కేసీఆర్‌కు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ఆహ్వానం

Mar 2 2026 8:46 AM | Updated on Mar 2 2026 8:46 AM

కేసీఆర్‌కు ఆహ్వానం

కేసీఆర్‌కు ఆహ్వానం

మర్కూక్‌(గజ్వేల్‌): మండల పరిధి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ను నాచారం ఆలయ ట్రస్ట్‌ మాజీ చైర్మన్‌ హన్మంతరావు ఆదివారం కలిశారు. ఈ నెల 6న జరిగే తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని వివాహ పత్రికను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాండుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

యోగాతోనే ఆరోగ్యం

హుస్నాబాద్‌రూరల్‌: నిత్యం యోగాసనాలు వేస్తే ఆరోగ్యంగా ఉంటారని శిక్షకురాలు అయిలేని అనిత అన్నారు. పట్టణంలోని ధర్మవీర్‌ యోగ కేంద్రం ద్వితీయ వార్షికోత్సం పురస్కరించుకుని ప్రత్యేక యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ తనువును, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఏకై క సాధనం యోగా అన్నారు. యోగాసనాలతో వ్యాయామం జరుగుతుందన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.

ఆర్టీసీ కార్గో ద్వారా

భద్రాద్రి తలంబ్రాలు

సిద్దిపేటకమాన్‌: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులకు అందించనున్నట్లు ఆర్టీసీ డీఎం భవభూతి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను డీఎం ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో ద్వారా రూ.151 చెల్లించి భక్తులు బుక్‌ చేసుకుంటే తలంబ్రాలను ఇంటి వద్దకే అందిస్తామన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అమరుల త్యాగాలు వృథా కావు

తూప్రాన్‌: ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించి పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరులకు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి మాదిగ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల త్యాగాలను కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement