అవకాశాలున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో కెమిస్ట్రీ పీజీ ఎంట్రెన్స్ రాయనున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్లు మాట్లాడారు. పీజీలో కెమిస్ట్రీని ఎంచుకుని, శిక్షణా తరగతులను ఉపయోగించుకుని వివిధ యూనివర్సిటీల్లో పీజీ ఎంట్రెన్స్లో మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. పీజీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి ఫలితాలను సాధించాలన్నారు. ఉచిత శిక్షణపై ఆసక్తిగల విద్యార్థులు కన్వీనర్ డాక్టర్ మనోహర్ను కలిసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మధుసూదన్రెడ్డి, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈనెలాఖరు వరకు బియ్యం పంపిణీ సిద్దిపేటరూరల్: రేషన్ బియ్యాన్ని ఈనెల 30వ తేదీవరకు అందించనున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్ తీసుకోని లబ్ధిదారులు వెంటనే అందుబాటులో రేషన్ షాప్నకు వెళ్లి తీసుకెళ్లాలన్నారు. పూర్తి స్థాయిలో బియ్యం అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 90 శాతం పంపిణీ పూర్తయిందని, మొత్తంగా 2,98,985 రేషన్కార్డులు ఉండగా, నేటికి 2,67,875 కార్డుదారులకు 16,739 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అక్రమలకు తావివ్వకుండా బియ్యం పంపిణీ చేయాలన్నారు. యాక్టివాపై సుదీర్ఘ ప్రయాణంసిద్దిపేటజోన్: యాక్టివా బైక్తో 6300 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన సిద్దిపేట యువకుడిని శుక్రవారం వాసవీ క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. స్థానిక శివాజీనగర్కు చెందిన శివకుమార్ 23 రోజుల పాటు ద్విచక్ర వాహనంపై లడక్ వరకు పర్యటించి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా శివకుమార్ను పట్టణ వాసవీ క్లబ్ ప్రతినిధులు నవీన్ కుమార్, శివకుమార్ హరికిరణ్, మంజుల, ధనలక్ష్మి ఘనంగా సన్మానించారు. బడుల తనిఖీకి ప్రత్యేక యంత్రాంగంనారాయణఖేడ్: పాఠశాలల తనిఖీకోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞానమంజరి డిమాండ్ చేశారు. ఖేడ్లో శనివారం నిర్వహించిన సంఘం డివిజన్స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులను పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యుటీ ఈవో, ఎంఈవో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలని, అవసరమైనచోట్ల కొన్ని అదనపు పోస్టులను మంజూరు చేసి ప్రత్యేక యంత్రాంగం ద్వారానే పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమిస్తే క్యాడర్, సీనియారిటీ సమస్యలతోపాటు విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శులు నరేశ్, ఏశప్ప, హరిసింగ్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. క్షయపై అవగాహన అవసరం హుస్నాబాద్రూరల్: గ్రామీణులకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించాలని ఇంఫాక్ట్ ప్రాజెక్టు టీబీ అలర్టు ఇండియా ప్రతినిధి శ్రీనివాస్ సూచించారు. పట్టణంలో ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు బ్యాక్టీరియా గాలిలో కలిసి మరొకరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి ఊపిరితిత్తులను ప్రభావితం చేసి, శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రులకు ఘన స్వాగతం
హుస్నాబాద్లో మంత్రులకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీగా కిలోమీటర్ల మేర తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. రోడన్నీ పార్టీ కార్యకర్తల జోష్తో నిండిపోయింది. పబ్లిక్ మీటింగ్కు మహిళలు భారీగా తరలివచ్చారు. కాగా సమావేశంలో సాంస్కృతిక కళాకారులు సంక్షేమం, అభివృద్ధిపై ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. కానీ సయ్యాటల పాటలు పాడటంతో మహిళలు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి చేస్తాం
అండగా ఉంటాం..హుస్నాబాద్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తాం‘గౌరవెల్లి’పై గత ప్రభుత్వం నిర్లక్ష్యం: మంత్రి కోమటి రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రూ.77కోట్లతో హుస్నాబాద్ నుంచి సుందరిగిరి వరకు నాలుగు వరసల రోడ్డు ఫేజ్ టూ కింద రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు రూ.80 కోట్లతో నాలుగు వరుసల రహదారి వారం రోజుల్లో మంజూరు అవుతుందని అన్నారు. గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కోసం సీఎంతో మాట్లాడామన్నారు. ఫారెస్ట్ అనుమతులు పూర్తి అయ్యాయని, కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.హుస్నాబాద్: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రులు దామోదర, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం రూ.11.50కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆరోగ్యం కేంద్రం ప్రారంభం, రూ.82 కోట్లతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన, రూ.72.20 కోట్లతో హుస్నాబాద్ నుంచి కొత్త పల్లి వరకు (ఫేజ్–2) నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులు కలిసి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఇదే మొదటి సారి. విద్య, ఆరోగ్యంతోనే సమాజంలో మార్పు ఆరోగ్య తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దామోదర మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే విద్య, ఆరోగ్యం, నైపుణ్యం అవసరమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ వల్లే హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కళాశాల వచ్చిందన్నారు. హుస్నాబాద్ 250 పడకల ఆస్పత్రికి 50 సీట్లతో పీజీ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఎంబీబీఎస్ కాదని పీజీ చదువుకునే డాక్టర్లు ఇక్కడికి వస్తారని ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రతి నియోజకవరానికి ఒక నర్సింగ్ కళాశాల అవసరమన్నారు. త్వరలో నాలుగు లేన్ల రోడ్డు: మంత్రి పొన్నం అక్కన్నపేట నుంచి జనగామ వరకు నాలుగు లేన్ల రోడ్డు త్వరలో వస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంలో ఇంజనీరింగ్ కళాశాల ఈ ఏడాది నుంచే ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇక్కడికి వచ్చిన మంత్రులు హుస్నాబాద్ అభివృద్దికి అభయం ఇవ్వాలని కోరారు. మూడు జిల్లాల కలెక్టర్లు కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల పనుల సర్వే చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.71.30 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. హుస్నాబాద్లో గోడౌన్లు నిర్మించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు, సుందరగిరి నుంచి కొత్తపల్లి వరకు ఫేజ్ వన్ నాలుగు వరుసల రహదారిని మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డికి మంత్రి పొన్నం వినతి పత్రాలు ఇచ్చారు. పొన్నంను పొగడ్తలతో ముంచెత్తిన మంత్రులు మంత్రి పొన్నంపై సహచర మంత్రులు ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రుల మాటలు ఇలా.. ‘పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారుడు. చాలా యాక్టివ్ మంత్రి. ఎప్పుడూ హుస్నాబాద్ కోసం పరితపిస్తుంటారు. ఉదయం హైదరాబాద్లో ఉంటే సాయంత్రం హుస్నాబాద్లో ఉంటారు. హుస్నాబాద్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేవి చాలా ఉన్నాయి. మేమంతా అండగా ఉంటాం. అభివృద్ధి చేస్తాం. రాబోయే మూడున్నరేళ్లలో పొన్నం అడిగిన పనులు పూర్తి అవుతాయి’ అని అన్నారు. ప్రతీ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ: తుమ్మల 50 పడకల పీజీ మెడికల్ కళాశాల: మంత్రి దామోదర త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం: మంత్రి తుమ్మల పది రోజుల్లో నాలుగు లేన్ల రహదారి మంజూరు: మంత్రి వెంకట్రెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధిపనులకు శ్రీకారం శ్రీరాంసాగర్, వరద కాలువలతో అన్నపూర్ణ జిల్లా కరీంనగర్ జిల్లా ప్రసిద్ధి చెందుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఎన్నో ప్రాజెక్టులు ఉన్న కరీంనగర్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చానన్నారు. నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరిని త్వరలో సీఎం ప్రారంభిస్తామన్నారు. నాలుగైదు జిల్లాలకు ఈ ఫ్యాక్టరి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఆ యిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయిల్పామ్ సాగుకు నష్టం ఉండదని, స్థిరత్వమైన ధర కల్పిస్తామన్నారు. -
పౌష్టికాహారం అందేలా చర్యలు
డీఈఓ శ్రీనివాస్రెడ్డి మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మిరుదొడ్డిలోని కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం), మోడల్ స్కూల్ హాస్టల్ను శుక్రవారం ఆయన సందర్శించారు. హాస్టల్లోని వంట గదులను, స్టోర్ రూంలను పరిశీలించారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించారా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్టల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కరమైన వాతావరణంలో విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించాలని టీచర్లకు సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి టీచర్లు మంచి ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని ఆదేశించారు. టెన్త్ చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇప్పటి నుంచే విజ్ఞానవంతమైన బోధన అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్బాబు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు. వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ప్రశాంత్నగర్(సిద్దిపేట): నేటి ఆధునిక కాలంలో వ్యాయామ విద్యకు ప్రాధాన్యత పెరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో వ్యాయామ విద్య స్టాక్ రిజిస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే వ్యాయామంపై పట్టు సాధిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం, బద్దకం, తదితర సమస్యలకు వ్యాయామం పరిష్కార మార్గమన్నారు. కార్యక్రమంలో తోట సతీష్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
గజ్వేల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 13వార్డుల్లో లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గానికి ప్రభుత్వం 3వేల ఇళ్లు మంజూరుచేసిందని చెప్పారు. ఇప్పటికే 2,938మందికి ప్రొసీడింగ్లను సైతం అందజేశామన్నారు. నియోజకవర్గానికి అదనపు ఇళ్లు కావాలన్నా.. ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుముఖంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం మంజూరైన ఇళ్లను ఆరు నెలల్లో పూర్తి చేసి పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు పూర్తి చేయాలని కోరారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లల్లా భావించి సీఎం రేవంత్రెడ్డి ముందుకుసాగుతున్నారని కొనియాడారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 9రోజుల్లో 9వేల కోట్లు రైతు భరోసా నిధులను జమ చేసినట్లు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసీ ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ఖాన్, కాంగ్రెస్ నాయకులు సమీర్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి గజ్వేల్లో ఇళ్ల పనులు ప్రారంభం -
మత్తు వదిలిద్దాం.. మహమ్మారిని తరిమేద్దాం
విద్యార్థులతో కలిసి ర్యాలీలో నడుస్తున్న కలెక్టర్, సీపీ, ఇతర అధికారులుసిద్దిపేటఎడ్యుకేషన్/హుస్నాబాద్: ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం.. మహమ్మారిని తరిమేద్దాం.. మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు’ అని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. సిద్దిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్) నుంచి ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులచే పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీని సీపీ అనురాధతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తుకు బానిసలుగా మారిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు బాధితులకు అవగాహన కల్పించాలన్నారు. స్నేహితులు, బంధువులు సన్మార్గాంలో నడిచేలా యువత బాధ్యతవహించాలన్నారు. అవగాహన కల్పిస్తున్నాం పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ పాఠశాలల్లో గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై వివరిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా డ్రగ్స్ కలిగి ఉన్నా, తీసుకున్నా వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1908కు లేదా కంట్రోల్ రూమ్ నంబర్ 8712667100 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. పాత బస్టాండ్ సర్కిల్ వద్ద డ్రగ్స్కు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీకాంత్రెడ్డి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్నె రవీందర్రెడ్డి, అదనపు డీసీపీ సుభాష్చంద్రబోస్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు.మానవహారం.. హుస్నాబాద్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాదవద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని అన్నారు. అంతకు ముందు విద్యార్థులు ర్యాలీగా వచ్చి అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి కలెక్టర్ హైమావతి పిలుపు జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్పై కదంతొక్కిన జనం -
పైరవీలకే పోస్టులు
మెరిట్ లిస్ట్ లేకుండానే.. అర్హత ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులతో సబ్జెక్ట్ నిష్ణార్థులు, ఎంఈవో, ఎస్వోల సమక్షంలో డెమో చెప్పించారు. క్లాస్ చెబుతుంటే ఎలాంటి వీడియో చిత్రీకరించలేదు. ఎలాంటి మెరిట్ లిస్ట్ను ప్రదర్శించకుండానే నేరుగా అభ్యర్థులకే సమాచారం అందించి సెలెక్ట్ చేశారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపికలు నిష్పక్షపాతంగా జరగలేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) లలో గెస్ట్ లెక్చరర్ల నియామకాల్లో పైరవీలకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లాలో 9 కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయంతో 42 గెస్ట్ లెక్చరర్ల నియామకం చేపట్టారు. అర్హులను కాకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు చెప్పిన వారికే అవకాశాలు కల్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపిస్తున్నారు. ఉన్నత అధికారులు మరోసారి పరిశీలించాలని డెమోకు హజరైన అభ్యర్థులు కోరుతున్నారు. 16 కేజీబీవీలలో.. జిల్లా వ్యాప్తంగా 23 చోట్ల కేజీబీవీలుండగా గతేడాది వరకు ఏడు చోట్ల మాత్రమే ఇంటర్ విద్యను అందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 9 కేజీబీవీలలో ఇంటర్మీడియెట్ విద్యను ప్రారంభించారు. దీంతో ఇంటర్ విద్యను అందించే కేజీబీవీలు 16కు చేరాయి. నూతనంగా ఇంటర్ విద్యను అందించేందుకు కొమురవెల్లి, వర్గల్, ములుగు, అక్కన్నపేట, హుస్నాబాద్, తొగుట, అల్లిపూర్(చిన్నకోడూరు) కేజీబీవీలలో బోధించేందుకు గెస్ట్ లెక్చరర్లను నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆయా కేజీబీవీల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించారు. 42 గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దాదాపు 150కి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పైరవీలకే ప్రాధాన్యత కేజీబీవీలలో గెస్ట్ లెక్చరర్ల ఎంపికల్లో పైరవీలకే ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక మాజీ ప్రతినిధులు చెప్పిన వారికే అవకాశాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి అవసరమైతే మరోమారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్యాపకుల సమక్షంలో డెమో నిర్వహించి ఎంపికలు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై త్వరలో కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. గెస్ట్ లెక్చరర్ల నియామకాల్లో అక్రమాలు ఆయా సబ్జెక్టులకు 42 మంది నియామకం మెరిట్ లిస్ట్ ప్రదర్శించకుండానే ఎంపికలు అవకతవకలపై సర్వత్రా విమర్శలు 9 కేజీబీవీల్లో నూతనంగా ఇంటర్ విద్య ప్రారంభం తొగుట, కొమురవెల్లిలో గెస్ట్ అధ్యాపకురాలి పోస్ట్కు ఓ మహిళా దరఖాస్తు చేశారు. రెండు చోట్లా ఎంతో కష్టపడి వేర్వేరుగా డెమో ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు. అయితే ఎలాంటి మెరిట్ లిస్ట్ ప్రదర్శించకుండానే గెస్ట్ లెక్చరర్ల నియామకం చేపట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీలు చేసుకున్న అభ్యర్థులనే నేరుగా పిలిచి ఎంపిక చేశారని తెలుస్తోంది. పోస్టుల నియామకాల్లో జరిగిన అవకతవకలపై అధికారులు దృష్టి సారించాలని డెమోకు హాజరైన అభ్యర్థులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట పారదర్శకంగానే ఎంపికలు కేజీబీవీలలో గెస్ట్ లెక్చరర్ల ఎంపికలు పారదర్శకంగా జరిగాయి.అవకతవకలకు అవకాశాలు లేవు. అభ్యర్థులు ఇచ్చిన డెమో ప్రకారం ఎంఈవో, ఎస్వో, ఆ సబ్జెక్ట్ నిష్ణార్థుడు సమక్షంలో ఎంపిక చేశారు –శ్రీనివాస్రెడ్డి, డీఈఓ -
కురిసిన వాన.. మురిసిన రైతన్న
వానాకాలం సీజన్లో సాగు వివరాలు (ఎకరాల్లో) పంట ఇప్పటి వరకు సాగైన పంటలు వరి 614 మొక్కజొన్న 9,145 పత్తి 51,510 కందులు 553 పెసర్లు 36ప్రశాంత్నగర్(సిద్దిపేట): కురిసిన వర్షాలతో సాగు పనులు ముమ్మరమయ్యాయి. కొద్ది రోజులుగా వర్షాలు లేక మొలకెత్తిన మొలకలు సైతం వాడిపోతుండటంతో దిగులుచెందుతున్న రైతుల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన వర్షాలు సంతోషాలను నింపాయి. జిల్లా వ్యాప్తంగా 1081.6మిల్లిమీటర్లు, సగటున 41.6మిల్లిమీటర్ల వర్ష పాతం నమోదయ్యింది. అత్యధికంగా నారాయణరావు పేట మండలంలో 90.21మి.మీ, సిద్దిపేట రూరల్ మండలంలో 73.2మి.మీ, సిద్దిపేట అర్బన్ మండలంలో 69.6మి.మీ, కోహెడ మండలంలో 56.3మి.మీ, అక్బర్పేట భూంపల్లి మండలంలో 55.8మి.మీ, తొగుట మండలంలో 55.5మి.మీ, దుబ్బాక మండలంలో 53.2మి.మీ, దౌల్తాబాద్ మండలంలో 52.9మి.మీ, అక్కన్నపేట మండలంలో 52.1మి.మీ, చిన్నకోడూరు, బెజ్జంకి మండలాలలో 51.1 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎండిపోయే దశలో ఉన్న పంటలకు వానలు ఊపిరిపోశాయి. ముందుగానే పంటలపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నౖ రెతులకు ఈ వర్షంతో కోండంత ధైర్యాన్ని ఇచ్చాయి. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వ్యవసాయాదారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 1081.6 మిల్లీమీటర్ల వర్షపాతం నారాయణరావుపేటలో అత్యధికం పంటలకు జీవం పోసిన వరుణుడు సాగు పనుల్లో అన్నదాతలు బిజీ పంటకు ప్రాణం నాకున్న భూమిని సాగుకు సిద్ధం చేసి, ప్రారంభంలో వర్షం పడగానే విత్తనాలు వేశాను. ఆ తరువాత వానలు లేకపోవడంతో బాధపడ్డాను. కొద్ది రోజులగా వానలు కురవడంతో పంటలకు ప్రాణం పోసినట్లయింది. – అనిమెల అభి, రైతు, తొగుట -
హుస్నాబాద్లో నేడు మంత్రుల పర్యటన
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హుస్నాబాద్: పట్టణంలో శుక్రవారం నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఏర్పాట్లను గురువారం కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.11.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఇదే ప్రాంగణంలో ఉన్న 100 పడకల ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు రూ.82 కోట్లతో నిర్మించనున్న 150 పడకల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. హుస్నాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రూ.77.20 కోట్లతో నిర్మిస్తున్న నాలుగు లేన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొంటారు. -
వసతి గృహాల్లో వసతులు కల్పించండి
యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతు నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా హాస్టళ్లల్లో కనీస వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ విద్య అభ్యసించడం అంటే సమస్యలతో సతమతమవడమనే విధంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లు మాత్రం మారడం లేదని ఆరోపించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో హాస్టల్ విద్యార్థులకు రావలసిన బెడ్డింగ్, స్టడీ మెటీరియల్స్ రాకపోవడంతో తల్లిదండ్రుల మీద అదనపు భారం పడుతుందన్నారు. కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు నాచారం శేఖర్, జిల్లా అధ్యక్షుడు గుడి కందుల రవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించండి
సిద్దిపేటకమాన్: పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు జిల్లా కోర్టులో న్యాయమూర్తులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పాత కేసులన్నీ పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, వినోద్కాంబ్లే, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట):పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. రాజగోపాల్పేటలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మొదటి రోజు 289 మంది విద్యార్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారులు ఐడీ పాస్వర్డు అందజేశారు. ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ ఐడీ పొందిన విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు పెట్టు కోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి ప్రధానికి లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం చేర్యాల(సిద్దిపేట): ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని సాధన సమితి జాతీయ అధ్యక్షుడు పరశురాం డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ప్రధానికి లక్ష పోస్ట్ కార్డ్ల ఉద్యమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన కార్యక్రమం గురువారం పట్టణ కేంద్రానికి చేరుకుంది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రధాని మోదీకి పోస్ట్ కార్డులు రాశారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ అంబేడ్కర్ సూచనలతోనే 1935 ఏప్రిల్ 1 రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఏర్పాటైందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 500 మందితో పోస్ట్ కార్డ్స్ వేయించామన్నారు. 26 జనవరి 2026 వరకు ప్రధానికి లక్ష మందితో పోస్ట్కార్డ్లు వేయిస్తామన్నారు. కార్యక్రమంలో కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జిల్లా కన్వీనర్ మేడిపల్లి చందు, మాజీ కౌన్సిలర్ చంటి, మాజీ సర్పంచ్ వల్లూరి శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు చిన్నకోడూరు(సిద్దిపేట): ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని చిన్నకోడూరు, గంగాపూర్, రామంచ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించవద్దన్నారు. ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు అమ్మాలని ఆదేశించారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. యూరియాను అవసరం మేరకు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ జయంత్ కుమార్, ఏఈఓలు పాల్గొన్నారు. -
వడ్డీ రాకాసులు
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రైవేటు ఫైనాన్స్లు పేదల నడ్డి విరుస్తున్నాయి. పేద ప్రజల అమాకత్వాన్ని, అవసరాలను ఆసరాగా తీసుకుని అప్పులు ఇచ్చి వడ్డీల పేరుతో నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సిద్దిపేటకు చెందిన ప్రైవేటు ఫైనాన్స్లు గ్రామాల్లో వారం, నెల రోజులు వారీగా మిత్తీలకు ఇస్తూ పేదలను హింసుస్తున్నారు. మహిళల పేరు మీద మహిళా గ్రూపులు ఏర్పాటు చేస్తూ వారం చిట్టీలు నడిపిస్తున్నారు. పది మందిని ఒక గ్రూపుగా చేసుకుంటూ నెలలో ఒక మొదటి వారాన్ని ఎంచుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. పది మందిలో ఆపద ఉండి ఎవరైనా డబ్బులు చెల్లించలేకపోతే వారి ఇళ్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అధిక వడ్డీతో డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్లో కుటుంబ కలహాలతో వారం క్రితం ఒక వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతను చెల్లించాల్సిన రూ.3 వేల కోసం గురువారం అతని ఇంటిపై సిద్దిపేటకు చెందిన ప్రైవేటు ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఫైనాన్స్ల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. పేదల నడ్డి విరుస్తున్న ప్రైవేటు ఫైనాన్స్లు వారి ఆగడాలను అరికట్టాలంటున్న ప్రజలు -
పంచాయతీ పోరు
మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణ ● ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ● ఇప్పటికే సిద్ధమైన ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు ● రిజర్వేషన్లు తేలకపోవడంతో నిలిచిన ఎన్నికల ప్రక్రియ ● కోర్టు తాజా ఆదేశాలతో వేడెక్కనున్న పల్లె రాజకీయంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పల్లె రాజకీయ మళ్లీ వేడెక్కనుంది. మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి షురూ కానుంది. సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని భావిస్తున్న నాయకులు మళ్లీ మద్దతు కోసం మంతనాలు ప్రారంభించనున్నారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాకే ఆశావహులు ప్రత్యక్ష కార్యచరణకు దిగాలని యోచిస్తున్నారు. ఈ రిజర్వేషన్ తమ అనుకూలంగా వస్తే..అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటినుంచి మద్దతు కోసం కార్యాచరణ ప్రారంభిస్తే ఖర్చులు తడిసి మోపెడవుతాయని..తీరా రిజర్వేషన్ అనుకూలంగా రాకపోతే ఖర్చులన్నీ వృథా అవుతాయనే ఆలోచనలో చోటా మోటా నాయకులు ఉన్నారు. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం 2024 జనవరి 31తోనే ముగిసిన విషయం విదితమే. అప్పట్నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోవడంతో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి ఈ ఎన్నికలను ఆరు నెలల క్రితమే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం జనవరిలో చకచకా ఎన్నికల ఏర్పాట్లు చేసింది. ఓటరు జాబితాలను కూడా సిద్ధం చేసింది. ఈవీఎంలు కాకుండా, బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉండటంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను జిల్లాకు తెప్పించారు. అలాగే బ్యాలెట్ పేపర్లు కూడా ముద్రించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా గుర్తించారు. స్టేజ్–1, స్టేజ్–2 ఇలా వివిధ స్థాయిల్లో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన ఆయా స్థాయిల్లోని అధికారులను, సిబ్బంది జాబితాను రూపొందించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన దాదాపు అన్ని ప్రక్రియలు ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు తీరా రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో పోలింగ్ ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఈ ఎన్నికల ఏర్పాట్లపై నిమగ్నం కానుంది.ముఖ్యనేతలకు ప్రతిష్ఠాత్మకమే..గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల నేతలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. తమ అనుచరులనే సర్పంచులుగా గెలిపించుకుంటేనే ఆయా గ్రామాల్లో నియోజకవర్గస్థాయి నాయకులకు పట్టు ఉంటుంది. దీంతో అన్ని పార్టీల నాయకులు తమకు అనుకూలమైన వ్యక్తులను బరిలోకి దింపేందుకు ఇప్పట్నుంచి అన్వేషణ ప్రారంభించనున్నారు. -
ప్రజల రక్షణే ముఖ్యం
సీపీ అనురాధ దుబ్బాకటౌన్: ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహించి, ప్రజల మన్ననలు పొందాలని సీపీ అనురాధ అన్నారు. బుధవారం బేగంపేట పోలీస్స్టేషన్ను సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఆమె మాట్లాడుతూ పోలీస్స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు త్వరగా అప్పగించాలని ఎస్ఐకి సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, సీసీఆర్బి సీఐ రామకృష్ణ, ఎస్బీ సీఐ శ్రీధర్ గౌడ్ తదితరులు న్నారు. కుకునూర్పల్లి పోలీస్స్టేషన్ తనిఖీ కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని కుకునూర్పల్లి పోలీస్స్టేషన్ను సీపీ అనురాధ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్, రికార్డ్స్, రైటర్రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్య లు పరిష్కరించాలన్నారు. ఆన్లైన్ గేమ్స్, ఆన్ లైన్ బెట్టింగ్పై నిఘా పెంచాలని సూచించారు. పథకాలు సద్వినియోగం చేసుకోండి అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సిద్దిపేటజోన్: ‘ఏమ్మా.. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నావా? ప్రభుత్వం ఇల్లులేని వారికి ఇందిరమ్మ పథకం అమలు చేస్తోంది. సద్వినియోగం చేసుకోవాలి’ అని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక 17 వార్డులో ఒక రేకుల ఇంటి వద్ద ఆగి ఇంటి యజమాని చిలుకల లక్ష్మితో ఆప్యాయంగా మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు గూర్చి అరా తీశారు. దరఖాస్తు చేసినట్టు ఆమె చెప్పడంతో అక్కడే ఉన్న అధికారులను వెంటనే వెరిఫై చేయాలని సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్ యార్డులో తనిఖీ చేశారు. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులను పరిశీలించారు. కాళ్లకుంట కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ ప్రజలతో వైద్య సేవలు గురించి ఆరా తీశారు. అన్ని రకాల మందులు, ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య పోస్టులు భర్తీ చేయండి హుస్నాబాద్: ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేసేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి వైద్యం కోసం వందలాది మంది హుస్నాబాద్కు వస్తుంటారని తెలిపారు. పేద ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే మందుల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఈసారీ లేనట్టే..!
చడీచప్పుడూలేని ‘ఫసల్ బీమా’ ● పంటల సాగుకు మార్గదర్శకాలేవీ? ● అదిగోఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం ● పంట నష్టానికి దేవుడే దిక్కు ‘ఫసల్ బీమా’ ఈసారీ కూడా అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం.. ఈ సీజన్లో పంటల సాగుకు అదను దాటే పరిస్థితి రాబోతున్నా చడీచప్పుడూలేదు. ఈ సీజన్లో రైతుకు పంట నష్టం జరిగితే ‘దేవుడే దిక్కు’ అనే దుస్థితి నెలకొంది. –గజ్వేల్జిల్లాలో ఏటా వానాకాలంలో 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. గతంలో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ‘ఫసల్ బీమా’ అమలు చేసేవారు. వానాకాలంలో సాగుచేసే ఆహార, నూనె గింజలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు పంటల వారీగా, ప్రాంతాల వారీగా ప్రీమియం నిర్దేశించారు. అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుపాను, అనావృష్టి, వరదలు, నీట మునిగిపోవడం, తెగుళ్లు, ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులకు నష్టం వాటిల్లితే నష్ట పరిహారం చెల్లించేవారు. అంతేగాకుండా ప్రతికూల వాతావరణం కారణంగా రైతులు విత్తనాలు విత్తకపోవడం, నార్లు వేయకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు బీమా మొత్తంలో 25శాతం వరకు సత్వర నష్టపరిహారం అందించే అవకాశం ఈ పథకంలో ఉండేది. పంట మధ్యకాలంలో నష్టపోయిన రైతులకు సైతం నష్టాన్ని అంచనా వేసి పరిహారంలో 25శాతం చెల్లించే అవకాశం. పంటల రకాలను బట్టి ప్రీమీయం చెల్లించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పథకం అమలయ్యేది. కానీ వివిధ కారణాలతో కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోయింది. రైతుల ఆశలపై నీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయించింది. గతేడాది నుంచే అమలు చేస్తామని కూడా ప్రకటించింది. కానీ ఈ సీజన్లోనైనా పథకం అమలవుతుందని అంతా భావించారు. కానీ రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టే కనపడుతోంది. ఈసారి వానాకాలం ఆరంభం నుంచే రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు భారీ వర్షామే లేకుండా పోయింది. జిల్లాలోని 23మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. సుమారు 80వేల ఎకరాల్లో పత్తిని ఇప్పటికే సాగు చేశారు. మొక్కజొన్న విత్తనం కూడా జోరుగా వేస్తున్నారు. కానీ భూముల్లో పదును లేక విత్తనం మొలకెత్తడం లేదు. పత్తికి ఇప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. మొక్కజొన్న పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఫసల్ బీమా’ అమలయి ఉంటే రైతులకు కొంత భరోసా ఉండేది. కానీ పరిస్థితి నేడు భిన్నంగా తయారైంది. నిజానికి జూలై 15లోగా పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు సాగుచేసుకునే అవకాశముంది. ఆ తర్వాత వరి సాగుకు మరికొంత సమయం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ‘ఫసల్’పై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోవడం.. ఈ సీజన్లో పథకం అమలయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మార్గదర్శకాలు రాలేదు ‘ఫసల్ బీమా’ అమలుకు సంబంధించి రైతుల నుంచి విజ్ఞప్తులు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ఒకవేళ వస్తే రైతులకు సమచారమిస్తాం. – రాధిక, జిల్లా వ్యవసాయాధికారి -
పలుచోట్ల మోస్తరు వాన
మొక్క మొక్కకు నీరు పోస్తూ.. హుస్నాబాద్లో 5.8మి.మీ. వర్షపాతం నమోదు జిల్లాలో బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 5.8మీ.మీ, బెజ్జంకిలో 5మి.మీ, అక్కన్నపేటలో 3.6మి.మీ, సిద్దిపేట అర్బన్, కోహెడ మండలాల్లో 1.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) పంటను కాపాడుకునేందుకు రైతు పాట్లు వర్షం కురవకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పంట ఎండిపోకుండా పడరాని పాట్లు పడుతున్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో రైతు దొంతరవేని రాజయ్య ఎకరంలో పత్తి పంట వేశారు. వానలు లేకపోవడంతో పత్తి మొక్కలను కాపాడుకోనేందుకు బిందెతో నీరు పోస్తున్నారు. వర్షాలు ఆలస్యమైతే మొక్క మొలిచేందుకు శక్తి ఉండదని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.పది వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఇది రాజయ్య బాధనే కాదు హుస్నాబాద్ డివిజన్లో 10 వేల ఎకరాల్లో పత్తి పంటలు వేసిన రైతుల గోస కూడా ఇలాగే ఉంది. – హుస్నాబాద్రూరల్ -
‘మల్లన్న’ జలాల కోసం ఉద్యమిస్తాం
దుబ్బాక: తలాపునే మల్లన్న సాగర్ జలాలు ఉన్నా సాగు నీటికి తిప్పలుతప్పడంలేదని, నీళ్లకోసం ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. బుధవారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి శివారులో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని 12 గ్రామాలకు ఇర్కోడు లిప్టు ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందించాలని జలసాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి నీరు ఇవ్వకుంటే హైదరాబాద్కు మల్లన్నసాగర్ నుంచి వెళ్లే జలాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకై నా సిద్ధమేనని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువలు కూడా నిర్మించడం లేదన్నారు. ఏడాదిన్నర కాలంగా కాలువలు నిర్మించి పొలాలకు నీరందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణంతో సర్వం కోల్పోయామని, మా కడుపులు నిండిన తర్వాతనే బయటకు నీళ్లు తీసుకెళ్లాలన్నారు. ఇర్కోడు లిఫ్టు ఇరిగేషన్ ద్వార నీళ్లు ఇవ్వడంతో పాటు వెంటనే కాలువలు పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గానికి నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవసరమైతే రాజీనామాకై నా సిద్ధమే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టీకరణ జలసాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు -
ఆయిల్పాం రైతులపై వివక్ష
నంగునూరు(సిద్దిపేట): ఆయిల్పాం సాగుచేస్తున్న రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు లాభదాయక పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 300 కోట్లతో ఆసియాలోనే అత్యాధునిక టెక్నాలజీతో అయిల్పామ్ ఫ్యాక్టరీకి అంకురార్పణ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించకపోవడంతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపడంలేదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పంటపై తగ్గించిన సుంకాన్ని యథాస్థానానికి తేవాలని డిమాండ్ చేశారు. మనదంతా ఒకే కుటుంబం సిద్దిపేటజోన్: నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబమని, మీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 227మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందినట్లు పేర్కొన్నారు. అనంతరం నంగనూర్ మండలం మల్యాల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై మండిపాటు -
క్షయ నిర్మూలనే లక్ష్యం కావాలి
● కలెక్టర్ హైమావతి ● వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షసిద్దిపేటరూరల్: క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఇందుకు టీబీ పరీక్షల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు అందిస్తున్న వివిధ ఆరోగ్య సేవలపై బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్ని ప్రాథమిక కేంద్రాల్లో టీబీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మాతా, శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా, గర్భిణుల నమోదు దగ్గర నుంచి ప్రసవం అయ్యేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ఎప్పటికప్పుడు వైద్యాధికారులు సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. సంవత్సర కాలంలో జరిగిన శిశు మరణాలపై పూర్తి నివేదికను అందించాలని ఆదేశించారు. ఆయుష్మాన్ ఆరోగ్య సెంటర్లో ఓపీ సంఖ్య పెంచాలన్నారు. అలాగే వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పల్వన్ కుమార్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ శాంత, ప్రభు త్వ గజ్వేల్ ఆస్పత్రి డాక్టర్ అన్నపూర్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. బాగా చదివి ప్రజలకు సేవ చేయండి సిద్దిపేటకమాన్: బాగా చదివి ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ హైమావతి వైద్య విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. వైద్య కళాశాలలో సిబ్బంది, వైద్య కోర్సుల వివరాలు, అవసరమైన పరికరాలు, ప్రాక్టికల్స్ చేయడానికి ల్యాబ్లు, సెక్యూరిటీ తదితర వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్య విద్యార్థులతో మాట్లాడారు. జూనియర్లను ర్యాగింగ్ చేయరాదని సీనియర్ విద్యార్థులకు సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలపై ఆరా తీశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ల కోసం పని చేస్తున్నారా?
చిన్నకోడూరు(సిద్దిపేట): ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడానికే తప్ప రైతుల కోసం పని చేయడం లేదని, ఇకనైనా అధికారుల్లో మార్పు జరగకపోతే సహించేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు అధికారుల తీరుపై మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్వద్ద ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో మల్లన్నసాగర్ 12వ ప్యాకేజీ పనులపై ఇరిగేషన్ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలలు అయినా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఎందుకు సమీక్ష సమావేశం నిర్వహించలేదని, జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నెల రోజుల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో మిగిలిపోయిన పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలని ఆదేశించారు. 2022లో పనులకు శంకుస్థాపన చేసినా నేటి వరకు ఎందుకు సాగు నీరు ఇవ్వలేదని మండిపడ్డాడు. దుబ్బాక నియోజకవర్గంలో గురువారం నుంచి ఇరిగేషన్ అధికారులు పర్యటించాలని సూచించారు. దుబ్బాక నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా ప్రాజెక్టుతో నష్టపోయారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మెగా కంపెనీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ బస్వరాజు, అధికారులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలు పట్టవా.. ఇరిగేషన్ అధికారులపై ఎంపీ రఘునందన్రావు ఫైర్ -
ఇన్చార్జి మంత్రిని కలిసిన నాగపురి
చేర్యాల(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ను సోమవారం మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకుడు నాగపురి కిరణ్కుమార్గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు చేర్యాల ప్రాంతంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సమీకృత భవనం నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి అవసరమైన డాక్టర్లను నియమించాలని కోరారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో చేర్యాల పట్టణ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. వీటన్నింటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
● ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం ● ప్రజావాణికి 186 దరఖాస్తులు సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. అలాగే సంబంధిత వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అంతకుముందు ఉదయం జిల్లా అధికారులతో ఇప్పటివరకు ప్రజవాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్ వివరాలు శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిపై నమ్మకం కలిగేలా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి 186 దరఖాస్తులు వచ్చాయి. టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి.. అర్జీదారులు దరఖాస్తులు అందించేందుకు ఒక్కసారిగా రావడంతో హాలు కిక్కిరిసిపోయింది. దీంతో స్పందించిన కలెక్టర్ టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి క్రమానుసారంగా అర్జీలు స్వీరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూతన పెన్షన్ విధానం మాకొద్దు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ రూల్స్కు సవరణలు చేస్తున్న క్రమంలో దాన్ని ఉపసంహరించాలని కోరుతూ ఆల్ఇండియా రాష్ట్ర పెన్షనర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పెన్షన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకుని పెన్షన్ దారులకు తీవ్రమైన నష్టం కలిగించిందన్నారు. దేశంలోని పెన్షనర్లు నిరసన తెలుపుతూ కలెక్టర్లకు వినతిపత్రాలను అందించడం జరగుతుందన్నారు. హక్కులను భంగం కలిగించే ఈ నూతన పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి, సత్యనారాయణ, రవికుమార్, సిద్దారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
సిద్దిపేటజోన్: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందచేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇస్తున్న ప్రభుత్వ సాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచాలని కోరారు. ప్రభుత్వ హామీ మేరకు ప్రతి మహిళకు రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసరా పథకం పింఛన్లు పెంచి ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ అక్రమాలకు పాల్పడి అనర్హులను జాబితాలో చేర్చడం వల్ల అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా నిరుద్యోగులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ, కుమార్ బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయం ఏదీ?
రైతు కూలీలపైఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందని ద్రాక్షేనా?ఆత్మీయ పథకం వివరాలు.. జిల్లా లబ్ధిదారులు సిద్దిపేట 16,505 మెదక్ 12,521 సంగారెడ్డి 22,792 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. వ్యవసాయ భూమి లేనివారు, ఉపాధి హామీ కూలీగా 20 రోజుల పాటు పని చేసిన వారు అర్హులని నిబంధన పెట్టారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,531 గ్రామాల్లో 51,818 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో ఇప్పటి వరకు 2,181 మందికే అందించడంతో 49,637 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రైతు కూలీలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. పథకాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా 70గ్రామాల్లో ప్రారంభించి దాదాపు ఐదు నెలలవుతున్నప్పటికీ ఇంకా అన్ని గ్రామాల్లో అమలు చేయడం లేదు. లబ్ధిదారులు ఎంపికై నప్పటికీ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, సిద్దిపేటకాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మారింది. భూమిలేని ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా కింద ఏటా రూ.12వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు విడతల్లో సాయం అందించనుంది. అందులో భాగంగా జనవరి 26న జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలం ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి 2,181 మందికి ఆత్మీయ భరోసా అందించారు. 70 గ్రామాలకే పరిమితం ఉమ్మడి మెదక్ జిల్లాలో 70మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి జనవరి 26న 2.181 మందికి మంజూరు పత్రాలను అందజేశారు. తర్వాత రూ.6వేల చొప్పున బ్యాంక్ ఖాతాలలో రూ. 1,30,86,000 జమ చేశారు. పైలెట్ ప్రాజెక్ట్లో అందుకున్న వారికి మరో నెల రోజులైతే రెండో విడత సాయం అందించాల్సిన సమయం వస్తుంది. మిగతా లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా వస్తుందా? రాదా ? అని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఇస్తారనేది అధికారులు ఎవరు చెప్పడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింది ఎంపిక చేసిన లబ్ధిదారులకు సాయం అందజేయాలని కోరుతున్నారు. పైలెట్ గ్రామాలకే పరిమితమా.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 51,818 మంది లబ్ధిదారుల ఎంపిక త్వరగా అందజేయాలంటూ వేడుకోలు -
ఉపకరణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేటరూరల్: ఉపకరణాలు అవసరం ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీకాంత్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రకాల ధ్రువపత్రాలతో http://tgobmms.cgg.gov.in// వెబ్సైట్లో ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.27న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలుసిద్దిపేటజోన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న ఎంపిక పోటీలు ఉంటాయని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు స్థానిక స్టేడియంలో అండర్ 10, 12, 14 బాల బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు, మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి పతకాలు, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేస్తారన్నారు. అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వచ్చే నెల 6న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటల లోపు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్తో వచ్చి జిల్లా అథ్లెటిక్స్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8501977079, 9704061543 నంబర్లు సంప్రదించాలన్నారు.రూ.1000 జరిమానాఅక్కన్నపేట(హుస్నాబాద్): ‘పచ్చని చెట్లపై గొడ్డలివేటు’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని పంచాయ తీ కార్యదర్శి స్వరూప స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను నేటమట్టం చేసిన రైతుకు రూ.1,000జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే రోడ్లకు ఇరువైపులా నాటిన చెట్లను ఎవరైనా నరికివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షుడిగా రాజుచారిసిద్దిపేటఅర్బన్: జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఎల్లుపల్లికి చెందిన చెన్నోజి రాజుచారి నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షురాడు విజయలక్ష్మి సోమవారం నియామక పత్రం అందజేశారు. తనను నమ్మి జిల్లా అధ్యక్షుడిగా రెండో సారి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షురాలికి రాజుచారి కృతజ్ఞతలు తెలిపారు.టాస్క్ఫోర్స్ నూతన ఇన్స్పెక్టర్గా శ్రీధర్సిద్దిపేటకమాన్: సిద్దిపేట టాస్క్ఫోర్స్ నూతన ఇన్స్పెక్టర్గా శ్రీధర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు నూతన సీఐ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పీడీఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణ జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు.అందుబాటులో ఇంజనీరింగ్ విద్యహుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల హుస్నాబాద్లో నూతన విద్యార్థుల అడ్మిషన్లు, తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రాత్రి హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు కోర్సులు ప్రభుత్వం కేటాయించింది. నాలుగు కోర్సులకు గాను 240 సీట్లతో అడ్మిషన్ల ప్రారంభం అవుతుందని మంత్రి పొన్నం తెలిపారు.మంత్రి టెలికాన్ఫరెన్స్హుస్నాబాద్: నియోజకవర్గంలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు. వానాకాలం సీజన్లో సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా వేశామన్నారు. మిగిలి ఉన్న వారికి రేపటికల్లా రైతుల అకౌంట్లల్లో జమ అవుతాయని తెలిపారు. -
విద్య ద్వారానే విజ్ఞానం
కొండపాక(గజ్వేల్): విద్య ద్వారానే విజ్ఞానం పెంపొందుతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. బందారం గ్రామంలోని హైస్కూల్లో ‘మనం.. మన ఊరు’ పేరిట సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను ఓపికతో వింటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. చిన్న తనం నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగుతూ పుట్టిన ఊరుకు పెంచిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కలదేవి పావని, రాగుల అర్చన, కెమ్మసారం అలేఖ్యలకు సిల్వర్ మెడల్స్తో పాటు నగదుగా అందజేస్తూ మిగతా విద్యార్థులకు విద్యాభ్యాస డైరీలను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రాంచంద్రం, మనం మన ఊరు ఉద్యోగుల అధ్యక్షుడు భగవాన్రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యను అందించండి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా విద్యాశాఖ బడిబాట, వేసవిలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ, టాస్, ఉల్లాస్, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటిస్తూ, విద్యార్థులకు కృత్యాధార బోధన నిర్వహిస్తూ క్లిష్టమైన అంశాలు సలువుగా అర్థమయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ రవీందర్రెడ్డి, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, 26 మండలాల ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అవార్డులకు పంచాయతీలు పోటీ పడాలి జాతీయ అవార్డుల కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు పోటీలో పాల్గొనాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడంపై సోమవారం జిల్లా, మండల స్థాయి అధికారులకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవార్డులు, ప్రశంసలు సమర్థవంతంగా పని చేయడానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తాయన్నారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈత, మునగ మొక్కలు ప్రధానంగా నాటాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఈఓలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్సిద్దిపేటకమాన్: న్యాయమూర్తి సాయిరమాదేవిని జిల్లా కోర్టులో కలెక్టర్ హైమావతి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తరుణంలో జిల్లా జడ్జిని ఆమె కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఇరువురు జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. కలెక్టర్ హైమావతి అధికారులకు దిశానిర్దేశం అభివృద్ధిలో ఎంపీడీఓలే కీలకం దుబ్బాక: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఎంపీడీఓల పాత్ర కీలకమని కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం సాయంత్రం ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్శర్మ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీడీఓలు కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలు కలెక్టర్కు వివరించామని భాస్కర్శర్మ తెలిపారు. అందరం సమష్టిగా పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్దామని కలెక్టర్ సూచించారని తెలిపారు. -
ఉత్సాహంగా ఒలింపిక్ రన్
సిద్దిపేటజోన్: ఒలింపిక్ డే పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఒలింపిక్ రన్ నిర్వహించారు. స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య, జిల్లా క్రీడా సమాఖ్య చైర్మన్ సాయిరాంలు రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ముస్తాబాద్ చౌరస్తా నుంచి విక్టరీ టాకీస్ చౌరస్తా వరకు అక్కడి నుంచి తిరిగి డిగ్రీ కళాశాల మైదానం వరకు రన్ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు వెంకట్స్వామి, రవీందర్ రెడ్డి, ఉప్పలయ్య, రామేశ్వర్ రెడ్డి, అశోక్, యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిష్టయ్య ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణం పరిష్కరించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు కిష్టయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో డీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిష్టయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలన్నారు. మిగిలిన డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయుల పక్షాన పోరాటంలో డీటీఎఫ్ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి, మల్లయ్య, మనీష్ కుమార్, ప్రభాకర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలి సిద్దిపేటకమాన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో యాదవుల ఆత్మగౌరవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యాదవులకు మంత్రి పదవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరగే యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో కృష్ణ, రాము, నర్సింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): పట్టణంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఆదివారం జరిగాయి. పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. విజేతలు ఈ నెల 28, 29 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే రాష్ట్ర ఓపెన్ కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తేజస్వీన్, ప్రవీణ్ తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణీతలుగా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ భాగ్యరాజ్, ట్రెజరర్ స్వామి, జాయింట్ సెక్రటరీ పవన్ కల్యాణ్, క్రీడాకారులు పాల్గొన్నారు. అసైన్డ్ భూములపై సర్వహక్కులు కల్పించాలిఅంబేడ్కర్, పూలే సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రహీం నారాయణఖేడ్: రాష్ట్రంలో అసైన్డ్ భూములు కలిగి ఉన్న రైతులకు 1977 పీవోటీ చట్టాన్ని రద్దుచేసి భూములపై సర్వహక్కులు కల్పించాలని అంబేడ్కర్, పూలే సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ రహీం ప్రభుత్వాన్ని కోరారు. ఖేడ్లోని సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంఘం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలలో మిగులు, ప్రభుత్వ భూములను భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ చేశారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుని పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలకు కేటాయించి పేదరైతులకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పండరీ, సహాయ కార్యదర్శి గౌచ్చిస్తి, ఖేడ్ డివిజన్ అధ్యక్షుడు నర్సింహులు, ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు యాదమ్మ పాల్గొన్నారు. -
మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి
భక్తజన నాచగిరి కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం భారీ సంఖ్యలో తరలిరావడంతో అలయ పరిసరాలు రద్దీగా మారాయి. పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 20వేల మంది దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ బండారు బొట్టు పెట్టడం, అభిషేక జలాలు చల్లడం, అఖండ హారతులు ఇవ్వడం వంటి కార్యక్రమాలను అర్చకులు ప్రారంభించారు.నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. హరిద్ర నది వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గర్భగుడిలో కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు. అభి షేకం, వ్రతం, కల్యాణాది మొక్కులు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. క్షేత్రంలో 15 వ్రతాలు, 10 అభిషేకాలు, 8 కల్యాణాలు జరి గాయి. ఆలయ యంత్రాంగం భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నది. – వర్గల్(గజ్వేల్) -
నూనె గింజల ఉత్పత్తికి ఊతం
కొత్త పథకానికి శ్రీకారం● ఈ ఖరీఫ్ నుంచే ఎన్ఎంఈఓ అమలు ● రైతులకు ఉచితంగా కొత్త విత్తన రకాల సరఫరా ● లబ్ధిదారుల ఎంపికకు వ్యవసాయశాఖ సన్నాహాలు పథకం అమలుకు నిర్దేశించిన లక్ష్యం పంట : విస్తీర్ణం (ఎకరాల్లో..) వేరుశనగ : 36,250 కుసుమ : 3,000 నువ్వులు : 15,000 సోయాబీన్ : 26,000 పొద్దుతిరుగుడు : 12,625 మొత్తం : 92,875 సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వంట నూనె గింజల పంటల విస్తీర్ణం ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్ఎంఈఓ (నేషనల్ మిషన్ ఆన్ ఈడబుల్ ఆయిల్) పథకం కింద సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమ పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పేలా..అధిక దిగుబడులు ఇచ్చే కొత్త రకాల విత్తనాలను ఉచితంగా సరఫరా చేయనుంది. అలాగే సంబంధిత వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందించనుంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. 2030 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపుకు సన్నాహాలు చేస్తున్నారు. అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల సరఫరా.. ఈ పథకం కింద ఎంపికై న రైతులకు ఉచితంగా నూనె గింజల విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయనుంది. ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాలు (ఒక హెక్టారు)కు పరిమితి విధించారు. ఉదాహరణకు సోయా సాగు చేస్తున్న రైతులు 1994లో విడుదల చేసిన జేఎస్.–335 వైరెటీనే ఎక్కువగా విత్తుకుంటున్నారు. ఈ వైరెటీతో ఆశించిన దిగుబడి రావడం లేదు. వీటి స్థానంలో 2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ సోయా విత్తనాలను సరఫరా చేస్తారు. అలాగే రైతు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పంటలను ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన సూచనలు చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాంకేతిక సహాయాన్ని అందిస్తారు. పాత వైరెటీలతో 60 శాతం తక్కువ దిగుబడి కొత్తగా వచ్చిన నూనెగింజల విత్తన రకాలకు, ప్రస్తుతం రైతులు వాడుతున్న విత్తనాలకు వచ్చే దిగుబడిలో 60 శాతం తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సోయా పంటనే ఉదాహరణగా తీసుకుంటే కొత్త వైరెటీలు (2021లో రిలీజైన డీఎస్బీ–34, ఎంఏసీఎస్–1460 వైరెటీ) తో ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు మొగ్గు చూపేలా.. ప్రస్తుతం రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రైతులు నూనెగింజల సాగు వైపు మొగ్గు చూపేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మరోవైపు దేశంలో నూనెగింజల ఉత్తత్తి చాలా తక్కువగా ఉంది. వివిధ దేశాల నుంచి నూనెగింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.పంటల వారీగా ఎంపిక చేసిన జిల్లాలు సోయాబీన్ : సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ పొద్దుతిరుగుడు : సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి వేరుశెనగ : నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ, మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట కుసుమ : సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ నువ్వులు : జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ -
చేనేతల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నీలకంఠ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తికి ఆదరణ లేకపోవడంతో చేనేత కుటుంబాలు దుర్భరంగా కాలం వెళ్లదీస్తున్నాయని అన్నారు. చేనేత వృత్తిలో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతకు ప్రసిద్ధి గాంచిన దుబ్బాక ప్రాంతంలో నేడు 50 కుటుంబాలకు కూడా ఉపాధి దొరకని పరిస్థితి నెలకొందన్నారు. చేనేతల సంక్షేమం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీలకంఠ సమాజం అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నీలకంఠ సంఘం అధ్యక్షుడు బోడ శ్రీహరి, కాల్వ రామస్వామి, వీరబత్తిని లింగం, దుబ్బరాజం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు. -
పచ్చని చెట్లపై గొడ్డలివేటు
అక్కన్నపేట(హుస్నాబాద్): నీడనిచ్చే పచ్చని చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. మండల పరిధిలోని కట్కూర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన చట్లను నరికేశారు. ఐదారేళ్ల కిత్రం పంచాయతీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటి మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం ఓ రైతు సుమారు సుమారు 10చెట్లను నేలమట్టం చేశారు. ఈ రోడ్డు మార్గంగా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ చెట్ల నీడన సేదతీరేవారు. చెట్ల నరికివేతతో ఇప్పుడా సౌకర్యం లేక ఆవేదన చెందుతున్నారు. పచ్చని చెట్లను నరికివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరికివేసిన సదరు వ్యక్తికి జరిమానాతోపాటు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
10 రోజుల్లో ఇళ్ల గ్రౌండింగ్
● ఉచిత ఇసుకకు తహసీల్దార్ల వద్దటోకెన్లు తీసుకోండి ● అధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశం సిద్దిపేటరూరల్: మంజూరు పత్రాలు పొందినవారితో 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గృహనిర్మాణ శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్థిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే నోట్ చేసుకోవాలని, ఎంపీడీఓతో సమావేశం నిర్వహించి సుముఖంగా లేని వారికి ఇందిరమ్మ కమిటీ, అధికారుల సమక్షంలో లెటర్ రాసి వారితో ఇల్లు వద్దు అన్నట్లు సంతకం తీసుకోవాలని చెప్పారు. రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు సోమవారం నుంచి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. ఉచిత ఇసుకకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్లు టోకెన్లు అందజేస్తారన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్మాణంలో ఇబ్బందులు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఈఈ, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మాలనపై వారం రోజు ల పాటు ప్రణాళిక ప్రకారంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ –2025 కార్యాచరణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఉన్నత పాఠశాల స్థాయి నుంచి ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్, మెడికల్ తదితర విద్యాసంస్థలపై ఫోకస్ పెడుతూ ఈనెల 26వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, మాదక ద్రవ్యాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, ఇంటర్మీడియెట్ అధికారి శ్రీనివాస్రెడ్డి, డీపీఆర్ఓ రవికుమార్ పాల్గొన్నారు. డయేరియా వ్యాధిపై అప్రమత్తం డయేరియా వ్యాధి ప్రబలకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీరు, కలుషితం, అపరిశుభ్ర వాతావరణం వల్ల డయేరియా, ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నా రు. ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా డయేరియాపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు,, హాస్టళ్లు, విద్యార్థులకు వేడి నీ రు అందించాలన్నారు. అన్ని విద్యాలయాల్లో ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు , ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయా రు చేసే విధానం గూర్చి వివరించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్, డిడబ్ల్యూఓ లక్ష్మికాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
నాచగిరి వ్రత శోభితం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం శనివారం సత్యదేవునివ్రత శోభతో అలరారింది. క్షేత్రానికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. హల్దీనది వాగులో పుణ్యస్నానాలాచరించి భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలు, కల్యాణాలు, సేవలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భగుడిలో కొలువైన శ్రీలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా సీనియర్ అసిస్టెంట్ సుధాకర్గౌడ్ పరివారం తగు జాగ్రత్తలు తీసుకున్నారు. -
30వరకు దరఖాస్తుల స్వీకరణ
ములుగు(గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎప్సీఆర్ఐ)లో 2025–26 సంవత్సరానికి గానూ బీఎస్సీ (హానర్స్) పారెస్ట్రీ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల డీన్ ఎస్జె.ఆశ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఏపీసీఈటీ ర్యాంకుల ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. దరఖాస్తులుకు ఈ నెల 30వ వరకు గడువు అన్నారు. ప్రవేశం కొరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.400, మిగతా వారు రూ.600 చెల్లించి నమోదు చేసుకోవాలని కోరారు. 20 మందికి ఉపాధి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సిద్దిపేట జోన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో శనివారం కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మొత్తం 50 మంది విద్యార్థులు హాజరుకాగారవగా వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి 20 మందిని ఎంపిక చేశారు. అనంతంర రీసోర్స్ పర్సన్ దుర్గాప్రసాద్ విద్యార్థులకు ఫార్మా రంగంలో గల అవకాశాలను గురించి వివరించారు. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ హైదరాబాద్ జీడిమెట్ల రిడాక్స్ ల్యాబ్స్తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. తద్వారా కళాశాల విద్యార్థులకు పరిశ్రమల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు సులువుగా పొందే వీలుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత కెమిస్ట్రీ అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ అధ్యాపకులు డాక్టర్ రవి, భాస్కర్, సుమలత, ఆంజనేయులు, శ్రీనివాస్, మనోహర్, బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు. ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలిజల సాధన సమితి డిమాండ్ తొగుట(దుబ్బాక): ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి చెరువుల్లోకి నీటిని విడుదల చేయాలని జల సాధన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గుడికందులలో ఆయా గ్రామాల రైతులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సాగునీరు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. మండలంలో 50 టీఎంసీల సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మించినప్పటికి తమ భూమికి చుక్క నీరు అందని దుస్దితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే యాసంగి పంటలకు మల్లన్న సాగర్ నుంచి చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. లేకుంటే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ‘కూత’ వేటు దూరంలో.. ● తుది దశకు కొమురవెల్లిరైల్వే స్టేషన్ పనులు కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న భక్తులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రతి యేటా మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ నుంచి భక్తులు వస్తుంటారు. కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న రైల్వే లైన్లో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీంతో రైల్వేశాఖ స్పందించి స్టేషన్ మంజూరు చేయగా.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్తో కలసి 2024 ఫిబ్రవరి 15న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రస్తుతం స్టేషన్, ప్లాట్ఫాం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దసరాకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభిస్తామని ఇటీవల కిషన్రెడ్డి ప్రకటించారు. ఈ రైల్వేస్టేషన్ ప్రారంభమైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ ఖర్చులతో పాటు సమయం ఆదా అవుతుంది. -
ఖేడ్లో మట్టి పరీక్ష కేంద్రం ఏర్పాటు
● ఉమ్మడి జిల్లాలో రెండో కేంద్రం ● ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు ప్రయోజనంనారాయణఖేడ్: ఎరువులు, రసాయన మందుల విచ్చలవిడి వాడకం ద్వారా నష్టపోతున్న రైతన్నలకు ఉపయోగపడేలా ఉమ్మడి జిల్లాకు మరో మట్టి నమూనా కేంద్రం మజూరైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే మట్టి నమూనా పరీక్షా కేంద్రం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రాంతం రైతులైనా తమ మట్టి నమూనాలను ఇక్కడే పరీక్షించుకోవాల్సి వస్తుంది. కాగా, ప్రభుత్వం తాజాగా నారాయణఖేడ్కు మట్టి పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను రూ.1.95కోట్లను విడుదల చేసింది. రూ.1కోటి ద్వారా భవన నిర్మాణం పనులు చేపట్టగా, రూ.95క్షలతో పరికరాలు, గాజు సామగ్రి, రసాయనాలు, ఫర్నీచర్, మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు వినియోగించనున్నారు. ఈ కేంద్రం పరిధిలో జిల్లాతోపాటు మెదక్ జిల్లా పరిధిలోని మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఖేడ్, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలతోపాటు, మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట, రేగోడ్, టేక్మాల్ తదితర మండలాల రైతులకు అనువుగా ఉండనుంది. ఖేడ్ పట్టణ శివారులోని జూకల్ శివారులో స్థలాన్ని ఇదివరకే ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ స్థలంలో భవన నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఈ కేంద్రంలో ఒక ఏడీఏ, ఏవో, ఏఈవోలు, ల్యాబ్ టెక్నీషియన్స్ను నియమించనున్నారు. భారీగా ఎరువుల వినియోగం రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎరువుల వినియోగం జరుగుతుందని, ప్రధానంగా యూరియా వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎరువుల, రసాయనాల మంత్రిత్వ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. యూరియా వినియోగం ఎక్కువవుతోందని, దాని ప్రభావం సాగు భూములపై చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక పురుగు మందుల వినియోగం మోతాదుకు మించి ఉందని వెల్లడించింది. మట్టి పరీక్షల ద్వారా ఈ సమస్యలను అధిగమించే అవకాశం ఉంది. ఇవీ ప్రయోజనాలు.. మట్టి పరీక్ష అనేది మట్టిలోని పోషక పదార్థాల స్థాయిలు, పీహెచ్ విలువ, ఉప్పు సమతుల్యత, సూక్ష్మపదార్థాల ఉనికి తెలుసుకోవడం వ్యవసాయంలో చాలా కీలకమైన అంశం. మట్టి పరీక్ష పంటకు సరిపోయే ఎరువుల ఎంపికకు సహాయ పడుతుంది. మట్టిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయా, ఏవి కొరతగా ఉన్నాయో తెలుసుకుని అందుకు అవసరమైన ఎరువులను సరిగ్గా వినియోగించుకునే వీలుంది. అనవసర ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చు. ఫలితంగా అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల కలిగే హానిని నివారించుకునే వీలుంది. సమతుల్య పోషకాల నిచ్చెన వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి దిగుబడి వస్తుంది. అవసరమైన వాటినే వినియోగించడం వల్ల ఖర్చూ తగ్గుతుంది. మట్టిలో మార్పులను గమనించి భవిష్యత్తులో తగిన పంటలు వేసే అవకాశం కలుగుతుంది. అధిక రసాయనాల వాడకాన్ని నియంత్రించి నేల, నీటి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కొత్త భూమిలో పంట సాగు ప్రారంభించే ముందు, ప్రతీ రెండు మూడేళ్లకు ఒకసారి, పంట దిగుబడులు తగ్గిన సందర్భాలు, భూమి మార్పు జరిగిన సందర్భాల్లో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించుకోవాలి. -
లోటు వర్షపాతమే..!
జిల్లాలోని 23 మండలాల్లో ఇదే పరిసి్థతి మండలాలవారీగా నమోదైన వర్షపాతం మండలం మిల్లి.మీటర్లలో దుబ్బాకలో 36.7 సిద్దిపేట రూరల్ మండలంలో 86.7 చిన్నకోడూరులో 92.0 బెజ్జంకిలో 53.3 కోహెడలో 64.3 హుస్నాబాద్లో 87.3 అక్కన్నపేటలో 68.6 నంగునూర్లో 36.6 సిద్దిపేట అర్భన్లో 66.9 తొగుటలో 78.6 మిరుదొడ్డిలో 93.5 దౌల్తాబాద్లో 46.2 రాయపోల్లో 82.8 వర్గల్లో 55.1 ములుగులో 48.4 మర్కూక్లో 22.9 జగదేవ్పూర్లో 40.8 గజ్వేల్లో 69.1 కొండపాకలో 45.8 చేర్యాలలో 65.9 మద్దూర్లో 32.4 అక్భర్పేట–భూంపల్లిలో 56.6 కుకునూర్పల్లిలో 54.0జగదేవ్పూర్ మండలం తిగుల్లో మొలకెత్తని పత్తిగజ్వేల్: సిద్దిపేట జిల్లాలో వర్షపాతం తీరు రైతులను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు సమృద్ధిగా వర్షాలు కురవకపోగా, 23 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు పత్తిని విత్తుకోగా, వర్షాల జాడ కరువై అది మొలకెత్తక ఇప్పటికే భారీ నష్టం చోటుచేసుకున్నది. మిగితా పంటల సాగుపై ఆందోళన నెలకొన్నది. జిల్లాలో జూన్కు సంబంధించి ఇప్పటివరకు 75.7మి.మీటర్ల సాధారణ వర్షపాతం కావాల్సి ఉన్నది. కానీ అడపాదడపా 37.5మి.మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. కొమురవెళ్లిలో ఇప్పటివరకు 79.9మి.మీలు, నారాయణరావుపేట మండలంలో 89.6మి.మీల సాధారణ వర్షపాతం నమోదైంది. దూల్మిట్ట మండలంలో 120.7మి.మీల వ ర్షపాతం నమోదైంది. దీనిప్రకారం ఆ ఒక్క మండ లంలో 45.4మి.మీల అధిక వర్షపాతం నమోదైంది. మొదలైన కలవరం జిల్లాలో ఈసారి 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరి అత్యధికంగా 3లక్షల ఎకరాలకుపైగా సాగులోకి రావొచ్చని భావిస్తున్నారు. కానీ జూన్లో సమృద్ధిగా వర్షాల్లేక పోవడం, 23 మండలాల్లో మైనస్ వర్షపాతం ఉండటం వల్ల రైతుల్లో కలవరం మొదలైంది. జిల్లాలో ఇప్పటికే పత్తి 60వేల ఎకరాలకుపైగా సాగులోకి వచ్చింది. గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేశారు. కానీ అప్పటి నుంచి భారీ వర్షాల జాడలేక...పత్తి విత్తు మొలకెత్తని పరిస్థితి నెలకొన్నది. దీనివల్ల ఇప్పటికే పత్తికి భారీ నష్టం జరిగిపోయింది. ఇకపోతే జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోవడం వల్ల కాల్వల ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు సమృద్ధిగా ఉంటే కాల్వల ద్వారానే నీరు అందడమే కాకుండా వేలాది ఎకరాల్లో భూగర్భ జలమట్టం పెరిగి బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండేవి. కానీ ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొనడం వరి సాగుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నది. ఈ నెలాఖరులో లేదా జూలైనైనా భారీ వర్షాలు కురిస్తే రైతులకు కొంత ఊరట లభించే అవకాశమున్నది. జూన్లో సాధారణ వర్షపాతం 75.7మి.మీ ఇప్పటివరకు కురిసింది...37.5మి.మీటర్లు మాత్రమే పత్తికి ఇప్పటికే భారీ నష్టం..ఆందోళనలో అన్నదాతఆందోళన వద్దు జిల్లాలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంటల సాగుకు అదును దాటలేదు. భారీ వర్షాలు వస్తాయని ఆశాభావం ఉన్నది. జూలై 15 వరకు పంటల సాగుకు అవకాశమున్నది. : రాధిక, వ్యవసాయాధికారి -
పంచాయతీ భవనమే ఇల్లు
జగదేవ్పూర్(గజ్వేల్): ఆమె గత స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్.. ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే కుటుంబంతో తలదాచుకుంటోంది. ఇందిరమ్మ ఇల్లు వస్తదని అనుకుంటే నిరాశే మిగిలింది. వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి దండు లావణ్యమల్లేశం 2019 స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తనకున్న అర ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పెంకుటిల్లులోనే నివాసముంటున్నారు. ఏడాదిన్నర క్రితం వర్షాలకు పెంకుటిల్లు కూలిపోగా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే నివాసం ఉంటున్నారు. ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. తాను బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ను కాబట్టే ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్లులు రూ. 4లక్షల వరకు రావాలని వాపోయారు. -
మెడికల్ కౌన్సిల్ తనిఖీలు
సిద్దిపేటకమాన్: పట్టణంలో నలుగురు నకిలీ వైద్యులను గుర్తించినట్లు మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ జి. శ్రీనివాస్, సిద్దిపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్ తెలిపారు. సిద్దిపేటలోని పలు ఆస్పత్రులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేటలో 20 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. పట్టణంలోని నాలుగు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో అర్హతకు మించి వైద్యం అందిస్తున్నారన్నారు. అధిక మోతాదులో యాంటీబయాటిక్ మందులు, స్టెరాయిడ్స్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. త్వరలో వీరిపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకున్న ఆస్పత్రులలో అర్హత కలిగిన వైద్యులు మాత్రమే వైద్య సేవలు అందించాలని తెలిపారు. సమావేశంలో ఐఏంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ గణేష్ వెనిశెట్టి, ట్రెజరర్ డాక్టర్ ప్రణీత్, డాక్టర్ సముద్రాల శ్రీనివాస్, డాక్టర్ సతీష్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.నలుగురు నకిలీ వైద్యుల గుర్తింపు -
అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం
సిద్దిపేటజోన్: ‘ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన చెందవద్దు. ఇది నిరంతరం ప్రక్రియ. అర్హులైన వారందరికీ ఇళ్లు అందిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి జిల్లాకు ఎక్కువగా వచ్చేలా చూస్తా’నని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నియోజకవర్గ పరిధిలోని 2,840 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 8 లక్షల కోట్లు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వేదిక మీదకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆహ్వానించక పోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి వేదిక మీదకు రావడం, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులను పైకి పిలవడంతో శాంతించారు. ముందస్తు జాగ్రత్తగా ఏసీపీ రవిందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందోళన వద్దు.. ఇది నిరంతరం ప్రక్రియ మరిన్ని ఇళ్ల మంజూరుకు కృషి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ -
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎన్సాన్పల్లిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 25లోగా పాఠశాలలో బోనఫైడ్, 2పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్కార్డు జిరాక్స్లను జతపరిచి దరఖాస్తు చేయాలన్నారు. ఈ నెల 27న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రవేశ పరీక్షను గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 91217 74930 నంబర్లో సంప్రదించాలన్నారు. దోస్త్ మూడోవిడత పొడిగింపు సిద్దిపేటఎడ్యుకేషన్: దోస్త్ మూడో విడత ప్రవేశాల ప్రక్రియను ఈనెల 25 వరకు పొడిగించినట్లు దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఆయన మాట్లాడారు. మూడో విడతలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 28న సీట్లను కేటాయిస్తారని, 30వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో టెక్నికల్ సమస్యలు ఉత్పన్నం అయితే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఏర్పాటు చేసిన దోస్త్ హెల్ప్లైన్ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం సిద్దిపేటకమాన్: పట్టణంలోని 37వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల కల సాకారం అయ్యిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. 23న మెగా జాబ్మేళా వర్గల్(గజ్వేల్): వర్గల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో మ్యాజిక్బస్ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో 23న విద్యార్థినులకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు తెలిపారు. యాక్సిస్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, జస్ట్డయల్, కార్పోన్, హెచ్ఆర్హెచ్ నెక్స్ట్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన ఇతర కళాశాలల విద్యార్థినులు కూడా హాజరుకావొచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ప్రియాంక: 81217 43274, పూర్ణశ్రీ: 80740 17090(మ్యాజిక్ బస్), డాక్టర్ వి.రాధ: 81791 23444, డాక్టర్ ఎస్.రాధారాణి: 99122 35358 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కుటుంబ సభ్యులకు చిన్నారి అప్పగింత
సిద్దిపేటకమాన్: బస్టాండ్లో తప్పిపోయిన పాపను పోలీసులు వివరాలు సేకరించి రెండు గంటల వ్యవధిలోనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణం టెలికాంనగర్లో నివాసం ఉంటున్న శివరాత్రి రాజు, స్వప్న దంపతులు తమ కూతురు హారిక (6), తమ అమ్మానాన్నతో కలిసి నివాసం ఉంటున్నారు. పాప నానమ్మ యాదమ్మ పట్టణంలోని హౌసింగ్ బోర్డు వద్ద చెరుకు రసం బండి నిర్వహిస్తోంది. శుక్రవారం సాయంత్రం పాప ఆడుకుంటూ బయటకు వచ్చి ఆర్టీసీ నూతన బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సు ఎక్కింది. ఆర్టీసీ సిబ్బంది గమనించి పాప పేరు, వివరాలు, అమ్మానాన్న పేర్లు అడగ్గా ఎలాంటి వివరాలు తెలుపలేదు. విషయం తెలుసుకున్న సిద్దిపేట వన్ టౌన్ పోలీస్స్టేషన్ బ్లూకోట్ సిబ్బంది బస్టాండ్ వద్దకు చేరుకుని విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడంతో పాటు పాప ఫొటోను అన్ని వాట్సప్ గ్రూప్లలో షేర్ చేశారు. పాపను బాలసదనానికి తరలించారు. పాప తప్పిపోయిన విషయం వైరల్ కావడంతో పాప కుటుంబం నివాసం ఉంటున్న కాలనీ వారు పాపను గుర్తించి పాప నానమ్మకు తెలిపారు. దీంతో వారు బాలసదనానికి చేరుకోగా పాప తమ మనవరాలేనని ఆధారాలు చూపించడంతో పోలీసు సిబ్బంది వారికి అప్పగించారు. గంటల వ్యవధిలో చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పంచాయతా.. పరిషత్తా?
‘స్థానిక’ ఎన్నికలపై జోరుగా చర్చ ● పల్లెల్లో మొదలైన పోరు సందడి ● స్థానిక సంస్థలకు నిలిచిన ఆర్థికసంఘం నిధులు ● పలు చోట్ల అభివృద్ధి పనులకు బ్రేక్ ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,531 జీపీలు, ఎంపీటీసీలు 690, జెడ్పీటీసీలు 72ఉమ్మడి మెదక్ జిల్లాలో 19,62,458 మంది పల్లె ఓటర్లుండగా 1,531 గ్రామ పంచాయతీలు, 690 ఎంపీటీసీలు, 72 జెడ్పీటీసీలు ఉన్నాయి. గతేడాది జూలై 4వ తేదీతో మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు (జెడ్పీటీసీ) పదవీకాలం, గతేడాది ఫిబ్రవరి 2తో సర్పంచ్ల పదవీకాలం ముగిశాయి. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలు ముందు నిర్వహిస్తే అధికార పార్టీకి లాభం అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి కావడంతో ప్రభుత్వ పాలన రెఫరండంగా భావించే అవకాశం ఉంది. ఆశల్లో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గరనే ఇంకా పెండింగ్లో ఉంది. బిల్లు ఆమోదం తర్వాతనే నిర్వహిస్తారా? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారో.. వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు స్థానిక పదవుల పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది లేకపోవడంతో కొంత వెనుకబడి ఉంది. దీంతో ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి పదవులు దక్కితే పార్టీ కొంత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందు జరుగుతాయా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా? అని పల్లెల్లో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల ప్రకటనతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం వేగం పెంచింది. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 6వేలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలలో జరుగుతాయని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఆశావహులు సైతం పోటీకి రెడీ అవుతున్నారు. సాక్షి, సిద్దిపేట: నిలిచిన ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. అదే పాలక వర్గాలుంటే ప్రతీ ఏడాది కేంద్రం నుంచి ప్రత్యేక నిధులను కేటాయించేవారు. ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
హై టెన్షన్!
దుబ్బాకలోతీవ్ర ఉద్రిక్తత మధ్య మంత్రి వివేక్ పర్యటన దుబ్బాకలో జరిగిన మంత్రి సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాటదుబ్బాక పట్టణంలో శుక్రవారం హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పర్యటనతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు పోటాపోటీగా ఆందోళనకు దిగడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. మంత్రి వివేక్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డిలు వారివారి పార్టీల కార్యకర్తలకు ఎంత నచ్చజెప్పినా ఫలితం కానరాలేదు. కలెక్టర్ సైతం పదేపదే విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అభివృద్ధికి అడ్డుపడొద్దు: మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ఇది చూసి ఓర్వలేకనే కొన్ని శక్తులు అడ్డుతగిలే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి వివేక్ అన్నారు. ఎన్నికల హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. అప్పులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాకు 12 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అందోళన వద్దు.. ఇది నిరంతరం ప్రక్రియ మరిన్ని ఇళ్ల మంజూరుకు కృషి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యప్రొటోకాల్, ఫ్లెక్సీల రగడ ఇరు పార్టీ నేతల మధ్య తోపులాట మంత్రి సమావేశం రసాభాస -
పునరావాస ప్యాకేజీ కల్పించాల్సిందే
ములుగు(గజ్వేల్): పునరావాస ప్యాకేజీ కల్పించాలంటూ కొండపోచమ్మ రిజర్వాయర్లో ముంపునకు గురైన మామిడ్యాల గ్రామ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ములుగు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు, సిబ్బంది లోపలికి వెళ్లకుండా ప్రధాన ద్వారం ఎదుట అడ్డుకున్నారు. బీజెపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్, మాజీ అధ్యక్షుడు రమేష్యాదవ్ ఆధ్వర్యంలో బీజెపీ శ్రేణులు ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఈ సందర్బంగా నిర్వాసితులు మాట్లాడుతూ ప్రాజెక్ట్ పేరిట తమ భూములు లాక్కొని తమకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్యాకేజీలు అందజేయాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్ ఆరీఫా నిర్వాసితులతో మాట్లాడారు. విషయం ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.‘కొండపోచమ్మ’ నిర్వాసితుల ఆందోళన -
ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు
తొగుట(దుబ్బాక): పొద్దు తిరుగుడు ధాన్యం విక్రయించి 75 రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొగుట సెంటర్ పరిధిలో 400 మంది రైతులకు గానూ రూ.3 కోట్లకుపైగా బకాయిలున్నాయన్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.రోడ్డుపై బైఠాయించిన రైతులు -
సర్కారు బడి.. సమస్యల ఒడి
● పెచ్చులూడుతున్న గదుల పైకప్పులు ● వరండాలలోనే తరగతులు ● మూత్రశాలలు లేక ఇబ్బందులు ● నిలిచిన ‘మన బడి’ పనులు ● క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలన పెచ్చులూడుతున్న పైకప్పులు.. వర్షాలకు ఉరుస్తున్న గదులు.. వరండాలు, రేకుల షెడ్డుల్లో తరగతులు.. ఇలా అసౌకర్యాల నడుమ బిక్కు బిక్కుమంటూ చదవులు వెళ్లదీస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘మన ఊరు– మన బడి’ అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. జిల్లాలో 912 ప్రభుత్వ పాఠశాలలో 65,231 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పలు పాఠశాలలను గురువారం సాక్షి విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగుచూశాయి. – సాక్షి, సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం మన ఊరు– మన బడి పథకం తీసుకొచ్చింది. అందులో భాగంగా 342 ప్రభుత్వ పాఠశాల్లో అదనపు గదులు, డైనింగ్ హాళ్లు, మూత్రశాలలు రూ.126..07కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 77 పాఠశాలలో పనులు పూర్తి కాగా, 96 పాఠశాలలు 75శాతం పనులు, ఇంకా 169 పాఠశాలలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. డిసెంబర్ 2023 వరకు జరిగిన పనులకు రూ.53.17 కోట్లకు గాను రూ.37.60కోట్లను మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.15.56కోట్లు పెండింగ్ ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో గదుల కొరత, సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు. అసంపూర్తిగా టాయిలెట్స్ చిన్నకోడూరు(సిద్దిపేట): ఎల్లాయపల్లి ప్రాథమిక పాఠశాలలో బాలికల టాయిలెట్స్ గత ఏడాది నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీంతో బాలికలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీటిని బాలవికాస వాటర్ ప్లాంట్ నుంచి రోజూ తీసుకువస్తున్నారు. పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులకు గాను ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. ఆరు బయటే మూత్ర విసర్జన కొమురవెల్లి (సిద్దిపేట): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి సరిపడా టాయిలెట్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఆరు బయటే మూత్ర విసర్జనకు వెళ్తున్నారు. గదులు పెచ్చులూడుతున్నాయ్.. నంగనూరు(సిద్దిపేట): మండల పరిధిలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. వర్షానికి తరగతి గదులు ఉరుస్తున్నాయి. పాఠశాలలో ఏడు గదుల గాను ఐదు గదులు వర్షానికి ఉరుస్తుండటంతో తరగతి గదిల్లోకి నీరు చేరుతుంది. భవనం పెచ్చులూడుతూ కింద పడడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకే గదిలో ఐదు తరగతులు మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని లింగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. మొత్తం ఐదు తరగతులకు 13 మంది విద్యార్థులకు గాను, గురువారం నలుగురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఒకే గదిలో ఐదు తరగతులకు 18 సబ్జెక్టులను ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. పొగతో ఉక్కిరిబిక్కిరి జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థలో ఉంది. 30 విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. ఒక గదిలో వరండాలో తరగతులు కొనసాగుతున్నాయి. అలాగే తిగుల్ ప్రాథమిక పాఠశాలలో వంట గది లేక రెండు గదుల మధ్యలో వంటలు చేస్తున్నారు. పొగతో విద్యార్థులు, స్థలం అనువుగా లేకపోవడంతో వంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.వర్గల్ మండలం జబ్బాపూర్ పాఠశాలలో వరండాలోనే నిర్వహిస్తున్న రెండేసి తరగతులుశిథిల భవనంలోనే.. కొండపాక(గజ్వేల్): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో 110 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థ కు చేరినప్పటికీ గత్యంతరం లేక అక్కడే విద్యా బోధన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ చదువుకుంటున్నారు. విద్యార్థుల తల్లితండ్రులు భయాందోళన చెందుతున్నారు. నిలిచిన నిర్మాణ పనులు ములుగు (గజ్వేల్): తునికి బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 109 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బడిలో సరిపోను గదులు లేవు. కంప్యూటర్ ల్యాబ్ కోసం లైబ్రరీ గదిని వినియోగిస్తున్నారు. పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మన ఊరు– మన బడి పథకం ద్వారా రూ.1.30కోట్ల నిధులతో రెండు హాళ్లు, 8 గదులతో కూడుకున్న నూతన భవన నిర్మాణం చేపట్టినప్పటికీ రెండేళ్లుగా అసంపూర్తి దశలోనే ఉంది.విద్యార్థులతోనే పనులు.. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో.. విద్యార్థులతోనే ఉపాధ్యాయులు పనులు చేయిస్తున్నారు. స్టాఫ్ రూమ్కు వారితోనే మ్యాట్లను అతికిస్తున్నారు. తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో పనులు చేయిస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. – సాక్షిస్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేటవిద్యార్థులే కొడుతున్న బడిగంట సిద్దిపేట రూరల్: చిన్నగుండపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో విద్యార్థులతోనే బడి గంటను మోగిస్తున్నారు. అలాగే గురువారం పేరెంట్స్ కమిటీ సమావేశం జరగడంతో వేసిన జంకానాలు విద్యార్థులే మోసుకెళ్లడం ‘సాక్షి’ కంటపడింది. దీనిపై హెచ్ఎం రాధపద్మజను వివరణ అడగగా ‘స్కావేంజరే గంట కొడుతుంది. స్కావేంజర్ మరో పని చేస్తుండటంతో టైం అయిందని విద్యార్థి బెల్ కొట్టి ఉండవచ్చు. మేము మీటింగ్లో ఉన్నాం. మరోమారు జరగకుండా చుసుకుంటాం’ అని అన్నారు. ముక్కు మూసుకోవాల్సిందే దుబ్బాక టౌన్(దుబ్బాక): పట్టణంలోని డబుల్ బెడ్రూం కాలనీలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాల దుర్ఘంధంతో కంపుకొడుతోంది. పాఠశాలలో 44 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. డబుల్ బెడ్రూంలలో వినియోగించిన నీరు పాఠశాలలోకి వచ్చి చేరుతుంది. పాఠశాల సమీపంలో డ్రైనేజీ సైతం సరిగా లేదు. వర్షం పడితే పై నుంచి నీరంతా వచ్చి తరగతి గదుల్లోకి వస్తుంది. నీటి పైప్లైన్ సరిగా లేక లీక్ అవుతుంది. పాఠశాలలో ఎలుకల బెడదతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. దశల వారీగా పనులు ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, మూత్రశాలల నిర్మాణాలు దశల వారీగా పనులు జరుగుతున్నాయి. మన ఊరు– మన బడి పనులకు డబ్బుల చెల్లింపు నిలిచిపోగా పనులు మధ్యలో నిలిచిపోయాయి. 8 ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు కలెక్టర్ మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ.30లక్షల చొప్పున రూ.2.40కోట్లు మంజూరు అయ్యాయి. – శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ -
బిక్కుబిక్కు చదువులు
మైత్రితో భరోసాసిద్దిపేట జీజీహెచ్లో మైత్రీ ట్రాన్స్ క్లినిక్ ద్వారా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వైద్యసేవలందిస్తున్నారు. వివరాలు 10లో uశుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025పాఠశాల శిథిలం.. విద్యార్థుల్లో భయంభయం వర్గల్(గజ్వేల్): మండల పరిధిలోని జబ్బాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థలో ఉంది. పైకప్పు పెచ్చులూడి ఊచలు తేలాయి. పాఠశాలలో 78 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గదుల కొరత కారణంగా వరండాలో రెండేసి తరగతులు నిర్వహిస్తున్నారు. భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. భయం భయంగా పాత భవనంలోనే చదువులు నెట్టుకొస్తున్నారు. కొత్త భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.న్యూస్రీల్ -
నేను కఠినంగా ఉంటా..
● విధుల్లో నిర్లక్ష్యం సహించను ● అధికారుల తీరుపై కలెక్టర్హైమావతి సీరియస్ హుస్నాబాద్: ‘నేను కఠినంగా ఉంటా.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు’ అని కలెక్టర్ హైమావతి సీరియస్ అయ్యారు. హుస్నాబాద్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాయలంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. పాఠశాలలో సౌకర్యాలు కల్పించాం, అడ్మిషన్లు పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలన్నారు. కాలం చెల్లిన మందులు వాడొద్దు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులతో కలెక్టర్ మాట్లాడారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేట్కు వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేయించుకోవాలని సూచించారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని సిబ్బందికి సూచించారు. అభివృద్ధి పనులపై సమీక్ష మున్సిపల్, పీఆర్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షా నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, కమ్యూనిటీ భవన నిర్మాణాల పెండింగ్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా పనులు ప్రారంభించకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే లీగల్ నోటీస్లు జారీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చట్ట ప్రకారం భూ సమస్యలు పరిష్కారం కోహెడరూరల్(హుస్నాబాద్): భూ భారతి చట్ట ప్రకారం భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. సముద్రాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసి పరిష్కారించాలని అధికారులకు సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు సందర్శనఅక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధిలోని గౌరవెల్లి ప్రాజెక్టును గురువారం కలెక్టర్ హైమావతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాజెక్టు స్థితిగతులు, నిర్మాణ పనులపై ఆరా తీశారు. పనులు ఎందుకు నిలిచాయని నీటిపారుదల శాఖ ఈఈ రామునాయక్ను అడిగి తెలుసుకున్నారు. ఎన్జీటీలో కేసులు ఉండడంతో చివర దశ పనులు నిలిచాయని రామునాయక్ వివరించారు. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా గండిపల్లి ప్రాజెక్టు కూడా ఉందని, ఆ ప్రాజెక్టు పనులు త్వరగా జరగాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. -
సంక్షేమ పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లండి
మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి హరికృష్ణ ఇంట్లో అల్పాహారం అనంతరం పార్టీ శ్రేణులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పశుగణానికి ‘ట్యాగింగ్’ వర్గల్(గజ్వేల్): నాచగిరి పుణ్యక్షేత్రంలోని గోశాలలో పశుగణానికి పశువైద్యాధికారులు ‘ట్యాగింగ్’ వేశారు. ‘డొక్కలు చిక్కి..బొక్కలు తేలి’ శీర్షికతో నాచగిరి గోశాలలో గోవుల దయనీయ స్థితిని వెల్లడిస్తూ ఈ నెల 9న ‘సాక్షి’ ప్రత్యేక కథనం పుచురించిన విషయం పాఠకులకు విదితమే. ఈ మేరకు ఆలయ యంత్రాంగం, పశువైద్యశాఖ స్పందించి ‘గోశాల’లో గోవుల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. వాటికి మేత, దాణా, పోషకాలు పెడుతున్నారు. మరోవైపు గురువారం పశువైద్యాధికారి డాక్టర్ సర్వోత్తం యాదవ్ గోశాలను సందర్శించి పరీక్షలు జరిపారు. ప్రతి పశువుకు ఒక గుర్తింపు నెంబర్ ఇస్తూ ‘ట్యాగింగ్’ చేశారు. ఆ నెంబర్ల ప్రకారం ఆయా పశువుకు సంబంధించి ఆరోగ్య స్థితిగతులు (కేస్ షీట్) నమోదుచేశారు. త్వరలోనే పశువులకు ‘లంప్స్కిన్’ వ్యాక్సిన్ వేస్తామని వైద్యాధికారి తెలిపారు. ఈ పాస్ మిషన్ ద్వారే ఎరువులు విక్రయించాలి జిల్లా వ్యవసాయ అధికారి రాధిక జగదేవ్పూర్(గజ్వేల్): ఎరువుల దుకాణాల డీలర్లు ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక సూచించారు. గురువారం మండలంలోని మునిగడప, జగదేవ్పూర్ గ్రామాలలో పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ పాస్ మిషన్లోని ఎరువుల నిల్వలు సమానంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధిక ధరలకు విక్రయించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా 3300 ఎంటీ యూరియా, 4600 ఎంటీల ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో సరిపడా వరి, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఈసెట్ కౌన్సెలింగ్ నంగునూరు(సిద్దిపేట): రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న కౌన్సెలింగ్ గురువారం ముగిసింది. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన కౌన్సెలింగ్కు 450 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
అంతా టెన్షన్.. టెన్షన్
● నేడు దుబ్బాకలో ఇన్చార్జిమంత్రి వివేక్ పర్యటన ● గతంలో మంత్రి కొండా సురేఖపర్యటనలో తీవ్ర ఉద్రిక్తత ● ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ● ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ దుబ్బాక: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి శుక్రవారం దుబ్బాకలో మంత్రి వివేక్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అంతటా టెన్షన్ నెలకొంది. గతంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్, ఎంపీ రఘునందన్రావు బీజేపీ, అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ని యోజకవర్గంలో గత ఏడాదిన్నర కాలంగా మూడు పార్టీల మధ్య ఆధిపత్య పోరు చోటుచేసుకుంది. ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టాలన్నా మూడు పార్టీలతో అధికారులకు తీవ్ర తలనొప్పిగా తయారైంది. 6 నెలల క్రితం దుబ్బాకలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య జరిగిన రగడ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడం.. మధ్యలోనే మంత్రి వెళ్లిపోవడం అంతా రసాభాసగా మారింది. మళ్లీ మంత్రిగా వివేక్ నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న చర్చ జోరుగు సాగుతోంది. పోటాపోటీగా ప్రకటనలు నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు అందించే కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా జరుగనుంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఏవరికి వారు భారీగా తరలిరావాలంటూ ప్రచారం మొదలుపెట్టారు. మంత్రి వివేక్ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందిస్తారంటూ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ఇస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుండగా బీజేపీ నాయకులు సైతం తరలిరావాలంటూ తమ క్యాడర్కు పిలుపు నివ్వడం తీవ్ర చర్చానీయంశంగా మారింది. మంత్రి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి ప్రత్యేకంగా క్యాడర్తో సమావేశం పై చర్చించారు. నేడు మంత్రి పర్యటన ఇలా.. మంత్రి వివేక్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని రజనీకాంత్రెడ్డి గార్డెన్కు చేరుకుంటారు. అక్కడే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈసందర్భంగా జరిగే సమావేశంలో ప్రసగించనున్నారు. సీపీ అనురాధ ప్రత్యేక దృష్టి మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా సీపీ అనురాధ దృష్టిసారించారు. అలాగే అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. -
కలెక్టర్ను కలిసిన సీపీ అనురాధ
సిద్దిపేటరూరల్: నూతన కలెక్టర్ కె.హైమావతిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డా.అనురాధ బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు మొక్కను బహూకరించారు. శాంతిభద్రతలకు సంబంధించి కొద్దిసేపు చర్చించారు. సీపీ వెంట అదనపు డీసీపీ అడ్మిన్ సుభాష్చంద్రబోస్, ఏసీపీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికడీఆర్డీవో జయదేవ్ ఆర్య దుబ్బాక: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా చేపట్టినట్లు డీఆర్డీవో జయదేవ్ ఆర్య పేర్కొన్నారు. త్వరలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనీకాంత్రెడ్డి ఫంక్షన్ హాల్ను బుధవారం సందర్శించి మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి వివేక్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, తహసీల్దార్ సంజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పల్లెలకు డ్రగ్స్ను రానివ్వొద్దుహుస్నాబాద్రూరల్: పల్లెలకు డ్రగ్స్కు రాకుండా యువతను కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని డ్రగ్స్ నిర్మూలన జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన డ్రగ్స్ నిర్మూలన యాత్ర మండలంలో పందిల్ల, పొట్లపల్లి, రాములపల్లి, బంజేరుపల్లి, కూచనపెల్లి గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..మన యువతను ఆన్లైన్ బె ట్టింగ్, సైబర్ నేరాలకు దూరంగా ఉంచాలన్నా రు. గ్రామాలకు డ్రగ్స్ రాకుండా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మేకల వీరన్న, సారయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థుల ఎంపికమర్కూక్(గజ్వేల్): తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం మర్కూక్ మండలం నుంచి జిల్లా స్థాయికి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఎర్రవల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన జూపల్లి భానుప్రసాద్, తాండె సాత్విక్ మండలంలోని పాములపర్తి పాఠశాలలో బుధవారం నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలలో గెలుపొందారు. ఈ మేరకు మండల విద్యాధికారి వెంకట్ రాములు ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించాలిహుస్నాబాద్: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి జంగపల్లి వెంకట నర్సయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక కోసం మండలస్థాయి పోటీలను బుధవారం ఎంఈఓ బండారి మనీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపిక పోటీలను డీవైఎస్ఓ వెంకట నర్సయ్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ...విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల వల్ల మంచి ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంద ని చెప్పారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థ్ధాయి ల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వాసుదేవ రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 30 వేలకు పైగా దరఖాస్తులు
జగదేవ్పూర్(గజ్వేల్)/మర్కూక్(గజ్వేల్): భూ భారతి సదస్సుల ద్వారా ఇప్పటి వరకు 30,630 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ వెల్లడించారు. జగదేవ్పూర్లో బుధవారం నిర్వహించిన భూభారతి సదస్సును హాజరై దరఖాస్తులను స్వీకరించారు. అంతకుముందు మర్కూక్ మండలంలోని పాతూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 3 నుంచి ప్రారంభమైన సదస్సులు 20 వరకు కొనసాగుతాయన్నారు. రైతుల నుంచి సాదాబైనామా, పేర్లు తప్పిదాలు, ఆన్లైన్లో సర్వే నంబర్లు తప్పిదం, అసైన్డ్ భూమికి సంబంధించిన దరఖాస్తులు వస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు నిర్మల, ప్రవీణ్రెడ్డి, ఆర్ఐ ఫహీద్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇక డుమ్మాలకు చెక్
సాక్షి, సిద్దిపేట: జిల్లా ప్రజా పరిషత్లు, మండల పరిషత్ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ హాజరును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా ప్రజా పరిషత్లు,73 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ సంబంధిత మెషీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ల పాలక వర్గాల గడువు గతేడాది జూలై 4వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారులుగా, మండల పరిషత్ ప్రత్యేక అధికారులుగా పలువురు జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల పరిషత్లలో పలువురు అధికారులు సమయ పాలన పాటించడం లేదని గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యా దులు అందాయి. దీంతో బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లు బిగించి సమయ పాలన పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఆఫ్లైన్ గతంలో పలు కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు ఆఫ్లైన్లో ఉండేది. అది సక్రమంగా పనిచేయకపోవడంతో పరికరాలు మూలన పడ్డాయి. దీంతో సిబ్బంది విధుల పట్ల జాప్యం వహించడం, తరచుగా డుమ్మా కొట్టడం, ఇంటికి వెళ్లడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు నమోదు చేసుకుంటున్నారు. పలువురు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందలేదు. వీటికి చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.సిద్దిపేట జెడ్పీలో బయోమెట్రిక్ మెషీన్లో హాజరు నమోదు చేసుకుంటున్న సిబ్బంది వారం రోజుల్లో అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో... మండల పరిషత్లు, జిల్లా పరిషత్లలో ఫేస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తాం. వారం రోజుల్లో అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో మెషీన్లు బిగించి అమలు చేయనున్నాం. ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నాం. ఈ నెల 18 నుంచి జిల్లా పరిషత్లో అమలు చేయడం ప్రారంభించాం. – రమేశ్, సీఈఓ, జిల్లా ప్రజాపరిషత్, సిద్దిపేట ఉద్యోగుల వివరాల సేకరణ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ మెషీన్లో ఉద్యోగులను గుర్తించేందుకు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగుల హోదా, ఆధార్ నంబర్, ఉద్యోగుల క్రమసంఖ్య తదితర వివరాలను బయోమెట్రిక్లో నమోదు చేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరుతో ఉద్యోగులు ఏ సమయానికి వస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? ఎంతమంది సిబ్బంది హాజరయ్యారు? అనే విషయాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంకు తెలియనుంది. జిల్లా మండల పరిషత్లు సిద్దిపేట 26 సంగారెడ్డి 26 మెదక్ 21 ఉద్యోగుల నుంచి ఆధార్నంబర్, హోదా వివరాల సేకరణ ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా పరిషత్లు, 73 మండల పరిషత్లు -
లెక్కదాటితే వేటు పక్కా..!
● విచ్చలవిడిగా యూరియా వాడితే చీడపీడలు ● కృత్రిమ కొరత సృష్టించొద్దు ● అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం ● వ్యవసాయ అధికారులు హెచ్చరిక హుస్నాబాద్రూరల్: ఈ సీజన్లో పంటలకు కావాల్సిన ఎరువులను ఇప్పటికే ప్రభుత్వం సరఫరా చేసేసింది. అయితే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలకు తగిన మోతాదులో ఎరువు వేస్తేనే ప్రయోజనం ఉంటుంది. కానీ, భవిష్యత్తులో కొందరు రైతులు యూరియా దొరకదని ముందే కొనుగోలు చేసి నిల్వ ఉంచడం వలన ఏ మాత్రం ప్రయోజనం ఉండదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యూరియా నిల్వ ఉంచడం వలన నత్రజని గాలిలో కలిసి ఎరువు నాణ్యత కోల్పోతుంది. నాణ్యతలేని ఎరువును పంటలకు వేసినా పని చేయదని చెబుతున్నారు. యూరియా కావాల్సిన రైతులకు మిగతా ఎరువులు కొనుగోలు చేస్తేనే ఇస్తామని లింకులు పెట్టి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక యూరియాను అవసరానికి మించి రైతులు కొని కృత్రిమ కొరతను సృష్టించే వారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల ఇలా... సీజన్కు కావాల్సిన 1,13,750 క్వింటాళ్ల యూరియా అవసరం ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. జూలై నెల వరకు కావాల్సిన యూరియా ఇప్పటికే వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నా దుకాణాల్లో మాత్రం దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. మోతాదు మించితే చీడపీడలు రైతులు ఎక్కువ మోతాదులో యూరియా వేయడం వలన మొక్క కాండము మెత్తబడి చీడపీడలు చేరి పంటకు నష్టం చేస్తాయని, పంటకాలం పెరిగి నీటి తడుల అవసరం ఎక్కువుతుందని, చీడపీడల నివారణకు అదనంగా పురుగు మందులు వాడటం వలన అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ఎకరాకు 2 బస్తాలు, మొక్కజొన్న, పత్తి పంటలకు ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియాను నాలుగు దఫాలుగా వేస్తే మొక్కలకు ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. -
పోక్సో నిందితుడికి ఏడాది జైలు
● రూ.25 వేల జరిమానా ● సిద్దిపేట మొదటి అదనపు సెషన్స్ కోర్టు తీర్పు కొండపాక(గజ్వేల్): పోక్సో కేసులో ఓ నేరస్తుడికి ఏడాది పాటు సాధారణ జైలుశిక్షతోపాటు రూ.25 వేల జరిమానాను విధిస్తూ సిద్దిపేట మొదటి అదనపు సెషన్స్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. కొండపాక మండలంలోని దమ్మక్కపల్లి గ్రామంలో 2022 ఆగస్టులో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ అమ్మాయిని నిందితుడు వెలికట్ట అనిల్ ఇంట్లోకి వెళ్లి చేయి పట్టి లాగి బూతు మాటలు తిడుతూ అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో అప్పట్లో నిందితుడిపై పోలీస్టేషన్న్లో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించగా ఇప్పటివరకు పాటు సిద్దిపేట జిల్లా అదనపు కోర్టులో విచారణ జరిగిందని కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. బాధితుల తరఫున పబ్లిక్ పాసిక్యూటర్ ఆత్మరాములు వాదనలను వినిపించారు. వాదనల అనంతరం కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన కోర్టు కానిస్టేబుల్ లావణ్య, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్రెడ్డి, భరోసా కేంద్రం సిబ్బంది సౌమ్య, హరితలను కోర్టు అభినందించింది. త్వరలో వీరందరికీ బహుమతులను అందజేస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. -
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మిరుదొడ్డి(దుబ్బాక): అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చదువులో ప్రతీ విద్యార్థి ముందంజలో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ‘మన ఊరు – మన బడి’కార్యక్రమంలో భాగంగా అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలకు మంజూరైన డ్యూయల్ డెస్కులను బుధవారం ఆయన ప్రారంభించారు. స్కూల్ యూనిఫామ్స్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే క్రమశిక్షణను అలవర్చుకుంటేనే భవిష్యత్తుకు బాటలు పడతాయన్నారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితేనే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అంజాగౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ గౌతమి, ప్రధానోపాధ్యాయుడు కిషన్, ఉపాధ్యాయులు పెరుమాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షుడు రమణాకర్ జగదేవ్పూర్(గజ్వేల్): రాష్ట్రంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్, ఉద్యమ కళాకారులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫోక్ ఇండస్ట్రీ అధ్యక్షుడు రమణాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కళాకారులకు ఐదు వందల ఇంటి స్థలాన్ని హైదరాబాద్లో ఇవ్వాలని కోరారు. మండలంలోని కొండపోచమ్మ ఆలయం వద్ద ఓ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన కళాకారుల కార్యనిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వృద్ధ కళాకారులకు పింఛన్, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యబీమా అందించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ పథకాన్ని పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకపోవడానికి ప్రతి కళాకారుడు కీలకపాత్ర పోషించాలన్నారు. త్వరలో హైదరాబాద్లో సీనియర్ కళాకారులతో కలిసి బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. సభకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 20 ఏళ్లకు పైగా పనిచేశామని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కళాకారుల పాత్ర కీలకమన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి సత్తార్, కోశాధికారి వేణు, ఉపాధ్యక్షుడు నాందేవ్, సలహాదారుడు దరువు అంజన్న, వరంగల్ శ్రీనివాస్, కోదాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
కలెక్టర్ కె.హైమావతి సిద్దిపేటరూరల్/సిద్దిపేటఅర్బన్: యోగాను ప్రతీ ఒక్కరు జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ కె.హైమావతి పేర్కొన్నారు. సిద్దిపేట యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగ సొసైటీ, భారత్ స్వాభిమాన ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల గురించి కలెక్టర్తో చర్చించారు. అంతకుముందు సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.హైమావతి మాట్లాడుతూ...రెవెన్యూ అవగాహన సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన ప్రతీ దరఖాస్తును అధికారులు పరిష్కరించాలన్నారు. జిల్లాలోని విద్యార్థులందరికీ యోగా అందించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా యోగ సాధనకు ఉపయోగపడే క్యాలెండర్ను, హరిద్వార్లోని పతంజలి యోగపీఠం ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బొమ్మలతో కూడిన తెలుగు అనువాద పుస్తకాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్, రాష్ట్ర యోగ అధ్యయన పరిషత్ సభ్యులు, ప్రముఖ యోగా శిక్షకుడు తోట సతీశ్, వ్యాస మహర్షి యోగా సొసైటీ చైర్మన్ డాక్టర్.అరవింద్, అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్రెడ్డి, టీఎన్జీవోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్రెడ్డి, రాష్ట్ర ప్రెస్ అకాడమీ పూర్వ సభ్యులు కె. అంజయ్య, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్ పామ్ ఎంతో లాభదాయకం
కొండపాక(గజ్వేల్): ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకమని కలెక్టర్ హైమావతి అన్నారు. ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్లో భాగంగా మంగళవారం మండలంలోని బందారంలో రైతు నర్రా జైపాల్రెడ్డికి చెందిన 10 ఎకరాల భూమిలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ తోటల సాగుకు అవసరమయ్యే పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తుందన్నారు. అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గుచూపాలన్నారు. 10 ఎకరాల్లో సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతు జైపాల్రెడ్డిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో హార్టికల్చర్, పట్టు పరిశ్రమ అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ మేనేజర్ భాస్కర్రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాగుకు రైతులు మొగ్గుచూపాలి కలెక్టర్ హైమావతిభూ సమస్యలు పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ హైమావతి అన్నారు. అంకిరెడ్డిపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉంటున్న భూ సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతీ దరఖాస్తు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనున్నట్లు తెలిపారు. -
యోగా ఏకాగ్రతను పెంచుతుంది
కొండపాక(గజ్వేల్): యోగా ఏకాగ్రతను పెంచుతుందని జాతీయ యోగాసన క్వాలీఫైడ్ కోచ్ తోట సతీష్ అన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం కొండపాకలోని బాలికల, బాలుర హైస్కూళ్లలో యోగా సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తోట సతీష్ మాట్లాడుతూ యోగా ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుందన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసాలకు యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచుతూ మరింతగా విద్యాభ్యాసాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం విఠల్నాయక్, ఉపాధ్యాయులు రఘువర్దన్రెడ్డి, హారతి, రామస్వామి, మహేందర్రెడ్డి, కనకయ్య, రాకేష్, రవీందర్రెడ్డి, సంయొద్దిన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.జాతీయ యోగాసన క్వాలీఫైడ్ కోచ్ తోట సతీష్ -
ఐటీ హబ్కు ఇంటర్నెట్ కట్
సిద్దిపేటఅర్బన్: సిద్దిపేటలోని ఐటీ హబ్లో మరోసారి ఇంటర్ నెట్ సేవలు నిలిచిపోయాయి. బిల్లు చెల్లించకపోవడం వల్లే ఇంటర్నెట్ కట్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం ఈదురు గాలుల వల్ల కేబుల్ తెగిపోవడంతో సేవలు నిలిచిపోయాయని చెబుతున్నారు. రెండు రోజుల పాటు నెట్ లేకపోవడంతో ఐటీ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా ద్వితీయ శ్రేణి పట్టణాల చెంతకు వచ్చిన ఐటీ కంపెనీలను మౌలిక వసతుల లేమి, ఇంటర్ నెట్, విద్యుత్ కారణంగా ఇబ్బందులు తప్పడంలేదు.రెండు రోజులుగా నిలిచిన సేవలు -
రోల్ మోడల్గా నిలవండి
సిద్దిపేటకమాన్: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందించి రోల్ మోడల్గా నిలవాలని సీపీ అనురాధ అన్నారు. శిక్షణ పొందుతున్న ప్రొబేషినరీ ఎస్ఐలకు సీపీ కార్యాలయంలో సీపీ మంగళవారం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. పోలీసు స్టేషన్కు వచ్చే ప్రజల సమస్యలు పూర్తిగా విని పరిష్కరించాలన్నారు. డయల్ 100కు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకోవాలన్నారు. సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్గౌడ్, ప్రొబిషినరీ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
అందరికా.. కొందరికా?
ఖాతాల్లోకి రైతు భరోసా ● మొదటి విడతగా మూడెకరాల లోపు వారికి జమ ● ఉమ్మడి జిల్లాలో 8.38లక్షల ఎకరాలకు రూ.502 కోట్లు ● గత యాసంగిలో 2.27లక్షల మంది దూరం ● ఈ సారైనా పూర్తి స్థాయిలో అందేనా? ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ కొందరికా? లేక అందరికా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 17,18,981 ఎకరాలకు రూ.859 కోట్లకుపైగా రైతు బంధును అందించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగిలో 4ఎకరాలలోపు వారికే రైతు భరోసా జమ చేసింది. దీంతో 40శాతం మంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. ఈసారి వానాకాలంలోనైనా అందరికీ జమ చేయాలని రైతులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేటప్రస్తుతం అందిన రైతు భరోసా ఇలా.. జిల్లా రైతులు ఎకరాలు రూ.కోట్లల్లో సిద్దిపేట 2,54,711 3,02,418 181,45,13,296 మెదక్ 2,25,764 2,24,319 134,59,15,589 సంగారెడ్డి 2,65,400 3,11,292 186,77,56,219గత యాసంగిలో రైతు భరోసా ఇలా.. జిల్లా రైతులు ఎకరాలు రూ.కోట్లల్లోసిద్దిపేట 2,62,238 3,33,238 199,94,28,372 మెదక్ 2,26,970 2,34,500 140,70,00,000 సంగారెడ్డి 2,67,236 3,33,416 200,05,00,000 -
ఆటలు ఆడించేవారేరీ?
జిల్లా వ్యాప్తంగా పీఈటీల కొరతక్రీడలు.. శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పే ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. అందుకు నిదర్శనం పీఈటీల కొరత తీర్చకపోవడమే. క్రీడా సామగ్రి, సరైన క్రీడాసదుపాయాలు లేక గ్రామీణ విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. దీంతో ప్రతిభా ఉన్నా శిక్షణ లేక ఆటల్లో రాణించలేకపోతున్నారు. చేర్యాల(సిద్దిపేట): జిల్లాలో 10 ప్రభుత్వ ఉన్నత, 217 జెడ్పీ ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 227 ఉన్నత పాఠశాలల్లో 31,978మంది విద్యనభ్యసిస్తున్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా కేవలం 128 మంది పీఈటీలే ఉన్నారు. కొన్నేళ్లుగా పీఈటీలను నియమించకపోవడంతో విద్యార్థులకు ఆటలు నేర్పించే వారే కరువయ్యారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్, క్రికెట్ వంటి ఆటలు ఆడాలని ఉన్నా శిక్షణ ఇచ్చేవారు లేరు. ప్రభుత్వం స్పందించి వెంటనే వ్యాయామ ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.ఖాళీలు చాలా ఉన్నాయి హాస్టళ్లలో ఖాళీలు చాలా ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అడ్మిషన్లు ప్రారంభించాం. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హాస్టళ్లలో సదుపాయాలు, సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తాం. మూడు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను చేర్చుకుంటాం. – రామస్వామి, వార్డెన్, తిగుల్ శిక్షణ లేక రాణించలేకపోతున్నాం సరైన శిక్షణ లేక బడిలో ఆడించే క్రీడల్లోనూ గెలవలేకపోతున్నాం. శిక్షణ ఇచ్చేవారు లేకపోవడంతో మాకు తోచిన విధంగా ఆడుతున్నాం. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పీఈటీని నియమించాలి. శిక్షణ, ఆటవస్తువులు అందిస్తే క్రీడల్లో రాణిస్తాం. – జశ్వంతి, 10వ తరగతి, చుంచనకోట జెడ్పీహెచ్ఎస్ నియామకం ప్రభుత్వ ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరం. కానీ పలు పాఠశాలల్లో పీఈటీల కొరత ఉండటంతో వ్యాయామం, ఆటలు ఆడించలేకపోతున్నాం. ఖాళీల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం చేపట్టే నియామకాల్లో సరిపడా పీఈటీలను నియమించాలని నివేదిస్తాం. – శ్రీనివాస్రెడ్డి, డీఈఓ -
21న మెగా ఫార్మా జాబ్ మేళా
సిద్దిపేటఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఈనెల 21న మెగా ఫార్మా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల టీఎస్కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమామహేశ్వరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, అరబిందో ఫార్మా, బయోకాన్, భారత్బయోటెక్ హెటిరో లాబ్స్, బయోలజికల్ తదితర కంపనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. డిగ్రీ ఉండి, 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సు ఉన్న పురుష అభ్యర్థులందరికీ అవకాశం ఉంటుందన్నారు. పాలిటెక్నిక్, కెమిస్ట్రీతో బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు హైదరాబాద్ జీడిమెట్లలో మూడు నెలల పాటు ఉచిత వసతితో కూడిన శిక్షణ అందిస్తారని తెలిపారు. అనంతరం రూ.15వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంతో కూడిన ఉద్యోగం కల్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి డీఈఈ శ్రీనివాస్రెడ్డి దుబ్బాకటౌన్: రాయపోల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సహించబోమని జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, ఏఈఈ, సీఆర్పీలు తదితరులున్నారు. ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈసెట్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్కు మొదటి రోజు 177 మంది విద్యార్థులు హాజరు కాగా అధ్యాపకులు సర్టిపికెట్లు పరిశీలించి ఐడీ, పాస్వర్డు అందజేశారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ ఆన్లైన్లో స్లాట్బుక్ చేసుకున్న విద్యార్థులకు గురువారం వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఐడీ పాస్వర్డు పొందిన విద్యార్థులు కళాశాలలో చేరేందుకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. -
అర్హత లేకున్నా వైద్యం చేస్తే ఫిర్యాదు
గజ్వేల్రూరల్: అర్హత లేకున్నా వైద్యం అందించే వారిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ)కు ఫిర్యాదు చేస్తామని ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ లింగం, చంద్రారెడ్డి, పెంటాచారిలు అన్నారు. మంగళవారం రాత్రి గజ్వేల్ ఐఎంఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కోర్టు సమీపంలోగల ఐ ఆసుపత్రి, సంగాపూర్ మార్గంలోని పల్స్, ఆక్సీకేర్, సన్రైజ్, మెడినోవ తదితర ఆస్పత్రులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐ ఆస్పత్రితో పాటు ఆక్సీకేర్, ఆసుపత్రిలో అర్హతలేని వారు చికిత్స అందిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని, పల్స్ ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆస్పత్రులలో విద్యార్హతకు మించి వైద్యం చేస్తున్నట్లు గుర్తించామని, ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని సూచించినట్లు తెలిపారు. ప్రజలు అర్హత లేని వైద్యుల వద్ద చికిత్స చేయించుకొని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని, అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిపై టీజీఎంసీతో పాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో గజ్వేల్ ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ నాగమున్నయ్య పాల్గొన్నారు. ఐఎంఏ ప్రతినిధుల హెచ్చరిక గజ్వేల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ -
రాజేశ్వర్రెడ్డికి స్వర్ణ కంకణం
సిద్దిపేటకమాన్: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు డాక్టర్ కలకుంట్ల రాజేశ్వర్రెడ్డికి దైవజ్ఞ బిరుదుతో పాటు స్వర్ణ కంకణం ప్రదానం చేశారు. విశ్వజ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ హైదరాబాద్లో నిర్వహించిన సమ్మేళనంలో అవార్డు అందజేశారు. ముహూర్తం, లగ్న, భావ, నవాంశ ఫలితాలపై, బృహత్సంహితపై నిర్వహించిన సెమినార్లో ప్రతిభావంతులకు గుర్తించి సత్కారాలు అందజేసినట్లు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అబ్జర్వర్లు చేర్యాల(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని, రానున్న రోజుల్లో వారికే పదవులు దక్కుతాయని పార్టీ జిల్లా అబ్జర్వర్లు పవన్ మల్లాడి, మేనేని రోహిత్రావు అన్నారు. సోమవారం స్థానిక వాసవి గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, గిరి కొండల్రెడ్డి, కొమ్ము నర్సింగరావు, దాసరి కళావతి, పుర్మ ఆగంరెడ్డి, మంజ మల్లేశం, దాసరి శ్రీకాంత్, కొమ్ము రవి, మహాదేవుని శ్రీనివాస్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ప్రశాంత్నగర్(సిద్దిపేట): బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ లాంగ్టర్మ్ కోంచిగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ సోమవారం తెలిపారు. గతంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ అయిన 50 మంది అభ్యర్థులకు, ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసిన 50 మంది అభ్యర్థులకు మొత్తంగా 100మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అందుకోసం అర్హులైన అభ్యర్థులు జులై 8వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు బీసీ స్టడీ సర్కిల్ (040–24071178)లో సంప్రదించాలన్నారు. ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ.9.93 లక్షలు హుస్నాబాద్: ఎల్లమ్మ ఆలయ మండపంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. రూ.9,93,957 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈసారి రూ.14వేలు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. జాతర సందర్భంగా వచ్చిన మిశ్రమ వెండి, బంగారం తిరిగి వెండిలో వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కిషన్ రావు, గోమాత సేవ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతు నేస్తంపైసీఎం వీడియో కాన్ఫరెన్సు కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి, కొండపాక మండలాల్లోని రైతు వేదికల్లో రైతు నేస్తంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగుపై అవగాహన కల్పించారు. భూములపై పక్కాగా హక్కులుండేలా భూ భారతి తీసుకువచ్చామన్నారు. ఇందిరమ్మ పథకంలో పేదలందరికీ అంచెలంచెలుగా అవకాశం కల్పిస్తామన్నారు. పంటల మార్పిడీలతోనే అధిక దిగుబడులు పొందుతారని అన్నారు. -
పెండింగ్ అర్జీలు పరిష్కరించండి
● కలెక్టర్ హైమావతి ● అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం ● ప్రజావాణిలో 98 దరఖాస్తులుసిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలకు సంబంధించి పెండింగ్లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పెండింగ్ అర్జీలను గురించి అధికారులతో మాట్లాడారు. మే 31 వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలియజేస్తూ మంగళవారం సాయంత్రంలోగా పెండింగ్ దరఖాస్తుల వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. ప్రజావాణికి తప్పనిసరిగా జిల్లా అధికారులు హాజరు కావాలన్నారు. కొందరు గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తప్పకుండా అనుమతి లేకుండా సెలవు పెట్టరాదని హెచ్చరించారు. ఇక నుంచి ప్రభుత్వశాఖల కార్యక్రమాల ప్రగతిపై 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈనెల 21న జిల్లా కేంద్రంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా అధికారులందరూ తప్పక పాల్గొనాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్రజావానిలో పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ 98 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, వివిధశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనుమతిలేని పాఠశాలపై చర్యలు తీసుకోండి చేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ అనుమతులు లేకుండా మూడేళ్లుగా పట్టణ కేంద్రంలో నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయన్నారు. కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తూ విద్యా వ్యాపారానికి సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకుని అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలను మూసివేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందించానన్నారు.పొలాలకు దారి చూపించండి నా పేరు చెప్యాల రాజేశ్వరి. మాది దుబ్బాక మండలం, బల్వంతాపూర్ గ్రామం. గ్రామంలోని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లేందుకు ప్రభుత్వ కుంట ఉండేది. ఆ కట్టపై నుంచి ఎన్నో ఏళ్లుగా వెళ్తూ వ్యవసాయం చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కొన్ని రోజుల క్రితం కుంటను కబ్జా చేసుకున్న కొందరు వ్యక్తులు దారి లేకుండా చేశారు. ఈ విషయంపై అధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదు. సమస్య పరిష్కరించి, న్యాయం చేయాలి. మా భూమిని ఇప్పించండి మాది సిద్దిపేట అర్బన్ మండలం, మిట్టపల్లి గ్రామం. మాకు గ్రామంలోని 333/2 సర్వే నంబర్ లో ఎకరం భూమి ఉంది. ఆ భూమిని వంశపారంపర్యంగా 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ వస్తున్నాం. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో అధికారులతో చేతులు కలిపి 5 నెలల క్రితం వారిపేరుపై పట్టా మార్పిడి చేసుకున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మా భూమిని మాకు ఇప్పించి న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. -
ముదిరాజ్లు ఐక్యంగా ముందుకెళ్లాలి
● మెదక్ ఎంపీ రఘునందన్రావు ● హాస్టల్ భవన ప్రహరీ నిర్మాణానికిశంకుస్థాపన సిద్దిపేటఅర్బన్: ముదిరాజ్ కులస్తులు పార్టీలకతీతంగా ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవారం అర్బన్ మండలం పొన్నాలలోని ముదిరాజ్ హాస్టల్ భవన ప్రహరీకి శంకుస్థాపన చేశారు. ప్రహరీ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.18 లక్షలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బీసీలను ముఖ్యమంత్రిని చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. బీజేపీకి అవకాశం వస్తే మూడు పర్యాయాలు బీసీ బిడ్డను ప్రధానమంత్రిగా చేసుకున్నామని, రాష్ట్రపతిగా మహిళను చేశామని తెలిపారు. అవకాశం వస్తే ముదిరాజులు కూడా ఐక్యంగా అభివృద్ధికి పాటుపడాలని, ముదిరాజుల సత్తా ఏంటో ప్రపంచానికి చాటాలన్నారు. బీసీల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ముదిరాజులను అధ్యక్షులుగా నియమించామని, బీజేపీలో ముదిరాజులకు సముచిత స్థానం దక్కుతుందని అన్నారు అంతకుముందుకు స్థానిక కాలనీ మహిళలు ఎంపీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. కాలనీలో మురుగు సమస్య తీవ్రంగా ఉందని పరిష్కారం చూపించాలని కోరారు. స్పందించిన ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కాలనీలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజీపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.పల్లెల అభివృద్ధే లక్ష్యం మిరుదొడ్డి(దుబ్బాక): పట్టణాలకు ధీటుగా పల్లెల అభివృద్ధికి పాటు పడతానని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. మండల పరిధిలోని కొండాపూర్లో రెడ్డి సంఘం రీడింగ్ రూంకు, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని అన్నారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న నానుడిని నిజం చేయడానికి తన వంతు శాయవక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, టెలికం బోర్డు మెంబర్ మొగుల్ల మల్లేశం, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఈజీఎస్ పనులపరిశీలన
కొండపాక(గజ్వేల్): కొండపాక, ముద్దాపూర్లో ఉపాధి హామీ పనులను జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టరు శివశంకర్ తోపాటు (సెంట్రల్) ఎంఓఆర్డీ బృందం సోమవారం పరిశీలించింది. ఆయా గ్రామాల్లో పనులు జరుగుతున్న చోట్లకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. ఎలాంటి పనులను చేయిస్తున్నారు? కూలీ డబ్బులు సరిగ్గా వస్తున్నాయా? లేదా అంటూ ఆరా తీశారు. భూముల లేవలింగ్, పాంపాండ్స్, రోడ్డు పనులను పరిశీలించారు. గ్రామాభివృద్ధి కోసం ఈ పనులు ఉపయోగపడుతాయా అన్న విషయాలపై ఆరా తీశారు. పనుల పారదర్శకతలను, కూలీల చెల్లింపులను అదనపు కలెక్టరు గరీమా అగర్వాల్ బృందానికి వివరించారు. పనుల తీరుల నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని డైరెక్టరు శివశంకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జగదేవ్ ఆచార్య, ఈజీఎస్ అధికారులు, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, కూలీలు తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ అడ్మిషన్ గడువు పెంపు ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ పది, ఇంటర్లో అడ్మిషన్ల గడువు జూలై 11వరకు పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి సోమవారం తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి (80084 03635)ని సంప్రదించాలన్నారు. -
సర్కారు బడి.. అడ్మిషన్లు ఫుల్
ఇందిరానగర్ ప్రభుత్వపాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు ● 6వ తరగతిలో 50 సీట్లకు ప్రవేశ పరీక్ష ● వచ్చిన దరఖాస్తులు 340 ప్రశాంత్నగర్(సిద్దిపేట): కార్పొరేట్ పాఠశాల కాదు.. ప్రైవేటు అసలే కాదు.. అది సర్కారు బడి. అయినా అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. స్కూల్ గేట్కు నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటే ఆ పాఠశాల స్థాయి ఏమిటో అర్థం అవుతుంది. అదే.. జిల్లా కేంద్రం ఇందిరానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఈ పాఠశాల అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. మొత్తం 1,217 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2025–26 నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఆన్లైన్లో (క్యూఆర్ ద్వారా) 560 దరఖాస్తులు వచ్చాయి. కానీ 6వ తరగతిలో 180సీట్లు మాత్రమే ఖాళీలున్నాయి. అయితే ఇందులో 130 ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కేటాయించగా, కేవలం 50 సీట్ల కోసం 340 దరఖాస్తులు వచ్చాయి. వీటి కోసం సోమవారం పాఠశాలలో అడ్మిషన్ టెస్ట్ నిర్వహించారు. దీంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల ఆవరణ అంతా సందడిగా మారింది. ప్రతిఏటా ఇదే పోటీ ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభం వేళ.. మా పాఠశాలలో 6వ తరగతితో పాటుగా ఇతర తరగతుల్లో చేరేందుకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 6వ తరగతిలో 50 సీట్ల కోసం సోమవారం ప్రవేశ పరీక్ష నిర్వహించాం. పాఠశాలలో విద్యావిధానం, మౌలిక సౌకర్యాల దృష్ట్యా ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.– ప్రభాకర్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానర్ -
సర్దుబాటు
ఉపాధ్యాయులవిద్యాశాఖ కసరత్తు షురూ.. ● విద్యార్థుల సంఖ్యకుఅనుగుణంగా మార్పులు ● 750 మంది టీచర్లు అధికంగాఉన్నట్లు గుర్తింపు ● జూలై 15వ తేదీ వరకుకొనసాగనున్న ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 912 ప్రభుత్వ పాఠశాలలో 4,205 మంది ఉపాధ్యాయులు ఉండగా అందులో దాదాపు 750 టీచర్లు అధికంగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వీరిని అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. జూలై 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 912 ప్రభుత్వ పాఠశాలల్లో 65,231 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత ఏడాది విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు అదనంగా ఉన్న వారి లెక్కలు తీశారు. ఎస్జీటీలు 1,902 ఉండగా విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా 400 మంది, స్కూల్ అసిస్టెంట్లు 2,303 మంది ఉండగా అదనంగా 350 మంది ఉన్నారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు 200 మంది, ఎస్జీటీలు 150 మందిని మాత్రమే సర్దుబాటు చేసే అవకాశం ఉంది. పాఠశాలలో ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందో.. తగ్గుతుందో ఈ నెల 30వ తేదీవరకు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థుల వరకు ప్రతి సబ్జెక్ట్కు ఒక ఉపాధ్యాయుడును నియమించాలి. తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వివిధ సబ్జెక్ట్లకు టీచర్లును నియమించనున్నారు. ఇప్పటికే పలువురు వినతులు గతంలో సెప్టెంబర్/అక్టోబర్ నెలలో టీచర్ల సర్దుబాటు చేసేవారు. ఈ సారి జూలై 15వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో అనుకూలమైన పాఠశాలకు సర్దుబాటు చేసే విధంగా చూడాలని ఇప్పటికే పలువురు వినతి పత్రాలు అందజేస్తున్నారు. మరికొందరు ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు, యూనియన్ నేతలు, రాజకీయ నాయకులతో పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు టీచర్లు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న చోటే ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర చోట్ల అవసరం లేకుంటే మిగులు ఉన్నా అదే పాఠశాలలో టీచర్లను కొనసాగించనున్నారు. వచ్చే నెల 15లోగా పూర్తి చేస్తాం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కడ పెరుగుతాయో.. ఎక్కడ తగ్గుతాయో తెలియదు. క్షేత్రస్థాయిలో ఎంత మంది ఉపాధ్యాయులు సర్ప్లస్గా ఉన్నారని పూర్తి స్థాయి సమాచారం వస్తుంది. కలెక్టర్ ఆమోదంతోనే టీచర్ల సర్దుబాటు జూలై 15వ తేదీ వరకు పూర్తి చేస్తాం. కలెక్టర్ ఆదేశాలతో ఎక్కడ కేటాయిస్తే ఆ పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. – శ్రీనివాస్ రెడ్డి, డీఈవో -
సాగుకు జలగండం!
30 అడుగుల లోతులో జలంహుస్నాబాద్రూరల్: జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. పంటలకు నీటి వినియోగం తగ్గినా వ్యవసాయ బావుల్లో రైతులు ఉహించని విధంగా 30 అడుగుల కింద నీరు చేరడంతో రైతులు వరి నార్లు పోసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. భూగర్భ జలశాఖ వారు ఏర్పాటు చేసిన బోరుబావుల్లో ప్రతి నెలా భూగర్భ జలాలను లెక్కిస్తుంటారు. కోహెడ మండలం రాంచంద్రాపూర్, హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్, జనగామ జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన బోరు బావుల్లో నీటి మట్టాన్ని గురువారం భూగర్భ జలశాఖ అధికారులు లెక్కించారు. గత నెలలో 28 అడుగుల లోతున ఉన్న జలం ఇప్పుడు 30 అడుగుల కిందకు పడిపోయిందని తెలిపారు. రెండేళ్ల కిందట జిల్లాలో భూగర్భ జలాలు 2 మీటర్ల లోతులోనే ఉన్నాయని ఇప్పుడు అడుగంటిపోతున్నట్లు చెబుతున్నారు. కాలేశ్వరం నీరు రాకపోవడం వల్లే.. కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకపోవడంతో చెరువు, కుంటలు ఎండిపోవడం, వాగుల్లో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నారని భూగర్భ జలాల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కోహెడ మండలం రామచంద్రాపూర్ వాగు ఒడ్డు ఉన్నప్పటికి రెండేళ్ల కింద 2 మీటర్ల లోతు ఉన్న జలం ఇప్పుడు 10 మీటర్ల కిందకు చేరింది. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ మహాసముద్రం కిందనే ఏర్పాటు చేసిన బోరు బావిలో కూడా భూగర్భ జలాలు 30 అడుగులకు చేరాయి. రెండేళ్ల కిందట 2 మీటర్ల కిందనే.. నెలలోనే 2 ఫీట్లకు పడిపోయిన జలాలు వరుణుడి కోసం రైతుల ఎదురుచూపు ఆరుద్రలో వానలు కురవకపోతే ఆరుతడి పంటలేప్రతీ నెల నీటిని లెక్కిస్తాం రాష్ట్ర భూగర్భ జలశాఖ, స్వాన్ ఎన్విరోల్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు భూగర్భ జలాలను లెక్కిస్తున్నారు. మే నెలలో 28 అడుగుల లోతులో ఉన్న నీరు ఇప్పుడు 30 అడుగులకు పడిపోయింది. వ్యవసాయ పంటలకు నీటి వినియోగం తగ్గినా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. 30 కిలోమీటర్లకు చొప్పున ఏర్పాటు చేసిన బోరు బావిలో నీటిని లెక్కించి అధికారులకు పంపిస్తున్నాం. – ఎండీ నసీర్, స్వాన్ ప్రతినిధి సాగుకు వెనుకంజ యాసంగి వరి పంటలు కోసిన తర్వాత భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ బావుల్లో నీరు పైకి వస్తుంది. జూన్ నెలలో కూడా రైతులు ఎలాంటి పంటలు సాగు చేయకముందే భూగర్భ జలాలు అడుగున చేరడంతో వానాకాలంలో రైతులు నార్లు పోసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పునాస పంటలు కూడా వేయలేక రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. రోహిణి, మృగశిర కార్తెల్లో ఆశించిన మేర వానలు పడకపోవడంతో ఆరుద్ర కార్తైపె ఆశలు పెంచుకున్నారు. వానలు లేకపోతే వేసిన పంటలు ఎండిపోతాయనే భయంతో విత్తనాలు వేయలేకపోతున్నారు. -
స్థానికంగా సత్తా చాటుదాం
గజ్వేల్రూరల్: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం కొడకండ్లలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మంత్రి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఇప్పటి నుంచే కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని కోరారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ముంపు బాధితులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు రంగారెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, హరికృష్ణ, నరేందర్రెడ్డి, విజయమోహన్, సర్ధార్ఖాన్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ కొడకండ్లలో కార్యకర్తల సమావేశం -
రైతు నేస్తంపై నేడు సీఎం వీడియో కాన్ఫరెన్స్
కొండపాక(గజ్వేల్): దుద్దెడ, కొండపాక, మర్పడ్గ, మేదినీపూర్ల్లోని రైతు వేదికల్లో సోమవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి చే రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి శివరామకృష్ణ తెలిపారు. వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులు, మెలకువలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందుతూ రైతులు ఆర్థికంగా లాభపడేలా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీశ్రీ బాటలో యువ కవులు నడవాలి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రకృతిలో ప్రతి వస్తువుపై రచన చేస్తూ తెలుగు సాహిత్యంలో ఎనలేని కీర్తి గడించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు బాటలో యువ కవులు సాగాలని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, యువకవి బస్వ రాజకుమార్లు అన్నారు. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఆదివారం సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తినిచ్చే రచనలు, రచయితలను మరువకూడదన్నారు. ముఖ్యంగా శ్రీశ్రీ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని, వారి బాటలో సాగాలన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ప్రశాంత్నగర్(సిద్దిపేట): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, చెట్లు లేకపోతే మనుగడ లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబుద్దీన్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో షాబుద్దీన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన లేకుండా ఎక్కడపడితే అక్కడ కోనోకార్పస్ చెట్లను పెంచి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిందని ఆరోపించారు. అలాగే ఎప్పడు పడితే అప్పుడు చెట్లు నరికివేతతో విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చెట్ల నరికివేత పని చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం ఆలోచన లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. కరెంటు తీగల కింద కోనోకార్పస్ చెట్లను పెంచడం వల్లే ఇప్పుడు ఈ దుస్థితి దాపురించిందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి వర్గల్(గజ్వేల్): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనివాస్బాబు అన్నారు. ఆదివారం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వర్గల్ మండలం గౌరారం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ నేతృత్వంలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ ఆవిర్భవిస్తోందన్నారు. గత పాలకుల తప్పిదాలు చక్కదిద్దుతూ, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల మెప్పు పొందుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వారిని కాపాడుకునే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. -
సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్
జిన్నారం(పటాన్చెరు): సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక వసతులతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మించడం అభినందనీయమని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, హెటిరో పరిశ్రమ ప్లాంట్ డైరెక్టర్ మోహన్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే అత్యాధునిక పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెటిరో పరిశ్రమ సహకారంతో రూ. 3.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. బోనాలతో మహిళలుఅమ్మవార్లకు బోనాలు.. హుస్నాబాద్: శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, భక్తుల కోలాహలం మధ్య బోనాల పండుగ వైభవంగా జరిగింది. పట్టణంలో ఆదివారం ఎల్లమ్మ, పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.ఐజీ సత్యనారాయణ -
విద్యాధరి సేవలో నూతన కలెక్టర్
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రాన్ని ఆదివారం సాయంత్రం నూతన కలెక్టర్ హైమవతి సందర్శించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి పరివారం ఆమెకు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ అర్చక వేదపండితులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. చంద్రశేఖర సిద్దాంతి ఆలయం తరపున అమ్మవారి జ్ఞాపికను అందజేసి సన్మానించారు. అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రిని కలిసిన కలెక్టర్హుస్నాబాద్: కలెక్టర్ హైమావతి ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయవర్గాల సాదర స్వాగతం జ్ఞాపిక అందజేత -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్
● ఎమ్మార్పీఎస్ నేతమందకృష్ణ ● దుద్దెడలో జగ్జీవన్రామ్ విగ్రహావిష్కరణకొండపాక(గజ్వేల్): అణగారిన వర్గాల అభ్యన్నతి కోసం పాటుపడిన ఆశాజ్యోతి బాబు జగ్జీవన్రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మండలంలోని దుద్దెడలో అంబేడ్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్రామ్ విగ్రహాన్ని శనివారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి సుదీర్ఘ కాలం సేవలందించిన అగ్రగణ్యుల్లో జగ్జీవన్రామ్ మొదటి స్థానంలో నిలిచారన్నారు. భారతదేశంలో చదువు అనే అక్షర జ్ఞానాన్ని పరిచయం చేసిన వ్యక్తి అని, బడుగు బలహీన వర్గాల ప్రజలు నేటికీ రిజర్వేషన్ల ఫలాలు పొందటం జగ్జీవన్రామ్ చలవేనన్నారు. 1994లో చేపట్టిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం వల్ల ఉపకులాల ఏర్పాటుకు చట్టబద్ధత లభించిందని, దుద్దెడలో పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరెపల్లి మహాదేవ్, నాయకులు భాకి ప్రభాకర్, దరువు ఎల్లన్న, అంజన్న, శ్రీనివాస్, ప్రభాకర్, కొమ్ము మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్
సిద్దిపేటరూరల్: జిల్లాకు నూతన కలెక్టర్గా బదిలీపై వచ్చిన కే.హైమావతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్లు గరిమాఅగర్వాల్, అబ్దుల్ హమీద్లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి మర్యాదపూర్వకంగా నూతన కలెక్టర్ హైమావతిని కలిశారు. భవిష్యత్ కమ్యూనిస్టులదేసీపీఎం నేత చుక్కా రాములు సిద్దిపేటఅర్బన్: రాబోయే కాలంలో దేశంలో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అవుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు అన్నారు. శనివారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్లో సీపీఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అసమానతలకు, దోపిడీకి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదుల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. దేశంలోనూ కార్మిక వర్గం జూలై 9న సార్వత్రిక సమ్మెను చేయాలని సన్నద్ధమవుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు అనే అంశంపై జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శశిధర్ బోధించారు. మతం, మతోన్మాదం, ప్రతిఘటన అంశాలపై రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్ బోధించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, నాయకులు గోపాలస్వామి, భాస్కర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, వెంకట్, కృష్ణారెడ్డి, యాదగిరి, రవికుమార్, బాలనర్సయ్య, శ్రీనివాస్, ప్రశాంత్, శిరీష, నవీన, శారద, తదితరులు పాల్గొన్నారు. బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలిముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు యాదగిరి గజ్వేల్రూరల్: కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి డిమాండ్ చేశారు. శనివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని, జనాభాలో 60శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు 37శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిందని గుర్తు చేశారు. 17న యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నేతృత్వంలో మెదక్లో రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు విజయేంద్రసాగర్, సదానంద్, కుమారస్వామి, నర్సింహ, వంశరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం.. దారుణం..!
2024–25లో లక్ష్యంచేరని పంట రుణాలు ● రూ.7,601 కోట్లకు గాను రూ.5,640కోట్లు మంజూరు ● మొండిచేయి చూపిన పలు బ్యాంకులు ● ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నఅన్నదాతలుసాక్షి, సిద్దిపేట: జిల్లాలో పంట రుణాలు లక్ష్యం మేరకు అందించడం లేదు. ప్రతీ సంవత్సరం రుణ లక్ష్యాన్ని పెంచి ప్రణాళిక విడుదల చేస్తున్న బ్యాంకర్లు.. పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. 2024–2025 ఆర్థిక సంవత్సరం రూ.7,601 కోట్లు వ్యవసాయ రంగానికి రుణ లక్ష్యం కాగా.. రూ 5,640 కోట్లు మాత్రమే అందించారు. కొన్ని బ్యాంకులు లక్ష్యం మేరకు ఇస్తున్నా.. మరికొన్ని అసలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పలువురు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వ్యవసాయ రంగానికే ప్రాధాన్యత వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికే అగ్రభాగం ఉంటుంది. 70 శాతానికి పైగా ఈ రంగానికే అందించాలన్న లక్ష్యాన్ని నిర్ణయిస్తారు. వానాకాలం, యాసంగి పంట రుణాలు, అనుబంధ రంగ రుణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కానీ రైతులకు ప్రతీ ఏడాది రుణాలను అందించడంలో పలు బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నారు. పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామని సాకులు చెబుతుండటంతో రైతులు రుణాలపై ఆశలు వదులుకుంటున్నారు. 2023–24లో రూ 4,509 కోట్ల రుణాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు రూ.900 కోట్ల వరకు రుణమాఫీ చేయడంతో 2024–25లో బ్యాంకు రుణాలు కొంత మేరకు పెరిగినప్పటికీ లక్ష్యం చేరుకోలేదు. 17న వార్షిక రుణ ప్రణాళిక విడుదల ప్రతీ ఏడాది జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ అధ్యక్షతన లీడ్బ్యాంక్ విడుదల చేస్తారు. 2025–26 సంవత్సరపు వార్షిక రుణ ప్రణాళికను ఈ నెల 17న విడుదల చేసేందుకు లీడ్ బ్యాంక్ అదికారులు సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.10వేల కోట్లు వార్షిక రుణ ప్రణాళిక ఉండే అవకాశం ఉంది. అందులో వ్యవసాయ రంగానికి దాదాపు రూ 8,600 కోట్లు ఉండనుంది. ఈ సంవత్సరం అయితే రైతులకు పంట రుణాలు వంద శాతం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆ బ్యాంక్లకు టార్గెట్లుపెంచుతున్నాం వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వని బ్యాంక్లకు ఈ ఏడాది టార్గెట్ను పెంచుతున్నాం. బ్యాంకర్లతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి టార్గెట్లు రీచ్ కావాలని అదేశిస్తున్నాం. – హరిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ప్రైవేట్ వ్యాపారుల దగ్గరకు.. పలు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో పంటల సాగు కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. అన్నదాతలు ఎప్పటి మాదిరిగానే ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో పండించిన పంట ద్వారా వచ్చిన ఆదాయం అంతా వడ్డీలకే సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోతుండటంతో మరింత అప్పుల పాలవుతున్నారు. -
సిద్దిపేట సూపర్
రామ్ దూర్గ్ పాలకవర్గ ప్రశంససిద్దిపేటజోన్: సిద్దిపేట చాలా బాగుందని, స్వచ్ఛబడి కొత్తగా ఉందని కర్నాటక రాష్ట్ర రామ్దుర్గ్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు కితాబిచ్చారు. శనివారం వారు సిద్దిపేట బల్దియాను సందర్శించారు. స్వచ్ఛబడిలో డిజిటల్ క్లాస్ ప్రక్రియ పరిశీలించారు. స్టీల్బ్యాంక్ సందర్శించారు. అదేవిధంగా వార్డు స్థాయి కంపోస్టు యార్డులో తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ గూర్చి ఆరా తీశారు. బుస్సా పూర్ డంప్యార్డ్ సందర్శించారు. తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారీ విధానం గురించి తెలుసుకున్నారు. ఇదే తరహాలో రామ్దూర్గ్ మున్సిపాలిటీలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. సిద్దిపేటను సందర్శించిన వారిలో రామ్దూర్గ్ మున్సిపాలిటీ చైర్మన్ సిద్దిరప్ప సురేష్, వైస్ చైర్మన్లు లక్ష్మి, జగదీష్, సరితా గోవింద్తో పాటు 22 మంది కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వీరికి సిద్దిపేట బల్దియా గురించి కమిషనర్ ఆశ్రిత్ కుమార్ వివరించారు. -
వారంలో ఒక రోజొస్తా
● సిద్దిపేటతో నాకు మంచి సంబంధం ● కార్మికశాఖ మంత్రి వివేక్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేటకు వారంలో ఒక రోజు వస్తానని, కార్యకర్తలకు అండగా నిలుస్తానని, కార్మికశాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. శనివారం హైద్రాబాద్ నుంచి చెన్నూరు వెళుతూ.. మార్గమధ్యలో సిద్దిపేటలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం తదితర పథకాలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు. అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా, అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. తన తండ్రి వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు సిద్దిపేటతో మంచి సంబంధాలు ఉండేవన్నారు. మళ్లీ సిద్దిపేటకు ఇన్చార్జీగా రావడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకొద్దామని చెప్పారు. అంతకు ముందు వివేక్కు జిల్లా కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, హరికృష్ణ, దరిపల్లి చంద్రం, అత్తు ఇమామ్, లక్ష్మీ, బొమ్మల యాదగిరి, కలీమొద్దీన్, గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
4,315 కేసులు పరిష్కారం
కేసుల పరిష్కారానికిలోక్ అదాలత్ సరైన వేదిక ● న్యాయమూర్తి వై జయప్రసాద్సిద్దిపేటకమాన్: క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్అదాలత్ సరైన వేదిక అని సిద్దిపేట ఇన్చార్జి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి వై జయప్రసాద్ అన్నారు. సిద్దిపేట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా న్యాయమూర్తులు పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జయప్రసాద్ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో 4,274 క్రిమినల్, 32 సివిల్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. 9 మోటారు ప్రమాద కేసులలో రూ.1,29,62,000 బాధితులకు ఇప్పించామన్నారు. మొత్తం 4,315 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. లోక్ అదాలత్లో కేసు రాజీ అయితే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోకుండా లోక్ అదాలత్లో కేసును పరిష్కరించుకుంటే సమయం ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి సెక్రటరీ, న్యాయమూర్తి మిలింద్ కాంబ్లె, న్యాయమూర్తులు సంతోష్కుమార్, సాధన, తరణి, వన్టౌన్ సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ ఉపేందర్, త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, రూరల్ సీఐ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజీమార్గంతో ఇద్దరూ గెలిచినట్లే: జడ్జి రేవతి హుస్నాబాద్: పట్టణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్కు అనూహ్య స్పందన లభించింది. హుస్నాబాద్లోని కోర్టు హాలులో జరిగిన జాతీయ లోక్ అదాలత్కు ప్రిన్సిపల్ సివిల్ కోర్టు జూనియర్ న్యాయమూర్తి రేవతి అధ్యక్షత వహించారు. ఇరువర్గాల రాజీతో మొత్తం 361 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..పలు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఇద్దరు గెలిచిన వారవుతారని న్యాయమూర్తి రేవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీపీ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, న్యాయవాదులు కన్నోజు రామకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు. -
మనుచౌదరి రిలీవ్
బాధ్యతలు చేపట్టనున్న నూతన కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: జిల్లాకు నూతన కలెక్టర్గా హైమావతి రానుండటంతో.. ఇప్పటివరకు కలెక్టర్గా విధులు నిర్వహించిన మిక్కిలినేని మనుచౌదరి శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఈ మేరకు శనివారం నూతన కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.రక్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం సిద్దిపేటజోన్: ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో నాల్గవ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడాశాఖాధికారి (డీవైఎస్ఓ)వెంకట్ నర్సయ్య తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని క్రీడా పాఠశాలల్లో 2025–26 సంవత్సరానికి గాను నాల్గో తరగతిలో విద్యార్థిని, విద్యార్థులకు అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారన్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మండల స్థాయిలో ఎంపికలు నిర్వహిస్తారన్నారు. ఎంపికై న వారికి ఈనెల 24న జిల్లా స్థాయిలో ఎంపిక ఉంటుందన్నారు. ఆయా క్రీడా పాఠశాలల్లో మొత్తంగా 40 చొప్పున 120 సీట్లు ఉన్నాయని, వీటిలో 60 బాలికలకు, 60 బాలురులకు కేటాయించారన్నారు. ఆసక్తిగల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లోనే అత్యుత్తమ బోధన డీఈఓ శ్రీనివాస్రెడ్డి చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ విద్యా బోధన అందుతుందని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అల్లీపూర్ కేజీబీవీలో విద్యార్థినులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, రెండు జతల స్కూల్ డ్రెస్లు, మధ్యాహ్న భోజనం, అన్ని విధాల సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పించి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. అనంతరం కమ్మర్లపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదవరెడ్డి, కేజీబీవీ స్పెషలాఫీసర్ నీలిమ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ను కలిసిన ప్రతాప్రెడ్డి గజ్వేల్రూరల్: ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్రావును కలవగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్లో అన్నదాన కార్యక్రమంతో పాటు కేక్ను కట్చేసి వేడుకలను నిర్వహించి ప్రతాప్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్దిపేటకమాన్: యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్ రేవతి తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రారంభించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలుష్యాల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచానికి భారతీయ యోగా ఆదర్శంగా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
బలి్దయాలో కేటుగాళ్లు
సిద్దిపేటజోన్: జిల్లాలో సైబర్ మోసాలు నిత్యకృత్యంగా మారాయి. ఒక్కొక్క రీతిలో మోసగాళ్ల వలలో అమాయకులు చిక్కుకుంటున్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నా నేరాలు ఆగడం లేదు. సైబర్ కేటుగాళ్లు ప్రస్తుతం సిద్దిపేట బల్దియాపై కన్నేశారు. ట్రేడ్ లైసెన్స్ బకాయిలు, రెన్యువల్ పేరిట ఫేక్ స్కానర్తో నయా దందాకు తెర తీశారు. జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న కేటుగాళ్ల మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. మున్సిపల్ కమిషనర్ పేరిట ఫేక్ కాల్స్ రావడం, అనుమానం వచ్చి బల్దియాలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. కమిషనర్ పేరిట ఫేక్ కాల్స్.. సైబర్ కేటుగాళ్ల దృష్టి బల్దియాలోని పన్నుల చెల్లింపు మీద పడింది. బడా వ్యాపార సంస్థలు ప్రతి ఏటా ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూపంలో మున్సిపాలిటీకి డబ్బులు చెల్లించడాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకు అనుగుణంగా మున్సిపల్ కమిషనర్ పేరిట ఫోన్ చేసి మీ దుకాణం.. వ్యాపార సంస్థలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయిలు ఉన్నాయని.. రిన్యూవల్ ఫీజు చెల్లించాలంటూ.. లేని పక్షంలో జరిమానా పడుతుందని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకదశలో స్కానర్ను పంపించి దాన్ని స్కాన్ చేసి డబ్బులు కట్టాలని బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రైతుబజార్ పరిసరాల్లోని ఒక ఆస్పత్రికి చెందిన మెడికల్ షాప్నకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని 7780110865 నంబర్ ద్వారా కాల్ వచ్చింది. మున్సిపల్ కమిషనర్ అంటూ కాల్ రావడంతో అనుమానం వచ్చి ఆయన నేరుగా బల్దియా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదే తరహాలో పట్టణంలోని ఒక ఆయిల్ మిల్లు వ్యాపారితో పాటు పలువురు వ్యాపారులకు స్కానర్తో మోసం చేసే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. ఇటీవల ఒక బార్ అండ్ రెస్టారెంట్కు సైబర్ మోసగాళ్లు మున్సిపల్ పేరిట ఫోన్ చేసి రూ. 2,500 వసూలు చేసినట్లు వెలుగుచూసింది. ప్రస్తుతం పట్టణంలో మున్సిపల్ అధికారుల పేరిట ఫేక్ కాల్స్ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.నయా సైబర్ దందా ట్రేడ్ లైసెన్స్ బకాయిలంటూ కాల్స్ మున్సిపల్ కమిషనర్ పేరిట బురిడీ! సైబర్ మోసగాళ్ల వలలో పలువురు అప్రమత్తంగా ఉండాలంటున్నఅధికారులుఅప్రమత్తంగా ఉండాలి సైబర్ మోసగాళ్ల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. పట్టణంలో వస్తున్న ఫోన్ కాల్స్ తన దృష్టికి వచ్చింది. మున్సిపల్ కార్యాలయంలో, అధికారులకు మాత్రమే ట్రెడ్ లైసెన్స్, ఇతర పన్నులకు సంబంధించి డబ్బులు చెల్లించి రశీదు పొందాలి. ఫేక్ కాల్స్పై సైబర్ క్రైమ్, పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నాం. ప్రజలకు ఫేక్ కాల్స్ వస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. – ఆశ్రిత్ మున్సిపల్ కమిషనర్, సిద్దిపేటపెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలున్నాయి. మున్సిపల్ నిబంధనల మేరకు ప్రతి ఏటా వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. అందుకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు కొన్ని రోజులుగా పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. ప్రతి వ్యాపార, వాణిజ్య సంస్థ నిబంధనల మేరకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ రికార్డుల ప్రకారం పట్టణంలో సుమారు ఐదు వేలపై చిలుకు వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్స్ పొందినట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్యే పల్లా త్వరగా కోలుకోవాలని..
చేర్యాల(సిద్దిపేట): మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో ఇటీవల ప్రమాదవశాత్తు జారిపడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. స్థానిక 3వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు భూమిగారి రాజేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు చేర్యాల నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పాదయాత్రను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య ప్రారంభించారు. శనివారం ఉదయం లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు. పాదయాత్రగా వెళ్లిన వారిలో భూమిగారి విజయ్, పుట్ట యశ్వంత్, కల్లాటి విశ్వతేజ ఉన్నారు. ప్రారంభ కార్యక్రమంలో పార్టీ చేర్యాల మండల అద్యక్షుడు అనంతుల మల్లేశం, నాయకులు నాచగొని వెంకటేష్, ఎర్రోళ్ల రామచంద్రం, పుర్మ వెంకట్రెడ్డి, మంచాల కొండయ్య. ఏర్పుల మహేష్ పాల్గొన్నారు.చేర్యాల నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర -
మార్పు వెనుక మతలబేమిటో!
ముప్పును ముందే చెబుతాయి వాతావరణానికి సంబంధించిన వివరాలు అందించే ప్రత్యేక యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వివరాలు 8లో uవిద్యార్థులకు రక్షణ కరువు పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో పాములు ప్రత్యక్షమవుతున్నాయి. వివరాలు 9లో uశనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి మార్పుపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బాధ్యతల నుంచి కొండా సురేఖను తప్పించి కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్ వెంకటస్వామిని ఇన్చార్జి మంత్రిగా నియమిస్తూ గురువారం ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే కొండా సురేఖ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతోపాటు, ఇటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో ఇన్చార్జి మంత్రిది కీలక బాధ్యత ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన ఏడు చోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్న జిల్లాలో ఇన్చార్జి మంత్రి పాత్ర మరింత కీలకం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను, కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో కీలకమైన ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖను మార్చడం వెనుక కారణమేమై ఉంటుందోననే దానిపై చర్చ జరుగుతోంది. కలకలం రేపిన వేర్వేరు సమీక్షలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి కొండా సురేఖలు ఒకే అంశాలపై ఒక్క రోజు వ్యవధిలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం అధికార వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్ పనుల సమాయత్తం వంటి అంశాలపై ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులు సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన విషయం విదితమే. ఈ ఆదేశాల మేరకు పక్షం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సంగారెడ్డిలో జరిగింది. మీడియాను అనుమతించకుండా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి ఇద్దరు మంత్రులు హాజరైనప్పటికీ.. కేవలం కొండా సురేఖ మాత్రమే సమీక్షలో మాట్లాడారని తెలిసింది. ఈ సమీక్ష జరిగిన 24 గంటలు గడవకముందే దామోదర రాజనర్సింహ ఇవే అంశాలపై జిల్లా పరిషత్లో మరోసారి సమీక్షలు నిర్వహించారు. ఇలా కొండా సురేఖ సమీక్షించిన అంశాలనే ఒక్క రోజు కూడా గడవక ముందే దామోదర సమీక్షించడం అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇలా జిల్లా మంత్రితో పొసగక పోవడంతోనే ఇన్చార్జి మంత్రి మారారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను కై వసం చేసుకోవాలంటే పకడ్బందీగా కార్యాచరణ అవసరం ఉంటుంది. ఇన్చార్జిగా బాధ్యతల్లో ఉంటే ఈ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం కుదరకపోవచ్చనే కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.న్యూస్రీల్ఆ నియోజకవర్గాల్లో కీలకం ఇన్చార్జి మంత్రిగా నియమితులైన వివేక్కు ఒకవిధంగా ఈ బాధ్యతలు సవాలుగానే కనిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికంగా ఉండడంతో పార్టీ కేడర్ను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమన్వయం కీలకం. చర్చనీయాంశంగా మారిన ఇన్చార్జి మంత్రి మార్పు నిర్ణయం కొండా సురేఖను తప్పించి వివేక్ నియామకం ఆ నియోజకవర్గాల్లో కేడర్ సమన్వయంవివేక్కు సవాలే -
800 ఏళ్ల పురాతన విగ్రహాన్ని కాపాడుదాం
సిద్దిపేటఅర్బన్: గ్రామ చరిత్రకు లిఖిత పూర్వక ఆధారమైన పురాతన విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరులో 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన మారకమ్మ విగ్రహం ఎలాంటి రక్షణ లేకుండా ఉండటంతో శుక్రవారం పరిశీలించారు. కాకతీయుల కాలంలో 1225 జూన్ 14న వెల్కటూరు గ్రామంలో మారకమ్మ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు విగ్రహం పీఠంపై చెక్కి ఉందన్నారు. గతంలో రోడ్డు పక్కన భూమిలో కూరుకొని ఉండేదని, గుడి కట్టడం కోసం బయటకు తీసిన విగ్రహం ముక్కు భాగంలో ధ్వంసం కావడంతో ప్రతిష్ఠించకుండా అలాగే వదిలేశారని, ఇప్పటికై నా విగ్రహానికి నీడ కల్పించాలని కోరారు. -
జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసిన నర్సారెడ్డి
గజ్వేల్రూరల్: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నూతనంగా నియమితులైన గడ్డం వివేక్ వెంకటస్వామిని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఇన్చార్జి మంత్రి వివేక్కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో సత్తా చాటేలా కృషి చేయాలని, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని వివేక్ వెంకటస్వామి సూచించినట్లు నర్సారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దూల్మిట్ట మండలం జాలపల్లిలో రైతుకు తెలియకుండానే పొలం నుంచి అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. సమీప రైతులు ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇలా తవ్వడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయని రైతులు
మోయతుమ్మెద వాగు పరిసర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అన్నరీతిలో ఇసుకను తరలిస్తున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు ట్రాక్టర్లు పోటాపోటీగా వెళ్తున్నాయి. అక్రమార్కులకు ఇసుక దందా కాసుల పంట పండిస్తోంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ఇసుక తవ్వు తున్నారు. అధికారులకు తెలిసినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. జోరుగా దందా కోహెడ మండలంలోని మోయతుమ్మెద వాగులో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. వాగు పరిసర గ్రామాలైన తంగళ్లపల్లి, బస్వాపూర్, వింజపల్లి, రాంచంద్రాపూర్, వరికోలు.. అలాగే ఎల్లమ్మవాగు నకిరేకొమ్ముల, నారాయణపూర్, నంగనూరు మండలం ఖాతా, అక్కెనపల్లి, ఘన్పూర్, దూల్మిట్ట మండలం అర్జునపట్ల, జాలపల్లిలో ఈ దందా జోరుగా సాగుతోంది. రోజూ టన్నుల కొద్దీ ఇసుక హుస్నాబాద్, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్కు ట్రాక్టర్లు, బొలెరో, లారీల్లో తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.4,500 నుంచి రూ.5వేల వరకు విక్రయిస్తున్నారు. స్థానిక వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు దృష్టి సారించడంలేదు. మామూళ్లకు అలవాటుపడి అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమకేవరూ అడ్డు అన్నట్లుగా ఇసుక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత అధికారుల నుంచి సమాచారం వస్తే తప్ప ఇసుక డంప్లను సీజ్ చేయడం లేదని విశ్వసనీయ సమాచారం. పలు చోట్ల వేలం పాట పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు పలు మార్లు ఇసుక డంపులను సీజ్ చేస్తున్నారు. పలు చోట్ల వేలం పాట నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల వదిలేస్తుండటంతో అక్రమార్కులు అధికారుల కళ్లుగప్పి తరలిస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక వాగుల సమీపంలో ఉన్న భూములలో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నాం లోకల్ ఇసుకపై జీఓ 3 ప్రకారం స్థానిక తహసీల్దార్, పోలీస్లకు అధికారం ఉంటుంది. వాహనాల్లో తరలిస్తుంటే సీజ్ చేసే అధికారం మైనింగ్ శాఖకు ఉంది. ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నాం. – లింగుస్వామి, ఏడీ, మైన్స్దూల్మిట్ట మండలం జాలపల్లిలో ఇసుకను తవ్వుతూ ట్రాక్టర్లలో లోడ్ చేస్తున్న కార్మికులుసీజ్ చేసిన వివరాలిలా.. కోహెడ పోలీసులు తంగళ్లపల్లి, అరేపల్లి గ్రామాల్లో ఏప్రిల్ నెలలో 95టన్నుల ఇసుక డంప్ను సీజ్ చేశారు. దీనిని తహసీల్దార్కు అప్పగించారు. మే 20న దూల్మిట్టలో 100ట్రాక్టర్ల ఇసుకను పట్టుకున్నారు. అలాగే జాలపల్లి, వీరబైరాన్పల్లిలలో ఇసుక డంప్లను ఇటీవల అధికారులు సీజ్ చేశారు. ఇలా పట్టుబడుతున్నా.. కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇసుకాసురులకు అవకాశంగా తీసుకుని ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. -
కంప్యూటర్ విద్యలోనూ రాణించాలి
హుస్నాబాద్: ప్రతి విద్యార్థి కంప్యూటర్ విద్యలోనూ ప్రావీణ్యత సాధించాలని మంత్రి పొన్నం అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ ల్యాబ్లో మెలకువలు నేర్చుకోవాలన్నారు. పాఠశాలలో ఎలాంటి నియామకాలు అవసరమో సిద్ధం చేసి, పాఠశాలకు పెయింటింగ్ వేయించాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం అందించాలన్నారు. -
రేషన్.. నో స్టాక్
రేషన్ షాప్లలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మూడు నెలలకు సంబంధించినరేషన్ బియ్యంను జూన్ 1 నుంచి ఒకే సారి ఇస్తుండటంతో పలు రేషన్ షాప్లలో స్టాక్ అయిపోతున్నాయి. దీంతో సన్న బియ్యం వస్తాయా రావా అని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల బియ్యంకు థంబ్లు తీసుకోవడం కొంత ఆలస్యం అవుతోంది. రేషన్ షాప్లకు త్వరగా బియ్యం సరఫరా చేసి లబ్ధిదారులకు అందించాలని కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేటజిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులు 2,98,985 ఉండగా సన్న బియ్యం 18,286.455 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇప్పటి వరకు మండల లెవెల్ స్టాక్ పాయింట్(ఎంఎల్ఎస్)ల నుంచి రేషన్ షాప్లకు 12,274.302 మెట్రిక్ టన్నుల బియ్యం చేరుకున్నాయి. 1,28,684 కార్డుదారులు 7,469.34 మెట్రిక్ టన్నుల బియ్యంను తీసుకున్నారు. పలు రేషన్ షాప్లలో4,894.26 మెట్రిక్ టన్నుల బియ్యం స్టాక్ ఉన్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 6,012.15 మెట్రిక్ టన్నుల బియ్యం చేరాలి. ఇంకా 1,70,301 కార్డుదారులు బియ్యం తీసుకోవాల్సి ఉంది. 283 రేషన్ దుకాణాల్లో.. జిల్లాలో సన్న ధాన్యం ఎక్కువగా కొనుగోలు కేంద్రాలలో విక్రయించకపోవడంతో నిజామాబాద్ నుంచి సన్న బియ్యంను సరఫరా చేస్తున్నారు. దీంతో సరఫరా చేయడం కొంత ఆలస్యమవుతోంది. అలాగే రేషన్ షాప్లు చిన్న చిన్న గదుల్లో ఉండటంతో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం స్టాక్ ఒకే సారి దించుకునేందుకు చోటు లేకపోవడం కూడా మరో కారణం. రేషన్ బియ్యం స్టాక్ లేకపోవడంతో షాప్లు తెరవడం లేదు. జిల్లాలో 682 రేషన్ షాప్లకు గాను గురువారం 283 రేషన్ దుకాణాల్లో మాత్రమే సరఫరా అందజేశాయి. మిగతా 399 రేషన్ షాప్లు తెరచుకోలేదు. కార్డుదారులు రేషన్ షాప్ల చుట్టూ తిరుగుతున్నారు. జూన్ 1 నుంచి 29వ తేదీ వరకే మూడు నెలల సన్న బియ్యం ఇస్తామని ముందుగానే అధికారులు ప్రకటించారు. దీంతో ఈ నెలలో బియ్యం తీసుకోకపోతే మూడు నెలల బియ్యం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంట వెంటనే స్టాక్ తెప్పించి పంపిణీ చేయాలని కోరుతున్నారు. మూడు మార్లు వచ్చా.. బియ్యం కోసం ఇప్పటి వరకు మూడు మార్లు వచ్చా. రెండు సార్లు మంది ఎక్కువగా ఉంటే ఇంటికి వెళ్లాను. మళ్లీ ఈ రోజు వస్తే బియ్యం స్టాక్ లేదని షాప్ బంద్ చేసి ఉంది. నేను లారీ డ్రైవర్ను. రేషన్ బియ్యమే తింటాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంపిణీ చేసేలా చూడాలి. – యూసుఫ్, సిద్దిపేటరోజుకు 20 ట్రక్కుల్లో.. జిల్లాకు నిజామాబాద్ నుంచి రేషన్ బియ్యం వస్తున్నాయి. రోజుకు 20 ట్రక్కుల్లో ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరుతున్నాయి. వాటిని రేషన్ దుకాణాల వారీగా సరఫరా అవుతున్నాయి. ఒక రౌండ్ 100శాతం పూర్తయింది. మరో రెండు, మూడు రోజుల్లో అన్ని దుకాణాలకు సరఫరా చేస్తాం. ఇప్పటి వరకు 54శాతం మంది బియ్యం తీసుకున్నారు. – తనూజ, డీఎస్ఓ తెరచుకోని 399 దుకాణాలు ఇప్పటి వరకు 12వేల మెట్రిక్ టన్నుల బియ్యం రాక ఇంకా 1.70లక్షల మందికిఅందని వైనం ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు త్వరగా పంపిణీ చేయాలని విన్నపాలు -
కొత్త కలెక్టర్గా హైమావతి
సాక్షి, సిద్దిపేట: జిల్లా కలెక్టర్గా కే హైమావతి నియమితులయ్యారు. మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టర్గా మిక్కిలినేని మనుచౌదరి బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా కే హైమావతి విధులు నిర్వర్తిస్తుండగా జిల్లాకు కలెక్టర్గా వస్తున్నారు. 15 నెలల పాటు జిల్లాకు సేవలు.. గతేడాది ఫిబ్రవరి 24న కలెక్టర్గా మనుచౌదరి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 15 నెలల పాటు జిల్లాకు సేవలు అందించారు. సౌమ్యుడు, మృదు స్వభావిగా గుర్తింపు పొందారు. క్షేత్రస్థాయి సందర్శనలు.. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి అధికారులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేశారు. పాలనలో విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నిత్యం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ జిల్లాను అభివృద్ధి వైపు తీసుకెళ్లారు. కలెక్టర్గా బాధ్యతలు తొలి జిల్లా అయినప్పటికీ యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించారు. మనుచౌదరి బదిలీ.. నిత్యం ప్రజలతో మమేకమై పని చేసిన మిక్కిలినేని -
అన్నదానం చాలా గొప్పది
● ఎమ్మెల్యే హరీశ్రావు ● అమర్నాథ్కు సరుకుల లారీప్రశాంత్నగర్(సిద్దిపేట): అన్నదానానికి మించిన మరో దానం లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో యాత్రికులకు అన్నదానం కోసం సరుకుల లారీని గురువారం జిల్లా కేంద్రంలోని హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు శరబేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నం ప్రరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆకలితో ఉన్నవాడికి అన్న పెట్టినప్పుడు దొరికే తృప్తి మరెక్కడా దొరకదన్నారు. ఎముకలు కొరికే చలిలో వేడి వేడిగా పట్టెడు అన్నం దొరికితే అది అమృతంలా భావిస్తారన్నారు. కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి, అమర్నాథ్ అన్నదాన సేవ సమితి చేసిన కార్యక్రమాలు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు. సేవాతత్వంలో సిద్దిపేట పేరు దేశమంతా వినపడాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్, అమర్నాథ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో పోటీ పడాలి..సిద్దిపేటజోన్: ఈ పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు పోటీ పడాలని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షటిల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపు పూర్తి చేసుకున్న వారితో ముచ్చటించారు. హరీశ్రావు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే క్రీడలు, యోగా, చదువు అనేవి ముఖ్యమన్నారు. సిద్దిపేటలో క్రీడలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించి క్రీడా హబ్ గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగం కార్యాలయాన్ని ప్రారంభించారు.మంత్రివర్గంలో యాదవులకు చోటేది ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గంలో యాదవులకు చోటు లేకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారరాలు, అభినందన కార్యక్రమంలో హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి కుల సంఘాలు కృషి చేయాలన్నారు. కుల సంఘాలు విద్యా ర్థులను ప్రోత్సహించాలన్నారు. యాదవ విద్యార్థులు యాదవ జాతి గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేయాలన్నారు. యాదవులకు హైదరాబాద్లో ని కోకాపేటలో కేసీఆర్ ఆత్మ గౌరవ భవనాలు నిర్మించారన్నారు. రేవంత్ రెడ్డి యాదవులకు గోర్లు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని వెటర్నరీ ఆస్పత్రులలో పాడి పశువులకు మందులు లేవన్నారు. పాఠశాలలు ప్రారంభమైనా విద్యాశాఖకు ఇంకా మంత్రి లేరని విమర్శించారు. -
ఆయిల్పాం సాగు లక్ష్యం చేరాలి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ లో ఆయిల్ ఫెడ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం సాగు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నందునా జిల్లాకు ఇచ్చిన 6,500ఎకరాల లక్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాలలో కలెక్షన్ సెంటర్ గుర్తించామని, మార్కుక్, హుస్నాబాద్ ప్రాంతాల్లో కూడా కలెక్షన్ సెంటర్ కోసం స్థల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. పెద్ద భూస్వాములనే కాకుండా చిన్న, సన్న కారు రైతులను కూడా ఆయిల్ పాం వైపు మళ్లించాలన్నారు. అంతకుముందుగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 12,339 ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతుందని తెలిపారు. ఆయిల్పాం పంట 955 టన్నుల గెలలు కటింగ్ చేసి ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీకి పంపినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, ఉద్యాన శాఖ అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులకు దిశానిర్దేశం -
పాఠశాలలకు పూర్వవైభవం తెస్తాం
సిద్దిపేటఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేందుకే అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి, సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు వచ్చేందుకే కస్తూర్బా, మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్ అన్ని ముందస్తుగానే అందిస్తున్నామన్నారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను కూడా పెంచి విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో విశ్వాసంతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారని మంత్రి తెలిపారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదవాలని అన్నారు. కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అన్ని రకాల వసతులను అందజేసేలా కృషి చేస్తున్నామని, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, డీఈఓ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పిస్తున్నాం విద్యార్థులు కష్టపడి చదివిఉన్నత స్థాయికి చేరాలి మంత్రి పొన్నం ప్రభాకర్ఐక్యంగా బలోపేతం చేద్దాం అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేటలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ(కేజీబీవీ) భవనం, రేగొండలో మూడపడిన ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలుగేళ్లుగా మూతపడిన పాఠశాలను తిరిగి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను అందజేశారు. రేగొండను విలీనం చేస్తాం అక్కన్నపేట మండలంలో ఉన్న రేగొండ గ్రామాన్ని హుస్నాబాద్లో విలీనం చేస్తానని మంత్రి తెలిపారు. రేగొండ నుంచి అక్కన్నపేటకు వెళ్లాలంటే దూరంగా ఉంటుందని, హుస్నాబాద్కు మాత్రం చాలా దగ్గరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో అవగాహన లేక పోవడంతో ఇష్టానుసారంగా కలపారన్నారు. -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
సిద్దిపేటకమాన్: లోక్ అదాలత్లో సత్వర న్యాయం జరుగుతుందని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సివిల్, క్రిమినల్, రోడ్డు ప్రమాద, కుటుంబ పరమైన కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ నెల 14న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నందున కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి రాజీపడేట్లు చూడాలన్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని అన్నారు.‘భగీరథ’ కోసం రోడ్డెక్కిన మహిళలుఖాళీ బిందెలతో నిరసనమర్కూక్(గజ్వేల్): మిషన్ భగీరథ నీరు 15 రోజులుగా రాకపోవడంతో మహిళలు రోడ్డెక్కారు. మండలంలోని వర్దరాజ్ పూర్లో ఖాళీ బిందెలతో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు రాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. బోరు బావుల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఒక్క మోటారు కాలిపోవడంతో బాగు చేయించేవారే కరువయ్యారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే భగీరథ నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.సిద్దిపేట అభివృద్ధికి రూ.2.60 కోట్లుప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.60కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 9 కొత్త గ్రామపంచాయతీల కోసం రూ.1 80కోట్లు, 10 కొత్త అంగన్వాడీలకు రూ.80 లక్షలు నిధులు విడుదలయ్యాయన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు బొమ్మల యాదగిరి, రాష్ట్ర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.అన్ని వర్గాల సంక్షేమమే బీజేపీ ధ్యేయంఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డిప్రశాంత్నగర్(సిద్దిపేట): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలో అనేక అద్భుతాలు జరిగాయని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పీఎం మోదీ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. రైతులకు అండగా నిలిచేది బీజేపీయేనన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధిచెందుతున్నాయన్నారు. ప్రతీ కార్యకర్తల కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూదిశ్రీకాంత్రెడ్డి, రాంచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు శంకర్, సిద్దిపేట పట్టణ అధ్యక్షులు వెంకట్, సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బడులను బతికించారు
సరికొత్తగా ఆహ్వానించేలా..తల్లులకు బొట్టుపెట్టి..అక్కన్నపేట(హుస్నాబాద్): ఎట్టకేలకు మూతబడిన పాఠశాలల తలుపులు తెరుచుకోనున్నాయి. గత ఏడాది విద్యార్థులు లేక బడులకు తాళం వేశారు. ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ చూపి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో విద్యార్థులు చేరారు. మండలంలో మొత్తం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 65, ఉన్నత పాఠశాలలు 9, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ), గిరిజన బాలికల గురుకులం ఉన్నాయి. ఇందులో గత ఏడాది 13 ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు లేక మూసివేశారు. ఈ నేపథ్యంలో మండల విద్యాధికారి రంగానాయక్, ఉపాధ్యాయులందరూ ఇంటింటా బడిబాట కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో రేగొండలోని ప్రాథమిక పాఠశాలలో ఏకంగా 35మంది విద్యార్థులు చేరారు. అలాగే కెప్టన్ చౌడుతండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు ప్రవేశాలను పొందారు. ఈ క్రమంలో గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రేగొండ, కెప్టన్ చౌడుతండా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం చేయనున్నారు. అలా గే ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకున్న కేజీబీవీ భవనాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు.కొండపాక(గజ్వేల్): సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సరికొత్త పద్ధతులతో ఆహ్వానం పలకనున్నారు. ఈ మేరకు హెచ్ఎం జయప్రకాశ్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు రూ.4 లక్షలతో పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు స్పోర్ట్స్ జతలు, అలాగే స్వచ్ఛమైన మంచి నీరు అందేలా మినీ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. సిద్దిపేట, కొండపాక, దుద్దెడలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే సుమారు 70 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో చేరేలా హెచ్ఎం కృషి చేశారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 210కి చేరింది. ప్రారంభం రోజున పాఠశాల నూతన శోభ సంతరించుకోనుంది.హుస్నాబాద్రూరల్: అంగన్వాడీలకు చిన్నారులను పంపించాలని కోరుతూ బుధవారం పందిల్ల, పొట్లపల్లి గ్రామాల్లో టీచర్లు ఇంటింటికీ తిరిగి పిల్లల తల్లులకు బొట్టుపెట్టి పలకరించారు. ఈ సందర్భంగా సీడీపీఓ జయ మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్యతోపాటు ఆటపాటలు, పౌష్టికాహారం ఇస్తున్నట్లు తెలిపారు. ఆలాగే వారంలో రెండు రోజులు ఎగ్ బిర్యానీ కూడా పెడుతున్నట్లు చెప్పారు. అంగన్వాడీల బలోపేతమే లక్ష్యమన్నారు. రేగొండ, కేప్టన్ చౌడుతండాలో తెరుచుకోనున్న పాఠశాలలు నేడు మంత్రిచే పునఃప్రారంభం -
ఏరువాక సంబురం
పందిల్లలో నాగలిపట్టి పొలం దున్నుతున్న మంత్రి పొన్నంజిల్లాలో ఏరువాక సాగు సంబరాలు ఘనంగా చేపట్టారు. మృగశిర కార్తెలో వచ్చే ఏరువాక పౌర్ణమికి కొత్త సాలు మొదలు పెడితే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల నమ్మకం. పందిల్లలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులతో కలిసి నాగలి పట్టారు. విత్తనాలు వేశారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. అలాగే అక్కన్నపేట మండలం బోరింగ్తండాలో రైతులతో కలిసి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) శ్రీలత పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టి సాగు పనులను ప్రారంభించారు.– హుస్నాబాద్రూరల్/ అక్కన్నపేట(హుస్నాబాద్) -
10,400 ఎకరాల్లో పరికరాలు అవసరం
జిల్లాలో ఈసారి కొత్తగా 10,400 ఎకరాల్లో డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటుచేయడం లక్ష్యం. ఇందులో భాగంగానే 6,500ఎకరాల్లో ఆయిల్పామ్, 2,700ఎకరాల కురగాయలు, పండ్ల తోటలు, మరో 1,200 ఎకరాల్లో ఇతర పంటలకు స్ప్రింకర్లను అందించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉద్యాన శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. గతేడాది ప్రభుత్వం జిల్లాలోని కూరగాయతోటల్లో డ్రిప్పు పరికరాల కోసం రూ. 5.39కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో 1112.5ఎకరాల్లో డ్రిప్ విస్తరించాలని కూడా టార్గెట్ నిర్దేశించారు. ఇకపోతే స్ప్రింకర్ల కోసం రూ. 97లక్షలు మంజూరు చేసింది. ఈ లెక్కన జిల్లాలో 516 యూనిట్లకు మాత్రమే పరికరాలు అందించే అవకాశం కలిగింది. పండ్ల తోటలకు కంటితుడుపుగా కేవలం 19ఎకరాల్లో డ్రిప్ కోసం రూ.40లక్షలు మాత్రమే మంజూరయ్యాయి. కాగా ఆయిల్పామ్కు మాత్రం పెద్దపీట వేస్తూ.. 4వేల ఎకరాల్లో విస్తరణకు రూ.7.85కోట్లు మంజూరయ్యాయి. ఈసారి నిధులు భారీగా పెరిగితే రైతుల అవసరాల తీరే అవకాశముంది. ప్రత్యేకించి ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన సిద్దిపేట లాంటి జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు డ్రిప్, స్ప్రింక్లర్లకు బడ్జెట్ను పెంచాల్సి ఉంది. ఇక్కడి నుంచి కురగాయలు దేశంలోని ప్రముఖ నగరాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి కురగాయలకు ఈ ప్రాంతామే ప్రధాన ఆధారం. ఈనేపథ్యంలో జిల్లాలో సాధారణ పంటలకు ధీటుగా కూరగాయలు, పండ్ల తోటలు సాగవుతుండటం వల్ల పరికరాల కోసం ఏటా రైతులు వేలల్లో దరఖాస్తులు అందిస్తున్నారు. అయినా నిధులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.డిమాండ్ ఎక్కువే.. ఈ అంశంపై జిల్లా ఉద్యాన శాఖాధికారి సువర్ణ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతుల నుంచి డ్రిప్, స్ప్రింక్లర్లకు భారీగా డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే కేటాయింపుల మేరకు ప్రాధాన్యత క్రమంలో పరికరాలు అందించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. -
వరలక్ష్మి నీకు ఇదేం బుద్ధి..!
మనోహరాబాద్(తూప్రాన్): వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బైక్పై ఎక్కించుకుని ఆభరణాలతో ఉడాయించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ వివరాలు వెల్లడించారు. తూప్రాన్ మండలం కొప్పులపల్లి గ్రామానికి చెందిన బాదనపురం పెంటయ్య(30) మండలంలోని వట్టూర్ గ్రామానికి చెందిన వరలక్ష్మి(30)తో సహజీవనం చేస్తున్నాడు. కాగా నిందితుడికి భార్యాపిల్లలు ఉన్నారు. నిందితుడు ఆన్లైన్ గేమ్స్కు బానిసై ఈ క్రమంలో లోన్లు సైతం తీసుకున్నాడు. అప్పులు ఎక్కువ అవ్వడంతో తీర్చేందుకు చోరీలు చేస్తున్నాడు. గత సంవత్సరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ పల్సర్ బైక్ను చోరీ చేసి ఆంధ్రాకు చెందిన నంబర్ ప్లేట్ అమర్చాడు.ఈ నెల 7న సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మన్నె రామవ్వ పాములపర్తికి వెళ్లేందుకు గజ్వేల్ బస్టాండులో ఉంది. నిందితులు వరలక్ష్మి వృద్ధురాలికి మాయమాటలు చెప్పి పెంటయ్యతో కలిసి బైక్ౖపై తీసుకొని పర్కిబండ సమీపంలోని ఓ గుడిలోకి వెళ్లి మద్యం తాగారు. కాగా వృద్ధురాలు మత్తులోకి జారుకోగానే ఆమె ఒంటిపై ఉన్న తులం బంగారు నల్లపూసల తాడు, చెవికమ్మలు, 50 తులాల వెండి కడియాలు చోరీ చేశారు. వృద్ధురాలు అరవగా చంపుతామని బెదిరించి పరారయ్యారు. వెంటనే వృద్ధురాలు మనోహరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం దండుపల్లి వద్ద వాహనాల తనిఖీలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బంది గోవర్ధన్రావు, రాధాకృష్ణ, భిక్షపతిలను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ పేర్కొన్నారు. -
పిల్లల బంగారు భవిష్యత్తే ముఖ్యం
● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ● కలెక్టరేట్లో అధికారిక దత్తత సిద్దిపేటరూరల్: అధికారికంగా దత్తత తీసుకున్న దంపతులు పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలువురి దంపతులకు చిన్నారులను అదనపు కలెక్టర్ మంగళవారం అధికారికంగా దత్తత అందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లలని బాగా చదివించాలని, వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలన్నారు. పిల్లల బంగారు భవిషత్కు బాటలు వేసే పూర్తి బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే సిద్దిపేటలోని శిశు గృహ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తద్వారా ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని, అదే విధంగా ఎవరైనా అక్రమ దత్తత తీసుకున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎ.లక్ష్మీకాంత్ రెడ్డి, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ మమత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, శిశు గృహ సోషల్ వర్కర్ రాజారామ్, తదితరులు పాల్గొన్నారు.నాణ్యమైన వస్తువులే సరఫరా చేయాలిప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు సరఫరా చేసే వస్తువుల విషయంలో నాణ్యమైన వస్తువులనే సరఫరా చేయాలని, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందించనున్న వస్తువుల టెండర్లను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అందించే మటన్, చికెన్, ఇతర అహార వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గడువుదాటిన వస్తువులు టెండర్దారులు వసతి గృహాలకు సరఫరా చేయరాదని, ఒక వేళ చేసినా వసతి గృహ నిర్వాహకులు తిప్పి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టెండర్దారులు పాల్గొన్నారు. -
ఫలించిన పోరాటం
ఎస్టీ జాబితాలోకి నక్కల కులస్తులుఆనందంగా ఉంది మా కులానికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు లేక చాలా నష్టోయాం. రిజర్వేషన్లు లేకపోవడంతో మా పిల్లలు ఉన్నత విద్య, ఉద్యోగాలకు దూరమయ్యారు. ఇన్నాళ్లకు తమ కులాన్ని గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చడం ఆనందంగా ఉంది. మాకు అండగా నిలిచిన సామాజిక సమరసత వేదికకు రుణపడి ఉంటాం. – తుమ్మల రాజు,చిన్న ముత్యంపేట అన్ని రంగాల్లో రిజర్వేషన్లు నక్కల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న జనాభాకు న్యాయం జరిగింది. ఇకనుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులమయ్యాం. పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుంటాం. – కాలియ యాదగిరి, సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తరతరాలుగా సంచార జీవనం సాగిస్తున్న నక్కల (పిట్టల) కులస్తుల ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. ప్రభుత్వం నక్కల కులస్తులను తాజాగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చింది. ఇక నుంచి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందనున్నాయి. అడవులు, గ్రామశివారుల్లో దుర్భర పరిస్థితుల్లో బతుకులు వెళ్లదీస్తున్న వీరిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటూ సామాజిక సమరసత వేదిక నేతృత్వంలో ఎనిమిదేళ్లుగా ఉద్యమించారు. వీరి న్యాయమైన సమస్యను గుర్తించి ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నక్కల కులస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. – దుబ్బాక 95 శాతం నిరక్షరాస్యత నక్కల(పిట్టల) కులస్తులు అడువులు, చెలకల్లో ఉంటూ పిట్టలు పట్టుకోవడం, మామిడి, చింత, వెలగ చెట్లను గుత్తకు పట్టుకొని వాటి కాయలను అమ్ముకుంటూ తరాలుగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కులసర్టిఫికెట్ లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరంగా ఉంటూవస్తున్నారు. 95 శాతానికి పైగా ఈ కులస్తులు నిరక్షరాస్యులే కావడం శోచనీయం. రాష్ట్రంలో 20 వేల కుటుంబాలు.. నక్కల కులస్తులను ఎస్టీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో 20 వేల కుటుంబాలు, జిల్లాలో 600 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తొగుట మండలం చిన్నముత్యంపేట, దుబ్బాక తో పాటు మండలంలోని చిట్టాపూర్, నర్సాయపల్లి, దమ్మక్కపల్లి, రాఘవాపూర్, మందపల్లి, ధర్మారం, బస్వాపూర్, సలాక్పూర్ తదితర 12 గ్రామాల్లో 600 వరకు నక్కల జాతి కులస్తులు ఉన్నరు. ఇందులో చిన్నముత్యంపేటలో 80 కిపైగా నక్కల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. సామాజిక సమరసత వేదిక అండతో.. నక్కల కులస్తుల దర్భుర పరిస్థితులను చూసి సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్జీ చలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరిపై అధ్యయనం చేశారు. నక్కల కులస్తుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలనే సంకల్పంతో ఏమిదేళ్లుగా పోరాటం చేశారు. పిట్టల వారు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులను, కలెక్టర్లను కలిసి ఎన్నో వినతిపత్రాలు అందజేశారు. వీరి పరిస్థితిని కేంద్ర మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లారు.అంతేకాకుండా గవర్నర్ జిష్ణుదేవ్వర్మను కలిసి వీరి దుర్భరపరిస్థితిని వివరించి, వినతి పత్రం అందించారు. ఎట్టకేలకు వీరి పోరాటం సఫలీకృతం కావడంతో నక్కల కులస్తుల్లో సంతోషం నెలకొంది.సుదీర్ఘ పోరాటంతోనే.. నక్కల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడంతో అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది. ఎస్టీలుగా గుర్తించడంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘపోరాటం చేసి ఫలితాన్ని అందుకున్నాం. పోరాటంలో సహకరించిన గవర్నర్, కలెక్టర్ మను చౌదరికి ధన్యవాదాలు. – అప్పల ప్రసాద్ జీ, కన్వీనర్ రాష్ట్ర సామాజిక సమరసత వేదిక ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 600 కుటుంబాలకు లబ్ధి ఇప్పటి వరకు కుల సర్టిఫికెట్లు లేక సంక్షేమ పథకాలకు దూరం చిన్నముత్యంపేటలో కులస్తులకు సర్టిఫికెట్లు జారీకుల ధ్రువీకరణ పత్రాలు జారీ ప్రభుత్వ ఆదేశాల మేరకు తొగుట మండలం చిన్నముత్యంపేటను రెవెన్యూ అధికారులు సందర్శించి పూర్వ పరాలను విచారించారు. తహసీల్దార్ శ్రీకాంత్ తన కార్యాలయంలో నక్కల కులస్తులకు పదిరోజుల క్రితం ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దీంతో అన్ని రకాల ప్రభుత్వ పథకాలను పొందుతారు. -
అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ ఘుమఘుమలు
‘అమ్మ మాట– అంగన్వాడీ బాట’ వారోత్సవాలుమిరుదొడ్డి(దుబ్బాక): ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీలు ఘుమ ఘుమలాడాయి. మిరుదొడ్డి, అక్బర్పేట–భూంపల్లి మండలాల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం వారోత్సవాలను ఉత్సాహంగా ప్రారంభించారు. చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎగ్ బిర్యానీ’లను ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో ఇక నుంచి తయారు చేయనున్నారు. వారానికి రెండు సార్లు అందించనున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల తల్లులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభమైన వారోత్సవాలను దుబ్బాక ఐసీడీఎస్ సూపర్వైజర్లు రేణుక, విజయలక్ష్మి పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాలల్లో అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, పున్నమ్మ, రేణుక, రేణమ్మ, విజయలక్ష్మి, బుజ్జమ్మ, నర్సమ్మ, విజయరత్న, అనిత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.