పకడ్బందీగా ఈ–నామ్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఈ–నామ్‌

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

కలెక్టర్‌ హైమావతి

సిద్దిపేటజోన్‌: జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌ మార్కెట్‌లలో ఈ –నామ్‌ 2.0 వెర్షన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ హైమావతి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో సిద్దిపేట, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ కార్యదర్శులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు, ట్రేడర్లు, కమిషన్‌ ఏజెంట్లతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కువ సంఖ్యలో కంప్యూటర్‌ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ–నామ్‌ భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement