విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకే ‘వికసిత్’
జిల్లా యువజన శాఖ అధికారి రంజిత్రెడ్డి
సిద్దిపేటజోన్: విద్యార్థుల ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోనే విధంగా ఈ వేదిక ఉపయోగపడనుందని జిల్లా యువజన శాఖ అధికారి రంజిత్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో యువతకు వికసిత్ భారత్ ద్వారా లభించిందన్నారు. విద్యార్థులలో చైతన్యం నింపి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం దీని ఉద్దేశ్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 100 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన ఐదుగురిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


