breaking news
Siddipet
-
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
తెలంగాణ: ట్రాక్టర్ ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. దీంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.బిహార్కు చెందిన కూలీలు తిమ్మారెడ్డిపల్లి శివారులోని కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. కుకునూరుపల్లిలో కూరగాయల మార్కెట్కు ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ట్రాలీని వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ పలీ్టకొట్టింది. కూలీలు ఎగిరి రోడ్డుపై పడిపోయారు. ట్రాలీలో ఉన్న 25 మందిలో ఆరుగురికి తీవ్ర, 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి.బస్సులోని 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్, డిపో మేనేజర్కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలంటూ సూచించారు.ఇదీ చదవండి: తండ్రి మందలించాడని.. విద్యార్థి ఆత్మహత్య -
రోజుకో నాయకుడి అక్రమాలు బయటపెడతాం!
సాక్షి, తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు వ్యవసాయ క్షేత్రం, అతని మామ అయిన హన్మంతరావుకు చెందిన భూములను కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం, ఎమ్మెల్సీలు శుక్రవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో హరీశ్రావు మామ హన్మంత రావుకు చెందిన ఆరు ఎకరాల భూమిని, చిన్నకోడూరు మండలం రామంచలో హరీశ్రావుకు చెందిన 13ఎకరాలలో ఉన్న వ్యవసాయ క్షేత్ర పరిసర ప్రాంతాలను పరిశీలించారు.వెలికట్ట గ్రామంలో ఎక్స్సర్వీస్మెన్లకు చెందిన భూమిని హన్మంతరావుకు ఎలా మార్చారు? అని కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్ను అడిగి తెలుసుకున్నారు. అలాగే చిన్నకోడూరు మండలం రామంచ గ్రామశివారులో 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హరీశ్రావు వ్యవసాయ క్షేత్రం భూమిని రంగనాయక సాగర్ రిజర్వాయర్కు కేటాయించే స్థలాన్ని తప్పించి కొనుగోలు చేశారా? అని ఆర్డీఓ సదానందంను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ భూము లకు సంబంధించిన మ్యాప్లు, వివిధ పత్రాలను అధికారులకు అందజేసి పరిశీలించాలని ఎంపీలు, ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు.అధికార దుర్వినియోగంతో పేరు మార్పిడి బీఆర్ఎస్ నేతల భూ వ్యవహారాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని వచ్చామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో ఎక్స్సర్వీస్మెన్లకు ఇచ్చిన 271 సర్వేనంబర్లోని భూమిలావాదేవీలు జరగవద్దని ఉన్నప్పటికీ 2010, 2011 సంవత్సరాలలో అక్రమంగా కొనుగోలు చేశారన్నారు.ఆ భూమికి ఎన్ఓసీ కలెక్టర్ ఇవ్వాల్సి ఉన్నా ఆర్డీఓ నుంచి తీసుకున్నారన్నారు. అసైన్డ్ భూమిని అధికార దుర్వినియోగం చేసి తమ పేరుమీద బదలాయించుకున్నారని ఆరోపించారు. 131 సర్వే నంబర్ భూమిని చూపించి భూమిని బదలాయించుకున్నారన్నారు. ఇప్పుడు ఎన్ఓసీ దొరికే పరిస్థితి లేదని, అసలు భూమిని కేటాయించినప్పుడు హద్దులు సైతం లేవని మండిపడ్డారు. హరీశ్రావు తీసుకున్న భూమి చుట్టూ సుడా పార్క్ను ఏర్పాటు చేశారన్నారు.బీఆర్ఎస్ నేతల భూదందాలు.. భూదందా ఫేస్–1లో ఎక్కడో ఉన్న భూమిని గోల్డ్ బిస్కెట్లాగా వాళ్ల మామకు హరీశ్ రావు అప్పగించారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. అసైన్డ్ భూమిని దళితులకు, ఎక్స్ సర్వీస్మెన్లకు ప్రభుత్వం ఇస్తే బీఆర్ఎస్ నేతలు భూదందా చేశారన్నారు. భూదందా ఫేస్–2లో రిజర్వాయర్లో భూమి కోల్పోతే ప్రభుత్వం పరిహారం రూ.6లక్షలు ఇస్తే.. హరీశ్ రావుకు రైతు రూ.2లక్షలకే ఎకరం ఎలా విక్రయిస్తాడు? బెదిరిస్తే ఇచ్చాడా? బ్లాక్మనీతో కొనుగోలు చేశారా? దీనిపై ఈడీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరముందన్నారు. అధికార దుర్వినియోగానికి హరీశ్ రావు పాల్పడటం స్పష్టంగా కన్పిస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఉద్యమం, అధికారంలోకి వచ్చిన తర్వాత భూ దందాలు చేశారని ఆరోపించారు. హరీశ్రావు మామకు చెందిన భూమి ఆరు ఎకరాలు ఆక్రమమని తేలిందని, ఈ భూమిని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని సీఎంను కోరుతున్నామన్నారు.సిద్దిపేటలో హరీశ్ అక్రమాలు చూపించాం...నేడు(శనివారం) జన్వాడకు పోయి కేటీఆర్ ఆక్రమాలను చూపిస్తామని, అలాగే రోజుకో ప్రాంతానికి వెళ్లి రోజుకో నాయకుడి అక్రమాలను బయట పెడుతామన్నారు. సందర్శించిన వారిలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, వంశీ, కడియం కావ్య, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, అనిల్ కుమార్, రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.ఇదీ చదవండి: వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ లేదు: హరీశ్రావు -
వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ లేదు: హరీశ్రావు
సాక్షి, తెలంగాణ: వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్ లేదని, కనీసం అందులో బాత్రూం కూడా లేదని, తనకు ఉన్న ఆస్తులన్నీ ప్రతి ఎన్నికల్లో పొందుపరిచే అఫిడవిట్లలో తెలిపానని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పష్టం చేశారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ కోసం రైతులకు నవంబర్ 2016 పరిహారంను ప్రభుత్వం చెల్లించిందని, జూన్ 2018లో రిజర్వాయర్ పూర్తి అయిందని, ఆగస్టు 2018–2024 వరకు 11 డాక్యుమెంట్లలో 13 ఎకరాల భూమిని కొనుగోలు చేశానన్నారు.తన భూమి కొనుగోలులో ఒక్క చిన్న తప్పు ఉందని నిరూపించినా మొత్తం భూమి ని ప్రభుత్వానికే వదిలేస్తానని హరీశ్ ప్రకటించారు. శుక్రవారం కాంగ్రెస్ ఎంపీల పర్యటించిన నేపథ్యంలో సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో «ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డెవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, అందులో భాగమే తన వ్యవసాయ భూమి వద్దకు కాంగ్రెస్ ఎంపీల పర్య టన అని మండిపడ్డారు.సీఎం తమ్ముళ్ల, మంత్రి పొంగులేటి, ఆయన కొడుకు చేస్తున్న భూ దందాలను బీఆర్ఎస్ ఎండగట్టినందుకే తమపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఎంపీల బృందం వస్తే కడు పు నిండా భోజనం పెట్టి తీసుకువెళ్లి వ్యవసాయ క్షేత్రంను చూపిద్దామనుకున్నాని హరీశ్ చెప్పారు.ప్రభుత్వంలో ఉండి యాత్రలా?ప్రభుత్వాలు వాస్తవాలను దాచిపెట్టినప్పుడు ప్రతిపక్షాలు యాత్రలు చేసి నిజనిర్ధారణకు వెళ్తాయి కానీ అధికారంలో ఉండి ప్రభుత్వమే యాత్రలకు రావడం శోచనీయమన్నారు.కేసీఆర్ హయాంలో కాళేశ్వరంతో పాటు ఏడు ప్రాజెక్టులకు అనుమతులు రాగా...ఇప్పుడు ఆ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టిందన్నారు.ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ గోదావరి నీళ్లను ఎత్తుకుపోవాలని చూస్తుంటే కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీలు దండయాత్ర చేయాలన్నారు. మెట్రో ఫేజ్–2కు, పాలమూరు ఎత్తిపోతల, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని, వీటి సాధన కోసం, రాష్ట్ర హక్కుల కోసం కలిసికట్టుగా కేంద్రంపై పోరాడాలి కానీ.. రాజకీయ కక్షసాధింపుల కోసం యాత్రలు చేయకూడద న్నారు.దళితులకు చెందిన 300 ఎకరాల భూమిని కేసీఆర్ కబ్జా చేయలేదని తేలితే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? అని హరీశ్ సవాల్ విసిరారు. దళితుల భూమి కబ్జా చేసినట్లు తేలితే తామంతా రాజీనామా చేస్తామని, ఇందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు హరీశ్రావు సవాల్ చేశారు.ఇదీ చదవండి: ఎల్నినోపై సమగ్ర వ్యూహం -
సిద్దిపేటలో హైటెన్షన్.. ఎర్రవల్లి సర్వేకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్టాపిక్గా మారింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ పరిసరాల్లోని భూములపై రెవెన్యూ శాఖ విచారణను ముమ్మరం చేసింది. 388 ఎకరాల భూముల లెక్క తేల్చేందుకు అధికారులు రెండో రోజు రంగంలోకి దిగగా.. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు సిద్దిపేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎర్రవల్లి నుంచి సిద్దిపేట వరకు రాజకీయ వేడి పెరిగింది.325 సర్వే నంబర్పై ఫోకస్..మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని వెంకటాపూర్, వరదరాజ్పూర్ గ్రామాల సరిహద్దుల్లో ఉన్న 325 సర్వే నంబర్ భూములపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఈ సర్వే నంబర్లోని సుమారు 388 ఎకరాల భూముల స్వభావం, విస్తీర్ణం, హద్దులను అధికారులు పరిశీలిస్తున్నారు. గురువారం మూడు గ్రామాల సరిహద్దులను గుర్తించి మార్కింగ్ చేసిన అధికారులు.. రెండో రోజు శాటిలైట్ మ్యాపింగ్ సహా అందుబాటులో ఉన్న రికార్డులతో భూముల విస్తీర్ణాన్ని నిర్ధారించే ప్రక్రియ చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు గత రికార్డులు, ప్రస్తుత రెవెన్యూ నమోదులను పోల్చి భూముల హక్కులు, స్వాధీనం, అసైన్డ్ భూముల వివరాలను పరిశీలిస్తున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.సిద్దిపేటకు కాంగ్రెస్ నేతలుఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు సిద్దిపేట పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ నుంచి ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి నేరుగా సిద్దిపేట కలెక్టరేట్కు వెళ్లనున్నట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ పరిసరాల్లోని అసైన్డ్ భూములపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవోను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. అలాగే రంగనాయకసాగర్ వద్ద మాజీ మంత్రి హరీశ్రావుకు సంబంధించిన ఫామ్హౌస్ భూములపైనా విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు కలెక్టర్ను కోరనున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి 325 సర్వే నంబర్లోని 388 ఎకరాల భూములపై పూర్తి వివరాలను బయటకు తేవాలని వారు డిమాండ్ చేయనున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ఎర్రవల్లి భూములపై సమగ్ర విచారణ జరుపుతామని ఇప్పటికే ప్రకటించారు.సీఎం భేటీ తర్వాతే క్లారిటీ..అయితే సిద్దిపేట పర్యటన విషయంలో కాంగ్రెస్ నేతల్లో చివరి నిమిషంలో కొంత సందిగ్ధత నెలకొన్నట్లు సమాచారం. అసెంబ్లీకి రెండు ఆర్టీసీ బస్సులు చేరుకోగా.. పర్యటనకు వెళ్లాలా? వద్దా? అన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఎంపీలు భేటీ కానున్నారు. పర్యటన సమయంలో అనుకోని ఘటనలు చోటుచేసుకుంటే అసలు భూముల అంశం పక్కదారి పట్టే అవకాశం ఉందన్న ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎంతో ఎంపీల భేటీ తర్వాతే సిద్దిపేట పర్యటనపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: దానం నాగేందర్ అనర్హతపై నేడే హైకోర్టు తీర్పు.. -
ప్రజల హక్కులు కాపాడటంలో ముందుంటాం
సిద్దిపేటకమాన్: ప్రజా హక్కులను కాపాడడంలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంతో మంది పోరాటాలు, త్యాగాల వల్ల స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కాపాడే బాధ్యత ఎక్కువగా పోలీసు వ్యవస్థపై ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు కుశాల్కర్, సుభాష్చంద్రబోస్, సీఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత రేషన్ మోదీ ఘనతే
ఎంపీ రఘునందన్రావు ప్రశాంత్నగర్(సిద్దిపేట): దేశంలో కరోనా వ్యాపించిన నాటి నుంచి ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్న ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినం, 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధినేతగా ప్రజా జీవితంలో మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్, ఉచిత వ్యాక్సినేషన్, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన నిర్ణయాలతో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిని పెంచేలా చేశారని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, బాసంగారి వెంకట్, కాసనిగొట్టు సంతోష్, విభీషణ్ రెడ్డి, తుంగ కనకయ్య, కొత్తపల్లి వేణుగోపాల్, గుండ్ల జనార్దన్, మీడియా ఇన్చార్జి గోనె మార్కండేయులు, పద్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
● రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతారెడ్డి ● కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన వేడుకలు సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రజా, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంత నిజాం పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగమైన చారిత్రాత్మక రోజు అని తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం, విద్యా ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బాటలు వేస్తుందన్నారు. రైజింగ్– 2047తో ముందుకు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం చూపే పాలన, పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలన, సామాజిక న్యాయం అనే నాలుగు ప్రధాన స్తంభాలపై ప్రజా ప్రభుత్వం పాలనను కొనసాగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తెలంగాణ రైజింగ్–2047 దార్శనిక ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రామీణ తెలంగాణను బలోపేతం చేసేందుకు పల్లె ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి సాధించాలని దశల వారీగా అమలు చేస్తుందన్నారు. ప్రతి గ్రామం, పట్టణం అభివృద్ధి చెందేలా ప్రజలకు చేరువైన పాలనను అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ కార్డును అర్హులందరికీ అందిస్తామన్నారు. ఈ 1000 రోజుల ప్రజాపాలనలో రాష్ట్ర ప్రగతితో పాటు జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికీ పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమవతి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, సీపీ రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతోనే సంపూర్ణ వికాసం
● డీఐఈఓ రవీందర్రెడ్డి ● జిల్లాస్థాయి బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభం సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి, ఎస్జీఎఫ్ అండర్ 19 జిల్లా చైర్మన్ రవీందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్)లో అండర్–19 ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి బాలికల కబడ్డీ క్రీడా ఎంపిక పోటీలను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సమ్మయ్య, ప్రిన్సిపాల్ ప్రమీలతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం పోటీలకు హాజరైన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. వారితో ఆత్మీయంగా ముచ్చటించి క్రీడలపై ఆసక్తి, శిక్షణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల బాలికల జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. కార్యక్రమంలో కబడ్డీ కోచ్ వెంకటేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు దేవరాజు, శారద, నరేశ్, వెంకటసాయి, సంజీవ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
చేయూతకు దరఖాస్తుల వెల్లువ
సాక్షి, సిద్దిపేట: చేయూత పెన్షన్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలో ప్రస్తుతం వివిధ రకాల చేయూత పెన్షన్లు 1,81,915 ఉండగా రూ. 39,34,54,640 నగదును అందజేస్తున్నారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు కొత్త పెన్షన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో 14,477 మంది వివిధ రకాల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలనకు అధికారుల నియామకం ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 226 మంది అధికారులను నియమించారు. ఇప్పటికే గ్రామాలకు, పట్టణాల్లో వార్డులకు ప్రత్యేక అధికారులకు ఎంపిక చేసే బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. చేయూత ప్రత్యేక యాప్లో దరఖాస్తుల వివరాలతో పాటు లాగిన్లను అందించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసి ఎంపీడీఓ లాగిన్కు పంపించనున్నారు. గ్రామాలకు చెందినవి ఎంపీడీఓలు, పట్టణాలకు చెందినవి మున్సిపల్ కమిషనర్లు అమోదం తెలపనున్నారు. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అందించే అవకాశం ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 14వేల మంది దరఖాస్తు ప్రస్తుతం 1.81లక్షల పెన్షన్లు 25లోగా క్షేత్ర స్థాయిలో విచారణ -
లలితాసన గణపతిం భజే
● వైరలవుతున్న వెయ్యేళ్లనాటి గణపతి విగ్రహం ● కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న రాష్ట్ర కూటుల చరిత్ర దుబ్బాకటౌన్: చాళుక్య కళారూపాలను తెలియజేసే కళా ఖండాలు రాయపోల్ మండల కేంద్రంలో పదిలంగా ఉన్నాయి. వినాయక చవితి నేపథ్యంలో వైరల్ అవుతున్న ప్రాచీన విగ్రహం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని భారీ ఏకశిలపై చెక్కిన గణపతి విగ్రహం ఎంతోకాలంగా పూజలందుకుంటోంది. రాయపోల్లోని గణపతి ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనం ఈ విగ్రహ చరిత్రకు కీలక ఆధారంగా భావిస్తున్నారు. శాసనంలో ప్రచురితమైన చారిత్రక వివరాల ప్రకారం..కల్యాణీ చాళుక్య చక్రవర్తి ఆహవనమల్ల మొదటి సోమేశ్వరుడి కాలానికి చెందిన శాసనంలో గణపతి విగ్రహానికి సంబంధించి క్రీ.శ.1048 నాటి ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వినాయక చవితి నేపథ్యంలో ఈ ప్రాచీన విగ్రహం సోషల్ మీడియా వేదికగా తెగ వైరలవుతోంది. క్రీ.శ.1048 నాటి విగ్రహంగా నిర్ధారణ అప్పట్లో రాయపోల్ను ‘రావిప్రోలు’గా పిలిచేవారని గావుండ హువిన అనే రాజు కుమారుడు జువ్విరెడ్డి ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చారిత్రక కథనాల్లో పేర్కొన్నారు. అయితే గణపతి విగ్రహం కాల నిర్ధారణ విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. విగ్రహ శిల్పశైలి, లలితాసన భంగిమ, నిర్మాణ లక్షణాలను పరిశీలించిన కొందరు చరిత్ర పరిశోధకులు ఇది 8–9వ శతాబ్దాల రాష్ట్రకూటుల కాలానికి చెందినదై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే శాసనంలో కనిపించే కాలం, శిల్పశైలిని బట్టి అంచనా వేసే కాలం మధ్య తేడా కనిపిస్తోంది. అందువల్ల విగ్రహాన్ని కచ్చితంగా క్రీ.శ.1048 నాటిదిగా నిర్ధారించడానికి ముందు శాసనాన్ని పురావస్తు, శాసన నిపుణులు అధికారికంగా పరిశీలించాల్సిన అవసరముంది. చరిత్ర గురించి తెల్పే శిలాశాసనంఈ రాతి గణపతి విగ్రహం ఐదడుగులకు పైగా ఎత్తులో ఉండటంతోపాటు లలితాసనంలో దర్శనమివ్వడం ప్రత్యేకతగా చెబుతున్నారు. ఆలయ పరిసరాల్లో చాళుక్య, రాష్ట్రకూటుల కాలానికి చెందినవిగా భావిస్తున్న మరికొన్ని శిల్పాలు, వీరగల్లులు కూడా ఉన్నట్లు పరిశోధకుల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. ప్రస్తుతం రాతి గణపతి ఉన్న ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. -
కరెంట్ కోతలపై రైతుల కన్నెర్ర
చిన్నశంకరంపేట(మెదక్): 24 గంటల కరెంట్ దేవుడెరుగు, కనీసం 6 గంటల కూడా సరిగా రావడం లేదని మండలంలోని జంగరాయి రైతులు గురు వారం ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సబ్స్టేషన్ను ముట్టడించి సిబ్బందిని నిలదీశారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో గవ్వలపల్లి–వెల్దుర్తి రహదారిపై బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివానందం, తహసీల్దార్ మాలతి రైతుల వద్దకు చేరుకుని సముదాయించారు. విద్యుత్శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని సూచించారు. ఇదే విషయం రైతులకు చెప్పి ఆందోళనను విరమింపజేశారు. నార్సింగిలో.. పాపన్నపేట(మెదక్): మండల శివారులోని నార్సింగి సబ్స్టేషన్ ఎదుట మెదక్– బొడ్మట్పల్లి రోడ్డుపై రైతులు రాస్తారోకోకు దిగారు. వ్యవసాయానికి 12 గంటలు ఇవ్వాల్సిన కరెంట్, కేవలం 8 నుంచి 9 గంటల పాటు ఇస్తున్నారని వాపోయారు. దీంతో పంటలు ఎండుతున్నాయని వాపోయారు. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్గౌడ్ తన సిబ్బందితో వెళ్లి రైతులను సముదాయించారు. -
సైన్స్ సెమినార్లో విద్యార్థుల ప్రతిభ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సెమినార్లో పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ ఘనపూర్ పాఠశాలకు చెందిన నిహారిక ప్రథమ స్థానం, టీజీఎంఎస్ లచ్చపేటకు చెందిన జమీల ద్వితీయ స్థానం, పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ దుబ్బాకకు చెందిన రేణు శ్రీ తృతీయ స్థానంలో నిలిచారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజమౌళి, న్యాయ నిర్ణేతలు నరసింహారెడ్డి, భగవాన్ పాల్గొన్నారు. సిద్దిపేటజోన్: రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం రైస్ మిల్లర్ల యజమానులు గురువారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ వేధింపుల చర్యలు మాను కోవాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించాలని, రవాణా చార్జీలు ఇవ్వాలని, నిల్వలో 15 నుంచి 20 శాతం తేడాలు ఉన్నా కేసులు నమోదు చేయవద్దు అని పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా రైస్ మిల్లర్ల యజమానులు పాల్గొన్నారు. దుబ్బాకటౌన్: 22–ఏ భూముల జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు అనుమాండ్ల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రాయపోల్లో ఆయన మాట్లాడుతూ.. 22ఏ జాబితాలో భూములు ఉండటంతో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ, వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు 22ఏ జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు తదితర సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, నాయకులు దయాకర్, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ హైమావతి ● బాలికల గురుకుల పాఠశాలసందర్శన దుబ్బాకరూరల్: మండలంలోని రామక్కపేటలోని బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ హైమావతి గురువారం సందర్శించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటకాలను శుభ్రమైన కూరగాయలతో చేస్తున్నారా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళ మెనూ ప్రకారం స్నాక్స్ అందిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించక పోతే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఫాం హౌస్కు రెవెన్యూ అధికారులు.. అసలేం జరగనుంది?
సాక్షి,సిద్దిపేట: ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా మరికాసేపట్లో రెవెన్యూ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ను సందర్శించనున్నారు. ఈ విచారణ నేపథ్యంలో కేసీఆర్కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే మర్కుక్ రెవెన్యూ కార్యాలయంలో అధికారులు సంబంధిత ఫైళ్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులతో సమావేశమై ఫాంహౌస్ భూములపై సమీక్ష నిర్వహించారు.మరోవైపు, శుక్రవారం సిద్దిపేటలో కాంగ్రెస్ ఎంపీలు పర్యటించనున్నారు. కబ్జా ఆరోపణలున్న భూమలను వారు పరిశీలించడంతో పాటు, రెవెన్యూ అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
హక్కులు, బాధ్యతలపై అవగాహన
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.సౌజన్య సిద్దిపేటఅర్బన్: ప్రజలు తమ హక్కులు, బాధ్యతలు వంటి చట్టపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.సౌజన్య స్పష్టం చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో చట్టాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రైతులు తమకు సంబంధించిన వివిధ చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, న్యాయ పరిరక్షణ, ఉచిత న్యాయ సహాయం గురించి తెలుసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు, ఏఓ బి.శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ బాదుడు!
రూ.2 వేలు మించితే ఎండీఆర్ 0.4శాతం చేతిలో నగదు అవసరం లేదు...బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు..క్యూలో నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా మొబైల్లో రెండు క్లిక్లతో బిల్లులు, ఫీజులు చెల్లిస్తున్న రోజులివి. జిల్లావ్యాప్తంగా దాదాపు 70శాతం మంది యూపీఐ ద్వారానే అన్నింటికీ పేమెంట్లు చేస్తున్నారు. పెద్ద వ్యాపార సంస్థలకు రూ.2వేలకు మించి చెల్లింపులు జరిపితే చార్జీలు తప్పవని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే ఈ చార్జీలు వ్యాపార సంస్థలకే వర్తించనున్నాయి. వ్యాపార సంస్థ నుంచి ప్రభుత్వం వసూలు చేస్తుందని ప్రకటించినప్పటికీ చివరకు ఆ భారం వినియోగదారుల పైనే వేస్తారని ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, సిద్దిపేట గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చేతిలో డబ్బులు, వాలెట్లో డబ్బులు ఉన్నాయో లేవో చూసుకుని బయట అడుగు పెట్టే వారు. అలాంటిది నోట్ల రద్దు అయినప్పటి నుంచి నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించింది. దీంతో ఇప్పుడు చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుందని వాలెట్ లేకుండానే బయటకు వెళ్తున్నారు. కొన్ని రంగాల్లో రూ.2 వేలు దాటిన లావాదేవీలపై శాతంతో సంబంధం లేకుండా రూ.5లు స్థిర ఎండీఆర్ వసూలు చేయాలని నిర్ణయించారు. బీమా ప్రీమియం, వివిధ రకాల బిల్లులు, రైలు టికెట్లు, పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై అక్టోబర్ 15వ తేదీ నుంచి చార్జీలు వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనతో మళ్లీ నగదు రూపంలో చెల్లింపులకే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. రూ1.19లక్షల కోట్లు జిల్లావ్యాప్తంగా 32 బ్యాంక్లకు చెందిన 165 శాఖలున్నాయి. 2.73లక్షల బ్యాంకుల ఖాతాలున్నాయి. 2025–26 సంవత్సరంలో 18.50లక్షల కోట్ల లావాదేవీలు జరగగా వీటి విలువ రూ.1.19లక్షల కోట్లు. ఏప్రిల్, మే, జూన్ 2026లో 7.85లక్షల లావాదేవీలు జరగగా వీటి విలువ రూ.30,234 కోట్లు. ఈ లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 70శాతంకు పైగా ప్రజలు యూపీఐ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వ్యక్తిగత బదిలీలపై ఎలాంటి రుసుము వసూలు చేయమని ప్రకటించారు. పెద్ద వ్యాపార సంస్థలకు రూ.2వేలకు మించి చెల్లింపులు జరిపితే మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) 0.4శాతం చార్జీలు వసూలు చేయనున్నారు. ఈ చార్జీలు వ్యాపారస్తుల నుంచి వసూలు చేస్తామని చెప్పినప్పటికీ అది చివరకు వినియోగదారుడిపైనే భారం పడుతుంది. ఇలా వినియోగదారుడిపై ప్రతి ఏడాది కోట్లాది రూపాయాలు ఆర్థిక భారం పడనుంది. 70 శాతం సర్వీసులు యూపీఐ పేమెంటే జిల్లావ్యాప్తంగా 5,99,242 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో గృహజ్యోతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పోగా మిగతా సర్వీసులకు ప్రతీ నెల బిల్లులను వసూలు చేస్తున్నారు. బిల్లులు చెల్లించే సర్వీసులలో మొత్తంగా 70 శాతం సర్వీసులు యూపీఐ ద్వారానే పేమెంట్ చేస్తున్నారు. దీనినిబట్టి చూస్తే చాలామంది యూపీఐని వినియోగిస్తున్నారని అర్థమవుతోంది. విద్యుత్ బిల్లులు ఆటో పే ఆప్షన్ పెట్టుకుంటే ఎండీఆర్ చార్జీలు ఏమీ పడవు. ఇలా ఆటో పే గృహ యజమానులకు అయితే బాగుంటుంది. అదే అద్దెకు ఉండే వారు ఆటో పే పెట్టుకోవడం వల్ల ఒక ఇంటి నుంచి మరో ఇంటికి అద్దెకి మారితే డబ్బులు పోయే ప్రమాదం ఉంటుంది. ఇలా వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ఇంధనం సేల్స్లో 60 శాతానికి పైగా యూపీఐ పేమెంట్స్ జిల్లాలో పెట్రోల్ పంపులలో జరిగిన సేల్స్లలో దాదాపు 60 శాతానికి పైగా యూపీఐ ద్వారానే వినియోగదారులు చెల్లింపులు చేస్తున్నారు. హుస్నాబాద్ రోడ్లోని ఓ పెట్రోల్ పంప్లో 800 లీటర్ల పెట్రోల్, డీజిల్ను విక్రయించగా అందులో రూ.70 వేలు యూపీఐ ద్వారా చెల్లింపులు, మిగతా రూ.20 వేలు నగదు రూపంలో వినియోగదారుడు చెల్లించారు. ఇలా అన్ని పెట్రోల్ పంప్లలో ఎక్కువగా యూపీఐ ద్వారానే పేమెంట్లు జరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్లపై చార్జీల వడ్డన విరమించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.విద్యుత్తు బిల్లులు యూపీఐ పేమెంట్లు నెల మొత్తం యూపీఐతో పేమెంట్ డబ్బులు సర్వీసులు చేసిన సర్వీసులు జూన్–2026 1,63,429 1,08,803 రూ.14,44,51,699 జూలై–2026 1,65,240 1,08,570 రూ.12,03,95,073 ఆగస్టు–2026 1,56,433 1,06,670 రూ.9,75,73,636 -
నిమజ్జనం వేళ .. జాగ్రత్తలివి
పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల నేరేడు చెరువు ఆరుగురు విద్యార్థులను బలి తీసుకుంది. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు చెరువులోకి దిగిన విద్యార్థుల్లో ఒకరు ఒక్కసారిగా మునిగిపోవడంతో.. అతడిని కాపాడేందుకు మరొకరు చేసిన ప్రయత్నం చివరకు ఆరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు శిరీష చారిటబుల్ ట్రస్ట్కు చెందిన హాస్టల్ విద్యార్థులు సుమారు 20 మంది గణేశ్ నిమజ్జనం కోసం ఈ చెరువు వద్దకు వెళ్లారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు చెరువులోకి దిగారు. మిగిలిన వారంతా చెరువు గట్టున నిలబడ్డారు. కాస్త ముందుకు వెళ్లి వినాయకుడిని నిమజ్జం చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా లోతు ఎక్కువ ఉండటంతో ఓ విద్యార్థి అదుపు తప్పి పడిపోయాడు.. అతడిని పట్టుకునే క్రమంలో మరొకరు.. ఇలా ఎనిమిది మందిలో ఆరుగురు విద్యార్థులు నీట మునిగారు. ఇద్దరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో చాలా సంవత్సరాలుగా నిమజ్జం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అయితే ఊహించని విధంగా లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మృతి చెందిన వారిలో నరసింహరాజ్(21), సుమంత్ రెడ్డి(17), గణేశ్(18), సిద్ధార్థ్ (17), శ్యామ్ కుమార్(17), ఉదయ్కుమార్(22) ఉన్నారు. విద్యార్థుల మృతదేహాలను పటాన్చెరులోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర, మాజీ మంత్రి హ రీశ్ రావు త దితరులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లాలో పోలీసుశాఖ వద్ద నమోదైన విగ్రహాల సంఖ్య సుమారు 3,525 ఉన్నట్లు ఆశాఖ వర్గాలు తెలిపాయి. నిమజ్జనం చేసే చెరువులు, కుంటలు 66 నమోదైనట్లు తెలిపారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అడ్డగోలు మట్టి తవ్వకాల వల్లే చెరువు వద్ద జరిగిన సంఘటనలో చిన్నారులు మరింత లోతుగా వినాయకుడిని నిమజ్జనం చేయాలనే ఆలోచన వారి మునకకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నా రు. అయితే చెరువుల్లో అడ్డగోలు మట్టి తవ్వకాల వల్లే గోతులు ప్రమాద భరితంగా మారుతున్నాయి. నియోజకవర్గంలోని అన్ని చెరువుల మట్టిని రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారు. పర్యవసానంగా ప్రమాదకర గుంతలు ఏర్పడుతున్నాయి. చెరువులు, కుంటల వద్ద పోలీసులు, అధికారులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలి. ఎక్కువ లోతు, ఉధృతంగా ప్రవాహం ఉన్న చెరువుల గురించి ముందే తెలుసుకోవాలి. అధికారులు ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులో చిన్న చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయడం మంచిది. ర్యాంప్ గానీ, ప్లాట్ఫామ్ నుంచే విగ్రహాన్ని నీటిలోకి వదలాలి. భారీ, పెద్ద విగ్రహాలను తప్పనిసరిగా క్రేన్ సహాయంతో నిమజ్జనం చేయాలి. నదిలో ప్రవాహం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. ఈత రానివారు, చిన్న పిల్లలు నీటిలోకి దిగకుండా పెద్దలు పర్యవేక్షించాలి. మద్యం సేవించి నిమజ్జనానికి రావడం, నీటిలో దిగడం అస్సలు చేయకూడదు. వినాయక శోభాయాత్ర సమయంలో విద్యుత్ తీగలు, రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి. విగ్రహం ఎత్తు, బరువు బట్టి అవసరం మేరకు వ్యక్తులను, సహాయకులను అందుబాటులో ఉండేలా చూసు కోవాలి. పోలీసులు,అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలి. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి -
నేటి నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు
సిద్దిపేటఎడ్యుకేషన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జిల్లా స్థాయి అండర్–19 క్రీడా పోటీలను ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు అండర్–19 ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుధవారం రవీందర్రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.సమ్మయ్య, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీలతో కలిసి వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో–ఎడ్యుకేషన్) ఆవరణ లో ఈ నెల 17, 18న అండర్ 19 విభాగంలో బాలికలకు కబడ్డీ ఎంపిక పోటీలను, బాలుర కు 19, 21న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక ఖోఖో పోటీలను గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఈ నెల 25, 26న బాలికలకు, 28, 29న బాలురకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 29న చెస్ పోటీలను బాల, బాలికలకు గజ్వేల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించనున్నట్లు చెప్పారు. క్రీడాకారు లు సకాలంలో రిపోర్టు చేయాలని సూచించారు. మల్లన్న హుండీ ఆదాయం రూ.74.52 లక్షలుకొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భక్తులు వేసిన కానుకలతో 63రోజుల్లో హుండీ ద్వారా రూ.74,52,087ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్ట సుధాకర్రెడ్డి తెలిపారు. బుధవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో ఆలయంలోని హుండీలనూ ఆలయఈఓ, ిదేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.74,52,087, మిశ్రమ బంగారం 32గ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 200గ్రాములు,విదేశి కరెన్సీ నోట్లు 31 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజా కళాజాతరను విజయవంతం చేయండిసిద్దిపేటకమాన్: విమలక్క యాభై ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ నెల 26, 27, 28వ తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న ప్రజా కళా జాతరను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ సంతోష్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్క్లబ్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోశ్0 మాట్లాడుతూ..యాభై ఏళ్ల విమలక్క పాటల ప్రస్థానాన్ని ప్రజా కళా జాతరగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్లం, రమ, ప్రభాకర్, మల్లేశం, వేణు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ప్రజాపాలన వేడుకలుసిద్దిపేటరూరల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లాకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్పర్సన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యఅతిథి కొత్తకోట సీత కలెక్టరేట్కు చేరుకుని 9.55 నిమిషాలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. -
కుల మతాలకతీతంగా అభివృద్ధి
బొడ్రాయి వద్ద రోడ్డు వెడల్పునకు అన్ని సంఘాలు ఏకగ్రీవ తీర్మానం దుబ్బాక: పట్టణంలో ఇటీవల ప్రతిష్ఠించిన బొడ్రాయి వద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు వెడల్పు చేయాలని రాజకీయాలకతీతంగా అన్ని కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. పట్టణంలోని బొడ్రాయి వద్ద హిందు,ముస్లిం కులపెద్దలు, పట్టణంలోని అన్ని కుల సంఘాల బాధ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, అన్ని రాజకీయపార్టీల నాయకులు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొడ్రాయి నడిరోడ్డుపై ఉండటంతో అక్కడ రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో పెద్ద వాహనాలు వెళ్లడం ఇబ్బందిగా తయారైంది. ఈ బొడ్రాయి నుంచే వినాయక విగ్రహాలు నిమజ్జనంకు తీసుకెళ్తారు. దీంతో వినాయక విగ్రహాలు వెళ్లేందుకు రోడ్డు ఇరుకుగా తయారైంది. ఇదే విషయమై సమావేశమైన అన్ని కుల మత సంఘాల బాధ్యులు ఇక్కడ రోడ్డును వెడల్పు చేయాలని తీర్మానించుకున్నారు. పట్టణాభివృద్ధికి రాజకీయాలకు, కుల మతాలకతీతంగా అందరూ ఏకతాటిపై నిలవడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పేమెంట్లపై చార్జీలు అన్యాయం
యూపీఐ పేమెంట్లపై కొత్తగా చార్జీలు విధించడం అన్యాయం. కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలు తగ్గించి ఆన్లైన్ పేమెంట్లో ప్రోత్సహించి ఇప్పుడు కొత్తగా ఈ చార్జీల భారం మోపడం పేద సామాన్య మధ్యతరగతి వ్యాపారులు ప్రజలను ఇబ్బందుల గురి చేయడమే. ఈ చార్జీల భారం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. వెంకట రాజశేఖర్రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్, దుబ్బాక మళ్లీ నగదు రూపంలో చెల్లింపులు చేస్తాం కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూ.2వేలకు పైగా యూపీఐ లావాదేవీలపై చార్జీలు పెంచడం సరికాదు. ఇలా చార్జీలు వేయడం వలన వినియోగదారుడిపైనే అదనపు భారం పడుతుంది. ఇలా భారం మీద పడే బదులు మళ్లీ నగదు రూపంలో చెల్లింపులకే మొగ్గు చూపుతాం. దీంతో మళ్లీ ఏటీఎంలు, బ్యాంకుల్లో రద్దీ పెరుగుతుంది. పచ్చిమట్ల రవీందర్ గౌడ్, హుస్నాబాద్ -
ఆశీర్వాద దీపం వెలిగిద్దాం
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆశీర్వాద దీపం వెలిగించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని గెజిట్ విడుదల చేసిన నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. ఎంఐఎం పార్టీకి తొత్తులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. గురువారం హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ ప్రపంచస్థాయి నాయకుడన్నారు. బ్రిక్స్ నిర్వహణను ప్రపంచదేశాలు అభినందించాయన్నారు. జిల్లాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు, కేంద్ర పథక లబ్ధిదారులు, గురువారం సాయంత్రం ఇంటింటా ఆశీర్వాద దీపం వెలిగించాలన్నారు. గురువారం నుంచి అక్టోబర్ 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం ఒక్కరోజే తెలంగాణ విమోచనదినోత్సవం, విశ్వకర్మ జయంతి, మోదీ జన్మదినం కావడం విశేషమన్నారు. -
కనెక్షన్ల పేరిట దోపిడీ
సిద్దిపేటఅర్బన్: చిన్నకోడూరు మండలంలోని ఓ గ్రామంలో రైతు కొత్తగా బోరు వేసుకున్నాడు. బోరు కోసం విద్యుత్ కనెక్షన్ కావాలని సంబంధిత లైన్మెన్ను కలిశాడు. లైన్మెన్ ఎస్టిమేషన్ వేసి రూ.40 వేల వరకు ఖర్చవుతుందని చెప్పగా రైతు డబ్బులు ఇచ్చాడు. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఓ గ్రామంలో నూతన ఇంటిని నిర్మించుకుంటున్న ఓ వ్యక్తి కరెంట్ కనెక్షన్ కోసం ఆ గ్రామ లైన్మెన్ను కలిస్తే అంచనా వేసి రూ.30 వేలు ఖర్చవుతుందని అంతా తానే చూసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఇలా అనేకమంది రైతులు, కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు నేరుగా విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లలేని వారు అధిక మొత్తం చెల్లించి మోసపోతున్నారు. రాష్ట్రం ప్రభుత్వం ఇటీవలే కొత్త విద్యుత్ పాలసీని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం వ్యవసాయ కనెక్షన్ కోసం రూ.9,125 చెల్లిస్తే ఒక కి.మీ వరకు విద్యుత్లైన్తోపాటు అవసరమైన పోల్స్ను ఉచితంగా విద్యుత్ శాఖ అందజేస్తుంది. 1 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉంటే అంచనా వ్యయంతోపాటు అవసరమైన పోల్స్కు, వైర్కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పాత పాలసీ ప్రకారం ఇదే కనెక్షన్కు రూ.4,950 చెల్లించేవారు. దీనికి మూడు పోల్స్, అవసరమైన వైర్ ఇచ్చేవారు. ఎక్కువ అవసరం ఉంటే ఎన్ని పోల్స్ అవసరం అవుతాయో దాని ప్రకారం డబ్బులు ఇచ్చి కనెక్షన్ తీసుకోవాల్సి ఉండేది. ఇలా మొత్తంగా రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు వచ్చేది. నూతన గృహ విద్యుత్ కనెక్షన్ కోసం అయితే రూ.3,925 చెల్లిస్తే 1 కి.మీ లోపు విద్యుత్ కనెక్షన్ను ఇస్తారు. పాత పాలసీ ప్రకారం దీనికి దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యేది. అవగాహన లోపంతోనే దోపిడీ నూతన విద్యుత్ పాలసీ వల్ల రైతులకు, గృహ వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుంది. అలాంటి పాలసీపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పాలసీ అమలులోకి వచ్చి దాదాపు ఏడాది దాటిపోయినా ఇప్పటివరకు గ్రామాలలో దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు నూతన విద్యుత్ పాలసీపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నూతన విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు, గృహ వినియోగదారులు సిబ్బందికి డబ్బులు ఇవ్వవద్దు. నేరుగా విద్యుత్ శాఖ కార్యాలయంలో సంప్రదించి ఆన్లైన్లో డబ్బులు చెల్లించి అవసరమైన పత్రాలు అందిస్తే 1 కి.మీ వరకు ప్రభుత్వమే కనెక్షన్ను ఏర్పాటు చేస్తుంది. మా సిబ్బంది ఎవరైనా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. – రామచంద్రయ్య, డీఈ, సిద్దిపేట -
కొలువుదీరిన గణనాథులు
● ఊరువాడలో విశేష పూజలు ● అంబరాన్నంటిన సంబురాలు గణపయ్యలు ఘనంగా మండపాలలో కొలువుదీరారు. జిల్లావ్యాప్తంగా సోమవారం పట్టణాలు, గ్రామలు, వాడవాడల్లో వినాయక ప్రతిమలను మండపాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం వేద పండితులతో గణపతి హోమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి వివిధ రకాల తీర్థప్రసాదాలు, నైవేద్యాలను సమర్పించారు. దీంతో జిల్లాలో గణపతి నామస్మరణ మార్మోగుతోంది. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
ఇంజనీరింగ్ దినోత్సవం
సిద్దిపేటజోన్: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి (ఇంజనీర్స్ డే)ని మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ విశ్వేశ్వరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ హెడ్వర్క్స్ వద్ద.. గజ్వేల్రూరల్: మండల పరిధిలోని కోమటిబండ గుట్టపైగల మిషన్ భగీరథ హెడ్వర్క్స్ వద్ద మంగళవారం ఇంజినీర్స్డే వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధులు రామ్ ఫణిధర్రావు, మల్లేశంగౌడ్, సత్యనారాయణలు డివిజన్ స్థాయి ఇంజీనర్లును సన్మానించారు. అనంతరం ఇంజినీర్ల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ సీఈ రాంచందర్నాయక్, సిద్దిపేట ఎస్ఈ వెంకట్రెడ్డి, గజ్వేల్ ఈఈ శ్రీనివాస్, గజ్వేల్ డీఈ రాజు, కొండపాక డీఈ నాగార్జున, ఏఈఈలు శ్రీధర్, పవన్కుమార్, గౌతమ్, విశ్లేష్, వీణ, గాయత్రితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్ల రాజకీయం
హుస్నాబాద్: తెలంగాణ విమోచనను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు చాడ శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ 1997 నుంచి పోరాటం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్ను కలిసిన బండారు
గజ్వేల్: టీపీసీసీ అధ్యక్షునిగా పదవీబాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మహేశ్కుమార్గౌడ్కు గజ్వేల్కు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మహేశ్కుమార్గౌడ్ నేతృత్వంలో పార్టీ విజయపథంలో నడుస్తున్నదని శ్రీకాంత్రావు చెప్పారు. హిందీ పురస్కారాల ప్రదానం చిన్నకోడూరు(సిద్దిపేట): జాతీయ హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో హిందీ పధ్యపఠన విజేతలకు హిందీ పురస్కారాలు అందజేశారు. హిందీ ఉపాధ్యాయులు, కవి భైతి దుర్గయ్య సహకారంతో 45 పద్యాలు చదివిన ఇద్దరు విద్యార్థులకు హిందీ కవితారత్న, 30కి పైగా చదివిన ఐదుగురు విద్యార్థులకు హిందీ కవితా భూషణ్, 15కు పైగా చదివిని నలుగురు విద్యార్థులకు హిందీ కవితాశ్రీ పురస్కారాలు, బహుమతులు అందజేశారు. హిందీ చేతివ్రాత, జ్ఞాపక శక్తి పరీక్ష, ఉపన్యాసం, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పేద కుటుంబానికి కార్మికుల అండ చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని మేడిపల్లిలో పేద భవన నిర్మాణ కార్మికుడు బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘం మండల అధ్యక్షులు చెరుకు నారాయణ మంగళవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. రూ.10 వేలు ఆర్థిక సాయం, బియ్యం అందజేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్మికులు తదితరులు ఉన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు దుబ్బాకటౌన్: మున్సిపల్ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్యానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజలు సైతం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ మహేశ్ కుమార్ అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని రెండు పడక గదుల గృహ సముదాయంలో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ చెత్తను పారిశుద్ధ్య వాహనాల్లో వేయాలని, ఇష్టారీతిన మురుగు కాల్వల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేయరాదన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్, ఫాగింగ్ చేయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది దిలీప్, అనిల్, విష్ణు తదితరులు ఉన్నారు. పీసీసీ సోషల్ మీడియా కార్యదర్శిగా డీవీ రావు బెజ్జంకి(సిద్దిపేట): టీపీసీసీ సోషల్ మీడియా కార్యదర్శిగా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దోనె వెంకటేశ్వర్రావును నియమించినట్లు రాష్ట్ర చైర్మన్ నవీన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్రావును మంగళవారం సహకార సంఘం చైర్మన్ ఒగ్గు దామోదర్ ఘనంగా సన్మానించారు. క్రీడలతో ఆరోగ్యం -
నానో యూరియాలో నత్రజని పోషకాలు
డివిజన్ వ్యవసాయాధికారి బాబూనాయక్కొండపాక(గజ్వేల్): నానో యూరియాలో నత్రజని పోషకం ఎక్కువ శాతం ఉంటుందని గజ్వేల్ డివిజన్ వ్యవసాయాధికారి బాబూనాయక్ పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్ గ్రామంలోని పత్తి పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాబూనాయక్ మాట్లాడుతూ.. సాధారణ యూరియా వాడకం కంటే నానో యూరియాను వాడటం వల్ల మొక్కలకు నత్రజని పోషకం ఎక్కువ శాతం అందుతుందన్నారు. నేల నీరు కలుషితం కాకుండా నానో యూరియా దోహదపడుతుందన్నారు. సాధారణ యూరియాను పంటలకు చల్లుకోవడం ద్వారా పోషకాలు వేరు భాగాల్లో నుంచి కొంత మేర ఆలస్యంగా మొక్కలకు అందుతాయన్నారు. కానీ నానో యూరియాను స్ప్రే చేసుకోవడం ద్వారా ఆకులపై పడటంతో పోషకాలు త్వరగా అందే అవకాశాలుంటాయని, ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు. అంతకు ముందు నానో యూరియా లాభాలపై రైతు వేదికలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ గోవిందరాజు,ఎంపీఓ నాగభూషణం,ఏఈఓ రమ్యశ్రీ, రైతులు పాల్గొన్నారు. -
రూ.70 కోట్లతో తాగునీటి పథకం
గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి నేరుగా హుస్నాబాద్కు తాగునీరు ● రోజూ సురక్షితమైన నీటి సరఫరా.. సర్వే పనులు ముమ్మరం ● 15న ప్రపంచ బ్యాంక్ అధికార ప్రతినిధుల బృందం పర్యటన హుస్నాబాద్: మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజలకు ప్రతీరోజు తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్తర నీటి పథకానికి శ్రీకారం చుట్టాయి. తాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.70 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి నేరుగా హుస్నాబాద్ పట్టణ ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేందుకు ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సర్వే పనులను ముమ్మరం చేశారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలకు ప్రస్తుతం మహ్మదాపూర్ మిషన్ భగీరథ సంప్ నుంచి 2.7ఎంఎల్డీ నీటి సరఫరా చేస్తోంది. ఒక్కో వ్యక్తికి రోజు 135 ఎల్పీసీడీ (లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే) నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం 80 ఎల్పీసీడీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నీటిని రెండు రోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా విడుదల కావడంతో పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 40 ఏళ్ల వరకు నీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని.. హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 6వేలకు పైగానే నల్లా కలెక్షన్లున్నాయి. దాదాపు 30వేలకు పైగా జనాభా ఉంది. త్వరలో హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోకి నాగారం, పోతారం(ఎస్), గాంధీనగర్, మాలపల్లి, పందిల్ల, మహ్మదాపూర్ వంటి గ్రామాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న తాగునీటి అవసరాలే కాకుండా దాదాపు 30 నుంచి 40 ఏళ్ల వరకు సరిపడే విధంగా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 25% (రూ.17.50 కోట్లు), వరల్డ్ బ్యాంక్ ద్వారా (రూ.35కోట్లు), రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ (రూ.17.50 కోట్లు) వాటా ధనంతో ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటికి ఇబ్బందులు ఉండవు గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా హుస్నాబాద్ వరకు చేపట్టే తాగునీటి పథకం ద్వారా భవిష్యత్లో తాగునీటి ఇబ్బందులు ఉండవు. ఎండాకాలంతోపాటు ఏ కాలంలోనైనా ప్రతీ రోజు తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. మిషన్ భగీరథ నీటి సరఫరా ఉన్నా లేకున్నా గౌరవెల్లి ద్వారా వచ్చే నీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది. ఈ పథకం హుస్నాబాద్కు అతి పెద్ద నీటి వనరుగా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. –మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్ -
రైస్ మిల్లులపై సోదాలు నిలిపివేయాలి
తెలంగాణ రైస్ మిల్లు అసోసియేషన్ సమావేశం ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సోదాలు నిలిపివేయాలని తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కన్వేన్షన్ హాల్లో శనివారం తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రంలోని రైస్ మిల్లులకు వరి ధాన్యం కేటాయించకపోవడం దారుణమన్నారు. మూడు రోజులుగా కలెక్టర్, పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులతోనే రైస్ మిల్లుల నిర్వహణ ముందుకు సాగుతుందని, రైతులు లేనిదే రైస్ మిల్లులు నిర్వహణ కష్టమన్నారు. 9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 9.70 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఇవ్వగా 9.60కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యంను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చామన్నారు. కొందరు మిల్లర్లు చేసిన అవినీతికి అందరిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అవినీతి పరులను రైస్ మిల్ అసోసియేషన్ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది 75లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఇవ్వగా 51లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించనున్నట్లు తెలిపారు. అందుకు గాను డిసెంబర్ 31 వరకు సమయం ఇవ్వాలన్నారు. రైస్ మిల్లర్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగాలంటే చర్చలు నిర్వహిస్తే 75% సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించండి
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బెజ్జంకి(సిద్దిపేట): మండల కేంద్రంలో శనివా రం కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి హాజరు, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల వివరాలను అడగి తెలుసుకున్నారు. శానిటేషన్ డ్రైవ్ చేపట్టి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పీఎంశ్రీ మాడల్ స్కూల్ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి, మోడల్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్ల లక్ష్మీకి బాల సాహిత్య పురస్కారం ప్రశాంత్నగర్(సిద్దిపేట): బాల సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నందుకు జిల్లా కేంద్రానికి చెందిన ఎడ్ల లక్ష్మీ జాతీయ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. సిరిసిల్లలో రంగి నేని ట్రస్ట్ నిర్వహిస్తున్న పిల్లల పండుగలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎడ్ల లక్ష్మీ పురస్కారం అందుకున్నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం శనివారం తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పత్తిపాక మోహన్, గరిపల్లి అశోక్, సిద్దిపేట బాలసాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారన్నారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్: అబద్ధపు పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫ్యల్యాలను చాటుకున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మండిపడ్డారు. శనివారం వర్గల్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోయిని కుమార్, బీజేపీ వార్డు సభ్యురాలు లావణ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కనకయ్యలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రతాప్రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెడితే.. నేడు రేవంత్రెడ్డి ఆధోగతి పాలుచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ను ప్రజలు ఇక క్షమించరని చెప్పారు. కార్యక్రమంలో వర్గల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, శేరిపల్లి సర్పంచ్ పావని, బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, వర్గల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
15న వరల్డ్ బ్యాంక్ బృందం రాక
అక్కన్నపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా హుస్నాబాద్ పట్టణానికి తాగునీటి సరఫరా చేసేందుకు చేపట్టే ప్రాజెక్టు సర్వే పనులను ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ నెల 15న వరల్డ్ బ్యాంక్ అధికారుల ప్రతినిధి బృంద సభ్యులు గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు తీరుతెన్నులు పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేయనున్నారు. రిజర్వాయర్ వద్ద ఇంటెక్ వెల్ను ఏర్పాటు చేసి, నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా విద్యుత్ మోటర్లను బిగించనున్నారు. ఎల్లమ్మ చెరువు సమీపంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద రూ.4 కోట్ల వ్యయంతో వాటర్ ట్రీట్మెంట్ కోస్ట్ను నిర్మిస్తారు. గౌరవెల్లి నుంచి హుస్నాబాద్ వరకు దాదాపు 6 కిలో మీటర్ల మేర పైపులైన్ నిర్మించి నేరుగా నీటి శుద్ధి కేంద్రానికి నీటిని తరలిస్తారు. శుద్ధి చేసిన నీటిని సిద్ధేశ్వరాలయం గుట్టపై ఏర్పాటు చేసిన అతి పెద్ద నీటి ట్యాంక్లోకి పంపిస్తారు. అక్కడి నుంచి మిగతా ట్యాంక్ల ద్వారా ప్రతీ రోజు ఇంటింటికీ నీటి సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా గౌరవెల్లి నుంచి రోజు 10 ఎంఎల్డీ అంటే కోటి లీటర్ల నీటిని హుస్నాబాద్కు తరలించే అవకాశం ఉంటుంది. సర్వే పనులు సకాలంలో పూర్తి చేస్తే వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం. -
గణపయ్యా.. గంగమ్మ ఏదీ?
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఈసారి నిమజ్జనానికి నీళ్లేవీ? గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు చాలా మంది భక్తులు మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, పూజించే వారిని ‘సాక్షి’ ప్రోత్సహిస్తోంది.ఇందులో భాగంగా మట్టి వినాయకులను పూజించే భక్తులు సెల్ఫీ తీసుకుని ‘సాక్షి’కి పంపిస్తే, వారి ఫొటోలను ప్రచురించనున్నాం. వాట్సాప్ 8686960064కు పంపించండి మరి.. వినాయక చవితి పండుగ వచ్చే నాటికే చెరువులు, కుంటలు జలకళను సంతరించుకునేవి.. ఎల్నినో ప్రభావంతో ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం చెరువులు, వంకలు, వాగులు వెలవెలబోతున్నాయి. చాలా వరకు చెరువులు ఎండి, బీటలు వారగా, మరికొన్ని చోట్ల నీళ్లు అడుగంటాయి. వినాయక విగ్రహాల నిమజ్జనానికీ నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 3,250కి పైగావినాయక ప్రతిమలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. నిమజ్జనాలకు చెరువుల్లో నీళ్లు చాలా తక్కువగా ఉండటంతో మండపాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సగటున 510 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 452 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగం చెరువుల్లో 25శాతం లోపే నీళ్లు ఉన్నాయి. ప్రతీ ఏడాది వినాయక చవితి సమయానికి చెరువులు నిండు కుండలా దర్శనమిచ్చేవి. జిల్లాలో 2,281 చెరువులుండగా అందులో 1,036 చెరువులో 25శాతం లోపు, 25 నుంచి 50శాతం లోపు 724 చెరువులు, 50 నుంచి 75శాతంలోపు 379 చెరువులు, 75 నుంచి 100శాతం వరకు 125 చెరువులు, 17 చెరువులు మత్తడి పోస్తున్నాయి. 25శాతంలోపు నీళ్లు ఉన్న చెరువులలో వినాయక నిమజ్జనం చేయడం కష్టంగా ఉండనుంది. వినాయక నిమజ్జనం వరకై నా వర్షాలు కురిసి చెరువులు నిండాలని భక్తులు కోరుకుంటున్నారు. 21 రకాల పత్రులకు ఇబ్బందే.. వినాయక చవితి సందర్భంగా 21 రకాల పత్రులతో పూజలు నిర్వహిస్తారు. ఈ సారి వర్షాలు తక్కువ కురవడంతో సంబంధించిన మొక్కలు, చెట్లు అంతగా పెరగలేదు. దీంతో వినాయక చవితి సందర్భంగా అవసరమైన అన్ని రకాల పత్రులలను సేకరించడం భక్తులకు కష్టంగా మారుతోంది. మట్టి గణపతికే ప్రాధాన్యం నవరాత్రులు ముగిసిన తర్వాత గణనాథుడిని నిమజ్జనం చేయడం ఆనవాయితీ, అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ), రసాయన రంగులు అద్దిన విగ్రహాలను నీటిలో నిమజ్జనంచేయడం వల్ల జలవనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. పీఓపీ నీటిలో త్వరగా కరగకపోవడంతో పాటు, రసాయన రంగులతో నీటి నాణ్యత పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం, సహజ రంగులను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.ఈ ఫొటోలో కనిపిస్తున్నది కొండపాక మండలం కమ్మంపల్లి చెరువు. ఈ గ్రామంలో దాదాపు 8 వరకు గణపతి మండపాలున్నాయి. ఈ గ్రామ చెరువులో చాలా తక్కువగా నీళ్లు ఉన్నాయి. ఐదు ఫీట్ల గణపతి విగ్రహాన్ని నిమ జ్జనం చేస్తే మునిగే పరిస్థితి కనిపించడం లేదు. మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. మట్టి గణపతిని పూజిద్దాం.. పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన జలజీవరాశులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. రసాయన రంగులను స్ప్రే చేయడంతో తయారు చేసే వారు లంగ్స్ సంబంధిత వ్యాధుల బారీన పడుతున్నారు. మట్టి గణపతికి సహజ రంగులను వినియోగించాలి. – డాక్టర్ డీఎన్. స్వామి, పర్యావరణ ప్రేమికుడు -
హామీల అమలుకు ఉద్యమిస్తాం
● రేషన్ డీలర్లపై అధికారుల వత్తిడి సరికాదు ● రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు నాయికోటి రాజుసిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు నాయికోటి రాజు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో 18నెలలుగా దొడ్డు బియ్యం రేషన్ దుకాణాల్లో నిల్వ ఉంచి అధికారులు ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించారు. బియ్యం వెనక్కి ఇవ్వని వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు బెదిరింపు చర్యలకు పాల్పడడం తగదన్నారు. అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. రేషన్ డీలర్లకు రెండవ కమిషన్ పేరిట రూ 300 చెల్లించాలని,అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో బకాయిలు ఉన్నా రూ 100 కోట్లను వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తేవాలన్నారు. సమస్యలపై సంఘటితంగా పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రతినిధులు ప్రభాకర్, శేఖర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 7,613 కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ ● లోక్ అదాలత్లో దివ్యాంగులకు జాబ్ మేళా ● 30 మందికి ఉద్యోగాల కల్పన సిద్దిపేటకమాన్: లోక్ అదాలత్లో మొత్తం 7,613 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. దివ్యాంగులకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ..సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాద కేసుల్లో రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకోవడానికి ఇరు వర్గాలు ముందుకు రావాలన్నారు. దివ్యాంగుజన్ కౌశల్ వికాస్, దివ్యాంగుజన్ రోజ్గార్ సేతు కార్యక్రమాలపై అవగహన కల్పించి దివ్యాంగుల సంక్షేమ శాఖ, చేయూత పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ, ఆర్సెటి ద్వారా శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దివ్యాంగులకు జాబ్ మేళా ద్వారా 175మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వీరిలో 30మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. అనంతరం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామీణ అభివృద్ధి శాఖ సంక్షేమ శాఖ, ఉపాధి కల్పన శాఖ, లీడ్ బ్యాంక్ స్టాళ్లను న్యాయమూర్తులు పరిశీలించారు. లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసుల్లో 36 సివిల్, 7,549 క్రిమినల్, మోటారు ప్రమాద 28కేసులున్నాయని తెలిపారు. మోటారు వాహన ప్రమాద కేసుల్లో రూ.1,34,05,000 ఇప్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తి జయప్రసా ద్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయ మూర్తి సౌజన్య, జిల్ల వెల్ఫేర్ ఆఫీసర్ శారద, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, బార్ అసోసియేషన్ అధ్యక్షు డు రమేష్బాబు, ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు వాసుదేవరావు, మహేందర్రెడ్డి, మురళి, లక్ష్మీబాబు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. -
పాతధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోవాలి
● కలెక్టరేట్ ఎదుట రైస్మిల్లర్ల నిరసన ● జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమురవెల్లి చంద్రశేఖర్ సిద్దిపేటరూరల్: ప్రభుత్వం గత మూడు పంటలకు సంబంధించిన ధాన్యాన్ని రైస్మిల్లులో నిల్వ ఉంచడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని వెంటనే ప్రభుత్వం నిల్వ ఉంచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కొమురవెల్లి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా రైస్మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిల్వ ఉంచిన ధాన్యాన్ని తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, రూరల్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ... ప్రభుత్వం గత 3 పంటలకు సంబంధించి సుమారు రూ. 1500 కోట్ల విలువైన ధాన్యం నిల్వలున్నాయన్నారు. ఎక్కువ రోజులుగా నిల్వ ఉండటం వల్ల నాణ్యత దెబ్బతిని పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీ చేస్తే నిల్వలు తక్కువగా ఉన్నట్లు చూపే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గత మూడేళ్ల క్రితం ఎఫ్సీఐ అధికారులు స్థలం కేటాయించినప్పటికీ అదే సీజన్లో డెలివరీ చేయలేకపోతున్నట్లు తెలిపారు. పాత ధాన్యాన్ని తీసుకున్న తర్వాతే కొత్త ధాన్యం కేటాయించాలని డిమాండ్ చేశారు. -
సమాజంలో గురువుకు ప్రత్యేక గౌరవం
● విద్యార్థుల్లో జాతీయభావం అవసరం ● ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేటజోన్: సమాజంలో గురువులకు ఒక అత్యున్నత గౌరవ స్థానం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం టీటీసీ భవన్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో జాతీయ భావం మరింత పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. వచ్చే తరానికి జనగణమన, వందేమాతరం గీతాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అవార్డులు, రివార్డులు ముఖ్యం కాదని, మీకు విద్యార్థులు ఇచ్చే గౌరవం పెద్ద పురస్కారమన్నారు. అవార్డులు అనేది మనిషికి ఉత్సహం, ప్రోత్సాహం అందిస్తుందన్నారు. అవార్డులు రానివారు నిరాశ పడొద్దని సూచించారు. తనకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవమని కొన్ని కారణాల వల్ల టీచర్ కాలేక పోయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారికి నాణ్యమైన బోధన చేయాలన్నారు. ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులను చూసి పిల్లలు నేర్చుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఆచరించు.. బోధించు అనే నినాదంతో టీచర్లు ముందుకు సాగాలన్నారు. అన్ని రంగాల్లో వారు ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు బాధ్యత టీచర్ల మీద ఉందన్నారు.అనంతరం కలెక్టర్ హైమావతి. పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్లతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలి
ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి రవీందర్ రెడ్డి హుస్నాబాద్: ఈ విద్యా సంవత్సరం కూడా పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, బాలుర జూనియర్ కళాశాలల్లో వేర్వేరుగా ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్మీడియెట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లా డుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్ధాయిలో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, ప్రిన్సిపాల్స్ లలిత, గంగాధర్, అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాలల్లో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ సిద్దిపేటఎడ్యుకేషన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వక్తలు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో శుక్రవారం మట్టివినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ సునీత, డాక్టర్ జీవన్కుమార్లు మాట్లాడారు. విద్యార్థినీ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాల్లో మట్టివిగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రసాయనాలను కలిపి చేసిన విగ్రహాలతో గాలీ, నీరు, పర్యావరణ కాలుష్యం జరుగుతోందన్నారు. అనంతరం అందమైన ప్రతిమలను తయారు చేసిన విద్యార్థులకు జ్ఞాపికలను అందించారు. ఎన్ఎస్స్, ఏకోక్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ అయోధ్యరెడ్డి, డాక్టర్ శ్వేత, ఏకోక్లబ్ కన్వీనర్లు డాక్టర్ మధుసూదన్రెడ్డి, డాక్టర్ స్వప్న, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టును శుక్రవారం ఇరిగేషన్ ఎస్ఈ పల్లెం రాజు, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు నుంచి హుస్నాబాద్కు తాగునీటిని సులభంగా సరఫరా చేసేందుకు పంప్హౌస్ను ఏప్రాంతంలో ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సరఫరాకు అనువైన ప్రాంతాలను పరిశీలించి సాంకేతిక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ రాములునాయక్, హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్లతో పాటు ఇరుగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్: క్రీడల్లో సత్తా చాటాలని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డు మైదానంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఎంపిక చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా చందన మాట్లాడారు. నిరంతర సాధన ద్వారా క్రీడా పటిమను పెంపొందించుకోవాలన్నారు. ఈ సెలెక్షన్స్లో 450మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పద్మాబాయి, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్, ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
దుబ్బాక: పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ నాయకులు గురువారం ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై అనుచిత వాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్పై బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు ఇల్లందుల శ్రీనివాస్, సీనియర్నాయకులు ఆస స్వామి శుక్రవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మచ్చ శ్రీనివాస్ సైతం కాంగ్రెస్ నాయకులు కాల్వ నరేశ్, మల్లుగారి చంద్రారెడ్డి, శ్రీరాం నరేందర్, సత్తు శ్రీనివాస్రెడ్డి, ఆకుల భరత్, స్వామితో కలిసి తనను ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారని, తనకు ప్రాణభయం ఉందంటూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియాలో సైతం జోరుగా విమర్శలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.దుబ్బాక పోలీస్స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు -
తాగునీటికే తపాస్పల్లి రిజర్వాయర్
కలెక్టర్ హైమావతి కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నీటిని తాగునీటికి మాత్రమే వినియోగిస్తామని జిల్లా కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. తపాస్పల్లి రిజర్వాయర్ను శుక్రవారం నీటి పారుదల శాఖ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 0.3 టీఎంసీలు ఉండగా దేవాదుల వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని బట్టి 0.2 టీఎంసీలు మాత్రమే రిజర్వాయర్లో నిల్వ చేశామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కుడి, ఎడమ కాలువలోకి నీటి వదల్లేదని నీటి పారుదల శాఖ అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ...ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల రిజర్వాయర్ నీటిని వ్యవసాయ రంగానికి కాకుండా వేసవిలో తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని రైతులకు తెలిపారు. రిజర్వాయర్ నుంచి గౌరయపల్లి మీదుగా చేర్యాల మండలం కమలాయపల్లి వరకు కాలువను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ దివ్య, ఎస్ఐ మహేశ్, నీటిపారుదల శాఖ అధికారులున్నారు. సిద్దిపేటరూరల్: కలెక్టరేట్ కార్యాలయం పక్కన గల ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవీఎం) గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా త్రైమాసిక పరిశీలనలో భాగంగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను ఓపెన్ చేసి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల వారీగా మిషన్ లను, భద్రపరిచిన ద్వారాలను వాటికున్న సీల్ లను పరిశీలించారు. ఎలక్షన్ కమిషన్ ప్రకారం అన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ తెలిపారు. -
మౌలికం.. మళ్లీ మొదటికి
యూఎఫ్ఐడీఎఫ్ పనుల్లో ప్రతిష్టంభన మున్సిపాలిటీల్లో యూఎఫ్ఐడీఎఫ్(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) పనుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. టెండర్ ప్రక్రియలో జాప్యం, ఇతర కారణాలతో ఏడాదిగా ఈ పనులు ముందుకుసాగలేదు. తాజాగా టెండర్ పూర్తయినా... నిధులు ఎక్కడినుంచి వస్తాయోనని తెలిపే ‘హెడ్ ఆఫ్ అకౌంట్’పై స్పష్టత లేదనే కారణంతో పనులు ప్రారంభించలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. పనులు జరిగిన చోట బిల్లులు రావడం లేదని...తాము కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటామేమోనని జంకుతున్నారు. –గజ్వేల్ మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా యూఐడీఎఫ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీకి రూ.15కోట్ల చొప్పున నిధులను విడుదల చేశారు. జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. ఇందులోభాగంగానే సిద్దిపేట మున్సిపాలిటీలో పనులు కొనసాగుతున్నాయి. కానీ ఈ పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే విషయాన్ని తెలిపే ‘హెడ్ ఆఫ్ అకౌంట్’పై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఫలితంగా బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తూప్రాన్ మున్సిపాలిటీలోనూ ఈ పనులు జరిగాయి. కానీ బిల్లుల చెల్లింపుపై స్పష్టత లేదు. ఈ పరిస్థితి వల్ల జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లో టెండర్లు దక్కించుకుని అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు తాము కూడా ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కుంటామనే భయంతో పనులు ప్రారంభించడానికి ముందుకు రావడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే చేతులెత్తేశారు కూడా. మౌలిక వసతులు కరువై అవస్థలు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా మౌలిక వసతులు లేకపోవడం వల్ల అవస్థల మధ్య కాలం గడపాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఏడాది కిందట మంజూరైన యూఐడీఎఫ్ పనులు చేపడితే కొంతమేరకై నా సమస్యలు తీరుతాయని భావిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో యూఐడీఎఫ్ కింద ఇందిరాపార్కు చౌరస్తా సుందరీకరణకు రూ.కోటి, హౌజింగ్ బోర్డు మైదానంలోని చిల్డ్రన్స్ పార్కు ఆధునీకరణకు రూ.కోటి, సంగాపూర్ రోడ్డు వైపున కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.40లక్షలు, తూప్రాన్ రోడ్డువైపున వరద కాల్వల నిర్మాణానికి రూ.1.2కోట్లు, మిగతా నిధులను వివిధ వార్డుల్లో ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వరద కాల్వల నిర్మాణానికి ప్రతిపాదించారు. కానీ ఈ పనుల్లో కదలిక లేదు. దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇదేరకంగా ప్రజలకు అత్యవసరమైన పనులను ప్రతిపాదించారు. కానీ పనులు ముందుకు సాగక...నిరాశే నెలకొంది.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం పట్టణాల్లో మెరుగైన వసతులే లక్ష్యంగా యూఐడీఎఫ్ కింద నిధులు వచ్చాయి. పనులు ప్రారంభించే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాం. – గణేశ్రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ ‘హెడ్ ఆఫ్ అకౌంట్’పై స్పష్టత కరువు బిల్లులు వస్తాయో రావోనని అనుమానం పనులు చేయలేమంటూ చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు జిల్లాలోని మున్సిపాలిటీల్లో దుస్థితి -
మండపాలకు ఉచిత విద్యుత్
సాక్షి, సిద్దిపేట: వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ భద్రత ఎంతో ముఖ్యమైందని మండలపాల నిర్వాహకులు విద్యుద్దీపాలతో అలంకరణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీడీసీఎల్ సిద్దిపేట జిల్లా ఎస్ఈ చంద్రశేఖర్ సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు త్వరలో ప్రారంభం కానుండటంతో మండప నిర్వాహకులు పాటించాల్సిన సూచనలపై ఎస్ఈని శుక్రవారం ‘సాక్షి’ పలకరించింది. ఆయన మాటల్లోనే.... ఈసారి ఉచిత కరెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఏడాది సైతం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం. నాణ్యమైన, సరైన సామర్థ్యం కలిగిన ఎంసీబీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బతిన్న వైర్లను వినియోగించవద్దు. వర్షం పడినప్పుడు తడిసిన వైర్లు, విద్యుత్తు పరికరాలను తాకవద్దు. మండపాలకు సీరియల్ లైట్లు వేసినప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్తు సిబ్బందికి వివరాలు చెప్పాలి వినాయక మండపం వద్ద ఎన్ని లైట్లు, మైక్ సెట్, ఇంకా వినియోగించే వాటి వివరాలు మండపం దగ్గరకు వచ్చే విద్యుత్ సిబ్బందికి చెప్పాలి. టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ససా యాప్లో వివరాలు నమోదు చేసి ఫొటో తీసుకుంటారు. విద్యుత్ లైన్ల కింద మండపాలు ఏర్పాటు చేయవద్దు. తీసుకొచ్చేప్పుడు.. నిమజ్జనానికి జాగ్రత్తలు పాటించాలి విగ్రహాలు మండపం వద్దకు తీసుకొచ్చేప్పుడు, నిమజ్జన సమయంలో తీసుకువెళ్లేటప్పుడు విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. స్తంభాల చుట్టూ ఇతర ప్రైవేట్ కేబుల్స్ కూడా ఉంటాయి. విద్యుత్తు తీగ నేరుగా తాకకపోయినా దగ్గరగా వెళ్లడం వల్ల విద్యుత్తు సరఫరా, ఇండక్షన్ కారణంగా ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. విద్యుత్ లైన్లకు దూరంగా పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే నంబర్కు 1912 ఫోన్, 8712441912 నంబర్కు వాట్సప్ చేయవచ్చు. వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరిస్తారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ భద్రత ఎంతో ముఖ్యం మండపాల వద్దకు వచ్చే సిబ్బందికి వివరాలు చెప్పాలి విద్యుత్ సమస్యలుంటే ఈ నంబర్కు 8712441912 వాట్సప్ చేయండి ‘సాక్షి’తో టీజీఎస్పీడీసీఎల్ ఎస్ఈ చంద్రశేఖర్ -
కేసులు రాజీ చేసుకోండి
సీపీ రష్మీ పెరుమాళ్ సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్ ఈనెల 12న నిర్వహిస్తుండటంతో కక్షిదారులు నేరుగా న్యాయస్థానాన్ని సంప్రదించి రాజీ చేసుకోవచ్చని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ పడదగిన సివిల్, ఆస్తి కుటుంబ తగాదాలు, కుటుంబ పరమైన నిర్వహణ, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంకెన్ డ్రైవ్, చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు రాజీ చేసు కోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. సీపీకి విత్తన గణపతి అందజేత గజ్వేల్: ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా బుధవారం సిద్దిపేట సీపీ రష్మీపెరుమాళ్కు ఆ సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వర్రావు విత్తన గణపతిని అందజేశారు. విత్తన గణపతిని పూజించి, నేలలో నాటితే, దేవుడు మొక్కగా మారి ఆశీర్వదిస్తారని రాజేశ్వరరావు చెప్పారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ మార్గదర్శనంలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ మొగిలి తదితరులు పాల్గొన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్లో అదనపు ప్లాట్ఫాం రూ. 40 కోట్లతో నిర్మాణం కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్లో రూ. 40 కోట్లతో అదనపు ప్లాట్ ఫాం నిర్మించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధి కారి పద్మజ వెల్లడించారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు, అఽధికారులు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో రెండు రైళ్లను పెంచాలని వినతిపత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు చేపడుతున్న రైల్వే లైన్ పనులు పూర్తయితే టెంపుల్ కారిడార్ ఏర్పాటు అవుతుందన్నారు. 24 గంటలూ భక్తులకు రైల్వే సిబ్బంది స్టేషన్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. మల్బరీ సాగుతో సిరులు రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ జేడీ లత తొగుట(దుబ్బాక): మల్బరీ సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండుతుందని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. మండలంలోని పెద్దమాసాన్పల్లి రైతు వేదికలో ‘నాపట్టు.. నా అభిమానం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడారు. పట్టుగూళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. మల్బరీ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎల్ని నో ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి లేనందన రైతులు సాగుకు ముందురావాలన్నారు. మిగితా పంటల మాదిరిగా పంట పెట్టుబడి ఖర్చులు అంతగా ఉండవన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసే దిశగా రైతులు ఆలోచించాలని ఆమె కోరారు. అనంతరం శాస్త్రవేత్తలు మల్లికార్జున్, రాఘవేంద్ర మల్బరీ సాగుపై రైతులకు ఆవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ తిరుపతిరెడ్డి, జిల్లా అధికారి సామల ఐలయ్య, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు. తొలి రోజు యూజీసీ నెట్ ప్రశాంతంసిద్దిపేటఅర్బన్: ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటి టెస్ట్) పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షకు తొలి రోజు ఉదయం సెషన్కు 47 మందికి గాను 27 మంది హాజరయ్యారు. 20 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో సెషన్కు 37 మందికి గాను 32 మంది హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ శ్రీకాంత్, టీసీఎస్ ఆఫీసర్ మహేష్బాబు పర్యవేక్షించారు. -
బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూర్కు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. బుధవారం ఉపసర్పంచ్ బెడద శివకుమార్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ నిత్యం ఎంతోమంది విద్యార్థులు చదువుకునేందుకు జనగామ జిల్లా కేంద్రానికి వెళ్తుంటారని, బస్సు లేకపోవడం వల్ల విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ఆర్టీసి అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, జీడికంటి సురేష్, రామడుగు బాలరాజు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా అద్దె భవనంలోనే విధులు
● వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ● ప్రతి నెలా రూ.45 వేల అద్దె చెల్లింపు సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం అదేశించినా ఇంకా అద్దె భవనంలోనే సిద్దిపేట వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కొనసాగుతోంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ఈ ఏడాది జనవరి 30 లోగా ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సర్కారు అదేశించింది. ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు చాలా వరకు కలెక్టరేట్లో కొనసాగుతు న్నాయి. మిగితా కొన్ని కార్యాలయాలను తరలించినా, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం మాత్రం తరలించ లేదు. అద్దె ప్రతి నెల రూ.45 వేలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం పొదుపు మంత్రం పాటిస్తున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క కార్యాలయానికే నెలకు రూ.45 వేల అద్దె చెల్లిస్తూ ఆదాయం వృథా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భవనంలోకి తరలించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
● పలు పాఠశాలల్లో వేడుకలు ప్రశాంత్నగర్(సిద్దిపేట): తెలంగాణ భాషా (మాండలిక) దినోత్సవాన్ని బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా విద్యార్థులు వివిధ రకాల తెలంగాణ మాండలికంకు సంబంధించిన ఉపన్యాసాలు, వ్యాసరచన పోటీలు, తెలంగాణ భాష గొప్పతనాన్ని తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బోనాల పాటలు, శ్రీ కృష్ణ దేవరాయ భువన విజయం నాటకం, సోది.. రకరకాల అద్భుతమైన కవితలు ప్రదర్శించారు. కాళోజీ తెలంగాణ మాండలికం అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. -
వ్యాయామంతోనే ఆరోగ్యం
ఎంపీ రఘునందన్ రావు మిరుదొడ్డి(దుబ్బాక): వ్యాయామంతోనే సకల ఆరోగ్యం సిద్ధిస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మండల పరిధిలోని కాసులాబాద్లో బుధవారం ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అలాగే వివిధ కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో ప్రశాంత జీవనం గడపాలంటే ప్రతి ఒక్కరు ఆరోగ్య సూత్రాలను పాటించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ అభివృద్ధిలో భాగస్వాములు కాకపోవడంతో రోడ్లు పురోగతి చెందడం లేదన్నారు. రోడ్లు మరమ్మతుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అమర్, సర్పంచ్ బాబాయ్, ఉప సర్పంచ్ రాజు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
● ఏఎంసీ చైర్మన్ విజయ మోహన్ ● సాదాసీదాగా వర్గల్ మండల పరిషత్ సమావేశం వర్గల్(గజ్వేల్): అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశం సాదాసీదాగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో సురేష్ మాట్లాడుతూ ఎల్ నినో నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, జలసిరి ద్వారా ఫామ్ పాండ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. విద్యుత్ సంబంధ సమస్యలను సర్పంచ్లు సభ ద్వారా అధికారుల దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని విద్యుత్ ఏఈ వాసుదేవరావు తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా వివిధ సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన విస్తరణ అధికారి సుధాకర్ రెడ్డి సభ్యులకు సూచించారు. సమావేశంలో గ్రామపంచాయతీ గ్రాంట్లు, మహిళా, శిశుసంక్షేమం, పశు పోషణ, జలసిరి పనులు తదితర అంశాలపై చర్చించారు. -
గొప్ప ప్రజాకవి కాళోజీ
సిద్దిపేటరూరల్: తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ తెలంగాణ ప్రజలను సామాజికంగా మేల్కొలిపిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ కొనియాడారు. బుధవారం కాళోజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను పద్మవిభూషన్తో గౌరవించిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి ఆధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భావితరాలకు స్ఫూర్తిని అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్డీసీ సుదర్శన్రెడ్డి, బీసీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్, డీసీఎస్ఓ తనూజ, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయండి
చేర్యాల(సిద్దిపేట): రాష్ట్రంలో పెడింగ్లో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవులు, నాయకులు మహేందర్రెడ్డి, శశిదర్రెడ్డి, పాండు, సిద్ధారెడ్డి, సత్యవర్ధన్, చంద్రమౌళి, బాలరాజు, సందీప్, చంద్రశేఖర్చారి, రవి, లక్ష్మారెడ్డి, మనోజ్, ప్రవీణ్, రా ములు, మహేష్, రాజు, శ్రీకాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్ ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా రాచకొండ ప్రశాంత్ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
అందుబాటులోకి తీసుకురావాలి
క్రీడాకారులు ఖేలో ఇండియా, రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ పోటీలు వచ్చే నెలలో హైదరాబాద్లో జరగనున్నాయి. దీంతో క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. కోమటి చెరువు, రంగనాయక సాగర్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ను అందుబాటులోకి తీసుకువస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతుంది. – గుండె ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి, జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ పరిశీలించి చర్యలు తీసుకుంటా సిద్దిపేటలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను త్వరలో పరిశీలించి చర్యలు తీసుకుంటా. కలెక్టర్ అనుమతితో మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేస్తా. – మల్లికార్జున్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ -
నిర్దేశించిన లక్ష్యం అధిగమించాలి
సిద్దిపేటజోన్: సర్ ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యం నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి సమష్టిగా పనిచేయాలని సిద్దిపేట ఆర్డీఓ సదానందం సూచించా రు. బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో సర్ నోటీసుల జారీ ప్రక్రియ. డిక్లరేషన్ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నోటీసులు పంపిణీ పూర్తి చేయాలని. అర్హులైన ఒక్క ఓటు పోకుండా చూడాలని సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లకు ఆయా పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించి సకాలంలో ప్రక్రియ జరిగేలా చూడాలని సూచించారు. మోహన్లాల్, మునీర్ పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో సిద్దిపేటలోని స్విమ్మింగ్ పూల్ నిరుపయోగంగా మారింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినా నిరాధరణకు గురవుతోంది. ఏడాదిన్నరగా తెరుచుకోక కంపుకోడుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి స్విమ్మింగ్ పూల్ను తెరిపించాలని క్రీడాకారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట 2016లో రూ. 5 కోట్ల వ్యయంతో 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మాజీ మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేటమినీ స్టేడియానికి సమీపంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. అలాగే బేబీ స్విమ్మింగ్ పూల్ను సైతం నిర్మించారు. ప్రారంభంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు సైతం నిర్వహించారు. కరోనా కాలంలో కొన్ని రోజులు మూత పడినా.. కొన్ని రోజులు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగింది. తర్వాత జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నాలుగేళ్లు ప్రైవేట్ కాంట్రాక్టర్ కొనసాగించినా, గతేడాది ఏప్రిల్లో నిర్వహణ బాధ్యతలు మున్సిపాలిటీకి అప్పగించారు. ఇదిలాఉండగా గతంలో కాంట్రాక్ట్ పొందిన వారు డబ్బులు చెల్లించకపోయినా చర్యలు తీసుకోవడం గమనార్హం. క్రీడాకారులకు శిక్షణ కరువు సిమ్మింగ్ పూల్ నిర్వహణ కొరవడటంతో శిక్షణ తీసుకునే విద్యార్థులు, క్రీడాకారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. త్వరలో రాష్ట్రస్థాయి జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ పోటీలు హైదరాబాద్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన క్రీడాకారులు పలువురు కోమటిచెరువు, రంగనాయకసాగర్, మరికొందరు హైదరాబాద్, వరంగల్, సంగారెడ్డిలలో శిక్షణ పొందుతున్నారు. ఆరు నెలలైనా అంతే! జిల్లా యువజన క్రీడల శాఖ నుంచి సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ ఏడాది ఏప్రిల్లో కలెక్టర్ అప్పగించారు. మున్సిపాలిటీకి అప్పగించి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటివరకు అటు వైపు అధికారులు చూడలేదు. గత వేసవిలో అందుబాటులోకి తీసుకవస్తారేమో అని పట్టణ వాసులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్లు పెట్టి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ నిరాధరణకు గురవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అందుబాటులోకి తీసుకురావాలని క్రీడాకారులు, పట్టణ వాసులు కోరుతున్నారు. మూత పడిన స్విమ్మింగ్ పూల్ అద్దాలు పగిలి, డోర్లు లేకుండా.. దుర్వాసన.. చెత్త, గడ్డి ఏడాదిన్నరగా స్విమ్మింగ్ పూల్ను ఓపెన్ చేయకపోవడంతో దుర్వాసనతో కంపుకొడుతోంది. వర్షపు నీరు, చెత్త చెదారంతో నిండిపోయింది. ఎయిర్ బాల్స్ దండ అంతా తెగిపోయింది. మోటార్లను నిర్లక్ష్యంగా బయటనే పడేయడంతో పాడయ్యాయి. పూల్ ఆవరణలో గడ్డి ఏపుగా పెరిగింది. గత కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లు బకాయి ఉంది. స్విమ్మింగ్ పూల్ చుట్టూ పక్కల నివాసం ఉండేవారు దోమలు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
థ్యాంక్స్ టూ సాక్షి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ‘ఎన్నాళ్లీ కంపు’ అంటు ఈనెల 2న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది మురుగును తొలగించారు. జిల్లా కేంద్రంలోని మారుతినగర్ వీధి నంబర్–1లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలనీలో మురుగు నీరు నిలిచింది. దీంతో పాటుగా మ్యాన్ హోల్లో నుంచి మురుగు నీరు కాలనీలో విచ్చలవిడిగా ప్రవహించటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దుర్వాసన, దోమలు, ఈగలతో పలువురు అనారోగ్యం బారినపడ్డారు. ఈక్రమంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది త్వరగా స్పందించి మురుగును తొలగించారు. దీంతో నేడు కాలనీ వాసులు ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. ఈసందర్భంగా సాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రిపుల్ఆర్ భూసేకరణ వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి ● గజ్వేల్లో అధికారులతో సమీక్ష గజ్వేల్: ట్రిపుల్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) భూ సేకరణను పూర్తి చేసి, భూములను నేషనల్ హైవే అథారిటీ(ఎన్హెచ్ఏఐ)కి అప్పగించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం గజ్వేల్ ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలన్నారు. జిల్లాలోని జగదేవ్పూర్, మర్కూక్, గజ్వేల్, వర్గల్, రాయపోల్ మండలాల నుంచి ట్రిపుల్ఆర్ నిర్మాణం జరగనుందని, దీనివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి, సహకారాన్ని కోరాలని చెప్పారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతంలో డ్రోన్ సర్వే నిర్వహించి రైతులు ఎలాంటి పంటలు వేయకుండా స్వాధీనం చేసుకో వాలని తెలిపారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ, ఎన్హెచ్ఏఐ అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలన్నారు. ఇంకా ఈ సమీక్షలో గజ్వేల్ ఆర్డీఓ వీవీఎల్ చంద్రకళ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
రాజీవ్రహదారిపై చెక్పోస్టు
● ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు ● ఫామ్హౌస్కు వెళ్లకుండా బ్రేకులు వర్గల్(గజ్వేల్): ఫామ్హౌస్ ముట్టడి పిలుపు నేపథ్యంలో మంగళవారం వర్గల్ మండలం గౌరారం రాజీవ్రహదారిపై పాములపర్తి క్రాస్రోడ్డు వద్ద చెక్పోస్టు ఏర్పాటుచేశారు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్కుమార్ పర్యవేక్షణలో సీఐలు సత్యనారాయణ, వాసుదేవరావు, ఎస్ఐలు, పోలీసులు ఫామ్హౌజ్ వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీచేశారు. అటువైపు వెళ్తున్న నాయకులను అదుపులోకి తీసుకుని గౌరారం, బేగంపేట, ములుగు పోలీస్స్టేషన్లకు తరలించారు. -
కాంగ్రెస్ సిగ్గుమాలిన చర్య
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక: ‘సీఎం రేవంత్రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం మంచి పరిణామం కాదు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టచ్ చేసి చూస్తే అర్థమవుతుందని’ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన ఫోన్ లో సాక్షితో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎంత కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తున్నారో తెలుస్తోందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమే కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కు ఉసిగొల్పడం సిగ్గు మాలిన చర్య అన్నారు. ఎర్రవల్లికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మధ్యలోనే పోలీసులు అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. -
సమన్వయంతో పనిచేయండి
తొగుట(దుబ్బాక): ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు సూచించారు. మిరుదొడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పర్పంచ్లు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. డీఏఈ స్వరూపరాణి చేర్యాల(సిద్దిపేట): ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని డీఏఓ స్వరూపరాణి రైతులకు సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అలాగే ప్రతి మంగళవారం జరిగే వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రైతులు పాల్గొని నూతన విషయాలు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం పలు పంటలను ఆమె స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ అఫ్రోజ్, ఆత్మ చైర్మన్ తిరుపతి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. సిద్దిపేటజోన్: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ –2027 కోసం యువత నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా యువజన అధికారి రంజిత్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లాలోని 15 ఏళ్ల నుంచి 29 ఏళ్లు ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వికసిత్ భారత్ ఛాలెంజ్, డిజైన్ ఫర్ భారత్, హ్యాక్ ఫర్ సోషల్ కాజ్,యూత్ ఆంత్ర, యూత్ పార్లమెంట్ అనే అంశాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. ఎంపిక ప్రక్రియ డిజిటల్ క్విజ్, వ్యాస రచన, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజెంటేషన్, గ్రాండ్ ఫినాలే వరకు అనేక దశల్లో కొనసాగుతుందన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): హైదరాబాద్లో జరిగిన అలయన్స్ క్లబ్ సౌత్ మల్టీపుల్ సమావేశంలో సిద్దిపేట అలయెన్స్ క్లబ్కు 4 అవార్డులు వచ్చాయని అలయెన్స్ క్లబ్ సభ్యులు ఆత్మరాములు తెలిపారు. సిద్దిపేటలో అలయెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాలో చేస్తున్న సేవ కార్యక్రమాలకు ఈ అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ అవార్డులతో తమ బాధ్యత మరింతగా పెరిగిందని వారు అన్నారు. చేర్యాల(సిద్దిపేట): కనీస వేతన సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణలో ప్రధాన కార్మిక సంఘాలైన సీఐటీయూ, ఏటీయూసీ, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్యం నిరాకరించడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి శోభ అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ భాస్కర్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లులకు తాళం వేశాం
సిద్దిపేటకమాన్: పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందేనని, అప్పటి వరకు రైస్ మిల్లులకు తాళం వేస్తామని జిల్లా రైస్ మిల్లర్స్ అండ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమురవెల్లి చంద్రశేఖర్, రూరల్ అధ్యక్షుడు చింత రాజు తెలిపారు. పట్టణంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. సివిల్ సప్లై నుంచి మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్పోర్ట్, ఇతర చార్జీలు రానందున మిల్లర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి ఎఫ్సీఐ వారు స్థలం చూపెట్టకపోవడంతో అదే సీజన్లో డెలివరీ చేయలేక పోతున్నామని, దీంతో మిల్లులను డిఫాల్టర్లుగా చిత్రీకరించి 25శాతం ఫెనాల్టితో పాటు 12శాతం వడ్డీ విధిస్తున్నారన్నారు. కొద్ది రోజులుగా అధికారులు తనిఖీ చేస్తూ మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మిల్లింగ్ ప్రక్రియ నిలిపివేసి, మిల్లులు మూసి వేసి తాళాలు కలెక్టర్కు అప్పగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మిల్లర్స్ నాయకులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందే వచ్చే సీజన్లో ధాన్యం తీసుకోం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా, రూరల్ అధ్యక్షులు కొమురవెల్లి చంద్రశేఖర్, చింత రాజు -
టాప్ ర్యాంక్
ఉత్తమ ప్లానింగ్తోజీపీడీపీలో సిద్దిపేట అర్బన్ టాప్ ● 95 శాతం మార్కులు సాధించిన 12 గ్రామాలు సిద్దిపేటఅర్బన్: ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ రూపొందించుకొని పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రవేశపెట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు బడ్జెట్ రూపొందించడం అనే ప్రక్రియ ఇంత వరకు లేదు. కానీ బడ్జెట్ మాదిరిగానే గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ) ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇటీవల రూపొందించిన 2026–27 జీపీడీపీలో సిద్దిపేట అర్బన్ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయి. జీపీడీపీలో భాగంగా గ్రామ ప్రజల అవసరాలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, పచ్చదనం, ఆరోగ్యం, విద్య, మహిళా, శిశు సంక్షేమం, సామాజిక భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. నిర్దిష్ట ప్రణాళికతో పని చేసిన అధికారులు రాబోయే రోజుల్లో గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది, ఏ ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి వాటిలో ప్రాధాన్యత క్రమంలో ఏ పనులను ముందు చేపట్టాలి, వాటి కోసం ఎంత నిధులు అవసరమవుతాయి, గ్రామంలో ప్రధాన మౌలిక వసతుల లేమి ఏంటి అనే విషయాలను గుర్తించి ఆ మేరకు కమిటీ నిర్ధిష్ట ప్రణాళిక రూపొందించింది. ఆ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడంలో అధికారులు విజయవంతంగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. జీపీడీపీ కమిటీకి ఎంపీడీఓ అధ్యక్షుడిగా, ఎంపీఓ కన్వీనర్గా, 14 శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో అంశం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూపొందించిన యాక్షన్ ప్లాన్లో అధికారులు ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకమైన అంశంను కేటాయించి ఆ అంశం వారీగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించారు. 95 శాతం సగటు సాధించిన సిద్దిపేట అర్బన్ మండలంలోని 12 గ్రామ పంచాయతీలు జీపీడీపీలో పాల్గొనగా కనిష్టంగా 93 శాతం మార్కుల నుంచి గరిష్టంగా 98 శాతం మార్కులు సాధించాయి. మండల స్థాయిలో మొత్తంగా 1200 మార్కులకు గాను సిద్దిపేట అర్బన్ మండలం 1143 మార్కులు సాధించి 95 శాతం సగటుతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. గ్రామాల వారీగా తడ్కపల్లి 98%, మందపల్లి 98%, మిట్టపల్లి 97%, బూరుగుపల్లి 96%, ఎన్సాన్పల్లి 96%, పాండవపురం 95%, కిష్ఠసాగర్ 95%, నాంచారుపల్లి 95%, ఎల్లుపల్లి 94%, బక్రిచెప్యాల 93%, పొన్నాల 93%, వెల్కటూరు 93 శాతం సాధించాయి. -
సదరంకిటకిట
జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సదరాని(దివ్యాంగుల వైకల్య నిర్ధ్దారణ పరీక్షల శిబిరం)కి అనూహ్య స్పందన లభించింది. వివిధ రకాల వైకల్య సమస్యలతో బాధపడుతున్న 290 మంది హాజరయ్యారు. వీరికి ఆర్థోపెడిక్, న్యూరో సర్జన్, రేడియాలిజిస్టులు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఆసరా పథకం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దివ్యాంగులు తరలించారు. శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి ధనరాజ్, అదనపు డీఆర్డీఓ సుధీర్లు పరిశీలించారు. –సిద్దిపేటజోన్ -
ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి
ప్రజల అవసరాలను గుర్తించి, ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా సిద్దిపేట అర్బన్ మండలం ముందుకు సాగుతోంది. ప్రణాళికను పకడ్బందీగా రూపొందించడంలో ప్రజలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారం ఎంతగానో తోడ్పడింది. ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయిలో మండలం మెరిసేలా కృషి చేస్తాం. – జోగం రాజు, ఎంపీఓ సిద్దిపేట అర్బన్ -
ఎర్రవల్లిలో హైటెన్షన్
డప్పుకొడుతూ ఫాంహౌస్ ముట్టడికి వెళ్తున్న డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మర్కూక్ వరదరాజుపూర్లో కాంగ్రెస్, బీసీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం.. అదుపుచేస్తున్న పోలీసులుకాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ ఆందోళన కార్యక్రమాలతో మంగళవారం గజ్వేల్ నియోజకవర్గం దద్దరిల్లింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్ను డప్పుచప్పుళ్లతో ముట్టడించడానికి కాంగ్రెస్, పోటీగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలను చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో వందలాది పోలీసులు మోహరించారు. కట్టడికి తీవ్రంగా శ్రమించారు. –గజ్వేల్ స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మాదిగ, మాల సంఘాల జేఏసీతో కలిసి కాంగ్రెస్ వెయ్యి డప్పులతో ఫామ్హౌస్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితోపాటు మాదిగ, మాల సంఘాల నాయకులు కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలోని వర్ధరాజపూర్కు చేరుకున్నారు. డప్పుచప్పుళ్లతో శివారువెంకటాపూర్ రోడ్డువైపు నుంచి ఫామ్హౌస్ వైపునకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ భారీ సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో నర్సారెడ్డికి గాయాలవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం పోలీసుల చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. పోలీసులు వారికి పక్కకు తోసి అక్కడి నుంచి నర్సారెడ్డిని.. ముందుగా ప్రజ్ఞాపూర్ అతిథి ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం..హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోడ్లలోనూ టెన్షన్.. కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో కేసీఆర్ ఫామ్హౌస్కు వెళ్లే ఎర్రవల్లి, శివారువెంకటాపూర్, వర్దరాజపూర్, మర్కూక్, దామరకుంట దారుల్లో టెన్షన్ వాతావారణం నెలకొంది. ఈ దారులను అష్టదిగ్బంధనం చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు రష్మీపెరుమాళ్, జోయల్డేవిస్, అనురాధతోపాటు గతంలో ఇక్కడ పనిచేసిన వెళ్లిన ఏసీపీ స్థాయి, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులను రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి రప్పించి ఆందోళన కార్యక్రమాలను కట్టడి చేయడానికి ప్రయత్నించారు. దామరకుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కృష్ణ ఇంటిపైకి దూసుకెళ్లడం ఉద్రిక్తతను సృష్టించింది. ఈ సందర్భంగా ఆయన ఇంటిపైకి రాళ్ల రువ్వడమేకాకుండా దాడి చేయడంతోపాటు కృష్ణతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం రాళ్లు రువ్వడంతో పలువురు కాంగ్రెస్ నాయకుల కారు అద్ధాలు ధ్వంసమయ్యాయి. వర్ధరాజపూర్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల తోపులాట చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పరస్పర వ్యతిరేక నినాదాలు దద్దరిల్లాయి. ఈ సందర్భంగా ఒకరిపై, మరొకరు చెప్పులు, వాటర్బాటిళ్లను విసురుకున్నారు. ఈ సందర్భంగా చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: నర్సారెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అరాచకం ప్రదర్శించడం వల్లే సమస్యలు వస్తున్నాయని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. ఫామ్హౌస్ ముట్టడి సందర్భంగా గాయపడిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యున్నతమైన పదవిలో ఉన్న స్పీకర్ను ఇష్టానుసారంగా దూషించడమేకాకుండా, పోలీసులపైనే బీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సంఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తం దద్దరిల్లిన గజ్వేల్ నియోజకవర్గం వందలాదిగా పోలీసుల మోహరింపు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్రెడ్డి కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సింగాయిపల్లి వద్ద రాజీవ్రహదారిపై రాస్తారోకో నిర్వహించడం ఉద్రిక్తతను సృష్టించింది. హుటాహుటినా పోలీసులు అక్కడికి చేరుకొని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించారు. కాగా మర్కూక్లో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కర్ణాకర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్ తదితరులు నిర్వహించిన రైతు ధర్నా కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
కేసీఆర్ ఫామ్హౌజ్ చుట్టూ పోలీసుల చక్కర్లు
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యల నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసనలకు దిగింది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌజ్ ముట్టడికి పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ విధించి.. పోలీసులు భారీగా భద్రతను మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో కేసీఆర్ ఫామ్హౌజ్ వైపు ఎవరినీ అనుమతించడం లేదు. అటు వైపు అన్ని మార్గాలను బారికేడ్లతో మూసివేసి, చుట్టుపక్కల పోలీసు వాహనాలతో నిరంతరం పహారా కాస్తున్నారు. ఇటు మర్కుక్ పోలీస్స్టేషన్ వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు డీసీఎంలను సైతం పోలీసులు సిద్ధంగా ఉంచారు. మరోవైపు ఎర్రవెల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ధర్నా శిబిరాన్ని పోలీసులు ఎత్తివేయడంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.ఇదీ చదవండి: రేవంత్ సర్కార్పై హరీష్రావు ఫైర్ -
అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్టులపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులు చేసి, ఇప్పుడు వారినే అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. హైకోర్టు చెప్పినా పట్టించుకోకుండా కేసులు పెట్టి అరెస్టు చేయడం చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.ప్రతిపక్షం అంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయడమే ప్రభుత్వ కుట్రా అని నిలదీశారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22ఏ భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థులు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే అరెస్టులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.“ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అంటే.. తప్పు చేసినవాడే ఎదుటివారిని నిందించడం అని హరీష్రావు పేర్కొన్నారు. పోలీసులు తమపై దాడి చేసి, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్సీలనే అరెస్ట్ చేస్తున్నారని విమర్శిస్తూ.. “దొంగే పోలీసును మందలించినట్టుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తమ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, గొంతు పిసికిన వారిపై చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు, అరెస్టులు చేయడం ఏమిటని హరీష్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యమని వ్యాఖ్యానించారు. ‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం’ అంటూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ గొంతుకను అణచలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా గౌరవ శాసన సభ్యుల ను, మండలి సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించిన పోలీసులే నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గౌరవ మండలి సభ్యులు తాత మధు, నవీన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం…— Harish Rao Thanneeru (@BRSHarish) September 8, 2026 -
జీవో 97 రద్దు చేయాలి
బీఆర్ఎస్వీ నేతలు హుస్నాబాద్: జీవో 97 రద్దు చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ రామ్మూర్తికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురామ్ మాట్లాడుతూ... ప్రభుత్వం తెచ్చి న జీవో 97వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యార్థులకు భరోసా కల్పించి ఉన్నత చదువులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. చీకటి జీవోలు తెచ్చి విద్యార్థులను ఇబ్బంది పెడితే బీఆర్ఎస్వీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ, యూత్ నాయకులు అమర్, శ్యామ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఖమ్మంలో జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో జిల్లా కన్వీనర్గా ఫణీందర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏబీవీపీ జిల్లా నాయకులు సోమవారం మీడియాకు తెలిపారు. జిల్లాలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఫణీందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దుబ్బాకరూరల్: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆకాంక్షించారు. శ్రావణమాసం ఆఖరి సోమవారం పురస్కరించుకుని అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లిలో శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సులోచనస్వామి, ఆలయ పూజారి భాను తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంటీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు గజ్వేల్: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్రావు తెలిపారు. గజ్వేల్ మండలం జాలిగామలో అనారోగ్యంతో బాధపడుతున్న మహ్మద్ ఖాజాబేగంకు రూ.5లక్షల ఎల్ఓసీ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రావు మాట్లాడుతూ...ఆర్థిక పరిస్థితులు చితికిపోయి మెరుగైన చికిత్స చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాచారం ట్రస్ట్బోర్డు డైరెక్టర్ నాయకం శ్రీనివాస్, కొండపోచమ్మ ఆలయ డైరెక్టర్ ఆనంద్, నాయకులు యాదగిరి, నవీన్గౌడ్, గోవింద్, మనోజ్కుమార్, నవీన్చారి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు సిద్దిపేటఅర్బన్/సిద్దిపేటరూరల్: తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాక్షస పాలన సాగుతోందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు వ్యాఖ్యానించారు. సోమవారం శాసనసభ సమావేశాలకు వెళ్తున్న హరీశ్రావు, కేటీఆర్లతో పాటు పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పొన్నాల వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హరీశ్రావు, కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు భౌతిక దాడులు చేయడం హేయమన్నారు. అనంతరం నాయకులు కలెక్టర్ వద్దకు చేరుకుని కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో కలెక్టర్ కె.హైమావతికి వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
ఎండుతున్న పంటలు
● అయోమయంలో రైతులు ● ఒకవైపు వర్షాభావంమరోవైపు కరెంట్ కోతలు ● యూరియా కొరతతో ఇబ్బందులు ఒకవైపు వానలు లేక మరోవైపు కరెంట్ కోతలతో రైతులు సతమతమవుతున్నారు. ఇటీవల వర్షాలకు రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేయగా..గత ఇరవై రోజుల నుంచి వర్షాలు లేక పోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకుని పంటభూములు నెర్రెలు వారుతున్నాయి. కళ్ల ముందే పంటలు ఎండి పోతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. –దుబ్బాకరూరల్ ఎల్నినో ప్రభావంతో వర్షాకాల ప్రారంభంలో వర్షాలు సరిగ్గా కురవక పోవడంతో రైతులు పంట పొలాలను చదును చేసి నాట్లు కొంత ఆలస్యంగా వేశారు. మధ్యలో కొన్ని తుఫానుల కారణంగా పంట పొలాల్లో నీళ్లు నిలవడంతో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వరి నాట్లు వేశారు. వరి నాట్లు వేసి రెండు నెలలు అవుతున్నా వరి పంటలు ఏపుగా పెరిగే దశలోనే వర్షాలు కురవక పోవడంతో నీళ్లు అందక పంటలు నెర్రెలు వారి ఎండిపోయె దశకు చేరాయి. కరెంట్ కోతలు అదనం ప్రభుత్వం పంటల సాగుకు 12గంటలు కరెంట్ ఇస్తామంటూనే కోతలు విధిస్తోంది. ఒక్కో రోజు ఒక్కోవిధంగా కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా చేయాలి. రోజుకు పది, పదకొండు గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్నారు. బ్రేక్ డౌన్లు, ఎల్సీల పేరుతో కరెంట్ కోతలు విధిస్తున్నారు. వచ్చే పన్నెండు గంటల్లో రోజుకు రెండు, మూడు గంటల కరెంట్ కోత విధిస్తున్నారు. దీంతో పంటలు సాగు రైతులకు కష్టంగా మారింది. పైపులతో పంటకు నీళ్లు వరి పంటలకు నీళ్లు అందకపోవడంతో రైతులు బోర్ల నుంచి పైపులు వేసి నీళ్లు అందిస్తున్నారు. రోజుకో మడికి పైపుల ద్వారా పంటలకు నీళ్లు పెడుతున్నారు. దీనికితోడు యాప్లో యూరియా బుక్కాక పోవడంతో రైతులు ఆందోళన చెందున్నారు. -
సీఎం రేవంత్ రాజీనామా చేయాలి
● ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ● గజ్వేల్లో విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ ధర్నా గజ్వేల్: ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతోపాటు యువతకు ఇచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గజ్వేల్లో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్మెంట్ రూ.12వేల కోట్లను ప్రభుత్వం బకాయిపెట్టడం వల్ల విద్యార్థుల చదువులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు. ‘యూత్ డిక్లరేషన్’అమలు చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. విద్యార్థులు, యువత పక్షాన పోరాటం ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాక్రిష్ణశర్మ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ‘ప్రజావాణి’లో ఆర్డీఓకు ఫిర్యాదు గజ్వేల్లోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలతో కలిసి స్థానిక ఆర్డీఓ వీవీఎల్ చంద్రకళకు ఫిర్యాదు చేశారు. -
24గంటల కరెంట్ ఇవ్వాలి
పంటల సాగుకు ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వాలి. 12 గంటల కరెంట్ ఇవ్వడం వలన వరి పంటలు పారడం లేదు. వర్షాలు లేక పోవడంతో పంటలు ఎండి పోతున్నాయి. పైపుల ద్వారా నీళ్లు పెట్టి పారిస్తున్నాం. –భద్రయ్య, రైతు యూరియా కొరతతో సతమతమవుతున్నాం. పంటలను యూరియా చల్లే సమయానికి యూరియా రావడం లేదు. ఏదో ఒక్క షాపుకు యూరియా వస్తే యాప్లో బుక్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్లో సతాయిస్తుండటంతో యూరియా బుక్ కావడం లేదు. యూరియా యాప్ను తొలగించాలి. అందరికీ యూరియా అందేలా చూడాలి. –జోగయ్య, రైతు -
సర్కారు కళాశాలలకే మొగ్గు
ఒకప్పుడు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపిన విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఆధునిక బోధనా పరికరాల ఏర్పాటు, విద్యార్థులు–తల్లిదండ్రులతో నిరంతర అనుసంధానం, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకార్యలపై ప్రచారం వంటి చర్యలు ప్రవేశాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. గతేడాదికంటే ఈ సంవత్సరం 287 ప్రవేశాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెరిగాయి. –సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రూ.2.67 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతీ కళాశాలకు రెండు చొప్పున ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులు, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ బోర్డులు అందించారు. డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించడం ద్వారా విద్యార్థులకు విషయాలను సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. 2025–26 విద్యా ఏడాదిలో మొదటి సంవత్సరంలో 2,986 మంది చేరగా, 2026–27లో 3,273 మంది ప్రవేశాలు పొందారు. ఏడాది వ్యవధిలోనే 287 మంది అదనంగా చేరడం ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది. నంగునూరు, ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గతం కంటే కొంత తక్కువగా ప్రవేశాలు జరిగాయి. రెండుసార్లు పేరెంట్ మీటింగ్లు విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండుసార్లు మెగా పేరెంట్ మీటింగ్లు నిర్వహించారు. కళాశాలల్లో అందుబాటులో ఉన్న బోధన, మౌలిక వసతులు, విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై తల్లిదండ్రులకు వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు జూనియర్ కళాశాల అధ్యాపకులను నోడల్ అధికారులుగా నియమించారు. ఆయా పాఠశాలలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో నిరంతరం సంబంధాలు ఏర్పరచుకున్నారు. విజయగాథలే ‘వాల్ ఆఫ్ ఫేమ్’ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పూర్వ విద్యార్థుల వివరాలతో ప్రత్యేకంగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ఏర్పాటు చేశారు. గతంలో జిల్లాలోని ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం ఏ రంగంలో, ఏ స్థాయిలో ఉన్నారో ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు. కళాశాలలను సందర్శించిన తల్లిదండ్రులు, విద్యార్థులు వీటిని ఆసక్తిగా పరిశీలించారు. ఇది కూడా ప్రవేశాల పెరుగుదలకు ఒక ప్రధాన కారణంగా మారింది. ఉన్నత విద్యకు భరోసా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, నీట్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు సాధిస్తే వారికి వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం అందుబాటులో ఉంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ఇది పెద్ద భరోసాగా మారుతోంది. తక్కువ ఖర్చుతో ఇంటర్మీడియెట్ విద్యను పూర్తి చేసి, ఉన్నత విద్యలోనూ అవకాశాలు పొందవచ్చనే అంశం తల్లిదండ్రులను ప్రభుత్వ కళాశాలల వైపు ఆకర్షిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పెరుగుతున్న ఆదరణ ఈ ఏడాది ఇంటర్లో 287కు పెరిగిన ప్రవేశాలు పూర్వ విద్యార్థుల విజయగాథలే ‘వాల్ ఆఫ్ ఫేమ్’ -
అక్రమ అరెస్టులు దారుణం
బీజేపీ రాష్ట్ర నాయకులు బాలేష్గౌడ్ దుబ్బాక: కాంగ్రెస్ సర్కార్ పిరికితనానికి అక్రమ అరెస్టులే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్గౌడ్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల వేల కోట్ల ఫీజు బకాయిలు ఎగ్గొట్టడాన్ని నిరసిస్తూ సోమవారం బీజేపీ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కి వెళ్లనివ్వకుండా దుబ్బాకలో పోలీసులు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎగ్గొట్టి 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును రేవంత్ సర్కార్ కాలరాస్తుందన్నారు. కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా బాలేష్గౌడ్తోపాటు బీజేపీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు శ్రీకాంత్యాదవ్, ప్రవీణ్కుమార్, రమేశ్రెడ్డి, రమణారెడ్డి, నేహాల్గౌడ్, మనోజ్గౌడ్ తదితరులున్నారు. -
మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమ వారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామి వారికి అభిషేకాలు, నిత్యకల్యాణం, గంగా పూజ, మహాగణపతి పూజ, పంచామృత, ,రసపంచామృత, ఏకదశరుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, పు ష్పార్చన, అన్నపూజ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ది శ్రీని వాస్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ అర్చకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పర్యావరణాన్ని పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన వినాయకులను పూజించడం వల్ల చెరువులు, కాలువలు కలుషితమవుతున్నాయని ఈ క్రమంలో మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా అధికారిక దత్తత కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిదేళ్ల బాలుడిని కరీంనగర్ జిల్లాకు చెందిన సింగిల్ పేరెంట్ మహిళకు కలెక్టర్ చేతుల మీదుగా అధికారికంగా దత్తత అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...బాబును బాగా చదివించాలని, అతడికి ఇష్టమైన రంగంలో ప్రోత్సాహమిస్తూ బాలుడి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే సిద్దిపేటలో గల శిశు గృహ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజావాణికి 70 దరఖాస్తులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 70 దరఖాస్తులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ హైమావతి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల్లో ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కాగా, ప్రజావాణి కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు ఆలస్యంగా హాజరుకావడంతో విషయాన్ని గమనించిన కలెక్టర్ హైమావతి సదరు జిల్లా అధికారులను ప్రజావాణి కార్యాలయం లోపలికి అనుమతించలేదు. దీంతో కొద్ది సేపు అదికారులు బయటనే వేచి ఉన్నారు. -
గ్రామాలాభివృద్ధికి నిధులివ్వండి
అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల సమగ్రాభివృద్ధికి నిధులివ్వాలని కోరుతూ ఆదివారం అక్కన్నపేట మండలంలోని పలువురు సర్పంచులు రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు మర్యాద పూర్వకంగా హైదరాబాద్లో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బానోతు వెంకటేశ్ నాయక్ మాట్లాడుతూ..మండలంలో మొత్తం 38గ్రామాలు ఉండగా అందులో 06 గిరిజన తండాలు( శ్రీరాంతండా, చౌటకుంట, సేవాలాల్ మహారాజ్తండా, హాతీరాం అంబనాయక్తండా, దాసుతండా, కెప్టన్ చౌడుతండా)లు గ్రామాలుగా ఏర్పాటు కాగా, జీపీలో ఉన్న నిధులు విత్డ్రాలు కావడంలేదన్నారు. జీపీడీపి ప్లాన్ లేదని, జీపీలో ఉన్న నిధులు తీసుకునేందుకు అవకాశం కల్పించాలని విన్నవించినట్లు చెప్పారు. సర్పంచులుగా గెలిచినప్పటి నుంచి సుమారుగా తొమ్మిది నెలల కాలం వ్యవధిలో గ్రామా భివృద్ధిలో భాగంగా రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ఖర్చు చేసిన డబ్బులు తీసుకునేందుకు ‘జీపీడీపీ’అడ్డంకిగా మారిందన్నారు. పైన పేర్కొన్న విషయాలపై మంత్రి పొన్నంతోపాటుగా పంచాయితీరాజ్ మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్ను కూడా కలిసి విన్నవించామని వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు పలువురు సర్పంచుల వినతి -
ఎమ్మెల్యేగా కేసీఆర్ రాజీనామా చేయాలి
బెజ్జంకి(సిద్దిపేట)ః రూ.23 కోట్ల రూపాయల వేతనం తీసుకుంటూ అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెజ్జంకిలో ఆదివారం బీఆర్ఎస్, కేసీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. అనంతరం సహకార సంఘం చైర్మన్ దామోదర్, ఏఎంసీ చైర్మన్ కృష్ణలతో కలిసి ఆయన మట్లాడుతూ.. దళితుడు స్పీకర్గా ఉన్నాడని అసెంబ్లీకి రాని కేసీఆర్ దళితద్రోహని ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేతనంగా తీసుకున్న రూ.23 కోట్లను సీఎం సహాయ నిధికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మానకొండూర్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను విమర్శించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు, సర్పంచ్లు రత్నాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సంపత్రెడ్డి, రమేశ్, సంతోశ్, రాములు,నర్సింగం, సందీప్, శరత్, తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకిలో కాంగ్రెస్ నాయకుల భారీ ర్యాలీ -
బెజ్జంకిలో స్వల్ప ఉద్రిక్తత
బెజ్జంకి(సిద్దిపేట): బీఆర్ఎస్, కాంగ్రెస్ల నిరసన కార్యక్రమాలతో ఆదివారం బెజ్జంకిలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలో ధ్వంసమైన రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బెజ్జంకి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా రూ.23 కోట్ల వేతనం తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగించారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ తిరుపతి అడ్డుకుని భగ్నం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ర్యాలీ ప్రశాంతంగా సాగింది. రోడ్ల కోసం బీఆర్ఎస్ నిరసన -
సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
గజ్వేల్: సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎంపీ రఘునందన్రావు అన్నారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్లో టీఆర్ఎస్ఎంఏ(తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తమదైన శైలిలో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయులంటే తనకెంతో గౌరవమని, వారి సమస్యల పరిష్కారానికి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ...ప్రైవేటు పాఠశాలలో యాజమాన్యాలు సంయుక్తంగా గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అభినందనీయమన్నారు. ఎంపీ రఘునందన్రావు టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం -
ఏటీసీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఇర్కోడ్ ఏటీసీ ప్రిన్సిపాల్ రామానుజ సిద్దిపేటరూరల్: ప్రభుత్వ అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ ఇర్కోడ్లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్.రామానుజ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పదవ తరగతి పాసై, పై చదువులు మధ్యలో ఆపేసిన వారు అర్హులని, ఎలాంటి వయో పరిమితి లేదని తెలిపారు. దరఖాస్తుదారులు ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు www.iti.telangana. gov.inవెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ 15 సీట్లు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ 11 సీట్లు, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ 10 సీట్లు అందుబాటులో ఉన్నాయని, రెండు సంవత్సరాల అడ్వాన్స్ సీఎన్సీ మెషినింగ్ టెక్నీషన్ 2 సీట్లు, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ 19 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పదవ తరగతి మెమో, బోనాఫైడ్, కుల ధ్రువీకరణపత్రం, ఈ మెయిల్ ఐడీ, ఫొటో, ఫోన్ నంబర్తో ఇర్కోడ్ ఏటీసీ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. వర్గల్కు ‘వైకుంఠ రథం’ వర్గల్(గజ్వేల్): తమ తండ్రి, దివంగత ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం వర్గల్ మాజీ సర్పంచ్ తూంకుంట గోపాల్రెడ్డి గ్రామానికి వైకుంఠ రథాన్ని వితరణ చేశారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆదివారం రథపూజలో పాల్గొని గ్రామానికి అంకితం చేశారు. అనంతరం దాతను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మోహన్, రంగారెడ్డి, ఉపసర్ప ంచ్ గోవర్ధన్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
జెట్టింగ్ యంత్రం వచ్చేనా?
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 2020 జూన్లో ప్రారంభమైన యూజీడీ పనులు అంచనాలు పెరిగి...రూ.155కోట్లతో పూర్తి చేశారు. ఇందులోభాగంగానే 130కిలోమీటర్ల భూగర్భ మురుగునీటి పైప్లైన్ వ్యవస్థతోపాటు నాలుగు చోట్ల ఎస్టీపీ(సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్)ల నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవస్థ గత మూడున్నరేళ్లుగా అందుబాటులోకి వచ్చింది. కానీ పనులు లోపభూయిష్టంగా సాగటం వల్ల పలు కాలనీల్లో నిర్మించిన పైప్లైన్లకు లీకేజీలేర్పడ్డాయి. మరోవైపు కొన్ని చోట్ల చాంబర్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా జనావాసాల్లోకి యూజీడీ మురుగునీరు పారుతోంది. ఎక్కడైనా యాజీడీ చాంబర్లు నిండితే..వాటిని క్లియర్ చేయాల్సిన జెట్టింగ్ యంత్రం ఈ మున్సిపాలిటీకి అందుబాటులో లేదు. రూ.155కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీకి రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సాకుతో సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ మున్సిపాలిటీకి జెట్టింగ్ యంత్రం సమకూర్చలేదు. ఫలితంగా యూజీడీ నిండినా, లీకేజీలేర్పడి క్లియర్ చేయాల్సి వస్తే...గతంలో సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులను బతిమాలుకొని ఇక్కడికి జెట్టింగ్ యంత్రాన్ని తెప్పించుకునేవారు. అది కూడా కొన్ని గంటలు మాత్రమే వచ్చి వెళ్లేది. దీనివల్ల చాంబర్లు క్లియర్ కాక, రోడ్లపైనే దుర్గంధం పారేది. త్వరలోనే కొనుగోలు చేస్తాం పాలకవర్గ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో జెట్టింగ్ యంత్రం కొనుగోలుకు మార్గం సుగమమైంది. త్వరలోనే కొత్త యంత్రం కొనుగోలు చేస్తాం. ఇందుకు సంబంధించి ఓ ఏజెన్సీని సంప్రదించాం. – గణేశ్రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ పాలకవర్గ సభ్యుల మధ్య ఏకాభిప్రాయంలో ఆలస్యం నెలకొనడం..గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అదనపు భారాన్ని మోపుతోంది. ఇక్కడ రూ.155 కోట్ల వ్యయంతో యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనులు పూర్తి చేసినా రూ.60లక్షలు ఖర్చుపెట్టి శుద్ధి యంత్రం సమకూర్చలేకపోయారు. రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో ఈ యంత్రం కొనుగోలులో జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని నెలలుగా యూజీడీ నిర్వహణకు నెలకు రూ.2లక్షలు అద్దె చెల్లించాల్సి రావడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోకస్ ఇది. –గజ్వేల్ ఏకాభిప్రాయంలో ఆలస్యంతో.. మున్సిపాలిటీపై భారం జెట్టింగ్ యంత్రంకు సంబంధించిన వాస్తవ పరిస్థితులన్నీ పాలకవర్గ సభ్యులకు తెలుసు. కొత్త యంత్రం కొనుగోలు చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన కీలకమైన విషయమని కూడా స్పష్టంగా తెలుసు. అయినా 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ.60లక్షల వరకు వెచ్చించి సొంత జెట్టింగ్ కొనుగోలు విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఎవరి ఎజెండా వారు అమలు చేశారు. జెట్టింగ్ యంత్రం కొత్తది ఎందుకు...? అని కొందరు కౌన్సిలర్లు, యంత్రం కొనుగోలు చేసే డబ్బులను వడ్డీకిచ్చి ఆ డబ్బులతో అద్దె చెల్లిస్తే సరిపోతుందని మరికొందరు వాదించారు. దీంతో సొంత యంత్రం కొనుగోలులో నెలల తరబడి జాప్యం నెలకొంది. ఈ మధ్యలో పట్టణంలో యూజీడీ సమస్యలు తలెత్తి...నెలల తరబడి నెలకు రూ.2లక్షల అద్దైపె జెట్టింగ్ యంత్రాన్ని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ లెక్కన మార్చి నెల నుంచి ఇప్పటివరకు లక్షల్లో దీనికోసం వెచ్చించారు. ఇప్పటికే ఇంటి పన్నుల చెల్లింపుల్లో వెనుకబడి...2025–26ఏడాదికి సంబంధించి రూ.3కోట్ల వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రాక, ఆర్థిక కష్టాల్లో ఉన్న మున్సిపాలిటీకి ఈ పరిణామం గుదిబండగా మారింది. అద్దె చెల్లించేబదులు...కొత్త యంత్రం మేలు విషయాన్ని ముందుగానే గ్రహించి ఉంటే వృథా ఖర్చు తప్పేది. ఎట్టకేలకు ఇటీవల ఈ అంశంపై పాలకవర్గం ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇప్పటికై నా త్వరలో జెట్టింగ్ యంత్రం తెప్పించి వృథాకు చెక్ పెట్టాల్సి ఉంది. ఈ ఒక్క అంశమే కాదు. ప్రజలకు పనికొచ్చే పనుల్లో పాలకవర్గ ఏకాభిప్రాయలోపం అనర్థాలను సృష్టిస్తోంది.కొనుగోలు కోసం ఏకాభిప్రాయంలో జాప్యం జెట్టింగ్ యంత్రం అద్దెకు రూ.2లక్షలు చెల్లించాల్సిన దుస్థితి సొంత జెట్టింగ్ యంత్రం కొనుగోలుతోనే సమస్యకు పరిష్కారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుస్థితి -
శనిగరం ఫిష్హబ్ పనులెప్పుడో!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం యుద్ధప్రాతిపదికన స్థల సేకరణ పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించినప్పటికీ ఆచరణలో మాత్రం ప్రక్రియ ఇప్పటికీ మొదలుకాలేదని తెలిసింది. హైవేకు సమీపంలో అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించడం దానికి సంబంధించిన నిధులు కేటాయింపుపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. 4,827 ఎకరాల విస్తీర్ణం కలిగిన శనిగరం ప్రాజెక్టులో ఏటా భారీగా చేపల దిగుబడి వస్తున్నందున ఇక్కడ అత్యాధునిక హంగులతో కూడిన మార్కెట్ యార్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాల్సిన అవసరం ఉంది. దిగుబడి పెరుగుతోంది..మార్కెట్ ఎక్కడ? ప్రాజెక్ట్లో ఇప్పటికే 10లక్షల చేప పిల్లలు 4లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసి దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఇవి పెద్దవయ్యక మత్స్యకారులు నష్టపోకుండా సరైన ధరకు అమ్ముకోవడానికి ఈ షిష్హబ్ సకాలంలో అందుబాటులోకి రావాల్సి ఉంది. మార్కెటింగ్ సదుపాయం, కోల్డ్స్టోరేజీల నిర్మాణం ఆలస్యమైతే మత్య్సకారులకు ఇబ్బందులు తప్పవని స్థానిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి.. మత్స్యకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలనే ప్రభుత్వ ఉద్దేశం మంచిదైనప్పటికీ క్షేత్ర స్థాయిలో పనులను మరింత వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం ప్రణాళికల రూపకల్పనకే పరిమితం కాకుండా తక్షణమే బడ్జెట్ నిధులు విడుదల చేసి ఈ ఫిష్హబ్ పనులను ప్రారంభించాలని తద్వారా ఈ ప్రాంత మత్స్యకారులకు త్వరగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. శనిగరం ప్రాజెక్ట్ శనిగరం ప్రాజెక్ట్ పరిధిలోని మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన ఫిష్హబ్ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాజీవ్ రహదారికీ ఆనుకుని అత్యాధునిక హంగులతో భారీ విక్రయ కేంద్రం, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన వెలువడి నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో మత్స్యకారులు కొంత ఆందోళన నెలకొంది. –కోహెడరూరల్(హుస్నాబాద్) మంత్రి పొన్నం ప్రకటించిన మాస్టర్ప్లాన్ షిష్హబ్ ఏర్పాటుపై ఇంకారాని స్పష్టత క్షేత్రస్థాయిలో వేగవంతం కాని స్థలసేకరణ ప్రాజెక్టులో పెరిగిన చేపల దిగుబడి విక్రయ కేంద్రం కోసం ఎదురుచూపులు -
హామీలు నెరవేర్చని సీఎం గద్దె దిగాలి
బెజ్జంకి(సిద్దిపేట): ఆరుగ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. బెజ్జంకిలో మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతు కోసం ఆదివారం ప్లకార్డులతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వెయ్యి రోజుల్లో ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంస్కార హీనంగా మాట్లాడుతున్న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఉపాధ్యాయ వృత్తిని అగౌరవ పరిచినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, సర్పంచ్లు, నాయకులు శ్రీధర్, భీమయ్య, నిర్మల, కవిత, రాజయ్య, చంద్రకళ, లక్ష్మణ్, తిరుపతి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్గుప్త, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ -
బహుజనులు రాజ్యాధికారం సాధించాలి
రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల చంద్రం ప్రశాంత్ నగర్(సిద్దిపేట): సకల జనులు సమ్మె చేసి సాధించుకున్న తెలంగాణలో రాజ్యాధికారం ఆధిపత్య కులాలదే అయిపోయిందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆధిపత్యకులాల్లోని పేదల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల చంద్రం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో ఆదివారం ఐక్యవేదిక జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తెల్జీరు శ్రీనివాస్యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మా ఓట్లు మావాళ్లకే అనే నినాదంతో ఐక్యవేదిక పనిచేస్తుందన్నారు. బహుజనుల రాజ్యాధికారం సాధించే దిశగా ఐక్యవేదిక పోరాటం చేస్తుందని తెలిపారు. కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వీడటంలేదు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సమయంలో స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన వీధి దీపాల స్తంభాలు అడ్డుగా ఉన్నాయని తొలగించి పక్కకు పడవేశారు. కానీ ఇంతవరకు మళ్లీ తిరిగి బిగించకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో స్టేషన్ ఆవరణ చీకటిగా ఉంటుందని అటు వైపు వెళ్లాలన్నా భయపడుతున్నార ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను బిగించి లైట్లు అమర్చాలని కోరుతున్నారు. సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని చంద్రమౌళి గార్డెన్స్లో ఆదివారం జిల్లా యోగా ఛాంపియన్ పోటీలు కనులవిందుగా సాగాయి. ట్రెడిషనల్, ఆర్టిస్టిక్, రిథమిక్, తదితర అంశాల్లో వయస్సుల వారీగా బాలబాలికలకు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 300 యోగ క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలను ప్రముఖ యోగ గురువు గణేశ్ రవికుమార్, సిద్దిపేట యోగాసనా అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, జిల్లా యోగ శిక్షకుడు సతీశ్ సంధ్యలు పర్యవేక్షించారు. అంతకుముందు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి, మెడికల్ కళాశాల ఆర్ఎంఓ సదానందం జ్యోతి ప్రజ్వలన చేసి సందేశమిచ్చారు. వర్గల్ క్షేత్రంలో భక్తుల సందడి వర్గల్(గజ్వేల్): వర్గల్ శ్రీవిద్యాసరస్వతీ క్షేత్రం ఆదివారం చిన్నారుల అక్షర స్వీకారాలతో అలరారింది. శ్రావణమాసం దశమి శుభకరమని తల్లిదండ్రులు తమ చిన్నారులకు క్షేత్రంలో అక్షరాభ్యాసాలు జరిపించారు. మరోవైపు శ్రావణ వేళ దైవదర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. కొండపైన సరస్వతి అమ్మవారిని, శంభులింగేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుని, శనీశ్వరుని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. బెజ్జంకి(సిద్దిపేట): కరీంగనర్లో ఆదివారం నిర్వహిస్తున్న ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు మండలం నుంచి సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు తరలివెళ్లారు. సభలకు వెళ్లినవారిలో మండల కార్యదర్శి రూపేశ్, పరశురాములు, రాములు, వేణు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రావణమాసంలో చివరి వారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. క్షేత్రానికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టడం లాంటి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు స్వామి వారి నిత్య కల్యాణంలో పాల్గొని కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించి వేడుకున్నారు. స్వామి వారిని రాష్ట్ర నీటి పారుదల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు, కరీంనగర్ నీటిపారుదల జిల్లా అధ్యక్షుడు గంగర రమేశ్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
‘ మా అసెంబ్లీ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాం’
సిద్ధిపేట: రేపట్నుంచి(సోమవారం, సెప్టెంబర్ 07వ తేదీ) ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ నష్టం చేసిందని, ఆ పార్టీ ప్రజలకు చేసిన ద్రోహాల మీద అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. ‘ఈ అసెంబ్లీ కనీసం నెల పెట్టాలని మేము బీఏసీలో డిమాండ్ చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ద్రోహాల మీద నిలదీస్తాం. 22a అంశం పై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాబోయే కొద్ది రోజుల్లో లక్షలాది మందితో కాళేశ్వరం ఎత్తిపోతల, రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. రాజీనామా చేయాల్సి వస్తే మీరే చేయాలి. అన్ని విషయాల్లో ఫెయిల్ అయిన మీరే రాజీనామా చేయాలి.ప్రధాన ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వడం లేదు. సీఎం బూతులు తిడుతున్న ఈ సభ కు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు అని అందరం ఎమ్మెల్యేం చెప్పాం. మీ తమ్ముడు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. ఆయనకు ఎందుకు గన్మెన్లను ఇచ్చి ఖర్చు పెడుతున్నారు. అసెంబ్లీ కనీసం నెలరోజులు జరగాలని మేము స్పీకర్ ను కోరుతాం.సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ను అడుగుతాం. మాకు తగిన సమయం ఇవ్వకపోతే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా వెనకాడం’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి:త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్ కీలక ప్రకటన -
ఆరు గ్యారంటీలని చెప్పి మోసం చేస్తారా?
సిద్దిపేటకమాన్: ఆరు గ్యారంటీలని చెప్పి ప్రజలను మోసం చేసిన రేవంత్రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై శనివారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం 97జీఓ రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, 2లక్షల ఉద్యోగాల సంగతిపై అసెంబ్లీలో నిలదీస్తానన్నారు. రైతు బీమా, ఫీజు రీయింబర్స్మెంట్, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు ఎక్కడ పోయాయని, కేసీఆర్ తెచ్చిన అన్ని స్కీమ్లు బంద్ చేశారన్నారు. సిద్దిపేట ప్రజల కోసం శిల్పారామం, రంగనాయక సాగర్ టూరిజం అభివృద్ధి చేస్తుంటే వాటి పనులను ఆపారన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టడం కాదని, నాపై పెట్టుకోండని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రూ.20వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, ఫార్మసీ, లా తదితర కోర్సుల్లో చదివించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్రెడ్డి పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ కాస్తా ‘జాబ్ లెస్’ క్యాలెండర్ అయిపోయిందని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని, 16వేలు మాత్రమే ఇచ్చారన్నారు. ఏడు గంటల కరెంట్ కూడా వస్తలేదని వరిచేనులు ఎండిపోయి వ్యవసాయానికి ఇబ్బంది అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతానన్నారు. కాగా నిరసన కార్యక్రమానికి విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. విద్యార్థులు హరీశ్రావుతో సెల్పీలు దిగడానికి పోటీ పడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెర్గు రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవిందర్రెడ్డి, పాల సాయిరాం, బీఆర్ఎస్, విద్యార్థి విభాగం నాయకులు, భారీ సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమా? 97జీఓ రద్దుకు అసెంబ్లీలో పోరాడుతా రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు ఏమయ్యాయి? మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ నా టైమ్ వస్తే ఊరుకుంటానా..!సిద్దిపేటజోన్: ‘సీఎం రేవంత్ రెడ్డి.. మీకు సిద్దిపేట మీద ఎందుకు అంతా కోపం.. ప్రస్తుతం మీ టైమ్ నడుస్తోంది.. రెండేళ్లు ఆగితే మా టైమ్ వస్తుంది. అప్పుడు ఊరుకుంటానా.. వెటర్నరీ కళాశాలను తిరిగి వెనక్కి తీసుకొస్తా.. నా ప్రాణం ఉన్నంతవరకు ఇంకా సిద్దిపేట అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటా’నని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక విపంచి ఆడిటోరియంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రెషర్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా విద్య, వైద్యం పరంగా అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. సిద్దిపేటలో తన కోరిక మేరకు అప్పటి సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. -
అసెంబ్లీకి వస్తారా? రారా?
గజ్వేల్: అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై నిర్వహించే చర్చలో పాల్గొంటారా? లేక తన పదవికి రాజీనామా చేస్తారో కేసీఆర్ తేల్చుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, పరిశ్రమలు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్లో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిల ఆధ్వర్యంలో శనివారం గజ్వేల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో మంత్రి వివేక్ పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ అవినీతికి పరాకాష్టగా మారిందన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో రూ.1000కోట్ల క్విడ్ప్రోకు పాల్పడ్డారన్నారు. మరోవైపు ఫార్ములా వన్ రేసింగ్లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయంగా మారటం వల్లే ప్రజలు గద్దె దింపారని అన్నారు. ఓట్లేసి గెలిపించిన గజ్వేల్ ప్రజలను సైతం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అవీనితిని అడ్రస్గా మారిన కాళేశ్వరంపై సమగ్రంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికై నా ఈనెల 7నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరై చర్చల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పదవికి రాజీనామా చేయాలన్నారు. కాగా అభివృద్ధి, సంక్షేమంపై తమ ప్రభుత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గత బీఆర్ఎస్ సంక్షేమాన్ని విస్మరిస్తే...నేడు తమ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతోందన్నారు. అంతకుముందు గజ్వేల్ రింగు రోడ్డుపై కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నేత వి.హన్మంతరావు మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటికై నా ఎర్రవల్లి ఫామ్హౌస్ వీడి.. అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి, ఏఎంసీ చైర్మన్లు నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విజయామెహన్, వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, కాంగ్రెస్ ప్రచార కమీటీ కన్వీనర్ నిమ్మ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.గజ్వేల్ ప్రజలను మోసం చేస్తారా? ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫలం కార్మిక శాఖ మంత్రి వివేక్ గజ్వేల్లో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ -
దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠకు రండి
మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వానం మర్కుక్(గజ్వేల్): అంగడికిష్టాపూర్లో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు శనివారం ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ విషయమై కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. కేసీఆర్ను కలిసిన వారిలో అంగడికిష్టాపూర్ సర్పంచ్ కొండల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మర్కుక్ కరుణాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మంద బాల్రెడ్డి, నాయకులు తదితరులున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ సిద్దిపేటకమాన్: రాజీపడే కేసులను గుర్తించి సత్వరం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో న్యాయమూర్తి శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో రాజీ ద్వారా కేసులు పరిష్కరించడటం వల్ల కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య తగ్గడంతో పాటు కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు జయప్రసాద్, సౌజన్య, ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు పాల్గొన్నారు. చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యుత్ కోతలు నివారించాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని మాచాపూర్ రైతులు శనివారం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. త్రీఫేజ్ కరంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియడం లేదని రైతులు ఆరోపించారు. రోజుకు వ్యవసాయానికి 8 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని, లోవోల్టేజీతో బోరుమోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని వాపోయారు. దుబ్బాక: విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ..విద్యార్థుల అభ్యున్నతికి కృషిచేస్తున్న లచ్చపేట మోడల్ స్కూల్ పీజీటీ సివిక్స్ ఉపాధ్యాయులు రాదారి నాగరాజు ప్రతిష్టాత్మకమైన శిక్షా రత్న అవార్డు–2026కు ఎంపికయ్యారు. విద్య, బోధన, కెరీర్ మార్గనిర్దేశం, కోచింగ్, అకాడమి క్ లీడర్షిప్ రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను నాగరాజు శిక్షా రత్న అవార్డు వరించింది. ఆదివారం హైదరబాద్లో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచిందన్నారు. యూరియా కోసం దుబ్బాకరూరల్: మండలంలోని చీకోడ్ గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. యాప్లో ఇబ్బందులు ఉండటం వల్ల బుక్ కావడం లేదని ఆరోపించారు. యూరియా కొరత వలన పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ నేతలపై పీఎస్లో ఫిర్యాదు
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితోపాటు వారి అనుచరులపై కేసు నమోదు చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం గజ్వేల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను అగౌరవపరచడం సిగ్గుచేటన్నారు. గజ్వేల్లో కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే వారు అధికారంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? అర్థం కావడంలేదన్నారు. వారం రోజుల్లో కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
బీడీ కార్మికుల జీవనభృతిపై అసెంబ్లీలో మాట్లాడుతా..
దుబ్బాక: బీడీ కార్మికుల జీవనభృతి రూ.4,016 అమలుచేయకపోవడంపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా 7 లక్షల మందికి పైగా బీడీ పరిశ్రమపై ఆధారపడి కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రూ.4,016 జీవనభృతి ఇస్తామని చెప్పి మూడేళ్లు అవుతున్నా అమలుచేయక పోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.భాస్కర్,సీఐటీయూ నాయకులు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా..వచ్చే ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ శనివారం జిల్లా రూరల్ పారాబాయిల్డ్ రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింత రాజు, కూర వేణు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి -
అధికారుల్లో కదలిక
ల్యాప్టాప్ మాయంపై ఆరా సిద్దిపేటజోన్: సిద్దిపేట బల్దియాలో ల్యాప్టాప్ల మాయంపై సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అరా తీసినట్లు తెలిసింది. బదిలీపై వెళ్లిన మెప్మా అధికారి ఒకరు ల్యాప్ టాప్ సరెండర్ చేయలేదని నిర్ధారణకు వచ్చిన అధికారులు సదరు మెప్మా అధికారికి నోటీసు జారీ చేశారు. అదేవిధంగా మరో ల్యాప్టాప్ బల్దియాలో బీరువాలో భద్రంగా ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా ల్యాప్ టాప్ గుట్టు రట్టు చేసేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. -
సన్నగా నొక్కేస్తుండ్రు
తిన్నగా నల్ల బజార్కు రేషన్ బియ్యంఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026జిల్లా వ్యాప్తంగా 3,36,869 రేషన్ కార్డులుండగా వీరికి 6,583 మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున అందజేస్తున్నారు. ఆగస్టు నెలలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ప్రభుత్వం పంపిణీ చేసింది. గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో అందులో 70శాతానికి పైగా బ్లాక్ మార్కెట్కు చేరేవి. దీంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గతేడాది ఏప్రిల్ నెల నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యంను పంపిణీ చేస్తోంది. ఇంటింటికీ తిరుగుతూ.. రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు రైస్ మిల్లర్లు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. కిలోకు రూ.15 నుంచి రూ18ల వరకు కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లర్లకు రూ.25 నుంచి రూ.30లకు విక్రయిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమీపంలో చైనా బజార్ కేంద్రంగా రోజు రేషన్ బియ్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా రేషన్ బియ్యం ప్రతి నెలా లక్షలాది రూపాయలు లావాదేవీలు జరుగుతున్నాయి. చైనా బజార్లో రేషన్ బియ్యం దందా జరుగుతుందని రెవెన్యూ , పోలీసులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అలాగే జిల్లా సరిహద్దులైనా రాయపోలులో ఓ మిల్లు అడ్డగా రేషన్ దందా కొనసాగుతోంది. సీఎంఆర్ కింద అందించే బియ్యానికి బదులు రేషన్ బియ్యంనే అందజేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రేషన్ అక్రమ దందాను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై డీఎస్ఓ తనూజను ఫోన్ సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 30శాతానికి పైగా పక్కదారి సన్న బియ్యం చాలా మంది వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటున్నప్పటికీ, కొందరు బయట విక్రయిస్తున్నారు. మొదట చాలా మంది సన్న బియ్యం విక్రయించకపోయినప్పటికీ బియ్యంలో 25శాతం వరకు నూకలు ఉండటం, అన్ని రకాల సన్నాలు మిక్స్డ్గా వస్తుండటంతో వాటిని 30శాతానికి పైగా వినియోగదారులు సద్వినియోగం చేసుకోవడం లేదు.పవర్ బ్యాంకులు మాయం కిలోకు రూ.15పైగా లబ్ధిదారుల నుంచి కొనుగోలు ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్న టీంలు సిద్దిపేటలో చైనా బజార్ కేంద్రంగా రేషన్ దందా చోద్యం చూస్తున్న రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులుఇటీవల జరిగిన ఘటనలు.. రాయపోల్ మండలం రామవరంలోని మహాలక్ష్మి రైస్ మిల్లులో 400 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఈ నెల 2న తెల్లవారు జామున పట్టుకున్నారు. ఆగస్టు 31న అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామ శివారులో ఉన్న బాలాజీ రైస్ మిల్లులో 188 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 30న నంగునూరు మండలం రామచంద్రపూర్లో మోతె సాయిలు రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ ఉన్న 150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రాజగోపాల్పేట పోలీసులు పట్టుకున్నారు.రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తే.. పేదోళ్ల కడుపు నింపిన వాళ్లమవుతామన్న ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది నుంచి పంపిణీ చేస్తోంది. గతంలో దొడ్డు బియ్యం చాలా వరకు తినకుండా బయట విక్రయించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా దాదాపు 30శాతానికి పైగా జిల్లాలో పక్కదారి పడుతున్నాయి. పలువురు ఇంటింటికీ తిరుగుతూ ‘బియ్యం కొంటాం... ’ అంటూ మైకులు పెట్టుకుని బహిరంగంగా తిరుగుతూ వినియోగదారుల నుంచి సన్న బియ్యం కొనుగోలు చేస్తూ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. అయినా పౌరసరఫరాలు, రెవెన్యూశాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట -
ఉత్తమ ఉపాధ్యాయులేరీ?
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికపై జాప్యం జరుగుతుండటంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి అవార్డులు ఇవ్వడం ప్రతి ఏటా కొనసాగుతుంది. అయితే ఎంపిక సెప్టెంబర్ 5లోగా చేసి, ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటిస్తారు. కాని ఈసారి ఎంపికలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇంతవరకు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యాసంవత్సరం జిల్లా వ్యాప్తంగా 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తున్నారు. అందుకు గాను జిల్లా వ్యాప్తంగా 100 వరకు దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, మన జిల్లాలో ఇంత వరకు ఎంపిక కాకపోవడంపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ఇవ్వని అధికారులు జిల్లాలో రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో విద్యావ్యవస్థ పూర్తిగా గడితప్పిందనే విమర్శలు ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదని ఉపాధ్యాయులే వాపోతున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక విషయమై విద్యాశాఖ అధికారులను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.ఎంపికలో ఆలస్యం -
సహస్రం..హరిత వికాసం
వర్గల్(గజ్వేల్): ఒకే రోజు 1000 కొబ్బరి చెట్లు..మెగా హరితహారం కార్యక్రమానికి వర్గల్ మండలం శేరిపల్లి గ్రామం వేదికగా నిలిచింది. శనివారం థామ్సన్ రైటర్స్, మ్యాజిక్ బస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సహకారంతో ఈ మెగా కార్యక్రమం జరిగింది. రోడ్డు ఇరువైపులా, పెద్దమ్మ గుడి, బీరప్ప గుడి, పోచమ్మ గుడి, దొడ్డి కొమురయ్య విగ్రహం దగ్గర, వైకుంఠధామం తదితర చోట్ల కొబ్బరిచెట్లు నాటే ఈ కార్యక్రమంలో సర్పంచ్ యెర్ర పావని, సంస్థ ప్రతినిధులు, గ్రామస్తులు భాగస్వాములయ్యారు. కొబ్బరిచెట్లు ఆదాయాన్ని, గ్రామ శోభను ఇనుమడింపజేస్తాయని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. శేరిపల్లిలో మెగా ప్లాంటేషన్ ఒకే రోజు 1000 కొబ్బరి మొక్కలు -
కనులపండువగా కృష్ణాష్టమి
కృష్ణాజన్మష్టమి వేడుకలను శుక్రవారం జిల్లా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సుందర సత్సంగం, వేంకటేశ్వర, సంతోషిమాత తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉట్టి కొట్టేకార్యక్రమాలను చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. – ప్రశాంత్నగర్(సిద్దిపేట)మల్లన్న ఆలయంలో ..కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద పట్నం వేసి పూజలు చేశారు. ఆలయ ఒగ్గు పూజారులు శ్రీకృష్ణుడు, గొల్లబామ, రుక్మిణి వేషధారణలతో ఆలయ సంప్రాదాయం ప్రకారం ఉట్టి కొట్టారు. అనంతరం స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. పంచరంగులతో పట్నం వేసి బోనం సమర్పించి మల్లన్న కల్యాణం చేపట్టారు. స్వామి వారిని సీపీ రష్మీ పెరుమళ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
గౌరవెల్లి ప్రాజెక్టు వైఎస్సార్ ఆలోచనే..
హుస్నాబాద్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. కాంగ్రెస్ వేయి రోజుల పాలన పై శుక్రవారం బీఆర్ఎస్ పందిల్లలో చేపట్టిన వంటవార్పు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు బాకీ పడిన పథకాలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతు కుటుంబాలను అదుకున్నాయని, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి అడపిల్లల పెళ్లిలకు అండగా నిలిచాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన వైఎస్సార్దే అయినా కేసీఆర్ ప్రాజెక్టు సామర్థ్యం పెంచి 99 శాతం పనులు పూర్తి చేయించి గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మెట్ట ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రాజెక్టు ఎత్తు పెంచి 8 టీఎంసీల నీటి నిల్వ ఉండేందుకు నిధులు విడుదల చేసి పనులు చేయిస్తే కాంగ్రెసోళ్లు కోర్టులో కేసులు వేయించి అడుగడుగున పనులకు అడ్డపడ్డారని ఆరోపించారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పనులు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా దగా చేస్తోందని ఆరోపించారు. ఎరువులు లేక నిత్యం హుస్నాబాద్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించదన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, ఎల్కతుర్తి, సైదాపూర్, భీమదేవరపల్లి, చిగురుమామిడి మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం పెంచింది కేసీఆరే పనులను అడ్డుకుంటోంది కాంగ్రెసోళ్లే.. మాజీ ఎంపీ వినోద్కుమార్ -
మహిళలకు కాంగ్రెస్ మొండిచేయి
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలునినాదాలు చేస్తున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులుసిద్దిపేటజోన్: ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. మహిళలు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వేంకటేశ్వర దేవాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో వంటవార్పు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, ఆసరా పథకం పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా తులం బంగారం, విద్యార్థులకు స్కూటీ.. ఇలా అన్నీ హామీలను విస్మరించారని అన్నారు. మరోవైపు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళలు అంతా ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మంజుల, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనకరాజు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.కల్యాణలక్ష్మి రద్దు చేసే కుట్ర వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు జెడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ -
ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించండి
గజ్వేల్రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలోగల మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు న్యాయం చేయాలని టీజేఎస్(తెలంగాణ జనసమితి) జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం ముంపు (వేములఘట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, ఎర్రవల్లి)గ్రామాల్లో ఇంటింటి పర్యటన చేపట్టి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్వామి మాట్లాడుతూ పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముంపు గ్రామాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆరోపించారు. ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. అదే విధంగా ప్యాకేజీలు, పరిహారం అందని వారికి న్యాయం చేస్తూ ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గజ్వేల్కు చేసిందేమీలేకపోగా, కేసీఆర్ హాయాంలో మంజూరైన రూ.180కోట్ల నిధులను రద్దు చేశారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గజ్వేల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. గజ్వేల్ కాంగ్రెస్ నేతలకు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టాలన్నారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టారని చెప్పారు. జిల్లాకు ఒక ఇన్చార్జి మంత్రి, మరో మంత్రి ఉన్నా...ప్రయోజనం లేదన్నారు. గజ్వేల్ కాంగ్రెస్లో ఉన్న కుమ్ములాటలను ముందుగా సరిదిద్దుకొని...బీఆర్ఎస్ గురించి మాట్లాడాలన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, బీఆర్ఎస్ నేతలు గంగిశెట్టి రవి, నర్సింగరావు, మల్లేశం, మద్దూరి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. టీన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్ సిద్దిపేటజోన్: ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి విక్రమ్రెడ్డి అన్నారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన సెప్టెంబర్10 ఛలో హైదరాబాద్ సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇది ఉద్యోగుల భవిష్యత్తు.. మన పిల్లల కోసం చేస్తున్న ఉద్యమం అని అన్నారు. ఈనెల10లోపు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సత్యనారాయణ, సుకుమారీ, విజయ్భాస్కర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
‘ఇండిగో’ పైలెట్గా గిరిజన బిడ్డ
హుస్నాబాద్రూరల్: మండల పరిధి భల్లునాయక్తండాకు చెందిన గిరిజన విద్యార్థి లావుడ్య మనోజ్కుమార్ ఇండిగో ఎయిర్ సర్వీస్ పైలెట్గా ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో సంతోషాలు వెల్లివిరిశాయి. తల్లిదండ్రులు లావుడ్య భిక్షపతి, గాయత్రి ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు మనోజ్కుమార్ ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తర్వాత పైలెట్ శిక్షణ పొందారు. ఇటీవల పైలెట్ సెలక్షన్ ఇంటర్వ్యూలో మనోజ్కుమార్ ఎంపికై నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి రామచంద్రాపురం(పటాన్చెరు): 104 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా చెందిన 104 ఉద్యోగ సంఘం నాయకులు రామచంద్రాపురంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ..గత 18ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న 300మందిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. డీఎంఈ పరిధిలోని ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. -
మీరు గ్రేట్ సార్
సర్కారు బడిని బాగుచేసిన హెడ్మాస్టర్ బడిపిల్లల కోసం సొంత ఖర్చుతో ఆటో సౌకర్యం కొండపాక(గజ్వేల్): మండల పరిధి సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయప్రకాశ్రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్కార్ బడిని సుందరంగా తీర్చిదిద్ది, విద్యార్థుల సంఖ్య పెంచుతూ.. సొంత ఖర్చుతో ఆటో సౌకర్యం కల్పించారు. విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు వచ్చేందుకు రెండు ఆటోలను ఏర్పాటు చేసి నెలకు రూ.20 వేల వరకు వెచ్చిస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఆట వస్తువులు, విద్యార్థులకు క్రీడా దుస్తులు, స్వచ్చమైన తాగు నీటి ఆర్వో ప్లాంట్, బోధన సులువుగా అర్థం అయ్యేలా ఐఎఫ్బీ స్క్రీన్ ఎల్ఈడీ ప్యానల్, కంప్యూటర్, తరగతి గదుల్లో కార్పెట్లు, పాఠశాలలోని గధుల్లో అందమైన కలర్లు వేయడం వంటి వాటి కోసం ఇప్పటి వరకు సుమారు రూ. 10లక్షలను ఖర్చు చేశారు. బడి బాట కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే సుమారు70 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం 182 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం అందుతోంది. హెచ్ఎం చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
కాంగ్రెస్ శ్రేణుల బైక్ ర్యాలీ
చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు. అల్లీపూర్ శివారులోని అనంతగిరి కట్టమైసమ్మ ఆలయం నుంచి చిన్నకోడూరు వరకు ర్యాలీ కొనసాగింది. ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ మాట్లాడుతూ అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. నాయకులు పంతం శ్రీనివాస్, రాజేశ్, హరిబాబు, చంద్రశేఖర్, చందు, లక్ష్మి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ చర్చకు సిద్ధం చేర్యాల(సిద్దిపేట): జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల కాంగ్రెస్ నాయకులు విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. నేతలు మంజె మల్లేశం, మారేళ్ల భాస్కర్రెడ్డి, బండి శ్రీనివాస్గౌడ్, శ్రీకాంత్, ఆగంరెడ్డి, సంజీవయ్య పాల్గొన్నారు. -
గురువే.. మా వెలుగు
ఉపాధ్యాయుల గొప్పతనంపై విద్యార్థుల మనోభావాలు ● నేడు గురుపూజోత్సవం అక్షరాలు నేర్పడమే కాదు.. జీవితంలో ఎలా ఎదగాలో మార్గం చూపించే దిక్సూచి కూడా ఉపాధ్యాయుడే. తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితాలపై అత్యధిక ప్రభావం చూపేది గురువులే. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా మంచి నడవడిక, క్రమశిక్షణ, సమయపాలన, పెద్దలను గౌరవించడం వంటి జీవిత విలువలను తమ గురువులు నేర్పుతున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. చదువులో వెనుకబడినప్పుడు ప్రత్యేకంగా సమయం కేటాయించి పాఠాలు చెప్పడం, తమలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, పోటీ పరీక్షలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుకు సాగేలా ధైర్యం చెప్పడం వంటి ఎన్నో విషయాలను పిల్లలు గుర్తు చేసుకుంటున్నారు. నేడు గురు పూజోత్సవం సందర్భంగా తమకు ఇష్టమైన ఉపాధ్యాయులు, పొందిన ప్రయోజనాలు, నేర్చుకున్న పాఠాలను చిన్నారులు తమ మాటల్లో వివరించారు ఇలా.. – సాక్షి, సిద్దిపేటనంగునూరు(సిద్దిపేట): పాఠశాలలో నిర్వహించే కల్చరల్ కార్యక్రమాల్లో బాగా ప్రోత్సహించారు. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచేలా చేసి తీర్చిదిద్దారు. అలాగే నర్మెటలో అయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్వయంగా మాట్లాడే అవకాశం కల్పించి నాలో స్ఫూర్తిని నింపారు. దీంతో నా ఫెవరెట్ టీచర్ అశోక్ అయ్యారు. అశోక్ సార్ మార్గదర్శకత్వంలో బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తా. తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకువస్తా. – గూడెపు కారుణ్య, పదో తరగతి, నర్మేట -
ప్రతిపక్షనేతగా కేసీఆర్ విఫలం
గజ్వేల్: ప్రతిపక్షనేతగా విఫలమైన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద చేస్తూ డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రజల సమస్యలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడున్న నేతలు కేసీఆర్ను ఇక్కడికి రప్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిపోయి.. అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లకాలంలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కటైన కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించిందన్నారు. అసెంబ్లీకి, నియోజకవర్గానికి రాని కేసీఆర్ ఇప్పటికై నా రాజీనామా చేస్తే...కొత్త వారు ఎన్నికై ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం -
ప్రతీ అంశం అర్థమయ్యేలా..
సిద్దిపేట అర్బన్(సిద్దిపేట): భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి నా ఫెవరేట్ టీచర్. ప్రతి అంశాన్ని అర్థమయ్యే విధంగా బోధిస్తారు. పాఠాలతో పాటు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, జీవితంలో ఏది ముఖ్యం అనే విషయాలన చెబుతూ మోటివేట్ చేస్తారు. – వెంకట సాయి, 9వ తరగతి, ఎల్లుపల్లిహెచ్ఎం జయప్రకాశ్రెడ్డి ఏర్పాటు చేసిన ఆటోలో వచ్చిన విద్యార్థులు వర్గల్(గజ్వేల్): నా పేరు వాంకార్ దత్త శ్రీపాద్. మాది వర్గల్ మండలం తున్కిఖాల్సా గ్రామం. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి ఇంగ్లిష్ మీడియం చదువుతున్న. పులి రాజు సార్ అంటే చాలా ఇష్టం. బయటకు తీసుకెళ్లి పొలాలు చూపుతో కార్యాలయాలు చూపుతూ అర్థమయ్యేలా పాఠాలు చెబుతారు. సారు చెప్పే పాఠాలు, సూచనలు, సలహాలు మా విద్యార్థులందరికీ ఎంతో ఇష్టం. నేను పాఠశాలలో పాడిన పాట జిల్లా స్థాయిలో ప్రశంసలు తెచ్చిపెట్టింది. అందుకు మా పులి రాజు సార్ ప్రోత్సాహమే కారణం. -
జాతీయ స్థాయిలో రాణిస్తూ..
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఇది గుర్తించిన ఫిజికల్ డైరెక్టర్ ప్రవీణ్ మెలకువలు నేర్పించారు. పీడీ నేర్పించే అంశాలను రోజూ సాయంత్రం సాధన చేస్తున్నా. వాలీబాల్లో ఇప్పటి వరకు మూడు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందా. అలాగే జిల్లా స్థాయిలో అనేక సార్లు ప్రథమ బహుమతులు సాధించా. పీడీ ప్రవీణ్ ప్రోత్సాహంతో వాలీబాల్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తా. జిల్లాకు గుర్తింపు తీసుకువస్తా. – కావటి అమూల్య, 9వ తరగతి, మోడల్ స్కూల్, ఇబ్రహీంనగర్ -
7న జిల్లాస్థాయి యోగా పోటీలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా స్థాయి సబ్ జూనియర్ యోగాసన పోటీల ఎంపికలు ఈ నెల 7న నిర్వహించనున్నట్టు జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు పెద్ది మనోహర్, గుడెపు మురళి కృష్ణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఉమాపార్థీవ కోటిలింగాల ఆలయ ఆవరణలోని /్ఞాన మందిరం లో జిల్లా స్థాయి పోటీలలలో రాణించిన యోగా క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఈ నెల 7న ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. యోగా పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తమ పేర్లను జిల్లా కార్యదర్శి మురళీకృష్ణను (8179250217, 9949453503) సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. -
బతుకమ్మ ఆడుతూ నిరసన
నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలపై ప్రభుత్వ ఇచ్చిన జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజగోపాల్పేటలో అధ్యాపకుల నిరసన 16వ రోజుకు చేరుకుంది. టీపీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం మహిళా అధ్యాపకులు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి సహ అధ్యక్షుడు అభినవ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తిలో విలీనం చేస్తే పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యూరియా కోసం రైతుల నిరసనదుబ్బాక: యూరియా కోసం రైతులు మంగళవారం దుబ్బాకలో ఆందోళనకు దిగారు. యాప్తో యూరియా బుక్ కావడం లేదని, ఎప్పుడు ఏ షాప్నకు యూరియా వస్తదో తెలి యని అయోమయ పరిస్థితులు ఏర్పడటంతో తమ పంటలు దెబ్బతింటున్నాయని వాపోయా రు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు రాజిరెడ్డి, మహేశ్ మాట్లాడుతూ కొత్తగా తీసుకొచ్చిన యాప్తో రైతులు చాల ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సరిపడా యూరియాను అందుబాటులో ఉంచి యాప్తో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. పర్యాటక కేంద్రంగా ఎల్లమ్మ చెరువు మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి హుస్నాబాద్: కాకతీయుల కాలంలో నిర్మించిన ఎల్లమ్మ చెరువును సుందరీకరణ పనులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అన్నారు. మంగళవారం పట్టణంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. లక్ష్మి మాట్లాడుతూ రూ.18 కోట్ల వ్యయంతో చెరువు సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అదనంగా టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3 కోట్లు మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా చెరువు మధ్యలో నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. చెరువు కట్ట పైన, కట్ట కింది భాగంలో గ్రీనరీ, వివిధ రకాల ఆకృతులతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వడ్డెపల్లి వెంకట రమణ, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. నిర్దిష్టమైన లక్ష్యంతోనే ఉన్నతస్థాయికి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రతి ఒక్కరూ నిర్ధిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని, జిల్లా ఉపాఽధి కల్పన అధికారి డాక్టర్ ప్రియాంక, స్టడీ సర్కిల్ డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ లో 125 రోజుల ఫౌండేషన్ కోర్స్ ఉచిత శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో ప్రతిరోజూ చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రతి అవకాశా న్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాల ను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ 125 రోజుల శిక్షణ విద్యార్థుల జీవితంలో ఒక గొప్ప అవకాశమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో వంద శాతం లక్ష్యాలను సాధించేలా క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట అర్బన్ నాసర్పూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పీహెచ్సీలోని ఫార్మసీ, మందుల నిల్వ గది, ల్యాబ్తో పాటు పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ, ఐపీ సేవలను పెంచడంతో పాటు ఎన్సీడీ స్క్రీనింగ్, నమూనాల సేకరణ, ఆరోగ్య పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, అన్ని రకాల మందుల నిల్వలను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ అవసరమైన స్టాక్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
● ‘జలసిరి’పై నిర్లక్ష్యం తగదు ● కలెక్టర్ హైమావతి ● అధికారులతో కలెక్టర్ జూమ్ సమావేశం సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వనమహోత్సవం, జలసిరి, ఇందిరమ్మ ఇళ్లు, పలు రకాల అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో జూమ్ సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా 17లక్షల 60వేల మొక్కలకు గాను 14 లక్షల 63వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. మరిన్ని రోజుల్లో వందశాతం మొక్కలు నాటి జియో ట్యాగింగ్ పూర్తి చేయాలన్నారు. జలసిరిలో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టడం కోసం చేపట్టిన పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేంది లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల వద్ద తప్పకుండా వర్షపు నీటిని ఒడిసి పట్టే కార్యక్రమం చేపట్టాలన్నారు. మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో పూర్తయిన వాటిని ఈనెల 15లోపు గృహ ప్రవేశాలు జరిగేలా పనిచేయాలన్నారు. చేయూత పెన్షన్లు అందించేందుకు గాను పరిశీలన పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, ఇన్చార్జి డీఆర్డీఓ రమేశ్, డీపీఓ రవీందర్, పీఆర్ ఈఈ శ్రీనివాస్, మిషన్భగీరథ ఈఈ, హౌసింగ్ పీడీ భగవంత్రావు తదితరులు పాల్గొన్నారు. 1,11,223 మందికి ‘సర్’ నోటీసులు.. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ‘ఎస్ఐఆర్’లో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 1,175 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఓటరు జాబితా ప్రకారం 4,28,861 మంది పురుషులు, 4,45,273 మంది మహిళలు, 47 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉండగా మొత్తంగా 87,4181 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సర్ ప్రక్రియలో 2,26,433 మంది నోటీసులు జనరేట్ చేసి 1,11,223 మందికి అందించినట్లు తెలిపారు. సర్ ప్రక్రియలో అభ్యంతరాలు, వినతులు స్వీకరించేందుకు ఈనెల 5, 6వ తేదీల్లో , తిరిగి 12, 13 తేదీల్లో పోలింగ్ కేంద్రాల ప్రత్యేక ప్రచార దినోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతీ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
అభివృద్ధిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా?
● రాహుల్గాంధీపై కేసులు సరికాదు ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లిప్రశాంత్నగర్(సిద్దిపేట): దేశాన్ని అభివృద్ధి చేయమని అడిగినందుకు ప్రతిపక్షాలపై అక్రమ చార్జ్షీట్లు నమోదు చేయడం ఎన్డీఏ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం మండిపడ్డారు. ఉత్తరాఖండ్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీపై చార్జ్షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పార్టీ కార్యాలయ ఆవరణలో పలువురు నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్గాంధీ కుటుంబం దేశాభివృద్ధి కోసం తమ ప్రాణాలు అర్పించిందన్నారు. దేశాభివృద్ధిలో గాంధీ కుటుంబం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. అలాంటి వారిపై అక్రమంగా కేసులు బనాయించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నెండేళ్లుగా దేశంలో అభివృద్ధి కుంటుపడిందని వాపోయారు. మునిగిపోతున్న అదానీకి రుణమాఫీచేసి కాపాడిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. గుజరాత్ వ్యాపారులకు రాయితీలు ఇచ్చి, వారి అభివృద్ధే దేశాభివృద్ధిగా పరిగణించడం ఏమి టని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన పనికి ఆహారం పథకం పేరు మార్చి పనిదినాలను తగ్గించారని, దీంతో పేద ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. సిద్దిపేటజోన్: ఉత్తరాఖండ్లో రాహుల్ గాంధీపై అక్రమ కేసు, ఎఫ్ఐఆర్ నమోదును నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ... రాహుల్ గాంధీపై అక్రమ కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. వెంటనే ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ముమ్మరంగా డిజిటల్ క్రాప్ సర్వే
జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి తొగుట(దుబ్బాక): పంటసాగు వివరాల కోసం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే జిల్లాలో ముమ్మరంగా సాగుతోందని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి తెలిపారు. మండలంలోని బండారుపల్లిలో డిజిటల్ క్రాప్ సర్వేను ఆమె మంగళవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ భూముల్లో ఏ పంట.. ఎంతవిస్తీర్ణంలో సాగుచేశారనే వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడానికి పంట నష్టం జరిగితే పరిహారం, బీమా పొందడానికి ఈ క్రాప్ బుకింగ్ డేటా అత్యంత కీలకమన్నారు. రాయితీ ఎరువులు, విత్తనాల కేటాయింపులకు కూడా ఇదే ప్రామాణికం కానున్నదని ఆమె తెలిపారు. -
వయోజన విద్య అడ్మిషన్లు పెంచండి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఓపెన్ స్కూల్, వయోజన విద్య అడ్మిషన్లు పెంచాలని, జిల్లా ఇన్చార్జి డీఈఓ రమేశ్ అన్నారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో ఓపెన్ స్కూల్, వయోజన విద్య జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓపెన్ స్కూల్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రమేశ్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ రెగ్యులర్ సర్టిఫికెట్తో సమానంగా పరిగణిస్తారన్నారు. రెగ్యులర్గా పాఠశాల, కళాశాలలకు వెళ్లలేని వారు ఓపెన్ స్కూల్, వయోజన విద్యాను అభ్యసించాలన్నారు. కార్యక్రమంలో డీడీఏఈ వెంకట్రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి మెదక్ జిల్లా కో ఆర్డినేటర్ వెంకట్స్వామి, అదనపు డీఆర్డీఓ సుధీర్, మోప్మా పీడీ హనుమంతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో సర్కార్ విఫలం
ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరుగజ్వేల్: హామీల అమలులో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గజ్వేల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం తీరుపై మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలనలో రేవంత్రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యాన్ని చాటుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను ఎండగట్టే క్రమంలో వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు భారీఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, బీఆర్ఎస్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
రూ. కోట్లు వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మించినా కాలనీల్లోని ప్రజలకు పాట్లు తప్పడంలేదు. సిద్దిపేట పట్టణంలో రూ.301 కోట్ల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లక్ష్యం గొప్పగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పలు కాలనీల్లో అవుట్ లైన్ నిర్మాణం చేయకపోవడంతో మురుగు రోడ్లపై, ఖాళీ స్థలాల్లో నిలుస్తోంది. దీంతో దుర్వాసన, దోమల బెడదతో స్థానిక ప్రజలు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. – సాక్షి, సిద్దిపేట రోడ్డు పైకి మురుగు కొన్ని నెలలుగా మా ఇంటి ఎదుట మ్యాన్హోల్ నుంచి డ్రైనేజీ నీళ్లు పారుతున్నాయి. దుర్వాసన, దోమ లతో ఇబ్బంది పడుతున్నాం. రోడ్డుపై పాకురు కావడంతో వాహనదారులు జారిపడిన సంఘటనలూ ఉన్నాయి. –అంజయ్య, మైత్రీవనం అవుట్ కనెక్షన్ ఇవ్వలేదు భవానీనగర్, మైత్రీవనంలో యూజీడీకి అవుట్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో మురుగు అంతా ఖాళీ స్థలాల్లో నిలుస్తున్నాయి. అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. –కృష్ణ, భవానీ నగర్, సిద్దిపేటసిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) అమృత్ పథకం, టీయూఎఫ్ఐడీసీ నిధులతో ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. సిద్దిపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.301.81 కోట్లు మంజూరు కాగా ఇందులో అమృత్ పథకం ఫేస్–1, 2లో రూ.229.13 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.72.68కోట్లు ఉన్నాయి. ఈ నిధులతో 324 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం, రెండు ఎస్టీపీలను నిర్మించారు. ఇప్పటి వరకు 25,890 నివాస గృహాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్షన్లు ఇచ్చారు. కొన్ని చోట్ల అవుట్ లైన్ నిర్మించకపోవడంతో మ్యాన్ హోల్స్లో నుంచి మురుగు పొంగిపోర్లుతోంది. దోమలతో నరకం మురుగు నీరు నిలిచిపోతున్న కాలనీల్లో ప్రజల అవస్థలు అన్నీఇన్నీకావు. దుర్వాసనతో ఇళ్లలో ఉండటం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు నిలవడం.. దోమలకు నిలయంగా మారడంతో చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తిస్థాయిలో నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నిత్యం ఇబ్బందే..మూడో వార్డులోని మారుతీనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మించలేదని కాలనీ వాసులు వాపోయారు.మురుగు నీటితో నిత్యం ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్కు కాలనీ కమిటీ వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో నరేందర్ రెడ్డి, ఆనంద్, రవీందర్, బాలయ్య, రామ్రెడ్డిలు ఉన్నారు. -
కేసీఆర్ వస్తేనే ప్రజలకు భవిష్యత్తు
● కాంగ్రెస్ సర్కార్లో కానరాని సంక్షేమ పథకాలు ● మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేటరూరల్: బీఆర్ఎస్ హయంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ఆగం చేసిందని, మళ్ళీ కేసీఆర్ వస్తేనే ప్రజలు, రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని రాంపూర్లో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణకు సురక్షితమైన భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేడు యూరియా, డీఏపీ కోసం 15 రోజుల పాటు క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతుబంధును ఒకరికి ఇచ్చి, ఇంకొకరికి ఎగబెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. చతికిలబడిన విద్యావ్యవస్థ ప్రశాంత్నగర్(సిద్దిపేట): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యావ్యవస్థ చతికిలబడిందని, స్కూల్ గ్రాంట్స్ నిల్ అని, స్కావెంజర్లకు జీతాల్లేవని, మన ఊరు మన బడి బంద్ అయ్యిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల ఉద్యోగి కనకయ్య పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీశ్రావు మాట్లాడుతు పాఠశాలలు ప్రారంభం అయ్యి మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో స్కూల్ ప్రారంభం కాకముందే ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు అందించామన్నారు. యూనిఫాంలు, స్కూల్ బ్యాగ్, టై, షూస్లు వెంటనే విద్యార్థులకు అందించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేసుకునే దుస్థితి వచ్చిందన్నారు. జీవో 97 తీసుకువచ్చి వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులను రోడ్డు మీదకు తెచ్చారన్నారు.సెల్ఫోన్ వ్యసనం మంచిది కాదు సిద్దిపేటజోన్: ‘ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ఫోన్ అనేది పిల్లలకు ఒక వ్యసనంగా మారిపోయింది. భోజనం చేసేటప్పుడు ఫోన్ చూస్తే గాని ముద్ద మింగలేని పరిస్థితికి చాలా మంది పిల్లలు వచ్చేశారు. ఇది మంచిది కాదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం స్థానిక మెరీడియన్ స్కూల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ పక్కన పెట్టి ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ లాంటి క్రీడల పట్ల ఆసక్తి చూపాలని సూచించారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరం చేసే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పైన ఉందన్నారు. ఇక్కడ చదివిన అఖిల అనే అమ్మాయి మెడిసిన్ సిటు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఐదేండ్ల డాక్టర్ కోర్సు ఫీజు ఖర్చుల బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చెస్ లాంటి ఆట మనలో మెదడుకు పదును పెడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్. సూడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ తిరుమాల్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్లు దేవేందర్ రెడ్డి, రాజా వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హక్కులపై అవగాహన అవసరం
చేర్యాల(సిద్దిపేట): బాలికలు తమ హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజ రమణ అన్నారు. సోమవారం చేర్యాల కేజీబీవీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ నరేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం, పరిశుభ్రత, పౌష్టికాహారం, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ శారద, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణకు రూ.3 కోట్లుహుస్నాబాద్: ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు అదనంగా రూ.3 కోట్లు నిధులు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. ఈ నిధులతో కట్ట సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. త్వరలోనే ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, గ్లాస్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కమిషనర్ పేర్కొన్నారు. అధికారులకు జరిమానా గజ్వేల్: సమాచారం ఇవ్వని కలెక్టరేట్ అధికారులకు జరిమానా విధించిన ఘటన ఆలస్యంగా తెలిసింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీకి సంబంధించిన సమాచారం కోరితే కలెక్టరేట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాష్ట్ర సమాచార కమిషన్ రూ.10వేల జరిమానా విధించిందని పిటీషనర్లు ఎండీ హయతొద్దీన్, సందబోయిన అశోక్, ప్రభాకర్లు సోమవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జూలై 20న వచ్చినట్లు చెప్పారు. తమ పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సమాచార హక్కు కమిషన్ను ఆశ్రయించామని పేర్కొన్నారు. రైతు సమస్యలు పరిష్కరించాలిచిన్నకోడూరు(సిద్దిపేట): రైతుల ఎదుర్కొంటు న్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రైతు సమస్యలపై ఎంపీడీఓ జనార్దన్కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యూ రియా యాప్ను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగో లు చేయాలన్నారు. పంట నిల్వలకు గోదాము లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. -
కూలీలు రావడం లేదు
ఇథనాల్ కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచి దుమ్ము, దుర్వాసన వస్తోంది. వ్యవసాయ పనులకు కూలీలు కూడా రావడం లేదు. ఫ్యాక్టరీ నుంచి వ్యర్థజలాలు బయటకు వస్తుండటంతో పంటల దిగుబడి తగ్గుతోంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పరిశ్రమలకు అధికంగా నీటిని వినియోగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయనే ఆందోళన ఉంది. – జట్టి శ్రీనివాస్, రైతు, దాచారం విషతుల్యమవుతున్నాయి ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని తోటపల్లి చెరువులోకి వచ్చే కాలువలో వదులుతున్నారు. దీంతో చేపలు మృత్యువాత పడ్డాయి. కలుషిత నీటితో పంటలు పండించడం అంటే విషతుల్యమైన ఆహారాన్ని అందించడమే. ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేయాలి. – గాజే రాజు, రైతు, దాచారం -
తవ్వేకొద్దీ అక్రమాలే..
● రూ.5.20 కోట్లతో బ్రాంచ్ల పునర్నిర్మాణం ● నిబంధనలకు విరుద్ధంగా ఆఫ్లైన్లో టెండర్ ప్రక్రియ ● సుమారు రూ.కోటి వరకు ముడుపులు? జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) బ్రాంచ్ల రినోవేషన్ (పునర్ నిర్మాణం) పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. సుమారు రూ. ఐదు కోట్లకు మించి అంచనా వ్యయం కలిగిన ఈ పనులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి అందిన కాడికి దండుకున్నారు. దాదాపు పదేళ్లుగా పాతుకుపోయిన ఓ ‘ముఖ్య’ అధికారి పాలకవర్గంలోకి కీలక నేత కలిసి ఈ అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న డీసీసీబీ బ్యాంకుల బ్రాంచ్లను రినోవేషన్ చేయాలని నిర్ణయించారు. ఆయా బ్రాంచుల్లో కొత్త ఫర్నీచర్, ఇంటీరియర్, క్యాషియర్ కౌంటర్, బీఎం క్యాబిన్, లాకర్లు, కంప్యూటర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఇలా.. ఆయా బ్రాంచులను రినోవేషన్ చేశారు. ఏ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లోనైనా రూ.5 లక్షలకు మించి అంచనా వ్యయం కలిగిన పనులను ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువకు టెండర్ కోట్ చేస్తే వారికి పని అప్పగిస్తారు. కానీ ఆన్లైన్లో టెండర్లు పిలిస్తే పోటీ ఎక్కువై తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు దక్కవు. దీంతో ఆఫ్లైన్ పేరుతో మొక్కుబడిగా టెండర్ ప్రక్రియ నిర్వహించి మమ అనిపించారు. తమకు అనుకూలైన కాంట్రాక్టర్లకు ఈ రినోవేషన్ పనులు కట్టబెట్టి అందిన కాడికి దండుకున్నారు. ఇలా 26 బ్రాంచులకు సగటున సుమారు రూ.20 లక్షల చొప్పున రూ.5.20 కోట్లు పనుల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. ఈ పనుల్లో ఏకంగా సుమారు రూ.కోటికి మించి చేతులు మారినట్లు అనధికారిక అంచనా. ఆ కాంట్రాక్టర్లకే ఎక్కువ పనులు ఈ రినోవేషన్ పనులు ఒకే కాంట్రాక్టర్కు ఐదారు కట్టబెట్టారు. ఎనిమిది కాంట్రాక్టర్లు, కంపెనీల పేరుతో ఈ పనులు చేపట్టి.. అందిన కాడికి దండుకున్నారు. బ్యాంకు ప్యానల్ ఇంజనీర్లు వేసిన ఎస్టిమేషన్ల కంటే ఎక్సెస్ (ఎక్కువ)కు టెండర్లు దక్కించుకుని అంచనా వ్యయం కంటే అదనపు దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. భారీగా పర్సెంటేజీలు డీసీసీబీకి కొత్తగా ఐదు బ్రాంచులను ఏర్పాటు చేసేందుకు 2023లో ఆర్బీఐ నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ బ్రాంచులకు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం కూడా ఒక్కో భవనానికి రూ. లక్షల అంచనా వ్యయంతో పనులు చేశారు. అయితే ఈ పనులకు ఆన్లైన్ టెండర్లు పిలిచినప్పటికీ.. బిల్లుల చెల్లింపుల్లో భారీ మొత్తంలో పర్సెంటేజీలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివరాలిచ్చేందుకు నిరాకరణ రినోవేషన్ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు డీసీసీబీ అధికారులు నిరాకరిస్తున్నారు. విచారణ దశలో ఉన్నప్పుడు ఈ వివరాలు ఇవ్వడం కుదరదని దాటవేస్తుండటం పలు ఆరోపణలు దారితీస్తోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకే పూర్తి వివరాలు వెల్లడించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 60 వేల మంది రైతులు చెల్లించే వడ్డీలపై నడుస్తున్న ఈ బ్యాంకులో అక్రమార్కులు అందిన కాడిక దండుకుని జేబులు నింపుకుంటున్న వ్యవహరాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ రినోవేషన్ పనుల వివరాల కోసం ‘సాక్షి’ ప్రతినిధి డీసీసీబీ ఇన్చార్జి సీఈఓ సురేష్ను సంప్రదించగా.. విచారణ కొనసాగుతుండగా వివరాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. -
కాంగ్రెస్ పతనం ఖాయం
● మెదక్, నిజామాబాద్ ఎంపీలు ఫైర్ ● బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాసిద్ధిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు ముందే 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న కోటి ఎకరాలను తొలగించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో అసెంబీ ముట్టడిస్తామని ఎంపీ రఘునందన్రావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. రఘునందన్ రావు మాట్లాడుతూ.. 22ఏ రద్దు చేయకుంటే సిద్దిపేట కలెక్టరేట్ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఏడాది దాటితే కాంగ్రెస్ పార్టీలో ఒక్క లీడర్ ఉండరని, దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం పలికారు. అంతకుముందు ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని రెండు ఒక్కటేనని ఆరోపించారు. ధర్నాకు పలువురు న్యాయవాదులు మద్దతు పలికారు. కాగా బీఆర్ఎస్ వారు రఘునందన్రావు దోస్తులు అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించడంతో పలువురు చర్చించుకోవడం కనిపించింది. -
ఊపిరాడక.. కునుకు పట్టక
పల్లెల్లో ‘ఇథనాల్’ చిచ్చు చెరువులో చేపలు మృత్యువాత ఇటీవల స్థానిక చెరువులో దాదాపు 8క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడటం గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల వల్లే చేపలు చనిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..కలుషిత నీటిని తాగిన పశువులు కూడా మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. మనుషుల ఆరోగ్యంతోపాటు మూగజీవాల ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కాల్వల్లోకి వ్యర్థజలాలు చేరుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లాల్సిన నీరు కలుషితమైతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు అంటున్నారు. కలుషిత నీటితో పండించిన పంటలు ఆహారంగా ప్రజల ఇళ్లకు చేరితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పంటలు దిగుబడి తగ్గడం ఒక సమస్య అయితే, కలుషిత నీటితో పండే ఆహార పంటల ప్రభావం మరో పెద్ద ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇథనాల్ పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, రైతులు ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. మండలం బంద్కు కూడా పిలుపునిచ్చారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తమ భూములు, ప్రాణాలను కాపాడాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. -
విద్యా హబ్గా తీర్చిదిద్దుతాం
● అన్ని రంగాల్లో హుస్నాబాద్ అభివృద్ధే లక్ష్యం ● మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: నియోజకవర్గంలోని ప్రతి మండలంలో విద్యా సంస్థను నెలకొల్పి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండలంలోని ఉమ్మాపూర్లో ఇంజనీరింగ్ కళాశాల బాలుర, బాలికల హాస్టళ్ల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఒక్కో హాస్టల్ రూ.7.28 కోట్లు చొప్పున మొత్తం రూ.14.56 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాశాలలో 295 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకువస్తామన్నారు. విద్యార్ధులు బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని, మౌలిక వసతులు కల్పించే బాధ్యత నాదని, మీకు గార్డియన్గా ఉంటానన్నారు. సైదాపూర్కు మరో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతుందని తెలిపారు. భీమదేవరపల్లి లో నవోదయ స్కూల్, చిగురుమామిడి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఎల్కతుర్తి మండలానికి బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ రాబోతుంది. కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమేష్ కుమార్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ నేతలను నిలదీయండి అక్కన్నపేట(హుస్నాబాద్): రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం మండిపడ్డారు. సోమవారం చాపగానీతండాలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు వారిని నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. మీరు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని ఇచ్చారు? ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఎక్కడ? మీ పదేళ్ల పాలనలో ప్రజలకు ఏ పథకాలు అందించారో చెప్పాలన్నారు. -
ఎంపీ, ఎమ్మెల్యే చెట్టాపట్టాల్!
ఒకరిది బీజేపీ, మరొకరిది బీఆర్ఎస్.. వారి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలకు నెలవైన దుబ్బాకలో సోమవారం ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఒకే వాహనంలో వెళ్లి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. – దుబ్బాక దుబ్బాక నియోజకవర్గం అంటేనే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి(బీఆర్ఎస్), ఎంపీ మాధవనేని రఘునందన్రావు (బీజేపీ) ఉమ్మడి దుబ్బాక మండలానికి చెందిన వారే కావడం.. అందులో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా అధికారులకు తీవ్ర తలనొప్పిగా తయారైంది. కొత్త ప్రభాకర్రెడ్డి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో హాజరుఅవుతుండగా రఘునందన్రావు సైతం పోటాపోటీగా పార్టీ క్యాడర్తో పాల్గొంటుండటం.. ఇరు పార్టీల క్యాడర్ నినాదాలతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. నియోజకవర్గంలో ఏ కార్యక్రమమైనా వందలాది మంది పోలీసుల ముందస్తు బందోబస్తు మధ్యనే జరుగుతూవస్తోంది. కాని ఇదంతా గతం.. ప్రస్తుత సన్నివేశాలతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? అని పలువురు అంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఒకే కారులో... భూంపల్లి–అక్బర్పేట మండలంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు మాధవనేని రఘునందన్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి ఒకే కారులో రావడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. రామేశ్వరంపల్లిలో జరిగిన అభివృద్ధి పనుల్లో కలిసి పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే అనంతరం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సైతం అదే కారు ఎక్కడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ముందు సీటులో వెంకటయ్య ఉండగా వెనుక సీటులో రఘునందన్రావు, ప్రభాకర్రెడ్డి కూర్చొని భూంపల్లి మండల కేంద్రంలో జరిగిన అభివృద్ది పనులకు హాజరు కావడం విశేషం. అభివృద్ధి పనుల్లో సైతం పక్కపక్కనే ఉండి పాలుపంచుకోవడం ఒకరికొకరు కొబ్బరి కాయలు అందించుకోవడం ఆప్యాయంగా పలుకరించుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలోనూ వీరి కలయిక చక్కర్లు కొట్టింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ ఇరు పార్టీల నాయకులు సైతం మాట్లాడుకోవడం కనిపించింది. -
మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో రద్దీగా మారి మల్లన్న నామస్మరణతో మార్మోగింది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టడంలాంటి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు స్వామి వారి నిత్య కల్యాణంలో పాల్గొని కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించి వేడుకున్నారు. భక్తులకు కావల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ఆలయానికి సుమారు రూ.4 లక్షల విలువచేసే వెండి బిందెను కొమురవెల్లికి చెందిన అంబటిపల్లి యాదలక్ష్మి కుటుంబ సభ్యులు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిగారు.. ఆలయాభివృద్ధికి నిధులివ్వండి
● మూడు గర్భగృహాలు ● 12వ శతాబ్దంలో నిర్మించిన కాకతీయుల కాలానికి చెందిన హిందూ దేవాలయం అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో త్రికూటాలయం అనే దేవాలయం ఉంది. ఇది కాకతీయుల కాలానికి చెందిన హిందూ దేవాలయం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. త్రికూటాలయం శైలిలో నిర్మించిన ఈ దేవాలయంలో మూడు గర్భగృహాలు ఒకే మండపానికి అనుసంధానమై ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఈ దేవాలయం శిథిలావస్తకు చేరుకుని పాడుబడ్డ బంగ్లా స్థాయిలో దర్శనమిస్తోంది. ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించండి ‘పల్లె పల్లెకు పొన్నమన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన’కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాకతీయుల కాలంలో నిర్మించిన త్రికూటాలయ దేవాలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పొన్నం గ్రామ పర్యటనకు రానున్న క్రమంలో గ్రామ సర్పంచ్ కొడముంజ బాలరాజు ఆదివారం త్రికూటాలయ ఆవరణంలో పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు పిచ్చిమొక్కలను శుభ్రం చేయించారు. తప్పకుండా స్థానిక, ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టిసారించి ఆలయా అభివృద్ధికి నిధులు కేటాయించి, దేవాలయ రూపురేఖలు మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నేడు గ్రామాల్లో మంత్రి పొన్నం పర్యటన
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలంలోని కట్కూర్, దుబ్బతండా, దాసుతండా, చాపగానీతండా, కన్నారం, పంతుల్తండా గ్రామాల్లో సోమవారం రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నట్లు ఎంపీడీఓ బానోతు జయరాం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘పల్లె పల్లెకు పొన్నమన్న– పల్లె పల్లెలో ప్రజాపాలన’కార్యక్రమంలో భాగంగా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మంత్రి పర్యటన కొనసాగుతుందని తెలిపారు. పెన్షన్ మంజూరు చేయండితహసీల్దారుకు బాధితురాలు వినతి బెజ్జంకి(సిద్దిపేట): తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న తనను ఒంటరి మహిళగా గుర్తించి పెన్షన్ మంజూరు చేయాలని మండలంలోని గాగిళ్లాపూర్ గ్రామానికి చెందిన పడిగల జ్యోతి కోరారు. బాధితురాలు తాను తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన పత్రాన్ని ఆదివారం విలేకరులకు చూపిస్తూ మాట్లాడారు. తనకు ఒక కిడ్నీ చెడిపోయిందని, థైరాయిడ్, మహిళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిపారు. తాను తల్లిదండ్రుల వద్దనే ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ధ్రువపత్రం ఇవ్వనందున గడువులోపు పెన్షన్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. బైక్ ర్యాలీకి భారీగా తరలిరావాలినంగునూరు(సిద్దిపేట): ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయడంతోపాటు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హలో మాదిగ, చలో సిద్దిపేట బైక్ ర్యాలీకి భారీగా తరలిరావాలని ఎమ్మార్పీ ఎస్ టీఎస్ జిల్లా అధికార ప్రతినిధి రాజేందర్ పిలుపునిచ్చారు. నంగునూరులో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 3న సిద్దిపేటలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్కు బైక్ర్యాలీ నిర్వహిస్తామన్నారు. దేవతలను పూజించడం తెలంగాణ సంస్కృతిహుస్నాబాద్రూరల్: గ్రామ దేవతలను పూజించటం తెలంగాణ సంస్కృతిలో భాగమని మా జీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠకు ఆయన హాజరై మాట్లాడారు. రైతులు విత్తనాలు వేసిన తర్వాత పంటల దిగుబడులు రావాలని ప్రకృతికి పూజలు చేస్తే కరుణించి వర్షాలు కురుపిస్తుందని ప్రజల నమ్మకమన్నారు. మన సంస్కృతి, చరిత్రను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని చెప్పారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ -
సాహిత్య రంగంలో పాపని రేణుక ప్రతిభ
మిరుదొడ్డి(దుబ్బాక): సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు రాయడంతోపాటు కవితలు, కథల ద్వారా సాహిత్య రంగంలో తన దైన ముద్రవేస్తున్న అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రానికి చెందిన రచయిత్రి రేణుక (శశిరేఖ) రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభను చాటుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడ మీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొ ని ప్రతిభను చాటారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. -
ఇట్లయితే ఎట్లా ‘సర్’
బల్దియాలో 27 వేల మందికి నోటీసులు ఈ పక్కన ఫొటోలో ఉన్నది..మహ్మమద్ అలీ వయస్సు 63. స్థానికంగా 33 వార్డులో నివాసం ఉంటున్నాడు. 2002 ఓటరు జాబితాలో ఈయన పేరు ఎం.డి అలీ అని ఉంది. అదేవిధంగా ఈయన తండ్రి పేరు 2002లో మాలిక్ అని ఉండగా ప్రస్తుత ఓటరు జాబితాలో మహ్మమద్ మాలిక్ అని ఉంది. సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ వివరాల్లో తేడాలున్నాయని తండ్రి కొడుకులిద్దరికీ నోటీసులు వచ్చాయి. నిర్ణీత గడువులోగా హాజరై వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ ఫొటోలో ఉన్నది అమీన్పూర్ సుశీలా. ఈమె వయస్సు 50 ఏళ్లు. స్థానికంగా 25వార్డులో 25 ఏళ్లుగా నివాసం ఉంటుంది. 15 ఏళ్లుగా జరిగిన మున్సిపల్, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కు సద్వినియోగం చేసుకుంది. ఇప్పుడు 2002లోని ఓటరు జాబితాలో మీ వివరాలు లేవని, మీకు ఓటరు జాబితాలో ఏ ప్రాతిపదికన ఉండాలో సరైన వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.వీరిద్దరిలాగానే చాలామందికి ఇలాగే నోటీసులు జారీ అయ్యాయి. సిద్దిపేటజోన్: ఓటరు వయస్సు, ఇంటి పేరులో అక్షరదోషాలు, చిరునామా, తండ్రి పేరు, పిల్లల పేర్లు, కవల పిల్లల వయస్సులో తేడాలు, తదితర తప్పిదాల పేరిట బల్దియాలో వేలాదిమందికి నోటీసులు జారీ అయ్యాయి. ఒక్క సిద్దిపేట మున్సిపాలిటీలో 6,005 మ్యాపింగ్ కానీ వారికి, 21,530 మందికి మ్యాపింగ్ సందర్భంగా 2002 ఓటరు జాబితా, ఎన్యూమరేషన్ పత్రాల వివరాల్లో పొంతన లేదని మొత్తంగా 27,435మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరంతా అధికారులు సూచించిన తేదీల్లో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 12రకాల ధ్రువీకరణ పత్రాలతో స్వయంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(సర్) సందర్భంగా విడుదల చేసిన ముసాయిదా జాబితా–2002 ఓటరు జాబితా వివరాలు పొంతన లేని తప్పుల తడకగా మారింది. 2002లో ఇంటిపేరు పూర్తిగా రాయకుండా, వయస్సు అంశంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాయడం, తండ్రి, వయస్సుతో సంతానం వయస్సు సరిపోలేదని, అక్షర దోషాల జాబితాలో పేర్లలో వ్యత్యాసం ఉందని చిన్న చిన్న తప్పుల ఆధారంగా నోటీసులు జారీ అయ్యాయి. జిల్లాలోని ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలో ‘సర్’ప్రక్రియలో భాగంగా అధికారులు 27,435మందికి నోటీసులు జారీ చేశారు. 2002 ఓటరు జాబితా వివరాలతో మ్యాపింగ్ కాలేదని 6,005మందికి నోటీసులిచ్చారు. అదేవిధంగా ఎన్యూమరేషన్ పత్రాల వివరాలు 2002 జాబితాలో వివరాలకు పొంతన లేదని 21430మందికి నోటీసులు జారీ అయ్యాయి. ముఖ్యంగా 6,005మంది ఎన్నికల కమిషన్ సూచించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాలు చూపించి ఆర్డీఓ స్థాయిలో డిక్లరేషన్ కోసం స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది. వీటికి జిల్లా కలెక్టర్ అప్రూవల్ తర్వాతే ఓటుహక్కు లభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్లరికల్ తప్పిదాల పేరిట నోటీసులు జారీ అయినా 21,430 మంది బీఎల్ఓ విచారణ అనుగుణంగా ఆర్డీఓ స్థాయిలో సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 43 వార్డుల్లోని 174 పోలింగ్ కేంద్రాల్లో మొత్తంగా 27,435 నోటీసులు జారీ అయ్యాయి. పోలింగ్ కేంద్రం 06లో అత్యధికంగా 448 నోటీసులు జారీ కావడం విశేషం -
చేసిన సేవలే గుర్తింపునిస్తాయి
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యమిరుదొడ్డి(దుబ్బాక): వృత్తి రీత్యా చేసిన మంచి సేవలే సమాజంలో మంచి గుర్తింపునిస్తాయని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మండల పరిధిలోని అల్వాల చెప్యాల క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్రావు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి శారదతో కలిసి ప్రిన్సిపాల్ రఘునందన్రావు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వృత్తి రీత్యా పదవీ విరమణ సర్వసాధారణమన్నారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలను చేర్చడంలో టీచర్లు, తల్లిదండ్రుల సమష్టి కృషి దాగి ఉంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో దాగి ఉన్న గుణాత్మకశక్తిని వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. ఒక విద్యార్థి అత్యున్నతస్థానంలో ఉన్నాడంటే ఉపాధ్యాయుల కృషి ఎంతో దాగి ఉంటుందన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖారాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
నీట్గా పీజీ పరీక్ష
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని వెరిటాస్ అండ్ విర్టస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటేడ్ పరీక్ష కేంద్రంలో నీట్ పీజీ–2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఆరు గంటల నుంచే పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు చేరుకున్నారు. ఉదయం 8.30గంటల్లోపు అభ్యర్థులను లోపలికి అనుమతించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షను నిర్వహించారు. మొత్తంగా 229 మంది అభ్యర్థులకు గాను 222 మంది అభ్యర్థులు హాజరవ్వగా 7మంది అభ్యర్థులు గైర్హజరయ్యారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. సిద్దిపేట ఏసీపీ, ఇతర అధికారులు పరీక్ష నిర్వహణను పరిశీలించారు. పరీక్ష సెంటర్ వద్ద 108ను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సౌకర్యాలను కల్పించారు. దీంతో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 50 మందికి గాను 49 మంది హాజరయ్యారు. పరీక్షకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేదెట్టా?
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో గుడిసెలు లేని గ్రామాలను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం ఒకెత్తయితే, క్షేత్రస్థాయిలో మంజూరైన లబ్ధిదారుల పరిస్థితి మరోలా ఉంటోంది. మండల పరిధిలోని కాసులాబాద్లోని బుడగ జంగాల లబ్ధిదారుల చేతిలో చిల్లి గవ్వ లేక ఇందిరమ్మ ఇంటి కల కలలాగానే మిగిలిపోతోంది. మిరుదొడ్డి(దుబ్బాక) ఇందిరమ్మ గూటి నిర్మాణానికి ముందస్తు పెట్టుబడి పెట్టలేక నిర్మాణాలకు నోచుకోలేకపోతున్నారు. గ్రామంలో సుమారు 50 కుటుంబాలు జీవిస్తున్నాయి. అందులో 25 కుటుంబాలకు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మంజూరైన లబ్ధిదారులు కూలీ నాలీ పనులు చేసుకుంటేనే ఏ పూటకు ఆ పూట తిండి గింజలు సంపాదించుకుంటారు. ఇక మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ముందస్తు డబ్బులు పెట్టి నిర్మించడానికి చిల్లి గవ్వ లేకపోవడంతో వారి సొంత గూటి కల కలగానే మిగిలిపోతోంది. దీంతో మంజూరైన ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారుల పేర్లు రికార్డులకే పరిమితమైపోతోంది. ఇళ్లు నిర్మించి ఇవ్వాలి తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా కట్టుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు రావాలంటే ముందస్తు నిర్మాణానికి తమ వద్ద డబ్బులు లేక మొదలు పెట్టడం లేదని వాపోతున్నారు. ఇంటి నిర్మాణం మొదలు పెడితే ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలకు తోడు, మరో రూ.12 లక్షలు ఉంటేనే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిండి గింజలకే అహర్నిశలు అష్టకష్టాలు పడుతున్నామని, ఇక ఇంటి నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని మధనపడుతున్నారు. తమకున్న ఖాళీ స్థలంలోనే ప్రభుత్వ ఖర్చులతోనే ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలని బుడగ జంగాల ప్రజలు కోరుతున్నారు. ఇల్లు మంజూరైనా రికార్డుల్లోనే -
ప్రభుత్వ కళాశాలలకు నిధులు
● ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.35.25 లక్షలు విడుదల ● విద్యార్థుల సంఖ్య ప్రకారం కేటాయింపు ● తప్పనున్న నిర్వహణ ఇబ్బందులు సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 2026–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల నిర్వహణకు రూ.35.25లక్షలు కేటాయించారు. ఈ నిధులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరు చేశారు. ఇందులో జనరల్ ఫండ్గా రూ.25,38,000, ఎస్సీ ఫండ్గా 5,99,250, ఎస్టీ నుంచి 3,87,750 నిధులు ఉన్నాయి. మౌలిక వసతుల కోసం.. 30 మందిలోపు ఉన్న కళాశాలలకు రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101– 250 వరకు రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మంది ఉన్న కాలేజీలకు రూ.లక్ష వరకు నిధులను కేటాయించారు. ఈ నిధులతో కళాశాలకు కావాల్సిన స్టేషనరీ, ల్యాబ్ నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తారు. చాక్పీసులు, తెల్లకాగితాలు, రిజిస్టర్లు, బుక్లెట్లు ఇతర వాటికి వినియోగించనున్నారు. నిధులు మంజూరుతో కాలేజీలకు ఇబ్బందులు తప్పనున్నాయి. నిధుల విడుదల ఇలా.. జిల్లా కళాశాలలు నిధులు సిద్దిపేట 20 రూ. 12,00,000 మెదక్ 16 రూ. 10,50,000 సంగారెడ్డి 20 రూ. 12,75,000 -
సిద్దిపేటలో హైటెన్షన్!
కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్లు అభివృద్ధి పనులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తమ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఇరు పార్టీల నాయకులు పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు చేపట్టగా.. పలువురు కాంగ్రెస్ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. – సాక్షి, సిద్దిపేట ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సిద్దిపేట నియోజకవర్గానికి అధికంగా నిధులు వచ్చాయి. అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదు. దీనిపై శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని’ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సవాల్ విసిరారు. ఈ చర్చకు నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ సైతం వస్తారని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ సవాళ్లతో పలు మార్లు ఉద్రిక్త వాతవరణం నెలకోంది. దీంతో ముందస్తుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐల నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సైతం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకుడు అత్తు ఇంటికి ఉదయమే పోలీసులు చేరుకున్నారు. అత్తును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. ఎవరు రాకపోవడంతో పోలీసులు ఊపిరి పిల్చుకున్నారు.ఏ మంత్రి వస్తారో రండి.. ‘చర్చకు ఎండిపోయిన రంగనాయకసాగర్ వద్దకు ఏ మంత్రి వస్తారో రండి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి’ అని బీఆర్ఎస్ యువజన, విద్యార్థి నాయకులు ఆరోపించారు. జిల్లాకు మంజూరైన వెటర్నరీ కళాశాల రద్దు, కోమటి చెరువు దగ్గర శిల్పారామం, చిన్నకోడూరు రహదారి, కాళేశ్వరం నుంచి నీళ్లు పంపింగ్ చేయకపోవడంతో రంగనాయకసాగర్ ఎండిపోతుందని బీఆర్ఎస్వీ నేతలు పేర్కొంటున్నారు. దీనిపై చర్చకు ఎవరు వస్తారో రావాలని యువజన నాయకులు సాయిప్రేమ్, యాదగిరి, రమేష్, శేఖర్లు సవాల్ విసిరారు. దీంతో శనివారం ఉదయమే బీఆర్ఎస్ యువజన, విద్యార్థి నాయకులు అందరూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. రంగనాయకసాగర్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. -
అధనంతో అక్రమాలు!
ప్రాసెసింగ్ చార్జీల పేరుతో రైతుల నుంచి రూ.1.57 కోట్లు అదనపు వసూళ్లు బ్యాంకు నిర్వహణ పేరుతో నిధులు స్వాహా! గత పాలకవర్గం నేత, బదిలీపై వెళ్లిన ‘ముఖ్య’అధికారి కలిసి దందా! జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆలస్యంగా వెలుగులోకి వ్యవహారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతలను నిండా ముంచిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏ డీసీసీబీల్లో లేనివిధంగా పంట రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ చార్జీల పేరుతో ఏకంగా రూ.1.57 కోట్లు వసూలు చేసేశారు. ఈ డబ్బును నిర్వహణ ఖర్చుల పేరుతో స్వాహా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత పాలకవర్గంలో ఓ కీలక నాయకుడు, ఏళ్ల తరబడి బ్యాంకులో పాతుకుపోయి..ఇటీవల బదిలీ అయిన ఓ ‘ముఖ్య’అధికారి కలిసి ఈ అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతలపై అదనపు భారం మొపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాలకు ఉన్న డీసీసీబీల్లో లేనివిధంగా ఇక్కడ ఈ అదనపు చార్జీలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం పంట రుణాలపై 7% వడ్డీని వసూలు చేయాలి. కానీ ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు అదనంగా 1% ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేశారు. అంటే రూ.లక్ష రుణం తీసుకున్న రైతు రూ.7వేల వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అదనంగా రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యిమంది రైతుల వద్ద ఈ అనధికారిక వసూళ్ల దందా సాగింది. అన్నదాతలను నిండా ముంచేశారు. రైతులు తిరగబడటంతో వెనక్కి! అమాయక రైతులు, నిరక్షరాస్యుల వద్ద వసూళ్లు యథేచ్ఛగా సాగాయి. కానీ కాస్త చైతన్యం ఉన్న రైతులు ఈ అక్రమ వసూళ్లను ప్రశ్నించారు. ఎక్కడా లేనిది అదనంగా చార్జీలు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. దీంతో దాదాపు నాలుగు నెలలపాటు సాగిన ఈ వసూళ్ల దందాను గుట్టు చప్పుడు కాకుండా నిలిపివేశారు. రైతుల వాటాధనంగా నడుస్తున్న ఈ బ్యాంకు అదే రైతులకు ఇచ్చే పంట రుణాలపై అదనపు వసూళ్లు చేసి వారిని నిండా ముంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముగిసిన పాలకవర్గం తీర్మానాలు ఈ అదనపు చార్జీల వసూళ్లకు మేనేజింగ్ కమిటీ (ఎంసీ) తీర్మానాలున్నాయని డీసీసీబీ వర్గాలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఈ బ్యాంకు మేనేజ్మెంట్ కమిటీ (పాలకవర్గం) పదవీకాలం 2025 ఫిబ్రవరిలోనే ముగిసింది. కానీ అదనపు వసూళ్లకు 2025 జూన్ 12న తీర్మానం చేశారు. అంటే పదవీకాలం ముగిన పాలకవర్గం తీర్మానం ఎలా చెల్లుతుందో అధికారులకే తెలియాలి. అయితే పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం వారి పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించారని డీసీసీబీ అధికారులు చెబుతున్నారు. పొడిగించిన ఈ తాత్కాలిక పాలకవర్గానికి రైతులపై భారం మోపే తీర్మానాలు చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. 2025 జూన్ 12 నుంచి 2025 అక్టోబర్ 8 తేదీ వరకు ఈ రూ.1.57 కోట్లు వసూళ్లకు తెగబడ్డారు. రైతులు తిరగబడకపోతే ఈ వసూళ్ల దందా మరింత సాగే అవకాశాలుండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా బ్యాంకు తీర్మానాలు చేసిన రైతులందరికీ తెలిసేలా పత్రికా ప్రకటన విడుదల చేయాలి. కానీ వసూళ్ల తీర్మానాలను బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా సర్క్యూలర్లు ఇచ్చేశారు. ఎంత లాభాలుంటే అంత స్వాహా బ్యాంకుకు ఎంత ఎక్కువ లాభాలు వస్తే అంతే మొత్తంలో స్వాహా చేయవచ్చనే ఈ అడ్డగోలు వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. బ్యాంకు నిర్వహణ ఖర్చుల పేరుతో ఈ డబ్బులు చాలా మట్టుకు డ్రా చేసినట్లు తెలుస్తోంది. అనేక సంవత్సరాలు ఇదే బ్యాంకులో పాతుకుపోయిన ఓ ‘ముఖ్య’అధికారి, గత పాలకవర్గంలోని కీలక నాయకుడు కలిసి చేసిన ఈ స్వాహా పర్వంలో గత పాలకవర్గంలోని మరికొందరికి వాటాలు పంచారనే ఆరోపణలున్నాయి. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో గుట్టుగా నిలిపివేత -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం
గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి 1000 రోజులవుతుండగా, అన్ని రంగాల్లో వైఫ్యలాలను మూటగట్టుకున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 2 నుంచి 8వరకు ప్రజలను చైతన్యపరిచేందుకు కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రజలకిచ్చిన హామీలపై నిలదీస్తూ బాకీ కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ప్రభుత్వ వైఫల్యాలపై వినతి పత్రాలను అందజేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందజేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఇప్పటికై నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. -
12న జాతీయ లోక్ అదాలత్
సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్ వచ్చే నెల 12న నిర్వహిస్తున్నట్లు, రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కోర్టుతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజీ పడదగినవి 1,776 కేసులు గుర్తించినట్లు వీటిలో 518 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన లోక్ అదాలత్లో 756 కేసులు పరిష్కరించామని, వీటిలో మోటారు వాహనాల సంబంధిత కేసుల్లో రూ.92లక్షల 26వేల నష్టపరిహారం ఇప్పించామని తెలిపారు. అలాగే గత జూన్లో నిర్వహించిన లోక్ అదాలత్లో 814కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సౌజన్య, న్యాయమూర్తి జయప్రసాద్ పాల్గొన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి జిల్లా న్యాయమూర్తి సౌజన్య సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సౌజన్య తెలిపారు. జిల్లా జైలును న్యాయమూర్తి శనివారం సందర్శించారు. ఖైదీల వంట గది, స్టోర్ రూమ్ను పరిశీలించి, ఖైదీలకు కల్పిస్తున్న భోజన వసతి గురించి జైలు సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ ప్రతి వారం జైలును సందర్శిస్తారన్నారు. అడ్వకేట్స్ లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సెల్స్ న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి ఎంపీ రఘునందన్రావు దుబ్బాకరూరల్: గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్రావు అన్నారు. అక్బర్పేటభూంపల్లి మండలం పోతారెడ్డిపేట కేదారేశ్వర ఆశ్రమంలో ప్రహరీ నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకు వస్తే నిధులు కేటాయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక ఏసురాజ్, బీజేపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో తగిన వసతులు లేవని ఎంపి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే నిధులు కేటాయిస్తానని తెలిపారు. కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ధ్యాన్ చంద్ యువతకు స్ఫూర్తిహుస్నాబాద్: నేటి యువత ధ్యాన్ చంద్ను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది కలిసి క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇస్తూ.. ఆయనను గౌరవించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం క్రికెట్ లో గెలిచిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● కలెక్టర్ హైమావతి ● పాఠశాల, కళాశాలల ఆకస్మిక తనిఖీ మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులు సీజనల్ వ్యాధులకు గురైతే సహించేది లేదని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. శనివారం చెప్యాల అల్వాల క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను ఆమె ఆకస్మికంగా తనఖీ చేశారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్ర స్థాయిలో ఆమె పరిశీలించారు. కూరల్లో మరింత నాణ్యత మెరుగు పరిచేలా పాటు పడాలన్నారు. వంట గది అపరిశుభ్రంగా ఉండటాన్ని పరిశీలించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భోజనం చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి భోజనం ఎలా ఉందనీ, మెనూ ప్రకారం పెడుతున్నారా, రుచిగా ఉంటుందా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలను అందించాలి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కింది స్థాయి వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మిరుదొడ్డిలోని పీహెచ్సీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్, ల్యాబ్, ఓపీ, మెడిసిన్ స్టాక్ రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ నుండి, కింది స్థాయి వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. వైద్యం అందుతున్న విధివిధానాలపై రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు ధీర్ఘకాలిక వ్యాధులకు గురైతే అందుబాటులో ఉన్న యునానీ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
చరిత్రలో చెరగని త్యాగం
● బైరాన్పల్లి గ్రామాభివృద్ధికి కృషి ● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిమద్దూరు(హుస్నాబాద్): రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదిరించిన గ్రామం వీర బైరాన్పల్లి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం దూల్మిట్ట మండలం బైరాన్పల్లిలో స్తూపం, బురుజు వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళుర్పించారు. గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైరాన్పల్లి పోరాటం ఒక్క గ్రామానికి పరిమితమైనది కాదన్నారు. మద్దూరు, లింగాపూర్, కూటిగల్, బెక్కల్, దూల్మిట్ట తదితర చుట్టూ పక్కల గ్రామాల ప్రజలను రజాకార్ల దాడుల నుంచి రక్షించడంలో బైరాన్పల్లి యువకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామానికి అధికారంగా వీర బైరాన్పల్లి పేరు మార్చాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కకు ఇప్పటికే వినతి పత్రం అందజేశామన్నారు. అభివృద్ధి పనులన్నింటిని రాబోయే ఆరునెలల్లోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి పోరాట గాథను భవిష్యత్ తరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కృషి చేస్తాన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను శాలువాలతో సన్మానించారు. అలాగే డాక్టర్ చందా రామయ్య రచించిన తెలంగాణ సాయుధ పోరాట పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బర్మ రాజమల్లయ్య,బీఆర్ఎస్ నాయకులు గ్రామా సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు. -
యాప్ ద్వారానే ఎరువులు విక్రయించాలి
జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి వర్గల్(గజ్వేల్): ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారానే డీలర్లు ఎరువుల అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి ఆదేశించారు. గురువారం వర్గల్ మండలం గౌరారం, మజీద్పల్లి, అంబర్పేట, మీనాజీపేట గ్రామాలలో ఎరువుల విక్రయకేంద్రాలు తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియ నిర్వహణ తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ సర్వేయర్ల ద్వారా డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం వర్గల్ మండలంలో 22 మంది సర్వేయర్లను నియమించామన్నారు. రైతులు విధిగా తమ పంటల వివరాలు సర్వేయర్లతో నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు సన్న వరి రకాలు, ఇతర సన్న వరి రకాలు సాగుచేస్తే సెప్టెంబర్ 10 లోపు సంబంధిత ఏఈఓ, సర్వేయర్లకు తెలిపి నమోదు చేయించుకోవాలన్నారు. ఉద్యోగుల జేఏసీ మహాధర్నా సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ సిద్దిపేటరూరల్: పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గాదరి పరమేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్యాదరి పరమేశ్వర్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో జయశ్రీ, వలిహమ్మద్, ఇంద్రసేనారెడ్డి, విక్రమ్ రెడ్డి, శ్రీధర్, మైపాల్ రెడ్డి, విజేందర్రెడ్డి, రాజిరెడ్డి, రాములు, మధుసూదన్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. సర్కార్ బడుల్లోనే నాణ్యమైన విద్య మర్కూక్(గజ్వేల్): సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ లింగయ్య అన్నారు. మండలంలోని పాములపర్తి పీఎంశ్రీ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాలలో సైన్స్ ల్యాబ్, పాఠశాల గ్రంథాలయం, మధ్యాహ్న భోజన పథకం, స్పోర్ట్స్ మెటీరియల్ వివిధ అంశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. కార్యక్రమంలో మర్కూక్, ములుగు మండల విధ్యాధికారులు వెంకట్రాములు, ఉదయ్ భాస్కర్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, ఫణీంద్రుడు తదితరులు పాల్గొన్నారు -
మీ భద్రతే మా బాధ్యత
● మహిళల భద్రత కోసం షీటీమ్స్ ● ‘సాక్షి’తో సిద్దిపేట మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గ సిద్దిపేటకమాన్: మీ భద్రతే మా బాధ్యత అంటూ జిల్లాలో మహిళలు, బాలికల రక్షణ కోసం షీటీమ్స్ పనిచేస్తున్నాయని సిద్దిపేట మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గ తెలిపారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో విద్యార్థులు, ఉద్యోగిణులు టీజింగ్కు గురయ్యే ప్రదేశాల్లో ఆకతాయిల ఆట కట్టించడానికి పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఐ దుర్గ గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో కళాశాలలు, ఆర్టీసీ బస్టాండ్లు, మార్కెట్లు, కోమటిచెరువు, రద్దీ ప్రాంతాల్లో సుమారు 50 ప్రాంతాలు హాట్ స్పాట్లుగా గుర్తించామని తెలిపారు. షీ టీం సిబ్బంది మఫ్టీలో ఉండి ఆకతాయిల ఆటకట్టిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్లో మూడు షీ టీం బృందాలు విధులు నిర్వహిస్తున్నాయన్నారు. ఒక్కో టీంలో ఒక ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళ పోలీసు కానిస్టేబుళ్లు మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. బాలికలు, మహిళలను వేధించే పోకిరిలను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు పెట్టీ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. బాలికలు, మహిళలు ఏవరైనా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 112, షీటీం నంబర్ 87126 67434కు ఫోన్ చేసి తెలపాలని సీఐ దుర్గ సూచించారు. -
ఇదేం తీరు?
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వం ధారపోసిన నిర్వాసితుల పట్ల రోజుకో తప్పిదం జరుగుతోంది. తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల్లో నిర్వాసితుల గ్రామాల పేర్లను మాయం చేశారు. కార్డుల్లో ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పేరిట అందజేస్తున్నారు. ఈ పరిణామం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అవరోధమని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. – గజ్వేల్ స్మార్ట్ రేషన్ కార్డుల్లో నిర్వాసిత గ్రామాల పేర్లు మాయం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కాలనీని నిర్మించిన సంగతి తెలిసిందే. ముంపు గ్రామాలైన ఏటిగడ్డకిష్టాపూర్లో 1,253, లక్ష్మాపూర్లో 388, వేములగాట్లో 1252, పల్లెపహాడ్లో 921, రాంపూర్లో 320, బ్రహ్మణ బంజేరుపల్లిలో 267, ఎర్రవల్లిలో 800, సింగారంలో మరో 330కుపైగా కుటుంబాలున్నాయి. ఆయా గ్రామాల్లో 14వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. కాలనీకి వచ్చినప్పటి నుంచి వీరిని నిత్యం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల్లో తమ గ్రామాల పేర్లు మాయం కావడం కాలనీవాసులను ఆందోళనకు గురిచేస్తున్నది. ముట్రాజ్పల్లి, సంగాపూర్ పేరిట స్మార్ట్ రేషన్ కార్డులు ఆర్అండ్ఆర్ కాలనీవాసులు అధికారికంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కొన్ని నెలల క్రితమే విలీనమయ్యారు. అయినా తమ గ్రామాల పేర్లనే ఆర్అండ్ఆర్ కాలనీలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ రకంగా కాలనీలో గ్రామాల బోర్డులను ఏర్పాటుచేసుకున్నారు. వీరి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు సైతం వారి సొంత గ్రామాల పేరిటే ఉన్నాయి. కానీ తాజాగా స్మార్ట్ రేషన్ కార్డులను అధికారులు మున్సిపాలిటీలోని భౌగోళిక లొకేషన్ పేరిట ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పేరిట అందజేస్తున్నారు. ఆయా గ్రామాల్లో కార్డుల పంపిణీ కూడా ప్రారంభమైంది. సమస్యల పరిష్కారానికి అవరోధమా? ముంపు బాధితుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ప్యాకేజీలు, పరిహారాలే కాకుండా ఆర్అండ్ఆర్ కాలనీకి గుడి, బడి, అంగన్వాడీ కేంద్రాలు అవసరమైన స్థాయిలో లేకపోవడం, శ్మశాన వాటికలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ పెండింగ్ సమస్యల పరిష్కారానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా వీరి సమస్యల పరిష్కారానికి ఒక్క పైసా విడుదల కాలేదు. ఇలాంటి తరుణంలో తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల్లో వారి సొంత గ్రామాల పేర్లు మాయమైపోవడం.. ఈ పరిణామం ఇదేవిధంగా కొనసాగితే చిరునామాలు మారిపోయి పెండింగ్ సమస్యల పరిష్కారానికి సాంకేతికంగా అవరోధం కలగనున్నదని నిర్వాసిత కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు లేకుండా చేస్తారా? నిర్వాసిత కాలనీవాసులకు మా సొంత గ్రామాలు కాకుండా ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పేరిట స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసి మాకు గుర్తింపు లేకుండా చేస్తారా? ఇది సహించేది లేదు. వెంటనే మా గ్రామాల పేర్లను పునరుద్ధరించాలి. – దామరంచ ప్రతాప్రెడ్డి, ఏటిగడ్డకిష్టాపూర్, మాజీ సర్పంచ్, ఆర్అండ్ఆర్ కాలనీ ఆందోళనకు సిద్ధం నిర్వాసిత కాలనీ ప్రజల హక్కులను కాలరాసేలా చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ప్రతి అంశంలోనూ ఏదోరకంగా మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. ఈ తప్పును సరిచేయకపోతే గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాం. – కొలిచెలిమె స్వామి, మాజీ సర్పంచ్, లక్ష్మాపూర్, ఆర్అండ్ఆర్ కాలనీ -
మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
● మాజీ మంత్రి హరీశ్రావు ● బీఆర్ఎస్లో చేరిన వర్గల్ వార్డు సభ్యులుసిద్దిపేటజోన్: మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గ వర్గల్ గ్రామ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. హరీశ్రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
జీఓ 97 రద్దు చేయాలంటూ బీఆర్ఎస్వీ నాయకుల ఆందోళన కలెక్టరేట్ చాంబర్ ఎదుట విద్యార్థులు, బీఆర్ఎస్వీ నాయకుల బైఠాయింపు.. సిద్దిపేటరూరల్: పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న జీఓ 97 రద్దు చేయాలంటూ గురువారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ ఎదుట మొదట ధర్నా చేపట్టిన విద్యార్థులు, నాయకులు.. ఆ తరువాత గేట్పైకి ఎక్కడం, తోసుకుంటూ కలెక్టరేట్ చాంబర్ వద్దకు పరుగులు పెట్టారు. పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండటంతో పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. కలెక్టర్ చాంబర్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీపీ కుశాల్కర్ చేరుకుని వారి నుంచి వినతిపత్రాన్ని స్వీకరించి నిరసనను సద్దుమణిగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జీఓ 97తో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు యాదగిరి, శ్యామ్, ప్రశాంత్, రమేశ్, మాధవ్, శేఖర్, రమేశ్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆశక్తి లేదు!
పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనియేటివ్స్) విభాగంలోకి పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం 97జీఓను విడుదల చేసింది. దీంతోపాలిటెక్నిక్తో జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జీఓతో పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి వివేక్ చెప్పినా, రద్దు చేయాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగుతుండటం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రభుత్వ, ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలున్నాయి. వీటన్నింటికీ సాంకేతిక విద్యామండలి అనుబంధ గుర్తింపు ఉంది. వీటిలో సుమారు 5వేలకు మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పీ–సెట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులందరూ మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తికాగానే ఉన్నత చదువు కోసం ఈ సెట్ పరీక్ష రాసి లెటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో ఎక్కువగా విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యపై మక్కువ చూపుతున్నారు. సిలబస్, బోధన ప్రణాళిక కూడా సాంకేతిక విద్యా మండలినే రూపొందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ ఇండియా పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. దీంతో పాలిటెక్నిక్ ప్రవేశాలు సైతం ఇదే రీతిలో ఉంటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఫీజులు పెరిగితే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉన్నత చదువులకు బ్రేక్ పాలిటెక్నిక్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి.. లేదంటే ఉన్నత విద్య చదువుకోవచ్చన్న ఉద్దేశంతో పాలిటెక్నిక్ విద్యను ఎక్కువగా చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈసెట్ లేకపోతే తాము ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరే అవకాశం ఉండదని, దాంతో తాము ఉన్నత చదువులు చదవకుండా ద్వారాలు మూసుకుపోతాయని పాలిటెక్నిక్ విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికై నా సీఎం, మంత్రులు, ఉన్నత అధికారులు స్పందించి 97 జీవోను రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆ రెండూ ఒక్కటి కాదు.. ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమాను ఒక్కటి చేయాలన్న ఉద్దేశంతో శక్తి స్కీంను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ రెండు ఒక్కటి చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల ఉన్నత విద్యకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పించే దాని విషయపై మంత్రి వివేక్ స్పష్టమైన జీవోను విడుదల చేయాలి. – పవన్కుమార్, విద్యార్థి, ద్వితీయ సంవత్సరం పాలిటెక్నిక్ సిలబస్ వేరు.. పాలిటెక్నిక్ సిలబస్, ఐటీఐ సిలబస్ రెండు వేరు వేరు. ఈ రెండింటినీ కలిపేందుకు 97జీఓవోను ప్రభుత్వం తీసుకువచ్చింది. వెంటనే ఈ జీవోను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు భరోసాను కల్పించాలి. –స్నేహ, విద్యార్థి, తృతీయ సంవత్సరంవిద్యార్థులు, అధ్యాపకుల నిరసన నంగునూరు(సిద్దిపేట): శక్తిలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, అధ్యాపకుల నిరసనలు కొనసాగుతున్నాయి. టీపీ జేఏసీ పిలుపు మేరకు అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అలాగే విద్యార్థులరు ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వం తెచ్చిన జీఓ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 97 వెనక్కు తీసుకోవాల్సిందే -
వినూత్నంగా రక్షాబంధన్..
హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం వినూత్నంగా వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి మాట్లాడుతూ.. వృక్షాలను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. విచక్షణారహితంగా అడవులను నరికి వేయడం వల్ల అనేక దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. వలంటీర్లు నాటిన చెట్లకు రాఖీలు కట్టి, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను పెంచే బాధ్యతను తీసుకున్నారని తెలిపారు. కళాశాల ఆవరణలో 150 మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టిన ఎన్ఎస్ఎస్ వలంటీర్లను అభినందించారు. -
భూ రీసర్వే కీలకం
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమం ఎంతో కీలకమని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హలులో పలు అంశాల పైన ఆర్డీవోలు, తహసీల్దార్లతో జూమ్ సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రీ–సర్వే ప్రక్రియ నిర్ణీత కాలవ్యవధిలోపు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో రీ–సర్వే లో సర్వే అధికారులు, తహసీల్దార్లు, గ్రామ సభలు నిర్వహించి అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కార ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సాదబైనామా అప్లికేషన్లు పూర్తిగా వెరిఫై చేసుకొని, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చెక్ చేసుకోవాలన్నారు. 22(ఏ) నాన్ అగ్రికల్చర్ సంబంధించిన వాటిని కరెక్ట్గా పరిశీలించాలని తహసిల్దార్ లను, ఆ రిపోర్ట్లను ఆర్డీఓ పూర్తిగా చెక్ చేశాకే కలెక్టరేట్కి పంపించాలని ఆదేశించారు. -
అంతా మా ఇష్టం!
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని జాతీయ రహదారి డివైడర్లపై గుర్తు తెలియని వ్యక్తి టెండర్ లేకుండా, మున్సిపల్ అనుమతి తీసుకోకుండానే గ్లోసన్ బోర్డులు ఏర్పాటు చేశాడు. దాదాపు వందకు పైగా బోర్డులు ఏర్పాటు చేసి, వ్యాపార ప్రకటనలు తీసుకుంటున్నాడు. కనీసం మున్సిపల్కు ఒక్క రూపాయి చెల్లించకుండా ఆదాయానికి గండికొడుతున్నారు. దాదాపు ఒక బోర్డుకు నెలకు రూ.3వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్లోసన్ బోర్డులు ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని సీడీఎంఏ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయినా బోర్డులు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. అనుమతి లేకుండా వ్యాపార ప్రకటనల కోసం బోర్డులు ఎలా ఏర్పాటు చేస్తారని, టెండర్ వేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశారు. చర్చ లేకుండానే తీర్మానం గ్లోసన్ బోర్డుల విషయంలో సర్వత్రా విమర్శలు రావడంతో అధికారులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం నిర్వహించిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో గ్లోసన్ బోర్డుల ఏర్పాటుపై పెద్ద సారు చెప్పారని ఎలాంటి చర్చ లేకుండా రూ.2లక్షల జరిమానా విధిస్తున్నట్లు తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో చర్చించకుండానే సంతకాలు పెట్టి తీర్మానం చేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు బోర్డులు ఏర్పాటు చేసిన వ్యక్తికే నిర్వాహణ బాధ్యతలు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి సమస్యకు పుల్స్టాప్ పెట్టి కొత్త భాష్యానికి తెరలేపారు.వ్యాపార ప్రకటనల బోర్డు అనుమతి, టెండర్ లేకుండానే గ్లోసన్ బోర్డులు మార్చి వరకు అనుమతివ్వాలని తీర్మానం కొత్త భాష్యం చెబుతున్న అధికారులు, పాలకవర్గం -
ఆర్టీసీ బస్సులో పొన్నం..
హుస్నాబాద్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలో దాదాపు 5 వేల ఆర్టీసీ బస్సులను నడిపించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం పందిల్ల గ్రామం నుంచి హుస్నాబాద్ బస్టాండ్ వరకు మంత్రి బస్సులో ప్రయాణించారు. బస్సులోని మహిళా ప్రయాణికులు మంత్రికి రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ప్రయాణికులకు మంత్రి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి ప్రయాణ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో రక్షాబంధన్ హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ మహిళా నాయకులు మంత్రికి రాఖీలు కట్టారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.రాఖీలు కట్టిన మహిళా ప్రయాణికులు -
రాఖీలుగా..
పుష్పాలే..హుస్నాబాద్: ప్రకృతి సిద్ధంగా లభించే పంచపాండవుల పుష్పాలతోనే ప్రతిఏటా ఆ కుటుంబం రక్షాబంధన్ జరుపుకొంటోంది. ఈసారి కూడా ఆ పుష్పాలతోనే రక్షాబంధన్ పండుగను సంతోషంగా జరుపుకొన్నారు. హుస్నాబాద్లోని ఆరపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య నర్సరీ పెంచుకుంటున్నారు. నర్సరీలో తీరొక్క కూరగాయలు, పండ్లు, పూలు మొక్కలు ఉన్నాయి. 22 ఏళ్లుగా తన నర్సరీలో ప్రకృతి సిద్ధంగా పూసిన పంచపాండవుల పుష్పాలను రాఖీలుగా తన అక్కాచెల్లెళ్లు కడుతున్నారు. రాఖీ మాదిరిగానే పంచపాండవుల పుష్పం ఉండటం విశేషం. మార్కెట్లో రెడీమేడ్గా లభించే రాఖీల కంటే పంచపాండవుల పుష్పాన్ని రాఖీగా కట్టుకోవడం శ్రేయస్కరంగా భావిస్తున్నారు. ఇలా పుష్పాన్ని రాఖీగా కట్టుకోవడం దేవుడిచ్చిన వర మని అయిలయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
తోబుట్టువులకు రాఖీలు కట్టిన సోదరీమణులు
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అనురాగానికి, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచే తమ తోబుట్టువులకు సోదరీమణులు రాఖీలు కట్టారు. అనంతరం ఆశీర్వాదాలు తీసుకున్నారు. వివిధ రాజకీయ నాయకులకు, పార్టీ కార్యకర్తలు, అధికారులకు రాఖీలను కట్టారు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, సామూహిక జంధ్యధారణ తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శివపార్వతులు, మార్కండేయ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. – ప్రశాంత్నగర్(సిద్దిపేట) -
ఆలస్యమేనా?
అమృతం..నత్తనడకన అమృత్ 2.0 పనులుజిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్–2.0 పథకం పనులు సాగుతున్నాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో రూ.28కోట్లు, సిద్దిపేటలో రూ.85కోట్లు, చేర్యాలలో సుమారు రూ.9కోట్లు ఈ పథకం కింద వెచ్చిస్తున్నారు. పట్టణాల్లో దాహార్తి సమస్య శాశ్వత పరిష్కారమే ఈ పనుల లక్ష్యం. ఏడాదిన్నర కిందట ప్రారంభమైన పనులు ఆగుతూ..సాగుతున్నాయి. ఆయా పట్టణాల్లో మంచినీటి సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం, కొత్తకాలనీలకు పైప్లైన్ల విస్తరణ, కొత్త నల్లా కనెక్షన్లు, వాటర్ మీటర్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. మార్చి 2027 డెడ్లైన్ మున్సిపాలిటీల్లో అమృత్–2.0 పనులు నత్తనడకన సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, కాంట్రాక్టర్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ అంశంపై ఇటీవలే హైదరాబాద్లో ఓ ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పట్టణాల్లో ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు డెడ్లైన్ విధించారు. గడువులోగా పనులు పూర్తి చేయకపోతే నిధులు ల్యాప్స్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కానీ క్షేత్రస్థాయిలో పనులు తీరు పరిశీలిస్తే గడువులోగా పనులు జరగటం అనుమానంగా మారింద. గజ్వేల్ పట్టణంలో భారత్నగర్, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్ల వద్ద 25లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. అంతేకాకుండా కొత్త కాలనీలకు మంచినీటి సరఫరా వ్యవస్థను తీసుకొచ్చేందుకు 15కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నది. ఈ పనులు 70శాతానికిపైగా పూర్తి చేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ పైప్లైన్ల పనులు కొంతవరకు పూర్తయినా, ఇంకా ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదు. పైప్లైన్ల కోసం రహదారులపై గుంతలు తవ్వి అలాగే వదిలేయడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మరోవైపు నెలల తరబడి పనులు పెండింగ్లో ఉన్నాయి. సిద్దిపేట, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.మున్సిపాలిటీల్లో నత్తనడకన సాగు..తున్న అమృత్ 2.0 పనులు పూర్తి చేయడానికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ పనులను ఎట్టిపరిస్థితుల్లో 2027మార్చిలోగా పూర్తి చేయాలని ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు ల్యాప్స్ చేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలిసింది. కానీ క్షేత్రస్థాయిలో పనుల తీరు చూస్తే గడువులోగా పూర్తికావడంపై సందేహం నెలకొంది. – గజ్వేల్పట్టణంలో అమృత్–2.0 పనులను గడువులోగా పూర్తి చేయాలని పనులు చేపడుతున్న పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులను కోరాం. ప్రస్తుతం చాలా చోట్ల పనులు పెండింగ్లో ఉన్న విషయం చెప్పాం. స్పందించి పనులు పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. – గణేశ్రెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ -
31 వరకే ఎల్పీజీకీ ఈకేవైసీ
నారాయణఖేడ్: వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్ (ఎల్పీజీ) వినియోగదారులకు ఈ– కేవైసీ గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ నెల 16 తర్వాత 23వ తేదీ నాటికి ఈ– కేవైసీ పూర్తి చేయని వినియోగాదారులకు మరోసారి అవకాశం కల్పించింది. వివిధ కారణాల వల్ల గడువులోగా ఎలక్ట్రానిక్ యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) పూర్తి చేయలేకపోయిన వారికి ఆయిల్ కంపెనీలు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించాయి. ఆయా కంపెనీలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 6 లక్షల పైచిలుకున్నాయి. ప్రతీ రోజు 10వేల సిలిండర్ల వినియోగం జరుగుతుంది. బోగస్ ఏరివేతకే! బోగస్ కనెక్షన్లు, అర్హత లేని లబ్ధిదారులు, మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్న కనెక్షన్లు, ఒకే కుటుంబానికి ఉన్న డూప్లికేట్ కనెక్షన్లను గుర్తించి తొలగించేందుకు కేంద్రం ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఎల్పీజీ కనెక్షన్కు ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ఇకపై రీఫిల్ సిలిండర్ బుకింగ్, డెలివరీ నిలిచిపోనుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కనెక్షన్ రద్దు చేసే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 80% పైగా ఈ–కేవైసీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. గతంలో పలుమార్లు గడువు విధించినప్పటికీ వంద శాతం ఈ–కేవైసీ పూర్తి కాలేదు. ఫలితంగా ఆయిల్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ తిరిగి ఈనెలాఖరుగా చివరి అవకాశం కల్పించాయి. ఎల్పీజీ కనెక్షన్లు క్రమబద్దీకరించడంతోపాటు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీని అందించేందుకు ఈ–కేవైసీని తప్పనిసరి చేసింది. కొన్ని ప్రాంతాల్లో మరణించిన వ్యక్తుల పేర్లతోనే గ్యాస్ కనెక్షన్లు కొనసాగుతున్నాయి. అర్హతలేని వ్యక్తులు, ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు కొనసాగుతున్న సందర్భాలను అధికారులు గుర్తించారు. ఇలాంటి కనెక్షన్లను ఈ–కేవైసీ ద్వారా ఫిల్టర్ చేసి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ–కేవైసీ ప్రక్రియలో వినియోగదారుల గుర్తింపు నిర్ధారించేందుకు ఆధార్ వివరాలతోపాటు బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకుంటున్నారు. వేలిముద్ర, ఐరిస్ వంటి వివరాలను ఎల్పీజీ డొమెస్టిక్ కనెక్షన్లకు అనుసంధానం చేయడం ద్వారా అసలైన వినియోగదారులను గుర్తించవచ్చని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు ముందుగా రీఫిల్ సిలిండర్ బుకింగ్, డెలివరీపై ఆంక్షలు విధించే అవకాశముంది. ఇప్పటికే బుక్ చేసిన సిలిండర్లు కూడా రద్దయ్యే పరిస్థితి ఉండొచ్చు. భవిష్యత్తులో కనెక్షన్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేని సిలిండర్ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అనుసంధానించని పక్షంలో కనెక్షన్ తొలగింపు


