పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

Mar 10 2026 1:28 PM | Updated on Mar 10 2026 1:28 PM

హుస్నాబాద్‌: స్వచ్ఛతలో అందరూ భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి పొన్నం అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం హుస్నాబాద్‌లో 5 కె రన్‌ నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు పంపించాలన్నారు. దోమల బెడద నివారణకు ఖాళీ స్థలాల్లో నీరు నిలవకుండా చూడాలన్నారు. వేసవి కాలంలో తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement